Anantapur Latest News
-
ప్రయాణికులకు శాపం!
ప్రణాళికా లోపం..అనంతపురం క్రైం: ఆర్టీసీ అధికారులు ముందుచూపు లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయాణికులకు శాపంగా పరిణమించేలా ఉన్నాయి. ఇటీవల చంద్రబాబు సర్కారు ఆధునికీకరణ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సర్కారు ఏం చెప్పిందో... ఆర్టీసీ అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఎలక్ట్రిక్ బస్స్టేషన్ నిర్మాణపు పనుల్లో అధికారుల ప్రణాళికా రాహిత్యం కొత్త సమస్యలకు దారితీస్తోంది. అనంతపురం ఆర్టీసీ బస్టాండులో అవసరాలకు మించి స్థలం ఉన్నప్పటికి అధికారులు మాత్రం డిపోలోని గ్యారేజీ ప్రాంతాన్ని నూతన స్టేషన్కు వినియోగిస్తున్నారు. ఇప్పటికే నడుస్తున్న సేవలకు ఆటంకం కలిగే విధంగా ప్రత్యేక స్టేషన్, గ్యారేజీ నిర్మాణ పనులు చేపట్టడంపై ఉద్యోగులు, కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కష్టాలు తప్పవా..? అనంతపురం ఆర్టీసీ డిపో నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. రోజువారీగా వేలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ఈ డిపోలో బస్సుల పార్కింగ్, మరమ్మతులు, సాంకేతిక విభాగాల నిర్వహణకు ప్రత్యేక స్థలాలు ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ బస్సుల కోసం చేపడుతున్న నిర్మాణాలతో ప్రస్తుతం ఉన్న సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోందని సిబ్బంది పేర్కొంటున్నారు. డిపో పరిధిలో బస్సుల స్టాపింగ్, మరమ్మతుల కోసం ఉపయోగిస్తున్న ప్రాంతాలను తగ్గించడం వల్ల భవిష్యత్తులో సాధారణ సర్వీసుల నిర్వహణ కష్టమయ్యే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాకముందే ప్రస్తుతం నడుస్తున్న బస్సులను ఇతర డిపోలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకిలా..? అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి ఉంటే డిపో వెలుపల లేదా అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్లో ఎలక్ట్రిక్ బస్సుల స్టేషన్ను ఏర్పాటు చేసే అవకాశం ఉండేదని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.అలా చేసి ఉంటే స్థల సమస్యలు,సర్వీ సులపై ప్రభావం, సిబ్బంది బదిలీల వంటి అంశాలు తలెత్తేవి కావని అంటున్నారు. సరైన ప్రణాళిక లేకపోతే ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికై నా ఉన్న సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ విషయంపై ఇన్చార్జ్ ఆర్ఎం శ్రీలక్ష్మిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ‘అనంత’ డిపోలోని గ్యారేజీ ప్రాంతంలో ఎలక్ట్రిక్ బస్స్టేషన్ నిర్మాణ పనులు ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటున్న వైనంవిద్యుత్ బస్సులను సంస్థ ద్వారా నడిపాలి. అనంతపురంలో ఉన్న సర్వీసులను రద్దు చేసి స్థానికంగా సిబ్బందిని ఇతర డిపోలకు సాగనంపడాన్ని యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రయాణికుల డిమాండ్ తగ్గట్టుగా సీ్త్రశక్తి పథకానికి బస్సుల సంఖ్య పెంచాలి. ఖాళీ స్థలాన్ని వినియోగించుకోకుండా డిపోలో కొత్త స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో భవిష్యత్లో ప్రయాణికులకు, బస్సులను భద్రపరుచుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరో 20 ఏళ్ల ప్రణాళికతో పనులు చేపట్టి ఉంటే బాగుండేది. – వి. సూరిబాబు, ఏపీపీటీడీ జిల్లా చైర్మన్ భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. -
శుభకార్యానికి వచ్చి తిరిగిరాని లోకాలకు
రాప్తాడు రూరల్: బంధువుల ఇంట్లో పెళ్లి సందడి. ఇంటి నిండా నవ్వులు, సరదా మాటలు. ఇంకొద్ది సేపట్లో అందరూ కలుసుకుని ఆనందంగా గడపాలని ఎదురుచూస్తున్న ఓ కుటుంబాన్ని విధి ఒక్క క్షణంలో ఛిద్రం చేసింది. పెళ్లి ఇంటికి చేరుకునేలోపే జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు ప్రాణాలు కోల్పోగా, తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ విషాద ఘటన రాప్తాడు మండలం లింగనపల్లి క్రాస్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రామగిరి మండలం గంగంపల్లికి చెందిన దూదేకుల బాబు (43), భార్య కులుసుంబీ, ఇద్దరు కుమార్తెలు మౌజు, తాసీంభాను (5)తో కలిసి బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బయలుదేరారు. లింగనపల్లి గ్రామానికి చెందిన బంధువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో కుటుంబమంతా ఆనందంగా సన్నాహాలు చేసుకుంది. తండ్రి, పెద్ద కుమార్తె ముందుగానే పెళ్లి ఇంటికి చేరుకున్నారు. భార్య కులుసుంబీ, చిన్నారి తాసీంభాను కొంత ఆలస్యంగా బస్సులో బయలుదేరి రాప్తాడుకు చేరుకున్నారు. బస్సు దిగిన తర్వాత భర్తకు ఫోన్ చేయడంతో, వారిని తీసుకువెళ్లేందుకు బాబు లింగనపల్లి నుంచి బైకుపై వచ్చాడు. భార్య, చిన్న కుమార్తెను బైకుపై ఎక్కించుకుని తిరిగి పెళ్లి ఇంటి వైపు బయలుదేరాడు. లింగనపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై మలుపు తిరుగుతుండగా బెంగళూరు వైపు నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం బైకును ఢీకొంది. ఢీకొన్న వేగానికి బైకుపై ఉన్న ముగ్గురూ దూరంగా ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో బాబు, ఐదేళ్ల చిన్నారి తాసీంభాను అక్కడికక్కడే మృతి చెందారు. భార్య కులుసుంబీ తీవ్రంగా గాయపడగా 108 అంబులెన్స్లో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందు తోంది. రాప్తాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంటతడి పెట్టించిన రోదనలు అప్పటిదాకా పెళ్లి వేడుకలతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘అయ్యో దేవుడా... ఎంత పని చేశావయ్యా’ అంటూ బంధువులు గుండెలవిసేలా విలపించిన దృశ్యాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. పెళ్లి ఇంటికి చేరాల్సిన తండ్రీ కూతుళ్లు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్న కుటుంబం చిన్నాభిన్నం దూదేకుల బాబు పేరూరు గ్రామంలో ఓ కిరాణా దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య, ఇద్దరు కుమార్తెలతో నిరాడంబరమైన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. చిన్నారుల భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ జీవిస్తున్న ఆ కుటుంబాన్ని ఊహించని ప్రమాదం క్షణాల్లో చిన్నాభిన్నం చేసింది. పెళ్లి వేడుకకు బయలుదేరిన కుటుంబానికి ఎదురైన ఈ విషాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రాప్తాడు మండలం లింగనపల్లి క్రాస్లో ఘోర రోడ్డు ప్రమాదం తండ్రి, కుమార్తె దుర్మరణం -
వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలు
రాప్తాడు రూరల్: రాష్ట్రంలో వ్యవస్థలను శాసించే స్థాయిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇలాంటి అరాచక పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో బుధవారం ఆయన అనంతపురంలో తోపుదుర్తి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. విశ్రాంత జిల్లా జడ్జి కృష్ణప్పతో కలిసి ఆయన తోపుదుర్తి ప్రకాష్రెడ్డి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ... వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఏడాదిన్నర క్రితం జరిగిన మహేశ్వరరెడ్డి ఆత్మహత్య ఘటనను అప్పటి నుంచి హత్యగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేశారన్నారు. ఆ ఘటనను సాకుగా తీసుకుని తోపుదుర్తి కుటుంబంపై నిందలు మోపి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించారని అన్నారు. ప్రజల్లో ఆ కుటుంబాన్ని చులకన చేయాలనే ఉద్దేశంతో వ్యవహరించారని పేర్కొన్నారు. చివరకు దర్యాప్తులో మహేశ్వరరెడ్డి మృతిని ఆత్మహత్యగా నిర్ధారించారన్నారు. అయితే మృతుడి తండ్రి ఫిర్యాదులో ఆత్మహత్యకు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి బెదిరింపు కారణమై ఉండొచ్చని పేర్కొన్నారని గుర్తు చేశారు. అదే ఫిర్యాదులో తన కోడలు అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురై తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కూడా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఏ తప్పూ చేయని తోపుదుర్తి కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నించిందన్నారు. ఎలాంటి ఆరోపణలు నిరూపించలేకపోవడంతో చివరకు అక్రమ కేసు బనాయించారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పేదలకు విస్తృత స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా పూర్తి రక్షణ, గౌరవం కల్పించారని పొన్నవోలు గుర్తు చేశారు. పోలీసులు కూడా పూర్తి స్వతంత్రంగా వ్యవహరించారన్నారు. శాంతిభద్రతల విషయంలో అప్పట్లో ఎస్పీలు ఎమ్మెల్యేల మాటలు కూడా వినే పరిస్థితి ఉండేది కాదన్నారు. చివరకు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్లకు కూడా తగిన రక్షణ కల్పించారన్నారు. నేడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి భద్రతను తొలగించడం సమంజసం కాదని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి తోపుదుర్తి కుటుంబానికి పరామర్శ -
కోర్ కోర్సులతో భవిత పదిలం
సాఫ్ట్వేర్ రంగం ట్రెండ్ మారొచ్చు. ఎంత టెక్నాలజీ మారినా భౌతిక నిర్మాణాలు, యంత్రాలు, విద్యుత్ వ్యవస్థలు ఎప్పటికీ అవసరమే. బుల్లెట్ రైళ్లు, స్మార్ట్ నగరాలు, మెగా ప్రాజెక్ట్ల నిర్మాణం కోర్ ఇంజినీర్ల ద్వారానే సాధ్యమవుతాయి. పవర్ గ్రిడ్ నిర్వహణ, ఎలక్ట్రికల్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయి. కోర్ బ్రాంచ్ కోర్సులు పూర్తి చేస్తే తొలుత తక్కువ ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి వేతనాలు అందుకుంటారు. –ప్రొఫెసర్ బి. దుర్గాప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ అండ్ ఆడిట్, జేఎన్టీయూ అనంతపురం -
యూనియన్ లోన్ విభాగం ప్రారంభం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలంటే అన్ని వర్గాల అభ్యున్నతికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం స్థానిక సంగమేష్నగర్ యూనియన్ బ్యాంకులో కొత్తగా ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ, రీటైల్ లోన్ విభాగాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బ్యాంకర్లు కీలకపాత్ర పోషించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వివిధ సబ్సిడీ రుణాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎంటర్ప్రెన్యూర్స్, రైతులు, మహిళలు, ఎఫ్పీవోలు, నిరుద్యోగ యువతకు అందించి వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. వినియోగదారులు సంతృప్తి చెందేలా బ్యాంకుల సేవలు పెంచాలని తెలిపారు. విద్య, వాహన, గృహ, ఫుడ్ప్రాసెసింగ్ రుణాలు కూడా పెంచాలన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అన్ని వర్గాలకు విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజక వర్గ పరిధిలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు తిరుపతి జోనల్ జనరల్ మేనేజర్ శ్రీపతిశ్రీనివాసన్, రీజనల్ హెడ్ వంశీక్రిష్ణ, ఆర్ఎల్పీ విభాగం అధికారి కొసిగి వెంకటేశ్వర్లు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. విరివిగా రుణాలివ్వాలని కలెక్టర్ సూచన -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం
●కొడవళ్లు, గొడ్డళ్లతో విరుచుకు పడిన టీడీపీ కార్యకర్తలు బ్రహ్మసముద్రం : రాయలప్పదొడ్డిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో హత్యాయత్నం చేశారు. గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. బాధితుల కథనం మేరకు... ఇంటి స్థలం విషయంలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. బుధవారం రాత్రి ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు రాఘవేంద్ర, ప్రసాద్, తిప్పేస్వామి, సురేంద్ర వేటకొడవళ్లు, గొడ్డళ్లతో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు హరిజన హరికృష్ణ, మల్లేశప్ప, కొల్లాపురిపై విచక్షణారహితంగా నరకడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. అంతటితో ఆగక కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. గాయపడిన హరి కృష్ణ, మల్లేశప్ప, కొల్లాపురిని కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన హరికృష్ణ, మల్లేశప్ప, కొల్లాపురి -
సాయం కోసం ఎదురుచూపు
అనంతపురం అగ్రికల్చర్: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా చంద్రబాబు ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి సారించడం లేదు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి ఏడాది రూ.400 కోట్ల మేర ‘అన్నదాత సుఖీభవ’ సొమ్ము ఇవ్వకుండా ఎగ్గొట్టేసిన ప్రభుత్వం... రెండో ఏడాది మాత్రం అతికష్టమ్మీద అందించారు. అందులోనూ 25 వేల మంది వరకు రైతులకు జాబితాలో చోటు కల్పించలేదు. ఇక ఈ ఏడాది సుఖీభవ కింద మొదటి విడత ఎప్పుడిస్తారో కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే జిల్లాలో ఖరీఫ్ మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు దక్కులు చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా పంట పెట్టుబడులకు ఇబ్బంది పడుతూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పథకాల అమలు అస్తవ్యస్తం ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు, అలాగే 2024 రబీ, 2025 ఖరీఫ్లో కరువు మండలాల రైతులకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు ఇవ్వాల్సిన పెట్టుబడిరాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) గురించి చంద్రబాబు ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. గత రెండేళ్లకు సంబంధించి రూ.120 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్లో పెట్టేశారు. ఇక వాతావరణ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా లాంటి పంటల బీమా పథకాలను అస్తవ్యస్తం చేయడంతో రైతులకు పరిహారం రాకుండా పోతోంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉచితంగా అమలు చేసిన పంటలబీమాను చంద్రబాబు ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలని భారం మోపడంతో పాటు నిబంధనల మేరకు పరిహారం ఇవ్వకుండా మోసం చేస్తుండటంతో రైతులు మండిపడుతున్నారు. ● రబీ–2024, ఖరీఫ్–2025లో జిల్లా రైతులు తమ వాటా కింద రూ.కోట్లలో ప్రీమియం చెల్లించారు. ఐదు వ్యవసాయ సీజన్లకు సంబంధించి ఇన్సూరెన్స్ ఏమైందో పాలకులు చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి తమ వాటా ప్రీమియం కంపెనీలకు చెల్లించకపోవడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతున్నట్లు పలువురు చెబుతున్నారు. పంటలు పండక అప్పులపాలై ఈ రెండేళ్లలో దాదాపు 100 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క బాధిత కుటుంబానికి కూడా ఎక్స్ గ్రేషియా చెల్లించకుండా మభ్యపెడుతున్నారు. ఉత్తుత్తి పంట రుణాలు రైతులకు మేలు జరిగేలా బ్యాంకుల ద్వారా పంట రుణాలు చురుగ్గా కొనసాగుతున్నట్లు చెబుతున్నా.. వాస్తవంగా రైతుల చేతికి పైసా వచ్చే పరిస్థితి ఉండదు. రైతులే బ్యాంకులకు వడ్డీ రూపంలో చెల్లించి గతంలో తీసుకున్న పంట రుణాన్ని నవీకరణ (రెన్యూవల్) చేసుకుంటున్నారు. పంట రుణం కింద బ్యాంకులు ఒకసారి మాత్రమే భూవిస్తీర్ణం ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకు రుణం ఇస్తుంది. ఇక ప్రతి ఏటా ఖరీఫ్లో రైతులు ఆ మొత్తానికి వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేసుకుంటారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఇతరత్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనం వస్తుందనే ఆలోచనతో బ్యాంకుల్లో తీసుకున్న రుణాన్ని రెన్యూవల్ చేసుకుంటారు. ఎరువు.. బరువు ● ఎరువుల ధరలు బస్తాపై రూ.250 నుంచి రూ.350 వరకు పెంచేశారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెంచడంతో రైతులకు ఎరువు ‘బరువు’ పెరిగిపోయింది. కరువు రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కారు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. రెండేళ్లు పూర్తయినా ఇన్పుట్, ఇన్సూరెన్స్ మాటెత్తని సర్కార్ తొలిఏడాది ఎగ్గొట్టి.. రెండో ఏడాది అరకొర ‘సుఖీభవ’ సాయం మూడో ఏడాది కింద ఎప్పుడిస్తారో స్పష్టత ఇవ్వని చంద్రబాబు ఖరీఫ్ పంట పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్న అన్నదాతలు -
చెనిక్కాయ ఇవ్వలేక.. కంది కథ
● రైతులకు అధికారుల సలహా అనంతపురం అగ్రికల్చర్: ప్రభుత్వం రాయితీపై విత్తన వేరుశనగ కాయల(చెనిక్కాయల)ను పూర్తిస్థాయిలో ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే దానిస్థానంలో కంది వేసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. గతేడాది సాగులోకి వచ్చిన విస్తీర్ణం కన్నా అదనంగా కంది పంట వేసేలా రైతులకు నచ్చజెప్పాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. గత ఖరీఫ్లో కంది ఏకంగా 1.35 లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చిన విషయం తెలిసిందే. జిల్లా చరిత్రలో తొలిసారిగా వేరుశనగ పంటను అధిగమించి కంది అత్యధిక విస్తీర్ణంతో మొదటి స్థానం ఆక్రమించింది. ఈ ఏడాది 1.50 లక్షల హెక్టార్లు దాటించేలా చూడాలని చెబుతున్నారు. కందితో పాటు మొక్కజొన్న, ఆముదం లాంటి పంటలను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి కారణం రాయితీ విత్తన వేరుశనగ సకాలంలో తగినంత ఇవ్వలేకపోవడమే. సవాల్గా మారిన విత్తన సేకరణ ఈ ఖరీఫ్లో అనంతపురం జిల్లాకు 56 వేల క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లాకు 72 వేల క్వింటాళ్లు రాయితీ విత్తన వేరుశనగ అందివ్వాలని కేటాయింపులు చేశారు. అయితే గత ఖరీఫ్, రబీలో రైతులకు పంపిణీ చేసిన వేరుశనగకు సంబంధించి సరఫరా చేసిన ప్రాసెసింగ్ ప్లాంట్లు, మిల్లర్లకు రాష్ట్ర ప్రభు త్వం రూ.90 కోట్ల మేర బకాయిలు చెల్లించకపోవడంతో ఈసారి విత్తన కొరత ఏర్పడింది. జిల్లాలో గత రబీలో రైతులు పండించిన వేరుశనగను జిల్లాకు చెందిన మిల్లర్లు కొనలేకపోయారు. బకాయిలు ఇంకొంత చెల్లించడంతో పాటు రైతులు చెల్లించే నాన్సబ్సిడీ మొత్తం తమకు అందిస్తే మరికొంత విత్తనం సరఫరా చేస్తామని మంగళవారం అనంతపురం కలెక్టర్ ఆనంద్ సమక్షంలో జరిగిన సమావేశంలో మిల్లర్లు విన్నవించుకున్నారు. -
అదనపు బాధ్యతల నుంచి తప్పుకున్న ఖుష్బూకొఠారి
● సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎఫ్ఏసీగా శ్రీనివాసరావుకు బాధ్యతలు అనంతపురం ఎడ్యుకేషన్: ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ ఒత్తిళ్ల కారణంగా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా ఉపసంచాలకురాలు (డీడీ) ఎఫ్ఏసీ బాధ్యతల నుంచి తప్పించాలని కోరిన బీసీ సంక్షేమశాఖ జిల్లా ఉపసంచాలకురాలు ఖుష్బూ కొఠారి అభ్యర్థనకు కలెక్టర్ ఆనంద్ ఆమోదం తెలిపారు. దీంతో సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎఫ్ఏసీ బాధ్యతలను గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావుకు అప్పగించారు. ఖుష్బూ కొఠారి గత ఏడాది జూలై నుంచి అదనంగా సాంఘిక సంక్షేమశాఖ డీడీ (ఎఫ్ఏసీ) బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు. అటు బీసీ సంక్షేమ శాఖ, ఇటు సాంఘిక సంక్షేమ శాఖ రెండు కీలక బాధ్యతలతో పాటు జిల్లాలోని వందకు పైగా హాస్టళ్ల పర్యవేక్షణ చేయాల్సి రావడం ఆమైపె తీవ్ర పని భారాన్ని మోపింది. ఇదిలా ఉండగా.. సంక్షేమ హాస్టళ్లలో తరచూ తలెత్తుతున్న వివిధ సమస్యలు, వివాదాలు, పరిపాలనా అంశాలు అదనపు ఒత్తిడిని పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతుండటంతో ఈ బాధ్యతలను కొనసాగించడం కష్టసాధ్యంగా మారిందని సమాచారం. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఎఫ్ఏసీ బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని ఆమె ఉన్నతాధికారులను కోరుతూ వచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఆమె విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూల నిర్ణయం తీసుకుని బాధ్యతల మార్పునకు ఆమోదం తెలిపారు. దీంతో సాంఘిక సంక్షేమశాఖ డీడీ (ఎఫ్ఏసీ) బాధ్యతలను గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావుకు అప్పగించారు. బుధవారం ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. -
జీజీహెచ్లో కిడ్నాప్ కలకలం
అనంతపురం సిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలో రోజుకో సంచలన ఘటన చోటుచేసుకుంటూనే ఉంది. తాజాగా బుధవారం పదేళ్ల బాలికను ఓ యువకుడు అపహరించేందుకు యత్నించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన బాబ్జాన్, తస్మియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడో సారి గర్భం దాల్చిన తస్మియాను కాన్పు కోసం కుటుంబసభ్యులు రెండు రోజుల క్రితం సర్వజనాస్పత్రిలో చేర్పించారు. మంగళవారం రాత్రి పండంటి ఆడబిడ్డకు తస్మియా జన్మనిచ్చింది. మనస్థిమితం లేక.. మంగళవారం రాత్రి నుంచి బాబ్జాన్ పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తూ ఆస్పత్రి ఆవరణలో సంచరించసాగాడు. కుటుంబసభ్యులు సముదాయించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఎమర్జెన్సీ వార్డు వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఉన్న ఓ బాలికను తన కుమార్తెగా భావించిన బాబ్జాన్ వెంటనే ఆ చిన్నారిని ఎత్తుకునే ప్రయత్నం చేశాడు. అజ్ఞాత వ్యక్తి ఒక్కసారిగా తనను ఎత్తుకోవడంతో భయపడిన బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో అక్కడే ఉన్న బాలిక కుటుంబసభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై బాబ్జాన్ను ఔట్పోస్టు పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న అనంతపురం రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని బాబ్జాన్ను స్టేషన్కు తరలించి, విచారణ చేపట్టారు. -
ఇంజినీరింగ్లో కోర్ బ్రాంచులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గిపోతోంది. ఐదేళ్ల క్రితం ఈ బ్రాంచ్ల్లోని సీట్లు, ప్రవేశాల సంఖ్యకు.. గత విద్యా సంవత్సరంలోని సీట్లు, ప్రవేశాల సంఖ్యకు మధ్
అనంతపురం: కంప్యూటర్ సైన్సెస్, అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన వారు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో ‘సాఫ్ట్వేర్’ కొలువులు దక్కక చతికిలపడుతున్నారు. ఏపీఈఏపీ సెట్లో అర్హత సాధించిన వారిలో 80 శాతం మంది సీఎస్ఈ, డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ), డిజైన్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఆటోమేషన్ తదితర కోర్సుల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఈసీఈ తదితర కోర్ బ్రాంచుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఈసీఈ మినహా మిగిలిన కోర్ బ్రాంచ్ విద్యార్థుల సంఖ్య మరీ తక్కువగా ఉంటోంది. 8 శాతమే స్కిల్డ్ ఉద్యోగాలు ఇంజినీరింగ్లో ప్రతి 100 సీట్లలో 80 శాతం మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్సెస్ వాటి అనుబంధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో కొలువులు తగ్గుముఖం పట్టడంతో 8 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి. మిగిలిన వారు కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తక్కువ జీతంతో వచ్చే కొలువులు దక్కుతున్నా.. గణనీయమైన ప్యాకేజీ కావాలన్న ఆశతో అవకాశాలను వదులుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోడింగ్ లేకపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై సాధికారిత లేకపోవడంతో ఉపాధి అవకాశాలను దూరం చేస్తున్నాయి. ● బీటెక్ అనంతరం మూడు, నాలుగు సంవత్సరాల సమయాన్ని కాలయాపన చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల అనంతరం ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే.. ఈమధ్య కాలానికి ఉద్యోగం చేసినట్లు సర్వీస్ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుభవం ఉందని చెబితే.. అందుకు తగ్గట్టు నైపుణ్యాలు లేనందున రెండు, మూడు నెలలకే ఇంటికి తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నైపుణ్యాలు పెంపొందించుకోకపోతే కంప్యూటర్ సైన్సెస్ బ్రాంచ్ కోర్సుల్లో బీటెక్ పూర్తి చేసినా ఫలితం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నైపుణ్యం కలిగిన అధ్యాపకులేరీ? బీటెక్ 2, 3, 4 సంవత్సరాల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు తప్పనిసరి. కంప్యూటర్ సైన్సెస్, ఐటీ ఆధారిత కోర్సుల్లో నైపుణ్యం గల అధ్యాపకుల కొరత అధికంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ వంటి ఐటీ ఆధారిత కోర్సులకు ఎంటెక్, పీహెచ్డీ పూర్తి చేసిన అధ్యాపకులు లేరు. ఏఐసీటీఈ మాత్రం ‘స్వయం’ (ఆన్లైన్) 20 కోర్సులు పూర్తి చేసిన వారు సీఎస్ఈ, వాటి ఆధారిత కోర్సుల్లో అధ్యాపకులుగా ఉండొచ్చని నిర్దేశించింది. ఈ కోర్సులు చేసి అధ్యాపకులుగా చెలామణి అవుతున్నారు. ఫలితంగా ఈ కోర్సుల విద్యార్థులకు తగిన శిక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు అధికంగా కంప్యూటర్ సైన్సెస్ ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నా.. అందుకు అనుగుణంగా అధ్యాపకులు లేకపోవడంతో నైపుణ్యాల కొరత వేధిస్తోంది. సాఫ్ట్వేర్ కొలువులకు వెళ్లే అభ్యర్థులను నిమిషాల వ్యవధిలోనే కొత్త కోడ్ రాయాలని బహుళ జాతి కంపెనీలు నిర్దేశించి.. ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. దీంతో సదరు అభ్యర్థులు నైపుణ్యాల లేమి కారణంగా ఇంటర్వ్యూల్లో విఫలమవుతున్నారు. 80 శాతం మంది కంప్యూటర్ సైన్సెస్, డేటా సైన్సెస్ వైపు మొగ్గు ఆ కోర్సులు బోధించే అధ్యాపకుల్లో వెంటాడుతున్న నైపుణ్యాల కొరత సాఫ్ట్వేర్ కొలువులు దక్కకనిరాశానిస్పృహలు ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్న కోర్ బ్రాంచుల వైపు ఆసక్తి చూపనివిద్యార్థులు -
యాప్తో విక్రయించకుంటే లైసెన్సులు రద్దు
ఆత్మకూరు: ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు (యూరియా, డీఏపీ) విక్రయించకపోతే ఎరువుల దుకాణాల లైసెన్స్లను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి సూచించారు. బుధవారం ఆత్మకూరులోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఎంత సరుకు విక్రయించారు? ఎంత మేరకు రికార్డుల్లో నమోదు చేశారు? అన్న విషయాలను తెలుసుకున్నారు. విక్రయాలకు సంబంధించిన రికార్డులు పక్కాగా లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా రైతులకు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని తమ దృష్ఠికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తన వేరుశనగ కోసం రైతులు రైతు సేవ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకట్కుమార్, ఏఓ జ్యోతి విజయ్కుమార్ పాల్గొన్నారు. ప్రాధేయపడినా ఒక్కరూ చేరలేదు గుమ్మఘట్ట: తాళ్లకెరలోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో 2026–2027 విద్యాసంవత్సరానికి గాను ఒకటో తరగతి అడ్మిషన్ ఒక్కటీ కాలేదు. గ్రామంలో 75 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. ఇందులో ఒకటో తరగతిలో చేరడానికి అర్హత ఉన్న పిల్లలు నలుగురు ఉన్నారు. ఉపాధ్యాయులు అడ్మిషన్ కోసం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ద్వారా అందే ఉచిత విద్య, సౌకర్యాల గురించి వివరించారు. ఎంత ప్రాధేయపడినా పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేయలేదు. ఒకటో తరగతికి ఒక్క విద్యార్థీ లేకుండా పోయారు. ఇక్కడ రెండో తరగతి నుంచి ఏడో తరగతి వరకు 45 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇదిలా ఉండగా మండలంలోని కృష్ణాపురం, కోనాపురం, గొల్లలదొడ్డి గ్రామాలలో అయితే ఒక్కొక్కరు మాత్రమే ఒకటో తరగతిలో ప్రవేశం పొందడం గమనార్హం. ఎంపీఆర్ను పర్యాటకంగా తీర్చిదిద్దుతాం గార్లదిన్నె: పెనకచెర్లలోని మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్)ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి ఎంపీఆర్ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న డ్యాం గేట్ల మరమ్మతును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఎంపీఆర్ (డ్యాం) వద్ద వసతుల కల్పన, రోడ్డు నిర్మాణం, బోటింగ్ సౌకర్యం, వసతి సముదాయాలకు మరమ్మతులు, సుందరీకరణ పనులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో రిసార్ట్ హోటల్ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న భవన సముదాయ గెస్ట్ హౌస్లను పునరుద్దరిస్తామని చెప్పారు. డ్యాం అందాలను, బ్యాక్ వాటర్ను సురక్షితంగా ప్రజలు వీక్షించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్, టూరిజం, రోడ్డు భవననాలు, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, అటవీ, పంచాయతీ అధికారులు సమన్వయంతో డ్యాం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్రావు, జిల్లా పర్యాటక అధికారి ఓబులమ్మ, తహసీల్దార్ ఈరమ్మ, ఇన్చార్జ్ ఎంపీడీఓ గోపాల్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
జీడిపల్లి రిజర్వాయర్ పరిశీలన
బెళుగుప్ప/ఆత్మకూరు: మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ను అసిస్టెంట్ కలెక్టర్లు శర్వాన్కుమార్రెడ్డి, హరిఓం పాండియా, ఆదిత్య శర్మ, నమ్రత్ అగర్వాల్, పవన్ తేజ, ప్రియ, సుయాస్ కుమార్, వెంకటేశ్ బన్నాలు బుధవారం పరిశీలించారు. జీడిపల్లి పంపు హౌస్ వద్ద అసిస్టెంట్ కలెక్టర్లకు తహసీల్దార్ అనిల్కుమార్ స్వాగతం పలికారు. రిజర్వాయర్ స్థితిగతులను వివరించారు. అనంతరం హంద్రీ–నీవా చీఫ్ ఇంజినీర్ నాగరాజ,హెచ్ఎన్ఎస్ఎస్ ఈఈ శ్రీనివాసులు,రెవెన్యూశాఖలఅధికారులతో అసిస్టెంట్ కలెక్టర్లు సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలతో కృష్ణాజలాలు జీడిపల్లికి చేరుకుంటాయని హంద్రీ–నీవా ఉన్నతాధికారులు వివరించగా, రిజర్వాయర్ పరిసరాలు, పంటల సాగుపై మండల రెవెన్యూ అధికారులు వివరించారు. అంతకుముందు ఆత్మకూరు, సిద్దరాంపురం గ్రామ పొలాల్లో రైతులు సాగు చేసిన టమాట, మామిడి పంటలను పరిశీలించారు. మార్కెట్ పరిస్థితిపై రైతులతో ఆరా తీశారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, ఆర్ఐ నగేష్బాబు, హెచ్ఎన్ఎస్ఎస్ డీఈ రామసుబ్బయ్య, రిజర్వాయర్ ఏఈలు పృధ్వి, దాదాఖలందర్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ ● 12 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.50 వేల నగదు అపహరణగుంతకల్లు: కాశీ యాత్రకు వెళ్లిన ఓ రైల్వే ఉద్యోగి ఇంట్లో దొంగలు చొరబడి 12 తులాల బంగారం ఆభరణాలతోపాటు 50 తులాల వెండి, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక డీజిల్ షెడ్లో పని చేసే జే. తిమ్మరాజు పాత గుంతకల్లులోని అంకాలమ్మగుడి సమీపంలోని సచివాలయం వద్ద నివాసముంటున్నారు. మంగళవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తిమ్మరాజు కాశీ యాత్రకు వెళ్లారు. ఇదే అదునుగా దొంగలు మంగళవారం అర్ధరాత్రి ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న విలువైన వస్తువులతోపాటు నగదు అపహరించి పరారయ్యరు. ఇంటి తాళం తెరిచి ఉండటం గమనించిన స్థానికులు తిమ్మరాజుకు ఫోన్లో సమాచారం చేరవేశారు. టూటౌన్ పోలీసులకు తిమ్మరాజు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా.. వెంటనే ఇంటి వద్దకు చేరుకుని పరిశీలించారు. క్లూజ్ టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. టూటౌన్ సీఐ వంశీకృష్ణ మాట్లాడుతూ దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. టపాసుల నిల్వ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలిఅనంతపురం సెంట్రల్: టపాసుల నిల్వ కేంద్రంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. నగర శివారులోని ఫెడ్కాన్ క్రాకర్స్ నిల్వ కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో భద్రపరిచిన నిల్వల వివరాలు చెక్లిస్ట్ ప్రకారం పరిశీలించారు. రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి శాఖల సమన్వయంతో సమస్యలు లేకుండా ఫెడ్కాన్ క్రాకర్స్ కేంద్రంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉదయభాస్కర్, ఆర్ఐ సందీప్కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘పీఎం సూర్యఘర్’ పనులు వేగవంతం చేయండి
అనంతపురం టౌన్: పీఎం సూర్యఘర్ పనులు వేగవంతం చేయాలని ఇంధన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. బుధవారం విద్యుత్ శాఖ ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సోలార్ రూప్టాప్ ప్రక్రియ పనులు ఆగస్టు ఆఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 17,500 యూనిట్ల మంజూరులో 4,700 ఇళ్లపై మాత్రమే ఇప్పటి వరకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేశారన్నారు. వచ్చే రెండు నెలల్లో 100 శాతం పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్యకూడేరు: కూడేరు మండల పరిధిలోని కొర్రకోడుకు చెందిన గొల్ల రామకృష్ణప్ప (63) బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతనిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రికి 7.30 గంటల సమయంలో మృతి చెందాడు. మృతునికి భార్య అంజనమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆరోగ్య సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. పశుసంపదతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ఉరవకొండ: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పశుసంపద కీలకమని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమచంద్ తెలిపారు. బుధవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాలకు చెందిన పశుసంవర్ధక శాఖ సిబ్బందికి జంతు కేంద్రీకృత పునరుత్పత్తి నిర్వహణ విధానంపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేడీ హాజరై మాట్లాడుతూ రైతులకు సుస్థిర ఆదాయం అందించే విధంగా పాడి పరిశ్రమను పోత్సహించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పశుసంపద పెంపుతో గ్రామసంపద పెంపు అనే కార్యక్రమంలో పశువు ప్రత్యుత్పత్తి ఉత్పాదకతపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ పశు కేంద్రీకృత విధానం ద్వారా పశువులను చూడి కట్టించే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గర్భధారణ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. పశువులు చూడి కట్టడం ఒక నెల ఆలస్యమైయితే రైతు రూ.6 వేలు నష్టపోతాడ న్నారు. కార్యక్రమంలో ఉరవకొండ ఏడీ డాక్టర్ ఉమామహేశ్వర్, నాగమల్లేశ్వరావు, డీడీ డాక్టర్ పెద్దన్న, రీసోర్స్ పర్సన్ కిరణ్రెడ్డి పాల్గొన్నారు. ‘టెట్’ టెన్షన్ తొలగించండిఅనంతపురం ఎడ్యుకేషన్: విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ)– 2009కు సవరణలు చేసి సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఉపాధ్యాయ భవన్లో జిల్లా అధ్యక్షుడు నరేష్కుమార్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గౌని పాతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరేష్కుమార్, ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి మాట్లాడుతూ టెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీఈ–2009 చట్టానికి తగిన సవరణలు చేయాలని కోరారు. ఒకవేళ టెట్ నుంచి మినహాయింపు సాధ్యం కాకపోతే, సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించి అర్హత మార్కులను తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీకి చైర్మన్ను నియమించాలని, ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర జీఓల కమిటీ సభ్యుడు గురురాజ, రాష్ట్ర సాంస్కృతిక కమిటీ సభ్యుడు గోపాల్నాయక్, జిల్లా గౌరవాధ్యక్షుడు దేశాయ్ నాగరాజు, సబ్ కమిటీ సభ్యులు రామకృష్ణ, సూర్యనారాయణ, ఓబన్న, రంగనాయకులు, రవి, తూమాటి రమేష్బాబు, రాష్ట్ర కౌన్సిలర్లు శివారెడ్డి, జె.వెంకటేశులు, పుల్లయ్య, సూర్యనారాయణ, అనిల్కుమార్, లక్ష్మీప్రసాద్, మదన్మోహన్ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని వివిధ యాజమాన్య పాఠశాలల్లో 2012కు ముందు నుంచి విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను టెట్ పరీక్షల నుంచి మినహాయించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహించిన ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రమణారెడ్డి మాట్లాడారు. 2012కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో, రాష్ట్ర సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ టెట్ నుంచి మినహాయింపు సాధ్యం కాకపోతే, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించి అర్హత మార్కులను తగ్గిస్తూ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా శాఖ తరఫున పలు సమస్యలను రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుని అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించేలా కృషి చేయాలని కోరారు. -
సీఎస్ఈ వైపు వెళ్లడం మంచిది కాదు
కోర్ బ్రాంచ్ల వైపు వెళ్తే రెండు విధాలుగా అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ వైపు వెళ్లొచ్చు. లేదా మౌలిక సదుపాయాల రంగాల్లో ఉద్యోగాలు దక్కుతాయి. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు స్వయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు దక్కుతాయి. 100కు 80 మంది కంప్యూటర్ సైన్సెస్ చదువుతున్నారు. ఏఐ రావడంతో ఉపాధిపై దెబ్బ పడుతోంది. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) వైపు వెళ్లడం లేదు. అంకితభావంతో కృషి చేస్తే సర్వీసెస్లో కొలువు సాధించవచ్చు. – డాక్టర్ బి.రమేష్ బాబు, ప్రిన్సిపాల్, పీవీకేకే కళాశాల -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి
రాప్తాడు రూరల్: చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రజల వద్ద ఎండగట్టాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ రాప్తాడు నియోజకవర్గ సదస్సు మంగళవారం అనంతపురం రూరల్ కళ్యాణదుర్గం రోడ్డు బీజీఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత భూకబ్జాలు, అక్రమ వసూళ్లు పెరిగిపోయాయని ఆరోపించారు. రెండేళ్ల పాలన ప్రజలకు వెన్నుపోటు, వంచన, విద్రోహం, వినాశనాన్ని మాత్రమే మిగిల్చిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో పాపంపేట ప్రాంతంలో ఇళ్లను కూల్చివేయడం, బినామీల పేరుతో ఈ ప్రాంతంలో వందలాది ఎకరాల భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్నారు. నియోజకవర్గంలో పరిటాల సునీత కుటుంబం ఆధ్వర్యంలో భూకబ్జాలు, సెటిల్మెంట్ రాజకీయాలు సాగుతున్నా యని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. మహిళలకు ప్రకటించిన నగదు సాయం, రైతులకు హామీ ఇచ్చిన పథకాలు, నిరుద్యోగ భృతి అమలు కాలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో అమలైన ఆసరా, చేయూత, సున్నావడ్డీ వంటి సంక్షేమ పథకాలను నిలిపివేశారన్నారు. పేరూరు డ్యాంకు వైఎస్సార్సీపీ హయాంలో నీళ్లు తీసుకొచ్చి రైతులకు మేలు చేశామన్నారు. పరిటాల సునీత వచ్చిన తర్వాత డ్యాంలో నీళ్లు లేక రైతులకు అన్యాయం చేశారన్నారు. హంద్రీ–నీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ కారణంగా వేలాది బోర్లు ఎండిపోయాయన్నారు. ఇందుకు పరిటాల సునీత, అధికార పార్టీ నాయకులే బాధ్యత వహించాలన్నారు. జగన్ ప్రభుత్వం ప్రారంభించిన గృహ నిర్మాణ కార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారన్నారు. పరిటాల సునీత రాసిన లేఖ 50 వేల నిరుపేద కుటుంబాలకు మరణశాసనం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెచ్చిన పీఏబీఆర్ తాగునీటి పథకం పైప్లైన్ పనులను కూడా రాజకీయ కారణాలతో అడ్డుకున్నారని ఆరోపించారు. తన గురించి మాట్లాడే అర్హత సునీతకు లేదన్నారు. అధికారాన్ని పరిటాల కుటుంబం దోపిడీకి వాడుకుందన్నారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం రానివ్వనని భరోసా ఇచ్చారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే ప్రజలు ఇప్పటికే ప్రభుత్వంపై పూర్తిగా విసుగు చెందారన్నారు. భవిష్యత్తులో వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు చంద్రకుమార్, మారుతీప్రసాద్, నాగార్జున, మెట్టు గోవిందరెడ్డి, నాయకులు గంగుల సుధీర్రెడ్డి, మామిళ్లపల్లి అమర్నాథ్రెడ్డి, ఓబుగారి హరినాథరెడ్డి, బండి పవన్, గోవిందరెడ్డి, సాకే వెంకటేశు, మజ్జిగ శంకరయ్య, ఆత్మకూరు చంద్రశేఖర్రెడ్డి, నియోజకవర్గ వ్యాప్తంగా మండల స్థాయి ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ సదస్సుకు హాజరైన వైఎస్సార్ సీపీ నాయకులు నా గురించి మాట్లాడే అర్హత పరిటాల సునీతకు లేదు రాబోయేది జగన్ ప్రభుత్వమే.. స్థానిక ఎన్నికల్లో విజయం మనదే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
ప్రజావ్యతిరేక పాలనకు మూల్యం తప్పదు
అనంతపురం అర్బన్: ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యాసవర సరుకుల ధరల పెంపును నిరసిస్తూ మంగళవారం వామపక్షపార్టీల నాయకులు, కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా రాస్తారోకో, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల నాయకులు నగరంలో ర్యాలీ నిర్వహించి క్లాక్టవర్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఎస్యూసీఐ, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ), సీపీఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శులు పాళ్యం నారాయణస్వామి, ఓ.నల్లప, కిషోర్బాబు, రాఘవేంద్ర, నాగరాజు, వేమన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. ధరలు పెంచి ప్రజలను దోపిడీ చేస్తోందని దుమ్మెత్తిపోశారు. నెల రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగుసార్లు, వంటగ్యాస్ ధరలు రెండుసార్లు పెంచిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పెరిగిన ధరలతో పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయాయని ఆందో ళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేరుతో ఢిల్లీ వేదికగా తిరగబడ్డారని, ఇప్పటికై నా ప్రభుత్వాలు ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వామపక్షపార్టీల నాయకులు శ్రీరాములు, రామిరెడ్డి, పద్మావతి, పార్వతీప్రసాద్, లింగమయ్య, రమణ, వలి, ప్రకాష్, పరమేష్, కుళ్లాయిస్వామి, కృష్ణ, వీరనారప్ప, చంద్రశేఖర్, మల్లీశ్వరి, రాధమ్మ, తబ్రేజ్ పాల్గొన్నారు. -
‘అక్షరాంధ్ర’ రిజిస్ట్రేషన్ గడువులోగా పూర్తి చేయాలి
రాప్తాడు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడానికి వలంటీర్ టీచర్లు – నిరక్షరాస్య అభ్యాసకుల జతపరిచే నమోదు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం రాప్తాడులోని స్వర్ణ గ్రామ సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్ ‘ఉల్లాస్ – అక్షరాంధ్ర’ కార్యక్రమం నమోదు ప్రక్రియను పరిశీలించారు. వెల్ఫేర్ అసిస్టెంట్లతో మాట్లాడి అభ్యాసకుల నమోదు పురోగతిపై ఆరా తీశారు. రాప్తాడు మండలంలో మొదటి విడతలో అక్షరాస్యత సాధించిన అభ్యాసకుల వివరాలు, రెండోదశ కార్యక్రమానికి గుర్తించిన అభ్యాసకుల సంఖ్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట వయోజన విద్య ఉపసంచాలకులు ఎస్.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయలక్ష్మి, పర్యవేక్షకులు జీవీ రమణ, డీఆర్డీఏ ఏపీఎం సునీత, ఉపాధి హామీ పథకం ఏపీఓ సావిత్రి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కంటైనర్ ఎక్కిన రైలింజన్ గార్లదిన్నె: సాధారణంగా గూడ్సురైలులో లారీలు ఇతర వాహనాలను తీసుకెళ్లడం చూస్తుంటాం. అయితే రైలు ఇంజిన్ను కంటైనర్ లారీలో తీసుకెళ్లడం ప్రజలు వింతగా తిలకించారు. మంగళవారం బెంగళూరు నుంచి ఒడిశాకు రైలింజన్ను తీసుకెళ్తున్న లారీ కంటైనర్ గార్లదిన్నె మండలం ఎగువపల్లి జాతీయరహదారి వద్ద కాసేపు ఆగింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు రైలింజన్ను ఎంతో ఆసక్తిగా చూశారు. -
22 మండలాల్లో వర్షం
● లోతట్టు ప్రాంతాలు జలమయం ● ఉరవకొండలో దంచికొట్టిన వానఅనంతపురం అగ్రికల్చర్: నైరుతి ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలోని 22 మండలాల పరిధిలో వర్షం కురిసింది. 5.7 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బెళుగుప్ప మండలంలో 25.4 మి.మీ, కణేకల్లు మండలంలో 25 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక రాయదుర్గం మండలంలో 20.6 మి.మీ, బ్రహ్మసముద్రం 14.4, గార్లదిన్నె 12.6, శెట్టూరు 10.8, యాడికి మండలంలో 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జూన్ సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా, ప్రస్తుతానికి 28.7 మి.మీ నమోదైంది. ఈనెలలో 4 వర్షపు రోజులు నమోదైనా... ఇంకా చాలా మండలాల్లో పదునైన వర్షం కురవలేదు. వజ్రకరూరు, గుత్తి, తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో సాధారణం కన్నా 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఉరవకొండలో భారీ వర్షం ఉరవకొండ: ఉరవకొండలో మంగళవారం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏకధాటిగా కురిసిన వర్షంతో క్లాక్టవర్ వద్ద మోకాలు లోతు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రోడ్ల మీద ఆకుకూరలు, కూరగాయలు విక్రయించే వ్యాపారులు అవస్థలు పడ్డారు. అయితే చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా వర్షం కురవకపోవడం గమనార్హం. -
పరిమళించిన మానవత్వం
● బుర్రా జయకృష్ణ కుటుంబానికి గ్రామస్తుల అండ ● రూ.1.15 లక్షల ఆర్థిక సాయం రాప్తాడు రూరల్: మానవత్వం పరిమళించింది. కష్టాల్లో ఉన్న ఓ కుటుంబానికి అండగా నిలవాలని చేసిన పిలుపునకు గొప్పగా స్పందించింది. కరువుతో పోరాడే అనంతపురం నేలలో మానవత్వం మాత్రం ఎప్పుడూ పచ్చగా ఉంటుందని మరోసారి నిరూపించింది. అనంతపురం రూరల్ మండలం కట్టకిందపల్లి గ్రామానికి చెందిన బుర్రా జయకృష్ణ కుటుంబ దయనీయ పరిస్థితిపై ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన ప్రత్యేక కథనం పలువురు దాతల హృదయాలను కదిలించింది. కిడ్నీలు దెబ్బతిని మంచానికే పరిమితమైన జయకృష్ణ కుటుంబానికి ఆయన భార్యే ప్రధాన ఆసరా. ఆమె కూడా ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇద్దరు చిన్నారులతో జీవనం సాగించడం భారంగా మారింది. ఈ పరిస్థితిని వివరిస్తూ ‘కష్టాల సుడిగుండం.. కన్నీటి ప్రయాణం’ శీర్షికతో ప్రచురించిన కథనం పలువురిని కదిలించింది. ముఖ్యంగా కట్టకిందపల్లి గ్రామస్తులు పెద్ద మనసు చాటుకున్నారు. గ్రామస్తులంతా స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి రూ. లక్ష అందించారు. అదేవిధంగా జయకృష్ణ భార్య కుమారి ఫోన్పే ఖాతాకు వివిధ ప్రాంతాల నుంచి రూ.15 వేల మేర విరాళాలు అందాయి. ఆపద సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ జయకృష్ణ, ఆయన భార్య కుమారి, పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపే లక్ష్యం
● డీఈఓ శ్రీనివాసరావు అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో 1.2 తరగతుల విద్యార్థులకు పునాది స్థాయిలో భాషా, గణిత నైపుణ్యాలను మెరుగుపరచడమే ‘జ్ఞాన ప్రకాశ్ ఇయర్–3’ శిక్షణ లక్ష్యమని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అనంతపురం, తాడిపత్రి, గుత్తి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లో ఆరు రోజులుగా జరుగుతున్న శిక్షణ మంగళవారం ముగిసింది. జాతీయ విద్యా విధానం–2020 (ఎన్ఈపీ), జాతీయ పాఠ్యాచరణ చట్రం (ఎన్సీఎఫ్), నిపుణ్ భారత్ లక్ష్యాల సాధన దిశగా ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించే ఉద్దేశంతో శిక్షణ చేపట్టారు. పాఠ్య సంస్కరణలు, అభ్యసన ఫలితాల ఆధారిత బోధన, రెడీనెస్ కార్యక్రమాలు, తరగతి గది అంచనా విధానాలు, గణిత ఆటల ద్వారా బోధన, టీఎల్ఎం వినియోగం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. బుక్కరాయసముద్రం విజయభారతి కళాశాలలో జరిగిన ముగింపు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో పునాది నైపుణ్యాల అభివృద్ధే శిక్షణ ప్రధాన లక్ష్యమన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచాలని సూచించారు. గుత్తి డివిజన్ డిప్యూటీ డీఈఓ లక్ష్మన్న మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలవాలని, తమ బోధన ద్వారా పిల్లల జీవితాలపై శాశ్వత ప్రభావం చూపగల సామర్థ్యం ఉపాధ్యాయులకే ఉంటుందని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఏఎంఓ వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ శిక్షణలో 1,458 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని తెలిపారు. రాప్తాడు మోడల్ స్కూల్లో నిర్వహించిన ముగింపు సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ టి.శైలజ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి భాషా, గణిత అంశాల్లో ప్రాథమిక నైపుణ్యాలు సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కార్యక్రమాల్లో అసిస్టెంట్ ఏఎంఓలు ఫణిరాజ్, నారాయణస్వామి, కేఆర్పీలు, డీఆర్పీలు పాల్గొన్నారు. -
నమ్మించి.. నట్టేట ముంచి..
● ఈజీగా స్టాక్ మార్కెట్ మోసాలు ● అప్రమత్తంగా లేకపోతే మోసపోవడం ఖాయం ● ఆర్థికంగా చితికిపోతున్న బాధితులు అనంతపురం సిటీ: డబ్బు మీద అత్యాశ కొంప ముంచుతోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నేడు సన్నగిల్లింది. దాని స్థానంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఊపందుకుంది. ధనిక వర్గాల వారికే పరిమితమైన స్టాక్ మార్కెట్ వ్యాపారం ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సామాన్య, మధ్య తరగతి వర్గాలకూ విస్తరించింది. ఈ క్రమంలో ప్రతి వంద మందిలో 15 మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో చాలామంది మోసపోతున్నారు. సంపాదించి పొదుపు చేసిన సొమ్ములో కొంత మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, అయితే అప్పులు చేసి పెట్టుబడులు పెడితే ప్రపంచ వ్యాప్తంగా ఏది జరిగినా కంపెనీలపై ప్రభావం పడి నష్టాలపాలు కాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. సామాజిక మాధ్యమాలే లక్ష్యంగా.. పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు కొన్ని కంపెనీలు వూహ్యాత్మకంగా అడుగులేస్తున్నాయి. పెట్టుబడిదారులు అప్రమత్తంగా లేకపోతే మోసపోవడం ఖాయమని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఏదైనా ఓ కంపెనీ నష్టాల బాటలో ఉన్నప్పుడే షేర్లను అమ్మకానికి పెడుతుందనే విషయాన్ని మరవరాదని అంటున్నారు. ఈ క్రమంలో షేర్ల విలువను పెంచుకునేందుకు వాట్సాప్, టెలిగ్రామ్ తదితర మాధ్యమాల కేంద్రంగా మోసాలకు తెరతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ముందుగా తమ కంపెనీలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉంటాయని నమ్మిస్తారు. దీంతో నమ్మి డీమాట్ ఖాతా తెరిచి యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే ఐపీఓ అలాట్ అయినట్లు, మంచి లాభాలు వస్తున్నట్లుగా కనిపిస్తాయి. అయితే స్టాక్స్ అమ్మి డబ్బు విత్డ్రా చేయాలనుకుంటే సాధ్యం కాదు. చివరకు డబ్బులు విత్ డ్రా చేయాలన్నా ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తుంది. మాయలో చిక్కుకున్న మేధావి వర్గం షేర్ మార్కెట్ వలలో సామాన్యులే కాదు మేధావి వర్గాలు సైతం చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఇటీవల వెలుగుచూసిన మోసాలు పలువురిని బెంబేలెత్తించాయి. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ భార్య స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి రూ.2.58 కోట్లు నష్టపోయినట్లు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. అలాగే ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.72 లక్షలు మోసపోవడం గమనార్హం. అలాగే అనంతపురంలోని బళ్లారి బైపాస్లో నివాసముంటున్న ప్రధానోపాధ్యాయుడు భాస్కర్బాబు సైతం తెలిసిన వారి నుంచి కొంత, లోన్ యాప్ల ద్వారా మరికొంత అప్పులు చేసి రూ.60 లక్షల వరకు ‘ఆరిజన్ కంపెనీ’లో పెట్టుబడులు పెట్టి నిండా మోసపోయారు. ఈ క్రమంలో ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించలేని స్థితిలో ఒత్తిళ్లు తాళలేక సూసైడ్నోట్ రాసి కూడేరు మండలం కమ్మూరు సమీపంలోని ఓ వెంచర్లో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేష్కుమార్రెడ్డి అనంతపురంలోని సాయినగర్లో ఆరిజన్ సొల్యూషన్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. సదరు కంపెనీలో పెట్టుబడులు పెడితే పదింతల లాభం ఉంటుందని పలువురిని నమ్మించాడు. కంపెనీ సిబ్బందితో పాటు బంధువులు, స్నేహితులతో పెట్టుబడులు పెట్టించాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల పాటు పెట్టుబడిపై రూ.5, రూ.10 వడ్డీ చొప్పున లాభాల రూపంలో చెల్లిస్తూ వచ్చాడు. దీంతో నమ్మకం పెరిగిన వారు మరికొందరిని ప్రమోట్ చేశారు. అలా ఒక్కొక్కరు రూ.4 లక్షలు మొదలుకుని రూ.90 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. అయితే నెలలు తిరగక ముందే రూ.25 కోట్లకు పైగా వసూలు చేసుకుని ఓ రోజు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి నరేష్కుమార్రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సదరు కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారందరూ సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఆత్మకూరు మండలానికి చెందిన ఓ విద్యావంతురాలు కొన్ని నెలల క్రితం అనంతపురంలో ఆరిజన్ కంపెనీ నిర్వహిస్తున్న షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. కొన్ని రోజులు లాభాలు సక్రమంగా చెల్లించడంతో నమ్మకం ఏర్పడింది. దీంతో ఇంట్లో ఉన్న బంగారు నగలు మొత్తం తాకట్టు పెట్టి రూ.90 లక్షల వరకు పెట్టుబడిన తర్వాత కంపెనీ నిర్వాహకుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చివరకు తాను మోసపోయినట్లుగా తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ పరిస్థితి ఈమె ఒక్కరిదే కాదు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎందరో బాధితులు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ మాయలో చిక్కుకుని ఆర్థిక నష్టాలతో కుదేలవుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
విడపనకల్లు: మండల పరిధిలోని మాళాపురం గ్రామంలో మంగళవారం ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మాళాపురానికి చెందిన బోయ పక్కీరప్ప భార్య పాల్తూరు సుంకమ్మ (58) ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలోనే ఉరవకొండ వైపు నుంచి విడపనకల్లు వైపు ద్విచక్రవాహనంలో వెళ్తున్న యువకుడు బలంగా ఆమెను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన సుంకమ్మను 108లో ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని పాడి గేదె.. : కారు ఢీకొని పాడి గేదె మృతి చెందిన ఘటన పెద్ద కొట్టాలపల్లి సమీపంలో జరిగింది. గ్రామానికి చెందిన రామకృష్ణ తన పాడి గేదెను మేపునకు తీసుకెళ్తుండగా, బళ్లారి వైపు నుంచి ఉరవకొండ వైపు వెళ్తున్న కారు ఢీకొంది. రూ.80 వేల విలువ చేసే పాడె గేదె మృతితో రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. నకిలీ ఎస్ఐ అరెస్టు కళ్యాణదుర్గం: తాను పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ అంటూ నమ్మబలికి ఓ వ్యక్తి వద్ద నుంచి కారు ఎత్తుకెళ్లిన వ్యక్తిని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ గణేష్ తెలిపిన మేరకు... శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చల్లాపల్లి ఎస్సీ కాలనీకి చెందిన గంటప్ప గారి అనిల్ కుమార్ ఇటీవల జస్ట్ డయల్ యాప్ ద్వారా కారు యజమాని జి.మనోహర్ను సంప్రదించాడు. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫొటోను వాట్సాప్ ద్వారా పంపి తాను పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ అని నమ్మబలికాడు. ఈ క్రమంలోనే మారుతి సుజుకి డిజైర్ కారు (ఏపీ 39 ఎన్టీ 8616)ను రోజువారీ అద్దెకు తీసుకున్నాడు. కారును తిరిగి ఇవ్వకుండా వివిధ ప్రాంతాల్లో మోసాలు చేసేందుకు వినియోగించాడు. అనంతపురం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఇలా మోసం చేసినట్లు వెల్లడైంది. నిందితుడు మంగళవారం బోరంపల్లి గ్రామ బస్స్టాప్ వద్ద ఉండగా, రూరల్ సీఐ గణేష్ వెంటనే అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కారును, పోలీస్ యూనిఫాంను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ గణేష్, సిబ్బందిని డీఎస్పీ రవిబాబు అభినందించారు. 7 విద్యుత్ సబ్స్టేషన్ల మంజూరు అనంతపురం టౌన్: జిల్లాలో కొత్తగా ఏడు సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. కళ్యాణదుర్గం మండలం బసాపురం, రాయదుర్గం నియోజకవర్గంలోని యర్రగుంట్ల, వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి, రాప్తాడు మండలం బండమీదపల్లి, శింగనమల నియోజకవర్గంలోని బొందలవాడ, గుంతకల్లు నియోజకవర్గం ఖాదర్పేటలో 33 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. ఇక అనంతపురం అర్టీసీ బస్టాండ్లో సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. -
నీటి ఎద్దడిపై నిరసనాగ్రహం
● సచివాలయానికి తాళం వేసిన తూమకుంట గ్రామస్తులు కుందుర్పి: తాగునీటి ఎద్దడి తీవ్రమైనా పట్టించుకునేవారు లేకపోవడంతో విసుగెత్తిపోయిన తూమకుంట గ్రామస్తులు మంగళవారం ఖాళీ బిందెలతో వెళ్లి గ్రామ సచివాలయానికి తాళం వేసి నిరసన తెలియజేశారు. సమస్య పరిష్కరించేదాకా తాళం తీసేది లేదని మహిళలు భీష్మించారు. 1,600 మంది జనాభా కలిగిన తూమకుంటకు రెండు గ్రామపంచాయతీ బోర్ల ద్వారా కుళాయిలకు నీటిని సరఫరా చేసేవారు. అయితే రెండు నెలల క్రితం బోర్లల్లో నీళ్లు అడుగంటాయి. కుళాయిలకు నీరు బంద్ అయ్యింది. ప్రారంభంలోనే గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేశారు. అప్పట్లో పంచాయతీ సెక్రటరీ సమస్య పరిష్కరిస్తామని ఫోన్ ద్వారా తెలిపారు. ఆ తర్వాత పట్టించుకున్నది లేదు. గ్రామస్తులు సుదూరంలో ఉన్న వ్యవసాయ పొలాలబాట పట్టారు. సైకిళ్లు, మోటారు బైకులు, ట్రాక్టర్లు, ఎద్దులబండ్లల్లో వెళ్లి నీటిని తెచ్చుకుని వాడుకునేవారు. కొంతమంది గ్రామంలోకి వచ్చే ఆటోల్లో తీసుకొచ్చే ఫిల్టర్ వాటర్ను బిందె రూ.10 చొప్పున కొంటున్నారు. రోజురోజుకూ నీటి సమస్య పెరిగిపోతుండటంతో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి విన్నవించుకునేందుకు వెళ్తే ఎంపీడీఓ లక్ష్మీశంకర్ అందుబాటులో ఉండటం లేదు. అధికారుల తీరును నిరసిస్తూ సచివాలయానికి చేరుకుని, సిబ్బందిని బయటకు పంపి తలుపులకు తాళం వేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రెండు గంటల తర్వాత ఎంపీడీఓ ఫోన్ ద్వారా గ్రామస్తులతో మాట్లాడి వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. -
జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం
●వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య కళ్యాణదుర్గం: జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు సీఎంను చేసుకుందామని వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు అధికారం కోసం అలవికాని హామీలను గుప్పించి రాష్ట్రంలోని మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను, రైతులను ప్రతి ఒక్కరినీ నిలువునా మోసం చేశారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోతున్నారన్నారు. కనీసం రైతులకు ఎరువులు అందించలేని పరిస్థితిని రాష్ట్రానికి తీసుకువచ్చారని విమర్శించారు. -
గంజాయి విక్రేత అరెస్ట్
గుంతకల్లుటౌన్: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న షికారీ ఈశ్వర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ శివసాగర్ మంగళ వారం తెలిపారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు తమకు రాబడిన సమాచారం ప్రకారం హనుమాన్ సర్కిల్లో గంజాయిని తరలిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన వెల్లడించారు. అనారోగ్యంతో కానిస్టేబుల్ కన్నుమూత తాడిపత్రి రూరల్: తాడిపత్రి అప్గ్రేడ్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మదన్రాజ్ (31) అనారోగ్యంతో కన్నుమూశారు. యాడికి మండల కేంద్రానికి చెందిన మదన్రాజ్ 2018లో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మృతి చెందారు. మృతదేహాన్ని పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లిలో నివాసానికి తీసుకురాగా, ఏఎస్పీ రోహిత్ కుమార్, సీఐ శివగంగాధర్రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు త్రిలోక్నాథ్, లక్ష్మినారాయణ, శివారెడ్డి నివాళులర్పించారు. తాడిపత్రి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కానిస్టేబుల్ భార్య అరుణకు ఎస్పీ జగదీష్ ఏఎస్పీ రోహిత్కుమార్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అన్ని విధాల కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చారు. గవిమఠం స్థలాలు అన్యాక్రాంతం కానివ్వం ఉరవకొండ: గవిమఠంకు చెందిన భవనాలు, స్థలాలను అన్యాక్రాంతం కానివ్వబోమని జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ అన్నారు. కర్ణాటకలోని చేళ్లగురికిలో ఉన్న గవిమఠం స్థలాలు ఆక్రమణకు గురయ్యాయన్న విషయం తెలుసుకున్న కమిషనర్ మంగళవారం అక్కడికి వెళ్లారు. స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ మఠం భూములు, ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. త్వరలోనే భూములకు బహిరంగ వేలం నిర్వహించి లీజుకిస్తామన్నారు. కార్యక్రమంలో మఠం సిబ్బంది నారాయణస్వామి, గోపి, మధు పాల్గొన్నారు. -
రెండేళ్ల పాలనంతా మోసమే..
● ప్రజలను చంద్రబాబు దగా చేశారు ● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి ఉరవకొండ: చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలన అవినీతి, అరాచకాలతో నిండిపోయిందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక దేవాంగ కల్యాణ మండపంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా చర్చావేదిక (రౌండ్టేబుల్ సమావేశం) నిర్వహించారు. పార్టీ పంచాయతీ రాజ్ విభాగం నాయకుడు బసవరాజు అధ్యక్షతన జరిగిన చర్చావేదికలో ‘విశ్వ’ మాట్లాడారు. చంద్రబాబు జీవితమంతా మోసాలు, అబద్దాలేనన్నారు. అన్ని వర్గాల ప్రజలు దీన్ని గుర్తించారన్నారు. రెండేళ్లలోనే ప్రజలను వంచించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేవలం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అప్రతిష్టపాలు చేయడానికి హింసారాజకీయాలు ప్రోత్సహిస్తున్నారన్నారు. గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. తన హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేస్తే, అందులో రూ.2.80 లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో వేశారన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. గొప్ప మానవతా వాదిగా జగన్ పాలన సాగించారన్నారు. చంద్రబాబు నేడు మహిళలు, రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలకూ మోసం చేశారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉరవకొండ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ముఖ్యంగా రికార్డు స్థాయిలో పేదలకు పట్టాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేసిన ఘనత తమదేనని తెలిపారు. రాయలసీమ జిల్లాల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కె.వి. రమణ మాట్లాడుతూ ఇచ్చిన హామీల్లో కనీసం 50 శాతం అయినా నెరవేర్చలేని అసమర్థుడు చంద్రబాబు అన్నారు. ప్రజలను మోసగించి అధికారంలోకి రావాలన్న తపన తప్ప హామీల అమలుపై చిత్తశుద్ధి లేదన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా మేధావి వర్గాల సంఘం ప్రతినిధి కొండారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు జీవితమంతా అబద్ధాలు, మోసాలేనని, అధికారం కోసం ఎంతకై నా దిగజారతారని విమర్శించారు. బాబును నమ్మి ఓట్లు వేస్తే అందరినీ నట్టేట ముంచుతారన్నారు. చర్చావేదికలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తూలురు అశోక్, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్దార్థ్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాకే పురుషోత్తం, వికలాంగుల సంఘం అధ్యక్షుడు వడ్డే ఆంజినేయులు, పంచాయతీరాజ్ విభాగం నాయకులు యోగేంద్రరెడ్డి, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి, మాజీ జెడ్పీటీసీ తిప్పయ్య, పార్టీ మండల, రూరల్ సమన్వయకర్తలు ఓబన్న, ఎర్రిస్వామిరెడ్డి, ప్రజా, కులసంఘాల నాయకులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి, చర్చావేదికలో పాల్గొన్న ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు -
ఇష్టారాజ్యంగా ఎరువుల పంపిణీ కుదరదు
అనంతపురం అగ్రికల్చర్: కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ఎలా ఉందనే దానిపై కలెక్టర్ ఆనంద్ అనంతపురంలో, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ బుక్కరాయసముద్రం మండలంలో దుకాణాలకు వెళ్లి పరిశీలించారు. జేడీఏ సాలురెడ్డి, ఏడీఏ వెంకటకుమార్, ఏఓ శ్యాంసుందర్రెడ్డి తదితరులను వెంట బెట్టుకుని ఎరువుల దుకాణాల్లో ఆన్లైన్ పద్ధతిలో పంపిణీ గురించి తెలుసుకున్నారు. యాప్ పనితీరు గురించి అధికారులు, డీలర్లను అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి ఇష్టారాజ్యంగా యూరియా, డీఏపీ అమ్మడానికి వీలులేదన్నారు. సాగు చేసిన పంటల విస్తీర్ణం బట్టి రైతులకు ఎంత మేర అవసరమో ఆ మేరకు ఎరువులు ఇవ్వాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మందుల కొరత రానివ్వొద్దు అనంతపురం సిటీ: జిల్లాలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, సర్వజనాస్పత్రిలో మందుల కొరత తలెత్తకుండా సరఫరా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురంలోని ఏపీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్ను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ మందులు సక్రమంగా సరఫరా కావడం లేదంటూ పీహెచ్సీల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. నిల్వ ఉన్న మేరకు అన్ని ఆస్పత్రులకూ మందులు సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ రామ్మోహన్, సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 30లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి అనంతపురం టౌన్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 కింద జిల్లా వ్యాప్తంగా మంజూరైన ఇళ్లను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 27వేల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అలాంటి ఇళ్ల నిర్మాణాలు 100 శాతం పూర్తి చేసుకుంటేనే బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. సెప్టెంబర్ ఆఖరులోగా పూర్తయిన వాటికే బిల్లులు వస్తాయని స్పష్టం చేశారు. మిగిలిన ఇళ్లకు బిల్లులు విడుదలను కేంద్ర ప్రభుత్వం ఆపివేయనున్నట్లు తెలిపారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలిపుట్లూరు: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ పి.జగదీష్ అన్నారు. మంగళవారం ఆయన మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో శక్తి యాప్, సీ్త్రరక్ష పోర్టల్ సేవలు, మహిళా రక్షణ చట్టాలు తదితర అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ధైర్యంగా వెంటనే పోలీసులను సంప్రదించాలని తద్వారా చట్టం వారికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తుందన్నారు. మహిళల భద్రతకు కుటుంబ, సామాజిక స్థాయిలో అందరూ బాధ్యత వహించాలన్నారు. ప్రయాణాల్లో ఉన్న సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా వేధింపులు, అసభ్య ప్రవర్తన ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అదనపు ఎస్పీ మహబూబ్బాషా, సీఐ సత్యబాబు, ఎస్ఐలు రామాంజనేయరెడ్డి, సురేంద్రబాబు పాల్గొన్నారు. ఖరీఫ్ ఈ–క్రాప్ మొదలైంది అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ ఈ–క్రాప్ (డిజిటల్ క్రాప్ సర్వే) మొదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ ఒకటి నుంచి పంట నమోదు కార్యక్రమం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఖరీఫ్ కింద సాగు చేసిన అన్ని రకాల పంటలను సెప్టెంబర్ 15లోపు ఈ–క్రాప్తో పాటు ఆధార్ బేస్డ్ కింద ఈ–కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు ఆర్ఎస్కే స్థాయిలో సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహించి తుది జాబితా సెప్టెంబర్ 30న ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. -
చంద్రబాబుకు వెన్నుపోటు అలవాటే
అనంతపురం: నమ్మిన వారిని వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో భాగస్వాములైన టీడీపీ, బీజేపీ, జనసేన వెన్నుపోటు పార్టీలని అభివర్ణించారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజలతో ఓట్లు వేయించుకుని... అధికారంలోకి వచ్చాక వారికే వెన్నుపోటు పొడిచాయని మండిపడ్డారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేయని హామీలు, ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు రెండేళ్ల పాలనపై అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. హంద్రీ–నీవా ద్వారా 240 రోజుల్లో 51 టీఎంసీలు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసి తీవ్ర అన్యాయం చేసిన మాటేమిటని నిలదీశారు. శ్రీశైలం నుంచి 800 అడుగుల్లోనే తెలంగాణ నీటిని తోడేస్తున్నా ప్రశ్నించలేని పరిస్థితి ఉందన్నారు. హంద్రీ–నీవా విస్తరణతో పాటు రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే తక్కువ సమయంలో ఎక్కువ నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. తన స్వార్థరాజకీయ ప్రయోజనాల కోసం సీమ హక్కులను తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి చంద్రబాబు తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ హామీల అమలులోనూ వైఫల్యం చెందారని, యువత, విద్యార్థి, మహిళలు, రైతులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలకూ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. రెండేళ్లుగా అనంతపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలిచి చేసిన పోరాటాలను గుర్తు చేసేలా ఫొటో ఎగ్జిబిషన్ ఆలోచింపజేసింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌస్ బేగ్, ఎద్దుల అమరనాథరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, గౌని నాగన్న, పూజారి రాజశేఖర్ యాదవ్, కాగజ్ఘర్ రిజ్వాన్, డాక్టర్ శంకరయ్య, కట్టుబడి తానీషా, మల్లెమీద నరసింహులు, కొర్రపాడు హుస్సేన్ పీరా, గువ్వల రాజేష్రెడ్డి, ఫయాజ్, చింతకుంట మధు, బాకే హబీబుల్లా, వీరా రామకృష్ణా రెడ్డి, గుజ్జల నగేష్, ఆసిఫ్, వెన్నపూస రామచంద్రారెడ్డి, సంపంగి రామాంజినేయులు, మలెల్ల వేణుగోపాల్, సాకే కుళ్లాయిస్వామి, సాకే అశోక్, మాలపాటి శ్రీనివాసులు, చిలకల థామస్, దత్త, జాహ్నవి, భానుమతి, వరలక్ష్మి, శశికళ, హజరాంబీ, రాధా యాదవ్, పద్మ, శోభాబాయి, శోభారాణి, ఉష, అంజలి, ప్రసన్న పాల్గొన్నారు. అనంతపురంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’పై నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న అనంత వెంకటరామిరెడ్డి, హాజరైన నేతలుమహిళలను దగా చేశారు చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ విమర్శించారు. హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసే రీతిలో పాలన సాగుతోందన్నారు. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసి.. ఆడబిడ్డ నిధి తదితర పథకాలు అమలు చేయకుండా మహిళలను దగా చేశారని మండిపడ్డారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న అనంతపురంలో నిర్వహించే ర్యాలీ, మానవహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ప్రదాత జగన్ సంక్షేమ పథకాల ప్రదాతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ అనంతపురం నియోజకవర్గ పరిశీలకుడు బోయ తిప్పేస్వామి కొనియాడారు. గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ప్రజల సంక్షేమానికి పాటుపడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు రెండేళ్ల పాలన వెన్నుపోటుకు చిరునామాగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రశ్నించిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. ప్రజల తరఫున నోరెత్తకుండా కేసుల నమోదుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలన, చంద్రబాబు రెండేళ్ల పాలనకు మధ్య తేడాను వివరించారు. చంద్రబాబు అడుగడుగునా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి పథకాల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు ‘రెండేళ్ల వెన్నుపోటు’ పాలనపై రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెన్నుపోటుల్లో దిట్ట చంద్రబాబు వెన్నుపోట్లు పొడవడంలో చంద్రబాబు దిట్ట అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అన్ని వర్గాలనూ మోసం చేశారన్నారు. మామ ఎన్టీఆర్, బామ్మర్ది బాలకృష్ణకు వెన్నుపోటు పొడిచినట్లే ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, నదీం అహమ్మద్, ఎస్ఈసీ సభ్యులు లింగాల శివశంకర్రెడ్డి, కోగటం విజయభాస్కర్రెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, మాజీ మేయర్ వసీం సలీం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, మొఘల్ సైఫుల్లా బేగ్, రిలాక్స్ నాగరాజు, కొండ్రెడ్డి ఓబిరెడ్డి, శ్రీదేవి, చంద్రశేఖర్ యాదవ్, ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, సాకే చంద్రలేఖ, దాసరి వాసంతి సాహిత్య, కృష్ణవేణి, భారతి తదితరులు ‘చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు’ గురించి వివరించారు. -
సచివాలయ వ్యవస్ధ నాశనమైంది
గత ప్రభుత్వంలో జనానికి ఏ పని కావాలన్నా సచివాలయంలోనే జరిగేవి. ఇప్పుడు సచివాలయ వ్యవస్ధ నాశనమైంది. అక్కడ ప్రభుత్వ సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. దీంతో సీఎస్సీ, మీ సేవ కేంద్రాలకు వెళ్లి కావాల్సిన సేవలకు డబ్బులు కట్టి చేయించుకోవాలి. అవి కూడా మండల కేంద్రానికి వెళ్లినా అంత సులభంగా జరగవు. ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయాలి కానీ.. ఇలా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. – ఆంజనేయులు, మాజీ సర్పంచ్, సిద్దరాంపురం, బొమ్మనహాళ్ మండలం -
దాహం కేకలు వినిపించట్లేదా?
కళ్యాణదుర్గం రూరల్: ‘రెండు నెలలుగా మంచి నీరు సరఫరా కావడం లేదు. గ్రామానికి సమీపంలోని బోరు బావుల నుంచి అవస్థలు పడుతూ నీటిని తెచ్చుకుంటున్నాం. ఎవరికి విన్నవించుకున్నా దాహార్తిని తీర్చేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదు’ అంటూ మండలంలోని గోళ్లవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల తీరును నిరసిస్తూ సోమవారం గ్రామ సచివాలయానికి తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు అర్జీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హామీ ఇచ్చి రెండు నెలలు గడిచిపోయిందన్నారు. ఇప్పటికై నా స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోళ్ల గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. గోళ్ల పంచాయతీలో ఉన్న పాతచెరువు, శిబాయి గ్రామాల్లో 10 బెల్టుషాపులు ఉన్నాయంటే మద్యం సరఫరా ఏ విధంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలకు మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ తాగునీటి సరఫరాపై లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యను పరిష్కరించలేదని సచివాలయానికి తాళం ఎమ్మెల్యే అమిలినేనికి విన్నవించినా పట్టించుకోలేదని స్థానికుల ఆవేదన -
సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల ముంగిటకే అందేవి. ఏ పని కావాలన్నా.. ఏ సర్టిఫికెట్లు కావాలన్నా సొంతూరిలోనే లభించేవి. పారదర్శక పాలన.. సత్వర స్పందనతో ప్రజల మన్ననలు అందుకున్న సచివాలయ వ్యవస్థ నేడు సేవల పరంగా అధమస్థానానికి పడిపోయింది. ఇందుకు కారణం
బొమ్మనహాళ్ మండలం లింగదహాళ్లో ఖాళీగా ఉన్న గ్రామ సచివాలయంబొమ్మనహాళ్: ప్రభుత్వ సేవలు వేగంగా అందించాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేర్చాలని 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రజల చెంతకే పాలన తీసుకొచ్చారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రెవెన్యూ తదితర అన్ని రకాల ప్రభుత్వ సేవలనూ సచివాలయం పరిధిలోనే అందుబాటులోకి తెచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1,207 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఇందులో 10,333 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రజలు గతంలె పనుల కోసం వ్యయప్రయాసలకోర్చి మండల, జిల్లా కేంద్రం వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సచివాలయ సేవలకు అనతికాలంలోనే గుర్తింపు లభించింది. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో చంద్రబాబు ప్రభుత్వం దీని పేరును మార్చేసింది. గ్రామాల్లోని సచివాలయాలను స్వర్ణ గ్రామం అని, పట్టణాల్లోని వాటిని స్వర్ణ వార్డు అని నామకరణం చేసింది. అయితే పేరు మార్చడంపై ఉన్న శ్రద్ధ సేవలను మెరుగుపరచడంపై లేకపోవడం గమనార్హం. నిత్యం.. ఫీల్డులోనే.. ప్రభుత్వం వివిధ రకాల సర్వేలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు సచివాలయంలో కన్నా ఫీల్డులోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. దీంతో పనిమీద సచివాలయాలకు వస్తున్న ప్రజలకు అక్కడ ఖాళీ కుర్చీలే కనిపిస్తుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని అనేక సచివాలయాల్లో ఇదే పరిస్ధితి నెలకొంది. కొన్ని చోట్ల ఒకరు, ఇద్దరు మాత్రమే కార్యాలయంలో కనిపిస్తున్నారు. టార్గెట్ల పేరిట వేధింపులు దిగువస్ధాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ తమను టార్గెట్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని సచివాలయ ఉద్యోగులు మదనపడుతున్నారు. జన గణన, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఈ–కేవైసీ, స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి పనులతో సతమతమవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు చేత పట్టుకుని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, అలాగే మనమిత్ర కార్యక్రమాలను వార్డుల్లో ప్రచారం చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది అధికారులైతే వింతపోకడలతో ప్రోగ్రెస్ చూపించాలంటూ తీవ్రంగా వేధిస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పరిపాలన కార్యదర్శులకు గత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల కోసం టార్గెట్ విధించారు. ఇలా సచివాలయ ఉద్యోగులపై సొంత విధులతో సంబంధం లేకుండా ఇతర శాఖల పనులన్నింటినీ నెత్తిన రుద్దుతూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. గతంలో వలంటీర్లు చేసే పనులు కూడా ఉద్యోగులతోనే చేయిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ పని చేయిస్తూ తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులం... బానిసలు కాదు అనంతపురం క్రైం/ అనంతపురం టవర్క్లాక్: ప్రభుత్వ ఉద్యోగులమే కానీ అధికారులకు వ్యక్తిగత బానిసలు కాదని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతర వేధింపులు, పని ఒత్తిళ్లు, అవమానకరమైన వ్యవహార శైలే కర్నూలు వీఆర్వో హుస్సేన్ ఆత్మహత్యకు కారణమయ్యాయని ధ్వజమెత్తారు. వీఆర్ఓ మృతి నేపథ్యంలో సోమవారం అనంతపురంలో సచివాలయ ఉద్యోగులు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా జెడ్పీ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి పేరు తీసుకొస్తున్న సచివాలయ ఉద్యోగులకు ప్రశంసలు కాకుండా వేధింపులే బహుమతిగా లభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి కారణంగా ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆరోపించారు. ‘సర్’ కార్యక్రమంలో 14 శాఖల భాగస్వామ్యం ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, మొత్తం బాధ్యతలను సచివాలయ ఉద్యోగులపైనే మోపి బలిపశువులను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల మరణాలపై సమగ్ర విచారణ చేపట్టి.. భవిష్యత్తులో ఇటువంటి విషాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచివాలయ వ్యవస్థపై బాబు సర్కార్ నిర్లక్ష్యం సర్వేల పేరుతో విపరీతమైన ఒత్తిళ్లు నిత్యం ఫీల్డ్లోనే ఉంటున్న ఉద్యోగులు వెలవెలబోతున్న సచివాలయాలు సకాలంలో సేవలందక ప్రజల పాట్లు -
ఇది వెన్నుపోటుదారుల ప్రభుత్వం
గార్లదిన్నె/శింగనమల : రాష్ట్రంలో ఉన్నది ప్రజలను వెన్నుపోటు పొడిచే ప్రభుత్వమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం గార్లదిన్నె మండలం కల్లూరులోని స్టార్ ఫంక్షన్ హాలులో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు, యువతతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అనంతతో పాటు మాజీ మంత్రి శైలజానాథ్, శింగనమల నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ఎం మోహన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికీ పాటుపడ్డారన్నారు. కులం, మతం, వర్గం కాకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకుని పథకాలు వర్తింపజేశారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో దౌర్జాన్యాలు, దాడులు, అవినీతి, అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిన ప్రజాప్రతినిధులు త్వరలో ఇంటింటికీ వస్తారని, అప్పుడు ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అన్ని స్థానాల్లోనూ గెలవడానికి కృషి చేయాలన్నారు. ‘సర్’ కార్యక్రమం నేపత్యంలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ఎం మోహన్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యర్శి నార్పల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. ఊరూరా బెల్టుషాపులు ఏర్పాటు చేయించి కూటమి నేతల జేబులు నింపుతోందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యర్శి శ్రీరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వంశీ గోకుల్రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం కార్యదర్శి సుధాకర్రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి బచ్చలన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చామలూరు రాజగోపాల్, ప్రసాద్, నాగేశ్వర్రెడ్డి, సూర్యనారాయణ, మేధావుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్కుమార్రెడ్డి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఫణీంద్ర, పార్టీ మండల కన్వీనర్లు ఎల్లారెడ్డి, పరాంధమ, మహేశ్వర్రెడ్డి, నాయకులు జేసీ నారాయణ, మంజునాథ్, పసల ఆదినారాయణ, మంత్రి ఆంజినేయులు, కాటమయ్య, కేశవయ్య, బృందావన్ రామాంజనేయులు, లక్ష్మిదేవమ్మ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న అనంత వెంకటరామిరెడ్డి, చిత్రంలో శైలజానాథ్ హాజరైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు ఫించన్ ఇస్తామని చెప్పి ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయకపోయినా చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. శింగనమల నియోజకవర్గంలో నీరు లేక పండ్లతోటలు ఎండిపోతుంటే చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనలో భాగంగా ఈ నెల 12న శింగనమల నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి -
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. రోజూ కూలి పనులకు వెళ్తూ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునే దంపతులు. ఇద్దరు కుమారులను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలని కలలు కన్నారు. అయితే విధి ఒక్కసారిగా వారిపై పగబట్టినట్లు మారింది. ఇ
జయకృష్ణకు అన్నం తినిపిస్తున్న కుమారిరాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కట్టకిందపల్లికి చెందిన బుర్రా జయకృష్ణ, కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు చరణ్ ఈసారి 9వ తరగతికి, చిన్నకుమారుడు ప్రభాస్ 7వ తరగతికి వెళ్తున్నారు. జయకృష్ణ బేల్దారి పని చేస్తుండగా, కుమారి కూలి పనులకు వెళ్లేది. కష్టపడి పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగించేవారు. నాలుగేళ్ల క్రితం తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రికి వెళ్లిన జయకృష్ణకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని తేలింది. అప్పటి నుంచి ప్రతివారం డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలతో పోరాడుతున్నాడు. స్వయంగా నడవలేని స్థితికి చేరుకోవడంతో భార్య తోడు తప్పనిసరి అయింది. దీంతో ఆమె కూలి పనులకు వెళ్లడం మానేసింది. పూట గడవడమే భారంగా... ఇద్దరూ పనులకు వెళ్లలేని పరిస్థితి రావడంతో కుటుంబానికి ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. ఉదయం లేవగానే ఇతర కుటుంబాలు పనులకు వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటుంటే, ఈ కుటుంబం మాత్రం పిల్లలకు పాలు ఎలా కొనాలి.. భోజనం ఎలా పెట్టాలి? అనే ఆలోచనలతో గడుపుతోంది. కనీస అవసరాలు తీర్చుకోవడమే భారంగా మారింది. గోరుచుట్టుపై రోకటిపోటులా.. కుటుంబం ఇప్పటికే కష్టాల్లో ఉండగా ఇటీవల భార్య కుమారి కూడా తీవ్ర అనారోగ్యానికి గురైంది. గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ పరిధిలో లేకపోవడంతో రూ.80 వేల వరకు ఖర్చు చేశారు. తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి ఆ మొత్తం పెద్ద భారంగా మారింది. అప్పులు చేసి చికిత్స చేయించుకు న్నా ఇప్పటికీ వాటి నుంచి కోలుకోలేకపోతున్నారు. కన్నీరు తెప్పించే పెద్ద కుమారుడి త్యాగం తల్లిదండ్రుల పరిస్థితిని చూసి పెద్ద కుమారుడు చరణ్ చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. చదువుకోవాల్సిన వయసులో బడి మానేసి బేల్దారి పనులకు వెళ్లి రోజుకు రూ.300 సంపాదిస్తూ ఇంటికి అండగా నిలిచాడు. పుస్తకాలు పట్టాల్సిన చేతులు మట్టిగంపలు మోశాయి. గ్రామస్తులు, ఉపాధ్యాయుల చొరవతో తిరిగి బడికి వెళ్లడం ప్రారంభించినా, సెలవులు వస్తే ఇప్పటికీ పనులకు వెళ్లి తల్లిదండ్రులకు తోడుగా నిలుస్తున్నాడు. వానొస్తే ఇంట్లోకే నీరు.. కుటుంబానికి ఉన్న ఏకై క నివాసం కూడా శిథిలావస్థకు చేరుకుంది. వర్షం పడితే ఇంట్లో నీళ్లు కారుతున్నాయి. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు అప్పులు, ఇంకోవైపు ఆకలి ఇలా ప్రతి రోజు ఆ కుటుంబానికి అగ్నిపరీక్షగా మారింది. శిథిలావస్థకు చేరిన ఇల్లు, ఇద్దరు కుమారులతో బుర్రా జయకృష్ణ, కుమారి దంపతులు మానవతామూర్తులు ఆదుకోవాలి అనారోగ్యం, అప్పులు, ఆకలి, పేదరికం ఒకేసారి దాడి చేయడంతో కుటుంబం సాయంకోసం ఎదురుచూస్తోంది. మానవతావాదులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్న సాయం కూడా ఆ కుటుంబానికి పెద్ద ఊరటనివ్వగలదని చెబుతున్నారు. ఇద్దరు చిన్నారుల చదువులు ఆగిపోకుండా, ఆ కుటుంబం మళ్లీ నిలదొక్కుకునేలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే ఈ.కుమారి ఫోన్పే నంబరు 63049 15177కు పంపాలని కోరుతున్నారు. పేద కుటుంబంపై పగబట్టిన విధి కిడ్నీలు క్షీణించి మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద దిక్కు అనారోగ్యానికి గురై నిస్సహాయురాలిగా మారిన భార్య కన్నీరు తెప్పించే పెద్ద కుమారుడి త్యాగం 8వ తరగతి చదువుకుంటూ కూలీగా మారిన వైనం మానవతావాదుల చేయూత కోసం దీనంగా ఎదురుచూస్తున్న కుటుంబం -
ఆడబిడ్డని చెప్పారు... మగపిల్లాడని తేలింది!
● గుంతకల్లులో విచిత్ర సంఘటన● డాక్టర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆస్పత్రి వద్ద కుటుంబీకుల ధర్నా గుంతకల్లు: ఆడబిడ్డ పుట్టిందని ఆ డాక్టర్ చెప్పారు. పసిగుడ్డును తల్లి చేతిలో పెట్టారు. ఇంటికి మహాలక్ష్మి వస్తోందని తండ్రి సంతోష పడ్డాడు. అందరికీ చెప్పుకుని మురిసిపోయాడు. అయితే, 39 రోజుల తరువాత.. పుట్టింది ఆడ్డబిడ్డ కాదు, మగ బిడ్డ అని తేలడంతో ఆ తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఇదే సమయంలో ఆడ శిశువును మాయం చేసి ఎక్కడి నుంచో మగబిడ్డను తెచ్చుకున్నారనే వదంతులు వ్యాపించడంతో అవమానంగా భావించిన ఆ దంపతులు ప్రసవం జరిగిన ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. వివరాలు.. గుంతకల్లు మండలలోని నక్కన దొడ్డికి చెందిన బోయ రవికుమార్ భార్య భార్గవి గత నెల మే3న స్థానిక స్వప్న నర్సింగ్ హోమ్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆడబిడ్డ పుట్టిందని తల్లిదండ్రులకు డాక్టర్లు చెప్పారు. శిశువు బరువు తక్కువగా ఉండటంతో గుంతకల్లులోని సాయిక్రిష్ణ నర్సింగ్ హోమ్లోని చిన్న పిల్లల వైద్యుడు పవన్ వద్దకు రెఫర్ చేయగా.. అక్కడ 15 రోజుల పాటు శిశువును ఐసీయూలో ఉంచారు. అనంతరం వైద్యుడు పవన్ అందుబాటులో ఉండడని చెప్పి మరో చిన్న పిల్లల వైద్యుడు నీలకంఠరెడ్డి వద్దకు పంపారు. శిశువు గుప్తాంగం వద్ద ఉబ్బి ఉండడంతో అనుమానం వచ్చిన నీలకంఠరెడ్డి కర్నూలులోని మెడికవర్ ఆస్పత్రికి శిశువును తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు అక్కడికి తీసుకెళ్లగా స్కానింగ్ చేసిన డాక్టర్లు.. పుట్టింది మగబిడ్డ అని తేల్చారు. దీంతో అవాక్కైన తల్లిదండ్రులు సోమవారం గుంతకల్లు వచ్చి సాయిక్రిష్ణ నర్సింగ్ హోమ్ వద్ద సీపీఎం నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. వైద్యురాలు రమణతో నాయకులు జగ్గలి రమేష్, సురేంద్రబాబు, వైటీ చెరువు రమేష్, రామునాయక్ తదితరులు వాదనకు దిగారు. డాక్టర్ రమణ మాట్లాడుతూ జన్యుపర లోపం కారణంగా శిశువులో ఒక్కోసారి ఆకారం కనబడదని, చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పగా.. అలాంటప్పడు ఆడబిడ్డ అని ఎలా నిర్ధారించారని నాయకులు నిలదీశారు. ఆడబిడ్డ అంటూ ఇప్పటికే మున్సిపాలిటీ వారు బర్త్ సర్టిఫికెట్ కూడా మంజూరు చేశారని, ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని మండిపడ్డారు. వెంటనే ఆస్పత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పలువురు కలగజేసుకుని బాధిత తల్లిదండ్రులు, నాయకులకు సర్దిచెప్పడంతో అంతా సద్దుమణిగింది. -
మద్యానికి డబ్బివ్వలేదని బలవన్మరణం
తాడిపత్రి రూరల్: మద్యం తాగేందుకు డబ్బులివ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడిపత్రి మండలంలోని బుగ్గలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం మర్రిమాకులపల్లికి చెందిన సాంబశివ (42) తన భార్య రత్న, ఇద్దరు పిల్లలతో కలిసి 15 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం తాడిపత్రికి వలస వచ్చాడు. స్థానికంగా పానీపూరి బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సాంబశివ మద్యానికి బానిసయ్యాడు. సోమవారం మద్యం తాగేందుకు డబ్బులివ్వాలంటూ భార్యతో గొడవకు దిగాడు. ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఇంటి వద్ద బాత్రూంలో కడ్డీకి ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి అనంతపురం అర్బన్: మెగా డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీపీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎగ్గుల శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు పసులూరి ఓబుళేసు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నాయకులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ఓ.ఆనంద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు, ఓబుళేసు మాట్లాడారు. మెగా డీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాల కారణంగా ఎస్సీ అభ్యర్థులు, పేద బడుగు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు. అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో అర్హులై ఉండి నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం జరిగేవరకు వైఎస్సార్సీపీ న్యాయపోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శోభారాణి, నగర ప్రధాన కార్యదర్శి శోభన్కుమార్, నాయకులు లబ్బేముత్యాలప్ప, సాకే ఓబుళపతి, అంజలి, తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిపై తేనెటీగల దాడి
కూడేరు: తేనెటీగలు దాడి చేయడంతో బుక్కరాయసముద్రం మండలం దెయ్యాలకుంట పల్లికి చెందిన రామచంద్రప్ప అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం మండల పరిధిలోని కమ్మూరులో ఓ రైతుకు చెందిన మామిడి పొలంలో కొమ్మలు కత్తిరించేందుకు రామచంద్రప్ప వచ్చాడు. కొమ్మలు కత్తిరిస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కూడేరులోని పీహెచ్సీకి తీసుకువెళ్లి చికిత్స అందించారు. ఆర్ట్స్ కళాశాల 6వ సెమిస్టర్ ఫలితాల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల 6వ సెమిస్టర్ ఫలితాలను ఎస్కే విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ఆచార్య జ్యోతికుమార్ సోమవారం విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్కేయూ మూల్యాంకన విభాగం డైరెక్టర్ ఆచార్య లక్ష్మయ్య, ప్రిన్సిపాల్ పద్మశ్రీ, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి తిరుమలేష్లతో కలిసి ఫలితాలను ప్రకటించారు. 6వ సెమిస్టర్ ఇంటర్న్షిప్ పరీక్షలకు 875 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 871 మంది 99.44 శాతం ఉత్తీర్ణత సాధించారు. అనంతరం ఉపకులపతి కళాశాల పరీక్షల విభాగాన్ని సంద ర్శించారు. పరీక్షల నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలు, వినియోగిస్తున్న సాంకేతిక వ్యవస్థల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పరీక్షల నిర్వహణలో పాటిస్తున్న పారదర్శకత, మెరుగైన విధానాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారులు జీఎల్ఎన్ ప్రసాద్, చంద్రశేఖర్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఏఐ ప్రజావాణి ద్వారా అర్జీల స్వీకరణ అనంతపురం సెంట్రల్: పోలీసుశాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన ఏఐ ప్రజావాణిని బాధితులు సద్వినియోగం చేసుకున్నారు. సోమవారం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఏఐ ప్రజావాణి ద్వారా 15 మంది వారి సమస్యలను చెప్పుకున్నారు. బాధితుల నుంచి సేకరించిన వివరాలను ఒక ఫార్మాట్లో అర్జీగా తయారు చేసి ఏఐ నేరుగా ఎస్పీ జగదీష్కు పంపింది. మొత్తం 184 అర్జీలను ఎస్పీ స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆయన త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. కార్య క్రమంలో అదనపు ఎస్పీ మహబూబ్బాషా, డీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పిడుగుపాటుకు పాడి ఆవు మృతి బ్రహ్మసముద్రం: పిడుగుపాటుకు పాడి ఆవు మృతి చెందిన సంఘ టన బ్రహ్మసముద్రం మండలంలోని పోలేపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పాడి రైతు మహదేవమ్మ మాట్లాడుతూ రూ.50 వేలు ఖర్చుచేసి ఆవును కొనుగోలు చేసినట్లు తెలిపారు. జీవనాధారంగా ఉన్న ఆవు మృతి చెందడంతో బోరున విలపించారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. పాడి ఆవు కళేబరాన్ని సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ లింగన్న పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మట్కా రాస్తున్న అత్త, కోడలి అరెస్టు తాడిపత్రి రూరల్: మట్కా రాస్తున్న అత్త, కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రి అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపిన మేరకు.. పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లికాలనీకి చెందిన అత్త,కోడలు వాసంతి, అలివేలు తమ ఇంట్లో మట్కా రాసేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోమవారం దాడులు నిర్వహించి ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.50,150 స్వాధీనం చేసుకున్నారు. మహిళా పోలీసు సాయంతో నిందితులిద్దరినీ కోర్టులో హజరుపరిచినట్లు సీఐ తెలిపారు. -
చెట్లు నరక్కుండా చూడాలి
అనంతపురం అర్బన్: మొహర్రం పండుగ సందర్భంగా చెట్లను నరకుండా చూడాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మొహర్రం నిర్వహణపై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. చెట్లను కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకుని చెట్లను పరిరక్షించాలన్నారు. మొహర్రం పండుగ సందర్భంగా గుండంలో వేసేందుకు వేప, రావి, జువ్వి, మర్రి, జమ్మి, చింత వంటి వృక్షాలను నరకకుండా చూడాలన్నారు. గ్రామాల పొలిమేరల్లో ఉండే సర్కార్ జాలి (కంప చెట్లు) మొద్దులను తీసి అగ్ని గుండంలో వేయాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, మైనారిటీ సంక్షేమ శాఖ ఏడీ రామసుబ్బారెడ్డి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, అటవీ శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కొత్త యాప్తోనే యూరియా, డీఏపీ అమ్మకాలు అనంతపురం అగ్రికల్చర్: రైతుల అవసరం మేరకు యూరియా, డీఏపీ ఎరువులు ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా అమ్మకాలు చేపట్టాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ ఆధార్ సంఖ్య ద్వారా తమ భూ విస్తీర్ణం, సాగు చేసిన పంటలను బట్టి ఎరువులు పంపిణీ ఉంటుందన్నారు. ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు అనంతపురం: జేఎన్టీయూ(ఏ) ఎస్కేయూ పరిధిలోని అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ నెల 8న దరఖాస్తు గడువు ముగియగా.. దాన్ని 15 వరకు పొడిగిస్తూ యూనివర్సిటీల రిజిస్ట్రార్లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలు https://apuniversitiesrecruitment.apcfss.in లో తెలుసుకోవచ్చు. డిగ్రీ ఫలితాల విడుదలకు కసరత్తు అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరిధిలోని డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్ ఫలితాల విడుదలకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. జనవరిలో పరీక్షలు నిర్వహించగా.. ఫలితాల వెల్లడిలో జాప్యం నెలకొనడంపై 13 వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుండటంపై ‘అంతా మా ఇష్టం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ అంశంపై ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ జ్యోతికుమార్ స్పందించారు. సోమవారం పరీక్షల విభాగం అధికారులతో కలిసి ఆన్లైన్ నిర్వహణ సంస్థతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. సక్రమమైన డేటాను అందించే అంశంలో పరీక్షల విభాగం ఉన్నతాధికారులు వైఫల్యం చెందడంతో ఫలితాల విడుదలకు జాప్యమైందని సదరు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. డేటా అందిస్తే ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. పెండింగ్లో ఉన్న సర్టిఫికెట్లు, ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని వీసీ ప్రకటించారు. ‘పరిష్కార వేదిక’లో అర్జీల వెల్లువ అనంతపురం అర్బన్: వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఇన్చార్జ్ డీఆర్ఓ పద్మావతి, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్ ప్రజల నుంచి 643 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీలుదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
బుక్కరాయసముద్రం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని బొమ్మలాటపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..సోమవారం మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన నాగభూషణ (37), కుళ్లాయప్ప (42), చాంద్బాషాలు ద్విచక్ర వాహనంలో నార్పలకు బయలుదేరారు. ఇదే సమయంలో నార్పల మండలం కేసేపల్లికి చెందిన ఎస్.అశోక్, ఎం.అశోక్ ద్విచక్ర వాహనంపై అనంతపురం వెళ్తున్నారు.బొమ్మలాటపల్లి సమీపంలో చెన్నంపల్లి క్రాస్ వద్ద ఎదురెదురుగా వీరి ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో నాగభూషణ అక్కడికక్కడే మృతి చెందగా, కుళ్లాయప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఘటనలో చాంద్బాషాకు కూడా తీవ్ర గాయాలు కాగా ఎం. అశోక్, ఎస్. అశోక్కు స్వల్ప గాయాలయ్యాయి. నాగభూషణకు భార్య నిర్మల, ఓ కుమారుడు, కుమార్తె, కుళ్లాయప్పకు భార్య కృపాదేవి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిసింది. -
వ్యక్తి ఆత్మహత్య
గుంతకల్లు రూరల్: చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంతకల్లు మండలంలోని కసాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కసాపురం గ్రామంలో సుంకులమ్మ కట్ట వద్ద నారాయణ అనే రైతుకు తోట ఉంది. ఈ తోటలో సోమవారం ఉదయం చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడి వద్ద సీ.అనిత అనే పేరుతో ఏటీఎం కార్డు లభించింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి వివరాలు ఆరా తీసి అనితకు ఫోన్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తన భర్త నగేష్ (38) అని, చిన్నపాటి గొడవ జరగడంతో ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆమె తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్న అనంతరం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నగేష్కు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నట్లు తెలిసింది. ఫుడ్ ఇండియా సదస్సుకు రిజిస్ట్రేషన్లు అనంతపురం అగ్రికల్చర్:కేంద్ర ఫుడ్ప్రాసెసింగ్ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా జూలై 9, 10న విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఫుడ్ ఇండియా–2026 సదస్సు ఏర్పాటు చేసినట్లు ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆసక్తి కలిగిన ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, చిన్న,మధ్య తరహా కుటీర పరిశ్రమల్లో తయారు చేసిన తమ ఉత్పత్తులను సదస్సులో ప్రదర్శించడం ద్వారా మార్కెటింగ్ వసతి పెంచుకోవచ్చన్నారు. ఇందుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సదస్సులో దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, ప్రదర్శన శాలలు ఏర్పాటవు తాయన్నారు. మరిన్ని వివరాలకు హార్టికల్చర్ డీడీ (7995086792) లేదా జిల్లా రిసోర్స్ పర్సన్ బి.హరీష్ (9676796974)ను సంప్రదించాలని సూచించారు. -
ఇంటిపై దాడి.. ఏడుగురిపై కేసు
● బిడ్డ కులాంతర వివాహం చేసుకుందని దాష్టీకంరాప్తాడు రూరల్: కులాంతర ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించిన ఓ యువతి కుటుంబ సభ్యులు యువకుడి నాయనమ్మ ఇంటిపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట గ్రామానికి చెందిన వరలక్ష్మి, అనంతపురం రూరల్ పాపంపేటకు చెందిన మురళి మనోహర్ ప్రేమించుకుని రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో ఈ వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, యువతి మేజర్ కావడంతో కౌన్సెలింగ్ నిర్వహించి ఇద్దరినీ కలిసి జీవించేందుకు అనుమతించారు. వివాహాన్ని అంగీకరించని యువతి కుటుంబ సభ్యులు మనోహర్ను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రూరల్ మండలం పాపంపేట కాలనీలో ఉన్న మనోహర్ నాయనమ్మ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్లు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి కుటుంబానికి చెందిన ఆరుగురు మహిళలతో పాటు ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. -
జేసీ అనుచరుల బరితెగింపు
● వైఎస్సార్సీపీ నేత ఇంటిపై దాడికి యత్నం అనంతపురం: టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులు బరితెగించారు. తాడిపత్రి నుంచి పెద్దవడుగూరుకు వాహనాల్లో వెళ్లి వైఎస్సార్సీపీ నేత రామచంద్రారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. మూడు రోజుల క్రితం జేసీ ప్రభాకర్రెడ్డి పెద్దవడుగూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వైఎస్సార్సీపీ నాయకులు శేషారెడ్డి, శరభారెడ్డి, గూడూరు సూర్యనారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, చితంబరరెడ్డిపై బెదిరింపు ధోరణిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా వైఎస్సార్సీపీ వాళ్లు అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎలా నామినేషన్ వేస్తారో చూస్తా అంటూ రెచ్చిపోయారు. దీనికి పెద్దవడుగూరు వైఎస్సార్సీపీ నేత రామచంద్రారెడ్డి స్పందించారు. మండలంలో 25 పంచాయతీలకు గాను 24 పంచాయతీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని, మరి నామినేషన్ వేయకుండా ఎక్కడ అడ్డుకున్నారు అంటూ జేసీ ప్రభాకర్రెడ్డిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘జగన్మోహన్రెడ్డి తలుచుకొని ఉంటే గెలిచేవాళ్లం కాదు.. జగన్ మోహన్రెడ్డి పుణ్యంతోనే తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం’ అన్న జేసీ ప్రభాకర్రెడ్డి మాటలను కూడా ఆ పోస్టులో గుర్తు చేశారు. వీటిని జీర్ణించుకోలేని జేసీ అనుచరులు సోమవారం 50 వాహనాల్లో పెద్దవడుగూరుకు చేరుకుని రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. అయితే అప్పటికే పోలీసులు ముందస్తుగా పలువురు వైఎస్సార్సీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. రామచంద్రా రెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలించి, కుటుంబ సభ్యులను ఇంట్లోంచి బయటకు పంపించడంతో ఎలాంటి సంఘటనా చోటు చేసుకోలేదు. -
ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ను బ్లాక్లిస్టులో పెట్టాలి
నల్లచెరువు: హంద్రీ–నీవా రెండోదశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనుల్లో భారీఎత్తున అక్రమాలకు పాల్పడిన కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్లిస్టులో పెట్టాలని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య, కదిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం వారు కదిరి నియోజకవర్గ పరిధిలో హంద్రీ–నీవా లైనింగ్ పనులను పరిశీలించారు. నల్లచెరువు మండలం బందార్లపల్లి, తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ సమీపాన పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి... విలేకరులతో మాట్లాడారు. హంద్రీ–నీవా లైనింగ్ పనుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పనులు అత్యంత నాసిరకంగా చేపడుతున్నారన్నారు. రూ.207 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు చంద్రబాబు ప్రభుత్వం అదనంగా రూ.102 కోట్లు కేటాయించినప్పటికీ పనుల్లో ఏమాత్రమూ నాణ్యత లేదన్నారు. ఇందులో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడిందన్నారు. నాసిరకం నిర్మాణ సామగ్రి వాడటంతో నీటి ప్రవాహానికి చాలా చోట్ల లైనింగ్ కొట్టుకుపోయిందన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రజల సొమ్మును దోచుకునేందుకే కూటమి నాయకులు లైనింగ్ పనులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ చేపడుతున్న పనులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోతే వైఎస్సార్సీపీ పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నల్లచెరువు మండల కన్వీనర్ రవికుమార్రెడ్డి, తనకల్లు మండల కన్వీనర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు. హంద్రీ–నీవా లైనింగ్లో భారీ అక్రమాలు నాసిరకం పనులు చేసి రూ.కోట్లు కొల్లగొట్టారు లైనింగ్ పనులను పరిశీలించిన మాజీ ఎంపీ తలారి రంగయ్య, వైఎస్సార్సీపీ సమన్వయకర్త మక్బూల్ -
పంచాయతీ కార్యాలయ భవనం కూల్చివేత
బ్రహ్మసముద్రం: టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఆ పార్టీ నేతల అక్రమాలకు , ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. గ్రామస్థాయిలో ముఖ్యంగా స్వపరి పాలనా వ్యవస్థలో అతి కీలకమైనది గ్రామ పంచాయితీ భవనం. టీడీపీ నేతలే దగ్గరుండి జేసీబీ యంత్రాలతో పంచాయతీ భవనాన్ని కూల్చివేశారు. వివరాలు... బ్రహ్మసముద్రం మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిలోని పంచాయతీ భవనాన్ని టీడీపీ నేతలు ఆదివారం ఉదయం కూల్చి వేసేందుకు జేసీబీ యంత్రాలతో అక్కడి వచ్చారు. అయితే పంచాయతీ భవనాన్ని కూల్చివేయడం ఏమిటని టీడీపీ మాజీ సర్పంచ్ కురుబ సందీప్ కుమార్తో పాటు టీడీపీ నేతలను గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన సందీప్ నాకే అడ్డు చెబుతారా.. ఎవరు అడ్డు వస్తారో చూస్తాం.. కూల్చండి అంటూ.. రకెంలేశాడు. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమేనని, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్పారంటూ జేసీబీతో పంచాయతీ భవనాన్ని కూల్చివేశారు. బాగున్న భవనాన్ని కూల్చివేయడం సరికాదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఘటనపై ఎంపీడీఓ ఏకాంబరేశ్వరయ్య వివరణ కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఎమ్మెల్యే అమిలినేని చెప్పారని రెచ్చిపోయిన టీడీపీ నేతలు బాగున్న భవనం కూల్చివేయడమేంటని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు -
బాటిల్పై రూ.40 అదనం
సాక్షి టాస్క్ఫోర్స్: పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. బెల్టుషాపులు అన్ని రకాల మద్యాన్ని ఇంటింటికీ సరఫరా చేసే స్థాయికి చేరాయి. ఎప్పుడు కావాలన్నా అందుబాటులో లభిస్తోంది. తాగునీటికై నా కొరత ఉంటుందేమో కానీ మద్యానికి కొదవ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 130కి పైగా బెల్టుషాపులు ఉన్నాయి. గ్రామాలలో పాల వ్యాన్లు ఎలా వెళ్తాయో అదే తరహాలో అధికార టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అనుచరుడు బృందాలుగా ఏర్పాటు చేసుకుని బెల్టుషాపులకు మందు సరఫరా చేస్తుండటం గమనార్హం. ఏటా రూ.180 కోట్ల మద్యం అమ్మకాలు.. నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం, కంబదూరు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం జనాభాలో 15 ఏళ్లు పైబడిన వారిలో సగటున 11.5 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు తేలింది. ఈ లెక్కన నియోజకవర్గంలో సుమారు 30 వేల మంది మద్యం తాగుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఎకై ్సజ్ శాఖ తాజా త్రైమాసిక నివేదికల ప్రకారం జిల్లాలోనే కళ్యాణ దుర్గం, కంబదూరు సర్కిళ్ల పరిధిలో మద్యం విక్రయాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. సాధారణం కంటే దాదాపు 220 శాతం అధికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటే మద్యం ప్రియులు ఎలా జుర్రేస్తున్నారో తెలుస్తోంది. రోజుకు 3,500 లీటర్ల ఐఎంఎల్ మద్యం అమ్ముడవుతుండగా, 4500 పైచిలుకు లీటర్ల బీర్ల వినియోగం జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రకారం ఏడాదికి నియోజకవర్గంలో సుమారు రూ.180 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. ఊరూరా బెల్టుషాపులు అన్ని బ్రాండ్లూ అందుబాటులో అదనపు ధరలతో బాదుడే బాదుడు పేదల కష్టార్జితం.. మందుకే సర్వస్వం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోగేసుకుంటున్న ‘పచ్చ’ధనం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కిటికీలోంచి మద్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇదేమీ అధికారిక మద్యం షాపు కాదు. బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బెల్టుషాపు. ఇక్కడ ఏర్పాటు కావాల్సిన మద్యం దుకాణాన్ని కర్ణాటక సరిహద్దున ఉన్న వేపులపర్తికి తరలించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అనుచరుడు అంతా తానై కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులతో బెల్టుషాపులు పెట్టించి అదనపు ధరలతో మద్యం అమ్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎకై ్సజ్ శాఖ నిర్ణయించిన ధరలు ఎంహెచ్ బ్రాందీ క్వార్టర్ (180 ఎంఎల్) ధర రూ.210 కాగా బెల్టుషాపుల్లో రూ.250కి అమ్ముతున్నారు. ఎంసీ వీఎస్ఓపీ 90 ఎంఎల్ ధర రూ.110 కాగా అదనంగా రూ.40, రాయల్ స్టాగ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 కాగా రూ.270 వసూలు చేస్తున్నారు. ఇక కళ్యాణి బీర్ రూ.180, కేఎఫ్ అల్ట్రా బీర్ రూ.220, కేఎఫ్ స్ట్రాంగ్ బీర్ రూ.200 అయితే వీటికి రూ.40 అదనంగా వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. -
నిధుల మిగులు.. పథకాలకు తెగులు
అనంతపురం అగ్రికల్చర్: మేమిస్తాం... కానీ మీరు పూర్తిగా ఖర్చు చేయొద్దు... అంటూ చంద్రబాబు ప్రభుత్వం ఓ వైపు బడ్జెట్ కేటాయిస్తూనే మరో చేత్తో అంతో ఇంతో వెనక్కి లాగేసుకుంటుండటంతో ఉద్యాన రైతుల పరిస్థితి దారుణంగా మారింది. తానా అంటే తందానా అన్నట్లుగా ఉద్యానశాఖ అధికారులు కూడా పథకాల అమలులో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటంతో రైతుకు ఫలాలు అందడం కష్టంగా మారింది. కేటాయించిన బడ్జెట్ పూర్తిగా ఖర్చు చేయకుండా మిగులుబాటు చూపిస్తూ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్ఎస్కే సిబ్బందితో పాటు ఉద్యానశాఖకు పెద్ద నెట్ వర్క్ ఉన్నా పథకాల అమలు, లక్ష్యాలు సాధించడంలో విఫలమవుతోంది. ఇటీవల కాలంలో చీడపీడలు, తెగుళ్లతో పంటలు దెబ్బతింటున్నా సస్యరక్షణ సలహాలు ఇచ్చేవారు లేకపోవడంతో ఉద్యానశాఖ కార్యాలయానికి రైతులు రావడం మానేశారు. గత మార్చి నెలాఖరుతో ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఉద్యానశాఖ పథకాలకు రూ.18.16 కోట్లు బడ్టెట్ కేటాయించింది. అందులో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ (ఎంఐడీహెచ్), రాష్ట్రీయ కృషి వికాస యోజనా (ఆర్కేవీవై), ఆయిల్ఫాం (పామాయిల్ తోటలు), బ్యాంబూ మిషన్ (వెదురుసాగు) కింద వివిధ రకాల పథకాల కింద 68,643 హెక్టార్ల పంటలకు ఉపయోగపడేలా రూ.18.16 కోట్లు కేటాయించారు. గడువు ముగిసేసరికి 17,528 హెక్టార్లకు ఉపయోగపడేలా 6,280 మంది రైతులకు ప్రయోజనం కలిగేలా రూ.11.79 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కేటాయించిన బడ్జెట్లో రూ.6.37 కోట్లు ఖర్చు చేయకుండా ప్రభుత్వానికి మిగిలేలా చేశారు. కాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది కూడా జిల్లాకు రూ.18.87 కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది మాత్రం రూ.7.98 కోట్లే. దీంతో రూ.10.89 కోట్లు భారీ బడ్జెట్ వెనక్కి పంపారు. ఇలా.. రెండేళ్ల కాలంలోనే జిల్లాకు కేటాయించిన బడ్జెట్లో ఏకంగా రూ.17.26 కోట్లు ఖర్చు చేయకుండా ప్రభుత్వానికి మిగిలించడం విశేషం. హార్టికల్చర్ కాంక్లేవ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2025 ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయి సదస్సుతో హల్చల్ చేశారు. కాంక్లేవ్కు 64 కార్పొరేట్ కంపెనీలు హాజరవడం, అందులో ఏడు కంపెనీలతో ఒప్పందం (ఎంఓయూ) చేసుకున్నందున జిల్లా రైతుల తలరాతలు మార్చేస్తామని పాలకులు గొప్పలు చెబుతున్నా కేటాయించిన మోస్తరు బడ్జెట్ కూడా ఖర్చు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కశ్మీర్, సిమ్లా లాంటి అతిశీతల ప్రాంతాల్లో పండే ఆపిల్... ఎండలు మండిపోయే ‘అనంత’లో పండిస్తున్నారు. ఈ–క్రాప్ జాబితా చూస్తే రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జిల్లాలో పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ పంటలు... ఇలా 100 రకాల వరకు ఉద్యాన పంటలు 2.75 లక్షల ఎకరాల్లో సాగులో ఉన్నాయి. ఏటా రమారమి 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఫలసాయం వస్తోంది. రూ.15 వేల కోట్ల వరకు టర్నోవర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం అరకొర బడ్జెట్ కేటాయిస్తుండటం, అందులోనూ ఖర్చు చేయకపోవడం, తరచూ వర్షాభావ పరిస్థితులు, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, మార్కెటింగ్ పరిస్థితి దారుణంగా ఉండటం, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతినడం, చీడపీడలు, తెగుళ్లు దాడి లాంటి సమస్యలు వేధిస్తుండటంతో తమ పరిస్థితి దారుణంగా ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.వేల కోట్లు వెచ్చించి సీమను ఉద్యానహబ్గా మారుస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతుండటంతో రైతులు నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు. గతేడాది పూర్తిస్థాయిలో బడ్జెట్ ఖర్చు చేయని ఉద్యానశాఖ రూ.6.37 కోట్లు ప్రభుత్వానికి మిగులు చూపించిన వైనం గ్రామ గ్రామానా నెట్వర్క్ ఉన్నా పథకాల అమలులో నిర్లక్ష్యం రెండేళ్లలో ఏకంగా రూ.17.26 కోట్లు బడ్జెట్ ప్రభుత్వానికి వెనక్కిరూ.6.35 కోట్లు వెనక్కి.. రైతుల తలరాత మార్చని ‘కాంక్లేవ్’ -
నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు
సందర్భం : నేడు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అనంతపురం సిటీ: ఇటీవల బెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్లు చాలా మందిని భయడపెతున్నాయి. అనారోగ్యకరమైన జీవన శైలితో పాటు రేడియేషన్, జెనెటిక్ డిసార్డర్ కూడా ఇందుకు కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరుదైన కొన్ని సందర్భాల్లో వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగానూ బ్రెయిన్ ట్యూమర్ బారిన పడే ప్రమాదముంటుందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏటా వంద కేసులు.. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇటీవల బ్రెయిన్ ట్యూమర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏడాదికి 80 నుంచి 100 కేసులు ఉంటున్నట్లు అనంతపురంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీర్ఘకాలంగా తలనొప్పితో బాధపడుతున్నా.. నొప్పి తీవ్రత తాళలేక వాంతులవుతున్నా.. మూర్ఛపోతున్నా వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి తోడు వినికిడి లోపం తలెత్తినా, చెవుల్లో ఈల వంటి శబ్ధం వస్తున్నా, నడుసున్నప్పుడు.. కూర్చున్నప్పుడు తడబాటుకు లోనవ్వడం కూడా బ్రెయిన్ ట్యూమర్కు ప్రాథమిక లక్షణాలను వైద్యులు అంటున్నారు. ప్రతి ట్యూమరూ క్యాన్సర్ కాదు.. సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్ ప్రాథమిక లక్షణాలు కనిపించకపోవచ్చు కానీ, తలనొప్పి, కంటి సంబంధిత సమస్యలు, వికారం, మూర్ఛ, సమతుల్యత కోల్పోవడం, జ్ఞాపకశక్తి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి వైద్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. ఆహారం, నిద్ర, వ్యాయామం, ఒత్తిడి తదితర అంశాలు మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అయితే ప్రతి బ్రెయిన్ ట్యూమర్.. బ్రెయిన్ క్యాన్సర్గా మారదని వైద్యులు పేర్కొంటున్నారు. నిపుణుల పర్యవేక్షణలో సరైన శస్త్రచికిత్స ద్వారా బ్రెయిన్ ట్యూమర్ను నయం చేయవచ్చని సూచిస్తున్నారు. రేడియేషన్కు దూరంగా మేలు.. ఆధునికత సాంకేతికత అందుబాటులో వచ్చిన తర్వాత రేడియేషన్ ప్రభావం అందరిపై ప్రభావం చూపుతోంది. పిల్లలు, యువత విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. ఇప్పటి వరకూ దేశీయంగా బెయిన్ ట్యూమర్ బారిన పడిన వారిలో అత్యధికులు చిన్నపిల్లలు, యువతీ యువకులేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జెనిటిక్ డిసార్డర్ సమస్యలు ఉన్న వారు బ్రెయిన్ ట్యూమర్ బారిన పడే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. రేడియేషన్ కారణంగా బ్రెయిన్ ట్యూమర్ జెనెటిక్ డిసార్డర్తోనూ సమస్య తలనొప్పి.. ఎప్పుడో ఓ సారైతే పర్వాలేదు.. కానీ క్రమం తప్పకుండా తలనొప్పి ఉందంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అది బ్రెయిన్ ట్యూమర్కి దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు. ఈ విషయాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు ఏటా జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేని నిర్వహిస్తూ వస్తున్నారు. -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్ ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ప్రారంభమవుతుందని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో అందజేయాలన్నారు. అర్జీలో ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని కాల్ సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి కూడా సమర్పించవచ్చని తెలియజేశారు. వీరభద్రుని సేవలో జస్టిస్ ప్రభాకర్ శాస్త్రి లేపాక్షి: లేపాక్షి వీరభద్రస్వామిని ఆదివారం కర్ణాటక రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ ప్రభాకర్ శాస్త్రి ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో సంప్రదాయం ప్రకారం జస్టిస్ ప్రభాకర్ శాస్త్రిని సత్కరించి శాలువతో సత్కరించారు. 17 మండలాల్లో వర్షం అనంతపురం అగ్రికల్చర్: నైరుతి ప్రవేశంతో జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 17 మండలాల పరిధిలో 12.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కుందుర్పిలో 80.2 మి.మీ, కణేకల్లులో 78 మి.మీ భారీ వర్షం కురిసింది. డి.హిరేహాల్ 56.2 మి.మీ, ఆత్మకూరు 36.4 మి.మీ, కంబదూరు 28.2, గుంతకల్లు 23.4, విడపనకల్లు 22.6, పెద్దవడుగూరు 19.6, శెట్టూరు 13.6, బొమ్మనహాళ్ 10.2, కూడేరు 10 మి.మీతో పాటు మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఓవరాల్గా ఈ నెల సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా ప్రస్తుతానికి 24.3 మి.మీ నమోదైంది. జూన్ మొదటి వారం ముగిసేసరికి 15 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షం కురిసింది. గుమ్మగట్ట, తాడిపత్రి, పెద్దపప్పూరు, వజ్రకరూరు, కళ్యాణదుర్గం, శింగనమల, పుట్లూరు, యల్లనూరు, బుక్కరాయసముద్రం తదితర మండలాల్లో పెద్దగా వర్షాలు నమోదు కాలేదు. మిగతా మండలాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ సాగుకు రెడీ అవుతున్నారు. విదేశీ అతిథులకు అవస్థల స్వాగతం చిలమత్తూరు: సుదూరంలోని దేశం నుంచి వేల మైళ్లు ఎగిరొస్తాయి. స్థానికులకు కనువిందు కలిగిస్తాయి. అలాంటి విదేశీ అతిథులకు కష్టాలే స్వాగతం పలుకుతుండడం కలచి వేస్తోంది. ఈ సారి మండుతున్న ఎండలతో చెరువులు, కుంటలు కళ తప్పాయి. నీటి కోసం పశువులు, జంతువులు, పక్షులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిలమత్తూరు మండల పరిధిలోని వీరాపురం, వెంకటాపురం గ్రామాలకు సంతానోత్పత్తి కోసం వచ్చిన సైబీరియన్ కొంగలపై కూడా ఈ ప్రభావం పడింది. వర్షాభావంతో ఆయా చెరువుల్లో నీరు ఇంకిపోవడంతో విదేశీ పక్షులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కలెక్టర్ మొదలు కిందిస్థాయి అధికారులు వీరాపురం వస్తున్నారు కానీ సైబీరియన్ కొంగల పరిరక్షణకు కనీసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
నాయీ బ్రాహ్మణులకు ప్రతిభా పురస్కారాలు
● దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకుల సూచన అనంతపురం టవర్క్లాక్: పది, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన నాయీ బ్రాహ్మణ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట రంగయ్య తెలిపారు. ఆదివారం స్థానిక జయమునెమ్మ కల్యాణ మంటపంలో ప్రతిభ పురస్కారాలకు సంబంధించి కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకట రంగయ్య మాట్లాడుతూ జులై 11న నాయీ బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభ పురస్కరాలు అందిస్తామన్నారు. అలాగే 12న వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతి ఫలితాల్లో 480 పైన మార్కులు సాధించిన వారు, అలాగే ప్రైవేటు పాఠశాలల్లో చదివి 520 మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివి 850 మార్కులు పొందిన వారు, ప్రైవేటు కళాశాలలో చదివి 900 మార్కులు సాధించిన వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఆర్టీసీ శ్రీనివాసులు, డోర్ నంబర్ 18–1–406, వేణుగోపాల్నగర్, పాతవూరు, అనంతపురం అడ్రస్కు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 9441222874 నంబర్కు సంప్రదించాలని కోరారు. రేషన్ బియ్యం స్వాధీనం తాడిపత్రి రూరల్ : పట్టణ సమీపంలోని రంగప్ప కాలనీలో ఆదివారం 60 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకొని నిందితుడు చిలమకూరు సురేష్పై కేసు నమోదు చేసినట్లు అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు సీఎస్డీటీ మల్లేష్తో కలిసి దాడులు జరిపామన్నారు. తాడిపత్రి పరిధిలోని పలు గ్రామాల్లోని రేషన్కార్డుదారుల నుంచి కిలో రూ.15 నుంచి రూ.16కు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని నిందితుడు తెలిపాడన్నారు. పత్తి దొంగల అరెస్ట్ రాయదుర్గం: దొంగతనాలు ఇప్పుడు ఇళ్లు, షాపులు, బ్యాంకులు, ఏటీఎంలకే పరిమితం కావడం లేదు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన పంటల్ని సైతం దొచుకెళ్లే ముఠాలు తయారవుతున్నాయి. ఇలాంటి ఘటనే బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లులో చోటు చేసుకుంది. ఆదివారం రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటరమణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఉంతకల్లుకు చెందిన రైతు బలిజ హనుమంతప్ప తన పొలంలో పత్తిని నిల్వచేశాడు. అందులోని ఐదు క్వింటాళ్ల పత్తిని రెండు రోజుల క్రితం గుర్తు తెలియన వ్యక్తులు దొంగిలించారు. దాని విలువ రూ.50 వేలు. దీనిపై స్థానిక పోలీస్స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నబీరసూల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం నేమకల్లు క్రాస్ వద్ద నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. పత్తి దొంగిలించినట్లు వారు ఒప్పుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఉంతకల్లుకు చెందిన వన్నూర్స్వామి, బలిజ నవీన్కుమార్, కురువళ్లికి చెందిన బోయ వెలిగొండ నితీష్, కర్ణాటక రాష్ట్రం రాయాపురానికి చెందిన వాల్మీకి హరి ఉన్నారు. పత్తి విక్రయించిన సొమ్ము రూ.44 వేలతో పాటు నేరానికి ఉపయోగించిన టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాన్నట్లు సీఐ తెలిపారు. 50 అడుగుల లోయలోకి పడిన ఐచర్ ● క్లీనర్ మృతి, డ్రైవర్ ఆచూకీ గల్లంతు ముదిగుబ్బ: మండల పరిధిలోని దొరిగిల్లు సమీపంలోని పులివెందుల ఘాట్లో ఆదివారం సాయంత్రం ఐచర్ వాహనం అదుపు తప్పి 50 అడుగుల లోయలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో నెల్లూరుకు చెందిన క్లీనర్ నవేంద్ర (30) అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే డ్రైవర్ వెంకటరమణారెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు. టమాట మొక్కలకు కట్టే కట్టెల లోడుతో పులివెందుల వైపు నుంచి ముదిగుబ్బ వైపునకు వస్తున్న ఐచర్ వాహనం ఘాట్ రోడ్లో రెండో క్రాస్ వద్ద అదుపు తప్పి 50 అడుగుల లోతులోకి పడిపోయిందని పోలీసులు తెలిపారు. కట్టెల కింద పడి క్లీనర్ మృతి చెందగా, డ్రైవర్ ఆచూకీ లభ్యం కాలేదు. -
‘తమ్ముళ్ల’ ఇసుక దందా
● టిప్పరును పట్టుకున్న పోలీసులు శింగనమల: మండలంలోని సలకంచెరువు–కొరివిపల్లి మధ్యలోని కూతలేరు వంక, ఉల్లికల్లు, తరిమెల గ్రామాల సమీపంలోని పెన్నానది పరీవాహక ప్రాంతం నుంచి టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. జేసీబీలతో ఇసుకను తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఒకచోట డంప్ చేసి.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా ఇసుక తరలించడం వల్ల భూగర్భజలాలు తగ్గిపోతున్నాయని, దీన్ని అరికట్టాలని రైతుల నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు శనివారం రాత్రి అనంతపురం–తాడిపత్రి రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పరును పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆ టిప్పర్ అధికార పార్టీ నాయకులది కావడంతో తదుపరి చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేనేత కార్మికుడి ఆత్మహత్య గార్లదిన్నె: అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కల్లూరుకు చెందిన రమేష్ (42) చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. మగ్గం నిర్వహణ.. కుటుంబ అవసరాల కోసం ఇతరుల వద్ద రూ.7 లక్షల దాకా అప్పులు చేశాడు. అయితే వచ్చే సంపాదన కుటుంబ పోషణకే సరిపోతోంది. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో రోజూ మదనపడుతుండేవాడు. ఈ క్రమంలో రమేష్ ఈ నెల మూడో తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. అయినా కోలుకోలేకపోయాడు. శనివారం రాత్రి మృతి చెందాడు. రమేష్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా పేర్కొన్నారు. -
తల్లికి వందనం.. ఎగనామం
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం క్షేత్రస్థాయిలో మాత్రం వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులకు వేదనగా మారుతోంది. ‘ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ లబ్ధి’ అని చెప్తున్న ప్రభుత్వం అర్హుల జాబితాను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అనర్హులుగా మారితే కారణమేంటి? ఎవరిని సంప్రదించాలి? సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? అనే కనీస సమాచారం కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్తే డీఈఓ కార్యాలయానికి వెళ్లమంటున్నారు. అక్కడికి వెళ్తే తమ వద్ద వివరాలు లేవంటున్నారు. ఎంఈఓ కార్యాలయాలు, పాఠశాలల హెచ్ఎంలూ చేతులెత్తేస్తున్నారు. చివరకు బాధితులు అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. దాచిపెడితే అనుమానాలు పెరగవా? ఏ ప్రభుత్వ పథకమైనా పారదర్శకంగా అమలు చేస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. అర్హులు, అనర్హుల జాబితా లేదు. దీంతో నిజంగా ఎంతమంది లబ్ధి పొందారు? ఎంతమంది నష్టపోయారు? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. గతేడాది అనుభవాలతో పాఠాలు నేర్చుకోలేదా? గతేడాది జిల్లాలో వేలాది మంది అర్హులకు పథకం అందలేదనే ఆరోపణలు వచ్చాయి. ఆధార్, బ్యాంకు ఖాతాల పొరపాట్లు, సాంకేతిక సమస్యలు, అర్హతల గందరగోళంతో చాలామంది కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగారు. అయినా సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని బాధితులు చెబుతున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిపోయి, మళ్లీ అదే గందరగోళం కనిపిస్తుండడం విచారకరం. ఎవరిని సంప్రదించాలో.. ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్థి పేరు జాబితాలో లేకపోతే ఆ కుటుంబం ఎవరిని అడగాలి? ఎక్కడ న్యాయం పొందాలి? నాలుగుచక్రాల వాహనం ఉందని, 12(1)–సీ సీటు వచ్చిందని, ఆధార్ వివరాలు సరిపోలలేదని రకరకాల కారణాలు చూపిస్తూ అర్హులను పక్కనపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే అనర్హులైతే ఆధారాలు చూపించాలి. అర్హులైతే వెంటనే సరిదిద్దాలి. కానీ ప్రస్తుతం ఆ రెండు మార్గాలు కూడా కనిపించడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. జాబితా విడుదల చేయండి.. తల్లికి వందనం పథకం అమలులో పారదర్శకత కోసం ప్రభుత్వం వెంటనే జిల్లా వారీగా అర్హులు, అనర్హుల జాబితాలను బహిరంగపరచాలి. అనర్హులుగా చూపిన ప్రతి విద్యార్థికీ కారణం వెల్లడించాలి. అభ్యంతరాలు తెలిపేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుల పరిష్కారానికి బాధ్యులెవరో స్పష్టంగా ప్రకటించాలి. పేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి సందేహాలకు తెరదించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అర్హత ఉన్నా పలువురికి వర్తించని పథకం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులు సమాధానం చెప్పేవారు లేరు... సమస్యనూ పరిష్కరించరు.. -
విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని, క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సమాజంలో ఉన్నత స్థానాలను అందుకుని తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈడిగ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగర శివారులోని రేణుకా యల్లమ్మ కల్యాణ మండపంలో ‘ఈడిగ (గౌడ) ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బీసీ రమేష్గౌడ్, రేణుకా యల్లమ్మ సొసైటీ గౌరవ సలహాదారు బుర్రా ఆదినారాయణ గౌడ్, అధ్యక్షుడు జగలేటి నాగేశ్వరరావు గౌడ్, ఈడిగ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేంద్ర కుమార్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ గౌడ్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం గౌడ్ హాజరయ్యారు. ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో 16వ ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 62 మంది ఈడిగ (గౌడ) విద్యార్థులకు పురస్కారాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా బీసీ రమేష్ గౌడ్, విశ్వనాథ్గౌడ్ మాట్లాడుతూ.. అవార్డులు అందుకున్న విద్యార్థులు రేపటి సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని ఆకాంక్షించారు. నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీఅనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు మొబైల్: 8977716661 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్ను తప్పకుండా తెలియజేయాలన్నారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ: అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈడిగ (గౌడ) ప్రతిభా పురస్కారాల పంపిణీలో వక్తలు -
‘అధికార’ దర్పం.. అధికారుల దాసోహం!
శెట్టూరు: రాజకీయ పార్టీ సమావేశాలు, ప్రైవేట్ వ్యక్తుల వ్యక్తిగత వేడుకలకు ప్రభుత్వ కార్యాలయాలు వేదికలుగా మారిపోతున్నాయి. అధికార పార్టీ నేతలు ఎలా చెప్తే అధికారులు అలా తలాడిస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఇటీవల ఎంపీడీఓ కార్యాలయంతో పాటు మరికొన్ని కార్యాలయాల్లో టీడీపీ మండల కన్వీనర్ బర్త్డే వేడుకలు నిర్వహించడం.. అధికారులు, సిబ్బంది తమ పనిని పక్కనపెట్టి మరీ ‘పచ్చ’ సేవలో తరించడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆదివారం మరోసారి అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ బూత్లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏల) సమావేశం ఏకంగా ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఇక్కడ మండలానికి సంబంధించి కీలకమైన ఫైళ్లు, కంప్యూటర్ తదితర సామగ్రి ఉన్నాయి. సిబ్బంది ఎవ్వరూ లేని సమయంలో బయటి వ్యక్తులు యథేచ్ఛగా లోనికి వచ్చారు. గంటల తరబడి అక్కడే ఉండటంతో పాటు ఆవరణమంతా కలియదిరిగారు. విషయం తెలిసిన జనం, స్థానిక ప్రజాప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో అనధికారిక సమావేశానికి అనుమతి ఉందా.. ఎవరు పర్మిషన్ ఇచ్చారు.. ఇలా ఎవరైనా తమ ప్రైవేట్ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవచ్చా.. అని చర్చించుకోవడం కనిపించింది. ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ బీఎల్ఏల సమావేశం మీటింగ్ విషయం తెలీదు ఆదివారం కార్యాలయానికి సెలవు. అయితే టీడీపీ కార్యకర్త ఒకరు మండల పరిషత్ సిబ్బంది వద్దకు వచ్చి యోగా కార్యక్రమం ఉందని చెప్పి తాళం చెవి తీసుకుని వెళ్లాడట. ఆ తర్వాత వారు కార్యాలయంలోనికి వెళ్లడం.. అక్కడే ఆవరణలో టీడీపీ బీఎల్ఏలతో సమావేశం నిర్వహించడం మాకు తెలియదు. – జిలానీ బాషా, ఎంపీడీఓ, శెట్టూరు -
పేదల రక్తం తాగేస్తున్నారు..
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కళ్యాణదుర్గంలో మద్యం షాపులన్నీ ‘కళ్యాణి వైన్స్’కే లాటరీలో తగిలాయట. ఇదెక్కడి వింతో నాకు అర్థం కావడం లేదు. తన సొంత డబ్బుతో పేదలకు మంచి చేస్తానని వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే.. అనుచరులకు మద్యం వ్యాపారం అప్పగించారు. వారేమో జలగలు రక్తం తాగినట్టు.. రెక్కలుముక్కలు చేసుకుని పేదలు సంపాదించిన సొమ్మునంతా తాగేస్తున్నారు. ఏ సందు చూసినా బెల్టుషాపులే. నేరుగా డోర్ డెలివరీ చేయడం ఇంకా దారుణం. బెల్టుషాపులపై ప్రజలు తిరగబడాలి. – డాక్టర్ తలారి రంగయ్య, మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
కుటుంబ కలహాలతో కార్మికుడి ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: పట్టణ సమీపంలోని చుక్కలూరు క్రాస్లో ఉన్న ఎమ్మెస్సార్ గ్రానైట్ ఫ్యాక్టరీలో కుటుంబ కలహాలతో కార్మికుడు పన్నారామ్ (34) ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్రెడ్డి వివరాలమేరకు.. రాజస్థాన్కు చెందిన పన్నారామ్ ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం తాడిపత్రికి వచ్చాడన్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలో బంధువులు ఉండటంతో వారి సాయంతో కార్మికునిగా పనిచేస్తున్నాడని చెప్పారు. కొన్ని రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లాడని, అక్కడ కుటుంబ సభ్యులతో గొడవపడి తాడిపత్రికి వచ్చాడన్నారు. మనస్తాపంతో శనివారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఉదయం ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సోదరుడు కిటికిలోనుంచి చూడగా పన్నారామ్ ఆత్మహత్య చేసుకున్న దృశ్యం కనిపించిదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నామన్నారు. బెంగళూరులో యాడికి యువకుడు..యాడికి: మండల కేంద్రానికి చెందిన వెంకటనారాయణరెడ్డి , అరుణ దంపతుల చిన్న కుమారుడు కిశాంత్శాడ్డి (24) బెంగళూరులో తాను నివసిస్తున్న గదిలోనే శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కిశాంత్రెడ్డి బెంగుళూరులోనే చదువుకొని అక్కడే ప్రైవేటు కంపెనీలో నెల క్రితం ఉద్యోగంలో చేరారు. జూన్ నెలలో జీతం కూడా పొందిన కిశాంత్రెడ్డి తన తల్లికి తన మొదటి జీతం ఇవ్వడానికి వారం క్రితం యాడికికి వచ్చాడు. మూడు రోజుల క్రితం మళ్లీ బెంగళూరు వెళ్లిన కిశాంత్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని యాడికికి తీసుకురాగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే కిశాంత్రెడ్డి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
కేబుల్ దొంగ అరెస్ట్
పుట్లూరు: రైతులు పంటలకు, పండ్ల తోటలకు నీరు అందించడానికి ఏర్పాటు చేసుకున్న బోరుబావుల వద్ద కేబుల్ వైర్ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసినట్లు సీఐ సత్యబాబు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పుట్లూరు మండలం మడుగుపల్లి అటవీ ప్రాంతంలో బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన తమ్మినేని మురళీ చోరీ చేసిన కేబుల్ను విక్రయించడానికి తరలిస్తున్నాడనే సమాచారంతో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో రూ.4 లక్షల విలువైన 1397 మీటర్ల వైరుతో పాటు మూడు ఐరన్ పైపులు, ద్విచక్ర వాహనాన్ని స్వాదీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. చోరీలకు పాల్పడుతూ రైతులను ఇబ్బందులు గురి చేస్తున్న దొంగను అరెస్ట్ చేయడంపై సీఐ సత్యబాబు, ఎస్ఐ సురేంద్రబాబు, ఏఎస్ఐ ఆదినారాయణ, కానిస్టేబుళ్లు వెంకటరమణ, రమేష్, నరేష్కుమార్ తదితరులను ఉన్నతాధికారులు అభినందించారు. ఇరు వర్గాల ఘర్షణ నార్పల: భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకుంది. మండలంలోని బండ్లపల్లిలో నివాసముంటున్న నారాయణరెడ్డికి నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉంది. నాగభూషణరెడ్డి, సాయి భూషణ్రెడ్డి అన్నదమ్ములు. కాగా.. వీరికి ఆరెకరాలకు పైగా భూమి ఉంది. ఇటీవల జరిగిన రీ సర్వేలో నారాయణరెడ్డికి చెందిన 44 సెంట్ల భూమి నాగభూషణ్రెడ్డి పేరిట నమోదైంది. భూమిలో దుక్కులు చేసేందుకు నాగభూషణ్రెడ్డి ప్రయత్నించడంతో అది తన భూమి అంటూ నారాయణరెడ్డి, ఆయన కుటుంబీకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సీకేపల్లి తహసీల్దార్ స్వామిభక్తి
● బీఎల్ఏల సమావేశంలో టీడీపీ నాయకులకు ప్రాధాన్యం ● ఏకంగా వేదికపై తన పక్కనే కూర్చోబెట్టుకున్న వైనం కనగానపల్లి (చెన్నేకొత్తపల్లి): నిబంధనలకు తూట్లు పొడుస్తూ అధికార పార్టీ నేతల వద్ద స్వామిభక్తిని చాటుకున్నారు చెన్నేకొత్తపల్లి తహసీల్దార్. ప్రత్యేక ఓటరు నమోదు (సర్) కార్యక్రమంలో భాగంగా శనివారం చెన్నేకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్ఓలతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన బీఎల్ఏల ఇన్చార్జ్ ఫణికుమార్తో పాటు మరో ఇద్దరు టీడీపీ నాయకులను తహసీల్దార్ సురేష్కుమార్ వేదికపైకి ఆహ్వానించి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఇందుకు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏలు అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇటువంటి సమావేశాలలో ఏ రాజకీయ పార్టీ నాయకులకు ప్రాధాన్యత కల్పించకుండా అందరినీ సమానంగా చూడాలన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిన తహసీల్దార్ తీరుకు వైఎస్సార్ సీపీ బీఎల్ఏలు నిరసన తెలియజేశారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రమే వేదికపైకి ఎలా ఆహ్వానిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తహసీల్దార్తో పాటు టీడీపీ నాయకులు దీనిని పట్టించుకోకుండా వ్యవహరించటంతో వారంతా సమావేశాన్ని బహిష్కరించారు. ఈ ఘటనపై స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు సీఈఓకు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ బీఎల్ఏలు చింతా మధుసూదన్, మల్లెల నరసింహులు, కర్ర కిష్టప్ప తెలిపారు. -
కంది పంటను ప్రోత్సహించండి
అనంతపురం అగ్రికల్చర్: గతేడాది కన్నా కొంచెం ఎక్కువగానే కంది పంట సాగు అయ్యేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి సూచించారు. శనివారం స్థానిక కృషిభవన్లో అనంతపురం డివిజన్ పరిధిలో ఉన్న అనంతపురం, రాప్తాడు, బుక్కరాయసముద్రం, కూడేరు, గార్లదిన్నె, ఆత్మకూరు మండలాల పరిధిలో ఉన్న ఆర్ఎస్కే అసిస్టెంట్లకు ఖరీఫ్–2026 కార్యాచరణపై శిక్షణ ఇచ్చారు. కంది పంటను ప్రోత్సహిస్తూనే... ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించేలా రైతుల దృష్టిని మళ్లించి యూరియా, డీఏపీ ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలన్నారు. ఈ ఏడాది అన్ని రకాల ఎరువులు కొత్తగా అందుబాటులోకి వచ్చిన యాప్ ద్వారానే సరఫరా, అమ్మకాలు చేపట్టాలన్నారు. పరిమితికి మించి ఎరువులు విక్రయించడానికి వీలులేదన్నారు. రోజువారీ నివేదికలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఇన్చార్జి ఏ.వెంకటకుమార్, ఏవోలు వంశీకృష్ణ, శ్యాంసుందరరెడ్డి, సోమశేఖర్, శుభకర్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ముగిసిన బీసీసీఐ శిక్షణ అనంతపురం: బీసీసీఐ (సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్) అండర్–16 టీమ్ సీ కోచింగ్ క్యాంప్ శనివారం ముగిసింది. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మే 11 నుంచి జూన్ 06వ తేదీ వరకు రెసిడెన్షియల్ శిక్షణ కల్పించారు. హెడ్ కోచ్ హిమ్ జోషిపుర, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ రొనాల్డ్ రాయ్ రోడ్రిజియస్, ఫిజియోథెరఫిస్ట్ మేఘాన్ సింఘ్ చౌహాన్, వైభవ్ గోసామి, అనుష్క ఆదిత్య, అనలిస్ట్ కలై సెల్వన్ తదితరులు పాల్గొన్నారు. -
పైరవీలు..రాజకీయ ఒత్తిళ్లు.. బేరసారాలు
● డీఈఓ కుర్చీ కోసం పలువురి ప్రయత్నాలు ● కర్నూలు, శ్రీసత్యసాయి, విజయవాడ అధికారుల మధ్య తీవ్ర పోటీ ● ఎవరి లాబీయింగ్ ఫలిస్తుందోనని ఉత్కంఠ అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కుర్చీ కోసం పలువురు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెగ్యులర్ డీఈఓ నియామకం ఎప్పుడు జరుగుతుంది.. ఆ కుర్చీలో ఎవరు కూర్చోబోతున్నారు అనే చర్చ విద్యాశాఖ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవలి దాకా జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసిన ఎం. ప్రసాద్బాబు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో పోస్టు ఖాళీ అయ్యింది. అప్పటి నుంచి సీటుపై పలువురు అధికారులు దృష్టి సారించారు. విద్యాశాఖలో కీలకంగా భావించే పోస్టును దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ముగ్గురి మధ్య ప్రధాన పోటీ? విద్యాశాఖ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ముగ్గురు అధికారులు ప్రధానంగా రేసులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లా నుంచి ఒకరు, శ్రీసత్యసాయి జిల్లా నుంచి మరొకరు, విజయవాడ ప్రాంతానికి చెందిన మరో అధికారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. వీరు మాత్రమే కాకుండా మరికొందరు అధికారులు కూడా తమ స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ప్రధాన పోటీ మాత్రం ఈ ముగ్గురి మధ్యే కొనసాగుతోందని విద్యాశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల ఆశీస్సుల కోసం.. జిల్లా స్థాయిలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలోనూ కీలక ప్రజాప్రతినిధుల వద్ద సిఫార్సు లేఖలు పొందేందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక కీలక మంత్రి వద్ద ఈ వ్యవహారంపై చర్చ జరిగినట్లు విద్యాశాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముడుపులు ముట్టజెప్పేందుకూ రెడీ! వివిధ స్థాయిల్లో బేరసారాలు కూడా జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. భారీగానే ముడుపులు ముట్టజెప్పేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీఈఓ నియామకం ఆలస్యం కావడానికి పరిపాలనా కారణాల కంటే పైరవీలు, రాజకీయ సమీకరణాలే కారణమన్న అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో విద్యా పరిపాలనకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో రెగ్యులర్ డీఈఓ లేకపోవడం కూడా చర్చనీయాంశమవుతోంది. డీఈఓ కుర్చీపై కన్నేసిన అధికారులంతా తమదైన శైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో చివరకు ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పైరవీలు, రాజకీయ సమీకరణాలు, పరిపాలనా అంశాలు... వీటిలో ఏది పైచేయి సాధిస్తుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
నృత్య రూపకం.. నయనానందకరం
ప్రశాంతి నిలయం: శ్రీకృష్ణుడి లీలామృతాన్ని, భాగవత ఇతిహాస వైభవాన్ని చాటుతూ చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకం నయానందకరంగా సాగింది. పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన మధ్యప్రదేశ్ సత్యసాయి భక్తులు శనివారం సాయికుల్వంత్ సభా మందిరంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉదయం సత్యసాయి మహా సమాధి చెంత సామూహిక సత్యసాయి అష్టోత్తర శత నామావళిని పఠించారు. సామూహిక పఠనంతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. అనంతరం భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. సాయంత్రం మధ్యప్రదేశ్ బాలవికాస్ చిన్నారులు వ్యాస మహర్షిచే రచించబడిన శ్రీమత్ భాగవతం, సత్యసాయిచే రచించబడిన భాగవత వాహిని నుంచి స్వీకరించిన భాగవత ఘట్టాలను ప్రదర్శంచారు. భాగవత్ కథామృతం పేరుతో నృత్య ప్రదర్శన ఇచ్చారు. అనంతరం భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
కొనసాగుతున్న వేధింపుల పర్వం
● సోషల్ మీడియా యాక్టివిస్టు సంజీవరెడ్డికి మరోసారి పోలీసు నోటీసు బెళుగుప్ప: సోషల్ మీడియా కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. సర్కారు లోపాలను ప్రశ్నించడమే పాపమన్నట్లుగా వ్యవహరిస్తోంది. అక్రమ కేసులపై న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా లెక్కచేయడం లేదు. బెళుగుప్ప మండలం నక్కలపల్లికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు సంజీవ రెడ్డికి తాజాగా పోలీసులు నోటీ సులు అందించడమే ఇందుకు నిదర్శనం. వ్యవసాయంపై ఆధారపడి వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తున్న సంజీవ రెడ్డిని 2024 సెప్టెంబర్లో పుట్టపర్తి పోలీసులు నక్కలపల్లిలో అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఆ తరువాత వరుసగా తిరుపతి, చిలకలూరిపేట, పార్వతిపురం, నగరి, ఆదోని, నంద్యాల, తాటికొండ, విజయ వాడ, అనకాపల్లి పోలీసుస్టేషన్లకు తీసుకెళ్లారు. మూడు నెలల పాటు తీవ్రంగా వేధించి విడుదల చేశారు. తాజాగా పులివెందుల, వేమూరు, కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన పోలీసులు నోటీసులు అందించడం గమనార్హం. ఓ సామాన్యుడిపై కక్షకట్టినట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్లు 7.43 లక్షలు.. జనాభా 22.33 లక్షలు ● జిల్లాలో ముగిసిన గృహగణన అనంతపురం అర్బన్:జనగణనలో మొదటి దశలో భాగంగా చేపట్టిన గృహగణన ప్రక్రియ శనివారంతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా 7,43,264 ఇళ్లు ఉండగా, అందులో 82,965 ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. తాళం వేసిన ఇళ్లు 949 ఉన్నాయి. మొత్తం జనాభా 22,33,405గా లెక్క తేల్చారు. 1,10,001 ఇళ్లను ఇతర పనులకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. పూర్తి నివాసం ఉన్న ఇళ్లు 5,39,635, కొంత భాగం నివాసమున్న గృహాలు 10,663 ఉన్నట్లు వెల్లడైంది. స్టోర్ బియ్యం స్వాధీనం అనంతపురం అర్బన్: రేషన్ కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తూ అక్రమంగా తరలిస్తున్న స్టోరు బియ్యాన్ని పౌర సరఫరాలశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాధ్యుడైన వ్యక్తిపై 6ఏ కేసు నమోదు చేశారు. శనివారం స్థానిక మరువకొమ్మ కొట్టాల్లో కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం అందుకు సీఎస్డీటీ సుబ్రమణ్యం దాడులు నిర్వహించారు. ఆటోతో పాటు అందులో ఉన్న ఆరు క్వింటాళ్ల (13 ప్యాకెట్లు) బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు బియ్యాన్ని పరిశీలించి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. బియ్యం కిలో రూ.17తో కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఆటో డ్రైవర్ తెలిపాడని అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్ ఇచ్చిన వివరాల మేరకు జైపాల్రెడ్డి అనే వ్యక్తిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. -
‘ఆల్ ఇండియా రేడియో’ మన దేశానికే గర్వకారణం. వార్తలు మాత్రమే కాదు రేడియో నాటికలు, ధారావాహికాలు , ధర్మ సందేహాలు, చలన చిత్ర పాటలు, వివిధ భారతి, జాతీయ వార్తలు, స్పాట్ లైట్, సంగీత కచేరీలు, ప్రముఖుల పరిచయం, ఇంటర్వ్యూలు, జాతీయ నాయకుల ప్రసంగాలు ఇలా ఒక్కటేంటి అన
●ఘనంగా ఆకాశవాణి అమృతోత్సవాలు ●అనంత రేడియో స్టేషన్ ఆరంభం ఆసక్తికరం ●90 ఏళ్లుగా కొనసాగుతున్న ఆల్ ఇండియా రేడియో సేవలు అనంతపురం కల్చరల్: ‘ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శుయంతాం. ప్రవాచకః బలదేవానంద సాగరః’ అంటూ రేడియోలో సమ్మోహనంగా వినిపించే ఆ కంఠం కోసం వేలాది మంది శ్రోతలు ఎదురు చూసేవారు. దశాబ్దాల కిందట ఢిల్లీ నుంచి ప్రసారాలు ఆరంభమై తొలి తెలుగు రేడియో స్టేషన్ విజయవాడకొచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ మీదుగా కడప ప్రసారాల నుంచి స్వతంత్రంగా ‘అనంత’కు చేరింది. దీని వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగున్నాయి. జనరంజకంగా... సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా దూసుకెళ్తున్నా తరగని ఆదరణ ఆకాశవాణిది. సాధారణ సెల్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ వరకు ఎఫ్ఎం స్టేషన్ తప్పనిసరిగా ఉండడమే దీనికి నిదర్శనం. కాబట్టే అన్ని వర్గాల శ్రోతలు ఉదయం నుంచి రాత్రి దాకా సాగే వేర్వేరు కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్న విషయమూ ఆశ్చర్యకరంగా ఉంటుంది. తెల్లవారు జామున మధురమైన సంగీత ధ్వనితో తట్టిలేపుతూ సాగే భక్తిరంజని, దేశభక్తిగేయం, వినదగు మాట, సేద్యపు సుద్దులు మొదలు చిత్రసీమ, చిత్ర జగత్, హలో అభిలాష , శ్రోతలు కోరిన సినిమా పాటలు ఈ నాటికీ జనరంజకంగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘ఆల్ ఇండియా రేడియో’గా నామకరణం చెంది 90 ఏళ్లు గడుస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ‘అమృతోత్సవ్’ పేరుతో ఆకాశవాణి విభిన్న కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ప్రతి ఏడాది జూన్ 8న రేడియో దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాజీవ్గాంధీ హత్యతో వాయిదా.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 12 రేడియో స్టేషన్లుంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు అనంతపురంతో కలిసి విశాఖపట్నం, విజయవాడ, మార్కాపురం, నెల్లూరు, కడప, తిరుపతి, కర్నూలు వంటి చోట్ల 8 కేంద్రాలు మాత్రమే మిగిలాయి. అనంత కేంద్రం 1991 మే 22న ప్రారంభం కావాల్సి ఉండేది. కానీ అదే ఏడాది మే 21న రాజీవ్గాంధీ హత్య జరగడంతో వారం రోజుల తర్వాత అంటే 29న అనంతపురంలో (ఎఫ్.ఎం స్టేషన్ హోదాలో) అధికారికంగా ప్రసారాలు ప్రారంభమయ్యాయి. స్థానిక కళలకు, కళాకారులకు, సాహిత్యానికి ఎక్కువ అవకాశాలివ్వడానికి తక్కువ పరిధి మాత్రమే ఉండే ఎఫ్.ఎం.(రీఫీక్వెన్సీ మాడ్యులేషన్) ప్రారంభించారు. వీటినే ఎల్ఆర్ఎస్ (లోకల్ రేడియో స్టేషన్)అని కూడా పిలుస్తారు. సృజనలో జాలువారిన ‘అనంత’ ప్రసిద్ధి చెందిన ఎంతో మంది సినీ రచయితలు, నటులు ఆకాశవాణిని దిగ్విజయంగా నడిపినట్టే అనంతపురంలోనూ ఎంతో మంది అధికారులు విభిన్నంగా, విలక్షణంగా తమదైన సృజనతో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శ్రోతలకు రేడియోను మరింత దగ్గర చేశారు. అనంతపురం ఆకాశవాణి ప్రారంభం నాటికి డాక్టర్ పద్మనాభరావు తొలి స్టేషన్ డైరెక్టర్ కాగా, తొలి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్గా డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ పనిచేశారు. ఆరవేటి శ్రీనివాసులు, డాక్టర్ మాచిరెడ్డి, అంజనప్పలు కేంద్రం డైరెక్టర్లుగా విధులు నిర్వహించారు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్గా రమణమూర్తి, విద్యాలంకార్, కళాకృష్ణ, మహేశ్వర్, వసుమతి, హరి, శివశంకరరెడ్డి, మురళీ, వై.శ్రీనివాసులు, నాగేశ్వరరెడ్డి పనిచేశారు. ప్రస్తుతం శృతి ప్రియాంక కేంద్రం అధికారిణిగా ఉన్నారు. ప్రధానంగా నాగసూరి వేణుగోపాల్, నాగేశ్వరరెడ్డి హయాంలో అనంత కళలు, సాహితీ ప్రచారం మరింత విస్తృతమైంది. వీరందరూ ఒక ఎత్తైతే రేడియో అనగానే మధురంగా వినపడే కంఠాలు అనౌన్సర్లవి. తొలిరోజుల్లో పుష్పరాజ్, పోతన్న, అమృత ఉండేవారు. తర్వాత వచ్చిన సుభాన్, డాక్టర్ జగర్లపూడి శ్యామసుందరశాస్త్రి వంటి వారు మంత్ర ముగ్దులను చేసే కంఠంతో ఎన్నో కార్యక్రమాలు కళ్లకు కట్టినట్టు నడిపించారు. వీరందరూ పదవీ విరమణ చేయగా ప్రస్తుతం క్యాజువల్ అనౌన్సర్లు అనంతపురం ఆకాశవాణిని ఆ పాత ఒరవడిలోనే హృద్యంగా కొనసాగిస్తున్నారు. సందర్భం రేపు రేడియో దినోత్సవం శ్రోతలు మెచ్చే ఆ పాత మధురాలు ప్రాంతాలకు తగ్గట్టుగా కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా అనంత ఆకాశవాణి ప్రసారాల పేర్లను ఇక్కడి భాష, యాస వచ్చేవిధంగా మార్పు చేశారు. పొలం కబుర్లు కాస్తా ‘సేద్యం సుద్దులు’గా, సూక్తి సుభాషితం, సుభాషిత రత్నావళి వంటి వాటిని ‘వినదగు మాట’గా మార్చారు. రైతుల కోసమైతే నిత్యం ప్రత్యేక ప్రసారాలు సాగుతాయి. ప్రతి ఫిబ్రవరి 15న రేడియో రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఇక టీవీలు, సెల్ఫోన్లు ఎన్నున్నా రేడియోలో వచ్చే పాటలంటే ఎంతో మంది చెవి కోసుకుంటారు. కాబట్టే ఆకాశవాణి ప్రసారం చేస్తే అనేక కార్యక్రమాల్లో ఆ పాత మధుర గీతాలది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా రైతులకు ఇచ్చే సూచనలు, బాలల కోసం వచ్చే కార్యక్రమాలు, డాక్టర్లతో, లాయర్లతో, విద్యావేత్తలతో , కవులు, కళాకారులతో చేసే కార్యక్రమాలకు ఈనాటికీ ఎంతో ఆదరణ ఉంటోందని అధికారులు చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
పామిడి: మండలంలోని కట్టకిందపల్లి గ్రామ మలుపు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రామగిరి దిగువ తండాకు చెందిన లక్ష్మానాయక్ (35) దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాలమేరకు.. వజక్రరూరు మండలంలోని బోడిసానిపల్లిలో పనిముగించుకున్న లక్ష్మానాయక్ తన ద్విచక్ర వాహనంలో రామగిరి దిగువ తండాకు బయలుదేరారు. కట్టకిందపల్లి గ్రామ సమీపంలో అటు వైపుగా వస్తున్న ఆటో – ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఘటనలో లక్ష్మానాయక్ తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య రుక్మిణితో పాటు కుమారుడు, కుమారులు ప్రశాంత్, సుమంత్లు ఉన్నారు. పామిడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతి ఉరవకొండ (విడపనకల్లు): విడపనకల్లు మండల పరిధిలోని పాల్తూరుకు చెందిన రైతు బోయ సురేష్ (30) శనివారం విద్యుదాఘాతంతో చనిపోయాడు. వివరాలు.. పాల్తూరుకు చెందిన సురేష్ వ్యవసాయం చేసుకోని జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం కొళాయి నీటి వద్ద మోటార్ను ఆన్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే మోటార్ వైర్ కట్ అయిన విషయాన్ని గుర్తించకపోవడంతో మోటార్ ఆన్ చేయగానికి విద్యుదాఘానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య ఉన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. లేపాక్షికి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కల్పించాలి లేపాక్షి: జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయానికి లండన్ కేంద్రంగా పనిచేస్తున్న బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కల్పించాలని నిర్వాహకులకు విన్నవించినట్లు చరిత్రకారుడు, పర్యాటరంగ నిపుణుడు మైనాస్వామి వెల్లడించారు. శనివారం సాయంత్రం స్థానిక ఏపీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయ సముదాయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందడానికి అన్ని అర్హతలున్నాయని పేర్కొన్నారు. మూడు అంగుళాల సూక్ష్మ శిల్పం నుంచి 12 అడుగుల పెద్ద శిల్పం వరకు ఉన్న శిల్పాలు, ఆసియా దేశాల్లోకెల్లా పెద్దదైన వీరభద్రస్వామి తైలవర్ణ చిత్రం, నేలను తాకని ఆకాశ స్తంభం, అతిపెద్ద నంది విగ్రహం, 33 అడగుల పొడువు 20 అడుగుల ఎత్తు గల నంది విగ్రహం లేపాక్షి ప్రత్యేకతలను చాటుతున్నాయని చెప్పారు. బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానిక నిర్వాహకులకు విషయం తెలుపగా త్వరలో వారు లేపాక్షిని సందర్శించి అన్ని విషయాలను నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
విద్యా విప్లవానికి పాతర
తన హయాంలో సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకూ అండగా నిలిచిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకూ బాసటగా నిలిచారు. ‘మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి’ అని మాటల్లో చెప్పడమే కాదు చేతల్లోనూ చేసి చూపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు సమకూర్చారు. ఆధునిక విద్యను దగ్గరకు చేర్చారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. జగన్పై అక్కసు పెంచుకున్న బాబు సర్కారు.. పేద విద్యార్థుల బంగారు భవితపై నీళ్లు చల్లింది. తాడిపత్రి రూరల్: గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా అడుగులు వేసింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. డిజిటల్ బోధనకు శ్రీకారం చుట్టింది. రూ.33 వేల విలువ చేసే ఒక్కో ట్యాబ్ను పేద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసింది. రూ.110 కోట్లు ఖర్చు చేసి జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో ఏకంగా 33,405 మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందజేసింది. ట్యాబ్లలో సాంకేతిక సమస్య తలెత్తితే ఏడు రోజుల్లో సరిచేసేలా, 30 రోజుల్లో మళ్లీ లోపాలు గుర్తిస్తే కొత్త వాటిని అందజేసేలా ఒప్పందం చేసుకుంది. 8వ తరగతితో పాటు 9, 10 తరగతుల విద్యార్థులకు సరిపోయే విధంగా బైజూస్ కంపెనీతో కలిసి సమగ్ర వివరాలు పొందుపరిచింది. సర్కారు నిర్లక్ష్యంతో పనిచేయని ట్యాబ్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్లు చంద్రబాబు ప్రభుత్వ పుణ్యమా అని నేడు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. పెత్తందారీ పోకడలతో ముందుకెళ్తున్న బాబు సర్కారు పేద విద్యార్థులకు అందజేసిన ట్యాబ్లను అప్డేట్ చేయకపోవడంతో అవి పనిచేయడం లేదు. ఉచిత ఇంటర్నెట్ డేటా ప్లాన్ గడువు ముగిసినా రెన్యూవల్ చేయలేదు. ప్రైవేటు కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని ఏకంగా రద్దు చేసి విద్యా విప్లవానికే చరమగీతం పాడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతా ఆర్భాటమే.. తమ ప్రభుత్వం ఏర్పడగానే విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తామని కూటమి నేతలు ఎన్నికలు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆ విషయమే పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తామంటూ ఏడాది క్రితం ఇన్ఫోసిస్ కంపెనీతో కలిసి ప్రకటించినా నేటికీ అమలు కాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో షరామామూలుగా ఈ హామీని కూడా చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ హయాంలో ఇచ్చిన ట్యాబ్లకే మరమ్మతులు చేయించి అందజేస్తే ప్రభుత్వ నిధుల ఆదాతో పాటు పేద విద్యార్థులకు మేలు చేసినట్లవుతుందని పలువురు అంటున్నారు. పేద విద్యార్థుల బంగారు భవితపై నీళ్లు చల్లిన చంద్రబాబు ప్రభుత్వం ఉన్నతాశయంతో అందించిన ట్యాబ్ల నిర్వహణను గాలికి వదిలిన వైనం జగన్పై అక్కసుతో కుటిల నిర్ణయం -
యథేచ్ఛగా చెట్ల నరికివేత
రాయదుర్గం: రాయదుర్గంలో చెట్ల నరికివేత యథేచ్ఛగా సాగుతోంది. ఇటీవల పట్టణంలోని బీటీపీ రోడ్డు బైలాంజనేయస్వామి ఆలయం వద్ద వందకు పైగా చింత చెట్లను పలువురు నేలకూల్చి సొమ్ము చేసుకున్నారు. తాజాగా టీచర్స్ కాలనీ, భంభంస్వామి ఆలయ పరిసరాల్లో దారికిరువైపులా నాటిన వృక్షాలతో పాటు సమీపంలోని చింత చెట్లను కూల్చేశారు. నిత్యం ఆహ్లాదాన్ని పంచుతున్న చెట్లను నరికివేస్తుండడాన్ని జీర్ణించుకోని స్థానికులు నిలదీయగా అక్రమార్కులు రెండు రోజులు మిన్నకుండిపోయారు. ఆ తర్వాత యథావిధిగా చెట్లు నేలకూల్చారు. దీనిపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు తీసుకోకుండానే... పట్టా భూమిలో చెట్టు నరకాలన్నా సంబంధిత మండల తహసీల్దారు వద్ద అనుమతి తీసుకుని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. జిల్లా అధికారులు పర్మిట్ ఇచ్చాక ఒక్కో టన్ను కలపకు రూ.16,800 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రాయదుర్గంలో చింత చెట్లు, దారికి ఇరువైపులా నాటిన వృక్షాలను నేలకూల్చిన వారు ఇలాంటి అనుమతులేవీ తీసుకోలేదని తెలిసింది. పట్టించుకోని అధికారులు.. మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి అని ప్రభుత్వాలు చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. స్వార్థపరులు కొందరు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. దీంతో ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ కరువవడంతో కొందరు యథేచ్ఛగా అడవుల్లోని చెట్లను నేలకూల్చి జేబులు నింపుకుంటున్నారు. ఇటుక బట్టీలకు తరలింపు.. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ ప్రాంతాల్లో ఇటుకలను కాల్చేందుకు కలప వినియోగిస్తున్నారు. దీంతో కొందరు చెట్లను నేలకూల్చి కలపగా మార్చి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఏ ఇటుక బట్టీ వద్దకు వెళ్లి చూసినా కలప గుట్టల కొద్దీ దర్శనమిస్తోంది. పచ్చదనం కనుమరుగవుతుండడం చూసి పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రత్యేక నిఘా ఉంచాం కలప అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాం. రాయదుర్గం టీచర్స్ కాలనీ, భంభంస్వామి ఆలయ పరిసరాల్లో చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకున్నాం. చెట్లను సంరక్షిస్తాం. వేరే ప్రాంతాల నుంచి రాయదుర్గం మీదుగా తరలివెళ్లే కలపను సైతం నిశితంగా పరిశీలిస్తున్నాం. అనుమతుల్లేకుంటే సీజ్ చేస్తున్నాం. ఇటుక బట్టీల్లో కలప పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు. – దామోదర్రెడ్డి, డీఆర్ఓ, రాయదుర్గం -
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఉక్కపోత కొనసాగింది. నైరుతి దిశగా గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
● రాజకీయ పార్టీల నాయకులకు కలెక్టర్ ఆనంద్ సూచన ఆశల ‘నైరుతి’ ఆగమనం అనంతపురం అగ్రికల్చర్: అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆశల నైరుతి’ వచ్చేసింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోకి రుతుపవనాలు శనివారం ప్రవేశించినట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ సారి కొంచెం ఆలస్యంగా జిల్లాను తాకినట్లు పేర్కొన్నారు. ● ‘నైరుతి’ నేపథ్యంలో శనివారం ఉదయం ఉక్కపోత కొనసాగగా... సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులతో వాతావరణం మారిపోయింది. అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. ఖరీఫ్ పంటలకు ఈ రుతుపవన వర్షాలే కీలకం కావడంతో ఎల్–నినో ప్రభావంతో ఏ మేరకు వరుణుడు కరుణిస్తాడనేది అంతుచిక్కడం లేదు. ఇటీవల తొలకర్లు కురవడంతో ఖరీఫ్ సాగుకు రైతులు రెడీ అవుతున్నారు. జూన్లో 61.2 మి.మీ, జూలైలో 64.3 మి.మీ, ఆగస్టులో 84.4 మి.మీ, సెప్టెంబర్లో 111.6 మి.మీ... మొత్తంగా నాలుగు నెలల కాలంలో 321.5 మి.మీ వర్షపాతం నమోదైతే పంటలకు ఢోకా ఉండదని చెబుతున్నారు. ప్రధానంగా జూలైలో మంచి వర్షాలు కురిస్తే 3.43 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ‘సర్’కు సహకరించండి అనంతపురం అర్బన్: ‘ఓటర్ల జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026 (ఎస్ఐఆర్) పారదర్శకంగా సాగేలా చర్యలు తీసుకున్నాం. ఎస్ఐఆర్ నిర్వహణకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలి’ అని కలెక్టర్ ఓ. ఆనంద్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డీఆర్ఓ ఎ. మలోలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2002 సంవత్సరంలో ఉన్న ఓటర్లు, 2025లో ఉన్న ఓటర్లు, వారి పిల్లలకు సంబంధించి 68 శాతం మ్యాపింగ్ పూర్తయ్యిందన్నారు. మ్యాపింగ్ 90 శాతానికి తక్కువ కాకుండా పూర్తిచేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. ఆదివారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి మ్యాపింగ్ చేస్తారని, ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల బీఎల్ఏలు పాల్గొని సహకరించాలన్నారు. 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి అందించే ఎన్యుమరేషన్ ఫారంలో వివరాలు పూరించి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జూలై 14 నుంచి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుందన్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించి, సెప్టెంబరు 18వ తేదీలోపు పరిష్కరిస్తారన్నారు. సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుందని చెప్పారు. ఎస్ఐఆర్పై అవగాహన కల్పించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులకు ఈ నెల 10 నుంచి 13 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో కో–ఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, ఎన్నికల డీటీ కనకరాజు, ఎస్ఏ శామ్యూల్ బెంజిమన్, వైఎస్సార్సీపీ ప్రతినిధి అమర్నాథ్రెడ్డి, టీడీపీ నారాయణస్వామి, జనసేన కిరణ్కుమార్, సీపీఎం బాలరంగయ్య, కాంగ్రెస్ బషీర్, బీజేపీ ఈశ్వర్ప్రసాద్, ఏఏపీ మసూద్వలి, బీఎస్పీ ప్రతినిధి అంజయ్య పాల్గొన్నారు. ‘యోగాంధ్ర’ను విజయవంతం చేయాలి అనంతపురం అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఈనెల 21న చేపట్టనున్న యోగాంధ్ర– 2026 కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలిచ్చారు. ఈ నెల 16న దివ్యాంగులకు థిమాటిక్ యోగా, 18న బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో, 20న గుత్తికోటలో ప్రత్యేక పర్యాటక డెస్టినేషన్ యోగా ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. యోగాపై ఆసక్తి పెంపొందించేందుకు ఆదివారం నుంచి గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించనున్నామన్నారు. ప్రతి సచివాలయానికి 10 మంది ట్రైనీలను మ్యాపింగ్ చేసి యోగా శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. వివరాలను ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయాలని సూచించారు. త్వరలోనే విడుదల చేస్తాం జ్ఞానభూమి పోర్టల్లో ఫలితాలు నమోదు చేయడానికి ఓ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చాం. ఎస్కే యూనివర్సిటీతో ఆ సంస్థ సమన్వయం చేసుకోవడంలో జాప్యం జరుగుతోంది. వారితో మాట్లాడి త్వరలోనే ఫలితాలు విడుదలయ్యేలా చూస్తాం. –శ్రీరాములు నాయక్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఎస్కేయూ -
పకడ్బందీగా ఎస్ఐఆర్ నిర్వహణ
● అధికారులకు డీఆర్ఓ మలోల ఆదేశం అనంతపురం అర్బన్: ‘‘ఓటరు జాబితాలో అనర్హులకు చోటు ఉండకూడదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. తప్పులు లేని, కచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితా లక్ష్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను పకడ్బందీగా నిర్వహించాలి’’ అని డీఆర్ఓ, డిప్యూటీ ఎన్నికల అధికారి ఎ.మలోల సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘సర్’ నిర్వహణపై డీఆర్ఓ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఈడీటీలు, బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకర ఓటర్ల జాబితా కీలకమన్నారు. దోషరహిత ఓటర్ల జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్తో పాటు ప్రతి అంశంలోనూ పారదర్శకంగా విధులు నిర్వర్తించా లని చెప్పారు. ఈనెల 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యకలాపాలు ఉంటాయన్నారు. 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అర్హులను ఓటరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్న వారి ఓట్లు తొలగించాలన్నారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ) తప్పనిసరిగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వాలన్నారు. సర్వే సమయంలో బీఎల్ఓలు తగినన్ని ఫారం–6, 7, 8లను వెంట ఉంచుకోవాలని ఆదేశించారు. 2002–05 ఓటర్ల జాబితా, 2025 ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచుకుని మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ చేయాలన్నారు. సమావేశంలో కో–ఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, ఎన్నికల డీటీ కనకరాజు, డీటీ మంజుల, ఎస్ఏ శామ్యూల్ బెంజిమన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వ్యవసాయ ప్రణాళిక అమలులో చంద్రబాబు సర్కార్ విఫలమయ్యింది. కీలకమైన ఖరీఫ్లో తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. నైరుతి కూడా వచ్చేస్తోంది. అయితే సకాలంలో విత్తనం అందే పరిస్థితి కనిపించకపోవడంతో ఈసారి కూడా రైతులకు కష్టాలు తప్పేలా లేవు. వేరుశనగ సాగు తగ్గించినట్లు చె
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్–2026 సాగుకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాకు 1.28 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ సేకరించి నిల్వ చేయాలని ఏపీ సీడ్స్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో అనంతపురం జిల్లాకు 56 వేల క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లాకు 72 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ 40 శాతం రాయితీపై అందిస్తామని ప్రకటించారు. నిధులు విడుదల చేయకుండా ఉత్తచేతులతో సేకరించడం తమ వల్ల కాదని ఏపీ సీడ్స్ చేతులెత్తేసింది. తీవ్ర ఒత్తిళ్ల మధ్య విత్తన పంపిణీ ప్రక్రియ మూడు రోజుల కిందటే మొదలు పెట్టారు. అనంతపురం జిల్లాలో 10, శ్రీసత్యసాయి జిల్లాలో రెండు... మొత్తం 12 ప్రాసెసింగ్ ప్లాంట్లలో విత్తనశుద్ధి చేసి సరఫరా చేయాలని ఆదేశించారు. కానీ... అన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లలో నిల్వ ఉన్న విత్తనకాయలు 20 వేల క్వింటాళ్లు మాత్రమేనని లెక్క వేశారు. ఈ పరిస్థితుల్లో కేటాయించిన మేరకు విత్తనం ఎక్కడి నుంచి సేకరించి నిల్వ చేస్తారో.. సకాలంలో రైతులకు ఎలా అందిస్తారో చంద్రబాబు ప్రభుత్వం, వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. బకాయిలతోనే విత్తన సమస్య.. గతేడాది ఖరీఫ్, రబీలో పంపిణీ చేసిన విత్తన వేరుశనగకు సంబంధించి ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులకు చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబించడంతో ఏపీ సీడ్స్కు ఇప్పుడు విత్తన సమస్య ఎదురవుతోంది. ఏడాది కాలంగా రూ.90 కోట్లు ఇవ్వకుండా జాప్యం చేసింది. బకాయిలు చెల్లించకపోతే విత్తనం అందించలేమని చేతులెత్తే పరిస్థితి ఉండటంతో రెండు రోజుల కింద సగం మొత్తం ఇచ్చినట్లు చెబుతున్నారు. రూ.కోట్లలో బకాయిలు పడటంతో తాము వడ్డీలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నట్లు మిల్లర్లు వాపోతున్నారు. అదే బకాయిలు పూర్తి స్థాయిలో గతంలోనే చెల్లించివుంటే రబీలో పండిన వేరుశనగను రైతుల నుంచి కొనుగోలు చేసి నిల్వ చేసుకునే పరిస్థితి ఉండేదని చెబుతున్నారు. గత రబీలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 వేల హెక్టార్లలో పండిన 2.80 లక్షల క్వింటాళ్లకు పైగా వేరుశనగను రైతుల నుంచి కర్ణాటక, తమిళనాడు, బళ్లారి, ఇతర ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకుపోయినట్లు పేర్కొంటున్నారు. ఇప్పుడు మనకు విత్తనం కావాలంటే తిరిగి తమిళనాడు, కర్ణాటక, ఇతర జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఆర్ఎస్కేలకు చేరింది 5 వేల క్వింటాళ్లే రాష్ట్ర ప్రభుత్వం పాతబకాయిలు సగమే చెల్లించడంతో కొందరు మిల్లర్లు మాత్రమే విత్తనశుద్ధి మొదలు పెట్టారు. 12 ప్రాసెసింగ్ ప్లాంట్లలో ఇంకా బెళుగుప్ప, ధర్మవరం, గుత్తి, కదిరి ప్రాంతాల్లో మొదలు కాలేదు. అంతో ఇంతో సొమ్ము వచ్చిందని తెలుసుకున్న ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్వాహకుడి ఇంటి దగ్గరకు అప్పులవాళ్లు వచ్చి తాము ఇచ్చిన అసలు, వడ్డీ తీసుకెళ్లారు. అయినా ఇంకా రూ.50 లక్షల వరకు అప్పు మిగలడంతో లబోదిబోమంటూ ఈసారి విత్తనశుద్ధి చేయలేనని చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 4 వేల క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లాలో వేయి క్వింటాళ్లు ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి రైతు సేవ కేంద్రా(ఆర్ఎస్కే)లకు మొత్తం 5 వేల క్వింటాళ్ల విత్తన కాయలు మాత్రమే చేరాయి. పరిస్థితి చూస్తే ఈసారి కూడా కేటాయించిన రైతులకు పూర్తిస్థాయిలో విత్తనం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాకు 1.28 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కేటాయింపు ప్రాసెసింగ్ ప్లాంట్లలో అందుబాటులో ఉన్నది 20 వేల క్వింటాళ్లు బకాయిలు తీవ్ర జాప్యం చేయడంతో కొనలేని పరిస్థితిలో మిల్లర్లు రబీలో పండిన వేరుశనగ ఇతర ప్రాంతాలకు తరలిపోయిన దుస్థితి ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి తెప్పించాలని మిల్లర్లు, ఏపీ సీడ్స్పై ఒత్తిడి -
జిల్లాకు వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల రెండు రోజులు ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు రేకుల కుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షం, మిగిలిన ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా శుక్రవారం నార్పల, శింగనమల, ఆత్మకూరు, గుంతకల్లు, అనంతపురం, బుక్కరాయసముద్రం, విడపనకల్లు, తాడిపత్రి, కూడేరు, శెట్టూరు, యల్లనూరు తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. నేడో రేపో ‘నైరుతి’ ప్రవేశం నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. గురువారం కేరళ, మరికొన్ని ప్రాంతాలను తాకిన నైరుతి రుతుపవనాలు ఈ నెల 6 లేదా 7న జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. జూన్ 15 నుంచి జూలై ఆఖరు వరకు పంటలు విత్తుకునేందుకు అనుకూలమని చెబుతున్నారు. మంచి వర్షాలు కురిస్తే ఏరువాక జోరందుకోనుంది. ‘సర్’పై నేడు రాజకీయ సమావేశం అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో శనివారం సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజరు కావాలని కోరారు. -
పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత
అనంతపురం అర్బన్: పర్యారవణ పరిరక్షణ సామాజిక బాధ్యత అని, ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఎకాలజీ సెంటర్ వరకు అవగాహన ర్యాలీకి కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. జిల్లాలో 13 లక్షల విత్తన బంతులు, కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టేందుకు సమాయత్తమవుతున్నామన్నారు. కార్యక్రమంలో సామాజిక వన విభాగం అధికారి గురు ప్రభాకర్, కాలుష్య నియంత్రణ శాఖ అధికారి శశికళ, డీఆర్డీఏ పీడీ శైలజ, వ్యవసాధికారి సాలురెడ్డి, ఆర్డీటీ ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారులు దీపా, శివరాం, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, నర్సింగ్ విద్యార్థులు, న్యాయవాదులు, జిందాల్ సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సంయమనంతో పరిష్కరించుకోవాలి గుమ్మఘట్ట: అన్నదమ్ములు, దాయాదుల మధ్య ఉన్న భూ సమస్యలను సంయమనంతో పరిష్కరించుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. రాయదుర్గం మండలం 74 ఉడేగోళం ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీసులో శుక్రవారం నిర్వహించిన ‘ఒక నెల.. ఒక నియోజకవర్గం.. నాలుగు సందర్శనలు’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ప్రజల నుంచి 39 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలతో కార్యాలయాలు, కోర్టులకు వెళ్లి సమయాన్ని, డబ్బును వృథా చేసుకుని జీవితాలను నాశనం చేసుకోరాదని హితవు పలికారు. అనంతరం రాయంపల్లి సమీపంలో ఉన్న గవిసిద్దేశ్వర స్టీల్ ఇండియా ప్రైవేట్లిమిటెడ్ పరిశ్రమను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ హరికుమార్, మండల, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ అనంతపురం: పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యమని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఈ.భీమారావు అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనంతపురం కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడానికి, కాలుష్య రహిత సమాజ స్థాపనకు పర్యావరణ ఆవశ్యకతను గుర్తించాలన్నారు. -
ఇష్టారాజ్యంగా ఎరువులు విక్రయిస్తే చర్యలు
అనంతపురం అగ్రికల్చర్: ఇష్టారాజ్యంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి హెచ్చరించారు. శుక్రవారం స్థానిక కృషిభవన్లో అనంతపురం డివిజన్ పరిధిలో ఉన్న ఆరు మండలాల ఇన్పుట్ డీలర్లు, దుకాణాదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత మందులు, విత్తనాలు, ఎరువులు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. ప్రధానంగా యూరియా, డీఏపీ అమ్మకాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. కొత్తగా యాప్ అందుబాటులోకి వస్తున్నందున రైతు భూ విస్తీర్ణం, సాగు చేసిన పంటను బట్టి ఎరువుల అమ్మకాలు ఉంటాయన్నారు. బయోమెట్రిక్ పద్ధతిలోనే అమ్మకాలు కొనసాగించాలని, ఎంఆర్పీలు, రైతుకు బిల్లులు, స్టాకు రిజిస్టర్లు, భౌతిక, ఆన్లైన్లో వ్యత్యాసాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. నిరంతరం నిఘా ఉంటుందని, ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఏడీఏ ఏ.వెంకటకుమార్, ఏఓలు రాకేష్నాయక్, సోమశేఖర్, శుభకర్, శ్యాంసుందరరెడ్డి పాల్గొన్నారు. -
ఉపాధి పనుల్లో ‘పచ్చ’ మేత
● పనుల పరిశీలనకు వెళ్లిన అధికారికి బెదిరింపులు ● తనిఖీలు చేస్తే కాళ్లూచేతులు నరికేస్తామంటూ వార్నింగ్! తాడిపత్రిటౌన్: ఉపాధి హామీ పనులు అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తమ పార్టీ ద్వారా ఫీల్డ్ అసిస్టెంటు పోస్టుల్లోకి వచ్చిన వారితో కుమ్మకై ్క అక్రమాలకు పాల్పడుతున్నారు. కూలీల ద్వారా చేయించాల్సిన పనులను జేసీబీలతో చేయించడం.. బిల్లుల కోసం కూలీల ఫొటోలు అప్లోడ్ చేయడం పరిపాటిగా మార్చుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించేందుకు వెళ్లే అధికారులకు ‘పచ్చ’ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. పెద్దపప్పూరు మండలంలో వారం రోజుల కిందట జరిగిన ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. పెద్ద ఎక్కలూరులో ఉపాధి హామీ పనులను రాత్రిపూట జేసీబీలు పెట్టి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం పూట తమకు అనుకూలమైన కూలీలతో పనులకు హాజరైనట్లు ఫొటోలు తీసి, యాప్లో అప్లోడ్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి కూలీలతో పనులు చేయించాలి. కానీ అధికార పార్టీ నాయకులు ఉపాధి పనులను తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. జేసీబీలతో చేయించి.. కూలి సొమ్మును కూలీలకు సగం ఇచ్చి.. మిగతాది తమ జేబులు నింపుకుంటున్నారు. ఇటీవల పనుల పరిశీలన కోసం వచ్చిన మండలస్థాయి ఉపాధి అధికారిని టీడీపీ నేతలు కలిశారు. ‘ఇక్కడ మీరేమీ పనులు చూడక్కర్లేదు. కాదని తనిఖీలు చేయాలని చూస్తే కాళ్లూచేతులు నరికేస్తా’ జాగ్రత్త అంటూ హెచ్చరించినట్లు తెలిసింది. ఈ విషయంలో గ్రామంలో ఆనోటా.. ఈనోటా పడి బయటకు వచ్చింది. ఇదిలా ఉండగా చెర్లోపల్లిలోనూ సదరు అధికారికి చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా క్షేత్రస్థాయి సిబ్బంది మద్యం మత్తులో ఆయనపై దురుసుగా మాట్లాడినట్లు తెలిసింది. ఈ విషయమై సదరు మండలస్థాయి అధికారిని ‘సాక్షి’ వివరణ కోరితే క్షేత్రస్థాయి సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే బెదిరింపుల విషయాన్ని దాటవేశారు. -
‘పచ్చ’ తోడేళ్ల చెరలో చెరువులు విలవిల
● చిత్రచేడు, అప్పేచర్లలో విచ్చలవిడిగా మట్టి దోపిడీ పెద్దవడుగూరు: మండలంలోని చిత్రచేడు, అప్పేచర్ల గ్రామాల్లోని చెరువులను ‘పచ్చ’ నాయకులు చెరబట్టారు. రైతుల మాటున విచ్చలవిడిగా మట్టిని తోడేస్తూ జేబులు నింపుకుంటున్నారు. రెండు వారాలుగా దందా సాగిస్తున్నారు. ఆయా చెరువుల నుంచి నిత్యం సుమారు వంద టిప్పర్ల మట్టిని డోన్, కర్నూల్, గుంతకల్లు తదితర ప్రాంతాలకు తరలించి రూ. లక్షలు వెనకేసుకుంటున్నారు. అప్పేచర్ల చెరువులో పలువురు పేద రైతులు సాగుచేసుకుంటున్న చోట కూడా మట్టి తరలించి కడుపు కొడుతున్నారు. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మట్టి టిప్పర్లు ప్రధాన దారుల్లో దూసుకెళ్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు హడలెత్తుతున్నారు. -
బరువు ఉండరు.. ఎత్తు పెరగరు!
బాల్యం.. బలహీనం ● అంగన్వాడీ సరుకుల్లో నాణ్యత డొల్ల ● దృష్టి సారించని చంద్రబాబు ప్రభుత్వం రాయదుర్గం: బాల్యం బక్కచిక్కుతోంది. పౌష్టికాహార లోపం వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు ఎదిగేకొద్ది రుగ్మతలతో నలిగిపోతున్నారు. జిల్లాలో 2,302 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 0–6 నెలల్లోపు పిల్లలు 10,361.. 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు 65,605.. 3–6 ఏళ్లలోపు పిల్లలు 46,894 మొత్తం 1,22,860 మంది ఉన్నారు. గత నెలలో 1,21,930 మంది చిన్నారులను పరీక్షించగా, ఘోరమైన విషయాలు వెల్లడయ్యాయి. వయసుకు తగ్గ ఎత్తులేని పిల్లలు 7,169, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు 2,760 మంది ఉన్నట్లు తేలింది. పోషణ లోపం ఉన్న పిల్లలు 2,220 మంది, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న వారు 640 మంది ఉండడం గమనార్హం. పోషకాహారం లేకనే.. సరైన పోషకాహారం అందకపోవడంతోనే ఎత్తుకు తగ్గ బరువు, బరువుకు తగ్గ ఎత్తు ఉండటం లేదు. అంగన్వాడీల ద్వారా అందిస్తున్న కోడిగుడ్లు, పాలు,కందిపప్పు,నూనె,చిక్కీ, రాగిపిండి, ఎండు కర్జూరం, బియ్యం, బెల్లం తదితర సరుకుల్లో నాణ్యత తీసికట్టుగా మారింది. రాగిపిండిలో అయితే ఇసుక రేణువులు కనిపిస్తున్నాయి. గోలీ సైజులో ఉండే కోడిగుడ్లు సరఫరా చేస్తూ చిన్నారుల పొట్ట కొడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పోషకాహారం అందేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేయగా.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ఏదీ పర్యవేక్షణ? అంగన్వాడీలపై పర్యవేక్షణ కొరవడడంతోనే దుస్థితి తలెత్తుతోందనే విమర్శలు ఉన్నాయి. బొమ్మనహాళ్ మండలం కురువళ్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఇటీవల కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు. పిల్లల ఎత్తు, బరువుల రిజిస్టర్ను పరిశీలించారు. తప్పుల తడకగా ఉండడంతో కార్యకర్తపై చర్యలు తీసుకున్నారు. రాయదుర్గంలో నెల రోజుల నుంచి సీడీపీఓ కుర్చీ ఖాళీగా దర్శనమిస్తోంది. కనీసం వేరొకరికి ఇన్చార్జ్ ఇవ్వలేదు. జిల్లాలోని చాలా చోట్ల ఇలాంటి దుస్థితే నెలకొంది. ఈ క్రమంలో అంగన్వాడీలపై పర్యవేక్షణ కరువై అంతా ఇష్టారాజ్యంగా మారింది. సమతుల ఆహారం తీసుకోవాలి గర్భిణులు, బాలింతలు సమతుల ఆహారం తీసుకుంటే రక్తహీనత నుంచి గట్టెక్కవచ్చు. బిడ్డకు ఆరు నెలల వరకూ తల్లిపాలే పట్టించాలి. ఏడాది తర్వాత పోషకాలు, విటమిన్లు ఉండే ఆహారం అందించాలి. ఉదయం సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. – మెర్జీ జ్ఞానసుధ, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, రాయదుర్గం నాణ్యత లేని సరుకులు ఇస్తే చర్యలు అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యత లేని సరుకులు సరఫరా చేస్తే కఠిన చర్యలు చేపడతాం. ఎత్తుకు తగ్గ బరువు, బరువుకు తగ్గ ఎత్తులేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. రక్తహీనత నివారణకు చర్యలు చేపడతాం. రాయదుర్గంకు త్వరలో సీడీపీఓను నియమిస్తాం. – శశికళ, ఐసీడీఎస్ పీడీ -
నాలుగో సింహం నవ్వులపాలు
● కాసుల కోసం ఖాకీల కక్కుర్తి ● సెటిల్మెంట్ల కేంద్రంగా పోలీస్ స్టేషన్ ● అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పంచాయితీలుతాడిపత్రిటౌన్: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు పాటుపడాల్సిన పోలీసులు దారి తప్పుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కనపెట్టి అధికార టీడీపీలో చిన్నబాస్గా చెలామణి అవుతున్న నాయకుడి డైరెక్షన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘పచ్చ’ నేతలతో స్టేషన్ను నింపి.. సెటిల్మెంట్ల ద్వారా కాసులు వెనకేసుకుంటున్నారు. ఇదీ తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్లోని అధికారుల తీరు. విశ్వసనీయ సమాచారం మేరకు.. స్టేషన్లోని కీలక అధికారి రోజూ సాయంత్రం ‘చిన్నబాస్’తో బాబా ఆలయంలో భేటీ అవుతుంటారు. ఎవరిపై కేసులు పెట్టాలి.. ఏ సెక్షన్లు పొందుపరచాలో సూచిస్తే అధికారి ఆ విధంగా నడుచుకుంటున్నారు. స్టేషన్లో జరిగే పంచాయితీలను రూ.లక్షకు పైగా గిట్టుబాటు అయితే కీలక అధికారి.. ఆలోపు ఉంటే కిందిస్థాయి అధికారులు చేస్తుంటారు. వీరిని ఆదర్శంగా తీసుకుని కిందిస్థాయి సిబ్బంది కూడా చిన్నాచితకా సెటిల్మెంట్లు కానిచ్చేస్తున్నారు. ఇదంతా ‘పచ్చ’ నేతల సమక్షంలోనే సాగుతోంది. ఇక పట్టణంలో మట్కా, పేకాట క్లబ్లకు అనధికార పర్మిషన్లు ఇస్తూ రోజు రూ.50 వేలకు పైగా ముడుపులు అందుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఎప్పుడు చూసినా అధికార పార్టీ నేతలే కనిపిస్తుండటంతో ‘ఇది పోలీస్ స్టేషనా.. లేక ‘పచ్చ’ నేతల నిలయమా’ అని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. ఖాకీల తీరు వివాదాస్పదం.. తాడిపత్రి పట్టణంలో ప్రధానంగా ఐదుగురు అధికార పార్టీ నాయకులు మట్కా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మట్కా నిర్వాహకుల్లో ఒకరిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అదీ ఏఎస్పీ టీం రెడ్హ్యాండెడ్గా అతన్ని పట్టుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో చేశారు. మిగిలిన ఐదుగురు నిర్వాహకుల జోలికి వెళ్లే సాహసం మాత్రం చేయడం లేదు. ● ఇక గంజాయి విషయానికి వస్తే నెల క్రితం ఓ లాడ్జ్లో దాదాపు పది కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు ఒడిశా యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాడిపత్రిలో వారు ఎందుకు ఉన్నారు.. ఎవరికి అమ్ముతున్నారు.. అని విచారణ చేయకుండా రైల్వే స్టేషన్లో తచ్చాడుతూ కనిపిస్తే పట్టుకున్నామని చెప్పి.. ‘గంజాయి బ్యాచ్’కు అండగా నిలిచి పెద్ద మొత్తంలో వెనకేసుకున్నట్లు తెలిసింది. ● పట్టణంలో ఇద్దరు బాలికలను ఇద్దరు అబ్బాయిలు ప్రేమ పేరుతో మోసం చేసి పది తులాల బంగారు ఆభరణాలు కాజేశారు. దీన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులకు రూ.5 లక్షలు అప్పగించి మిగిలినది పోలీసులు స్వాహా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● తక్కువ ధరకే బంగారు ఇప్పిస్తామని పలువురి నుంచి రూ.కోట్లల్లో డబ్బు సేకరించి, మోసగించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి 13 తులాల బంగారు లభ్యమైందని చెప్పి రిమాండ్కు పంపారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు తెలుస్తోంది. -
వెన్నుపోటుకు బ్రాండ్ చంద్రబాబు
ఉరవకొండ: ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించి తాను ‘వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్’ అని చంద్రబాబు నిరూపించుకున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం విడపనకల్లు మండల కేంద్రంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రజలను ఎలా వంచించారో ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేశారు. అంతకు ముందు బైక్ ర్యాలీ నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల క్రితం అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు.. అందులో ఒక్క హామీ కుడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఉచిత గ్యాస్, ఆడబిడ్డ నిధి లాంటి హామీలు అమలు చేయలేదన్నారు. రైతుల సంక్షేమాన్ని కూడా గాలికొదిలి వారిని మోసం చేశారన్నారు. అమరావతి పేరు మీద రూ.2 లక్షల కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు.అమరావతిపై దుబారా ఖర్చు తప్ప ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని, అందులో భాగంగానే ప్రతి గ్రామంలో బెల్టుషాపు, ఎక్కడ పడితే అక్కడ జూద కేంద్రాలు వెలిశాయని పేర్కొన్నారు. రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల మీద భారం మోపిందన్నారు. ప్రభుత్వ అవినీతిపై మాట్లాడితే రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారన్నారు. పార్టీ రీజనల్ అధికార ప్రతినిధి కె.వి.రమణ మాట్లాడుతూ ఆర్థిక మంత్రి, అసత్యాల ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజలను మోసగించారన్నారు. అమరాతి పేరుతో భారీ ఎత్తున దోపిడీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల పరిశీలకులు ముత్తూలురు అశోక్, ఎంపీపీ కరణం పుష్పవతి, పార్టీ రాష్ట్ర నాయకులు కరణం భీమిరెడ్డి, హవళిగి భరత్రెడ్డి, సుంకన్న, ఓబుళప్ప, గిరిబాబు, నాగేంద్ర, సిద్దార్థ్, జనార్థన్రెడ్డి, ఎర్రిస్వామి, అనిల్, గోవప్ప, ఆది, అజిత్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి పేరుతో దుబారా ఖర్చు పెట్టి దోపిడీ చేస్తారా? సూపర్ సిక్స్ హామీలు గుర్తుకై నా ఉన్నాయా? వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ధ్వజం -
బాధ్యతల స్వీకరణ
అనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా జీవిగారి శివప్రసాద్ శుక్రవారం స్థానిక గ్రంథాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయనను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్, కమ్మన్న, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతాపరెడ్డి, జయరామ్ తదితరులు సత్కరించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సెస్సు వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. అధికారులు, సిబ్బంది ఒకేతాటిపై నిలిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ● తాత్కాలిక (ఎఫ్ఏసీ) కార్యదర్శిగా సేవలందించిన కమ్మన్నను రవికుమార్ నాయుడు, రామాంజనేయులు, గోవిందు, రాజు, రామాంజనమ్మ తదితరులు సన్మానించారు. నేటి నుంచి ‘మన డబ్బులు–మన లెక్కలు’పై సదస్సులు అనంతపురం టౌన్: జిల్లాలో 16 మండలాల్లోని స్వయం సహాయక సంఘాలకు ‘మన డబ్బులు – మన లెక్కలు’ యాప్పై ఈ నెల 20వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సంఘం పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించి సభ్యులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. తీసుకున్న రుణం, చెల్లించిన రుణం, సభ్యులు చేసుకున్న పొదుపు వివరాలను తెలియజేయాలన్నారు. ప్రతి సంఘం సభ్యురాలు ‘మన డబ్బులు – మన లెక్కలు’ యాప్ను డౌన్లోడ్ చేసుకుని సంఘం వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునన్నారు. రుణం, పొదుపు వివరాలను మ్యానువల్ పుస్తకంలో నమోదు చేయడంతో పాటు మొబైల్ యాప్లో సైతం నమోదు చేయించే విధంగా వీఓలు, సీసీలు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ స్తంభంపై నుంచి పడి వ్యక్తి మృతి గుత్తి: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎస్ పల్లికి చెందిన రామాంజనేయులు (38) అలియాస్ రామన్న విద్యుత్ స్తంభం నుంచి జారి పడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఎస్ పల్లికి చెందిన రామాంజనేయులు ప్రైవేట్ విద్యుత్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. పెద్దవడుగూరు మండలం జీ–వెంకటాం పల్లిలోని ఓ పొలంలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా షాక్కు గురై కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన రామాంజనేయులును గుత్తి ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల్లో చోటు అనంతపురం: వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల్లో పలువురికి చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన యు.నాగార్జున వైఎస్సార్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ఎస్.ఖాసీఫ్ఆలీ, టి.వెంకట రెడ్డి జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులుగా, మనోవిశ్వాస్ రెడ్డి జిల్లా ఐటీ వింగ్ ఉపాధ్యక్షుడిగా, దామోదర్ రెడ్డి, కొండారెడ్డిని జిల్లా ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రటరీలుగా, బ్రహ్మానంద రెడ్డిని జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, జి. నారాయణ రెడ్డి, నంజుండప్పను జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. మచ్చుకత్తితో వ్యక్తి వీరంగం డీ హీరేహాళ్ (రాయదుర్గం): డీ హీరేహాళ్ మండలంలోని మురడిలో వీరేష్రెడ్డి అనే వ్యక్తి మచ్చుకత్తితో వీరంగం సృష్టించాడు. గురువారం రాత్రి గ్రామానికి చెందిన నాగరాజురెడ్డి, వీరేష్రెడ్డి మధ్య స్థలం విషయంపై ఘర్షణ జరిగింది. స్థానికుడు నరసింహారెడ్డి జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. వీరేష్రెడ్డి రాయితో దాడి చేసేందుకు యత్నించాడు. స్థానికులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే, చీకటి పడ్డాక తప్పతాగి వచ్చిన వీరేష్ రెడ్డి మచ్చు కొడవలి పట్టుకుని బీభత్సం సృష్టించాడు. ‘మీ అంతుచూస్తా..ఈ రోజు నరికే వెళతా’నంటూ హల్చల్ చేశాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డీ హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి గ్రామానికి చేరుకుని విచారించారు. వీరేష్రెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
ఇద్దరిని బలిగొన్న నిర్లక్ష్యం
● విద్యుదాఘాతంతో తండ్రీకుమారుడు దుర్మరణం ● పంచాయతీ బోరు మోటర్ మరమ్మతు చేస్తుండగా ఘటన గుమ్మఘట్ట: అధికారుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. విద్యుదాఘాతంతో మెకానిక్లైన తండ్రీకుమారులు దుర్మరణం చెందారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లికి చెందిన ఆనంద్, రాధమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ఆనంద్ (50), చిన్న కుమారుడు తేజ (25) విద్యుత్ మోటర్లు రిపేరీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గుమ్మఘట్ట మండలం కరిసూరయ్యదొడ్డి గ్రామంలో తాగునీటి మోటర్ చెడిపోయింది. దీని రిపేరీ కోసం శుక్రవారం ఆనంద్, తేజను పిలిపించారు. వీరు వాహనం సహాయంతో మోటర్ను వెలికితీసేందుకు ఉపక్రమించారు. మోటర్ పై భాగంలో 11కేవీ విద్యుత్ లైన్ ఉంది. అయితే విద్యుత్ సరఫరా ఉన్న సమయంలోనే మోటర్, ఇరన్ పైపు తీస్తుండగా 11కేవీ విద్యుత్లైన్ను తగిలింది. అంతే ఆనంద్, తేజ విద్యుదాఘాతానికి గురై క్షణాల్లో ప్రాణం విడిచారు. వీరిని కాపాడేందుకు ప్రయత్నించిన రేవన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం ఆస్పత్రిలో చేర్చారు. తండ్రీకుమారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో బొమ్మక్కపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పంచాయతీ అధికారులు మోటర్ రిపేరీ సమయంలో విద్యుత్ అధికారుల నుంచి ఎల్సీ తీసుకుని ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు చర్చించుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన తండ్రీకుమారుడు ఆనంద్, తేజ -
సూపర్సిక్స్ హామీలు గాలికి
పామిడి: చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేసి జనాన్ని నట్టేట ముంచిందని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు వై.నైరుతిరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పామిడిలో వైఎస్సార్సీపీ జిల్లా ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమానికి నైరుతిరెడ్డి హాజరై మాట్లాడారు. హామీలు పూర్తిగా అమలు చేయడంలో విఫలమైన అబద్ధాలకోరు బాబుకు ప్రజలు బుద్ధి చెప్పేరోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్కహామీనీ సక్రమంగా అమలుచేయకపోవడంతో ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారన్నారు. అవినీతి– అక్రమాలు, దందాలు–దౌర్జన్యాలు, కుళ్లు– కుతంత్రాలే ధ్యేయంగా బాబు పాలన సాగుతోందని దుయ్యబట్టారు.అభివృద్ధి–సంక్షేమాన్ని అటకెక్కించి డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సూపర్సిక్స్ హామీలు నెరవేర్చే వరకూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమిస్తామిన్నారు. అనంతరం ఎన్నికల మేనిఫెస్టోను, బాండ్ల ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, మేధావులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. -
లాడ్జీల్లో విజిటర్ మేనేజ్మెంట్ సిస్టం
అనంతపురం సెంట్రల్: జిల్లాలో హోటళ్లు, లాడ్జీల్లో బస చేసే సందర్శకుల వివరాల నమోదుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాంకేతికతతో రూపొందించిన విజిటర్ మేనేజ్మెంట్ సిస్టంను ఎస్పీ జగదీష్ ప్రారంభించారు. శుక్రవారం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించారు. లాడ్జీల యజమానులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ సందర్శకులు వచ్చిన వెంటనే వివరాలు పంపితే తన కార్యాలయానికి రియల్ టైమ్లో చేరతాయన్నారు. విదేశీ పర్యాటకుల సమాచారాన్ని కూడా వేగంగా పంపవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. డబ్బు ఆశ చూపుతారు.. దోచేస్తారు ● ఘరానా ముఠా అరెస్ట్ ● రూ.1.35 లక్షలు స్వాధీనం అనంతపురం సెంట్రల్: ‘రూ. లక్షకు మూడు లక్షల నకిలీ నోట్లు ఇస్తాం..బ్లాక్ నోట్లను కెమికల్స్ ద్వారా ఒరిజనల్ నోట్లుగా మారుస్తాం’మంటూ అమాయక ప్రజలను నమ్మించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను ఎస్ఐ ప్రసాద్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గ్రామానికి చెందిన పానుగంటి నాగ శంకర్, కర్నూలు జిల్లా బెలగాల మండలం బ్యాతోలి గ్రామానికి చెందిన గొల్ల వెంకటేష్, కమ్మరి పరుశురాముడు ముఠాగా ఏర్పడి దోపిడీలకు పాల్పడేవారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో సామాన్య ప్రజలను మోసం చేయడం అలవాటుగా చేసుకున్నారు. రూ. లక్ష నిజమైన నగదు ఇస్తే కెమికల్ సాయంతో నకిలీ కరెన్సీని ఒరిజనల్గా మారుస్తామని నమ్మబలికేవారు. బాధితులను నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి కత్తులతో బెదిరించి నగదు దోచుకొని పరారయ్యేవారు. నిందితుల ఆచూకీపై సమాచారం రావడంతో తపోవనం సర్వీసు రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లాతో పాటు నంద్యాల, కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
దుష్ప్రచారం ఆపకపోతే మహిళలే బుద్ధి చెబుతారు
అనంతపురం ఎడ్యుకేషన్: అమ్మా డెయిరీపై ఎమ్మెల్యే పరిటాల సునీత దుష్ప్రచారం ఆపకపోతే మహిళలే నాలుక చీరేస్తారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం స్థానిక తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల నుంచి డబ్బు వసూళ్లు చేశారన్న ఆరోపణలను ఖండించారు. 3,900 మంది మహిళా రైతులు షేర్ల రూపంలో చెల్లించిన సొమ్మును తిరిగి తీసుకున్నారని, అవసరమైతే బ్యాంకు స్టేట్మెంట్లు పరిశీలించాలని సునీతకు సూచించారు. రాక్రీట్ సంస్థ పనులకు రూ.415 కోట్ల బిల్లులు రావాల్సి ఉండగా రూ.310 కోట్లు మాత్రమే చెల్లించారని తెలిపారు. మిగిలిన బిల్లుల కోసం సంస్థ కోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం లేదని విమర్శించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రైతులకు నీళ్లివ్వడంలో సునీత విఫలం.. పంటలు ఎండిపోతున్నాయని, బోర్లలో నీటి మట్టాలు తగ్గిపోయాయని రైతులు పలుమార్లు పరిటాల సునీతను కలిసి పేరూరు డ్యాంకు నీళ్లు ఇప్పించాలని కోరినా ఆమె పట్టించుకోలేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జీడిపల్లి–పేరూరు డ్యాం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సామర్థ్యాన్ని 3.9 టీఎంసీల నుంచి 5.5 టీఎంసీలకు పెంచి పనులు చేయించామని తెలిపారు. 2023 నాటికే 67 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పీఏబీఆర్ నుంచి ఆత్మకూరు మీదుగా పాపంపేట వరకు తాగునీటి పైపులైన్ పనులకు తమ హయాంలో టెండర్లు పిలిచి అధిక శాతం పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. కేవలం 10 శాతం పనులు పూర్తి చేస్తే ఆత్మకూరుకు నీళ్లు అందేవని, కానీ రెండేళ్లుగా ఆ పనులు ఎందుకు చేయలేదని సునీతను ప్రశ్నించారు. తాము ప్రారంభించిన తాగునీటి పథకాన్ని కొనసాగించకుండా వదిలేయడం వెనుక కమీషన్ల రాజకీయాలు ఉన్నాయా? అని నిలదీశారు. 110 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా స్పందించడం లేదని విమర్శించారు. అందుకే ఆన్లైన్లో మహానాడు.. చంద్రబాబు ప్రభుత్వం మహిళలు, రైతులు, నిరుద్యోగులను మోసం చేసిందని, ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ఈసారి మహానాడును ఆన్లైన్లో నిర్వహించారని ప్రకాష్రెడ్డి అన్నారు. తొలి ఏడాది కడపలో మహానాడు నిర్వహించిన చంద్రబాబు, రెండేళ్లు గడిచినా మేనిఫెస్టో అమలు చేయకపోవడంతో ప్రజల మద్దతు కోల్పోయారని విమర్శించారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులను మోసం చేసిన టీడీపీకి ప్రజలు దూరమయ్యారని, అందుకే ఈసారి ఆన్లైన్ మహానాడు నిర్వహించారని ఎద్దేవా చేశారు. ఇళ్ల నిర్మాణాలపై ఓపెన్ చాలెంజ్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను కావాలనే అడ్డుకుంటున్నారని, ఇప్పటికీ లక్షా 80 వేల రూపాయలతో ఇల్లు నిర్మించి చూపేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అదే పని పరిటాల సునీత చేయగలరా అని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణాలపై జరిగిన విజిలెన్స్ విచారణ నివేదికను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పాపంపేటలో ఇళ్ల కూల్చివేతలు, భూముల రిజిస్ట్రేషన్లు, బినామీల పేర్లతో భూ వ్యవహారాలు జరిగాయంటూ ధ్వజమెత్తారు. అమరావతిలో జరుగుతున్న దోపిడీపైనా, ప్రజల సమస్యలపైనా తాను మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు నాగార్జున, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, నాయకులు అమర్నాథ్రెడ్డి, మజ్జిగ శంకరయ్య, మేడాపురం మనేరు నరసింహులు, సీకే పల్లి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరరెడ్డిది ఆత్మహత్య అని తెలిసినా అసత్య ప్రచారం రాక్రీట్పై ఇంకెన్నాళ్లు అక్కసు? ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపాటు -
యథేచ్ఛగా చౌక బియ్యం మేత
అనంతపురం అర్బన్: చంద్రబాబు ప్రభుత్వంలో కొందరు రేషన్ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారు. ఇటీవల ‘నగదు బదిలీ’ దందాకు తెరతీశారు. కార్డుదారులతో నేరుగా వ్యాపారం చేస్తున్నారు. ఇళ్లవద్దకే వెళ్లి బియ్యం పంపిణీ చేసినట్లుగా ఈపాస్లో వేలిముద్ర వేయించుకుని కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు చెల్లిస్తున్నారు. తమకు డబ్బు వద్దు.. సరుకులు కావాలనే కార్డుదారులకు కూడా బలవంతంగా డబ్బు అంటగడుతున్నట్లు తెలిసింది. బరితెగింపు.. ప్రతి నెలా 26 తేదీన వృద్ధులకు, నిస్సహాయులకు వారి ఇళ్ల వద్దకే డీలర్ వెళ్లి బియ్యం పంపిణీ చేయాలి. ఇతర కార్డుదారులకు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చౌక దుకాణం వద్దనే బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చౌక దుకాణాల్లో సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా కొందరు ఘనులు 1వ తేదీనే బియ్యం పంపిణీ పూర్తి చేయడం చూస్తే ఎంతగా బరి తెగించారో స్పష్టమవుతోంది. ఇదిగో సాక్ష్యం.. అనంతపురం నగరంలోని 1285015 నంబరు చౌక దుకాణం పరిధిలో 529 కార్డులు ఉన్నాయి. ఇక్కడి డీలరు మే నెల 29వ తేదీన 22 కార్డులకు, 30వ తేదీన 16.. 31వ తేదీన 259, జూన్ 1వ తేదీన 232 ఇలా మొత్తం 529 కార్డులకూ సరుకులు పంపిణీ చేసినట్లు చూపాడు. గతంలోనూ ఈ చౌక దుకాణం డీలర్ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా తీరు మార్చుకున్నట్లుగా లేదనే విషయాన్ని ప్రస్తుత నెల పంపిణీ తీరు చెబుతోంది. ఇక్కడొక్కటే కాదు.. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిసింది. బ్లాక్ మార్కెట్కు.. పలువురు డీలర్లు కార్డుదారులకు బియ్యం ఇవ్వ కుండా బదులుగా కిలోకు రూ.10 నుంచి రూ.15 డబ్బులు ఇస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఒక రకంగా కార్డుదారులతోనే డీలర్ వ్యాపారం చేస్తున్నాడు. అలా కొనుగోలు చేసిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో కిలో రూ.20 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కార్డుదారులతో వ్యాపారం చేస్తున్న పలువురు డీలర్లు బియ్యానికి బదులు డబ్బులిస్తున్న వైనం సరుకులు కావాలన్న వారికీ మొండిచేయి -
అభ్యసనాభివృద్ధిపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక తరగతుల ఉపాధ్యాయులకు జ్ఞాన ప్రకాశ్ ఇయర్–3 (ఎఫ్ఎల్ఎన్) శిక్షణ కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుత్తి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో మొత్తం ఏడు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన శిక్షణను ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు ప్రారంభించి, మాట్లాడారు. పునాది దశలోని విద్యార్థుల అభ్యసనాభివృద్ధికి అవసరమైన బోధనా విధానాలు, ఆధునిక విద్యా పద్ధతులు, తరగతి గది నిర్వహణ, విద్యార్థుల్లో భాషా, గణిత నైపుణ్యాల పెంపుపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సౌకర్యార్థం రాష్ట్ర అధికారుల సూచన మేరకు అనంతపురంలో అదనంగా మరో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సమగ్ర శిక్ష ఏఎంఓ వేణుగోపాల్ తెలిపారు. బుక్కరాయసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న విజయభారతి బీఈడీ కళాశాలలో శుక్రవారం నుంచి కొత్త శిక్షణ కేంద్రం ప్రారంభమవుతుందన్నారు. ఆన్లైన్ ద్వారా అనంతపురం కేంద్రాన్ని ఎంపిక చేసుకున్న ఉపాధ్యాయులు మాత్రమే ఈ కేంద్రంలో శిక్షణకు హాజరుకావాలని సూచించారు. ఇప్పటికే ఇతర కేంద్రాల్లో నమోదు చేసుకుని, తమకు అనుకూలమైన కేంద్రాలను ఎంపిక చేసుకున్న ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి ఆయా కేంద్రాల్లో శిక్షణ పొందొచ్చని తెలిపారు. -
ధరల పెంపుదలతో సామాన్యులపై భారం
అనంతపురం టవర్క్లాక్: పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. పెంచిన ధరలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో ఎన్జీవో హోంలో గురువారం సదస్సు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణ స్వామి అధ్యక్షత జరిగిన సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం తరచూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను అధికంగా పెంచి ప్రజలపై గుదిబండ వేస్తోందన్నారు. ధరలు స్థిరంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పరిపాలన కన్నా ప్రజల నాశనమే లక్ష్యంగా మోదీ పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, వేమయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, నాయకులు నాగరాజు, వీరానారాయణ, మల్లికార్జున, వేమన, శ్రీరాములు, కేశవ రెడ్డి, నారాయణ స్వామి, పద్మావతి, లింగమయ్య, రమణయ్య, రాజేష్ గౌడ్, కుళ్లాయి స్వామి, చిరంజీవి, రామాంజనేయులు, పెద్దయ్య, నాగార్జున పార్వతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి క్షణంలో ఉద్యోగం చేజారిపోయింది!
అనంతపురం ఎడ్యుకేషన్: స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పోస్టుల భర్తీలో నాకు అన్యాయం జరిగింది. డీఎస్సీ–25 నోటిఫికేషన్లో ఎస్సీ–3 కేటగిరీ కింద ఐదు జనరల్ పోస్టులు చూపించారు. అందుకే 5వ అభ్యర్థిగా ఉన్న నాకు కచ్చితంగా ఉద్యోగం వస్తుందని సంతోషించాను. అయితే చివరికి నాలుగు పోస్టులు భర్తీ చేసి, ఐదో పోస్టు స్పోర్ట్స్ కోటా కింద కేటాయించారు. దీంతో నాకు ఉద్యోగం చేజారిపోయింది. 57 మార్కులు సాధించి 219 మెరిట్ ర్యాంకుతో ఎస్సీ–3 కేటగిరీలో 5వ అభ్యర్థిగా నిలిచా. ‘ఒకవేళ ఆ పోస్టు స్పోర్ట్స్ కోటాకు కేటాయించాల్సి ఉంటే నోటిఫికేషన్లోనే స్పష్టంగా చూపించాల్సింది. ఐదు పోస్టులూ ఎస్సీ–3 కేటగిరీలోనే చూపించి, తర్వాత ఒక పోస్టు స్పోర్ట్స్ కోటాకు మళ్లించడంతో నష్టపోయా. ఎస్జీటీ వైపు కాకుండా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుపైనే పూర్తిగా దృష్టి పెట్టా. ఎన్నో త్యాగాలు చేసి, రాత్రింబవళ్లు కష్టపడి చదివా. ఉద్యోగం చేతికొచ్చిందనుకునే సమయంలో ఇలా జరగడం చాలా బాధ కలిగించింది. నేను కోచింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్లో కూడా ఉద్యోగం వస్తుందని భావించి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కానీ చివరి క్షణంలో పోస్టు భర్తీ విధానం మారడంతో ఆశలన్నీ అడియాసలయ్యాయి. – జూటూరు రెడ్డప్ప, డీఎస్సీ–25 అభ్యర్థి, అనంతపురం -
లోపాయికారిగా పోస్టులు కట్టబెట్టారు..
కళ్యాణదుర్గం: నేను మెగా డీఎస్సీ–2005లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్) పరీక్ష రాసి 72.90 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించా. వాస్తవానికి ఉద్యోగాల భర్తీలో ఓపెన్ ర్యాంక్లో 11,13 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు ఓపెన్లో కాకుండా రెండు పోస్టులను బీసీ– డీ రిజర్వేషన్లో కేటాయించారు. ఓపెన్లో పంపించకుండా రెండు పోస్టులు రిజర్వేషన్ బీసీ– డీ రిజర్వేషన్కు పంపడం విద్యాశాఖ అధికారుల లోపాయికారి వ్యవహారం. ఎస్సీ, బీసీ కేటగిరీలోనూ ఇలాగే జరిగింది. నేను నెలలు పాటు అనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కుటుంబానికి దూరంగా ఉండి డీఎస్సీ కోసం సన్నద్ధమయ్యా. ఇలాంటి సమయంలో మెరిట్ జాబితా, తుది ఎంపిక జాబితాను బయటకు పెట్టకుండా విద్యాశాఖ అధికారులు లోపాయి కారిగా పోస్టులు కట్టబెట్టారు. విద్యాశాఖ అధికారులు దీనిపై సమగ్ర విచారణ జరపాలి. మా లాంటి వారికి న్యాయం చేయాలి. – పూజారి గోపాల్, ముప్పలకుంట -
పేదల బతుకులు ‘శిథిలం’
రాప్తాడు రూరల్: ప్రతి పేదవాడి జీవితంలో సొంతిల్లు ఓ కల. కూలినాలి చేసుకుంటూ, తినీతినక రూపాయి రూపాయి దాచుకుని ఓ చిన్న ఇంటి స్థలం కొనుక్కోవాలని, పిల్లలకు తలదాచుకునే నీడ కల్పించాలని ఎన్నో కుటుంబాలు కలలు కంటుంటాయి. ఆ ఆశలనే కొందరు దళారులు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి అధికార పార్టీ అండతో భవిష్యత్తులో పట్టాలు వస్తాయన్న హామీలతో పేదల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. చివరకు అధికారులు రంగంలోకి దిగితే దళారులు కనిపించకుండా పోతున్నారు. దీంతో నిరుపేదలు నష్టపోతున్నారు. మాయ మాటలతో మోసం అనంతపురం రూరల్ మండలం కురుగుంట సమీపంలోని 153 సర్వే నంబరు తడకలేరు వంక పొరంబోకు భూమిలో ఎమ్మెల్యే పరిటాల సునీత పేరు చెప్పుకుని రామగిరి మండలానికి చెందిన ఓ వ్యక్తి గుడిసెలు వేయించాడు. ‘ఎలాంటి ఇబ్బంది ఉండదు‘, ‘శాశ్వత ఇళ్లు కట్టుకోవచ్చు’, ‘పట్టాలు కూడా వస్తాయి‘ అంటూ భరోసా కల్పించాడు. వారి మాటలు నమ్మిన పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఒక్కో గుడిసెకు రూ. 40 వేలు చెల్లించినట్లు బాధితులు చెబుతున్నారు. కొందరు అప్పులు చేసి శాశ్వత నిర్మాణాలు కూడా ప్రారంభించారు. అయితే గురువారం తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, జేసీబీలతో అక్కడికి చేరుకున్న అధికారులు గుడిసెలను కూల్చివేశారు. కుటుంబాలను నిద్రలేపి, బలవంతంగా బయటకు పంపించి నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఇంట్లో ఉన్న సామగ్రి, కూలర్లు, నిత్యావసరాలు, కష్టపడి కొనుగోలు చేసిన వస్తువులు శిథిలాల కింద నలిగిపోయాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చిన మహిళలు, పిల్లల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేశాయి. అలాగే 41 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలో ఓ కుల సంఘం నాయకుడు ఇదే తరహాలో గుడిసెలు వేయించాడు. వాటిని కూడా అధికారులు బలవంతంగా తొలగించారు. దళారులపై చర్యలు తీసుకోవాలి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. వసూళ్లు చేసిన వారి ఆస్తులను గుర్తించి బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేదల గుడిసెలను కూల్చివేసిన దృశ్యం, గుడిసె కూల్చివేయడంతో చంటిబిడ్డతో దిగాలుగా కూర్చొన్న మహిళ ఈ పాపం ఎవరిది? ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయడం తప్పేనని అందరికీ తెలుసు. కానీ ఆ గుడిసెలు ఒక్కరోజులో వేయలేదు. నెలల తరబడి నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. వందల సంఖ్యలో గుడిసెలు ఏర్పడ్డాయి. శాశ్వత నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. ఇంత జరుగుతున్న సమయంలో అధికారులు ఎక్కడ ఉన్నారు? ప్రజాప్రతినిధులకు తెలీకుండా జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటి గుడిసె వేసిన రోజే చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇన్ని కుటుంబాలు నష్టపోయేవా? పది గుడిసెలు ఏర్పడినప్పుడు హెచ్చరించి ఉంటే ప్రజలు అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టేవారా? ఈరోజు గుడిసెలు నిర్ధాక్షిణ్యంగా పీకేస్తే ఈ పాపం ఎవరిది? అనే ప్రశ్న తలెత్తుతోంది. వంక పొరంబోకు భూముల్లో గుడిసెలు వేయించిన దళారులు ఒక్కొక్కరితో రూ.40 వేలు వసూలు ! నెలల తరబడి పట్టించుకోని అధికారులు ఉన్నఫళంగా జేసీబీలతో గుడిసెల నేలమట్టం లబోదిబోమంటున్న పేదలు -
అలవిగాని హామీలిచ్చిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్కటీ సరిగా అమలు చేయకపోవడంపై జనాగ్రహం పెల్లుబికింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా హామీలు నెరవేర్చని వైనంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగ
అనంతపురంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, పార్టీ శ్రేణులుఅనంతపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలకు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ‘చంద్ర గ్రహణం’ పట్టుకుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘ వెన్నుపోటుకు రెండేళ్లు ’ నిరనన కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ మేనిఫెస్టోతో పాటు చంద్రబాబు, పవన్కళ్యాణ్ పేరుతో ఇచ్చిన హామీల బాండ్లను నాయకులు దహనం చేసి నిరసన తెలిపారు. అనంత మాట్లాడుతూ చంద్రబాబు పాలనను రెండు మాటల్లో చెప్పాలంటే.. అవినీతి–అక్రమాలు, దందాలు–దౌర్జన్యాలు, కుట్రలు–కుతంత్రాలే అని అభివర్ణించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిందేమీ లేదని, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, ఎస్ఈసీ సభ్యులు కోగటం విజయభాస్కర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బీసీ రమేష్గౌడ్, గౌస్ బేగ్, అనంత చంద్రారెడ్డి, వెన్నం శివారెడ్డి, మాజీ మేయర్ వసీం సలీం, కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, చింతా సోమశేఖర్రెడ్డి, బోయ కృష్ణమూర్తి, చామలూరు రాజగోపాల్, శివబాల, శ్రీదేవి, కృష్ణవేణి, డాక్టర్ శంకరయ్య, కట్టుబడి తానీషా పాల్గొన్నారు. తెలుగు దోపిడీ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజాసేవా పార్టీ కాదని, ‘తెలుగు దోపిడీ పార్టీ’గా మారిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో గురువారం ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో నిరసన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాపంపేట నుంచి విద్యారణ్యనగర్ వరకు ర్యాలీ చేపట్టి, మార్గమధ్యంలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యారణ్యనగర్లో ఇటీవల కూల్చివేసిన ఇళ్ల స్థలాల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అభివృద్ధి పేరుతో అమరావతికే ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన జిల్లాలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఆత్మకూరులోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఒక్క హామీనైనా నెరవేర్చారా? మేనిఫెస్టోలో ప్రకటించి.. ఏ ఒక్క హామీని నెరవేర్చని ఘన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదేనని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు, కంబదూరు మండలాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరిగింది. నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ, పీఏసీ సభ్యుడు, పార్టీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య హాజరై కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దగా కోరు ప్రభుత్వాన్ని గద్దెదింపే రోజులు దగ్గర పడ్డారని ధ్వజమెత్తారు. అన్ని వర్గాలనూ మోసం చేశారు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాలను మోసం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మెట్టు విశ్వనాథరెడ్డి విమర్శించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి తదితర హామీల అమలు ఏమైందని నేతలు ప్రశ్నించారు. గుమ్మఘట్ట, రాయదుర్గం, డీ హీరేహాళ్, బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పండి? ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూర్, కూడేరు మండల కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసన ర్యాలీలు నిర్వహించారు. మేనిఫెస్టోను తగలబెట్టి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండేళ్ల పాలనలో ఎన్ని హామీలను అమలు చేశారో చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న ప్రశ్నించారు. మేనిఫెస్టో, బాండ్లు దహనం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో.. ప్రజలకిచ్చిన బాండ్ పేపర్లను దహనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎన్నికల్లో హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక అన్నివర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్తేమి కాదని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన అరాచక పాలనకు చంద్రబాబు ప్రభుత్వం పరాకాష్టగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. తాడిపత్రి పట్టణంలో నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించిన అనంతరం సూపర్ సిక్స్ హామీల పత్రాలను, బాండ్లను తగలబెట్టారు. పెద్దారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమాలు, భూదందాలు, దౌర్జన్యాలే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వారి కుటుంబాలను హింసిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పేరం స్వర్ణలత పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసనాగ్రహం శింగనమల నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, మాజీ సమన్వయకర్త వీరాంజినేయులు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి తరిమెల వంశీగోకుల్రెడ్డి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. చంద్రబాబు పాలనపై వెల్లువెత్తిన నిరసన జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు పలు చోట్ల టీడీపీ మేనిఫెస్టో పత్రాలు దహనం రెండేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని నేతల ధ్వజం సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు -
‘బాబు ప్రభుత్వం ఉద్యోగులకు చేసింది శూన్యం ’
ఉరవకొండ: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లయినా ఉద్యోగ, ఉపాధ్యాయులకు చేసింది శూన్యమని ఏపీటీఎఫ్–1938 సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప తెలిపారు. స్థానిక ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏపీటీఎఫ్–1938 జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లయినా 12వ పీఆర్సీ ప్రకటించకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. దీంతో పాటు డీఏ బకాయిలు, 2022లో సరెండర్ సెలవుల బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. 2018 నుంచి వివిధ టెజ్రరీల్లో పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయులకు జీఓ 342 పైన ఉన్నత విద్య అభ్యసించే వెసులుబాటు యదాతథగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు సాకే భాస్కర్, రాష్ట్ర కౌన్సిలర్లు భాస్కర్, దాదాఖలందర్, తాలుకా వైస్ చైర్మన్ కిశోర్, మండల అధ్యక్షులు గోపాల్, ఆదినారాయణ, గోపాల్నాయక్ తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు అనంతపురం అర్బన్: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఓ.ఆనంద్ స్పష్టం చేశారు. రెండో విడతలో 97 మందికి అక్రిడిటేషన్ మంజూరు చేశామన్నారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమాచార శాఖ ఆధ్వర్యంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో కమిటీ కన్వీనర్ , డీఐపీఆర్ఓ బాలకొండయ్య, సభ్యులు అయూఫ్, షఫీ ఉల్లా, రవికుమార్, ప్రతాప్, అనిల్కుమార్రెడ్డి, మల్లికార్జునరావు, రసూల్, రామాంజనేయులు, ఆర్వీఎస్ప్రసాద్, డీఎంహెచ్ఓ ఈబీదేవి, ఏసీఎల్ లావణ్య, ఆర్టీసీ ఆర్ఎం శ్రీలక్ష్మి, సమాచారశాఖ సిబ్బంది పాల్గొన్నారు. 17 నుంచి గూగూడు బ్రహ్మోత్సవాలునార్పల : జిల్లాలో ప్రసిద్ధి చెందిన గూగూడు కుళ్లాయిస్వామి (మొహ ర్రం) బ్రహ్మోత్సవాలు ఈ నెల 17నుంచి ప్రారంభం కానున్నాయి. 29న చివరి దర్శనంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈఏడాది ఉత్సవాల నిర్వహణకు వందేళ్లు కానున్నాయి. దీంతో బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు నిర్వహణ ఇలా.. 17న కుళ్లాయి స్వామివారి ప్రఽథమ దర్శనం, 18న స్వామివారి నిత్యపూజ నివేదన, 19న స్వామివారి అగ్నిగుండం ఏర్పాటు, 20న స్వామి వారిని నిలుపుట, 21న స్వామివారికి నిత్యపూజ నివేదన, 22న స్వామివారి ఐదో సరిగెత్తు, 23న స్వామివారి నిత్యపూజ నివేదన, 24న స్వామివారి ఏడో సరిగెత్తు, రాత్రికి దేవుని మెరవణి, 25న స్వామివారి నిత్యపూజ నివేదన, విడిదినం, 26న స్వామివారి గ్రామోత్సవం, పెద్దసరిగెత్తు, రాత్రికి దేవుని మెరవణి , అగ్నిగుండ ప్రవేశం, 27న స్వామివారి అగ్నిగుండ ప్రవేశం, సాయత్రం 4 గంటలకు జలధి, 29న స్వామివారి చివరి దర్శనంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
సందర్భం
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాపాడతారా..కాటేస్తారా? ● ‘అనంత అరణ్య’ం పేరిట అటవీకరణకు శ్రీకారం అనంతపురం న్యూటౌన్ : అతి తక్కువ వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లాలో విరివిగా మొక్కలు పెంచే బహత్తర కార్యక్రమానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ అనంత అరణ్య’ పేరుతో అటవీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో డ్వామా, జిల్లా పరిషత్, సాంఘిక సంక్షేమ శాఖల సమన్వయంతో అమలు చేయనున్నారు. ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో కార్యాచరణకు సంకల్పించారు. జిల్లాలోని అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం డివిజన్ల పరిధిలోని పాఠశాల ఆవరణలను ఎంపిక చేశారు. అయితే ఈఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అధికారులను కలవరపెడుతున్నాయి. ఇందుకు సూపర్ ఎల్–నినో ప్రభావం కూడా తోడవుతుండడంతో ‘ అనంత అరణ్య’ కార్యక్రమం ద్యారా మొక్కలు ఏపుగా పెరుగుతాయో లేక గతంలో మాదిరిగా నాటిన మొక్కలు నిలువునా ఎండి గుంతలకే పరిమితమౌతాయో వేచి చూడాల్సిందే. జిల్లాలో అటవీకరణ, పచ్చదనం పెంపునకు 28 మండలాల్లోని 48 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రతి 25 సెంట్ల విస్తీర్ణంలో 1,625 మొక్కలను నాటనున్నారు. సుమారు 108 ఎకరాల్లో 80 వేల మొక్కలు అవసరం కానున్నాయి. అధికారులు గుర్తించిన మండలాల్లో సగానికి పైగా మొక్కలు పెంచడానికి అనువైన పరిస్థితులున్నాయని మొదటి దశలో రెసిడెన్షియల్ పాఠశాలు, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఆవరణల్లో ‘అనంత అరణ్య’ ను అమలు చేయనున్నారు. -
ప్రతి విద్యార్థికీ విద్యా సామగ్రి కిట్ అందాలి
కూడేరు: సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికీ విద్యా సామగ్రి కిట్ అందాలని పథకం రాష్ట్ర పరిశీలకురాలు అనురాధ ఆదేశించారు. గురువారం కూడేరులోని ఎమ్మార్సీని ఆమె సందర్శించారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను సరఫరా అయిన పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంను పరిశీలించారు. ఇండెంట్ ప్రకారం అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలు సరఫరా అయ్యాయా? అని ఆరా తీశారు. మండలానికి చేరిన , ఇంకా కావాల్సిన వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఎంఈఓ మహమ్మద్ గౌస్కు ఆదేశించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సీఎంఓ చంద్రశేఖర్, ఎంఈఓ మహమ్మద్ గౌస్, సీఆర్పీ రమణ, ఎమార్సీ సిబ్బంది ఆంజనేయులు పాల్గొన్నారు. పోక్సో కేసులో యువకుడి అరెస్టు ఉరవకొండ: బాలికను మభ్య పెట్టి వివాహం చేసుకున్న కేసులో చిన్నముష్టూరు బీసీ కాలనీకి చెందిన బోయ వన్నూర్స్వామి అనే యువకుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ మహానంది, ఎస్ఐ జనార్దన్నాయుడు వివరాలు వెల్లడించారు. చిన్నముష్టూరుకు చెందిన వన్నూర్స్వామి బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సెప్టెంబర్లోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి ఉరవకొండ/అనంతపురం టౌన్: గత ప్రభుత్వంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మంజూరై అర్ధంతరంగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్లోపు లబ్ధిదారులు పూర్తి చేసుకోవాలని హౌసింగ్ పీడీ మాడిచేడు శైలజ తెలిపారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గంలోని హౌసింగ్ ఏఈలు సిబ్బందితో పీడీ సమీక్ష నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా జిల్లాలో 27,579 ఇళ్లు అర్ధంతరంగా ఆగిపోయాయన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 3,787 మంది ఇళ్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. మున్సిపాల్టీ పరిధిలో ఆవాస్ ప్లస్ కింద 66,936 మంది సర్వే పూర్తి చేశామని, ఇందులో 42,323 మంది స్థలం ఉండి ఇళ్లులేని వారిని గుర్తించామని, 20వేల మంది ఇళ్లు, స్థలం రెండు లేని వారు ఉన్నారన్నారు. బీఎల్, ఎల్ఎల్, ఆర్ఎల్ స్థాయిలో ఉన్న గృహాలను సెప్టెంబర్లోపు పూర్తి చేసుకోవాలన్నారు. సెప్టెంబర్లోపు పూర్తయిన ఇళ్లకు మాత్రమే బిల్లులు మంజూరు అవుతాయన్నారు. ఆప్షన్–3 ఇళ్లను ఆప్షన్ మార్పు ప్రక్రియను సైతం వేగవంతం చేయాలన్నారు. గృహ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వారితో చర్చించి మార్పు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. -
మహిళల భద్రతపై అవగాహన కల్పించాలి
అనంతపురం సెంట్రల్: మహిళల భద్రతపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. గురువారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో సీ్త్ర రక్ష పోర్టల్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. పోర్టల్ సర్వేలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు మహిళా పోలీసులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సీ్త్ర రక్ష పోర్టల్ పబ్లిక్ ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 23 వేల ఇళ్లను సందర్శించి, మహిళలు, చిన్నారుల రక్షణ, చట్టాలపై అవగాహన కల్పిస్తూ వివరాలను సేకరించినట్లు వివరించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, అదనపు ఎస్పీ మహబూబ్బాషా తదితరులు పాల్గొన్నారు. ఏఐ డ్యూటీ రోస్టర్ యాప్ ఆవిష్కరణ పోలీసుశాఖలో మరో యాప్ను ఎస్పీ జగదీష్ గురువారం ఆవిష్కరించారు. పోలీసు సిబ్బంది డ్యూటీల కేటాయింపు పూర్తిగా ఆన్లైన్, పారదర్శకంగా చేపట్టేందుకు ఏఐ డ్యూటీ రోస్టర్ యాప్ను తీసుకొచ్చారు. ఎలాంటి పక్షపాతం లేకుండా సిబ్బంది సీనియార్టీ, గతంలో చేసిన విధులు, నైపుణ్యాల ఆధారంగా ఏఐ కేటాయిస్తుందని ఎస్పీ తెలియజేశారు. దీంతో సిబ్బందికి మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు ఉత్సాహంతో పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరెడ్డి, ఆర్ఐ పవన్కుమార్, ఐటీ టీఎం సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు అనంతపురం టౌన్: వర్షాల కారణంగా ఇసుక కొరత లేకుండా గనులశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో రీచ్ల నుంచి ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదినారాయణ తెలిపారు. జిల్లాలోని యల్లనూరు మండల కేంద్రంతో పాటు మల్లగుండ్లలోని ఇసుక రీచ్ల నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభించి, ప్రస్తుతం 75 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో మిగిలిన 25 వేల టన్నుల ఇసుకను సైతం అందుబాటులోకి తీసుకొచ్చి ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ స్తంభంపై నుంచి పడి వ్యక్తి మృతి పెద్దవడుగూరు : మండలంలోని జి.వెంకటాంపల్లిలో గుత్తి మండలం సూరుసుంకుపల్లికి చెందిన రామాంజనేయులు(55) విద్యుత్ స్తంభంపై నుంచి జారిపడి మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. వివరాలు.. మృతుడు గ్రామంలో ఎలక్ట్రీషియన్గా చేస్తూ జీవనం సాగించేవాడు. రైతు వెంకటరాముడు పొలంలో మోటారు మరమ్మతు చేయడానికి వెళ్లాడు. మోటారు కనెక్షన్ తొలగించడానికి విద్యుత్ స్తంభం ఎక్కగా, కాలుజారి కింద పడి, అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
పామిడి సర్వేయర్పై సస్పెన్షన్ వేటు
పామిడి: పామిడి మండల సర్వేయర్గా పని చేస్తున్న ఎస్. మురళీధర్ను సస్పెండ్ చేస్తూ సర్వే శాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో ప్రజలు అందించే భూ కొలతల సమస్యల పరిష్కారంలో రాష్ట్రవ్యాప్తంగా 8 మంది మండల సర్వేయర్లు నిర్లక్ష్యం వహించారు. అందులో భాగంగా పామిడి సర్వేయర్ కూడా ఉన్నారు. సర్వే సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటున్న పామిడి సర్వేయర్పై సస్పెన్షన్ వేటు పడింది. అడవులు సృష్టిస్తాం నెట్ జీరో హెల్తీ క్యాంపస్ పేరులో జిల్లాలో మొక్కల పెంపకాన్ని చేపటేందుకు ప్రణాళికలను తయారు చేశాం. దీంతో మొక్కలు పెరగడానికి అవసరమైన అన్ని రకాల వసతులు ఒకేచోట కల్పిస్తున్నాం. కన్నా శాంతివనం స్ఫూర్తితో ఒకే ఆవరణలో చిన్న తరహాలో అడువులను సష్టించేలా చర్యలు చేపట్టాం. జిల్లాలో మొక్కల పెంపకం కోసం 48 ప్రభుత్వ నివాస పాఠశాలప్రాంగణాల్లో గుంతలు తీసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. – సలీం బాషా, డ్వామా, ప్రాజెక్టు డైరెక్టర్ ప్రతిఒక్కరూ మొక్క నాటండి అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని అటవీశాఖ డివిజనల్ అధికారి గురుప్రభాకర్ పిలుపునిచ్చారు. జిల్లాలో 13 లక్షల విత్తనపు బంతులు వెదజల్లనున్నట్లు తెలిపారు. గార్లదిన్నె, సలకం చెరువు, ఎర్రగుంటపల్లి, ఎస్కేయూనివర్సిటీ, తాడిప్రతి, పుట్లూరు, పెద్దవడుగూరు, గుంతకల్లు, పెన్నహోబిలం తదితర నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. -
రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం
● కలెక్టర్ ఆనంద్ బుక్కరాయసముద్రం: జిల్లాలో రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని బొమ్మలాటపల్లిలో పీఎండీఎస్.ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానం అమలును కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు పెళ్లె టైజ్డ్ పీడీఎంఎస్ ఉత్తమ ప్రత్యామ్నాయమన్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడుతున్న ఎల్నినో పరిస్థితుల్లో తక్కువ వర్షపాతం, పరిమిత నీటి లభ్యత ఉన్న రైతులకు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ విధానం తక్కువ నీటితో ఆరుతడి పంటలను విజయవంతంగా సాగు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే పొలాల్లో ఏడాది పొడవునా జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. అనంతరం బీకేఎస్ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో సెర్ప్, వెలుగు సంస్థ ద్వారా పొదుపు సంఘాల మహిళలకు ‘మన డబ్బులు – మన లెక్కలు’ అనే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి, రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ విజయ శంకర్బాబు, ఏడీఏ వెంకట్, మండల వ్యవసాయ అధికారి శ్యాం సుంధర్రెడ్డి, డాక్టర్ న వీన్, డాక్టర్ నరేంద్ర, ఏపీఎం అనితాదేవి, ఎంపీపీ సునీత తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్ అనంతపురం అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా 27 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలో ఇటీవల డిప్యూటీ కలెక్టరుగా పదోన్నతి పొందిన ఎ.హరికుమార్ను బాపట్ల ఆర్డీఓగా నియమించారు. ప్రస్తుతం ఈయన రాయదుర్గం తహసీల్దారుగా ఉన్నారు. అలాగే పి.విజయకుమారిని శ్రీసత్యసాయి జిల్లా కేఆర్ఆర్సీ ఎస్డీసీగా నియమించారు. ప్రస్తుతం ఈమె రాప్తాడు తహసీల్దారుగా ఉన్నారు. హెచ్ఎల్ఎల్సీ (భూసేకరణ) ఎస్డీసీగా ఉన్న ఎం.రామ్మోహన్ను అనంతపురం జిల్లా కేఆర్ఆర్సీ ఎస్డీసీగా నియమించారు. హెచ్ఎల్ఎల్సీ (భూసేకరణ) ఎస్డీసీగా వి.వెంకటనారాయణను నియమితులయ్యారు. తహసీల్దార్లకు స్థానాల కేటాయింపు అనంతపురం అర్బన్: తహసీల్దార్లుగా పదోన్నతి పొందిన వారికి స్థానాలు కేటాయించారు. ఈ మేరకు కలెక్టర్ ఓ.ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు చెందిన పది మంది తహసీల్దార్లు పోస్టింగ్ దక్కించుకున్నారు. ఆర్.సూర్యప్రతాప్ రాయదుర్గం తహసీల్దార్గా, పి.రవిచంద్ర తాడిపత్రి, పీజీ అరుణ ఉరవకొండ, పి.సింధు యల్లనూరు, డి.వెంకటేశ్వరమ్మ విడపనకల్లు, సి.జయశ్రీ వజ్రకరూరు, జి.విజయలక్ష్మి ల్యాండ్ రీఫామ్స్ (కలెక్టరేట్), పీఎంవీ మనోజ్ డీఏఓ (అనంతపురం ఆర్డీఓ ఆఫీసు), వై.బాలమ్మ పుట్లూరు, ఎం.ఉదయభాస్కర్ అనంతపురం రూరల్ తహసీల్దార్గా నియమితులయ్యారు. -
గూగూడు.. సమస్యలు బోలెడు
నార్పల : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు గూగూడులో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రతి ఏటా ఉత్సవాల వేళ భారీ ఆదాయం సమకూరుతున్నా భక్తులకు వసతులు కల్పించడంలో దేవదాయ శాఖ, అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సరిపడు వసతి గదులు అందుబాటులో లేవు. కల్యాణకట్ట వద్ద తలానీలాలు సమర్పించే చోట తగినన్ని బాత్రూములు లేవు. నెల రోజులు ముందు నుంచి వసతుల కల్పనపై దృష్టి సారించాల్సి ఉండగా తాత్సారం చేశారు. ఇటీవలే రెండు, మూడు బాత్రూముల నిర్మాణం చేపట్టారు. ఇవి ఏమాత్రమూ చాలవని.. ఆలయ నలు దిక్కులా అవసరమైనన్ని బాత్రూములను అందుబాటులోకి తేవాలని భక్తులు కోరుతున్నారు. ఇక కల్యాణ కట్ట వద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడిన చోట నీరు నిలిచి మడుగును తలపిస్తున్నాయి. అధ్వానంగా గదులు గూగూడు కుళ్లాయిస్వామి దేవాలయ ఆవరణలో 22 వసతి గృహాలు (సత్రాలు) ఉన్నాయి. వీటితో పాటు సమీప ప్రాంతంలోని గదులు చెత్తాచెదారంతో నిండి అపరిశుభ్రంగా మారాయి. కొన్ని గదుల గోడల పగుళ్లు ఏర్పడి శిథిలావస్థకు చేరినా పట్టించుకోవడం లేదు. మరికొన్ని గదుల తలుపులు దెబ్బతిన్నాయి. కుళాయిలు సరిగా లేక ట్యాంక్లోని నీరు వృథాగా పోతున్నాయి. అపరిశుభ్రంగా కోనేరు కల్యాణ కట్ట సమీపంలోని కోనేరు అపరిశుభ్రంగా ఉంది. ఎంతో పవిత్రంగా భావించే కోనేరును శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను భక్తులు కోరుతున్నారు. నీటి వసతి కల్పనకు చర్యలేవీ? గూగూడు ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతారు. నీటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇప్పటికే దేవదాయ శాఖ అధికారులు, మండల అధికారులతో ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. అయినా ఇప్పటి వరకు నీటి వసతి కల్పనకు చర్యలు తీసుకోలేదు. ఉత్సవాల ఏర్పాట్లకు తీసుకున్న చర్యల గురించి వివరణ కోసం ఈఓ శోభారాణిని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆమె అందుబాటులోకి రాలేదు. ఆపరిశుభ్రంగా ఉన్న బాత్రుములు దెబ్బతిన్న గదుల తలుపులు 17 నుంచి గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు లక్షలాదిగా తరలిరానున్న భక్తులు అరకొరగానే తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం పట్టించుకోని దేవదాయ శాఖఅధికారులు, ప్రజాప్రతినిధులు -
ఓటు తొలగించడం సులభం కాదు
అనంతపురం అర్బన్: ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్–సర్) ప్రక్రియ ఈ నెల 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 5 నుంచి 14 వరకు ‘సర్’ నిర్వహణపై సంబంధిత అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తారు. 15 నుంచి బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తారు. 2002 జాబితా ప్రకారం ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఓటరుగా ఉన్నారా లేదా అనేది పరిశీలిస్తారు. అక్కడ నివాసం లేని ఓటర్లను తొలగింపు జాబితాలో చేరుస్తారు. 2002లో అక్కడ ఓటు ఉన్నట్లయితే అందుకు సంబంధించి వివరాలను ఓటరు సంబంధీకులు బీఎల్ఓకు సమర్పిస్తే మ్యాపింగ్ చేస్తారు. ఒకే కుటుంబంలో ఓటర్లుగా ఉన్న వారందరినీ ఒకే బూత్లో ఉండేలా చూస్తారు. మ్యాపింగ్ కాకపోతే ఇబ్బందే ఓటరుగా మ్యాపింగ్ కాకపోతే ఇబ్బంది తప్పదు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 20,38,523 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 13,86,365 మంది ఓటర్ల మ్యాపింగ్ జరిగింది. ఇంకా 6,52,158 మంది ఓటర్ల మ్యాపింగ్ కావాల్సి ఉంది. ఇప్పటికే మ్యాపింగ్ అయిన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందీ లేదు. మ్యాపింగ్ కాని వారంతా మ్యాపింగ్ చేసుకోని పక్షంలో ఓటు కోల్పోవాల్సి వస్తుంది. మ్యాపింగ్ కోసం ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు. మ్యాపింగ్ కాని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మ్యాపింగ్ చేయించుకోవాలి. అత్యధికంగా మ్యాపింగ్ కాని ఓటర్లు అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలో 1,08,684 మంది, రాప్తాడులో 1,02,944 మంది ఉన్నారు. అత్యల్పంగా గుంతకల్లు నియోజకవర్గం పరిధిలో 28,639 మంది ఓటర్లు ఉన్నారు. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో 77 వేల నుంచి 86 వేల మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదు. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి ‘సర్’ విషయంలో రాజకీయ పార్టీలు, వారి పార్టీల బీఎల్ఏ (బూత్ లెవల్ ఏజెంట్)లు అప్రమత్తంగా ఉండాలి. తమ బూత్ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు.. ఎంత మంది మ్యాపింగ్ అయ్యారు.. ఎంత మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదు.. అనే వివరాలను తెలుసుకుని ఉండాలి. మ్యాపింగ్ కాని ఓటర్ల వద్దకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండేలా చూడాలి. బీఎల్ఓ వచ్చినప్పుడు వివరాలను సమర్పించేలా చూసి మ్యాపింగ్ చేయించాలి. 2002 ఓటరు జాబితాలో ఓటరుగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఆ ఇంటిలో లేకపోతే.. ఆ ఇంటిలో ఉన్న ఆ ఓటరు తాలూకు బంధువుల నుంచి వివరాలు ఇప్పించి మ్యాపింగ్ చేయించాలి. ఓటు తొలగిస్తే ఆందోళన వద్దు ఒక ఇంటిలో ఓటరుగా ఉన్నప్పటికీ పొరపాటున ఓటు తొలగిస్తే ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 14వ తేదీ వరకు సిబ్బందికి శిక్షణ 15 నుంచి బీఎల్ఓలు ఇంటింటి సర్వే జిల్లాలో మొత్తం ఓటర్లు 20,38,523 మ్యాపింగ్ అయిన ఓటర్లు 13,86,365 మ్యాపింగ్ చేసుకోవాల్సిన ఓటర్లు 6,52,158 మ్యాపింగ్ కాకపోతే ఓటు కోల్పోయే పరిస్థితి ‘సర్’పై శిక్షణ ఇవ్వాలి అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ‘సర్’పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు డీఆర్ఓ మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘సర్’పై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలకు శిక్షణ నిర్వహించాలని డీఆర్ఓను ఆదేశించారు. కాన్ఫరెన్స్లో కో–ఆర్డినేషన్ విభాగం అధిపతి యుగేశ్వరీదేవి, ఎన్నికల విభాగం డీటీ కనకరాజు, ఎస్ఏ శామ్యూల్ బెంజిమన్ తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓటు తొలగించడం అంత సులభం కాదు. మ్యాపింగ్ అయిన ఏ ఒక్కరి ఓటునూ తొలగించేందుకు వీలుండదు. జిల్లా ఓటర్లలో 68 శాతం మ్యాపింగ్ అయ్యారు. మిగిలిన ఓటర్లను మ్యాపింగ్ చేసేందుకు ఈ నెల 7 నుంచి 14 తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. 2002లో ఓటరుగా ఉంటే... ఆ వివరాలను చెప్పి మ్యాపింగ్ చేసుకోవచ్చు. బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు వయసు 18 ఏళ్లు నిండినట్లు, నివాస ధ్రువీకరణకు సంబంధించి ఏదేని ధ్రువపత్రం (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, బ్యాంక్ పుస్తకం, విద్యుత్ బిల్లు) చూపిస్తే సరిపోతుంది. ఇక రెండు చోట్ల ఓటుంటే ఒక చోట ఓటును తొలగిస్తారు. బీఎల్ఓలకు రాజకీయ పార్టీల బీఎల్ఏలు సహకరించాలి. – ఎ.మలోల, జిల్లా రెవెన్యూ అధికారి -
23 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 23 మండలాల పరిధిలో 8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కంబదూరు 45.4 మి.మీ, పెద్దవడుగూరు 28.8, విడపనకల్లు 22.8, కుందుర్పి 17.6, పామిడి 15.4, రాప్తాడు 15.2, గుత్తి 12.4 మి.మీతో పాటు రాయదుర్గం, బెళుగుప్ప, కళ్యాణదుర్గం, శెట్టూరు, బ్రహ్మసముద్రం, గుంతకల్లు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, అనంతపురం, గార్లదిన్నె, శింగనమల, నార్పల, యల్లనూరు తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. వృద్ధాప్య సహాయానికి దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం క్రైం: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధాప్య ఆర్థిక సహాయం పొందేందుకు జూన్ 30లోగా దరఖాస్తులు సమర్పించాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీసీఎస్లో కనీసం ఐదు సంవత్సరాలు సభ్యత్వం కలిగి ఉండి, 63 ఏళ్లు పూర్తి చేసుకున్న విశ్రాంత ఉద్యోగులు ఈ సహాయానికి అర్హులని పేర్కొన్నారు. భద్రతా పథకంలో సభ్యులుగా ఉన్న వారు ఈ పథకానికి అర్హులు కాదని స్పష్టం చేశారు. దరఖాస్తు ఫారాలు అనంతపురం కొత్త బస్టాండ్ సమీపంలోని డిపో వద్ద ఉచితంగానే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన సభ్యులు దరఖాస్తులను పూర్తి చేసి జూన్ 30లోగా ప్రధాన కార్యాలయానికి చేరేలా పంపించాలని సూచించారు. ఇతర వివరాల కోసం 99854 31084 నంబర్ను సంప్రదించాలని సూచించారు. 22 మందికి తహసీల్దార్లుగా పదోన్నతి అనంతపురం అర్బన్: జోన్–5 పరిధిలో జిల్లాకు సంబంధించి 2017–18 బ్యాచ్కు చెందిన 18 మంది పీడీటీలు (ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్లు), నలుగురు ఆర్పీ (ర్యాంక్ ప్రమోటీస్)లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు సీసీఎల్ఏ జె.విజయలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్లుగా పదోన్నతి పొందిన వారికి త్వరలో జిల్లాలో పోస్టులు కేటాయిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. పదోన్నతి పొందింది వీరే.. తహసీల్దార్లుగా పదోన్నతి పొందిన పీడీటీలు బి.రవి, వెలగరెడ్డి శేఖర్, ఆర్.బాలాంజినేయులు, ఆర్.సూర్యప్రతాప్, కె.ఎస్.మారుతీప్రకాశ్, సి.మనోజ్కుమార్, వి.మహేశ్వరరెడ్డి, టి.శ్రీనివాసరెడ్డి, ఎం.క్రాంతికుమార్, పి.ముకుంద, ఎం.ఉదయ్భాస్కర్, కె.మధునాయక్, పి.సింధు, బి.సురేంద్రనాథ్, సి.జయశ్రీ, పి.అరుణ, ఎస్.ఆర్.సంహిత, డి.వెంకటేశ్వరమ్మ ఉన్నారు. ఇక ఆర్పీలు కె.నరసింహులు, బి.హనుమంతు, జి.విజయలక్ష్మి, బి.బాలమ్మ తహసీల్దార్లుగా ప్రమోషన్ పొందారు. ‘పల్స్ పోలియో’ విజయవంతం చేయాలి అనంతపురం సిటీ: ఈ నెల 28 నుంచి చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో పీహెచ్సీ, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ఆమె సమీక్షించారు. ఈ నెల 28న పోలియో కేంద్రాల ద్వారా పిల్లలకు చుక్కల మందు ఇవ్వాలన్నారు. 29, 30 తేదీల్లో నిర్దేశించిన గ్రామాల్లోని ప్రతి ఇంటినీ ఆరోగ్య సిబ్బంది సందర్శించి ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు అందించాలన్నారు. కార్యక్రమంలో డీపీఎంఓ శ్రీనివాసులురెడ్డి, ఎస్ఓ మహమ్మద్ రఫీ, వ్యాక్సిన్ సూపర్వైజర్ శామ్యూల్ పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీగా మహబూబ్బాషా అనంతపురం సెంట్రల్: మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ మహబూబ్బాషాకు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి దక్కింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అడిషనల్ ఎస్పీ హోదాలో మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీగా కొనసాగుతూనే అనంతపురం అర్బన్ డీఎస్పీ ఇన్చార్జ్ బాధ్యతలూ నిర్వర్తించనున్నారు. ఈ సందర్బంగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
ర్యాంకు వచ్చినా.. ఉద్యోగం రాలేదు
నేను మెగా డీఎస్సీ–2025లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్) పరీక్ష రాసి.. 71.65 మార్కులతో జనరల్లో 121వ ర్యాంకు సాధించాను. శ్రీసత్యసాయి జిల్లాలో ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టుల లెక్క ప్రకారం నాకు ఉద్యోగం ఖాయమని భావించా. కానీ ఎంపిక జాబితాలో పేరు లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎస్టీ కేటగిరీలో జిల్లాలో మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయి. ఇందులో రెండు మహిళలకు, నాలుగు జనరల్ అభ్యర్థులకు, ఒక పోస్టు నాన్లోకల్ కోటాకు కేటాయించారు. నాన్లోకల్ అభ్యర్థులు లేని కారణంగా ఆ పోస్టు కూడా స్థానిక ఎస్టీ అభ్యర్థులకే దక్కాలి. ఈ లెక్కన మొత్తం ఐదు పోస్టులు జనరల్ అభ్యర్థులకు అందుబాటులోకి వచ్చాయి. నాకు జనరల్లో 121 ర్యాంకుతో పాటు ఎస్టీ కేటగిరీలో ఐదో స్థానంలో ఉన్నాను. అయినా ఉద్యోగం రాలేదు. ఈ విషయమై మంగళగిరిలోని అధికారులను సంప్రదిస్తే ఆ పోస్టును ‘స్పోర్ట్స్ కోటా’కు కేటాయించినట్లు చెప్పారు. టెట్, డీఎస్సీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు అవకాశాలు లేకుండా, ‘ప్రత్యేక కోటా’ పేరుతో పోస్టులు భర్తీ చేయడం వల్ల నాలాంటి వారికి అన్యాయం జరిగింది. ఈసారి ముందుగానే ‘పోస్టు ప్రిఫరెన్స్’ తీసుకోవడం కూడా నా అవకాశాలను దెబ్బతీసింది. మెరిట్ జాబితాలు, తుది ఎంపిక జాబితాలను బహిర్గతం చేయకపోవడంపై అనుమానం కల్గుతోంది. జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తే మా చేతుల్లో ఏమీలేదన్నారు. ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి. – సుగాలి గోపాల్నాయక్, కుర్లపల్లి తండా, కనగానపల్లి మండలం, శ్రీసత్యసాయి జిల్లా -
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు ప్రభుత్వ చౌక ధరల దుకాణాల (స్టోర్ల)పై ఎక్కువగా ఆధారపడతారు. ఉచితంగా, రాయితీపై ఇచ్చే సరుకులే వారికి దిక్కు. అలాంటి సామాన్యులపై కనికరం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రెండేళ్ల పాలనలో దశల వారీగా సరుకుల సంఖ్యలో కోత
సరుకుల కోసం స్టోర్ వద్ద కార్డుదారుల క్యూ (ఫైల్) అనంతపురం అర్బన్/ రాయదుర్గం టౌన్/ ఉరవకొండ: పేదల జీవితాలతో చంద్రబాబు సర్కార్ ఆడుకుంటోంది. అరకొర సంపాదనతో బతుకులీడుస్తున్న వారికి ప్రభుత్వం చౌకగా అందించే సరుకులను కుదిస్తోంది. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే విధానాన్ని రద్దు చేసింది. దీంతో కార్డుదారులు సరుకులు పొందాలంటే పాత పద్ధతిలో చౌకదుకాణాలు (స్టోర్ల)కు వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు తీసుకొచ్చింది. ప్రస్తుతం కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, రాగులు అటకెక్కించేసి బియ్యం, పంచదార (చక్కెర) వరకే పరిమితం చేసింది. దీంతో పేదలు బయటి మార్కెట్లో ఆ సరుకులను అధిక ధరలు వెచ్చించి కొనాల్సి వస్తోంది. బెంబేలెత్తిస్తున్న ధరలు నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. దీనికితోడు ఇంధన ధరల పెంచడంతో అన్ని రకాల వస్తువులపై మరింత భారం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం చౌక డిపోల ద్వారా సబ్సిడీపై నిత్యవసరాలు సరఫరా చేస్తే పేదలకు ఎంతో చేయూతగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం పట్ల ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. పేదలపై ప్రతి నెలా రూ.10.23 కోట్ల భారం ప్రభుత్వం కార్డుదారులకు జొన్నలు, రాగులు పంపిణీ చేయకపోవడంతో బయటి మార్కెట్లో వాటిని పేదలు కొనుగోలు చేయక తప్పడం లేదు. మార్కెట్లో జొన్నలు కిలో రూ.50, రాగులు కిలో రూ.50తో కొనుగోలు చేస్తున్నారు. ప్రతి కుటుంబం నెలసరి రెండు కిలోల జొన్నలు, ఒక కిలో రాగులు తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. తద్వారా 6.82 లక్షల మంది కార్డుదారులు కిలో జొన్నలు రూ.50 చొప్పున ప్రతి నెల రెండు కిలోల జొన్నలకు రూ.6.82 కోట్లు, ఒక కిలో రాగులకు రూ.3.41 కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రభుత్వం జొన్నలు, రాగులు పంపిణీ చేయకపోవడంతో పేదలు ప్రతి నెలా రూ.10.23 కోట్ల అదనపు భారం భరిస్తున్నారు. ఉడకని కందిపప్పు పౌరసరఫరాల సంస్థ ద్వారా పేదలకు అందజేసే నిత్యావసర సరుకులు రానురానూ తగ్గిపోతున్నాయి. వాస్తవానికి బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార పంపిణీ చేయాలి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కందిపప్పు సరఫరాను నిలిపేసింది. ఎప్పటికప్పుడు ఈసారి కందిపప్పు ఇస్తున్నాం అంటూ పాలకులు ప్రచారం చేయడం తప్ప పేదలకు పంపిణీ చేసింది లేదు. ప్రైవేట్ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. కందిపప్పు, జొన్నలు, గోధుమపిండి కట్ తాజాగా రాగుల పంపిణీకి బ్రేక్ వేసిన సర్కార్ బయట కొనుగోలుతో పేదలపై మోయలేని భారం చంద్రబాబు పాలనలో సరుకుల కోతలు.. ధరల మోతతో జనం కుదేలు -
అర్హులైన ఓటర్లను తొలగిస్తే పోరాటం తప్పదు
● మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ గార్లదిన్నె/నార్పల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)– 2026 మాటున అర్హులైన ఓటర్లను తొలగిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం నార్పల మండలం దుగుమర్రి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ బూత్ కమిటీల విస్తృత స్థాయి సమావేశం, బీఎల్ఏల అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ఎం మోహన్ రెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ ఓటరు జాబితాల పరిశీలనలో బీఎల్ఏలు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఓటు విలువైందేనన్నారు. బూత్ స్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి, అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడాలన్నారు. నియోజకవర్గంలో తాము ప్రజలకు అండగా నిలవడాన్ని జీర్ణించుకోలేక కొందరు రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు.. 2029 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ఎంమోహన్రెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. యువ నాయకుడు రుత్విక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియతో ఎన్నికలు మొదలైనట్లేనన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతుంటే వెంటనే స్పందించి, అర్హులైన ఓటర్లకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి వంశీ గోకుల్ రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి, బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, శింగ నమల నియోజకవర్గ బీఎల్ఏల ఇన్చార్జ్ మంజునాథ్, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఓబిరెడ్డి, మండల కన్వీనర్లు ఖాదర్ వలి, ఎల్లారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, పరంధామ రెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, నాయకులు ఫణీంద్ర, నాగేశ్వర రావు, రామాంజనేయులు, ఆంజనేయులు, ప్రభుదాస్, శివశంకర్, వేదాంత మోహన్, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దగా పాలనకు రెండేళ్లు
అనంతపురం: చంద్రబాబు సారథ్యంలోని దగా పాలనకు రెండేళ్లు పూర్తయ్యాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ పాలన కంటే రెట్టింపు సంక్షేమం అందిస్తామని సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. బాబు పాలనపై ముద్రించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లను వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్రెడ్డితో కలిసి అనంత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘అనంత ’ మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, భూదందాలు, దౌర్జన్యాలు, అకృత్యాలే లక్ష్యంగా పాలన సాగుతోందని దుయ్యబట్టారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతపురం నగరంలో భూ కబ్జాలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తూ ప్రజల ఆస్తులను కాజేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్రెడ్డి మాట్లాడుతూ హామీల అమలును విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వ ‘వెన్నుపోటు పాలన’కు నిరసనగా జూన్ 4వ తేదీ నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, ఎస్ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బీసీ రమేష్ గౌడ్, గౌస్ బేగ్, మాజీ మేయర్ వసీం సలీం, సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, నాయకులు ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, పూజారి రాజశేఖర్ యాదవ్, వీర రామకృష్ణారెడ్డి, సాకే చంద్రశేఖర్, బోయ కృష్ణమూర్తి, చింతకుంట మధు, ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, ఎల్లుట్ల మారుతీనాయుడు, గువ్వల రాజేష్రెడ్డి, పెన్నోబులేసు, చామలూరు రాజగోపాల్, ఎగ్గుల శ్రీనివాసులు, ఫయాజ్, కోన రాజారెడ్డి, మల్లెమీద నరసింహులు, కాగజ్ఘర్ రిజ్వాన్, మొఘల్ సైఫుల్లా బేగ్, లింగాల రమేష్, కొండ్రెడ్డి ఓబిరెడ్డి, కొర్రపాడు హుస్సేన్పీరా, అనిల్కుమార్ గౌడ్, లక్ష్మన్న, దాదా ఖలందర్, ఆసిఫ్, కమల్ భూషణ్, జావెద్, మల్లెల వేణుగోపాల్, శేఖర్ బాబు, అనిల్కుమార్రెడ్డి, మాలపాటి శ్రీనివాసులు, వెన్నపూస రామచంద్రారెడ్డి, భాస్కర్రెడ్డి, రఫీ, హిదాయతుల్లా, రామకృష్ణ, బాల మారుతీ ప్రసాద్, శ్రీదేవి, కృష్ణవేణి, శివబాల, సాకే చంద్రలేఖ, జాహ్నవిరెడ్డి, భారతి, పార్వతి, దేవి, శోభారాణి, భానుమతి, సుహాసిని, హజరాంబీ, ఖమర్తాజ్, సుజాత, రాధ, కళావతి, పద్మ, వరలక్ష్మి, నాగమణి, లక్ష్మి, అంజలి, ఉష, పద్మావతి, దేవి, సుజాత, పాల్గొన్నారు. -
ఓటు హక్కు పరిరక్షణే ధ్యేయం
● బోగస్, తప్పుడు ఓట్లపై నిఘా పెట్టండి ● ఎస్ఐఆర్పై అప్రమత్తత అనివార్యం ● బీఎల్ఏలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత దిశానిర్దేశం అనంతపురం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్త వహించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ)కు, వైఎస్సార్సీపీ నేతలకు ‘ఎస్ఐఆర్’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అనంత వెంకటరామిరెడ్డి వారికి దిశానిర్ధేశం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు జరుగుతున్న కుట్రను తిప్పికొట్టాలన్నారు. అధికార పార్టీలు బోగస్, తప్పుడు ఓట్లను జాబితాలో ఎక్కించే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైన ఓటు హక్కు పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో దోహదపడే వివిధ రకాల దరఖాస్తులపై బీఎల్ఏలకు పూర్తి పట్టు ఉండాలని సూచించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్ల తొలగింపు వివాదాస్పదమైందన్నారు. అక్కడ అభ్యర్థులు గెలుపొందిన స్థానాలను పరిశీలిస్తే.. ఆయా నియోజకవర్గాల్లో తొలగించిన ఓట్ల కన్నా.. మెజార్టీ తక్కువ ఓట్లు రావడమే ఇందుకు కారణమన్నారు. అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకులు తిప్పేస్వామి మాట్లాడుతూ పార్టీ ఐడీ కార్డుల పరిశీలన ప్రక్రియ 100 శాతం పూర్తయిందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా వ్యవహరించాలని కోరారు. ఎస్ఐఆర్ కో ఆర్డినేటర్ గోపీనాథ్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐఆర్ కమిటీ సభ్యుడు వెన్నం శివారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు ఎద్దుల అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బీసీ రమేష్ గౌడ్, గోగుల రాధాకృష్ణ, మాజీ మేయర్ వసీం తదితరులు పాల్గొన్నారు. -
టెంకాయ చెట్టుపై పడిన పిడుగు
గుత్తి రూరల్: జక్కలచెరువు ఆర్ఎస్ గ్రామంలో టెంకాయ చెట్టుపై పిడుగుపడి మంటలు వ్యాపించాయి. మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన అంగడి రాజన్న ఇంటి ఆవరణలో ఉన్న టెంకాయ చెట్టుపై పెద్ద శబ్ధంతో పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో చెట్టుకింద ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగు శబ్దానికి సమీపంలోని నివాస గృహాలు కంపించాయి. భూకంపమేమోనని భావించి పలువురు బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకుని చెట్టుపై మంటలను ఆర్పివేశారు. ప్రయాణిస్తుండగా విడిపోయిన రైలు బోగీలు ● లోకోపైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం గుత్తి: గుత్తి రైల్వేస్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలు (06571) బోగీలు విడిపోయాయి. ప్లాట్ఫారం–1పై వెళుతున్న సమయంలో ఎస్–6, ఎస్–7 మధ్య జాయింట్ కప్లింగ్ ఊడిపోవడంతో బోగీలు వేరయ్యాయి. లోకో పైలట్ గమనించి వెంటనే రైలును నిలిపివేయడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే టెక్నీషియన్స్ ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. అనంతరం రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. బోగీలు విడిపోయిన కారణంగా రైలు గంట ఆలస్యంగా నడిచింది. -
పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం టౌన్: ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో 7.23ఎకరాలు, కళ్యాణదుర్గం నియోజకవర్గం తిమ్మసముద్రంంలో 13.40 ఎకరాలు, తాడిపత్రి నియోజకవర్గం ఊరుచింతలలో 10.86ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిలో దాదాపు 293 ప్లాట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు 75 శాతం మేర రాయితీలను అందించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ 96663 30666 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా శివప్రసాద్ అనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా జె. శివప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు పౌర గ్రంథాలయశాఖ డైరెక్టర్ అకేపాటి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. బెల్టుషాపుల నిర్వాహకులపై కేసులు బెళుగుప్ప: మండల పరిధిలోని శ్రీరంగాపురంలో బెల్టుషాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ పేర్కొన్నారు. శ్రీరంగాపురంలో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నాంటూ మహిళలు సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గ్రామానికి వెళ్లి బెల్టుషాపుల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఏఐ సాయంతో పిల్లల సంరక్షణఅనంతపురం సెంట్రల్: కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఆరేళ్లలోపు చిన్నారుల్లో శారీరక, మానసిక అభివృద్ది లోపాలను గుర్తించే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నట్లు మహిళా,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) శశికళ తెలిపారు. మంగళవారం నగరంలోని పాతూరులో కస్తూరిబాయి పాఠశాలలో సీడీపీఓలు, సూపర్వైజర్లు, మాస్టర్ ట్రైనర్స్, అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ నిర్వహించారు. ఆరేళ్లలోపు పిల్లల సమగ్రాభివృద్ధి, ఎదుగుదలను ట్రాక్ చేయడంపై అవగాహన కల్పించారు. పోషణ్ ట్రాకర్ సాయంతో ఏఐ ఆధారిత సిస్టం ద్వారా మరింత స్పష్టమైన స్క్రీనింగ్ చేయనున్నట్లు తెలిపారు. పిల్లల కదలికలు, ప్రవర్తన, ఆటల వీడియోలను ఏఐ విశ్లేషించి, వారి వయస్సుకు తగ్గట్టుగా ఎదుగుదల ఉందో లేదో ఏఐ చెబుతుందన్నారు. -
ఆలిండియా 62వ ర్యాంకుతో మెరిసిన సమిత్
అనంతపురం ఎడ్యుకేషన్: జేఈఈ అడ్వాన్స్డ్–2026 పరీక్షల్లో అనంతపురం నగరానికి చెందిన కోనంకి సమిత్ చౌదరి అదరగొట్టాడు. ఆలిండియా స్థాయిలో 62వ ర్యాంకుతో మెరిశాడు. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షలో సమిత్ చౌదరి సాధించిన విజయం జిల్లా ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. ప్రస్తుతం సమిత్ చౌదరి విజయవాడలోని శ్రీచైతన్య విద్యాసంస్థల గోసాల వేదవ్యాస్ భవన్లో ఇంటర్ చదివాడు. సమిత్ చౌదరి స్వగ్రామం శ్రీసత్యసాయి జిల్లా రామగిరి. తండ్రి కోనంకి అశోక్ కుమార్ గుడిబండ మండలం జంబులబండ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా, తల్లి అరుణాదేవి పెనుకొండ బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. తన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, కృషి, క్రమశిక్షణే కారణమని సమిత్ చౌదరి తెలిపాడు. -
●తాగునీటి కష్టాలు ఇంకెన్నాళ్లు?
రాయదుర్గంటౌన్: తాగునీటి కోసం రాయదుర్గం పట్టణ ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. పది రోజులకు ఒకసారి మాత్రమే అదీ అరకొరగా కొళాయిలకు నీరు వదులుతున్నారు. అవి ఎవ్వరికీ చాలకపోవడంతో కష్టాలు పెరిగిపోతున్నాయి. సోమవారం 19వ వార్డు అంబేడ్కర్ కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో బీటీపీ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ట్యాంకర్లు కూడా పంపకపోతే తాగునీటి అవసరాలు ఎలా తీరుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఏఈ నరసింహులు, సిబ్బంది అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ట్యాంకర్ పంపించి ఆందోళనను విరమింపజేశారు. -
రెవెన్యూలో వసూల్ రాజాలు
అనంతపురం అర్బన్: తహసీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ సిబ్బంది అవినీతి తారస్థాయికి చేరింది. రెవెన్యూ సేవలకు వెలకట్టి.. జేబులు నింపుకుంటున్నారు. కొందరైతే కాసుల కోసం జలగల్లా పీడిస్తారనే విమర్శలు ఉన్నాయి. డబ్బులు చేతిలో పడితేనే ఫైళ్లు కదులుతాయనే విమర్శలు ఉన్నాయి. అక్రమార్జనలో కొందరు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (ఎంఆర్ఐ), గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఓ) రూ.కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు ఉన్నాయి. వీరి అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వీరి అవినీతిపై 408 ఫిర్యాదులు అందాయి. ఇందులో 338 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్లు.. 70 పెండింగ్లో ఉన్నట్లు అధికారిక నివేదిక స్పష్టం చేస్తోంది. తహసీల్దారు కార్యాలయాల్లో ప్రతిపనికీ డబ్బులు వసూలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఇక్కడి కొందరు అవినీతి సిబ్బందికి పైసలిస్తేనే పనులు జరిగే పరిస్థితి నెలకొంది. కార్యాలయానికి వచ్చే ప్రజలు, రైతుల అవసరాన్ని బట్టి వసూలు మొత్తం పెరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అడంగల్, 1బి సవరణలు, పట్టాదారు పాసు పుస్తకం మంజూరు, మ్యుటేషన్, సర్వే నంబరు కరెక్షన్, సబ్ డివిజన్, ఇలా ప్రతి పనికీ డబ్బులు గుంజుతారనే ఆరోపణలు బహిరంగంగానే వినవస్తున్నాయి. తహసీల్దారు కార్యాలయాల్లోని కొందరు అవినీతి సిబ్బందికి 22ఎ (నిషేధిత భూములు), 08 (చుక్కల భుములు), మిగులు భూమి కరెక్షన్ ఫైళ్లు కల్పతరువుగా మారి కాసులు కురిపిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఫైలు సిద్ధం చేయడం ప్రారంభించడంతోనే డబ్బులు వసూలు ప్రక్రియ సమాంతరంగా మొదలవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి సిబ్బందిపై ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్, ఇతర అధికారులకు ప్రతి వారం ఒకటో రెండో ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. రెవెన్యూ సేవలను ఆదాయ వనరుగా మార్చుకున్న అక్రమార్కుల కదలికలపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) నిఘా ఉంచింది. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఏసీబీ ఉద్యోగి ఒకరు వచ్చి సాధారణ వ్యక్తిలా పరిసరాల్లో తిరుగుతుంటాడు. వివిధ సమస్యలపై వచ్చే ప్రజలతో, ముఖ్యంగా రైతులతో ఆ ఉద్యోగి మాట్లాడతాడు. ఏం పనిమీద వచ్చావు.. తహసీల్దారు కార్యాలయంలో పని ఎందుకు కాలేదు.. అక్కడ ఎవరైనా డబ్బులు ఇవ్వాలని అడిగారా.. ఎంత అడిగారు...? వంటి వివరాలను ఆ ఉద్యోగి సేకరిస్తాడు. ఇలా ఆదాయానికి మించిన ఆస్తులు, బినామీలకు సంబంధించి అవినీతి ఉద్యోగుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అడిగినంత డబ్బులిస్తేనే ఫైళ్లలో కదలిక కాసుల కోసం జలగల్లా పీడిస్తున్న వైనం ఆర్ఐలు, వీఆర్ఓలపై ఫిర్యాదుల వెల్లువ అక్రమార్కుల ఆర్థిక వ్యవహారాలపై ఏసీబీ నిఘా కల్పతరువుగా 22ఎ, 08 ఫైళ్లు.. ప్రతివారం ఏసీబీ నిఘా.. ప్రతి పనికీ పైసావసూల్.. -
జేఈఈ అడ్వాన్స్డ్లో ‘అనంత’ విద్యార్థుల ప్రతిభ
అనంతపురం ఎడ్యుకేషన్: దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2026 ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ఐఐటీల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు స్థానికంగానే చదువుకుని అఖిల భారత స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఓతూరి అబు సాజిద్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5,793వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 1287వ ర్యాంకు సాధించగా, డి.ఫయాజ్ అహ్మద్ ఓబీసీ కేటగిరీలో 1421వ ర్యాంకు సాధించారు. జి.సుహాస్ 1951, బి.ప్రషిత 2,810, పునీత్ చౌదరి 3,765, మాలపాటి కీర్తి 5,534, రాజ్ నిఖిలేష్ 9,093 అఖిల భారత ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరవుతుండగా, అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే భారతీయ సాంకేతిక విద్యా సంస్థలు (ఐఐటీలు)లో ప్రవేశ అవకాశాలు లభిస్తాయి. ఐఐటీల్లో సీట్లకు అర్హత సాధించిన పలువురు విద్యార్థులు -
చిత్రావతిలో ఇసుక రీచ్ వద్దు
● ఇన్చార్జ్ కలెక్టర్కు రైతుల వినతి అనంతపురం అర్బన్/యల్లనూరు: చిత్రావతి నదిలో ఇసుక రీచ్ను రద్దు చేయాలని యల్లనూరు రైతులు కోరారు. సోమవారం కలెక్టరేట్ వద్ద రైతులు బాలరంగయ్య, ఓబుళేసు, నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. కోడుమూర్తి గ్రామ పొలం సర్వే నంబరు 67–2ఏ, 68లో 3.90 ఎకరాలను గంపయ్యగారి పెద్ద నాగముని పేరున పట్టా భూమిగా చూపి ఇసుక రీచ్ మంజూరు చేశారన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది బంజరు భూమి అన్నారు. రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదికలతో ఇసుక రీచ్ మంజూరు చేయడం సరికాదన్నారు. ఆ సర్వే నంబర్లలోనే కాకుండా చిత్రావతిలో 20 అడుగుల లోతుకు తవ్వుతున్నారన్నారు. విషయాన్ని తహసీల్దారు దృష్టికి తీసుకెళితే తనకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారన్నారు. చిత్రావతి నది ఒడ్డున పండ్ల తోటలు, తాగునీటి బోర్లు ఉన్నాయని, ఇష్టారీతిన ఇసుక తవ్వకంతో భూగర్భ జలాలు అడుగంటి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇసుక రీచ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్కు రైతులు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతులు రమేస్, శివయ్య, వీరప్ప, పెద్ద రామాంజనేయులు, ఓబుళయ్య, తదితరులు పాల్గొన్నారు. ఆలయాల ఆదాయ పెంపే లక్ష్యంఉరవకొండ: దేవాలయాల స్థిరాస్తులపై ఆదాయం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. సోమవారం ఉరవకొండ గవిమఠంతోపాటు ప్రసిద్ధ పర్యాటక పుణ్యక్షేత్రం పెన్నహోబిలాన్ని కమిషనర్ పరిశీలించారు. గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జునప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు ఆయనను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ భక్తులకు సౌకర్యవంతమైన, సంతృప్తికర దర్శనం కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. గవిమఠం భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లోని భూములు, ఆస్తులు కాపాడతామన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఏసీ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. నేరేడు మొక్కల నరికివేత తాడిపత్రి రూరల్: ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఎంచుకున్న విష సంస్కృతి తాడిపత్రి ప్రాంతంలో మళ్లీ మొదలైంది. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన ఆలూరులో పోలీసు బందోబస్తు ఉన్నా చెట్ల నరికివేత చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. గ్రామంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు గోసు రామచంద్రారెడ్డి మూడు ఎకరాల విస్తీర్ణంలో 280 నేరేడు మొక్కలు పెంచుతున్నాడు. ఇందులో 200 మొక్కలు సోమవారం తెల్లవారుజామున నరికివేతకు గురయ్యాయి. బాధితుడు తోటను పరిశీలించిన అనంతరం ఇది రాజకీయ కక్షసాధింపులో భాగంగానే జరిగిందని నిర్ధారణకు వచ్చారు. టీడీపీకి చెందిన రవిచంద్రారెడ్డి, వరప్రసాద్రెడ్డి, బ్రహ్మయ్య, రమేష్, యోగీంద్రతోపాటు మరికొందరు కలిసి నేరేడు చెట్లను కొడవళ్లతో నరికివేశారని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అప్గ్రేడ్ స్టేషన్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపారు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫోన్ చేసి గోసు రామచంద్రారెడ్డితో మాట్లాడి సంఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. 40 సపోట చెట్ల నరికివేత: ఆలూరు గ్రామంలో రాజకీయాలకు దూరంగా, తటస్థంగా ఉంటున్న రైతు సుబ్బారెడ్డికి చెందిన 40 సపోట చెట్లను ఎవరో నరికివేశారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఈ పని ఎవరో చేశారో తెలియడం లేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
షేర్ మార్కెట్ లాభాల ఆశ చూపి కుచ్చుటోపీ
అనంతపురం సెంట్రల్: షేర్ మార్కెట్లో లాభాల ఆశ చూపి ప్రజలకు కరూ.25 కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టిన ఓ వ్యక్తి ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిండా మోసపోయిన బాధితులు సోమవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమ గోడు వెలిబుచ్చారు. బాధితుల కథనం మేరకు... బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేష్కుమార్రెడ్డి అనంతపురం నగరం సాయినగర్లో ఆరిజన్ సొల్యూషన్ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేశాడు. సదరు కంపెనీలో పెట్టుబడులు పెడితే షేర్ మార్కెట్, ఆన్లైన్ బిజినెస్ ద్వారా మంచి లాభాలు తీసుకొచ్చి మీ డబ్బును పదింతలు చేస్తానని నమ్మబలికాడు. ఇందుకు ఎక్కువ శాతం విద్యావంతులైన తన స్నేహితులను, కంపెనీలో పనికి కుదుర్చుకున్న సిబ్బందిని, బంధువులను వాడుకున్నాడు. తొలుత కొద్ది రోజుల పాటు పెట్టిన పెట్టుబడికి రూ.5, రూ.10లు చొప్పున వడ్డీ(లాభాల రూపంలో) చెల్లించాడు. డబ్బులు బాగా ఇస్తున్నాడు.. అందులోనూ తెలిసిన వ్యక్తేనన్న నమ్మకంతో బాధితులు వారికి తెలిసిన వాళ్లతో సైతం కంపెనీలో పెట్టుబడులు పెట్టించారు. ఇలా ఒక్కొక్కరు రూ.4 లక్షలు మొదలుకుని రూ.60 లక్షలు, రూ.90 లక్షలు.ఇలా పెట్టుబడులు పెట్టారు. అయితే కొన్ని నెలల నుంచి నరేష్ కుమార్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. బాధితుల వేదన వర్ణనాతీతం.. చాలామంది స్నేహితుల దగ్గర అప్పుగా, బ్యాంకు లోన్లు, బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని నరేష్కుమార్రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు తిరిగి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నారు. నగరంలోని బళ్లారి బైపాస్లో నివాసముంటున్న ప్రధానోపాధ్యాయుడు భాస్కర్బాబు కూడా బ్యాంకులు, లోన్ యాప్లలో డబ్బులు తీసుకొని దాదాపు రూ.60 లక్షలు పెట్టుబడి పెట్టాడు. నిండా మోసపోయిన ఇతను నెలనెలా ఈఎంఐలు చెల్లించలేక, ఒత్తిళ్లు తాళలేక కూడేరు మండలం కమ్మూరు సమీపంలోని ఓ వెంచర్లో సూసైడ్నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి బాధితులు వందల్లో ఉన్నారు. తమకు న్యాయం చేయాలని, నిందితుని నుంచి డబ్బులు వసూలు చేయాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. రూ.90 లక్షలు నష్టపోయాం ఆరిజన్ సొల్యూషన్ కంపెనీలో రూ.90 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాను. మా దగ్గర ఉన్న బంగారు మొత్తం తాకట్టు పెట్టాం. తెలిసిన వాళ్ల దగ్గర అప్పుగా తెచ్చి కూడా ఇచ్చాం. లాభాలు దండిగా వస్తాయని నరేష్కుమార్రెడ్డి ఆశ చూపాడు. తొలినాళ్లలో డబ్బులు సక్రమంగా ఇవ్వడంతో మరింత అప్పు చేసి ఇచ్చాం. మా లాంటి ఎంతోమంది బాధితులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులే న్యాయం చేయాలి. – నాగవేణి, ఆత్మకూరు మండలం నిండా ముంచిన ఆరిజన్ సొల్యూషన్ కంపెనీ రూ.25 కోట్లకు పైగా వసూలు బాఽధితుల్లో ఎక్కువ శాతం నిర్వాహకుడి స్నేహితులు, బంధువులే లబోదిబోమంటూ ఎస్పీ కార్యాలయానికి... -
‘మెగా’ కాదు... దగా డీఎస్సీ
అనంతపురం ఎడ్యుకేషన్: చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ–25 పేరుతో దగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగులను నిలువునా ముంచిందని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి యువకులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అర్హతలేని వారికి ఉద్యోగాల కేటాయింపు, పేపర్ లీకేజీ ఆరోపణలు, ఫేక్ సర్టిఫికెట్లతో ఎంపికలు జరిగినట్లు వచ్చిన అభియోగాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్కు వినతిపత్రం అందజేశారు. లోకేష్ను బర్తరఫ్ చేయాలి.. ఎన్నికల ముందు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి.. తీరా 16 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని, డీఎస్సీ నిర్వహణలోనూ అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించిందన్నారు. లక్షలాది రూపాయలకు పోస్టులు అమ్ముకున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ పరీక్షలు జరిగినా మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారని, కానీ ఏపీలో మాత్రం డీఎస్సీ పరీక్షలకు సంబంధించి మెరిట్ జాబితా ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. సీఎం చంద్రబాబుకు నిజాయితీ ఉంటే తక్షణం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను బర్తరఫ్ చేసి సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి చేతగాని దద్దమ్మ.. రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి చేతగాని దద్దమ్మ అని యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మండిపడ్డారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి యువత ఆశలపై నీళ్లు చల్లారన్నారు. ఎన్నికలకు ముందు ‘యువగళం’ కార్యక్రమంలో నారా లోకేష్ అనేక హామీలు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక యువతను అడుగడుగునా మోసం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి హోదాలో నారా లోకేష్ ఇద్దరూ డీఎస్సీపై తొలి సంతకం చేశారని, అయితే పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో మాజీ మేయర్ వసీం, వైఎస్సార్సీపీ నేతలు అనంత చంద్రారెడ్డి, కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, వీరాంజనేయులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్ బేగ్, యూత్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, రామాంజి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్లుట్ల మారుతీనాయుడు, గుంతకల్లు అధ్యక్షుడు అబ్దుల్ బషీద్, కళ్యాణదుర్గం అధ్యక్షుడు తలారి చరణ్, శింగనమల అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, ఉరవకొండ అధ్యక్షుడు బసవనగౌడ్, అనంతపురం అధ్యక్షుడు శ్రీనివాస్ గురుదత్త, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, నాయకులు ఓబిరెడ్డి, సైఫుల్లా బేగ్, మల్లెమీద నరసింహులు, రాజేష్రెడ్డి, దాదా ఖలందర్, లోకనాథ్రెడ్డి, సాకే చిరంజీవి, గుజ్జల శివయ్య, అమర్నాథ్రెడ్డి, కొండ్రెడ్డి ఓబిరెడ్డి, వెన్నం శివారెడ్డి, ఇసాక్, రమణారెడ్డి, సంపంగి రామాంజినేయులు, కై లాష్, అమ్మవారిపేట శ్రీకాంత్, సతీష్, శ్యాం పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై యువకులు, నిరుద్యోగుల మండిపాటు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన -
సేవలు తగ్గిపోయాయి
జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆర్బీకేల్లో ఇప్పుడు సేవలు తగ్గిపోయాయి. గతంలో విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు, రైతు భరోసా, పీఎం కిసాన్, పశువుల మందులు, ఈ–క్రాప్, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, పావలా వడ్డీ, సున్నా వడ్డీ... ఇలా రైతులకు సంబంధించి ఏది కావాలన్నా అక్కడికి వెళితే తెలిసేవి. గతంలో రైతులతో ఆర్బీకేలు కిటకిటలాడేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రైతులు పెద్దగా అటువైపు వెళ్లడం లేదు. రెండేళ్లుగా రైతులకు ఎలాంటి ప్రయోజనమూ లేకుండా పోయింది. – సత్యనారాయణరెడ్డి, రైతు, బోరంపల్లి, కళ్యాణదుర్గం మండలం -
రైతు భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు
రాయదుర్గంటౌన్: పట్టణ శివారు గౌడ లేఅవుట్ జగనన్న కాలనీ సమీపంలోని 169 సర్వే నంబర్లో ఓ రైతు భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి జేసీబీలు, టిప్పర్లతో రైల్వే పనుల కోసం పట్టణానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు దగ్గరుండి మట్టి తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న సదరు రైతు బంధువులతో పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ మట్టి తరలిస్తున్న వారిని అడ్డుకొని నిలదీశారు. దాదాపు 70 దాకా టిప్పర్ల మట్టిని తరలించి భూమిని గుంతలమయం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు టీడీపీ నాయకుల అండదండలు ఉన్నాయని, ఎవరూ ఏమీ చేయలేరని బెదిరిస్తున్నట్లు బంగి శివ తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. -
పెళ్లింట విషాదం
● బాలుడిని రక్షించే క్రమంలో యువతి మృతి ఉరవకొండ: పెళ్లింట విషాదం నెలకొంది. కళ్ల ముందే నీటిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడేందుకు యత్నించిన యువతి మృతితో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాలు.. ఉరవకొండ పట్టణంలోని పార్కు ఆంజినేయస్వామి ఆలయం వద్ద నివాసముంటున్న రత్నమాచారి, కళావతి దంపతులకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఈనెల 7న పెద్ద కుమార్తె నీరజకు మంత్రాలయంకు చెందిన కాళప్ప ఆచారి కుమారుడితో వివాహం జరిగింది. ఇరువురు కుటుంబ సభ్యులు ఈనెల 30న మంత్రాలయంలోని వరుడి ఇంట్లో సత్యనారాయణ పూజ ఏర్పాటు చేశారు. పూజ కోసం వెళ్లిన బంధువులు స్నానం కోసం తుంగభద్ర నదికి వెళ్లారు. పుష్కర ఘాట్ సమీపంలో స్నానాలకు దిగారు. ఇందులో హైదరాబాద్కు చెందిన సతీష్చంద్రతో పాటు అతని ఐదేళ్ల కుమారుడు యువన్ ఉన్నారు. యువన్ నీటిలో మెల్లగా కొట్టుకుపోవడం గమనించిన రత్నమాచారి, కళావతి దంపతుల మూడో కుమార్తె సంధ్య నదిలో దిగి చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసింది. అయితే నీటి ప్రవాహం ఎక్కవగా ఉండటంతో సంధ్య కూడా నీటిలో కొట్టుకుపోయింది. సంధ్య బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ అమ్మాయి చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు వెళ్లి మృత్యువాత పడటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి కళ్యాణదుర్గం రూరల్ (కంబదూరు): వ్యవసాయతోటకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ను తాకి గొర్రెల కాపారి మురళి (42) మృతి చెందిన సంఘన కంబదూరు మండల పరిధిలోని రాళ్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు.. కంబదూరు మండలం రాళ్లపల్లి గ్రామానికి చెందిన మురళి గొర్రెలు మెపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం కూడా గొర్రెలను మోపుకుంటూ వెళ్లాడు. వ్యవసాయ తోట రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ వైరును ప్రమాదశాత్తూ తాకడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య అక్కమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బస్సు ఢీకొని ఒకరి మృతి కనగానపల్లి: మండల పరిధిలోని పర్వతదేవపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాలమేరకు.. పర్వతదేవరపల్లికి చెందిన బాబాసాహెబ్ (65) ఆదివారం రాత్రి 7.30 సమయంలో నడుచుకొంటూ జాతీయ రహదారి దాటుతున్నాడు. ఆ సమయంలో బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మాదిగలు అన్ని రంగాల్లో రాణించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: మాదిగ విద్యార్థులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాల్లో 500కు పైగా మార్కులు సాధించిన మాదిగ విద్యార్థులకు మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం ‘పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రతిభా పురస్కారాలు’ పంపిణీ చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు మన్నెపాకుల రమేష్ అధ్యక్షతన వహించారు. ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, బండారు శ్రావణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు, బండారు శ్రావణి మాట్లాడుతూ పేద విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలు ఎన్టీ రామాంజినమ్మ, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షులు సురేష్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్, మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వై.కే. విశ్వనాథ్, మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి బిక్షాలు తదితరులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజాసమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో అందజేయాలని సూచించారు. అర్జీ వెంట ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. కొనసాగుతున్న గాలివాన అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో గాలివాన కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 21 మండలాల పరిధిలో 15.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. గుత్తిలో 55.8, రాప్తాడు 41, యాడికి 40, తాడిపత్రి 40.2, అనంతపురం రూరల్ 39.4, అనంతపురం అర్బన్ 37, పుట్లూరు 36.6, బుక్కరాయసముద్రం 34, యల్లనూరు 31.4, నార్పల 28.4, గార్లదిన్నె 23.6, బెళుగుప్ప 18.2, కళ్యాణదుర్గం 13.2 మి.మీతో పాటు పామిడి, పెద్దపప్పూరు, శింగనమల, కంబదూరు, ఆత్మకూరు, కూడేరు, కణేకల్లు, పెద్దవడుగూరు తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయడంతో అక్కడక్కడ అరటి పంట దెబ్బతినగా... నగరంలో పెద్ద పెద్ద చెట్లు సైతం పడిపోయాయి. పెద్ద చెట్లతో పాటు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఆదివారం సాయంత్రం విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. నైరుతి రాకమునుపే తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. ఎల్–నినో అంటూ భయపెడుతున్నా ముందస్తు వర్షాలతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. రాగల రెండు రోజులు కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రైవేట్ కళాశాలల్లో బోగస్ హాజరుకు చెక్ ● ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి ● 75 శాతం అటెండెన్స్ లేకపోతే ఫీజురీయింబర్స్మెంట్ కట్ ● అక్రమార్జనకు కోతతాడిపత్రి రూరల్: ప్రైవేట్ కళాశాలల్లో ముఖ ఆధారిత హాజరు (ఫేషియల్ అటెండెన్స్) విధానం తప్పనిసరి చేస్తూ ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ బోగస్ హాజరు నమోదు చేసి.. విద్యార్థులకు మంజూరయ్యే ఫీజు రీయింబర్స్మెంట్ను సొమ్ము చేసుకుంటున్న పలు కళాశాలలకు ఈ నిర్ణయం శరాఘాతంగా మారింది. జిల్లాలో 57 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, 14 ఇంజినీరింగ్ కళాశాలలు, 14 బీఈడీ కాలేజీలు, 35 ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎం.కామ్ కోర్సులు అందించే కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలన్నింటిలోనూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఫేషియల్ అటెండెన్స్ అమలు చేయనున్నారు. ఎవరికి ఇబ్బంది అంటే... ప్రైవేట్ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకున్న వారిలో కొందరు నేరుగా తరగతులకు హాజరవుతున్నారు. మరికొందరు గైర్హాజరవుతూ యాజమాన్యంతో ‘మేనేజ్’ చేయించుకుంటున్నారు. ఇంకొందరు ఉద్యోగాలు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో తరగతులకు హాజరయ్యేవారూ ఉన్నారు. ఇక డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్, ఏంసీఏ, ఏంబీఏ తదితర కోర్సులు చదువుతున్న వారిలో అర్హులైన వారికి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పొందాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి. ఇలా తరగతులకు హాజరుకాని వారితో కళాశాల యాజమాన్యాలు లోపాయికారి ఒప్పందం చేసుకుని తగినంత ‘హాజరు’ వేస్తూ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటూ వస్తున్నాయి. ఇకమీదట 75 శాతం హాజరు లేకపోతే ఫీజురీయింబర్స్మెంట్ వర్తించదు. దీంతో ఆయా కళాశాలలు అక్రమార్జనను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
తనయుడి మరణంతో ‘తల్లి’డిల్లి..
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు అర్ధంతరంగా తనువు చాలించడం ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ కనిపించే తనయుడు విగతజీవిగా పడి ఉండటాన్ని ఆ హృదయం తట్టుకోలేకపోయింది. నువ్వులేని లోకంలో నేనుండలేనంటూ ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది. తల్లీకుమారుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కళ్యాణదుర్గం రూరల్ (కంబదూరు): ఈతకెళ్లి యువకుడి మృతి చెందగా.. కుమారుడి మరణవార్త విని తట్టుకోలేక తల్లి ఉరివేసుకున్న సంఘటన కంబదూరులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కంబదూరు మండల కేంద్రలో నివాసం ఉండే అనిత, హనుమంతు దంపతులు. వీరు వడ్డే పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అజయ్ (16) కుమారుడు, కుమార్తె అశ్విని ఉన్నారు. పదో తరగతి పూర్తి చేసిన అజయ్ ఆదివారం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో తోటలో ఏర్పాటు చేసిన నీటి ట్యాంక్లో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. వెంటనే స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుమారుడి మరణవార్తతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి అనిత (37)ను కుటుంబ సభ్యులు, బంధువులు ఓదార్చేందుకు ప్రయత్నించారు. కుమారుడి మరణం తట్టుకోలేక గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒకేసారి ఇద్దరి మరణంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ఈతకెళ్లి బాలుడి మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య -
ముగిసిన గృహగణన
● 1,369 గృహాలకు తాళం, 84,301 గృహాలు ఖాళీ ● గణన మరోవారం పెంచే అవకాశం అనంతపురం అర్బన్: జనగణన–2027లో భాగంగా చేపట్టిన తొలిదశ గృహగణన కార్యక్రమం జిల్లావ్యాప్తంగా మే 30తో ముగిసింది. 32 మండలాలు, నగరపాలక సంస్థ, ఐదు పురపాలక సంఘాల పరిధిలో 7,41,014 గృహాలు ఉన్నాయి. వీటిలో 5,47,438 గృహాల్లో నివాసముంటున్నారు. వీటిలో గడువు ముగిసే నాటికి 5,02,493 గృహాల గణన (91.789 శాతం) పూర్తి చేశారు. 44,945 గృహాలు సర్వే చేయాల్సి ఉంది. అయితే గృహగణన వందశాతం పూర్తికానందున కార్యక్రమాన్ని సెన్సస్ శాఖ మరో వారం రోజులు పెంచే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు రావచ్చని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. 84 వేల ఇళ్లు ఖాళీ.. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఉన్న 7,41,014 గృహాలలో 84,301 గృహాలు ఖాళీగా ఉన్నాయి. 1,369 గృహాలు తాళం వేసి ఉన్నాయి. ఇక 1,07,906 గృహాలను ఇతర పనులకు వినియోగిస్తున్నారు. 5,47,438 నివాస గృహాల్లో 5,02,493 గృహాలను లెక్కించారు. ఇకజిల్లాలో మొత్తం జనాభా 22,11,143 మంది ఉన్నారు. -
విద్యతోనే సమాజంలో సముచిత స్థానం
వైన్ షాపులో చోరీ యాడికి: మండల పరిధిలోని రాయలచెరువులో అయ్యప్పస్వామి దేవాలయం వెనుక భాగాన ఉన్న బ్రాందీ షాపులో శనివారం రాత్రి చోరీ జరిగింది. శనివారం రాత్రి దుండగులు వైన్ షాపు వెనుక భాగంలో గోడ పైన కన్నం వేసి షాపు లోపలికి చొరబడి రూ.2 లక్షల మద్యం బాటిళ్లు, రూ.23 వేల నగదును ఎత్తుకెళ్లారు. సీఐ శ్రీనివాసులు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ సభ్యులు చోరీ జరిగిన చోట వేలి ముద్రలు సేకరించారు. అనంతపురం ఎడ్యుకేషన్: విద్యతోనే సమాజంలో సముచిత స్థానం లభిస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక గుత్తి రోడ్డులోని కనకదాస కల్యాణ మండపంలో నిర్వహించిన కనకదాస ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు, సమాజానికి, కురుబ కులానికి ఉపయోగపడాలన్నారు. సివిల్స్ చదవాలనుకునే విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి మాట్లాడుతూ సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లే విద్యార్థులకు ఉచిత వసతి సదుపాయం కల్పిస్తామని తెలిపారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ విద్యా పరంగా అభివృద్ధి చెందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్యార్థులు అహర్నిశలు శ్రమించాలని సూచించారు. కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే మల్లికార్జున మాట్లాడుతూ మారుమూల గ్రామాల విద్యార్థులు కూడా విద్యలో రాణిస్తుండటం హర్షణీయమన్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీ వెంకటరాముడు మాట్లాడుతూ విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ చాటిన కురబ విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో కురుబ సంఘం జిల్లా అధ్యక్షులు తుప్పటి ఈశ్వరయ్య, డాక్టర్ కేసీ మహేష్, మాస్టర్ మైండ్స్ బసవయ్య, డెప్యూటీ డీఈఓ లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే దగ్గుపాటితో వేగలేం!
అనంతపురం టౌన్: తెలుగుదేశం పార్టీలో ముస్లిం మైనార్టీ నాయకుల మనుగడ కష్టతరంగా మారింది. పార్టీకోసం కష్టపడి పనిచేస్తున్న తమను రాజకీయంగా ఎదగకుండా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ ముస్లిం మైనార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో వివక్ష, దాడులకు గురయ్యామని అంటున్నారు. ఆయన ఆగడాలను తెలుపుతూ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలు వైరల్గా మారాయి. ● నగరంలోని సాయినగర్లో అస్రా కంటి ఆస్పత్రి భవనాన్ని ఎమ్మెల్యే అనుచరులే డబుల్ రిజిస్ట్రేషన్ చేయించి.. ఆపైన నిర్వాహకులైన ముస్లిం మైనార్టీ కుటుంబంపై దాడులకు సైతం తెగబడ్డారు. రూ.కోట్లు విలువ చేసే స్థలాన్ని, భవనాన్ని కాజేయాలనే కుట్రలు చేశారు. ఒక దశలో ఎమ్మెల్యే నేరుగా మహిళా డాక్టర్ భర్త షరీఫ్కు ఫోన్ చేసి ‘చెప్పుతో కొడతా ల.. కొడకా. ఎమ్మెల్యే గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే బావమరిది గురించి మాట్లాడతావా? నీ కథ చూస్తా’నంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ● నగరంలోని ఆజాద్నగర్కు చెందిన టీడీపీ నాయకుడు నూర్మహమ్మద్ రంజాన్ మాసం పురస్కరించుకొని ఇఫ్తారు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక నాయకుని ఫొటో ఫ్లెక్సీలో లేదని స్థానిక నేతలు ఎమ్మెల్యేను విందుకు రాకుండా అడ్డుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని మైనార్టీ నాయకుడు నూర్ మహమ్మద్ ఆత్మహత్యాయత్నం చేశాడు. నాకేమైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణం.. టీడీపీ కోసం కష్టపడి పని చేసినా గుర్తింపు లేదంటూ ముస్లిం మైనార్టీ నాయకుడు సైఫుద్దీన్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపాడు. ‘నాకు జరిగిన అన్యాయం గురించి బహిరంగంగా మాట్లాడితే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు జీర్ణించుకోలేక దాడులకు తెగబడుతున్నారు. నాకు గానీ, నా కుటుంబ సభ్యులకు గానీ ఏమైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణ’మంటూ ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మమ్మల్ని మీరే కాపాడండి.. ‘అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలోని రాజీవ్ కాలనీ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో రూ.లక్షల్లో ఖర్చు పెట్టి పోటీ చేశాను. సార్వత్రిక ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్ గెలుపు కోసం అహర్నిశలూ శ్రమించాను. కానీ నేనేమీ పని చేయలేదంటూ ఎమ్మెల్యే దూషణలకు దిగుతున్నారు. మీరే మమ్మల్ని కాపాడండి’ అంటూ సర్పంచ్ అభ్యర్థి నబిరసూల్ చంద్రబాబు, లోకేష్లను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇవే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ నాయకులపై ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో ముస్లింల మనుగడ కష్టమే తమకేమైనా జరిగితే ఆయనే కారణం వైరల్ అవుతున్న ముస్లిం మైనార్టీ నాయకుల వీడియోలు -
రైతు సేవలకు కత్తెర
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు ఇతోధికంగా సేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్బీకే/ఆర్ఎస్కేలను చంద్రబాబు ప్రభుత్వం కుదించింది. 25 శాతం కేంద్రాలను మూసేయడంతో రైతులు వ్యవసాయ సేవలు పొందడానికి ఇబ్బందులు తప్పేలా లేవు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి దేశంలోనే లేనివిధంగా రైతు బాగోగులే లక్ష్యంగా 2020లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేశారు. వ్యవసాయం, పట్టు, పాడి, పశుపోషణ, మత్స్య, ఉద్యాన, మార్కెటింగ్, ఏపీఎంఐపీ తదితర వ్యవసాయ అనుబంధ రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి రైతులు ఊరు దాటకుండా అన్ని రకాల సేవలూ ముంగిటకే అందించారు. వన్స్టాప్ హెల్ప్ సెంటర్లుగా విత్తు నుంచి విపత్తు వరకు, పంట సాగు నుంచి విఫణిలో పంట అమ్ముకునే దాకా రైతులకు విశేష సేవలు అందిస్తూ వచ్చాయి. ఆర్బీకే వేదికగా గ్రామస్థాయి పంట ప్రణాళిక అమలు చేస్తూ అడుగడుగునా రైతులకు అండగా ఉండేలా తీర్చిదిద్దారు. వాటిని ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా సొంత భవనాలు నిర్మించారు. పల్లెసీమల్లో ఆర్బీకేలు రైతులకు ఆలయాలుగా మారిపోయాయి. అలా ఒకే విడతగా అనంతపురం జిల్లాలో ఏకంగా 451 ఆర్బీకేలు ఏర్పాటు చేసి.. అక్కడ వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఏలను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా రైతులకు అందుతున్న సేవల గురించి దేశంలో ఉన్న పలు రాష్ట్రాలు, అలాగే విదేశీ బృందాలు సందర్శించి ప్రశంసలు గుప్పించాయి. అయితే చంద్రబాబు నేతృత్వంలో కొలువుదీరిన ప్రభుత్వం ఆర్బీకేలను ఆర్ఎస్కేలు పేరు మార్చేసింది. జగన్కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో ఆర్ఎస్కేల నిర్వీర్యం చేస్తూ వచ్చింది. ఏడాది కిందట హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) అంటూ కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. ఆర్ఎస్కేల సంఖ్యను పెంచాల్సింది పోయి తగ్గించడం గమనార్హం. హేతుబద్ధీకరణ ఏ ప్రాతిపదికన చేశారో కూడా తెలియని విధంగా మొదట 15 ఆర్ఎస్కేలను తొలగించారు. తర్వాత వాటి సంఖ్య 125కి చేరింది. గతంలో జిల్లా వ్యాప్తంగా 451 ఆర్బీకేలు ఉండగా.. అందులో 125 మూతపడటంతో వాటి సంఖ్య 326కు పడిపోయింది. అందులో 126 ఆర్ఎస్కేల్లో వీఏఏలు, 180 ఆర్ఎస్కేలో వీహెచ్ఏలు, 12 ఆర్ఎస్కేల్లో వీఎస్ఏలు అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఉన్న 8 ఆర్ఎస్కేల్లో ఎంపీఈఓలను నియమించారు. రెండేళ్లు తిరగకుండానే ఏకంగా 125 ఆర్ఎస్కేలను మూసివేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాయితీ విత్తన వేరుశనగ, యూరియా, డీఏపీ లాంటి ఎరువులు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాల కోసం గ్రామం వదలి వేరే గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. విత్తు, విపత్తు సమయాల్లో సకాలంలో సేవలు అందే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకునే పరిస్థితి లేదు. మూతవేసిన ఆర్ఎస్కే గ్రామాల్లో ఇప్పుడు విత్తన వేరుశనగ సరఫరా చేస్తారా లేదా వేరే గ్రామాలకు అటాచ్ చేస్తారా అనేది కూడా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. హేతుబద్ధీకరణ పేరుతో ఆర్ఎస్కేల కుదింపు 451 నుంచి 326కు తగ్గిన ఆర్ఎస్కేల సంఖ్య వన్స్టాప్ హెల్ప్ సెంటర్లుగా జగన్ హయాంలో రైతులకు విశిష్ట సేవలు 125 ఆర్బీకేలు మూత.. -
ఆర్బీకేలు పునఃప్రారంభించాలి
రేషనలైజేషన్ పేరుతో మూతబడిన 125 ఆర్ఎస్కేలు తెరిచి గతంలో మాదిరిగా అన్ని రకాల సేవలూ అందించాలి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి పథకాల ఫలాలు, ఇతరత్రా కార్యక్రమాలు రైతు ముంగిటకే చేరాలనే ఆలోచనతో ఏర్పాటు చేసిన వాటిని కుదించే ప్రయత్నాలు చేయడం మంచిదికాదు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నవాటిని మూసివేసి రైతులకు సేవలు దూరం చేయడం దారుణం. గతంలో మాదిరిగానే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతరత్రా ఇన్పుట్స్ వంటివి మూసివేసిన ఆర్ఎస్కేల్లో కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి. – ఆర్.చంద్రశేఖర్రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి, ఏపీ రైతు సంఘం -
‘ముంగారు’కు వేళాయె
అనంతపురం అగ్రికల్చర్: కీలక ఖరీఫ్ (ముంగారు) సీజన్ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ఎల్–నినో కారణంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ ప్రభుత్వం, వ్యవసాయశాఖ మూడు నెలలుగా విస్తృత ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలు (సౌత్వెస్ట్ మాన్సూన్స్) కూడా ఇంకా పలకరించలేదు. ఈ వారాంతంలోపు ‘నైరుతి’ ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘నైరుతి’ ప్రభావంతో కురిసే వర్షాలపై ఖరీఫ్ ఆధారపడింది. ఈ ఖరీఫ్లో అన్ని రకాల పంటలు 3.43 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. అందులో ప్రధానపంట వేరుశనగ 1,47,382 హెక్టార్లు ఉండగా, ఆ తర్వాత కంది 78,274 హెక్టార్లు, పత్తి 42,119 హెక్టార్లు, మొక్కజొన్న 21,659 హెక్టార్లు, ఆముదం 17,490 హెక్టార్లుగా ఉంది. నీటి వసతి కింద 22,868 హెక్టార్లలో వరి నాట్లు వేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇలా ఐదు ప్రధాన పంటలతో పాటు జొన్న, సజ్జ, రాగి, కొర్ర, పెసర, ఉలవ, అలసంద, మినుము, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి 20 నుంచి 22 రకాల పంటలు సాగులోకి రావచ్చని అంచనాలు తయారు చేశారు.పంటలు సకాలంలో సాగులోకి రావాలంటే రుతపవనాలు ప్రభావం చూపి జూన్ 15 నుంచి జూలైలో మంచి వర్షాలు పడాలి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల కాలాన్ని ఖరీఫ్గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో 321.5 మి.మీ సాధారణ వర్షం నమోదు కావాలి. మొత్తం ఏడాది పొడవునా 512.5 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు. జిల్లాలో 4,03,454 మంది రైతులు ఉన్నారు. అందులో ఒక హెక్టారులోపున్న చిన్నకారు రైతులు 1,27,584 మంది ఉండగా, ఒకటి నుంచి 2 హెక్టార్ల లోపున్న సన్నకారు రైతులు 1,47,044 మంది ఉన్నారు. ఇక రెండు నుంచి నాలుగు హెక్టార్ల లోపున్న మధ్యస్థ రైతులు 1,03,793 మంది ఉండగా, 4 నుంచి 10 హెక్టార్ల వరకు ఉన్న ఓ మాదిరి రైతులు 22,952 మంది, 10 హెక్టార్లు, అంతకన్నా ఎక్కువ కలిగిన పెద్ద రైతులు 2,081 మంది ఉన్నట్లు గణాంకాలు వెల్లడిన్నాయి. ఖరీఫ్ మొదలైనా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. సకాలంలో విత్తనం, ఎరువులు, అన్నదాత సుఖీభవ, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, పావలావడ్డీ, యంత్రపరికరాలు లాంటి వాటి రూపంలో సాయం చేయడానికి మనసు రావడం లేదు. పంట పెట్టుబడులకు అవసరమైన డబ్బు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు 56 వేల క్వింటాళ్ల రాయితీ విత్తనం కేటాయించి, విత్తన వేరుశనగకు 40 శాతం సబ్సిడీ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు విత్తన పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు. పాత బకాయిలు రూ.90 కోట్లు ఇస్తే కానీ తాము ఖరీఫ్కు విత్తనం సరఫరా చేయలేమని ప్రాసెసింగ్ప్లాంట్ల నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. గతేడాది మాదిరిగా ఈసారి కూడా కంది, మొక్కజొన్న, ఆముదం విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నా రైతులకు మేలైన విత్తనం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఇక వేరుశనగతో పాటు ప్రధాన పంటలు విత్తుకునేందుకు జూన్ 15 నుంచి జూలై ఆఖరు వరకు సరైన సమయమని ఏఆర్ఎస్, కేవీకే ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.విజయశంకరబాబు, డాక్టర్ సాధినేని మల్లీశ్వరి, జేడీఏ ఎన్.సాలురెడ్డి తెలిపారు. నేటి నుంచి ఖరీఫ్–2026 3.43 లక్షల హెక్టార్లలో పంటల సాగు అంచనా ఎల్–నినో, ప్రతికూల పరిస్థితుల్లో ఆలస్యంగా ‘నైరుతి’ ఇంకా మొదలు కాని రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ విత్తన పంపిణీ ఎప్పుడో..? 3.43 లక్షల హెక్టార్లు అంచనా.. 4.03 లక్షల మంది రైతులు.. పెట్టుబడులకు తప్పని ఇబ్బందులు.. -
జల్లిపల్లి మారెమ్మ ఆలయంలో చోరీ
కూడేరు: మండల పరిధిలోని జల్లిపల్లిలో బస్టాండ్లో అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న మారెమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఆలయం ముందు రోజూలాగానే శుభ్రం చేస్తున్న వ్యక్తికి ఆలయం గేటు లోపలికి తోసి ఉండడం కనిపించింది. వెంటనే పూజారికి సమాచారం ఇవ్వడంతో ఆయనతో పాటు గ్రామస్తులు వచ్చి పరిశీలించారు. వెండి నాగపడగ, గొడుగులు, ఇతర ఆభరణాలు, బంగారు తాళిబొట్లు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో ఏఎస్ఐ సంజీవులు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు 3 కేజీల వరకు వెండి ఆభరణాలు, 3 తులాల బంగారు ఆభరణాలు పోయి ఉండవచ్చని గ్రామస్తులు, ఆలయ పూజారి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 3 కేజీల వెండి, 3 తులాల బంగారం అపహరణ -
గాలివానకు విరిగిన విద్యుత్ స్తంభాలు
అనంతపురం టౌన్: గాలివాన బీభత్సం సృష్టించడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలతో పాటు ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయి. దీంతో విద్యుత్శాఖకు దాదాపు రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు విద్యుత్శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. గుత్తి, గుంతకల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున 11కేవీతో పాటు ఎల్టీ విద్యుత్ స్తంభాలు కూలిపోయినట్లు పేర్కొన్నారు. అలాగే అనంతపురం నగరంతో పాటు రూరల్ ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తున విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగిపోయాయి. దాదాపు 220కి పైగా స్తంభాలు కూలిపోయినట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం కురిసిన గాలి వానకు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు తీగలు తెగిపోయాయి. విద్యుత్శాఖకు రూ.12 లక్షల నష్టం -
దుర్గంలో దాహం కేకలు
రాయదుర్గంటౌన్: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గంలో తాగునీటి ఎద్దడి తారస్థాయికి చేరింది. నెలకు మూడు సార్లు కూడా కుళాయిలకు నీరు వదలడం లేదు. రెండు నెలలుగా పరిస్థితి అధ్వానంగా మారింది. విసుగుచెందిన బీటీపీ రోడ్డు, మొలకాల్మూరు రోడ్డు, లక్ష్మీబజార్, మధుటాకీస్ ఏరియా తదితర ప్రాంతాల మహిళలు ఆందోళనబాట పట్టారు. గత శుక్రవారం ఓబుళాచారి రోడ్డు, నేతాజీరోడ్డు, గోసాబావి వీధికి చెందిన మహిళలు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తాజాగా శనివారం ఐదో వార్డు మహిళలు సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. ఆందోళన చేసిన ఏరియాలకు మాత్రం వెంటనే ట్యాంకర్లు పంపుతున్నారని, మరి తమ పరిస్థితి ఏమిటని మిగతా ప్రాంతవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చెబుతున్న కారణాలివే.. కణేకల్లులోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి రాయదుర్గానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హెచ్చెల్సీ శాశ్వత మంచినీటి పథకం ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. తరచూ కరెంటు సరఫరాలో అంతరాయం, ఎస్ఎస్ ట్యాంకు నుంచి వీరాపురం వద్ద గల పంప్ హౌస్ వరకు విద్యుత్ లైన్ లోపంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. సమీక్షలతోనే సరి.. పరిష్కారమేదీ? డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మంచినీటి పథకం కింద మరో మూడు నెలలకు సరిపడ నీరు అందుబాటులో ఉన్నా రాయదుర్గం పట్టణవాసులకు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సమీక్షలతోనే అధికారులు, పాలకులు సరిపెడుతున్నారు గానీ క్షేత్రస్థాయిలో తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వేసవి ప్రారంభం నుంచే సరైన ప్రణాళిక లేకపోవడమే తాగునీటి సమస్యకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అవసరమైన చోట్ల బోర్లు వేసి కనీసం అవసరాలకు వినియోగించే నీటిని డిస్ట్రిబ్యూషన్ లైన్లకు లింక్ ఇస్తే సమస్య కాస్త అదుపులోకి వచ్చేది. దీంతోపాటు పట్టణంలో విరివిగా బోర్లు ఏర్పాటు చేసి సిస్టన్ ట్యాంకులు ఏర్పాటు చేసినా ఉపశమనం లభించేది. గతంలో నీటిని అందించిన పాత బోర్లు నేటికీ నిరుపయోగంగా ఉన్నాయి. వీటిపై దృష్టి సారించకపోవడం కూడా నిర్లక్ష్యంగా ప్రజలు పేర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా లోపాలు అధిగమించే దిశగా చర్యలు తీసుకోకపోవడంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాయదుర్గం పురపాలక సంఘంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. పది రోజులకోసారి కూడా కుళాయిలకు తాగునీరు రావడం లేదు. సమస్యను అధిగమించడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు. మహిళలు ఎక్కడికక్కడ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పది రోజులకోసారి కూడా నీరు రాని దుస్థితి రెండు నెలలుగా మహిళల ఆందోళనబాట సమస్య పరిష్కారంలో ప్రభుత్వం విఫలం నీరు సక్రమంగా వదలాలి కాలనీలకు రెండు నెలలుగా తాగునీరు సకమ్రంగా రావడం లేదు. తాగునీటి విడుదల ఆలస్యమైన రోజుల్లో కనీసం ట్యాంకర్ నీరు కూడా పంపడం లేదు. అధికారులు స్పందించి నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలి. – నాయకుల సుధ, గాంధీనగర్ కాలనీ, రాయదుర్గం తాగునీటి సరఫరా మెరుగుకు చర్యలు విద్యుత్ అంతరాయం, పైప్లైన్ లీకేజీలతో నీటి సరఫరాలో జాప్యం జరుగుతోంది. విద్యుత్ సరఫరా లోపాన్ని నివారించేందుకు అధికారులతో సమీక్షించాం. ఒకే ఫీడర్తో విద్యుత్ సరఫరా చేసేలా కృషి చేస్తాం. ప్రస్తుతం ఉన్న ట్యాంకర్ల సంఖ్య పెంచుతాం. – దివాకర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, రాయదుర్గం -
అనంతలో భారీ వర్షం
వలస కూలీల వాహనం బోల్తా ● బాలుడితో సహా డ్రైవర్ దుర్మరణం రాప్తాడు రూరల్: వలస కూలీలతో బయల్దేరిన వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బాలుడితో సహా డ్రైవర్ దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్కు చెందిన 23 మంది కూలీలు కేరళలో ఉపాధి కోసం శుక్రవారం రాత్రి క్రూషర్ వాహనంలో బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున రాప్తాడు మండల పరిధిలోని కార్బన్ సిటీ వద్ద 44వ జాతీయ రహదారికి రాగానే అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. భారీ రాళ్ల మధ్య పల్టీలు కొట్టడంతో కూలీలందరూ చెల్లాచెదురుగా పడిపోయారు. ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏమి జరిగిందో అర్థం కాని పరిస్థితి. చీకటిలో సహాయం కోసం పలువురు ఆర్తనాదాలు చేశారు. ఈ ప్రమాదంలో కూలి పనుల కోసం వెళ్తున్న మహిపాల్ (16) అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రంజిత్ యాదవ్ (21)ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరి కలలు, ఆశలు, కుటుంబాల భవిష్యత్తు ఒక్క క్షణంలో రోడ్డుపైనే చిధ్రమయ్యాయి. ఇంటి వద్ద వారి కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఈ వార్త గుండెల్ని పిండేసే విషాదంగా మారింది. ప్రమాదంలో గాయపడిన పలువురు కూలీలను స్థానికులు, పోలీసులు, 108 సిబ్బంది సకాలంలో స్పందించి అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పలు మండలాల్లో మోస్తరుగా వర్షపాతం నమోదు లోతట్టు ప్రాంతాలు జలమయం అనంతపురం అగ్రికల్చర్: వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించిన తరుణంలో అనంతపురం నగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పగలంతా ఉక్కపోతతో సూరీడు సెగలు పుట్టించినా.. సాయంత్రానికి వరుణుడు చల్లబరిచాడు. ఒక్కసారిగా భారీ ఉరుములు, మెరుపులకు తోడు 20 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. దాదాపు గంటకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది. జనజీవనం స్తంభించిపోయింది. దీంతో నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. పలు లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో జనం ఇబ్బంది పడ్డారు. అనంతపురంలో 40 మి.మీ మేర వర్షం పడగా.. అనంతపురం రూరల్ మండలం, తాడిపత్రి, గుత్తి, నార్పల, యల్లనూరు, పుట్లూరు, శింగనమల, బుక్కరాయసముద్రం, రాప్తాడు, పెద్దపప్పూరు, కూడేరు, బ్రహ్మసముద్రం, బెళుగుప్ప, గార్లదిన్నె తదితర మండలాల్లో కూడా మోస్తరుగా వర్షపాతం నమోదైంది. 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో అక్కడక్కడా పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాకమునుపే ముందస్తుగా తొలకరి వర్షాలు పడుతుండటంతో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఎల్లో అలర్ట్ నేపథ్యంలో రాగల మూడు రోజులు వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే సూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. -
రైతు సమస్యలు పట్టవా?
అనంతపురం టవర్క్లాక్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులు పని తీరులో చాలా మార్పులు వచ్చాయని, రైతుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అసహనం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా స్థాయీ సంఘ సమావేశం జరిగింది. ప్రధానంగా తాగునీరు, వ్యవసాయం, వైద్యం, విద్య, విద్యుత్, వెల్ఫేర్ వంటి అంశాలపై చర్చ సాగింది. అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్ర మాట్లాడుతూ... ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా నేటికీ రైతులకు విత్తన వేరుశనగ పంపిణీపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జేడీఏ సాలురెడ్డి మాట్లాడుతూ.. విత్తన శుద్ధి ఏజెన్సీలకు చెల్లించాల్సిన బకాయిల విషయంగా ఆలస్యం చోటు చేసుకుందని, రైతులకు జూన్ 4 నుంచి విత్తన పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కంబదూరు జెడ్పీటీసీ నాగరాజు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. జెడ్పీటీసీ నీలం భాస్కర్ మాట్లాడుతూ.. శింగనమల నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ తీసుకెళ్లినా నేటికీ పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యపై ఇప్పటికై నా నిర్లక్ష్యం వీడాలని అధికారులకు చైర్పర్సన్ సూచించారు. రైతులకు పంట నష్ట పరిహారం, బీమా పరిహారం ఇప్పటి వరకూ ఇవ్వలేదని జెడ్పీటీసీ నాగరాజు గుర్తు చేశారు. సర్వజనాస్పత్రిలో నెలకొన్న సమస్యలను జెడ్పీటీసీ చంద్ర ప్రస్తావిస్తూ... రోగులకు చాలీచాలని భోజనం పెడుతున్నారన్నారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ అంబులెన్స్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్లు లేకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గిరిజమ్మ సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ.. సమగ్ర విచారణ చేపట్టి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామన్నారు. కాగా, సమావేశానికి విద్యాశాఖాధికారులు గైర్హాజరు కావడంతో చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ మాట్లాడుతూ.. ఐసీడీఎస్లో నెలకొన్న పలు సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ విజయలక్ష్మి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జున, ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీలు పాల్గొన్నారు. స్థాయీ సంఘ సమావేశంలో అధికారులను నిలదీసిన జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ ఎప్పుడు చేపడతారని నిలదీత తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశం సర్వజనాస్పత్రిలో రోగులకు భోజనం సక్రమంగా అందివ్వాలని డిమాండ్ -
విహారయాత్రలో విషాదం
ఉరవకొండ: బక్రీద్ పండుగ నేపథ్యంలో కూడేరులోని పీఏబీఆర్ వద్దకు చేరుకున్న కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్కు చెందిన ఓ కుటుంబం శనివారం పీఏబీఆర్కు చేరుకుంది. తొమ్మిది మంది కుటుంబసభ్యులు కలసి విందు భోజనాలు చేసిన అనంతరం షేక్ ఫరీదా(35), ఆమె సోదరి కుమార్తె యాస్మిన్(13) సరదాగా జలాశయం చివరన నీటిలోకి దిగారు. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు గుర్తించి వెలికి తీసేలోపు విగత జీవులయ్యారు. పోలీసులు వచ్చి స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వెధవల పర్మిషన్తో భూములు అమ్మాలా?
అనంతపురం టౌన్: భూములు అమ్ముకోవాలంటే వెధవల పర్మిషన్ కావాలట. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్చౌదరి ధ్వజమెత్తారు. నగరంలో రౌడీయిజం చేస్తామంటే ఊరుకునేది లేదంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నగరంలో భూకబ్జాలు అధికమయ్యాయని, దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులుతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. త్వరలోనే కలెక్టరుకు లిఖిత పూర్వకంగా ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ప్రస్తుతం వేధింపులకు గురవుతున్నారని, అలాంటి వారికి తాను అండగా ఉంటానని చెప్పారు. జేసీ, పరిటాల కుటుంబాలతో రాజకీయ విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు ఏవీ లేవన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఒక వ్యక్తి గ్రాఫ్తోనే ఎన్నికల్లో గెలుపొందినట్లు అహంకారంతో చంకలు గుద్దుకుంటున్నాడన్నారు. కార్యకర్తలందరి రెక్కల కష్టంతోనే పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. అదే గ్రాఫ్తో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించి సదరు వ్యక్తి సత్తా ఏంటో చూపిస్తే సంతోషపడతామన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నా పోటీ చేయబోనని అధిష్టానానికి తెలియజేశానన్నారు. నగరంలో పార్టీకి మైలేజ్ తీసుకొచ్చానని చెప్పుకుంటున్న వ్యక్తులే పోటీ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. నగరంలో రౌడీయిజం చేస్తామంటే ఊరుకునేది లేదు ఎమ్మెల్యే దగ్గుపాటిపై పరోక్షంగా ధ్వజమెత్తిన ప్రభాకర్ చౌదరి -
యువకుడి దుర్మరణం
గుమ్మఘట్ట: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాయదుర్గం నివాసి రిజ్వాన్ (32) శుక్రవారం వ్యక్తిగత పనిపై గుమ్మఘట్ట మండలం గోనబావికి వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన... 75 వీరాపురం గ్రామం దాటిన తర్వాత ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన రిజ్వాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై ఎస్ఐ చిన్నరాయుడు దర్యాప్తు చేపట్టారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశాలు అనంతపురం: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు బెంగళూరులో ఉచితంగా ట్యాలీ, కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు అడ్మిషన్ల కో–ఆర్డినేటర్ హరిప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 35 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. పూర్తి వివరాలకు 90004 87423 లో సంప్రదించవచ్చు. -
కోటా మేరకు ఎరువులు సరఫరా చేయాలి
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ సీజన్కు సంబంధించి నెలవారీ కోటా మేరకు అన్ని రకాల ఎరువులు కచ్చితంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులను వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి ఆదేశించారు. ఎరువుల సరఫరా అంశంపై శుక్రవారం తన చాంబర్లో టెక్నికల్ ఏఓ వంశీకృష్ణతో కలిసి ఎరువుల కంపెనీ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఈ ఖరీఫ్లో సెప్టెంబర్ ఆఖరు వరకు ఒక లక్ష మెట్రిక్ టన్నుల మేర ఎరువులతో ప్రణాళిక ఉన్నందున ఆయా కంపెనీలు తమ టార్గెట్ మేరకు సరఫరా చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 48,476 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో యూరియా 10,509 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4,630 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 2,956 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2,175 మెట్రిక్ టన్నులు ఉండగా అత్యధికంగా కాంప్లెక్స్ ఎరువులు 28,205 మెట్రిక్ టన్నులు ఉన్నాయని వివరించారు. త్వరలో కొత్త యాప్ అందుబాటులోకి రానుందని, దీని ద్వారా రైతులే స్వయంగా భూవిస్తీర్ణం, పంటల సాగును బట్టి వారికి అవసరమైన యూరియా, ఇతర ఎరువులను ఇండెంట్ పెట్టుకుని తీసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆన్లైన్లో జిల్లా వ్యాప్తంగా దుకాణాలను మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. ప్రతి రైతుకూ బయోమెట్రిక్ ద్వారా ఎరువుల అమ్మకాలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంటల వారీగా సాగు విస్తీర్ణంను బట్టి ఆర్ఎస్కేల్లో తగినంత ఎరువులు ముందస్తుగా నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. -
అవమాన భారం.. ఆత్మహత్యాయత్నం
● పోలీస్స్టేషన్ ఎదుటే దివ్యాంగుడి కుటుంబం అఘాయిత్యం అనంతపురం సెంట్రల్: మాటలతో కించపరుస్తూ.. భౌతికదాడులకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంతో అవమానభారం భరించలేక దివ్యాంగుడి కుటుంబం పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబం తెలిపిన మేరకు... మున్నానగర్లో షేక్ షాషావలి, ఎస్.రేష్మా అనే దివ్యాంగ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి ఇంటి మెట్లకు దగ్గరగా పబ్లిక్ ట్యాప్ ఉంది. అక్కడ నీళ్లు నిలబడటంతో పాచిపట్టింది. దివ్యాంగులు ఇంట్లోకి వెళ్లే సమయంలో అక్కడ పట్టుతప్పి కిందపడి గాయాలపాలైన ఘటనలు ఉన్నాయి. పబ్లిక్ కొళాయిని కాస్త దూరంగా మార్చి తమకు ఇబ్బంది లేకుండా చూడాలని రేష్మా గత నెల 27న నగరపాలక సంస్థ కమిషనర్కు అర్జీ ఇచ్చి సమస్యను వివరించింది. అయితే కొళాయిని మరోచోటుకు మార్పు చేయడానికి పొరుగింటి వారు ఒప్పుకోవడం లేదు. దీంతో ఇరు కుటుంబాల నడుమ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తమ శారీరక లోపాన్ని ఎత్తిచూపుతూ దూషణలకు దిగుతున్నారని, వారి వేధింపులతో మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నామని, విచారణ చేసి తమకు న్యాయం చేయాలని షాషావలి ఈ నెల ఏడో తేదీ వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అండర్ సెక్షన్ 92 (దివ్యాంగుల చట్టం) కింద మున్నానగర్కు చెందిన రామాంజనేయులు, సాదగ్ని, శ్రీదేవి, మున్నీపై కేసు నమోదు చేశారు. అంతకు మించి చర్యలు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో గురువారం షాషావలి కుటుంబ సభ్యులపై పొరుగింటి వారు గొడవకు దిగారు. మాటామాటా పెరిగి భౌతికదాడులకు పాల్పడ్డారు. దీన్ని అవమానభారంగా భావించిన షాషావలి కుటుంబ సభ్యులు వన్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి మొరపెట్టుకున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తామేమీ చేయలేమని పోలీసులు చెప్పడంతో స్టేషన్ బయటకు వచ్చిన వారు నడిరోడ్డుపై బైఠాయించారు. నిందితులకు అధికార టీడీపీ డివిజన్ ముఖ్య నాయకులు అండగా నిలుస్తున్నారని, ఇక న్యాయం జరగనప్పుడు తాము చనిపోవడమే మేలంటూ బాటిల్లోని పెట్రోలు ఒంటిపై పోసుకున్నారు. ఇంతలో సీఐ వెంకటేశ్వర్లు వచ్చి వారి ప్రయత్నాన్ని అడ్డుకుని పంపించేశారు. ఇప్పటికై నా స్పందించి న్యాయం చేయకపోతే ఎస్పీని కలుస్తామని బాధితులు తెలిపారు. దివ్యాంగుల గోడును కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. -
ఏపీఎల్ టోర్నీ కోచ్లుగా జిల్లా వాసులు
అనంతపురం: వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంఽధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) టోర్నీలో ప్రాతినిథ్యం వహిస్తున్న రెండు ఫ్రాంచేజీ జట్లకు కోచ్లుగా జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం దక్కింది. కాకినాడ కింగ్స్ జట్టు హెడ్ కోచ్గా ఎల్ఎన్ ప్రసాదరెడ్డి, విజయవాడ సన్షైన్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా గులామ్ ఖాదిర్ బాషా నియమితులయ్యారు. అలాగే అమరావతి రాయల్స్ జట్టు ఫిజియోగా జిల్లాకు చెందిన కె.అశోక్కు అవకాశం దక్కింది. కాగా, రంజీ ప్లేయర్గా రాణించిన ఎల్ఎన్ ప్రసాదరెడ్డి 53 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో ఆడిన అనుభవం ఉంది. బ్యాటింగ్ కోచ్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది కాకినాడ కింగ్స్ జట్టుకు కోచ్గా వ్యవహరించారు. ఈ ఏడాది కూడా అదే జట్టుకు ఆయనకు అవకాశం దక్కడం గమనార్హం. ఇక గులామ్ ఖాదిర్బాషా రాష్ట్ర స్థాయి జూనియర్, సీనియర్ జట్లలో ఆడిన అనుభవం ఉంది. గతంలో ఆంధ్రా రంజీ సీనియర్, జూనియర్ జట్లకు ఫిజియోగా అశోక్ పనిచేశారు. ప్రసాదరెడ్డి, గులామ్ ఖాదిర్బాషా, అశోక్ (ఫిజియో) -
విహార యాత్రలో విషాదం
● మున్నార్లో మృతి చెందిన ఉపాధ్యాయుడు సుధాకర్బాబు అనంతపురం ఎడ్యుకేషన్: కుటుంబ సభ్యులతో కలిసి కేరళలోని మున్నార్కు విహార యాత్రకు వెళ్లిన అనంతపురం రూరల్ మండలం పాపంపేట జెడ్పీహెచ్ఎస్ ఇంగ్లిష్ టీచరు సీడీ సుధాకర్ బాబు మృతి చెందారు. అక్కడ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతుండగా గురువారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి రాత్రి 11.30 గంటల సమయంలో కన్ను మూశారు. ఆయనకు భార్య నళిని (స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లిష్), ఇద్దరు కుమారులున్నారు. ఆయన మృతి తీరని లోటు అని, అంకిత భావంతో పనిచేసే టీచరుగా మన్ననలు పొందారని పాపంపేట జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం పి.లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు వనజ, శోభ, హరికిరణ్, పవన్, వెంకటేష్, కవిత, నాగవేణి సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం అయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. -
కక్ష సాధింపు చర్యలు తగదు
● వైఎస్సార్సీపీ పీఆర్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అనంతపురం: ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరైన పద్ధతి కాదంటూ చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి హితవు పలికారు. జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డిని శుక్రవారం ఆయన ములాఖత్లో కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తున్నందుకే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రాజకీయ ఒత్తిళ్లు, అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలనుకోవడం సీఎం చంద్రబాబు అవివేకానికి నిదర్శనమన్నారు. ఇలాంటి చర్యలతో ప్రజల హక్కుల పరిరక్షణకు వైఎస్సార్సీపీ నిరంతర సాగిస్తున్న పోరాటం మరింత ఉధృతంగా మారుతుందని హెచ్చరించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం టౌన్: గృహ నిర్మాణ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్న ఆ సంస్థ పీడీ శైలజ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 4 డేటా ఎంట్రీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నారు. www. ananthapuramu.ap.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడు చేసుకున్న దరఖాస్తులను భర్తీ చేసి జూన్ 10వ తేదీలోపు గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో అందజేయాలి. పూర్తి వివరాలకు 08554–274456 లో సంప్రదించవచ్చు. విత్తనశుద్ధి మొదలు పెట్టండి : జేడీఏ అనంతపురం అగ్రికల్చర్: విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా వెంటనే విత్తనశుద్ధి మొదలు పెట్టాలని ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులను జేడీఏ సాలురెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ వెంకటసుబ్బయ్య, టెక్నికల్ ఏఓ రాకేష్నాయక్తో కలిసి అనంతపురంలోని విజయ, రామకృష్ణ మిల్లులను ఆయన సందర్శించారు. బకాయిలు విడుదల చేసే అవకాశం ఉన్నందున రైతులకు ఇబ్బంది లేకుండా విత్తనశుద్ధి మొదలు పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. 40 శాతం రాయితీతో 56 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ పంపిణీ జూన్ మొదటి వారంలోనే ప్రారంభించాల్సి ఉంటుందని, అలాగే రైతులకు ఉచితంగా మినీకిట్ల రూపంలో కందుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 190 క్వింటాళ్ల జీలుగ, 474 క్వింటాళ్ల జనుము, 95 క్వింటాళ్ల పిల్లిపెసర లాంటి గ్రీన్మెన్యూర్ సీడ్ 50 శాతం సబ్సిడీతో ఇస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు చైన్స్నాచర్ల అరెస్ట్ తుమకూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి పట్టణంలో ఈ నెల 26న చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను శుక్రవారం వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రానికి చెందిన రాజు, ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామానికి చెందిన ఓబన్న ఉన్నారు. నిందితుల నుంచి 60 గ్రాముల బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నారు. చిరునామా అడిగే నెపంతో ఈ నెల 26న మధుగిరిలోని దొడ్డపేట దేవాంగ వీధిలో నివాసముంటున్న వృద్ధురాలు లక్ష్మమ్మ మెడలోని 60 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని బైక్పై ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో అనంతపురంలో ఒకరిని, తెలంగాణలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితులపై శుక్రవారం కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. -
రైతుకు ఉచితం.. కానరాని వ్యాపారం
రైతులు కష్టపడి పండించిన పంటలను నేరుగా కొనుగోలుదారులకు విక్రయిస్తే తగిన గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుందనే సదుద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుంతకల్లులో నిర్మించిన రైతు బజార్... ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారింది. 2024, ఫిబ్రవరి 23న ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ రైతు బజార్లో గదులను అన్నదాతలకు ఉచితంగా కేటాయించాల్సి ఉంది. అయినా నేటికీ ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంతకల్లు టౌన్: రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను స్వయంగా వారే విక్రయించుకునేందుకు వీలుగా రూ.50 లక్షల మార్కెట్ కమిటీ నిధులతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుంతకల్లులో అధునాతన రైతు బజార్ను నిర్మించింది. 2024, ఫిబ్రవరి 23న అప్పటి ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. ఈ లోపు ఎన్నికలు రావడంతో రైతు బజార్ ప్రజా వినియోగంలోకి రాలేకపోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుబజార్ను పూర్తిగా గాలికొదిలేసింది. మార్కెట్కు వెళ్లాలంటే 3 కి.మీ దూరం.. పట్టణ శివారు కాలనీలైన దోనిముక్కల రోడ్డు ఇందిరమ్మకాలనీ, జగనన్న కాలనీలు, జగ్జీవన్రామ్, టీచర్స్కాలనీ, సీఐటీయూ, శ్రీనివాసనగర్, బర్మశాల, ప్రశాంతినగర్ తదితర కాలనీలకు చెందిన ప్రజలు ప్రస్తుతం మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉన్న మార్కెట్కు కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు తదితరాలు కొనుగోలు చేయడానికి వెళుతుంటారు. కనీసం 2 నుంచి 3 కి.మీ దూరం ప్రయాణించాల్సి రావడంతో ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఒక్కసారి ఆటోలో వెళ్లి రావాలంటే రూ.100 వరకు ఖర్చవుతోంది. దీంతో ఇళ్ల వద్దకు కూరగాయాలను తీసుకొచ్చే వ్యాపారులకు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ యార్డులో నిర్మించిన రైతుబజార్ను వినియోగంలోకి తెస్తే శివారు ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది. కలగా మారిన డీజీ రైతు బజార్ అధునాతన వసతులతో నిర్మించిన రైతుబజార్లో క్రయవిక్రయాలకు సంబంధించి గదులను రైతులకు పూర్తి ఉచితంగా కేటాయిస్తారు. దీనికి తోడు ఆధునిక సాంకేతికతను అంది పుచ్చుకున్న మార్కెట్ యార్డు... ప్రత్యేకంగా డీజీ రైతు బజార్ యాప్ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా తమకు అవసరమైన కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు తదితరాలను వినియోగదారులు బుక్ చేసుకుంటే వారి ఇంటి వద్దకే వాటిని సరఫరా చేయనున్నారు. అయితే రెండుళ్లు గడిచినా రైతు బజార్లో క్రయవిక్రయాలు సాగకపోవడంతో డీజీ రైతు బజార్ యాప్ కాస్త కలగా మారింది. అధునాతన వసతులు కలిగిన గుంతకల్లులోని వైఎస్సార్ రైతు బజార్, రైతులు స్వయంగా పంట ఉత్పత్తుల విక్రయాలు సాగించేందుకు నిర్మించిన గదులు రైతులే స్వయంగా పంట ఉత్పత్తులు విక్రయించుకునే వెసులుబాటు గత ప్రభుత్వంలో పూర్తయిన రైతు బజార్ ఎన్నికల కోడ్ రాకతో ప్రారంభానికే పరిమితం ఆ తర్వాత పట్టించుకోని చంద్రబాబు సర్కార్ ప్రకటనలకే పరిమితమైన డీజీ రైతు బజార్ యాప్ -
స్వీయ రక్షణ సామర్థ్యాలు పెంపొందించుకోవాలి : ఎస్పీ
తాడిపత్రి టౌన్: స్వీయ రక్షణ సామర్థ్యాలు పెంపొందించుకోవాలని మహిళలకు ఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. మహిళలు, చిన్నారుల భద్రతకు జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ దండయాన్ కార్యక్రమంపై తాడిపత్రిలో ఐసీడీఎస్, అంగన్వాడీ, పొదుపు సంఘాల మహిళలకు శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. శక్తి యాప్, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. గృహ హింస, మహిళలపై వేధింపులు, బాల్య వివాహాలు, సైబర్మోసాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అపరిచిత వ్యక్తులఫోన్ కాల్స్కు స్పందించరాదని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచకోకూడదని సూచించారు. సమస్య ఎదురైతే భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ పోస్టర్లను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఎస్పీని తాడిపత్రి వాసవీ క్లబ్బు సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రోహిత్కుమార్, సీఐలు శివగంగాధర్రెడ్డి, ఆరోహణరావు, రామసుబ్బయ్య, మార్కెట్యార్డు చైర్మన్ భూమా నాగరాగిణి, న్యాయవాదులు జ్యోతి, ఫరీదా, నబీనా, ఎస్ఐలు ధరణి, గౌష్, దయాకర్, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. జంగంరెడ్డిపల్లిలో విషాద ఛాయలుశింగనమల(నార్పల): నార్పల మండలం జంగంరెడ్డిపల్లిలో శుక్రవారం విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి కురుబ రాజా, లక్ష్మీదేవి దంపతుల ఏకైక కుమారుడు యశ్వంత్ కుమార్(17) విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతూ అదే కళాశాలలో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగమేఘాలపై విజయవాడకు తరలి వెళ్లారు. కాగా, శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదివిన యశ్వంత్కుమార్ బెటర్మెంట్ పరీక్షలు రాయడానికి వెళ్లాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అరటి తోట దగ్ధం వజ్రకరూరు: మండలంలోని గంజికుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, రైతు ఆవుల వెంకట్రాముడు అరటి తోట మంటల్లో దగ్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగాయి. ఉరవకొండ నుంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పే లోపు నాలుగు ఎకరాల్లోని 7 వేల అరటి చెట్లు, డ్రిప్ పరికరాలు, పైపులు, మోటారు కాలిపోయాయి. ఘటనతో రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. -
ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం
గుమ్మఘట్ట: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ తెలిపారు. రాయదుర్గం మండలం 74ఉడేగోళం ఆర్టీటీ ఫీల్డ్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూ సమస్యలకు తీర్పులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, వివిధ సమస్యలపై 25 వినతులు అందినట్లు తహసీల్దార్ హరికుమార్ తెలిపారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు. 31న కనకదాస ప్రతిభా పురస్కారాల ప్రదానం అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కురుబ విద్యార్థులకు ఉమ్మడి జిల్లా కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 31న ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆర్వేటి పద్మావతి, ప్రధాన కార్యదర్శి మంగళకుంట నాగరాజు, కోశాధికారి అట్టే ఓబులేసు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఉన్న కనకదాస కల్యాణ మంటపంలో జరిగే ఈ కార్యక్రమానికి కురుబ ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయిలో స్థిరపడిన ఉద్యోగులు హాజరు కానున్నారు. వనపర్తిలో గుత్తి వాసి మృతి గుత్తి: స్థానిక కోట వీధికి చెందిన బొలెరో డ్రైవర్ జగదీష్(24) తెలంగాణలోని వనపర్తి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం రాత్రి కొత్తిమీర, కరివేపాకు లోడుతో హైదరాబాద్కు వెళుతుండగా వనపర్తి సమీపంలో టైర్ పంచర్ కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. మరో ఇద్దరితో కలిసి టైర్ మారుస్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొనడంతో జగదీష్తో పాటు మరో ఇద్దరూ మృతి చెందారు. -
కుట్రల ప్రభుత్వంపై కన్నెర్ర
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలో పాలన సాగిస్తోంది కూటమి ప్రభుత్వం కాదని, కుట్రల ప్రభుత్వం అని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన ‘మెగా డీఎస్సీ’ పూర్తిగా అవ్యవస్థలు, అనుమానాలకు కేంద్రబిందువుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్న నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేంద్రరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షల నిర్వహణలో జరిగిన గందరగోళంతో అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అభ్యర్థుల నుంచి వస్తున్న ఆరోపణలు, ప్రశ్నపత్రాల లీకేజీ అనుమానాలు, టెక్నికల్ సమస్యలు అన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గందరగోళాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ను బర్తఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజకీయాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సమాధానం చెప్పాల్సిన మంత్రి బెదిరింపులు, ఒత్తిళ్లు, రాజకీయ ప్రతీకారాలతో ముందుకు వెళ్తున్నారన్నారు. మెగా డీఎస్సీ నిర్వహణలో అక్రమాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నవీన్రెడ్డి, విజయ్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాశీరాం నాయక్, రాష్ట్ర నాయకులు సుధీర్రెడ్డి, షెక్షావలి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ రాయల్, మంజునాథ్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నిషాంత్రెడ్డి, అశోక్, గంగ శివుడు, సాయి నితిన్, నాగరాజు గౌడ్, నగర అధ్యక్షులు కై లాష్, రేవంత్ రెడ్డి, అజయ్, కాశీ మనోజ్, సాకే పురుషోత్తం, నగర ఉపాధ్యక్షులు అంజన్రెడ్డి, శివ దత్తాత్రేయ, నగర ప్రధాన కార్యదర్శులు పులి కార్తికేయ, రాహుల్ రెడ్డి, మనోజ్, హరీష్, చరణ్, ప్రకాష్, సాయిరెడ్డి, షరీఫ్, గన, నవీన్, దినేష్, రియాజ్, సుబ్బు, తరుణ్, లోకేష్, సురేంద్ర, ప్రసాద్, అరుణ్, రఫీ, కార్తీక్ పాల్గొన్నారు. డీఎస్సీ–25 నిర్వహణపై సీబీఐ విచారణ చేయించాలి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉరితాళ్లతో విద్యార్ధి నాయకుల నిరసన నారా లోకేష్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ -
విలేకరి ముసుగులో వసూళ్లు!
● ‘పరిటాల’ అనుచరుడు రవి దందా ● అరెస్టు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు సాక్షి, టాస్క్ఫోర్స్: పరిటాల అనుచరుడిగా చెప్పుకుంటూ విలేకరి ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న ఓ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడిని నంద్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే...రామగిరి మండలం పీఆర్ కొట్టాలకు చెందిన వై.రవి తాను ప్రజాటీవీ చానల్ స్టాఫ్ రిపోర్టర్నని చెప్పుకుంటూ పలువురిని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడేవాడు. ఈ క్రమంలోనే నంద్యాలలోని ఉదయానంద ఆస్పత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ భార్గవరెడ్డిని కలిసి తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తానని బెదిరించాడు. దీంతో వైద్యుడు గతంలో రూ.4 వేలు ఇచ్చి పంపించాడు. రెండు రోజుల క్రితం మళ్లీ డబ్బుల కోసం ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. అయితే డాక్టర్ లెక్కచేయకపోవడంతో గురువారం రాత్రి నేరుగా నంద్యాలలోని ఆస్పత్రికి వెళ్లి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు డాక్టర్ తిరస్కరించడంతో హంగామా చేశాడు. ఆస్పత్రి సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న నంద్యాల త్రీటౌన్ పోలీసులు వచ్చి రవిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతనిపై నాన్బెయిలబుల్ కేసు నమోదు చేశారు. శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టి.. జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు సీఐ వేణుగోపాల్ తెలిపారు. రవి చరిత్ర అంతా నేరమయం రవి చరిత్ర అంతా నేరమయమేనని పీఆర్ కొట్టాల గ్రామస్తులు తెలిపారు. చేతికి ‘పరిటాల రవి’ అని పచ్చబొట్టు వేయించుకుని ఆ కుటుంబానికి తాను ముఖ్య అనుచరుడినంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేసేవాడన్నారు. తరువాత కులసంఘాల పేరుతో దందాలు కొనసాగించాడన్నారు. ప్రస్తుతం ప్రజాటీవీ విలేకరినని వ్యాపారులను, ఇతరులను బెదిరిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడన్నారు. అంతేకాకుండా అనంతపురం నుంచి విజయవాడకు ద్విచక్ర వాహనంలో వెళ్తూ మార్గమధ్యంలోని ప్రముఖులను బెదిరించేవాడని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే రవిపై అనంతపురం వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్ పోలీస్స్టేషన్లలో కేసులు కూడా నమోదైనట్లు పీఆర్ కొట్టాల వాసులు తెలిపారు. తాజాగా నంద్యాలలోనూ వైద్యుడిని బెదిరించి కటకటాల పాలయ్యాడని వెల్లడించారు. -
గాలి మరకు మంటలు
ఆత్మకూరు: ఆత్మకూరు వద్ద ముట్టాల రోడ్డుకు వెళ్లే దారి పక్కన శుక్రవారం తెల్లవారుజామున గాలి మరకు మంటలు అంటుకున్నాయి. మధ్యాహ్నం వరకు గాలి మర పైన మంటలు చెలరేగాయి. టెక్నికల్ సమస్యల వల్ల అలా మంటలు వ్యాపించి ఉండవచ్చని నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసింది. మధ్యాహ్నానికి మంటలు అదుపులోకి వచ్చి పూర్తిగా ఆగిపోయాయి. జూనియర్ కళాశాలలకు 5 వరకు సెలవులు అనంతపురం ఎడ్యుకేషన్: అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నేపథ్యంలో జూన్ 1న పున:ప్రారంభం కావాల్సిన జూనియర్ కళాశాలలు ఆరో తేదీకి మార్పు చేశారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అకడమిక్ కేలండర్ మేరకు ఒకటో తేదీ కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఐదో తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగనున్నాయి. చాలా కళాశాలలు పరీక్ష కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. దీనికితోడు అధ్యాపకులు, సిబ్బంది పరీక్షల విధుల్లో ఉన్నారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యేదాకా సాధారణ తరగతులు ప్రారంభించడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు మరో 5 రోజుల అదనపు సెలవులు లభించాయి. అకడమిక్ క్యాలెండర్లోని మిగతా షెడ్యూళ్లు, సూచనలు యథాతథంగానే కొనసాగుతాయని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. జిల్లాకు ‘ఎల్లో’ అలర్ట్ ● ఈదురుగాలులు, తేలికపాటి వర్షసూచన అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజలు ఉమ్మడి అనంతపురం జిల్లాకు ‘ఎల్లో’ అలర్ట్ ప్రకటించినట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈ నెల 30 నుంచి జూన్ 2 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షంతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. 30న 9 మి.మీ, 31న 4.3 మి.మీ, జూన్ ఒకటిన 6 మి.మీ, 2న 4 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. ఉరుములు, మెరుపుల సమయంలో పిడుగుపాటుకు గురికాకుండా అలాగే ఈదురుగాలులకు పంటలు దెబ్బతినకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పీజీ సెట్ ఫలితాల విడుదల అనంతపురం: యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీ సెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 1338 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1154 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1040 (90.12 శాతం) మంది అర్హత సాధించారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన కె.భార్గవి రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించారు. జనరల్ విభాగంలో వడ్డే అనిల్ కుమార్ రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. సెరికల్చర్ విభాగంలో ఎస్. హర్షవర్ధిని రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు, శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన టి.మదీనా తస్లీం సెరికల్చర్ విభాగంలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు తెచ్చుకున్నారు. మొత్తం 30 బ్రాంచ్ల్లో అడ్మిషన్లు నిర్వహించడానికి ఏపీ పీజీసెట్ నిర్వహించారు. దీంతో ఈ దఫా కూడా పీజీ కళాశాలలు తగినన్ని సీట్లు భర్తీకాక వెలవెలబోయే పరిస్థితి నెలకొంది. ఆలింగనం చేసుకుని సెల్ఫోన్ కొట్టేశాడు గుత్తి: బక్రీద్ సందర్భంగా గుత్తిలో జేబు దొంగలు చెలరేగిపోయారు. సామూహిక ప్రార్థనల అనంతరం ఈద్గా మైదానం నుంచి బయటకు వస్తున్న స్థానికుడు మహమ్మద్ రఫీని ఓ అపరిచిత వ్యక్తి కలిసి ఈద్ ముబారక్ అంటూ ఆలింగనం చేసుకున్నాడు. పరిచయం లేని వ్యక్తి తనకు ఈద్ ముబారక్ చెప్పడంతో మహమ్మద్ రఫీ సైతం మురిసిపోతూ ఆలింగనం చేసుకున్నాడు. కాసేపటి తర్వాత చూసుకుంటే తన జేబులో ఉండాల్సిన రూ.15 వేలు విలువ చేసే సెల్ఫోన్ కనిపించలేదు. తనను ఆలింగనం చేసుకున్న వ్యక్తే మొబైల్ను అపహరించి ఉంటాడని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అర్హుల ఓట్లు ఏవీ తొలగిపోరాదు
రాయదుర్గం: ఓట్ల తొలగింపు, చేర్పులు, మార్పుల విషయంలో బీఎల్ఏల పాత్ర కీలకమని, అర్హులైన వారి ఓట్లు ఏ ఒక్కటీ జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో చేపట్టనున్న ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శుక్రవారం రాయదుర్గంలోని నేషనల్ ఫంక్షన్ హాలులో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి అధ్యక్షతన ‘సర్’పై వైఎస్సార్సీపీ నియోజకవర్గస్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ)కు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రత్యేక శిక్షకులుగా హాజరైన ‘సర్’ ఇన్చార్జ్ గోపీనాథ్, స్టేట్ వింగ్ రీజనల్ సెక్రెటరీలు మంజునాథ, శివారెడ్డితో క్లుప్తంగా ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వివరించారు. అనంతరం అనంత వెంకటరామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో ‘ప్రతి ఓటూ.. భవితకు మెట్టు’ అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ఓట్ల గోల్మాల్కు పాల్పడే అవకాశం ఉందని, ఈ విపత్తు నుంచి బయటపడే మార్గం చూసుకోవాలన్నారు. మన ఓటుకు మనమే భద్రతగా ఉండాలన్నారు. ముఖ్యంగా 2002– 2025 మధ్య ఓట్ల వ్యత్యాసాన్ని ప్రతి బూత్లోనూ సరిచూసుకోవాలన్నారు. ఇటీవల పశ్చిమబెంగల్లో సర్ ప్రోగ్రాం ద్వారా 90 లక్షల ఓట్లు తొలగించారని గుర్తు చేశారు. సీఎం అభ్యర్థి మమత బెనర్జీ నియోజకవర్గంలోనూ 48 వేల ఓట్లు తొలగిస్తే .. ఆమె 15 వేల ఓట్లతో మాత్రమే ఓటమి పాలయ్యారన్నారు. తమిళనాడులోనూ 78 లక్షల ఓట్లు కోత కోశారన్నారు. ఇలా ఈ రెండు చోట్లే కాదు మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగుచూశాయన్నారు. జూన్ 15 నుంచి ‘సర్’ ప్రక్రియ ప్రారంభం కాగానే బీఎల్ఏలు అధికారుల వెంటే ఉండాలన్నారు. కారణం లేకుండా ఒక్క ఓటు తొలగించినా ఉపేక్షించేది లేదన్నారు. మోసం, కుట్ర, దగా చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యలన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటాలని అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీ అధినేత ఈ విషయంపై దిశానిర్దేశం చేశారని, దీనికి ప్రతి కార్యకర్తా కట్టుబడి పనిచేయాలన్నారు. ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. రెండేళ్లు గడిచినా సూసర్ సిక్స్లోని ప్రధాన హామీలన్నీ అటకెక్కించారన్నారు. అభివృద్ధిని విస్మరిస్తూ దోపిడికే పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు వైఎస్సార్సీపీదే నని, ప్రజలంతా జగన్ను మళ్లీ సీఎంగా చూడాలని కోరుకుంటున్నారన్నారు. ‘సర్’ కార్యక్రమంపై మండలాల్లోనూ నాయకులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కళేకుర్తి ఉషారాణి, పొరాళ్ల శివకుమార్, సుదర్శనరెడ్డి, రాజగోపాల్రెడ్డి, బీటీపీ గోవిందు, రాజ్కుమార్, నాయక్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పొరాళ్ల శిల్ప, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు మేకల శ్రీనివాసులు, గౌని కాంతారెడ్డి, రామాంజినేయులు, బ్రహ్మానందరెడ్డి, వాల్మీకి రామాంజినేయులు, రవీంద్రనాథ్రెడ్డి, మైనార్టీ నాయకుడు రహంతుల్లా, బూత్లెవెల్ అధ్యక్షుడు అంజిరెడ్డి, కేపీదొడ్డి రమేష్, ఆర్టీ కాంతారెడ్డి, ఎంపీపీ భవాని, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, చిత్రంలో మెట్టు గోవిందరెడ్డి, హాజరైన బీఎల్ఏలు, పార్టీ నాయకులు ఇటీవల ఐదు రాష్ట్రాల్లో భారీగా ఓట్లు తొలగించారు ఇక్కడ ఆ పరిస్థితి రాకూడదు ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడాలి బీఎల్ఏలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత సూచన -
●ముస్లింలపై ఎందుకీ వివక్ష?
బురదలోనే కూర్చొని ప్రార్థనలకు సిద్ధమవుతున్న ముస్లింలు ముస్లింలపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో రెండు సార్లు వచ్చే రంజాన్, బక్రీద్ పర్వదినాల్లో ఎంతో పవిత్రంగా తాము సామూహిక ప్రార్థనలు జరుపుకునే ఈద్గా ప్రాంతాల్లో కనీస మౌలిక వసతుల కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది రంజాన్ మాసంలో, తిరిగి గురువారం జరుపుకున్న బక్రీద్ ప్రార్థనల్లో తాము ఇబ్బందులు పడాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి అనంతపురంలోని ఈద్గా మైదానం బురదమయమైందని, దీంతో గురువారం బురద మధ్యలోనే సామూహిక ప్రార్థనలు ముగించాల్సి వచ్చిందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పర్వదినాల నాడు ఈద్గా మైదానాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు కల్పించేవారని, ఆ ఐదేళ్లూ తాము ఎలాంటి అసౌకర్యాలకు లోను కాలేదని గుర్తు చేస్తున్నారు. ముస్లింలపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
‘మహానాడు’లో పాల్గొన్న ఫీల్డ్ అసిస్టెంట్
వజ్రకరూరు: స్థానిక మినీ కల్యాణ మంటపంలో గురువారం నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో వజ్రకరూరు గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఉస్మాన్బాషా పాల్గొనడం చర్చనీయాంశమైంది. పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొనడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయదుర్గం: గుమ్మఘట్ట మండలంలోని జే వెంకటంపల్లిలో తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరాయి. రెండు రోజుల కిత్రం కురిసిన వర్షానికి తాగునీటి పైపులు కొట్టుకుపోయాయి. ఫలితంగా గ్రామస్తులు బిందెడు నీటికి బండెడు కష్టాలు పడాల్సి వస్తోంది. పనులన్నీ మానుకుని వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంపై గ్రామ కార్యదర్శి మల్లికార్డునను వివరణ కోరగా వర్షానికి గ్రామంలో పైప్లైన్ దెబ్బతిందన్నారు. రెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని, ఆ లోపు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరందిస్తామని చెప్పారు. బిందెడు నీటికి బండెడు కష్టాలు -
టీబీ డ్యాంలో 10 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్, అనంతపురం జిల్లా ప్రజల వర ప్రదాయిని తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం)లో 10.140 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 2025 డిసెంబర్ 27న నిలిచిపోయిన ఇన్ఫ్లో డ్యాం ఎగువ ప్రాంతాల్లో ఈ నెల 19 నుంచి కురుస్తున్న వర్షాలతో మళ్లీ ప్రారంభమైంది. ఆశించిన రీతిలో వర్షాలు కురిస్తే జూన్ లేదా జూలైలో పూర్తి స్థాయిలో నీరు చేరుతుంది. డ్యాం నీటి మట్టం 1,633 అడుగులతో 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం కాగా.. గురువారానికి 1,588.91 అడుగులతో 10.140 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 623 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 54 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1,590.76 అడుగుల వద్ద 11.680 టీఎంసీల నీరు నిల్వ ఉండి 2,574 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 131 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉండింది. అదిరిందయ్యా చంద్రం! అనంతపురం: నాయకుల ప్రసంగాలు విసుగు పుట్టించాయి. ఊకదంపుడు ఉపన్యాసాలు వినలేక ‘తెలుగు తమ్ముళ్లు’ సరదాగా చిందేశారు. పూటుగా మద్యం తాగి.. రోడ్డుపై ఎక్కడపడితే అక్కడే తాగి ఊగిపోయారు. మత్తులో తూలి పడిపోయి అచేతనావస్థలో ఉండిపోయారు. గురువారం అనంతపురం సప్తగిరి సర్కిల్లోని మూడు రోడ్ల కూడలిలో ఓ టీడీపీ కార్యకర్త పూటుగా మద్యం సేవించి రోడ్డుపైనే పడిపోయిన దృశ్యమిది. అనంతపురంలో ఏర్పాటు చేసిన మహానాడు వేదికలో పార్టీ నేతలు ప్రసంగాలు చేస్తుండగా, అక్కడ నుంచి కొందరు బయటకు వచ్చేసి మద్యం సేవించడానికి పోటీపడడం గమనార్హం. ఈ క్రమంలో మద్యం మత్తులో తూలుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల ఫొటోలు, వీడియోలను తీసిన పలువురు ‘అదిరిందయ్యా చంద్రం’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయగా విపరీతంగా వైరలయ్యాయి. బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్ కుందుర్పి: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం రాత్రి క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన పలువురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. పట్టుబడిన ఐదుగురూ 18 నుంచి 19 సంవత్సరాల్లోపు వయసున్న వారే కావడం గమనార్హం. వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. బెట్టింగ్రాయుళ్లను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.20,100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
తీరని నష్టం.. దారుణ మోసం
భక్తిశ్రద్ధలతో బక్రీద్రైతులన్నా, వ్యవసాయమన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్దగా గిట్టడం లేదు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకుండా దగా చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఇప్పటికే నాలుగు సీజన్లు ముగిశాయి. మూడు రోజుల్లో ఐదో సీజన్ కూడా మొదలుకానున్నా పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా దాటవేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో అకాల వర్షాలు లేదంటే అధిక వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వాన ఇలా ప్రకృతి వైపరీత్యాలు రైతులను తీరని గాయం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన సర్కారు నిర్లక్ష్యం చేస్తుండటంతో అన్నదాతల పరిస్థితి దారుణంగా తయారైంది. బక్రీద్ను గురువారం జిల్లావ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదుల్లో హాజీలు, మౌలానాలు ఖుద్బా చేశారు. ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఇమామ్లు బక్రీద్ విశిష్టతను తెలియజేశారు. చిన్నారులు, పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం బక్రీద్ సందర్భంగా దువా చేస్తున్న చిన్నారులునేడు 74 ఉడేగోళానికి ఇన్చార్జ్ కలెక్టర్ గుమ్మఘట్ట: రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామానికి శుక్రవారం ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ విచ్చేయనున్నట్లు తహసీల్దార్ హరికుమార్ తెలిపారు. స్థానిక ఆర్డీటీ ఫీల్డ్ కారాల్యయ ఆవరణంలో జరిగే ఒక నెల, ఒక నియోజకవర్గం, నాలుగు సందర్శనలు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించి పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణ పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నది నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతోంది. పొలాలు, శ్మశాన వాటికలు, బ్రిడ్జిల పక్కన ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చిత్రావతి నదిలో నీళ్లు పూర్తిగా తగ్గిపోతుండడంతో అక్రమార్కులు ఇసుకను జోరుగా తరలిస్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా పట్టణంలో పలు బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో పాటు పక్క రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ కొందరు టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. నాలుగు రోజులుగా రాయలవారిపల్లి, ఎనుములపల్లి సమీపంలోని చిత్రావతిలో హిటాచీలు ఏర్పాటు చేసి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇటీవల జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారులు మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ముదిగుబ్బ పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతపురం అగ్రికల్చర్: చంద్రబాబు పాలనలో వర్షాలు గతి తప్పాయి. అకాలంలో అధిక వర్షాలు కురవడం, పంట దిగుబడులు అరకొరగా రావడం, వచ్చిన ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించకపోవడం వల్ల వ్యవసాయం భారంగా పరిణమించింది. పంట నష్టం భారీగా జరిగినా పరిహారం ఇవ్వడానికి వెనుకాడుతుండటం రైతులను కలచివేస్తోంది. ఈ ప్రభుత్వ హయాంలో గత నాలుగు సీజన్లలో వరి, వేరుశనగ, మొక్కజొన్న, పప్పుశనగతో పాటు అరటి, మామిడి, చీనీ, టమాట, ఇతర కూరగాయల పంటలు వేల హెక్టార్లలో దెబ్బతిన్నాయి. 2024 ఖరీఫ్లో ఏడు, రబీలో ఏడు మండలాలను కరువు జాబితాలో చేర్చినా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ఈ సీజన్కు సంబంధించి మార్చి 19, 23, మే 1, 7, 22, 27 తేదీల్లో ఈదురుగాలుల బీభత్సానికి రూ.15 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు అంచనాలు వేశారు. రెండేళ్లలో రూ.1,000 కోట్ల వరకు పంటనష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు రూ.120 కోట్లకు పైగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని జిల్లా అధికారులు పలు దఫాలుగా ప్రతిపాదనలు పంపారు. ప్రకృతి కన్నెర్రకు పంటలు దెబ్బతిని తీరని నష్టం వాటిల్లుతున్నా చంద్రబాబు సర్కారు కరుణ చూపకపోవడం గమనార్హం. జగన్ హయాంలో రూ.380 కోట్ల ఇన్పుట్.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 2019–2024 మధ్య కాలంలో మొదటి నాలుగేళ్లూ విస్తారంగా వర్షాలు కురిశాయి. మధ్య మధ్యలో భారీ వర్షాలు, ఈదురు గాలులు, చివరి ఏడాది 2023లో ఎల్–నినో కారణంగా వర్షాలు తక్కువై పంటలు దెబ్బతిన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం ఏ సీజన్లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్ ముగిసేలోపు పెట్టుబడి రాయితీ పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.380.20 కోట్లు అందించారు. వ్యవసాయ పంటలకు సంబంధించి 2,65,290 మంది రైతులకు రూ.364.85 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి 8,997 మంది రైతులకు రూ.15.35 కోట్లు జమ చేశారు. వీటికి తోడుగా ఇన్సూరెన్స్, రైతు భరోసా, సున్నావడ్డీ కింద పెద్ద మొత్తంలో సాయం చేస్తూ రావడంతో వ్యవసాయం ఇబ్బంది లేకుండా సాగిపోయిందని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పంట నష్ట ఉపశమనం ఇలా.. ఆగస్టు 2024 నుంచి అమలులోకి వచ్చిన స్కేల్ ఆఫ్ రిలీఫ్ (పంట నష్ట ఉపశమనం) ప్రకారం ఎన్ని హెక్టార్లు దెబ్బతిన్నా కేవలం రెండు హెక్టార్లకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు. వేరుశనగ, పత్తి, వరి, చెరకు హెక్టారుకు రూ.25 వేల ప్రకారం, సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, కంది, కుసుమ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, కొర్ర, సామ, జూట్ పంటలు హెక్టారుకు రూ.15 వేల ప్రకారం ఖరారు చేశారు. అరటి, మామిడి, దానిమ్మ, జామ, ఉసిరి, సపోటా, రేగు, డ్రాగన్ఫ్రూట్, జీడిపప్పు, కాఫీ, పసుపు, మిరప హెక్టారుకు రూ.35 వేలు, కళింగర, కర్బూజా, దోస, బొప్పాయి, టమాట, పూలు, ఉల్లి, ధనియాలు, కూరగాయలకు రూ.25 వేలు, సెంటు విస్తీర్ణంలో ఉన్న ఆకుతోటలకు రూ.300 ప్రకారం గరిష్టంగా రూ.75 వేల వరకు ఇస్తారు. కర్రపెండలం రూ.10 వేలు, ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,500 ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈనెల 23న అనంతపురం రూరల్ మండలం కామారుపల్లిలో గాలులకు నేలవాలిన అరటి తోట, 27న బెళుగుప్ప మండలంలో పడిపోయిన బీర పందిర్లు రైతులతో చంద్రబాబు సర్కారు పరిహాసం నాలుగు సీజన్లు ముగిసినా రూపాయి అందించని వైనం రూ.120 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా దగా వైఎస్ జగన్ హయాంలో సీజన్ ముగిసేలోపు నష్ట పరిహారం ఐదేళ్లలో జిల్లా రైతులకు రూ.380 కోట్లకు పైగా అందజేత -
డీఎస్సీ అక్రమాలపై నేడు నిరసన
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–2025 నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలు, స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేపట్టాలనే డిమాండ్తో శుక్రవారం వైఎస్సార్ఎస్యూ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయనున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థుల పేర్లు తుది ఎంపికలో లేకపోవడం, ప్రశ్న పత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టుల విక్రయాల ఆరోపణలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమానికి నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, విద్యార్ధి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దర్గా కట్ట వద్ద యువకుడి మృతి యాడికి: మండల కేంద్రంలోని దర్గా కట్టపై కూర్చొన్న ఓ యువకుడు ఉన్నఫళంగా కిందపడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లికి చెందిన మద్దిలేటి కుమారుడు సుధాకర్(34)కు యాడికి మండలం కమలపాడుకు చెందిన యువతితో వివాహమైంది. ఈ క్రమంలో కమలపాడుకు వచ్చిన సుధాకర్ గురువారం యాడికి గ్రామానికి వచ్చాడు. సాయంత్రం కమలపాడు మార్గంలోని దర్గా వద్దకు చేరుకుని కట్టపై కూర్చొన్న అతను ఉన్నఫళంగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడు చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి మద్దిలేటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, సుధాకర్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. రైలు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు రాయదుర్గం టౌన్: రైలు ఢీకొన్న ఘటనలో స్థానిక సీబీఎన్ కాలనీకి చెందిన శంకరమ్మ(70) తీవ్రంగా గాయపడింది. కాలనీకి ఆనుకుని ఉన్న రైలు పట్టాలపై పావగడ రైల్వేస్టేషన్ నుంచి రెండు బోగీలు ఉన్న తనిఖీ రైలు గురువారం సాయంత్రం రాయదుర్గం స్టేషన్కు చేరుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బహిర్భూమి కోసం పట్టాలు దాటుతున్న శంకరమ్మను రైలు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. తల, కాలుకు తీవ్ర రక్తగాయాలైన శంకరమ్మను 108లో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ అనంతపురం సెంట్రల్: నగరంలోని అశోక్నగర్ హరిహరదేవాలయం సమీపంలో బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతూ 10 మంది పట్టుబడ్డారని వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అందిన సమాచారం మేరకు గురువారం తనిఖీలు చేపట్టిన సమయంలో జూదరులు పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.10,600 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. బాలిక ఆత్మహత్య ఎన్పీకుంట: తల్లి మందలింపుతో మనస్థాపం చెంది ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... ఎన్పీకుంట మండలం కటకంవారిపల్లికి చెందిన వల్లెపు నవ్య (14) ఇంటి పనులు సరిగా చేయకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక గురువారం తెల్లవారుజామున బాత్రూమ్లో పైకప్పునకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణమూర్తి క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
చెరువులో వృద్ధురాలి మృతదేహం
గార్లదిన్నె: మండలంలోని జంబులదిన్నె చెరువు సమీపంలో ముళ్లకంపల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విణ్ మణిదీప్, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ కౌలుట్లయ్య అక్కడకు చేరుకుని పరిశీలించారు. సుమారు 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని, మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. 20 రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేశారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని ఖననం చేశారు. మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే గార్లదిన్నె పోలీసులను సంప్రదించాలని కోరారు. నగరంలో ఇద్దరి బలవన్మరణం అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... నగరంలోని నవోదయకాలనీలో నివాసముంటున్న గుజ్జల నాగార్జున భార్య గాయత్రి (35) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం విషపూరిత ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఇందిరానగర్లో నివాసముంటున్న కొలిమి మహమ్మద్ రఫి(36) గురువారం వేకువజామున ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, రఫీ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ‘దుర్గం’లో పోలీసుల దందా!కళ్యాణదుర్గం రూరల్: స్థానిక అర్బన్ పోలీసులు తీరు వివాదాస్పదమవుతోంది. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న యువకులను విచారణ పేరుతో స్టేషన్కు పిలుచుకెళ్లి అందిన కాడికి డబ్బు వసూలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం బక్రీద్ సందర్భంగా కొందరు యువకులు పట్టణ సమీపంలో మద్యం సేవిస్తుండగా పోలీసులు అక్కడకు చేరుకుని, వారి సెల్ఫోన్లను లాక్కొన్నారు. అనంతరం విచారణ పేరుతో స్టేషన్కు తీసుకెళ్లి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఒక్కొక్కరి ద్వారా వసూలు చేసుకుని వదిలేశారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులను వివరణ కోరగా స్పందించలేదు. కేబుల్ కత్తిరిస్తూ పట్టుబడిన దొంగ డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): వ్యవసాయ బోరుబావి వద్ద కేబుల్ కత్తిరిస్తూ రైతులకు ఓ దొంగ పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామ శివారున ఉన్న రైతు పొలంలో బోరు బావి వద్ద బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి కేబుల్ కత్తిరిస్తుండగా రైతులు గుర్తించి, వెంటనే బంధించారు. విచారణలో బళ్లారి జిల్లా సంగనకల్లు గ్రామానికి చెందిన వెంకటేష్గా గుర్తించారు. రైతుల నుంచి సమాచారం అందుకున్న డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాదరెడ్డి అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం గురువారం కేసు నమోదు చేశారు. గుప్త నిధుల వేటగాళ్ల అరెస్ట్ తలుపుల: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఓ ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్ఐ చెన్నయ్య తెలిపారు. గురువారం వివరాలను ఆయన వెల్లడించారు. తలుపుల మండలం పులిగుండ్లపల్లి సమీపంలోని పెద్దపులి కొండ ప్రాంతంలో కొందరు వ్యక్తులు బుధవారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తుండగా స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో రాజనాలవాండ్లపల్లికి చెందిన గంగాద్రి పారిపోగా, ముఠా సభ్యుల్లో ఎనిమిది మంది పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి పోలీసులు రెండు కార్లు, పార, గునపం, రెండు గోలాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. గంగాద్రి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గంగమ్మ ఆలయంలో వెండి కిరీటం చోరీ ఓడీచెరువు: నారప్పగారిపల్లిలో గంగమ్మ ఆలయంలో వెండి కిరీటం చోరీ అయినట్లు గ్రామస్తులు గురువారం తెలిపారు. నారప్పగారిపల్లిలోని గంగమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి వెండి కిరీటాన్ని చోరీ చేశారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మల్లికార్జున రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఏ ఒక్క ఓటరూ మిస్ కాకూడదు
● మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ గోపినాథ్ తాడిపత్రి టౌన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా చేపట్టిన ఓటర్ల జాబిత పునః పరిశీలన ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్రామాల్లో ఏ ఒక్క ఓటరూ మిస్ కాకుండా చూడాలని వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ గోపినాథ్ సూచించారు. ‘సర్’పై గురువారం పెద్దపప్పూరు, యాడికి మండలాలకు చెందిన పార్టీ బీఎల్ఓలకు తాడిపత్రిలోని పార్టీ కార్యాలయంలో గురువారం వారు అవగాహన కల్పించారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మారిన ఓటరు వివరాల అప్డేట్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఓట్ల తొలగింపుపై నిఘా ఉంచాలన్నారు. ఇంటింటీ పరిశీలన పక్కాగా చేపట్టాలన్నారు. పక్క రాష్ట్రల్లో ఓట్ల తొలగింపు కారణంగా ఎన్నికల ఫలితాలు ఎలా తారుమారయ్యాయో వివరించారు. ఇటీవల తాడిపత్రిలో నిర్వహించిన మహిళా సదస్సులో టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి లం.. భాష మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలన్నా, వారి ఓట్లన్నా జేసీ ప్రభాకర్రెడ్డికి చులకన భావం అన్నారు. గతంలో మాదిరి గ్రామాల్లో ఫ్యాక్షన్ వర్గాలు లేవని, దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్తో పిల్లలు బాగా చదువుకుని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సాప్ట్వేర్లుగా స్థిరపడ్డారని గుర్తు చేశారు. తల్లిదండ్రులఅప్పులు తీర్చి గ్రామాల్లో గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా బతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, వేమనాథరెడ్డి, రామ్మూర్తిరెడ్డి, రామిరెడ్డి, యోగేశ్వరరెడ్డి, అమరనాథరెడ్డి, రామచంద్రారెడ్డి, కాశి, సూర్యనారాయణరెడ్డి, లక్ష్మీరెడ్డి, మస్తాన్, రంగేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, సోమశేఖరరెడ్డి, రమేష్నాయుడు, సంజీవరాయుడు, లక్ష్మీదేవి, వెంకటరామిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, మల్లికార్జున, అశోక్రెడ్డి, పెద్దయ్య, ప్రసాద్రెడ్డి, భాస్కరరెడ్డి, రంగ, లక్ష్మీనాథరెడ్డి, తలారి శివయ్య తదితరులు పాల్గొన్నారు.


