breaking news
Anantapur Latest News
-
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
జిల్లాలో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి చక్రాల కిందపడి ఒకరు మృతి చెందగా... లారీని వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో మరో ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. రాయదుర్గం టౌన్: మండలంలోని టి.వీరాపురం గ్రామానికి చెందిన ఈశ్వరప్ప (55) వ్యక్తిగత పనిపై గురువారం రాయదుర్గానికి వచ్చాడు. పని ముగించుకుని సాయంత్రం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన టి.వీరాపురం సమీపంలో మలుపు వద్ద ఎదురుగా వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓవరటేక్ చేసే క్రమంలో అదుపు తప్పి బస్సు వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య వడ్రక్క, ఓ కుమారుడు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతో పాటు జీవాల పోషణతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ జయానాయక్ తెలిపారు. తాడిపత్రి రూరల్: నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన మద్దిలేటి తన ఇద్దరు కుమారులకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తన అన్న కుమారుడు బండి చరణ్ (18)తో కలసి ద్విచక్ర వాహనంపై గురువారం సాయంత్రం తాడిపత్రిలోని ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు బయలుదేరాడు. తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలోకి చేరుకోగానే ముందు వెళుతున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకనే ఉన్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో బైక్ నడుపుతున్న బండి చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మద్దిలేటికి తీవ్ర గాయాలయ్యాయి. మద్దిలేటి కుమారులు అర్జున్, సురేష్ సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు. ఆ గన్ ఎక్కడిది? అనంతపురం సెంట్రల్: నగరంలో విద్యుత్నగర్ సర్కిల్లో ఓ వ్యక్తి ఇంట్లో బయటపడిన గన్ ఎక్కడిదనే అంశంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. దంపతుల మధ్య నెలకొన్న మనస్పర్థల కేసులో దిశ పోలీసులు బుధవారం సదరు వ్యక్తి ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో గన్తో పాటు కత్తి పట్టుబడడం కలకలం రేపింది. గురువారం కూడా సదరు గన్ గురించి దిశ పోలీసులు నోరు మెదప లేదు. -
రైల్వే సొమ్ము కాంట్రాక్టర్ పాలు
● బాగున్న డ్రెయినేజీలపైనే మళ్లీ కట్టడాలు గుంతకల్లు: స్థానిక డీఆర్ఎం కార్యాలయ సమీపంలోని వీవీ నగర్లో రైల్వే నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. జోనల్ వర్క్లో భాగంగా రూ.లక్షలు వెచ్చించి రైల్వే ఉద్యోగుల వసతి సముదాయం ప్రహరీతో పాటు డ్రెయినేజీల నిర్మాణ పనులు చేపట్టారు. అయితే వందశాతం మెరుగ్గా ఉన్న డ్రెయినేజీలపై రాతి కట్టడం చేపట్టడం గమనార్హం. ఈ పనిలోనూ ఒకసారి వినియోగించి తొలగించిన రాళ్లనే మళ్లీ వాడుతూ కాంట్రాక్టర్ అక్రమాలకు తావివ్వడం విమర్శలకు దారి తీస్తోంది. కాంట్రాక్ట్కు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్లో ఒకసారి వినియోగించిన రాళ్లను మళ్లీ వాడాలనే నిబంధన లేదు. రైల్వే ఉద్యోగుల పురాతన వసతి గృహాలను కూల్చివేయడం ద్వారా బయటపడిన ఒక్కో రాయిని 50 పైసలతో కాంట్రాక్టర్ కొనుగోలు చేసి, వాటిని డ్రెయినేజీ నిర్మాణానికి వాడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కొరవడిన పర్యవేక్షణ రైల్వే నిధులతో చేపట్టిన పనులను సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారుల పర్యవేక్షణలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను ఓ సూపర్వైజర్కు అధికారులు కేటాయించారు. అయితే పని ప్రాంతంలో ఆయన ఎన్నడూ కనిపించరు. ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు వెళ్లిపోతాడో ఎవరికీ తెలియదు. దీంతో పనులు నాసిరకంగా సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఐఓడబ్ల్యూ శివదాసన్ను వివరణ కోరగా... వీవీ నగర్, ప్రభాత్నగర్ జోనల్ పరిధిలో స్పెషల్ వర్క్ కింద దాదాపు రూ.1.80 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో పార్కు అభివృద్ధి, ఉద్యోగుల వసతి గృహాల ప్రహరీ, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు. వర్షం వచ్చినప్పుడు డ్రెయినేజీలో మట్టి పడకుండా ఉండేందుకు ఎత్తు పెంచుతూ రాతి కట్టడం కడుతున్నట్లు పేర్కొన్నారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బాబు మౌనం వీడాలి
● సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అనంతపురం అర్బన్: పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని, ఈ అంశంపై సీఎం చంద్రబాబు ఇప్పటికై నా మౌనం వీడాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. సీపీఐ వందేళ్ల వేడుక సందర్భంగా గురువారం అనంతపురంలోని లలిత కళాపరిషత్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన ఉద్యమవీరుల కుటుంబాల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.బీజేపీ పాలనలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దేశానికి ప్రమాదకరమన్నారు. రాజ్యాంగంలోని లౌకిక, సోషలిస్టు పదాలను తొలగించి దేశాన్ని మతరాజ్యంగా మారుస్తున్న బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు, నితీష్కుమార్పై ఉందన్నారు. మోదీ బయటికు గాంధీ పేరు జపిస్తున్నా.. మనసులో మాత్రం గాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సేనే ఉన్నారని ఆరోపించారు. పాలనలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రజాసంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తున్నారని, రాష్ట్ర సంపదను అనుయాయులకు దోచిపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారన్నారు. భూములను కారు చౌకగా తన అనుయాయ కంపెనీలకు కట్టబెడుతూ ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, జె.రాజారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
ఏమీ ఆశించకుండా మన కోసం కష్టపడి, మనం వృద్ధిలోకి రావాలని ఆశించే నిస్వార్థ ప్రేమ తల్లితండ్రులది. ఆప్యాయత, సంరక్షణ, ఓదార్పు, మద్దతు, అంగీకారం, వాత్సాల్యం అనేవి కేవలం తల్లిదండ్రుల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. అందుకే తల్లిదండ్రులే ప్రత్యక్షదైవాలని ‘‘మాతృదేవోభవ–
తల్లిదండ్రుల సాయంతో నడుస్తున్న రవితేజారెడ్డి గుంతకల్లు: విడపనకల్లు మండలం కడదరబెంచి గ్రామానికి చెందిన మహిపాల్రెడ్డి, పద్మజ దంపతులకు ఒక్కాగానొక్క కుమారుడు రవితేజారెడ్డి ఉన్నాడు. సాధారణ వ్యవసాయ కుటుంబం. తమ ఆర్థిక పరిస్థితికి మించి కుమారుడిని చదివించి సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేయించారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల కష్టాలను దూరం చేయాలని భావించిన రవితేజారెడ్డి... బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజినీర్గా ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రయోజకుడైన కుమారుడిని ఓ ఇంటి వాడిని చేయాలని భావించి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఇలాంటి తరుణంలోనే 2020లో బెంగళూరులో చోటు చేసుకున్న ప్రమాదంలో రవితేజారెడ్డి తలకు, వెన్నెముకకు బలమైన గాయాలై మంచాన పడ్డాడు. అప్పటి నుంచి రవితేజారెడ్డి శరీరం క్రమంగా బలహీన పడుతూ వచ్చింది. కాళ్లు, చేతులు సచ్చుబడ్డాయి. మాటలు కూడా తడబడసాగాయి. కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని డాక్టర్లు సైతం స్పష్టం చేశారు. రైతు కాస్త కూలీ అయ్యాడు.. చికిత్సకు వైద్యులు చేతులేత్తిసిన విపత్కర పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు ఆశ వదులుకోలేదు. రవితేజారెడ్డిని మామూలు మనిషిగా మార్చేందుకు ఆ మరుక్షణం నుంచే పోరాటం మొదలు పెట్టారు. ఎన్నో ఆస్పత్రులు తిరిగారు... ఎందరో నిపుణులైన డాక్టర్లను కలిశారు. ఉన్న ఆస్తులు విక్రయించారు. మరింత డబ్బు అవసరం కావడంతో అప్పులు చేసి, రూ.20 లక్షలకు పైగా ఖర్చు పెట్టారు. ఈ నేపథ్యంలో పది మందికి అన్నం పెట్టే రైతు కాస్త కూలీగా మారాడు. ఆ దంపతుల ఆత్మవిశ్వాసం ముందు విధి తలవంచింది. ఐదేళ్లుగా కుమారుడి కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇస్తున్నాయి. ప్రతి రోజూ ఫిజియోథెరఫి అవసరం కావడంతో గ్రామాన్ని వదిలి గుంతకల్లుకు మకాం మార్చి రాజేంద్రనగర్లో అద్దె ఇంట్లో ఉంటూ కుమారుడి బాగు కోసం శ్రమిస్తున్నారు. మార్కెట్ యార్డు మైదానంలో రోజూ రెండు గంటల పాటు నడక, వ్యాయామం చేయిస్తూ ఆ తల్లిదండ్రులు పడుతున్న తపనను గమనించిన చూపరుల హృదయాలు ద్రవిస్తున్నాయి. త్వరలో రవితేజారెడ్డి పూర్తిగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. గొప్ప ఆదర్శమూర్తులు పిల్లల బాగు కోసం తల్లిదండ్రులు పడే తపనకు నిదర్శనమే మహిపాల్రెడ్డి దంపతులు. నేటి తరానికి వీరు ఆదర్శ మూర్తులు. వారి ప్రయత్నం ఫలించి రవితేజారెడ్డి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారాలని కోరుకుంటున్నా. – డాక్టర్ లక్ష్మయ్య, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గుంతకల్లు ప్రమాదంలో వెన్నెముక, తలకు బలమైన గాయాలు అవయవాలు సచ్చుబడి మంచానికే పరిమితమైన యువకుడు ఎదిగొచ్చిన కుమారుడి ఆరోగ్యం కోసం ఐదేళ్లుగా తల్లిదండ్రుల అలుపెరుగని పోరాటం వారి సంకల్పం ఎదుట తలొగ్గిన విధి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న యువకుడు -
●పాసున్నా.. బస్సు ఆపకపాయే
బొమ్మనహాళ్: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ చుక్కలు చూపిస్తోంది. రోడ్డుపై విద్యార్థులను చూడగానే డ్రైవర్లు బస్సులు ఆపడం లేదు. దీంతో తిప్పలు తప్పడం లేదు. బొమ్మనహాళ్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఉద్దేహాళ్, శ్రీధరఘట్ట, తిమ్మలాపురం, కొలగానహాళ్లి, ఉప్పరహాళ్, సింగాన హళ్లి, ఎల్బీ నగర్, గోనేహాళ్, లింగదహాళ్, బండూరు తదితర గ్రామాల నుంచి 300 మందికి పైగా విద్యార్ధులు వస్తుంటారు. వీరందరూ డబ్బు కట్టి బస్సు పాసులు తీసుకున్నారు. అయినా అవి నిరుపయోగంగా మారాయి. దీంతో కళాశాలకు సకాలంలో చేరేందుకు లగేజీ ఆటోలు, ట్రాక్టర్లపై ప్రమాదకర స్థితిలో ప్రయాణం సాగిస్తున్నారు. మరికొందరు విద్యార్థులు కాలినడకన చేరుకుంటున్నారు. ఇక కళాశాల ముగిసిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. దీంతో ఇంటికి చేరుకునే లోపు చీకటి పడుతోంది. అధికారులు స్పందించి విద్యార్థులకు ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌలభ్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలం
● ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ధ్వజం ఉరవకొండ: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల వ్యవధిలోనే రైతులు రోడ్డున పడ్డారన్నారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా గిట్టుబాటు ధర లేక పంటను రోడ్డు మీద రైతులు పారవేస్తున్నారన్నారు. ఈ ఏడాది జిల్లాలో పంటల సాగు చేపట్టకపోవడంతో లక్ష ఎకరాలు బీడుగా మారాయన్నారు. కందిలో దిగుబడులు లేవన్నారు. మిర్చి పంటను తెగుళ్లు నాశనం చేస్తున్నాయన్నారు. దీంతో పెట్టుబడులు సైతం చేతికి అందని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా ఉన్న ఊళ్లోనే రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడమే కాకుండా, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీలు సకాలంలో అందడంతో వ్యవసాయం లాభసాటిగా సాగిందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వడ్డే వెంకట్ అనంతపురం కల్చరల్: నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ముదిగుబ్బకు చెందిన వడ్డే వెంకట్ను నియమిస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకట్ నియామకంపై జిల్లా వడ్డెర సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గర్భం దాల్చిన బాలిక ఉరవకొండ: ప్రేమ పేరుతో ఓ బాలిక వంచనకు గురైంది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వివరాలను ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది గురువారం వెల్లడించారు. బొమ్మనహల్ మండలం శ్రీధరగట్టు గ్రామానికి చెందిన యువకుడు శివమణి కొంత కాలంగా ఉరవకొండ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని మభ్యపెట్టి పలుమార్లు శారీరకంగా కలిశాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. విషయం గుర్తించిన బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పీఏబీఆర్ గేట్లు బంద్ కూడేరు: మండలంలోని పీఏబీఆర్కు ఇన్ఫ్లో తగ్గడంతో గురువారం సాయంత్రం క్రస్డ్ గేట్లను అధికారులు బంద్ చేశారు. ప్రస్తుతం పీఏబీఆర్కు 220 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా... 340 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. నీటి మట్టం 5.18 టీఎంసీలు ఉన్నట్లు ఇరిగేషన్ జేఈఈ తెలిపారు. ధర్మవరంలో వృద్ధురాలికి స్క్రబ్ టైఫస్ ధర్మవరం అర్బన్: పట్టణంలోని శాంతినగర్కు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు స్క్రబ్ టైఫస్ బారిన పడింది. ఈ నెల 8న తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలతో బాధపడుతూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ఆమె నడుముపై నల్లటి మచ్చను వైద్యులు గుర్తించి వైద్య పరీక్షలకు రెఫర్ చేశారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో నిర్వహించిన ఐజీఎం ఎలిసా పరీక్షలో ఆమెకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు గురువారం ఫలితాలు అందినట్లు ధర్మవరం ఆసుపత్రి సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్ తెలిపారు. ప్రస్తుతం వృద్ధురాలికి ధర్మవరం ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. -
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
అనంతపురం సిటీ: పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ ఆనంద్ అన్నారు. ఎస్సీఆర్టీ బృందం రూపొందించిన వంద రోజుల ప్రణాళిక, స్టడీ మెటీరియల్ను క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ గురువారం విడుదల చేశారు. డీఈఓ ప్రసాద్బాబు, డీసీఈబీ సెక్రటరీ గంధం శ్రీనివాసులు పాల్గొన్నారు. నేడు షీప్ సొసైటీల ఎన్నికలు అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల (షీప్ సొసైటీస్) ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 29 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించడానికి పశు సంవర్థకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి విడతగా ఈనెల 5న 55 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించగా వివిధ కారణాలతో 13 సొసైటీలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. రెండో విడతలో కూడా పలు సొసైటీలకు ఎన్నికలు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం తోపుదుర్తి, అమ్మవారిపేట, కాలువపల్లి, టి.కొత్తపల్లి, చెర్లోపల్లి, దోసులుడికి, గొల్లలదొడ్డి, శీబాయి, వైసీ పల్లి, మలయనూరు, గొల్లపల్లి, నడిమిదొడ్డి, జి కొట్టాల, సింగనగుట్టపల్లి, పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లి, జి.కొత్తపల్లి, బొమ్మేపర్తి, అయ్యవారిపల్లి, పీసీ ప్యాపిలి, కాటికానికాలువ, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం మామిళ్లపల్లి, పర్వతదేవరపల్లి, కొడపగానిపల్లి, రామస్వామితాండా, నసనకోట, పి.కొత్తపల్లి, ఆత్మకూరు సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సత్వర పరిష్కారం అనంతపురం క్రైం: అహుడా పరిధిలో పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని అహుడా కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ కింద వచ్చిన అర్జీలు ఎక్కువకాలంగా పెండింగ్లో ఉండకూడదన్నారు. ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. లేఅవుట్ ఆమోదించిన తర్వాత మూడేళ్లు గడిచినా చెప్పిన విధంగా అభివృద్ధి పనులు పూర్తి చేయని డెవలపర్లు, రియల్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అహుడా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్డేలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పాల్గొన్నారు. టెట్కు రెండో రోజు 946 మంది హాజరు అనంతపురం సిటీ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు రెండో రోజైన గురువారం మొత్తం 1025 మందికి 946 మంది హాజరయ్యారని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 553 మందికి గాను 513 మంది మాత్రమే హాజరయ్యారు. 40 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 472 మందికి గాను 433 మంది పరీక్ష రాశారు. 39 మంది డుమ్మా కొట్టారని డీఈఓ తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి విడపనకల్లు: వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీపీకి చెందిన కార్యకర్త దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఉండబండలో గురువారం రాత్రి వైఎస్సార్సీపీ కార్యకర్త గోపాల్ తాను వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తానని, టీడీపీకి చెందిన ఉప్పర ఎర్రిస్వామితో చెప్పడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఎర్రిస్వామి కట్టెతో తలపై కొట్టడంతో గోపాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై బాధితుడు పాల్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
‘దుర్గం’ మున్సిపల్ చైర్పర్సన్గా గౌతమి
కళ్యాణదుర్గం: నాటకీయ పరిణామాల మధ్య కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్గా బీజేపీ నుంచి టీడీపీలోకి చేరిన తలారి గౌతమి ఎన్నికయ్యారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ వసంతబాబు ఆధ్వర్యంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. 22 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు హాజరయ్యారు. వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఎన్నికకు గైర్హాజరయ్యారు. చైర్మన్ పదవి కోసం వైఎస్సార్సీపీ నుంచి 14వ వార్డు కౌన్సిలర్ లక్ష్మన్న, టీడీపీకి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ గౌతమి పోటీపడ్డారు. అయితే వైఎస్సార్సీపీ అభ్యర్థి లక్ష్మన్నకు 11 మంది, టీడీపీ అభ్యర్థి గౌతమికి 11 మంది కౌన్సిలర్లు చేతులెత్తి మద్దతు తెలిపారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా పాల్గొన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తమ పార్టీ అభ్యర్థి గౌతమికి మద్దతుగా చేతులెత్తడంతో వారి సంఖ్యాబలం 13కు చేరింది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్గా గౌతమి ఎన్నికై నట్లు ప్రిసైడింగ్ అధికారి వెల్లడించారు. 144 సెక్షన్ ఉల్లంఘన గురువారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎన్నికల కమిషన్ విధించిన 144 సెక్షన్ను టీడీపీ నేత లు ఉల్లంఘించారు. ఎన్నిక జరుగుతున్న నమయంలో నేరుగా చంద్రబాబు జిందాబాద్, అమిలినేని జిందాబాద్ అంటూ ఎమ్మెల్యే అల్లుళ్లు ధర్మతేజ, అవినాష్ తమ అనుచరులతో ఎన్నిక జరిగే మున్సిపల్ కార్యాలయం వద్దకు చొచ్చుకువచ్చారు. మీడియా కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీని సైతం ఆక్రమించి మీడియా ప్రతినిధులు కూర్చునే అవకాశం లేకుండా చేశారు. టీడీపీ కవ్వింపు చర్యలు చైర్మన్ ఎన్నిక పూర్తి చేసుకుని బయటికి వస్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను చూసిన టీడీపీ నేతలు పెద్దగా అరుస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. అలాగే అధికార పార్టీ ప్రలోభాలకు లొంగని కౌన్సిలర్లను చూసిన వైఎస్సార్సీపీ నేతలు నైతిక విజయం తమదేనంటూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇరు పార్టీల మధ్య కొద్దిసేపు నినాదాలు హోరెత్తాయి. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని ఇరు పార్టీలను సముదాయించి అక్కడి నుంచి పంపించారు. కళ్యాణదుర్గం రూరల్: ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన రాజకీయం చేయాలని వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. గురువారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనంతరం రంగయ్య మాట్లాడారు. అధికారం, డబ్బు ఉందనే అహంకారంతో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టారన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో 13 మంది వైఎస్సార్సీపీ వైపు, 11 మంది టీడీపీ వైపు ఉండగా.. వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లను ప్రలోభపెట్టి చైర్మన్ ఎన్నికకు గైర్హాజరయ్యేలా చేసి, కేవలం ఎంపీ, ఎమ్మెల్యే మద్దతుతోనే టీడీపీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుందని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా నైతిక విలువలతో కూడిన రాజకీయమే చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కుర్రరాము, పరమేశ్వప్ప, లక్షన్న, పూసుల భాగ్యమ్మ, అర్చన, గోపారం హేమవతి, తలారి రాజ్కుమార్, తిరుమల చంద్రమ్మ, గంగమ్మ, తిప్పమ్మ, సుదీప్తి, జెడ్పీటీసీ సభ్యులు బొమ్మన్న, గుద్దెళ్ల నాగరాజు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, కన్వీనర్లు గోళ్లసూరి, ఎంఎస్ రాజు, హనుమంతురాయుడు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. విలువలతో కూడిన రాజకీయం చేయాలి ఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల గైర్హాజరుతో టీడీపీకి చాన్స్ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ నేతల కవ్వింపు చర్యలు -
సర్వేలు మొదలు ప్రతి పనికీ చంద్రబాబు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. దీంతో ఈ భారం మోయలేం బాబోయ్ అని సచివాలయ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. బయటకు చెప్పుకోలేక లోలోన మదన పడుతూ కృంగిపోతున్నారు.
అనంతపురం అర్బన్: చంద్రబాబు సర్కార్ సచివాలయ ఉద్యోగులపై మోయలేని భారం మోపుతోంది. పది మంది చేసే పని ఒకరితో చేయిస్తూ తీవ్రవేదనకు గురిచేస్తోంది. సచివాలయ ఉద్యోగులు ఏకంగా 14 సర్వేలు నిర్వహిస్తున్నారు. మరోవైపు క్లిష్టమైన, కీలకమైన బీఎల్ఓలుగానూ వ్యవహరిస్తున్నారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి త్వరలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఓటరు మ్యాపింగ్ బాధ్యతలను అప్పగించి మరింత భారం మోపారు. సర్వేలు ఇలా... సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాల్సి వస్తోంది. ఇలా ఏకంగా 14 సర్వేలతో పాటు బీఎల్ఓ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సర్వేల విషయానికొస్తే పీ–4, వర్క్ ఫ్రమ్ హోమ్, అప్డేట్ ఈ–కేవైసీ, హౌస్ హోల్డ్ డేటా, అప్డేట్ మొబైల్ సర్వే, ఫ్యామిలీ మైగ్రేషన్, ఇతర శాఖల ఈ–కేవైసీ, వాట్సాప్ మన మిత్ర, ఆధార్ సీడింగ్ పర్ వాహన మిత్ర, కౌశలం సర్వే, హౌస్హోల్డ్ ఎడిట్ సర్వే, రైస్ కార్డు పంపిణీ, వాట్సాప్ డోర్ టూ డోర్ ప్రచారం, పింఛన్ల వెరిఫికేషన్ చేస్తున్నారు. బీఎల్ఓ బాధ్యతలు సర్వేలతో పాటు బీఎల్ఓ విధులు నిర్వర్తిస్తున్నారు. ఓటరు చేర్పునకు ఫారం–6, ఓటరు తొలగింపునకు ఫారం–7, వివరాల మార్పులు, చేర్పులకు ఫారం–8 స్వీకరణ నిరంతర ప్రక్రియ. త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టనున్న నేపథ్యంలో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ కూడా వారికి అప్పగించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల మ్యాపింగ్ చేయాలి. బాధను బయటకు చెప్పుకోలేక.. సర్వేలు, ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహించే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని... ఆ బాధను కూడా బయటకు చెప్పుకోలేని దుర్భర పరిస్థితిలో ఉన్నామని పలువురు సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. సమస్యలను, ఇబ్బందులను బయటకు చెబితే శాఖాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. బహుమతిగా షోకాజ్ నోటీసులు ఓటరు మ్యాపింగ్ శాతం తగ్గితే సచివాలయ ఉద్యోగులు షోకాజ్ నోటీసులను బహుమతిగా అందుకుంటున్నారు. ఒకవైపు రెగ్యులర్ సర్వేలు నిర్వహిస్తూ... మరోవైపు ఇంటింటికీ వెళ్లి ఓటరు మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులు ఎంతలా పని ఒత్తిడికి గురవుతున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోకపోగా షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారంటూ పలువురు సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. సచివాలయ ఉద్యోగులపై తీవ్రమైన పని ఒత్తిడి ఏకంగా 14 సర్వేలు నిర్వహించాల్సిన పరిస్థితి తాజాగా ఓటరు మ్యాపింగ్తో మరింత భారం మ్యాపింగ్ తగ్గితే బహుమానంగా షోకాజ్ నోటీసులు ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నామని ఉద్యోగుల ఆవేదన -
మంచు కురిసే వేళలో..
అనంతపురం అగ్రికల్చర్: ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పతనమయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో జనం గజ గజ వణుకుతున్నారు. గురువారం విడపనకల్లులో 10.03 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి, మడకశిరలో కూడా 10.4 డిగ్రీలు నమోదైంది. అలాగే వజ్రకరూరు 11.2 డిగ్రీలు, గుమ్మఘట్ట 11.3 , తనకల్లు 11.4 , అమడగూరు 11.5 , శెట్టూరు 11.5 , బొమ్మనహాళ్ 11.7, నల్లచెరువుల, కణేకల్లు 11.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా మండలాల్లో ఈ సీజన్లోనే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా 27 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు రికార్డయ్యాయి. దీంతో చలి ప్రభావం బాగా పెరిగింది. -
ప్రజాస్వామ్యానికి పాతర
సాక్షి, టాస్క్ఫోర్స్: అధికారం కోసం పరిటాల కుటుంబం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. బలంలేకున్నా రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక బరిలో నిలిచి.. వైఎస్సార్సీపీకి చెందిన కుంటిమద్ది ఎంపీటీసీ సభ్యురాలు సాయిలీలను ప్రలోభాలకు గురి చేశారు. గురువారం జరిగిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలో సాయిలీలకు టీడీపీ కండువా కప్పి దౌర్జన్యంగా, నిబంధనలకు విరుద్ధంగా ఎంపీపీగా ఏకగ్రీవం చేశారు. బలం లేకున్నా...బరిలో నిలిచి రామగిరి మండలంలో పది ఎంపీటీసీ స్థానాలుండగా... అందులో పేరూరు–1, పేరూరు–2, మాదాపురం, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, రామగిరి, కుంటిమద్ది, పోలేపల్లి, గంతిమర్రిలలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. నసనకోట స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోగలిగింది. ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వు కాగా, రామగిరి ఎంపీటీసీ సభ్యురాలు మీనుగ నాగమ్మ ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే 2024 డిసెంబరులో ఆమె అనారోగ్యంతో మృతి చెందగా... ఎంపీపీ స్థానం దక్కించుకునేందుకు పరిటాల కుటుంబం కుట్రలు, కుతంత్రాలకు తెరతీసింది. తమ పార్టీ తరఫున మహిళా ఎంపీటీసీలు లేకపోవడంతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేశారు. నాలుగుమార్లు వాయిదా టీడీపీ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్ ఘటనలతో రామగిరి ఎంపీపీ ఎన్నిక నాలుగుసార్లు వాయిదా పడింది. దీంతో మరోసారి అధికారులు ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వగా టీడీపీ నేతలు అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్నారు. దాడులు...దౌర్జన్యాలే లక్ష్యం.. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి రామగిరి మండలంలోని వైఎస్సార్సీపీ నేతలను టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇళ్లు, వాహనాలు, పొలాల్లోని పచ్చని చెట్లను లక్ష్యంగా చేసుకొని రోజూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మార్చి 30వ తేదీన వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్యపై పరిటాల సమీప బంధువులు దాడి చేసి హతమార్చారు. చివరకు వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ కప్పల సాయిలీలను భయపెట్టి పార్టీలో చేర్చుకున్నారు. గురువారం జరిగిన ఎన్నికలో ఆమెను అప్రజాస్వామికంగా ఎన్నిక చేసుకుని సంబరపడుతున్నారు. రామగిరి ఎంపీపీ ఎన్నికలో పరిటాల నిసిగ్గు రాజకీయం వైఎస్సార్ ఎంపీటీసీలకు ప్రలోభాలు, బెదిరింపులు కుంటిమద్ది ఎంపీటీసీ సాయిలీలకు బలవంతంగా పచ్చకండువా ఎంపీపీగా గెలచాలమంటూ సంబరాలు -
హైవేపై బ్లాక్ స్పాట్లకు చెక్
● ప్రమాదాల నివారణకు తపోవనం, రాప్తాడు వద్ద సిక్స్వే వై జంక్షన్ల ఏర్పాటు ● 18 ప్రాంతాల్లో అండర్ పాస్లు అనంతపురం టవర్క్లాక్: కర్నూలు నుంచి బాగేపల్లి వరకూ ఎన్హెచ్ 44 జాతీయ రహదారిలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర రహదారులశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో ఉన్న 24 బ్లాక్ స్పాట్లను అధికారికంగా గుర్తించి వాటి పరిష్కరానికి భారీగా నిధులు మంజూరు చేసింది. నాలుగు ఫ్లై ఓవర్లు .. ఆరు వరుసల రహదారులు, 18 అండర్ పాస్, సర్వీస్ రోడ్లు, అండర్ పుట్స్, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఒక్కో ఫ్లై ఓవర్కు రూ.40 కోట్లు కర్నూలు నుంచి బాగేపల్లి వరకు 24 ప్రమాద ప్రాంతాలు ఉండగా అందులో తపోవనం, రాప్తాడు, సోమందేపల్లి, కోడూరు వద్ద ఆరు లైన్లు రహదారులతో వై జంక్షన్ ప్లైఓవర్లు నిర్మించనున్నారు. ఒక్కో ఫ్లై ఓవర్కు రూ.40 కోట్లు నిధులు ఖర్చు చేయనున్నారు. వీటికి త్వరలోనే టెండర్లకు పిలవనున్నారు. 18 అండర్ పాస్లు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి 18 చోట్ల అండర్ పాస్లు, సర్వీస్ రోడ్లు, చిన్న అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి 24 బ్లాక్ స్పాట్స్ ఉండగా 22 చోట్ల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రమాదాలు తగ్గే ప్రదేశాలు తపోవనం, సాక్షి ఎడిషన్, రాప్తాడు, సోమందేపల్లి మార్గాల వద్ద రోడ్లు ప్రమాదాలు తగ్గనున్నాయి. భారీ వాహనాలు, రహదారి దాటే చిన్న వాహనాలతో తర చూ ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు అండర్ పాస్లు, సర్వీస్ రోడ్లు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో దాదాపు 40 నుంచి 60 శాతం వరకు ప్రమాదాలు తగ్గుతాయి. -
49 చెరువులకు నీటి సరఫరా లేనట్టే?
● కుడికాలువ నీటి కోసం ఎదురు చూస్తున్న రైతులు కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం) నుంచి ధర్మవరం కుడికాలువ కింద ఉన్న ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న 49 చెరువులకు ఇరిగేషన్ అధికారులు ఇప్పట్లో నీటిని సరఫరా చేసే పరిస్థితి కనిపించడం లేదు. కూడేరు మండలం జల్లిపల్లి వద్ద కుడికాలువ 4వ కిలో మీటర్ వద్ద గతంలో చేసిన మరమ్మతు పనులు నాసిరకంగా ఉండడంతో నీటి ప్రవాహానికి కాలువ గట్టు భారీగా కోతకు గురై తెగిన విషయం తెలిసిందే. కాలువ గట్టు మరమ్మతులకు సుమారు రూ.కోటి వరకు ఖర్చవుతుందని ఇరిగేషన్ అధికారులు కలెక్టర్, ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఒకవేళ మరమ్మతు పనులు మొదలెట్టినా కనీసం 15 రోజులు సమయం పడుతుంది. కుడి కాలువ గేట్లదీ సమస్యే కుడి కాలువకు నీటిని విడుదల చేసే గేట్లు కూడా పైకి లేవకుండా మొరాయిస్తున్నాయి. గత నెల 15న కుడి కాలువకు నీటి విడుదలకు ఇరిగేషన్ అధికారులు సిద్ధ పడ్డారు. గేట్లు మరమ్మతు చేపట్టి నీటి విడుదల చేద్దామని అధికారులు 22న ట్రయల్ చూశారు. కానీ గేటు పైకి లేవలేదు. నాటి నుంచి మెకానికల్ నిపుణులు వచ్చి గేట్లు పైకి లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తుంగభద్ర డ్యాం గేటును డిజైన్ చేసిన మెకానికల్ నిపుణులు కన్నయ్య నాయుడు సూచనలతో మరమ్మతులు చేపట్టగా ఈ నెల 1న గేట్లు పైకి లేవడంతో 700 క్యూసెక్కుల నీటిని కుడి కాలువకు వదులుతూ వచ్చారు. కుడి కాలువ మొత్తం 112 కిలోమీటర్లు ఉంది. 7వ తేదీ నీరు 80వ కిలో మీటరుకు చేరగానే జల్లిపల్లి వద్ద గట్టు తెగింది. డ్యాం నుంచి నీరు వృథాగా వెళ్లకుండా అధికారులు 9వ తేదీ గేట్లను కిందికి దించారు. తెగిన గట్టుకు మరమ్మతు చేపట్టాక నీటి విడుదలకు గేట్లు పైకి లేస్తాయో.. లేదో ? తెలియని పరిస్థితి. కాబట్టి కుడి కాలువ కింద 49 చెరువులకు నీటి సరఫరా ఎప్పుడవుతుందో చెప్పలేని పరిస్థితి. 49 చెరువుల కింద ఉన్న ఆయకట్టు రైతులు, రైతులు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. -
‘నకిలీ’ సూత్రధారులకు బిగుస్తున్న ఉచ్చు
మడకశిర: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో సూత్రధారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. అగళి మండలం కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి ఏకంగా 3,982 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ కాగా, అధికారులు అప్రమత్తమయ్యారు. సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా నోడల్ అధికారి కళాధర్ వారం రోజుల పాటు విచారణ చేసి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపారు. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే నకిలీ బర్త్ సర్టిఫికెట్ల సూత్రధారులెవరో తేల్చి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. 3,981 బర్త్ సర్టిఫికెట్లు రద్దు కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి జారీ అయిన బర్త్ సర్టిఫికెట్లపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఇందులో ఒకే ఒక బర్త్ సర్టిఫికెట్ మాత్రం అసలుదని గుర్తించారు. మిగిలిన 3,981 బర్త్ సర్టిఫికెట్లన్నీ నకిలీవేనని తేల్చారు. ఇదే విషయాన్ని విచారణ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పొందుపర్చారు. దీంతో ప్రభుత్వం నకిలీ బర్త్ సర్టిఫికెట్లన్నింటినీ రద్దు చేయాలని ఆదేశించగా... అధికారులు చర్యలకు ఉపక్రమించారు. బుధవారం నాటికే 3,981 నకిలీ బర్త్ సర్టిఫికెట్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. సూత్రధారుల అరెస్ట్కు రంగం సిద్ధం! నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన సూత్రధారుల అరెస్ట్కు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు నమోదు కాగానే... పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిసింది. అయితే ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తారా...? లేక సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తారా..? అనే విషయం త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఏదిఏమైనా మరో రెండు, మూడు రోజుల్లో నకిలీ సూత్రధారులు కటకటాల వెనక్కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక క్రిమినల్ కేసు నమోదుకు సిఫార్సు చేసిన ఉన్నతాధికారులు 3,981 బర్త్ సర్టిఫికెట్లు రద్దు..సూత్రధారుల అరెస్ట్కు రంగం సిద్ధం -
‘ఉపాధి’లో అక్రమాలు
కూడేరు: మండలంలో చేపట్టిన ఉపాధి పనుల్లో భారీగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. గొటుకూరు, కూడేరు పంచాయతీల పరిధిలో దాదాపు రూ.20 లక్షల మేర అక్రమాలు చోటు చేసుకున్నట్టు సామాజిక తనిఖీ అధికారులు నిగ్గు తేల్చారు. తక్కువ పనిని ఎక్కువగా చేసినట్లు రికార్డుల్లో పొందుపరిచి రూ.లక్షల్లో బిల్లులు చేసుకున్నారని ఈ నెల 3, 8వ తేదీల్లో ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో సామాజిక తనిఖీ జిల్లా రీసోర్స్ పర్సన్ ఆంజనేయులు అభియోగం మోపారు. మెట్టభూముల్లో ఉద్యాన పంటల పథకంలోనూ భారీగా అవినీతికి పాల్పడినట్లుగా రైతులు ఆరోపించడం గమనార్హం. చీనీ, మామిడి మొక్కలు నాటుకున్నా.. ఎరువులు, అంతర పంటల సాగు బిల్లులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెట్టారంటూ గ్రామసభల్లో ఉపాధి సిబ్బందితో 28 మంది రైతులు గొడవకు దిగారు. కొలతల్లో భారీగా తేడాలు 2024,, ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఉపాధి హామీ పథకం కింద పూర్తయిన రూ.7.26 కోట్ల పనులపై గత నెల 26 నుంచి సామాజిక తనిఖీ చేపట్టి ఈ నెల 3, 8వ తేదీల్లో ఆయా గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గొటుకూరు పంచాయతీలో ఏడు నీటి కుంటల్లో పని చేస్తే 4 కుంటల్లో కొలతలు తేడా ఉన్నాయని, ఈ పనుల్లో రూ.10.5 లక్షలు దుర్వినియోగం అయినట్లు సామాజిక తనిఖీ జిల్లా రీసోర్స్ పర్సన్ ఆంజనేయులు అభియోగం మోపారు. అలాగే కూడేరు పంచాయతీ పరిధిలో పీఏబీఆర్ కుడికాలువలో పూడిక తీత పనులు మొదలు పెట్టక ముందు కొలతలను రికార్డుల్లో పొందపరచలేదన్నారు. మొత్తం 6 ఐడీల్లో పని చేస్తే 5 ఐడీల్లో పరిస్థితలో ఎలాంటి మార్పు లేదన్నారు. చెక్ డ్యాంలో పూడిక తీత పనుల కొలతల్లోనూ తేడాలున్నాయని, ఈ రెండింటిలో సుమారు రూ.10 లక్షల వరకు ఎక్కువ బిల్లులు చేసినట్లు అభియోగం మోపారు. ఈ అభియోగాలపై సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరంలో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి. వెలుగు చూసిన సిబ్బంది చేతి వాటం రెండు పంచాయతీల్లో రూ.20 లక్షల దుర్వినియోగం -
పత్తి రైతులు చలికి చిత్తు
గుత్తి: పత్తి విక్రయించడానికి తెల్లవారుజామునే రావాల్సి రావడంతో రైతులు చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు గుత్తి వ్యవసాయ మార్కెట్యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. వారంలో ఒక్కసారి బుధవారం మాత్రమే పత్తి కొంటారు. ఈ క్రమంలో బుధవారం గుత్తి నుంచే కాకుండా చుట్టుపక్కల మండలాల రైతులు పత్తిని వాహనాల్లో లోడ్ చేసుకుని తెల్లవారుజామున నాలుగు గంటకే పత్తి కొనుగోలు కేంద్రానికి తెచ్చారు. అధికారులు ఉదయం 10 గంటలకు వచ్చారు. రైతులు అంతవరకూ చలికి వణుకుతూనే ఆహార పానీయాలు లేకుండా గడపాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వారంలో కేవలం ఒక్క రోజు మాత్రమే అదీ అరకొరగా, నామమాత్రంగా పత్తి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. వారంలో కనీసం నాలుగు రోజులైనా పత్తి కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆయిల్పాం విస్తరణపై దృష్టి అనంతపురం అగ్రికల్చర్: వాణిజ్య పంటగా ఆయిల్పాం (పామాయిల్)ను విస్తరించే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడేం వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతిరెడ్డి, ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి తదితరులు బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. పామాయిల్ తోటల సాగుకు జిల్లాలో ఆరు మండలాలు అనువుగా ఉంటాయని గుర్తించి, రైతులను ప్రోత్సహించడానికి కంపెనీలకు గతేడాది బాధ్యతలు అప్పగించినట్లు వారు తెలిపారు. అందులో కూడేరు, కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హీరేహాళ్, ఉరవకొండ, వజ్రకరూరు మండలాల్లో ఇప్పటికే పంట సాగు చేశారన్నారు. తాజాగా రైతుల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మరో ఐదు మండలాల్లో సాగు అవకాశాల పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. కొత్తగా విడపనకల్లు, గుమ్మఘట్ట, రాయదుర్గం, ఆత్మకూరుతో పాటు బెళుగుప్ప మండలాల్లో సాగుకు అనువుగా ఉందా లేదా అనే దానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. మంచి నేలలు, ఏడాది పొడవునా నీటి సదుపాయం తప్పనిసరి అన్నారు. తరచూ బెట్ట పరిస్థితులు ఏర్పడే ప్రాంతాల్లో ఆయిల్పాం మంచిదికాదన్నారు. టెట్ తొలిరోజు ప్రశాంతం ● 866 మంది అభ్యర్థులు హాజరు అనంతపురం సిటీ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) తొలి రోజైన బుధవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా అనంతపురం, తాడిపత్రి, గుత్తి ప్రాంతాల్లోని మొత్తం ఏడు కేంద్రాల్లో 940 మందికి గాను 866 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. 74 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఉదయం జరిగిన పరీక్షకు 470 మందికి గాను 433 మంది, మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్లో 470 మందికి గాను 433 మంది హాజరయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఈఓ తెలిపారు. -
రూ.3.74 లక్షల విలువైన ఎరువుల విక్రయాల నిలుపుదల
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక భాస్కర్ అగ్రి సొల్యూషన్ దుకాణంలోవ్యవసాయశాఖ గుత్తి ఏడీఏ ఎం.వెంకటరాముడు, రూరల్ ఏఓ వెంకట్కుమార్ బుధవారం తనిఖీలు చేపట్టారు. సరైన అనుమతి పత్రాలు లేని నాగార్జున ఫర్టిలైజర్స్ కంపెనీకి చెందిన రూ.3,74,324 విలువ చేసే ఎరువుల విక్రయాలు నిలుపుదల చేస్తూ నోటీసులు జారీ చేశారు. పీఏబీఆర్కు తగ్గిన ఇన్ఫ్లోకూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) లోకి బుధవారం ఇన్ఫ్లో బాగా తగ్గిపోయింది. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా 570 క్యూసెక్కుల చేరుతుండగా, 470 క్యూసెక్కులు తగ్గించారు. దీంతో 100 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతోంది. అలాగే హెచ్చెల్సీ లింక్ చానల్ ద్వారా 150 క్యూసెక్కుల నీరు చేరుతోంది. రిజర్వాయర్లో 5.18 టీఎంసీలకు నీటి మట్టం చేరుకోవడంతో రెండు గేట్ల ద్వారా 460 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న మిడ్ పెన్నార్ డ్యామ్కు విడుదల చేస్తున్నారు. ఏడీఏ అల్తాఫ్కు బెదిరింపు అనంతపురం సెంట్రల్: వ్యవసాయ శాఖలో అనంతపురం ఏడీగా పనిచేస్తున్న అల్తాఫ్ ఖాన్కు ఓ దుండగుడు బెదిరింపు కాల్ చేసి బ్లాక్ మెయిల్కు దిగిన అంశం సంచలనం రేకెత్తించింది. ఘటనపై అనంతపురం రెండో పట్టణ పోలీసులకు ఏడీఏ ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి 2021 వరకూ ఓ పురుగుల మందుల కంపెనీలో పనిచేశాడు. కారణాలు ఏమైనా అతన్ని విధుల నుంచి కంపెనీ తొలగించింది. అప్పటి నుంచి పురుగు మందులు ఇస్తానంటూ నమ్మబలికి రైతులను మోసం చేస్తూ రావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా తన వాట్సాప్ ప్రొఫైల్లో అవినీతి నిరోధక శాఖ సీఐ హమీద్ ఖాన్ ఫొటోను ప్రొఫైల్గా పెట్టుకుని అధికారులకు తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ నగదు లాక్కొనేవాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఏడీఏ అల్తాఫ్ ఖాన్కు ఫోన్కాల్ చేస్తూ తనను తాను ఏసీబీ ఇన్ఫార్మర్గా పరిచయం చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చాడు. ‘నగరంలోని ఎన్ఆర్ ఫర్టిలైజర్స్లో పట్టుకున్న మూడు ఆటోలకు డబ్బులు తీసుకొని వదిలేశారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. నేను చెప్పినంత డబ్బు ఇవ్వాలి. లేదంటే ఏసీబీ సీఐకి చెప్పి నీపై దాడులు చేయిస్తా’ అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బుధవారం ఏడీఏ ఫిర్యాదు మేరకు టౌటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు రొళ్ల: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం లక్ష్మంపల్లి నివాసి, ఆర్డీటీ మాజీ సీఓ వన్నూరుస్వామి, ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్, ఉమెన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మాజీ మేనేజర్ పి.శ్రీనివాసరావుపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు రొళ్ల పీఎస్ ఏఎస్ఐ హిదయ్తుల్లా తెలిపారు. వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. రొళ్ల మండలం రత్నగిరి గ్రామానికి చెందిన లింగాయత్ అడివేష్ సహకారంతో 2023లో ఆర్డీటీ, డ్వాక్రా మహిళ సంఘాల సభ్యులు డిపాజిట్ చేసిన రూ.1,500కు సంస్థ తరఫున వడ్డీ చెల్లించడంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి నిత్యావసర సరుకులు అందుతాయని వన్నూరు స్వామి, శ్రీనివాసరావు నమ్మించారు. ఈ క్రమంలో రూ.2 లక్షల వరకు వసూలు చేసుకున్నారు. ఇప్పటి వరకూ నిత్యావసర సరుకులు ఇవ్వలేదు. డిపాజిట్ చేసిన సొమ్ము వెనక్కు చెల్లించాలని అడిగినా సమాధానం ఇవ్వడం లేదు. దీంతో మోసపోయినట్లుగా నిర్ధారించుకున్న అడివేష్ ఫిర్యాదు మేరకు ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. భార్యపై వేధింపులు.. భర్త నుంచి గన్, కత్తి స్వాధీనం అనంతపురం సెంట్రల్: నగరంలోని విద్యుత్ నగర్లో దంపతుల మధ్య చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో భర్త వద్ద గన్, కత్తి లభ్యం కావడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. విద్యుత్నగర్లో నివాసముంటున్న ఓ వ్యక్తి.. ఓ యువతిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కొన్ని నెలలుగా పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయినా ఫలించకపోవడంతో తాజాగా బాధితురాలు దిశ పోలీసులను ఆశ్రయించింది. తనకు సంబంధించిన వస్తువులు, దుస్తులు ఇప్పించాలన్న ఆమె వేడుకోలుకు స్పందించిన దిశ పోలీసులు బుధవారం నేరుగా విద్యుత్ నగర్లోని భర్త ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఏకంగా గన్తో పాటు ఓ కత్తి కూడా లభ్యమైంది. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వివరాలు వెల్లడించేందుకు దిశ పోలీసులు నిరాకరించారు. గన్ ఎక్కడ నుంచి వచ్చింది. ఆయుధాలను ఇంట్లో ఎందుకు దాచాడు అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. -
అమిలినేని అడ్డదారులు
కళ్యాణదుర్గం: సంఖ్యాబలం లేదు. అయినా మున్సిపల్ చైర్మన్గిరి కోసం టీడీపీ ఆరాటపడుతోంది. ఇందుకోసం అడ్డదారులు తొక్కింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. తాజాగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు డబ్బు ఎరచూపి.. వినని వారిని బెదిరించి మొత్తానికి ఆరుగురిని తమవైపు లాగేసుకున్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నాలుగు వార్డులను కై వసం చేసుకుంది. మిగిలిన 19 వార్డులలో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. మళ్లీ అదే ఫార్ములా.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు డబ్బు ఎర చూపించారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆశచూపి ఐదుగురిని టీడీపీలోకి చేర్చుకున్నారనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. అయితే ఇటీవల కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మరోసారి అదే ఫార్ములా ప్రయోగించారు. సంఖ్యాబలం లేక వైఎస్సార్సీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణీంద్రను రెండురోజుల క్రితం టీడీపీలోకి చేర్చుకున్నారు. ఓటమి భయంతో క్యాంపు రాజకీయాలు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవుతుందని గ్రహించిన ఎమ్మెల్యే అప్రమత్తమై క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి చేరిన కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి అనంతపురం తరలించారు. ఓ అపార్ట్మెంట్ లో 11 మంది కౌన్సిలర్లను తన ఆధీనంలో పెట్టుకున్నారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా గురువారం నేరుగా వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మాట వినకుంటే బెదిరింపులు టీడీపీని కాదని వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటు వేస్తే సహించేది లేదంటూ కౌన్సిలర్లను హెచ్చరించినట్లు సమాచారం. మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణీంద్రను బెదిరించినట్లు విమర్శలు వినిపించాయి. ఈ నెల 5న తన పార్టీ సస్పెన్షన్ను ఎత్తివేయాలని వైఎస్సార్సీపీ అఽధిష్టానాన్ని ఫణీంద్ర వేడుకున్నారు. దీంతో స్పందించిన పార్టీ కేంద్ర కార్యాలయం జయం ఫణీంద్ర సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేసింది. జయం ఫణీంద్ర వైఎస్సార్సీపీ ఉంటే టీడీపీకి పూర్తిగా నష్టం జరుగుతుందని భావించి.. అదే రోజు రాత్రి ఫణీంద్రను బెదిరించి మరీ టీడీపీలోకి చేరేలా ఎమ్మెల్యే అమిలినేని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు విమర్శలున్నాయి. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్గిరి కోసం దిగజారిన వైనం సంఖ్యాబలం లేక వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు డబ్బుతో ఎర ప్రత్యేక క్యాంపు నుంచి నేడు నేరుగా ఎన్నిక కేంద్రానికి -
స్క్రబ్ టైఫస్పై అలర్ట్
● సర్వజనాస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డు భయపడాల్సిన పనిలేదు స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల భయపడాల్సిన పనిలేదు. కీటకం కుట్టిన చోట నల్లటి గుర్తు ఏర్పడి, ఆ చుట్టూ ఎర్రగా ఉంటుంది. తర్వాత జ్వరం, తలనొప్పి, తదితర లక్షణాలు కన్పిస్తే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వారం రోజుల పాటు సరైన వైద్యం తీసుకుంటే నయమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. – డాక్టర్ యాసర్ అరాఫత్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జీజీహెచ్ అనంతపురం మెడికల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడు స్క్రబ్ టైఫస్ కేసుల నమోదు నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇందులో మంగళవారం ముదిగుబ్బ, గుమ్మఘట్ట మండలం తాళ్లకెర ప్రాంతానికి చెందిన ఇద్దరికి పాజిటివ్ ఉన్నట్లు బయటపడగా.. బుధవారం కిరికెర గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ పాజిటివ్ కేసుల్లో ఐదు నెలల గర్భిణి ఉండటం గమనార్హం. కేసులు కలకలం రేపుతుండటంతో అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో సూపరింటెండెంట్ కేఎల్ సుబ్రహ్మణ్యం, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు. ఈఎన్టీ వార్డులోని రోగులను మరో వార్డుకు తరలించి.. అక్కడ 20 పడకలతో ప్రత్యేక స్క్రబ్ టైఫస్ వార్డు ఏర్పాటు చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించడానికి ర్యాపిడ్ యాక్షన్ టీంను అందుబాటులో ఉంచారు. మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ భీమసేనాచార్, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవి కుమార్, వైద్య కళాశాల నుంచి డాక్టర్ ఆది నటేష్, డాక్టర్ సరోజమ్మ, డాక్టర్ కృష్ణవేణిని నియమించారు. నిరంతరాయంగా సేవలందించేందుకు స్టాఫ్నర్సులకు మూడు షిఫ్టులు కేటాయించారు. స్క్రబ్ టైఫస్పై అవగాహన గుమ్మఘట్ట: తాళ్లకెరకు చెందిన ఓ విద్యార్థిని స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడినట్లు తెలియడంతో మలేరియా సబ్యూనిట్ అధికారి నాగేంద్రప్రసాద్, వైద్యులు సందేశ్, తహసీల్దార్ రజాక్వలి, ఎంపీడీఓ జయరాములు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కీటకనాశిని మందుతో గ్రామంలో పిచికారీ చేయించారు. -
కనువిప్పు కలిగించే సంతకం
టమాట కిలో రూ.30 కక్కలపల్లి మార్కెట్లో బుధవారం కిలో టమాట గరిష్ట ధర రూ.30, కనిష్టం రూ.12, సరాసరి రూ.24 చొప్పున క్రయవిక్రయాలు జరిగాయి. చీనీ టన్ను రూ.19 వేలు అనంతపురం మార్కెట్ యార్డులో బుధవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.19 వేలు, కనిష్టం రూ.8 వేలు పలికాయి. ●వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ పోరుబాట ●జిల్లాలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతం ●నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రానికి చేరిన సంతకాల ప్రతులు గురువారం శ్రీ 11 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అనంతపురం అర్బన్లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన సంతకాల ప్రతుల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న అనంత వెంకటరామిరెడ్డి, చిత్రంలో పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్రెడ్డిఉరవకొండలో సేకరించిన సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో జిల్లా కేంరద్రానికి తరలించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి తదితరులుఅనంతపురం: ప్రజలకు అత్యాధునిక వైద్యం.. పేదలకు డాక్టర్ కలను దూరం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు పన్నిన కుట్రపై వైఎస్సార్సీపీ సమరశంఖం పూరించింది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపు మేరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రెండు నెలలపాటు ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్యం చేసి సంతకాలు సేకరించారు. ప్రజాప్రయోజనాలను పక్కనపెట్టి తన అనుయాయులకు లబ్ధి చేకూర్చడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, యువత, మేధావులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రజా క్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు సర్కారుకు కనువిప్పు కలిగించేలా ముందుకొచ్చి మరీ సంతకాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంత మైంది. నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాల ప్రతులను జాగ్రత్తగా బాక్సుల్లో భద్రపరిచి, బుధవారం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ నెల 15న నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతపురం అర్బన్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ విజయవంతంగా ముగిసింది. బుధవారం అనంత క్యాంప్ కార్యాలయం నుంచి సంతకాల ప్రతులను జిల్లా కార్యాలయానికి తరలించారు. అంతకు ముందు క్యాంప్ కార్యాలయం వద్ద సంతకాల ప్రతులను ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాక్సుల్లో ఉంచారు. ఆ తర్వాత ప్రత్యేక వాహనంలో వాటిని ఉంచి భారీ బైక్ ర్యాలీతో వెళ్లారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు మీసాల రంగన్న, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉరవకొండలోని పొట్టిశ్రీరాములు సర్కిల్ వద్ద కోటి సంతకాల ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోనే రికార్డు స్థాయిలో 62 వేల సంతకాలు సేకరించామని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకుడు నరేష్రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు తాడిపత్రి రమేష్రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాయలసీమ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ప్రణయ్రెడ్డి పాల్గొన్నారు. రాయదుర్గంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా బాక్సులను జిల్లా కేంద్రానికి తరలించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, విశిష్ట అతిథిగా పార్లమెంట్ పరిశీలకుడు నరేష్రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ఎం మోహన్రెడ్డి, ఎస్ఈసీ మెంబర్ గౌని ఉపేంద్రరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప తదితరులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం దిగ్విజయంగా ముగిసింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 40 వేల సంతకాల సేకరణ పూర్తయినట్లు వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ పత్రాలను బుధవారం ర్యాలీగా జిల్లా కేంద్రానికి తరలించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి పార్టీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. తాడిపత్రిలో 40 వేల సంతకాలు సేకరించినట్లు చెప్పారు. ముఖ్య అతిథిగా పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి హాజరయ్యారు. రాప్తాడు నియోజకవర్గంలో సంతకాల ప్రతుల వాహనాన్ని అనంతపురంలో వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి ప్రారంభించారు. -
కిసాన్ రైలు నడపండి
గుంతకల్లుటౌన్: జిల్లాలో అన్నదాతలు పండిస్తున్న ఉద్యాన పంటల ఉత్పత్తుల ఎగుమతి కోసం తాడిపత్రి నుంచి ఢిల్లీ, ముంబైకు కిసాన్ రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాను కలెక్టర్ ఆనంద్ కోరారు. బుధవారం గుంతకల్లులో డీఆర్ఎంతో కలెక్టర్ భేటీ అయ్యారు. అరటి, చీనీ, మామిడి, దానిమ్మ, తదితర ఉద్యాన పంటల ఉత్పత్తి ఎగుమతి చేసే రైతులకు రవాణా చార్జీలను కూడా తగ్గించాలని కలెక్టర్ కోరారు. త్వరితగతిన పూర్తి చేయండి వజ్రకరూరు: విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం వజ్రకరూరు మండలం రాగులపాడు,కొనకొండ్ల గ్రామాల్లో జరుగుతున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ ప నులను ఆయన పరిశీలించారు. 20 రోజుల్లోపు పూర్తిచేసి భవనాలను అధికారులకు అప్పగించాలని సూచించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆనంద్ ఆలయ అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించే క్రమంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టర్కు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. అనంతరం ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆలయ వెనకభాగాన ఏళ్ల తరబడిగా పరిష్కారానికి నోచుకోని డ్రెయినేజీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తామని, ఆ నిధులతో డ్రెయినేజీని అక్కడినుండి మళ్లించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణం ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మిస్తామని తెలియజేశారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా వచ్చేనీటిని పైప్లైన్ ద్వారా ఆలయానికి తీసుకువచ్చేలా అనుమతి ఇవ్వాలని ఆలయ అధికారులు కోరగా.. ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ దేవదాసు, ఆలయ ఈవో ఎం.విజయరాజు, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ గెలుపు తథ్యం
కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు నరేష్రెడ్డి, సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఆయన అనుచరులు ప్రలోభాలు పెట్టి ఒక వైఎస్సార్సీపీ కౌన్సిలర్ను డబ్బుకు కొనుగోలు చేశారని మండిపడ్డారు. అయినా మిగతా సభ్యులు లొంగకుండా పార్టీ కోసం నిలబడ్డారని తెలిపారు. గురువారం జరిగే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుస్తారని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ సుధీర్, ఎంఎస్ రాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
● లెక్కల మాస్టారుగా మారిన కలెక్టర్ కళ్యాణదుర్గం నుంచి జిల్లా కేంద్రానికి సంతకాల ప్రతులను వాహనంలో తరలిస్తున్న సమన్వయకర్త తలారి రంగయ్య, పార్టీ నేతలు తాడిపత్రిలో కోటి సంతకాల సేకరణ ప్రతుల బాక్సులతో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, నాయకులు సత్యనారాయణరెడ్డి తదితరులుఅనంతపురం నుంచి బయల్దేరిన రాప్తాడు నియోజకవర్గ సంతకాల ప్రతుల వాహనాన్ని ప్రారంభిస్తున్న వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి ఆత్మారామిరెడ్డిగుంతకల్లుటౌన్: పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం గుంతకల్లులోని డాక్టర్ సరోజినినాయుడు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. తొలుత ఉపాధ్యాయులతో సమావేశమైన కలెక్టర్ సబ్జెక్టు టీచర్ల ఖాళీల గురించి హెచ్ఎం శంకరయ్యను ఆరా తీశారు. జిల్లాలోని హైస్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ల ఖాళీలు లేకుండా చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి టెన్త్ క్లాస్ సీ–సెక్షన్కు వెళ్లారు. గణిత శాస్త్రంలో విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు త్రికోణమితి చాప్టర్కు సంబంధించి ఓ ప్రాబ్లమ్ను బోర్డుపై వేసి.. దానిని పరిష్కరించాలని సూచించారు. అయితే బోర్డుపై ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పది నిమిషాలైనా బాలికలు ముందుకు రాలేదు. దీంతో కలెక్టరే లెక్కల మాస్టారుగా మారారు. బోర్డుపై ప్రాబ్లమ్ను సాల్వ్ చేసి త్రికోణమితిలో సులువైన బోధనా పద్ధతుల గురించి వివరించారు. మ్యాథ్స్లో పూర్గా ఉన్నారని, బాగా ప్రాక్టిస్ చేయించాలని మ్యాథ్స్ టీచర్ పుష్పలతను ఆదేశించారు. అనంతరం విద్యార్థుల టాయిలెట్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని ఆరగించి, మెనూ పాటి ప్రకారం వడ్డిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తరువాత కలెక్టర్ విలేకర్లతో మాట్లాడుతూ టెన్త్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలోని స్కూళ్లల్లో ఖాళీలను వారం రోజుల్లోపు 80 అకడమిక్ ఇన్స్ట్రక్టర్(విద్యా వలంటీర్ల)తో భర్తీ చేస్తామన్నారు. ఉర్దూ జూనియర్ కాలేజీల ప్రారంభంపై ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాస్, డీఎల్డీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్, ఎంఈఓ సుబ్బరాయుడు తదితరులు ఉన్నారు. మీ వెనకున్న కౌన్సిలర్లు ఎవరు? -
పగలు రెక్కీ.. రాత్రి దోపిడీ
హిందూపురం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.40 లక్షలు విలువ చేసే 309.13 గ్రాముల బంగారు నగలు, 3,010 గ్రాముల వెండి సామగ్రి, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం హిందూపురం అప్గ్రేడ్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ మహేష్, సీఐ ఆంజనేయులుతో కలసి ఎస్పీ సతీష్కుమార్ వెల్లడించారు. పట్టుబడింది వీరే... పోలీసులకు పట్టుబడిన వారిలో గుంటూరులోని రామిరెడ్డినగర్కు చెందిన బండికాళ్ల రత్నరాజు అలియాస్ తేజా (ప్రస్తుతం పరిగి మండలం గొల్లపల్లిలో ఉంటున్నాడు), హిందూపురం మండలం హనుమేపల్లికి చెందిన ఎస్ఎన్ బాబూప్రసాద్ (ప్రస్తుతం చిక్కబళ్లాపురం జిల్లా గౌరీబిదనూరు తాలూకా విదురాశ్వత్థంలో ఉంటున్నాడు), గౌరీబిదనూరు తాలూకా అలకాపురం నివాసి సిద్దిక్ సాహెబ్, హిందూపురం మండలం సంతేబిదనూరు గ్రామానికి చెందిన ఎంజీ గంగరాజు, ఉప్పర సురేష్ ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రత్నరాజుపై 55 కేసులు ఉన్నాయి. 2023 నుంచి వరుస చోరీలు చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో పరిచయం పెంచుకున్న ఐదుగురు.. విడుదలైన తర్వాత ముఠాగా ఏర్పడి పగటి సమయంలో కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవారు. చీకటి పడగానే ఆయా ఇళ్లలోకి చొరబడి విలువైన సామగ్రితో పాటు నగదూ అపహరించుకెళ్లేవారు. 2023 నుంచి ఈ నెల వరకూ వీరు హిందూపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పలు పీఎస్ల పరిధిలో వరుస దోపిడీలు సాగిస్తూ వచ్చారు. ఆయా ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు... ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాలతో డీఎస్పీ మహేష్ నేతృత్వంలో బృందాలుగా విడిపోయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సాయంతో బుధవారం ఉదయం ఐదుగురిని అరెస్ట్ చేసి, బంగారు నగలు, వెండి సామగ్రితో పాటు మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సిబ్బందిని అభినందిస్తూ ఎస్పీ రివార్డులు అందజేశారు. తాళం పడిన ఇళ్లే టార్గెట్.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్ట్ 320 గ్రాముల బంగారు, 3 కిలోల వెండి సామగ్రి స్వాధీనం -
అనంతలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు
అనంతపురం కల్చరల్: ఈ నెల 12, 13, 14 తేదీలలో అనంతపురంలోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల వేదికగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యోగాసనా అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు, బ్రోచర్లను మంగళవారం వివేకానంద యోగభవన్లో ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ వెల్ఫేర్ విభాగంలో యోగాకు గుర్తింపు దక్కడంతో రాష్ట్ర స్థాయి విజేతలను ఈ నెల 28 నుంచి జనవరి 2వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాసిక్ వద్ద సంగమేశ్వరంలో జరిగే జాతీయ స్థాయి చాంపియన్షిప్ పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో విజేతలు నేరుగా ఆసియన్ గేమ్స్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. కార్యక్రమంలో యోగాసన అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముత్యాలరెడ్డి, కేవీ రమణ, యోగా గురువులు దివాకర్, ఆంజనేయులు, మారుతీప్రసాద్, మహేష్, మల్లికార్జున పాల్గొన్నారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ హిందీ సలహాదారుగా గైబువలి అనంతపురం సిటీ: కేంద్ర సహకార మంత్రిత్వ శాఖకు హిందీ సలహాదారుగా హిందీ సేవాసదన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, హిందీ ప్రచార సభ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఎస్.గైబువలి మంగళవారం తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినట్లు వివరించారు. తనకు లభించిన ఈ అవకాశంతో భవిష్యత్లో హిందీ భాషాభివృద్ధికి మరింత పట్టుదలతో పని చేస్తానని వెల్లడించారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ గుంతకల్లు రూరల్: మండలంలోని వెంకటాంపల్లి శివారున పొలాల్లో పేకాట ఆడుతున్న 20 మందిని అనంతపురం స్పెషల్పార్టీ, గుంతకల్లు రూరల్ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ శ్రీనివాస్, రూరల్ సీఐ ప్రవీణ్కుమార్ వెల్లడించారు. రూ.18,92,040 నగదు, 17 ద్విచక్ర వాహనాలు, ఓ కారు, 24 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో గుంతకల్లు రూరల్ పీఎస్ ఎస్ఐ రాఘవేంద్రప్ప, కసాపురం పీఎస్ ఎస్ఐ టీపీ వెంకటస్వామి, పాల్గొన్నారు. బొమ్మనహాళ్: మండలంలోని దర్గాహొన్నూరు గ్రామ శివారున పొలాల్లో మంగళవారం సాయంత్రం పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి, రూ.39,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్ఐ నబీరసూల్ వెల్లడించారు. పోలీసుల రాకను గుర్తించి పారిపోయిన బోయ హనుమంతు, బోయ కడవలయ్య, మరేగౌడ, మల్లాపురం వెంకటేష్, గుండ్లపల్లి జానీ, మాల్యం అంజి, గోవిందవాడ బసప్పను త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల అదుపులో మోసకారి దళారీ బెళుగుప్ప: మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులతో అనామతు కింద పప్పుశనగ, ధనియాలు తదితర పంట దిగుబడులను తీసుకెళ్లి... రూ.కోట్లలో నగదు చెల్లించకుండా ముఖం చాటేసిన మోసకారి దళారీని బెళుగుప్ప పోలీసులు మంగళవారం కర్ణాటక ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారంతో మోసపోయిన స్థానిక మండల రైతులతో పాటు ఇతర మండలాల రైతులు, ధాన్యం వ్యాపారులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని న్యాయం చేయాలని ఎస్ఐ శివను కోరారు. సోలార్ ప్లాంట్లో వలస కార్మికుడి మృతి గుత్తి రూరల్: మండలంలోని బేతాపల్లిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్కు చెందిన రబీవుల్లా (62) మంగళవారం మృతి చెందాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని తన గదికి వెళ్లి పడుకున్నాడు. మంగళవారం ఉదయం ఎంతకూ నిద్రలేవకపోవడంతో గదిలో ఉన్న వారు అనుమానంతో పరిశీలించారు. అచేతనంగా ఉండడంతో వెంటనే అంబులెన్స్ ద్వారా గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ‘వాటర్ ప్లాంట్లకు కేటగిరి– 3 కనెక్షన్ ఇవ్వండి’ అనంతపురం టౌన్: వాటర్ ప్లాంట్లకు కేటగిరి– 3 కింద విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్కు పలువురు ఫిర్యాదు చేశారు. మంగళవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 15 ఫిర్యాదు అందాయి. ఇందులో ముగ్గురు వాటర్ ప్లాంట్లకు కేటగిరి– 3 కింద కనెక్షన్లు ఇవ్వాలని విన్నవించారు. కంబదూరు మండలంలో ఓవర్ లోడ్ సమస్యతో తరచూ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజులు పోవడంతో విద్యుత్ అంతరాయం కలుగుతోందని మరికొందరు ఫిర్యాదు చేశారు. -
లక్ష మంది కూలీలకు ఉపాధి కట్
అనంతపురం టౌన్: ఉన్న చోటనే ఉపాధి కల్పిస్తూ వలసలు నివారించాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీల జాబ్కార్డులకు ఆధార్తో అనుసంధానించి, ఈ–కేవైసీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలా చేయించుకున్న వారికే పనులు కల్పించడం, బిల్లులు జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ–కేవైసీ చేయించడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీనికితోడు ఈ–కేవైసీ చేయించుకోలేదని 20 శాతం మేర కార్డులను తొలగించి, వారి ఉపాధికి గండి కొట్టడం విమర్శలకు తావిస్తోంది. మూడు నెలల కిందటి వరకు జిల్లా వ్యాప్తంగా 3.16 లక్షల జాబ్కార్డులు 5.38 లక్షల మంది కూలీలు ఉండేవారు. ప్రస్తుతం 4.37 లక్షల మంది కూలీలు మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు ఉపాధి హామీ అధికారుల గణంకాలు పేర్కొంటున్నాయి. అంటే మూడు నెలల కాలంలోనే 1.01లక్షల మంది జాబ్కార్డులను అధికార యంత్రాంగం తొలగించేసిందన్నమాట. జాబ్కార్డుల తొలగింపునకు కుట్ర చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చేసి, తమకు అనుకూలంగా ఉన్న వారిని నియమించింది. దీంతో గ్రామాల్లోని ఓ వర్గానికి చెందిన కూలీల జాబ్కార్డులను తొలగింపే లక్ష్యంగా కుట్ర పన్నింది. ఈ– కేవైసీ చేయడానికి వెళ్లిన సమయంలో కూలీలు అందుబాటులో లేరని, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారని కారణాలు నమోదు చేశారు. ఇలా ప్రతి మండలంలోనూ 4వేల మంది దాకా కూలీల జాబ్కార్డులు తొలగించారంటే ఏ స్థాయిలో కుట్ర పన్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ–కేవైసీ చేసేవారేరీ? ఉపాధి కూలీలు జాబ్కార్డులకు ఈ– కేవైసీ ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా చేయించుకోవాలి. అయితే సర్వర్ పని చేయలేదంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రక్రియ పూర్తి చేయడం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ద్వారా 6,500ఎకరాల్లో డ్రై ల్యాండ్ హార్టికల్చర్ పథకం కింద పండ్ల మొక్కలను చాలామంది రైతులు సాగు చేసుకున్నారు. అలాంటి రైతుల జాబ్కార్డులకు సైతం ఈ– కేవైసీ చేయలేదు. పండ్ల మొక్కల రైతులకు ప్రతి నెలా మొక్కల సంరక్షణ కోసం వాటర్ బిల్లుతోపాటు ఎరువుల బిల్లులను ఖాతాల్లో జమ చేస్తారు. అయితే వీరికి కూడా గ్రామాల్లో ఈ–కేవైసీ చేయలేదు. దీంతో డ్రైల్యాండ్ హార్టికల్చర్ రైతులు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్న లబ్ధిదారులతోపాటు మరి కొందరు ఉపాధి కూలీలు ఈ– కేవైసీ కోసం ఎంపీడీఓ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 4.37 లక్షల మంది కూలీలకు గాను 3.60 లక్షల మంది కూలీలు ఈ– కేవైసీ చేశారు. మూడు నెలలుగా కాలయాప చేయడంతో మిగిలిన 70 వేల మంది కూలీలకు ఈ– కేవైసీ చేయలేదు. మరి వీరిని కూడా ఈ కేవైసీ చేయించుకోలేదని జాబ్కార్డులో ఉంచుతారా? లేకుంటే అందుబాటులో లేరంటూ రెండు నెలల క్రితం తొలగించిన లక్షల మంది కూలీల జాబితాలోకే చేరుస్తారా అన్నది వేచి చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ–కేవైసీకి ససేమిరా కూలీలు అందుబాటులో లేరంటూ సాకుతో కత్తెర జిల్లాలో లక్ష మంది కూలీల జాబ్కార్డుల తొలగింపు -
రాష్ట్రంలో ‘రెడ్బుక్’ పాలన
● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ కళ్యాణదుర్గం రూరల్: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగ పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. మంగళవారం కళ్యాణదుర్గం వచ్చిన ఆయన స్థానిక పోలీసులతో మాట్లాడారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ... బ్రహ్మసముద్రం మండలాకి చెందిన బోయ ఆనంద్ది ఆత్మహత్య కాదని హత్యగా కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారని తెలిపారు. ఈ అంశంలో వాస్తవాలు వెలుగు చూడాలంటే పారదర్శక దర్యాప్తు అవసరమని మీడియా సమావేశంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య చేసిన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని ఆక్షేపించారు. అధికార పార్టీ నేతల తప్పులను నిలదీయడం ప్రతిపక్ష నేతగా, మాజీ ఎంపీగా తలారి రంగయ్య బాధ్యత అనే విషయాన్ని పోలీసులు గుర్తించాలన్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబుకు తొత్తుగా మారి ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. గోరంట్ల మాధవ్కు నోటీసులు అనంతపురం: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని గతంలో ఓ మీడియా సమావేశంలో గోరంట్ల మాధవ్ అన్నారు. దీనిపై అప్పట్లో పోలీసులకు వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. మీడియాలో మాట్లాడిన వ్యాఖ్యలపై ఇప్పటికే గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు. తాజాగా మంగళవారం విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు అనంతపురంలోని గోరంట్ల మాధవ్ ఇంటికి చేరుకుని మళ్లీ నోటీసులు అందించారు. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. నీట మునిగి వ్యక్తి మృతి బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని అనంత సాగర్ కాలనీకి చెందిన జబీవుల్లా (40) మంగళవారం బీకేఎస్ చెరువులో చేపలు పడుతూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. గమనించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టి జబీవుల్లా మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
సవాల్గా ‘సామర్థ్య’ సర్వే
అనంతపురం సిటీ: జిల్లాలోని 135 క్లస్టర్ల పరిధిలో చేపట్టిన ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) బేస్లైన్ సర్వే నత్తనడకన సాగుతోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, గణితం అంశాలకు సంబంధించి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను, ప్రస్తుత స్థాయిని అంచనా వేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. ఎస్సీఈఆర్టీ రూపొందించిన యాప్లో నమోదైన విద్యార్థుల పేర్లను ఎంపిక చేసుకోగానే సెల్ఫోన్ స్క్రీన్పై ప్రత్యక్షమయ్యే ప్రశ్నలను ఒక్కొక్కటిగా విద్యార్థికి చూపుతూ సమాధానాలను రాబట్టి యాప్లోనే పొందుపరచాలి. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా సదరు విద్యార్థి ప్రగతి నివేదిక ఆ క్షణంలోనే నమోదైపోతుంది. పూర్తి స్థాయి డిజిటల్ విధానంలో చేపట్టిన ఈ సర్వే ఫలితాల ఆధారంగా త్వరలో ప్రారంభం కానున్న గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. జిల్లాలో మొత్తం 1,416 పాఠశాలల్లో 83,103 మంది విద్యార్థులను సర్వే చేయాల్సి ఉంది. ఇందులో 10,109 మంది విద్యార్థులను సర్వే చేయగా... ఇంకా 72,994 మంది విద్యార్థులను సర్వే చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ 810 పాఠశాలల్లో సర్వే ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో నిర్దేశిత గడువులోపు సర్వే పూర్తి కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరచండి కూడేరు: పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్య పరచాలని సంబంధిత అధికారులను జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య ఆదేశించారు. కూడేరు మండలం అరవకూరులో మంగళవారం ఆయన పర్యటించారు. పలు వీధుల్లోని డ్రైనేజీలు చెత్తా చెదారంతో నిండి ఉండడం గమనించి, పంచాయతీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రం చేయించాలని కార్యదర్శికి సూచించారు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం వేయకుండా ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఇంటి వద్ద డస్ట్బిన్ పెట్టుకుని అందులో వేస్తే పారిశుధ్య కార్మికులు తీసుకెళతారని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కుళ్లాయిస్వామి, ఏపీఓ పోలేరయ్య, పంచాయతీ కార్యదర్శి హరినాథ్ పాల్గొన్నారు. -
విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
గుత్తి: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని గుత్తి ఆర్ఎస్లో ఉన్న నంబర్–2 ప్రభుత్వ పాథమిక పాఠశాల విద్యార్థులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నాల్గో తరగతి విద్యార్థులు గది నుంచి బయటకు వచ్చిన ఐదు నిమిషాల వ్యవధిలోనే పై కప్పు పెచ్చులూడి పడ్డాయి. ఆ సమయంలో పెద్ద శబ్ధం కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. నాల్గో తరగతిలో మొత్తం 17 మంది విద్యార్థులు ఉన్నారు. భోజన విరామానికి ముందే పెచ్చులూడి పడి ఉంటే విద్యార్థులకు ప్రాణాపాయం ఉండేదని, దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని హెచ్ఎం వీరాచారి అన్నారు. పాఠశాలలోని మరో తరగతి గదిలోనూ పెచ్చులూడి పడుతున్నాయని అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రెడ్బుక్ రాజ్యాంగానికి భయపడం
● వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు అనంతపురం సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్బుక్ రాజ్యాంగానికి తాము భయపడేది లేదని, అక్రమ అరెస్ట్లు.. తప్పుడు కేసులపై అలుపెరగని పోరాటాలు సాగిస్తామని జిల్లా వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు స్పష్టం చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ మంగళవారం అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ యాదవ్తో పాటు రాష్ట్ర నాయకులు నవీన్రెడ్డి, సుధీర్రెడ్డి, నగర అధ్యక్షుడు కై లాష్ మాట్లాడారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని కోరితే జైలులో పెట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. మంత్రి నారా లోకేశ్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సవాల్ చేశారు. ప్రశ్నించడానికే వచ్చానంటూ పదేపదే చెప్పే డీసీఎం పవన్కళ్యాణ్ మౌనం వీడి విద్యార్థుల పక్షాన నోరు విప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్రెడ్డి, నాయకులు తేజ, అనిల్, కిరణ్, ఇంద్రశేఖర్రెడ్డి, నాగేంద్ర, రాహుల్రెడ్డి, లోకేశ్, ప్రవీణ్, అరవింద్, కార్తీక్, అశోక్, జగదీశ్వర్, కార్తికేయ, బాబా ఇమ్రాన్, సాయి పాల్గొన్నారు. -
పదేళ్ల బాబుకు పునర్జన్మ..
అనంతపురం మెడికల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి చిన్నపిల్లల విభాగం వైద్యులు, స్టాఫ్నర్సులు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి చేరుకున్న పదేళ్ల బాలుడికి పునర్జన్మను ప్రసాదించారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, చిన్నపిల్లల విభాగం ఇన్చార్జ్ హెచ్ఓడీ డాక్టర్ ప్రవీణ్దీన్కుమార్తో కలసి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎల్ సుబ్రహ్మణ్యం మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విష సర్పం కాటుతో.. పెద్దవడుగూరు మండలం కండ్లగూడురు గ్రామానికి చెందిన నారాయణస్వామి, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, ఈ నెల 2న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చిన్న కుమారుడు శివనారాయణ అర్ధరాత్రి సమయంలో మేల్కోని మూత్రవిసర్జనకంటూ బయటకు వచ్చాడు. ఆ సమయంలో కుప్పకూలిపోవడంతో తల్లిదండ్రులు ఆగమేఘాలపై పామిడిలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పాము కాటు (కట్ల పాముగా అనుమానం) కారణంగా అప్పటికే శివనారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. అదే సమయంలో ఇంటి వద్ద ఉన్న పదేళ్ల వయసున్న పెద్ద కుమారుడు శివరామరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమచారం అందుకున్న తల్లిదండ్రులకు దిక్కుతోచలేదు. బంధువులు అంబులెన్స్లో తీసుకురావడంతో పరిస్థితి విషమంగా ఉందని వెంటనే అనంతపురానికి తీసుకెళ్లాలని పామిడిలో వైద్యులు సూచించారు. 36 గంటల నిరంతర శ్రమ శివరామరాజును అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకువచ్చే లోపు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వైద్యులు వెంటనే చిన్నపిల్లల విభాగంలో అడ్మిట్ చేసుకుని పీఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి 36 గంటల పాటు నిరంతర వైద్య సేవలు అందించారు. కాస్త కోలుకున్న తర్వాత మరో రెండు రోజుల పాటు పీఐసీయే స్టెప్డౌన్లో, అనంతరం సాధారణ వార్డులో ఉంచి చికిత్స అందజేశారు. ఈ క్రమంలో శివరామరాజుకు దాదాపు 40 వైల్స్ యాంటీ స్నేక్ వీనమ్ అందించడంతో పాటు ఖరీదైన మందులు, ఐసీసీయూ సౌలభ్యాన్ని ఉచితంగా అందించారు. సాధారణంగా ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ తరహా సేవలు పొందాలంటే రూ.3లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. నిజంగా వారు దేవుళ్లు.. ‘ఇప్పటికే ఓ బిడ్డ శివనారాయణను కోల్పోయాం. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ బతుకుతాడో.. లేదోనని మొక్కని దేవుడు లేడు. అయితే పెద్దాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగం వైద్యులు, స్టాఫ్ నర్సులు మా బిడ్డను బతికించారు. నిజంగా వారు దేవుళ్లే’ అంటూ శివరామరాజు తల్లి లక్ష్మీదేవి భావోద్వేగంతో పేర్కొన్నారు. సమావేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధిక, నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మలాబాయి, పీజీలు వాసవి, ప్రేమ్, జీవన్, లావణ్య, హౌస్సర్జన్ ఏంజెల్, స్టాఫ్నర్సులు మేరీ సుజాత, అరుణ, కీర్తి, పెద్దక్క, మాధవి, తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ చిన్నపిల్లల విభాగం ఘనత ఈ నెల 2న అర్ధరాత్రి పాముకాటుకు గురైన అన్నదమ్ముళ్లు పామిడి సీహెచ్సీకి చేర్చేలోపు తమ్ముడి మృతి జీజీహెచ్లో చేరిన బాబుకు ప్రాణం పోసిన వైద్యులు, స్టాఫ్నర్సులు -
చీకటి జీఓపై మూకుమ్మడిగా కన్నెర్ర
అనంతపురం సిటీ: విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలకు ప్రవేశం లేకుండా చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీఓపై విద్యార్థి సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. విద్యార్థుల హక్కులు కాలరాచేలా ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీఓను తక్షణం ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ముక్తకంఠంతో ప్రకటించారు. అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య, వీఎన్ఐవీ, పీఎస్ఎఫ్, ఏపీ బీసీ విద్యార్థి సంఘం, ఏఐఎస్పీ, ఏఐఎస్ఓ ఐక్య సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. విద్యార్థుల సమ స్యలు వెలుగు చూడకుండా ఉండేందుకే ప్రభుత్వం చీకటి జీఓలు జారీ చేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థి సంఘాలపై నిషేధం విధించడమంటే ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడమేనని, ఈ కుట్రకు చంద్రబాబు ప్రభుత్వం తెరలేపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు కుళ్లాయిస్వామి, నరేష్, గిరి, వీరేంద్ర ప్రసాద్, వేమన, సురేష్, రామన్న, అబ్దుల్ ఆలం, కేశవకుమార్, నరసింహ, అనిల్కుమార్, హనుమంత రాయుడు, ఓబులేసు, వినోద్, భీమేష్, ప్రతిభా భారతి, చరణ్, చందు, మంజు, ఉమామహేష్ పాల్గొన్నారు. పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు ప్రవేశించకుండా జీఓ జారీ చేయడంపై మండిపాటు అనంతలో విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆందోళన -
ప్రైవేటీకరణపై పెల్లుబికిన వ్యతిరేకత
● మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి ● సంతకాలతో స్పష్టం చేసిన జిల్లా ప్రజలు అనంతపురం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబికింది. ప్రజలకు మెరుగైన వైద్యం, పేదలకు వైద్య విద్యనభ్యసించే అవకాశాలను దూరం చేసేలా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో తనకు కావలసిన వారికి అప్పణంగా కట్టబెట్టేందుకు చేస్తున్న కుట్రలపై భగ్గుమన్నారు. వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అక్టోబర్ పది నుంచి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. రెండు నెలలపాటు నిర్విరామంగా సాగిన ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువత, మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు, మేధావులు తదితర అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదిలివచ్చి సంతకాలు చేశారు. ఈ పత్రాలను ప్రస్తుతం వేగంగా డిజిటలైజేషన్ చేస్తున్నారు. ● అనంతపురం అర్బన్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం విజయవంతమైంది. సంతకాల ప్రతులను బుధవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక వాహనంలో అనంత క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయానికి తరలిస్తారు. ● రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలం తాళ్లకెరలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మెట్టు విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు. ● ఉరవకొండలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షుడు సాకే పురుషోత్తం, అనిల్, దేవా, నాగరాజ్, పృథ్వీరాజ్, శ్రీకాంత్, అశోక్ పాల్గొన్నారు. -
నేటి నుంచి కళ్యాణదుర్గంలో 144 సెక్షన్
● రేపు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కళ్యాణదుర్గం: మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బుధవారం నుంచి కళ్యాణదుర్గంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వసంతబాబు అన్నారు. గురువారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మంగళవారం డీఎస్పీ రవిబాబు, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్తో కలిసి ఆర్డీఓ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డు కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే, ఎంపీలకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉందన్నారు. చైర్మన్ ఎన్నికకు ఓటు హక్కు కలిగిన వారు తమ గుర్తింపు కార్డుతో హాజరుకావాలన్నారు. మున్సిపల్ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలోనే సెక్యూరిటీ జోన్గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నిక నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగ కుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. చైర్మన్ ఎన్నికకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. -
రాప్తాడును రావణ కాష్టంలా మార్చారు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో నిత్యం హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, కబ్జాలు పెరిగి పోయాయి. ఆమె ఒక లేడీ మాఫియా డాన్గా వ్యవహరిస్తున్నారు’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ఒక్క ఎంపీటీసీ మాత్రమే ఉండి, అవకాశం లేకపోయినా సొంత మండలం రామగిరిలో ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు సునీత అడ్డదారులు తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. మెజార్టీ ఎంపీటీసీలు తమ వైపు ఉన్నా, కూడా అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నా మీకు ఏదీ అనుకూలంగా లేదన్నారు. వైఎస్సార్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించారు. మీరు కోరిన ఎంపీటీసీ సభ్యులను ఎంపీపీగా చేసుకోవాలని సూచించారు. అయితే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని పరిటాల కుటుంబం గుర్తు పెట్టుకోవాలన్నారు. మజ్జిగ లింగమయ్య హత్యతోనే ప్రారంభమైన పరిటాల కుటుంబ పతనం పాపంపేట దోపిడీతో సంపూర్ణమైందన్నారు. అలా చేస్తే రాజకీయ సమాధే.. పరిటాల సునీత నలుగురు రిటైర్డ్ తహసీల్దార్లకు జీతాలిస్తూ తమ వద్ద పెట్టుకున్నారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. వివాదాస్పద భూములను గుర్తించి వాటిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ‘నీ మొగుడు నాలుగుసార్లు, నువ్వు మూడుసార్లు ఎమ్మెల్యేలైనా రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాలకు ఏమైనా చేసి ఉంటో చెప్పుకోండి’అని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అయినా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురాలేని చేతగాని కుటుంబం పరిటాల కుటుంబమన్నారు. ఇలా బతికే బదులు ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగాలని హితవు పలికారు. లేదంటే మీ ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకుని తాము ప్రారంభించి మీ ప్రభుత్వంలో ఆగిన అన్ని పథకాలనూ పూర్తి చేస్తే అప్పుడైనా ప్రజలు ఆదరిస్తారన్నారు. అలాకాకుండా ప్రకాష్రెడ్డిని తిట్టినా, ప్రశ్నించిన వారిని, ఎదిరించిన వారిని హత్యలు చేసుకుంటూపోతే రాజకీయ సమాధి కావడం తథ్యమన్నారు. విద్య, వైద్యం వ్యాపారంగా మార్చేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేలా నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోందని ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా తమ అధినేత ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటిదాకా 11 లక్షల సంతకాలు అయ్యాయని, ఇందులో రాప్తాడు నియోజకవర్గంలో 70 వేలకు పైగా ప్రజలు సంతకాలు చేశారని వివరించారు. ప్రభుత్వ వైద్యం, విద్య రంగాలను ప్రైవేటీవకరణ, కార్పొరేటీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారంగా మార్చుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, ఆలమూరు ఓబులేసు, మీనుగ నాగరాజు, ఎంపీటీసీ సునీల్దత్తరెడ్డి, కుంటిమద్ది సర్పంచ్ నరేంద్ర, తోపుదుర్తి ఎంపీటీసీ పోతులయ్య, ప్రణిల్కుమార్రెడ్డి పాల్గొన్నారు. లేడీ మాఫియా డాన్ పరిటాల సునీత సొంత మండలంలో ఎంపీపీని దక్కించుకోలేకపోతున్నావ్ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలిగితే మంచిది అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీపీ ఎన్నికను బాయ్కాట్ చేస్తున్నాం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
గంగవరంలో ఘోరం
బెళుగుప్ప: గంగవరంలో ఘోరం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో రెండు గుడిసెలు దగ్ధమైన ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. మరో ఇద్దరు కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. గంగవరం సమీపంలోని తోటలో ఎగువపల్లి గంగమ్మ (55), నరసన్న దంపతులు జమ్ముతో రెండు గుడిసెలు వేసుకుని, తమ కుమారుడు ఎర్రిస్వామి, కోడలు వాణి, మనవడు అనంతసాయితో కలసి నివాసం ఉంటున్నారు. వాణి ప్రసవం కోసం ఇటీవల ఉరవకొండలోని పుట్టింటికి వెళ్లింది. సోమవారం రాత్రి ఎర్రిస్వామి కుమారుడు అనంతసాయితో కలిసి ఒక గుడిసెలో నిద్రించాడు. మరో గుడిసెలో గంగమ్మ పడుకుంది. ఆమె భర్త నరసన్న మేకలకు కాపలాగా ఆరుబయట నిద్రించాడు. గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి క్షణాల్లో మంటలు అలుముకున్నాయి. గంగమ్మ బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో మంటల్లో చిక్కుకుపోయి కాలిపోయింది. ఆరుబయట ఉన్న నరసన్న గమనించి గట్టిగా కేకవలు వేయడంతో పక్క గుడిసెలో నిద్రిస్తున్న ఎర్రిస్వామి, అనంతసాయి లేచి చుట్టుముట్టిన మంటల్లోంచి ఎలాగోలా బయటకు వచ్చి గాయాలతో బయటపడ్డారు. అయితే గంగమ్మ సజీవదహనమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గుడిసెల్లోని నిత్యావసర వస్తువులు, వ్యవసాయ పరికరాలు కాలిపోవడంతో రూ.5లక్షల దాకా నష్టం వాటిల్లింది. బాధితుడు ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ తెలిపారు. మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని ఫొరెన్సిక్ బృందంతో పాటు పోలీసులు పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్తో రెండు గుడిసెలు దగ్ధం మంటల్లో చిక్కుకుని మహిళ సజీవ దహనం గాయాలతో బయటపడిన కుటుంబ సభ్యులు -
మొదలు కాని ఈ–క్రాప్
అనంతపురం అగ్రికల్చర్: చంద్రబాబు ప్రభుత్వం పంటల బీమా పథకాలపై రైతులకు ఏమాత్రమూ ధీమా ఇవ్వడం లేదు. అసలు తమకు సంబంధమే లేదన్నట్లుగా 2023 ఖరీఫ్, రబీ కింద ఇవ్వాల్సిన పరిహారం ఎగ్గొట్టిన సర్కారు... 2024 ఖరీఫ్, రబీది కూడా ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబిస్తోంది. బీమా పథకాలు రైతుల దరికి చేరకుండా ఏమార్చే కుట్ర చేస్తోంది. ప్రభుత్వ మెప్పు కోసం వ్యవసాయశాఖ, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బీమా పథకాలపై మౌనం పాటిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. 2019–2024 మధ్య ఐదేళ్లూ రైతులపై ఎలాంటి భారం పడకుండా అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వాతావరణబీమా, ప్రధానమంత్రి ఫసల్బీమా పథకాలను ఉచితంగా అమలు చేసి... నాలుగేళ్లు పెద్ద మొత్తంలో రైతులకు పరిహారం కూడా ఇచ్చింది. ఇప్పుడు ఉచిత పంటల బీమాకు మంగళం పాడేసిన చంద్రబాబు సర్కారు రైతుల నుంచి ప్రీమియం రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నా... పరిహారం ఇవ్వకుండా మోసపుచ్చుతున్న పరిస్థితి నెలకొంది. రబీలో ఆరు పంటలకు బీమా.. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రబీలో ఫసల్ బీమా కింద పప్పుశనగ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి పంటలు, వాతావరణ బీమా కింద టమాటకు వర్తింపజేశారు. ఎందుకో కానీ వ్యవసాయశాఖ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రీమియం చెల్లింపు గడువు కూడా ఈ నెల 15న సమీపిస్తున్నా రైతుల్లో అవగాహన కల్పించడం లేదు. జనరలీ సెంట్రల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో అమలు కానున్న బీమా పథకంలో వ్యవసాయ పంటలకు 1.5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పప్పుశనగ ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఖరారు చేయగా అందులో రైతులు తమ వాటా కింద రూ.450 ప్రకారం ప్రీమియం చెల్లించాలి. వేరుశనగకు ఎకరాకు రూ.32 వేలు కాగా.. ప్రీమియం 480 ప్రకారం, జొన్నకు రూ.21 వేలు కాగా ప్రీమియం రూ.315 ప్రకారం, మొక్కజొన్నకు రూ.35 వేలు కాగా ప్రీమియం రూ.525 ప్రకారం, వరికి రూ.42 వేలు కాగా ప్రీమియం రూ.630 ప్రకారం, టమాటాకు రూ.1,600 ప్రకారం రైతులు ప్రీమియం చెల్లించాలన్నారు. వరికి ఈనెలాఖరు వరకు గడువు వుండగా మిగతా పంటలకు ఈనెల 15 లోపు ప్రీమియం గడువు విధించారు. మామిడి పంటకు బీమా ఉందా లేదా అనేది ఇంకా చెప్పడం లేదు. పంట కోత ప్రయోగాల ఫలితాలు, ఆటోమేటిక్ వెదర్ రిపోర్టు ఆధారంగా బీమా పరిహారం లెక్కించి రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే పప్పుశనగ సాగు పూర్తి కాగా వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటలు సాగవుతున్నాయి. రబీకి సంబంధించి ఈ–క్రాప్ (డిజిటల్ క్రాప్ సర్వే) ఇంకా మొదలు పెట్టలేదు. రబీ మొదలై నెలన్నర అవుతున్నా ఎందుకు ప్రారంభించడం లేదనేది వ్యవసాయశాఖ స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే 80 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఈ–క్రాప్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో వివిధ పథకాలకు ప్రామాణికంగా తీసుకుని రైతులకు వివిధ రూపాల్లో ప్రయోజనం కలిగేలా చేశారు. బీమా కోసం ఎదురుచూస్తున్నాం ముగుస్తున్న ప్రీమియం గడువు ప్రభుత్వం నుంచి వెలువడని ప్రకటన రబీలో వాతావరణ, ఫసల్ బీమా కింద ఆరు పంటలు నోటిఫై ఇంకా ఈ–క్రాప్ ప్రక్రియ కూడా మొదలు పెట్టని వ్యవసాయశాఖ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసిన చంద్రబాబు సర్కారు -
జిల్లాకు పాకిన స్క్రబ్ టైఫస్
అనంతపురం మెడికల్: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి జిల్లాకు పాకింది. పలువురికి పాజిటివ్ కేసులు నమోదవడం జిల్లాను కలవరపెడుతోంది. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని మెడిసిన్ విభాగంలో 12 ఏళ్ల బాలిక (తాళ్లకెర), గైనిక్ వార్డులో 16 ఏళ్ల బాలిక (ముదిగుబ్బ) అడ్మిషన్లో ఉన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. స్క్రబ్ టైపస్ కేసులకు ప్రత్యేక వార్డును కేటాయిస్తే బాగుంటుందని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలోనూ కొందరికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెల్సింది. కానీ ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని తొక్కిపెట్టింది. ఇటీవల ఇటువంటి కేసులు అధికమవుతుండడంతో జిల్లా అధికార యంత్రాంగం కేసులు అధికం కాకుండా, స్క్రబ్ టైఫస్ లక్షణాలున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.కుడి కాలువ గేట్లు దించారుకూడేరు: జల్లిపల్లిలో 4వ కిలో మీటర్ వద్ద తెగిన పీఏబీఆర్ కుడి కాలువ గట్టుకు తక్షణమే మరమ్మతులు చేపట్టేందుకు ఇరిగేషన్ జేఈఈలు ఓబులరెడ్డి, లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్యం మంగళవారం ధర్మవరం కుడికాలువ గేట్లు కిందికి దించేశారు. గేట్లు దించకపోతే 600 క్యూసెక్కుల నీరు వృథాగా మిడ్ పెన్నార్కు చేరుతాయి. కుడి కాలువ గేట్లు ముట్టుకుంటే మొరాయించి మళ్లీ పైకి లేవవని తెలిసినప్పటికీ గత్యంతరం లేక గేట్లు దించేశారు. అయినప్పటికీ లీకేజీ రూపంలో 150 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతున్నాయి. పీఏబీఆర్ 4, 6, 7 గేట్ల స్పిల్వే ద్వారా మాత్రమే 660 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న మిడ్ పెన్నార్కు వదులుతున్నారు. మరో రెండు రోజుల్లో తెగిన కుడి కాలువ గట్టుకు మరమ్మతులు చేపట్టనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మంగళవారం నాటికి డ్యాంలో 5.21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హెచ్చెల్సీ ద్వారా 160, జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా 570 క్యూసెక్కులు వచ్చి డ్యాంలోకి చేరుతోంది. అవుట్ 1000 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బీఫార్మసీ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ(ఏ) పరిధిలో నవంబర్లో నిర్వహించిన బీఫార్మసీ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–19) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీఫార్మసీ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ, రెండో సెమిస్టర్ (ఆర్–19, ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ శంకర శేఖర్రాజు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ అంకారావు పాల్గొన్నారు. ఫలితాలను జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని సూచించారు. నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 1.06 కోట్ల ఆదాయం లభించినట్లు ఈఓ ఎం.విజయరాజు తెలిపారు. మంగళవారం ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు చేపట్టారు. 106 రోజులకు గాను రూ.1,06,88,365 నగదు, అన్నదాన హుండీ ద్వారా రూ.45,330 నగదును భక్తులు స్వామివారికి సమర్పించినట్లు ఈఓ తెలిపారు. 0.024 గ్రాముల బంగారు, 1.450 కిలోల వెండితోపాటు 13 డాలర్ల విదేశీ కరెన్సీ, 5 దినామ్స్ను భక్తులు స్వామివారికి సమర్పించినట్లు వెల్లడించారు. దేవదాయశాఖ జిల్లా అధికారి బోయపాటి సుధారాణి, ఆలయ ఏఈవో వెంకటేశ్వర్లు ఇతర సిబ్బంది, పోలీస్ సిబ్బంది, తదితరులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన వీరభద్రసేవా సమితి, హనుమాన్ సేవా సమితి, రాఘవేంద్ర సేవా సమితి, శ్రీరామ సేవాసమితి సభ్యులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఫ్లెక్సీ మీద పడి ఇద్దరికి తీవ్రగాయాలు
అనంతపురం క్రైం: నగర పాలక సంస్థ పరిధిలో టీడీపీ నేతలు అనధికారికంగా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ మీదపడి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నగర శివారులోని బళ్లారి బైపాస్ చౌరస్తా.. 44వ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ప్రధాన అనుచరులు రమేష్, నలుబోలు మధుతో పాటు పలువురు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో ఒకటి గాలికి ఎగిరి అటుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లికి చెందిన సంజీవరెడ్డి, శ్రీనివాసరెడ్డిపై కుప్పకూలింది. ఐరన్ ఫ్రేమ్ నుదిట్లోకి దూసుకెళ్లడంతో సంజీవరెడ్డి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడు. శ్రీనివాసరెడ్డి తలకు బలమైన గాయమై అరగంటకు పైగా అపస్మారకంగా రోడ్డుపై పడిపోయాడు. అటుగా వెళుతున్న వాహనదారులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సర్వజనాస్పత్రికి తరలించింది. పరిశీలించిన వైద్యులు సంజీవరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నిర్ధారించారు. కాగా, గాలికి ఊగుతున్న భారీ ఫ్లెక్సీని తొలగించాలని పలుమార్లు టీడీపీ నేతలకు తెలిపినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్థానికులు తెలిపారు. చివరకు నగర పాలక సంస్థ అధికారులకు తెలిపినా వారు కూడా పట్టించుకోలేదన్నారు. చివరకు పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు ప్రాణాలు బలయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని నగర ప్రజలు కోరుతున్నారు. పీఏబీఆర్ నుంచి నీటి విడుదల కూడేరు: పీఏబీఆర్ నుంచి దిగువన ఉన్న మిడ్పెన్నార్ డ్యాంకు నీటిని విడుదల చేశారు. సోమవారం ఉదయం రిజర్వాయర్ 2, 4, 7 గేట్లను పైకెత్తి 620 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ మేరకు ఇరిగేషన్ డీఈఈ వెంకరమణ, ఏఈఈలు లక్ష్మీదేవి, గంగమ్మ, రేణుక, ముత్యాలప్ప వెల్లడించారు. ధర్మవరం కుడి కాలువకు 770 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తుండగా ఆదివారం వేకువజామున జల్లిపల్లి 4వ కి.మీ. వద్ద కాలువ గట్టు తెగి నీరంతా పంట పొలాల్లోకి చేరింది. కుడి కాలువ గేట్లు కిందకు దించితే మళ్లీ పైకి లేవడానికి మొరాయిస్తాయని భయపడిన అధికారులు డ్యాం ఎస్కేప్ రెగ్యులేటర్ వద్ద నీటిని కుడి కాలువ నుంచి మిడ్ పెన్నార్ డ్యామ్కు మళ్లించారు. మూడు గేట్ల ద్వారా 620 క్యూసెక్కులు కలుపుకుని మొత్తంగా 1,390 క్యూసెక్కుల నీటిని మిడ్ పెన్నార్కు విడుదల చేసినట్లైంది. డ్యాంలో 5.21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 730 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,600 క్యూసెక్కులున్నటు డీఈఈ తెలిపారు. రక్తమోడుతున్న శ్రీనివాసరెడ్డి, అపస్మారకంగా పడి ఉన్న సంజీవరెడ్డి -
సర్వే చేయలేదంటూ షోకాజ్ నోటీసులు
మీమాంసలో ఎనర్జీ అసిస్టెంట్లు రిమాండ్కు రామగిరి డీటీ, మరో ఇద్దరు తాడిపత్రిలో దురాగతాలపై స్పందించండి అనంతపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న అంశాలపై సర్వే చేయలేదంటూ ఎనర్జీ అసిస్టెంట్లకు జిల్లా సచివాలయ అధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకరిద్దరు కాదు... ఏకంగా 137 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం కలవరానికి తెరలేపింది. పేరుకు మాత్రమే సచివాలయం విధులు ఎనర్జీ అసిస్టెంట్లు పేరుకు మాత్రమే సచివాయల ఉద్యోగులే అయినా పని మొత్తం విద్యుత్ శాఖలోనే చేయాల్సి ఉంటుంది. ఉదయం సచివాలయంలో ముఖ హాజరు వేసుకున్న అనంతరం సాయంత్రం వరకూ విద్యుత్ సబ్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తుంటారు. దీనికి అదనంగా ప్రతి రెండు రోజులకు ఒకసారి నైట్ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. దీంతో వారు సర్వే చేయాల్సిన పని లేదంటూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల చెప్పడంతో ఆ మేరకు ఎనర్జీ అసిస్టెంట్లు సర్వేకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో సచివాలయాల పరిధిలోని కుటుంబాలకు కౌశలం, సిటిజన్ ఈకేవైసీ, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్పై డోర్ టూ డోర్ సర్వే చేయలేదని జిల్లా వ్యాప్తంగా 137 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు జిల్లా సచివాలయ అధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3న షోకాజ్ నోటీసులు అందుకున్న ఎనర్జీ అసిసెంట్లు ప్రస్తుతం తాము సంజాయిషీ ఎవరికి ఇవ్వాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా సచివాలయ అధికారికి సంజాయిషీ ఇవ్వాలా? లేదంటే విద్యుత్ శాఖ ఎస్ఈకి సంజాయిషీ ఇవ్వాలో స్పష్టత లేకుండా పోతోంది. సర్దుబాటు చర్యల్లో భాగంగా మండలాల్లో పనిచేస్తున్న చాలా మంది ఎనర్జీ అసిస్టెంట్లను అనంతపురం నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లోని విద్యుత్ సబ్స్టేషన్లకు విద్యుత్ శాఖ అధికారులు బదిలీ చేశారు. వీరికి సర్వే చేయాలనే అంశంపై ఇప్పటి వరకూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. అయినా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. జిల్లాలో 137 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు ఎవరికి సంజాయిషీ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి గగ్గోలు పెడుతున్న ఎనర్జీ అసిసెంట్లు ఉద్యోగాలకు ఎలాంటి ముప్పులేదు వాస్తవానికి వారు ఎనర్జీ అసిస్టెంట్లు కాదు (జేఎల్ఎం గ్రేడ్–4) ఉద్యోగులు. విద్యుత్ శాఖ విధులంటే 24 గంటలూ పని చేయాల్సి ఉంటుంది. దీంతో వారు సర్వేలు చేయరని ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఎనర్జీ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం జిల్లా సచివాలయ అధికారికి లేదు. జీతం మేమే చెల్లిస్తున్నాం, పనులు మేమే చేయించుకుంటున్నాం కాబట్టి ఆ అధికారం మాకే ఉంది. ప్రస్తుతం అందుకున్న నోటీసులకు సంజాయిషీ మాత్రమే ఇవ్వండి. వారి ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదు. – శేషాద్రి శేఖర్, ఎస్ఈ, విద్యుత్ శాఖ -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల ఆత్మహత్యలు
గార్లదిన్నె: ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటులో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. కోటంకలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు గుర్రప్పకుటుంబ సభ్యులను ఆయన సోమవారం పరామర్శించారు. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి, పంటలకు గిట్టుబాటు ధర ఉంటే రైతు గుర్రప్ప ఆత్మహత్య చేసుకునేవారు కాదన్నారు. ఎక్స్గ్రేషియా చెల్లించి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు విత్తు నుంచి పంట విక్రయం వరకు అడుగడుగునా అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రైతుల చెంతనే వ్యవసాయ సేవలు, పకడ్బందీగా సంక్షేమ పథకాలు అందించారన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు బీమా, ఇన్పుట్ సబ్సిడీ వంటివి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గిట్టుబాటు ధరలతో పంట ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. రైతులెవ్వరూ అధైర్యపడవద్దని, వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఇదే గ్రామంలో ఇటీవల హఠాన్మరణం చెందిన చాబాల సూరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్రెడ్డి, జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, మండల కన్వీనర్ ఎల్లారెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు ఓబిరెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులపై దాడులు అరికట్టాలి
● పోలీసు గ్రీవెన్స్లో గిరిజన, వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు అనంతపురం సెంట్రల్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్టీలపై దాడులు తీవ్రమయ్యాయని, ఎస్టీలకు రక్షణ కల్పించాలని వెఎస్సార్సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు నాయక్, గిరిజన ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జగదీష్ను కలిసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ఉరవకొండ నియోజకవర్గం లత్తవరం తండాకు చెందిన వెంకటేష్ నాయక్పై టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ బోదపాటి గోవిందప్ప అనవసరంగా కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడన్నారు. ఘటనపై ఉరవకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఇప్పటికై నా గోవిందప్పపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్ష పడేలా చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందునాయక్, లత్తవరం తండా సర్పంచ్ నాగరాజు నాయక్, నాయకులు ప్రసాద్నాయక్, ఆంజనేయులు నాయక్, సుంక నాయక్, లక్ష్మణ నాయక్, వీరస్వామి నాయక్, కాశీనాయక్, వార్డు మెంబర్ కుమారస్వామి నాయక్, ఆదిత్య లక్ష్మణ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. టూటౌన్ సీఐ శ్రీకాంత్యాదవ్పై చర్యలు తీసుకోవాలి సర్వజనాస్పత్రి ఎదుట అంబులెన్స్ డ్రైవర్లను బెదిరిస్తున్న అనంతపురం టూటౌన్ సీఐ శ్రీకాంత్యాదవ్ చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. సీఐ తీరును నిరసిస్తూ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట నుంచి ఎస్పీ కార్యాలయం వరకూ సోమవారం ర్యాలీ నిర్వహించి, గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ అంబులెన్స్ డ్రైవర్లను విచారణ పేరుతో పోలీసు స్టేషన్కు పిలిపించి సీఐ శ్రీకాంత్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ తీరు ఇలాగే కొనసాగితే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్గౌడ్, నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు, నగర అధ్యక్షుడు చిరంజీవి, నాయకులు పాల్గొన్నారు. -
పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
అనంతపురం సిటీ: వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న పదో తరగతి, ఓపెన్ స్కూల్, ఒకేషనల్కు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించే గడువును పొడిగించినట్లు డీఈఓ ప్రసాద్బాబు సోమవారం తెలిపారు. అపరాధ రుసుం లేకుండా 9వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 10 నుంచి 12 వరకు, రూ.200 ఫైన్తో 13 నుంచి 15 వరకు, రూ.500 జరిమానాతో 16 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు సంబంధించి రూ.125, పరీక్ష తప్పిన విద్యార్థులైతే మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే రూ.125, మూడు కంటే తక్కువ సబ్జెక్టులు ఉంటే రూ.110, ఒకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా రూ.60, తక్కువ వయస్సు వారు రూ.300, మైగ్రేషన్ కోసం రూ.80 చెల్లించాలని సూచించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యూడైస్ పోర్టల్లో విద్యార్థి వివరాలు ధ్రువీకరించిన తరువాత www.bse.ap.gov.inలోని పాఠశాల లాగిన్ ద్వారా అప్లికేషన్లను అప్లోడ్ చేయాలని ఆదేశించారు. నేడు డయల్ యువర్ ఎస్ఈ అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ‘డయల్ యువర్ విద్యుత్ శాఖ ఎస్ఈ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 08554– 272943 లేదా 91547 90350కు ఉదయం 10 నుంచి 11.30 గంటల లోపు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలను తెలపాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముగ్గురు మిత్రులు వచ్చేశారు రాప్తాడు రూరల్: రాప్తాడు మండలం చిన్మయనగర్ ఎల్ఆర్జీ స్కూల్లో పదో తరగతి చదువుతూ అదృశ్యమైన ముగ్గురు మిత్రులు తిరిగి వచ్చేశారు. దీంతో పోలీసులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులు ఎం.సుధీర్, గంగుల దీపక్ కుమార్, జి.ఆంథోని ప్రకాష్ ఈ నెల 5న స్కూల్ నుంచి వెళ్లిపోయారు. అనంతపురంతో పాటు బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో పోలీసులు, కుటుంబ సభ్యులు గాలించారు. నాలుగు రోజులవుతున్నా వీరి ఆచూకీ లభించని వైనంపై ‘సాక్షి’లో సోమవారం ‘వీడని ముగ్గురు మిత్రుల అదృశ్యం మిస్టరీ’ శీర్షికన వెలువడిన కథనానికి స్పందన లభించింది. తల్లిదండ్రులు మానసికంగా పడుతున్న బాధను తెలుసుకున్న విద్యార్థుల్లో ఒకరు తల్లికి ఫోన్ చేసి తాము గుంతకల్లులో ఉన్నామని, రైలు ఎక్కి అనంతపురం వస్తున్నామని తెలిపారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, పోలీసులు అనంతపురం రైల్వేస్టేషన్కు వెళ్లి.. వారు రాగానే అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీహర్ష ఎదుట హాజరు పరిచారు. చదువుకోవడం ఇష్టం లేకనే విద్యార్థులు వెళ్లిపోయారని సీఐ తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం ముగ్గురినీ తల్లిదండ్రులకు అప్పగించారు. -
కడుపు మాడ్చటంపై కన్నెర్ర
● రోడ్డెక్కిన విద్యార్థులు ● ఆందోళనలో పాల్గొన్న తల్లిదండ్రులు ● హెచ్ఎం తీరుపై మండిపాటు గుమ్మఘట్ట: మధ్యాహ్న భోజన పథకం కింద అరకొరగా అన్నం పెడుతూ కడుపు మాడుస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పూలకుంట క్రాస్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 169 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ నెల రోజులుగా మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణం కన్నా తక్కువగా భోజనం వడ్డిస్తుండటంతో విద్యార్థులు ఆకలితో నకనకలాడాల్సి వస్తోంది. తరగతి గదిలో పాఠాలు కూడా వినలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు సోమవారం బీటీపీకి వెళ్లే ప్రధాన రోడ్డుపైకి చేరుకుని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమనెందుకు ఆకలితో చంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు. వాహనాల రాకపోకలు స్తంభించడంతో ఎంఈఓ సోమశేఖర్, ఎస్ఐ ఈశ్వరయ్య వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. అనంతరం విద్యార్థుల సమస్యపై పాఠశాలకు వెళ్లి హెచ్ఎం బషీర్ అహమ్మద్ను నిలదీశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి బియ్యాన్ని ఏజెన్సీ నిర్వాహకులకు అందిస్తున్నానని హెచ్ఎం తెలిపారు. హాజరు కన్నా తక్కువగా బియ్యం ఇవ్వడం వల్లే విద్యార్థులకు తగినంత భోజనం పెట్టలేకపోతున్నామని ఏజెన్సీ నిర్వాహకురాలు పార్వతి స్పష్టం చేశారు. తమ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బియ్యంలో కోత విధిస్తున్నారని ఆరోపించారు. అనంతరం డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి పాఠశాలకు వెళ్లి ఘటనపై విచారణ చేపట్టారు. హెచ్ఎం బషీర్ అహ్మద్ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు అసభ్య పద జాలంతో దూషిస్తుంటారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నివేదిక తయారు చేసి కలెక్టర్కు అందిస్తానని డిప్యూటీ డీఈఓ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా బషీర్ అహ్మద్ ఇదివరకు పనిచేసిన నేత్రపల్లి, టీ.వీరాపురం, తాళ్లకెర పాఠశాలలోనూ ఇదే విధంగా ప్రవర్తించేవారని, ఇప్పటికీ ఆయనలో మార్పు రాలేదని పలువురు ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. -
ఇన్పుట్సబ్సిడీ ఇవ్వలేదు
ఈ ఏడాది అకాల వర్షాలకు మూడు ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రూ.50 వేల వరకు నష్టం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడలేదు. ప్రభుత్వానికి నివేదిక పంపామని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కింద పరిహారం కానీ అందించలేదు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, సున్నా వడ్డీ లాంటి పథకాల కింద ఆర్థిక సాయం అందించారు. – జి.దాసన్న, నంజాపురం, బ్రహ్మసముద్రం మండలం -
రేపటి నుంచి టెట్
● 21 వరకు పరీక్షల నిర్వహణ ● రెండు సెషన్లలో పరీక్షలు అనంతపురం అర్బన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఈ నెల 10 నుంచి 21 వరకు జరగనుంది. పరీక్షల నిర్వహణకు ఏడు కేంద్రాలను ఎంపిక చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. టెట్ నిర్వహణపై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష రెండు సెషన్లుగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుదని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పోలీసు బందోబస్తు నిర్వహంచాలని సూచించారు. నిర్దేశించిన శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి సూచించారు. పల్స్పోలియోకు ఏర్పాట్లు చేయండి వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అవసరమైన ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. పల్స్పోలియో కార్యక్రమంపై కలెక్టర్ సోమవారం రెవెన్యూ భవన్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 0–5 ఏళ్ల వయసున్న చిన్నారులు 2,84,774 మంది ఉన్నారన్నారు. 51 పీహెచ్సీలు, 25 యూపీహెచ్సీలు, 6 పీపీ యూనిట్లు మొత్తం 82 యూనిట్లలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,451, అర్బన్ పాంతాల్లో 334 మొత్తం 1,785 బూత్లలో పల్స్ పోలియో నిర్వహించాలన్నారు. 5,247 మంది సిబ్బంది మొదటి రోజున బూత్ యాక్టివిటీ చేపట్టాలన్నారు. మిగిలిన వారికి ఇంటింటి కార్యక్రమం 22, 23 తేదీల్లో నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, డీఎంహెచ్ఓ ఈబీ దేవి పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణతో వైద్య విద్యకు పాతర
● చంద్రబాబు ప్రభుత్వంపై నిరసనాగ్రహం ఎస్ఆర్ఐటీ కళాశాల వద్ద కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్, సంతకాల కోసం తరలివచ్చిన విద్యార్థులు అనంతపురం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించి వైద్య విద్య, మెరుగైన వైద్యానికి పాతర వేయవద్దని ప్రజలు నినదించారు. ప్రభుత్వ వైద్యం, విద్య పొందడం ప్రజల హక్కు అని, ఆ హక్కును స్వార్థ ప్రయోజనాల కోసం కాలరాయొద్దని చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ జిల్లా అంతటా ముమ్మరంగా సాగుతోంది. వైఎస్సార్సీపీ నాయకులు వైద్య కళాశాలలపై సర్కారు కుట్రను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. వైద్య కళాశాలలను పరిరక్షించుకునేందుకు విద్యార్థులు, యువత, మేధావులు సహా అన్ని వర్గాల ప్రజలూ ముందుకు వచ్చి సంతకాలు చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినదించారు. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం, ఎస్ఆర్ఐటీ కళాశాల వద్ద సోమవారం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. శింగనమల నియోజకవర్గ పరిశీలకులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎంమోహన్రెడ్డి హాజరయ్యారు. గుంతకల్లు పట్టణంలోని 16, 7, 31వ వార్డుల్లో కోటి సంతకాల సేకరణ జోరుగా సాగింది. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఎండీ.ఖలీల్, సీనియర్ నాయకుడు కాకర్ల నాగేశ్వరరావు, వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు షాబుద్దీన్, 7వ వార్డు కౌన్సిలర్ లింగన్న పాల్గొన్నారు. పామిడిలోని ఆరో వార్డులో వైఎస్సార్సీపీ జిల్లా ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి, పట్టణ కన్వీనర్ నాగూరు ఈశ్వర్రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు షామీర్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. గుత్తి మండలం రజాపురంలో వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నేత హాజీ మలంగ్ బాబా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరులో సర్పంచ్ ఎగ్గిడి వరలక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో వాటిల్లే నష్టాలను వివరించారు. -
ప్రోత్సాహం కరువైనా.. ఆదుకున్న మార్కెట్
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలవుతున్నా... నేటికీ పట్టు రైతులకు ప్రోత్సాహకాలు అందలేదు. బైవోల్టిన్ పట్టుగూళ్లు ప్రతి కిలోపై రూ.50 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాల్సి ఉంది. ఈ 18 నెలల కాలంలో నయా పైసా కూడా ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలు రూ.90 కోట్లకు పైగా పేరుకుపోయాయి. ఇలాంటి తరుణంలో మార్కెట్లో గూళ్ల ధరలు పెరగడంతో పట్టు రైతులకు ఉపశమనం లభించింది. మడకశిర: రాష్ట్రంలోనే బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పత్తిలో ఉమ్మడి జిల్లా రైతులు ప్రథమ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం హిందూపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి తదితర పట్టుగూళ్ల మార్కెట్లలో బైవోల్టిన్ పట్టుగూళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఏడాది క్రితం కిలో బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర రూ.600 లోపే ఉండగా, ప్రస్తుతం రూ.800తో అమ్ముడు పోతోంది. కర్ణాటకలోని రామ్నగర్ మార్కెట్లో కిలో బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర రూ.900కు పైగా పలుకుతోంది. దీంతో న్యాయబద్ధంగా తమకు అందాల్సిన ప్రోత్సాహాకాలపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా.. మార్కెట్ తమను ఆదుకుటోందని పట్టు రైతులు పేర్కొంటున్నారు. పట్టు రైతులకు ప్రోత్సాహకాలు అందించని చంద్రబాబు ప్రభుత్వం ధరల పెరుగుదలతో పట్టు రైతులకు దక్కిన ఊరట -
దృఢ సంకల్పమే క్రీడాకారుడిగా మార్చింది
విజయం సాధించాలనే సంకల్పం ఉంటే క్రీడలు, చదువులో రాణించడానికి పేదరికం ఎన్నడూ అడ్డంకి కాదు. ఉమ్మడి జిల్లాకు చెందిన బోయ బాబు విషయంలో ఇది నిజమని తేలింది. కడు పేదరికం నుంచి వచ్చి... ఆర్టీటీ సహకారంతో ఓ వైపు చదువులు, మరో వైపు క్రీడల్లో రాణిస్తూ నేడు జిల్లా గర్వించే క్రీడాకారుడిగా ఎదిగిన బోయ బాబు విజయ ప్రస్తానం ఆయన మాటల్లోనే... – పుట్టపర్తి అర్బన్: మాది అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అమ్మ ఓబులమ్మ వ్యవసాయ కూలి పనులకు పోతోంది. నాన్న చెన్నప్ప కంకర రాళ్లు కొట్టే పనికి పోతుంటాడు. రోజంతా వారు కష్టపడితే తప్ప కుటుంబం గడిచేది కాదు. రాళ్లు కొట్టే క్రమంలో నాన్న, వ్యవసాయ కూలి పనుల్లో అమ్మ తరచూ గాయపడేవారు. అయినా ఆ బాధ నాకు తెలియకుండా వారు నన్ను పెంచారు. ఎలాగైనా బాగా చదువుకుని, ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి అమ్మానాన్న ను బాగా చూసుకోవాలని అనుకున్నా. ఆటనే ఈ స్థాయికి చేర్చింది పేదరికం కారణంగా నాకు చదువులు, ఉద్యోగ అవకాశాలు ఉండవని అనుకున్నా. ఈ బాధను మరచిపోయేలా పరుగు తీయడం మొదలు పెట్టా. ఈ క్రమంలోనే బంతిని కాలితో కంట్రోల్ చేస్తూ నా స్నేహితులకు అందకుండా పరుగు తీస్తుండడం గమనించిన టీచర్లు నన్ను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇలాంటి సమయంలో ఆర్డీటీ సంస్థ దేవుడిలా ఆదుకుంది. ఫుట్బాల్ అకాడమీలో చేర్చుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న సెయింట్ విన్సెంట్ డీపాల్ స్కూల్లో విద్యాభ్యాసం చేసేలా ప్రోత్సహించింది. 6 నుంచి 10వ తరగతి వరకూ అక్కడే చదువుకున్నా. తిరిగి ఆర్డీటీ సహకారంతోనే అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశా. ప్రస్తుతం పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్ సహకారంతో ఆ ట్రస్ట్ విద్యాసంస్థలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నా. కళాశాల ప్రిన్సిపాల్ రమేష్బాబు, పీడీ శ్రీనివాసులు నన్నెంతగానో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఫుట్బాల్లో రాణిస్తున్న బోయ బాబు జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ జట్టు తరఫున ప్రాతినిథ్యం -
క్రికెటర్ దీపికకు ఘన స్వాగతం
మడకశిర/అమరాపురం: అంధుల మహిళల టీ20 ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అమరాపురం మండలం తంబాలహట్టి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇటీవల కొలంబోలో జరిగిన అంధుల మహిళల టీ20 ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో నేపాల్ను ఓడించి కప్ను కై వసం చేసుకోవడంతో కెప్టెన్ దీపిక దేశానికి పరిచయమయ్యారు. దీపిక వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తంబాలహట్టికి తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఆమైపె పూల వర్షం కురిపించి.. హారతులు పట్టారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎస్ఐ ఇషాక్బాషా ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నేడు మడకశిరలో సన్మానం .. అంధుల మహిళల టీ20 ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ దీపిక సోమవారం మడకశిరకు వస్తున్నారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత తొలిసారిగా మడకశిరకు వస్తున్న నేపథ్యంలో ఆమెకు ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. -
సర్వేల భారం తగ్గించండి
● సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుస్వామి అనంతపురం అర్బన్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై రోజురోజుకూ పెరుగుతున్న సర్వేల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక గణేనాయక్ భవన్లో జరిగిన సచివాలయ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వేల భారం తగ్గిస్తామంటూ గతంలో అధికారులు ఇచ్చిన హమీ అమలు కాకపోగా కొత్తగా మరిన్ని సర్వేలు చేర్చడం కక్షపూరిత చర్యగా కనిపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్డీనాయుడు, నాగేంద్రకుమార్, సమాఖ్య నాయకులు సూర్యప్రకాష్, ప్రదీప్, స్వర్ణ, రఫీ, సురేంద్ర, నితిన్కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఇసుక తరలింపు అడ్డగింత శింగనమల: మండల పరిధిలోని పెన్నా నది, వంకలు, వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా జిల్లా మైనింగ్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. శనివారం రాత్రి ఇసుక రీచ్ల్లో తనిఖీలు చేపట్టారు. తరిమెల పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా లోడు చేస్తున్న హిటాచీ, ఇసుకతో వెళుతున్న టిప్పరును సీజ్ చేశారు. ఇసుక అక్రమ డంప్లోకి తరలిస్తున్న ట్రాక్టరును స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులుగా ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్న రెరండు ట్రాక్టర్లు, రెండు టిప్పర్లను అదుపులోకి శింగనమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ విజయ్కుమార్ మాట్లాడుతూ... ఇసుక, ఎర్రమట్టి తరలింపులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇప్పటికే గార్లదిన్నె మండలంలో 11 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిస్తుండగా మైనింగ్ అధికారులు అడ్డుకుని, వాహనాలను అప్పగించారని వివరించారు. హంద్రీనీవా కాలువలో వ్యక్తి గల్లంతు ఆత్మకూరు: మండలంలోని పంపనూరు వద్ద ఉన్న హంద్రీ నీవా కాలువలో ఆదివారం ఓ వ్యక్తి గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. అయితే అతను ఎవరు అనేది స్పష్టంగా చెప్పలేకపోయారు. కాగా, మతిస్థిమితం లేక గ్రామంలో తిరుగుతుండే పంపనూరు గ్రామానికి చెందిన మల్లన్న (65) ఆదివారం మధ్యాహ్నం కాలువ వద్ద సంచరించడం చూసినట్లు కొందరు పేర్కొన్నారు. దీంతో గల్లంతైన వ్యక్తి మల్లన్న అయి ఉండవచ్చుననే అనుమానాలు బలపడ్డాయి. సర్పంచ్ ఎర్రిస్వామి, వీఆర్వో, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
జిల్లాకు అందాల అతిథులు
అనంతపురం: వేలాది కిలోమీటర్ల దూరం నుంచి రివ్వున ఎగురుతూ వచ్చిన అందాల అతిథులు ఉమ్మడి జిల్లాలో సందడి చేస్తున్నాయి. ప్రకృతి సోయగాలను రెట్టింపు చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇందులో బుల్లి పిట్ట ’ఉల్లంకి’ మొదలు, రంగురంగుల వివిధ జాతుల పక్షులు ఉన్నాయి. ఇప్పటికే స్థానికంగా 220 రకాల పక్షి జాతులను ఎస్కేయూలోని జువాలజీ విభాగం పరిశోధకులు గుర్తించగా... తాజాగా 32 జాతులకు చెందిన విదేశీ పక్షులు ఉమ్మడి జిల్లాలో సందడి చేస్తున్నట్లు నిర్ధారించారు. వీటి కిలకిలరావాలు, అందాలు, సందడి జిల్లా వాసులకు సరికొత్త అనుభూతినిస్తున్నాయి. ఆహారం.. సంతానోత్పత్తి కోసమే.. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం పరిశోధన విద్యార్థుల సర్వే ప్రకారం ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. వీటిలో రష్యా, బ్రిటన్, సైబీరియా, బంగ్లాదేశ్, నైజీరియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, శ్రీలంక తదితర 29 దేశాల నుంచి 32 జాతులకు చెందిన వలస జాతి పక్షులు ఇప్పటికే అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని చిత్రావతి, సంగమేశ్వరం, పెన్నా, హగరి నదీ తీరాలతో పాటు.. శింగనమల మండలం తరిమెల గ్రామ పరిసరాల్లో విడిది ఏర్పాటు చేసుకున్నాయి. కాగా, ఆయా దేశాల్లో శీతాకాలంలో తీవ్రమైన చలి నుంచి తప్పించుకోవడంతో పాటు సంతానోత్పత్తి కోసం ఈ పక్షులు వలస వచ్చినట్లుగా పరిశోధక విద్యార్థులు గుర్తించారు. ● సాండ్ పైపర్.. తెలుగులో ఉల్లంకి పిట్ట, చిట్టి తుర్రి అంటారు. యూరప్, మధ్య ఆసియా నుంచి వలస వచ్చాయి. నీటి అంచున బుడిబుడిగా నడుస్తూ పురుగులు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ● లిటిల్ స్టింట్.. తెలుగులో చిన్న ఉల్లంకి అని అంటారు. రష్యా, సైబీరియా ప్రాంతం నుంచి వలస వచ్చాయి. ఇవి కూడా నీటి అంచున సంచరిస్తూ కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ● లిటిల్ రింగెడ్ ప్లోవర్.. తెలుగులో చిన్న వలయ ఉల్లంకి అంటారు. నీటి పరివాహక ప్రాంతాలు, వంకలు, వాగులతో పాటు మెట్ట ప్రాంతాల్లోనూ సంచరిస్తూ పురుగులు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ● నార్తర్న్ పిన్టైల్ పక్షి (సూది తోక బాతు).. ఇప్పటికే ధర్మవరం చెరువు, సంగమేశ్వరం, పెన్నా, చిత్రావతి, హగరి నదులతో పాటు తరిమెల గ్రామంలోని నీటి వనరుల్లో కనిపిస్తున్నాయి. నీటిలో ఈదుతూ జలచరాలను ఆహారంగా తీసుకుంటాయి. ● రోజీ స్టార్లింగ్ .. దీనిని గులాబీ గోరువంక అని కూడా పిలుస్తారు. ప్రధానంగా పంటలకు నష్టం కలిగించే మిడతలు, పురుగులు, ఇతర కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. దీంతో వీటిని రైతుల పాలిట మిత్రులుగా పరిగణిస్తారు. పది రోజుల నిర్విరామ ప్రయాణంతో 13 వేల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి కేవలం పది రోజుల్లోనే ఉమ్మడి జిల్లాకు విదేశీ పక్షులు చేరుకుంటాయి. రష్యా, సైబీరియా, ఆసియా ప్రాంతాల నుంచి సముద్రమట్టానికి 8 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ హిమాలయాల మీదుగా వలస వచ్చిన ఈ పక్షులు చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. – డాక్టర్ వి.బాలసుబ్రహ్మణ్యం, జువాలజీ విభాగం అధ్యాపకుడు, ఎస్కేయూ లిటిల్ స్టింట్సాండ్ పైపర్ నార్తర్న్ పిన్టైల్ లిటి రింగెడ్ ప్లోవర్ ఉమ్మడి జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో విదేశీ పక్షుల సందడి 32 జాతులకు చెందిన విదేశీ పక్షుల రాక స్థానికంగా 220 రకాల పక్షిజాతుల గుర్తింపు ఫిబ్రవరి చివరి వరకు కనువిందు చేయనున్న పక్షులు సందడి చేస్తున్న అరుదైనవి కొన్ని.. -
వైఎస్సార్సీపీ అనుబంధ కమిటీల్లో పలువురికి చోటు
అనంతపురం: వైఎస్సార్సీపీ అనుబంధ కమిటీల్లో పలువురికి చోటు దక్కింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అనంతపురం అర్భన్ నియోజకవర్గానికి చెందిన గువ్వల రాజేష్రెడ్డిని రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా, కళ్యాణదుర్గానికి చెందిన ఇ.రాము బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా, బిక్కి నాగలక్ష్మి రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రెటరీగా, టి.వన్నూర్ స్వామిని ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా, జి.నాగరాజును ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా నియమించారు. అలాగే కళ్యాణదుర్గానికి చెందిన పి.నరేష్ బాబును పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీగా, ఆలమూరు కృష్ణారెడ్డిని జిల్లా కార్యదర్శిగా, కె.తిప్పేస్వామిని జిల్లా కార్యదర్శిగా నియమించారు. కళ్యాణదుర్గానికి కె.మహలింగను జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడిగా, ఎం.లింగప్పను ఎస్సీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, యు.శ్రీనివాసులును ఎస్సీ సెల్ జిల్లా సెక్రెటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
హెచ్చెల్సీకి గండి
● ఉంతకల్లు వద్ద కుడిగట్టు చెదిరిపోవడంతో వాగులోకి నీరు ● నీటిమట్టం తగ్గించి యుద్ధప్రాతిపదికన గండి పూడ్చివేత బొమ్మనహాళ్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి పెద్ద ప్రమాదం తప్పింది. బొమ్మనహాళ్ హెచ్చెల్సీ సెక్షన్ పరిధిలోని ఉంతకల్లు వద్ద హెచ్చెల్సీకి 113–557 కిలోమీటర్ పెద్ద కుడి గట్టుకు అకస్మాత్తుగా ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో పెద్ద గండి పడింది. దీంతో ఒక్కసారిగా కాలువ నుంచి 70 నుంచి 90 క్యూసెక్కుల నీరు వాగులో వెళ్లాయి. వాగులోంచి ఉద్దేహాళ్, ఉంతకల్లు గ్రామాల ఆయకట్టు భూముల్లో సాగు చేసిన వరి పంట పొలాల్లోకి నీరు చేరింది. పంట కోత సమయలో ఇలా జరగడంతో ఆందోళనకు గురైన రైతులు వెంటనే హెచ్చెల్సీ అధికారులకు సమాచారం అందించారు. కణేకల్లు సబ్ డివిజన్ డీఈఈ దివాకర్రెడ్డి, సరిహద్దు డీఈఈ ప్రవీణ్కుమార్రెడ్డి, ఏఈఈలు అల్తాఫ్, రంజిత్కుమార్ సిబ్బందితో కలిసి గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. నీటి మట్టాన్ని సరిహద్దులో 400 క్యూసెక్కులు తగ్గించి గండి పూడ్చేందుకు జేసీబీ, ఇటాచీలతో చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు గండిని పూర్తిగా మూసివేసి కాలువ నుంచి నీరు వాగులోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. హెచ్చెల్సీ సరిహద్దులో ఎక్కువ స్ధాయిలో నీరు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని డీఈఈ దివాకర్రెడ్డి తెలిపారు. కాలువలో 1,600 క్యూసెక్కులు రావాల్సి ఉండగా.. ఒకేసారి 2 వేల క్యూసెక్కుల నీరు రావడంతో కాలువ కుడి గట్టుకు గండి పడిందని స్పష్టం చేశారు. గండి పెద్దది కాకముందే పూడ్చి వేశామన్నారు. -
తెగిన పీఏబీఆర్ కుడికాలువ గట్టు
కూడేరు: జల్లిపల్లి వద్ద ఆదివారం వేకువ జామున పీఏబీఆర్ కుడి కాలువ గట్టు తెగింది. నీరంతా పెద్ద ఎత్తున పంట పొలాల్లోకి ప్రవహించింది. విషయాన్ని రైతులు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈఈ శశిరేఖ, డీఈ కవిత, జేఈ ఓబులు రెడ్డి, తహసీల్దార్ మహబూబ్ బాషా తెగిన గట్టును పరిశీలించారు. డ్యాం దగ్గర ఎస్కేప్ రెగ్యులేటర్ వద్ద కుడి కాలువకు నీరు వెళ్లకుండా మిడ్పెన్నార్ డ్యాంకు వెళ్లేలా మళ్లించారు. గేట్లు బంద్ చేస్తే మళ్లీ స్తంభిస్తాయని అధికారులు నీటి మళ్లింపు చేపట్టారు. దీంతో కుడి కాలువకు నీటి సరఫరా ఆగింది. గట్టుకు మరమ్మతు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. అధికారుల అలసత్వం.. రైతుల పాలిట శాపం ఏడాడి క్రితం బోర్వెల్ లారీ కుడి కాలువ గట్టుపై వెళ్లినపుడు ఆ బరువుకు గట్టు కిందికి కుంగింది. దీంతో లారీ ఇరుక్కుపోయింది. అప్పుడు అధికారులు గట్టుకు తూతూ మంత్రంగా మరమ్మతులు చేపట్టడంతోనే ప్రస్తుతం గట్టు నీటి ప్రవాహానికి కోతకు గురైంది. నీటి విడుదలకు ముందు కాలువ భద్రతను అధికారులు పర్యవేక్షించలేదు. కాలువలో పెరిగిపోయిన కంప చెట్లు తొలగించిందీ లేదు. అధికారుల అలసత్వం రైతుల పాలిట శాపంగా మారింది. నీటి ప్రవాహానికి వేరుశనగ, కంది, వరి, చీనీ పంట పూర్తిగా దెబ్బతిన్నాయి. నీటితో పాటు మట్టికొట్టుకునిపోవడంతో బావులు, బోర్లు పూడిపోయాయి. మోటర్లు, స్టార్టర్ పెట్టెలు కొట్టుకుపోయాయి. రూ.కోటి వరకు నష్టం వాటిల్లింది. -
ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నూతన కమిటీ ఎన్నిక
అనంతపురం అర్బన్: ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా నూతన కమిటీని ఆదివారం అనంతపురంలోని ఆదిమూర్తినగర్లో ఉన్న ఆ సంఘం కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపారావు వ్యవహరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా డి.రవీంద్ర, ప్రధాన కార్యదర్శిగా సీకే లక్ష్మన్న, గౌరవాధ్యక్షుడిగా రామ్గోపాల్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎస్.డేవిడ్, ఉపాధ్యక్షులుగా పి.మాబూసాహెబ్, శ్రీనివాసులు నెహ్రూ, సహాయ కార్యదర్శిగా పెంచలయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా సురేష్, ప్రచార కార్యదర్శిగా పి.ఆది, కార్యవర్గసభ్యుడిగా వెంకటమణ ఎన్నికయ్యారు. ఎస్టీయూ జిల్లా కార్యవర్గం ఎన్నిక అనంతపురం సిటీ: ఎస్టీయూ 79వ వార్షిక సమావేశం అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి భవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆ శాఖ జిల్లా అధ్యక్షుడిగా ఎన్.రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్.రామాంజనేయులు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్థిక కార్యదర్శిగా మల్లికార్జున, జిల్లా కార్యవర్గ సభ్యులుగా మరో 20 మందిని, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఇంకో 17 మందిని ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా నాగరాజు హాజరయ్యారు. -
మందపై దూసుకెళ్లిన వాహనం
బెళుగుప్ప: మండలంలోని కాలువపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం గొర్రెల మందపై ట్యాక్సీ దూసుకెళ్లిన ఘటనలో 45 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు... ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డి తనకున్న ఐదు ఎకరాల పొలాన్ని విక్రయించగా వచ్చిన డబ్బుతో గొర్రెల పెంపకాన్ని చేపట్టాడు. మేపు కోసం ఇతర ప్రాంతాలనకు మందను తోలుకెళ్లిన ఆయన కాపరులతో కలసి తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున కాలువపల్లి వద్దకు చేరుకున్నాడు. జాతీయ రహదారిపై రోడ్డుకు పక్కగా గొర్రెలను తోలుకెళుతూ మార్గమద్యంలో వంతెనను దాటిస్తుండగా.. వెనుక నుంచి మందపైకి శరవేగంగా ఓ ట్యాక్సీ దూసుకెళ్లింది. పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. కాపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సింధనూరు జాతికి చెందిన 45 గొర్రెలు మృతి చెందాయి. కళేబరాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఘటనతో రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి వాపోయాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శివలింగప్ప, పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకుని బాధితుడు నాగేశ్వరరరెడ్డికి ధైర్యం చెప్పారు. జీవనాధరమైన పొలాన్ని విక్రయించి, గొర్రెల పోషణ చేపట్టిన రైతు నాగేశ్వరరెడ్డిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలంటూ గ్రామస్తులతో కలసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మూడు గంటలకుపైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉరవకొండ రూరల్ సీఐ మహానంది, కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, బెళుగుప్ప ఎస్ఐ శివ తదితరులు అక్కడకు చేరుకుని ఆందోళకారులతో మాట్లాడి, న్యాయం జరిగేలా చూస్తామని భరోసానిచ్చారు. దీంతో ఆందోళనను విరమించారు. ఘటనపై గొర్రెల యజమాని నాగేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 45 గొర్రెల మృతి ప్రాణాపాయ స్థితిలో మరో 15 జీవాలు కాపరులకు తప్పిన ప్రమాదం -
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం : ఎస్పీ
అనంతపురం సెంట్రల్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమించాలని ఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో.. సైకిల్ తొక్కు బ్రో’ నినాదంతో జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఆదివారం ఆయన సైకిల్ ర్యాలీని ప్రారంభించి, మాట్లాడారు. డ్రగ్స్ వినియోగంపై కలిగే అనర్థాలపై యువతలో చైతన్య పెంచే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. పిల్లల నడవడిక, ప్రవర్తను సరిచేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. గంజాయి, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై 1972, 112 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సైకిల్ తొక్కడాన్ని ఓ వ్యాయామంగా నిరంతరం కొనసాగించడం ద్వారా మెరుగైన ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఇలియాజ్బాషా, డీఎస్పీలు శ్రీనివాసరావు, మహబూబ్బాషా, సూర్యనారాయణరెడ్డి, నీలకంఠేశ్వరరెడ్డి, ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఇండియన్ రెడ్క్రాస్, డిస్కవరీ అనంతపురం, లలితమ్మ హెల్పింగ్ హ్యాండ్స్, యాపిల్స్ తదితర ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. బైక్ల ఢీ – వ్యక్తి మృతి బెళుగుప్ప: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం వెంకటాద్రిపల్లిలో వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న రాసినేని చంద్రమౌళి(65)కి భార్య శకుంతల, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం సాయంత్రం బెళుగుప్పలో దుకాణానికి అవసరమైన సరుకులు కొనుగోలు చేసి, రాత్రికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎదురుగా శీర్పి గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనంపై వస్తున్న తిప్పేస్వామి ఢీకొనడంతో చంద్రమౌళితో పాటు తిప్పేస్వామి, ఆయన భార్య భూలక్ష్మి రోడ్డుపై పడ్డారు. చంద్రమౌళి తలకు బలమైన గాయాలయ్యాయి. స్వల్పగాయాలతో తిప్పేస్వామి, భూలక్ష్మి దంపతులు బయటపడ్డారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న చంద్రమౌళిని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తిప్పేస్వామికి కళ్యాణదుర్గం ఆస్పత్రిలో చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి
అనంతపురం అర్బన్: దేశ రక్షణలో సైనికులు, మాజీ సైనికులు అందించిన సేవలు, త్యాగాలకు వెలకట్టలేమని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. సైనికుల కుటుంబాలకు ప్రతి పౌరుడూ తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాయుధ దళాల పతాక నిధి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని తన వంతు విరాళం అందజేసి, మాట్లాడారు. అందరి సహకారంతో సాయుధ దళాల పతాక నిధికి విరాళాలను సేకరించాలని సూచించారు. జిల్లాలో అర్హులైన మాజీ సైనికులకు, అమరులైన సైనిక కుటుంబాలకు భూ పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. అంతకు ముందు పతాక దినోత్సవ ర్యాలీని ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్ క్లాక్ వరకు నిర్వహించి విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప, సిబ్బంది గిరీష్, బాబాఫకృద్ధీన్, అమర్నాథ్, అనిల్, రమాదేవి, మాజీ సైనికులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, హరే రామ హరే కృష్ణ సేవాసమితి భక్తుడు పతాక నిధికి చెక్ రూపంలో రూ.10 వేలు విరాళాన్ని కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా సైనిక సంక్షేమ శాఖకు అందజేశారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ, మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు విశ్వేశ్వరరావు, సైనిక వితంతువులు తమ విరాళాలు అందించారు. -
వీడని ముగ్గురు మిత్రుల అదృశ్యం మిస్టరీ
రాప్తాడురూరల్: రాప్తాడు మండలం చిన్మయనగర్లోని ఎల్ఆర్జీ స్కూల్లో పదో తరగతి చదువుతూ అదృశ్యమైన ముగ్గురు స్నేహితుల మిస్టరీ నాలుగు రోజులవుతున్నా లభించలేదు. పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన ఎం.సుధీర్, తాడిపత్రి మండలం వంగనూరుకు చెందిన గంగుల దీపక్కుమార్, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం చెన్నమనాయనికోటకు చెందిన జి.ఆంథోని ప్రకాష్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నారు. ఈ నెల 5న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. వీరి కోసం ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టింది. సమీప ప్రాంతాలు, బస్టాండు, రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించింది. మరో బృందం బెంగళూరుకు వెళ్లింది. ఆరోజు ఏమి జరిగిందంటే... ముగ్గురు స్నేహితులు హాస్టల్లో ఉంటూ ఓ విషయంపై వాదనకు దిగి కారు అద్దాలు పగులకొట్టారు. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించిన యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్లు చేసి విషయం చెప్పి వెంటనే వచ్చి మాట్లాడాలని చెప్పింది. తమ కుటుంబ సభ్యులు వస్తే ఎక్కడ ఇబ్బంది పడతామోననే భయంతో అదేరోజు ఇంటర్వెల్ సమయంలో తరగతి గది నుంచి వెళ్లిపోయారు. గుర్తించిన యాజమాన్యం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా లాభం లేకపోయింది. అదేరోజు రాప్తాడు పీఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు.. అదృశ్యమైన ముగ్గురు స్నేహితుల్లో దీపక్కుమార్, ఆంథోని ప్రకాష్ ఇద్దరూ వారి తల్లిదండ్రులకు ఏకై క కుమారులు. మరో విద్యార్థి సుధీర్కు అన్న ఉన్నాడు. ఈ పిల్లలు మిస్సింగ్ అయ్యారని తెలిసిన రోజు నుంచి తల్లిదండ్రులు పడుతున్న ఆందోళన అంతా ఇంతా కాదు. కూలినాలి చేసుకుంటూ ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలను చదివిస్తున్నామని వాపోతున్నారు. మూడు నెలల్లో వార్షిక పరీక్షలు ఉన్న సమయంలో ఇలా అదృశ్యం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆశలను అడియాసలు చేయొద్దని పిల్లలను వేడుకుంటున్నారు. తెలిసో తెలియకో చేసిన తప్పుగా క్షమిస్తామని, ఎక్కడున్నా వెంటనే తిరిగి రావాలని, చదువు ఇష్టం లేదంటే ఇంటికి రావాలని కోరుతున్నారు. నాలుగు రోజులవుతున్నా ఆచూకీ లభించని వైనం రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందం ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు -
‘సంతకమే’ సమర శంఖం
అనంతపురం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. పార్టీలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు తరలివచ్చి సంతకాలు చేసి చంద్రబాబు సర్కారు తీరుపై సమర శంఖం పూరిస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యం.. వైద్య విద్య అందకుండా దూరం చేసే కుట్రలను సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ● కళ్యాణదుర్గం నియోజకవర్గం మాకోడికి గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన సంతకాల ప్రతులను వైఎస్సార్సీపీ నాయకులు ఆదివారం మాజీ ఎంపీ తలారి రంగయ్యకు అందజేశారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం మండల కన్వీనర్ ఎంఎస్ హనుమంత రాయుడు, సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ ముత్యాలు, నాయకులు మంజునాథరెడ్డి, శెట్టూరు, తిప్పేస్వామి, హరినాథరెడ్డి, ప్రతాప్, వీరాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. ● ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామ పంచాయతీలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్సార్ విద్యార్థి విభాగం రాయలసీమ, యుజవన విభాగం జోనల్ అధ్యక్షుడు వై.ప్రణయ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కరణం భీమరెడ్డి, భరత్రెడ్డి, కన్వీనర్ కురుబ రమేష్, మండల ఉపాధ్యక్షుడు బోయ నాగేంద్ర, కురువ గురిబాబు, యువజన వభాగం బోయ వన్నూర్ స్వామి, డిష్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ● శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం చెర్లోపల్లి, కుమ్మనమల గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. సంతకాలు చేసిన పత్రాలను వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పొన్నపాటి మహేశ్వరరెడ్డికి నాయకులు తిరుపాలరెడ్డి ,శ్రీరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపాటు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేస్తున్న ప్రజలు -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్ : కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా విన్నవించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి పరిష్కార స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా meekosam.ap.gov.i n ద్వారా కూడా సమర్పించవచ్చని తెలిపారు. కమ్మేస్తున్న పొగమంచు ● ఉష్ణోగ్రతల తగ్గుదలతో పెరుగుతున్న చలి అనంతపురం అగ్రికల్చర్: పొగమంచు ‘అనంత’ను కమ్మేస్తోంది. ఎదురుగా ఐదు అడుగుల దూరం కూడా సరిగా కనిపించనంత స్థాయికి చేరుకుంది. వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఇదే రకమైన వాతావరణం నెలకొంది. సాయంత్రం 5 గంటలకే పొగమంచు ఉండటంతో చీకట్లు అలుముకున్నట్లు కనిపిస్తోంది. వేకువజామున, ఉదయం 9 గంటల వరకు పరిస్థితి ఇలాగే ఉంది. పల్లె ప్రాంతాలు, నగర శివార్లు, జాతీయ రహదారులు దట్టమైన పొగమంచు మరింత అధికంగా కనిపిస్తోంది. దీంతో వాహనదారులు బాగా ఇబ్బంది పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 32 డిగ్రీల మధ్య నమోదవుతుండగా.. రాత్రిళ్లు 16 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నందన చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి గజ గజ వణికిస్తోంది. దీంతో రైతులు, శ్రామికవర్గాలు, పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచు వల్ల గాలికాలుష్యం అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. అనారోగ్యకరమైన వాతావరణం ఉన్నందున చలికాలంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెలాఖరు, జవవరిలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. చెర్లపల్లి–యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సోమ, మంగళవారాలు (8, 9 తేదీల్లో) చెర్లపల్లి–యలహంక–చెర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం రాత్రి 10 గంటలకు చెర్లపల్లి జంక్షన్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 11.45 గంటలకు యలహంక రైల్వేస్టేషన్కు చేరుతుందని పేర్కొన్నారు. తిరిగి ఈ రైలు అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి చెర్లపల్లి జంక్షన్కు బుధవారం ఉదయం 4.30 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైళ్లు కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబుబ్నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం, హిందూపురం మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. ఈ రెండు రోజులు సింగిల్ సర్వీసుల్లో మాత్రమే ఈ రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేడు డయల్ యువర్ సీఎండీ అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 89777 16661 నంబర్కు కాల్ చేయాలని సీఎండీ శివశంకర్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కురుగుంట శివారులో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆలమూరుకు చెందిన జెన్నే సాయి సిద్ధార్థ (19) మృతిచెందాడు. వివరాలు.. ఆలమూరుకు చెందిన జెన్నే రామకృష్ణ కుమారుడు సాయి సిద్ధార్థ ఆత్మకూరు మండలం కొత్తపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా చిన్నంపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం సాయిసిద్ధార్థ బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. రేపు అంధ మహిళల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ రాక మడకశిర: మడకశిరకు అంధుల మహిళల టీ 20 ఇండియా క్రికెట్ కెప్టెన్ దీపిక సోమవారం రానున్నారు. తొలి సారిగా ప్రపంచ కప్ గెలిచి, ఆమె తన సొంత గడ్డ మడకశిరకు వస్తున్నారు. అమరాపురం మండలం తంబాలహట్టి గ్రామానికి చెందిన దీపిక మడకశిరకు వస్తుండడంతో ఆమెకు ఘనంగా స్వాగతం పలకడానికి ప్రజలు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ బంగ్లాలో స్థానిక నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు ఏర్పాట్లపై చర్చించారు. సెలవులో ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి అనంతపురం సెంట్రల్: మహిళా,శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ అరుణకుమారి వారం రోజులు పాటు సెలవులో వెళ్లనున్నారు. ఈమె గుడ్ గవర్నెస్ అంశంపై వెస్ట్ బెంగాల్, నోయిడాలో జరుగుతున్న సెమినార్లో పాల్గొననున్నారు. శింగనమల సీడీపీఓ లలితకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించనున్నారు. శిశుగృహ పర్యవేక్షణ అధికారిగా అనంతపురం అర్బన్ సీడీపీఓ అనురాధకు అప్పగించినట్లు తెలిసింది. -
పైళ్లెన నెల రోజులకే ఆత్మహత్య
యాడికి: ఏడడుగుల బంధం.. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో గడపాల్సిన యువకుడికి ఏకష్టమొచ్చిందో.. పైళ్లెన నెల రోజులకే విషపుగుళికలు మింగి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరూరులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు..యాడికి మండలం నగరూరుకు చెందిన జయరాంనాయుడుకు శరత్ కుమార్ నాయుడు (23), లోకేష్ కమార్ నాయు డు అనే ఇద్దరు కుమారులు. శరత్కుమార్ నాయుడు మరో వ్యక్తితో కలిసి కొంతకాలంగా బెంగళూరులో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు లోకేష్ కుమార్ నాయుడు నగరూరులో వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. గత నెల 2,3వ తేదీన బళ్లారి జిల్లాకు సమీపంలోని సుగ్నీల్ కొట్టాలకు చెందిన సుస్మితతో శరత్కుమార్నాయుడుకు వివాహమైంది. 10 రోజుల క్రితం భార్య సుస్మితను నగరూరులో ఇంటి వద్ద ఉంచి బెంగళూరుకు వెళ్లాడు. ఈనెల 3న సుస్మిత పుట్టింటికి వెళ్లింది. శుక్రవారం బెంగుళూరు నుంచి వచ్చిన శరత్కుమార్ తాడిపత్రి మీదుగా నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న తన స్నేహితుడు హరీష్ ఇంటికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో హరీష్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లిన తర్వాత ఇంటిలో ఉన్న శరత్ కుమార్ నాయుడు తన సెల్ఫోన్తో భార్యతో గంటపాటు మాట్లాడాడు. ఆ తర్వాత విషపు గుళికలు మింగానని మిత్రుడు హరీష్కు ఫోన్లో తెలిపాడు. వెంటనే రూముకు వచ్చిన హరీష్ అతనికి తాడిపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన చికిత్సకోసం అనంతపురం తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన శరత్కుమార్నాయుడును కుటుంబ సభ్యులు చూసి కన్నీటి పర్యంత మయ్యారు. -
ప్రాణం తీసిన పొగ మంచు
కనగానపల్లి: బెంగళూరు నుంచి హైదరాబాదుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువతి మార్గమధ్యంలో పొగ మంచు కారణంగా ప్రమాదానికి గురై దుర్మరణం పాలైంది. ఈ ఘటన శనివారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్కు చెందిన రాళ్లపల్లి వినీల (35) బెంగళూరు నుంచి హైదరాబాద్కు ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. మార్గమధ్యంలోని మామిళ్లపల్లి వద్దకు రాగానే పొగ మంచులో జాతీయ రహదారి పక్కన ఉన్న ఐరన్ సేఫ్టీబార్ కనిపించక ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఆమె రోడ్డుపై పడింది. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కనగానపల్లి పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మృతురాలి వివరాలు సేకరించారు. పీహెచ్డీ పూర్తి చేసిన యువతి సికింద్రాబాద్కు చెందిన రాళ్లపల్లి ధర్మరావు, కుష్మా దంపతుల కుమార్తె వినీల. ఇటీవలే ఈమె సైకాలజీ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశారు. బెంగళూరులో ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె శనివారం తెల్లవారుజామున బెంగళూరులోని బంధువుల ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని తీసుకుని హైదరాబాద్కు బయల్దేరింది. పొగమంచు ఎక్కువగా ఉండడంతో సేఫ్టీబార్ కనిపించక రోడ్డు ప్రమాదానికి గురైంది. విషయాన్ని సికింద్రాబాద్లోని కుటుంబ సభ్యులకు తెలియజేసి, వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నూర్ మహ్మద్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ యువతి దుర్మరణం బెంగళూరు నుంచి హైదరాబాదుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఘటన -
హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం
అనంతపురం టవర్క్లాక్: హైకోర్టు న్యాయ మూర్తి, అనంతపురం జిల్లా అడ్మిని స్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎస్.భానుమతి శనివారం జిల్లా పర్యటనకు విచ్చేశారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద న్యాయమూర్తిని కలెక్టర్ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి భీమరావు, ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. నేడు ఎన్ఎంఎంఎస్ మెరిట్ పరీక్ష ● 4 ప్రాంతాల్లో 15 పరీక్ష కేంద్రాలు అనంతపురం సిటీ: కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాల కోసం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షలు ఆదివారం నిర్వహించనున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అర్హులు. జిల్లా వ్యాప్తంగా 3,340 మంది దరఖాస్తు చేసుకున్నట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. వీరి కోసం అనంతపురంలో 5, కళ్యాణదుర్గంలో 3, రాయదుర్గంలో 3, గుంతకల్లులో 4 కేంద్రాల చొప్పున మొత్తం 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు వెబ్సైట్, వాట్సాప్లలో హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ అంశానికి సంబంధించి సందేహాలు ఉంటే ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు. హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, దీని ఆధారంగా విద్యార్థులు ఇంటి నుంచి నేరుగా పరీక్ష కేంద్రానికి సులభంగా చేరుకోవచ్చని తెలిపారు. పరీక్ష ఫలితాలు వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో వస్తాయన్నారు. పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తయ్యే వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున బ్యాంకు ఖాతాకు స్కాలర్షిప్ జమ అవుతుందని వెల్లడించారు. అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్కు ‘అనంత’ క్రీడాకారుడు అనంతపురం సిటీ: అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్కు అనంతపురానికి చెందిన క్రీడాకారుడు నరేష్ ఎంపికయ్యాడు. ఇతను ఎస్ఎస్బీఎన్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం సీఈసీ చదువుతున్నాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఇటీవల నిర్వహించిన అథ్లెటిక్స్లో పాల్గొని 100 మీ. 400 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచాడు. దుబాయ్లో ఆదివారం నుంచి 14వ తేదీ వరకు జరగనున్న అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ పోటీల్లో భారత్ తరఫున ఆడేందుకు బయలుదేరి వెళ్లినట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డా.శ్రీనివాస్రెడ్డి శనివారం తెలిపారు. నరేష్ను కళాశాల కరస్పాండెంట్ పీఎల్ఎన్ రెడ్డి, ప్రెసిడెంట్ పీవీ రమణారెడ్డి, సెక్రటరీ నిర్మలమ్మ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.ఎస్.రామ్మోహన్ అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలోనూ మన దేశ కీర్తిని చాటాలని ఆకాంక్షించారు. -
అన్నదాత ఆత్మహత్యలకు చంద్రబాబుదే బాధ్యత
● వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ధ్వజం ఉరవకొండ: రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలకు చంద్రబాబుదే పూర్తి బాధ్యత అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ మోసమేనన్నారు. రైతులు పండించిన పంటలకు 18 నెలల కాలంలో ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించారో చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. జిల్లాలో అరటి రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, గతంలో అరటి టన్ను రూ.2,300 పలికేదని, ఇప్పుడు రూ.50 కూడా అడిగేవారు లేరన్నారు. గిట్టుబాటు ధర లేక పంటను ట్రాక్టర్లతో తొలగిస్తూ, రోడ్డుపైన పారేస్తున్నారన్నారు. మిరపకు బదులుగా లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారన్నారు. గతంలో మొక్కజొన్న క్వింటా రూ.2,600 పలికితే ప్రస్తుతం రూ.1400 పోవడంలేదని అన్నారు. పత్తి క్వింటా రూ.8,100 ఉంటే ప్రస్తుతం రూ.5,500 పలకలేదన్నారు. ప్రస్తుతం కందులు 3 లక్షల ఎకరాల్లో సాగవుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. జిల్లాలో రాయితీపై శెనగ విత్తనాలు ఆలస్యంగా ఇవ్వడంతో రైతులు సద్వినియోగం చేసుకోలేకపోయారని, వాటిని టీడీపీ నాయకులు బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకున్నారన్నారు. ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీకి మంగళం: చంద్రబాబు ఆర్బీకేలను నిర్వీర్యం చేసి ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీలకు మంగళం పాడారని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రైతులకు అవసరమైన యూరి యా, మందుల కొరత ఉందని, మినీ కిట్లు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులకు రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయి పడి, పంటల బీమాకు మంగళం పాడారన్నారు. దీంతో పాటు అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు రెండేళ్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చి రూ.30 వేలు ఎగ్గొట్టారన్నారు. ఈ సమస్యలపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్న తరుణంలో వాటిని డైవర్ట్ చేయడానికి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని చంద్రబాబు తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్కు తేరలేపరన్నారు. తక్కువ మంది సిబ్బందితో లక్షలాది మంది రైతులను కలిసినట్లు ఎక్కడో ఓ టీడీపీ నాయకుడి ఇంటి వద్ద కూర్చొని వారి ఫొటో తీసుకొని పంపుతున్నారన్నారు. 10న ఉరవకొండలో జరిగే ర్యాలీని జయప్రదం చేయండి.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఉరవకొండలో చేపట్టిన కోటిసంతకాల సేకరణలో భాగంగా 60 వేలు సంతకాలు పూర్తి చేశామని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈసంతకాలను సేకరించి వాటిని ర్యాలీగా అనంతపురానికి తరలించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టినట్లు తెలిపారు. ఈసంతకాలను ఈనెల 13న విజయవాడకు తరలించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రసాద్, పార్టీ రాష్ట్ర నాయకులు ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు, మార్కెట్యార్డు మా జీ చైర్పర్సన్ సుశీలమ్మ, మాజీ ఎంపీపీ చందాచంద్రమ్మ, ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న తదితరులు పాల్గొన్నారు. -
స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్
అనంతపురం సిటీ/ అనంతపురం టవర్క్లాక్: సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కులు, విద్యా విస్తరణ కోసం పోరాడిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యావత్ జాతికి స్ఫూర్తి ప్రదాత అని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ ఆనంద్ అన్నారు. ఆయన అలోచనలను ఆచరణలో పెట్టినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పరిషత్ ఎదుట అంబేడ్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సర్కిల్లో గల అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్తో పాటు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్స్న్ బోయ గిరిజమ్మ, నగర పాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి, ఏడీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, బండారు శ్రావణిశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్.. ‘జ్ఞానం పొందు– కష్టపడు –సంఘటితం అవ్వు’ అనే సూత్రాలు నమ్మి ఆచరించి సమాజానికే మార్గదర్శకులయ్యారని కొనియాడారు. జిల్లాలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీల్లో బాల్య వివాహాలు కొనసాగిస్తుండడంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కుష్బూ కొఠారి, అధికారులు రామూనాయక్, శ్రీనివాసులు, రామ్మోహన్, వైఎస్సార్సీపీ నాయకులు అనంత చంద్రారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, మీసాల రంగన్న, పసలూరు ఓబిలేసు, సాకే అశోక్ కుమార్, లబ్బే రాఘవ, శ్రీనివాసులు నాయక్, కార్పొరేటర్ సాకే చంద్రలేఖ, సాకే కుళ్లాయి స్వామి, సాకే శివశంకర్, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పాల్గొన్నారు. -
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. చలి వాతావరణం పెరిగింది. ఈశాన్యం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
భూసేకరణ వేగవంతం చేయండి అనంతపురం అర్బన్: ఫీడర్ సోలరైజేషన్ పథకం కింద జిల్లాలో 498 ఏకరాల్లో 111 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు భూసేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. శనివారం సీఎస్ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎన్ఆర్ఈడీసీఏపీ ప్రాజెక్టులు, ఇతర పథకాలపై ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ తోలేటి, కలెక్టర్ ఆనంద్, నెడ్క్యాప్ ఎండీ కమలాకర్బాబు, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ అయూబ్ఖాన్, జాయింట్కలెక్టర్ శివ్నారాయణ్ శర్మతో కలిసి అధికారులతో సమీక్షించారు. అనంతపురం సర్కిల్ పరిధిలోని 20 ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియలో జాప్యం కాకూడదన్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో పీఎం కుసుమ్ పథకం కింద 610 మెగావాట్ల సామర్థ్యంతో 1.36 లక్షల వ్యవసాయ పంపుసెంట్లకు సోలార్ విద్యుత్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. పీఎం సూర్య ఘర్ కింద జిల్లాలో 35.7 మెగావాట్ల సామర్థ్యంతో 17,870 గృహాలకు రూఫ్టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. బీఆర్ అంబేడ్కర్కు నివాళి భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్హాలులో ఆయన చిత్రపటానికి సీఎస్ విజయానంద్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఎస్పీడీసీఎల్ సీజీఎంలు రమణాదేవి, ఉమాపతి, జీఎం విజయన్, ఎస్ఈ శేషాద్రి శేఖర్, డీఆర్ఓ మలోల పాల్గొన్నారు. -
భూములు, స్థలాలు కొంటున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించాలి..
అనంతపురం అర్బన్: నగరం, నగర పరిధి విస్తరిస్తోంది.. జనాభాకనుగుణంగా భూములు, స్థలాల అవసరం ఏర్పడింది. భూములు, స్థలాల విలువ కూడా బాగా పెరిగిపోయింది. ఇదే అదునుగా చూసు కొని కొందరు అక్రమ మార్గంలో నడుస్తున్నారు. భూములు, స్థలాల హక్కుదారుల పేరిట నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. మరోవైపు డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూములు, స్థలాలు,ఇళ్లను కొనుగోలు చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి...అక్రమార్కుల మోసాన్ని ఎలా గుర్తించాలి..అనే అంశాలపై ‘మీకోసం’లో ‘సాక్షి’ అంది స్తోంది.ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి..● స్థలం కొనేప్పుడు తప్పుడు వివరాలు ఇస్తారు. బేరం మాట్లాడేప్పుడు బ్రోకర్లు వచ్చి రెచ్చ గొట్టి ఎక్కువ ధరకు కొనే విధంగా చేస్తారు.● ఆస్తి ఎవరి పేరున ఉందనేది తెలుసుకోవాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఈసీ (ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్) తీసుకోవాలి. ● ఆస్తి కొనేముందు ఓరిజినల్ సేల్ డీడ్ (అసలైన డాక్యుమెంట్)లో ఉండే యజ మాని ఫొటోను గమనించాలి. అన్ని లింక్ డాక్యుమెంట్ల హిస్టరీ చూడాలి.● సేల్ అగ్రిమెంట్ కనీసం మూడు నెలలు ఉండేలా చూసుకోవాలి. అగ్రిమెంట్ చేసుకునేప్పుడు డబ్బులు 5 నుంచి 10 శాతం కంటే ఎక్కువ ఇవ్వకండి. ● ధర మాట్లాడే అప్పుడు నిజమైన యజ మానితో మాట్లాడాలి. యజమానికి సంబంధించి గుర్తింపుకార్డు అడగాలి.● కొనుగోలు చేయబోవు స్థలం డాక్యుమెంట్లు, చిరునామా నిజమైనదా? కాదా తెలుసుకోవాలి. ● క్షేత్రస్థాయిలో స్థలం కొలతలు, డాక్యుమెంట్లోని కొలతల్లో తేడాలు గుర్తించాలి. ● కొందరు ఆస్తిని వేరేవాళ్లకు విక్రయించి, మన వద్ద అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ సమయంలో, రిజిస్ట్రేషన్ ముందు రోజు ఈసీ తీసుకోవాలి.అవసరమైన డాక్యుమెంట్లు ఏవంటే..యజమాని సేల్ డీడ్ ఒరిజినల్డాక్యుమెంట్పై స్టాంప్ చూడాలి. లింక్ డాక్యుమెంట్లు చూడాలి.అన్ని డాక్యుమెంట్లలో కొనేవారు, విక్రయించేవారు ఒక్కరే కాకపోతే.. అమ్మేవారి వంశవృక్షం సర్టిఫికెట్ తప్పనిసరిగా ఇప్పించుకోవాలి.డాక్యుమెంట్ మొదటి పేజీలో ఏదైనా కోర్టు సీల్, సంతకం ఉంటే ఆ ఆస్తి పైన కేసు ఉందని అర్థం చేసుకోవాలి.ఈసీ (ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికెట్) మదర్ డీడీ సర్టిఫికెట్, రికార్డ్ ఆఫ్ రైట్స్, వ్యవసాయ భూమి అయితే టె నాన్సీ అండ్ క్రాప్, సర్వే స్కెచ్ ఉండాలి.లే అవుట్ అప్రూవల్, ఖాతా ధ్రువపత్రం, డీసీ కన్వవర్షన్ సర్టిఫికెట్ (అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్), ఆస్తి పన్ను సర్టిఫికెట్.అపార్మెంట్మెంట్లు, ఇళ్లు అయితే ప్లాన్ అప్రూవల్ ఉండాలి. తక్కువ ఫ్లోర్లకు అప్రూవల్ తీసుకొని ఎక్కువ ఫ్లోర్లు నిర్మిస్తారు. అలాంటి ఫ్లాట్లు కొంటే భవిష్యత్తులో ఇబ్బంది వస్తుంది.అప్రూవల్ స్థలాలు కొనాలి...ఇటీవల అనప్రూవల్ వెంచర్లు చాలానే వెలుస్తునాయి. లే అవుట్ అప్రూవల్ స్థలాలను కొనుగోలు చేయాలి. లేదంటే అప్రూవల్ సమయంలో స్థలం విలువపై 14 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఉచితంగా భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్లను ఇస్తుంది. అలాంటి వాటిని కొనుగోలు చేసినా మళ్లీ వారికే వెళతాయి. రిజిస్ట్రేషన్ చెల్లదు. పేదవారికి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన స్థలాలు కొనకూడదు. -
ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో!
అనంతపురం సెంట్రల్: ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసుకున్న తన షెడ్డును దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని న్యాయం కోసం పోలీసుస్టేషన్కు వెళ్లిన బాధిత మహిళను అధికారపార్టీ నేతలతో పాటు సీఐ దుర్భాషలాడటంతో పాటు బెదిరించారు. మనస్తాపం చెందిన బాధితురాలు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన శనివారం అనంతపురంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. అనంతపురంలో గుత్తిరోడ్డు నుంచి ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లే ప్రధాన దారి పక్కన డీసీఎంఎస్ స్థలంలో గానుగ మెహతాజ్ అనే మహిళ గత కొన్నేళ్లుగా రేకులషెడ్లో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇటీవల సదరు స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. స్థలాన్ని ఖాళీ చేయాలని అనేకసార్లు ఆమైపె ఒత్తిడి తెచ్చారు. అవసరమైతే తాను లీజుకు తీసుకుంటానని చెప్పినా వినలేదు. ఇటీవల కళ్యాణదుర్గం వచ్చిన నారా లోకేష్కు ఆమె తన సమస్యను మొరపెట్టుకుంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ నెట్టం వెంకటేష్ను కలిసి వేడుకుంది. దీంతో సదరు టీడీపీ నేతలు ఆగ్రహించారు. ‘నారా లోకేష్నే కలుస్తావా.. నీకు స్థలం ఇచ్చేది లేదు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో’ అంటూ బెదిరించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల జాఫర్, రఘు అనే వ్యక్తులు వచ్చి దౌర్జన్యం చేశారని, తర్వాత అర్ధరాత్రి సమయంలో తమ షెడ్డును అక్కడినుంచి ఎత్తుకుపోయారని వాపోయారు. పైగా ఆ స్థలాన్ని తమకు ఇచ్చారంటూ నిర్మాణం చేపడుతున్నారన్నారు. దీనిపై త్రీటౌన్ పోలీసుస్టేషన్కు వెళ్లి సీఐ రాజేంద్రనాథ్యాదవ్ను కలిసి మొరపెట్టుకుందన్నారు. అయితే ‘నీ కేసు తీసుకునేది లేదు’ అంటూ సీఐ తీవ్రస్థాయిలో బెదిరించినట్లు ఆరోపించారు. ఇక తనకు న్యాయం జరగదని మనస్తాపం చెందిన మెహతాజ్ శనివారం అదే స్థలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అధికారపార్టీ నేతలతో పాటు సీఐ బెదిరింపు షెడ్డు దౌర్జన్యంగా తొలగించినా ఫిర్యాదు స్వీకరణకు ససేమిరా మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు -
ఊపందుకున్న ఉద్యమం
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అనంతపురం: ప్రజలకు మెరుగైన వైద్యం, పేదలకు వైద్య విద్య కల అందకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్వహించలేమంటూ పీపీపీ విధానం పేరిట ప్రైవేటీకరణకు చర్యలు చేపట్టింది. ప్రజల క్షేమాన్ని పక్కనపెట్టి తమ అనుయాయులకు లబ్ధి చేకూర్చడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. వైద్య కళాశాలలను పరిరక్షించుకోవాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగేలా చూడాలని ‘కోటి సంతకాల సేకరణ’ ప్రజా ఉద్యమం నిర్వహిస్తోంది. ఊరూవాడా సాగుతున్న ప్రజా ఉద్యమంలో పార్టీలకతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు భాగస్వాములయ్యారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేస్తున్నారు. నాడు విప్లవాత్మక సంస్కరణలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ఉండగా, 2019లో ఒకేసారి 17 కొత్త వైద్య కళాశాలలు తీసుకొచ్చింది. ఇందులో ఐదు వైద్య కళాశాలలను 2023–24లోనే ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మన విద్యార్థులకు అదనంగా సమకూర్చారు. ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా బలోపేతం చేశారు. మిగిలిన కళాశాలల ఏర్పాటు వివిధ దశల్లో ఉంది. నేడు వైద్య కళాశాలలకు చంద్రగ్రహణం చంద్రబాబు సర్కారు కొలువుదీరాక వైద్యరంగం నిర్వీర్యమైంది. పేద విద్యార్థుల డాక్టర్ కల చిదిమేసేలా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు. క్రమేణా ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సర్కారు తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఉధృతంగా ప్రజా ఉద్యమం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ– రచ్చబండ ప్రజా ఉద్యమం జిల్లా అంతటా ఉధృతంగా సాగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు పెడుతున్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరించరాదని, ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని, మెరుగైన వైద్యం, అందుబాటులో వైద్య విద్య కొనసాగించాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అనంతపురం, రాప్తాడు, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవ కొండ నియోజకవర్గాల్లో 2.80 లక్షల మంది ఇప్పటి దాకా సంతకాలు చేశారు. ముఖ్యంగా యువత, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. సింహభాగం సంతకాలు విద్యార్థులవే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం తమ భవిష్యత్తును పెత్తందార్లకు ఫణంగా పెట్టిందని విద్యార్థులు, యువత భావిస్తుండడమే ఇందుకు నిదర్శనం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర ప్రైవేటీకరణతో పేదలకు మెరుగైన వైద్యం, వైద్యవిద్య దూరం సర్కారు తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ పార్టీలకతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తల భాగస్వామ్యం -
అన్నదాతను ఆదుకునే మనసు లేదు
● స్వప్రయోజనాల కోసమే బాబు పాకులాట ● అచ్చెన్న వ్యాఖ్యలపై ‘అనంత’ ధ్వజంఅనంతపురం: అన్నదాతను ఆదుకునే మనసు చంద్రబాబు ప్రభుత్వానికి లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. పాత కేసుల మాఫీ కోసం 15రోజులకోసారి ప్రధాని మోదీని కలవడం మోకరిల్లడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని విమర్శించారు. పుట్లూరు మండలం ఎల్లుట్లలో అరటి రైతు నాగలింగమయ్య ఆత్మహత్య ఘటనను వైఎస్సార్సీపీ శవరాజకీయాల కోసం వాడుకుంటోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను అనంత ఖండించారు. బాధిత కుటుంబానికి ఆత్మస్థైర్యం కలిగించడంతో పాటు పాటు రైతాంగానికి తోడుగా ఉంటామని చెప్పడం కోసమే తాము ఎల్లుట్లకు వెళ్లామని చెప్పారు. రైతులను ఆదుకోవాలని కోరితే శవ రాజకీయాలు చేస్తున్నామని వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థ విధానాల వల్లే రైతులు శవాలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టానికి విరుద్ధంగా రైతు నాగలింగమయ్య మృతదేహానికి తెల్లవారుజామునే పోస్టుమార్టం చేసి.. గ్రామానికి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కనీసం బంధుమిత్రులందరూ వచ్చే అవకాశం కూడా లేకుండా పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేయిస్తారా అని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీం పవన్కళ్యాణ్, నారా లోకేష్లు ఢిల్లీ వెళ్లి గిట్టుబాటు ధరల కోసం ప్రధాని మోదీని డిమాండ్ చేయాలని సూచించారు. రైతులెవరూ నిరాశ చెందవద్దని, చావు పరిష్కారం కాదని, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని కుటుంబాలను కష్టాల్లోకి నెట్టవద్దని అన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకెళ్దాం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో అంబేడ్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ స్వయం శక్తి, కృషితో మహోన్నతమైన స్థానానికి చేరిన అంబేడ్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంబేడ్కర్ దార్శనికతను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో చూపించిన అంశాన్ని గుర్తు చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ అవకాశాలు కల్పించారని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీచైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, అనంత చంద్రారెడ్డి, మీసాల రంగన్న, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్రెడ్డి, వాసంతి సాహిత్య, నాయకులు అశ్వర్థ నాయక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబులేసు, వీరాంజినేయులు, వెన్నం శివరామిరెడ్డి, నాగన్న, రంగంపేట గోపాల్రెడ్డి, ఆలమూరు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
రూ.10 వేల అప్పు మాఫీ కోసమే విజయలక్ష్మి హత్య
గుత్తి: గత నెల 28న హత్యకు గురైన దుద్దేకుంట విజయలక్ష్మి కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. శనివారం సాయంత్రం గుత్తి పోలీసు స్టేషన్లో కేసు వివరాలను సీఐ రామారావు, ఎస్ఐ సురేష్తో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. పట్టణానికి చెందిన దుద్దేకుంట విజయలక్ష్మి అనే మహిళ ఇంట్లో ఆటో డ్రైవర్ రాము, భార్య అలీసమ్మ అద్దెకుంటున్నారు. విజయలక్ష్మి నుంచి రాము రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. అసలు చెల్లించలేదు. వడ్డీ కట్టలేదు. విజయలక్ష్మిని చంపేస్తే అప్పు మాఫీ అవుతుందని ఆమెను హత్య చేసేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో గత నెల 26న విజయలక్ష్మి తోట నుంచి ఇంటికి వెళ్తుండగా రాము, అలీసమ్మ అడ్డగించారు. ఆమెను గొంతు నులిమి చంపారు. ఆమె మెడలో ఉన్న 22 గ్రాముల బంగారు గొలుసు లాక్కున్నారు. మృతదేహాన్ని ఆటోలో వేసుకొని గుంతకల్లు మండలం వైటీ చెరువు గ్రామ చెరువులో పడేశారు. విజయలక్ష్మి కొడుకు, సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కేసును ఛేదించడానికి పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడ్డారు. అలీసమ్మ ఫోన్కు కొసమట్టం ఫైనాన్స్ కంపెనీ నుంచి తరచూ మెసేజ్లు వచ్చాయి. రాము, అలీసమ్మపై అనుమానంతో మెసేజ్లు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పోలీసులు చాక చక్యంగా కేసును ఛేదించారు. పోలీసులు రాము ఆటోను సీజ్ చేసి, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా రిమాండ్కు జడ్జి ఆదేశించినట్లు సీఐ చెప్పారు. కేసును ఛేదించిన సీఐ రామారావు, ఎస్ఐ సురేష్, కానిస్టేబుళ్లు భాస్కర్ నాయుడు, కిశోర్, అశోక్ ప్రత్యేక బృందాలను ఎస్పీ జగదీష్, డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రమేష్బాబు అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పి.రమేష్బాబు (రెవెన్యూ) ఎన్నికయ్యాడు. శనివారం నగరంలోని ప్రభుత్వ డ్రైవర్ల సంఘం భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్జీఓ జిల్లా జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, సిటీ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, ఆలిండియా గవర్నమెంట్ డ్రైవర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ వై.నాగేశ్వరావు హాజరయ్యారు. వారి సమక్షంలో రమేష్బాబును జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో డ్రైవర్లు పి. నాగభూషణం. హెచ్ఎం బాషా, మల్లికార్జున, అయూబ్, నారాయణస్వామి, ఖాజా సాబ్, బాబు, వెంకటరాముడు, విశ్రాంత ఉద్యోగులు ఎన్ఎస్ వరదరాజులు, భాస్కర్ పాల్గొన్నారు. -
పోలీసు శాఖలో హోంగార్డుల వ్యవస్థ కీలకం
● జిల్లా ఎస్పీ జగదీష్ ● ఘనంగా హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం అనంతపురం సెంట్రల్: పోలీసుశాఖలో హోంగార్డు వ్యవస్థ కీలకంగా మారిందని జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. శనివారం పోలీసు పరేడ్ మైదానంలో 63వ హోంగార్డుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా ఎస్పీ సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డులు పోలీసులతో సమానంగా అన్ని రకాల సేవలు అందిస్తున్నారన్నారు. సాధారణ విధుల నుంచి క్లిష్టతర విధుల్లోనూ పాల్గొంటున్నారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, డ్రైవింగ్, కంప్యూటర్ తదితర విధుల్లో వారి పాత్ర కీలకంగా ఉంటోందన్నారు. హోంగార్డుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారి పిల్లలు చదువుల ప్రోత్సాహంలో భాగంగా మెరిట్ స్కాలర్షిప్లు ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం హోంగార్డుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ రకాల పోటీల్లో ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ఎస్పీ ప్రశంసాపత్రాలు, మెమొంటోలు అందించారు. 500 మందికి బందోబస్తు విధుల టీషర్టులు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్బాషా, డీఎస్పీలు శ్రీనివాసరావు, మహబూబ్బాషా, నీలకంఠేశ్వరరెడ్డి, పలువురు సీఐలు, ఏఆర్ సిబ్బంది, పోలీసు అధికారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. బైక్ అదుపు తప్పి యువకుడి మృతి గుత్తి రూరల్: కరిడికొండ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడి జే.రవి(29) మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు..కె.ఊబిచెర్ల గ్రామానికి చెందిన శ్రీరాములు కుమారుడు రవి పెయింటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రవి చిన్న కుమారుడు పవన్కుమార్ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు కేక్ కొనుగోలు చేసేందుకు గుత్తికి వెళ్లి వస్తుండగా, రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య శారద, కుమారులు కరుణకుమార్, పవన్కుమార్ ఉన్నారు. -
గంగదేవిపల్లిలో ఉమ్మడి జిల్లా ‘సీడీసీ’ బృందం అధ్యయనం
గీసుకొండ: జాతీయ ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో జరిగిన అభివృద్ధిని శ్రీసత్యసాయి జిల్లా అగళి, అనంతపురం జిల్లా పుట్లూరు మండలాలకు చెందిన కమ్యూనిటీ డెవలప్మెంట్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు శుక్రవారం అధ్యయనం చేశారు. రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్టు సీనియర్ ట్రస్టీ రామాంజనేయులు, రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఓబులేసు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు నాగమణి, ఆంజనేయులు, బాలవికాస సీనియర్ అసోసియేట్ కొట్టె రమాదేవితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామం సాధించిన ప్రగతి, విజయాలను జిల్లా ట్రైనింగ్ మేనేజర్లు కూసం రాజమౌళి, వనపర్తి కరుణాకర్ వివరించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు మేడిద సుశీల, గూడ సరోజన తదితరులు పాల్గొన్నారు. -
పలు చోట్ల షీప్ సొసైటీ ఎన్నికలు వాయిదా
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల (షీప్ సొసైటీ) ఎన్నికలకు సంబంధించి తొలి విడతగా శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 55 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించారు. రికార్డులు సరిగా లేకపోవడం, ఉన్న వాటిని అధికారులకు సమర్పించకపోవడం, అలాగే చిన్నపాటి తగాదాలు, అధికార పార్టీ ఒత్తిళ్లు తదితర కారణాలతో కంబదూరు మండలం చెన్నంపల్లి, కుందుర్పి మండలం బెస్తరపల్లి, కనగానపల్లి మండలం దాదులూరు, రొద్దం మండలం తురకలాపట్నం, శింగనమల మండలం సలకంచెరువుతో పాటు మరికొన్ని సొసైటీల్లో ఎన్నికలు ఆగినట్లు సమాచారం. ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికల అధికారుల ద్వారా పూర్తిస్థాయి సమాచారం శనివారం అందే పరిస్థితి ఉందని పశుసంవర్ధకశాఖ అధికారులు డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి, డాక్టర్ గోల్డ్స్మన్ తెలిపారు. ఈ నెల 12న రెండో విడతగా 29 సొసైటీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. చాలాచోట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు రంగంలోకి దిగి ఏకగ్రీవం చేసుకున్నట్లు చెబుతున్నారు. పంపిణీకి సిద్ధంగా చేపపిల్లలు అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలోని అధీకృత రిజర్వాయర్లలో పెంపకం చేపట్టేలా వచ్చే వారంలో ఉచితంగా 50.34 లక్షల చేపపిల్లల పంపిణీకి మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. గుమ్మగట్ట మండలంలోని బీటీపీ, గార్లదిన్నె మండలంలోని ఎంపీఆర్, రామగిరి మండలంలోని అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులోకి గతంలో ఉచితంగా చేపపిల్లలు వదులుతూ వచ్చారు. ఈ సారి అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్లో తగినన్ని నీళ్లు లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ను తప్పించి, ఆ స్థానంలో గండికోట రిజర్వాయర్ను చేర్చారు. దీంతో గండికోట రిజర్వాయర్లో 36.75 లక్షలు, ఎంపీఆర్లో 7.76 లక్షలు, బీటీపీలో 5.83 లక్షలు చేపపిల్లలు వదలనున్నారు. ఇవి కాకుండా ఎస్సీ ఎస్టీ వర్గాల మత్స్యకారులకు 40 శాతం రాయితీతో, మిగిలిన మత్స్యకారులకు 60 శాతం రాయితీతో చేపపిల్లలు పంపిణీ చేయనున్నారు. శిశుగృహ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనంతపురం సెంట్రల్: శిశుగృహలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ అరుణకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేనేజర్, సోషల్ వర్కర్, నర్సు, ఆరుగురు ఆయాలు (ఓసీ–3, ఎస్సీ–2, బీసీ 1), వాచ్మెన్, డాక్టర్ (పార్ట్ టైం) పోస్టులు భర్తీ చేయనున్నారు. డాక్టర్ పోస్టు మినహా మిగిలిన పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 8 నుంచి 14వ తేదీలోపు అందజేయాలి. పూర్తి వివరాలకు https://ananthapura mu.ap.gov.in/ వెబ్సైట్ను పరిశీలించవచ్చు. పోలీసులకు ఇరువురు మహిళల అప్పగింత తాడిపత్రి రూరల్: పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చారన్నా అనుమానంతో ఇరువురు మహిళలను పోలీసులకు గ్రామస్తులు అప్పగించారు. తాడిపత్రి మండలం అయ్యవారిపల్లిలో శుక్రవారం ఉదయం ఇరువురు మహిళలు పూసలు అమ్ముతూ చిన్నారులతో సన్నిహితంగా మాట్లాడుతుండడం గమనించిన స్థానికులు వారి వద్దకెళ్లి ఆరా తీశారు. ఆ సమయంలో పొంతన లేని సమాధానాలతో దాట వేసే ప్రయత్నం చేయడంతో అనుమానం వచ్చి ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. ఇసుక రీచ్లో వాటా కోసం రచ్చ యల్లనూరు: ప్రభుత్వ ఇసుక రీచ్లో వాటా కావాలంటూ ఓ టీడీపీ నేత దౌర్జన్యానికి దిగిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన అనిల్కుమార్, మరికొందరు యల్లనూరులోని చిత్రావతి నదిలో ఇసుక రీచ్ను ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నారు. కొంత కాలంగా ఈ రీచ్లో తనకు వాటా కావాలంటూ మండల టీడీపీ కన్వీనరు దొడ్లో రామాంజనేయులు గొడవపడుతూ వస్తున్నాడు. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ ఇసుక తరలిస్తామంటే కుదరదంటూ గురువారం అర్ధరాత్రి తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రామకృష్ణ అక్కడకుచేరుకుని సర్దిచెప్పడంతో వివాదం అప్పటికి సద్దుమణిగింది. కాగా, ఈ విషయం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ దృష్టికి వెళ్లడంతో ఆమె ఇద్దరికీ సర్దిచెప్పిట్లుగా సమాచారం. గొంతెండుతున్నా పట్టించుకోరా? కుందుర్పి : వారం రోజులుగా తాగునీరు రావడం లేదని స్థానిక విద్యుత్ కాలనీ, కలిశప్ప గుట్ట కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో శుక్రవారం నిరసన తెలిపారు. వందలాదిమంది మహిళలు తరలిరావడంతో కెనరాబ్యాంకు కూడలిలో రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. తాగునీటి సమస్య ఉందని లిఖితపూర్వకంగా ఇచ్చినా పెడచెవిన పెడతారా అంటూ మండిపడ్డారు. తనను గెలిపిస్తే తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన అమిలినేని సురేంద్రబాబు.. ఎమ్మెల్యే అయ్యాక దానిని మరచిపోయారన్నారు. వాహనాల రాకపోకలు స్తంభించిపోవడంతో పోలీసులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సాయంత్రం ఎంపీడీఓ మాధవి వచ్చి వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
చియ్యేడులో అగ్ని ప్రమాదం
● వంట గ్యాస్ లీకై చెలరేగిన మంటలు ● మహిళకు తీవ్ర గాయాలు రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం చియ్యేడు గ్రామంలో వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన వడ్డే శ్రీనివాసులు, సాలమ్మ దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ఇంటికి తాళం వేసి ధర్మవరంలో నివాసముంటున్న కుమార్తె, అల్లుడుని పలకరించేందుకు వెళ్లారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఇంటి బయట భార్యను వదిలి వడ్డే శ్రీనివాసులు పని కోసం వెళ్లిపోయాడు. అప్పటికే వంట గ్యాస్ లీకై ఇల్లంతా వ్యాపించింది. తలుపులు తీసి లోపలకు ప్రవేశించిన సాలమ్మ లైట్ స్విచ్ వేయడంతో ఒక్కసారిగా పెద్దశబ్ధంతో మంటలు చెలరేగాయి. ఘటనలో సాలమ్మ తీవ్రంగా గాయపడింది. చుట్టుపక్కల వారు స్పందించి వెంటనే సాలమ్మను అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. 80 శాతం కాలిన గాయాలైనట్లుగా గుర్తించిన వైద్యుల సూచన మేరకు... మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. కాగా, పేలుడు ధాటికి శ్రీనివాసులు ఇంటితో పాటు ఇరువైపులా ఉన్న సోదరుల ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి పోలీసులు, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. -
కణేకల్లులో టీడీపీ మూకల దుశ్చర్య
● వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కణేకల్లు: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం కణేకల్లు నడిబొడ్డున ఉండటాన్ని టీడీపీ మూకలు జీర్ణించుకోలేకపోయాయి. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి వైఎస్సార్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు కడుతూ వస్తున్నారు. అయినా వైఎస్సార్సీపీ శ్రేణులు సహనం కోల్పోలేదు. దీన్ని అలుసుగా తీసుకుని మరో అడుగు ముందుకు వేశారు. శుక్రవారం రాత్రి కళేకుర్తికి చెందిన టీడీపీ కార్యకర్త ధనుంజయ్య బస్టాండ్ ప్రాంతంలోని వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నాడు. తొలుత చేయి విరగ్గొట్టాడు. స్థానిక ప్రజలు గమనించి తిరగబడ్డారు. అయితే అప్పటికే విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్త ధనుంజయ్యను అదుపులో తీసుకున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్త దుశ్చర్యను నిరసిస్తూ పోలీసు స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు ధర్నా చేశారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పాటిల్ బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.ఉషారాణి, జిల్లా ఉపాధ్యక్షులు మారెంపల్లి మారెన్న, కణేకల్లు పట్టణ మాజీ కన్వీనర్ టి.కేశవరెడ్డి, అనుబంధ సంఘాల నేతలు ఆర్కే బద్రీ, ఆదిసద్గురు చంద్రశేఖర్రెడ్డి, వేమనతోపాటు పలువురు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎస్ఐ నాగమధును కలసి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు గౌని ఉపేంద్రరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మాధవరెడ్డి, నాయకులు వెంకటరెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి..టీడీపీ వర్గీయుల దుశ్చర్యను ఖండించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పేరం స్వర్ణలత
అనంతపురం/తాడిపత్రి టౌన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర నూతన సంయుక్త కార్యదర్శిగా తాడిపత్రికి చెందిన పేరం స్వర్ణలత నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ట్స్ కళాశాలలో పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు అనంతపురం సిటీ: జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మశ్రీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీజీసెట్ రాయని వారితో పాటు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి. ఎంఏ ఇంగ్లిష్, తెలుగు, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఎంకామ్, ఎమ్మెస్సీ బొటనీ, జువాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, జియాలజీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమ్యాటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి. అడ్మిషన్ పొందిన వారు అదే రోజు కోర్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రణాళిక రూపొందించండి అనంతపురం అర్బన్: ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) అమలుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎండీడీకేవై అమలుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాస్థాయితో పాటు మండలస్థాయిలోనూ ప్రణాళికలు రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఉద్యాన శాఖ డీడీ ఉమాదేవి, డీసీఓ అరుణకుమారి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్చంద్, కేవీకే శాస్త్రవేత్త మల్లేశ్వరి, డ్వామా పీడీ సలీమ్బాషా, ఎల్డీఎం నరేష్రెడ్డి, డీఆర్డీఏ పీడీ శైలజ, పరిశ్రమల శాఖ ఏడీ రాజశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులను తీర్చిదిద్దాలి
ఆత్మకూరు: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆనంద్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం)– 3.0 నిర్వహించారు. ముఖ్య అతిథి కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఇతర అంశాల్లో ఏది ఇష్టమో తెలుసుకుని అందులో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. తాను చదువుకునే రోజుల్లో తన తల్లి రోజూ గంట సమయం కేటాయించి.. ఏం చదువుతున్నానో తెలుసుకునేదన్నారు. తల్లి ప్రత్యేక కృషి వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, హెచ్ఎం లక్ష్మిదేవి, సర్పంచ్ వరలక్ష్మి, ఎంపీపీ సుబ్బర హేమలత, ఎంపీడీఓ లక్ష్మినరసింహ, ఎంఈఓలు నరసింహారెడ్డి, రామాంజినేయులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శివకుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు లావణ్య, శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలతో అనర్థాలు బాల్య వివాహాలను నిర్మూలించేందుకు దేశ వ్యాప్తంగా చేపట్టిన ‘బాల వివాహ్ – ముక్త్ భారత్’ వంద రోజుల ఇంటెన్సివ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ సిబ్బందితో కలిసి కలెక్టర్ ఆనంద్ అవగాహన కల్పించారు. దుగుమర్రి వీఆర్వో సస్పెండ్ శింగనమల(నార్పల): నార్పల మండలం దుగుమర్రి వీఆర్వో వెంకోబారావుపై సస్పెన్షన్ వేటు పడింది. రంగాపురానికి చెందిన రైతు నాగార్జునతో మ్యుటేషన్ కోసం వీఆర్వో రూ.38 వేలు లంచం డిమాండ్ చేసిన విషయం విదితమే. దీంతో జిల్లా రెవెన్యూ అధికారులు విచారణ జరిపి.. కలెక్టర్కు నివేదిక పంపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వీఆర్వో వెంకోబారావును సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నేడు సీఎస్ విజయానంద్ రాక అనంతపురం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్ శనివారం అనంతపురం రానున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 11.45 గంటలకు కలెక్టరేట్లో పీఎం కుసుమ్, పీఎం సూర్యాఘర్, ఎన్ఆర్ఈడీసీపీ ప్రాజెక్టులపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించనున్నారని పేర్కొన్నారు. రాత్రికి అనంతపురంలోనే బసచేసి, ఆదివారం ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళతారని వెల్లడించారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు అనంతపురం మెడికల్: చిన్నారుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపరాదని డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి హెచ్చరించారు. పుట్టినప్పటి నుంచే వారికి స్క్రీనింగ్ చేసి, ముందస్తు వైద్య సేవలందించాలని సూచించారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో పీహెచ్సీల్లో విధులు నిర్వర్తించే సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. ఏ శిశువూ వైద్యపరమైన లోపాలతో పుట్టకూడదన్నారు. పిల్లల్లో ఎవరికై నా ఎదుగుదల సమస్య ఉంటే ప్రారంభదశలోనే గుర్తించి సేవలందిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ శశిభూషణ్రెడ్డి, వైద్యులు డాక్టర్ శంకర్ నారాయణ, డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ రాధిక, పల్లవి తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతల ఆక్రందనలు పట్టవా..?
పుట్లూరు: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు ఆక్రందనలు చేస్తుంటే చంద్రబాబు సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. అరటికి గిట్టుబాటు ధర లేక..పంట కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించ ఆత్మహత్య చేసుకున్న రైతు నాగలింగమయ్య అంత్యక్రియలు శుక్రవారం ఎల్లుట్ల గ్రామంలో జరిగాయి. ఈ సందర్భంగా అనంత, శైలజానాథ్ హాజరై రైతు మృతదేహంపై పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రైతు నాగలింగమయ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని స్పష్టం చేశారు. వ్యాపారంలో నష్టం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించడానికి కష్టపడేదానికన్నా రైతులను ఆదుకుని ఉంటే ఇంతటి దారుణం జరిగేది కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు సినిమా టికెట్లు పెంచడంపై ఉన్న శ్రద్ధ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటయ్యేలా మద్దతు ధర ప్రకటించడంపై ఎందుకు లేదని నిలదీశారు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే.. తెల్లారకముందే డాక్టర్లను రప్పించి పోస్టుమార్టం చేయించి.. భారీపోలీసు బలగాల నడుమ అంత్యక్రియలు నిర్వహించాలని చూడటమంటే.. రైతు ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా అంగీకరించినట్లు కాదా అని ప్రశ్నించారు. రైతులు, కూలీలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ఎవ్వరూ అధైర్యపడవద్దని అన్నారు. వక్రీకరించడం సిగ్గుచేటు అరటికి గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలై రైతు నాగలింగమయ్య పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటే వక్రీకరించడం సిగ్గుచేటని మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. నాగలింగమయ్య అరటి కాయల వ్యాపారని, నష్టం వచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే రైతు ఆత్మహత్య జరిగిందన్నారు. రైతులెవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, మీ కుటుంబానికి అన్యాయం చేయవద్దని చేతులెత్తి మొక్కారు. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ఎవ్వరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని భరోసా కల్పించారు. రైతు నాగలింగమయ్య కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అప్పులు తీర్చాలని, పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ఇకనైనా ముందుకు వచ్చి గిట్టుబాటు ధరతో అరటి కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర వలంటీర్ కార్యదర్శి జయరాంరెడ్డి, ఎస్సీసెల్ నాయకులు శివశంకర్, మండల కన్వీనర్లు పొన్నపాటి మహేశ్వరరెడ్డి, గువ్వల శ్రీకాంత్రెడ్డి, ఎల్లారెడ్డి, పూల ప్రసాద్, ఖాదర్వలి, జెడ్పీటీసీ నీలం భాస్కర్, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు నాగలింగమయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తదితరులురైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చేతులెత్తి మొక్కుతున్న మాజీ మంత్రి శైలజానాథ్, చిత్రంలో అనంత తదితరులు సినిమా టికెట్లు పెంచేందుకు సై.. పంటలకు గిట్టుబాటు కల్పించేందుకు నై చంద్రబాబు సర్కారుపై అనంత, శైలజానాథ్ ధ్వజం -
కరోనా విలయతాండవం మొదలైన 2020 మార్చిలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అన్ని వర్గాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించారు. భారతదేశం అంతటా విపత్తు సంభవించింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రె
అనంతపురం అగ్రికల్చర్: కరోనా విలయతాండవం మొదలైన 2020 మార్చిలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ఏపీలో అడుగుపెట్టడానికి భయపడ్డారు. చివరకు టీడీపీ నేతలు సైతం కనీసం ప్రజలకు నైతిక స్థైర్యం కల్పించలేక దాక్కున్నారు. లాక్డౌన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయిన విపత్కర పరిస్థితుల్లో వెనుకడుగు వేయకుండా, ముఖ్యంగా రైతులు, పేద వర్గాలకు అడుగడుగునా అండగా నిలబడి ‘నిజమైన పాలకుడి’గా వైఎస్ జగన్ వ్యవహరించిన తీరు గత కొంత కాలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. ఉద్యాన రైతుల కోసం కిసాన్ రైలు కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్లతో దేశవ్యాప్తంగా మార్కెట్లు బంద్ కావడంతో రూ.లక్షలు పెట్టుబడులతో పండించిన ఉద్యాన ఉత్పత్తులు అమ్ముకోలేక రైతులు పడుతున్న అవస్థలపై అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సకాలంలో స్పందించారు. ఎక్కడిక్కడ జిల్లాల పరిధిలో కాల్సెంటర్లు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచారు. స్థానిక అమ్మకాలపై దృష్టి సారించి కనీస పెట్టుబడులకు ఢోకా లేకుండా రూ.1,400 కోట్లు విలువ చేసే 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉద్యాన ఉత్పత్తులు క్రయవిక్రయాలు సాగించడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే అనంతపురం నుంచి నేరుగా ఢిల్లీ, నాగపూర్, ఝాన్సీ, ఆగ్రా మార్కెట్లకు ఉద్యాన ఉత్పత్తులు తరలించే ‘కిసాన్ రైలు’ను 2020, సెప్టెంబర్ 9న ప్రారంభించారు. మొదటి రైలులో 14 వ్యాగన్ల ద్వారా 322 టన్నుల ఉద్యాన ఉత్పత్తులు తరలించారు. ఇందులో 213.5 టన్నుల టమాట, 75 టన్నుల అరటి, 20 టన్నుల చీనీ, 8 టన్నుల కర్భూజా, 3 టన్నుల మామిడి, 2.50 టన్నుల బొప్పాయి ఉన్నాయి. స్పెషల్బోగీ ఏర్పాటు చేయడంతో 11 మంది రైతులు, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, సెర్ఫ్ శాఖల నుంచి 15 మంది అధికారులు కూడా రైలులో ఢిల్లీకి వెళ్లి అక్కడి మార్కెటింగ్ వ్యవస్థపై అధ్యయం చేయగలిగారు. అనంతరం 2020 సెప్టెంబర్ 19న 12 వ్యాగన్ల ద్వారా 240 టన్నులు, అదే ఏడాది అక్టోబర్ 12న 12 వ్యాగన్ల ద్వారా 276 మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు కిసాన్రైలు ద్వారా తరలించారు. అందులో చీనీ, మామిడి, దానిమ్మ, అరటి, టమాట, ఉసిరి, కర్భూజాతో పాటు వేరుశనగ లాంటి వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. నాడు టన్ను చీనీ రూ.లక్ష!వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన చర్యల ద్వారా 2021, 2022, 2023, 2024లో జిల్లాలోని దాదాపు అన్ని రకాల ఉద్యాన ఉత్పత్తులకు ఉత్తర భారతదేశంలో మంచి డిమాండ్ పెరిగింది. 2021లో చీనీ టన్ను ఏకంగా రూ.లక్ష ధర పలికింది. అలాగే అరటి టన్ను రూ.30 వేల మార్క్ను చేరుకుంది. టమాట కూడా ఒకానొక దశలో కిలో రూ.100కు చేరుకుంది. ఇలా వైఎస్ జగన్ హయాంలో మార్కెటింగ్ పరిస్థితులు మెరుగుపడడంతో ఉమ్మడి జిల్లా రైతులకు పూర్తి ఆర్థిక భరోసా దక్కింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యాన ఉత్పత్తులకు గిట్టుబాటు కరువైపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అరటిని రోడ్డున పారబోస్తున్న దుస్థితి నెలకొందంటే రైతుల పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. కష్ట కాలంలో రైతులకు అండగా నిలిచిన జగన్ సర్కార్ కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఉద్యాన రైతులకు అడుగడుగునా ప్రోత్సాహం కిసాన్ రైలు ద్వారా ఢిల్లీ, నాగపూర్ మార్కెట్లకు జిల్లా ఉద్యాన ఉత్పత్తులు -
ఆదుకోనందుకే రైతు ఆత్మహత్యలు
అనంతపురం : చంద్రబాబు ప్రభుత్వం అనంతపురం జిల్లాను రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారుస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన అరటి రైతు నాగలింగమయ్య ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన స్పందించారు. అరటి కిలో రూపాయి చొప్పున కొనుగోలు చేస్తుండటంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అరటి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అరటి రైతు నాగలింగమయ్య ఆత్మహత్యను చంద్రబాబు ప్రభుత్వ హత్యగానే భావించాలని పేర్కొన్నారు. అరటి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ తరఫున వారం, పది రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ధ్వజమెత్తారు. రైతు నాగలింగమయ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఈ సందర్భంగా సూచించారు. -
మళ్లీ మళ్లీ ప్రారంభోత్సవం!
● ముచ్చటగా మూడోసారి డీఎల్డీఓ కార్యాలయం ప్రారంభం గుంతకల్లు: భవనం ఒకటే.. కానీ ప్రారంభోత్సవం మూడోసారి. ప్రచారం కోసం ఇలా పదే పదే ప్రారంభించి చంద్రబాబు ప్రభుత్వం అబాసుపాలైంది. రాష్ట్రంలో 77 డీఎల్డీఓ కార్యాలయాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. ఇందులో గుంతకల్లులోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో డివిజనల్ అభివృద్ధి అధికారి (డీఎల్డీఓ) కార్యాలయం కూడా ఉంది. వాస్తవానికి ఇక్కడి జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని 2017 జూలై 14న అప్పటి ఎమ్మెల్యే ఆర్.జితేంద్రగౌడ్, జిల్లా చైర్మన్ చమన్సాబ్ ప్రారంభించారు. అయితే భవనాన్ని అభివృద్ధి పరచాడానికి రూ.లక్షలు ఖర్చు చేసి తిరిగి డీఎల్డీఓ కార్యాలయంగా నామకరణం చేసి 2024 అక్టోబర్ 16న ప్రసుత్త ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. ఇదే కార్యాలయాన్ని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. పైగా రంగులు, ఫర్నీచర్ కోసం అంటూ తాజాగా రూ.10 లక్షల దాకా నిధులు ఖర్చు చేశారు. గతంలో ప్రారంభించిన భవనాన్ని మళ్లీ మళ్లీ ప్రారంభిస్తూ ఉండడంతో ప్రజలు అవాక్కవుతున్నారు. విద్యుత్ సబ్స్టేషన్దీ ఇదే తీరు స్థానిక ఎమ్మెల్యే మెప్పు కోసం అధికారులు ప్రారంభించిన భవనాలనే మళ్లీ మళ్లీ ఆయన ఓప్రారంభింపజేస్తున్నట్లు అర్థమవుతోంది. పట్టణంలోని సత్యనారాయణ పేట విద్యుత్ సబ్స్టేషన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ సబ్స్టేషన్కు వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి దాదపు రూ. 2 కోట్ల నిధులుతో శంకుస్థాపన, భూమిపూజ చేయగా.. సగం పనులు పూర్తి చేశారు. అయితే ఇటీవల ఈ సబ్స్టేషన్ను తామే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటూ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. అది తాత్కాలిక భవనమే డిప్యూటీ సీఎం వర్చువల్గా ప్రారంభోత్సవం చేసిన డీఎల్డీఓ భవనం తాత్కాలికమే. డీఎల్డీఓ కార్యాలయానికి స్థలం కేటాయించపోవడంతో జిల్లా పరిషత్ అతిథి భవనాన్ని 2024లో మండల పరిషత్ నిధులు ఖర్చు చేసి దెబ్బతిన్న స్లాబ్ను తొలగించచి, అభివృద్ధి పరిచాం. తాజాగా జిల్లా పరిషత్ నిధులతో దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసి ఫర్నీచర్తో పాటు డీఎల్డీఓ కార్యాలయంగా ఆధునికీకరించాం.డీఎల్డీఓ కార్యాలయానికి ప్రత్యేక స్థలం కేటాయిస్తే శాశ్వత భవనం నిర్మించుకుంటాం. – విజయలక్ష్మి, డీఎల్డీఓ, గుంతకల్లు -
కడుపు మంటతో మాట్లాడుతున్నారు
అనంతపురం ఎడ్యుకేషన్: తోపుదుర్తి కుటుంబం వైపు జనం ఉన్నారని కడుపు మంటతో ఎమ్మెల్యే పరిటాల సునీత తనపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. గురువారం వైస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తోపుదుర్తిలో తాను గతంలోనే మంజూరు చేయించిన సబ్స్టేషన్ను ఇప్పుడు ఎమ్మెల్యే ప్రారంభించి బిల్డప్ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు చెన్నేకొత్తపల్లి, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేయిస్తామని చెప్పించి.. తోపుదుర్తి రిజర్వాయర్ గురించి ప్రస్తావన తేలేదని, అంటే ఈ రిజర్వాయర్ను రద్దు చేయించాలనే కదా నీ ఉద్దేశమని నిలదీశారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో ప్రజలను బెదిరించి కాలనీలను కొట్టేయాలని పరిటాల కుటుంబం చూసిందని ధ్వజమెత్తారు. రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల్లో మట్టిని అమ్ముకోవడం, క్రషర్ల వద్ద, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద డబ్బులు వసూళ్లు చేస్తూ, పంచాయతీలకు రావాల్సిన పన్నులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఆత్మకూరు మండలానికి మీరేమి చేశారని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి.. చంద్రబాబును తిట్టారని మూడేళ్ల నుంచి అదే వీడియోను తిప్పితిప్పి చూపిస్తున్నారన్నారు. అప్పట్లో దీనికి ముందురోజు పరిటాల శ్రీరామ్ ‘అయ్యా ప్రకాష్రెడ్డి.. నువ్వు గడపగడపకూ తిరుగుతున్నావు. కొండారెడ్డి హత్య కేసులో ముద్దాయిలు నిన్ను చంపితే మాకు సంబంధం లేదు’ అని మాట్లాడాడని గుర్తు చేశారు. ఇలాంటి వారిని వెనుకేసుకొస్తున్నది చంద్రబాబే కదా అని తోపుదుర్తి చందు మాట్లాడారన్నారు. ‘ఆయన మాట్లాడిన భాష తప్పే. ఉద్దేశం మాత్రం ఇదే’ అని అప్పుడే తాను వివరణ కూడా ఇచ్చానన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయించడం వెనుక పరిటాల శ్రీరామ్ ఉన్నాడని ఆరోపించారు. మహిళలకు ఏమి రక్షణ కల్పించారు? రాప్తాడు నియోజకవర్గంలోని మహిళలకు ఏమి రక్షణ కల్పించారో ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్పాలని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. వేధింపులకు గురైతే పోలీసులు న్యాయం చేయలేదన్న బాధతో చెన్నే కొత్తపల్లికి చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుందన్నారు. రాప్తాడులో సావిత్రమ్మ అనే మహిళను అధికార పార్టీ వాళ్లే చంపించారని, మీ ఊరి పక్కనే దళిత బాలికను గ్యాంగ్రేప్ చేస్తే కనీసం పరామర్శించిన పాపాన పోలేదని నిలదీశారు. గరిమాకులపల్లిలో అంగన్వాడీ టీచరును ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి కొడితే కనీసం మాట్లాడలేకపోయారన్నారు. ‘మజ్జిగ లింగమయ్య హత్యతో మొదలైన నీ పతనం పాపంపేటలో భూముల అక్రమ రిజిస్ట్రేషన్తో సంపూర్ణమైంద’ని పేర్కొన్నారు. ‘జాకీ’పై ప్రమాణానికి సిద్ధమా..? ‘నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో 2018లోనే జాకీ పరిశ్రమ తరలిపోయిందని ఆనాడే ‘సాక్షి’ పత్రిక రాసింది. ఆ జాకీ పరిశ్రమ నువ్వు ఉన్నప్పుడు వెళ్లిపోయిందా? నేను వచ్చిన తర్వాత వెళ్లిపోయిందా? అనే దానిపై కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధమా?’ అని పరిటాల సునీతకు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సవాల్ విసిరారు. ఇళ్ల నిర్మాణాల్లో రూ.80 కోట్లు తాను తిన్నానని మాట్లాడే ప్రతి ఒక్కరిపైనా పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, లోకనాథరెడ్డి, సాకే వెంకటేశు, మీనుగ నాగరాజు, మల్లికార్జున, పోతులయ్య, నీరుగంటి నారాయణరెడ్డి, బాలపోతన్న, సనప గోపాల్రెడ్డి, విశ్వనాథరెడ్డి, బిల్లే పెదయ్య పాల్గొన్నారు. నేను తీసుకొచ్చిన సబ్స్టేషన్ను ప్రారంభించి బిల్డప్పా..? జాకీ పరిశ్రమ ఎవరి హయాంలో పోయిందో ప్రమాణం చేద్దామా..! పరిటాల సునీతపై తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆగ్రహం -
యథేచ్ఛగా మాస్ కాపీయింగ్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న మూడు, ఐదు సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. గురువారం నాటి పరీక్షల్లో ఏకంగా 17 మంది విద్యార్థులు డీబార్ అయ్యారు. అనంతపురం ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాలలో నలుగురు, గుత్తి ఎంఎస్ డిగ్రీ కళాశాలలో ముగ్గురు, హిందూపురం బాలయేసు డిగ్రీ కళాశాలలో ఇద్దరు, బాలాజీ విద్యా మందిర్లో ఎనిమిది మంది మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ పట్టుబడటంతో వారిని డీబార్ చేసినట్లు ఎస్కేయూ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. రికార్డుల సవరణకు అవకాశం అనంతపురం సిటీ: పాఠశాల రికార్డుల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల పేర్లు, ఇతర వివరాలలో తప్పుల సవరణకు అవకాశం కల్పించినట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. రికార్డులను సవరించే అధికారాన్ని మండల, డిప్యూటీ విద్యాధికారులు, గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు కల్పిస్తూ విద్యా శాఖ నుంచి తమకు ఆదేశాలు అందినట్లు వివరించారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు రికార్డుల్లో తప్పుల సవరించుకోవడానికి గడువు ఇచ్చారన్నారు. చదువుల పండుగకూ కటకటే! ● నేడు మెగా పేరెంట్, టీచర్స్ మీటింగ్ అనంతపురం సిటీ: పిల్లల చదువులెట్ల సాగుతున్నాయి.. బడిలో.. తరగతి గదిలో వారి ప్రవర్తన ఎలా ఉంటోంది.. వారు ఇంట్లో ఎలా మసలుకుంటున్నారు.. వారి భవిష్యత్కు ఏం చేస్తే.. ఎలా చేస్తే బాగుంటుందో చర్చించేందుకు మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం–3.0) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 1,752 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు 3 లక్షల మంది దాకా సమావేశానికి హాజరుకానున్నారు. అయితే ప్రభుత్వం జిల్లాకు రూ.49.82 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. అరకొర డబ్బుతో సమావేశాలు ఎలా నిర్వహించాలంటూ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం అనంతపురం అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ పి.జగదీష్, ఆర్అండ్బీ ఎస్ఈ మురళీకృష్ణతో కలిసి జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. నగర పరిధిలో గుర్తించిన 23 పార్కింగ్ ప్రదేశాలను నెల రోజుల్లోగా అందుబాటులోకి తేవాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. రాప్తాడు వద్ద రైల్వే బ్రిడ్జిని రెండు వారాల్లో ప్రారంభించాలన్నారు. మాదకద్రవ్యాలకు అడ్డుకట్టవేయాలి మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలకు అడ్డుకట్టవేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ జగదీష్తో కలిసి నార్కో కో ఆర్డినేషన్ సెంటర్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ‘నశా ముక్త్ భారత్’లో భాగంగా పోలీసు శాఖతో అన్ని శాఖలు సమన్వయం చేసుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 8న పీజీలో స్పాట్ అడ్మిషన్లు అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగులు సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఎస్కేయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ నరసింహన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. తీవ్ర జ్వరంతో చిన్నారి మృతి ఉరవకొండ(విడపనకల్లు): తీవ్ర జ్వరంతో బాధపడుతూ రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాలు... విడపనకల్లుకు చెందిన వినోద్, వసంత దంపతులకు రెండేళ్ల వయసున్న కుమార్తె తనుశ్రీ ఉంది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కుమార్తెకు తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. గురువారం జ్వరం తీవ్రం కావడంతో వెంటనే స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యం అందేలోపు చిన్నారి మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
అరటి రైతుది ప్రభుత్వ హత్యే
శింగనమల : ఎల్లుట్లలో అరటి రైతు నాగలింగం ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంరత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అభివర్ణించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అరటికి మార్కెట్లో కిలో రూపాయిలోపే ధర ఉండటంతో పంట కోసం చేసిన రూ.15 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక రైతు నాగలింగం ఆత్మహత్య చేసుకున్నారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. అరటి రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేసి, హెచ్చరించినా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో రైతు బలయ్యాడని, ప్రభుత్వమే రైతు చావుకు పూర్తి బాధ్యత వహించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టకముందు ఒక మాట, అధికారం చేపట్టిన తర్వాత మరో మాట మాట్లడటం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. అరటి పంటకు మార్కెలో సరైన ధర లేక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఉచిత పంటల బీమాను లక్షల మంది రైతులు సద్వినియోగం చేసుకున్నారన్నారు.పూట్లూరు మండలం ఎల్లుట్లలో శుక్రవారం పర్యటించి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన రైతు నాగలింగం కుటుంబాన్ని పరామర్శిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటికై నా రైతులను ఆదుకోక పోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
ఇటీవల వ్యవసాయశాఖ నిర్వహించిన ‘రైతన్నా.. మీకోసం’ ప్రభుత్వ ప్రచార వేదికగా మారిపోయింది. అరచేతిలో వైకుంఠం చూపించడం, అబద్ధాలతో మోసం చేయడం, రైతు చెవిలో పూలు పెట్టడంలో ఆరితేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు ‘రైతన్నా మీ కోసం’ అంటూ లేని గొప్పలు చెప్పుకునేందుకు వేసిన ఎత్తు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో నవంబర్ 24 నుంచి 29 వరకు నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం అట్లర్ ఫ్లాప్ అయ్యింది. తొలిరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడక్కడా హాజరై ఫొటోలకు ఫోజులిచ్చి.. తర్వాత పత్తా లేకుండా పోయారు. చేసేది లేక మండలస్థాయి అధికారులు, ఆర్ఎస్కే అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది అయిష్టంగానే మిగతా ఐదు రోజులు కొనసాగించారు. ఆరు రోజుల పాటు గ్రామాలకు వెళ్లి అధికారులు నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ కింద జిల్లా వ్యాప్తంగా 442 ఆర్ఎస్కేల పరిధిలో 2,82,547 మంది రైతులను కలిసినట్లు నివేదిక తయారు చేశారు. ఇంటింటికీ వెళ్లి రైతులను కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు వివరిస్తూనే రైతుల మొబైల్లో ‘ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్’ యాప్ డౌన్లోడ్ చేయించినట్లు పేర్కొన్నారు. అక్కడక్కడా ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు కొందరు మొక్కుబడిగా పాల్గొన్నారు. అలాగే ఈ నెల 3న ఆర్ఎస్కే వేదికగా వర్క్షాపులు నిర్వహించి కార్యక్రమాన్ని ముగించినట్లు అధికారులు ప్రకటించారు. 2026 ఖరీఫ్, రబీ, 2027 ఖరీఫ్కు సంబంధించి యాక్షన్ ప్లాన్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. అసంతృప్తులు.. నిలదీతలు ‘రైతన్నా మీ కోసం’ అంటూ అధికారులు గ్రామాలకు వెళ్లి పంచసూత్రాల కరపత్రం, మొబైల్ యాప్తో సరిపెట్టడంతో పలువురు రైతులు సమస్యలపై నిలదీసినట్లు తెలుస్తోంది. ‘రెండేళ్లవుతున్నా ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినా మాకు రాలేదు. పీఎం కిసాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బ్యాంకులు, అధికారులు చుట్టూ తిరుగుతున్నా సాయం అందడం లేదం’టూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అరటి, చీనీ, వరి, వేరుశనగ, మొక్కజొన్న, పత్తి, ఆముదంకు గిట్టుబాటు ధరలు లేక పంటలను వదిలేస్తున్నామంటూ ఆక్రోశించారు. పల్లె పల్లెలోనూ రైతులు ప్రశ్నల వర్షం కురిపించడంతో నీళ్లు నమలడం మినహా అధికారులు హామీ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ముందుగానే ఊహించిన ప్రజాప్రతినిధులు, స్థానిక చోటామోటా నాయకులు కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం. రైతుల నుంచి నిలదీతలు ఎక్కువ కావడంతో అధికారులు కూడా ఇంటింటికీ వెళ్లడం మానేసి ఓ పది మంది రైతులను గుట్టుగా పిలిపించుకుని కరపత్రాలు ఇచ్చేసి వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ ముద్ర వేసి మరికొందరు రైతులను కలవకుండానే కలిసినట్లుగా నివేదించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు మున్ముందు అది చేస్తారు, ఇది చేస్తారు అంటూ అధికారులు కూడా అబద్ధాలు చెప్పి ఎలాగోలా కార్యక్రమాన్ని ముగించి ఊపిరి పీల్చుకున్నారు. ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో అధికారులు నాతో పాటు చాలామంది రైతులను కలవనే లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈసారి అరకొరగా అన్నదాత సుఖీభవ సాయం తప్ప చేసిందేమీ లేకపోవడంతో రైతుల్లో నమ్మకం సన్నగిల్లిపోయింది. అందుకే కార్యక్రమానికి వెళ్లడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదు. – ఎం.నారాయణస్వామి, ఎల్లుట్ల, పుట్లూరు మండలం రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఇటీవల నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ వల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనమూ లేదు. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో చాలామంది రైతులు మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రూ.80 వేలు పెట్టుబడి పెట్టి 4 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. 100 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినా ధరల్లేక తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. రైతన్నా మీ కోసంలో న్యాయం చేస్తామన్న వాళ్లు మళ్లీ కనిపించడం లేదు. – గొల్ల నారాయణస్వామి, ముద్దలాపురం ఫలితమివ్వని ‘రైతన్నా మీ కోసం’ తొలిరోజు ఫొటోలకు ఫోజులిచ్చి తర్వాత కనిపించని ప్రజాప్రతినిధులు రైతులకు సాయమందించకున్నాప్రచారం కోసం రూ.కోట్లు వెచ్చించిన సర్కారు -
నీటి సరఫరాలో నిర్లక్ష్యం వీడండి
పుట్లూరు: వర్షాభావ పరిస్థితులతో వట్టిపోయిన చెరువులకు నీటిని సరఫరా చేయడంలో మరీ ఇంత నిర్లక్ష్యం తగదని, ఇప్పటికై నా స్పందించి వెంటనే చెరువులను నీటితో నింపాలని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి వైఎస్సార్సీపీ నాయకులు సూచించారు. గురువారం పుట్లూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే అధ్యక్షతన ప్రజాదర్బార్ నిర్వహించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మహేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి విష్ణునారాయణ తదితరులు ఎమ్మెల్యేను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. చెరువులకు నీటి సరఫరాతో పాటు అరటి రైతులను ఆదుకోవాలని కోరారు. సుబ్బరాయసాగర్ వద్ద గేట్లు మరమ్మతులకు గురి కావడంతో నీటి సరఫరా ఆలస్యమైనట్లు ఎమ్మెల్యే తెలపడంతో నాయకులు అసహనం వ్యక్తం చేశారు. అరటి రైతుల సమస్యలు వివరిస్తుండగా వైఎస్సార్సీపీ నేతలను సీఐ సత్యబాబు, పోలీసులు అడ్డుకుని బలవంతంగా అక్కడి నుంచి పక్కకు లాక్కెళ్లారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి రమణాయాదవ్, నాయకులు నాగేశ్వరరెడ్డి, సురేష్రెడ్డి, నారాయణస్వామి, శేఖర్, సాంబశివారెడ్డి పాల్గొన్నారు. -
షీప్ సొసైటీ ఎన్నికలకు వేళాయె
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల (షీప్ సొసైటీ)కు ఎన్నికలు నిర్వహించడానికి పశుసంవర్ధకశాఖ షీప్ డెవలప్మెంట్ విభాగం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 350 సొసైటీలు రిజిస్టర్ చేసుకోగా... అందులో డిపార్ట్మెంట్ యూనియన్ పరిధిలో 215 సొసైటీలు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఉమ్మడి జిల్లా పరిధిలో 130 సంఘాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. పెండింగ్లో ఉన్న 84 సొసైటీలకు డిసెంబర్ 5, 12న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న మదిగుబ్బ సొసైటీకి ఎన్నిక నిలిపివేశారు. 2018లో ఎన్సీడీసీ కింద రూ.10.66 కోట్ల రుణాల పంపిణీకి సంబంధించి సక్రమంగా కంతులు కట్టని 342 మందిని డిఫాల్టర్ జాబితాలో పెట్టినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. డీ–ఫాల్టర్లకు ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఓటు వేయడానికి అర్హత లేదన్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 45 సొసైటీలకు, శ్రీ సత్యసాయి జిల్లాలో 39 సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి విడత కింద ఈనెల 5న 55 సొసైటీలకు, రెండో విడతగా ఈనెల 12న 29 సొసైటీలకు ఎన్నిక జరగనుంది. ప్రాథమిక స్థాయిలో ఎన్నికలు పూర్త్తి కాగానే జిల్లా యూనియన్కు ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిసింది. ఒక్కో సొసైటీలో ఏడు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి తర్వాత ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నట్లు షీప్ డెవలప్మెంట్ ఏడీ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి తెలిపారు. కాగా, పార్టీలకు అతీతంగా జరుగుతున్న షీప్ సొసైటీ లను ఎలాగైనా దక్కించుకునేందుకు ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ‘పచ్చ’ నాయకులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. గత జనవరి, ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో సైతం తెలుగు తమ్ముళ్లు చాలా చోట్ల బెదిరింపులకు దిగి పాగా వేసిన విషయం తెలిసిందే. తొలివిడత ఎన్నికలు జరగనున్న సొసైటీలివే.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపు (శుక్రవారం) తొలివిడతగా 55 షీప్ సొసైటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో అనంతపురం జిల్లా పరిధిలో పంపనూరు, పాపంపల్లి, సనప, నీలంపల్లి, వెంకటాపురం, పి.యర్రదొడ్డి, నెలగొండ, సంగాల, ఈస్ట్కోడిపల్లి, ఎం.వెంకటాంపల్లి, పి.చెన్నంపల్లి, ఓబగానపల్లి, ఉదిరిపికొండ, బెస్తరపల్లి, బొందలవాడ, చామలూరు, ఎద్దులపల్లి, నరసాపురం, జూటూరు, బండార్లపల్లి, గాండ్లపర్తి, భోగినేపల్లి, సలకంచెరువు, గడేహొత్తూరు, హావలిగి ఉండగా... శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో మందనకుంట, ధేమకేతేపల్లి, గౌనివారిపల్లి, బాలంపల్లి, చలివెందుల, పరిగి, చాలకూరు, మాగేచెరువు, పత్తికుంటపల్లి, సోమందేపల్లి, గొడ్డువెలగల, డబురువారిపల్లి, వంచిరెడ్డిపల్లి, వెంకటగిరిపాలెం, రాంపురం, వెంగలమ్మచెరువు, కోగిర, ఎం.కొత్తపల్లి, రొద్దం, తురకలా పట్నం, యర్రాయపల్లి, హరియాణ్చెరువు, బిల్వంపల్లి, దాదులూరు, భానుకోట, కొండపల్లి, కేఎన్ పాళ్యం, తగరకుంట, గంగరెడ్డిపల్లి, దుబ్బార్లపల్లి సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 12న 29 సొసైటీలకు.. రెండో విడత కింద ఈ నెల 12న ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 29 సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు 55 సొసైటీలకు, 12న 29 సొసైటీలకు ఎన్నికలు వీటిని దక్కించుకునేందుకు టీడీపీ నాయకుల కుయుక్తులు -
జగన్తోనే దివ్యాంగుల సంక్షేమం
అనంతపురం: ఒకే దఫా రెండు లక్షల పింఛన్లు దివ్యాంగులకు ఇచ్చి వారి సంక్షేమానికి కృషి చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి ‘అనంత’ ముఖ్య అతిథిగా, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, పీఏసీ సభ్యుడు వై. విశ్వేశ్వర రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి దివ్యాంగులకు పంచి పెట్టారు. అనంతరం విలేకరులతో ‘అనంత’ మాట్లాడుతూ దొంగ పింఛన్లు తీసుకున్నారంటూ దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే దివ్యాంగులకు దన్నుగా నిలిచారని కొనియాడారు. వారికి అన్ని విధాలుగా ప్రాధాన్యత కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్లలో కోత వేయాలని, కొందరు దివ్యాంగులకు అన్యాయం చేయాలని చూసిందని, దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేసిన దివ్యాంగులకు అభినందనలు తెలిపారు. అదే స్ఫూర్తితోనే ముందుకు వెళ్లాలని సూచించారు. దివ్యాంగులపై దృష్టి పెట్టాలి దివ్యాంగుల సంక్షేమంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. దురదృష్టవశాత్తు వైకల్యం కలిగినా అన్ని రంగాల్లోనూ దీటుగా రాణిస్తున్నారన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఉన్నారని ప్రశంసించారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంలుగా పనిచేసిన సమయంలో దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి పెన్షన్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేశారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివా రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ జానీ, 48వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసులు, పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ రాజేష్, అర్బన్ అధ్యక్షుడు కాళేశ, రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షుడు టి.వీరాపురం ఆంజనేయులు, శింగన మల అధ్యక్షుడు భరత్కుమార్ రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షుడు సాకే ఆంజనేయులు, కళ్యాణదుర్గం దొణస్వామి, బెనకల్లు రామాంజినేయులు, ఫకృద్దీన్, జి. శ్రీనివాసులు, నారాయణ స్వామి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు అప్పట్లో ఎన్నో కార్యక్రమాల అమలు చంద్రబాబు పింఛన్లలో కోత పెట్టి అన్యాయం చేయాలని చూశారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ ఎమ్మెల్యే ‘విశ్వ’ -
అయ్యో దేవుడా.. !
పెద్దవడుగూరు: అభం శుభం తెలియని బాలురు. తల్లిదండ్రుల పక్కన ఆదమరచి నిద్రిస్తున్నారు. ఆ సమయంలో విష సర్పం కాటేసింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన పెద్దవడుగూరు మండలంలోని కండ్లగూడూరు గ్రామంలో చోటు చేసుకొంది. వివరాలు.. గ్రామానికి చెందిన వడ్డే వీరనారాయణస్వామి, లక్ష్మీదేవి దంపతులు వ్యవసాయ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు శివరామరాజు (10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతుండగా, రెండో కుమారుడు శివనారాయణ (7) అదే బడిలో 2వ తరగతి చదువుతున్నాడు. అన్నదమ్ములిద్దరూ మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నిద్రపోయారు. రాత్రి 12 గంటల సమయంలో శివనారాయణ తనకు కడుపు నొప్పిగా ఉందంటూ తల్లి లక్ష్మీదేవికి చెప్పగా ఆమె బయటకు తీసుకెళ్లింది. చూస్తుండగానే బాలుడు నోటి వెంట నురగలు కక్కుతూ కుప్పకూలాడు. పాముకాటు అని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఎంత సేపటికీ వాహనం రాకపోవడంతో బాలుడిని ద్విచక్ర వాహనంలో తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో 108 రావడంతో అందులోకి ఎక్కించి పెద్దవడుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య సిబ్బంది పరిశీలించి బాలుడి శరీరంలో స్పందన లేకపోవడంతో పామిడికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడికి తీసుకెళ్లగా వైద్య సిబ్బంది పరీక్షించి శివనారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఇంటి దగ్గర నుంచి మొదటి కుమారుడు శివరామరాజు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం రావడంతో వెంటనే ద్విచక్ర వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇద్దరు బాలురు పాము కాటుకు గురవడం, అందులో ఒకరు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతి చెందిన బాలుడు శివనారాయణ జీజీహెచ్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న శివరామరాజు ప్రాణాపాయ స్థితిలో.. అనంతపురం మెడికల్: పాముకాటుకు గురైన శివరామరాజు సర్వజనాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్ పర్యవేక్షణలో అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రవీణ్దీన్కుమార్, డాక్టర్ సంజీవప్ప, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మమత బాలుడికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటికే 40 యాంటీ స్నేక్ వీనమ్స్ వైల్స్ను అందించారు. బాలుడి నరాలపై విషం ప్రభావం చూపడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాబును చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. అన్నదమ్ములకు పాముకాటు తమ్ముడి మృతి.. ప్రాణాపాయ స్థితిలో అన్న పెద్దవడుగూరు మండలం కండ్లగూడూరులో విషాదం -
సింధూర వర్ణం.. కాంతులీనిన కసాపురం
● ఘనంగా హనుమద్ వ్రతం గుంతకల్లు రూరల్: వేలాదిగా తరలి వచ్చిన ఆంజనేయస్వామి మాల ధారులతో కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం సింధూర వర్ణంతో కాంతులీనింది. భక్తుల ఆంజనేయస్వామి నామస్మరణతో ఆలయ పురవీధులు మార్మోగాయి. ఆంజనేయ పాహిమాం, పవనపుత్ర రక్షమాం అని స్వామివారిని స్మరించుకుంటూ భక్తి పారవశ్యం పొందారు. ఆంజనేయస్వామి మాలధారుల మండల దీక్షలు ముగియడంతో బుధవారం ఆలయంలో హనుమద్ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ముందుగా ఆంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించిన అర్చకులు ఆ తరువాత మాలధారులు తమ ఇరుముడుల ద్వారా సమర్పించిన ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. బెంగళూరు నుంచి తెప్పించిన ప్రత్యేక పుష్పాలు, స్వర్ణాభరణాలతో నెట్టికంటి ఆంజనేయస్వామిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వేదికపై కొలువుదీర్చారు. వేదపండితులు హనుమద్ వ్రతం విశిష్టత, నెట్టికంటి ఆంజనేయస్వామి క్షేత్ర మహిమను వివరించారు. మహామంగళహారతితో హనుమద్ వ్రతం ముగించి భక్తులకు, మాలధారులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేక ఏర్పాట్లు.. హనుమద్ వ్రతంలో పాల్గొని స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాలధారులు ఇరుముడులను సమర్పించేందుకు ఆలయ ముందు భాగంలో ఏర్పాట్లు చేశారు. మాలధారులు, భక్తుల కోసం వసతి కల్పించారు. ఆలయ ప్రధాన గోపురం ముందు రెండు మెడికల్ క్యాంపులు నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా రూరల్ సీఐ ప్రవీణ్కుమార్, కసాపురం ఎస్సై వెంకటస్వామి, రూరల్ ఎస్సై రాఘవేంద్రప్ప పటిష్ట బందోబస్తు చేపట్టారు. ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు, ఆలయ అను వంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈవో వెంకటేశ్వర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రత్యేక అలంకరణలో ఆంజనేయస్వామి, హనుమద్ వ్రతంలో పాల్గొన్న మాలధారులు -
రోడ్డెక్కిన పత్తి రైతులు
● పత్తి కొనుగోలు చేయలేదని ఆందోళన గుత్తి: పత్తి కొనుగోలు చేయలేదంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేసిన ఘటన పట్టణంలో జరిగింది. వివరాలు.. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. బుధవారం రైతులు 14 ట్రాక్టర్లు, 407 వాహనాల్లో పత్తిని విక్రయించడానికి వచ్చారు. అయితే, ఏడుగురు రైతులకు సంబంధించిన పత్తిని మాత్రమే కొనుగోలు చేసిన సిబ్బంది.. నాణ్యత లోపించిందంటూ మిగతా పత్తిని తిరస్కరించారు. పత్తిని కొనుగోలు చేయాలని కోరినా ఒప్పుకోకపోవడంతో రోడ్డుపై పత్తి వాహనాలను ఉంచి రైతులు రాస్తారోకో చేశారు. దీంతో దిగొచ్చిన సీసీఐ అధికారులు ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఏడుగురు విద్యార్థుల డీబార్ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న యూజీ మూడు, ఐదు సెమిస్టర్ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డీబార్ అయ్యారు. బుధవారం జరిగిన పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ పట్టుబడిన ఏడుగురు విద్యార్థులను డీబార్ చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. హిందూపురంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురిని బుక్ చేశామన్నారు. విల్డ్ తెగులు సోకిన మిరప పంట పరిశీలన ఉరవకొండ/విడపనకల్లు: మిరపకు విల్డ్ తెగులు శీర్షికన ఈ నెల 2న ‘సాక్షి’ దినపత్రికలో వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి ఉమాదేవి, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త యుగంధర్, హార్టికల్చర్ అధికారిణి యామిని, విడపనకల్లు మండల వ్యవసాయ అధికారి పెన్నయ్య, సిబ్బంది బుధవారం ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో సాగు చేసిన మిరప పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిరప పూత, కాయ దశలో ఉండటంతో ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుందన్నారు. నివారణకు 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, 10 గ్రాముల ప్ట్రెప్టొసైక్లిన్ కలిపి మొక్క పాదుల్లో పిచికారీ చేయాలన్నారు. జెమిని ఆకుముడత నివారణకు ఫెరిఫ్రాక్టిఫిన్ 1.5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధం 3 గ్రాములు వాడాలన్నారు. -
కర్ణాటక దీటైన జవాబు
● స్వల్ప ఆధిక్యంలో ఆంధ్ర జట్టు అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ క్రీడామైదానం వేదికగా సాగుతున్న అండర్019 కుచ్బెహార్ క్రికెట్ ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్లో కర్ణాటక జట్టు దీటైన జవాబిచ్చింది. ఓవర్నైట్ స్కోర్ 176/5 బుధవారం ఆటను కొనసాగించిన కర్ణాటక జట్టు బ్యాటర్ అక్షత్ ప్రభాకర్, సిద్ధార్థ్ అఖిల్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ వేగాన్ని పెంచారు. అక్షత్ ప్రభాకర్ 200 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. సిద్ధార్థ్ అఖిల్ 83, ధ్యాన్ హిరేమత్ 47 పరుగులు చేశారు. కర్నాటక జట్టు తొలి ఇన్నింగ్స్లో 148.1 ఓవర్లలో 392 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 33 పరుగుల ఆధిక్యంతో ఆంధ్ర జట్టు తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించి ఆట ముగిసే సమయానికి 18.1 ఓవర్ల వద్ద 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. కోగటం హనీష్ వీరారెడ్డి 22 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కాగా, గురువారం ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్ ఫలితం డ్రా గా ముగిసే అవకాశమున్నట్లు సమాచారం. -
జనవరి 1 నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ
● జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణయ్య అపంతపురం టవర్క్లాక్: పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిపికెట్ల (డీఎల్సీ)ను జనవరి 1 నుంచి సమర్పించాల్సి ఉంటుందని, అంతకు ముందు సమర్పించిన వాటిని పరిగణనలోకి తీసుకోబోమని జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక పెన్సనర్ల భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యామిలీ పెన్షనర్లు ఎక్కడ ఉన్న తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరులోపు సమర్పించాల్సి ఉంటుందన్నారు. స్థానికంగా ఉన్న వారు ఎస్టీఓ కార్యాలయం, మీ–సేవా సెంటర్లు, పెన్షనర్ల సంఘాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించవచ్చునన్నారు. విదేశాల్లో ఉన్నవారు అక్కడి ఎంబసీ కార్యాలయంలో సర్టిఫై చేయించుకుని డీఎల్సీ సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎస్టీఓకి వీడియో కాల్ చేసినా వారి డీఎల్సీ కూడా ఆమోదించబడుతుందన్నారు.అనారోగ్య పరిస్థితి లో ఉన్న వారు ఫిబ్రవరిలో ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే వారి ఇంటి వద్దకెళ్లి డీఎల్సీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెన్షనర్లను కోరారు. సమావేశంలో జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పెద్దన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి శీలా జయరామప్ప తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక అభివృద్ధికి నోచుకోని దుర్గం
పర్యాటకంగా అభివృద్ధి చేయాలి ●కాలగర్భంలో కలిసిపోతున్న ప్రాచీన దేవాలయాలు ●కన్నెత్తి చూడని పర్యాటక, పురావస్తు శాఖలు రాయదుర్గం టౌన్: విజయనగరాజుల 3వ రాజధానిగా శతాబ్దాల చరిత్ర గల రాయదుర్గం కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం కనబరుస్తున్నాయి. వారసత్వ సంపదకు నిలయమైన చారిత్రక కట్టడాలు, ప్రసిద్ది చెందిన ప్రాచీన ఆలయాలు, కోట, కొండలు, గుట్టలు, దేశంలోనే అరుదైన పాదరాస లింగం, దశభుజ గణపతి ఆలయం, లింగాలబండ చతుర్ముఖ పశుపతినాథేశ్వర ఆలయం, జైన సంస్కృతిని చాటిచెప్పే రససిద్దేశ్వరస్వామి ఆలయం, ఏనుగుల బావి, కోనేరు, ప్రాచీన విగ్రహాలతో నేటికీ రాయదుర్గంలో 15వ శతాబ్దపు వైభవం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. కొండపై అద్బుతమైన శిల్పకళా సంపద చెక్కు చెదరలేదు. అయితే ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు శీతకన్నేయడంతో గుప్త నిధుల వేటగాళ్ల దుశ్చర్యకు ప్రాచీన ఆలయాలు కాస్త కాలగర్భంలో కలిసి పోతున్నాయి. పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా రాష్ట్ర పర్యాటక శాఖ, కేంద్ర పురావస్తుశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. రాయదుర్గానికి రాచమార్గమైన కోట ఊరువాకిలిని ఆధునికీకరించే విషయంలో కేంద్ర పురావస్తుశాఖ అధికారులు పూర్తి నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. కోటగోడలు శిథిలావస్థకు చేరుకుని కళావిహీనంగా మారాయి. -
తాడిపత్రిలో కలకలం
● పోలీసుల అదుపులో ధర్మవరం వాసులు తాడిపత్రి రూరల్: స్థానిక ఆర్డీటీ కాలనీలో బుధవారం పిల్లల అపహరణ కలకలం రేగింది. మత్తుతో కూడిన బిస్కెట్లు, చాక్లెట్లు చిన్నారులకు ఇచ్చి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ జంటను స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన దంపతులు కౌసల్య, వెంకట్రాముడు కుటుంబ కలహాల నేపథ్యంలో విడిపోయారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం తన కుమార్తెతో కలసి కౌసల్య తాడిపత్రికి చేరుకుని ఆర్డీటీ కాలనీలో నివాసముంటోంది. బుధవారం వెంకట్రాముడు తన వెంట మరో యువతిని వెంటబెట్టుకుని తాడిపత్రికి చేరుకుని కూతురిపై మమకారంతో ఆరా తీయడం మొదలు పెట్టాడు. రమేష్రెడ్డి కాలనీలోని పాఠశాలలో చదువుకుంటున్నట్లుగా తెలుసుకుని అక్కడకు చేరుకుని తన వద్ద ఉన్న కుమార్తె ఫొటోలను ఉపాధ్యాయులు, విద్యార్థులకు చూపించాడు. అక్కడ లేదని తెలుసుకున్న అనంతరం వెంట తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లను విద్యార్థులకు పంచి ఆర్డీటీ కాలనీకి వెళ్లి భార్య, కుమార్తె ఆచూకీ కోసం గాలింపు చేపట్టాడు. తన వద్ద మిగిలిన చాక్లెట్లు, బిస్కెట్లను కాలనీలోని చిన్నారులకు పంపిణీ చేస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు వారిని పట్టుకుని వివరాలు అడిగారు. సమాధానం చెప్పకపోవడంతో దేహశుద్ధి చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని ఆప్గ్రేడ్ పీఎస్కు తరలించారు. వెంకట్రాముడు చెబుతున్న వివరాలను నిర్ధారించుకునేందుకు కౌసల్య, ఆమె కుమార్తెను పిలిపించారు. విచారణలో వెంకట్రాముడు చెప్పింది వాస్తవమని నిర్ధారించుకున్నారు. అయితే వెంకట్రాముడు వద్ద కత్తి ఉండడంతో అనుమానాలు రేకెత్తాయి. కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లే సమయంలో భార్య అడ్డుపడితే కత్తితో దాడి చేయాలని అనుకున్నాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు. -
సమస్యలు పరిష్కారం కావడం లేదు : మంత్రి కేశవ్
అనంతపురం అర్బన్: జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, సమస్యలపై ప్రజల నుంచి అధికారులు, జిల్లా యంత్రాంగానికి, రాజకీయ వ్యవస్థకు అందుతున్న ఫిర్యాదులే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అపరిష్కృత సమస్యలపై బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఓ.ఆనంద్తో కలసి అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం రెవెన్యూభవన్లో విలేకరులతో మాట్లాడారు. పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలపై అధికారులతో సమీక్షించినప్పుడు పరిష్కారం కాని వాటిని కూడా అయినట్లుగా చూపించినట్లుగా వెల్లడైందన్నారు. ఇలాంటి వాటిలో ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖలకు సంబంధించి 50 శాతం వరకు ఉంటున్నాయన్నారు. ప్రతి అర్జీని ప్రత్యేకంగానే భావించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విద్యుత్ ప్రమాదాలపై అవగాహన ఉండాలి అనంతపురం టౌన్: విద్యుత్ ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ రక్షక్ వాహనాన్ని బుధవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్, ఈఈ జేవీ రమేష్, విజిలెన్స్ సీఐ విశ్వనాథ్చౌదరి పాల్గొన్నారు. వికసించని చామంతి పెద్దపప్పూరు: మండలంలో రైతులు సాగు చేసిన చామంతి పంట మొగ్గ దశలోనే ఎండిపోతోంది. మండల వ్యాప్తంగా దాదాపు 118 ఎకరాల్లో రైతులు చామంతి పంట సాగు చేస్తున్నారు. గత నెల కురిసిన వర్షాలకు పంటకు తెగుళ్లు సోకాయి. రైతులు ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం దక్కలేదు. క్షేత్రస్థాయిలో ఉద్యాన అధికారులు పరిశీలించి, చేపట్టాల్సిన చర్యలను వివరించాలని రైతులు కోరుతున్నారు. వైఎస్సార్సీపీ పీఆర్ విభాగం కర్నూలు ఇన్చార్జ్గా రంగారెడ్డి అనంతపురం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ పంచాయతీ రాజ్ విభాగం కర్నూలు ఇన్చార్జ్గా గుత్తికి చెందిన సీవీ రంగారెడ్డి (పీఆర్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ) నియమితులయ్యారు. ఈ మేరకు పీఆర్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి బుధవారం వెల్లడించారు. -
బొలెరో వాహనానికి నిప్పు
యల్లనూరు: మండలంలోని వెన్నపూసపల్లిలో గట్టు విజయ్కుమార్కు చెందిన బొలెరో (ఏపీ 27 టీడబ్ల్యూ 0227) వాహనానికి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పోలీసులు తెలిపిన మేరకు... మంగళవారం రాత్రి విజయ్కుమార్ తన బొలెరో వాహనాన్ని నివాసం సమీపంలో పెట్టి ఇంట్లోకి వెళ్లి నిద్రించాడు. బుధవారం వేకువజామున నిద్రలేచి చూసే సరికి వాహనం పూర్తిగా కాలిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న పుట్లూరు సీఐ సత్యబాబు.. సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా ఉన్నందుకే ఈ పని చేశారా? లేదా ఎవరైనా కక్షతో నిప్పు పెట్టారా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. -
రోడ్డు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం
● అక్రమంగా మట్టి తవ్వకాలు ● కన్నెత్తి చూడని అధికారులు విడపనకల్లు: రోడ్డు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. మండల పరిధిలోని చీకలగురికి గ్రామంలో బూదగవి రోడ్డు క్రాస్ నుంచి చీకలగరికి వరకు నూతనంగా రూ.1.5 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.ఇందుకోసం రోడ్డు కాంట్రాక్టర్ గ్రామ సచివాలయం సమీపంతో పాటు జగనన్న లేఅవుట్కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో పెద్ద పెద్ద గుంతలు తవ్వి మట్టిని అక్రమంగా తరలిస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టమొచ్చినట్లు జేసీబీలను పెట్టి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించినా అటు వైపు రెవెన్యూ,మైనింగ్ శాఖ అధికారులు, పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, కాంట్రాక్టర్ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘కాంట్రాక్టర్ మంత్రి పయ్యావుల కేశవ్ బంధువు.. అందుకే అతను ఏం చేసినా, ప్రజలకు ఇబ్బంది కలిగించినా పట్టించుకోవడం లేదు’ అని చర్చించుకుంటున్నారు. -
డిటోనేటర్ల దొంగల అరెస్ట్
● 24 గంటల్లోనే మిస్టరీని ఛేదించిన పోలీసులు పెద్దవడుగూరు: మండలంలోని కోనాపురం సమీపంలో ఉన్న కార్తికేయ ఎంటర్ప్రైజెస్లో సోమవారం రాత్రి డిటోనేటర్లను అపహరించుకెళ్లిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన చోటు చేసుకున్న 24 గంటల్లోపే కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. పెద్దవడుగూరు పీఎస్లో బుదవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి వెల్లడించారు. పట్టుబడిన వారిలో యాడికి మండల చందన గ్రామానికి చెందిన రవికుమార్, పామిడిలోని నాగిరెడ్డి కాలనీ నివాసి చిట్టావుల రాము, కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన ఉప్పర వీరేష్ ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రవికుమార్ గతంలో కార్తికేయ ఎంటర్ప్రైజెస్లో ఎక్స్ప్లోజివ్ మ్యాగజైన్ విభాగం డ్రైవర్గా పనిచేశాడు. అయితే జీతం ఇవ్వకపోవడంతో పని మానేశాడు. ఈ క్రమంలో పలుమార్లు అడిగినా మేనేజర్ శ్యాంకుమార్ జీతం చెల్లించలేదు. స్టాక్ పాయింట్లో నిల్వ ఉన్న ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ను తీసుకెళ్లి విక్రయించి తన డబ్బు తీసుకోవాలని భావించిన రవికుమార్.. తన స్నేహితులు చిట్టావుల రాము, ఉప్పర వీరేష్తో కలసి పథకం రచించాడు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి కారులో కార్తికేయ ఎంటర్ప్రైజెస్ గోదాము వద్దకు చేరుకుని గోడకు కన్నం వేసి లోపలకు ప్రవేశించారు. రూ.2 లక్షల విలువైన డిటోనేటర్లు అపహరించుకెళ్లారు. మంగళవారం ఉదయం విషయాన్ని గుర్తించిన మేనేజర్ శ్యాంకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో చందన గ్రామ సమీపంలో నిందితులను అరెస్ట్ చేసి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ ఆంజనేయులు, పెద్దపప్పూరు ఎస్ఐ నాగేంద్రప్రసాద్, పెద్దవడుగూరు ఏఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి, సిబ్బంది మధుసూధన్, రామకృష్ణ, మోహన్, లక్ష్మీనారాయణ, షాషావలి, కిషోర్రాజు, సూర్యనారాయణ, సుధాకర్నాయక్ను ఏఎస్పీ రోహిత్కుమార్ అబినందించారు. -
బీకేఎస్లో ఇరువర్గాల ఘర్షణ
బుక్కరాయసముద్రం: తహసీల్దార్ కార్యాలయం సమీపంలో మంగళవారం ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఇటీవల అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్ సర్కిల్ పేరిట బోర్డు నాటిన సంగతి తెలిసిందే. అయితే ఈ బోర్డును రెండు రోజుల క్రితం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. అదే స్థలంలో అంబేడ్కర్ సర్కిల్ అంటూ మరో బోర్డు నాటడానికి దళిత సంఘాల నేతలు సిద్ధమయ్యారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొందరు ఇది కొండమీద రాయుని స్వామి ద్వారం అని, ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయొద్దని అడ్డుచెప్పారు. దీంతో మంగళవారం రాత్రి ఇరువర్గాల మధ్య గొడవ చోటు చేసుకుని ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాల వారికి నచ్చజెప్పారు. దీంతో బోర్డు ఏర్పాటు విషయం తాత్కాలికంగా వాయిదా పడింది. -
నేత్రపర్వంగా చన్నమల్లప్ప జాతర
బ్రహ్మసముద్రం: మండలంలోని సూగేపల్లిలో సోమవారం రాత్రి ఆరూఢ చన్నమల్లప్ప స్వామి జాతర నేత్రపర్వంగా సాగింది. అర్ధరాత్రి 11 గంటల సమయంలో పీఠాధిపతి ఆరూఢా చన్నమల్లప్ప స్వామిని అశ్వ రథంపై ఊరేగించారు. మంగళవారం తెల్లవారుజామున ఊరేగింపు స్వామీజీ పూర్వీకుల సజీవ సమాధుల వద్దకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం తిరిగి మఠానికి ఊరేగింపుగా చేరారు. ఉత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. రథంపై ఊరేగుతున్న చన్నమల్లప్ప స్వామి జాతరలో పాల్గొన్న భక్తులు -
తాగుడుకు డబ్బివ్వలేదని వ్యక్తి బలవన్మరణం
రాప్తాడు రూరల్: తాగుడుకు డబ్బివ్వకపోవడంతో క్షణికావేశంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కనగానపల్లి మండలం యలకుంట్ల గ్రామానికి చెందిన కామేశ్వరగౌడ్ (46), నాగలక్ష్మి దంపతులు దాదాపు పాతికేళ్ల క్రితం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లికాలనీ పంచాయతీ నందమూరినగర్కు వలస వచ్చారు. ఆటో డ్రైవర్గా కామేశ్వరగౌడ్, ప్రభుత్వాస్పత్రిలో శానిటేషన్ వర్కర్గా నాగలక్ష్మి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఇటీవల మద్యానికి బానిసైన కామేశ్వరగౌడ్ తరచూ తాగుడుకు డబ్బుల కావాలని, భార్య, కుమారులను వేదించేవాడు. సోమవారం రాత్రి కూడా మద్యం కొనుగోలుకు డబ్బివ్వాలని భార్యతో గొడవ పడ్డాడు. ఆమె తన వద్ద లేవనడంతో ఆటో తీసుకుని వెళ్లిపోయాడు. ఇంటెల్ పాత కళాశాల భవనం వద్దకు చేరుకుని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రాంబాబు అక్కడకు చేరుకుని మృతుడిని కామేశ్వరగౌడ్గా అనుమానిస్తూ సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని నిర్ధారించారు. బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యా వలంటీర్ పోస్టుల కోసం దరఖాస్తుల స్వీకరణ అనంతపురం సిటీ: ఐదు నెలల కాలానికి సంబంధించి విద్యా వలంటీర్ల పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 5వ తేదీలోపు జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అనంతపురం జిల్లాకు 80, శ్రీసత్యసాయి జిల్లాకు 68 విద్యావలంటీర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఖాళీలు, ఇతర వివరాలకు www.deoananathapuramu.bolgspot. com వెబ్సైట్ను పరిశీలించాలని సూచించారు. ఎద్దుల బండి నుంచి జారి పడి వ్యక్తి మృతి బ్రహ్మసముద్రం: ప్రమాదవశాత్తు ఎద్దుల బండి నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో నివాసముంటున్న పవన్ (35)కు భార్య రత్నమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పలువురు గ్రామస్తులు ఎద్దుల బళ్లు కట్టుకుని సూగేపల్లిలో జరుగుతున్న జాతరకు బయలుదేరారు. అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించిన పవన్... తాను కూడా జాతరకు వస్తానంటూ పట్టుబట్టి ఎద్దుల బండిలో ఎక్కాడు. గ్రామం నుంచి ఒక కిలోమీటరు దూరం ప్రయాణించిన తర్వాత అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని కళ్యాణదుర్గంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘స్వమిత్వ’ సర్వే పక్కాగా జరగాలి ● జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు అనంతపురం ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాలలో ఆస్తులపై యజమానులకు చట్టపరమైన గుర్తింపు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వమిత్వ యోజన పథకం సర్వేలో జిల్లా వెనుకబడి ఉందని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు తెలిపారు. స్వమిత్వ యోజన పథకం సర్వే ప్రక్రియపై మంగళవారం సర్వే అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. జిల్లాలో మొత్తం 276 రెవెన్యూ గ్రామాల పరిధిలో 324 గ్రామాలు ‘స్వమిత్వ’ కింద ఎంపిక చేశారన్నారు. సర్వే పక్కాగా జరగాలన్నారు. గ్రామకంఠాలను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే యాజమాన్య హక్కు పత్రం ఇవ్వడానికి వీలుంటుందన్నారు. డీపీఓను కలిసిన జీఎస్డబ్ల్యూఎస్ మండల ఇన్చార్జ్లు డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు పొంది గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల (జీఎస్డబ్ల్యూఎస్) మండల ఇన్చార్జ్లుగా నియమితులైన వారు మంగళవారం డీపీఓను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ పని విషయంలో ఎవరూ రాజీ పడొద్దన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. -
రూ.8.66 లక్షల విలువైన ఎరువుల విక్రయాల నిలిపివేత
కళ్యాణదుర్గం రూరల్: స్థానిక సాయి ఫర్టిలైజర్స్, రాయల్ ట్రేడర్స్, జయ మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ దుకాణాల్లో మంగళవారం ఉదయం వ్యవసాయాధికారులు తనిఖీలు చేపట్టారు. రికార్డులకు, నిల్వలకు పొంతన లేని రూ.8,66,242 విలువైన ఎరువులు, విత్తనాల విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో వ్యవసాయ స్క్వాడ్ అధికారి రవి, ఏడీఏ యల్లప్ప, ఏఓ శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం లాభదాయకం : డీపీఎం గుమ్మఘట్ట: ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని రైతులకు డీపీఎం లక్ష్మానాయక్ సూచించారు. గుమ్మఘట్ట మండలం 75వీరాపురం సమీపంలోని నారాయణనాయక్ పొలంలో ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేసిన కంది, ఆముదం, సజ్జ, గోరుచిక్కుడు, అనుముల పంటలను మంగళవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. పీఎండీఎస్ విత్తనాలతో జీవవైవిద్యాన్ని అనుసరిస్తూ పంటల సాగు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చునని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. డిటోనేటర్ల అపహరణ పెద్దవడుగూరు: మండలంలోని కోనాపురం సమీపంలో ఉన్న కార్తికేయ ఎంటర్ప్రైజేస్ గోదాములో నిల్వ చేసిన డిటోనేటర్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గోదాముకు కన్నం వేసి లోపలకు ప్రవేశించిన దుండగులు.. ఆర్డినరీ డిటోనేటర్లు, 2,500 కిలోల పవర్ జెల్, 4,500 డీకార్డులను అపహరించుకెళ్లారు. వీటి విలువ రూ.8లక్షలు ఉంటుందని కార్తికేయ ఎంటర్ప్రైజేస్ మేనేజర్ శ్యాంకిరణ్ తెలిపారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పెద్దవడుగూరు పీఎస్ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. డిటోనేటర్ల స్వాధీనం యాడికి: మండలంలోని చందన గ్రామ సమీపంలో కల్లం దొడ్డిలో దాచిన డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, పెద్దవడుగూరు సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ ఆంజనేయులు మంగళవారం రాత్రి చందన గ్రామంలో తనిఖీలు చేపట్టి భారీగా దాచి ఉంచిన డినోటేర్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పెద్దవడుగూరు పోలీసు స్టేషన్కు తరలించారు. పెరుగుతున్న అరటి ధరలు● జిల్లా ఉద్యాన అధికారి ఉమాదేవి పుట్లూరు: అరటి రైతులు ఎవరూ నిరుత్సాహానికి గురికాకూడదని, కొన్ని రోజులుగా అరటి ధరలు పెరుగుతూ వస్తున్నాయని జిల్లా ఉద్యాన అధికారి ఉమాదేవి అన్నారు. మంగళవారం పుట్లూరు మండలం సూరేపల్లి, కడవకల్లు గ్రామాల్లో ఆమె పర్యటించి, అరటి తోటలను పరిశీలించారు. సకాలంలో కోతలు చేపట్టాలన్నారు. ఫ్రూట్ కేర్ యాక్టివిటీ సక్రమంగా చేపట్టడం ద్వారా మంచి నాణ్యతతో పాటు అధిక దిగుబడి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన సహాయ సంచాలకులు దేవానంద్, ఉద్యాన అధికారి నెట్టికంటయ్య, ఉద్యాన విస్తరణ అధికారి రామాంజనేయులు, ఉద్యాన సహాయకురాలు రస్మిత, రైతులు పాల్గొన్నారు. -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
గుంతకల్లు: హనుమన్ శోభయాత్ర వైభవంగా జరిగింది. హనుమాన్ మాలధారులు 40 రోజుల దీక్ష అనంతరం మంగళవారం ఇరుముడి సమర్పణ చేపట్టారు. తొలుత మండల పరిధిలోని ఎన్.తిమ్మాపురం సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద నుంచి ర్యాలీగా గుంతకల్లులోని బళ్లారి గేట్ సమీపంలోని అభయాంజనేయస్వామి విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాన్ని రథంపై కొలువుదీర్చారు. బెంగళూరు నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో ఉత్సవ విగ్రహంతో పాటు రథాన్ని ముస్తాబు చేశారు. అనంతరం శోభాయాత్రను పుర ప్రముఖలు ప్రారంభించారు. వాయిద్య కళాకారులు, కోలాటం ఆడే కళాకారుల ప్రదర్శనల నడుమ శోభాయాత్ర బీరప్పగుడి సర్కిల్, ప్రధాన రహదారి, సత్యనారాయణపేట మీదుగా కసాపురం వరకు సాగింది. జై శ్రీరామ్, జై నెట్టికంటి ఆంజనేయస్వామి నినాదాలతో పురవీధులు మార్మోగాయి. దారి పొడవునా మాలధారులకు అన్నప్రసాదాలను భక్తులు అందజేశారు. ఆలయ ప్రాంగణం చేరుకున్న అనంతరం మాలధారులు ఇరుముడి సమర్పించారు. బుధవారం మాలధారుల నడుమ అత్యంత వైభవంగా హనుమద్వత్రం నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్రలో ఆర్డీఓ శ్రీనివాస్, ఆలయ ఈఓ విజయరాజు, ఆలయ కమిటీ చైర్మన్ సుగుణమ్మ, అర్చకులు, నెట్టికంటి మాలధారులు తదితరులు పాల్గొన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. -
మిరపకు విల్డ్ తెగులు
● ఎండిపోతున్న పంట ● మందులు వాడిని అదుపు కాని వైనంఉరవకొండ: కీలక దశలో విల్డ్ తెగులు ఆశించడంతో మిరప పంట ఎండిపోతోంది. ఎన్ని మందులు వాడిని తెగులు అదుపులోకి రావడం లేదు. చేసేదిలేక రైతులు పంటను తొలగిస్తున్నారు. హెచ్చెల్సీ, జీబీసీ, హంద్రీ–నీవా కాలువ కింద, బోర్ల సౌకర్యం ఉన్న భూముల్లో 30 వేల ఎకరాల్లో వాణిజ్య పంటగా మిరప వేశారు. ఇందులో అత్యధికంగా ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, కణేకల్లు మండలాల్లో సాగు చేశారు. ఎకరాకు రూ.1.20 లక్షల దాకా పెట్టుబడి పెట్టి మిరపను సాగు చేశారు. ప్రస్తుతం కాయ, పూత దశలో విల్డ్ తెగులు ఆశించడంతో పంట ఒక్కసారిగా ఎండిపోతోంది. మొదట వేర్లకు సోకి కుళ్లిపోవడం ప్రారంభమవుతోంది. ఒక్క మొక్కకు ఈ వైరస్ సోకి రోజుల వ్యవధిలోనే వ్యాప్తి చెంది ఎక్కడికక్కడే మొక్కలు ఎండిపోతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. పంటను దున్నేసిన రైతులు మండల పరిధిలోని ఇంద్రావతి, మోపిడి గ్రామాల్లో పలువురు రైతులు 30 ఎకరాల్లో సాగు చేసిన మిర్చి పంట విల్డ్ తెగులు సోకి ఎండిపోతుండటంతో ఏం చేయాలో తెలియక రైతులు ట్రాక్టర్తో దున్నేశారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఎంతో జాగ్రత్తగా పంట సాగు చేస్తే విల్డ్ తెగులు ఇలా నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రబుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇంద్రావతి వద్ద ట్రాక్టర్తో పంటను దున్నేస్తున్న రైతువాతావరణంలో మార్పులతోనే.. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం మంచు ప్రభావం ఎక్కవగా ఉండటం వల్ల మిర్చికి తెగుళ్లు ఆశించాయి. రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే తెగుళ్లు నివారించవచ్చు. మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటరు నీటితో కలిపి మొక్కల మొదల్లో పిచికారీ చేయాలి. నత్రజని ఎరువులు తగ్గించుకుంటే మంచిది. కొమ్మ ఎండు, కాయ కుళ్లుకు ఒక ఎంఎల్ ప్రొపికోనజోల్ 0.5 ఎంఎల్ డైఫోన్కోనజోల్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. – యామిని, హార్టికల్చర్ అధికారి, ఉరవకొండ గత్యంతరం లేక దున్నేశా.. నేను ఐదు ఎకరాల విస్తీర్ణంలో 5531 తేజ రకం మిర్చి సాగు చేశాను. మందుల పిచికారి, ఎరువులు, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి ఎకరాకు రూ1.20 లక్షల దాకా పెట్టుబడి పెట్టాను. పంట కీలక దశకు చేరుకున్నా విల్డ్ తెగులు సోకింది. కళ్లెదుటే పంట ఎండిపోతోంది. నివారణ చర్యలు చేపట్టినా తెగులు అదుపులోకి రాలేదు. గత్యంతరం లేక ట్రాక్టర్తో పంటంతా దున్నేశాను. – నరసింహులు, మోపిడి -
బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్ధులు
బొమ్మనహాళ్: గ్రామీణ ప్రాంతాల నుంచి కళాశాలకు వచ్చే విద్యార్ధుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉంతకల్లు క్రాస్ వద్ద కళ్యాణదుర్గం–బళ్లారి అంతర్రాష్ట్ర రహదారి ఎస్ఎఫ్ఐ స్టేట్ కమిటి సభ్యుడు బంగి శివ, సీఐటీయూ జిల్లా కోశాధికారి నాగమణి, మండల నాయకుడు ఓబులేసు ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్ధులు ఆందోళనకు దిగారు. బస్సులు నిలపకపోవడంతో కళాశాలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని, చదువులకు దూరమవుతున్నామని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల వదిలిన తర్వాత సాయంత్రం వచ్చే బస్సులు ఒక్కటి కూడా ఆపడం లేదని, తాము ఇంటికి వెళ్లేసరికి రాత్రి అవుతోందన్నారు. పాసులు జారీ చేసి బస్సులు ఆపకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటపాటు బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా బస్సులు, లారీలు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని రాయదుర్గం, కళ్యాణదుర్గం ఆర్టీసి డీపోల మేనేజర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. బస్సులు కళాశాల సమయానికి పంపుతామని, ఉంతకల్లు క్రాస్ వద్ద నిలిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్ధులు, ప్రజాసంఘాల నాయకులు శాంతించారు. ఆందోళన విరమించడంతో వాహనాలు ముందుకు కదిలాయి. -
రెడ్ బుక్ అండతో అధికమైన అకృత్యాలు
అనంతపురం: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలులోకి తేవడంతో అకృత్యాలు అధికమయ్యాయని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురంలోని తన నివాసంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తాడిపత్రిలో ఆటవిక పాలన సాగుతోందన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెచ్చుమీరాయని తెలిపారు. స్టేషన్కు వెళ్లి కేసులు నమోదు చేస్తే.. నిందితులు తిరిగి కౌంటర్ కేసులు పెడుతూ వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రెడ్బుక్ రాజకీయాలు ఆపి.. ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని హితవు పలికారు. స్వార్థ రాజకీయాల కోసం జేసీ ప్రభాకర్రెడ్డి గొడవలు సృష్టిస్తున్నారని, పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు, అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించకపోతే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. దందాలో జేసీ ప్రభాకర్రెడ్డికి వాటాలు తాడిపత్రిలో విచ్చలవిడిగా గంజాయి, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని పెద్దారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాడిపత్రి శివారులో ఎర్ర కాలువను ఆక్రమించి ప్లాట్లు వేస్తున్నారని, వంకలు పూడ్చి, ప్లాట్లు వేసి అమ్మకాలు సాగిస్తున్నారని, పెద్ద కాలువలను పూడ్చి చిన్న డ్రెయినేజీలుగా మార్చేశారని తెలిపారు. భారీ వర్షం వస్తే పలు కాలనీలు నీట మునిగిపోతాయన్నారు. తాడిపత్రి దందా వ్యవహారాల్లో జేసీ ప్రభాకర్రెడ్డికి వాటాలు అందుతున్నాయని ఆరోపించారు. తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వంకలు, వాగుల్లో లే అవుట్లు వేయకుండా, ఇప్పటికే ఉన్న ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీకి లేఖ రాసినట్లు వివరించారు. కలెక్టర్, ఎస్పీ తక్షణమే స్పందించి తాడిపత్రి ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు. గంజాయి విక్రేతలు, మట్కా బీటరు, పేకాట నిర్వాహకులు ఎవర్ని అడిగినా తాము ఎమ్మెల్యేకు వారం వారం చందాలు ఇస్తున్నామంటున్నారన్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఎమ్మెల్యే అస్మిత్రెడ్డి, ఎమ్మెల్యే తండ్రి జేసీ ప్రభాకర్రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదని, చంద్రబాబు వద్ద నెల మామూళ్లు తీసుకోవడం తప్ప ఆయనకేం తెలుసని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎద్దేవా చేశారు. మహిళలపై దారుణాలు జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రాయల సీమలో ఫ్యాక్షన్ తగ్గింది కానీ.. రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోయాయన్నారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెచ్చుమీరాయి స్వార్థ రాజకీయాలు కోసం జేసీ ప్రభాకర్రెడ్డి గొడవలు సృష్టిస్తున్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి ధ్వజం -
‘ఉపాధి’ కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కూడేరు: ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ సలీం బాషా సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం ఆయన చోళసముద్రం, కూడేరు, ఇప్పేరు గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న నీటి కుంట, పశువుల షెడ్, కుడికాలువలో చెట్ల తొలగింపు, పూడిక తీత పనులను తనిఖీ చేశారు. పనులను నిబంధనల మేరకు నాణ్యతగా చేస్తే కేటాయింపు మేరకు దినకూలీ వర్తింపజేస్తామని కూలీలకు తెలియజేశారు. ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి కూలీలకు ఏయే పనులు కల్పించడానికి అందుబాటులో ఉన్నాయో వివరించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ పోలేరయ్య, ఈసీ రాజేష్, టీఏలు కోమల అనిల్ కుమార్, ఆయా పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. బెళుగుప్ప: మండలంలోని రామసాగరం, అంకంపల్లి గ్రామాల్లో ఉపాధి హామీకింద చేపట్టిన గోకులం షెడ్లు, పల్లె వనం పనులను డ్వామా పీడీ సలీం బాషా మంగళవారం పరిశీలించారు. పల్లె వనం మొక్కలను పూర్తిస్థాయిలో సంరక్షించాలని మండల అదికారులకు పీడీ సూచించారు. ఏపీఓ మురళీకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ వన్నూరస్వామి, పంచాయతీ సెక్రటరీ వెంకటేశులు పాల్గొన్నారు. బీటీపీ ఆయకట్టుకు 15 నుంచి సాగు నీరు గుమ్మఘట్ట: భైరవానితిప్ప ప్రాజెక్టు ద్వారా ఈ నెల 15 నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ రాయదుర్గం, కళ్యాణదుర్గం డీఈఈలు గీతాలక్ష్మి, దామోదర తెలిపారు. బైరవానితిప్ప గ్రామంలోని ఇన్స్పెక్షన్ బంగ్లా ఆవరణలో ఆయకట్టు రైతులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కుడి కాలువ కింద 6బీ తూము నుంచి చివరి ఆయకట్టు వరకు 1,940 ఎకరాలకు, ఎడమ కాలువ కింద ఒకటో తూము నుంచి 9వ తూము వరకు 3,162 ఎకరాలకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు. ఆయకట్టు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఈ సురేంద్రనాథ్రెడ్డి, ఎంపీపీ భవాని, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం తహసీల్దార్లు రజాక్వలి, సుమతి, సాగునీటి సంఘం చైర్మన్ నాగరాజు, వైస్ చైర్మన్ సుబాన్, ఏఈఈ హరీష్, రైతులు పాల్గొన్నారు. ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్ ● రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం గుంతకల్లు టౌన్: పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయితో పాటు రూ.11 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ మనోహర్ మంగళవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని ఇరానీ కాలనీకి చెందిన యాసర్ అలీ, షేక్ మొహమ్మద్ ఈజీ మనీకి అలవాటు పడి ఆరు నెలలుగా గంజాయి విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లా కోసాటౌన్ మురముర ప్రాంతం నుంచి రూ.25 వేలకు గంజాయి కొనుగోలు చేశారు. ఆ గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అందిన సమాచారం మేరకు పట్టణంలోని రైల్వే ఆస్పత్రి వెనుక పాడుబడిన రైల్వేక్వార్టర్స్ వద్ద యాసర్ అలీ, షేక్ మొహమ్మద్ను అరెస్ట్ చేసి, వీరి నుంచి రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరిచామన్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు విక్రేతలను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. సమావేశంలో ఎస్ఐ కొండయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
మాల్యంలో మాతా శిశు మరణం
● గర్భంలోనే శిశువు మృతి ● సిజేరియన్ సమయంలో తల్లి మృత్యువాత ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు కణేకల్లు: రాయదుర్గం నియోజకవర్గంలో మాతాశిశు మరణం కలకలం రేపింది. ఏడు నెలల శిశువు గర్భంలోనే మృతి చెందగా.. సిజేరియన్ చేసి బయటకు తీసే క్రమంలో అధిక రక్తస్రావమై తల్లి మరణించింది. వివరాలిలా ఉన్నాయి. కణేకల్లు మండలం మాల్యం గ్రామానికి చెందిన హరిజన గంగమ్మ (26), హరిజన సురేష్ దంపతులు. వీరికి ఏడాదిన్నర వయసుగల కుమారుడు ఉన్నాడు. గంగమ్మ రెండోసారి గర్భం దాల్చింది. ఇటీవల డీ హీరేహాళ్ మండలం కల్యం గ్రామంలోని పుట్టింటికెళ్లింది. నెలవారీ వైద్య పరీక్షల్లో హైరిస్క్ గర్భవతిగా గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భంతో ఉంది. సోమవారం ఉదయం తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న గంగమ్మను భర్త వచ్చి హుటాహుటిన కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించి.. కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్లు గుర్తించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే అంబులెన్స్ ద్వారా అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మరోమారు వైద్య పరీక్షలు చేసి.. కడుపులో శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. సిజేరియన్ చేసి శిశువును బయటకు తీయాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. సరే తల్లినైనా కాపాడండని కుటుంబ సభ్యులు కోరారు. అనంతరం వైద్యులు సిజేరియన్ చేస్తుండగా... అధిక రక్తస్రావమై గంగమ్మ కూడా ప్రాణాలు కోల్పోయింది. అమ్మా.. అమ్మా... గంగమ్మ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మాల్యం తీసుకొచ్చారు. అమ్మ చనిపోయిన విషయం పసికందుకు తెలియలేదు. ఎందుకని అమ్మ లేవలేదని అక్కడే ఉండిపోయాడు. ఎంతకూ లేవలేదని ‘అమ్మా.. అమ్మా..’ అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. గుక్కపట్టి ఏడుస్తూనే ఉన్న కుమారుడిని చూసి అక్కడున్నవారు కంటతడి పెట్టారు. దేవుడు ఎంత నిర్దయుడు.. పసికందుకు తల్లిని లేకుండా చేశాడు అంటూ నిట్టూర్చారు. అమ్మ పలకలేదని ఏడుస్తున్న చిన్నారి (ఇన్సెట్) గంగమ్మ -
తమ్ముళ్ల ఇసుక దోపిడీ
శింగనమల: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల ధన దాహానికి వాగులు, వంకలు కనుమరుగవుతున్నాయి. అడ్డగోలుగా ఇసుక అక్రమ తరలింపు చేపట్టి ప్రశ్నించిన వారిని ‘ప్రభుత్వం మాది... మేం ఏమీ చేసినా చెల్లుతుంది. కాదని ఎవరైనా అంటే భూమి మీద నూకలు చెల్లిపోతాయి’ అని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో వారి ఆగడాలను అడ్డుకునే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. ప్రజాప్రతినిధి అండతో.. శింగనమల నియోజకవర్గంలో శింగనమల, గార్లదిన్నె, యల్లనూరు, బుక్కరాయసముద్రం మండలాల్లోని వంకలు, వాగులు, పెన్నా, చిత్రావతి నదుల్లో పుష్కలంగా ఇసుక లభ్యమవుతోంది. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధి అండతో ఆయా వంకలు, వాగులు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తరలింపులతో టీడీపీ నాయకులు రూ. లక్షల్లో కూడబెట్టుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. తాజాగా శింగనమల మండలంలోని చీలేపల్లి వంకపై కన్నేసిన టీడీపీ నాయకులు.. 20 రోజులుగా ఇసుకను యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుల వ్యవధిలోనే వంక మొత్తం గోతుల మయమై పోయింది. సలకంచెర్వు నుంచి చీలేపల్లికి వెళ్లే మార్గంలో వంకలోకి టిప్పర్ల వెళ్లేందుకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. వంకలో జేసీబీని ఏర్పాటు చేసి ఇసుకను తవ్వి ఒడ్డున ఓ చోట డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా రాత్రి సమయాల్లో ఇతర ప్రాంతాలకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్కు రూ.5వేలు చొప్పున ఈ రోజుల్లోనే రూ. 50 లక్షలకు పైగా ఇసుకను దోచేశారు. ఈ విషయం రెవెన్యూ అధికారులు, పోలీసులకు తెలిసినా వారు అటుగా కన్నెత్తి కూడా చూడడం లేదు. రోజూ టిప్పర్ల ద్వారా అక్రమ రవాణా రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు ఉనికి కోల్పోతున్న చీలేపల్లి వంక టిప్పర్ డ్రైవర్లకు ప్రత్యేక వసతి వంకలో ఇసుకను తరలించుకెళ్లేందుకు వచ్చే టిప్పర్ డ్రైవర్ల కోసం టీడీపీ నేతలు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. డ్రైవర్లు నిద్రించేందుకు వంక పక్కనే ప్రత్యేకంగా మంచాలు వేశారు. భోజనాలు, ఇతరత్రాలను అక్కడే సమకూరుస్తున్నారు. దీంతో చీలేపల్లి వంక నుంచి ఇసుక తరలించేందుకు టిప్పర్ డ్రైవర్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇసుక తరలింపులతో భూగర్భ జలాలు అడుగంటి పంటల సాగు ప్రశ్నార్థకమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపులు అడ్డుకోవాలని అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ తరలింపులు అడ్డుకోవాలని వేడుకుంటున్నారు. -
సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ మృతి
అనంతపురం: సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ (54) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. ఆయనకు భార్య రాజేశ్వరి, కుమార్తె జాహ్నవి ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో ఆయన పాత్రికేయుడిగా పనిచేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... అనంతపురంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్హోంలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. రాజకీయ, అధికార, అనధికారులతో సుదీర్ఘ పరిచయాలు ఉన్న కాలవ రమణ... జిల్లా కరువు, సాగునీటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు కథనాలు రాస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మృతిపై అన్ని వర్గాల వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు జర్నలిస్టులు నర్సింగ్ హోం వద్దకెలిల రమణ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలకు మృతదేహాన్ని స్వస్థలం హిందూపురానికి కుటుంబసభ్యులు తరలించారు. రమణ మృతి బాధాకరం : అనంత వృత్తి పట్ల అంకితభావం, నిబద్ధత గల కాలవ రమణ మృతి బాధాకరమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందరితో కలివిడిగా, ఆప్యాయంగా ఉంటూ అభిమానంగా మాట్లాడే కాలవ రమణ పత్రికా లోకానికి తీరని లోటుగా అభివర్ణించారు. పాత్రికేయ వృత్తిలో విశేష సేవలు అందించిన సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ మృతి బాధాకరమని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. హిందూపురంలోని కాలవ రమణ నివాసం వద్ద మృతదేహాన్ని ఆయన సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘కమర్షియల్’లో జేసీ, డీసీలుగా పదోన్నతులు అనంతపురం ఎడ్యుకేషన్: కమర్షియల్ ట్యాక్స్ శాఖలో జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించి స్థానాలు కేటాయించారు. ఈ మేరకు సోమవారం ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం డివిజన్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్గా పని చేస్తున్న పి.భాస్కర్వల్లికి జాయింట్ కమిషనర్గా పదోన్నతి కల్పించి విజయవాడ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ చేశారు. అలాగే తాడిపత్రి సర్కిల్లో అసిస్టెంట్ కమిషనర్గా పని చేస్తున్న ఎస్.సోనియాతారకు డిప్యూటీ కమిషనర్గా పదోన్నతి కల్పించి విజయవాడ–3 డివిజన్కు, సూర్యపేట సర్కిల్ విజయవాడ–2 డివిజన్లో అసిస్టెంట్ కమిషనర్గా పని చేస్తున్న షేక్ షహనాజ్బేగంకు డిప్యూటీ కమిషనర్గా పదోన్నతి కల్పించి అనంతపురం డివిజన్ కార్యాలయానికి బదిలీ చేశారు. కాగా డిప్యూటీ కమిషనర్గా పదోన్నతి పొందిన సోనియాతారను ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం అనంతపురం చైర్మన్ జమీలాబేగం, ఇతర సభ్యులు శాలువా కప్పి అభినందించారు. ఖైదీల బందోబస్తులో జాగ్రత్తలు తప్పనిసరిఅనంతపురం సెంట్రల్: ఖైదీల ఎస్కార్టు, గార్డు డ్యూటీల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్బాషా సూచించారు. పోలీసు కార్యాలయ ఆవరణలోని జిల్లా శిక్షణ కేంద్రంలో సిబ్బందికి ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఖైదీల వివరాలను ముందుగా తెలుసుకోవాలని, ఆయుధాలు, హ్యాండ్కప్స్, లీడింగ్ చైన్లను అవసరానికి తగినట్లుగా వాడాలని సూచించారు. ఆయుధాల అప్పగింత విధి ప్రకారం జరగాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, ఆర్ఐ పవన్కుమార్, ఆర్ఎస్ఐలు బాబ్జాన్, రమేష్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎద్దుల బండిని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
● రైతుకు తీవ్రగాయాలు ● జోడెద్దులు మృతి విడపనకల్లు: మండలంలోని పెద్ద కొట్టాలపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో రైతుకు తీవ్రంగా గాయపడగా జోడెద్దులు మృతి చెందాయి. వివరాలు... పెద్ద కొట్టాలపల్లి గ్రామానికి చెందిన రైతు ఎర్రిస్వామిరెడ్డి సోమవారం తెల్లవారుజామున ఎద్దుల బండి కట్టుకుని మాళాపురం వైపుగా ఉన్న తన పొలానికి బయలుదేరాడు. పెద్ద కొట్టాలపల్లి సమీపంలోకి చేరుకోగానే 42వ జాతీయ రహదారిపై శరవేగంగా దూసుకొచ్చిన పీఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు.. వెనుక నుంచి బండిని ఢీకొంది. ఘటనలో ఎద్దులతో పాటు బండి ఎగిరి రోడ్డుపక్కనే ఉన్న పొలంలో పడి ముక్కలైపోయింది. ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. తీవ్రంగా గాయపడిన ఎర్రిస్వామిరెడ్డిని స్థానికులు వెంటనే అంనతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీఎం బాధ్యతల స్వీకరణగుంతకల్లుటౌన్: స్థానిక రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (డీసీఎం)గా జి.మోహన్కృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఇక్కడ డీసీఎంగా పనిచేస్తున్న శ్రీకాంత్రెడ్డి సికింద్రాబాద్ డివిజన్కు డీఓఎంగా బదిలీ అయ్యారు. గంజాయి విక్రేతల అరెస్ట్అనంతపురం సెంట్రల్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుల వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో నగరంలోని టీవీ టవర్ ప్రాంతంలో నివాసముంటున్న షికారి శీనా, ఎన్టీఆర్ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ ఉన్నారు. అందిన పక్కా సమాచారంతో సోమవారం నదోదయ కాలనీ శశ్మాన వాటిక వద్ద నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. శిశుగృహ సిబ్బంది తొలగింపు అనంతపురం సెంట్రల్: మహిళాశిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహ సిబ్బందిని తొలగిస్తూ ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ అరుణకుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శిశుగృహలో రెండు నెలల పసికందు నిరూప్ అక్టోబర్ 2న మృతిచెందిన విషయం తెలిసిందే. కేవలం శిశుగృహ సిబ్బంది నిర్లక్ష్యం, గొడవలు కారణంగా శిశువు మృతి చెందినట్లుగా అధికారిక విచారణలో నిర్ధారణ అయింది. దీంతో ఇటీవల సిబ్బంది మొత్తాన్ని తొలగిస్తూ కలెక్టర్ ఆనంద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏఎన్ఎం గుణవతి, ఆయాలు ఆదిలక్ష్మి, నూర్జహాన్, ప్రభావతమ్మ, వాచ్మెన్ రాజశేఖర్కు టర్మినేట్ చేస్తూ సోమవారం ఉత్తర్వులను అరుణకుమారి అందజేశారు. ఉత్తర్వులు అందుకునేందుకు శిశుగృహ మేనేజర్ దీప్తి, సోషల్ వర్కర్ లక్ష్మీదేవి రాలేదు. -
కోగటం ‘వీర’బాదుడు
అనంతపురం కార్పొరేషన్: అండర్ –19 కూచ్బెహార్ క్రికెట్ ట్రోఫీలో భాగంగా ఆర్డీటీ క్రికెట్ గ్రౌండ్లో కర్ణాటకతో సోమవారం జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు బ్యాటర్ కోగటం హనీష్ వీరారెడ్డి మెరుపు సెంచరీతో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 5 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. తొలుత టాస్ నెగ్గిన ఆంధ్ర జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోని ఓపెనర్ లోహిత్ లక్ష్మీనారాయణ 5 పరుగులు చేసి పెవిలిన్ బాట పట్టాడు. ఈ సమయంలో మరో ఓపెనర్ కోగటం హనీష్ వీరారెడ్డితో జతకట్టిన కేఎల్ శ్రీనివాస్ వికెట్ పడకుండా కర్ణాటక బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో కోగటం వీరారెడ్డి 163 బంతుల్లో 10 బౌండరీలు, 5 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. కెరియర్లో (అండర్–19) తొలి మ్యాచ్ ఆడుతున్న కేఎల్ శ్రీనివాస్ కూడా 225 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 98 పరుగులు సాధించి పెవిలియన్ బాట పట్టాడు. ఆటముగిసే సమయానికి పరమ్వీర్ సింగ్ 24, ఏఎన్వీ లోహిత్ 41 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో ధ్యాన్ 3, రతన్ 2 వికెట్లు పడగొట్టారు. ఆంధ్ర స్కోర్ 300/5 -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్యాయత్నం
రాప్తాడు రూరల్: అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వీరనారాయణ భార్య యమున ఆత్మహత్యాయత్నం చేసింది. అదనపు కట్నం వేధింపులు తారాస్థాయికి చేరడంతో జీవితంపై విరక్తితో ఆమె పురుగుల మందు తాగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... రాప్తాడుకు చెందిన యమునకు 11 ఏళ్ల క్రితం అనంతపురం రూరల్ పరిధిలోని చిన్నకుంటకు చెందిన వీరనారాయణతో పైళ్లెంది. పెళ్లి సమయంలో వీరనారాయణకు కట్న కానుకలు కింద రూ.3 లక్షల నగదు, 16 తులాల బంగారాన్ని యమున తల్లిదండ్రులు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. పుట్టినింటి నుంచి ఎకరా భూమి రాయించుకుని రావాలంటూ భార్యపై వీరనారాయణ ఒత్తిడి చేస్తూ వచ్చాడు. అప్పట్లో వేధింపులు భరించలేక యమున ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో పోలీసులు గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలోనే వీరనారాయణకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం భర్తతో కలసి యమున తోటకు వెళ్లింది. అక్కడ అదనపు కట్నం విషయంగా మరోసారి భర్త, అత్త, మామ, ఆడపడచు నిలదీశారు. యమున సమాధానం ఇచ్చే లోపు భౌతిక దాడికి పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన యమున నేరుగా ఇంటికి చేరుకుని తోట నుంచి తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారి సమాచారంతో వీరనారాయణ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న యమునను వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తరలించారు. కాగా, సమాచారం అందుకున్న ఇటుకలపల్లి పోలీసులు ఆస్పత్రికి చేరుకుని యమునను పరిశీలించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధిస్తుండడంతోనే తమ కుమార్తె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందంటూ బాధితురాలి తల్లి, సోదరుడు వాపోయారు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. అదనపు కట్నం వేధింపులు తాళలేక పరిస్థితి విషమం... బెంగళూరుకు తరలింపు -
రాష్ట్రంలో హామీలు అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం
ఉరవకొండ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మద్యాన్ని పారిస్తూ సీఎం చంద్రబాబు తన సొంత జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక యువత నిరాశకు గురవుతున్నారన్నారు. పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ ఉద్యమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేశవరెడ్డి, సీపీఐ తాలుకా కార్యదర్శి మల్లికార్జున, సహాయ కార్యదర్శి చండ్రాయుడు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పార్వతీప్రసాద్, నాయకులు గన్నేమల్లేసు, పురిడి తిప్పయ్య, శ్రీధర్, శ్రీరాములు, రమణ, బసవరాజు, ప్రసాద్, నారాయణమ్మ, మల్లారాయుడు, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ధ్వజారోహణ, అంకురార్పణ
● నేడు హనుమద్ వ్రతం మడకశిరరూరల్: భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఘనంగా ధ్వజారోహణ, అంకురార్పణ చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బెంగళూరుకు చెందిన హనుమంతయ్య, రామాంజనప్ప వారి కుటుంబ సభ్యులచే, ఆంజినేయస్వామి ఆలయంలో గోవిందరాజులు, రత్నమ్మ కుటుంబ సభ్యులచే ధ్వజారోహణ, అంకురార్పణ, అగ్నిహోత్ర, హోమం తదితర కార్యక్రమాలను పురోహితులు నిర్వహించారు. స్వామివార్లకు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు చేశారు. అదే విధంగా రొళ్ల జెడ్పీటీసీ అనంతరాజు కుటుంబ సభ్యులు స్వామి వార్లకు పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, సర్పంచులు కరియన్న, రామాంజినేయులు, ఈఓ నరసింహరాజు, కమిటీ చైర్మన్ నర్సేగౌడ్, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నేడు వ్రతం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయాల్లో స్వామి వార్లకు మన్యసూక్త పవమాన హోమం, హనుమద్వ్రతం, అభిషేకం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. -
సమస్యలు పరిష్కరించండి సారూ..
● పరిష్కార వేదికలో ప్రజల వేడుకోలు ● వివిధ సమస్యలపై 437 వినతులు అనంతపురం అర్బన్: ‘‘సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాము.. అర్జీలు ఇస్తూనే ఉన్నాము. ప్రయోజనం ఉండడం లేదు. దయచేసి మా సమస్యలు పరిష్కరించి ఆదుకోండి’’ అంటూ ప్రజలు అర్జీదారులు అధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు, తిప్పేనాయక్, వ్యవసాయాధికారి ఉమామహేశ్వర్మ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రజల నుంచి అందే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యను నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. వినతులు కొన్ని... ● మంచినీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం రూరల్ మండలం కళ్యాణదుర్గం రోడ్డు రాఘవేంద్ర కాలనీకి చెందిన రామకృష్ణారావు తదితరులు విన్నవించారు. ద్వారకా విల్లాస్ వరకు మంచినీటి సరఫరా చేస్తున్నారని, అక్కడి నుంచి పైప్లైన్ పొడిగించి తమ కాలనీకి నీటి సరఫరా చేయాలని కోరారు. ● ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద నుంచి రూ.1.55 లక్షలు తీసుకుని మోసం చేసిందని నగరంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన కుమ్మర లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పించడం లేదని, తీసుకున్న డబ్బు కూడా తిరిగివ్వడం లేదని చెప్పింది. గట్టిగా అడిగితే మూడు చెక్లు ఇచ్చిందని అవి బ్యాంకులో చెల్లలేదని తెలిపింది. ఆమె నుంచి తనకు డబ్బు ఇప్పించాలని కోరింది. ● వితంతు పింఛను మంజూరు చేయించాలని అనంతపురం రూరల్ మండలం సజ్జల కాల్వకు చెందిన ఎం.రత్నమ్మ విన్నవించింది. తన భర్త గత ఏడాది నవంబరు 3వ తేదీన మరణించాడని చెప్పింది. కుటుంబ పోషణ కష్టంగా ఉందని, పింఛను మంజూరు చేయించి ఆదుకోవాలని కోరింది. ఇతని పేరు ఏకుల కృష్ణ. కూడేరు మండలం లెప్రసీ కాలనీలో ఉంటున్నాడు. ఈయన భార్య అలివేలమ్మ పేరున 2.48 ఎకరాల భూమి (ఖాతా నంబరు 1083) ఉంది. ఇటీవల అలివేలమ్మ మరణించింది. ‘అన్నదాత సుఖీభవ’ కింద మొదటి, రెండో విడతలో సాయం జమ కాలేదని చెప్పాడు. చాలా సార్లు అర్జీ ఇచ్చానని, సమస్య పరిష్కరిస్తామని పంపిస్తారే తప్ప ఇప్పటికీ పరిష్కరించలేదని వాపోయాడు. ఈమె పేరు సారంబీ. కూడేరు మండలం బ్రాహ్మణపల్లి. ఈమెకు ఎకరా భూమి ఉంది. ‘అన్నదాత సుఖీభవ’ నగదు జమ కాలేదు. ఈమె ఆధార్కు వీఆర్ఓ అథెంటికేషన్ కావడంతో ప్రభుత్వ ఉద్యోగి అని చూపిస్తోంది. దీంతో డబ్బులు జమ కావడం లేదు. పలుమార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. -
మహిళలపై హింసకు అడ్డుకట్ట వేయాలి
● కలెక్టర్ ఆనంద్ అనంతపురం అర్బన్: మహిళలు, బాలికలపై జరిగే హింసకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. మహిళలపై హింస వ్యతిరేక అంతర్జాతీయ పక్షోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నేను సైతం’’ అంటూ అందరూ భాగస్వాములై మంచి మార్పు కోసం పనిచేయాలన్నారు. మహిళలు, బాలికలపై జరిగే హింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ భూత్, సైన్ బోర్డులో కలెక్టర్తో పాటు అధికారులు సెల్ఫీ దిగి, సంతకం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ ఎ.మలోల, పీడీ అరుణకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అర్హులందరికీ పింఛన్లు బుక్కరాయసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలందరికీ పింఛన్లు పంపిణీ చేసేలా ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని రేకులకుంట గ్రామంలో పలువురు లబ్ధిదారులకు ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర్మూర్తి, ఎంపీడీఓ సాల్మాన్, సర్పంచ్ నరసమ్మ, ఎంపీపీ సునీత, డిప్యూటీ ఎంపీడీఓ సదాశివ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
33 ఏళ్లు కళ్లుగప్పి.. ఎట్టకేలకు దొరికి
● బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడి అరెస్టు కూడేరు: 33 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ నిందితుడు ఎట్టకేలకు దొరికాడు. కూడేరు పోలీసులు తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లికి చెందిన బోయ నరసింహులు 33 ఏళ్ల క్రితం కూడేరు మండలం జల్లిపల్లి వద్ద మదనపల్లి డిపోకు చెందిన బస్సును అడ్డగించాడు. కత్తులు చూపి ప్రయాణికుల వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు కూడేరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎంత గాలించినా నరసింహులు ఆచూకీ మాత్రం లభించలేదు. అతని అరెస్టు వారెంట్ 33 ఏళ్లుగా అనంతపురం కోర్టులో పెండింగ్లో ఉంది. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఎట్టకేలకు నరసింహులును ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అనంతపురంలోని కోర్టులో జడ్జి ఎదుట హాజరు పరచి రిమాండ్కు పంపారు. పంట రుణాల కోసం బ్యాంకు ఎదుట ధర్నా ఉరవకొండ: పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉరవకొండలోని యూనియన్ బ్యాంకు ఎదుట కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగారెడ్డి, బాలరంగయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు పెద్దముస్టూరు వెంకటేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు. ప్రస్తుతం రైతులు మిరప, వరి, కంది సాగు చేస్తున్నారని, అయితే వీరికి ఇప్పటి వరకు బ్యాంకు రుణాలు మంజూరు కాలేదన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కౌలు రైతులకు రెండు లక్షల వరకూ రుణాలు మంజూరు చేయాలనే నిబంధన ఉన్నా బ్యాంకర్లు అమలు చేయడం లేదన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులకు వర్తింపచేయాలన్నారు. అనంతరం బ్యాంకు సిబ్బందికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు సుంకన్న, శీనప్ప, రామాంజనేయులు, ఆంజనేయులు, నాగవేణి, తిప్పమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవీ నియంత్రణ అందరి బాధ్యత ● జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్ అనంతపురం మెడికల్: హెచ్ఐవీ నియంత్రణ అందరి బాధ్యత అని జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హెచ్ఐవీ పట్ల యువత అవగాహన కల్గి ఉండాలన్నారు. హెచ్ఐవీ రోగుల పట్ల వివక్షకు ఆస్కారం లేకుండా వారికందించే సేవల్లో నాణ్యత పెంచాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి మాట్లాడుతూ హెచ్ఐవీ రోగులకు మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తునట్లు పేర్కొన్నారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యశాఖ ద్వారా విస్తృత కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ర్యాలీ ఆర్ట్స్ కళాశాల నుంచి క్లాక్టవర్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు సాగింది. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రమణ్యం, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, డెమో నాగరాజు, డిప్యూటీ హెచ్ఈఈఓ త్యాగరాజు, డీపీఎం వెంకటరత్నం, అనంత నెట్వర్క్ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
అరటి రైతు నిరసనాగ్రహం
అనంతపురం: కడుపు మండిన అరటి రైతులు చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా కదం తొక్కారు. వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అరటి గెలలను భుజాన తీసుకొచ్చి కలెక్టరేట్ ఎదుట పారపోసి వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం అక్కడే బైఠాయించారు. ఆరుగాలం శ్రమించి పండించిన అరటి పంటను పొలాల్లో ట్రాక్టర్లతో దున్నివేయాల్సి వస్తోందని, పశువులకు మేతగా వేస్తున్నామని ఆవేదన చెందారు. వెంటనే అరటి పంటను ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాజీ మంత్రి సాకే శైలజనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసిందన్నారు. అరటి రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అరటి గెలలు కొనే నాథుడే లేక చెట్లలోనే మాగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రెండు రూపాయలకే కిలో అరటి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని వాపోయారు. కిలో రూ. 7–10తో కొనుగోలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నదంతా డ్రామా అని విమర్శించారు. తాము 24 టన్నుల అరటి కాయలు తీసుకొచ్చామని, ప్రభుత్వం చెబుతున్న రేటుతో కొనుగోలు చేస్తే రూ.500 మినహాయింపు కూడా ఇస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు ఎకరా రూపాయికి కట్టబెడుతున్న చంద్రబాబుకు రైతుల సంక్షేమం మాత్రం పట్టడం లేదన్నారు. రోజూ ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. జగన్ పాలన చూసి నేర్చుకోండి: వైఎస్ జగన్ పాలన చూసి చంద్రబాబు ఎంతో నేర్చుకోవాల్సి ఉందని శైలజానాథ్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు రైతుల గురించి అవగాహనే లేదని, ఆయన గురించి మాట్లాడుకోవడమే వృథా అని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు అదే సిద్ధాంతంతో అన్నదాతలను నట్టేట ముంచుతున్నారన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో జిల్లాలో ఏకంగా 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రైతుల పక్షాన వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని, రైతన్నకు తోడుగా వైఎస్సార్సీపీ నిలుస్తుందని స్పష్టం చేశారు. అనంతరం మాజీ మంత్రి శైలజానాథ్ రైతులతో కలిసి కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం సమర్పించి, రైతులు పడుతున్న కష్టాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నారాయణ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్ రెడ్డి, శ్రీరామరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు సాకే రుత్విక్ హృదయ్, సాకే చంద్రశేఖర్, నార్పల సత్యనారాయణ రెడ్డి, శ్రీరామ రెడ్డి, బండ్ల ప్రతాప్ రెడ్డి, భోగాతి ప్రతాప్ రెడ్డి, సూరి, పూల ప్రసాద్, మహేశ్వర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఖాదర్ బాషా, నీలం భాస్కర్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, శివశంకర్ నాయక్, శ్రీనివాస నాయక్, మారుతీ నాయుడు, చామలూరు రాజగోపాల్, మిద్దె కుళ్లాయప్ప, విష్ణు నారాయణ తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలతో సీఐ దురుసు ప్రవర్తన.. రైతుల నిరసన సందర్భంగా కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అరటి గెలలతో నిరసన తెలుపుతున్న రైతులపై వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తించగా.. అన్నదాతలూ అంతే స్థాయిలో ప్రతిస్పందించారు. రైతులు ఇబ్బంది పడుతుంటే మీరు ఇలా మాట్లాడడం సమంజసం కాదంటూ హితవు పలికారు. అంతలోనే మరో సీఐ వచ్చి సర్దిచెప్పి పంపింజేశారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న అరటి రైతులు, నాయకులు, కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం సమర్పిస్తున్న మాజీ మంత్రి శైలజానాథ్ జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ వద్ద ధర్నా పంటను రోడ్డుపై పారబోసి నిరసన మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా చంద్రబాబూ..?: శైలజానాథ్ ఆగ్రహం -
రైతాంగం పరిస్థితి అగమ్యగోచరం
బెళుగుప్ప: పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఫలితంగా రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. బెళుగుప్ప మండలం యలగలవంకలో పార్టీ నేతలతో కలసి ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్కెట్లో మొక్కజొన్న, కంది, అరటి తదితర పంటలకు సరైన ధరలు లేక రైతులు నష్టపోతున్నారన్నారు. మొక్కజొన్నకు క్వింటా రూ.2400 మద్దతు ధరను ప్రకటించిన ప్రభుత్వం... కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా మోసం చేసిందన్నారు. ఫలితంగా క్వింటా రూ.1,700కు మించి దళారులు కొనుగోలు చేయడం లేదన్నారు. ఇదే తరహాలో కంది, అరటి రైతులు దగా పడ్డారన్నారు. పాలకుల వైఫల్యం కారణంగా వరి, పత్తి రైతులు కూడా నష్టపోతున్నారని తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను లక్షలాది మంది రైతులు సద్వినియోగం చేసుకున్నారని, చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేక ప్రస్తుతం 19 లక్షల మంది కూడా పంటల బీమా ప్రీమియంను చెల్లించలేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, సబ్సిడీ విత్తన పంపిణీకి చంద్రబాబు సర్కార్ మంగళం పాడిందన్నారు. అధికారం చేపట్టకు ముందు ఒక మాట చేపట్టిన తర్వాత మరో మాట మాట్లాడడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. ఇప్పటికై నా రైతులను ఆదుకోకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిది సీపీ వీరన్న, జిల్లా ఉపాధ్యక్షుడు శివలింగప్ప, మండల కన్వీనర్ చిన్న మచ్చన్న, యువజన విభాగం మండల ఉపాధ్యక్షుడు సంతోష్రెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి తిమ్మారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడుసురేష్, సర్పంచ్ మారుతి, నాయకులు శీనప్ప, వెంకటేశులు, పాతన్న, వెంకటేశులురెడ్డి, పూల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆదుకోవడంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలం వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ -
అపార్కు ఆటంకాలు
అనంతపురం సిటీ: ఆధార్ తరహాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి 12 అంకెల గుర్తింపు సంఖ్యను జారీ చేసేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రక్రియకు నాంది పలికింది. నూతన విద్యా విధానం అమలులో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రత్యేకించి విద్యార్థుల కోసమే అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమీ అకౌంట్ రిజిస్ట్రీ)ని తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ అన్ని పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించాలని ఆదేశించింది. అయితే ‘అపార్’ మొదట్లో కొంత వరకు జోరుగా సాగినా ఇప్పుడు ముందుకు సాగడం లేదు. పిల్లలను పాఠశాలల్లో చేర్చే సమయంలో నమోదు చేసిన వివరాలు, ఆధార్లోని వివరాలకు ఏమాత్రమూ పొంతన కుదరడం లేదని తెలుస్తోంది. దీంతో చిక్కులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఇంటి పేరు, పుట్టిన తేదీల్లో చాలా తేడా ఉండడంతో వీటిని సరి చేయడం ప్రధాన సమస్యగా మారింది. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు.. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి అపార్ గుర్తింపు సంఖ్య అనివార్యం. అది ఉంటేనే ఫీజు చెల్లించేందుకు వీలు కలుగుతుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ సంవత్సరం జిల్లాలో పది పరీక్షలు రాసే విద్యార్థులు 1,74,837 మంది ఉన్నారు. 83.84 శాతం అపార్ నమోదు పూర్తయిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మిగిలిన వారి పరిస్థితిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలు 141 ఉండగా, మొత్తం 50,934 మంది విద్యార్థులకు గాను 24,213 మంది మాత్రమే అపార్ నమోదు చేయించుకున్నారు. మిగిలిన 26,721 మంది పిల్లల వివరాలు నమోదు కాకపోవడం గమనార్హం. ఆధార్లో తప్పులతో మందకొడిగా ప్రక్రియ వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ కాని వైనం ‘అపార్’ ఉంటేనే పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు వంద శాతం పూర్తి చేస్తాం విద్యార్థులకు అపార్ చాలా కీలకం కానుంది. వంద శాతం ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం. ఇందుకు సంబంధించి ఎంఈఓలు, అన్ని పాఠశాలల హెడ్మాస్టర్లకు, ఉపాధ్యాయులకు తగిన ఆదేశాలు ఇచ్చాం. – కడప ప్రసాద్బాబు, డీఈఓ సమస్యలను అధిగమిస్తాం ఆధార్ కార్డుల్లోని వివరాలతో పాఠశాలల్లో నమోదైన వివరాలు సరిపోలడం లేదు. అందుకే ఆలస్యమవుతోంది. సమస్యను అధిగమించి త్వరలోనే లక్ష్యం మేరకు అపార్ నమోదును పూర్తి చేయాలని అన్ని కళాశాల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశాం. – కదిరి వెంకటరమణ నాయక్, ఆర్ఐఓ -
నేటి నుంచి ఆంధ్ర, కర్ణాటక మధ్య టెస్ట్ మ్యాచ్
అనంతపురం కార్పొరేషన్: కూచ్ బెహార్ అండర్ –19 క్రికెట్ ట్రోఫీలో భాగంగా సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్ర, కర్ణాటక జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆర్డీటీలోని రాయలసీమ క్రికెట్ మైదానాన్ని సిద్ధం చేశారు. ఆదివారం ఇరు జట్ల క్రీడాకారులు నెట్స్లో ముమ్మర సాధన చేశారు. భారత మాజీ ఆటగాడు, కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ కర్ణాటక జట్టు కెప్టెన్గా బరిలో దిగుతున్నాడు. నేడు పింఛన్ల పంపిణీఅనంతపురం టౌన్: సామాజిక భద్రతా పింఛన్లను సోమవారం ఉదయం 6.30 గంటల నుంచి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. పింఛన్ల పంపిణీ అంశంపై సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్లో సంబంధిత అధికారులతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ పరిధిలోని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేయాలని సూచించారు. ఈ ప్రక్రియను ఎంపీడీఓలు, డీఎల్డీఓలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అమ్మాజీ ఆలయంలోకి ఎలుగు బంటి రొళ్ల: మండలంలోని జీరిగేపల్లిలో త్రిశక్తి దేవతలుగా విరాజిల్లుతున్న అమ్మాజీ (మారక్క, గ్యారక్క, ముడుపక్క) ఆలయంలో ఆదివారం వేకువజామున ఎలుగుబంటి ప్రవేశించింది. శనివారం సాయంత్రం ఆలయ అర్చకులు మారన్న, ముడుపన్న పూజాదికాలు ముగించుకున్న అనంతరం గర్భగుడికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆదివారం వేకువజామున ఆలయంలోకి ఎలుగుబంటి చొరబడి గర్భగుడి తలుపులు తాకి వెళ్లింది. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న అర్చకులు విషయాన్ని గుర్తించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. -
నట్టేట ముంచిన ‘ఆమె’
● అనంతపురం రూరల్ మండలం నందమూరినగర్లో వందల సంఖ్యలో మహిళలు యానిమేటర్ ఆదిలక్ష్మి మోసానికి బలయ్యారు. వందలు... వేలు.. కాదు రూ. కోట్లలో దగా చేసి ఉడాయించడం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఇళ్లల్లో పాచి పని చేసుకుంటున్న వారిని కూడా వదల్లేదు. చీటీలు, వడ్డీలతో పాటు డ్వాక్రా సభ్యుల పేర్లతో రుణాలు తీసుకుంది. ఈమె బాధితుల్లో ఎక్కువగా కూలీనాలీ చేసుకునే వారే ఉన్నారు. రాప్తాడు రూరల్: నందమూరి నగర్లో చాలా కాలంగా ఉంటూ యానిమేటర్గా పనిచేస్తున్న ఆదిలక్ష్మి సుదీర్ఘకాలంగా ఆ ప్రాంతంలో చీటీ వ్యాపారం నిర్వహిస్తోంది. అందరితోనూ మంచిగా ఉండడంతో చాలా మంది ఆమెను నమ్మారు. ఈ నమ్మకంతోనే చీటీలు పూర్తయినా వడ్డీ చెల్లిస్తానంటే చీటీలు వేసిన వారు ఒప్పుకున్నారు. వడ్డీ డబ్బులు ఇవ్వకుండా తిరిగి వారిని కొత్త చీటీల్లోకి సభ్యులుగా చేర్చుకునేది. దీనికి తోడు రూ. 2 వడ్డీతో రూ.లక్షల్లో అప్పులు చేసింది. అంతటితో ఆగకుండా ప్రగతి మహిళా సంఘం సభ్యుల పేరుపై రుణాలు తీసుకుంది. ఇలా మొత్తం రూ. 3 కోట్ల దాకా చేరుకోగానే 15 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. వారం రోజుల క్రితం విషయాన్ని తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ గత సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్ను కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం డీఆర్డీఏ అధికారులకు, అనంతపురం రూరల్ పోలీసులకూ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులపై అటు పోలీసులు కానీ, ఇటు డీఆర్డీఏ అధికారులు కాని ఎలాంటి విచారణ చేపట్టకపోవడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. టీడీపీ నేత జోక్యం.. ఆదిలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లే విషయం స్థానిక ఓ టీడీపీ నేతకు ముందుగానే తెలుసుననే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదిలక్ష్మిపై ఒత్తిడి తీసుకెళ్లి ఆమె ఇంటిని బాధితుల్లో ఒకరైన తన సమీప బంధువు పేరిట రాయించినట్లుగా సమాచారం. ఇది ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఆమె కూడా తమలాగానే అప్పులు ఇచ్చిందని, అయితే ఇంటిని ఆమె ఒక్కతే ఎలా రాయించుకుంటుందని మిగిలిన వారు ప్రశ్నిస్తున్నారు. ఆదిలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లే ముందు సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె కుమార్తెకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుగానే లాంగ్లీవ్లో వెళ్లడానికి సదరు టీడీపీ నేతనే పావులు కదిపినట్లుగా తెలిసింది. ఈ విషయంలో అధికారులు ఇప్పటికై నా స్పందించి తమకు న్యాయం చేయాలని పలువురు బాధితులు కోరుతున్నారు. కోట్లాది రూపాయలు ముంచేసి పరారైన యానిమేటరు చీటీలు, వడ్డీలతో పాటు సభ్యుల పేర్లతో రుణాలు బాధితులంతా కూలీనాలీ చేసుకునేవారే అజ్ఞాతంలోకి వెళ్లేముందు ఓ మహిళ పేరుపై ఇంటిని రాయించిన వైనం వెనుక నుంచి తతంగం నడిపిన స్థానిక టీడీపీ నేత -
రాయలసీమకు తీరని అన్యాయం
అనంతపురం కల్చరల్: రాయలసీమ ప్రాంతానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయని, నిధులు, నీళ్లు రాబట్టుకోవడంలో పాలకులు దారుణంగా విఫలమయ్యారని రచయితలు, ఉద్యమ సంస్థల ప్రతినిధులు ధ్వజమెత్తారు. వేమనా ఫౌండేషన్, రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో అనంతపురం జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం రాయలసీమ మహాకవి సమ్మేళనం జరిగింది. సీమ వ్యాప్తంగానే కాకుండా చైన్నె, నెల్లూరు, ప్రకాశం, బళ్లారి, హంపీ నుంచి కవులు, రచయితలు విచ్చేసి సీమ ప్రత్యేకతను చాటేలా కవితలు వినిపించారు. ముఖ్యంగా జనప్రియకవి ఏలూరు యంగన్న, ఒంటెద్దు రామలింగారెడ్డి రాగయుక్తంగా ఆలపించిన కవితాగానం, జూటూరు షరీఫ్, రఘురామయ్య, రియాజుద్దీన్, సడ్లపల్లి చిదంబరరెడ్డి, వన్నప్ప, నరిసిరెడ్డి, టీవీరెడ్డి వచన కవితలు అమితంగా ఆకట్టుకున్నాయి. అంతకు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు డాక్టర్ శాంతినారాయణ, బండి నారాయణస్వామి, జెట్టీ జైరామ్, మాజీ వీసీ కాడా రామకృష్ణారెడ్డి, కవిసమ్మేళనం సమన్వయకర్త డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, తరిమెల అమరనాథరెడ్డి, జిరసం అధ్యక్షుడు కొత్తపల్లి సురేష్ , ఉద్యమ సంస్థల ప్రతినిధులు కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు. రాజధానిని కర్నూలు నుంచి అమరావతికి తరలించుకుపోతున్నా పాలకులు నిలదీయలేకపోయారని విమర్శించారు. అడుగడుగునా సీమకు జరిగిన అన్యాయాలను ఎండగట్టారు. ప్రజలను సీమ సమస్యలు ప్రతిబింబించే సాహిత్యంతో పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, రవికుమార్, లోకన్న తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ మహాకవి సమ్మేళనంలో రచయితలు -
పింఛన్ కోసం వెళుతూ పరలోకాలకు..
● కారు ఢీకొని మహిళ మృతి ● కుమారుడికి తీవ్ర గాయాలు ముదిగుబ్బ: పింఛన్ తీసుకోవడానికి వేరే గ్రామానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రామలక్ష్మమ్మ (72) అనే మహిళ మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు... ముదిగుబ్బ మండలం ఈదులపల్లికి చెందిన రామలక్ష్మమ్మ పుట్టినిల్లు ధర్మవరం మండలం బిల్వంపల్లి. గతంలో ఆమె కుటుంబమంతా బిల్వంపల్లిలోనే నివాసం ఉండేది. ఆమెకు వితంతు పింఛన్ ఆ ఊరిలోనే వచ్చేది. తర్వాత కొంతకాలానికి ఈదులపల్లికి తిరిగొచ్చారు. పింఛన్ మాత్రం బిల్వంపల్లిలోనే ఉండిపోయింది. దీంతో ఆమె సోమవారం పింఛన్ తీసుకోవడానికి ఒకరోజు ముందుగానే ఆదివారం కుమారుడు ఓబుళపతితో కలసి ద్విచక్ర వాహనంపై బిల్వంపల్లికి బయలుదేరింది. మార్గమధ్యంలోని రాళ్ల అనంతపురం వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రామలక్ష్మమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన ఓబుళపతిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు చర్చించుకోవడం కనిపించింది. ప్రశాంతంగా యూపీఎస్సీ పరీక్ష అనంతపురం అర్బన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఏపీఎఫ్సీ, ఈఓ, ఏఓ పోస్టులకు సోమవారం నిర్వహించిన కంబైన్డ్ రిక్రూట్మెంట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల హాజరు 43.70 శాతం నమోదైంది. మొత్తం 1,263 మంది అభ్యర్థులకు గానూ 552 మంది హాజరవ్వగా 711 మంది గైర్హాజరయ్యారు. పరీక్షను డీఆర్ఓ మలోల, యూపీఎస్సీ అసిస్టెంట్ కంట్రోలర్ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
మాటలతోనే సరి.. రైతు ఆశలు ఆవిరి
పంట చేతికి వచ్చినా ధరల్లేక అరటి రైతులు దిక్కులు చూస్తున్నారు. కొనేవారు లేక తోటలను అలాగే వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. తోటలోనే కాయలు మాగిపోతున్నా పట్టించుకునే వారు లేరు. రూ. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంట కళ్లెదుటే కుళ్లిపోతుండడం చూసి రైతులు నలిగిపోతున్నారు. ‘గిట్టుబాటు ధర కల్పిస్తాం.. ఆదుకుంటాం..’ అంటూ ఆశలు రేకెత్తిస్తున్న పాలకులు, అధికారులు చివరికి ఉత్తచేతులు చూపుతూ నిరాశే మిగులుస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
60 చీనీ చెట్ల నరికివేత
తాడిమర్రి: చిల్లకొండయ్యపల్లిలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు 60 చీనీచెట్లు నరికివేశారు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వెళ్లిన బాధితుల పట్ల సీఐ శ్యామరావు ఫోన్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చిల్లకొండయ్యపల్లిలో కొంకా తిరుపాల్ తనకున్న సర్వే నంబర్ 24–5లోని పొలంలో ఐదేళ్ల క్రితం 300 చీనీ మొక్కలు సాగు చేశాడు. ఆదివారం ఉదయం నీరు పెట్టడానికి వెళ్లగా తోటలో 60 చీనీ చెట్లు నరికివేతకు గురవడం చూసి తిరుపాల్ భార్య కళావతి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బాధితులు అక్కడి నుంచి తాడిమర్రి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే అక్కడ వారు ఏఎస్ఐతో మాట్లాడుతూ ఇటీవల నెలకొన్న రస్తా వివాదం కారణంగానే గుర్తు తెలియని వ్యక్తులు తమ చీనీచెట్లను నరికేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఏఎస్ఐ తన సెల్ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్చేసి ముదిగుబ్బ సీఐ శ్యామరావ్కు వివరాలు తెలిపారు. చెట్లు ఎవరు పీకారో చెప్పలేనప్పుడు ‘ఏం.... కి వచ్చారు’ అంటూ మహిళ అని కూడా చూడకుండా సీఐ అనుచిత వ్యాఖ్యలు చేశారని రైతు దంపతులు ఆరోపించారు. అనంతరం వారు అక్కడి నుంచి ధర్మవరం వెళ్లి డీఎస్పీ హేమంత్కుమార్కు సీఐ ప్రవర్తన తీరుతో పాటు చీనీచెట్ల నరికివేత గురించి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ స్పందిస్తూ కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ చేపట్టి నిందితులను గుర్తించాలని తాడిమర్రి పోలీసులను ఆదేశించారు. చిల్లకొండయ్యపల్లిలో ఘటన ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సీఐ అనుచిత వ్యాఖ్యలు డీఎస్పీకి బాధిత రైతు దంపతుల ఫిర్యాదు -
సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక
అనంతపురం అర్బన్: ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో జరిగాయి. అధ్యక్షుడిగా జి.ప్రభాకర్, ఉపాధ్యక్షుడిగా జి.బ్రహ్మానంద, కార్యదర్శిగా ఇ.నాగరాజు, సంయుక్త కార్యదర్శిగా పి.రవితేజ, కోశాధికారిగా కె.దామోదర్నాయుడు, కార్యనిర్వాహక సభ్యులుగా ఎం.శేఖర్బాబు, ఎన్.సునీల్కుమార్, ఆర్.అయేషాసిద్ధిక్, జి.వన్నూరుస్వామి, డి.ఎర్రిస్వామి, బి.జగన్మోహన్రెడ్డి ఎన్నికయ్యారు. అధ్యక్ష, సంయుక్త కార్యదర్శి పదవులకు పోటీ నెలకొనడంతో ఓటింగ్ నిర్వహించారు. మిగిలిన తొమ్మిది పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోదండపాణి వ్యవహరించారు. మొరాయిస్తున్న టౖర్బైన్ కూడేరు: పీఏబీఆర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఈ నెల 22న తలెత్తిన టర్బైన్ సమస్య కొలిక్కి రాలేదు. ఈ నెల 23 నుంచి అధికారులు మరమ్మతులు చేయిస్తున్నా.. సమస్య తీరలేదు. దీంతో నిపుణుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి రిజర్వాయర్ అధికారులు తీసుకెళ్లినట్లుగా తెలిసింది. వృద్ధురాలి బలవన్మరణం గుంతకల్లు టౌన్: స్థానిక తిలక్నగర్లో నివాసముంటున్నజి.సుంకన్న భార్య రాములమ్మ(61) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని మెయిన్ రోడ్డులో ఓ లాడ్జి పక్కన సుంకన్న టీ స్టాల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య రాములమ్మ కొన్నేళ్లుగా డయాబెటిక్, తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. దీనికి తోడు ఇటీవల మూత్ర విసర్జన సమస్య తీవ్రమైంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన రాములమ్మ... ఆదివారం వేకువజామున బాత్రూమ్లోకి వెళ్లి టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ తాగింది. కాసేపటి తర్వాత బాత్రూం వద్దకెళ్లిన మనవడు.. అపస్మారక స్థితిలో పడి ఉన్న అవ్వను గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఉదయం 7.30 గంటల సమయంలో ఆమె మృతిచెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ మంజుల తెలిపారు. ఆటో బోల్తా .. ఒకరి మృతికూడేరు: ఆటో బోల్తాపడిన ఘటనలో కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన పర్వతయ్య(57) మృతిచెందాడు. ఆదివారం రాజప్పకు చెందిన ఆటోలో ఉజ్జనయ్యతో కలసి వెళుతుండగా గ్రామ శివారుకు చేరుకోగానే కొర్రకోడుకు చెందిన అమర్నాథ్ ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి ఆటోను ఢీకొన్నాడు. ఘటనలో ఆటో బోల్తాపడింది. కిందపడిన పర్వతయ్య, రాజప్ప, ఉజ్జనయ్య, అమర్నాథ్ గాయపడ్డారు. స్థానికులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికి పర్వతయ్య మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగిసిన రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల గ్రామంలో రెండు రోజులుగా సాగిన ఎస్జీఎఫ్ అండర్–17, 19 రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ఆదివారం ముగిశాయి. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో అనంతపురం క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్ షిప్ను దక్కించుకున్నారు. అండర్–19లో బాలుర విభాగంలో చిత్తూరు జిల్లా క్రీడాకారులు విజయం సాధించారు. తృతీయ స్థానంలో నెల్లూరు జిల్లా క్రీడాకారులు నిలిచారు. విజేతలను అభినందిస్తూ పరిటాల శ్రీరామ్, జనసేన నేత మధుసూదన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఓబిరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఉమ్మడి జిల్లా ఉద్యోగుల ఆటవిడుపు అనంతపురం కార్పొరేషన్: శ్రీసత్యసాయి జిల్లా పోలీసు, అనంతపురం జిల్లా రెవెన్యూ జట్లు ఆదివారం అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడాయి. పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీసత్యసాయి జిల్లా పోలీసు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. జట్టులో నాగేంద్రప్రసాద్ 31, ప్రభాకర్ 20, ఎస్పీ సతీష్కుమార్ 14, డీఎస్పీ మహేష్ 17 పరుగులు చేశారు. అనంతరం బరిలో దిగిన అనంత రెవెన్యూ జట్టు 17.5 ఓవర్ల వద్ద 95 పరులకు కుప్పకూలింది. జట్టులో రవితేజ 17, కలెక్టర్ ఆనంద్ 9 పరుగులతో నాటౌట్గా నిలిచారు. 35 పరుగుల తేడాతో శ్రీసత్యసాయి జిల్లా పోలీసు జట్టు విజయం సాధించింది. శ్రీసత్యసాయి జిల్లా బౌలర్లలో ఎస్పీ సతీష్కుమార్ 4 వికెట్లు తీసుకుని ఆల్రౌండర్ ప్రతిభను కనబరిచారు. -
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
● సంక్షేమ వసతి గృహాల్లో ఏఐ యాప్ వినియోగంపై అనేక సందేహాలు అనంతపురం సిటీ: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అక్రమాలను గుర్తించేందుకు అమలు చేసిన హాస్టల్ పర్మినెంట్ ట్రాకింగ్ సిస్టం(హెచ్పీటీఎస్) యాప్ ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వసతి గృహాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. హాస్టళ్లలో కింది స్థాయి సిబ్బందికి అన్ని బాధ్యతలు అప్పగించి వార్డెన్లు వచ్చిపోయే అతిథులుగా మారిపోయారు. దీంతో సిబ్బంది అనేక అక్రమాలకు తెరలేపినట్లుగా ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ యాప్ తీసుకువచ్చారు. జిల్లా వ్యాప్తంగా వెనుకబడిన తరగతులకు సంబంధించి 55 వసతి గృహాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండగా, ఇందులో 7,700 మంది విద్యార్థులు ఉంటున్నారు. 50 ఎస్సీ హాస్టళ్లలో 5,400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటన్నింటిలోనూ గత నెల 18 నుంచి యాప్ను అమలుల్లోకి తీసుకువచ్చారు. వార్డెన్లకు అవగాహన కల్పించాం ఏఐ యాప్తో హాస్టళ్లలో అక్రమాలను ఎక్కడికక్కడ గుర్తించి వాటిని సరిదిద్దేందుకు అవకాశం ఉంది. హాస్టళ్లలో రోజు వారీ చేసే పనుల ఫొటోలు ఈ యాప్లో అప్లోడ్ చేయాలి. మెనూ ప్రకారం అల్పాహారం, భోజనాలు, చిరుతిళ్లు, వసతి గృహ ప్రాంగణం, గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారా లేదా అని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వీలుంటుంది. లోపాలు, నిర్లక్ష్యం ఉన్నట్లు తెలిసిన వెంటనే చర్యలు తప్పవు. – కుష్బూ కొఠారి, బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, అనంతపురం -
పశువైద్యానికి కష్టకాలం
జిల్లాలోని పశు వైద్యశాలల్లో మూగజీవాలకు సరైన వైద్యం అందడం లేదు. డాక్టర్ల కొరత, ఉన్నచోట సరైన సమయానికి విధులకు హాజరు కాకపోవడం, సీజనల్ వ్యాధులకు మందులు లేకపోవడంతో జిల్లాలో పశువులకు వైద్యం కరువైంది. అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పశువైద్యం గాలిలో దీపమైంది. ప్రతి మూడు నెలలకోసారి పశువైద్యశాలలకు అవసరమైన మందులు, వైద్య సామగ్రి సరఫరా చేయాల్సి ఉన్నా.. ఏడాదికి కనీసం రెండు సార్లు కూడా చేయడం లేదు. అదిగో ఇదిగో అంటూ నెలల తరబడి నెట్టుకొస్తున్నారు. డాక్టర్లు, ఏడీలు ఆన్లైన్లో పెడుతున్న ఇండెంట్ చివరకు పత్తా లేకుండా పోతోంది. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో మందులు లేని పరిస్థితి. ఏదైనా జబ్బు బారిన పడిన పశువులు, జీవాలను పశు వైద్యశాలకు తీసుకెళ్తే డాక్టర్లు పరీక్షించి ప్రైవేట్లో మందులు తీసుకురావాలని చెబుతుండడంతో పెంపకందారులు అవాక్కవుతున్నారు. ప్రబలుతున్న ప్రాణాంతక వ్యాధులు.. పశువైద్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో తమపై అదనపు భారం పెరిగి పోతోందని రైతులు, కాపర్లు వాపోతున్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు, లంపీస్కిన్, అంత్రాక్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలి వైద్యానికి ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర మందులు లేక ప్రాథమిక వైద్యానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆర్ఎస్కేలను పూర్తిగా విస్మరించడంతో గ్రామాల్లో ప్రథమ చికిత్సకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆర్బీకేల్లో సైతం అత్యవసర మందులు అందుబాటులో పెట్టారని, ఇపుడు ఆర్ఎస్కేల్లో ఎక్కడేగాని కనీసం మందు బిళ్ల కూడా కనిపించడం లేదని పశుపోషకులు అంటున్నారు. తీవ్రంగా మందుల కొరత.. జిల్లా వ్యాప్తంగా పట్టణ, ఏరియా పశువైద్యశాలలు (వెటర్నరీ హాస్పిటల్స్–వీహెచ్లు) 15 ఉండగా, మండల, మేజర్ పంచాయతీ ప్రాంతాల్లో వెటర్నరీ డిస్పెన్సరీలు (వీడీ) స్థాయి ఆసుపత్రులు 56, గ్రామ స్థాయి పశుచికిత్సా కేంద్రాలు (రూరల్ లైవ్స్టాక్ యూనిట్స్–ఆర్ఎల్యూ) 14 ఉన్నాయి. ఇవి కాకుండా 122 గోపాలమిత్ర కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటన్నింటిలోనూ మందుల కొరత తీవ్రంగా నెలకొంది. ప్రథమ చికిత్స చేయడానికి కూడా చాలా ఆస్పత్రుల్లో అత్యవసర మందులు లేవు. గొంతువాపు, చొప్ప వాపు, చిటుకు రోగం, ఆంత్రాక్స్, ఈసుడు రోగం, బొబ్బరోగం, కొక్కెర తెగులు, మశూచి, రేబీస్, పారుడు రోగం, నట్టల మందు, గోట్ఫాక్స్, నీలినాలుక వ్యాధి, గాలికుంటురోగం, ముద్దచర్మవ్యాధి, బాతుపారుడు, బాతు ప్లేగు, జూనోటిక్ సమస్యలు, తదితర ప్రాణాంతక, ప్రమాదకరమైన వ్యాధుల నివారణ టీకాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవంటున్నారు. అరకొర సరఫరాతో నెలకొన్న మందుల కొరత ఆర్ఎస్కేల్లో ప్రథమ చికిత్సకూ ఇబ్బంది -
బడి బస్సు భద్రమేనా..?
అనంతపురం సిటీ: ఇటీవల కర్నూలు సమీపంలో రహదారిపైనే కావేరి బస్సు దగ్ధమై పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల బస్సుల కండీషన్లపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బస్సులను తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా జిల్లాలో రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి 680 వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అత్యధిక శాతం వాహనాలకు భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నర్సరీ నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ చదివే విద్యార్థులను తరలించే వాహనాల్లో ప్రమాదం జరిగితే భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు.వాహనాల్లో ఫైర్ అలారం, డిటెక్షన్ సిస్టం, అత్యవసర ద్వారాలు, స్పీడ్ గవర్నర్లు, అగ్ని ప్రమాదాలు జరిగితే నివారించే పరికరాలు పని చేయకపోవడం వంటి లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. రంగంలోకి రవాణా శాఖ అధికారులు.. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన వాహనాల కండీషన్లను పరిశీలించేందుకు రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో మొత్తం 71 వాహనాలను తనిఖీ చేశారు. అత్యవసర ద్వారం, స్పీడ్ గవర్నర్, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, ఉన్న వాటిలో సక్రమంగా పని చేయకపోవడాన్ని గుర్తించారు. 60 బస్సుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. మిగిలిన వాహనాలను కూడా తనిఖీ చేయాలని అధికారులు నిర్ణయించారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలను అవసరమైతే సీజ్ చేయనున్నట్లు చెబుతున్నారు. కావేరి బస్సు ఘటన నేపథ్యంలో అధికారుల స్పెషల్ డ్రైవ్ 60 బస్సుల నిర్వాహకులకు నోటీసులు -
కానరాని ఉషస్సు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యా లయంలో మౌలిక సదుపాయాల కల్పనకు పీఎం ఉష (ప్రధాన మంత్రి– ఉచ్ఛతార్ శిక్షా అభియాన్) కింద రూ.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు ఖర్చుపెట్టలేని నిస్సహాయ స్థితిలో వర్సిటీ ఉన్నతాధికారులు ఉన్నారు. దీంతో నిధులకు చెదలు పట్టడమే కాకుండా వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. 2026 మార్చిలోపు నిధులు ఖర్చు చేయకపోతే వెనక్కి వెళ్లడమే కాకుండా మరో దఫా రావాల్సిన రూ.20 కోట్ల నిధులూ రాని పరిస్థితి ఏర్పడనుంది. ఇప్పటి దాకా ఒక్క పనిలో కూడా కనీసం అడుగు కూడా ముందుకు పడకపోవడంతో మార్చి నెలాఖరులోపు దాదాపుగా పూర్తి చేయని దుస్థితి నెలకొంది. సమావేశాలతో సరి.. పీఎం ఉష పథకం కింద పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశముంటుంది. న్యాక్ గ్రేడింగ్ను బట్టి నిధులు మంజూరవుతాయి. నాక్ ఏ ప్లస్ గ్రేడ్ ఉంటే రూ.100 కోట్ల నిధులు, న్యాక్–బీ గ్రేడ్ ఉంటే రూ.20 కోట్ల నిధులు అందుతాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి న్యాక్–బీ గ్రేడ్ గుర్తింపు ఉండడంతో రూ.20 కోట్ల నిధులు మంజరయ్యాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వర్సిటీ వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణా రెడ్డి ‘పీఎం– ఉష’కు దరఖాస్తు చేయగానే, నిధులు మంజూరయ్యాయి. అనంతరం అప్పట్లోనే వీసీ ప్రొఫెసర్ కే. హుస్సేన్ రెడ్డి హయాంలో నిధులు వర్సిటీ ఖాతాకు జమయ్యాయి. 2026 మార్చి నెలాఖరులోపు రూ.20 కోట్ల నిధులు ఖర్చు చేయకపోతే వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని తెలిసినా వర్సిటీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. సివిల్ పనులకు సంబంధించి టెండర్లు మాత్రమే ఖరారయ్యాయి. అవి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు. గడువు సమీపిస్తున్నా తరచూ సమావేశాలు నిర్వహించడం, చర్చించడంతోనే కాలయాపన చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ అభివృద్ధిపై శ్రద్ధేదీ? వర్సిటీలో ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి బ్లాక్గ్రాంట్ నిధులు మినహా నయాపైసా నిధులను చంద్రబాబు ప్రభుత్వం అందించిన పాపాన పోలేదు. నూతన ప్రాజెక్ట్ ఒక్కటీ రాలేదు. అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క రూపాయి మంజూరు చేయలేదు. వర్సిటీల అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టకపోగా.. పీఎం ఉష పథకం కింద గత ప్రభుత్వం హయాంలో అందిన నిధుల ఖర్చుపై దృష్టి పెట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీ భవిష్యత్తుపై ఉన్నతాధికారులు దృష్టి సారించడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందాన తయారైంది ఎస్కేయూలో పరిస్థితి! అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేయడం అందరికీ తెలిసిందే. కానీ, ఎస్కేయూలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. నిధులుండీ ఖర్చు చేయలేని దుస్థితి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ సీపీ హయాంలో పీఎం ఉష పథకం కింద ఎస్కేయూకు రూ.20 కోట్ల నిధులు 2026 మార్చి నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యం గడువులోపు నిధులు ఖర్చు చేస్తే.. మరో రూ.20 కోట్లు వచ్చే అవకాశం ఇప్పటిదాకా ప్రారంభం కాని పనులు వర్సిటీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు -
బోయ ఆనంద్ది ముమ్మాటికీ హత్యే
● హంతకులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అండదండలు ● మాజీ ఎంపీ తలారి రంగయ్య ధ్వజం అనంతపురం: ‘బ్రహ్మసముద్రం మండలం యనకల్లు గ్రామానికి చెందిన బోయ ఆనంద్ది ముమ్మాటికీ పరువు హత్యే. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆటవిక పాలన సాగిస్తూ బీసీ సామాజికవర్గాల వారిపై దమనకాండకు పాల్పడుతున్నారు. హంతకులు సీఎం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు కావడం, ఎమ్మెల్యే సురేంద్రబాబు అండదండలు ఉండడంతో పోలీసులు పట్టించుకోవడం లేదు’ అంటూ వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. శనివారం బాధిత కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఓ యువతి, బోయ ఆనంద్ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారన్నారు. ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు గతంలోనే ఆనంద్ తల్లిదండ్రులైన బోయ వెంకటేశులు, వరలక్ష్మిపై పాశవికంగా దాడి చేశారన్నారు. ఈ క్రమంలోనే ఆనంద్ బెంగళూరుకు వెళ్లిపోయి ఉద్యోగంలో చేరాడన్నారు. ఈ నెల 20న మళ్లీ సదరు యువతి ఫోన్ చేసి కళ్యాణదుర్గం రాకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో వెంటనే బయలుదేరి వచ్చాడన్నారు. ఈ క్రమంలో రాయదుర్గం రోడ్డులోని పెట్రోల్ బంకు వెనుక ముళ్ల కంపల్లో బోయ ఆనంద్కు యువతి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు బలవంతంగా గడ్డి మందు తాగించి, చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారన్నారు. దీనిపై బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్తో పాటు కళ్యాణదుర్గం సీఐకి బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఆనంద్ను కడతేర్చారనేందుకు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఎంత మంది బలి కావాలి..? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు,టీడీపీ నాయకుల వేధింపులకు ఎంతో మంది ఎస్సీ, బీసీలు బలవుతున్నారని రంగయ్య పేర్కొన్నారు. టీడీపీలో చేరలేదని వేధించడంతో మర్రిమాకులపల్లికి చెందిన గొల్ల మమత తన బిడ్డను నీళ్ల తొట్టెలో వేసి తనూ ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన తలారి శ్రావణిని టీడీపీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్ పోలీసులతో కుమ్మకై ్క వేధించడంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకుందన్నారు. బోరంపల్లి చాకలి రామాంజినేయులు, తలారి రత్నమ్మలూ టీడీపీ నాయకుల బాధితులేనన్నారు. జంబుగుంపలకు చెందిన షాలిని అనే బాలికను టీడీపీ నాయకులు పట్టపగలే చేయి పట్టుకుని అఘాయిత్యం చేసేందుకు యత్నించారని విమర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి.. బోయ ఆనంద్ హత్యతో కుటుంబం దిక్కులేనిదిగా మారిందని రంగయ్య వాపోయారు. తక్షణమే కుటుంబాన్ని ఆదుకోవాలని, కోటి రూపాయల పరిహారంతో పాటు ఆనంద్ సోదరి పూజకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి యర్రంపల్లి కృష్ణమూర్తి, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం రూరల్ కన్వీనర్లు పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, గోళ్ల సూరి, కంబదూరు జెడ్పీటీసీ జి. నాగరాజు, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు దొడగట్ట మురళి, లీగల్ సెల్ నాయకులు రామాంజినేయులు, ఎనుముల దొడ్డి సర్పంచ్ విజయ్కుమార్, సీనియర్ నాయకులు భాస్కర్, అంకంపల్లి గోపాల్, జానీ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో కంది, మొక్కజొన్న సాగు చేసిన రైతుల కంట కన్నీరు కనిపిస్తోంది. పంటకు గిట్టుబాటు ధర దక్కక అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. వరుణుడు భయపెడుతుండడంతో పంటను కాపాడుకోలేక... మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకోలేక అల్లాడిపోతున్నారు. క్రమక్రమంగా అప్పుల ఊబిలోక
రైతులను వెంటాడుతున్న కష్టాలు ● కంది, మొక్కజొన్న పంటలకు దక్కని కనీస మద్దతు ధర ● కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని చంద్రబాబు ప్రభుత్వం ● అన్నదాత కష్టాలు వర్ణనాతీతం కూడేరు మండలం ముద్దలాపురంలో పొలాల్లోనే ఆరబోసిన మొక్కజొన్నలు కళ్యాణదుర్గం/కూడేరు: ఇప్పటివరకూ అరటి రైతు కష్టాలు అందరినీ ఆలోచింపజేశాయి. తాజాగా ఆ జాబితాలో కంది, మొక్కజొన్న రైతులు చేరారు. ఈ ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా కంది 55,296 హెక్టార్లలో సాగులోకి వచ్చింది. ఇటీవల పంటను తొలగించారు. చంద్రబాబు ప్రభుత్వం కంది పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.7,550 ప్రకటించినా కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుండడంతో నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు కంది క్వింటాల్ ధర రూ.6,300కు కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మొక్కజొన్న.. ధర లేదన్నా.. మొక్కజొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్లో 42 వేల హెక్టార్లలో పంట సాగైంది. ఇతర పంటలతో పోల్చితే తక్కువ పెట్టుబడితో గిట్టుబాటవుతుందన్న ఉద్దేశంతో ఖరీఫ్లో రైతులు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా సాగు చేశారు. మంచి దిగుబడులు వచ్చాయి. పంట చేతికొచ్చి విక్రయించాల్సిన సమయంలో ధర పడిపోయింది. దీంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 ప్రకటించినా.. కొనుగోలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఇదే క్రమంలో క్వింటా ధర బహిరంగ మార్కెట్లో కేవలం రూ.1,600–రూ.1,750 పలుకుతుండడంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. బూజు పడుతున్న గింజలు... పొలాల్లోనే మొక్కజొన్న గింజలను రైతులు నిల్వ ఉంచుకున్నారు. ఇటీవల మంచు కురుస్తుండడంతో గింజలు దెబ్బతినకుండా టార్ఫాలిన్ కప్పుతున్నారు. అయితే, వాతావరణంలో మార్పుతో సూర్యరశ్మి అంతంత మాత్రంగానే తగులుతుండడంతో గింజలు బూజు పట్టాయి. కష్టపడి పండించిన పంట దెబ్బతింటుంటే రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
వైఎస్సార్ నాయకుడికి వేధింపులు
● నోటీసులు ఇస్తామని రప్పించి అరెస్టు చేసిన వైనం అనంతపురం సెంట్రల్: చంద్రబాబు ప్రభుత్వంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగంలో అరాచకాలు తారస్థాయికి చేరాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే గొంతు కలను అణచివేసేందుకు ‘పచ్చ’ నేతలు యత్నిస్తున్నారు. తాజాగా అనంతపురంలో మూడో డివిజన్ కార్పొరేటర్ అంకే కుమారమ్మ భర్త, వైఎస్సార్సీపీ నాయకుడు బోయ కృష్ణమూర్తిని వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. గొడవ కేసులో కేవలం నోటీసులు ఇస్తామని పిలిపించి అదుపులోకి తీసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. ఈ నెల 21న మూడో డివిజన్ లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు పర్యటిస్తుండగా టీడీపీ నాయకుడు గోపాల్ కవ్వింపు చర్యలకు పాల్పడడమే కాకుండా ఘర్షణకు దిగాడు. నగరపాలక సంస్థ శానిటేషన్ వర్కర్ కదిరప్పపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయంపై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం కేసులో నోటీసులు ఇవ్వాల్సి ఉందంటూ వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణమూర్తిని పోలీసుస్టేషన్కు పిలిపించారు. అక్కడికి వెళ్లిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పి కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించడం గమనార్హం. పోలీసుల తీరును వైఎస్సార్సీపీ నాయకులు ఖండించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒత్తిళ్ల మేరకే కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. -
ఆట పాటలతో ఆత్మస్థైర్యం
● అట్టహాసంగా విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలు అనంతపురం కార్పొరేషన్: ఆటపాటల ద్వారా విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మస్థైర్యం నింపొచ్చని కలెక్టర్ ఆనంద్ అన్నారు. డిసెంబర్ మూడో తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ) మైదానంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆటల పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఇలాంటి పోటీల వల్ల విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను వెలికి తీయడమే గాక వారిలో ఆత్మస్థైర్యం నింపొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలు చేసే అన్ని పథకాల్లోనూ వీరికి రావాల్సిన రిజర్వేషన్ తప్పక పాటించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విభిన్న ప్రతిభావంతుల కోసం ర్యాంప్స్, లిఫ్ట్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని తెలిపారు. ప్రతి ఒక్కరూ యూడీఐడీ కార్డును కలిగి ఉండాలని సూచించారు. అనంతరం రన్నింగ్ 100 మీటర్లు, షాట్పుట్, డిస్కస్త్రో, లాంగ్ జంప్, సాఫ్ట్బాల్ ఆటల పోటీలు నిర్వహించగా, 500 మంది విభిన్నప్రతిభాంతులైన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా నిరూపించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గడుపుటి నారాయణస్వామి, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు అర్చన, బీసీ సంక్షేమ శాఖల డీడీ ఖుష్బూ కొఠారి, డీఎస్డీఓ మంజుల, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడల్లో మేటిగా రాణించాలి
అనంతపురం కార్పొరేషన్: అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మేటిగా రాణించాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న డాక్టర్ తాలిమెరాన్ ఏఓ ఆల్ ఇండియా జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా కేరళ, గోవా జట్ల మధ్య జరిగిన్ మ్యాచ్లో క్రీడాకారులను కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులందరూ క్రీడా స్పూర్తితో ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో పుట్బాల్ అసోసియేషన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. రేపు కలెక్టర్ దృష్టికి అరటి రైతుల సమస్యలు శింగనమల: నియోజకవర్గంలోని అరటి రైతుల సమస్యలను సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ తెలిపారు. అరటి ధరలు పాతాళానికి పడిపోవడంతో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, రైతులను ఆదుకోవాలని మరోసారి కలెక్టర్కు విన్నవించనున్నట్లు పేర్కొన్నారు. శింగనమల నియోజకవర్గంలోని రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలో ఇంటర్ చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు వివిధ అంశాల్లో డిసెంబర్ ఒకటి నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీడాప్ జాబ్స్ జిల్లా కో–ఆర్డినేటర్ శైలజ శనివారం తెలిపారు. 19 నుంచి 26 ఏళ్లలోపు వయస్సు కలిగిన యువతీ యువకులు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 90 రోజుల ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపికై న వారికి ఉచిత భోజనం, వసతితో పాటు యూనిఫాం ఇవ్వనున్నట్లు వివరించారు. -
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
గోరంట్ల: కేంద్రీయ విద్యాలయ సంఘటన్లో బోధన, బోధనేతర ఉద్యోగ నియామకాలకు అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 4లోపు దరఖాస్తు చేస్తుకోవాలని పాలసముద్రంలోని నాసిన్ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బట్న కృష్ణారావు కోరారు. కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 6,191 ఉద్యోగాలకు సీబీఎస్ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవీఎస్ పాటు ఎన్వీఎస్లో కూడా నియామకాలు చేపడుతున్నాయన్నారు. ఉసురు తీసిన మద్యం మత్తు బ్రహ్మసముద్రం : మద్యం మత్తు ఆ యువకుడి ఉసురుతీసింది. ఎరడికెర గ్రామానికి చెందిన బోయ రవి (28), గౌరమ్మ దంపతులు. వీరికి కుమారుడు గౌతమ్నంద, కూతుళ్లు విష్ణుప్రియ, బేబీ ఉన్నారు. కూలి పనులకెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు. అయితే రవి ఇటీవల మద్యానికి అలవాటుపడ్డాడు. విపరీతంగా తాగేవాడు. ఈ క్రమంలో కూలి పనులకు కూడా వెళ్లడం మానేశాడు. శనివారం ఉదయం పూటుగా మద్యం తాగాడు. తర్వాత ఏమైందో తెలీదు మత్తులోనే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నీటిలో కొట్టుకొచ్చిన శవం వజ్రకరూరు: రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవాసుజల స్రవంతి ఎత్తిపోతల పథకం వద్దకు శనివారం గుర్తుతెలియని శవం కొట్టుకువచ్చింది. అక్కడి సిబ్బంది గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నాగస్వామి తన సిబ్బందితో అక్కడకు చేరుకుని కాలువలో కొట్టుకువచ్చిన శవాన్ని బయటకు తీయించారు. మృతుని వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్ఐ పేర్కొన్నారు. చేతిపై పి.సునిత అని పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించారు. గుర్తు పట్టిన వారు వెంటనే 94409 01867, 94407 96856, 94901 08514, 94407 96828 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. విజయలక్ష్మి మృతిపై వీడని మిస్టరీ గుత్తి: గుత్తి ఆర్ఎస్కు చెందిన విజయలక్ష్మి మృతి మిస్టరీ వీడలేదు. ఆర్ఎస్కు చెందిన రామాంజనేయులురెడ్డి భార్య మృతి చెందడంతో విజయలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈమె ఈ నెల 26న ఇంటి నుంచి తోటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే విజయలక్ష్మి వైటీ చెరువు గ్రామంలోని చెరువులో శవమై తేలింది. ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా? లేక ఆత్మహత్య చేసుకుందా అన్నది తెలియడం లేదు. ఆస్తి కోసం మొదటి భార్య పిల్లలే తమ తల్లిని చంపి ఉంటారని విజయలక్ష్మి పిల్లలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు హర్షవర్దన్ ఆత్మకూరు: జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టులో ఆత్మకూరు క్రీడాకారునికి చోటు లభించింది. మూడు నెలల క్రితం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్ధాయి పోటీల్లో ఆత్మకూరుకు చెందిన భానుకోట వీర హర్షసాయివర్దన్ సత్తా చాటాడు. దీంతో అతడిని త్వరలో జరిగే సంతోష్ ట్రోఫీ జాతీయస్థాయి ఫుట్బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేస్తూ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి శుక్రవారం లేఖ పంపారు. హర్షవర్దన్ చైన్నెలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే క్రీడలపై మక్కువ.. : ఆత్మకూరుకు చెందిన భానుకోట వీర హర్షసాయివర్దన్ చిన్నప్పటి నుంచే క్రీడలపై మక్కువ పెంచుకున్నాడు. ముఖ్యంగా ఫుట్బాల్ క్రీడలో జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు చాలాసార్లు ఆడి ప్రతిభ కనబరిచాడు. చదువు, క్రీడలతో పాటు ఖాళీ సమయాల్లో తన తండ్రి భానుకోట బాలపోతన్నకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నాడు. జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల హర్షవర్దన్ సంతోషం వ్యక్తం చేశాడు. హ్యాండ్బాల్ పోటీలకు సెలెక్షన్స్ రేపు అనంతపురం కార్పొరేషన్: ఎల్ఆర్జీ స్కూల్లో సోమవారం ఉదయం 9 గంటలకు జిల్లాస్థాయి సీనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు క్రీడాకారుల సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు హ్యాండ్బాల్ కార్యదర్శి సాకే శివశంకర్ తెలిపారు. -
పంచాయతీ స్థలం కబ్జాకు యత్నం
ఉరవకొండ: ప్రజోపయోగం కోసం కేటాయించిన స్థలాలపై కొంతమంది పచ్చనేతల కన్ను పడింది. ఉరవకొండలో గ్రామపంచాయతీ స్థలం ఎక్కడ ఖాళీ ఉందంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. లక్ష్మీనృసింహస్వామి కాలనీలోని సర్వే నంబర్ 604లో రూ.80 లక్షలు విలువ చేసే 30 సెంట్ల స్థలం ఉంది. ఇందులో 3 సెంట్ల స్థలాన్ని పీర్లచావిడికి పంచాయతీ వారు కేటాయించారు. ఇంకా 27 సెంట్ల స్థలం ప్రజాప్రయోజనాల కోసం అలాగే ఉంచారు. ఈ విలువైన స్థలంపై కొంతమంది టీడీపీ నేతల కన్ను పడింది. రెవెన్యూ అధికారులతో ములాఖత్ అయి 2017లో మంజూరు చేసినట్లు నకలీ పట్టాలు సృష్టించుకున్నారు. ఇందులో టీడీపీ కుటుంబ సభ్యులు, వారి బంధువుల పేరు మీద రెండు సెంట్ల స్థలం మంజూరైనట్లు పట్టాల్లో కనబరిచారు. దీంతో రెండు రోజులుగా సదరు స్థలం వద్దకెళ్లి హద్దులు వేసేందుకు సిద్ధమయ్యారు. గమనించిన కాలనీవాసులు అడ్డగించి.. ప్రజోపయోగం కోసం కేటాయించిన స్థలాన్ని మీరెలా ఆక్రమిస్తారంటూ నిలదీశారు. ‘మమ్మల్నే నిలదీస్తారా’ అంటూ అధికార పార్టీ నాయకులు కాలనీవాసులపై దాడికి యత్నించారు. అంతటితో ఆగక వీరే ముందుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని తమపై కాలనీవాసులు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు టీడీపీ నేతలకు కేటాయించిన పట్టాలపై రెవెన్యూ అధికారులతో విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ స్థలంలో కొంతమంది రెవెన్యూ సిబ్బంది కుడా వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద పట్టాలు రాయించుకున్నట్లు విశ్వసనీయసమాచారం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజోపయోగ కార్యాల కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తే తాము అడ్డుకుని తీరుతామని కాలనీవాసులు స్పష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శి గౌస్సాహెబ్ స్పందిస్తూ విచారణ జరిపి పంచాయతీ స్థలం అయితే దాన్ని ఆక్రమణకు గురికాకుండా చూస్తామని తెలిపారు. ప్రజోపయోగ స్థలానికి నకిలీ పట్టాలు స్థలంలోకి వెళ్లిన వారిని అడ్డుకున్న ప్రజలు కాలనీవాసులపై దాడికి యత్నించిన ‘తమ్ముళ్లు’ -
హెచ్ఐవీ నియంత్రణకు పటిష్ట చర్యలు
అనంతపురం మెడికల్: హెచ్ఐవీ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో హెచ్ఐవీ తగ్గుముఖం పట్టిందని చెప్పారు. ఈ ఏడాదిలో 26,516 మంది గర్భిణులకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తే అందులో 20 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఇక సాధారణ ప్రజలు 58,501 మందికి పరీక్షలు చేయగా 264 మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయ్యిందన్నారు. క్షేత్రస్థాయిలో హెచ్ఐవీని అరికట్టడానికి విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినం డిసెంబర్ ఒకటో తేదీన అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు చేపట్టే ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ లైట్ ర్యాలీ ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ జయలక్ష్మి, ఎయిడ్స్ విభాగం ప్రోగ్రాం మేనేజర్ వెంకటరత్నం, రమణ, డెమో నాగరాజు, ఎస్ఈఈఓ త్యాగరాజు, డిప్యూటీ హెచ్డీఓ గంగాధర్ పాల్గొన్నారు. -
28,768
ఉమ్మడి జిల్లాలో గణాంకాలు మందులు తీసుకున్న వారి సంఖ్య16,414● ఉమ్మడి జిల్లాలో విస్తరిస్తున్న హెచ్ఐవీ ● నియంత్రణలో ఆరోగ్య శాఖ వెనుకంజ ● రోగుల పట్ల వివక్ష..చికిత్సలకు నిరాకరణ అనంతపురం మెడికల్: హెచ్ఐవీ మహమ్మారి నియంత్రణ పట్ల ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికారులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాపకింద నీరులా హెచ్ఐవీ కేసులు నమోదవడంతో పాటు హెచ్ఐవీతో జీవిస్తున్న వారి పట్ల వివక్ష కొనసాగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇక హెచ్ఐవీ బాధితులకు పూర్తిస్థాయిలో పింఛన్లు మంజూరు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. ఆరోగ్యశాఖ బుకాయింపు ఉమ్మడి జిల్లాలో గత ఐదేళ్లలో 2,283 మంది హెచ్ఐవీ బారిన పడినట్లు ఆరోగ్యశాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఏఆర్టీ సెంటర్లో గడిచిన రెండేళ్లలోనే 1,400కుపైగా కేసులు నమోదయ్యాయి. ఇంకా కదిరి, బత్తలపల్లి ఏఆర్టీ సెంటర్ల పరిధిలో వేల సంఖ్యలో కేసులు రికార్డయ్యాయి. కానీ ఆరోగ్యశాఖాధికారులు హెచ్ఐవీ కేసులను తొక్కిపెడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా అనంతపురం, కదిరి, బత్తలపల్లి ఏఆర్టీ సెంటర్లలో 28,768 మంది హెచ్ఐవీ బాధితులుంటే.. అందులో 16,414 మంది మాత్రమే హెచ్ఐవీకి సంబంధించి మందులు వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ వేల సంఖ్యలో హెచ్ఐవీ బాధితులు మందులను వాడడం లేదు. ఆరోగ్యశాఖ మాత్రం అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నా.. క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా హెచ్ఐవీ మందులు వాడని వారిపై దృష్టిసారించి, వారిని మందులు వాడించేలా చర్యలు తీసుకోవడంలో ఉమ్మడి జిల్లా ఆరోగ్యశాఖాధికారులు విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. మందులు క్రమం తప్పకుండా వాడితేనే హెచ్ఐవీ పాజిటివ్ బాధితుల జీవిత కాలం పెరిగే అవకాశం ఉంది. 511 మంది మృతి ఆరోగ్యశాఖ నివేదికల ప్రకారం హెచ్ఐవీతో జీవిస్తున్న వారు గత ఐదేళ్లలో 511 మంది మృతి చెందారు. వీరిలో క్రమం తప్పకుండా మందులు వాడని వారు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. 2021–22లో 130, 2022–23లో 155, 2023–24లో 122, 2024–25లో 81, 2025–26కు సంబంధించి ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారు. ఆగని వివక్ష.. ● ఈ ఏడాది జూలై 24న ఓ హెచ్ఐవీ బాధితురాలికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి వస్తే వైద్యులు తిరస్కరించారు. చివరకు హెచ్ఐవీ బాధితులు విషయాన్ని అప్పటి ఇన్చార్జ్ కలెక్టర్ శివనారాయణ్ శర్మకు వినవిస్తే.. ఆయన స్పందించడంతో సర్జరీ చేశారు. ● రాయదుర్గానికి చెందిన ఓ యువకుడు, ధర్మవరానికి చెందిన మరో యువకుడు కాలు సమస్యతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి రాగా ఆర్థో వైద్యులు సర్జరీకి తిరస్కరించి తిరుపతికి వెళ్లండని సిఫార్సు చేశారు. కాగా అక్కడికి వెళ్లాక అనంతపురంలోనే చేస్తారని అక్కడి వైద్యులు సెలవిచ్చారు. చివరకు ఇద్దరు యువకులు రూ.3 లక్షలు వెచ్చించి బెంగళూరులో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ● హెచ్ఐవీ బాధితులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం లేదు. జిల్లాలో 18 మంది ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ● ప్రస్తుతం జిల్లాలో ఐదేళ్లుగా 2,366 మందికి మాత్రమే పింఛన్ ఇస్తున్నట్లు ఆరోగ్యశాఖ చెబుతోంది. అర్హులైన వారు ఇంకా వేల సంఖ్యలో పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. హెఐవీతో జీవిస్తున్న వారికి మెరుగైన వైద్య సేవలందిస్తామని పాలకులు, అధికారులు చెబుతున్నా అది మాటలకే పరిమితమవుతోంది. ఏఆర్టీ సెంటర్ల సంఖ్య 3గత ఐదేళ్లలో మరణించిన వారి సంఖ్య511హెచ్ఐవీ బాధితుల సంఖ్య పట్టించుకునే వారే లేరు హెచ్ఐవీతో జీవిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే లేరు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు మాత్రం అధికారులు స్పందించడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిపోయింది. వేల మందికి పింఛన్ మంజూరు కావాల్సి ఉంది. గత ప్రభుత్వంలో కొత్త పింఛన్లు ఇచ్చారు. – రామాంజినేయులు, అనంత నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్స్ నియంత్రణకు కృషి హెచ్ఐవీ నియంత్రణకు కృషి చేస్తాం. క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. బాధితులకు జరగాల్సిన శస్త్రచికిత్సల జాప్యంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. హెచ్ఐవీ రోగులకు మెరుగైన సేవలందించేలా చూస్తాం. – డాక్టర్ భ్రమరాంబదేవి, డీఎంహెచ్ఓ -
ప్రతిష్టాత్మకంగా కోటి సంతకాల సేకరణ
అనంతపురం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన అధ్యక్షతన నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ మండలాల పరిశీలకులు, కన్వీనర్లు, ఎంపీపీలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామ కమిటీల నియామకం, అనుబంధ కమిటీల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ కోటి సంతకాల సేకరణ విజయవంతంగా పూర్తి చేయడానికి మండల నేతల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ఎంపీపీ నారాయణరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్ కుమార్, కరణం భీమరెడ్డి, మండల కన్వీనర్లు రమేష్, మచ్చన్న, సోమశేఖర్ రెడ్డి, ఈడిగ ప్రసాద్, రామచంద్రారెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
బాలికలు అన్ని రంగాల్లో విజయం సాధించాలి
గార్లదిన్నె: బాలికలు అన్ని రంగాల్లో విజయం సాధించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ అరుణకుమారి పిలుపునిచ్చారు. శనివారం మండల గార్లదిన్నెలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికల రక్షణ, విద్య, చట్టాలు, బాలికలకు ఉన్న అవకాశాలుపై శిక్షణ నిర్వహించారు. ప్రాజెక్టు డైరెక్టర్ అరుణకుమారి మాట్లాడుతూ బాలికలకు భరోసా ఇవ్వగలిగితే వారు ఎంతటి క్లిష్టమైన లక్ష్యాన్నైనా సునాయాసంగా చేరుకోగలరని, జీవితంలో స్థిరపడగలరని అన్నారు. బాలికల్లో ప్రతిభను వెలికి తీయడానికి పాటల పోటీలు, డ్రాయింగ్ వకృత్వ పోటీలు నిర్వహించి, సర్టిఫికెట్లు అందజేస్తున్నామన్నారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ సురేంద్రబాబు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శైలజ, చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా సమన్వయకర్త కృష్ణమాచారి, ఎంపీడీఓ యోగానందరెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీవాణి, నిర్మల, కేజీబీవీ ఎస్ఓ నాగసత్య, తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం
● జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా శ్రీనాథ్, యుగంధర్రెడ్డి అనంతపురం కార్పొరేషన్: జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. శనివారం ఆర్డీటీ ఆడిటోరియంలో క్రికెట్ సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి బీఆర్ ఈశ్వర్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా సి.శ్రీనాథ్, ఉపాధ్యక్షుడిగా నూర్ మహమ్మద్ ఖాన్, కార్యదర్శిగా యుగంధర్రెడ్డి, సహాయ కార్యదర్శిగా ఎన్ సర్దార్, కోశాధికారిగా జె.మురళీకృష్ణ, కౌన్సిలర్గా హెచ్ అన్సార్ఖాన్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువకుల ప్రతిభ ఆధారంగానే వివిధ జట్లకు ఎంపిక చేస్తామని చెప్పారు. క్రికెట్ సంఘం అభివృద్ధికి పారదర్శంగా పనిచేయాలని క్రికెట్ సంఘం లైఫ్ టైం మెంబర్ మాంఛోఫెర్రర్ సూచించారు. క్రికెట్ అభివృద్ధికి ఆర్డీటీ మైదానం, సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. నూతన సంఘానికి ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మహిళా క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మచ్చా రామలింగారెడ్డి, క్రికెట్ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు నార్పల సత్యనారాయణరెడ్డి, మండల క్రికెట్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. -
కేశవా.. విద్యార్థుల ఇక్కట్లు కానవా!
కూడేరు: ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు విద్యార్థుల సమస్యలు పట్టడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావొస్తున్నా.. బడి పిల్లలు ఇంకా మండుటెండలోనే పాఠాలు వల్లె వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇందుకు నిదర్శనమే కూడేరు మండలం ఉదిరిపికొండ తండాలోని ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 64 మంది విద్యార్థులున్నారు. ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే తరగతి గదులు కేవలం మూడే ఉన్నాయి. దీంతో 2, 4వ తరగతులను ఆరు బయట నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పటికైనా మంత్రి కేశవ్ స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.


