Anantapur Latest News
-
సజావుగా పాలిసెట్
అనంతపురం: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ఏపీ పాలిసెట్ –2026 జిల్లాలో సజావుగా జరిగింది. మొత్తం 9,809 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 9,110 (93 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని పాలిసెట్ జిల్లా సమన్వయకర్త సి.జయచంద్రారెడ్డి తెలిపారు. అబ్బాయిలు 5,537 (94 శాతం), అమ్మాయిలు 3,553 (92శాతం) మంది హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను జిల్లా పరిశీలకులు సత్యనారాయణరెడ్డి పర్యవేక్షించారు. విపత్తుల నిర్వహణపై మాక్ ఎక్సర్సైజ్ అనంతపురం అర్బన్: రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లాలో ఆయిల్, కెమికల్ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ను కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. విపత్తుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో 30న ఉదయం 8 గంటలకు గుత్తి మండలం పరిధిలో ఉన్న బీపీసీఎల్ ప్లాంట్లో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇన్చార్జ్ జేడీఏ రవిపై 28న విచారణ అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్ ఏడీఏగా ఎం.రవి (ప్రస్తుతం ఇన్చార్జ్ జేడీఏ) ఉన్న సమయంలో 2025 జూన్ 6న అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 28న విచారణ చేపట్టనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. వ్యవసాయశాఖ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని కమిషనరేట్కు చెందిన విచారణాధికారి (జేడీఏ) విజయభారతి నోటీసు జారీ చేసినట్లు సమాచారం. మంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్యే దగ్గుపాటి.. ఏడీఏ రవి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. దీంతో ఈ నెల 22, 23 తేదీల్లో విచారణ ఉంటుందని ఆదేశాలు ఇచ్చారు. అయితే తాజాగా ఎమ్మెల్యే మరో ఉత్తరం ద్వారా సదరు అధికారి ఎం.రవి మీద చేసిన ఆరోపణలు సమాచార లోపం కారణమని తెలియజేశారు. దీంతో ఈ వ్యవహారం ఇంతటితో ఆగిపోతుందని భావించారు. కానీ తాజాగా ఈ నెల 28న అనంతపురం, 29న హిందూపురంలో విచారణ కొనసాగుతుందని విచారణాధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల కాలంలో వ్యవసాయశాఖలో ఆధిపత్య పోరుపై వరుసగా విచారణలు కొనసాగుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ టౌన్–మైసూర్ మధ్య బై వీక్లీ ఎక్స్ప్రెస్ గుంతకల్లు: కాకినాడ టౌన్ నుంచి కర్ణాటకలోని మైసూర్కు కొత్తగా బై వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టినట్లు డివిజన్ అధికారులు తెలిపారు. కాకినాడటౌన్ – మైసూర్ ఎక్స్ప్రెస్(17289)ను మే1 నుంచి పట్టాలెక్కుతుంది. కాకినాడ టౌన్ నుంచి ప్రతి సోమ, శుక్రవారాల్లో ఉదయం 9 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మైసూర్ జంక్షన్కు చేరుతుందున్నారు. తిరుగు ప్రయాణంలో మైసూర్ జంక్షన్ (17290) నుంచి ప్రతి మంగళ, శనివారాల్లో సాయంత్రం 5.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30 గంటలకు కాకినాడ టౌన్కు చేరుతుందన్నారు. ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరంటౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నెలగొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, యాదగిరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, బెంగళూరు, బెంగుళూరు సిటీ, కెంగేరి, రామనగరం, చెన్నపట్నం మండ్య మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. మే చివరి వరకు ఉపాధి హామీ పథకమే అనంతపురం టౌన్: ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉఫాధి హమీ పథకాన్ని వీబీ జీ రామ్ జీ పథకంగా పేరు మార్చి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో ఉపాధి కూలీల పనిదినాలను పెంచడంతో మే నెలాఖరు వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగానే కొనసాగుతుందని డ్వామా పీడీ సలీం బాషా తెలిపారు. -
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ‘హనీ ట్రాప్’ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది.చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా ముఠా సభ్యులు ఈ వ్యవహారాన్ని నడుపుతుంటే పోలీసులు ఎందుకు పసిగట్టలేకపోయారు? ఇంటెలిజెన్స్, ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్
● రెండేళ్లుగా నడుస్తున్న హనీట్రాప్ను గుర్తించడంలో పోలీసులు విఫలం ● ఎస్పీకి సమాచారం ఇవ్వడంలో ఇంటెలిజెన్స్, ఎస్బీ విభాగాలు ఘోర వైఫల్యం ● బాధితులు స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు చేసినా ఎస్బీ, ఇంటెలిజెన్స్ మౌనరాగం ● హనీట్రాప్ వ్యవహారాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్న కొందరు పోలీసులు ● టీడీపీ ఎమ్మెల్యేలకు తెలియకుండానే అనుచరులు దందా చేశారా అనే అనుమానాలు ● టీడీపీ ఎమ్మెల్యేలు, కీలకనేతలపై విచారణ చేస్తేనే వెలుగులోకి మరిన్ని వాస్తవాలు సాక్షిప్రతినిధి అనంతపురం: దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో అనంతపురం ఒకటి. మొన్నటి వరకు దేశంలో వ్యభిచార ముఠాలపై ఎక్కడ రైడ్ చేసినా ‘అనంత’ యువతులు, మహిళలు ఉండేవారు. వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి.. ఆ రొంపిలోకి తిరిగి వెళ్లకుండా నిరోధించేందుకు ఎన్నో స్వచ్ఛందసంస్థలు పని చేశాయి. ఇలాంటి దశ నుంచి ఇప్పుడిప్పుడే ‘అనంత’ అభివృద్ధిబాట పడుతోంది. కష్టపడి బతికే మనుషులున్న ప్రాంతం. పిల్లలను బాగా చదివించుకునేందుకు పట్టణాలకు పంపుతున్నారు. శని, ఆదివారాల్లో అనంతపురం మార్కెట్ యార్డు ప్రాంతాన్ని సందర్శిస్తే జిల్లావాసుల కష్టం, వారి జీవనశైలి కళ్లముందే కన్పిస్తుంది. యాపిల్తో సహా రాష్ట్రంలో అత్యంత ఎక్కువ పండ్ల ఉత్పత్తులు పండించే ప్రాంతం. ఇలాంటి జిల్లాలో ‘హనీ ట్రాప్’ ఉదంతం తీరు, దాని వెనుక టీడీపీ ముఠా సభ్యుల పాత్ర చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే! ఒళ్లు అమ్ముకుని బతికే అభాగ్యులు ఒక రకం. కానీ అమ్మాయిల అందాలతో వలపు వల వేసి.. అందులో చిక్కుకున్న వారిని చితకబాది వీడియోలు తీసి లక్షల రూపాయలకు ప్రామిసరీ నోట్లు రాయించుకుని, వేధించడం, చివరకు వారి ప్రాణాలు పోయే స్థితికి తీసుకురావడం అనేది క్షమించరాని నేరంగా ‘అనంత’ సమాజం భావిస్తోంది. ఎస్పీ చెప్పినా కేసు నమోదుకు నో! జిల్లాలో ఎక్కడ నేరాలు జరిగినా పోలీసుల వ్యవహారశైలి ఎప్పటికప్పుడు గుర్తించి పోలీసుబాస్కు అందించడం ఇంటెలిజెన్స్, ఎస్బీ విధి. ఎస్పీ ఉన్న అనంతపురంలోనే 15 మందికిపైగా ఉన్న ముఠా సభ్యులు వందలాది మందిని ట్రాప్ చేస్తుంటే గుర్తించడంలో విఫలమయ్యారు. చివరకు ఓ పురోహితుడిని పూజ పేరుతో రప్పించి కొట్టి, వీడియోలు తీసి రూ.10 లక్షలు లాగేసి తిరిగి వేధింపులకు దిగితే బాధితుడు పోలీసుస్టేషన్కు వెళ్లినా ఫలితం లేదు. చివరకు గతేడాది డిసెంబర్లో ఎస్పీ జగదీష్ను కలిసి విన్నవిస్తే చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిఫార్సు చేసినా సీఐ రాజేంద్రనాథ్యాదవ్ కేసు నమోదు చేయలేదు. దీన్నిబట్టి పోలీసుశాఖ సిబ్బంది పనితీరు ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. ఊరికో సచివాలయం, కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, సీఐలు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా రెండేళ్లుగా జరుగుతున్న తంతును గుర్తించలేదు. కాదు..కాదు.. తెలిసినా చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు. ఎందుకంటే హనీట్రాప్ ముఠాలో పోలీసుల పాత్ర ఉండటంతో వారి గురించి ‘బాస్’కు చేరవేయకుండా తాత్సారం చేశారు. దీని ఫలితమే హనీ ట్రాప్ కుంభకోణం రూ.కోట్లకు చేరుకుంది. ముఠా వేధింపులు భరించలేక ఏకంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. వందలాది బాధితులు గోడు చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. ఇలాంటి సిబ్బందితో శాంతి భద్రతలను ఎలా కాపాడతారో ఎస్పీకే తెలియాలి. మేల్కోకుంటే ముప్పే జిల్లాలో నిఘా వ్యవస్థ పటిష్టంగా లేకపోతే శాంతిభద్రతలు దారితప్పే ప్రమాదం ఉంది. ఇద్దరు సీఐలు, ఆరుగురు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్న హనీట్రాప్ దందా వ్యవహారంలోనే ఎస్బీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఎస్పీని అప్రమత్తం చేయలేకపోతే జిల్లాలో జరుగుతున్న నేరాల సమాచారం, ఎస్ఐ, సీఐల పనితీరుపై ఎలాంటి పారదర్శక నివేదికలు ఇస్తున్నారో ఎస్పీ గుర్తించాలి. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజకీయాల కోసం ఇలాంటి ఆసాంఘిక శక్తులను వెనకబెట్టుకోవడంపై ఆలోచించాలి. బెంగళూరు, ముంబై, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వినిపించే ‘హనీ ట్రాప్’ పేరు ఇప్పుడు ‘అనంత’కు పాకింది. ప్రభుత్వ, రాజకీయ నేతల ఒత్తిళ్లతో కేసును సీరియస్గా తీసుకోకపోతే భవిష్యత్లో మరిన్ని దారుణాలకు ఇలాంటి ముఠాలు ఒడిగడతాయి. ఎస్పీ నిష్పక్షపాతంగా విచారణ చేయించి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దందా వెనుక ఎమ్మెల్యేల సపోర్ట్ లేదా? బీజేపీ నుంచి లేడీ డాన్ రంగమ్మను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత టీడీపీలో చేర్చుకున్నారు. దబ్బర రాజేష్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ మేయర్ మదమంచి స్వరూపకు అనుచరుడు. హనీట్రాప్ ముఠాతో సంబంధమున్న నరేంద్రరెడ్డి 2024 నుంచి దగ్గుపాటి ప్రసాద్ వెంట నడుస్తున్నారు. వీరు ఇంత అరాచకం చేస్తుంటే పరిటాల సునీత, దగ్గుపాటి ప్రసాద్ ఎందుకు తెలుసుకోలేకపోయారు.. రాప్తాడు మండలం హంపాపురంలోని 7 హిల్స్ హోటల్ వద్ద నిందితురాలితో కలిసి సీఐ శ్రీహర్ష పంచాయితీలు చేస్తుంటే ఎందుకు మిన్నకుండిపోయారు.. సునీత సోదరుడు ధర్మవరపు మురళీకి కూడా ఈ వ్యవహారం తెలీదా.. ఎమ్మెల్యేల మద్దతు లేకుండానే పోలీసులు ఇంత ధైర్యంగా భాగస్వాములయ్యారా.. కార్యకర్తలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇంత నీచమైన మార్గం ఎంచుకోవాలా అనేది జిల్లావాసులు లేవనెత్తుతున్న ప్రశ్నలు. రెండేళ్లుగా ఈ గుట్టును గుర్తించకపోవడం కేవలం నిఘా వైఫల్యమే కాదు, పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కూడా అనేది స్పష్టమవుతోంది. -
తాగునీటి ఎద్దడిపై సభ్యుల గళం
అనంతపురం సెంట్రల్: ‘ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు తారస్థాయికి చేరాయి. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య జఠిలంగా మారుతోంది. సత్యసాయి, శ్రీరామరెడ్డి తదితర తాగునీటి పథకాల నిర్వహణ అధ్వానంగా తయారైంది. కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో నీటి సరఫరా జరగడం లేదు. జిల్లాలో తాగునీటి ఇబ్బందులను తక్షణం పరిష్కరించాలి. బోర్లు ఎండిపోయిన పోయిన గ్రామాల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి’ అని సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనంతపురం కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పాల్గొన్నారు. ముగ్గురు మంత్రులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి.. తాగునీటి సమస్య జఠిలంగా మారుతోంది. నిధుల లేమితో ఏ పనులూ ముందుకు సాగడం లేదు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వ స్థాయిలో చొరవ చూపి నిధులు తీసుకొస్తారని భావిస్తే వారు పత్తా లేకుండా పోయారని జెడ్పీటీసీలు, ఎంపీపీలు నిట్టూర్చారు. సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ముందస్తు చర్యలు చేపట్టకపోతే ఎలా..? వేసవిలో తాగునీటి ఇబ్బందులు వస్తాయని తెలిసినా ముందస్తుగా పనులు చేపట్టకపోతే ఎలా అని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాల వలన ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయని పుట్టపర్తి ఎమ్మెల్యే సిందూరరెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలవుతున్నా ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేయడం ఏంటని ప్రశ్నించారు. గ్రామాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా పశువుల నీటి తొట్టెలు నిర్మించినా అందులో నీరు నింపకపోవడంతో నిరుపయోగంగా మారాయన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని, శనగ, వరి, మొక్కజొన్న పంటను సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. రూ. వంద కోట్ల నిధులు తీసుకురండి పుట్టపర్తి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి కోరగా.. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ స్పందిస్తూ నిధులు తీసుకురావాల్సిన మీరే అడిగితే ఎక్కడి నుంచి ఇవ్వాలని అన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారినికి రూ.100 కోట్ల నిధులు తీసుకురావడానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. అలాగే సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 108 అంబులెన్స్ సేవల్లో అంతరాయం లేకుండా చూడాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య అధికంగా ఉందని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న యూజర్ చార్జీలు జెడ్పీ అందించడం ద్వారా సమస్యాత్మక ప్రాంతాలకు నిధులు మంజూరు చేయడానికి వీలవుతుందని వివరించారు. ఖరీఫ్ సీజన్కు ముందుగానే విత్తనాలు రైతులకు అందించేందుకు వ్యవసాయశాఖ అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించారు. సమస్యలపై ఏకరువు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ మాట్లాడుతూ నార్పల పీహెచ్సీలో గైనకాలజిస్టు లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్కానింగ్ మిషన్ అందుబాటులో ఉన్నా ఉపయోగంలో లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో రాప్తాడు నియోజకవర్గ తాగునీటి సమస్య పరిష్కరించడానికి పీఏబీఆర్ నుంచి పైపులైన్ ఏర్పాటుకు నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి రెండున్నరేళ్లు అవుతున్నా ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. బుక్కరాయసముద్రం జెడ్పీటీసీ నీలం భాస్కర్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 23 గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, అవసరమైన చోట బోర్లు వేయాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక పిల్లలు బయటకు వెళ్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నెట్టం వెంకటేశ్వర్లు, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ కేశవరెడ్డి, ఇన్చార్జ్ జెడ్పీ సీఈఓ నాగరాజు నాయుడు, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. జెడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, చిత్రంలో కలెక్టర్ ఆనంద్, హాజరైన ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూర, సభ్యులు జిల్లాలో తాగునీటి సమస్య జఠిలం ప్రభుత్వ తీరుపై జెడ్పీ సమావేశంలో సభ్యుల ధ్వజం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేల గైర్హాజరు -
హద్దులు చెరిపేసిన ఇసుక మాఫియా
శింగనమల: మండలంలోని నిదనవాడ సమీపంలో ఉన్న పెన్నానదీ పరివాహక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తరలింపులపై శనివారం రెవెన్యూ, మైనింగ్ అధికారులతో కలిసి పోలీసులు పరిశీలించారు. చెలరేగిన ఇసుక మాఫియా ఆగడాలను గత రెండు రోజులుగా రైతులు ఆడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శింగనమల, పెద్దవడుగూరు మండలాలకు చెందిన అధికారుల్లో చలనం వచ్చి క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. పెన్నానది నట్టనడి మధ్య నుంచి ఇసుకను తవ్వి తరలించడంతో ఏర్పడిన లోతైన గుంతలను చూడగానే అధికారులు విస్తుపోయారు. భారీ స్థాయిలో ఇసుకను అక్రమంగా తరలించారని నిర్ధారించుకున్నారు. అక్రమంగా పెన్నానదిలోకి చొరబడి.. పెద్దవడుగూరు మండలం చిత్రచేడు రెవెన్యూ పరిధిలోని పొలంలో ఇసుక రీచ్ కోసం అనుమతులను పొందిన చిత్రచేడు ప్రాంతానికి చెందిన కొందరు చివరకు పెన్నానదిలోకి అక్రమంగా చొరబడినట్లుగా అధికారులు గుర్తించారు. అటూఇటు చేస్తూ పెద్దవడుగూరు, శింగనమల మండలాల హద్దులను చెరిపేస్తూ శింగనమల మండలం నిదనవాడ సరిహద్దులోకి చొరబడి పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలించినట్లుగా నిర్ధారించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులను నిదనవాడ గ్రామానికి చెందిన పలువురు రైతులు నిలదీశారు. పలుమార్లు తాము వాహనాలను ఆడ్డుకుని అధికారులకు పట్టిస్తే ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దులు గుర్తిస్తాం ఇసుక తరలింపులతో భూగర్భ జలం అడుగంటి చుట్టుపక్కల ప్రాంతాల పొలాల్లోని బోరు బావుల్లో నీరు అందకుండా పోతోందని రైతులు వాపోయారు. నిదనవాడ రెవెన్యూ పరిధిలోని వంద ఎకరాల్లో పండ తోటలు ఉన్నాయని, నీటి తడులు అందక చెట్లు ఎండిపోతున్నాయని తెలిపారు. ఇసుక తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నారు. ఇసుక అక్రమ తరలింపుపై చర్యలు తీసుకపోతే, కలెక్టర్ వద్దకెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటామన్నారు. అప్పటికై నా ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అయితే అక్రమంగా ఇసుకను తరలించిన వారిపై తీసుకునే చర్యల గురించి అధికారులు ఏమాత్రం మాట్లాడకుండా నిదనవాడ, చిత్రచేడు గ్రామాల మధ్య ఉన్న రెవెన్యూ సరిహద్దులు గుర్తిస్తామని చెప్పడం విశేషం. విస్తుపోయిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు, పోలీసులు పెన్నానది నట్టనడిమధ్య నుంచి అక్రమ తరలింపు -
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటి పట్టున ఉంటున్న వారు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి నీట మునిగారు. ● వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు విద్యార్థుల మృతి గుమ్మఘట్ట: మండలంలోని కోనాపురం గ్రామానికి చెందిన హనుమంతరాయుడు, ఈరమ్మ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థిరాస్తులేమీ లేకపోవడంతో బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. అక్కడే పిల్లలను చదివించుకుంటున్నారు. వేసవి సెలవులు కావడంతో రాయదుర్గం మండలం వేపరాల గ్రామంలో ఉన్న అమ్మమ్మ గంగమ్మ ఇంటికి వచ్చిన కుమారుడు శరత్ (16)... శనివారం స్నేహితులతో కలసి సరదాగా వేదవతి హగరిలోని ఓ గుంతలో ఉన్న నీటిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీట మునిగిపోయాడు. ఆ సమయంలో స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టి వెలికి తీసేలోపు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి గ్రామానికి చెందిన హరిజన వెంకటేశులు అనంతపురానికి మకాం మార్చి ఓ అపార్ట్మెంట్కు వాచ్మెన్గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అనంతపురంలోనే ఆయన కుమారుడు విజయ్కుమార్ ఏడో తరగతి చదువుకుంటున్నారు. వేసవి సెలవులు కావడంతో అపార్ట్మెంటులోని తన స్నేహితులతో కలసి స్వగ్రామం జీడిపల్లికి విజయ్కుమార్ వచ్చాడు. శనివారం రిజర్వాయర్ కాలువ సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విజయ్కుమార్ నీటిలో పడిపోయాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న సమీపంలోని పొలాల్లో ఉన్న రైతులు వెంటనే కాలువ వద్దకు చేరుకుని గాలించి వెలికి తీసేలోపు విజయకుమార్ మృతి చెందాడు. ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శివ తెలిపారు. శరత్ (ఫైల్), మృతుడు విజయ్కుమార్ -
కార్యకర్తలే పార్టీకి బలం
ఆత్మకూరు: వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలమని, కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుని అండగా నిలుస్తామని రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలోని తన స్వగృహంలో శనివారం రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులతో ఆయన సమావేశమై మాట్లాడారు. గ్రామ కమిటీ అధ్యక్షులను పార్టీ కార్యకర్తలకు పరిచయం చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షుడితో మొదలు ప్రతి ఒక్కరూ పార్టీ గుర్తింపు కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. గుర్తింపు కార్డు లేని వారు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఓటు హక్కును కాపాడుకుందాం మనం ఎక్కడున్నా... నియోజకవర్గంలోనే ఓటు హక్కు ఉండేలా చూసుకోవాలని కార్యకర్తలకు ప్రకాష్రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలోనూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో బీఎల్ఓలు, గ్రామ కమిటీ అధ్యక్షులు కీలకంగా వ్యవహరించాలన్నారు. గ్రామంలో ఎవరికై నా ఓటు హక్కు ఉందో లేదా తెలుసుకుని వారిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా ఎండగట్టాలని యువతకు పిలుపునిచ్చారు. అలాగే వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు మనం చేసిన మంచిపై చైతన్యం తీసుకురావాలన్నారు. గ్రామ స్థాయి సమావేశాలతో చైతన్యం పరచాలి గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జనాన్ని చైతన్య పరచాలన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేరూరు డ్యాంకు నీరు అందకుండా చేశారని, అలాగే హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ వేసి రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. పాపంపేటలో 300 ఎకరాలను ఆక్రమించుకోవాలని చూశారని, 14 ఇళ్లను కూలదోశారని, ఆ సమయంలో బాధితులకు అండగా నిలిచామని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని జగనన్నతో మాట తీసుకున్నామని, ఇందులో భాగంగానే పిల్ల కాలువల ద్వారా లక్ష ఎకరాలకు నీరు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు దుబ్బా చంద్రశేఖరరెడ్డి, రంగంపేట గోపాలరెడ్డి, బాలపోతన్న, వీరాంజనేయులు, నరసింహారెడ్డి, గూలి కొండారెడ్డి, సుభద్రమ్మ, వాసుదేవరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, సనప గోపాలరెడ్డి, కృష్ణానాయక్, మల్లారెడ్డి, మీనుగ నాగరాజు, ఎంపీటీసీ పోతులయ్య, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున, సుదాకర్రెడ్డి, యల్లప్ప, భాస్కర్, లోకేష్, అమర్నాథ్, రమేష్, కొండా, ఆదెప్ప, మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, వెంకటేష్, మురళి, ఓబీ టైలర్ వెంకటేష్, ఆంజనేయులు, నరసింహ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జనాన్ని చైతన్యపరచండి పిల్ల కాలువల ద్వారా పొలాలకు నీరు అందించడమే మా లక్ష్యం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి -
కారు ఢీకొని యువకుడి మృతి
గుత్తి రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ఓ వలస కూలీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉత్తర్ప్రదేశ్లోని ఆజమ్ఘర్ జిల్లా ఫూల్పూర్ తాలూకా బెల్బాయి గ్రామానికి చెందిన అజయ్ సరోజ్ (23), అదే గ్రామానికి చెందిన మరికొందరితో కలసి గుత్తి మండలంతో పాటు నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలంలో మామిడి కాయల ప్యాకింగ్ పనికి వచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామ శివారున ఉన్న తోటలో మామిడి కాయలు ప్యాకింగ్ చేసి లారీలో లోడు చేశారు. మధ్యాహ్న భోజనం కోసమని 44వ జాతీయ రహదారి దాటుతున్న అజయ్ సరోజ్ను కర్నూలు నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అజయ్ను తోటి కూలీలు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స మొదలు పెట్టే లోపు ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన కారును అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతర్రాష్ట్ర గంజాయి విక్రేత అరెస్ట్ కూడేరు: గంజాయి విక్రయిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కూడేరు పీఎస్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీఐ రాజు వెల్లడించారు. తాడిపత్రికి చెందిన గట్టు శివదత్త చెడు వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బు సంపాదనకు గంజాయిని కొనుగోలు చేసి కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి తరలించి ఎక్కువ మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఈ నేపథ్యంలో శనివారం గంజాయి తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు కూడేరు మండలం ముద్దలాపురం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకటిన్నర కిలోల గంజాయి, ఖరీదైన ఓ కారు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీఎస్సీ వికలాంగుల కోటాలో అన్యాయం చేశారు ● విద్యాశాఖ తీరుపై దివ్యాంగులు అంజనప్ప, ప్రభావతి ఆవేదన అనంతపురం టవర్క్లాక్: మెగా డీఎస్సీలో భాగంగా గత ఏడాది చేపట్టిన నియామక ప్రక్రియలో వికలాంగుల కోటా కింద అనర్హులకు పోస్టింగ్ ఇచ్చారంటూ బాధితులు శ్రీసత్యసాయి జిల్లా ఓడీసీ మండలానికి చెందిన అంధుడు అంజనప్ప, అనంతపురం జిల్లా గుంతకల్లు మండలానికి చెందిన ప్రభావతి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అనంతపురంలోని రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో పనిచేసిన డీఈఓ ప్రసాద్, ఆర్జేడీ శ్యామూల్ ముడుపులు తీసుకుని తమకు తీరని అన్యాయం చేస్తూ ఎలాంటి అర్హత లేని శివలింగమ్మకు పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు. స్థానికంగా ఆమెకు వైద్య పరీక్షలు చేయించకుండా వైఎస్సార్ కడప జిల్లాలో చేయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ను స్వయంగా సమస్య వివరించినా ఇప్పటి వరకూ వారూ కూడా స్పందించలేదని వాపోయారు. న్యాయం చేకూరే వరకు తాము పోరాటం చేస్తామని తెలిపారు. క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య రాప్తాడు రూరల్: క్షణికావేశంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... వజ్రకరూరు మండలం కొనకొండ్లకు చెందిన చాకలి భాగ్యమ్మ (34)కు రాప్తాడుకు చెందిన చాకలి నరేష్తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నరేష్ ఎలక్ట్రీషియన్గా, భాగ్యమ్మ బేల్దారి కూలీగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల దంపతుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు నెలకొన్నాయి. శనివారం ఉదయం ఇద్దరూ పనుల కోసమని బయటకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికొచ్చారు. ఆ సమయంలో పిల్లలతో కలసి తాను ఊరికి వెళ్తానని వదిలిరావాలంటూ భర్తను భాగ్యమ్మ అడిగింది. అయితే తనకు ఓపిక లేదని, మీరే వెళ్లాలంటూ నరేష్ తెలిపాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తల్లి గట్టిగా అరుస్తుంటే కుమారుడు ‘అమ్మా నువ్వు లోపలికి వెళ్లు’ అంటూ గదిలోకి పంపి తలుపులు వేశాడు. అప్పటికే తీవ్ర మనస్థాపానికి గురైన భాగ్యమ్మ గది లోపలి నుంచి గడియపెట్టుకుని ఉరి వేసుకుంది. కాసేపటి తర్వాత తలుపులు తీసేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. దీంతో బలవంతంగా తలుపు తొలిగించి చూశారు. అప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భాగ్యమ్మను గమనించి వెంటనే సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఇంధన కొరతతో ఇక్కట్లు
● పలు చోట్ల పెట్రోలు బంకులు మూత ● నో స్టాక్ బోర్డుతో వాహనదారుల బేజారు కళ్యాణదుర్గం/ తాడిపత్రి టౌన్: అనంతపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శనివారం ఇంధన కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కళ్యాణదుర్గంలో 8 పెట్రోల్ బంకులకు గాను ఆరు చోట్ల నోస్టాక్ బోర్డులు వెలిశాయి. దీంతో మిగిలిన రెండు బంకుల వద్దకు వాహనదారులు క్యూ కట్టారు. అయితే అక్కడ ఒక చోట పెట్రోల్ లేకపోతే.. మరొక చోట డీజిల్ లేదు. ఉదయం నుంచి వేచి ఉన్నా పెట్రోల్, డీజిల్ లభించకపోవడంతో వాహనదారులు మండిపడ్డారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కష్టాల నుంచి కోలుకోకముందే ఇప్పుడు ఇంధన కొరత ఏర్పడటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదని దుమ్మెత్తిపోశారు. ఇక తాడిపత్రి పట్టణ, చుట్టుపక్కల 20 పెట్రోలు బంకులు ఉండగా.. 12 బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు వెలిశాయి. పెట్రోలు, డీజిల్ దొరక్కపోతే ఆటోలు ఎలా నడపాలి.. కుటుంబాలు ఎలా పోషించుకోవాలని డ్రైవర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొందరు వాహనదారులు ముందు జాగ్రత్తగా అదనపు క్యాన్లతో క్యూలో నిల్చోవడం గమనార్హం. రాత్రికల్లా మిగిలిన బంకుల్లో కూడా ఇంధన నిల్వలు అయిపోయినట్లు తెలిసింది. ఇక అనంతపురంలో అర్ధరాత్రి వరకూ పెట్రోలు బంకుల వద్ద వాహనదారులు కిక్కిరిసిపోయారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు అనంతపురం అర్బన్: జిల్లాలో డీజిల్ కొరత లేదని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ స్పష్టం చేశారు. కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు ఆయన సూచించారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిల్వలు ఉన్నాయన్నారు. డిమాండ్ మేరకు ఇంధనం సరఫరా చేయాలని సంబంధిత బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ సేల్స్ ఆఫీసర్లకు తెలియజేశామన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా స్టాక్ నిల్వ చేసినా, బ్లాక్ మార్కెటింగ్కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్లు, సీఎస్డీటీలు తమ పరిధిలోని పెట్రోల్ బంక్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. కళ్యాణదుర్గంలోని నోస్టాక్ బోర్డుతో మూతతాడిపత్రిలో క్యూ..అనంతపురంలో పెట్రోలు బంకుల వద్ద శనివారం రాత్రి బారులు తీరిన ద్విచక్ర వాహనదారులు -
ఆలయ కమిటీ నుంచి ‘హనీట్రాప్’ అనంత కుమారి తొలగింపు
అనంతపురం కల్చరల్: హనీట్రాప్ కేసులో పట్టుబడిన అనంతపురంలోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ ధర్మకర్తల మండలి సభ్యురాలు అనంతకుమారిని కమిటీ నుంచి తొలగిస్తున్నట్లు ఈఓ నాగేంద్రుడు తెలిపారు. శనివారం మొదటిరోడ్డులోని శివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్ర చౌదరితో కలిసి ఆయన మాట్లాడారు. ఇకపై ఆలయానికి ఆమెకు ఎలాంటి సంబంధాలుండవని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. మలేరియా అంతమే లక్ష్యం అనంతపురం: జిల్లాలో 2030 నాటికి మలేరియాను పూర్తి స్థాయిలో అంతం చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకుని కార్యాచరణను అమలు చేస్తున్నట్లు జిల్లా మలేరియా అధికారి ఓబులు తెలిపారు. నివారించదగిన వ్యాధులపై ప్రపంచ టీకాల వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలను చైతన్య పరుస్తూ శనివారం అనంతపురంలో నర్సింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీని చేపట్టారు. డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ర్యాలీని డాక్టర్ ఓబులు ప్రారంభించారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి మలేరియాను నిర్మూలించడంలో తమ వంతు బాధ్యత నెరవేరుస్తామంటూ విద్యార్థులతో కలిసి వైద్యాధికారులు ప్రతిజ్ఞ చేశారు. డాక్టర్ ఓబులు మాట్లాడుతూ.. 2027 చివరి నాటికి మలేరియా జీరో కేసులే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, 2030 నాటికి పూర్తి స్థాయిలో అంతం చేస్తామని పేర్కొన్నారు. మలేరియా ప్రభావిత ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా పరిగణిస్తూ ప్రభుత్వ అన్ని శాఖల సహకారంతో ముందస్తు వ్యాధి నివారణ చర్యలు చేపడతామన్నారు. జూన్ మాసమంతటా మలేరియా నివారణ మాసోత్సవాలను నిర్వహిస్తామన్నారు. జిల్లా మాస్ మీడియా అధికారి నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో మాత్రమే మలేరియా కేసులు నమోదు కావడం లేదన్నారు. ఇందులో అనంతపురం జిల్లాను చేర్చేలా కృషి చేయాలన్నారు. మాస్ మీడియా డిప్యూటీ అధికారి లక్ష్మీనారాయణ, హెచ్ఈఓ గంగాధర్, ఇన్చార్జ్ సహాయ మలేరియా అధికారి మద్దయ్య, అర్బన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి అబ్దుల్ మునాఫ్, సిబ్బంది నూర్బాషా, శ్రీధర్ మూర్తి, రమేష్ బాబు, రాఘవేంద్రరెడ్డి, లోకేశ్వరరెడ్డి, మధుసూదన్, డిప్యూటీ హెచ్ఈఓ వెంకటేష్, ఆదిల్ బాషా, డెమో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు అనంతపురం ఎడ్యుకేషన్: వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు జూన్ 11 వరకు వేసవి సెలవులు పాటించాల్సినందేనని స్పష్టం చేశారు. ప్రత్యేక తరగతులు, స్పెషల్ కోచింగ్, రెమిడియల్ క్లాస్ల పేరుతో విద్యార్థులను పాఠశాలలకు రప్పించడం పూర్తిగా నిషేధమన్నారు. అలాగే హోమ్వర్క్, ప్రాజెక్టులు, పరీక్షలు వంటి అకడమిక్ కార్యకలాపాలు అప్పగించరాదన్నారు. ఎలాంటి స్కాలర్షిప్ పరీక్షలూ నిర్వహించరాదన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాలను ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలను విక్రయించరాదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం మాత్రమే ఫీజులు వసూళ్లు చేయాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిలబస్కు అనుగుణంగా ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలనే వినియోగించాలన్నారు. ఇతర పుస్తకాలను గుర్తిస్తే మాత్రం చర్యలుంటాయని హెచ్చరించారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు వారి పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించినా, నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయించినా, అధికఫీజులు వసూళ్లు చేసినా సంబంధిత ఉప విధ్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. -
అనంతపురం కేంద్రంగా తెలుగుదేశం పార్టీ నేతలు సాగించిన హనీట్రాప్ ఉదంతంలో ఉచ్చు బిగుస్తోంది. ఇందులో భాగస్వాములైన ఎవ్వరినీ వదలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్ కృతనిశ్చయంతో ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆ దిశగానే ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా, ప
సాక్షిప్రతినిధి, అనంతపురం: అమాయకులను లక్ష్యంగా చేసుకుని అమ్మాయిలను ఎరగా వేసి.. పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లోకి దూసుకొచ్చి ఒళ్లు హూనమయ్యేలా చితకబాది.. నగ్న ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి.. బాధితుల నుంచి రూ.లక్షల్లో డబ్బు వసూలు చేస్తున్న హనీట్రాప్ ముఠాపై పోలీసు శాఖ కొరఢా ఝుళిపిస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు రంగమ్మ నాయుడు, రాజేష్ నాయుడు, నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో నడిచిన హనీ ట్రాప్ దందాపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ముఠా సభ్యుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్డేటా ఆధారంగా ఆడియో రికార్డులు తెప్పించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులపై ఆడియో రికార్డుల ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. పోలీసు ప్రతిష్ట పెంచే దిశగా చర్యలు ‘అనంత’ హనీట్రాప్ వ్యవహారాన్ని ఛేదించడంపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో పోలీసు అధికారుల పాత్ర ఉండటం ఆయన్ను బాధించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ముఠాలో ఉన్నవారు, అందులో భాగస్వాములుగా ఉన్నవారు ఎవ్వరినీ వదలిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్, డీఐజీ షీమోషీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు శాఖకు తీరని మచ్చను మిగిల్చిన ఈ వ్యవహారంలోని పోలీసులందరిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా రాప్తాడు సీఐ శ్రీహర్షను విధుల నుంచి పూర్తిగా తొలగించేలా సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్యాదవ్పై కూడా సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు తెలిసింది. వీరితో పాటు మరికొంతమంది పోలీసుల పాత్రపై ఆరా తీయడంతో పాటు ఆధారాలు సేకరిస్తున్నారు. వీరిపై కూడా సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా పోయిన పోలీసు ప్రతిష్టను పునరుద్ధరించాలనే భావనలో ఎస్పీ, డీఐజీ ఉన్నట్లు తెలు స్తోంది. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రైనీ ఎస్పీ అశ్విన్ మణిదీప్ పర్యవేక్షణలో ఈ కేసు విచారణ సాగుతోంది. నలుగురు సీఐల పాత్రపై ఆరా హనీ ట్రాప్ ముఠా బాధితులతో రెండు, మూడేళ్ల కిందటి తేదీలతో ప్రామిసరీనోట్లు రాయించుకున్న తర్వాత వాటిని సీఐల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేసే పని చేశారు. ఈ వ్యవహారంలో అనంతపురంతో పాటు ఇతర ప్రాంతాల్లోని బాధితులు ఉన్నారు. వీరితో డబ్బులు వసూలు చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లోని సర్కిళ్లలో పని చేసే సీఐలు, ఎస్ఐల సహకారం తీసుకున్నారు. అయితే ఆ సీఐలు కూడా హనీ ట్రాప్ వ్యవహారం తెలిసి సహకరించారా? తెలీకుండా బకాయిలు మాత్రమే వసూలు చేశారా? బకాయిలు వసూలు చేయమని ఏ టీడీపీ నేత సిఫార్సు చేశారు? అనే దిశగా కూడా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. పురోహితులనూ వదలని గ్యాంగ్ హనీట్రాప్ బాధితుల్లో ఉద్యోగులు, వ్యాపారులు, రియల్టర్లతో పాటు పురోహితులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత బాధితులు నేరుగా ఎస్పీని కలిసి గోడు వెల్లబోసుకుంటున్నారు. ముఠా సభ్యుల నుంచి బాండ్లను సేకరించిన ఎస్పీ.. వాటిని చించేసినట్లు తెలుస్తోంది. అలాగే వసూలు చేసిన డబ్బుల రికవరీ దిశగా కూడా ఎస్పీ ఆలోచిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో ఎస్పీకి బాధితులు వాయిస్ మెసేజ్, ఫోన్లు, వాట్సాప్ ద్వారా ధన్యవాదాలు చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు బాధితుల వేదనను విన్న ఎస్పీ తీవ్రంగా చలించినట్లు తెలుస్తోంది. ఓ ప్రజాప్రతినిధి వీడియోపై సర్వత్రా చర్చ! హనీట్రాప్ వ్యవహారంలో ఓ టీడీపీ ప్రజాప్రతినిధి ఆడియో, వీడియో రికార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని జిల్లా పోలీసు అధికారులు ఇంటెలిజెన్స్ డీజీకి, డీజీపీకి పంపారని తెలుస్తోంది. అయితే ఇది పోలీసు వర్గాలతో పాటు టీడీపీ నేతలతో చర్చిస్తున్న అంశమే. ఇది వాస్తవమా కాదా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. హనీట్రాప్కు రాజకీయ రంగు హనీట్రాప్ వ్యవహారంలో అరెస్టయిన లేడీ డాన్ రంగమ్మనాయుడు బీజేపీ నుంచి టీడీపీలో చేరారు. రాజేశ్నాయుడు టీడీపీలో కొనసాగుతున్నారు. అలాగే రుద్రంపేట మాజీ ఉపసర్పంచ్ నరేంద్రరెడ్డి వైఎస్సార్సీపీ మద్దతుతో గెలిచినా, 2024కు ముందే టీడీపీలో చేరారు. ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్కు అనుకూలంగా పని చేశారు. అలాగే అనంత వెంకటరామిరెడ్డిని ఓడించేందుకు పనిచేస్తానని ఎల్లో మీడియా వేదికగా చెప్పారు. ఇలాంటి వ్యక్తిని తిరిగి వైఎస్సార్సీపీ నేతగా ప్రచారం చేసే ప్రయత్నం టీడీపీ నేతలు, అనుకూల మీడియా చేశాయి. అయితే వాస్తవం ‘అనంత’ ప్రజానీకానికి తెలియడంతో టీడీపీ ఎత్తులు పారలేదు. మరో ఆరుగురి పోలీసులపై చర్యలుహనీ ట్రాప్ ముఠాతో సంబంధాలు ఉన్న పోలీసులపై చర్యలకు ఎస్పీ జగదీష్ ఉపక్రమించారు. ఇందులో భాగంగా అనంతపురం రూరల్, ఇటుకలపల్లి పోలీస్స్టేషన్లలో పని చేస్తున్న ఆరుగురు సిబ్బందిని వీఆర్కు పంపుతూ శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వీఆర్కు వెళ్లిన వారిలో అనంతపురం రూరల్ ఏఎస్ఐ నాగరాజు, హెడ్కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుళ్లు జయరాంనాయక్, దేవేంద్ర, మురళి ఉన్నారు. అలాగే ఇటుకలపల్లి కానిస్టేబుల్ దేవ్లానాయక్ ఉన్నారు. ముఠాలోని టీడీపీ నేతల కాల్ రికార్డులు పరిశీలిస్తున్న పోలీసులు ముఠాలో మరికొంతమంది పోలీసులు, రాజకీయ నేతలు ఉన్నట్లు గుర్తింపు బాధితుల్లో పురోహితులు, ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయనేతలు కూడా.. ట్రైనీ ఎస్పీ అశ్విన్ మణిదీప్తో లోతుగా విచారణ చేయిస్తున్న ఎస్పీ జగదీష్ వీఆర్కు మరో ఆరుగురు పోలీసులు -
‘అనంత’ వేదికగా ఫుట్బాల్ టోర్నీ
అనంతపురం అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆర్డీటీ స్టేడియం వేదికగా ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్–2026 నిర్వహించున్నారని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. టోర్నీ నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్లోని మినీకాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జేసీ సమీక్షించారు. అండర్–15, అండర్–19 బాలబాలికల విభాగంలో మూడు రోజుల పాటు టోర్నీ సాగుతుందన్నారు. ప్రతి జిల్లా నుంచి దాదాపు 72 మంది చొప్పున 28 జిల్లాల ప్రాతినిథ్యం ఉంటుందన్నారు. బాలికలకు విన్సెంట్ డిపాల్, ఆర్డీటీలో వసతి ఉంటుందని, బాలురకు కలెక్టరేట్ సమీపంలోని బుడ్డప్పనగర్లో ఉన్న రాజేంద్ర మునిసిపల్ ఉన్నత పాఠశాలలో వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. క్రీడా ప్రాంతం, వసతి ప్రదేశాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మంజుల, వైఎస్సార్ కడప స్పోర్ట్స్ స్కూల్ కో–ఆర్డినేటర్, ప్రత్యేక అధికారి జగన్నాథరెడ్డి, ఆన్సెట్ అధికారి శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అడ్డంగా దొరికి..అడ్డగోలు ప్రచారమా?
అనంతపురం: ‘జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న రుద్రంపేట మాజీ ఉప సర్పంచ్ నరేంద్ర రెడ్డి ..అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు ముఖ్య అనుచరుడు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ దగ్గుపాటి తరఫునే పనిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా ఉన్నాయి. అయినా అతను మావాడు కాదని టీడీపీ నేతలు అనడం, ఎల్లోమీడియా కూడా వైఎస్సార్సీపీకి ఆపాదించి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు’ అని అనంతపురం నగర మాజీ మేయర్ వసీం సలీం, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం వారు అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నరేంద్రరెడ్డిని నాలుగేళ్ల క్రితమే వైఎస్సార్సీపీకి దూరంగా ఉంచినట్లు మాజీ మేయర్ వసీం తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ స్వయంగా నరేంద్రరెడ్డి ఇంటికి వెళ్లి అతన్ని కలిశారన్నారు. అలాగే అతను దగ్గుపాటి తరఫున ఎన్నికల్లో పనిచేశాడని, గెలిచిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లి మరీ అభినందించాడని తెలిపారు. అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చినందుకు 101 టెంకాయలు కొట్టి సంబరాలు చేసుకున్నాడన్నారు. అలాంటి వ్యక్తి హనీ ట్రాప్ కేసులో దొరకగానే ఎల్లోమీడియా తప్పుడు ప్రచారానికి తెర లేపిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో నగరంలో అకృత్యాలు పెరిగిపోయాయన్నారు. భూకబ్జాలు, అక్రమాలు, బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో హనీట్రాప్లు జరిగేవని, ఇప్పుడు టీడీపీ నేతల అండ, పోలీసుల నిర్లక్ష్యంతో అనంతపురంలోనూ జరుగుతున్నాయన్నారు. నగర అధ్యక్షుడు సోమ శేఖర్రెడ్డి మాట్లాడుతూ ఇదివరకు జిల్లాలో రైతు ఆత్మహత్యలు చూశామని, ఇప్పుడు హనీట్రాప్ల కారణంగా బాధితులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చూస్తున్నామని అన్నారు. గత ఎన్నికల సమయంలో రుద్రంపేట నరేంద్రరెడ్డి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడంటూ ఆంధ్రజ్యోతి పత్రిక, ఈటీవీలో సైతం కథనాలు వచ్చాయన్నారు. మళ్లీ ఇప్పుడు అతను వైఎస్సార్సీపీ అంటూ ఎల్లోమీడియా చిత్రీకరించడం దారుణమన్నారు. మంచి జరిగితే టీడీపీకి.. చెడు అయితే వైఎస్సార్సీపీకి ఆపాదించడం ద్వారా మీడియా విలువలను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. నగరంలో గంజాయి, బెల్ట్ షాపులు మితిమీరిపోయాయని, విచ్చలవిడిగా పర్మిట్ రూమ్లు పెట్టి నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. రుద్రంపేట నరేంద్రరెడ్డి టీడీపీ వ్యక్తే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటికి ప్రధాన అనుచరుడు హనీట్రాప్ కేసులో దొరకగానే మీవాడు కాదంటారా? టీడీపీ, ఎల్లోమీడియాపై మాజీ మేయర్ వసీం, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి ధ్వజం -
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
అనంతపురం అర్బన్: విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ ఆనంద్ ఐసీడీఎస్ అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. ఐసీడీఎస్ పనితీరుపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్సీకి సిఫారసు చేసిన పిల్లలు తప్పనిసరిగా అక్కడే ఉండేలా చూడాల్సిన బాధ్యత సీడీపీఓ, సూపర్వైజర్లదేనని అన్నారు. పోషణ్ ట్రాకర్, గ్రోత్ మానిటరింగ్కు సంబంధించి కచ్చితమైన డేటా నమోదు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలను సూపర్వైజర్లు, సీడీపీఓలు సందర్శించడంతో పాటు పిల్లల ఎత్తు, బరువు కొలచాలన్నారు. ఆ రిపోర్టును ఆదే రోజు సమర్పించాలని ఆదేశించారు. తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, పిల్లల బరువు విషయంలో జాగ్రత్తలు పాటించనట్లు గుర్తిస్తే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. టీహెచ్ఆర్ పంపిణీలో జిల్లా 8వ స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో మొదటిస్థానానికి చేరుకునేలా పనిచేయాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు సరుకులను పౌరసరఫరాల శాఖ సరఫరా చేయడంలో ఆలస్యం చేస్తే విషయాన్ని తన దృష్టికి తీసుకురావాలన్నారు. టీనేజీ ప్రెగ్నెన్సీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డులేని పిలల్లను, డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి పాఠశాల్లలో చేర్పించాలన్నారు. పాఠశాలలు పునఃప్రారంమైన తరువాత వయసు 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల ఉన్న విద్యార్థినులకు బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ శశికళ, జిల్లా సరఫరాల సంస్థ మేనేజర్ రమేష్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ శ్రీనివాసులురెడ్డి, సీడీపీఓలు శ్రీదేవి, లలితమ్మ, షాజిదాబేగం, ఎల్లమ్మ, ఉమా, భారతి, సూపర్వైజర్లు, పాల్గొన్నారు. ప్రజలు నేరుగా ఫిర్యాదులు సమర్పించాలి అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు మధ్యవర్తుల ద్వారా కాకుండా ప్రజలు నేరుగా ఫిర్యాదులు సమర్పించాలని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రజల ఫిర్యాదులు ఆర్టీఐ కార్యకర్తలు, స్థానిక దళారుల వంటి మధ్యవర్తుల ద్వారా నమోదవుతున్నాయన్నారు. చాలా సందర్భాల్లో సంబంధిత వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులు నేరుగా నమోదు చేసుకోవడానికి బదులుగా అర్జీదారుల వివరాలను ఉపయోగించి ఇతరుల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. దీంతో ఫిర్యాదుల పరిష్కార సమయంలో పౌరులకు, పరిష్కరించే అధికారులకు, శాఖాధిపతులకు అనవసరమైన సమస్యలకు, అసౌకర్యానికి దారితీస్తోందన్నారు. -
ఆగిన ‘శ్రీరామరెడ్డి’ తాగునీటి సరఫరా
● మూడు నియోజకవర్గాలో దాహం కేకలు కూడేరు: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వల్ల ఏకంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా ఆగిపోయింది. కూడేరు మండల పరిధిలోని పీఏబీఆర్ వద్ద ఏర్పాటైన నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ పథకం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర నియోజక వర్గాల్లోని సుమారు 1,050 గ్రామాలకు తాగునీటిని సరఫరా అవుతోంది. ఈ నెల 19న తాగునీటిని సరఫరా చేసే మూడు పంపింగ్ పైపులు పని చేయకుండా మొరాయించాయి. ఇందులో ఒక పంపింగ్ పైపు పనిచేసినా కూడా నీటి సరఫరా సాఫీగానే సాగుతుంది. అయితే ఒక దాని తర్వాత మరొకటి అలా మూడు పంపింగ్ పైపులూ పనిచేయకుండా పోయాయి. కాంట్రాక్టర్, అధికారులు పంపింగ్ పైపుల పని తీరును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించినట్లు తెలుస్తోంది. మరమ్మతుల కోసం రెండు రోజుల క్రితం పంపింగ్ పైపులను తీసుకెళ్లారు. శుక్రవారం సాయంత్రం వరకు పైపులను అమర్చలేదు. ఆరు రోజులుగా కళ్యాణదుర్గం, హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలోని గ్రామాలకు నీటిసరఫరా ఆగిపోయింది. అసలే వేసవి. ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గానికి మాత్రం ప్రత్యామ్నాయ మార్గం గుండా నీటిసరఫరా చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పంపింగ్ పైపులకు మరమ్మతులు చేయించి తాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
నేడు పుట్టపర్తిలో సత్యసాయి ఆరాధనోత్సవాలు
ప్రశాంతి నిలయం: సత్యసాయి ఆరాధనోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఉత్సవాల నేపథ్యంలో సాయికుల్వంత్ సభా మందిరాన్ని, సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించారు. వేడుకలకు భక్తులు భారీగా తరలిరానుండగా...సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది. ఆరాధనోత్సవాల్లో భాగంగా నిర్వహించే నారాయణ సేవకు హిల్వ్యూ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సత్యసాయి ఆరాధనోత్సవాలు శుక్రవారం ఉదయం 8 గంటలకు సాయికుల్వంత్ సభా మందిరంలో వేద పఠనంతో ప్రారంభమవుతాయి. 8.10 గంటలకు సత్యసాయి విద్యార్థులు పంచ రత్న కీర్తనలు ఆలపిస్తారు. 9 గంటలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఎస్ఎస్ నాగానంద ప్రారంభోపన్యాసం చేస్తారు. సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండ్య వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సత్యసాయి పూర్వ ప్రసంగాలను డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. భజన, మంగళ హారతితో ఉదయం వేడుకలు ముగుస్తాయి. నారాయణసేవ..ఆరాధనోత్సవాల్లో భాగంగా భక్తులకు నారాయణ సేవ (అన్నప్రసాద వితరణ) నిర్వహించేందుకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంతి నిలయంలో వేడుకలు ముగిసిన అనంతరం ఉదయం 10 గంటలకు నారాయణ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణతో పాటు నూతన వస్త్రాలను బహూకరిస్తారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొననుండగా.. హిల్వ్యూ స్టేడియంలో తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. -
బీసీలకు చంద్రబాబు అన్యాయం
అనంతపురం: బీసీలకు సీఎం చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. బీసీల హక్కుల సాధనలో భాగంగా ఈ నెల 26న అనంతపురంలోని లలితకళాపరిషత్లో నిర్వహించనున్న ‘బీసీ గళం’ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులతో కలిసి ‘బీసీ గళం’ పోస్టర్లను గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో వారు ఆవిష్కరించారు. భగీరథ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ హయాంలో బీసీల అభివృద్ధికి తీసుకున్న చర్యలను నేడు కొనసాగించడం లేదని దుయ్యబట్టారు. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు, కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలు, సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టడం సిగ్గుచేటన్నారు. అడుగడుగునా దగా వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే విశ్వ మాట్లాడుతూ..చంద్రబాబు ప్రభుత్వం బీసీల కోసం సంక్షేమ పథకాల అమలులో వివక్ష చూపుతోందని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మంగమ్మ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం ఎందాకైనా పోరాడతామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ సభలో బీసీల సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో బీసీలు పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం బీసీలను అడుగడు గునా దగా చేస్తోందన్నారు. ‘బీసీ గళం’ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ అనంతపురం నియోజకవర్గ పరిశీలకుడు బోయ తిప్పేస్వామి, సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, హరిత, సాకే చంద్రలేఖ, భారతి, హజరబి, కమర్ తాజ్, పార్వతి, రాధా యాదవ్, ప్రియాంక, జిల్లా ప్రధాన కార్యదర్శులు పూజారి రాజశేఖర్ యాదవ్, గౌని నాగన్న, నగర అధ్యక్షుడు చింత సోమశేఖర్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, కాగజ్ఘర్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. బ్యాక్ బోన్ అని జగన్ నిరూపించారు చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి గద్దెనెక్కాక అటకెక్కించారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ అని నిరూపించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ధ్వజం బీసీల హక్కుల సాధనకు ‘అనంత’లో 26న ‘బీసీ గళం’ సభ విజయవంతం చేయండి: పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత పిలుపు -
‘నక్ష’పై ప్రత్యేక దృష్టి సారించాలి
అనంతపురం అర్బన్: ‘‘కేంద్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాల్లోని భూముల సర్వే కోసం నక్ష ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ఈ ప్రాజెక్టు అమలుకు 10 పుర, నగరపాలక సంస్థలను ఎంపిక చేసింది. అనంతపురం కూడా పైలెట్ ప్రాజ్టెక్టు కింద ఎంపిక కానున్న నేపథ్యంలో ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు అమలుతో ప్రభుత్వ, స్థానిక సంస్థల ఖాళీ స్థలాలు, భూముల లభ్యతపై స్పష్టత వస్తుందన్నారు. ఈ క్రమంలో వాటిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. అందుబాటులోని ఖాళీ భూముల్లో ప్రజలకు గృహవసతి కల్పించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో నక్ష ప్రాజెక్టు సర్వేను వేగవంతం చేయడంతో పాటు డిజిటల్ మ్యాపింగ్ పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అహుడా కార్యదర్శి రామకృష్ణారెడ్డి, నగరపాలక సంస్థ ఎస్ఈ రాజశేఖర్, ఎల్డీఎం నరేష్రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం శ్రీలక్ష్మి, సర్వే ఏడీ విజయసారథి, టెలికాం జేటీఓ రామకృష్ణ, కార్పొరేషన్ ఇన్చార్జ్ టీపీఓ ఓంకార్ పాల్గొన్నారు. ‘పీఎం సూర్యఘర్’ను సద్వినియోగం చేసుకోండి పామిడి: పీఎం సూర్యఘర్ పథకాన్ని ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అన్నారు. గురువారం ఆయన పామిడిలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఏర్పాటు చేసిన ఉచిత సోలార్ ప్యానెల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జిల్లాలో 17 వేల మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను గుర్తించారన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి మండలానికి కేటాయించిన డ్రోన్ను అన్నదాతలు వినియోగించుకోవాలన్నారు. రాబోయే ఏడాదిలో పీఎం జన ధన్ కృషి యోజన పథకం కింద రూ. 80 కోట్లతో వ్యవసాయాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తామన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ షర్మిల, ఏఈ మధుసూదన్రావు తదితరులు పాల్గొన్నారు. -
తెగుళ్లపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
కూడేరు: ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దేవానంద, ప్రిన్సిపల్ సైంటిస్ట్ తిరుపతి రెడ్డి, ఉద్యాన పరిశోధన స్థానం సైంటిస్ట్ రమేష్ అన్నారు. కూడేరు మండల పరిధిలోని మరుట్లలో గురువారం వారు పర్యటించారు. చీనీ, మామిడి, దానిమ్మ పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా చీనీలో వేరుకుళ్లు, గమ్మోసిస్ తెగులు గుర్తించారు. గమ్మోసిస్తో చీనీ చెట్టు కాండం ప్రాంతంలో బెరడు బంక్ మాదిరి కారి నిదానంగా మొత్తం ఎండిపోతుందన్నారు. వేరుకుళ్లు తెగులుతో పోషక పదార్థాలు, నీరు చెట్టుకు అందకుండా పోయి ఎండిపోతాయని, తెగుళ్లు సోకిన వెంటనే కాండం, వేర్లకు తగలకుండా కలుపు మందు పిచికారీ చేయాలని సూచించారు. వారి వెంట నియోజకవర్గ హెచ్ఓ యామిని ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉచిత, నిర్భంద విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ)–2009 సెక్షన్ 13 ప్రకారం 1–8 తరగతుల ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు, స్క్రీనింగ్, టాలెంట్ టెస్ట్లు, స్కాలర్షిప్ టెస్ట్లు నిర్వహించరాదన్నారు. స్టేట్ సిలబస్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ఇలా ఏ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలలకైనా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి పరీక్షలు నిర్వహించే పాఠశాలలకు సెక్షన్ 13(2)(బీ) ప్రకారం మొదటి ఉల్లంఘనకు రూ. 25 వేల జరిమానా, తదుపరి ప్రతి ఉల్లంఘనకు రూ. 50 వేల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నిబంధనల తీవ్రతను బట్టి పాఠశాల గుర్తింపు రద్దుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు. ఉప విద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. గుంతకల్లు డివిజన్ను అభివృద్ధి బాటలో నడుపుదాం గుంతకల్లు: గుంతకల్లు డివిజన్ను అభివృద్ధి బాటలో నడుపుదామని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ పిలుపునిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి విడిపోయిన గుంతకల్లు డివిజన్లో తొలిసారిగా గురువారం ఆయన పర్యటించారు. ప్రత్యేక రైలులో గుంతకల్లు రైల్వేస్టేషన్కు చేరుకున్న ఆయనకు డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా, ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డీఆర్ఎం కార్యాలయంలోని మీటింగ్ చాంబర్లో డివిజన్ స్థాయి అధికారులతో సందీప్ మాథుర్ సమావేశయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్లో గుంతకల్లు డివిజన్ విలీనమవుతున్న తరుణంలో డివిజన్ భౌగోళిక సరిహద్దులతోపాటు ఎంత మేర డివిజన్ కుదింపులకు గురవుతుందనే అంశాలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని రాయచూర్ సెక్షన్ను దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేయాలని రైల్వేబోర్డు నిర్ణయించినట్లు తెలిసిందన్నారు. జూన్లో డివిజన్ భౌగోళిక స్వరూపంతోపాటు రూట్ మ్యాప్ నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. అధికారులు శ్రమించి డివిజన్ను అన్ని విభాగాల్లో ముందంజలో నిలపాలని పిలుపునిచ్చారు. అనంతరం కంట్రోల్ రూం కార్యాలయాన్ని, గుంతకల్లు –డోన్ రైలు మార్గాన్ని జీఎం తనిఖీ చేశారు. కార్యక్రమంలో సెక్రటరీ బాలాజీ కిరణ్ పాల్గొన్నారు. మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఫలితాల వివరాలు www.apms. apcfss.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ఆయా మోడల్ స్కూళ్లలో సంప్రదించాలని సూచించారు. -
లోన్ యాప్ వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య
మడకశిర రూరల్: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం ఉప్పిడిపల్లికి చెందిన సిద్దార్థ (24)కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహమైంది. వీరికి రెండేళ్ల వయసున్న కుమార్తె ఉంది. ఈ క్రమంలో సిద్దార్థ వ్యక్తిగత అవసరాల నిమిత్తం ‘సీఏఎస్ఈఏఎస్’ యాప్ ద్వారా రూ.10 వేల రుణం తీసుకున్నాడు. రుణం తీసుకునే ముందు యాప్లో ఉన్న సమాచారం మేరకు తనకు పరిచయస్తులైన నలుగురి ఫోన్ నంబర్లను నమోదు చేశాడు. అయితే రుణం కంతులు సక్రమంగా చెల్లించలేకపోవడంతో వడ్డీల భారం పెరిగి రూ.16 వేలకు చేరుకుంది. ఈ క్రమంలో యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. రుణం చెల్లించకపోతే నగ్నంగా ఉన్న ఫొటోలను షేర్ చేసి పరువు తీస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో తనకు కొద్ది సమయం కావాలని సిద్ధార్థ కోరాడు. అయినా వినకుండా లోన్ యాప్ నిర్వాహకులు గతంలో సిద్దార్థ నమోదు చేసిన పరిచయస్తుల సెల్ఫోన్ల వాట్సాప్ నంబర్లకు నగ్నంగా ఉన్న ఫొటోలు పంపారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న సిద్దార్థ తీవ్ర మనోవేదనకు లోనై ఈ నెల 21న కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు గాలించినా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం గ్రామ శివారులోని పొలంలో చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న సిద్దార్థను గమనించిన స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అవమానం భరించలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లుగా భార్య కవిత చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
బూదగవిలో ఉద్రిక్తత
● కోర్టు వివాదంలో ఉన్న భూమిని కొలిచేందుకు వెళ్లిన అధికారులు ● మనస్తాపంతో పురుగుల మందు తాగిన యువరైతు ఉరవకొండ: కోర్టు వివాదంలో ఉన్న భూమిని కొలిచేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం కావడంతో మనస్తాపంతో ఓ యువరైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలు... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు బాధిత కుటుంబసభ్యులు మేరకు ఉరవకొండ మండలం బూదగవి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతు తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి పాతికేళ్ల క్రితం సోమశేఖర్గౌడ్ అనే వ్యక్తితో పాల్తూరు గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 333ఎ, 313లో ఉన్న 8.64 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కొంతకాలంగా ఆ భూమిపై కన్నేసిన కృష్ణం రఘుతో పాటు గంట రంగనాథ్, గోవిందునాయక్, ఎరికల సురేష్, నరేంద్ర ఎలాగైనా ఆక్రమించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. దీంతో లక్ష్మీదేవి కుమారులు మల్లికార్జున, ధనుంజయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ వివాదం ఉరవకొండ సివిల్ కోర్టులో నడుస్తోంది. అయినా కృష్ణం రఘు, తదితరులు పట్టించుకోకుండా ఈ నెల 4న భూమిలో దౌర్జన్యంగా ప్రవేశించి కొలతలు తీయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో మల్లికార్జున కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. దీంతో అప్పటికి వెనక్కు తగ్గిన వారు... గురువారం భారీ పోలీసు భద్రత మధ్య రెవెన్యూ అధికారులతో కొలతలు తీయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన మల్లికార్జున అధికారుల సమక్షంలోనే పురుగుల మందు తాగడంతో వెంటనే 108 వాహనంలో ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇసుక టిప్పర్లను ఆడ్డుకున్న రైతులు
శింగనమల: మండలంలోని నిదనవాడ వద్ద ఉన్న పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ వాహనాలను గ్రామస్తులు గురువారం రాత్రి అడ్డుకున్నారు. కొంత కాలంగా నది పరివాహక ప్రాంతంలో టీడీపీ నేతలు జేసీబీలు, హిటాజీలు ఏర్పాటు చేసి, టిప్పర్ల ద్వారా ఇసుకను పెద్దవడుగూరు మీదుగా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నెల రోజులుగా ఈ దందా ఊపందుకుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పార్టీలకు అతీతంగా రైతులందరూ సమావేశమై చర్చించారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు అందకుండా పోతోందని, ఫలితంగా భవిష్యత్తులో పంటలు సాగు చేయడం కష్టమవుతుందని భావించిన అందరూ ఇసుక తరలింపులను అడ్డుకోవాలని తీర్మానించుకున్నారు. దీంతో గురువారం రాత్రి పెన్నానదిలోకి ప్రవేశించిన టిప్పర్లను రైతులందరూ ఏకమై అడ్డుకున్నారు. వాహనాలను అడ్డుకున్న సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ గుంతకల్లు టౌన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పట్టుబడిన వారిలో మధ్యప్రదేశ్లోని థార్ జిల్లా కుక్సీ గ్రామానికి చెందిన అశోక్ ధ్యాన్ సింగ్, రాజుసింగ్ మెహడా ఉన్నారు. వీరి నుంచి 7.2 తులాల బంగారు నగలు, రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, నిందితులు అనంతపురం 4వ పట్టణ పీఎస్తో పాటు గుంతకల్లులోని వన్టౌన్ పీఎస్ పరిధిలోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. సుమారు 55 తులాల బంగారు నగలు, 150 తులాల వెండి సామగ్రి, రూ.2.20 లక్షల నగదు అపహరించారు. గుంతకల్లులో చోటు చేసుకున్న చోరీలకు సంబంధించి కేసులు నమోదు చేసిన పోలీసులు సీఐలు మనోహర్, ప్రవీణ్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం అశోక్ ధ్యాన్సింగ్, రాజుసింగ్ గుంతకల్లులోని ఢీజిల్ షెడ్ వద్ద తచ్చాడుతుండగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
ఆర్టీసీ నిర్మాణాల్లో అలసత్వం
అధికార పార్టీ నేతల ధన దాహానికి ఆర్టీసీ అభివృద్ధి కుంటు పడింది. అభివృద్ధి పనుల్లో పంపకాలు, పర్సంటేజీల ఒత్తిళ్ల నేపథ్యంలో ఎక్కడి నిర్మాణాలు అక్కడే నిలిచి పోయాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు వేసిన శిలాఫలకాలు దిష్టిబొమ్మల్లా మారాయి. ● శిలాఫలకాలతోనే సరి అనంతపురం క్రైం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ అనంతపురం రీజియన్ పరిధిలో చేపట్టిన పలు నిర్మాణాలు ప్రారంభ దశలోనే ఆగిపోయాయి. గుత్తి బస్టాండ్ నిర్మాణం కోసం రూ.20 లక్షలతో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. గుత్తి బస్టాండ్లో ఆరు దుకాణాల నుంచి ప్రతి నెలా రూ. లక్ష వరకూ అద్దె రూపంలో ఆదాయం సమకూరేది. అభివృద్ధి పేరుతో ఈ దుకాణాలను కూల్చేశారు. తాత్కాలిక బస్టాండు నిర్మాణం తప్పనిసరి అంటూ మార్చి 31న నేతలు శిలాఫలకాలు కూడా వేశారు. అయితే ఈ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. కారణాలు ఆరా తీస్తే శాశ్వత బస్టాండ్ నిర్మాణం కోసం రూ.5 కోట్ల అంచనాతో ప్రణాళిక సిద్ధమైనా, కాంట్రాక్టర్ పనులు చేపడుతున్న సమయంలో స్థానిక టీడీపీ నేతల నుంచి పర్సెంటేజీల కోసం వేధింపులు మొదలయ్యాయి. దీంతో పనులు చేపట్టలేక కాంట్రాక్టర్ ముఖం చాటేశాడు. రాయదుర్గంలోనూ అదే పరిస్థితి రాయదుర్గంలో బస్టాండ్ నిర్మాణానికి వర్క్ ఆర్డర్ ఉన్నా.. రూ.50 లక్షలతో జరగాల్సిన పనులపై ఎలాంటి పురోగతి లేదు. అలాగే అనంతపురంలో ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయ నిర్మాణం కూడా నత్తనడకన సాగుతోంది. ఈ పని ఇప్పటి వరకూ కేవలం పిల్లర్లకు కాలమ్స్ వేయడం వరకే పరిమితమైంది. పర్సెంటేజీల గోల తమకు పర్సెంటేజీలు చెల్లించకపోతే పనులు అడ్డుకుంటామంటూ కాంట్రాక్టర్లను స్థానిక టీడీపీ నేతలు బెదిరిస్తున్నట్లుగా అంతర్గతంగా జోరుగా చర్చ సాగుతోంది. సబ్ కాంట్రాక్టుల పంపకాల విషయంగా మితిమీరిన జోక్యం, ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత లేకపోవడంతో కాంట్రాక్టర్లు సైతం ధైర్యం చేసి ముందుకు రాలేకపోతున్నారు. ఈ నిర్మాణాలపై అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఇన్చార్జ్ల పెత్తనంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్ఎం నుంచి డీఎం వరకూ కీలక స్థానాలన్నీ ఇన్చార్జ్లతోనే నెట్టుకొస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన దౌర్బాగ్యంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతి పనీ వారికి అనుకూలంగా వెళ్లాలనడమే కానీ, ప్రయాణికుల సంక్షేమం, వారి భధ్రతను గాలికి వదిలేశారని వాపోతున్నారు. ఊహల పల్లకీలో ఊరేగింపు బాబు సర్కారులో ఆర్టీసీకి పైసా లబ్ధి చేకూరకపోయినా ప్రయాణికులను మాత్రం ఊహల పల్లకీలో ఊరేగిస్తున్నట్టుగా నేతలు ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మభ్యపెడుతూ, అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ పలువురు మండిపడుతున్నారు. ప్రజలకు అవసరమైన బస్టాండ్లు, కార్యాలయాలు సమయానికి పూర్తి కాకపోవడం వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాక, ఉన్నవాటిని కూల్చేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ ఇన్చార్జ్ ఆర్ఎం శ్రీలక్ష్మిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. -
ఆర్టీఐహెచ్తో ఎస్ఆర్ఐటీ ఒప్పందం
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్ఆర్ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాలలో ఇంకుబేషన్ సెంటర్ స్థాపనకు రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ (ఆర్టీఐహెచ్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్రెడ్డి తెలిపారు. వివరాలను గురువారం వారు వెల్లడించారు. విద్యార్థుల్లో ఇన్నోవేషన్ వ్యాపార దృక్పథాన్ని ప్రోత్సహించడంతో పాటు వ్యాపారవేత్తలుగా ఎదిగాలనుకునే ఔత్సాహిక విద్యార్థులను గుర్తించి వారిలో నైపుణ్యాలు, బిజినెస్ స్కిల్స్ను అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించారు. ఈ భాగస్వామ్యం ద్వారా నూతన ఆవిష్కరణలతో పాటు విద్యార్థులకు స్టార్టప్లు, ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయన్నారు. కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ హఫీజ్ బాషా, ఐఐసీ అధ్యక్షుడు డాక్టర్ రంజిత్రెడ్డి, కన్వీనర్ డాక్టర్ ఆంజనేయులు పాల్గొన్నారు. మొక్కజొన్న పంట దగ్ధం గుమ్మఘట్ట: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మొక్కజొన్న పంట దగ్ధమైంది. స్థానికులు తెలిపిన మేరకు.. గుమ్మఘట్ట మండలం తాళ్లకెర గ్రామానికి చెందిన రైతు సన్నన్న తనకున్న 4.45 ఎకరాల భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట చేతికి రావడంతో కోత కోసి కంకులను ఓ చోట ఆరబోశాడు. ఈ నేపథ్యంలో గురువారం ఆరుబయలు ప్రాంతంలోని ఎండు గడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి ఆరబోసిన కంకులను చుట్టుముట్టాయి. కంకులతో పాటు టార్పాలిన్, డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. ఘటనతో రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతును ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం : ఎస్పీ కళ్యాణదుర్గం రూరల్: మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఎస్పీ జగదీష్ అన్నారు. సీ్త్ర శక్తి యాప్పై గురువారం కళ్యాణదుర్గంలోని ఓ ఫంక్షన్ హాల్లో మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, పోలీసు సిబ్బందితో కలసి తొలుత పట్టణంలో ఎస్పీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. సెల్ఫోన్ ఉన్న ప్రతి ఒక్క మహిళ రస్త్రీ శక్తి యాప్ను డౌన్లోడు చేసుకోవాలన్నారు. ఏవిధమైన ఇబ్బందులు తలెత్తిన సీ్త్ర శక్తి యాప్ ఉపయోగించుకుని రక్షణ పొందాలన్నారు. స్వీయ రక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని బాలబాలికలకు సూచించారు. బాల్య వివాహలను నివారించి మహిళలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రవిబాబు, పోలీసు సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వ్యక్తి దుర్మరణం శింగనమల: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... శింగనమల మండలం సి.బండమీదపల్లి గ్రామానికి చెందిన హరి (34) రాప్తాడు సమీపంలో ఉన్న ఐచర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంపై తాడిపత్రికి వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని రాత్రి తిరుగు ప్రయాణమైన ఆయన నాయనపల్లిక్రాస్ వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన హరి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, హరికి భార్య, కుమార్తె ఉన్నారు. గతంలో సచివాలయ వలంటీర్గా పనిచేసాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆటో బోల్తా .. వ్యక్తి మృతి కూడేరు: ఆటో బోల్తా పడన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరు మండలం పి.నారాయణపురానికి చెందిన దొనస్వామిరెడ్డి(60) తన చెల్లెలు కుమారుడి పెళ్లి కోసమని బుధవారం కడదరకుంట వద్ద ఓ తోటలో మామిడి కాయలు కొనుగోలు చేసుకుని ఆటోలో వేసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో దొనస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో డ్రైవర్ రాజేష్ బయటపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే దొనస్వామిని అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
●బాబోయ్ ఎండలు
జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. 10 గంటల తర్వాత ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఎండవేడిమికి వృత్తిదారులు తమ పనులు చేయలేకపోతున్నారు. ఉపాధి వేతనదారులు, భవన నిర్మాణ కార్మికులు, శ్రామికులు, ఫుట్పాత్ వ్యాపారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఎండ వేడి, ఉక్కపోత ఉండడంతో జిల్లావాసులు విలవిల్లాడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: తోపుడు బండిపై గుజరీ వేసుకుని వెళుతున్న మహిళ మండు టెండలో అనంతపురం వన్టౌన్ పీఎస్ వద్ద చంటి బిడ్డతో సేద తీరుతున్న దృశ్యం ఎండ వేడి నుంచి ప్రయాణికులకు రక్షణ కల్పించేలా ఆటోపై ఏర్పాటు చేసిన రబ్బరు షీట్ రోడ్డు పక్కన చెట్ల కింద భోజనం చేస్తున్న వ్యవసాయ కూలీలు -
పుస్తకంతోనే వ్యక్తిత్వ వికాసం
అనంతపురం కల్చరల్: సెల్ఫోన్ చేస్తున్న వింతలు, విడ్డూరాలతో అరచేతి లోనే సాహిత్యం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అయినా పుస్తకాలకున్న ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. వందల సంఖ్యలో నేటికీ వస్తూనే ఉన్నాయి. ప్రతి పుస్తకంలో అనుభవాలసారంతో జీవితాన్ని నిర్దేశించే లక్ష్యం దాగుంటుంది. మానసిక వికాసానికి దోహదపడే అలాంటి పుస్తకాలకు చరిత్ర పుటల్లో అందమైన స్థానాన్ని కల్పించారు. చదవటం, రాయడం, ప్రచురించడం, కాపీరైట్స్... తదితరాలను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఏప్రిల్ 23న పుస్తక దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకానికి ఆదరణ తగ్గలేదని చాటే కార్యక్రమాలు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఆ రోజే ఎందుకు? ప్రపంచ సాహిత్య శిఖరాల్లో అగ్రభాగాన నిలిచిన ‘డాన్ క్విక్సోట్’ నవల రచయిత, స్పెయిన్కు చెందిన మిగుల్ డె సెర్వాన్టెస్ పుట్టింది అక్టోబర్ 7 కాగా, ఏప్రిల్ 23న మరణించారు. ఈ క్రమంలో ఆయనకు గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో ఆయన జయంతి నాడు పుస్తక దినోత్సవం జరపాలని ప్రముఖ స్పానిష్ రచయిత విసెంటే క్లావెల్ ఆండ్రెస్ ఆలోచన చేశాడు. అయితే విలియం షేక్స్పియర్, గార్సియాసా డి లా వేగా తదితర ఎందరో ప్రముఖ రచయితలు మరణించింది ఏప్రిల్ 23 కావడంతో అందరి జ్ఞాపకార్థం 1995, ఏప్రిల్ 23న యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) తొలిసారిగా ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఆదివారం వస్తే రచయితలకు పండుగే పుస్తకం చదివే వాళ్ల సంఖ్య తగ్గిపోతోందని పాత తరం వారంటున్నా దిగ్గజ రచయితలతో పాటూ యువ రచయితలు పోటీ పడి రచనలు సాగిస్తుండడం విశేషం. సాధారణ రచనలతో పాటూ అవార్డులు, రివార్డులందుకుంటున్న రచనలు ఇటీవల కోకొల్లలుగా ముద్రితమవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం వచ్చిందంటే అనంతపురంలోని ఎన్జీఓ హోమ్, ప్రెస్క్లబ్లు పుస్తకావిష్కరణలకు సిద్దమవుతాయి. ఒకప్పుడు ఒకే రోజు రెండు మూడు పుస్తకాలు పాఠకుల ముందుకొచ్చేవి. ప్రత్యేక ప్రణాళిక, ఒప్పందం అనంతరం ఒక ఆదివారం ఒక్కటే అన్నట్లుగా నిర్ణయించుకోవడంతో ప్రతి ఆదివారమూ రచయితలకు, పుస్తక ప్రియులకు ఓ పండుగలా మారింది. ఆదరణలోనూ విభిన్నమే కాల్పనిక సాహిత్యం, ప్రబంధ సాహిత్యం, విప్లవ సాహిత్యం, ఆధునిక సాహిత్యం... ఇలా ఒకప్పుడు రాజ్యమేలిన నవలలు మళ్లీ ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. అలాగే ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస పుస్తకాలకూ తరగని ఆదరణ ఉంటోంది. ముఖ్యంగా యువ రచయితలు పెరుగుతుండడంతో కవిత్వంలో వస్తున్న పెనుమార్పులతో పుస్తకాదరణ పెరుగుతోంది. పుస్తక దినోత్సవం వచ్చేనాటికి పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు వచ్చేస్తున్న నేపథ్యంలో పుస్తక పఠనం వైపు విద్యార్థులను మళ్లించాలని మేధావులంటున్నారు. నగరంలో ప్రతి ఆదివారమూ ఓ పుస్తకావిష్కరణేపుస్తకాలు మరో ప్రపంచానికి కిటికీ లాంటివి. ప్రతి పేజీతో మనకు కొత్త వ్యక్తులను, కొత్త సంస్కృతులను, కొత్త ఆలోచనలను పరిచయం చేస్తాయి. ఒక పుస్తకాన్ని మొదటిసారి చదివితో ఓ కొత్త స్నేహితుడిని సంపాదించుకున్నట్లు ఉంటుంది. అదే పుస్తకాన్ని మరోసారి చదివితే పాత స్నేహితుడిని కలుసుకున్న ఆనందం కలుగుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పుస్తకానికి చరిత్ర పుటల్లో ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించారు. 1995 నుంచి ఏప్రిల్ 23న అంతర్జాతీయ పుస్తక దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పఠనాసక్తి పెరిగింది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండకపోవడం దాని స్వాభావిక లక్షణం. ఇంటర్నెట్ విపరీతంగా పెరిగిపోతున్న రోజుల్లోనూ మళ్లీ పుస్తక పఠనానికి ఆదరణ పెరుగుతుండడం ఆహ్వానించదగిన విషయం. లుక్ కల్చర్ నుంచి బుక్ కల్చర్ వైపుగా యువత పయనం సాగుతోంది. నేను రాసిన బుజ్జోని కల, ఒక కత్తుల వంతెన, అనంత రత్నాలు వంటి పుస్తకాలను అప్పటి కంటే ఇప్పుడే మళ్లీ అడిగి చదువుతుండడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఉండే రచయితల పుస్తకాలకు ఆదరణ ఉంటోంది. – చంద్రశేఖరశాస్త్రి, స్పందన అనంత కవుల వేదిక సందర్భం ః నేడు అంతర్జాతీయ పుస్తక దినోత్సవం -
‘కాగ్నిజెంట్’లో సంబరాలు
అనంతపురం ఎడ్యుకేషన్: రెండు రోజుల క్రితం విడుదలైన జేఈఈ మెయిన్స్–2026 ఫలితాలు, ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అనంతపురంలోని కాగ్నిజెంట్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. దీంతో బుధవారం ఆ కళాశాలలో సంబరాలు చేసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు సంస్థ సీఈఓ ఎస్వీ రత్నాకర్ ప్రసాద్, డైరెక్టర్లు ఆలూరు సాంబశివారెడ్డి, జె.సాల్మన్రాజు, కె.నరేంద్ర రెడ్డి, కళాశాల అధ్యాపకులు హాజరయ్యారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆలూరు సాంబశివారెడ్డి సత్కరించారు. జేఈఈ మెయిన్స్లో జి.సుశాల్ ఆల్ ఇండియా ర్యాంక్ 168 సాధించగా, ఆర్ జస్వంత్ కుమార్ 262, ఎస్.తరుణ్ 1,088, ఎం. సాయిసహస్ర 1,479, ఎ.ప్రణవి 3,213, వి. మణిదీపిక 4,444, యు.నవీన్ 4,883, బి.జయవర్ధన్ 5,957, వీఎన్ శోభన్ 10,730, ఎ.సాయిశృతి 13,874, ఎన్.సాయి చరణ్ 14,414, బి విశ్వంత్రెడ్డి 15,127, పి.హాసిని 15,123, కె.తేజజ్యోతి 16,756 ర్యాంకులు సాధించారు. 90 పర్సంటైల్కు పైగా 29 మంది విద్యార్థులు సాధించారు. మొత్తం 33 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని రత్నాకర్ ప్రసాద్ తెలిపారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లోనూ 988 మార్కులతో ఎన్. విశిష్ట టాపర్గా నిలిచిందన్నారు. అలాగే 986 మార్కులతో ఎం రూపేష్, జి గ్రీష్మ, ఎం చేతన, ఎ.ప్రణవి మెరిసారన్నారు. 980 మార్కులకు పైగా 47 మంది, 950కు పైగా 91 మంది, 900కు పైగా 146 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో పి చైత్ర, కె.సాయి వర్షిత్, సి.పూజ, వి.రిషిత, డి.ప్రగతి చౌదరి 465 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారన్నారు. డి.జైలీల, కె.భవ్య తన్విస్ చరణ్, ఎం.జస్వంతి, డి.రజితేశ్వరి, ఎం.యోగేష్ రావు, జె.కెన్నిత్ సాల్మన్ 464 మార్కులు సాధించారన్నారు. 460 మార్కులకు పైగా 47 మంది, 450కు పైగా 100 మంది, 400కు పైగా 242 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు వివరించారు. బైపీసీ విభాగంలో జి.పూజశ్రీ 448 మార్కులతో టాపర్గా నిలిచినట్లు పేర్కొన్నారు. కె.సాకేత్ నాయర్, వి.నిఖిలశ్రీ 447 మార్కులతో రెండో స్థానం దక్కించుకున్నారన్నారు. 440కు పైగా 11 మంది, 420కు పైగా 30 మంది, 390కు పైగా మార్కులతో 44 మంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కాగ్నిజెంట్ను ఆదర్శవంతమైన జూనియర్ కళాశాలగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆలూరి సాంబశివారెడ్డి పేర్కొన్నారు. -
మ్యుటేషన్ దరఖాస్తులు పరిష్కరించాలి
● రెవెన్యూ అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం అనంతపురం అర్బన్: మ్యుటేషన్ కోసం రైతుల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ రెవెన్యూ ఆదేశించారు. మ్యుటేషన్ దరఖాస్తుల పరిష్కారం, గ్యాస్ సిలెండర్ల పంపణీ, తదితర అంశాలపై బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, సీఎస్డీటీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జేసీ సమీక్షించారు. మ్యుటేషన్కు సంబంధించి పరిష్కార వేదిక, ఏపీ సేవా, మీ సేవా ద్వారా అందిన అభ్యర్థనలపై క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షించాలన్నారు. 22ఏ, చుక్కల భూములకు సంబంధించిన ప్రతిపాదనలు నిర్ధిష్ట సమయంలో సిద్ధం చేసి ఆమోదం కోసం కలెక్టర్కు పంపించాలన్నారు. నాల్గో విడత రీసర్వే లో భాగంగా గ్రౌండ్ ట్రూథింగ్ పనులకు మొబైల్ అప్లికేషన్ ఇచ్చారన్నారు. సర్వే చేసేటప్పుడు సంబంధిత రైతులు హాజరయ్యేలా సమాచారం ఇచ్చి వారితో ఈకేవైసీ పూర్తి చేయాలన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎస్డీటీలను ఆదేశించారు. సిలిండర్ల అక్రమ నిల్వలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియలో ముందుగా డ్రాప్ట్ పట్టాదారు పుస్తకం ప్రింట్ తీసుకుని రైతులకు చూపించాలన్నారు. అందులో సవరణలు ఉంటే గుర్తించి, కరెక్షన్ మాడ్యూల్ ద్వారా మార్పులు చేర్పులతో కచ్చితమైన పాసుపుస్తకాలను రైతులకు అందించాలని ఆదేశించారు. వీసీలో డీఆర్ఓ ఎ.మలోల, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ అఖిల, సర్వే శాఖ ఏడీ విజయసారథి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల జీఎం రమేష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
తాగుడు మానేయమంటే ఉరేసుకున్నాడు!
కణేకల్లు: సంపాదన మొత్తం తాగుడుకే ఖర్చు పెడితే కుటుంబ పోషణ ఎలా? అంటూ భార్య నిలదీయడంతో క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కణేకల్లు మండలం మాల్యం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ఎం.రాజశేఖర్ (25)కు భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల మద్యానికి బానిసైన రాజశేఖర్ సంపాదన మొత్తం తాగుడుకే ఖర్చు పెట్టసాగాడు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. ఇదే అంశంపై బుధవారం భార్య నిలదీసింది. తాగుడు మానేసి బంధుమిత్రుల వద్ద పరువు నిలుపుకోవాలని హితవు పలికింది. దీంతో క్షణికావేశానికి లోనైన రాజశేఖర్ గ్రామ శివారులోని చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రైతులకు సకాలంలో విద్యుత్ కనెక్షన్లు ● విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ అనంతపురం టౌన్: రైతులకు వ్యవసాయ కనెక్షన్లను సకాలంలో మంజూరు చేయనున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉండగా, ప్రతిపాదనలను ఇప్పటికే కార్పొరేట్ కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. అక్కడి నుంచి అనుమతులు కాగానే దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకూ వ్యవసాయ కనెక్షన్ మంజూరు చేస్తామన్నారు. రాబోవు 6 నెలల కాలంలో సీనియార్టీ మేరకు దశల వారీగా వ్యవసాయ కనెక్షన్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. యువకుడి దుర్మరణం ముదిగుబ్బ: ఐస్క్రీమ్ బండి ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు మృతి చెందాడు. ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లమాడ మండలం గోపేపల్లి గ్రామానికి చెందిన చాంద్బాషా, సహీన దంపతుల కుమారుడు హైదర్బాషా (18) వ్యక్తిగత పనిపై బుధవారం ముదిగుబ్బకు వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ఇందుకూరుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఎదురుగా వస్తున్న ఐస్క్రీమ్ విక్రయించే వాహనం ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన హైదర్బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కోర్టుకు హాజరుకాని ఇద్దరి అరెస్ట్తనకల్లు: న్యాయస్థానం కళ్లు కప్పి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తనకల్లు పీఎస్ ఎస్ఐ దిలీప్కుమార్ తెలిపారు. వివరాలను బుధవారం వెల్లడించారు. తనకల్లు మండలం దేవళంతండా, పెనుగుండుతండాకు చెందిన ఓబులేసు, నాగరాజునాయక్ గతంలో మద్యం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసుల్లో అప్పట్లో న్యాయస్థానానికి హాజరైన వారు ఆ తర్వాత కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరగసాగారు. దీంతో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ కావడంతో బుధవారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.
రైతు ఆదాయం పెంపే లక్ష్యం అనంతపురం అర్బన్: రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రాథమిక రంగాల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశుసంపద అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టి రైతులకు ఆదాయం పెంచాలని చెప్పారు. ఎరువులు అధిక ధరలకు విక్రయించకుండా చూడాలన్నారు. సీసీఆర్సీ పొందిన కౌలు రైతులకు పంటరుణాలను బ్యాంకులు మంజూరు చేయాలన్నారు. రాయితీపై డ్రిప్ పరికరాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయ అధికారి రవికుమార్, ఉద్యాన శాఖ అధికారి పద్మలత, ఆత్మ పీడీ నారాయణనాయక్, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్రెడ్డి, సెరికల్చర్ ఏడీ రేణుక, డ్వామా పీడీ సలీంబాషా, డీసీఓ అరుణకుమారి, నాబార్డ్ మేనేజర్ అనురాధ, డీఆర్డీఏ ఏపీడీ రాధారాణి, ఎఫ్పీఓ సభ్యులు, అగ్రిటెక్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మాతా శిశు మరణాలకు చోటివ్వరాదు మాతా, శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మాతా శిశు మరణాల అంశంపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. తాడిపత్రి, గుంతకల్లు ప్రాంతాల్లో చోటు చేసుకున్న రెండు మాతృ మరణాలపై విచారణ వివరాలను ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్యూటీ డాక్టర్ డెలివరీ చేయాలని ఆదేశించారు. ప్రసవాలు ప్రభుత్వ లేదా అధీకృత ఆస్పత్రుల్లో జరిగేలా చూడాలన్నారు. మాతా శిశు మరణాలు సంభవించకుండా అత్యవసర ప్రసూతి వైద్య సేవలను బలోపేతం చేయాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం చేసినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ శ్రీనివాసులురెడ్డి, డీసీహెచ్ఎస్ సెల్వంరాజ, ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ గంగాధర్రెడ్డి, డాక్టర్ శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ శశికళ పాల్గొన్నారు. -
గుత్తిలో నకిలీ నోట్ల కలకలం
గుత్తి: గుత్తి పట్టణంలో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. నెల రోజులుగా నకిలీ నోట్ల చలామణి అవుతుండటంతో వ్యాపారులు, జనాలు బెంబేలెత్తి పోతున్నారు. అమృత్ సినిమా థియేటర్ ఎదురుగా హోటళ్లకు విచ్చేసిన కస్టమర్లు అల్పాహారం తిన్న తర్వాత బిల్లు చెల్లించారు. వారు ఇచ్చిన వంద రూపాయల నోట్లను హోటల్ నిర్వాహకులైన వలి, షారూక్, బాషా కొంతసేపటి తర్వాత గమనిస్తే నకిలీవని తేలడంతో ఆందోళనకు గురయ్యారు. రద్దీగా ఉండే హోటళ్లు, వ్యాపార సముదాయాలను టార్గెట్గా చేసుకుని నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రాథమికంగా వాటిని గుర్తించలేకపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. హోటల్ నిర్వాహకుడు షారూఖ్ మాట్లాడుతూ తన హోటల్లో టిఫిన్ చేసిన అనంతరం వ్యక్తి ఇచ్చిన రూ.100 నోటు నకిలీదని గుర్తించలేకపోయినట్లు తెలిపాడు. ఇలా మూడుసార్లు తాను మోసపోయానని వాపోయాడు. రెండు రోజుల క్రితం తనకూ ఓ కస్టమర్ రూ.100 నకిలీ నోటు ఇచ్చాడని మరో హోటల్ నిర్వాహకుడు వలి తెలిపాడు. సాయంత్రం డబ్బు లెక్కిస్తున్న సమయంలో అది దొంగ నోటని గుర్తించానన్నాడు. అధికారులు స్పందించి దొంగ నోట్ల చలామణిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
పేకాటరాయుళ్ల అరెస్ట్
ఆత్మకూరు: మండలంలోని కుర్లపల్లి వద్ద పేకాట ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను బుధవారం ఎస్ఐ గౌతమ్ వెల్లడించారు. అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం కుర్లపల్లి శివారు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో ఓ తోట వద్ద పేకాట ఆడుతూ ఐదుగురు పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.6,570 నగదు, ఐదు సెల్ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు వివరించారు. మహిళల భద్రతకు ‘సీ్త్ర రక్ష’ : ఎస్పీఅనంతపురం సెంట్రల్: మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన శక్తియాప్, సీ్త్ర రక్ష పోర్టల్ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. బుధవారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో మహిళలు, చిన్నారుల భద్రతపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ యాప్లు బాధిత మహిళలకు రక్షణగా నిలుస్తాయన్నారు. చిన్నారులపై జరిగే నేరాలపై చట్టం కఠినంగా అమలవుతుందని హెచ్చరించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానస్పద కాల్స్ మెసేజ్లు, యాప్లకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోరాదని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మజ, న్యాయవాది శశికళ, పలు కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. 25న పారిశ్రామిక వేత్తలకు శిక్షణ అనంతపురం టౌన్: మహిళా పారిశ్రామిక వేత్తలకు ఈ నెల 25న శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ ఆధ్వర్యంలో అనంతపురం శివారు పంగల్ రోడ్డులోని టీటీడీసీ కార్యాలయంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని ఉన్న మహిళా పారిశ్రామిక వేత్తలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
క్లిక్కర్ ఆధారిత లర్నింగ్కు 143 స్కూళ్ల ఎంపిక
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన మెరుగుపరచడానికి ‘క్లిక్కర్ ఆధారిత లర్నింగ్’ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 143 స్కూళ్లు ఎంపికయ్యాయి. 9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్ విధానాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన క్లిక్కర్ పరికరాలను బుధవారం ప్రధానోపాధ్యాయులకు ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు అందజేసి, మాట్లాడారు. ఈ విధానం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి సహాయపడుతుందన్నారు. ప్రతి విద్యార్థికి ఒక చిన్న బ్లూటూత్ క్లిక్కర్ పరికరం ఇస్తారన్నారు. ఉపాధ్యాయులు పాఠం బోధించిన తర్వాత ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పీ) లేదా స్మార్ట్ టీవీలో బహుళైచ్చిక ప్రశ్నలు ప్రదరిస్తారు. వెంటనే విద్యార్థులు తమవద్ద ఉన్న క్లిక్కర్ ద్వారా సరైన సమాధానం బటన్ నొక్కుతారు. ఎంతమంది విద్యార్థులు, ఏయే విద్యార్థులు సరైన సమాధానం, తప్పు సమాధానం ఇచ్చారో క్లిక్కర్ డివైజ్ ద్వారా తెలుస్తుందని తెలిపారు. ధర్మవరంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ధర్మవరం అర్బన్: ఈ నెల 23 నుంచి మే 3వ తేదీ వరకూ ధర్మవరంలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అడహక్ కమిటీ చైర్మన్ చెన్నంశెట్టి జగదీశ్వరప్రసాద్ వెల్లడించారు. 23న ధ్వజారోహణంతో ఉత్సవాలను ప్రారంభం కానున్నాయి. 24న ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయి. 25న ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం సింహ వాహనం, 26న ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం హనుమద్వాహనం, 27న ఉదయం పల్లకీ ఉత్సవం, సాయంత్రం శ్రీవారి కల్యాణోత్సవం ఉంటాయి. 28న ఉదయం గరుడోత్సవం, సాయంత్రం శేష వాహనం, రాత్రి గజ వాహన సేవలు నిర్వహిస్తారు. 29న ఉదయం 7గంటలకు మడుగుతేరు, సాయంత్రం 4గంటలకు బ్రహ్మ రథోత్సవం ఉంటుంది. అదే రోజు సాయంత్రం 6గంటలకు ధూళోత్సవం నిర్వహిస్తారు. 30న సాయంత్రం అశ్వవాహనం, మే 1న ఉదయం 6గంటలకు వసంతోత్సవం, 10గంటలకు చక్రస్నానం, సాయంత్రం 6గంటలకు హంస వాహన సేవలు ఉంటాయి. 2న సాయంత్రం 6గంటలకు దేవతా ఉద్వాసన, 3న ఉదయం 9గంటలకు పుష్ప యాగం, సాయంత్రం శయనోత్సవంతో ఉత్సవాలను ముగిస్తారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
అనంతపురం ఎడ్యుకేషన్: దేశంలో పేరు మోసిన ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంజినీరింగ్, బీఈ కోర్సుల ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన రెండో విడత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తాచాటి ఆలిండియా ర్యాంకులను కై వసం చేసుకున్నారు. జనరల్ ర్యాంకులతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల్లోనూ మంచి ర్యాంకులు సాధించారు. సెషన్–1 ఫలితాలు జనవరిలో విడుదల కాగా, తాజాగా సోమవారం రాత్రి సెషన్–2 ఫలితాలు విడుదలయ్యాయి. రెండు సెషన్లలో ఎక్కువగా వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. జి.సుశాల్ 168, ఆర్.భార్గవి 232, ఆర్.జస్వంత్కుమార్ 262, గురుగుంట్ల వైష్ణవి 395, అఖిల 976, గుండే శివమణినాయుడు 1,059, ఎస్.తరుణ్ 1,088, ఎం.తన్విక 1,240, ఎం.సాయిసహస్ర 1,479, ఓతూరి అబుసాజిద్ 1,809, డి.ఫయాజ్ అహమ్మద్ 2,547, ఎ.ప్రణవి 3,213, ప్రతాప్ రెడ్డి 3,925, అన్వేష్ 4,005, జశ్వంత్నాయక్ 4,024, కిరణ్ కౌషిక్ 4,278, వి.మణిదీపిక 4,444, మహర్ష 4,718, యు.నవీన్ 4,883, బి.శివదీప్ 5,045, బి.జయవర్దన్ 5,957, ఎస్.హాజీవలి 6,943వ ర్యాంకు సాధించారు. -
స్టేషన్ వద్దకు వచ్చి ఫోన్ చెయ్..
ముఠా సభ్యుల మధ్య విభేదాలు వచ్చి గొడవలు చేసుకున్న సందర్భంలో హెడ్ కానిస్టేబుల్ ఒకరు ఓ సభ్యురాలికి ఫోన్ చేసి మాట్లాడాడు. ‘మీరు మీరు ఎందుకు కొట్లాడుకుంటారు. నేను ఎస్పీని కలిసి అన్ని విషయాలూ చెబుతానని సదరు మహిళ అంటే... వద్దువద్దు నేను మాట్లాడతా. రెండు రోజులు సైలెంటుగా ఉండు.. ఆమె నీ జోలికి రాకుండా నేను మాట్లాడతా. రేపు ఉదయం మీరు స్టేషన్ వద్దకు రండి. ఫోన్ చేస్తే నేను బయటకు వస్తా. ఆలోపు మీరు వారిని తడుముకోవద్దు. నువ్వు బంగారు బాతువు. నువ్వు ఆమెతో విభేదిస్తే వ్యాపారం జరగదని భావించి ఈరకంగా గొడవ చేసి ఉంటుంది. నాకూ చాలా డబ్బు ఇచ్చినామని చెప్పిండొచ్చు. ఆడపిల్లల సొమ్ము... ఎంత ఇచ్చినా తీసుకున్నాను తప్ప ఇంతేకావాలని నేను అడగలేదు’ అని మాట్లాడిన ఆడియోలు వైరల్ అవుతున్నాయి. చాలా తెలివైనోడు...జాగ్రత్త! ఓ కానిస్టేబుల్ ముఠా సభ్యురాలితో ఫోన్లో మాట్లాడిన తీరును పరిశీలిస్తే ట్రాప్కు పూర్తిగా సహకరించినట్లు స్పష్టమవుతోంది. ‘వాడు చాలా తెలివైనోడు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని టీం లీడర్కు చెప్పా. ట్రాప్ చేసే మహిళ అతడి కారులో వెళ్తుంటే వెనుక మరోబైకును ఎందుకు ఫాలో అవ్వమని చెప్పింది..? ఓపెన్ ప్లేస్లోకి వెళ్లాక వెనుక బైకు వస్తుంటే కారులో ఉన్న వ్యక్తికి ఎందుకు అనుమానం రాదు..? ఆయన విషయంలో అదే జరిగింది. అనుమానం వచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఏదో మోసం జరుగుతోందని గ్రహించి ఆ ఏరియా వారిని కనుక్కున్నాడు. విషయమంతా తెలిసిపోయింది. ఆమె ఇదే పని చేస్తోందని అతడికి ఎవరో చెప్పారంట. అతను నా వద్దకు వచ్చి అదే విషయాన్ని చెప్పాడు. అనుమానం వచ్చి నీ నంబరు బ్లాక్లో పెట్టాడు. జాగ్రత్తగా డీల్ చేయాలి కదా’ అంటూ సంభాషించాడు. రాప్తాడు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ‘నయా హనీ ట్రాప్’ దందా ఊహించని మలుపు తిరుగుతోంది. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఈ దందాలో భాగస్వాములయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని జిల్లా పోలీస్ బాస్ (ఎస్పీ) జగదీష్ సీరియస్గా పరిగణించారు. అనంతపురం రూరల్ పరిధిలో వెలుగుచూసిన ఈ హనీట్రాప్ ముఠా... ఆర్థికంగా బలమైన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులను లక్ష్యం చేసుకుని వలపు వల విసిరి నిలువు దోపిడీ చేసింది. ముఠా తీరు భయంకరం హనీ ట్రాప్లో చిక్కుకున్న వారి పట్ల ముఠా సభ్యులు వ్యవహరించే తీరు అత్యత భయంకరంగా ఉంటోందని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించి, ప్రజలను అప్రమత్తం, అవగాహన కల్పించాల్సిన పోలీసులే వారికి సహకరించడం దుమారం రేపుతోంది. పలువురు పోలీసులు తమకు ‘టచ్’లో ఉన్నారనే ధైర్యంతోనే ముఠా బరితెగించినట్లు స్పష్టమవుతోంది. ట్రాప్లో పడిన వ్యక్తులు తిరగబడే పరిస్థితి ఉంటే తమకు అనుకూలంగా ఉన్న పోలీసులను రంగంలోకి దింపుతారు. పోలీసు డ్రెస్లో ఉన్నవారు అక్కడికి చేరుకోగానే సదరు వ్యక్తి హడలిపోవడం పరిపాటి. ‘మహిళను ఇబ్బంది పెట్టావు. ఆమె బలత్కారం కేసు పెడితే కచ్చితంగా జైలుకు వెళతావు’ అంటూ బాధితులను బెదిరించే ధోరణిలో మాట్లాడినట్లు సమాచారం. ఇప్పటిదాకా జిల్లాలో హనీట్రాప్ బాధితుల సంఖ్య వందల్లో ఉన్నట్లు తెలిసింది. మలుపు తప్పిన అంతర్గత విభేదాలు ఇటీవల కొందరు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో హనీట్రాప్ దందా వెలుగులోకి వచ్చింది. మరోవైపు హనీట్రాప్ ముఠా సభ్యుల్లో అంతర్గత విభేదాలు బయటపడడం కేసును కొత్త మలుపు తిప్పింది. వెంటనే స్పందించిన ఎస్పీ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి గుట్టు రట్టు చేసేదిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. హనీట్రాప్ బాధితులు తమకు న్యాయం చేయాలని ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా మంగళవారం అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. పోలీసుల పాత్రపై ఎస్పీ సీరియస్ మరోవైపు ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ ముఠా సభ్యులతో మాట్లాడిన సంభాషణ పోలీసు విభాగంలో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం పట్ల ఎస్పీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సహకరించిన ఏ స్థాయి వారినీ ఉపేక్షించ కూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నివేదిక రాగానే బాధ్యులైన సిబ్బందిపై వేటు వేస్తారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనంతపురం సమీపంలో ఉన్న ఓ ఎస్హెచ్ఓ కూడా ముఠాకు అన్ని విధాలా సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు పోలీసు శాఖలో ఓ ఉన్నతాధికారి అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఎస్పీ దృషికి వచ్చినట్లు సమాచారం.ఆర్ట్స్ కళాశాల డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డిగ్రీ మొదటి సంవత్సరం ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ప్రిన్సిపాల్ చాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్కే యూనివర్సిటీ పరీక్షల విభాగం డైరెక్టర్ ఆచార్య రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరామ్ నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.పద్మశ్రీ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తిరుమలేష్ చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు మొత్తం 1,447 మంది విద్యార్థులు హాజరు కాగా 672 మంది (46.44 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బీఏలో 33 శాతం, బీకాంలో 54 శాతం, బీఎస్సీలో 48 శాతం, బీబీఏలో 40 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు నిర్వహించిన రెండు నెలల్లోపు ఫలితాలను విడుదల చేయడం సంతోషకరమని ఎస్కే యూనివర్సిటీ అధికారులు తెలిపారు. -
25న పాలిసెట్
● 31 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ ● హాజరుకానున్న 9,745 మంది విద్యార్థులు ● ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని డీఆర్ఓ ఆదేశం అనంతపురం అర్బన్: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి పాలిసెట్–2026 ఈ నెల 25న జరగనుంది. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని డీఆర్ఓ, పరీక్షల నోడల్ అధికారి మలోల సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై డీఆర్ఓ సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆరు పట్టణాల్లోని 31 కేంద్రాల్లో నిర్వహించే పరీక్షకు 9,745 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. కేంద్రానికి ఒకరు చొప్పున ఆరుగురు డిప్యూటీ తహసీల్దార్లను ఫ్లయింగ్ స్క్వాడ్గా నియమించామన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద వైద్యశిబరం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు చెప్పారు. పరీక్ష వేళలకు అనుకూలంగా ఉండేలా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. గంట ముందే చేరుకోవాలి.. విద్యార్థులు నిర్దేశించిన పరీక్ష సమయం కంటే గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని డీఆర్ఓ సూచించారు. కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులనూ అనుమతించబోరన్నారు. -
మా మొర ఆలకించండి
చీనీ చెట్లు ఎండిపోతున్నాయ్ అనంతపురం అర్బన్: ‘మా కష్టం పగోడికి కూడా రాకూడదు. చెరువుల్లో నీరు లేక బోర్లు అడుగంటి దాదాపు వెయ్యి ఎకరాల్లో చీనీ చెట్లు ఎండిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అప్పులపాలై చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సిన వస్తుంది’ అని గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామ రైతులు సుబ్బయ్య, రామచంద్ర, తాతిరెడ్డి, కిష్టప్ప, వెంకటేశ్వరరెడ్డి, ఎర్రిస్వామి, రాయలసీమ రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు అక్బర్ ఆవేదన చెందారు. సోమవారం వారు కలెక్టరేట్లో ఆందోళన చేశారు. బ్రాహ్మణపల్లి చెరువు, ఓటికుంట చెరువు, రామాకుల చెరువుల్లో నీరు లేకపోవడంతో సమీపంలోని వ్యవసాయ బోర్లు అడుగంటి చీనీ చెట్లు ఎండిపోతున్నాయని తెలిపారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా నీటితో ఈ చెరువులను నింపకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తమ గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి, పంటల దుస్థితిని చూసి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అదేశారు. పరిష్కార వేదికకు 504 అర్జీలు అనంతపురం అర్బన్: తమ మొర ఆలకించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 504 అర్జీలను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్తో పాటు డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి, రమేష్రెడ్డి స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. అందే ప్రతి అర్జీకీ నాణ్యమైన పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. వినతుల్లో కొన్ని అనంతపురంలోని సంగమేష్నగర్లో నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలం కబ్జాకు గురవుతోందని ఓబులేసు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిపాడు. ఆక్రమణదారుల నుంచి స్థలాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. విద్యుతాఘాతానికి గురై కాలిపోయిన గంధం చెట్లకు సంబంధించి వాల్యుయేషన్ సర్టిఫికెట్ను డీఎఫ్ఓ కార్యాలయంలో ఇవ్వడం లేదని రాయదుర్గం మండలం జుంజురాంపల్లికి చెందిన ప్రకాష్ ఫిర్యాదు చేశాడు, గుమ్మఘట్ట మండలం భూపసముద్రం సర్వే నంబరు 164–బిలోని తమ పొలంలో 2,500 గంధపు చెట్లను 15 ఏళ్లుగా పెంచుతున్నానని చెప్పాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 1,800 చెట్లు, మోటార్లు, పైపులు కాలిపోయాయనని తెలిపాడు. చెట్లకు నష్టపరిహారం కోసం వెళితే అటవీశాఖ నుంచి వాల్యుయేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలని అధికారులు చెప్పారన్నారు. అటవీశాఖ అధికారులేమో ఇవ్వడం లేదన్నారు. తనకు నష్టపరిహారం అందేలా చూడాలని వేడుకున్నాడు. అనంతపురం శివారులోని రాజీవ్కాలనీ పంచాయతీ ప్రియాంకనగర్లో నివాసముంటున్న చాకలి వెంకటేష్ అనే దివ్యాంగుడు తనకు పింఛన్ మంజూరు చేయాలని అధికారులను కోరాడు. 50 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఉందని, ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా మంజూరు చేయలేదని తెలిపాడు. గుంతకల్లు మండలం నెలగొండ గ్రామ సర్వేనంబరు 263లో 4.22 ఎకరాలు పట్టా భూమి తనకు తాతల నుంచి సంక్రమించిందని, అయితే రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో తన పేరు తొలగించి వేరొకరి పేరు మీద భూమి ఎక్కించారని రైతు నెట్టికల్లు ఆవేదన వ్యక్తం చేశాడు. వీఆర్ఓతో పాటు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఆన్లైన్లో పేరును సరిచేయడం లేదన్నాడు. తన సమస్య పరిష్కరించాలని అధికారులను కోరాడు. -
నిధులు సరే.. నీళ్లు పారవా?
అనంతపురం ఎడ్యుకేషన్: చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుల పేరుతో నిధులు తప్ప నీళ్లు పారడం లేదు అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. సోమవారం అనంతపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులంటే రైతులకు నీళ్లు ఇవ్వడానికనేది వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వచనమైతే, కాంట్రాక్టర్లకు దోచి పెట్టడమనేది చంద్రబాబు నిర్వచనమని అన్నారు. హంద్రీ–నీవా కాలువకు దివంగత ఎన్టీఆర్ డీపీఆర్ చేయించారన్నారు. 40 టీఎంసీల నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకురావడం సాధ్యం కాదని చెప్పి 5 టీఎంసీల తాగునీటికి పరిమితం చేస్తూ చంద్రబాబు జీఓ తెచ్చారన్నారు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత తిరిగి 40 టీఎంసీల సామర్థ్యానికి పెంచారన్నారు. పనులు మొదలుపెట్టి జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు తెచ్చారన్నారు. రెండోదశ పనులు దాదాపు 70 శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్సార్దే అన్నారు. హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్ మీదే.. తామే హంద్రీ–నీవాను తీసుకొచ్చామని, జిల్లాను సస్యశ్యామలం చేశామని, ఆ క్రెడిట్ తమదేనంటూ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని తోపుదుర్తి విమర్శించారు. హంద్రీ–నీవాను నాశనం చేసిన క్రెడిట్ మీదేనని మండిపడ్డారు. మొన్నటిదాకా 2,200 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే వచ్చాయన్నారు. అయితే టీడీపీ వాళ్లు అందుకు భిన్నంగా 52 టీఎంసీల నీటిని తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. నాసిరకంగా కాంక్రీట్ పనులు.. కుప్పంకు నీళ్లు తీసుకుపోవాలనే ఉద్దేశంతో హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ చేయించారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. ఫలితంగా కాలువ కింద ఉన్న వందలాది గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి వేలాది బోర్లు ఎండిపోయాయన్నారు. బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే రూ.3,850 కోట్లతో కాలువ లైనింగ్ పనులు చేపట్టారన్నారు. అనంతపురం నుంచి చిత్తూరు దాకా వందచోట్ల లైనింగ్లో కంకర మొత్తం రాలిపోయిందంటే పనులు ఎంత అధ్వానంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబుకు ఆదాయం వస్తుందంటేనే పనులు చేపట్టి.. దానికి అభివృద్ధి అని పేరు పెడతారన్నారు. మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా నామమాత్రపు ఖర్చుతో పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా... పట్టించుకోలేదన్నారు. ఎందుకంటే వారికి నిధులు పారాలి తప్ప నీళ్లు అవసరం లేదన్నారు. హంద్రీ–నీవా కాలువను వారి ఆదాయ మార్గాల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారన్నారు. పొలాలకు నీళ్లివ్వాల్సిన ప్రాజెక్ట్ను కాంట్రాక్టర్లకు వరప్రదాయణిగా మార్చుతున్న మీదీ బతుకేనా? అంటూ మండిపడ్డారు. నాసిరకం లైనింగ్ పనులపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లకాలువల నిర్మాణాలకు టెండర్లు పిలిచి, పూర్తి చేయాలని, లేదంటే ప్రజాకోర్టులో తప్పకుండా శిక్ష వేస్తారని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీ రామాంజనేయులు, నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, మామిళ్లపల్లి అమర్నాథరెడ్డి, కనగానపల్లి అంకే అశోక్, శేఖర్, సనప గోపాల్రెడ్డి పాల్గొన్నారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే తహతహ హంద్రీ–నీవా లైనింగ్తో అడుగంటిన భూగర్భజలాలు చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆగ్రహం -
విశ్వగురువు బసవేశ్వరుడు
అనంతపురం అర్బన్: భూమిపై శ్రమజీవులతోనే సమాజం నిర్మితమయ్యిందని, మానవత్వమే జీవనాధారమని విశ్వగురువు బసవేశ్వరుడు చాటి చెప్పారని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన మహాత్మ బసవేశ్వర జయంతికి జేసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బసవేశ్వరుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించి, మాట్లాడారు. కులమత, వర్గ, వర్ణ భేదం లేకుండా అందరూ సమానులేని చాటి చెప్పిన మహనీయుడు బసవేశ్వరుడని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ తుల్జాపూర్ స్వప్న, పర్యాటక శాఖ అధికారి జయకుమార్బాబు, రీజనల్ డైరెక్టర్ ఓబుళమ్మ, డ్వామా పీడీ సలీంబాషా, ఆర్కియాలజీ ఏడీ స్వామినాయక్, శిల్పారామం ఏఓ సుధాకర్, వీరశైవ సమాజం అధ్యక్షుడు ఎంజీ రాజు, ప్రధాన కార్యదర్శి గౌలి, ప్రతినిధులు సతీష్కుమార్, ఈశ్వర ప్రసాద్, చిరంజీవి, గోపాల్, గంగాధర్, శివ, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు. 28 నుంచి పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు ● మే 6న బ్రహ్మ రథోత్సవం ఉరవకొండ రూరల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. మే ఆరో తేదీ బ్రహ్మ రథోత్సవం (తేరు) జరగనుంది. బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఈఓ సాకే రమేష్బాబు, ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు, ఆలయ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. ఈఓ మాట్లాడుతూ ఈ నెల 28న ఆమిద్యాల నుంచి ఉత్సవమూర్తులను పెన్నహోబిలం క్షేత్రానికి తీసుకురావటంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయన్నారు. 29న ప్రాకారోత్సవం, 30న ఉదయం సింహ వాహనోత్సవం, సాయంత్రం చంద్రప్రభ వాహనోత్సవం, మే 1న ఉదయం గోవాహనోత్సవం, సాయంత్రం శేష వాహనోత్సవం, 2న హంస వాహనోత్సవం, 3న హనుమద్ వాహనోత్సవం, 4న గరుడ వాహనోత్సవంతో పాటు స్వామి వారి కల్యాణోత్సవం, 5న ఉదయం సూర్యప్రభ వాహనోత్సవం సాయంత్రం ఐరావత వాహనోత్సవం ఉంటుందన్నారు. 6న బ్రహ్మ రథోత్సవం, 7న అశ్వ వాహనోత్సవం, 8న ధ్వజారోహణ, 8న శయనోత్సవం, 9న ఉత్సవమూర్తులను తిరిగి ఆమిద్యాల గ్రామానికి చేర్చటంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. టీచర్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాలు సిద్ధం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ తాత్కాలిక జాబితా సిద్ధం చేసినట్లు ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టిస్) ఆధారంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలలో పనిచేస్తున్న ఎస్జీటీలు, పాఠశాల సహాయకులు, హెచ్ఎంల సీనియార్టీ జాబితాలను (సబ్జెక్టు వారీగా, మీడియం వారీగా) సిద్ధం చేశామన్నారు. deo anantapur. blogspot. com వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఉపాధ్యాయులు తమ సీనియారిటీ వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23లోగా పనిదినాల్లో మాత్రమే డీఈఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. అభ్యంతరం తెలిపే ఉపాధ్యాయడి పూర్తి పేరు, హోదా సంబంధిత వివరాలు, సీనియార్టీ జాబితాలో తప్పిదం ఎక్కడ జరిగిందో స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఆధారాలు జత చేయాలని సూచించారు. జాబితాలో పేర్లు లేని ఉపాధ్యాయులు కచ్చితంగా వారి వివరాలు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎంఈఓలు, హెచ్ఎంలు ఈ సీనియార్టీ జాబితాలను పరిశీలించి తమ పరిధిలో ఉన్న టీచర్లు సస్పెన్షన్లో ఉన్నా, సెలవుపై ఉన్నా, ఏ ఇతర కారణాల వల్ల తాత్కాలిక జాబితాలో లేకపోతే వెంటనే కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. లేదంటే ఎంఈఓలు, హెచ్ఎంలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఫారెన్ సర్వీస్లో పని చేస్తున్న టీచర్లు కూడా తాత్కాలిక సీనియార్టీ జాబితాలో ఉన్నారో లేదో పరిశీలించుకోవాలన్నారు. -
కొత్త పంటల సాగుపై తొందర పడకండి
అనంతపురం అగ్రికల్చర్/గుంతకల్లు రూరల్/ గార్లదిన్నె: యాపిల్, లాంగాన్, మకాడమియా, అవకాడో, లిచీ, లక్ష్మణఫలం లాంటి కొత్త రకం పండ్లతోటలు సాగు చేయడానికి తొందరపడకుండా కొంతకాలం రైతులు వేచిచూడాలని ఉద్యానశాఖ అడిషినల్ డైరెక్టర్లు సీహెచ్ హరినాథరెడ్డి, ఎం.వెంకటేశ్వర్లు, ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతిరెడ్డి సూచించారు. జిల్లాలో మూడు మండలాల పరిధిలో రైతులు సాగు చేసిన యాపిల్ పంటతో పాటు కొత్త రకం పంటల గురించి ఇటీవల విస్తృతంగా ప్రచారం జరగడంతో వాటి పరిశీలనకు రెండు రోజుల పాటు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మొదటి రోజు ఆదివారం కుందుర్పి మండలం ఎనుములదొడ్డిలో రైతు నాగరాజు సాగు చేసిన యాపిల్ పంట, అలాగే కళ్యాణదుర్గం మండలంలో రైతు కృష్ణమూర్తి సాగు చేసిన డ్రాగన్, విభిన్న పద్ధతుల్లో సాగు చేసిన కళింగర పంట, అవకాడో పంటను చూశారు. బెళుగుప్ప మండలం గుండ్లపల్లిలో రైతు రామాంజినేయులు 1.20 ఎకరాల్లో 300 రకాల మామిడి, 30 రకాల జామతో పాటు మొత్తం మీద పలు రకాల పండ్లతోటలు 1,500 చెట్లు కలిగిన తోటను పరిశీలించి రైతు అనుభవాలు తెలుసుకున్నారు. పోలీసుశాఖలో పనిచేస్తున్న ఆయన వివిధ దేశాల్లో పండించే పలు కొత్త రకాలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నట్లు గుర్తించారు. రెండో రోజు సోమవారం గార్లదిన్నె మండలం మర్తాడులో రైతు రమణారెడ్డి సాగు చేసిన యాపిల్, లాంగాన్, కర్జూరం తోటలు, అలాగే గుంతకల్లు మండలంలో రైతు చంద్రశేఖర్ సాగు చేసిన మలబార్ వేప, సీతాఫలంలో కొత్తరకమైన లక్ష్మణఫలం, లాంగ్ మల్బరీ, మకాడమియా, వాటర్ యాపిల్ తోటలను పరిశీలించి, మాట్లాడారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్లు మాట్లాడుతూ కొత్త రకం పంటలను తొందరపడి సాగు చేయవద్దన్నారు. ఒకసారి చేతికిరాగానే పంట వచ్చినట్లేనని భావించి మిగతా రైతులు అదే బాట పడితే సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. యాపిల్తో పాటు కొత్త రకాల పండ్లతోటలపై మూడేళ్లు అధ్యయనం చేసిన తర్వాత ముందుకు వెళదామన్నారు. అధ్యయనం చేసే బాధ్యతను రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతిరెడ్డితో పాటు జిల్లాలో ఉన్న మరికొందరు శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. -
తాగుబోతుల గోల భరించలేకున్నాం
కణేకల్లు: ‘సార్.. గుడి – బడి వద్దే బెల్టుషాపు పెట్టి మద్యం అమ్ముతున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు తాగుబోతులు మత్తులో వీరంగం సృష్టిస్తున్నారు. వారి గోల భరించలేకపోతున్నాం’ అంటూ కె.కొత్తపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టు షాపును ఎత్తేసి ప్రజలు ప్రశాంతంగా ఉండేలా చూడాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ బ్రహ్మయ్యకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల, ఆంజనేయస్వామి దేవాలయం పరిసర ప్రాంతంలో బెల్టుషాపు తెరిచి రేయింబవళ్లూ మద్యం అమ్ముతున్నారన్నారు. మద్యం తాగిన వారు హల్చల్ చేస్తూ పరిసర ప్రాంత ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారన్నారు. తహసీల్దార్ స్పందిస్తూ బెల్టుషాపు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
కూలీలపై నిర్లక్ష్యం
తాడిపత్రి రూరల్: కూలీల వలసల నివారణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ ఏడాది వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ – గ్రామీణ (వీబీ జీ రామ్ జీ)గా మారింది. ఇదివరకు ఏడాదికి వంద రోజుల పనిదినాలు కల్పించేవారు. కొత్తగా ఆ సంఖ్యను 125 దినాలకు పెంచింది. కూలీల ఉపాధికి మెరుగైన హామీ అంటూ చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అయితే అందుకు అనుగుణంగా కూలీలకు పని ప్రదేశాల్లో కల్పించాల్సిన సౌకర్యాలను మాత్రం విస్మరిస్తోంది. జిల్లాలో దాదాపు 4.48 లక్షల మంది కూలీలు ఉన్నారని అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. పనులకు హాజరవుతున్నవారు 3.55 లక్షల మంది ఉన్నారు. ఉపాధి హామీ పథకం కింద వీరికి 60 రకాలకు పైగా పనులను అధికారులు కల్పించాల్సి ఉంది. వేసవి అలవెన్సులపై అలసత్వం.. ఉపాధి పనుల్లో పాల్గొనే కూలీలకు వేసవి భత్యం అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూలీలు చేసిన పనులకు సంబంధించి కూలిలో అదనంగా 30 శాతం వేసవి భత్యం చెల్లించింది. ప్రస్తుతం అలవెన్సు గురించి పట్టించుకునే నాథులే లేరు. ఇక చాలా ఏళ్లుగా కూలీలకు పనిముట్లను పంపిణీ చేయడం లేదు. గడ్డ పారల మరమ్మతులకు రూ.10, గంపకు రూ.5, మంచినీటి కోసం రూ.5, ఐదు కిలోమీటర్లకుపైగా దూరం నుంచి వచ్చిన కూలీలకు రూ.20 చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ముఖ హాజరుపై తీవ్ర వ్యతిరేకత.. కూలీలకు ముఖ హాజరు ప్రవేశ పెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డిజిటల్ విధానం అమలుతో వేతనం కోల్పోవాల్సి వస్తుందేమోనన్న భయం కూలీలను వెంటాడుతోంది. నెట్వర్క్ పనిచేయక, సిగ్నల్ దొరకపోవడం తదితర సాంకేతిక కారణాల వల్ల ముఖ హాజరు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ముఖ హాజరును రద్దు చేసి పాత పద్ధతి అమలు చేయాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి హామీ కింద పనులు చేసే కూలీలకు సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. ఇటువంటి సమయంలో ఎండలో ఉంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. పని ప్రదేశంలో కూలీలకు నీడ, మజ్జిగ– మంచినీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఫలితంగా కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు పనిచేసే ప్రదేశాల్లో కూలీలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించాం. కూలీలకు అవసరమైన పనిముట్లు ప్రభుత్వం నుంచి రాలేదు. అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్టు ఎయిడ్ బాక్స్లను ఉంచాలని సూచించాం. కూలీలు సేద తీరడానికి టెంట్లు వేయాలని చెప్పాం. వాటి ఏర్పాటులో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. – రాజ్యలక్ష్మి, ఏపీఓ, ఉపాధి హామీ, తాడిపత్రి ఉపాధి సరే.. సౌకర్యాలేవీ..? సేద తీరడానికి టెంట్లు కరువు నీళ్లు – మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేక కూలీలు సతమతం అమలు కాని వేసవి అలవెన్సు పనిముట్ల పంపిణీని విస్మరించిన ప్రభుత్వం సదుపాయాలు ఎక్కడ..? జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. నిలువ నీడ లేక ఉపాధి పనులు చేస్తున్న కూలీలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. పని ప్రదేశంలో కూలీలు సేద తీరటానికి, భోజనాలు చేయడానికి టెంట్లు వేయాల్సి ఉంది. అయితే ఎక్కడా టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో చెట్ల నీడన సేద తీరుతూ, భోజనాలు చేయాల్సి వస్తోంది. చెట్లు లేని చోట ఎండల్లోనే మగ్గుతున్నారు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, పనులు జరిగే సమయంలో కూలీలు గాయాలపాలైతే వారికి చికిత్స కోసం అయోడిన్ బాటిల్, బ్యాండేజీ, దూది తదితర వస్తువులతో కూడిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను అందుబాటులో ఉంచాలని నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదు. తీవ్రమైన ఎండల బారినపడి కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఎక్కడా అందుబాటులో ఉంచిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతం కొన్నిచోట్ల తాగడానికి నీళ్లు కూడా లేకపోవడంతో కూలీలు ఇంటి నుంచే బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుని గొంతు తడుపుకుంటున్నారు. -
చివరగా కుమార్తెతో వీడియో కాల్లో మాట్లాడి..
● పోస్టల్ ఉద్యోగి బలవన్మరణం ● భార్య 9 నెలల నిండు గర్భిణి ● అనంతపురం రూరల్ మండలం మధురానగర్లో విషాదం రాప్తాడు రూరల్: కారణాలు తెలీదుకాని జీవితంపై విరక్తితో ఓ పోస్టల్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య 9 నెలల నిండు గర్భిణి. 18 నెలల వయసున్న కుమార్తె అంటే అమితమైన ప్రేమ. తాను చనిపోయే ముందు కుమార్తె గుర్తుకొచ్చింది కాబోలు చివరిసారిగా వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఏమనిపించిందో ఏమో కానీ, మళ్లీ వీడియోకాల్ చేసి మాట్లాడాడు. బాధనంతా దిగమింగుకుని యోగక్షేమాలు అడిగి ఫోన్ పెట్టేశాడు. ఆ కుటుంబానికి అదే చివరికాల్ అయింది. ఫోన్ పెట్టేసిన కాసేపటికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సోమవారం అనంతపురం రూరల్ మండలం కళ్యాణదుర్గం రోడ్డు మధురానగర్ మూడోక్రాస్లో సోమవారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఈదులముష్టూరుకు చెందిన కుమ్మర గోపినాథ్ (38)కి అనంతపురం రూరల్ మండలం ఆలమూరుకు చెందిన కుమ్మర శ్రావణితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 18 నెలల కుమార్తె ఉంది. శ్రావణి ప్రస్తుతం 9 నెలల నిండు గర్బిణి. ఇంకో నాలుగైదు రోజుల్లో కాన్పు కానుంది. అనంతపురం రూరల్ మండలం మధురానగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఆత్మకూరు పోస్టాఫీసులో పని చేస్తున్నాడు. భార్య డెలివరీ కోసమని పుట్టింటికి వెళ్లింది. గోపినాథ్ ఒక్కడే ఇంట్లో ఉంటూ డ్యూటీకి వెళ్లి వచ్చేవాడు. కొన్నేళ్ల పాటు ఊరి నుంచి డ్యూటీకి వెళ్లి వస్తే తనకెంతో సౌకర్యవంతంగా ఉంటుందని భార్య అభ్యర్థనకు గోపినాథ్ అంగీకరించాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం మధురానగర్లో ఉన్న ఇంట్లో నుంచి చాలా సామగ్రిని ఆలమూరుకు తరలించారు. ఇంకా కొన్ని మిగిలి ఉండగా...రెండు మూడు రోజుల్లో ఖాళీ చేయాలని భావించారు. ఇంతలో ఏమి జరిగిందో ఏమో తెలీదు కాని గోపినాథ్ సోమవారం మధ్యాహ్నం భార్య, కుమార్తెతో ఫోన్లో మాట్లాడాడు. మరో మారు భార్య ఫోన్చేస్తే లిఫ్ట్ చేయలేదు. మామ సుబ్బరాయుడు ఫోన్ చేసినా స్పందించలేదు. వెంటనే ఇంటి యజమానికి శ్రావణి ఫోన్ చేయడంతో ఆమె మిద్దైపెకి వెళ్లి చూడగా అప్పటికే వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న గోపినాథ్ కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని వెంటనే కిందకు దింపి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కారు బోల్తా.. వ్యక్తి మృతి బెళుగుప్ప: మండలంలోని నరసాపురం వద్ద ప్రధాన రహదారిపై కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... రాయదుర్గం నివాసి లడ్డూ వలీసాహెబ్ (66) కుటుంబసభ్యులతో కలసి కారులో సోమవారం ఉదయం కళ్యాణదుర్గం బయలుదేరాడు. నరసాపురం వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పల్లంలోకి బోల్తా కొట్టింది. కారు నుజ్జునుజ్జయింది. గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన వారిని వెలికి తీశారు. అప్పటికే వలీ సాహెబ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. డ్రైవర్ రామచంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో ఇద్దరు కుటుంబసభ్యులు బయటపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే వలీసాహెబ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఒంటరి మహిళతో అసభ్య ప్రవర్తన
అనంతపురం సెంట్రల్: మగ దిక్కు లేక హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళ కుటుంబంపై ఓ తాగుబోతు వేధింపులకు పాల్పడ్డాడు. హోటల్లో ఉంటున్న 17 ఏళ్ల వయసున్న ఆమె కుమార్తెను బలవంతం చేయడానికి యత్నించాడు. ఈ ఘటన సోమవారం అనంతపురంలోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులో ఉన్న రుద్రవైన్స్ షాపు వద్ద చోటు చేసుకుంది. ‘నేను రౌడీషీటర్ని.. ఒకడ్ని చంపినా... నన్ను అడ్డుకునే వారు ఈ నగరంలోనే లేరు.. నీ బిడ్డను కిడ్నాప్ చేస్తా.. మీకు ఎవరు అడ్డు వస్తారో చూస్తా ’. అంటూ మద్యం మత్తులో రెచ్చిపోతూ బట్టలు విప్పి ఒంటరి మహిళ, ఆమె కుమార్తెతో పట్టపగలే అసభ్యకరంగా ప్రవర్తించాడు. గమనించిన స్థానికులు వెంటనే దుండగుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, నాల్గో పట్టణ పోలీసులకు అప్పగించారు. దుండగుడు ఎవరన్నది పోలీసులు విచారిస్తున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు -
మంత్రి పయ్యావుల అనుచరుడి దౌర్జన్యం
మూడు తులాల బంగారు నగలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన హేమంత్కుమార్, మంత్రి పయ్యావుల కేశవ్ అనుచరుడు లక్కవరం శ్రీనివాసులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అనంతపురానికి చెందిన సాయిలీల ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె తన వేదనను విలేకరులకు వెల్లడించారు. 2023 డిసెంబర్ నుంచి తనను వారు వేధిస్తున్నారని, ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు ఎస్పీని కలిసి విన్నవించుకున్నానని తెలిపారు. ఎస్పీని కలిసిన ప్రతిసారీ అనంతపురం రూరల్ పోలీసులకు సిఫారసు చేస్తున్నారని, అయినా తనకు న్యాయం చేకూరడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో లక్కవరం శ్రీనివాసులును రూరల్ పోలీసుస్టేషన్కు పోలీసులు పిలిపించి, పంచాయితీ చేశారని, ఆ సమయంలో నగలు తిరిగి ఇస్తానంటూ అంగీకరించాడని తెలిపారు. అయితే నేటికీ నగలు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికై నా పోలీసులు తనకు న్యాయం చేయాలని ఎస్పీని కలిసి వేడుకున్నట్లు వివరించారు. -
పోలీసులతో చేకూరని న్యాయం
అనంతపురం సెంట్రల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని, బాధితులకు న్యాయం చేకూరడం లేదంటూ పలువురు వాపోయారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 129 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కాగా, సమస్యల పరిష్కారంపై పలువురు ఫిర్యాదుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షాత్తూ ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేసినా న్యాయం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికారపార్టీ నాయకుల సిఫారసులు ఉన్న వారి పక్షానే పోలీసులు నిలుస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఒకే సమస్యపై న్యాయం కోసం పలుమార్లు ఎస్పీ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. సిఫారసు ఉంటేనే పనులు ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా దక్కని న్యాయం పరిష్కార వేదికకు 129 వినతులు -
వైభవంగా శ్రీవారి రథోత్సవం
బొమ్మనహాళ్: మండల కేంద్రంలో వెలసిన వేంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం ఆలయంలో మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు పెద్ద ఎత్తున జరిగాయి. ఉదయం 6 గంటలకు దీక్షా హోమం, బలిహరణ, 10 గంటలకు రథాంగహోమం, రథ బలి, మడుగుతేరు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చి బ్రహ్మ రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు గోవింద నామసర్మణంతో రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవం ముందు వివిధ వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, భక్తులు కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. గనిలో ప్రమాదం – కార్మికుడి మృతి యాడికి: గనిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ కడప జిల్లా వీరనాయునిపల్లికి చెందిన రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు పవన్కుమార్రెడ్డి (25) ఇద్దరూ యాడికి మండలంలోని బోయరెడ్డి పల్లి సమీపంలో ఉన్న అదానీ సిమెంట్స్ పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో కుందన కోట – గుడిపాడు గ్రామాల మధ్యలో ఉన్న గనుల్లో విధుల్లో ఉన్న సూపర్వైజర్ పవన్కుమార్రెడ్డిని గని నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొంది. తలకు బలమైన గాయమైన పవన్కుమార్రెడ్డిని వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న యాడికి సీఐ శ్రీనివాసులు, సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
అక్రమ మైనింగ్ను అరికట్టండి
అనంతపురం అర్బన్: పెద్దవడుగూరు మండలం కొండుపల్లి వద్ద వందల ఎకరాల్లో సాగుతున్న అక్రమ మైనింగ్ను అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాంటూ జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్కు సీపీఐ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన పరిష్కార వేదికలో జేసీని సీపీఐ నాయకులు వెంకటరాముడు, సూర్యనారాయణరెడ్డి, చిరుతల మల్లికార్జున కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. కొండుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 698–ఏ, సీ, బీ2, 697, 699, 688–ఏ2, బీ–1లో అక్రమ మైనింగ్ సాగుతోందన్నారు. దాదాపు రూ.6 కోట్లు విలువ చేసే డోలమైట్, స్టీటైట్ ఖనిజం 8వేల టన్నులకు పైగా తరలించారని ఆరోపించారు. ఈ విషయం రెవెన్యూ, గనుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళితే మొక్కబడిగా తనిఖీలు నిర్వహించి కొంత ఖనిజం సీజ్ చేశారని, అయితే ఎవరిపై చర్యలు తీసుకున్నది లేదన్నారు. తహసీల్దారు సీజ్ చేసిన ఖనిజాన్ని కొద్ది రోజుల తరువాత అక్రమార్కులు తరలించి సొమ్ము చేసుకున్నారని తెలిపారు. కొండుపల్లిలో 10 గనులు మాత్రమే అనుమతి పొంది నడుస్తున్నాయని, మిగిలినవన్నీ అక్రమంగా నడుస్తున్నవే తెలిపారు. దీనిపై తనిఖీలు నిర్వహించి అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుత్తి గుత్తి: గుత్తి మున్సిపాలిటీ అప్గ్రేడ్ అయ్యింది. జనాభా, ఆదాయం ఆధారంగా థర్డ్ గ్రేడ్ నుంచి సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్గ్రేడ్ కావడం వల్ల ఎక్కువ నిధులతో పాటు అదనపు సిబ్బంది వస్తారు. మున్సిపాలిటీ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. -
భర్తను కిడ్నాప్ చేశారన్నా పట్టించుకోలేదు
రూ. 50వేలు తిరిగి ఇవ్వనందుకు తన భర్త హుస్సేన్బాషాను పది రోజుల క్రితం కిడ్నాప్ చేసి, చిత్ర హింసలకు గురిచేస్తున్నారని సాకే కామాక్షి అనే మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. అనంతపురంలోని భారత్ వాటర్ప్లాంట్లో తన భర్త హుస్సేన్బాషా పని చేసేవాడని గుర్తు చేశారు. ఈ క్రమంలో యజమాని వద్ద అప్పు చేశాడని, తిరిగి ఇవ్వకపోవడంతో వారు బందీగా చేసుకున్నారని వివరించారు. ఆరేళ్ల్లుగా కనీస జీతం కూడా ఇవ్వకుండా పనులు చేయించుకున్నారన్నారని, ఇప్పుడు తన భర్తను వదిలి పెట్టకపోవడంతో ఇంట్లో జీవనం దుర్భరంగా మారిందని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతపురం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసి, రోజూ పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎలాగైనా తన భర్తను విడిపించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. -
నిర్లక్ష్యపు డ్రైవింగ్కు బలి
రాప్తాడు రూరల్/కుందుర్పి: నిర్లక్ష్యపు డ్రైవింగ్కు ఓ రైతు నిండు ప్రాణం బలైంది. పండించిన పంటను అమ్ముకుని కుటుంబానికి ఆధారం కావాలనే ఆశతో వచ్చిన అన్నదాత అదే మార్కెట్ యార్డులో ప్రాణాలు కోల్పోవడం చూపరులను కలచివేసింది. వివరాలు..కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రన్న (66) తన పొలంలో పండించిన మామిడి కాయలను బొలెరో వాహనంలో తీసుకుని కక్కలపల్లి గ్రామంలోని టమాట మండీకి వచ్చాడు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మార్కెట్లో సరుకు ఉంచి, మరుసటి రోజు ఉదయం వేలంలో పాల్గొనేందుకు అక్కడే వేచి ఉంటూ బహిరంగ ప్రదేశంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో టీఎస్ 07 ఈయూ 3699 నంబరు గల చావర్లెట్ క్రూజ్ కారును డ్రైవర్ రివర్స్ చేస్తూ నిద్రిస్తున్న చంద్రన్నను గుర్తించకుండా అతని మీదుగా దూసుకెళ్లాడు. ఘటనలో చంద్రన్న తొడలు, నడుం భాగం తీవ్రంగా నలిగిపోయాయి. క్షతగాత్రుడిని ఆగమేగాలపై స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ పీఎస్ ఎస్ఐ రాంబాబు ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మార్కెట్ యార్డులో రివర్స్లో వచ్చి పడుకున్న రైతు మీద దూసుకెళ్లిన కారు నిద్రలోనే కన్నుమూత -
గడ్డివాములకు నిప్పు పెడుతున్న వ్యక్తి అరెస్ట్
పెద్దవడుగూరు: మండల కేంద్రం చుట్టుపక్కల వరుసగా గడ్డివాములకు నిప్పు పెడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. సోమవారం స్థానిక పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వారు వెల్లడించారు. గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన తపెల పెద్దరంగడు అలియాస్ సుధాకర్ కొన్ని రోజులుగా పెద్దవడుగూరులో తిరుగుతూ గడ్డివాములకు నిప్పు పెట్టి పైశాచిక ఆనందం పొందసాగాడు. ఈ నెల 13న రైతు గొల్ల గంగన్న గడ్డివాములు, 14న జడ్.వీరారెడ్డికి చెందిన గడ్డివాములు, 15న జెడ్.హనుమంతరెడ్డి గడ్డివాములు, 18న మొళకతాళ్లలో, 19న పెద్దవడుగూరులోని వట్టెం విజయబాస్కర్రెడ్డికి చెందిన గడ్డివాములకు నిప్పు పెట్టాడు. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు నిఘా పటిష్టం చేవారు. ఈ క్రమంలో 19వ తేదీన చోటు చేసుకున్న సంఘటనా ప్రదేశంలోని సీపీ కెమెరాల్లో నిక్షిప్తమైన పుటేజీల ఆధారంగా సోమవారం పెద్ద రంగడుని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. -
మహిళల భద్రతకు శక్తి యాప్ : ఎస్పీ
గుంతకల్లు టౌన్: మహిళలు, బాలికల భద్రతకు శక్తి యాప్ ఓ రక్షణ కవచమని ఎస్పీ పి.జగదీష్ అన్నారు. సోమవారం సాయంత్రం పాత గుత్తి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో గుంతకల్లు సబ్డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాలికలు, మహిళల భద్రతపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. విద్యార్థినులు, మహిళలు తమ ఫోన్లలో ఉన్న క్యాండీక్రష్, ఇతర చాటింగ్ యాప్లను తొలగించి శక్తియాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆపదలో ఉన్న సమయంలో యాప్లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకుని రక్షణగా నిలుస్తారని చెప్పారు. ఈ యాప్ వినియోగం వల్ల గత రెండేళ్లల్లో జిల్లాలో బాలికలు, మహిళలపై 10 శాతం నేరాలు తగ్గాయన్నారు. ఏపీకే ఫైల్స్, లోన్ యాప్లు, సైబర్ మోసాలపై చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల జీవితాలు నాశనమవుతాయన్నారు. మాదకద్రవ్యాల వినియోగంపై 1972కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే జయరామ్, స్థానిక డీఎస్పీ శ్రీనివాసులు, అనంతపురం మహిళా పీఎస్ డీఎస్పీ మహబూబ్బాషా, సబ్డివిజన్లోని సీఐలు మనోహర్, ప్రవీణ్, రామారావు, శంకర్నాయక్, రాజు, మహానంది పాల్గొన్నారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించేందుకు పట్టణంలో సాయంత్రం నిర్వహించిన ర్యాలీలో ఎస్పీ హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనాన్ని నడిపారు. అనుమానంతోనే బాలుడి హత్య ● 48 గంటల్లోనే మిస్టరీ ఛేదింపు ● నిందితుడి అరెస్ట్ రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం పామురాయి సమీపంలో జరిగిన మైనర్ బాలుడి హత్య కేసులో మిస్టరీని 48 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. అనుమానం పెనుభూతమై ఓ బాలుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు చాకలి రామ్మోహన్ సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాలను రూరల్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎన్.శేఖర్ వెల్లడించారు. ఈ నెల 18న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో పామురాయి సమీపంలోని సిమెంట్ పెల్లల ఫ్యాక్టరీ వద్ద స్థానిక రజక కాలనీకి చెందిన కళ్యాణ్ సాత్విక్ అనే బాలుడు హత్యకు గురయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సదరు బాలుడు తన భార్యతో సన్నిహితంగా ఉన్నాడనే అనుమానంతో కక్ష పెంచుకున్న రామ్మోహన్ పథకం ప్రకారం జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశానికి బాలుడిని తీసుకెళ్లి సిమెంట్ పెల్లలతో తలపై మోది హత్య చేశాడు. దర్యాప్తు చేపట్టిన సీఐ ఎన్.శేఖర్ నేతృత్వంలోని పోలీసులు పక్కా ఆధారాలతో సోమవారంరాప్తాడు మండలం కదిరి–అనంతపురం రోడ్డులోని ఆర్డీటీ స్టేడియం సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐతో పాటు ఎస్ఐ కె. రాంబాబు, మహిళా ఎస్ఐ కె. చైతన్య స్వరూపిణి, పీసీలు తిమ్మప్ప, జయరాం నాయక్, కె. రాజును అనంతపురం రూరల్ డీఎస్పీ టి.శ్రీనివాసులు అభినందించారు. ఐసీడీఎస్ పీడీ బాధ్యతల స్వీకరణ అనంతపురం సెంట్రల్: ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీగా శశికళ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకూ పనిచేస్తున్న ఎం.శ్రీదేవి తనను ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆమెను తిరిగి బద్వేలు సీడీపీఓగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆమె రిలీవ్ అయ్యారు. రాయచోటి సీడీపీఓగా పనిచేస్తూ ఇక్కడికి ఇన్చార్జ్ పీడీగా బదిలీపై వచ్చిన శశికళకు బాధ్యతలు స్వీకరించారు. -
బీసీలపై ప్రభుత్వానికి వివక్ష
అనంతపురం: బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని, ఎలాంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాలు దక్కకుండా చంద్రబాబు ప్రభుత్వం వివక్షకు గురిచేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్గౌడ్ విమర్శించారు. ఈ నెల 26న అనంతపురంలో తలపెట్టిన ‘బీసీ గళం’ కార్యక్రమం విజయవంతం చేయడానికి గల కార్యాచరణపై సోమవారం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈ నెల 26న జరగబోయే బీసీ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా బీసీ వర్గాలకు ఆర్థిక స్వావలంబన, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ద్వారా సామాజిక సాధికారిత దిశగా గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలు వేశారని గుర్తు చేశారు. బీసీలను చంద్రబాబు బ్యాక్వర్డ్ క్లాస్గా భావిస్తే.. బ్యాక్ బోన్ క్లాస్గా వైఎస్ జగన్ మార్చారని ప్రశంసించారు. అమ్మ ఒడి పథకం, విద్యాదీవెన, విద్యా కానుక, పొదుపు మహిళలకు ఆసరా, అక్క చెల్లెమ్మలకు చేయూత లాంటి పథకాలను దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అమలు చేసి అన్ని విధాలుగా అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని నాగన్న (న్యాయవాది), రాధాకృష్ణ, బీసీ జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర, ఉపాధ్యక్షుడు లక్ష్మన్న, బీసీ సెల్ నగర కార్యదర్శి నరేష్, శ్రీనివాసులు, రిలాక్స్ నాగరాజు, శేఖర్ బాబు, రాజశేఖర్, నవీన్, లక్ష్మణ్, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, రాజేష్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, కై లాష్, చిన్న రాయుడు, ఎం. కిరణ్, దస్తా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యను ప్రైవేటీకరణ, కాషాయీకరణ నుంచి కాపాడాలి
అనంతపురం ఎడ్యుకేషన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ, కాషాయీకరణ చేయాలనే ప్రయత్నాల నుంచి కాపా డాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ నాల్గో ఎస్ఎఫ్ఐ మహాసభను ఆదివారం సీపీఎం కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ గేయానంద్, ప్రసన్నకుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యను బలహీనపరుస్తూ, సెంట్రల్ యూనివర్సిటీలకు తగిన బడ్జెట్ కేటాయించకుండా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సరైన సౌకర్యాలు లేకుండా విద్యాభ్యాసం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కామన్ పీజీ సెట్ విధానం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారని పేర్కొన్నారని వాపోయారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్, జిల్లా అధ్యక్షుడు గిరి, నగర నాయకులు శివ, భీమేష్, సెంట్రల్ యూనివర్సిటీ కమిటీ అధ్యక్షురాలు అన్నన్, ఎస్కే యూనివర్సిటీ కార్యదర్శి శాంతిరాజ్, నాయకులు పవన్, నాగేంద్ర పాల్గొన్నారు. -
హే ‘భగ’వాన్!
● బెంబేలెత్తిస్తున్న ఉష్ణోగ్రతలు అనంతపురం అగ్రికల్చర్: మునుపెన్నడూ లేనివిధంగా సూరీడు తీవ్రస్థాయిలో ప్రతాపం చూపిస్తుండటంతో హే‘భగ’వాన్ అంటూ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉష్ణోగ్రతలు ఏ మాత్రమూ తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఆదివారం ‘సన్’ స్ట్రోక్ మరింత పెరిగింది. తాడిపత్రి, కళ్యాణదుర్గం ప్రాంతంలో 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో 15 రోజులుగా ‘అనంత’ అగ్నిగుండంలా మండుతోంది. వైశాఖ మాసానికి సార్థకత చేకూరుస్తూ సూరీడు జనానికి ముచ్చెటమలు పట్టిస్తున్నాడు. జిల్లా అంతటా గరిష్టంగా 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 24 డిగ్రీల నుంచి 31 డిగ్రీలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో రాత్రిళ్లు కూడా తీవ్ర ఉక్కపోత, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ మాత్రం అలసత్వం వహించినా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా రాగల మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. దాదాపు పొడి వాతావరణం ఉంటుందని, ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చన్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలిపారు. -
నగ.. జాగ్రత్తలతోనే నిగనిగ
అనంతపురం కల్చరల్: బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నా మోజు తీరడం లేదు. ఎగబడి కొంటున్నారు. చాలా మందికి బంగారు ఆభరణాలను ధరించడమంటే మక్కువ. మహిళలకైతే ఇక చెప్పక్కర్లేదు. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే నిత్యం బంగారం చేతులు మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజుల్లో కొంతైనా బంగారం కొని దాచుకోవాలన్న సెంటిమెంట్ బలంగా ఉంటుంది. సోమవారం అక్షయ తృతీయ ఉండడంతో నగలు కొనడం కోసం అందరూ పరుగులు పెడుతున్నారు. తులం బంగారం రూ. లక్షన్నర దాటేస్తున్నా కొనుగోళ్లకు ఉత్సాహం చూపుతున్నారు. జాగ్రత్త.. జాగ్రత్త బంగారంపై ఉండే మోజు, ఆత్రంగా కొనేయాలనుకోవడం వల్ల విపణి వీధిలో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పుత్తడి కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని వినియోగదారుల సంఘాల వారు సూచిస్తున్నారు. ● ఆఫర్ల పేరిట జరిగేవన్నీ మోసాలే. ఎందుకంటే తక్కువ ధరకు బంగారం విక్రయించాలని వ్యాపారులు అనుకోరు. ● కేడీఎం పేరుతో 24 క్యారెట్ల బంగారు నగలంటారు. వాస్తవానికి పూర్తి బంగారంతో ఆభరణాలు తయారు చేయడం సాధ్యం కాదు. తప్పనిసరిగా ఇతర లోహాలు వాడాల్సిందే. ● హాల్మార్క్ ఉందా లేదా చూసుకోవాలి. చైను, డాలర్ కలిసి కొనుగోలు చేసే సమయంలో కేవలం డాలర్పై మాత్రమే హాల్మార్క్ ఉంటుంది. చైనుపై కూడా ఉండేవి కొనాలి. బీఐఎస్ లోగో, స్వచ్ఛత సంఖ్య, తయారీ సంవత్సరం, తయారీ సంస్థ లోగో ఉండాలి. లేదంటే నాణ్యతా లోపం ఉన్నట్లు లెక్క. ● భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) అనుమతి లేకనే చాలా చోట్ల ఆభరణాలు అమ్ముతుంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ● వాల్యూ అడిషన్ చార్జెస్ పేరుతో ఇష్టానుసారంగా అంటే 15–28 శాతం వరకు వసూలు చేయకూడదు. దీన్ని గమనించాలి. ● తరుగు, ఇతర తయారీ ఖర్చుల విషయంలో ప్రధానంగా మోసం జరుగుతుంటుంది. నిజానికిది వినియోగదారులకు సంబంధించిన అంశం కానే కాదు. వీటిని ముందుగానే వాల్యూ అడిషన్ చార్జెస్ ద్వారా చెల్లిస్తాం. పెద్ద ఎత్తున మోసం జరిగేదిక్కడే. నేడు అక్షయ తృతీయ బంగారం కొనుగోళ్లకు ఉత్సాహం చూపుతున్న ప్రజలు కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు బ్రహ్మసముద్రానికి చెందిన తిమ్మక్క ఇటీవల అనంతపురంలోని ఓ బంగారు దుకాణంలో 20 గ్రాముల గోల్డ్ కొనుగోలు చేసింది. దుకాణదారులు తరుగును కూడా లెక్కించి డబ్బు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన తిమ్మక్క వినియోగదారుల సంఘాన్ని ఆశ్రయించింది. దుకాణదారులతో మాట్లాడిన సంఘం వారు మరి కొంత బంగారాన్ని ఆమెకు ఇప్పించారు. అనంతపురం నగరానికి చెందిన వసుంధర నెల రోజుల క్రితం రెండు తులాల బంగారాన్ని కొనుగోలు చేసింది. అయితే, దుకాణదారులు పాత జీఎస్టీ ప్రకారం చార్జి చేశారు. 5 శాతం జీఎస్టీకి మించి ఉండడంతో రంగంలోకి దిగిన వినియోగదారుల సంఘం నాయకులు దుకాణదారులతో మాట్లాడి ఆమెకు న్యాయం చేశారు... ఇలాంటి ఘటనలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి. -
‘రెవెన్యూ’లో పదోన్నతులు ఎండమావే!
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో రెవెన్యూ శాఖది ప్రత్యేకస్థానం. ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఇక్కడి అధికారుల నుంచి సలహాలు, సూచనలు ముఖ్యంగా పదోన్నతుల విషయంలో అనుసరించాల్సిన విధానాలను తెలుసుకుంటారు. ఇలా ఇతర శాఖలకు మార్గదర్శకంగా ఉండే రెవెన్యూశాఖ.. ఇక్కడి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విషయంలో సరైన న్యాయం చేయలేకపోతోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్ (జేఏ)లకు సీనియర్ అసిస్టెంట్(ఎస్ఏ)లుగా పదోన్నతి కల్పన అర్హులైన ఉద్యోగులకు ఎండమావిలా మారింది. సీనియారిటీ జాబితా సిద్ధం చేసిన ప్రతిసారీ లోపాలు ఉండడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో అధికారుల నిర్వాకం కారణంగా ఏకంగా పదోన్నతుల కల్పన ఫైలు అనుమతి కోసం సీసీఎల్ఏకు చేరింది. ఇలాంటి పరిస్థితి రెవెన్యూ శాఖ చరిత్రలో ఎన్నడూ చూడలేదని పలువులు ఉద్యోగులు చెబుతుండడం గమనార్హం. 65 ఎస్ఏ పోస్టుల ఖాళీ.. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియను అనంతపురం నుంచే నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి రెవెన్యూ శాఖలో దాదాపు 65 సీనియర్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన జూనియర్ అసిస్టెంట్లు (జేఏ) ఉమ్మడి జిల్లాలో 40 మంది వరకు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫైలు.. సీసీఎల్ఏ పరిధిలోకి.. జేఏలకు పదోన్నతి కల్పించేందుకు సీనియారిటీ జాబితా లోపభూయిష్టంగా సిద్ధమవుతుండడంతో ప్రక్రియకు ప్రతిసారి ఆటంకం వస్తోంది. పదోన్నతులు కల్పించే విషయంలో ప్రతి ఏడాది అప్డేషన్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ 2020–21 వరకు అప్డేషన్ జరిగింది. ఆ తరువాత నుంచి జరగలేదు. అప్డేషన్ ఐదేళ్ల లోపు ఉంటే పదోన్నతులు కల్పించడం కలెక్టర్ పరిధిలో ఉంటుందని కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే 2021–22, 2022–23, 2023–24, 2024–25, 2025–26 ఇలా ఐదేళ్లు అప్డేషన్ చేయలేదు. ప్రస్తుతం 2026–27 ఆర్థిక సంవత్సరం నడుస్తోంది. అప్డేషన్ జరగక ఐదేళ్లు దాటడంతో సీసీఎల్ఏ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేషన్ చేసుకుంటూ ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. పదోన్నతులు పొందేందుకు ఇలా సీసీఎల్ఏ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థతి గతంలో ఎన్నడూ రాలేదని సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు ఉమ్మడి జిల్లాలో 65 ఎస్ఏ పోస్టులు ఖాళీ అధికారుల నిర్వాకంతో సీసీఎల్ఏకు ఫైలు అర్హులైన 40 మంది జేఏల ఎదురుచూపు ఈ పరిస్థితి చరిత్రలో ఎన్నడూ లేదంటున్న ఉద్యోగులు నిరాశా నిస్పృహలో ఉద్యోగులు.. ఉద్యోగులు తమ సర్వీస్లో ఆశించేది పదోన్నతి. అయితే పదోన్నతి కల్పించడంతో జాప్యం జరిగితే ఆ ప్రభావం ఉద్యోగి పనితీరుపై పడుతుంది. అర్హత ఉండీ అధికారుల నిర్వాకం కారణంగా ఏళ్లుగా పదోన్నతి పొందలేకపోతున్న జూనియర్ అసిస్టెంట్లు తీవ్ర నిరాశా నిస్పృహతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఉన్న ఉద్యోగుల నుంచి నాణ్యమైన సేవలు అందవనే అభిప్రాయం సీనియర్ ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. -
ఓఎంసీలో ‘పచ్చ’దొంగలు
సాక్షి టాస్క్ఫోర్స్: రాయదుర్గం నియోజకవర్గం డీహీరేహాళ్ మండలంలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో సీబీఐ సీజ్చేసిన విలువైన ఇనుప ఖనిజాన్ని ఓ ‘పచ్చ’ముఠా చీకటి మాటున తరలించినట్టు సాక్షాధారాలతో కొందరు సోషల్మాధ్యమాల్లో వైరల్ చేశారు. ముడి ఇనుము అక్రమంగా తరలిస్తుండగా ఈ నెల 3న కర్ణాటక పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేసినట్టు ఆరోపించారు. గతంలోనూ ఇలాగే చోరీకి పాల్పడి సమీప ఐరన్ఓర్ ఫ్యాక్టరీలో విక్రయించి సొమ్ము చేసుకున్నట్టు విమర్శలు ఉన్నాయి. కర్ణాటకలో కేసులు నమోదైతే ఇక్కడి అధికారులు దృష్టి సారించకపోవడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తరచూ మైనింగ్ దోపిడీ వ్యవహారం తెరకెక్కుతున్నా సంబంధిత అధికారులు నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మైనింగ్ దొంగలు కేసు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని బీఎస్పీ నాయకుడు చిందనూరు నాగరాజు ఆరోపించారు. ఎన్ఎండీసీలోనూ ఖనిజం చోరీ? కర్ణాటక రాష్ట్రం సండూరు పరిసరాల్లో ఉండే ఎన్ఎండీసీలోనూ ఖనిజం దోపిడీ జరిగింది. ఈ వివరాలు వైరల్గా మారాయి. ఎంతో భద్రతా వలయం మధ్యనున్న ఎన్ఎండీసీలో అక్రమంగా తవ్వకాలు జరిపిన ముడి ఇనుమును నేమకల్లు సమీపాన ఓ స్పాంజ్ ఐరన్ఓర్ ఫ్యాక్టరీకి తరలించినట్టు కర్ణాటక పోలీసులు గుర్తించారు. కేసులు నమోదు చేసి ఫ్యాక్టరీలోనూ సోదాలు జరిపినట్టు తెలిసింది. ఈ వివరాలను బళ్లారి ఎస్పీ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు. స్థానిక అధికారులు అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఎందుకు దృష్టి సారించలేదని రాజకీయపార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవాలు నిగ్గుతేల్చి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని బీఎస్పీ నాయకుడు చిందనూరు నాగరాజు ఆదివారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. -
‘సర్వజన’ వేదనాలయం
● వైద్య సేవల్లో తీవ్ర నిర్లక్ష్యం ● ఓపీ కోసం గంటల తరబడి నిరీక్షణ ● పట్టించుకోని సర్వజనాస్పత్రి అధికారులు ● కుందుర్పి మండలం ఎనుమలదొడ్డి గ్రామానికి చెందిన హరిజన మారెక్క (70) జ్వరం, విరేచనాలతో బాధపడుతుండటంతో శుక్రవారం అనంతపురం సర్వజనాస్పత్రి ఎఫ్ఎం వార్డులో చేర్చారు. శనివారం మధ్యాహ్నం ఆమె ఆరోగ్యం క్షీణించింది. చాలాసేపటి తర్వాత అత్యవసర వైద్య విభాగానికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి ఆమె మృత్యువాత పడింది. డాక్టర్లు సకాలంలో స్పందించకపోవడంతోనే మృతి చెందారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి 7 గంటలైనా ‘మహా ప్రస్థానం’ వాహనం అందుబాటులోకి రాలేదు. ఇలాంటి ఘటనలు సర్వజనాస్పత్రిలో నిత్యకృత్యం అయ్యాయి.అనంతపురం: మెరుగైన వైద్య సేవలతో రోగులకు సాంత్వన చేకూర్చాల్సిన వైద్యాలయం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో వేదనాలయంగా మారింది. ఉమ్మడి జిల్లాకు అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రే పెద్దదిక్కు. సాధారణ రోగులతో పాటు ప్రమాద బాధితులు, అత్యవసర వైద్యం కోసం వేల సంఖ్యలో వస్తుంటారు. వైద్యులు, వైద్య నిపుణులు, విభాగాధిపతులు, సిబ్బంది కొరత లేదు. తగినంత జీతాలు అందుతున్నా కొందరిలో అంకిత భావం కొరవడుతోంది. అవుట్ పేషంట్ సేవల కోసం వచ్చే రోగులకు ‘అభా’ రిజిస్ట్రేషన్ పేరుతో సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. వార్డుల వారీగా ప్రత్యేకంగా ఓపీలు ఇవ్వడానికి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. ‘అభా’ రిజిస్ట్రేషన్కు ప్రత్యేకంగా కంప్యూటర్లు, ఇతర సామగ్రి మంజూరయ్యాయని చెబుతున్నా.. అవి ఎక్కడున్నాయో తెలియని దుస్థితి. అతిథి పాత్రలో వైద్యులు సర్వజనాస్పత్రి వైద్యుల్లో చాలామంది అతిథి పాత్ర పోషిస్తున్నారు. నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా రావడం.. ముందుగా వెళ్లిపోవడం చేస్తున్నారు. సొంత క్లినిక్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రభుత్వ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రోగులు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. పీజీలే దిక్కే బోధనాస్పత్రి అయిన సర్వజనాస్పత్రిలో మొత్తం 21 విభాగాల్లో పీజీ వైద్యులు ఉన్నారు. ఆయా విభాగాల్లో పీజీలపైనే భారం మోపి సీనియర్లు విధులకు డుమ్మా కొడుతున్నారు. ఎమెర్జెన్సీ వార్డుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కేసుల పట్ల సీనియర్ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పీజీలకు ఫోన్ ద్వారా సలహాలు ఇస్తూ వారు సొంత ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిమగ్నమైపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అత్యంత క్లిష్టమైన కేసుల్లోనూ సీనియర్ వైద్యులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. వైద్యులు తప్పులమీద తప్పులు చేస్తున్నా సర్వజనాస్పత్రి ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో రోగుల వేదన అరణ్య రోదనగా మిగులుతోంది. -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్ కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ప్రజాసమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మార్పు చేసిన వేళలను ప్రజలు గమనించాలని సూచించారు. పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో భూసమస్యలపై అర్జీలను అందజేయాలన్నారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam. ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి కూడా సమర్పించవచ్చని తెలియజేశారు. నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ అనంతపురం టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 89777 16661 నంబరుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ.. అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 08554– 272943, 9154790350 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన ఎంజేపీ సెట్
ఉరవకొండ/కుందుర్పి: జిల్లాలో అత్యంత ప్రాతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల జూనియర్ కళాశాల (ఎంజేపీ జేసీ) సెట్–2026 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. వజ్రకరూరు మండలంలోని కొనకొండ్ల జూనియర్ గురుకుల కళాశాలలో నిర్వహించిన పరీక్షలకు 490 మంది విద్యార్థులు కేటాయించారు. అందులో 387 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ జాన్సీరాణి తెలిపారు. కుందుర్పి పాఠశాల ప్రిన్సిపాల్, జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలల కన్వీనర్ జీ. అస్రత్ అలీ విలేకరులతో మాట్లాడారు. ఆదివారం కొనకొండ్ల, నార్పల జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు నార్పల, గుమ్మగట్ట, హీరేహాళ్, కుందుర్పి, కొనకొండ్ల, లేపాక్షి, పేరూరు, నసనకోట తదితర పాఠశాలల నుంచి 776 మంది ధరఖాస్తు చేసుకున్నారన్నారు. అందులో 645 మంది విద్యార్థులు హాజరుకాగా 131 మంది గైర్హాజరయినట్లు ఆయన తెలిపారు. వ్యక్తి అనుమానాస్పద మృతి తాడిపత్రి రూరల్: మండలంలోని కోమలి రైల్వేస్టేషన్ పరిధిలో రైలు పట్టాల పక్కన నాగేంద్ర (45) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు అప్గ్రేడ్ పోలీసులు ఆదివారం తెలిపారు. కోమలి గ్రామానికి చెందిన నాగేంద్రకు భార్య, పిల్లలు ఉన్నారు. మేకలు మేపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుభకార్యం నిమిత్తం అత్తవారింటికి కుటుంబ సభ్యులతో వెళ్లిన నాగేంద్ర.. తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చిన నాగేంద్ర తాను కోమలి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్నానని, పిల్లలను సరిగా చూసుకోవాలని తమ్ముడు సురేంద్రకు ఫోన్ చేశాడు. ఆందోళనతో సోదరుడు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా రైల్వే పట్టాల పక్కన విగతజీవిగా పడి ఉన్నాడు. శవాన్ని పరిశీలించగా తలకు రెండు చోట్ల గాయాలు అయ్యి ఉన్నాయి. అనుమానంతో సోదరుడు అతన్ని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించగా అప్పటికే నాగేంద్ర మృతిచెంది ఉన్నాడు. సంఘటనా స్థలాన్ని బట్టి చూస్తే నాగేంద్రను హత్య చేసి ఉంటారని తమ్ముడు సురేంద్ర పోలీసులకు తెలియజేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. మహిళా వికాసానికి కాంగ్రెస్ అడ్డు ● మంత్రి సత్యకుమార్ అనంతపురం టవర్క్లాక్: మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్తో సహా విపక్షాలు వ్యతిరేకించి మహిళా వికాసానికి అడ్డుపుల్ల వేశాయని.. అయినా చర్చలు జరిపి గెలిచే తీరుతామని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆదివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలోని మహిళలు, ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి ఆ వర్గాలకు తీరని అన్యాయం చేసిందన్నారు. బిల్లు ఆమోదం పొందే వరకు పోరాడతామన్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందితే మహిళలు రాజకీయంగా ఎదిగేవారన్నారు. బంగారు గొలుసు అపహరణ బత్తలపల్లి: శుభకార్యానికి వెళ్లి బ్యాగు చూసుకోగా, అందులో ఉన్న బంగారు గొలుసు కనిపించలేదని బాధితులు నాగమోహన్, భూమిక దంపతులు ఆవేదన చెందారు. వివరాలు.. ముద్దనపల్లికి చెందిన నాగమోహన్, భూమిక దంపతులు నార్పల మండలం గొల్లపల్లికి ఓ శుభకార్యానికి వెళ్లేందుకు బత్తలపల్లికి వచ్చారు. తాడిపత్రికి వెళ్లే ఆర్టీసీ బస్సులో వెళ్లారు. అక్కడికెళ్లిన తర్వాత బ్యాగులో ఉన్న మూడున్నర తులాల బంగారు నెక్లెస్ కనిపించలేదు. అయితే అదే బ్యాగులో ఉన్న జత కమ్మలు, చిన్నపాటి గొలుసు ఉందని బాధితులు తెలిపారు. అనంతరం బత్తలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటర్ విద్యార్థి అదృశ్యం బత్తలపల్లి: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ఆదివారం అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. జలాలపురానికి చెందిన బి.శివయ్య, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు నెల్లూరులో బీటెక్ చదువుతున్నాడు. రెండో కొడుకు జగదీష్ ధర్మవరంలోని మోడల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. మాట్లాడుతూ వచ్చే ఏడాదైనా బాగా చదివి మంచి ఫలితాలు తెచ్చుకోవాలని సూచించారు. మనస్థాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. -
కార్మికుడికి నకిలీ అధికారి బురిడీ
రాప్తాడురూరల్:భవన నిర్మా ణ కార్మికుడిని నకిలీ అధికారి బురిడీ కొట్టించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు...ఆత్మకూరు మండలం బి.యాలేరుకు చెందిన మోపూరు వెంకటరాముడు భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హంపాపురంలో పేమెంట్ రూ.30 వేలు రావాల్సి ఉండ గా, ఆదివారం అక్కడికి వెళ్లి యజమానిని కలిశాడు. అతను సోమవారం పేమెంట్ చేస్తానని, తన వద్దనున్న రూ.20 వేలు అనంతపురంలో సిమెంట్ యజమానికి ఇవ్వాలని వెంకటరాముడుకు ఇచ్చి పంపాడు. ఈ డబ్బు తీసుకొని వెంకటరాముడు బైక్పై బయల్దేరాడు. హంపాపురం క్రాస్ దాటిన తర్వాత గోడౌన్ సమీపంలో రోడ్డుపక్కన కారు, ద్విచక్ర వాహనం ఆగి ఉన్నాయి. వెంకటరాముడు అక్కడికి చేరుకోగానే బైకుపై ఉన్న యువకుడు బండిని ఆపి ‘తాము చెకింగ్ అధికారులు’ అని చెప్పా రు. ముందుగా బ్యాగ్ పరిశీలించి, జేబుల్లోని డబ్బు చూపించాలన్నారు. తన వద్దనున్న రూ.20 వేలు ఆ వ్యక్తి డబ్బును తీసుకుని లెక్కపెట్టాడు. అనుమానం వచ్చిన వెంకటరాముడు అతన్ని ప్రశ్నించగా, ‘మా సార్ చెప్పినట్టు చెక్ చేస్తున్నాం’ అని చెప్పాడు. డబ్బు తిరిగి ఇస్తున్నట్లు ఇస్తూ అక్కడి నుంచి బెక్పై రాంగ్ రూట్లో హంపాపురం వైపు ఉడాయించాడు. మోసపోయినట్లు విషయం గ్రహించిన వెంకటరాముడు వెంటనే అతన్ని వెంబడించినా ఫలితంలేకపోయింది. తిరిగి ఘటన స్థలానికి వచ్చేసరికి అక్కడా కారు లేదు. బాధితుడు రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
రేపు ఎస్సీ కమిషన్ చైర్మన్ రాక
అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఈనెల 21న జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఐదుగురు సభ్యులు కూడా హాజరవుతారని ఎస్సీ సంక్షేమశాఖ ఉప సంచాలకులు కుస్బూ కొఠారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. 2 గంటల నుంచి జిల్లా, మండలస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ఉంటుందన్నారు. బయన్నపేటలో యువకుడిపై దాడి బుక్కరాయసముద్రం: మండలంలోని దయ్యాలకుంటపల్లి వద్దనున్న బయన్నపేటలో ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రామాంజనేయులు కుమార్తె వివాహం త్వరలో జరగబోతుండగా, ఇల్లు శుభ్రం చేసే పనులు చేస్తున్నారు. రామాంజనేయులు కొడుకు గణేష్ స్థానికంగా ఉన్న కొళాయి వద్ద నీరు పట్టుకుంటుండగా అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్, సూరి అక్కడ ఘర్షణ పడ్డారు. గణేష్పై శ్రీకాంత్, సూరి కర్రలతో భౌతికదాడికి దిగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయ సమస్యలపై మూడోదశ పోరాటానికి రంగం సిద్ధం అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) మూడోదశ పోరాటానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 25న విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న జిల్లా ప్యాప్టో నాయకులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కరపత్రాలు విడుదల చేశారు. నాయకులు మాట్లాడుతూ 12వ పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ ఇచ్చే ప్రతి పిలుపును విజయవంతం చేస్తామని తీర్మానించారు. 25న విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలు ఉంటాయన్నారు. సమావేశంలో ప్యాప్టో చైర్మన్ శ్రీనివాస నాయక్, సెక్రటరీ జనరల్ పురుషోత్తం, సభ్యులు రమణారెడ్డి, వెంకటరత్నం, కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు శంకరమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు వెంకటసుబ్బయ్య, గోవిందరాజులు పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్య పుట్లూరు: రంగమనాయునిపల్లిలో శనివారం రాత్రి వీరేంద్ర (26) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన వీరేంద్ర డిగ్రీ వరకు చదువుకున్నాడు. కూలి పనులకు వెళ్లి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగుతున్న విషయం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో గ్రామంలోని తన మేనమామ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. గమనించిన బంధువులు వెంటనే తలిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతుడు తండ్రి ఓబులేషు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
‘మున్సిపాలిటీలో కీచకుడు’పై రేపు విచారణ
అనంతపురం సెంట్రల్: తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో మహిళలను వేధిస్తున్న కీచకుడిపై విచారణకు కలెక్టర్ ఆనంద్ ప్రత్యేక కమిటీని నియమించారు. మున్సిపాలిటీ, సచివాలయాల పరిధిలో పనిచేసే మహిళా ఉద్యోగులను కీలక అధికారి లైంగికంగా వేధించేవాడు. కాపురాలు కూల్చే స్థితికి తీసుకొచ్చేవాడు. పలుమార్లు గొడవలు జరిగినా ఆ అధికారి తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలో ఈ నెల 15న ‘మున్సిపాలిటీలో కీచకుడు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యులు ఇప్పటికే తాడిపత్రికి వెళ్లి ప్రాథమికంగా విచారణ చేపట్టారు. బాధితులు మరింత స్వేచ్ఛగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురంలోని కో–ఆపరేటివ్ కార్యాలయంలో తమ గోడును తెలియజేయవచ్చని ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి తెలిపారు. -
నీటి నిల్వల పెంపునకు కృషి
ఐసీడీఎస్ పీడీగా శశికళ అనంతపురం సెంట్రల్: ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ)గా రాయచోటి సీడీపీఓ శశికళ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గత ఫిబ్రవరిలో వైఎస్సార్ జిల్లా బద్వేలు సీడీపీఓగా పనిచేస్తున్న ఎం.శ్రీదేవికి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. ఫిబ్రవరి 26న ఆమె బాధ్యతలు చేపట్టారు. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా తనను ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఆమె విజ్ఞప్తి మేరకు బాధ్యతల నుంచి తప్పించి.. రాయచోటి సీడీపీఓ శశికళను పీడీగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె గతంలో తాడిపత్రి, కదిరి, హిందూపురం తదితర ప్రాజెక్టుల్లో సీడీపీఓగా పనిచేసిన అనుభవం ఉంది. త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఐసీడీఎస్ అధికారవర్గాలు వెల్లడించాయి. మహిళా ఓటర్లే అధికం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని 577 గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజునాయుడు శనివారం ప్రకటించారు. పంచాయతీరాజ్ చట్టం–1994 నిబంధనల ప్రకారం, 2026 ఏప్రిల్ 15 నాటికి ఈ వివరాలను ఖరారు చేసినట్లు డీపీఓ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 577 గ్రామ పంచాయతీలు, 5,748 వార్డులు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 13,65,922 మంది ఉండగా.. వీరిలో పురుష ఓటర్లు 6,78,302 మంది, మహిళా ఓటర్లు 6,87,494 మంది ఉన్నారు. ఇతరులు 126 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. మొత్తం మీద మహిళా ఓటర్లు 9,192 మంది ఎక్కువగా ఉన్నారు. ఈ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు డీపీఓ తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అవకాశం అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యామండలి మార్చి–2026 ఫలితాల అనంతరం విద్యార్థులకు ఇంప్రూమెంట్ అవకాశంపై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి సబ్జెక్టుల వారీ ఉత్తమ మార్కుల విధానంతో ఒకే ప్రయత్నంలో ఇంప్రూవ్మెంట్ అవకాశం కల్పించినట్లు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐఓ) వెంకటరమణనాయక్ తెలిపారు. ప్రథమ సంవత్సరం పాస్, ఫెయిల్ అయిన అభ్యర్థులు ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ (ఐపీఏఎస్ఈ) మే–2026లో పాస్ అయిన పేపర్లలో ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా పాస్ అయిన సబ్జెక్టుల్లో ఇంప్రూమెంట్కు హాజరయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఇంప్రూవ్మెంట్ రాసిన అనంతరం ఎక్కువ మార్కులను (ఉత్తమ మార్కులు) పరిగణనలోకి తీసుకుంటారని స్పష్టం చేశారు. అయితే ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి ఇంప్రూమెంట్ అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఫెయిల్ అయిన పేపర్లకు విద్యార్థులు పాస్ అయ్యే వరకు ఎన్నిమార్లు అయినా హాజరుకావచ్చని తెలిపారు. పెద్దవడుగూరు : గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వలను పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ పెద్దవడుగూరులో పర్యటించారు. పంచాయతీ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత పెద్దవంకలో ‘జలధార–జలహారతి’ కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేశారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో ఇంకుడు గుంతకు భూమి పూజ నిర్వహించారు. అక్కడే ఏర్పాటు చేసిన రూట్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ను పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న ఫంక్షన్ హాలులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామంలో కురిసిన ప్రతి వర్షపు చుక్కనూ భూమిలోకి ఇంకిపోయేలా చూడాలన్నారు. నీటిని నిల్వ చేసేందుకు ట్యాంకులు, కుంటలు, కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జిల్లాలో మూడు లక్షల హెక్టార్లకు పైగా పంటల సాగు ఎక్కువగా వర్షంపైనే ఆధారపడి ఉందన్నారు. తక్కువ నీటితో పంటలు పండించే అంశంపై దృష్టి సారించాలన్నారు. పౌష్టికాహార ప్రాధాన్యతను తెలియజెప్పేందుకు జిల్లా వ్యాప్తంగా పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువును ప్రతి నెలా పదో తేదీలోపు నమోదు చేయాలన్నారు. వివరాలు తప్పుగా నమోదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. -
కార్యకర్తలపైనే దాడులు చేయిస్తావా?
● కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ కార్యకర్త అనంతపురం టౌన్: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలనే ఇష్టానుసారం అసభ్యపదజాలంతో దూషిస్తూ దాడులు చేయిస్తావా.. అంటూ అనంతపురం అర్బన్కు చెందిన టీడీపీ కార్యకర్త విశ్వ వాపోయారు. ఎమ్మెల్యే దగ్గుపాటి తనపై దాడి చేయించాడంటూ సోషల్ మీడియా వేదికగా పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. హౌసింగ్ బోర్డులో ఓ స్థల వివాదంలో ఎమ్మెల్యే ఫోన్ చేసి ‘ఏరా లం.. .కా.. చెప్పుతో కొడతా’ అంటూ తనను దుర్భాషలాడడంతోపాటు తన అనుచరులతో దాడి చేయించాడంటూ ఆరోపించారు. ‘పార్టీని నమ్ముకున్న వారిపై దాడులు చేయిస్తావు? నీ మాట వినకుంటే వైన్ షాపులను తగలబెట్టిస్తావు? ఇదేనా నీవు కార్యకర్తలకు ఇచ్చే విలువ’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇలా చేయలేదంటూ దగ్గుపాటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా గురించి కాలవ శ్రీనివాసులును అడుగు. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు.. అనుచరులు ఉండొచ్చు. అంతమాత్రాన కార్యకర్తలపై దాడులు చేస్తారా.. ఇదెక్కడి నీతి.. నీలాంటి ఎమ్మెల్యేలు ఉంటే చంద్రబాబు మళ్లీ సీఎం కాలేడు. నీలాంటి వాళ్లు ఎమ్మెల్యేలు అయ్యి పార్టీని నాశనం చేస్తున్నారు. నేను చనిపోతే నువ్వే కారణం దగ్గుపాటి ప్రసాద్’ అంటూ విశ్వ విలపించారు. -
ఉగ్రరూపం దాల్చిన భానుడు
● జిల్లా అంతటా మండుతున్న ఎండలు ● జన జీవనం స్తంభించేలా వేసవితాపం ● నేటి నుంచి వైశాఖం.. పొయ్యిశాకమే అనంతపురం అగ్రికల్చర్: భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉమ్మడి అనంతపురం జిల్లా అగ్నిగుండంలా తయారైంది. శుక్రవారం ఏకంగా 44.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.తాడిపత్రి మండలం తేరన్నపల్లిలో ఈ మేరకు ఉష్ణోగ్రత రికార్డయింది. పుట్లూరు 43.2, యల్లనూరు 42.8 డిగ్రీల నమోదుతో పాటు పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు, విడపనకల్లు, నార్పల తదితర నల్లరేగడి భూములు కలిగిన మండలాల్లో వేసవితాపం అధికంగా ఉంది. మిగతా ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య సూరీడు బెంబేలెత్తిస్తున్నాడు. రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల మధ్య ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాత్రింబవళ్లు ఉక్కపోతతో పాటు 8 కిలోమీటర్ల వేగంతో కూడిన వడగాల్పులతో జనం మాడిపోతున్న పరిస్థితి నెలకొంది. ● ఇక శనివారం నుంచి వైశాఖ మాసం మొదలు కానుండటంతో పొయ్యి శాకం మాదిరిగా ఎండలు మరింత దంచికొట్టే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే ఎండలకు రోళ్లు కూడా పగులుతాయన్నట్లు చెబుతున్న రోహిణీకార్తె కూడా ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మండువేసవి తీవ్రస్థాయిలో ఉండటం గమనార్హం. గ్లోబల్ వార్మింగ్, అలాగే ఎల్–నినో కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు. రేపోమాపో 45 డిగ్రీల మార్క్ చేరుకునే పరిస్థితి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారత వాతా వరణశాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేసింది. జాగ్రత్తలు తప్పనిసరి వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకపోవడం మేలు. అది ఎండకు చాలా కీలక సమయమని చెబుతున్నారు. పనులన్నీ ఉదయం, సాయంత్రం చేసుకుంటే ఉత్తమం. బయటకు వెళ్లాల్సివస్తే టోపీ, గొడుగు, తలపాగా, తడి టవల్, గ్లౌజులు, కూలింగ్ గ్లాసులు వాడాలి. వదులుగా ఉండే లైట్ కలర్ దుస్తులు ధరించాలి. నల్లటి దుస్తులు, టైట్గా ఉన్నవి వాడకూడదు. రోజుకు నాలుగైదు లీటర్ల నీళ్లు తాగాలి. ప్రతి గంటకూ ఒక గ్లాసు నీళ్లు లేదా మజ్జిగ తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్, గ్లూకోజ్, పుచ్చకాయ, కీరదోస లాంటి పండ్లరసాలు మంచివి. కూల్డ్రింక్స్, ఆల్కహాల్, కాఫీ, టీ లాంటివి తగ్గించాలి. పెరుగన్నం, కూరగాయలు, లైట్గా ఫుడ్ తీసుకోవాలి. ఆయిల్ఫుడ్, మసాలాలు, చికెన్, మటన్, బిర్యానీ, ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి. వీటి వల్ల బాడీ హీట్ పెరుగుతుంది. ఇంట్లో కిటికీలకు తడిబట్టలు కట్టుకుంటే మేలు. అప్పుడప్పుడు ముఖం, కాళ్లు కడుక్కోవాలి. పిల్లలు, వృద్ధులు, బీపీ, షుగర్, ఇతరత్ర జబ్బులున్నవాళ్లు, రైతులు, శ్రామికులు, ఫుట్పాత్ వ్యాపారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. వాంతులు, తలతిరగడం, జ్వరం, చెమట పట్టకపోవడం, ఫిట్స్ లాంటి వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు. శుక్రవారం ఎండలకు నిర్మానుష్యంగా ఉన్న అనంతపురం శివారులోని రుద్రంపేట రహదారి అనంతపురంలో ఎండ వేడి తాళలేక తక్కెడ గిన్నె తలపై పెట్టుకున్న మహిళ -
అడుగంటుతున్న భూగర్భజలాలు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో భూగర్భజలాల స్థితిగతులు గతి తప్పే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత వర్షపాత సంవత్సరంలో ఒకటీ అర మినహా భారీ వర్షాలు లేకుండా మోస్తరు వర్షాలతో వరుణుడు సరిపెట్టడంతో తగ్గుదల నమోదవుతున్నట్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 91 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫిజోమీటర్ల నుంచి భూగర్భజలశాఖ తాజాగా సేకరించిన లెక్కల ప్రకారం జిల్లా సగటు నీటి మట్టం 12.14 మీటర్లుగా నమోదైంది. గత ఐదేళ్ల కాలంలో ఇదే గరిష్టం కావడం విశేషం. తాజా గణాంకాలను పరిశీలిస్తే... 19 మండలాల్లో నీటి మట్టం తగ్గుదల నమోదు కావడం విశేషం. డేంజర్లో నాలుగు మండలాలు సరైన వర్షాలు లేకపోవడం, నీటి వినియోగం అధికంగా ఉండటం వల్ల కుందుర్పి, కళ్యాణదుర్గం, యాడికి, శెట్టూరు మండలాలు ‘డేంజర్ జోన్’లోకి వెళ్లినట్లు ఆ శాఖ అధికారులు నివేదించారు. ఈ నాలుగు మండలాల్లో 20 మీటర్లు అంతకన్నా ఎక్కువ లోతులోనే భూగర్భజలాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. వీటితో పాటు అనంతపురం రూరల్, గుత్తి, యల్లనూరు, శింగనమల, బ్రహ్మసముద్రం, కూడేరు, గుమ్మఘట్ట, రాయదుర్గం, బెళుగుప్ప, కంబదూరు, తాడిపత్రి, డి.హీరేహాళ్, పామిడి, కణేకల్లు, పుట్లూరు మండలాల్లో కూడా భూగర్భజల మట్టం కనిష్టంగా 8 మీటర్లు, గరిష్టంగా 20 మీటర్ల లోతులో కనిపిస్తూ తగ్గుదల నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. కుందుర్పి మండలం ఎర్రగుంట ఫిజోమీటర్లో 44.35, యాడికి మండలం నగరూరులో 42.08, పుట్లూరులో 35.60 మీటర్ల లోతుకు పతనమైనట్లు గుర్తించారు. సాధారణ వర్షపాతమే ఈ ఏడాది జిల్లాలో 470 మి.మీ మేర సాధారణ వర్షపాతం నమోదైంది. కానీ ఐదారు మండలాల్లో మాత్రమే భారీ వర్షాలు కురవగా... మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి నమోదయ్యాయి. ఎక్కడా వాగులు, వంకలు, చెక్డ్యాంలు, నదీ పరివాహక ప్రాంతాలు పెద్దగా ప్రవహించకపోవడం వల్ల భూగర్భజలాలు తగ్గుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. గత ఐదారేళ్లతో పోల్చితే ఈ ఏడాది 40 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావడంతో నీటి మట్టం తగ్గుతున్నట్లు అంచనా వేస్తున్నారు. గతేడాది 62 వర్షపు రోజులు, అంతకు మునుపు నాలుగేళ్లూ 70 నుంచి 80 వరకు రెయినీడేస్ నమోదయ్యాయి. ఈ ఏడాది వర్షం రూపంలో 165 టీఎంసీల వరకు నీటి ప్రవాహం ఉండగా.. అందులో 19.74 టీఎంసీలు మాత్రమే భూగర్భంలోకి ఇంకాయి. ఎల్–నినో హెచ్చరికతో ఆందోళన ఈసారి నైరుతి రుతుపవనాలపై ‘ఎల్–నినో’ ప్రభావం ఉంటుందని భారత వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాలు తక్కువగా నమోదయ్యే పరిస్థితి ఉందని చెబుతుండటంతో మున్ముందు భూగర్భజలాలు మరింత పతనం కావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రధానంగా ఉద్యాన పంటల మీద ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. వీటికి తోడు హంద్రీ–నీవా కాలువకు చంద్రబాబు సర్కారు లైనింగ్ చేయడంతో భూగర్భజలాలు తగ్గుతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘ఎల్–నినో’ కారణంగా అధిక నీటి వినియోగం కలిగిన వరి లాంటి పంటలు వేయకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచనలు చేస్తున్నారు. ‘డేంజర్’లో కుందుర్పి, కళ్యాణదుర్గం, యాడికి, శెట్టూరు జిల్లా తాజా సగటు నీటి మట్టం 12.14 మీటర్లుగా నమోదు ఎల్–నినో హెచ్చరికతో ఆందోళన రేకెత్తిస్తున్న పాతాళగంగ -
జిల్లాలో 2024 నుంచి 2025 వరకు నాలుగు సీజన్లు (ఖరీఫ్, రబీ) ముగిశాయి. వర్షాభావం, అకాల వర్షాలు, అధిక వర్షాలు, ఈదురు గాలులు, వడగళ్లవాన ఇలా... ప్రకృతి కన్నెర్ర చేయడంతో అటు వ్యవసాయ, ఇటు ఉద్యాన పంటలు వేలాది ఎకరాల్లో దెబ్బతిన్నాయి. అయితే పంటనష్టపోయిన రైతులకు పెట
ఈదురుగాలులకు నేలవాలిన అరటి (ఫైల్) అనంతపురం అగ్రికల్చర్: వర్షాలు గతి తప్పాయి. సకాలంలో కాకుండా అకాలంలో అధిక వర్షాలు కురవడం, పంట దిగుబడులు అరకొరగా రావడం, వచ్చిన ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించకపోవడం వల్ల రైతులకు వ్యవసాయం భారంగా పరిణమించింది. ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పంట నష్టం భారీగా జరిగినా నిబంధనల మేరకు ఒక్కో రైతుకు గరిష్టంగా రెండు హెక్టార్లకు పరిహారం ఇవ్వడానికి కూడా వెనకాడుతుండటం రైతులను కలిచివేస్తోంది. ఈ ప్రభుత్వ హయాంలో గత నాలుగు సీజన్లలో వరి, వేరుశనగ, మొక్కజొన్న, పప్పుశనగతో పాటు అరటి, మామిడి, చీనీ, టమాట, ఇతర కూరగాయల పంటలు వేల హెక్టార్లలో దెబ్బతినడంతో రూ.950 కోట్ల వరకు పంటనష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు రూ.115 కోట్లకు పైగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. 2024 ఖరీఫ్లో ఏడు, రబీలో ఏడు మండలాలను కరువు జాబితాలో ప్రకటించినా... వాటికి కూడా ఇన్పుట్సబ్సిడీ ఇవ్వకపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం కోసం వ్యవసాయ, ఉద్యాన రైతులు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నా ప్రభుత్వం కరుణించకపోవడం గమనార్హం. అందని ‘పంట నష్ట ఉపశమనం’ ఆగస్టు 2024 నుంచి అమలులోకి వచ్చిన స్కేల్ ఆఫ్ రిలీఫ్ (పంట నష్ట ఉపశమనం) ప్రకారం వేరుశనగ, పత్తి, వరి, చెరకు హెక్టారుకు రూ.25 వేల ప్రకారం లెక్కకట్టి ఇస్తారు. సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, కంది, కుసుమ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, కొర్ర, సామ, జూట్ పంటలు హెక్టారుకు రూ.15 వేల ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేశారు. అలాగే అరటి, మామిడి, దానిమ్మ, జామ, ఉసిరి, సపోటా, రేగు, డ్రాగన్ఫ్రూట్, జీడిపప్పు, కాఫీ, పసుపు, మిరప హెక్టారుకు రూ.35 వేలు, కళింగర, కర్భూజ, దోస, బొప్పాయి, టమాట, పూలు, ఉల్లి, ధనియాలు, కూరగాయలకు రూ.25 వేలు, సెంటు విస్తీర్ణంలో ఉన్న ఆకుతోటలకు రూ.300 ప్రకారం గరిష్టంగా రూ.75 వేల వరకు ఇస్తారు. కర్ర పెండలం రూ.10 వేలు, ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,500 ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేశారు. అయితే 2 ఖరీఫ్– 2 రబీ మొత్తం నాలుగు వ్యవసాయ సీజన్లు ముగిసినా పంటనష్టపోయిన రైతులెవ్వరికీ పంటనష్ట ఉపశమన సాయం అందలేదు. జగన్ హయాంలో రూ.380 కోట్ల సాయం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పాలించిన 2019–2024 మధ్య కాలంలో మొదటి నాలుగేళ్లూ విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే మధ్య మధ్యలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, అలాగే చివరి ఏడాది కాస్త వర్షాభావం కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం ఏ సీజన్లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్ ముగిసేలోపు పెట్టుబడిరాయితీ పరిహారం ఇస్తూ వచ్చారు. అలా ఐదేళ్ల హయాంలో ఏకంగా రూ.380.20 కోట్లు అందించారు. అందులో వ్యవసాయ పంటలకు సంబంధించి 2,65,290 మంది రైతులకు రూ.364.85 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి 8,997 మంది రైతులకు రూ.15.35 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ జమ చేశారు. గత రెండేళ్లుగా కరువు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం రూ.115 కోట్ల వరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా దాటవేత సాయం కోసం వ్యవసాయ, ఉద్యాన రైతుల ఎదురుచూపులు -
బైక్పై నుంచి కింద పడి టీచర్ మృతి
లేపాక్షి: ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... నల్లచెరువుకు చెందిన పి.సుభాన్బీ (39)కు భర్త ముస్తాఫా, ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన ఓ కుమార్తె ఉన్నారు. హిందూపురంలోని నందమూరినగర్లో నివాసముంటూ లేపాక్షిలోని కేజీబీవీలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు (సీఆర్టీ) గా సుభాన్బీ పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం తన భర్త ముస్తాఫాతో కలసి ద్విచక్ర వాహనంపై కేజీబీవీకు బయలుదేరారు. మార్గమధ్యంలో చోళసముద్రం సమీపంలోని టోల్ప్లాజా వద్ద స్పీడ్ బ్రేకర్లు దాటే సమయంలో అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. సుభాన్బీ వెల్లకిలా పడడంతో తలకు బలమైన గాయమై వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు వెంటనే హిందూపురంలోని జిల్లాస్పత్రికి తరలించారు. సుభాన్బీ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఘటనపై లేపాక్షి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సుభాన్బీ మృతిపై లేపాక్షి కేజీబీవీ ఎస్ఓ నీలిమా, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి
● జర్నలిస్టులకు కలెక్టర్ ఆనంద్ సూచన ● మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు సహకారం అనంతపురం అర్బన్: పని ఒత్తిడిలో ఉన్నా.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ వహించాలని వర్కింగ్ జర్నలిస్టులకు కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీడబ్ల్యూజేయూ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కంటి అద్దాలను ఆందజేసి, మాట్లాడారు. ఇటీవల అనారోగ్యంతో ఇద్దరు జర్నలిస్టులు మరణించడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు జిల్లా యంత్రాంగం తరఫున సహకారం అందిస్తామన్నారు. జర్నలిస్టులకు అన్నివిధాల అండగా ఉంటామని, వారి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందన్నారు. జిల్లా అభివృద్ధిలో జర్నలిస్టులు భాగస్వాములవ్వాలని సూచించారు. మీనాక్షమ్మ ఫౌండేషన్ చైర్మన్ రవికాంత్ రమణ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు తమ సంస్థ ద్వారా ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించడంతో పాటు ఉచితంగా 200 మందికి కంటి అద్దాలను సమకూర్చామన్నారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మదన్మోహన్రెడ్డి, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో బేల్దారి మృతి
యాడికి: అధిక ఉష్ణోగ్రతలతో వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా ఒక బేల్దారి వడదెబ్బకు గురై మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాడికి మండల కేంద్రంలోని తిప్పారెడ్డిపల్లి రహదారిలో నివసిస్తున్న కుమ్మర శ్రీనివాసులు(35) బేల్దారి పనులు చేసుకుంటూ భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. -
●ఆకాశంలో అద్భుతం
వినీలాకాశంలో విరబూసిన సింధూర రేఖ అల్లంత దూరాన ఉన్న కొండల మధ్య నుంచి శుక్రవారం సాయంత్రం 6.20 గంటల సమయంలో సూరీడు అస్తమిస్తూ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాడు. ఆకాశంలో సింధూర వర్ణంలో ఆవిష్కృతమైన రేఖను చూసిన పలువురు తన్మయత్వం చెందారు. సూరీడు సిగలోని ఓ పాయ అలా గాలిలో ఎగురుతున్నట్లుగా పంచిన అనుభూతిని పలువురు తమ సెల్ఫోన్లలో భద్రపరుచుకున్నారు. ఈ అద్భుత దృశ్యం కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో చూపరులను ఆకట్టుకుంది. ఈ దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. – కళ్యాణదుర్గం: -
నీటి సరఫరా పునరుద్ధరణ
విడపనకల్లు: హావళిగి గ్రామానికి ఎట్టకేలకు సురక్షిత మంచినీటి సరఫరా పునరుద్ధరించారు. కలుషిత నీటితో ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల దుస్థితిని ‘నీరిలా.. తాగేదెలా..?’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురించిన విషయం విదితమే. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, ఈఈ శ్రీనివాసులు స్పందించి శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. బొల్లనగుడ్డం నుంచి తాగునీరు సరఫరా అయ్యే పైపులైన్ పగలడం వల్ల నీరు కలుషితమవుతుండటాన్ని గుర్తించారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి తాగునీటిని వదిలారు. నీరు శుభ్రంగా ఉందని గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ అంజుమన్, ఏఈఈ ముజమ్మిల్, డిప్యూటీ ఎంపిడీఓ భాస్కర్బాబు, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రగతితో సమగ్రాభివృద్ధి అనంతపురం అర్బన్: పారిశ్రామిక ప్రగతి ద్వారానే జిల్లా సమాగ్రాభివృద్ధి సాధిస్తుందని కలెక్టర్ ఆనంద్ అన్నారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి సింగిల్ డెస్క్ ద్వారా అనుమతులు మంజూరు చేయాలని చెప్పారు. ఏపీఐఐసీ పారిశ్రామికవాడల్లో వివిధ దశల్లో ఉన్న పరిశ్రమల ఉత్పత్తిని వేగవంతం చేయాలని సూచించారు. 2025లో జరిగిన భాగస్వామ్య సదస్సు, ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పరిశ్రమలు, ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆమోదించిన ప్రాజెక్టుల మీద సమీక్షించారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ పథకాల ద్వారా అర్హులైన వారి నుంచి నాణ్యతగల పథకాలను ఎంపిక చేయాలని పరిశ్రమల శాఖ అధికారిని ఆదేశించారు. ఆయా పథకాల కింద విరివిగా రుణాలు మంజూరు చేయాలని ఎల్డీఎంను ఆదేశించారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా ఆర్ఏఎంపీ కింద నిర్వహించాల్సిన ఉద్యమ్, ఈఎస్డీపీ, వీడీపీ, జెడ్, తదితర కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కింద యూనిట్లకు రాయితీలు కల్పించారు. సమావేశంలో పరిశ్రమల అధికారి శ్రీనివాసయాదవ్, ఏపీఐఏసీ జెడ్ఎం నాగకుమార్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ, ఏసీటీఓ కృష్ణారెడ్డి, డీటీసీ వీర్రాజు, ఎల్డీఎం హేమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓగా విజయలక్ష్మి అనంతపురం టవర్క్లాక్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా పి.విజయలక్ష్మి నియమితులయ్యారు. గుంతకల్లు డివిజనల్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తున్న ఆమెను జెడ్పీ రెగ్యులర్ సీఈఓగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమె గతంలో డ్వామా ఏపీడీగా పనిచేస్తూ ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీగా పని చేశారు. రేపు క్రికెట్ మహిళా జట్లఎంపిక అనంతపురం: సీనియర్, అండర్–15 (ఉమెన్) క్రికెట్ జట్ల ఎంపిక ఆదివారం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఈ మేరకు క్రికెట్ కోచ్ ఆర్.కుమార్ శుక్రవారం వెల్లడించారు. అండర్–19కు సెప్టెంబర్ 1, 2007 తరువాత జన్మించిన వారు, అండర్–15కు సెప్టెంబర్ 1, 2011 తరువాత పుట్టిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లతో ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించే ఎంపిక పోటీలకు ఆసక్తి గల వారు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు 99630 74220 లో సంప్రదించాలని కోరారు. -
ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోండి
● పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ జోనల్ మాజీ చైర్పర్సన్ మంజుల అనంతపురం సెంట్రల్: సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళను దూషించిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు వైఎస్సార్సీపీ మహిళా నేత, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలతో కలిసి శుక్రవారం అనంతపురం టూటౌన్ పోలీసులను ఆమె కలిసి ఫిర్యాదును అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి నాడు ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు వెళుతున్న తనను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దూషించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. తమను రానీయకండంటూ సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, తన భర్త పెన్నోబులేసుతో ఉన్న రాజకీయ విభేదాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగతంగా తనను అసభ్యకరంగా దూషించాడని తెలిపారు. తన భర్తను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తనను, తన భర్తను బెదిరిస్తున్నారని, తమకు ఏమైనా జరిగితే దానికి ఎంఎస్ రాజునే కారణమవుతారని స్పష్టం చేశారు. మహిళలంటే ఏ మాత్రం గౌరవం ఉంటే తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే వైఎస్సార్సీపీ మహిళలంతా కలిసి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కేఎల్ దేవి, నాయకురాలు అంజలి, శోభ, పార్వతి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
లోఓల్టేజీ సమస్య పరిష్కరిస్తాం
● విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి బొమ్మనహాళ్: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న లో–ఓల్టేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో రూ.3 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు, రూ.80 లక్షలతో చేపట్టిన పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుతో కలిసి శుక్రవారం సాయంత్రం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... లో–ఓల్టేజీ సమస్యను పరిష్కరిచేందుకు నేమకల్లులో 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా 11 కేవీ సబ్స్టేషన్లు మూడింటిని ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతరెడ్డి, ఎంపీపీ నాగమణి, సింగల్విండో చైర్మన్ కొత్తపల్లి మల్లికార్జున, కన్వీనర్ బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మట్కా బీటర్ అరెస్ట్ గార్లదిన్నె: మట్కా రాస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ప్రొబేషనరీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్ తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. మట్కా నివారణలో భాగంగా మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అబ్దుల్ అనే వ్యక్తి శివాలయం వద్ద బహిరంగ ప్రదేశంలో మట్కా రాస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి మట్కా పట్టీలు, రూ.51,960 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి బొమ్మనహాళ్: విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం ఏలంజి గ్రామానికి చెందిన గాదిలింగమ్మ, గంగన్న దంపతుల కుమారుడు వన్నూరుస్వామి (19) చేతి బోరు పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో మరికొందరితో కలిసి కొలగానహళ్లి గ్రామంలో రైతు చిరంజీవి పొలంలో చేతి బోరు వేసేందుకు శుక్రవారం వెళ్లాడు. బోరు వేస్తున్న సమయంలో ఇనుప పైపును పైకి ఎత్తుతున్న సమయంలో పైనున్న 11కేవీ విద్యుత్ లైన్ తగిలి షాక్కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన వన్పూరుస్వామిని స్థానికులు బళ్లారిలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. కాగా, వన్నూరు స్వామికి ఇటీవల వివాహ నిశ్చయమైంది. మరో మూడు నెలల్లో పెళ్లి ముహుర్తం నిర్ణయించుకున్నారు. ఇలాంటి తరుణంలో కుమారుడు మృతితో తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది. టీసీసీ ఫలితాల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: గత ఫిబ్రవరిలో జరిగిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ–2026) పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. www.bse.ap.gov.in వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయని అనంతపురం జిల్లా ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు. డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్లలో పరీక్షలు రాసిన విద్యార్థులు వెబ్సైట్ నుంచి మార్కుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
మహిళ దారుణహత్య
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం సిండికేట్ నగర్ రామకృష్ణ పురంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు.. యల్లనూరు మండలం సింగారం కొత్తపల్లికి చెందిన రవిచంద్ర నాయుడు, రాధ దంపతులు బతుకు తెరువు కోసం 20 ఏళ్ల క్రితం అనంతపురం నగరానికి వలస వచ్చారు. హోటల్, వివిధ రకాల పనులతో జీవనం సాగిస్తున్న వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఉద్యోగాల నిమిత్తం ఒకరు బెంగళూరు, మరొకరు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఏడాది క్రితం రవిచంద్ర నాయుడు మృతి చెందాడు. అప్పటి నుంచి రాధ రామకృష్ణ పురంలోని అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసముంటోంది. గురువారం రాత్రి ఆమె హత్యకు గురైన విషయాన్ని స్థానికులు శుక్రవారం ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ సీఐ శేఖర్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. తలపై లోతైన గాయం, తీవ్రస్థాయిలో రక్తస్రావం జరగడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లుగా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రంగంలో దింపి ఆధారాలు సేకరించారు. పోస్ట్మార్టం నిమిత్తం రాధ మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
పేలుడు పాపం ఎవరిది..?
కదిరి: ఎవరో చేసిన పాపానికి నలుగురు అమాయకులు బలయ్యారు. సాయం చేద్దామని వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. అలాగే మూడు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కదిరి పట్టణానికి కూత వేటు దూరంలోని కుమ్మరవాండ్లపల్లిలో ఈ నెల 15న చోటు చేసుకున్న పేలుళ్ల ఘటన ఈ ప్రాంతం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన విశ్వనాథరెడ్డి(52), మూబున్నీసా(51), మధుసూదన్(35), అస్లాం(50) కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేదు. కుటుంబ యజమానులను కోల్పోయిన వారంతా భవిష్యత్ తలచుకుని శోకసంద్రంలో ఉండిపోయారు. పేలుళ్లంటే గుర్తొచ్చేది వెంకన్నే తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కొత్తగూడెంకు చెందిన వెంకన్న కుటుంబం కొన్నేళ్లుగా కుమ్మరవాండ్లపల్లిలో జయరాం నాయక్ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటోంది. ఈ ప్రాంతంలో క్వారీల్లోనే కాకుండా పొలాలు, రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా పెద్ద పెద్ద బండరాళ్లు పగలగొట్టాలంటే.. వెంటనే ఈ ప్రాంతవాసులకు గుర్తొచ్చేది వెంకన్న, ఆయన కుమారుడు సతీష్. వారికి ఫోన్ చేస్తే చాలు వెంటనే వచ్చి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల సాయంతో పేలుళ్లు జరిపి బండరాళ్లు పగలగొడుతుంటారు. రాయి సైజును బట్టి డబ్బు తీసుకుంటారు. పేలుడు పదార్థాల గురించి పోలీసులకు తెలియదా? వెంకన్న ఉంటున్న ఇంట్లో ఎప్పుడూ జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లతో పాటు ఇతర పేలుడు పదార్థాలు స్టాక్(నిల్వ) ఉంటాయనే విషయం ఈ ప్రాంత వాసులందరికీ తెలుసని స్థానికులు చెబుతున్నారు. మరి ఈ విషయం పోలీసులకు తెలియదంటే నమ్మశక్యంగా లేదని వారంటున్నారు. తరచూ కార్డన్ అండ్ సెర్చ్ పేరుతో సోదాలు చేసే పోలీసులకు ఆ ఇంట్లో పేలుడు పదార్థాలు కనిపించలేదా? అని కొందరు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి పోలీసు సిబ్బంది కొందరు తరచు వెంకన్న ఇంటివద్దకే వచ్చి మామూళ్లు తీసుకొని వెళ్తుంటారని, రూరల్ పోలీస్ స్టేషన్లోని కొందరు పోలీసు అధికారులకు కూడా అందులో వాటా వెళ్తుందని ఆరోపిస్తున్నారు. ఇందులో ఎవరి పాపం ఎంతో..తెలియదు గానీ, దీనికి పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు పేర్కొంటున్నారు. వెంకన్న కుటుంబంపై కేసు నమోదు పేలుళ్లకు కారణమైన వెంకన్నతో పాటు ఆయన కుమారుడు సతీష్పై కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2023లోని సెక్షన్ 105 కింద వారిపై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ గతంలో ఉన్న ఐపీసీ సెక్షన్ 304కు సమానం. చంపాలనే ఉద్దేశం లేకపోయినా ప్రాణహాని కలిగిస్తుందని తెలిసీ చేసే పనుల వల్ల మరణం సంభవిస్తే ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం నిందితుడు వెంకన్న పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మాకు సమాచారం లేదు కుమ్మరవాండ్లపల్లిలోని ఆ ఇంట్లో పేలుడు పదార్థాలున్న విషయం మా దృష్టికి రాలేదు. స్థానికులు ఎవరైనా సమాచారం ఇచ్చి ఉంటే చర్యలు తీసుకునేవాళ్లం. ఎక్కడైనా ఇలాంటి పేలుడు పదార్థాలు నిల్వలు ఉన్నా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా... సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. – శివనారాయస్వామి, డీఎస్పీ, కదిరి కుమ్మరవాండ్లపల్లి ఘటనలో అన్నీ అనుమానాలే పేలుడు పదార్థాల నిల్వ గురించి పోలీసులకు తెలియదా? మరి కార్డెన్ సెర్చ్లు ఎందుకు చేశారంటున్న స్థానికులు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్న ప్రతిపక్షాలు -
తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
● కలెక్టర్ ఆనంద్కూడేరు: వేసవి ముగిసేంత వరకు తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. గురువారం ఆయన కూడేరు మండలంలోని పీఏబీఆర్ వద్ద ఉన్న సత్యసాయి, అనంత, శ్రీరామిరెడ్డి, ఉరవకొండ తాగునీటి ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. నిబంధనల మేరకు నీటిని శుద్ధి చేయించాలని సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో హెచ్చెల్సీ ఎస్ఈ సుధాకర్ రావు, డీఈ కవిత, సత్యసాయి బోర్డు ఎస్ఈ ప్రభాకర్ రావు, తహసీల్దార్ ఉదయ్ భాస్కర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసులు, ఎంపీడీఓ కుళ్లాయి స్వామి పాల్గొన్నారు. బకాయి వేతనాలు చెల్లించే వరకూ సమ్మెలోనే బకాయి వేతనాలు చెల్లించే వరకూ తాము సమ్మెలోనే కొనసాగుతామని కలెక్టర్ ఓ.ఆనంద్కు శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు స్పష్టం చేశారు. తాగునీటి పథకాల పరిశీలనకు వచ్చిన కలెక్టర్ను కార్మికులు కలిసి మాట్లాడారు. ‘సార్ .. కాంట్రాక్టర్లు నెలనెలా జీతంలో కోతలు విధిస్తూ మా పొట్ట కొడుతున్నారు’ అంటూ వాపోయారు. రూ.16,500 వేతనం ఇవ్వాల్సి ఉండగా రూ.15 వేలే ఇస్తున్నారని తెలిపారు. ఫేజ్–4 కింద పనిచేస్తున్న కార్మికులకు రూ.16,500కు గాను రూ.10,500 ఇస్తున్నారన్నారు. ఈ వేతనాలు కూడా గత 9 నెలలుగా చెల్లించకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 38 నెలల పీఎఫ్ బకాయిలు పేరుకుపోయాయన్నారు. వేతనాలు సక్రమంగా అందకపోవడంతో కుటుంబ పోషణ భారమై తప్పని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. స్పందించిన కలెక్టర్ జెడ్పీ అధికారులతో మాట్లాడి కొంత మేర బడ్జెట్ అందేలా చేస్తానని భరోసానిచ్చారు. మిగిలిన మొత్తాన్ని కాంట్రాక్టర్లతో మాట్లాడి సర్దుబాటు చేయించాలని అక్కడే ఉన్న ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసులును ఆదేశించారు. దీంతో పెండింగ్ వేతనాలు ఇచ్చేంత వరకూ తాము సమ్మెలో కొనసాగుతామని కార్మికులు తెగేసి చెప్పారు. -
కొనసాగుతున్న కక్ష సాధింపులు
అనంతపురం సెంట్రల్: చంద్రబాబు ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కక్షసాధింపుల పర్వం కొనసాగుతోంది. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించారంటూ అనంతపురంలోని వినాయకనగర్కు చెందిన షేక్షామిర్ను రిమాండ్కు తరలించ డం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో స్థానిక వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తీరు వివాదాస్పదంగా మారింది. షేక్షామిర్పై 2004లో రౌడీషీట్ ఓపెన్చేయగా.. అప్పటి నుంచి సత్ప్రవర్తనతో మెలుగుతూ కార్ల మెకానిక్ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. షామిర్ వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కావడంతో ఇటీవల బైండోవర్ కేసు నమోదు చేశారు. రెచ్చగొట్టి.. కేసుల్లో ఇరికించి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నగరంలోని మూడో డివిజన్లో టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల డివిజన్లో పర్యటించిన వైఎస్సార్సీపీ నాయకుడు బోయ కృష్ణమూర్తితో గొడవకు దిగారు. తర్వాత తమపై దాడి చేశాడంటూ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో కృష్ణమూర్తితో పాటు పలువురిపై వన్టౌన్ పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. గొడవ జరిగిన సమయంలో వీడియోలు, సీసీ ఫుటేజీలు ఇచ్చినప్పటికీ ఏకపక్షంగా కేసులు నమోదు చేసి కృష్ణమూర్తిని రిమాండ్కు పంపారు. గొడవను సాకుగా చూపి ఆయన వద్ద ఉంటున్నాడనే కారణంతో తాజాగా షేక్షామిర్ను రిమాండ్కు తరలించడం గమనార్హం. సీఐ తీరు వివాదాస్పదం.. షేక్షామిర్ను జైలుకు పంపే విషయంలో వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. బైండోవర్ నిబందనలు ఉల్లంఘించాడని పోలీసులు గతేడాది నవంబర్లోనే నోటీసులు ఇవ్వగా.. అప్పట్లోనే షామిర్ మండల మేజిస్ట్రేట్ వద్ద హాజరై వివరణ ఇచ్చాడు. దీనిపై మేజిస్ట్రేట్ సంతృప్తి చెందినట్లు తెలిసింది. ఇవేవీ పట్టించుకోకుండా బుధవారం పోలీసుస్టేషన్కు పిలిపించిన పోలీసులు అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం కోర్టులో కూడా హాజరుపరచకుండానే రిమాండ్కు పంపినట్లు బాధితుడు వాపోయాడు. నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు నా కుమారుడు షేక్ షామిర్ ఏ తప్పు చేయకపోయినా వన్టౌన్ పోలీసులు వేధిస్తున్నారు. షేక్ షామిర్కు ముగ్గురు పిల్లలు సంతానం. మెకానిక్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కేసుల్లో ఇరికించి జైలుకు పంపితే భార్యాపిల్లలు పస్తులుండాల్సి వస్తుంది. – ముక్తుమ్వలీ, బాధితుడి తండ్రి -
‘సీమ’లో సాగునీటి ప్రాజెక్టుల అంశంలో ‘అనంత’ అధికార, ప్రతిపక్షపార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఆపేసిన ‘సీమ ద్రోహి’ చంద్రబాబు అని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తుంటే, అసలు ఈ పథకంతో ‘అనంత’కు ప్రయోజనం శూన్యం అని టీడీపీ నేతలు అంటున్నారు.
చంద్రబాబు నిర్వాకంతో ఆగిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుసాక్షిప్రతినిధి అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రలో అత్యంత దారుణ కరువు పరిస్థితులు సంభవించింది 1995 నుంచి 2003 వరకే. రైతుల ఆత్మహత్యలు, వలసలతో పాటు గంజి కేంద్రాలు, పశువులకు గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేసి మనుషులు, పశువులు బతికితే చాలు అన్న దారుణ పరిస్థితులు ఉండేవి. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. వీటికి పరిష్కారాలు ఒక్కరోజు కూడా అన్వేషించలేదు. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక కరువును శాశ్వతంగా నివారించేందుకు హంద్రీ–నీవా, హెచ్చెల్సీ ఆధునికీకరణ చేపట్టారు. వలసల నివారణకు ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రంతో అమలు చేయించారు. ఇప్పుడు ‘అనంత’ తలరాత మారుతోందంటే వైఎస్ చేపట్టిన సంస్కరణలే కారణమని అందరికీ తెలుసు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వాస్తవాలను మరుగునపెట్టి తామే ‘అనంత’ను ఉద్దరించామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. హంద్రీ–నీవా ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏంటి కేశవా? హంద్రీ–నీవా ప్రాజెక్టును ఎన్టీఆర్, చంద్రబాబు ఆ తర్వాత వైఎస్సార్ చేపట్టారని కేశవ్ ప్రస్తావించారు. 1996 మార్చి 11న ఉరవకొండలో, 1999 జూలై9న ఆత్మకూరులో హంద్రీ–నీవాకు చంద్రబాబు రెండుసార్లు శంకుస్థాపన చేశారు. 1995–96 నుంచి 2003–04 వరకూ చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్నకాలంలో హంద్రీ–నీవా కోసం బడ్జెట్లో రూ.190కోట్లు కేటాయింపులు చేశారు. ఇందులో రూ.24.53 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇది కూడా శంకుస్థాపనలకు, ఆఫీసు నిర్వహణకు మాత్రమే! వైఎస్ సీఎం అయ్యాక రూ.6,850 కోట్లతో ప్రాజెక్టు పట్టాలెక్కించారు. 2004–05 నుంచి 2009–10వరకూ వైఎస్ హయాంలో బడ్జెట్లో రూ.3,399.74కోట్లు కేటాయించారు. కేటాయింపుల కంటే రూ. 940.62 కోట్లు ఎక్కువగా అంటే రూ.4,340.36 కోట్లు ఖర్చు చేశారు. ఆపై రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి హయాంలో రూ.2,143.44 కోట్ల విలువైన పనులు చేశారు. 2012లోనే కృష్ణాజలాలు జీడిపల్లి రిజర్వాయర్కు చేరాయి. 2014లో చంద్రబాబు మూడోసారి సీఎం అయ్యే సమయానికి మిగిలింది రూ.366.56 కోట్ల పనులు మాత్రమే. అంటే చంద్రబాబు 2004లో సీఎంగా దిగిపోయే సమయానికి హంద్రీ–నీవా పనులు ప్రారంభమే కాలేదు. 2014లో మళ్లీ సీఎం అయ్యే సమయానికి అప్పటికే ఫేజ్–1 పనులు పూర్తయ్యి జీడిపల్లికి నీళ్లొచ్చాయి. మిగిలింది రూ.366.56 కోట్ల విలువైన పనులు మాత్రమే. వాస్తవాలు ఇలా ఉంటే కేశవ్ మాత్రం చంద్రబాబు ‘అనంత’కు ఏదో చేశారనే సత్యదూరమైన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ లిఫ్ట్పై కూడా సత్యదూరమైన మాటలే రాయలసీమ లిఫ్ట్తో ‘అనంత’కు ఏం ఉపయోగం.. నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలని కేశవ్ మాట్లాడారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు ఎలా వచ్చాయో కేశవ్ బదులిచ్చి ఉంటే బాగుండేది. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను కృష్ణాడెల్లాకు ఇచ్చి, శ్రీశైలం నుంచి డెల్టాకు ఇవ్వాల్సిన నీటిని దిగువకు పంపకుండా ‘సీమ’కు వాడతామని చంద్రబాబు అప్పట్లో చెప్పారు. దీనిపై జీఓ విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. అదీ చేయలేకపోయారు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ద్వారా హంద్రీ–నీవా ఫేజ్–2కు నీరిచ్చి, హంద్రీ–నీవా ద్వారా వచ్చే మొత్తం నీటిని ‘అనంత’కే ఉపయోగపడేలా చేయాలనేది ఆ ప్రాజెక్టు లక్ష్యం. అలాగే భవిష్యత్లో అవుకు రిజర్వాయర్ నుంచి తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల మీదుగా మిడ్పెన్నార్ డ్యాంకు నీటిని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు జరిగితే ‘అనంత’ సస్యశ్యామలం అవుతుంది. పైగా రాయలసీమ లిఫ్ట్ ద్వారా 14రోజుల్లోనే శ్రీశైలంలో నీటిని తోడేయొచ్చని మాట్లాడారు. ప్రాజెక్టులోకి వరద నీరు ప్రారంభమయ్యాక 881 అడుగుల వరకు వచ్చేదాకా ఆగకుండా 800 అడుగుల నుంచి లిఫ్ట్ చేసే వెసులుబాటు ఉంది. ఓవైపు తెలంగాణ 800 అడుగుల నుంచి తోడేస్తుంటే, 881 అడుగుల వరకు నీరు వచ్చేదాకా ‘సీమ’ ఎదురుచూడాలా? అనేది కేశవ్ ఆలోచించాలి. రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలి ‘అనంత’కు హెచ్చెల్సీ, హంద్రీ–నీవా మినహా మరో సాగునీటి వనరు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనన్ని మార్గాల ద్వారా నీళ్లు తెప్పించుకునే అవకాశాలను ఏ రాజకీయపార్టీ తీసుకున్నా దానికి తక్కిన పార్టీలు మద్దతు ఇచ్చి సాధించాలి. అప్పుడే ‘అనంత’ జనజీవనం బాగుపడుతుంది. వ్యక్తిగత రాజకీయాల కోసం ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదు. రాయలసీమ లిఫ్ట్తో హంద్రీ–నీవా ఆయకట్టుకు పుష్కలంగా సాగు, తాగునీరు దొరకడంతో పాటు అవుకు నుంచి ఎంపీఆర్కు మరో కొత్త ప్రాజెక్టు నిర్మించి నీటిని తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ఇదీ.. ‘అనంత’కు చంద్రబాబు చేసిన ద్రోహం 2012లో జీడిపల్లికి కృష్ణాజలాలు వస్తే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వడమే తరువాయి. ఫేజ్–1లో 1.18లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అప్పట్లో అంతా భావించారు. 33, 34, 36 ప్యాకేజీలకు 2014కు ముందే టెండర్లు పూర్తయి పనులు మొదలయ్యాయి. అయితే కుప్పం వరకూ ప్రధాన కాలువ పూర్తయి నీరు వెళ్లేదాకా డిస్ట్రిబ్యూటరీ పనులు చేయొద్దని 2015 ఫిబ్రవరి 23న జీఓ 22ను చంద్రబాబు జారీ చేశారు. ఇదొక్క నిర్ణయం చాలు చంద్రబాబు ‘అనంత’ గొంతు కోశారని చెప్పేందుకు. ఇప్పటి వరకూ ఆ జీఓ తర్వాత డిస్ట్రిబ్యూటరీలు చేసేందుకు మరో జీఓ జారీ చేయలేదు. ఆ జీఓతో డిస్ట్రిబ్యూటరీలు ఆగిపోయాయి. 2012లోనే నీళ్లు వచ్చినపుడు 2014–19 వరకూ ఐదేళ్లలో ఎందుకు డిస్ట్రిబ్యూటరీలు చేయలేదో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. ‘సీమ’ సాగునీటి ప్రాజెక్టుల అంశంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మాటల యుద్ధం రాయలసీమ లిఫ్ట్తో హంద్రీ–నీవా మొత్తం నీరు ‘అనంత’ జిల్లా వాడుకునేలా వెసులుబాటు రాయలసీమ లిఫ్ట్ ఆపేసి చంద్రబాబు సీమకు ద్రోహం చేశారని వైఎస్సార్సీపీ ఉద్యమబాట ఈ ప్రాజెక్టుతో ‘అనంత’కు ఉపయోగం లేదని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టును తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నం -
కేశవ్ ఇలాకాలో క‘న్నీటి’ కష్టాలు
ఉరవకొండ: మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఉరవకొండ పట్టణంలోనే 15 రోజులుగా తాగునీరు సరఫరా కాలేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో స్థానికులు చేతి పంపులు, నీటి ట్యాంకుల వద్ద మండుటెండలో గంటల తరబడి నిరీక్షించి నీళ్లు తెచ్చుకుంటున్నారు. 50 వేల జనాభా ఉన్న ఉరవకొండ పట్టణానికి పీఏబీఆర్ నుంచి ప్రత్యేక లైన్ ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. అయితే, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ప్రణాళిక లేమి, తరచూ పైప్లైన్ మరమ్మతులు, కరెంట్ సమస్య వెరసి 15 రోజులుగా పట్టణానికి తాగు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించి తాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఉరవకొండలో సైకిల్పై నీటిని తెచ్చుకుంటున్న స్థానికులు, చిన్నకొండ వద్ద మరమ్మతుకు నోచుకోని నీటి ట్యాంకు మంత్రి పయ్యావుల నియోజకవర్గంలో తారస్థాయికి తాగునీటి సమస్య ఉరవకొండలో 15 రోజులైనా సరఫరా కాని తాగునీరు నీరిలా.. తాగేదెలా..? విడపనకల్లు: మండల పరిధిలోని హావళిగి గ్రామంలో సరఫరా అవుతున్న తాగునీరు రంగు మారి, దుర్గంధం వెదజల్లుతోంది. మంత్రి కేశవ్ ఇలాకాలోని గ్రామంలో నెలకొన్న ఈ దుస్థితి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలలుగా అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజ్ నీటి కంటే అధ్వానంగా నీరు ఉన్నాయంటూ వాపోతున్నారు. గత్యంతరం లేక ఆ నీటినే తాగిన పలువురు వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రుల పాలైనట్లు తెలిసింది. విషయాన్ని అనేక సార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ అయినా స్పందించి, మంచి నీరు సరఫరా అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
జర్నలిస్టు హెల్త్ స్కీమ్ పొడిగింపు : కలెక్టర్
అనంతపురం అర్బన్: వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ పొడిగిస్తూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. అక్రిడిటేషన్ అమలులో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ పథకం ప్రీమియం కింద రూ.1,250 మొత్తాన్ని చెల్లించి 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను రెన్యువల్ చేసుకోవాలన్నారు. www.cfms.ap. gov.in వెబ్సైట్ ద్వారా హెడ్ ఆఫ్ అకౌంట్ 8342–00–120–01–03–001–001, డీడీఓ కోడ్ 2703 0802 003 కింద ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒరిజినల్ చలానా, అక్రిడిటేషన్ కార్డు జిరాక్స్, హెల్త్ కార్డ్ జిరాక్స్ను జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు:ఎస్పీ అనంతపురం సెంట్రల్: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. గురువారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను ఉపేక్షించరాదని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్సుమెంట్ చర్యలను పెంచాలని, బ్లాక్స్పాట్స్ను గుర్తించాలని సూచించారు. మట్కా, గంజాయి, పేకాట, ఇసుక అక్రమ రవాణా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయాలన్నారు. పేలుడు పదార్థాలు ఇళ్లలో ఉంచు కోకుండా నిఘా మరింత పెంచాలన్నారు. కార్యక్రమంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్చౌదరి, ప్రొబేషనరీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, డీఎస్పీలు మహబూబ్బాషా, శ్రీనివాసరావు, రవిబాబు, శ్రీనివాస్, టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుంతకల్లులో దొంగ బీభత్సం గుంతకల్లు రూరల్: గుంతకల్లులో ఓ దొంగ బీభత్సం సృష్టించాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్లు సంజీవనగర్లో నివాసముంటున్న డాక్టర్ రవి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రించారు. గురువారం వేకువజాము 2.30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన ఓ యువకుడు నేరుగా బెడ్రూంలోకి ప్రవేశించాడు. బీరువాను తెరిచి, అందులోని రెండు తులాల బంగారు నగలు తీసుకుని ఉడాయించాడు. అనంతరం అక్కడికి అర కిలోమీటరు దూరంలో ఉన్న ఆర్డీఓ కార్యాలయ సమీపంలో నివాసముంటున్న సుశీలమ్మ ఇంట్లోకి చొరబడ్డాడు. 3 గ్రాముల బంగారు మాటీలు, 4 గ్రాముల రెండు బంగారు ఉంగరాలు, 2.5 తులాల వెండి చైన్, రూ.15 వేల నగదు అపహరించాడు. అనంతరం పక్కనే ఉన్న పార్వతీ ఇంట్లోకి వెనుక ద్వారం నుంచి ప్రవేశించాడు. పార్వతీ కుమార్తె, మనవరాలిని గమనించి, ఆ గది తలుపులు మూసి గడియ పెట్టాడు. అనంతరం హాల్లో నిద్రిస్తున్న పార్వతి వద్దకెళ్లి ఆమె ముఖంపై దిండు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఉలిక్కిపడి లేచి గట్టిగా కేకలు వేసింది. దీంతో యువకుడు ప్రధాన ద్వారం తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. బాధితులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో కసాపురం పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్
● రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపాటు అనంతపురం ఎడ్యుకేషన్: చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్లో ఎప్పుడైతే పలుచనవుతుందో ఆ వెంటనే జనం దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. గురువారం స్థానిక తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కారిడార్గా మార్చుకుని రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ వైఎస్ జగన్ చేసిన ప్రకటనకు విశేష స్పందన లభిస్తోందన్నారు. కేవలం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పిన మాటలకు అన్ని వర్గాలూ మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఈ క్రమంలో ఉలిక్కిపడిన టీడీపీ నేతలు ఒకవైపు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, మరోవైపు వైఎస్సార్సీపీ శ్రేణులను అక్రమ అరెస్ట్లు చేస్తున్నారన్నారు. తమ పార్టీ సోషల్ మీడియా రాప్తాడు నియోజకవర్గ కన్వీనరు గిరీష్కుమార్రెడ్డి ఐటీ ఉద్యోగి అని, ఆయన ఎప్పుడూ ఎవరినీ గట్టిగా కూడా మాట్లాడలేదన్నారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటారన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీతకు కొందరు వెధవలు ఇచ్చిన సలహాతో గిరీష్రెడ్డిని టార్గెట్ చేశారని, పది రోజుల ముందే ఎస్బీ వారి దృష్టిలో అతని పేరు ఉందనే ప్రచారం తెరపైకి తెచ్చారన్నారు. ఈనెల 13న రాత్రి 10 గంటలకు సంబంధం లేని ఓ వ్యక్తితో కుప్పంలో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు 14న సాయంత్రం అనంతపురంలో గిరీష్ను అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆయనతో వాంగ్మూలం తీసుకున్నట్లు డాక్యుమెంటు సిద్ధం చేసుకుని వైఎస్ జగన్ పీఆర్ఓ శ్రీహరిపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. గిరీష్కుమార్రెడ్డిని రిమాండ్కు తరలిచేందుకు కోర్టులో హాజరుపరిస్తే జడ్జి అంగీకరించలేదన్నారు. తాను నేరం చేయలేదని, ఎలాంటి పోస్టులు పెట్టలేదని, తన ఫోన్ చెక్ చేసుకోండని గిరీష్కుమార్రెడ్డి జడ్జి ఎదుట మొరపెట్టుకున్నాడన్నారు. ఈ క్రమంలో జడ్జి ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వ కుండా ఇది తప్పుడు కేసుగా భావించి ఆయనే వ్యక్తిగత ష్యూరిటీ ఇచ్చారని, ప్రభుత్వ పాలన ఎంత చెత్తగా ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. కుట్రలు, కుతంత్రాలు, మోసపూరిత విధానాలు, అక్రమ కేసులు, అరెస్ట్లకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం జువ్వలదిన్నెలో మత్స్యకారుల వ్యతిరేకతను ఎదుర్కోలేక, జగన్ ఏర్పాటు చేసిన 10 ఫిషింగ్ హార్బర్లను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తుంటే తట్టుకోలేకనే గిరీష్రెడ్డి, శ్రీహరిని అరెస్ట్ చేశారన్నారు. లీగల్ సెల్ సహకారంతోనే బెయిలు గిరీష్రెడ్డి అక్రమ అరెస్ట్ను రాప్తాడు వైఎస్సార్సీపీ సమిష్టిగా ఎదుర్కొందన్నారు. రాష్ట్ర లీగల్ సెల్ సహకారం, ఇక్కడి న్యాయవాదులు నాగన్న, బాబ్జీ సహకారంతో గిరీష్రెడ్డిని బెయిల్పై విడుదల చేయించారన్నారు. కక్షపూరిత విధానాలను పరిటాల సునీత మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో గిరీష్కుమార్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, నాయకులు గంగుల సుధీర్రెడ్డి, లోకనాథరెడ్డి, నారాయణరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సునీల్దత్తరెడ్డి, నెమలివరం రఘు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యంతోనే పేలుళ్లు!
● భారీ పేలుడుతో భీతావహ వాతావరణం ● కుమ్మరవాండ్లపల్లి ఘటనపై సర్వత్రా విస్మయంకదిరి అర్బన్/కదిరి టౌన్: బుధవారం ఉదయం 11.15 గంటల ప్రాంతం.. కదిరి పట్టణ శివారులోని కుమ్మరవాండ్లపల్లి.. కదిరి–రాయచోటి రోడ్డుకు అతి సమీపంలోని ఓ ఇంటి నుంచి పొగలు మొదలయ్యాయి.. స్థానికులంతా గుమికూడారు. ఇంట్లో వారు మాత్రం అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. మంటలు ఆర్పుదామన్న ఆత్రుతతో స్థానికుల్లో కొందరు లోపలికి వెళ్లారు. ఇంతలోనే భారీ పేలుడు.. ఆ ఇంటితో పాటు ఇరువైపులా ఉన్న ఇళ్లు నేలమట్టమయ్యాయి. లోపలికి వెళ్లిన వారిలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. శరీరాలన్నీ కాలిపోయాయి. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. స్థానికుల హాహాకారాలు మిన్నంటాయి. భారీ పేలుడు శబ్దం చుట్టుపక్కల చాలా దూరం వరకు విన్పించింది. ఏమి జరిగిందో అర్థం కాక పట్టణవాసులు రకరకాలుగా చర్చించుకున్నారు. చివరకు జిలెటిన్స్టిక్స్ పేలుడు వల్ల దుర్ఘటన జరిగిందని తెలిసి ప్రజలు నిర్ఘాంతపోయారు. కదిరి చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని ఘటన ఇప్పుడు సంభవించిందంటూ విస్మయం వ్యక్తం చేశారు. పదేళ్లుగా.. యథేచ్ఛగా.. కుమ్మరవాండ్లపల్లిలో జిలెటిన్స్టిక్స్ పేలుడు జరిగిన ఇంట్లో పదేళ్లుగా తెలంగాణవాసులు ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. జనావాసాల మధ్య ఇంట్లో పేలుడు పదార్థాలు పెట్టుకుని ఉంటున్నా ఎవరికీ అనుమానం రాకపోవడం గమనార్హం. వారు కదిరి చుట్టుపక్కల రహదారుల నిర్మాణం, వెంచర్లు, రైతుల భూముల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా పెద్దపెద్ద రాళ్లను బ్లాస్టింగ్ చేసేందుకు వెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు. ఒకసారి పనులకు వెళితే తర్వాత రెండు, మూడు రోజులకు గానీ తిరిగొచ్చేవారు కాదు. దీంతో కష్టపడి పనులు చేసుకుంటున్నారని స్థానికులు అనుకునేవారు. ఓ భారీ ప్రమాదపుటంచున తాము జీవిస్తున్నామని వారు ఏ రోజూ భావించలేదు. కరువైన తనిఖీలు ఎక్కడైనా భారీ బ్లాస్టింగ్లు జరుగుతుంటే రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, మైనింగ్ తదితర శాఖల అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకే పేలుళ్లు జరుపుతున్నారా అనేది చూడాల్సి ఉంటుంది. ఉల్లంఘించినట్లు తేలితే కేసు నమోదు చేసి, కఠిన చర్యలు చేపట్టాలి. కానీ ఇక్కడ అలాంటివేమీ జరగడం లేదు. చాలాకాలం నుంచి కదిరి చుట్టుపక్కల యథేచ్ఛగా బ్లాస్టింగ్లు చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొంతకాలం క్రితం గట్లు వద్ద ఓపెన్ బ్లాస్టింగ్ చేస్తుండగా.. సమీప కాలనీవాసులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని రెండు రోజులు స్టేషన్లో ఉంచుకుని వదిలేశారు. కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. దీంతో షరామామూలే అన్నట్లు బ్లాస్టింగ్లు జరిగిపోతున్నాయి. పేలుడు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ జనావాసాల మధ్య నిల్వ చేసేందుకు వీలులేదు. ఊరికి దూరంగా, అధికారులు నిర్దేశించిన ప్రాంతంలో తగిన భద్రతా ఏర్పాట్ల మధ్య మాత్రమే నిల్వ చేయాలి. బ్లాస్టింగ్ చేసే వారికి కూడా ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ ఉండాలి. కానీ ఇలాంటి భద్రతా ప్రమాణాలేవీ పాటించపోయినా అధికారులు పట్టించుకోకపోవడం కుమ్మరవాండ్లపల్లిలో భారీ విషాదానికి దారి తీసిందని ప్రజలు మండిపడుతున్నారు. సాక్షి, పుట్టపర్తి : ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ చాలా మంది పేలుడు పదార్థాలను ఇంట్లోనే నిల్వ ఉంచుకుని ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో మూడేళ్లలో మూడు పేలుళ్లు సంభవించాయి. కొత్తచెరువు మండలం వంగంపల్లిలో జరిగిన గ్యాస్ పేలుడులో ఓ మహిళ దుర్మరణం చెందగా.. గోరంట్లపల్లిలో ప్రజలు ముందుగానే అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ రెండు ఘటనలు 2023 జూలై, ఆగస్టు నెలల్లో జరిగాయి. ఆ తర్వాత పేలుడు ఘటనలు లేవనే చెప్పవచ్చు. అయితే తాజాగా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. నలుగురు దుర్మరణం చెందగా.. 28 మంది గాయపడ్డారు. అవగాహన లోపంతో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడంతోనే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ముందుగా అప్రమత్తమై పరారీ తెలంగాణ నుంచి వచ్చిన ఓ కుటుంబం పదేళ్లుగా కుమ్మరవాండ్లపల్లిలో నివాసం ఉంటోంది. రాతి పనులకు వెళ్లే క్రమంలో పేలుడు పదార్థాలు వినియోగించేవారు. పనుల్లో భాగంగా ఒకేసారి భారీ డంపు చేసినట్లు సమాచారం. బుధవారం ఉదయం సమయంలో పేలుడు పదార్థాల నుంచి పొగ వస్తుండటం గమనించిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. గ్యాస్తో ప్రమాదమే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా సరిగా జరగడం లేదు. దీంతో చాలా మంది అవసరం లేకపోయినా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుని నిల్వ చేసుకుంటున్నారు. జాగ్రత్తలు పాటించకుండా సిలిండర్లను ఎక్కడపడితే అక్కడ ఉంచితే పెనుప్రమాదం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పేలుడు పదార్థాలు నిల్వ ఉంచితే చర్యలే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచుకోవడం నేరం. ఎవరి ఇంట్లో అయినా అనుమతులు లేని పేలుడు పదార్థాలు ఉన్నట్లయితే వెంటనే బయట పడేయండి. పోలీసులకు పట్టుబడితే తీవ్రమైన చర్యలు ఉంటాయి. అనుకోకుండా ప్రమాదం సంభవిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనే విషయం గ్రహించాలి. గ్యాస్సిలిండర్ల నిల్వలోనూ జాగ్రత్త అవసరం. ఎవరైనా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎస్.సతీష్ కుమార్, ఎస్పీ -
ఇలా జరుగుతుందని అనుకోలేదు
పేలుడు జరిగిన ఇంటికి సమీపంలోనే నివాసం ఉంటున్నాం. ఆ ఇంట్లో మంటలు వ్యాపిస్తుండడంతో ఆర్పేందుకు బిందెలతో నీళ్లు ఇచ్చాను. ఇంతలోనే భారీశబ్ధంతో పేలుడు సంభవించింది. నా ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతింది. నాకు స్వల్ప గాయాలయ్యాయి. భయంకరమైన పేలుడుతో భీతిల్లిపోయాం. పేలుడు జరిగిన ఇంట్లో వారు నాలుగురోజులకోసారి వ్యానులో వచ్చి వెళ్తుండేవారు. ఏదో మైనింగ్ పని చేసుకుంటున్నారని అనుకున్నాం. ఇలా పేలుడు పదార్థాలు నిల్వ చేస్తుంటారని ఊహించలేకపోయాం. – పార్వతమ్మ, కుమ్మరవాండ్లపల్లి -
శ్రీహరి అరెస్ట్ అక్రమం
అనంతపురం : వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా సెల్ ఇన్చార్జ్) పూడి శ్రీహరి అరెస్ట్ అక్రమం అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం మాటున సాగుతున్న అరాచకాలకు ఇలాంటి ఉదంతాలు పరాకాష్టగా నిలుస్తున్నాయన్నారు. బుధవారం నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు సాకే శైలజానాథ్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి అనంత వెంకటరామిరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ సివిల్ డ్రస్లో వచ్చి నోటీసులు ఇవ్వకుండానే శ్రీహరిని అరెస్టు చేసి, తీసుకెళ్లడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలు గురించి ప్రశ్నించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అక్రమ అరెస్ట్లకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి వాటిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తున్నారన్నారు. ఏకంగా అంబేడ్కర్ జయంతి రోజున రెడ్బుక్ రాజ్యాంగం గురించి మంత్రి నారా లోకేష్ మాట్లాడడం దుర్మార్గమన్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ పోలీసులు 41 నోటీసు ఇవ్వకుండా, ఎలాంటి విచారణా చేయకుండా శ్రీహరిని దారిలో అడ్డుకుని అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామిక చర్య అన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. తక్షణమే శ్రీహరిని బేషరతుగా విడుదల చేయాలని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విధానానికి విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. దౌర్జన్యానికి పరాకాష్ట పోలీసులు సివిల్ డ్రస్లో వచ్చి పూడి శ్రీహరికి చెందిన ల్యాప్టాప్, ఫోనును లాక్కెళ్లడం దౌర్జన్యానికి పరాకాష్ట అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. గతంలో సజ్జల భార్గవరెడ్డి అంశంలోనూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. సమ సమాజ స్థాపనకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారని, అలాంటి మహనీయుడి జయంతి రోజునే నారా లోకేష్ ‘రెడ్బుక్ రాజ్యాంగం’పై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 111 సెక్షన్లు పెట్టడం.. వాటిపై బెయిల్ రాకుండా చేయడం.. ఇలాంటి అంశాలను సమాజం హర్షించదని అన్నారు. ఇప్పటికై నా అక్రమ నిర్బంధాలు మానుకోవాలని హితవు పలికారు. రెడ్బుక్ పేరిట సాగిస్తున్న దాష్టీకాలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి తప్ప కక్షసాధింపు చర్యలకు పోరాదని సూచించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు సరైనవి కాదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాయడమే రెడ్బుక్ మాటున అరాచక పాలన తగదు విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు -
రెండింటా సమాన స్థానమే
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రెండింటా జిల్లా రాష్ట్రంలో 15వ స్థానాన్ని దక్కించుకుంది. మొదటి సంవత్సరంలో గతేడాదికంటే ఉత్తీర్ణత శాతం పెరిగినా.. ద్వితీయ సంవత్సరంలో తగ్గింది. బుధవారం ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో గతేడాది 63 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 17వ స్థానంలో నిలవగా ఈసారి 73 శాతానికి పెరిగి 15వ స్థానాన్ని కై వసం చేసుకుంది మొత్తం 21,730 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా 15,814 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 11,434 మంది బాలికలకు గాను 9,144 మంది 77.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. 10,296 మంది బాలురకు గాను 6,670 మంది 63.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వివిధ గ్రూపుల్లో ప్రభుత్వ యాజమాన్యాల కళాశాలల విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలతో పోటీపడుతూ మార్కులు సాధించారు. ● జిల్లాలోని 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 3,667 మంది విద్యార్థులకు గాను 1,560 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1663 మంది బాలికలను గాను 911 మంది (54.78 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 1694 మంది బాలురకు గాను 649 మంది (38.31 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● రెండు ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 703 మంది విద్యార్థులకు గాను 191 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 187 మంది బాలికలను గాను 91 మంది (48.66 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 516 మంది బాలురకు గాను 100 మంది (19.37) శాతం ఉత్తీర్ణత సాధించారు. ● 9 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 665 మంది విద్యార్థులకు గాను 567 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 489 మంది బాలికలను గాను 417 మంది (85.27 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 176 మంది బాలురకు గాను 150 మంది (85.22 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● 15 మోడల్ స్కూళ్లల్లో 968 మంది విద్యార్థులకు గాను 598 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 739 మంది బాలికలను గాను 490 మంది (66.30 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 229 మంది బాలురకు గాను 108 మంది (47.16 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● 9 కేజీబీవీ స్కూళ్లల్లో 788 మంది బాలికలను గాను 628 మంది (79.69 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● 65 ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 15,886 మంది విద్యార్థులకు గాను 12,270 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 7,958 మంది బాలికలను గాను 6,607 మంది (83.02 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 7,928 మంది బాలురకు గాను 5,663 మంది (71.43 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలు రెండుస్థానాలు దిగువకు.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో గతేడాదికంటే ఈసారి రెండుస్థానాలు కిందకు దిగజారింది. గతేడాది 13వ స్థానంలో ఉండగా ఈసారి 15వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉత్తీర్ణత శాతం కూడా గతేడాది కంటే ఈసారి నాలుగు శాతం తగ్గింది. మొత్తం 20,320 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 76 శాతం అంటే 15,530 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 10,790 మంది బాలికలను గాను 7,954 మంది (72.11 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 9530 మంది బాలురకు గాను 6,664 మంది (68.49 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 3,057 మంది విద్యార్థులకు గాను 1,560 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,490 మంది బాలికలను గాను 1,008 మంది (67.65 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 1567 మంది బాలురకు గాను 858 మంది (54.75 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● రెండు ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 538 మంది విద్యార్థులకు గాను 191 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 137 మంది బాలికలను గాను 76 మంది (55.47 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 401 మంది బాలురకు గాను 115 మంది 28.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. ● 9 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 561 మంది విద్యార్థులకు గాను 544 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 460 మంది బాలికలను గాను 407 మంది (88.48 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 154 మంది బాలురకు గాను 137 మంది (88.96 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● 15 మోడల్ స్కూళ్లల్లో 979 మంది విద్యార్థులకు గాను 685 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 717 మంది బాలికలను గాను 525 మంది (73.22 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 262 మంది బాలురకు గాను 160 మంది (61.07 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● 9 కేజీబీవీ స్కూళ్లల్లో 710 మంది బాలికలను గాను 564 మంది (79.44 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● 65 ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 14,862 మంది విద్యార్థులకు గాను 11,668 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 7,516 మంది బాలికలను గాను 6,274 మంది (83.48 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 7,346 మంది బాలురకు గాను 5,394 మంది (73.43 శాతం) ఉత్తీర్ణత సాధించారు. రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోండి ఈ నెల 20 నుంచి 27 వరకు రీవెరిఫికేషన్, రీటోటలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. రీవెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1300 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీటోటలింగ్ కోసం రూ. 260 చెల్లించాలని ఆర్ఐఓ వెంటకరమణనాయక్ తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లాకు 15వ స్థానం ఫస్టియర్ 73, సెకండియర్ 76 శాతం ఉత్తీర్ణత మెరిసిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు -
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా
కుమ్మరవాండ్లపల్లి పేలుడు ఘటన బాధితులకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ తెలిపారు. బుధవారం ఆయన కుమ్మరవాండ్లపల్లిలో ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. క్షత్రగాత్రులకు ధైర్యం చెప్పారు. అలాగే మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా,వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ ప్రణీత్రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జైనుల్లా బాధితులను ఓదార్చారు. కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. బుధవారం కదిరి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పేలుడు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంలో నలుగురు మృతిచెందగా... మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించినట్లు పేర్కొన్నారు. ఇదే ఘటనలో మరో 17 మంది గాయపడ్డారన్నారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వం తరఫున పక్కాగృహం మంజూరు చేస్తామని చెప్పారు. -
సంకల్పమే వారి విజయ సోపానం
అనంతపురం ఎడ్యుకేషన్: ఈ రోజుల్లో చదువు అంటే చాలా మందికి కార్పొరేట్ కాలేజీలు, భారీ ఫీజులు, ప్రత్యేక కోచింగ్ సెంటర్లు గుర్తుకొస్తాయి. ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు అన్ని సౌకర్యాలతో ఉన్న కళాశాలల్లో చదువుకుని మంచి మార్కులు సాధించడం గొప్పకాదు. కూలినాలి చేసుకునే కుటుంబాలు, పూటగడవని కుటుంబాల నుంచి వచ్చి ప్రభుత్వ కళాశాలలు, హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటూ మంచి మార్కులు సాధించడం గొప్ప. ఇందుకు నిదర్శనమే బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాలు. ప్రభుత్వ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. సౌకర్యాలు లేకపోయినా, అత్యాధునిక ల్యాబ్స్ లేకపోయినా, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రత్యేక ట్యూషన్లకు వెళ్లకుండా సంక్షోభాల మధ్య చదువుకుని కార్పొరేట్ విద్యార్థులకు ఏమాత్రమూ తీసిపోని విధంగా మార్కులు సాధించి ప్రశంసలందుకుంటున్నారు. వీరిలో కొందరి తల్లిదండ్రులు కూలీలు, మరికొందరు రైతులు ఉన్నారు. ఇంకొందరు విద్యార్థులు అనాథలు ఉన్నారు. వీరికి చదువు ప్రాధాన్యత గురించి చెప్పే వారు కూడా లేరు. అయినా ఆ పిల్లల్లో ఉన్న సంకల్పమే వారి గురువు అయింది. వారి కుటుంబ కష్టాలే వారికి పాఠాలు నేర్పాయి. ఆర్థిక ఇబ్బందుల్లోనూ చదువుపైనే దృష్టి సారించారు. ఫలితంగా విజయాన్ని అందుకున్నారు. ‘ఎంత కష్టమైనా, చదువుతో జీవితాన్ని మార్చుకోవచ్చు’ అని నిరూపించారు. భారతి, డి.హీరేహాల్, 493 (ఎంపీహెచ్డబ్ల్యూ) ఎస్.తస్లీం, 488 (ఐఎంఎల్టీ) షేక్ సానియా, 491 (సీఎస్ఈ) ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సౌకర్యాలు లేకపోయినా మెరుగైన మార్కులు సాధించిన పలువురు విద్యార్థులు -
ఎంఎస్ రాజు తక్షణమే క్షమాపణలు చెప్పాలి
● వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ● రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగమేనంటూ మండిపాటుఅనంతపురం: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏకంగా దళిత మహిళానేతను దుర్భాషలాడిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తక్షణమే క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఓ దళిత మహిళను బూతులతో దూషించడం ఎంఎస్ రాజు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. అవమానం తట్టుకోలేక వైఎస్సార్సీపీ దళిత మహిళా నేత, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల బహిరంగంగానే బిగ్గరగా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయారని గుర్తు చేశారు. మంజులను దుర్భాషలాడడమే కాక, తిరిగి ఆమైపెనే ఐ–టీడీపీ బ్యాచ్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంఎస్ రాజు మాట్లాడిన బూతులు సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఉన్నాయన్నారు. ఈ అంశాలన్నింటిపై సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగానే మహిళలపై అత్యాచారాలు, హత్యలు, ఆకృత్యాలు అధికమయ్యాయని మండిపడ్డారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషిస్తే.. ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేని అసమర్థ స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు నిదర్శనమన్నారు. జెడ్పీ వైస్చైర్మెన్ నాగరత్నమ్మ మాట్లాడుతూ.. దళిత మహిళా నేత మంజులను దుర్భాషలాడిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు. ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకోకపోతే.. మహిళల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశాయి భారతీరెడ్డి, నాయకులు శోభారాణి, భారతి, ఖమర్తాజ్, శోభాబాయి, ఉషారాణి, అంజలి తదితరులు పాల్గొన్నారు. -
అవగాహన లేకుండా మాట్లాడకు కేశవ్..
ఉరవకొండ: సాగునీటి ప్రాజెక్ట్లపై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడడం మానుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ చైర్మన్ రమణ హితవు పలికారు. ఇటీవల పబ్లిక్ మీటింగ్లలో సాగునీటి ప్రాజెక్ట్లపై మంత్రి మాట్లాడిన తీరు చూస్తుంటే కనీస విషయ పరిజ్ఞానం కూడా ఆయనకు లేదనే విషయం తేటతెల్లమవుతోందన్నారు. బుధవారం వజ్రకరూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముచ్చుమర్రి ఎత్తిపోతుల పథకానికి, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధమే లేదనే విషయాన్ని మంత్రి గుర్తించాలన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ పథకంలో భాగంగా 834 అడుగుల ఎత్తుతో పంపింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన కారణంగా నీరు అందని సమయంలో ప్రత్యామ్నాయంగా 800 అడుగుల నుంచి పంపింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఎక్కువ రోజులు వరద ఉంటే నేరుగా కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు ఇవ్వడమే ముచ్చమర్రి ఎత్తిపోతల పథకం ఉద్దేశమన్నారు. అయితే మంత్రి కేశవ్ మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవని, ఒకసారి డీపీఆర్ కోసం, రెండో సారి మంచినీటి కోసమేనని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయితే మిగులు జలాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను సాగునీటి కోసమే అని చెబితే అనుమతులు వస్తాయా? అని ప్రశ్నించారు. మంచినీళ్ల కోసమంటూ ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను కూడా నిర్మించిన విషయం కూడా మంత్రి కేశవ్కు తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. రాయలసీమ ప్రాంత సాగునీటి సాధన ఉద్యమకారులు, మేధావులు, ప్రజలందరూ శ్రీశైలం ప్రాజెక్టును హైడల్ ప్రాజెక్ట్ నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చాలని గగ్గోలు పెడుతుంటే మంత్రి కేశవ్ మాత్రం రాయలసీమకు తీరని అన్యాయం జరిగేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం మంత్రి ఇంతలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారో చెప్పాలన్నారు. హంద్రీ–నీవా ప్రాజెక్టును చంద్రబాబు పూర్తి చేసినట్లు మంత్రి కేశవ్ చెబుతున్నారని, ఈ అంశంపై దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. 1985లో హంద్రీ–నీవా ప్రాజెక్ట్ను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించారని, ఆ తర్వాత 2005లో జలయజ్ఞంలో భాగంగా పనులను డాక్టర్ వైఎస్సార్ పూర్తి చేయించారని గుర్తు చేశారు. 1994లో చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ఒక్క కిలోమీటరు కూడా కాలువ తవ్వలేదనే విషయం తెలుసుకోవాలన్నారు. 2014 నుంచి 2019 వరకు రెండో దశ పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేస్తే నేడు కుప్పం ప్రాంతానికి సీఎం చంద్రబాబు దర్జాగా నీటిని మళ్లించుకుంటున్నారని తెలిపారు. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి తన ఏడేళ్ల పాలనలో హంద్రీ–నీవా కోసమే రూ.7వేల కోట్లు ఖర్చు పెట్టి 70 శాతం మొదటి దశ పనులు పూర్తి చేశారన్నారు.చంద్రబాబు అవగాహనా లోపం కారణంగా 40 టీఎంసీల సామర్థ్యం కలిగిన హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కాస్త 5 టీఎంసీల మంచినీళ్ల ప్రాజెక్టుగా మారుతోందని మండిపడ్డారు. 11,500 క్యూసెక్కులకు బదులు, 3,850 క్యూసెక్కుల ప్రవాహానికి నీటిని కుదించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికై నా కేశవ్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, లేకపోతే రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయమన్నారు. ‘హంద్రీ–నీవా’కు చంద్రబాబు చేసిన మేలు ఏదీ లేదు దమ్ముంటే హెచ్ఎన్ఎస్ఎస్పై బహిరంగ చర్చకు రావాలి రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ చైర్మన్ రమణ -
పేదల సంక్షేమం పట్టదా?
ఉరవకొండ: రాష్ట్రంలో పేదల సంక్షేమం చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్న క్యాంటీన్లు, హంద్రీ–నీవా తదితర అంశాలపై ఇటీవల మంత్రి కేశవ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ ఖండించారు. అమరావతి నిర్మాణంలో అంతులేని అవినీతి చోటు చేసుకుందన్నారు. రూ.14,800తో చదరపు అడుగు నిర్మాణం చూపడం దారుణమన్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో చదరపు అడుగు రూ.4 వేలతో అద్భుత కట్టడాలు వెలుస్తున్నాయన్నారు. కేవలం అమరావతి ప్లాన్ కోసమే రూ400 కోట్లు తగలేశారని, రాజధాని ప్రాంతంలో వర్షపు నీళ్లు ఎత్తేయడానికి, ముళ్ల కంపలు తొలగించడానికి ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. మొబైలజేషన్ అడ్వాన్స్ పేరుతో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు రూ5,500 కోట్లు దోచి పెట్టారన్నారు. రాజధానిలో మౌలిక వసతులకే రూ. 2లక్షల కోట్లు కావాలని, ఈ అప్పు ఎవరు తీరుస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు. రాజధాని తప్ప పేదల సంక్షేమం పట్టని చంద్రబాబు ప్రభుత్వం దోచుకో..దాచుకో అనే రీతిలో పాలన సాగిస్తోందని మండిపడ్డారు. హంద్రీ–నీవా ద్వారా చంద్రబాబు తన నియోజకవర్గానికి నీటిని తీసుకెళుతున్నారని, అయితే ఇప్పటి వరకూ జీడిపల్లి నిర్వాసితులకు పరిహారం ఇచ్చే ఆలోచన ఎందుకు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. జీడిపల్లి రిజర్వాయర్లో ప్రస్తుత నీటి నిల్వకు అదనంగా మరో 4 టీఎంసీలు పెంచేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.675 కోట్లతో ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశారని, ప్రస్తుత కేటాయింపుల్లో ఆ రిపోర్టును ఆమోదిస్తే రాయలసీమకు తాగు, సాగునీరు అవసరాలతో పాటు చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. -
కీచకుడిపై చర్యలు తీసుకోండి
అనంతపురం క్రైం: తాడిపత్రి మున్సిపాలిటీలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉన్నతాధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా బుధవారం అనంతపురంలోని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ మాట్లాడారు. ఉన్నత హోదాలో ఉంటూ మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సరికాదన్నారు. బాధితులు అధిక సంఖ్యలో ఉన్నా... ఒత్తిళ్లు, బెదిరింపుల కారణంగా వారు ధైర్యంగా బయటకు చెప్పుకోలేక మానసికంగా కుదేలవుతున్నారన్నారు. మహిళల భద్రతపై పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బాధితులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. లైంగిక వేధింపుల వంటి ఘటనలను పంచాయితీల పేరుతో కప్పిపుచ్చడం న్యాయాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కీచకుడి వెనుక ఉన్న రాజకీయ ఆశ్రయం బయటపడకపోతే నిజాలు వెలుగులోకి రావని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని కోరారు. బాధిత మహిళలకు పూర్తి రక్షణ కల్పించి, వారి ఫిర్యాదులను గోప్యంగా స్వీకరించాలని సూచించారు. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) నాగరాజుకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం. నాగమణి, గోపాల్, నాగరాజు, ముత్తు, తిరుమలేష్, ఎర్రిస్వామి, లక్ష్మీనరసమ్మ, నాగేంద్ర, శ్రీనివాసులు, ఆజాం బాషా, గురుస్వామి, నల్లప్ప, పరమేష్, గిరి, భీమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక
గుమ్మఘట్ట (రాయదుర్గం రూరల్): ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు నెల్లూరులోని అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు రాయదుర్గంలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ బుధవారం వెల్లడించారు. ఎంపికై న వారిలో ఎస్ఎండీ అలీ, ఎస్.సమీర్, ఖాజాపీరా, వెంకటసాయి, హర్షవర్దన్ ఉన్నారు. వీరిని కళాశాల అధ్యాపకులు బుధవారం అభినందించారు. యువతి ఆత్మహత్యాయత్నం అనంతపురం సెంట్రల్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి అనంతపురంలోని అరవిందనగర్లో ఉన్న బీసీ హాస్టల్ ఉంటూ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో అనస్తియా టెక్నీషియన్ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించిన తోటి విద్యార్థుల సమాచారంతో వెంటనే ఆమెను సర్వజనాస్పత్రికి హాస్టల్ సిబ్బంది తరలించింది. కాగా, సదరు యువతి తన మేనత్త కుమారుడిని ప్రేమించి ఇరు కుటుంబాలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో మనస్తాపం చెంది విషపూరిత ద్రావకం తాగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. -
శ్రీహరి అరెస్ట్ ‘రెడ్బుక్’లో భాగమే..
● వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఆర్వో, పార్టీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఈ అరెస్ట్ను ఖండిస్తూ వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పూడి శ్రీహరిని అతని ఇంట్లోనే కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురైయ్యేలా అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ఎన్నో దుర్మార్గాలకు చంద్రబాబు, లోకేష్, పవన్కుమార్ పాల్పడుతున్నారన్నారు. అయితే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి రెడ్బుక్లకు భయపడకుండా చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, దుర్మార్గలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. ఈ పోరాటంలో దూసుకెళుతున్న శ్రీహరిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఇంతటి దుర్మార్గానికి పాల్పడిందన్నారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టారనే సాకు చూపి అరెస్ట్ చేయడం సరైంది కాదన్నారు. ఈ అరెస్ట్ ద్వారా సోషల్ మీడియాను అణగదొక్కాలనుకోవడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమన్నారు. ఇప్పటికై నా పోలీసులు వెంటనే శ్రీహరిని బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికారప్రతినిధి సీపీ వీరన్న, ఉస్మాన్, డిష్ సురేష్, కౌడిగి గోవిందు, సిద్దు, జగదీష్, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి కేశవ్ ఇలాకాలో దాహం కేకలు
● కలుషిత నీరు తాగి రోగాల బారిన జనం ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత నియోజకవర్గ కేంద్రం ఉరవకొండలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. పలు కాలనీలకు పబ్లిక్ కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు పూర్తిగా రంగుమారి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. కుళాయిల ద్వారా వస్తున్న నీటిని బకెట్లో పట్టుకుంటే పూర్తిగా నురుగు తేలి డ్రెయినేజీ నీరులా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కలుషిత నీటి కారణంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు రోగాల బారిన పడ్డారని తెలిపారు. పట్టణంలోని ఏదో ఒక ప్రాంతానికి చెందిన వారు రోజూ కలుషిత నీటిని బాటిళ్లలో పట్టుకెళ్లి అధికారుల ఎదుట ఏకరువు పెడుతున్నా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. తాజాగా 11, 12 వార్డులు, పార్కు ఆంజనేయస్వామి ఆలయం, అరబిక్ హైస్కూల్ తదితర ప్రాంతాల్లో బుధవారం కూడా కలుషిత నీరు సరఫరా కావడంతో అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఇప్పటికై నా మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించి ప్రజల తాగునీటి కష్టాలు దూరం చేయాలని పలువురు కోరుతున్నారు. గిరిష్కుమార్రెడ్డికి బెయిల్ మంజూరు ఆత్మకూరు: ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న అభియోగంతో ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్కుమార్రెడ్డిని కుప్పం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి వెంటనే లాయర్ల ద్వారా హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేయించారు. దీంతో సొంత పూచీకత్తిపై గిరీష్కుమార్రెడ్డికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. క్లిష్ట సమయంలో కార్యకర్తల పక్షాన నిలబడిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి చొరవపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. బంగారు ఆభరణాల అపహరణ కణేకల్లు: ప్రయాణికురాలి వద్ద నుంచి బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన కణేకల్లులో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కరిష్మా కణేకల్లులో తన బంధువుల ఇంట జరుగుతున్న నామకరణ వేడుకలకు అత్త హమీదాతో కలిసి సోమవారం సాయంకాలం ఆర్టీసీ బస్సు కణేకల్లు క్రాస్ వరకూ ప్రయాణించింది. అక్కడి నుంచి ఆటోలో కణేకల్లుకు చేరుకున్నారు. ఇక్కడి బస్టాండ్ నుంచి మరో ఆటో ఎక్కి బంధువుల ఇంటికి చేరుకుని, బ్యాగ్ పరిశీలించగా అందులో మూడు తులాల బంగారు ఆభరణాలు ఉంచిన బాక్స్ కనిపించలేదు. ఘటనపై అత్త హమీదా ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నాగమధు తెలిపారు. టీడీపీ పొలిట్బ్యూరోలో ఇద్దరికి స్థానం అనంతపురం టౌన్: టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరికి స్థానం కల్పిస్తూ ఆ పార్టీ అధిష్టానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు మరోమారు అవకాశం కల్పించారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పొలిట్బ్యూరో సభ్యుడిగా నియమించారు. దీంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతనిధులుగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, గుణపాటి దీపక్రెడ్డి, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్గా బీవీ వెంకటరాముడును నియమించారు. వీరితోపాటు జిల్లా నుంచి పలువురికి పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోకి స్థానం దక్కింది. మద్యం దుకాణం సీజ్ శింగనమల: మండల కేంద్రంలోని మద్యం దుకాణాన్ని ఎకై ్సజ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. బుక్కరాయసముద్రం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని శింగనమల, గార్లదిన్నె, నార్పల మండలాల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎకై ్సజ్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శింగనమలలోని దుకాణంలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. కీచక అధికారిపై విచారణ తాడిపత్రి టౌన్: మహిళా ఉద్యోగులు, సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న తాడిపత్రి మున్సిపల్ కార్యాలయ అధికారి తీరుపై ‘మున్సిపాలిటీలో కీచకుడు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. దీంతో బుధవారం ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి విచారణ చేపట్టారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని మహిళా సిబ్బందిని విడివిడిగా విచారణ చేశారు. -
అద్దె భవనాలే దిక్కు
అనంతపురం టౌన్: ప్రభుత్వ ఖజానాకు అత్యధికంగా ఆదాయం సమకూర్చే శాఖల్లో ప్రధానమైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సొంత భవనాలు లేవు. ఏడాదికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.500కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా సమకూరుతోంది. అయినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించే యోచన ప్రభుత్వం చేయడం లేదు. 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. డీఐజీ కార్యాలయంతోపాటు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు సైతం అద్దె భవనాల్లోనే ఉన్నాయి. అలాగే అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, రామ్నగర్, కళ్యాణదుర్గం, శింగనమల, యాడికి, పామిడి, గుంతకల్లు, కణేకల్లు తదితర ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ ప్రైవేట్ భవనాల్లోనే ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు చిలమత్తూరు, ధర్మవరం రిజిస్ట్రేషన్ కార్యాలయాలూ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సొంత భవనాల ఏర్పాటు ఎన్నడో.. ఏడాదికి ప్రభుత్వ ఖజానాకు ఉమ్మడి జిల్లా పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రూ.500 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. రెవెన్యూ పరంగా బలమైన ఆదాయ వనరుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు లేని కొరత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. కొన్నేళ్లుగా అద్దె భవనాల్లోనే కాలం నెట్టుకొస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించి ఇచ్చే అంశంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ భవనాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ భవనాలు సైతం అద్దె భవనాల్లోనే సొంత భవనాల ఏర్పాటుపై దృష్టి సారించని ప్రభుత్వం నివేదిక పంపారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాల విషయమై ఉన్నతాధికారులకు గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు నివేదికలు పంపారు. సొంత భవనాలు కేటాయిస్తే రిజిస్ట్రేషన్ శాఖపై అద్దె భారం తగ్గుతుంది. – బి.శ్రీనివాసులు, జిల్లా రిజిస్ట్రార్ -
మామిడి పండు.. ఏమారితే రోగాలు మెండు
అనంతపురం అగ్రికల్చర్/తాడిపత్రి రూరల్/హిందూపురం: వేసవి ఫలరాజు ‘మామిడి’ మార్కెట్లోకి వచ్చింది. ఏడాదిలో రెండు మూడు నెలలు కనిపించే నిగనిగలాడే మధురమైన మామిడిని ఆస్వాదించేందుకు జనం రెడీగా ఉన్నారు. ఫలాలన్నింటిలోకి ప్రత్యేక స్థానం కలిగిన ‘మామిడి’ ప్రస్తుతం కొందరి స్వార్థం కారణంగా కలుషితమై ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లకు వచ్చే మామిడి కాయలను సంప్రదాయ రీతుల్లో కాకుండా కృత్రిమ విధానాల్లో మగ్గిస్తుండడమే ఇందుకు కారణం. ఉమ్మడి జిల్లాలో విస్తారంగా.. ఉమ్మడి జిల్లాలో దాదాపు 84వేల ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. జిల్లాలో చీనీ తరువాత అతిపెద్ద వాణిజ్య పంటగా మామిడిని రైతులు పండిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, పెద్దవడుగూరు, బుక్కరాయసముద్రం, నార్పల, గుత్తి, తాడిపత్రి, యల్లనూరు మండలాలు, శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ, ధర్మవరం, రొద్దం, చిలమత్తూరు, హిందూపురం, కదిరి, తలుపుల, ఎన్పీకుంట, తనకల్గు, ముదిగుబ్బ తదితర మండలాల్లో అత్యధికంగా సాగులో ఉంది. కాయలతో ఉన్నా తోటలను వ్యాపారులు హోల్సేల్గా కొనుగోలు చేస్తున్నారు. మోతాదు మించితే ఇథలిన్ కూడా ప్రమాదకరమే గతంలో రైతులు శాసీ్త్రయ పద్ధతుల్లో మామిడి కాయలను మగ్గించి విక్రయాలు సాగించేవారు. ఆ తర్వాత టోకుగా తోటల్లోని ఫలసాయాన్ని కొనుగోలు చేసిన వ్యాపారులు కాల్షియం కార్బైడ్ ద్వారా 24 గంటల్లోపు మామిడి కాయలను మగ్గించి ప్రజారోగ్యంతో చెలగాటమాడసాగారు. ఈ క్రమంలో ఇథలిన్ గ్యాస్ వినియోగం అందుబాటులోకి వచ్చింది. కాల్షియం కార్బైడ్తో మగ్గించిన కాయల కంటే ఇథలిన్ గ్యాస్ వినియోగం ద్వారా దుష్ఫలితాలు తగ్గాయి. అయితే మోతాదుకు మించి ఇథలిన్ గ్యాస్ వినియోగిస్తే అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ తదితర వ్యాధుల బారిన పడే ప్రమాదముంటుందని పేర్కొంటున్నారు. మూతపడుతున్న రైపనింగ్ సెంటర్లు ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇథలిన్ గ్యాస్ రైపనింగ్ సెంటర్లు పలు సాంకేతిక కారణాలతో మూతపడుతున్నాయి. తాడిపత్రిలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఇథలిన్ రైపనింగ్ సెంటర్ కేవలం రెండేళ్లు కూడా నడవలేదు. మునిసిపాలిటీ ఆధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఈ సెంటర్ కాస్త మూతపడింది. ఈ క్రమంలోనే ఇథలిన్ గ్యాస్తో పండ్లను మాగబెట్టడం ఖర్చుతో కూడుకుంటోందనే నెపంతో జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు తిరిగి కాల్షియం కార్బైడ్ ఉపయోగిస్తున్నారు. ఈ విషయం తెలిసినా మునిసిపల్ ఆధికారులు పట్టించుకోవడం లేదు. మామిడి పండ్లు మామిడి పండ్ల నిగనిగల వెనుక పొంచి ఉన్న అనారోగ్యం పక్వానికి రాకమునుపే రసాయనాల ద్వారా మాగబెడుతున్న పరిస్థితి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న నిపుణులు ఉమ్మడి జిల్లాలో 84వేల ఎకరాల్లో మామిడి సాగు -
భార్య గొంతు కోసిన భర్త
అనంతపురం సెంట్రల్: అనంతలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గొంతు కోసిన భర్త ఉదంతం మంగళవారం శ్రీనివాసనగర్ సైఫుల్లా బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. నగరంలోని రాజీవ్కాలనీలో నివాసముంటున్న రాజేష్, తేజస్విణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 14 ఏళ్ల క్రితం ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లారీ డ్రైవర్గా రాజేష్ పనిచేస్తుండగా.. సైఫుల్లాబ్రిడ్జి సమీపంలో ఓ బిర్యాని సెంటర్లో తేజస్విణి పనికి వెళుతోంది. కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తరుచూ గొడవలు జరిగేవి. దీంతో వారం రోజులుగా తేజస్విణి నగరంలోని ఓ పీజీలో ఉంటూ పనికి వెళుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సదరు బిర్యానీ సెంటర్ వద్ద పనిలో ఉండగా రాజేష్ వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. మాటమాట పెరిగి అక్కడే ఉన్న కత్తితో ఆమె గొంతుపై దాడి చేశాడు. అదే సెంటర్లో పనిచేస్తున్న యువకుడు లక్ష్మీనారాయణ అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అతనిపై కూడా దాడి చేయడంతో చేతికి తీవ్ర గాయమైంది. స్థానికులు స్పందించి హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తేజస్విణి పరిస్థితి మెరుగు పడుతోందని వైద్యులు తెలిపారు. నిందితుడు రాజేష్ను అరెస్ట్ చేసినట్లు త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్యాదవ్ తెలిపారు. ఘటనపై పూర్తిగా విచారిస్తున్నట్లు వివరించారు. అనంతలో ఘాతుకం త్రుటిలో తప్పిన ప్రాణాపాయం -
వైభవం.. గావుల మహోత్సవం
● భక్తులతో కిటకిటలాడిన పోతలయ్యస్వామి ఆలయ ప్రాంగణం కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లిలో మంగళవారం పోతలయ్యస్వామికి గావుల మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పోతలయ్యస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత మహిళలు, యువకులు జ్యోతులు, బోనాలతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం పోతురాజులు ఉరుముల శబ్ధాలకు నృత్యాలు చేసుకొంటూ వచ్చి ఆలయం ముందు మేకపోతు పిల్లలను బలి ఇచ్చి గావుల మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ దృశాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. -
పరవశింపజేసిన సంగీత విభావరి
ప్రశాంతినిలయం: సాయికుల్వంత్ సభామంటపంలో రెండో రోజూ తమిళ నూతన సంవత్సర వేడుకలు వైభవంగా సాగాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం ప్రముఖ సంగీత విద్వాంసురాలు కీర్తనా భరద్వాజ్ కర్ణాటక సంగీత కచేరీతో భక్తులను మైమరిపించారు. సంప్రదాయ తేవారంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె శాశ్వతమైన తమిళ భక్తి గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు. అనంతరం బ్రోచేవారెవరురా, మోక్షము కలదా కృతులతో భక్తి భావాన్ని ఆవిష్కరించారు. కీర్తనా భరద్వాజ్ బృందాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, ఆయన భార్య హిమవాహిణి ఘనంగా సత్కరించారు. -
అంబేడ్కర్ స్ఫూర్తితో సమగ్రాభివృద్ధికి చర్యలు
అనంతపురం ఎడ్యుకేషన్: నవ భారత నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలోని డీపీఆర్సీ సమావేశ హాలులో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఓ. ఆనంద్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వెంకటప్ప, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలు రామాంజమ్మ, జిల్లా/డివిజన్ ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ సెల్ సభ్యుడు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ అంకె ఈశ్వరయ్య, దూదేకుల సంఘం సభ్యుడు ఇమామ్ హుస్సేన్, విశ్వకర్మ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కుర్లపల్లి రంగాచారి, రజక కార్పొరేషన్ డైరెక్టర్ పరమేశ్వర్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేడ్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. అంబేడ్కర్ భవనం, బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ/ఎస్టీ సబ్–ప్లాన్, హాస్టల్స్కు సంబంధించిన అంశాలను పరిశీలించినట్లు తెలిపారు. నంబర్–3 హాస్టల్ మూసివేత అంశాన్ని పరిశీలించి, అవసరమైతే వచ్చే ఏడాది నుంచి అద్దె భవనంలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. జిల్లాలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయ, ఏడాదికి 4 బాల్య వివాహాలు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ ద్వారా అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ భవన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో అనంతపురం ఆర్డీఓ కేశవ నాయుడు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జ్ అధికారి శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ శైలజ, వ్యవసాయ శాఖ జేడీ రవికుమార్, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, డ్వామా పీడీ సలీంబాషా, ప్రజా సంఘాల నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ ఓ.ఆనంద్ -
గుత్తి కేంద్రంగా రేషన్ దందా
గుత్తి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుత్తి కేంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం దందా ఊపందుకుంది. మండలంలో టీడీపీకి చెందిన ముగ్గురు వ్యక్తుల కనుసన్నల్లోనే ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ చౌక దుకాణాల నుంచి పేదలు తీసుకున్న బియ్యాన్ని తమ ఏజెంట్ల ద్వారా కిలో రూ.15 నుంచి రూ.17 చొప్పున కొనుగోలు చేసి ఓ చోట డంప్ చేస్తారు. ఓ బస్తాకు 50 కిలోల చొప్పున బియ్యాన్ని నింపి 500 బస్తాలు అయ్యాక మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గుత్తి మండలం ఎంగిలిబండ వద్ద డంప్ చేసిన 550 బస్తాల రేషన్ బియ్యాన్ని సోమవారం రాత్రి స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులోనూ కేవలం 88 బస్తాల బియ్యం మాత్రమే సీజ్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. మామూళ్ల మత్తులో పట్టించుకోని అధికారులు రేషన్ బియ్యం అక్రమ దందాలో ప్రతి నెలా పోలీసులు, రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో మామూళ్ల మత్తుకు అలవాటు పడిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు అండగా నిలవడంతో రేషన్ బియ్యం దందా ఊపందుకుంది. విషయం గుట్టుచప్పడు కానంత వరకూ అంతా బాగానే ఉంటుంది. ఒక్కసారి బయటపడితే మాత్రం అధికారులు మాయ చేసి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకు నిదర్శనమే ఎంగిలిబండ వద్ద సోమవారం రాత్రి అధికారులు స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం డంప్. అక్కడి నిర్జన ప్రదేశంలో 550 బస్తాల రేషన్ బియ్యాన్ని డంప్ చేసినట్లుగా స్థానికులు గుర్తించి పక్కా సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. దీంతో ఓ ఎస్ఐ అక్కడకు వెళ్లి రేషన్ బియ్యం కనిపించలేదని వెనుదిరిగారు. కాసేపటి తర్వాత మరో ఎస్ఐ, సిబ్బంది అక్కడకు చేరుకుని 88 బస్తాలు మాత్రమే ఉన్నాయంటూ సీజ్ చేయించారు. అయితే 550 బస్తాలు ఉన్నట్లు సమాచారం ఇస్తే కేవలం 88 బస్తాలు మాత్రమే సీజ్ చేయడం వెనుక స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 462 బస్తాల రేషన్ బియ్యం ఏమయ్యాయో అంతు చిక్కడం లేదు. నెల రోజుల క్రితం కూడా ఎంగిలిబండ సమీపంలో 150 బస్తాల రేషన్ బియ్యం డంప్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం అందుకున్న చాలాసేపటి తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని 60 బస్తాలు మాత్రమే పట్టుబడినట్లు వెల్లడించారు. ఈ అంశంలో తలెత్తిన అనుమానాలు వీడక ముందే తాజాగా 462 బస్తాల రేషన్ బియ్యం లెక్క తేలకపోవడంతో ఈ అక్రమ దందా వెనుక రెవెన్యూ, పోలీసుల సహకారం ఉందనే అనుమానాలు బలపడ్డాయి. పేదల ఆకలి తీర్చేందుకు చౌకధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. ఏకంగా రాష్ట్ర సరిహద్దులు దాటి పోతోంది. గుత్తి కేంద్రంగా జరుగుతున్న ఈ అక్రమ దందా వెలుగు చూడడంతో స్థానికులు అవాక్కవుతున్నారు. అయితే అక్రమార్కులకు అధికారులు అండగా నిలవడంతోనే రేషన్ బియ్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమంగా డంప్ చేసిన రేషన్ బియ్యం పట్టివేత అక్రమార్కులకు అధికారుల అండ 550 బస్తాల డంప్ నుంచి కేవలం 88 బస్తాలు సీజ్ 462 బస్తాల రేషన్ బియ్యం మాయంపై అనుమానాలు -
రసాయనాలతో మాగబెడుతున్న పరిస్థితి
మామిడి పండ్లు సహజంగా పక్వానికి రాకముందే వ్యాపార ధోరణితో కొందరు త్వరగా మాగేలా కృత్రిమ పక్వం (ఆర్టిఫిషియల్ రైపనింగ్) చేస్తున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. కృత్రిమంగా మాగబెట్టడానికి చాలా మంది కాల్షియం కార్బైడ్ వాడుతున్నారు. ఇది తేమ తగిలినపుడు అసిటిలిన్ వాయువు విడుదల చేస్తుంది. ఈ వాయువు పండ్లను త్వరగా పసుపు రంగులోకి మారేలా చేస్తుంది. రూ.80 ఖర్చుతో ఒక కిలో కాల్షియం కార్బైడ్ ద్వారా 5 నుంచి 10 టన్నుల వరకు మామిడి కాయలను కేవలం 24 గంటల్లోనే మాగబెట్టవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, చర్మ అలర్జీలు వస్తాయి. దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులపై అనారోగ్య ప్రభావం అధికంగా ఉంటుంది. క్యాల్షియం కార్బైడ్ను నిషేధించినా కొందరు రహస్యంగా వాడుతూనే ఉండడం ఆందోళనకరం. – ఆర్.శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వినియోగదారుల సంఘాల సమాఖ్య -
● అధినేతతో భేటీ
గుంతకల్లు టౌన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి కుమార్తె, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి కలిశారు. కూలీల సంఖ్య పెంచాలి : డ్వామా పీడీ శింగనమల: ఇప్పటి వరకూ పూర్తి చేసిన ఉపాధి హామీ పనులకు సంబంధించి బిల్లులు త్వరగానే అందిస్తామని డ్వామా పీడీ సలీంబాషా తెలిపారు. మంగళవారం శింగనమలలో చేపట్టిన ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. మస్టర్లను పరిశీలించి, హాజరును తనిఖీ చేశారు. కూలీల సంఖ్య మరింత పెంచాలని సిబ్బందికి సూచించారు. ఎండలు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పనులకు త్వరగా ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని కూలీలకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు మాట్లాడుతూ.. పని ప్రాంతంలో నీడ కోసం టార్పాలిన్ పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఓ భాగ్యలక్ష్మి, టీఏ అనిల్, సిబ్బంది పాల్గొన్నారు. బైకు అదుపు తప్పి యువకుడి మృతి ఉరవకొండ రూరల్: రోడ్డుకు అడ్డుగా వచ్చిన గేదెను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామానికి చెందిన అశోక్ (36) సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఉరవకొండకు బయలుదేరాడు. పట్టణ సమీపంలోని శ్మశాన వాటిక వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా వచ్చిన గేదెలను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐచర్ను ఢీకొన్న బొలెరో – ఒకరి మృతివిడపనకల్లు: ఐచర్ను బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లి వద్ద ఐచర్ వాహనం మరమ్మతులకు లోను కావడంతో 42వ జాతీయ రహదారి పక్కన డ్రైవర్ ఆపేశాడు. ఈ క్రమంలో మంగళవారం బళ్లారి వైపు నుంచి వేగంగా వస్తున్న బొలెరో వాహన డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఐచర్ను ఢీకొన్నాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బొలెరో వాహన డ్రైవర్ను స్థానికులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని తమిళనాడుకు చెందిన సుందరమూర్తిగా (47) గా పోలీసులు గుర్తించారు. ఘటనపై విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ ప్రయాణికుడికి జరిమానా కదిరి అర్బన్: ఆర్టీసీ బస్సులో కోళ్లను బెంగళూరుకు తరలిస్తున్న ఓ ప్రయాణికుడికి మంగళవారం ఆ సంస్థ విజిలెన్స్ అధికారులు జరిమానా విధించారు. ఉమ్మడి జిల్లాలఆర్టీసీ విజిలెన్స్ అధికారి శ్రీనివాసులు, సిబ్బంది ప్రవీణ్కుమార్... మంగళవారం గౌనిపల్లి వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కదిరి డిపోకు చెందిన బస్సు డిక్కీలో 46 కోళ్లను బెంగళూరుకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. సజీవ మూగజీవాలు, పక్షులను ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లకూడదని వారు తెలిపారు. లగేజీపై జరిమానా, మూగజీవాలను అక్రమంగా తరలించడం రెండూ కలిపి రూ. 1,750 జరిమానా విధించి వివరణ తీసుకుని పంపిచేశారు. -
కొనే ముందు పరిశీలించాలి
మామిడి పండ్లను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు ఒకసారి పరిశీలించాలి. సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువకాలం నిల్వ ఉండడమే కాక తియ్యటి వాసనతో ఉంటాయి. కృత్రిమంగా మాగిన మామిడి పండ్లలో పై పొర ముడతలు లేకుండా గట్టిగా ఉంటుంది. తొక్కపై నల్లని చుక్కలు కనిపిస్తాయి. అలాగే మామిడి పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15 నుంచి 20 నిముషాల పాటు ఉంచి తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడిలేకుండా తుడిచిన తర్వాత వాటిని తినాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. – మహేష్, ఉద్యాన అధికారి, హిందూపురం -
రెడ్బుక్తో అరాచక పాలన
అనంతపురం: దేశంలోని అన్ని రాష్ట్రాలూ అంబేడ్కర్ రాజ్యాంగం నడుస్తుంటే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అరాచకాలకు పరాకాష్టగా నిలుస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఇందుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ అందరికీ సమాన హక్కులు కల్పించేలా భారత రాజ్యాంగం రూపొందించిన అంబేడ్కర్ తరతరాలకు స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. అంబేడ్కర్ స్ఫూర్తితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత మంత్రి వర్గంలోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ, సంక్షేమ పథకాల్లోనూ బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని ప్రశంసించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి.. రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పీఏసీ సభ్యులు వై.విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ మేయర్ వసీం, మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, వెన్నం శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, పూజారి రాజశేఖర్ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, రంగంపేట గోపాల్రెడ్డి, నాగార్జునరెడ్డి, ఎద్దుల అమరనాథరెడ్డి, గోగుల రాధాకృష్ణ, చంద్రశేఖర్ యాదవ్, కై లాష్, జిల్లా అధికార ప్రతినిధులు సీపీ వీరన్న, చింతకుంట మధు, నాటక అకాడమీ మాజీ చైర్పర్సన్ రాగే హరిత, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్ పర్సన్ మంజుల, రాధాయాదవ్, సాకే చంద్రలేఖ, అంజలి, శోభారాణి, ముక్తియార్, అనిల్కుమార్ గౌడ్, క్రిస్టియన్ మైనార్టీ నేత చిలకల థామస్, పసలూరు ఓబులేసు, పార్టీ నేతలు భారతి, ప్రియాంకరెడ్డి, భారతిరెడ్డి, మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టుబడి తానీషా, పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శంకరయ్య పాల్గొన్నారు. -
చిరు ధాన్యాలపై చిన్నచూపు
● పప్పుధాన్యాల్లో కంది, పప్పుశనగకే ప్రాధాన్యత అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యవసాయంలో చిరుధాన్యాలు (మిల్లెట్స్) పంటలపై చిన్నచూపు కొనసాగుతుండగా, పప్పుధాన్యాల (పల్సస్) పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గుతోంది. మిల్లెట్స్లో సజ్జ, రాగి, కొర్ర, అండుకొర్ర, ఆరిక, సామ, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు ఉండగా అందులో ప్రస్తుతం మొక్కజొన్నకే రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే పల్సస్లో పెసర, అలసంద, మినుము, కంది, పప్పుశనగ, సోయా, అనుము తదితర పంటలు ఉండగా అందులో కంది, పప్పుశనగ సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ‘మిల్లెట్స్–పల్స్’లో రెండు మూడింటిపై రైతులు మొగ్గుచూపుతుండగా మిగతావన్నీ నామమాత్రంగా సాగవుతున్నాయి. జిల్లాలో ప్రధానపంటగా 30 ఏళ్ల పాటు లక్షలాది ఎకరాల సాగుతో ఓ వెలుగు వెలిగి ప్రపంచ దృష్టి ఆకర్షించిన వేరుశనగ ఇప్పుడు క్షీణించే దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో సాగవుతున్న వేరుశనగ నేడు నాలుగు లక్షల ఎకరాల కనిష్ట స్థాయికి పతనం కావడం గమనార్హం. పంటల వైవిధ్యానికి చిరునామా ‘అనంత’ వ్యవసాయ రికార్డులు పరిశీలిస్తే... 1960 నుంచి 1980 వరకు పంటల వైవిధ్యానికి అనంతపురం జిల్లా కేరాఫ్గా నిలిచింది. ఖరీఫ్ వచ్చిందంటే చాలు 25 నుంచి 30 రకాల పంటలతో పంటల వైవిధ్యతను చాటుకుంది. 1985 తర్వాత వేరుశనగ సాగు క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2005 నాటికి ఏకపంటగా విస్తరించిన వేరుశనగ దెబ్బకు మిగతా పంటలన్నీ కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. 2010 తర్వాత వివిధ కారణాలతో వేరుశనగ సాగు తగ్గుదల నమోదవుతోంది. వేరుశనగ తగ్గడంతో మరోసారి పంటల సరళి మారుతోందని భావించినా.. చిరుధాన్యాల్లో మొక్కజొన్న, పప్పుధాన్యాల్లో కందికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కనీసం రాగి, జొన్న, సజ్జ, కొర్ర, అలాగే పెసర, అలసంద, మినుము, ఉలవ లాంటి పంటలు పెరిగితే మరోసారి పంటల వైవిధ్యం స్పష్టంగా గోచరిస్తుంది. వీటి పరిస్థితి ఇలా ఉండగా.. వరి సాగు మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు స్థిరంగానే ఉండటం గమనార్హం. అప్పట్లో బోరు బావుల కింద ప్రతి రైతూ అంతో ఇంతో సాగు చేస్తుండగా ఇప్పుడు ఆయకట్టు ప్రాంతాలకే వరి పరిమితమైనా సాగు విస్తీర్ణం కాస్త ఇటుగా పయనం సాగిస్తోంది. అప్పట్లో చిరుధాన్యాల శకం 1960 దశకంలో రాగి, జొన్న, సజ్జ, కొర్ర, అండుకొర్ర, ఆరిక, సామ తదితర మైనర్ అండ్ మేజర్ మిల్లెట్స్ (చిరుధాన్యాలు) ఏకంగా 15 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అప్పట్లో వేరుశనగ 5 లక్షల ఎకరాలకు మించి సాగు చేయలేదు. వరుస కరువులు, వర్షాభావం, వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, రైతుల ఆలోచన విధానాల మార్పుల కారణంగా పంటల సరళి విభిన్నంగా కొనసాగింది. 2000 సంవత్సరానికి అటు ఇటుగా వేరుశనగ పంట ఏకంగా 20 లక్షల ఎకరాలకు ఎగబాకడం, చిరుధాన్యపు పంటలన్నీ కలిపినా 50 వేల ఎకరాలకు పరిమితం కావడం చూస్తే వేరుశనగ దూకుడు ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతోంది. జిల్లాలో ఎక్కడ చూసినా వేరుశనగ తప్ప మిగతా పంటలు కనిపించని పరిస్థితికి చేరాయి. విస్తీర్ణం తగ్గిపోయిన వేరుశనగ స్థానంలో ఇప్పుడు కంది, మొక్కజొన్న, ఆముదం లాంటి పంటలు ఆక్రమించాయి. చిరుధాన్యపు పంటల విస్తీర్ణం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా ఆచరణలోకి రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆ అధికారి వికృతంగా ప్రవర్తిస్తున్నాడు. కిందిస్థాయి అమాయక మహిళా ఉద్యోగులను వేధిస్తున్నాడు. పలువురు బాధితుల కుటుంబ సభ్యులు బడిత పూజ చేసినా.. ఆ అధికారిలో ఏమాత్రమూ మార్పు రావడం లేదు.
తాడిపత్రి టౌన్: మున్సిపాలిటీలోని ఓ అధికారి వేధింపులకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. మహిళ అందంగా కనిపిస్తే చాలు తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. ఇప్పటికే పలువురు మహిళల పట్ల వికృతంగా ప్రవర్తించారు. తాజాగా ఓ అమాయకురాలిపై కన్నేయగా...ఆమె భర్త సదరు అధికారికి దేహశుద్ధి చేశాడు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓ సచివాలయంలో పనిచేసే యువతి మున్సిపల్ కార్యాలయానికి అటాచ్డ్ కింద డ్యూటీ వేయించుకున్నారు. అక్కడ ఓ కీలక అధికారి ఆమె అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని తన మనసులోని కోరిక బయటపెట్టాడు. దీంతో ఆమె దిగ్భ్రాంతికి గురై విషయాన్ని భర్తకు చెప్పి విలపించింది. ఆగ్రహావేశాలకు లోనైన భర్త ఆ అధికారి ఇంటికెళ్లి దేహశుద్ధి చేశాడు. వేధింపుల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా అధికార పార్టీ నేత ఒకరు జోక్యం చేసుకుని బయటకు రాకుండా ‘పంచాయితీ’ చేశాడు. ● మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ యువతిని సైతం సదరు కీలకాధికారి ఫోన్ ద్వారా లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. కొన్ని నెలలుగా జీతం పెండింగ్ ఉండటంతో ఆ అధికారికి ఫోన్ ద్వారా వివరించడమే ఆమె తప్పయ్యింది. దీన్ని అలుసుగా తీసుకొని వేధింపులకు ప్రయత్నించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన యువతి విషయాన్ని భర్తకు తెలిపింది. ఆయన ఏకంగా కార్యాలయానికి వచ్చి గొడవకు దిగాడు. అప్పుడు కూడా అధికార పార్టీ నాయకుడు కల్పించుకుని ‘సర్దుబాటు’ చేశాడు. అందంగా కనిపిస్తే వేధింపులే.. మున్సిపల్ కార్యాలయంలో ఆ అధికారి అంటే మహిళా ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు హడలెత్తిపోతారు. మహిళా ఉద్యోగులు కాస్త అందంగా కనిపిస్తే చాలు ఆ అధికారి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కోక తప్పదు. ఒంటరిగా కార్యాలయంలోకి వెళ్లాలంటే హడలెత్తిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చాంబర్లోకి వెళ్లిన వారికి ఆ అధికారి వక్ర చూపు, రెచ్చగొట్టే మాటలు, జుగుప్సాకర చేష్టలతో తన వాంఛ తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ● గతంలో ఓసారి పురపాలక సంఘంలో పురుషుల స్థానంలో మహిళా ఉద్యోగులను నియమించుకోవాలని కీలక అధికారి భావించాడు. తన ఆలోచనను అధికార పార్టీ నాయకునికి చెప్పి ఒత్తిడి చేశాడు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. సచివాలయ ఉద్యోగులే టార్గెట్ తాడిపత్రి ప్రాంతంలోని సచివాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను ఆ కీలకాధికారి టార్గెట్ చేశారు. సాధారణంగా సాయంత్రం 5 గంటలలోపు సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ అధికారి మాత్రం సాయంత్రం 5 తరువాతే సమావేశాలు, సమీక్షలంటూ సచివాలయ ఉద్యోగులను పిలిపించుకుంటాడు. కొన్నిసార్లు రాత్రి 8 గంటలైనా కొనసాగిస్తుంటాడు. ఈ అధికారి వైఖరితో మహిళా ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. అంతేకాదు భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీసిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. తన ప్రవర్తనతో తరచూ గొడవలు గతంలో ఆ కీలకాధికారి ప్రభుత్వ క్వార్టర్స్లో నివాసం ఉండేవాడు. అప్పట్లో పొదుపు సంఘంలో పనిచేస్తున్న ఓ మహిళను పలు రకాలుగా భయపెట్టి లోబరుచుకున్నాడు. ఈ విషయం తెలిసిన మరో ఉద్యోగి కూడా అమెను బ్లాక్మెయిల్ చేసి తానూ సన్నిహితంగా మెలిగాడు. ఈ వ్యవహారం అధికారికి తెలిశాక ఉద్యోగితో గొడవకు దిగాడు. కొన్నిరోజుల తరువాత క్వార్టర్స్లో ఇంటి పనిచేస్తున్న యువతితో కీలకాధికారి సన్నిహితంగా మెలిగాడు. విషయం తెలుసుకున్న మహిళ భర్త.. సదరు అధికారిని నిలదీసి.. మర్యాద తీస్తానని బెదిరించాడు. ఇంతలో అధికార పార్టీ నాయకుడు జోక్యం చేసుకొని సద్దుమణిగించాడు. ఈ తతంగం చుట్టుపక్కల వారికి తెలియడంతో క్వార్టర్స్ ఖాళీ చేసి.. తన కార్యాలయానికి సమీపంలో అద్దె ఇంటికి మకాం మార్చాడు. ఇల్లు మారినా ఆ అధికారి బుద్ధి మాత్రం మారలేదు. భార్య లేని సమయంలో ఇంట్లోనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాడు. ఇంటి యజమాని గమనించి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడు. దీంతో మరో ఇంటికి మారాడు. అక్కడా పాత పద్ధతే కొనసాగిస్తున్నాడు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆ అధికారి లైంగిక వేధింపుల నుంచి తమకు విముక్తి కల్పించాలని బాధిత ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళా ఉద్యోగులు అందంగా కనిపిస్తే అంతే.. రెచ్చగొట్టే మాటలు.. జుగుప్సాకర భాషతో వెకిలి చేష్టలు ఇదీ తాడిపత్రిలో కీలక అధికారి తీరు దుమారం రేగిన ప్రతిసారీ అధికార పార్టీ నేత ‘దుప్పటి పంచాయితీ’ -
పోజులివ్వకుండా చెత్తసేకరణపై దృష్టి పెట్టాలి
బొమ్మనహాళ్: పంచాయతీ కార్యదర్శులు ఫొటోలకు పోజివ్వకుండా చెత్త సేకరణపై దృష్టి పెడితే గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడుతుందని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు సూచించారు. జిల్లాలోని 30 మంది పంచాయతీ కార్యదర్శులకు గ్రామ స్ధాయిలో పారిశుధ్యం మెరుగు పరచడం, ప్రజల్లో శుభ్రతపై సానుకూల భావన పెంపొందించడమే లక్ష్యంగా రెండో రోజు శిక్షణను మంగళవారం ఉంతకల్లులోని చెత్త సంపద తయారీ కేంద్రం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ ఫొటోలకు పోజులు ఇవ్వడంపై కాకుండా గ్రామాల్లో చెత్త సేకరణపై కచ్చితమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వారానికి మూడు రోజులపాటు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే శుభ్రత సాధ్యమవుతుందని చెప్పారు. విడతల వారీగా ఈ నెల 18వరకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటి ఎంపీడీఓ వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి పల్లవి తదితరులు పాల్గొన్నారు. -
తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత ఆదాయం
● ఇసుక, చెరువు మట్టిని తోడేస్తున్న ‘తమ్ముళ్లు’ ● రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నా పట్టని అధికారగణం పెద్దవడుగూరు : చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అధికార టీడీపీ నాయకులు ఆదాయమే పరమావధిగా సహజ వనరులను కొల్లగొడుతున్నారు. పెన్నా నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను, చెరువుల్లోంచి సారవంతమైన మట్టిని తోడేసి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ వనరులను కాపాడాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. మండలంలోని గుత్తి అనంతపురం, జి.వెంకటాంపల్లి, కొండూరు, చిట్టూరు తదితర ప్రాంతాల నుంచి ఇసుకను రాత్రి వేళల్లో అనంతపురం, పామిడి, గుత్తి, తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాజాగా జి.వెంకటాంపల్లి చెరువు మట్టిపై కన్నేశారు. సాధారణంగా బీడుభూములకు, లోతట్టు ప్రాంతాలకు చెరువులోని సారవంతమైన ఒండ్రుమట్టిని రైతులకు అవసరమైనప్పుడు ఉచితంగానే తోలుకోవచ్చు. అయితే ఇక్కడ రైతులు కాకుండా ‘పచ్చ’ నేతలు రంగంలోకి దిగారు. జేసీబీలు పెట్టి చెరువు మట్టిని రాత్రి, పగలు అనే తేడా లేకుండా తవ్వి.. ట్రాక్టర్ల ద్వారా తరలించి రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. -
శేషవాహనంపై శ్రీవారు
బొమ్మనహాళ్: మండల కేంద్రంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో మంగళవారం శ్రీవారు శేష వాహనంపై విహరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో పవిత్ర గంగాజలాభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక అలంకరణ, మంగళ హారతి, తీర్ధప్రసాదాలు, అన్నసంతర్పణ నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన శేషవాహనంపై శ్రీవారిని కొలువుదీర్చి పుర వీధుల్లో ఊరేగింపు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. నేడు ఇంటర్ ఫలితాలు అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు బుధవారం ఉదయం 10.31 గంటలకు విడుదల చేయనుంది. జిల్లాలో వేలాదిమంది విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్ BIEAP Results Portal ద్వారా హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశం కల్పించారు. ఇందుకోసం 95523 00009 నంబర్కు Hi అని మెసేజ్ పంపితే ఫలితాలు అందుతాయి. ఫలితాల విడుదల సమయంలో వెబ్సైట్పై భారీ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఓపికగా ప్రయత్నించాలని అధికారులు సూచించారు. పెద్దమ్మా.. కరుణించమ్మా..!అనంతపురం కల్చరల్: నగరంలోని ఐదోరోడ్డులోని పెద్దమ్మ జాతర మంగళ వారం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోనాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. నిర్వాహకులు రంగా, సాయి, ఆంజనేయులు, నాగరాజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ ఆత్మకూరు: పంపనూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్కుమార్రెడ్డిని కుప్పం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న అభియోగంతోనే అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు ఫిర్యాదు చేశారు.. ఏ విషయం అనేది కుటుంబ సభ్యులకు సమాచారం తెలపకుండా గిరీష్కుమార్రెడ్డిని అరెస్టు చేయడం అనుమానాలకు తావిస్తోంది. వైభవంగా దేవమ్మదేవి జాతర బొమ్మనహాళ్: సిద్దరాంపురంలో మంగళవారం దేవమ్మ దేవి దేవర ఘనంగా ప్రారంభించారు. భక్తులు మేళాతాళాలతో ఇళ్ల నుంచి బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భారీగా వచ్చిన జనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ్రెడ్డి అమ్మవారికి దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. బుధవారం తెల్లవారుజామున జంతు బలిదానం చేయనున్నట్లు కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామాంజనేయులు, నాయకులు జయరామ్రెడ్డి, కోటేశ్వరరెడ్డి, ఆంజనేయులు, వెంకటేశులు, సురేష్, డాక్టర్ బసప్ప, ఫొటో బసవరాజు, నాగరాజు, హరి, ప్రసాద్ రెడ్డి, విశ్వనాథ్రెడ్డి, సూర్యప్రతాప్రెడ్డి, ముక్కన్న, రామ్చరణ్ పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణపై చైతన్య పరచండి
అనంతపురం అర్బన్: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్య పరచాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లు, బ్రోచర్లను జేసీ ఆవిష్కరించి, మాట్లాడారు. అగ్ని ప్రమాదాల నివారణ పద్దతులను వారోత్సవాల్లో తెలియజేయాలన్నారు. గృహాలు, వంటిల్లు, పాఠశాలలు, వసతి గృహాలు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్లు, గ్యాస్ గోదాములు, గిడ్డంగులు, కర్మాగారాలు, తదితర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, పద్మావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు అనంతపురం సెంట్రల్: అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన తన చాంబర్లో మీడియాతో మాట్లాడారు. అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై వారోత్సవాల్లో ప్రజలను చైతన్య పరచనున్నట్లు తెలిపారు. అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం -
డిజిటల్ రూపంలో తాళపత్ర గ్రంథాలు
అనంతపురం కల్చరల్: జిల్లాలో లభించిన పురాతన తాళపత్ర గ్రంథాలను డిజిటల్ రూపంలోకి మారుస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. వారసత్వ సంపద పరిరక్షణ అంశంపై రాష్ట్ర పురావస్తు, ప్రదర్శనశాల శాఖల అధికారులతో సోమవారం కలెక్టర్ సమీక్షించారు. జిల్లా వాసరత్వ సంపద, సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకోవడాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. చారిత్రాత్మక సంపదను కాపాడుకునేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్ఞాన భారతం కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటూ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా ప్రముఖులను భాగస్వాములను చేస్తూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల వద్ద, దేవాలయాలు, మఠాలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో ఉన్న తాళపత్ర గ్రంథాల వివరాలను పురావస్తుశాఖ అధికారులకు అందించి సహకరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మ్యూజియం శాఖ సహాయ సంచాలకుడు స్వామి నాయక్, నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంతరావు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి నాయుడు, టూరిజం శాఖ అధికారి జయ కుమార్, ఎస్కేయూ రిజిస్ట్రార్ రమేష్బాబు, ఇంటాక్ కన్వీనర్ రాంకుమార్, కో కన్వీనర్ పిడతల కృష్ణమూర్తి తదితరులు సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. -
సూరీడు సలసల
జిల్లా అంతటా 40 నుంచి 43 డిగ్రీలతో భానుడి భగభగలు అనంతపురం అగ్రికల్చర్: మండే ఎండలకు ఉమ్మడి ‘అనంత’ అట్టుడుకుతోంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతుండటంతో జనజీవనం స్తంభించే స్థాయికి చేరుకుంటోంది. వేసవితాపం అధికం కావడంతో ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు, జంతుజాలం విలవిలలాడుతోంది. సోమవారం తాడిపత్రి మండలం తేరన్నపల్లిలో 43.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా అంతటా 40 నుంచి 43 డిగ్రీలతో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. శింగనమల 41.8, నార్పల 41.6, పుట్లూరు 41.4, యల్లనూరు 41.4, విడపనకల్లు 41.3, ఆత్మకూరు 41.1, కళ్యాణదుర్గం 41.1, పెద్ద పప్పూరు 41 డిగ్రీలు...ఇలా తూర్పు, ఉత్తర ప్రాంత మండలాల్లో ఎండ తీవ్రత తారస్థాయికి చేరుకుంది. అనంతపురం, గుంతకల్లు, వజ్రకరూరు, బుక్కరాయ సముద్రం, బొమ్మనహాళ్, గుత్తి, కంబదూరు మండలాల్లో కూడా వేసవితాపం అధికంగా ఉంది. ● శ్రీసత్యసాయి జిల్లాలో కూడా రామగిరి 41.1 డిగ్రీలు, ధర్మవరం 40.6, పుట్టపర్తి 40.5, ఎన్పీ కుంట 40.4, ముదిగుబ్బ 40.2, నల్లమాడ 40.2 డిగ్రీల మేర ఎండ తీవ్రత కొనసాగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 24 నుంచి 29 డిగ్రీల మధ్య నమోదవుతూ సెగలు పుట్టిస్తున్నాయి. వడగాల్పులు కూడా 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో జనానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సూరీడు సలసలమంటున్న పరిస్థితి నెలకొంది. ఏసీలు మినహా ఫ్యాన్లు, కూలర్లు పెద్దగా పనిచేసే పరిస్థితి లేక రాత్రింబవళ్లు జనం ఉడికిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇటీవల వడదెబ్బ మరణాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజులు మరింత భయానకమే ఇప్పుడే ఇలా ఉంటే ఈ నెల 16 నుంచి మొదలయ్యే వైశాఖ మాసం, వచ్చే నెలలో రోహిణి కార్తెలను తలచుకుని జనం మరింత భయపడిపోతున్నారు. ‘ఎల్–నినో’ కారణంగా ఈసారి వేసవితాపం పతాకస్థాయికి చేరుకునే ప్రమాదం ఉన్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఐస్ లేకుండా మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, బత్తాయి లాంటి పండ్లరసాలు, చెరకు రసం లాంటివి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. గొడుగు, టోపీ, మాస్క్ లాంటివి లేకుండా బయటకు రాకూడదని చెబుతున్నారు. ఏ మాత్రం అలసత్వం వహించినా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అనంతపురంలో ఎండకు తట్టుకోలేక స్కార్ఫ్లతో ఇలా..అనంతపురంలో ఎండ సెగకు ఏడుస్తున్న చిన్నారి -
దాహమో.. రామచంద్రా!
ఓ వైపు ఎండలు.. మరోవైపు దాహం ఆ వానరాన్ని ముప్పుతిప్పలు పెట్టాయి. అప్పుడే ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని హోటల్ వైపు వెళ్లింది. అక్కడ జనం హడావుడి కనిపించింది. గొంతెండిపోతుంటే తాళలేక హోటల్లోకి వెళ్లి అక్కడున్న నీళ్ల బాటిల్ను ఎత్తుకుని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని చెట్టు కిందకు చేరుకుంది. అక్కడ బాటిల్ మూత తీసి గుటగుటా తాగుతుండగా.. పక్కనే ఉన్న మరికొన్ని వానరాలు వచ్చాయి. వాటికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బాటిల్లోని నీళ్లన్నీ ఆ ఒక్క వానరమే తాగేసి దాహం తీర్చుకుంది. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – ఉరవకొండ: -
ప్రాణాలు బలిగొన్న ఫిట్స్
తాడిపత్రి రూరల్: మూర్చ వ్యాధి ఒకరి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... యాడికి మండలం రాయలచెరువుకు చెందిన శివశంకర్ కుమారుడు మోహన్కుమార్ (25) తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండడంతో కుటుంబ పోషణ భారాన్ని ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తన స్నేహితుడు మధుతో కలసి పనుల కోసమని ద్విచక్ర వాహనంపై తాడిపత్రికి బయలుదేరాడు. తేళ్లమిట్టపల్లి వద్దకు చేరుకోగానే బైక్ నడుపుతున్న మోహన్కుమార్కు ఫిట్స్ వచ్చాయి. దీంతో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన మోహన్కుమార్, మధును అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మోహన్కుమార్ పరిస్థితి ఆందోళకరంగా ఉండటంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్వల్పంగా గాయపడిన మధు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు. -
దార్శనికుడు వైఎస్ జగన్
అనంతపురం: భవిష్యత్తులో కృష్ణా, తుంగభద్ర జలాలు తగ్గే అవకాశముందని కరువు పీడిత ‘అనంత’ను, అదే విధంగా రాయలసీమలోని తక్కిన జిల్లాలను పరిరక్షించేందు కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను ప్రారంభించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతను ప్రదర్శించారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. సోమవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటాన్ని జీర్ణించుకోలేక మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఓ క్రిమినల్ అని విమర్శించారు. గతంలో ఉరవకొండ ప్రాంతంలో అరాచకాలు రాజ్యమేలాయని, సూడో నక్సల్స్ పేరుతో హత్యాకాండ కొనసాగించారని, ఆఖరుకు పోలీస్స్టేషన్ పక్కనే హత్యలు జరిగిన ఘటనలూ ఉన్నాయని గుర్తు చేశారు. కేశవ్ తరహాలోనే అందరికీ నేర మనస్తత్వం ఉంటుందని భావించి ఇష్టానుసారంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఆయన కమీషన్ల కక్కుర్తి తారస్థాయికి చేరిందని, ఆయన కమీషన్ల మంత్రి అంటూ టీడీపీ నాయకులే మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏడాదిలో హంద్రీ–నీవా లైనింగ్కు రూ.3 వేల కోట్లు ఖర్చు చేశామని కేశవ్ గొప్పలు చెప్పుకుంటుండటం సిగ్గుచేటన్నారు. పనుల్లో ఎక్కడా నాణ్యత లేదన్నారు. నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచారా అని నిలదీశారు. లైనింగ్ పేరుతో హంద్రీ–నీవా నీటిని కుప్పంకు తరలించి ‘అనంత’ రైతుల కడుపు కొట్టారన్నారు. తమ హయాంలో హంద్రీ–నీవా కాలువ నీరు భూముల్లోకి ఇంకడం వల్ల వేలాది మంది రైతుల వ్యవసాయ బోర్లు రీచార్జ్ అయ్యాయని గుర్తు చేశారు. తాజాగా కాలువకు కాంక్రీట్ లైనింగ్ చేయడం వల్ల నీరు ఆగకుండా వెళ్లిపోతుండటంతో ఎక్కడా సమీప భూముల్లోకి ఇంకే అవకాశం లేకుండా చేసి రైతులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు విస్తరణకు అడుగడుగునా అడ్డు హంద్రీ–నీవా ప్రాజెక్ట్ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేస్తే.. టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్ చేపట్టిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడ్డారని విమర్శించారు. తాను చెబితేనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు నిలిపివేశారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారని, సీఎం చంద్రబాబుకు, మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే రేవంత్రెడ్డి చెప్పింది అబద్ధమని చెప్పగలరా అని సవాల్ చేశారు. రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతపై వైఎస్సార్సీపీ చేపట్టిన అవగాహన కార్యక్రమాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. ఏదైనా ప్రాంతం నష్టపోతుందని భావించినపుడు అధికార, ప్రతిపక్ష పార్టీలతో కలిసి పరిరక్షణకు కృషి చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఏదైనా ఒక్కటైనా చేశారా అని నిలదీశారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా రాయలసీమ ఎత్తిపోతల పథకం, అక్రమ కేసులు, మహిళలపై అత్యాచారాలపై ప్రశ్నించి తీరతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, దేవా, ఎస్టీ సెల్ నగర కార్యదర్శి గుజ్జల శివయ్య తదితరులు పాల్గొన్నారు. ‘మావిగన్’ను జీర్ణించుకోలేకే మంత్రుల అవాకులు తారస్థాయికి చేరిన క్రిమినల్ కేశవ్ కమీషన్ల కక్కుర్తి వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం చంద్రబాబు నిర్వాకంతో సీమ ఎడారిగా మారుతోంది మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య -
పేరూరు డ్యాంకు నీటిని విడుదల చేయాలి
ప్రశాంతి నిలయం: ‘‘వరుణుడు కరుణించలేదు..పట్టించుకోవాల్సిన పాలకులూ ఇక్కడి నీటిని హంద్రీనీవా కాలువకు లైనింగ్ వేసి మరీ కుప్పానికి తరలించారు. దీంతో బోర్లన్నీ ఒట్టిపోయి రైతులు పంటలు సాగుచేసుకోలేకపోయారు. నాడు కళకళలాడిన పొలాలన్నీ నేడు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికై నా స్పందించి పేరూరు డ్యాంకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోండి’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి కోరారు. సోమవారం రైతులతో కలిసి పుట్టపర్తికి వచ్చిన ఆయన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ మౌర్య భరద్వాజ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో 65 కిలోమీటర్లు కాలువ తవ్వించి నీటిని విడుదల చేసి పేరూరు డ్యాంను కళకళలాడించామన్నారు. కానీ ప్రస్తుత పాలకులు డ్యాంకు నీరు ఇవ్వకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల సునీత వల్లే రైతులకు అన్యాయం రాప్తాడు కరువు పరిస్థితులకు మాజీ మంత్రి పరిటాల సునీత కారణమని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో తాము రాప్తాడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తే.. నేడు సాగునీరు లేక బీడు భూములు కనిపిస్తున్నాయన్నారు. సాగునీటి సమస్యతో పంటలు సాగుచేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు ఇస్తే కనీసం రెండు పంటలను సాగు చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా... రైతుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. తాము పాపంపేటకు నీళ్లివ్వాలని ప్రయత్నించినప్పుడు ఇళ్లను కూల్చివేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా... పేరూరు డ్యాంకు చుక్క నీరు ఇవ్వలేదన్నారు. హంద్రీనీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేసి నీటిని చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పానికి తరలించారన్నారు. దీంతో గతంలో వంద అడుగుల లోతులోనే బోర్లలో నీళ్లు వచ్చేవని, ప్రస్తుతం 400 అడుగులు వేసినా నీరు రావడం లేదన్నారు. 2018లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు భూమి పూజ చేసినప్పటికీ పూర్తి చేయలేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.170 కోట్లు పనులకు బిల్లులు చేశామన్నారు. అయితే ఒక్క పనీ చేయకుండా పేరూరు డ్యాంకు పరిటాల రవి పేరు పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా భారీగా కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సానే రాజారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రంగంపేట గోపాల్రెడ్డి, మజ్జిగ శంకరయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్రెడ్డి, రామగిరి, కనగానపల్లి జెడ్పీటీసీలు నాగార్జున, మారుతి, పెద్దిరెడ్డి, చంద్రకుమార్, మీనుగ నాగరాజు, రాజేష్, నాగముని, తలమర్ల సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డిమాండ్ రైతులతో కలిసి జేసీకి వినతి పత్రం అందజేత -
పెళ్లింట గొడవ – వ్యక్తిపై దాడి
యల్లనూరు: మండలంలోని కూచివారిపల్లిలో పెళ్లింట గొడవ చోటు చేసుకుని వ్యక్తిపై దాడి జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన టీడీపీ నేత లింగమనాయుడు తమ్ముడి కుమారుడి పెళ్లి ఆదివారం తాడిపత్రిలో జరిగింది. అదే రోజు రాత్రి స్వగ్రామంలో తిరుగింపులు ఉండడంతో బుక్కాపురం గ్రామానికి చెందిన వారికి క్యాటరింగ్ అప్పగించారు. ఈ క్రమంలో క్యాటరింగ్ నిర్వాహకుడు తన సిబ్బంది అంకాల్, మరికొందరితో వంటకాలు సిద్ధం చేయించి ఆదివారం రాత్రి పెళ్లింటికి పంపాడు. అక్కడ ఆహార పదార్థాలను వాహనం నుంచి దింపే విషయంగా అంకాల్ తదితరులు పెళ్లింటి వారిని సాయం కోరారు. ఆ సమయంలో క్యాటరింగ్ సిబ్బందికి లింగమనాయుడి మధ్య గొడవ చోటు చేసుకుంది. అంకాల్పై లింగమనాయుడు చెయ్యి చేసుకున్నాడు. విషయాన్ని తన కుమారులు, సమీప బంధువులకు అంకాల్ చేరవేసి రప్పించుకున్నాడు. దీంతో పెళ్లికి హాజరైన కొడవండ్లపల్లికి చెందిన యంపలాకు శివకేశవ, అతని బావమరిది గడ్డిమడుగు సురేష్ సర్ధి చెబుతుండగా వారిపై క్యాటరింగ్ సిబ్బంది దాడికి ప్రయత్నించారు. దాడి నుంచి తప్పించుకుని శివకేశవ, సురేష్ ఇంటికెళ్లిపోయారు. ఆదివారం రాత్రి 10.30గంటల సమయంలో శివకేశవ ఇంటికి క్యాటరింగ్ సిబ్బంది చేరుకుని కట్టెలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఘటనలో గాయపడిన శివకేశవ ఆస్పత్రికెళ్లి చికిత్స చేయించుకున్న అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిలో వడ్డే చౌడయ్య, అనిల్, అంకరాజు, పెద్దిరాజు, అంకాల్, కుళ్లాయప్ప, రాజు అలియాస్ కుంటి, అర్జున్, మంజులరాజు తదితరులు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. రైల్వే ఉద్యోగులకు అవార్డులు గుంతకల్లు: అంకిత భావంతో విధులు నిర్వర్తించిన రైల్వే ఉద్యోగులకు అవార్డులతో డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా సత్కనించారు. ఈ నెల 8న గుంతకల్లు–బళ్లారి సెక్షన్లోని హద్దనిగుండి రైల్వేస్టేషన్ వద్ద హంపి ఎక్స్ప్రెస్ రైలు చక్రాల నుంచి వెలువడుతున్న పొగలను గుర్తించిన పాయింట్స్మెన్ అనిల్కుమార్ విషయాన్ని వెంటనే అధికారులకు చేరవేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలు హగరి రైల్వేస్టేషన్కు చేరుకోగానే ఆపేయడంతో ట్రాక్ మెంటైనర్ అనిల్కుమార్, టెక్నీషియన్ విక్కీకుమార్ మరమ్మతులు చేసి పెను ప్రమాదాన్ని నివారించారు. ఈ విషయం తెలుసుకున్న డీఆర్ఎం సీఎస్ గుప్తా సోమవారం తన చాంబర్కు పాయింట్స్మెన్ అనిల్కుమార్, ట్రాక్ మెంటైనర్ అనిల్కుమార్, టెక్నీషియన్ విక్కీకుమార్ను రప్పించుకుని అవార్డులను అందజేసి, అభినందించారు. బళ్లారిలో ప్రమాదం.. యువకుడి దుర్మరణం బొమ్మనహాళ్: బళ్లారిలో చోటు చేసుకున్న ప్రమాదంలో బొమ్మనహాళ్ మండలానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. బాధిత కుటుంబసభ్యులు సమాచారం మేరకు... ఉంతకల్లు గ్రామానికి చెందిన వెంకటేశులు, శ్రీదేవి దంపతుల కుమారుడు రవికిరణ్ (17) బళ్లారిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం బళ్లారికి వెళ్లిన రవికిరణ్ అక్కడ స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మోతీ సర్కిల్ వద్దకు చేరుకోగానే కేఎస్ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఘటనలో రవికిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన స్నేహితుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బళ్లారి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిష్కార వేదికకు 169 వినతులుఅనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 169 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. అర్జీలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు మహబూబ్బాషా, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రేపు మెగా జాబ్మేళా అనంతపురం టౌన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్ ఆధ్వర్యంలో ఈ నెల 15న నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు డీఆర్డీఏ పీడీ శైలజ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 10వ తరగతి, ఆ పై విద్యార్హతలతోపాటు డిప్లొమా, బీటెక్, ఐటీఐ విద్యార్హతలున్న వారు అర్హులు. ఎంపికై న వారు బెంగళూరు, పెనుకొండ తదితర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు నగర శివారులోని పంగల్ రోడ్డు వద్ద ఉన్న టీటీడీసీలో బుధవారం జరిగే జాబ్మేళాకు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావచ్చు. -
25 నుంచి సమ్మెలోకి సత్యసాయి నీటి కార్మికులు
వజ్రకరూరు: సత్యసాయి నీటి పథకానికి అవసరమైన బడ్జెట్ కేటాయించి, నిధులు విడుదల చేయాలని, నాలుగు నెలల వేతన బకాయిలు మంజూరు చేయాలంటూ ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళుతున్నట్లు శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికులు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం వజ్రకరూరు తహసీల్దార్ నరేష్కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ గౌస్, ఎస్ఐ నాగస్వామినిను కలసి సమ్మె నోటీసు అందజేసి, మాట్లాడారు. నీటి సరఫరా పథకం నిర్వహణకు ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించలేదని, గత ఏడాదికి సంబంధించి అరకొర నిధులు కేటాయించి పథకాన్ని నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కార్మికులు దుర్భర జీవనం గడుపుతున్నారని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లడం అనివార్యమైందని పేర్కొన్నారు. డిమాండ్లు నెరవేరేవరకూ నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి తాగునీటి పథకం కా ర్మికులు బాబయ్య, జయన్న, చెన్నయ్య, భీమేష్, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్లో వర్షాలు తక్కువే అనంతపురం అగ్రికల్చర్: వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఖరీఫ్ కాలంలో వర్షాలు తక్కువగానే నమోదవుతాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించిందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. లా–నినో బలహీనపడిందని, జూన్ నుంచి ఎల్–నినో ప్రభావం ఉంటుందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవచ్చన్నారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదారు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని, మిగతా మండలాల్లో సాధారణం కన్నా తక్కువగానే వర్షాలు పడవచ్చని పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఖరీఫ్ వ్యవసాయం కీలకం కావడంతో భారత వాతావరణ శాఖ చేదునిజం చెప్పడంపై అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాలకు సంబంధించి ఈ నెలాఖరున స్పష్టమైన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ‘స్పాట్’ రెమ్యూనరేషన్ పెంచాలి ● వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకన విధుల్లో పాల్గొంటున్న స్పెషల్ అసిస్టెంట్లకు అసిస్టెంట్ ఎగ్జామినర్ల (ఏఈ)తో సమానంగా డీఏ, రెమ్యూనరేషన్ ఇవ్వాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి మూల్యాంకన ప్రక్రియలో స్పెషల్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. గతంతో పోలిస్తే వారి పనిభారం గణనీయంగా పెంచినా తగిన పారితోషికం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. వారి శ్రమకు తగిన గౌరవం కల్పించేలా వెంటనే డీఏ, రెమ్యూనరేషన్ను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్నహోబిలం హుండీ కానుకల లెక్కింపు ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను సోమవారం లెక్కించారు. 110 రోజులకు గాను శాశ్వత హుండీల ద్వారా రూ.28.66 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయ శాఖ అధికారి గంజి మల్లికార్జున, ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు, సభ్యులు బొల్లినేని పద్మాక్షి, గుంతకల్లు హనుమాన్ సేవాసంస్థ సభ్యులు, అనంతపురం ఒకటో రోడ్డు శివాలయం సేవా సమితి, భవాని సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
బ్యాంకులో మహిళ ఆత్మహత్యాయత్నం
కళ్యాణదుర్గం: స్థానిక యూనియన్ బ్యాంక్లోని మేనేజర్ చాంబర్లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు... యూనియన్ బ్యాంక్లోని తన ఖాతాలో రూ. లక్షల కోట్లు ఉన్నాయంటూ నకిలీ పత్రాలు చూపి జనాన్ని మోసం చేస్తున్నారన్న అభియోగంపై కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని పార్వతీనగర్లో నివాసముంటున్న ఒంటిమిద్ది ఎర్రిస్వామిని రెండు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా స్థానిక ఆ బ్యాంక్ అధికారుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరిచి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. దీంతో మనస్తాపానికి లోనైన ఎర్రిస్వామి భార్య జ్యోతి సోమవారం మధ్యాహ్నం యూనియన్ బ్యాంక్ కు చేరుకుని మేనేజర్తో మాట్లాడారు. తన భర్తకు సంబంధంలేని వ్యవహారంలో టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమంగా ఫిర్యాదు చేశారంటూ వాపోతూ అప్పటికే తన వెంట తెచ్చుకున్న గుర్తు తెలియని మాత్రలు మోతాదుకు మించి మింగేసింది. గమనించిన బ్యాంక్ సిబ్బంది, జ్యోతి బంధువులు వెంటనే ఆమెను స్థానిక సీహెచ్సీకి తరలించారు. మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన బాధితురాలు టీడీపీ నేతల ఆదేశాలతోనే తన భర్తపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారంటూ ఎర్రిస్వామి భార్య జ్యోతి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఆన్లైన్ ద్వారా రెండు రోజుల క్రితం తన ఫిర్యాదును మానవ హక్కుల సంఘం కమిషనర్కు ఆమె పంపారు. డీఎస్పీ రవిబాబు, పట్టణ సీఐ హరినాథ్ సిబ్బంది తమ ఇంటి వద్దకు వచ్చి ఎలాంటి నోటీసు, వారెంట్ లేకుండానే సరైన కారణం చూపకుండా తన భర్త ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారని వాపోయారు. తన భర్తను చూసేందుకు అనుమతి కూడా ఇవ్వకుండా పోలీసులు వ్యవహరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని కేసులో నేరాన్ని అంగీకరించాలంటూ తన భర్తను శారీరకంగా, మానసికంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్లతో తన భర్తపై అక్రమ కేసు బనాయించారంటూ యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఎదుట ఆవేదన మేనేజర్ చాంబర్లోనే మోతాదుకు మించి మాత్రలు మింగిన బాధితురాలు -
వెంటాడుతున్న భూ సమస్యలు
● అధికారుల చుట్టూ రైతుల ప్రదక్షిణ ● ‘పరిష్కార వేదిక’లో 587 అర్జీలు ● అందులో అత్యధికం భూ సమస్యలే అనంతపురం అర్బన్: రైతులను భూ సమస్యలు వెంటాడుతున్నాయి. వాటి పరిష్కారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా నిర్వహించిన రెవెన్యూ క్లినిక్కు భూసమస్యలపై అర్జీలు పెద్ద సంఖ్యలో వచ్చాయి. కలెక్టర్ ఆనంద్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, రామ్మోహన్, అఖిల ప్రజల నుంచి వివిధ సమస్యలపై 587 అర్జీలు స్వీకరించారు. ఇందులో భూ సమస్యలకు సంబంధించిన అర్జీలు 350 వరకు ఉండడం గమనార్హం. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. వినతుల్లో కొన్ని.. ● వితంతు పింఛను మంజూరు చేయాలని గుమ్మఘట్ట మండలం యర్రంపల్లికి చెందిన కాపు లక్ష్మి విన్నవించింది. తన భర్త 2018లో అనారోగ్యంతో చనిపోయాడని తెలిపింది. జీవనం కష్టంగా ఉందని, పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకుంది. ● సాధారణ రైతునైన తనను ట్యాక్స్ పేయర్గా నమోదు చేశారని పామిడి మండలం కొండాపురం గ్రామానికి చెందిన పి.వేణుసాగర్రెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో తనకు అన్నదాత సుఖీభవ, తన కుమారులకు ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదని వాపోయాడు. ట్యాక్స్ పేయర్ జాబితా నుంచి తొలగించి తమకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశాడు. -
ఆత్మకూరు మండలానికి చెందిన టీడీపీ నేత ఒకరు ఓ రైతును సంప్రదించి పొలంలోని మట్టి తోలుకుంటాం.. ఇందుకుగాను కొంత డబ్బు ఇస్తాం అని ప్రతిపాదించారు. అప్పటికే కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న ఆ రైతు సరే అని ఒప్పుకున్నాడు. ఇంకేముంది ఆ నేత పొలంలోకి జేసీబీ తీసుకొచ్చి మట్
వై.కొత్తపల్లి వద్ద హంద్రీ నీవా కాలువ పక్కనే జేసీబీతో మట్టిని టిప్పరుకు వేస్తున్న దృశ్యం సాక్షి టాస్క్ఫోర్స్: రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు సంపాదన కోసం బరి తెగిస్తున్నారు. అధికారిక అనుమతులు లేకుండానే వై.కొత్తపల్లి, వడ్డుపల్లి తదితర ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. పొలం, గుట్టలు, కొండలే కాదు ఏకంగా కాలువ గట్లనూ వదలడం లేదు. నీటి ప్రవాహం పెరిగినప్పుడు కాలువలకు గండిపడే ప్రమాదం ఉన్నా వెనక్కు తగ్గడం లేదు. ఎమ్మెల్యే పరిటాల సునీత అండతోనే ఇలా చెలరేగిపోతున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, పోలీసు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కంటికి కనిపించవా..? టీడీపీ నేతలు నాణ్యమైన మట్టి కోసం ఏకంగా వై.కొత్తపల్లి వద్ద హంద్రీ –నీవా కాలువ గట్టు సమీపాన హిటాచీ, జేసీబీలను పెట్టి తవ్వకాలు మొదలు పెట్టారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా తవ్వడం.. టిప్పర్ల ద్వారా తరలించడం యథేచ్ఛగా సాగుతోంది. కాలువకు ఆనుకుని మట్టిని తవ్వితే కేసులు పెడుతామన్న ఇరిగేషన్ అధికారుల హెచ్చరికలు ఇక్కడ పనిచేయడం లేదు. సామాన్యులపై మాత్రమే వారు ప్రతాపం చూపుతారన్న విమర్శలు ఉన్నాయి. వందల సంఖ్యలో టిప్పర్ల మట్టి తరలిస్తున్నా ఇరిగేషన్ అధికారుల కంటికి ఎందుకు కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మట్టి తవ్వకాల్లో దూకుడు భవన నిర్మాణాలు, లేఅవుట్లకు మట్టి అవసరం. అందులో నాణ్యమైన మట్టికి డిమాండ్ ఎక్కువగా ఉంది. అనంతపురంలో ఒక టిప్పర్ మట్టి రూ.7 వేలకు పైగా పలుకుతోంది. దీంతో ‘పచ్చ’ నేతలు గ్రామీణ ప్రాంతాల నుంచి రోజూ పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలించేస్తున్నారు. ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి వద్ద హంద్రీ–నీవా కాలువ పక్కన, వడ్డుపల్లి సమీపంలోని అటవీ ప్రాంతం, మదిగుబ్బ దగ్గర కొండపై మట్టి తవ్వకాలు ఎక్కువగా సాగుతున్నాయి. బహిరంగంగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నా ఏ అధికారీ పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోపాయికారి ఒప్పందంతోనే మట్టి దందా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. యథేచ్ఛగా మట్టి తరలింపు సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నేతలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు -
తొలిసారి స్వీయ జనగణన
రాయదుర్గం టౌన్: దేశంలో ప్రతి ఐదేళ్లకోసారి జనగణన చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. చివరి సారి 2011లో జనాభా లెక్కించారు. 2021లో కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్డౌన్ పరిస్థితుల్లో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం 2026–27లో జన గణనను కేంద్రం ప్రభుత్వం నిర్వహిస్తోంది. అతి పెద్దదైన ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు సమాయత్తమయ్యారు. డేటా గోప్యతకు ప్రాధాన్యత ప్రజల వ్యక్తిగత వివరాలకు అత్యంత గోప్యతనిస్తూ ఈసారి స్వీయ గణనకు (సెల్ఫ్ ఎన్యుమరేషన్)కు అవకాశం కల్పించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా జన గణనలో పాల్గొనే వెసులుబాటు దక్కింది. ఇది స్థానికంగా అందుబాటులో లేని వారికి ఎంతో ఉపయుక్తంగా మారింది. మొత్తం రెండు దశల్లో సాగనున్న ఈ ప్రక్రియలో తొలి విడతగా ఇళ్ల వివరాలు, సదుపాయాల సర్వే చేపట్టనున్నారు. మే 1 నుంచి మే 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక రెండో దశలో జనాభా లెక్కింపు ఉంటుంది. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతుల ఆధారంగా జనగణన ఉంటుంది. తొలి సారి దేశవ్యాప్తంగా పూర్తిగా డిజిటల్ విధానంలో అందుబాటులోకి తెచ్చిన ఈ ప్రక్రియలో ఈ నెల 16 నుంచి ప్రజలు తమ వ్యక్తిగత వివరాలను ఎవరికి వారే నేరుగా వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 30 వరకు స్వీయ గృహ గణన కార్యక్రమాన్ని చేపడతారు. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, చార్జ్ ఆఫీసర్లను ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో శిక్షణ కల్పిస్తున్నారు. 16 నుంచి స్వీయగణన జనాభా లెక్కల అధికారులు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు లేకపోవడం, ఉద్యోగ, వ్యాపారరీత్యా వేరే ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ప్రభుత్వం ఈసారి కొత్తగా స్వీయ జనగణనకు అవకాశం కల్పించింది. డిజిటల్ సెన్సెస్లో భాగంగా ప్రజలు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. జనాభా లెక్కింపు అధికారులు ఇంటి వద్దకు రాకముందే ప్రజలు తమ వివరాలను అధికారిక వెబ్సైట్లో నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. స్వీయ జనగణనకు దేశంలోని ప్రతి రాష్ట్రానికీ నిర్ణీత సమయాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలోనే ఏపీలో స్వీయ గణనకు ఈ నెల 6 నుంచి 30వ తేదీ వరకు అవకాశం ఉంది. ఎలా నమోదు చేయాలంటే.. స్వీయ గణన కోసం https://se.census.gov.in వెబ్సైట్లో లాగిన్ కావడం ద్వారా వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్లి రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకుని క్యాప్చా నమోదు చేయాలి. తర్వాత కుటుంబ యజమాని పేరు, మొబైల్ నెంబర్ ధ్రువీకరించాలి. భాషను ఎంపిక చేసుకుని ఓటీపీ నమోదు చేయాలి. లొకేషన్ వివరాలను నమోదు చేశాక కుటుంబానికి సంబంధించిన వివరాల గురించి 33 ప్రశ్నలకు సమాధానాలు నింపాలి. ఇందులో సొంత ఇల్లు ఉందా? అద్దె ఇంట్లో ఉంటున్నారా? ఎల్పీజీ గ్యాస్ వాడుతున్నారా? కారు లేదా బైక్ ఉందా లాంటి ప్రశ్నలుంటాయి. అన్ని వివరాలను నమోదు చేశాక ఒకసారి ప్రివ్యూ చూసుకుని ఫైనల్ సబ్మిషన్ బటన్ నొక్కాలి. 11 అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ జనరేట్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీ నంబర్ చెబితే సరిపోతుంది. ఇచ్చిన వివరాలలో ఏవైనా తప్పులు, మార్పులు ఉంటే ఎన్యుమరేటర్ సమక్షంలో సరిచేసుకునే అవకాశం ఉంటుంది. డిజిటల్ జనగణన కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రజలే నమోదు చేసుకునేలా వెసులుబాటు ఎక్కడి నుంచైనా ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’కు అవకాశం సొంతూళ్లలో లేని వారికి ఉపయుక్తం -
గొడవలు.. గందరగోళం
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం న్యూటౌన్ జూనియర్ కళాశాలలో ఇటీవల ముగిసిన ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకన (స్పాట్ వాల్యుయేషన్) శిబిరంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పలు అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. బోర్డు నుంచి సీనియార్టీ ఆధారంగా వచ్చిన చీఫ్ ఎగ్జామినర్ల (సీఈ) జాబితాలో మార్పులు చేయడం వివాదానికి దారితీసింది. సీనియర్ లెక్చరర్లను పక్కనబెట్టి జూనియర్లను నియమించడం, విధి విధానాలను ఉల్లంఘిస్తూ నియామకాల్లో ఇష్టానుసారం వ్యవహరించడం శిబిరంలో అసంతృప్తిని రగిల్చింది. దీనికి తోడు అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ఈ క్రమంలో రగడ రాజుకుందని సీఈలు, ఏఈలు విమర్శిస్తున్నారు. గొడవలు, పరస్పర దూషణలు చోటుచేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఒక జవాబు పత్రం మాయమై నాలుగు రోజుల తర్వాత క్యాంపు బయట లభించడం. సీనియార్టీని అనుసరించి చీఫ్ ఎగ్జామినర్ (సీఈ)ల నియామకం ఇంటర్మీడియెట్ బోర్డు అధికారుల నుంచే జరుగుతుంది. ఈ క్రమంలో ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి మొత్తం 12 మందితో సీనియార్టీ జాబితా పంపారు. దీన్నికాదని జిల్లాస్థాయిలో మరో జాబితా తయారు చేయడం.. అందులో సీనియార్టీని అనుసరించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బోర్డు నుంచి వచ్చిన జాబితాలో 5వ పేరులోఉన్న ప్రిన్సిపాల్..ఇక్కడి జాబితాలో 14వ పేరుగా మార్చడమే ఇందుకు నిదర్శనం. గణితం సబ్జెక్టులోనూ ఇదే రకంగా జరిగిందని అధ్యాపకులు చెబుతున్నారు. క్యాంపులో ఓ జవాబుపత్రాన్ని ‘మాయ’ం చేశారు. ఈ విషయం గతనెల 31న వెలుగులోకి వచ్చింది. సంబంధిత ఏఈ, సీఈలకు ముచ్చెమటలు పట్టాయి. వారికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఈ దుమారం క్యాంపు మొత్తం వైరల్ కావడంతో పెద్ద చర్చ జరిగింది. ఈ ఘటన మూల్యాంకన ప్రక్రియ భద్రతపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రక్రియలో ఇలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోవడం పట్ల విద్యావర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. క్యాంపులో మిస్ అయిన జవాబుపత్రం నాలుగు రోజుల తర్వాత అదికూడా క్యాంపునకు సంబంధం లేనిచోట లభించింది. దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న ఫిజిక్స్ ల్యాబ్లో దొరకడం అనుమానాలకు తావిస్తోంది. క్యాంపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిత్యం ప్రధానగేటుకు తాళం వేసే ఉంటుంది. బయట వారికి అనుమతి ఉండదు. అలాగే ఫిజిక్స్ ల్యాబ్కు తాళం వేసే ఉంటుంది. అధికారులు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే శిబిరం నుంచి మాయమైన జవాబుపత్రం.. తాళం వేసి ఉండే ల్యాబ్లో ఎలా దొరికిందనేది అంతుచిక్కని ప్రశ్న. దీని వెనుక దాగి ఉన్న కుట్రకోణం బయటకు రావాలని ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తే ఇంటిదొంగలు బయటపడతారని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సీఈలు, ఏఈలు మూల్యాంకన విధులంటేనే బెంబెలేత్తే పరిస్థితి వస్తుందని వారు వాపోతున్నారు. స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులో జరిగిన అవకతవకలపై స్వయంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీఓఈ)కు ఓ అసిస్టెంట్ క్యాంపు అధికారి (జనరల్) ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. అనవసరమైన వాగ్వాదాలతో తొలిరోజు శిబిరం బాగా ఆలస్యమైందని, ఏసీఓ (జనరల్)ను పక్కనపెట్టి అన్నీతానై క్యాంపు అధికారి వ్యవహరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా అప్పటికే పని చేసిన వ్యక్తిని మళ్లీ సీఈగా నియమించారని తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఏసీఓ జనరల్–1ను చేర్చకపోవడం, అవసరమైన సమాచారం అందించకపోవడం ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్యలేనని పేర్కొన్నారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఇంటర్ బోర్డు అధికారులు ఈ వ్యవహారాన్ని ఏమాత్రం సీరియస్గా తీసుకుంటారో వేచి చూడాలి. ఇదీ ఇంటర్ ‘స్పాట్’ తీరు బోర్డు నుంచి వచ్చిన సీఈల జాబితా మార్పుతో దుమారం సీనియర్గా ఉన్నవారిని తప్పించి జూనియర్ల నియామకం మూల్యాంకన శిబిరంలో గొడవలు, ఘర్షణలు, పరస్పర దూషణలు ఓ జవాబుపత్రం ‘మాయ’ం... నాలుగు రోజుల తర్వాత లభ్యం ఇటీవల ముగిసిన మూల్యాంకనం... ఆలస్యంగా వెలుగులోకి అక్రమాలు జవాబుపత్రాన్ని ‘మాయ’ం చేశారు? సీఓఈకు ఫిర్యాదు చేసిన ఏసీఓ.. నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి.. బోర్డు జాబితాలో 5వ పేరు.. ఇక్కడి జాబితాలో 14వ పేరు -
రైల్వే పనుల్లో నాణ్యతకు తిలోదకాలు
తాడిపత్రి రూరల్: తాడిపత్రి రైల్వేస్టేషన్లో అమృత్ పథకం కింద జరుగుతున్నా పనుల్లో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వేస్టేషన్లో వివిధ పనుల నిమిత్తం రెండు విడతలుగా రూ.20 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికీ ఆయా పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనికితోడు పనుల్లో కూడా నాణ్యతలో లోపాలు కనిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్ మాస్టర్ కార్యాలయం ఎదురుగా జరుగుతున్న గ్రానైట్ బండ పరుపు కోసం ప్లాట్ ఫారంపై ఉన్న సిమెంట్ కాంక్రీట్ను తొలగించారు. సిమెంట్ బెడ్ పనులు చేస్తున్నారు. సిమెంట్ బెడ్ కోసం వేసిన సిమెంట్, ఇసుకను నిబంధనల మేరకు వేయకుండా పనులు చేశారన్న ఆరోపణలున్నాయి. బెడ్ కోసం ఉపయోగిస్తున్న కంకర కూడా నాణ్యత లోపించిందంటున్నారు. ఇందులో కంకర పొడి కనిపిస్తోందని, కొంత వరకు వేసిన సిమెంట్ బెడ్పై క్యూరింగ్ సరిగా చేయలేదన్న విమర్శలున్నాయి. ఆ బెడ్పై గ్రానైట్ బండ పరుపు పరచడం వల్ల భవిష్యత్తులో కుంగిపోయి ఎగుడు, దిగుడుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. గతంలో ప్లాట్ ఫారంపై వేసిన టైల్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉండేదంటున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువు.. రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనుల్లో అధికారుల పర్యవేక్షణా లోపం కనిపిస్తోంది. ఒకప్పుడు రైల్వే పనుల్లో నాణ్యతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రస్తుతం అలా కనిపించడం లేదు. జరుగుతున్న పనులను అధికారుల పరిశీలించకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యం చేస్తున్నారు. జరిగిన పనుల నాణ్యతను లోతుగా పరిశీలిస్తే తప్ప ఏమేరకు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారో అర్థమవుతుందని ప్రయాణికులు చెబుతున్నారు. పట్టించుకోని అధికారులు -
మహిళపై అత్యాచారయత్నం
గుత్తి: పట్టణ పరిధికి చెందిన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి బలత్కారం చేయడానికి ప్రయత్నించాడు. పోలీసుల వివరాలమేరకు.. జడ్.వీరారెడ్డి కాలనీకి చెందిన లక్ష్మిదేవి పట్టణ శివారులోని డాబాలో పని ముగించుకుని శనివారం అర్ధరాత్రి ఒంట గంట సమయంలో ఇంటికి వెళ్తోంది. మార్గ మధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెను బలత్కారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె మెడలోని దారం చెవి కమ్మకు తగిలి చెవికు గాయమైంది. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆరు కుట్లు వేశారు. సీపీఎం మండల కార్యదర్శి నిర్మల బాధితురాలిని వెంట బెట్టుకుని పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సురేష్ .. జడ్.వీరారెడ్డి కాలనీకి వెళ్లి బాధితురాలిని కలిసి జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. కాలనీ మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. 18న కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆర్థిక–ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 18న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు నరేష్కుమార్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. నరేష్కుమార్ మాట్లాడుతూ బోధనేతర పనులు, సీపీఎస్ రద్దు, ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాల సమస్య, ిపీఆర్సీ అమలు తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలోనే నిరసనలకు దిగినట్లు పేర్కొన్నారు. సబ్ కమిటీ సభ్యులు గురురాజ, రామకృష్ణ, రంగనాయకులు, సూర్యనారాయణ, సుభద్ర, రాష్ట్ర కౌన్సిలర్లు శివారెడ్డి, ఎల్లప్ప, జె.వెంకటేశులు, నారాయణస్వామి, ఓబులేసు, హిమగిరి, అంజి, కలిముల్లా, తిప్పేస్వామి, శ్రీనివాసులు, బాలసుబ్రహ్మణ్యం, హనుమంతు, రంగానాయుడు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు అగళి: కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన మండల పరిధిలోని కసాపురం దగ్గర ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల వివరాలమేరకు.. హైదరాబాద్ నుంచి శిర వైపుగా వెళ్తోంది. అయితే మండలంలోని కసాపురం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి దగ్గర కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపు తప్పింది. దీంతో సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారులో ఉన్న ముగ్గురు మూగ గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ ఘటనతో విద్యుత్ స్తంభం ధ్వంసమైన ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. విద్యుత్శాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మరమ్మతు పనులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
మహిళా టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: మహిళా టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య మాట్లాడుతూ జిల్లాలో సుమారు 50 శాతం మంది మహిళా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. అయితే వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. పాఠశాలల్లో వాష్రూమ్లు, టాయిలెట్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళా ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక స్టాఫ్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. మానసిక ఒత్తిడి తగ్గించేందుకు స్ట్రెస్ మేనేజ్మెంట్ కౌన్సిలర్లను నియమించాలన్నారు. చైల్డ్ కేర్ లీవ్ వినియోగంలో సౌలభ్యం కల్పించాలని కోరారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కౌన్సిలర్ గోవిందరాజులు, జిల్లా కార్యదర్శి అర్జున్, సీనియర్ నాయకులు నాగేంద్ర, శ్రీనివాసులు, బసవరాజు, అనిల్ కుమార్, సురేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ పాల్గొన్నారు. మతిస్థిమితం లేని మహిళ మృతిఉరవకొండ: మండల పరిధిలోని చిన్నమూష్టూరు గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద మతిస్థిమితం లేని మహిళ (30 నుంచి 40 ఏళ్లు) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించిన అనంతరం సీఐ మహానంది మాట్లాడుతూ కొన్ని రోజులుగా మతిస్థిమితం లేని మహిళ హంద్రీనీవా కాలువ గట్ల వద్ద ఉంటూ తిరిగేదన్నారు. ఆహారం లేక ఎండ వేడిమికు తట్టుకోలేక కాలువ సమీపంలోని చెట్టు కింద మృతి చెందినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం యాచకురాలు మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. రైలు కింద పడి వ్యక్తి మృతి కదిరి అర్బన్: మండల పరిధిలోని కాళసముద్రం సమీపంలో శనివారం అర్ధరాత్రి రైలు కింద పడి కదిరి మండలం చిప్పలమడుగు గ్రామానికి చెందిన రామాంజినేయులు (55) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
కాసుల రెవెన్యూ
● ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గుడిబండ తహసీల్దారు కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గత నెల 31న దాడులు నిర్వహించారు. మ్యుటేషన్ కోసం ఎస్.రాయాపురం రైతు షేక్ సద్ధాం నుంచి తహసీల్దారు శ్రీధర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇది ఒక ఎత్తయితే.. ఆ తరువాత విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అనంతపురం శివారు పంగలరోడ్డు దగ్గరున్న వీరనాగమ్మ గుడి సమీపంలోని శ్రీధర్ ఇంటిని ఏసీబీ అధికారులు తనిఖీ (హౌస్ సెర్చ్) చేయగా రూ.50 లక్షల నగదు దొరికింది. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ● అనంతపురం రూరల్ మండలం ఇటుకలపల్లికి చెందిన బొజ్జయ్యకు 376 సర్వే నంబరులో పొలం ఉంది. డబుల్ ఎంట్రీగా ఉన్న తప్పును సరిచేసేందుకు మ్యుటేషన్ కోసం వీఆర్ఓ రూ.30 వేలు అడిగారు. దీంతో నగదు రూపంలో రూ.5 వేలు ఇచ్చి, వీఆర్ఓ చెప్పిన బినామీకి ఫోన్పే ద్వారా రూ.14 వేలు పంపించి ఇంత కంటే ఎక్కువ ఇచ్చుకోలేనని బొజ్జయ్య చెప్పాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని మ్యుటేషన్ చేయకపోవడంతో గత డిసెంబరు 8వ తేదీన బొజ్జయ్య ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్కు ఆధారాలతో ఫిర్యాదు చేశాడు. అనంతపురం అర్బన్: ప్రభుత్వ యంత్రాంగంలో రెవెన్యూ శాఖ అత్యంత కీలకమైనది. ఇక్కడ పారదర్శకంగా సేవలందించాల్సిన అధికారులు, ఉద్యోగుల్లో కొందరు దారితప్పారు. అదనపు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రధానంగా మ్యుటేషన్లలో అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కొర్రీలు వేసి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటుండటంతో రైతులు చేసేది లేక ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లోనూ ఇలాంటి దుస్థితే నెలకొంది. అయితే యల్లనూరు, కుందుర్పి, రాప్తాడు, గుత్తి తహసీల్దారు కార్యాలయ అధికారులు, సిబ్బంది అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముడుపులు ఇస్తేనే... రెవెన్యూ సేవలను అధికారులు ఆదాయ వనరులుగా మార్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. మ్యుటేషన్ కోసం వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. చుక్కల భూముల ఫైళ్లు సిద్ధం చేసేందుకు, పట్టాదారు పాసుపుస్తకాల జారీకి, అడంగళ్, 1బీ సవరణకు కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అడ్డూఅదుపు లేకుండా మామూళ్లు గుంజుతున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అన్నీ సక్రమంగా ఉన్నా పనులు చేయడానికి అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్ చేస్తుండటంతో విసిగిపోయిన బాధిత రైతులు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నారు. కరెక్షన్.. కలెక్షన్.. తహసీల్దారు కార్యాలయ పరిధిలోని కొందరు అవినీతి సిబ్బంది రికార్డుల్లో చేతివాటం చూపిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో వివరాలను వారే తప్పుగా నమోదు చేస్తారు. ఆ తప్పును సరిచేసేందుకు సంబంధిత వ్యక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. సరిదిద్ధాలంటే (కరెక్షన్)పై అధికారులకు డబ్బులు ఇచ్చుకోవాలంటూ వేలకు వేల రూపాయలు గుంజుతుంటారు. డబ్బులివ్వకపోతే చుక్కలే.. రెవెన్యూ సిబ్బంది రూటే సప‘రేటు’గా ఉంటోంది. పనిమీద వచ్చిన వారు డబ్బులు ఇవ్వకపోతే చుక్కలు చూపిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఫైలులో ఏదో ఒక కొర్రీ పెట్టి నెలల తరపడి తిప్పుకుంటారని పలువురు బాధితులు వాపోతున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో వారు అడిగినంత కాకపోయినా మధ్యేమార్గంగా ఒక ‘రేటు’ మాట్లాడుకుని మర్పించుకోవాల్సి వస్తోందని అంటున్నారు. అవినీతికి అడ్డాగా తహసీల్దార్ కార్యాలయాలు భూ సమస్యలు, మ్యుటేషన్లే ఆదాయ వనరులు అడిగినంత ఇవ్వకపోతే ముందుకు సాగని పనులు -
బకాయిలు విడుదల చేయాలి
అనంతపురం టవర్క్లాక్: ఏపీ ఎన్జీఓ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎన్జీఓ హోంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యయ, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న జీపీఎస్ ఏపీ జీఎల్ఐ, గ్రాడ్యుటీ, సరెండర్ లీవ్లకు సంబంధించిన బకాయిలు కొద్దిగా మాత్రమే విడుదల చేశారని, పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న వెంకటేష్ బాబును ఘనంగా సన్మానించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న శ్రీధర్బాబును ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాధవ్, రవికుమార్, జమీల బేగం, ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ, దస్తగిరి, పద్మావతి, అనంతయ్య, మనోహర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లిష్ సబ్జెక్టు ఫోరమ్ కార్యవర్గం ఎన్నిక అనంతపురం ఎడ్యుకేషన్: ఇంగ్లిష్ సబ్జెక్టు ఫోరమ్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక కేఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లా ఇంగ్లిష్ సబ్జెక్టు ఫోరమ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బోరంపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా డి. పుల్లయ్య, కోశాధికారిగా శివప్రసాద్ నాయుడుతో పాటు గౌరవాధ్యక్షుడిగా రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా ప్రసన్నలక్ష్మి, బసవరాజు, షమీవుల్లా, కార్యదర్శులుగా నటరాజు, రామ్మోహన్రెడ్డి, హరికృష్ణను ఎన్నుకున్నారు. సమావేశంలో ఫోరమ్ సీనియర్ ఉపాధ్యాయులు జయన్న, రంగస్వామి, నాగిరెడ్డి, నాగేంద్ర, సత్యప్రసాద్, సయ్యద్, మంజు, స్వర్ణలత, మంజునాథ్ పాల్గొన్నారు. కొత్త సిలబస్కు అనుగుణంగా ఉత్తమ బోధనా పద్ధతులను అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని వారు పేర్కొన్నారు. గ్రామస్తుల దాడిలో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చిలమత్తూరు: మండల పరిధిలోని గాడ్రాళ్లపల్లికి చెందిన బావిరెడ్డి (51) అనే మతిస్థిమితం లేని వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేయడంతో మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు శనివారం రాత్రి వాహనాలపై రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశాడని, మనుషులపై కూడా దాడి చేయడం, బట్టలు లేకుండా తిరగడం వంటి చర్యలతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారన్నారు. ఆత్మ రక్షణలో భాగంగా గ్రామస్తులు బావిరెడ్డిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. -
పీఆర్సీ వెంటనే ఏర్పాటు చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ిపీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ (రూసో) నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక 10వ తరగతి స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద రూసో జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఏపీ పీఎస్ హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ ిపీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు పూర్తవుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఏ జిల్లా అధ్యక్షుడు జయరాం నాయక్, కార్యదర్శి రవీంద్రబాబు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి డెగావత్ రవి మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, పింఛను ఉద్యోగుల హక్కు అని పేర్కొన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
రాప్తాడురూరల్: రాప్తాడు మండలంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. ఆయా ఘటనల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... పుట్లూరు మండలం ఎల్లుట్లకు చెందిన రాజశేఖర్ (40) మామిళ్లపల్లి వైపు నుంచి జాతీయ రహదారిపై రాప్తాడు వైపు బైకులో వస్తున్నాడు. ఎం.చెర్లోపల్లి వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. బైకు అదుపుతప్పి... యల్లనూరు: యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన మారుతి తన సోదరి మమతతో పాటు ఆమె కుమారుడు గగన్ (5)తో కలిసి రాప్తాడు వైపు నుంచి అనంతపురం వైపు బైకులో వస్తున్నారు. అయితే గాయత్రి మిల్క్డైరీ సమీపంలో అదుపుతప్పి బైకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గగన్ తలకు తీవ్ర గాయాలై మృత్యువాతపడ్డాడు. మారుతి, మమత గాయాలతో బయటపడ్డారు. తన కళ్లెదుటే కుమారుడు చనిపోవడంతో తల్లి రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు రెండు ఘటనాస్థలాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో రైతు... కుందుర్పి: మండలంలోని రుద్రంపల్లికి చెందిన మహలింగప్ప అనే రైతు తన వ్యవసాయ పొలంలో పండించిన చిలగడ దుంపలను హైదరాబాద్ మార్కెట్కు బొలెరోలో తీసుకెళ్తున్నాడు. అయితే శనివారం రాత్రి కర్నూలు సమీపంలో బొలెరో వాహనాన్ని ఓ ప్రైవేటు వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో మహలింగప్ప అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు. -
అటు చీవాట్లు.. ఇటు హూంకరింపు
అనంతపురం టౌన్: అద్దె భవనం ఖాళీ చేయించే విషయంలో కోర్టు అక్షింతలు ఓ వైపు.. మరొకచోటకు పోరాదంటూ ప్రజాప్రతినిధి హూంకరింపు మరొక వైపు స్టాంప్స్ అండ్ రిజి స్ట్రేషన్స్ శాఖ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అనంతపురం రామ్నగర్లోని అద్దె భవనాల్లో జిల్లా రిజిస్ట్రార్ (డీఆర్) కార్యాలయంతో పాటు అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్వహిస్తున్నారు. అయితే సంబంధిత భవన యజమాని కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు కూడా నిర్ణీత గడువులోపు ఖాళీ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గడువుదాటినా ఖాళీ చేయకపోవడంతో భవన యజమాని మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణ కిందకు రావడంతో అప్పటి జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్ కోర్టుకు హాజరై మరికొంత గడువు కోరారు. అనంతరం కార్యాలయ మార్పు కోసం అద్దె భవనం కావాలని ప్రకటనలు ఇచ్చారు. బళ్లారి రోడ్డులోని ఓ భవన యజమాని ముందుకు రావడంతో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు అధికారులు కార్యాలయాన్ని సదరు భవనంలోకి మార్చడానికి కసరత్తు పూర్తి చేశారు. ఇంతలో డాక్యుమెంట్ రైటర్లు స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి కార్యాలయాన్ని ఇక్కడే కొనసాగేలా చూడాలని మొరపెట్టుకున్నారు. ఈ మేరకు రామ్ నగర్ ప్రాంతం నుంచి మరొక చోటుకు మారకూడదంటూ ప్రజాప్రతినిధి హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ భవనం కోసం అన్వేషించారు. అయితే రామ్నగర్లో అద్దె భవనం దొరకలేదు. కోర్టు ఆదేశాలు ధిక్కరించలేక.. ప్రజాప్రతినిధి మాటను కాదని ముందుకెళ్లలేక మదనపడుతున్నారు. భవనాన్ని మీరే అద్దెకు ఇప్పించండని కోరితే ప్రజాప్రతినిధి ‘ఏమి చేసుకుంటారో నాకు తెలీదు. కార్యాలయం ఇదే ప్రాంతంలో ఉండాల్సిందే’ అంటూ మరోమారు గద్దించారని సమాచారం. ఎవ్వరూ ఒత్తిడి చేయలేదు రామ్నగర్లోని అద్దెభవనంలో ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాన్ని మార్చాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన మాట వాస్తవమే. అందులో భాగంగానే భవనం కోసం వెతికాం. బళ్లారి రోడ్డులో భవనం ఎంపిక చేశాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీ సెలవులో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత కార్యాలయం మార్పుపై నిర్ణయం తీసుకుంటాం. రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మార్చకూడదని.. ఇక్కడే ఉంచాలని ఏ ప్రజాప్రతినిధీ మమ్మల్ని ఒత్తిడి చేయలేదు. – బి.శ్రీనివాసులు, జిల్లా రిజిస్ట్రార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ భవనం ఖాళీకి కోర్టు ఆదేశం స్థానికంగా ఉండాలంటున్న అర్బన్ ప్రజాప్రతినిధి సమీపంలో దొరక్క.. ఉన్న భవనం ఖాళీ చేయలేక.. సందిగ్ధంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు -
‘అనంత’ విద్యార్థినికి జపాన్ నుంచి పిలుపు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘అనంత’ విద్యార్థినికి జపాన్ దేశం నుంచి పిలుపు వచ్చింది. సైన్స్లో కనబరచిన ప్రతిభకు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించింది. గుంతకల్లు మండలం కసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసి ప్రస్తుతం ఇడుపులపాయలో ఇంటర్ చదువుతున్న కావలి జ్యోతి తన సృజనాత్మకతతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ‘సోలార్ మల్టీపర్పస్ పోర్టబుల్ టెంట్’ అనే వినూత్న నమూనాను రూపొందించిన విద్యార్థిని ప్రతిభకు గుర్తింపుగా, దేశవ్యాప్తంగా నిర్వహించిన ఇన్స్పైర్ మనక్ జాతీయస్థాయికి ఎంపిక కావడం గమనార్హం. ఈ ప్రతిభతో ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో మరొక గొప్ప అవకాశం లభించింది. జపాన్ సైన్స్, టెక్నాలజీ ఏజెన్సీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘సకుర సైన్స్ ప్రోగ్రాం’ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా.. అందులో కావలి జ్యోతి ఒకరు ఉండడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా యువ శాస్త్రవేత్తలకు జపాన్లో సైన్స్, టెక్నాలజీ రంగాల్లో జ్ఞానాన్ని పంచుకునే అరుదైన అవకాశం లభించనుంది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేసి జ్యోతిని అభినందించారు. ప్రత్యేకంగా విద్యార్థిని మార్గదర్శకులు ఉపాధ్యాయులు నారాయణ సేవలను కొనియాడారు. ఇలాంటి ప్రతిభను వెలికితీయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. సైన్స్లో ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూసమస్యల అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో అందజేయాలని సూచించారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని తెలియజేశారు. సజావుగా ఫ్లాగ్షిప్ పరీక్ష అనంతపురం అర్బన్: యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలో నిర్వహించిన ఫ్లాగ్షిప్ (ఎన్డీఏ, ఎన్ఏ, సీడీఏ) పరీక్ష సజావుగా జరిగింది. పరీక్షలకు 522 మంది అభ్యర్థులకు గానూ 340 మంది హాజరయ్యారు. ఎస్ఎస్బీఎన్ కేంద్రంలో జరిగిన కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ (సీడీఏ) పరీక్షకు అభ్యర్థుల హాజరు 55 శాతం నమోదయ్యింది. కేఎస్ఆర్ కళాశాల కేంద్రంలో జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నావల్ అకాడమీ (ఎన్ఏ) పరీక్షకు అభ్యర్థుల హాజరు 65.18 శాతం నమోదయ్యింది. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆనంద్ సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును, మౌలిక సదుపాయాల కల్పనను పరిశీలించారు. నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు సెల్: 8977716661 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ.. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. వడదెబ్బతో వృద్ధురాలి మృతి కూడేరు: భగభగమని మండుతున్న ఎండలకు ఓ వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతి చెందింది. గార్లదిన్నె మండలం సంజీవపురానికి చెందిన బొగ్గు వెంకటలక్ష్మమ్మ (65) ఆదివారం కూడేరులో పోలీసు స్టేషన్ వెనుక వైపు వ్యవసాయ పొలంలో విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆ పొలం రైతు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. ఆమె వద్ద లభించిన కవర్లో ఆస్పత్రి చీటీ కనిపించింది. అందులో ఉన్న చిరునామా ఆధారంగా కుమారుడు సోముకు సమాచారమిచ్చారు. అతను వచ్చి చనిపోయినది తన తల్లి వెంకటలక్ష్మమ్మ అని గుర్తించాడు. తన తల్లి పుట్టినిల్లు అరవకూరని, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇంటి వద్ద ఉండకుండా తిరుగుతుండేదని చెప్పాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిందని తెలిపాడు. ఈ క్రమంలో శనివారం ఆమె వడదెబ్బకు గురై మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతిపై ఎలాంటి అనుమానాలూ లేవని చెప్పడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
గోల్షాట్ బాల్ విజేతలుగా తిరుపతి, గుంటూరు
కదిరి అర్బన్: మున్సిపల్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం జరిగిన 4వ ఆంధ్రప్రదేశ్ జూనియర్ బాలుర, బాలికల ఇంటర్ డిస్ట్రిక్ట్ గోల్షాట్ బాల్ చాంపియన్షిప్ పోటీల్లో తిరుపతి, గుంటూరు జట్లు విజేతలుగా నిలిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో తిరుపతి జట్టు, ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జట్టు, తృతీయ స్థానంలో అనంతపురం జట్లు నిలిచాయి. అలాగే బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో గుంటూరు జట్టు, ద్వితీయ స్థానం శ్రీసత్యసాయి జట్టు, తృతీయస్థానం విశాఖపట్నం జట్లు నిలిచాయి. విజేతలకు ఎంఈఓ చెన్నక్రిష్ణ ట్రోఫీలు, ప్రశంశాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గోల్షాట్ బాల్ వ్యవస్థాపకుడు రాజేంద్రప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి దేవిప్రియా, ప్రతినిధులు ప్రసన్నకుమార్, రామాంజులురెడ్డి, జగదీష్, డేనియల్తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఉపాధిని కోల్పోయాం
చంద్రబాబు ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ అందించే ఎండీయూ వాహనాలను తొలగించడంతో ఆపరేటర్లు ఉపాధిని కోల్పోయారు. వాహనాలను తిప్పలేక మూలన పడేశాం. బ్యాంకు రుణాలను క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే నేటికీ ఆ హామీని మాత్రం నెరవేర్చలేదు. సక్రమంగా వాయిదాలను ప్రభుత్వం చెల్లించకపోవడతో ఆపరేటర్లకు సంబంధించి సిబిల్ స్కోర్ తగ్గిపోతోంది. వాహనాల ఇన్సూరెన్స్ రూ.11,500 కూడా ప్రభుత్వం చెల్లించాలి. – రామాంజినేయులు, ఎండీయూ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
పెన్నా నది పరివాహక ప్రాంతంపై ‘పచ్చ’ నేతల కన్నుపడింది. సహజవనరు అయిన ఇసుకను ఎడాపెడా తవ్వేస్తున్నారు. అంతటితో ఆగక అధికార పార్టీ ముఖ్య నేత నదీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి.. దర్జాగా చదును చేసి నిర్మాణాలకు ఉపక్రమించారు. దీని కారణంగా తాడిపత్రి ప్రాంతంలో నది స్
అక్రమ నిర్మాణాల కోసం పెన్నానదిని పూడ్చి వేస్తున్న దృశ్యం సాక్షి టాస్క్ఫోర్స్ : పెద్దవడుగూరు మండలం కొండూరు నుంచి తాడిపత్రి మండలం వంగనూరు వరకు దాదాపు 65 కిలో మీటర్ల మేర పెన్నానది పరివాహక ప్రాంతం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అధికార టీడీపీ నేతలు పెన్నానదిలో ఇసుకను వ్యక్తిగత ఆదాయవనరుగా మార్చేసుకున్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. అడిగేవారు లేరని పెద్ద ఎత్తున తోడేశారు. దీంతో ఎక్కడ చూసినా పెద్దపెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. అలాగే తాడిపత్రి సమీపంలోని నది పరివాహక ప్రాంతంలో ఏకంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో పర్యావరణం దెబ్బతింటోంది. 2017లో పెన్నానదిలో టీడీపీ ముఖ్య నేత పార్కు నిర్మాణం చేపట్టడంపై పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే ఇవ్వడంతో పార్కు మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు అదే పార్కు పక్కన పరివాహక ప్రాంతాన్ని పూడ్చి నిర్మాణాలకు పూనుకున్నారు. దీన్ని ఆపకపోతే భవిష్యత్తులో తాడిపత్రికి వరద ముంపునకు గురయ్యే అవకాశం లేకపోలేదు. దిశ మారుతోన్న ‘దక్షిణ కాశీ’ తాడిపత్రిలో పురాతన బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద పెన్నానది ఉత్తర – దక్షిణ దశగా ప్రవహిస్తూ దక్షిణ కాశీగా పేరుపొందింది. అయితే నదిలో అక్రమ నిర్మాణాల కారణంగా పెన్నానది స్వరూపం మారుతుండటంతో ‘ఉత్తర –దక్షిణ’ దిశలు మారే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుషితమవుతున్న పెన్నా నది తాడిపత్రి మున్సిపల్ అధికారులు మురుగునీటిని పైపుల ద్వారా నేరుగా పెన్నానదిలోకి మళ్లిస్తున్నారు. దీంతోపాటు చుక్కలూరు, సజ్జలదిన్నె సమీపంలోని గ్రానైట్, నాపరాళ్ల పరిశ్రమల ద్వారా వచ్చే వ్యర్థం నీరు నేరుగా నదిలో కలుస్తోంది. పురాతన బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం వరకు నదిలో మురుగు కాలువలు ఏర్పడాయి. దీంతో నదిలో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. అక్రమంగా ఇసుక తవ్వకాలు ఆక్రమణలో నదీ పరివాహక ప్రాంతం దర్జాగా చదును చేసి.. నిర్మాణాలకు శ్రీకారం టీడీపీ ముఖ్యనేతను నిలువరించలేక అధికారుల మౌనం -
సెగలు కక్కుతున్న సూరీడు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా అంతటా ఎండలు దంచేస్తున్నాయి. నాలుగు రోజులుగా 40 నుంచి 42 డిగ్రీలతో సూరీడు మండిపోతున్నాడు. భానుడి భగభగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. తాడిపత్రి, పెద్దపప్పూరు, శింగనమల, పెద్దవడుగూరు, కళ్యాణదుర్గం, పుట్లూరు, యల్లనూరు, విడపనకల్లు, నార్పల, రాప్తాడు, అనంతపురం తదితర మండలాల్లో మండేఎండలు జనాన్ని మాడ్చేస్తున్నాయి. ఈ నెల 9న తాడిపత్రి మండలం తేరన్నపల్లిలో 42.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటూ సాయంత్రం 5 గంటల వరకు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆ తర్వాత రాత్రి ఉక్కపోత, వడగాడ్పులతో సెగలు పుట్టిస్తున్నాడు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 22 నుంచి 28 డిగ్రీల వరకు నమోదవుతోంది. ఇక మధ్యాహ్న సమయంలో జన, వాహన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రైతులు, శ్రామికులు, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, రోగులు, పుట్పాత్ వ్యాపారులు ఎండలకు తాళలేక మరింత ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి వడదెబ్బకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు రాకపోవడం మంచిదని చెబుతున్నారు. కాగా రాగల నాలుగు రోజులూ ఇదేరకమైన పరిస్థితి ఉంటుందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పూలే ఆశయాలు కొనసాగిస్తాం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత అనంతపురం : మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి అనంత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. దురాచారాలను రూపుమాపేందుకు ఆయన ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఆయనబాటలోనే నడుస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు.. బ్యాక్ బోన్ అని నమ్మి, వారి అభ్యున్నతికి కృషి చేశారని గుర్తు చేశారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ పూలే స్ఫూర్తితో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. బడుగు, బలహీన వర్గాలు అన్ని విధాలా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకున్నారన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే స్పూర్తితో విద్యారంగంలో నూతన సంస్కరణలు తీసుకొచ్చి, పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేలా చూశారన్నారు. మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పించి, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం బడుగులను నట్టేట ముంచుతోందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా.. డైవర్షన్ పాలిటిక్స్తో కాలయాపన చేస్తోందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలకు దన్నుగా నిలిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, ఎస్ఈసీ సభ్యుడు లింగాల శివశంకర్ రెడ్డి, మాజీ మేయర్ వసీం, నాటక అకాడమీ మాజీ చైర్పర్సన్ రాగే హరిత, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, భారతి, పద్మ, శోభారాణి, అంజలి, లక్ష్మి, పార్వతి, దేశాయి భారతి, చంద్రకళ, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, నాయకులు ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, రిలాక్స్ నాగరాజు, లక్ష్మన్న, శ్రీనివాస్ నాయక్, జానీ, థామస్, దాదా ఖలందర్, సాకే అశోక్కుమార్, వెన్నపూస రామచంద్రారెడ్డి, మాలపాటి శ్రీనివాసులు, కమల్ భూషణ్, రామచంద్ర, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ రాష్ట్ర దొంగపై పీడీ యాక్ట్
● కడప సెంట్రల్ జైలుకు తరలింపు కదిరి టౌన్/తనకల్లు: రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన 43 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్ రాష్ట్ర దొంగపై పోలీసులు పీడీయాక్ట్ ప్రయోగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరులకు తెలిపారు. తనకల్లు మండలం నందిగానిపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి సాయికుమార్ అలియాస్ సాయి నితిన్ చోరీల్లో సిద్ధహస్తుడు. పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు పంపినా...తిరిగి వచ్చాక మళ్లీ చోరీల బాట పట్టేవాడు. ఇలా అతనిపై తిరుపతి, తిరుమల, అలిపిరి, తిరుచానూర్, రేణిగుంట, అన్నమయ్య జిల్లా మదనపల్లి, అనంతపురం, నార్పల, కర్నూలు, హిందూపురం, తనకల్లు పోలీసు స్టేషన్లతో పాటు కర్ణాటక, తమిళనాడులోని వివిధ పోలీసు స్టేషన్లలో 43 చోరీ కేసులు నమోదై ఉన్నాయి. దీంతో కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు సాయికుమార్పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. గతంలోనే కదిరి పోలీసు సబ్డివిజన్ పరిధిలోని ముగ్గురిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు గుర్తు చేశారు. వివిధ కేసుల్లో నేరస్తులు, రౌడీషీటర్లుగా ఉన్న వారు ప్రవర్తన మార్చుకోకపోతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఒక్క అంశంతోనే ముగిసిన పాలకమండలి సమావేశం అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం ఒకే ఒక్క అంశంతోనే ముగిసింది. వీసీ ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతి కుమార్ అధ్యక్షతన శనివారం ఎస్కేయూ పాలకమండలి సమావేశం జరిగింది. పాలకమండలి సభ్యులు ఆన్లైన్లో పాల్గొన్నారు. 2023లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. హైకోర్టులో వ్యాజ్యం కారణంగా భర్తీకి అవరోధాలు ఏర్పడ్డాయి. తిరిగి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధం చేసిన నేపథ్యంలో అప్పటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ను రద్దు చేయాలనే ప్రతిపాదనను పాలక మండలి ఎజెండాలో చేర్చారు. దీనికి పాలకమండలి ఆమోదం తెలిపింది. డీఎస్పీ విజయ్కుమార్పై బదిలీ వేటు పుట్టపర్తి టౌన్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్పై బదిలీ వేటు పడింది. రాష్ట్రంలోని ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి డీఐజీ హరీష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ను శ్రీకాకుళం జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బదిలీ చేశారు. అయితే పుట్టపర్తి డీఎస్పీగా ఎవరినీ నియమించలేదు. 17 నెలలుగా విజయకుమార్ పుట్టపర్తి డీఎస్పీగా పనిచేశారు. పలు అంశాల్లో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. విదేశీయుల భూముల అంశం, కొత్తచెరువు హత్యకేసు, పేకాట అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. -
రైతులను మరచిన ప్రభుత్వం
అనంతపురం ఎడ్యుకేషన్: పది మందికి అన్నం పెడుతున్న రైతుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం మరచిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. శనివారం అనంతపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి పేరిట రూ.లక్షల కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆర్గనైజ్డ్గా జరుగుతున్న క్రైమ్ను ప్రజల ముందు ఉంచుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ట్రోలింగ్ చేయడం శోచనీయమన్నారు. డైవర్షన్ టెక్నిక్లను ఉపయోగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఛీప్ పాల్టిక్స్కు పాల్పడుతోందన్నారు. అమరావతి నిర్మించడానికి తాము వ్యతిరేకం కాదని, అక్కడ చేస్తున్న దోపిడీకి వ్యతిరేకమని స్పష్టం చేశారు. కేంద్రీకృత అభివృద్ధి విధానానికి తాము వ్యతిరేకమన్నారు. జగనన్న చెప్పినట్లు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుకుని రాజధాని (మావిగన్) అభివృద్ధి చేస్తే అతితక్కువ ఖర్చుతోనే పూర్తవుతుందన్నారు. 28 గ్రామాలున్న అమరావతి ప్రాంతంలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని, రెండోదశ భూసేకరణకు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ఇందుకోసం ఇంకో రూ.లక్ష కోట్లు అప్పులు చేస్తామనడం శోచనీయమన్నారు. మీరు, మీ బినామీలు భూములు కొనుగోలు చేసిన ప్రాంతానికి రాష్ట్ర సంపదనంతా ఎలా తరలిస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. సీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వండి అమరావతికి ఇచ్చిన ప్రాధాన్యతను రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి ఇవ్వాలని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే హంద్రీ–నీవా, హెచ్ఎల్సీ మోడరైజేషన్ పూర్తవుతాయన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే పోలవరం డైవర్షన్ వల్ల ఏపీ, ఎగువ ప్రాంతాలకు కేటాయింపునకు అవకాశం ఉన్న 45 టీఎంసీల నీటిని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు కేటాయించాలన్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా ఎమ్మెల్యే పరిటాల సునీత అడ్డుకుంటోందని విమర్శించారు. డ్యాంలో నీరు లేక బోర్లు ఎండిపోతున్నాయన్నారు. జీడిపల్లి నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు తెస్తామని చెబుతున్న పరిటాల సునీత భూ సేకరణకు ఒక రూపాయి కూడా ఇప్పించలేదన్నారు. శిలాఫలకం వేసుకుని డబ్బా కొట్టుకోవడం మినహా చేసిందేమీ లేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 60 శాతం పనులు పూర్తి చేయించానన్నారు. రూ.170 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు. పనులు పూర్తయి డ్యాంకు నీళ్లు తీసుకొస్తే ప్రకాష్రెడ్డికి మంచిపేరు వస్తుందని భయపడి అప్పటి కాంట్రాక్టర్ను బెదిరించి పనులు ఆపించారన్నారు. ప్రత్యామ్నాయంగా తురకాలపట్నం చెరువు మీదుగా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావచ్చని చెప్పామన్నారు. అయినా ఆమె పట్టించుకోలేదన్నారు. పేరూరు డ్యాంకు నీటి విడుదల కోసం ఈ నెల 21న కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు ప్రకాష్రెడ్డి తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, గంగుల సుధీర్రెడ్డి, బద్దలాపురం పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు చంద్రకుమార్, మారుతి, రాప్తాడు వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు, మీనుగ నాగరాజు పాల్గొన్నారు. అమరావతి పేరిట రూ.లక్షల కోట్ల దోపిడీకి స్కెచ్ ఛీప్ పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజం -
నేడే ‘ఎంజేపీ’ ప్రవేశ పరీక్ష
కుందుర్పి: జిల్లాలోని కొనకొండ్ల, కుందుర్పి, గోనబావి, నార్పల, డీ హీరేహాళ్ మహాత్మా జ్యోతిరావు పూలే (ఎంజేపీ) వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల్లో 2026–2027 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశానికి గాను ఆదివారం పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్ అస్రత్వలి తెలిపారు. శనివారం ఆయన కుందుర్పిలో మీడియాతో మాట్లాడారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,956 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. -
‘ఉపాధి చట్టం’ పరిరక్షణకు ఉమ్మడి పోరాటం
బత్తలపల్లి: ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, నిరుపేదలకు మేలు చేసే ‘ఉపాధి చట్టం’ పరిరక్షణకు కలిసి వచ్చే అన్ని పార్టీలతో ఉమ్మడి పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఉపాధిహామీ కూలీల హక్కుల కోసం సీపీఐ, ఏపీ వ్యవసాయ, కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు వైఎస్సార్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. శనివారం బత్తలపల్లి మండలం కాటికోటేశ్వరక్షేత్రం నుంచి రెండో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తమ బృందంతో పాదయాత్రగా లింగారెడ్డిపల్లి క్రాస్ వద్దకు చేరుకోగా... వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డితో పాటు మాజీ మంత్రి సాకే శైలజానాథ్, కళ్యాణదుర్గం, ధర్మవరం నియోజకవర్గాల సమన్వయకర్తలు, తలారి రంగయ్య, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంతపురం తాజా మాజీ మేయర్ వసీం, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, బత్తలపల్లి వైస్ ఎంపీపీ గజ్జెల వెంగళరెడ్డి తదితరులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లింగారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, బీకేఎంయూ జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్సింగ్ గురియ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తదితరులు మాట్లాడారు. వలసలు నివారించి కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు 2005లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో నార్పల మండలం బండ్లపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఉపాధిహామీ పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాపై భారం ఉపాధి చట్టం స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన వీబీ జీ రాంజీ పథకం వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతుందని నేతలు అన్నారు. గతంలో ఉపాధి పథకానికి 90 శాతం నిధులను కేంద్రం అందించేదని, కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాల్సి వస్తోందన్నారు. కేంద్రం 90 శాతం నిధులు మంజూరు చేసినప్పడే టీడీపీ సర్కార్ బిల్లులు సకాలంలో చెల్లించలేదని, ఇప్పుడు 40 శాతం నిధులివ్వాలంటే కష్టమేనన్నారు. దీనివల్ల మళ్లీ వలసలు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో చంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల పని దినాలు కూడా కల్పించలేదన్నారు. గత ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 వేల కుటుంబాలకు మాత్రమే వంద రోజులు పని కల్పించినట్లు వివరించారు. అందువల్ల పాత పద్ధతిలోనే ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు. పాదయాత్రలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, అక్కినేని వనజ, జాతీయ కార్యదర్శి నిర్మల్, రైతు సంఘం జాతీయ అధ్యక్షులు వెంకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, ఆవుల శేఖర్, బండి వెంకటేశ్వరరావు, వేమయ్య యాదవ్, మల్లికార్జున, రాజారెడ్డి, వలరాజు, నాసర్, సంతోష్కుమార్, యుగంధర్, చంద్రనాయక్, కాటమయ్య, చలపతి, ముసుగు మధు, కదిరప్ప, వైఎస్సార్సీపీ నాయకులు చల్లా మహేష్నాయుడు, కోటి సురేష్కుమార్, గుర్రం శ్రీనివాసరెడ్డి, బండి వీరనారప్ప, షరాబ్ యోగానంద ఆచారీ, బగ్గిరి బయపరెడ్డి, మండల ఉపాధ్యక్షులు బ్యాల్ల పెద్దయ్య, మాజీ సర్పంచులు అక్కిం దామోదర్, చెడిపోతుల గోపాల్, గొల్లపల్లి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీబీ జీ రాంజీతో రాష్ట్రంపై పెనుభారం టీడీపీ ఏన్డీయేలో భాగస్వామిగా ఉన్నా.. ప్రయోజనం లేదు వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం పాదయాత్రకు మద్దతు -
‘పట్టు’ సొసైటీ అధ్యక్షుడిగా ఓబులేసు
అనంతపురం అగ్రికల్చర్: పట్టు పరిశ్రమ శాఖ ఉద్యోగుల పరపతి సంఘం అధ్యక్షుడిగా డి.ఓబులేసు, కార్యదర్శిగా సి.ఆదినారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడిగా జి.బసవరాజు ఏకగీవ్రంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ఎ.సర్ఫరాజ్ నవాజ్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికై న ఏడుగురు డైరెక్టర్లు శనివారం స్థానిక పట్టుశాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న సొసైటీ కార్యాలయంలో సమావేశమయ్యారు. నోటిఫికేషన్ మేరకు ఆఫీస్ బేరర్ల ఎన్నికలు నిర్వహించి అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి స్థానాలకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. డైరెక్టర్లుగా జి.రామలింగారెడ్డి, బి.గోవిందప్ప, కె.బాబయ్య, జీవీ శివప్రసాద్ కొనసాగనున్నారు. నూతన కార్యవర్గాన్ని ఆ శాఖ ఉద్యోగులు అభినందించారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని అధ్యక్షుడు ఓబులేసు, కార్యదర్శి ఆదినారాయణరెడ్డి తెలిపారు. చిన్నారి దుర్మరణం కణేకల్లు: బతుకు తెరువు కోసం తల్లిదండ్రులతో కలసి వలస వెళ్లిన ఓ చిన్నారి... మహానగరంలో చోటు చేసుకున్న ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు... కణేకల్లు మండలం గోపులాపురం గ్రామానికి చెందిన శాంతి, చిన్న మారెన్న బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లి, భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరి వెంట కుమారుడు నిషాంత్ (7) కూడా ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మహదేవపురలో సైకిల్పై వెళుతున్న నిషాంత్ను ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టెంపో ట్రావెల్ ఢీకొంది. ఘటనలో వాహనం చక్రాల కిందపడి నిషాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వ్యక్తిని కాపాడిన రైల్వే పోలీసులు తాడిపత్రి రూరల్: క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని సకాలంలో రైల్వే పోలీసులు గుర్తించి కాపాడారు. వివరాలు.. కూలి పనులతో జీవనం సాగిస్తున్న నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లికి చెందిన శివశంకర్రెడ్డి మద్యానికి బానిసయ్యాడు. అతిగా మద్యం సేవిస్తున్న కారణంగా అనారోగ్యం బారిన పడ్డాడు. పనులు సైతం చేయడానికి శరీరం సహకరించకపోవడంతో మనోవేదనకు లోనైన శివశంకరరెడ్డి శనివారం తాడిపత్రిలోని రైల్వే స్టేషన్కు చేరుకుని ప్లాట్ఫారం చివర అనుమానాస్పదంగా తచ్చాడుతుండడంతో రైల్వే హెడ్కానిస్టేబుల్ వరప్రసాద్, కానిస్టేబుల్ సుబ్బారెడ్డి అక్కడకు చేరుకుని ఆరా తీశారు. దీంతో తాను పడుతున్న ఇబ్బందులను శివశంకరరెడ్డి ఏకరవు పెట్టి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే తనకు మార్గమని పేర్కొన్నాడు. దీంతో వెంటనే శివశంకరరెడ్డిని జీఆర్పీ స్టేషన్కు తరలించి, కుటుంబసభ్యులను రప్పించుకున్నారు. కౌన్సిలింగ్ అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కుడి కాలువకు నీటి సరఫరా నిలుపుదల కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ నుంచి ధర్మవరం కుడికాలువ ద్వారా నీటి సరఫరాను శనివారం నిలుపుదల చేశారు. ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజక వర్గ పరిధిలోని కాలువ పరిధిలోని 49 చెరువులను నీటితో నింపినట్లు హెచ్చెల్సీ ఎస్ఈ సుధాకరరావు వెల్లడించారు. శనివారం ఆయన రిజర్వాయర్ను పరిశీలించి, నీటి మట్టం, అవుట్ ఫ్లో వివరాలను సిబ్బందితో ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రిజర్వాయర్లో ఉన్న నీరు తాగునీటి ప్రాజెక్ట్లకు సరిపోతుందన్నారు. కార్యక్రమంలో రిజర్వాయర్ డీఈ కవిత, జేఈలు ఓబుళరెడ్డి, గంగమ్మ, మిడ్ పెన్నార్ డ్యాం జేఈ సురేంద్ర రెడ్డి పాల్గొన్నారు. మైనర్పై తండ్రి అత్యాచారయత్నం బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని ఓ కాలనీలో ఇంటర్ చదువుతున్న బాలికపై తండ్రి అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి తండ్రి మద్యం మత్తులో బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడడంతో గమనించిన తల్లి అడ్డుకుంది. ఘటనపై తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమెదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పెద్ద కష్టం
ఉమ్మడి జిల్లాకే పెద్దదిక్కుగా ఉన్న అనంతపురం సర్వజనాస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా మారింది. రోగులకు సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. ఎటు చూసినా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చికిత్స కోసం వస్తున్న పేదలు సరైన వైద్యం అందక గగ్గోలు పెడుతున్నారు. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలూ అందకుండా పోయాయి. దీంతో సర్వజనాస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వైద్యసేవలు మరింత అధ్వానంగా మారాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం అందుబాటులో వీల్చైర్ లేక ఇబ్బంది పడుతున్న పేషెంట్ వీల్చైర్లలో ఖాళీ డబ్బాలు పెట్టుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సిబ్బంది -
పీఆర్సీ సాధనకు 18న కలెక్టరేట్ వద్ద ధర్నా
● ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గౌని పాతిరెడ్డి రాయదుర్గంటౌన్: పీఆర్సీ సాధనకు ఈ నెల 18న కలెక్టరేట్ వద్ద తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి పిలుపునిచ్చారు. రాయదుర్గంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూల్లో రాయదుర్గం ఏపీటీఎఫ్ జోనల్ సమావేశం శనివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పాతిరెడ్డి హాజరై, మాట్లాడారు. పీఆర్సీ నియమించకుండా చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే కమిషన్ నియమించి ఐఆర్, పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. రాబోవు బదిలీల్లో జీరో సర్వీస్ అవకాశం ఇవ్వాలని, రెండేళ్లకోసారి రేషనలైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలను వెంటనే మంజూరు చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, విద్యా వ్యవస్థలో గందరగోళం తొలగించి పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి, అనిల్కుమార్, రంగప్ప, ఖాసీంపీరా, మల్లికార్జున, ఆంజనేయులు, సునీల్, పాండు, సిద్దేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పూలే మార్గం అనుసరణీయం
అనంతపురం ఎడ్యుకేషన్: సమసమాజ నిర్మాణానికి అనేక పోరాటాలు సాగించిన మహాత్మా జ్యోతిబాపూలే మార్గం అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. పూలే 200వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం వేడుకలు నిర్వహించారు. ముందుగా జెడ్పీ కార్యాలయ ఆవరణలోని పూలే విగ్రహానికి కలెక్టర్ ఓ.ఆనంద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీపీఆర్సీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, విద్యకు జ్యోతిబా పూలే ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమాన హక్కులు, అవకాశాల కోసం పూలే సాగించిన పోరాటాలను కొనియాడారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ చదువు హక్కు ఉందని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడిగా పూలే నిలిచారన్నారు. పూల నాగరాజు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పూలే విగ్రహాల ఏర్పాటు కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వెంకటప్ప, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, బీసీ సంక్షేమశాఖ ఇన్చార్జ్ డీడీ రామసుబ్బారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, డైరెక్టర్లు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్య అనంతపురం సెంట్రల్: అప్పులు తీర్చే మార్గం కానరాక అనంతపురంలోని కోవూరునగర్లో నివాసముంటున్న నిరంజన్కుమార్(43) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. శనివారం తెల్లవారుజామున ఇంట్లోనే వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న నిరంజన్కుమార్ను గమనించిన కుటుంబసభ్యులు గట్టిగా కేకలు వేశారు. చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నాల్గో పట్టణ పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. గోల్షాట్ బాల్ పోటీల్లో అనంత శుభారంభంకదిరి అర్బన్: స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాల క్రీడా మైదానం వేదికగా జూనియర్ బాలబాలికల అంతర్ జిల్లాల గోల్షాట్ బాల్ చాంపియన్షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉత్కంఠగా సాగిన పోటీల్లో బాలుర విభాగంలో విశాఖపట్నంపై అనంతపురం జట్టు విజయం సాధించింది. అలాగే బాపట్లపై విశాఖపట్నం, శ్రీసత్యసాయిపై గుంటూరు, కర్నూలుపై తిరుపతి, జట్లు విజయం సాధించాయి. బాలికల విభాగంలో గుంటూరుపై శ్రీసత్యసాయి జట్టు, బాపట్లపై విశాఖపట్నం జట్టు విజయం సాధించాయి. -
సమాజ నిర్మాణంలో చట్టం కీలక పాత్ర
● జస్టిస్ రాజేంద్ర మీనన్ అనంతపురం: సమాజ నిర్మాణంలో చట్టం కీలక పాత్ర పోషిస్తుందని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఆర్మ్డ్ ఫోర్స్ ట్రిబ్యునల్ చైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లీగల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ జస్టిస్ రాజేంద్ర మీనన్ అన్నారు. అనంతపురంలోని విజయనగర లా కళాశాలలో నూతన అకడమిక్ భవనాన్ని శనివారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ మీనన్ మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి చాలా పవిత్రమైందన్నారు. చట్టబద్ధమైన వాదనల ద్వారా న్యాయాన్ని నిలబెట్టే ఈ వృత్తిలో కొనసాగడమంటే సమాజానికి సేవ చేసే ఒక గొప్ప అవకాశం దక్కినట్లేనని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో స్థిరపడాలంటే సహనం, ఓర్పు ఉండాలన్నారు. జడ్జిమెంట్కు సంబంధించి ఏఏ పుస్తకాలు చదవాలో వివరించారు. జర్నల్స్, లా బుక్స్ నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలని సూచించారు. వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే.. సమాజ సేవకు కృషి చేయాలని కోరారు. ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతి కుమార్ విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో విజయనగర లా కళాశాల కరస్పాండెంట్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ఆలూరి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


