breaking news
Anantapur Latest News
-
‘నువ్వు ఎవడివిరా నా మనిషిని బస్సులు ఫుల్ కాలేదని అడగటానికి’
గుత్తి: ఈ నెల 10న అనంతపురంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సభ గుత్తిలో టీడీపీ నేతల వర్గపోరుకు ఆజ్యం పోసింది. దమ్ముంటే రారా చూసుకుందామంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుని ప్రధాన రహదారిపైకి చేరుకుని గొడవకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా చేజారింది. ఉద్రిక్తతల నడుమ ఇరువర్గాలు చివరకు పోలీస్ స్టేషన్కు చేరుకుని పంచాయితీకి సిద్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గుత్తి పట్టణ టీడీపీ కన్వీనర్ ఎంకే చౌదరి, అదే పార్టీ నాయకుడిగా చెలామణి అవుతున్న జీఆర్పీ కానిస్టేబుల్ వాసు మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 10న సీఎం చంద్రబాబు సభకు జనాలను తరలించాలంటూ 24వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ శ్రీనాథ్కు ఎంకే చౌదరి మూడు బస్సులు కేటాయించాడు. అయితే జనాలు ఉత్సాహం చూపకపోవడంతో బస్సులు ఫుల్ కాలేదు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీనాథ్కు ఎంకే చౌదరిఫోన్ చేసి బస్సులు ఎందుకు ఫుల్ కాలేదని ఆరా తీయడంతో విషయాన్ని వెంటనే వాసు దృష్టికి శ్రీనాథ్ తీసుకెళ్లాడు. దీంతో ఎంకే చౌదరికి వాసు ఫోన్ చేసి ‘నువ్వు ఎవడివిరా నా మనిషిని బస్సులు ఫుల్ కాలేదని అడగటానికి’ అంటూ గద్దించాడు. దీనికి దీటుగానే ఎంకే చౌదరి కూడా స్పందించాడు. ఫోన్లోనే ఇరువురి మధ్య మాటల యుద్ధం సాగింది. అనంతరం ఇద్దరూ ఛాలెంజ్లు విసురుకుని ఎవరికి వారు అనుచరులతో కలసి ప్రధాన రహదారిపై ఉన్న జీపు స్టాండ్ వద్దకు చేరుకుని గొడవకు దిగారు. పరిస్థితి విషమిస్తుండడంతో స్థానికులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరువర్గాల అనుచరులు పెద్ద సంఖ్యలో పీఎస్ వద్ద గుమికూడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాసు తనను బెదిరించినట్లు ఎస్ఐ సురేష్కు ఎంకే చౌదరి ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. -
రేపు ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షలు
అనంతపురం అర్బన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 14న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ (ఎన్డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ (సీడీఎస్) పరీక్షలు జరగనున్నాయని డీఆర్ఓ మలోల తెలిపారు. రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 252 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై డీఆర్ఓ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో యూపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ ముఖేష్ దత్ మీనాతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఎస్సీ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జేఎన్టీయూ(ఏ) కేంద్రంలో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష మూడు సెషన్లుగా ఉదయం 9 నుంచి ఉదయం 11 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 12.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు పేపర్–2, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పేపర్–3 జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు 119 మంది హాజరవుతారని వెల్లడించారు. అనంతపురంలోని కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్ష రెండు సెషన్లుగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షలకు 133 మంది హాజరవుతారని తెలిపారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జేఎన్టీయూఏ కేంద్రానికి ఇన్స్పెక్టింగ్ అధికారిగా ఎస్డీసీ తిప్పేనాయక్, రూట్ అధికారిగా ఎస్డీసీ రామ్మోహన్, కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల కేంద్రానికి ఎస్డీసీ మల్లికార్జునుడు, రూట్ అధికారిగా మల్లికార్జునరెడ్డిని నియమించామని వెల్లడించారు. పరీక్ష సమయానికి గంట ముందే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాలని డీఆర్ఓ సూచించారు. -
పాలనలో ‘కూటమి’ సూపర్ ఫ్లాప్
● సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి రాయదుర్గం టౌన్: ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ అంటూ ప్రజలను మోసం చేయడాన్ని మానుకోవాలని, వాస్తవానికి పాలన చేతకాక సూపర్గా ఫ్లాప్ అయ్యారనే విషయాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు గుర్తించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శి రాజారెడ్డి హితవు పలికారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ స్థానిక ఇన్చార్జ్ నాగార్జున, జిల్లా కార్యవర్గ సభ్యుడు సంజీవప్ప, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొట్రేష్తో కలసి శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు వందకు పైగా హామీలిచ్చి.. అన్నీ అమలు చేశామంటూ సభల్లో గొప్పలకు పోవడం సిగ్గు చేటన్నారు. ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు ఆడబిడ్డ నిధి ఊసే మరిచారన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా తామే ఇచ్చినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి బారులు తీరుతూ అవస్థలు పడుతుంటే సూపర్ హిట్ సభలు పెట్టి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడలేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కార్మికులకు 8 గంటలు ఉన్న సమయాన్ని 10 గంటలు పెంచడం దుర్మార్గమైన చర్య అన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చిరుతల మల్లికార్జున, ఏఐఎస్ఎఫ్ కోశాధికారి ఆంజనేయులు, నరసింహులు, తిప్పేస్వామి, దుర్గప్ప, రవి, గంగాధర, నాగయ్య, కుమార్ తేజ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ మొదలైన దందా..
ఈ ఏడాది సీజన్ మొదలు కావడంతో ‘గూండా ట్యాక్స్ 2.0’ మొదలైంది. ఓ ట్రాన్స్పోర్ట్ యజమాని, ఓ మండీ యజమాని రంగంలోకి దిగారు. వీరి ఆధ్వర్యంలోనే వసూళ్లు చేస్తున్నారు. రోజూ సగటున 190 దాకా వాహనాలు లోడింగ్ అవుతున్నాయి. అంటే రోజూ ఆదాయం రూ. 3 లక్షలకు పైమాటే. పరిటాల కుటుంబం పేరు చెప్పుకుంటూ యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందుకోసం కొందరిని ప్రత్యేకంగా నియమించుకున్నారు. ఉదయం ఏ మండీకి ఏయే వాహనాలు వచ్చాయో స్లిప్పులు రాసుకుని సాయంత్రం ఆయా మండీల యజమానులకు చెబుతారు. స్లిప్పుల్లో లెక్కల ప్రకారం ఎన్ని వాహనాలు వెళ్లి ఉంటే అంత డబ్బు చెల్లించాలి. ఇదంతా బయ్యర్ల నుంచి వసూలు చేస్తున్నా...వారు రైతులపై మోపుతారని వాపోతున్నారు. ‘టమాట మండీమే అప్సీ ఏక్ గాడీకు దో హజార్ గూండా ట్యాక్స్ బర్నా’ అంటూ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాలకు చెందిన బయ్యర్లు చర్చించుకుంటున్నారు. కాగా ‘టమాట లారీ లోడింగ్ రిసీప్ట్, ‘టమాట మినీ లారీ లోడింగ్ రిసీప్ట్’ పేరుతో రశీదులు ఇస్తుండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎవరి కోసం, ఎందుకోసం వసూళ్లు చేస్తున్నారో అన్న వివరాలు లేకపోవడంతో మండిపడుతున్నారు. -
వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి భాస్కర్రెడ్డి మృతి
ఆత్మకూరు/ అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్రెడ్డి (70) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. తోపుదుర్తి భాస్కర్రెడ్డి అనంతపురంలో నివాసముంటూ ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామం వద్ద ఉన్న తన పొలంలో కూలీలతో పనులు చేయించేవారు. ఇదే క్రమంలో శుక్రవారం కూడా తన పొలంలో కూలీలతో పనులు చేయిస్తుండగా ఫోన్ రావడంతో కూలీల దగ్గర నుంచి పక్కకు వెళ్లారు. తర్వాత ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో పొలంలో పని చేసే వారు వెళ్లి చూడగా కిందపడి ఉన్నారు. వెంటనే అనంతపురంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్స అందించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు. భాస్కర్రెడ్డికి కుమారుడు, కుమార్తె సంతానం.అందరితో సన్నిహితంగా..తోపుదుర్తి భాస్కర్రెడ్డి 1987లో కాంగ్రెస్ నుంచి ఆత్మకూరు ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత డీసీసీ వైస్ ప్రెసిడెంట్గా కూడా పని చేశారు. ఆయన సతీమణి తోపుదుర్తి కవిత 2006లో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించాక దంపతులిద్దరూ జగన్ వెంట నడిచారు. రాజకీయాల్లో ఎలాంటి మచ్చ లేకుండా ఉన్న భాస్కర్రెడ్డి ప్రతి ఒక్కరితోనూ సన్నిహితంగా ఉండేవారు. అలాంటి వ్యక్తి ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.పలువురి నివాళితోపుదుర్తి భాస్కర్రెడ్డి మరణ వార్త వినగానే వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు, అభిమానులు అనంతపురంలోని నివాసం వద్దకు తరలివచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ రంగయ్య, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చందు, తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, తోపుదుర్తి నయనతారెడ్డి, గంగుల భానుమతి, రమేశ్గౌడ్, తదితరులు భాస్కర్రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. సంతాపం తెలిపిన వారిలో అనంతపురం మేయర్ వసీం, మాజీ మున్సిపల్ చైర్మన్ నూర్ మహమ్మద్, వైఎస్సార్ట్రేడ్ యూనియన్ నేత బెస్త రమణ, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు వడిత్య గోవిందునాయక్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్రెడ్డి, తెలుగు వర్సిటీ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ పెదారపు చెన్నారెడ్డి ఉన్నారు.రేపు అంత్యక్రియలుఅనంతపురం ఎడ్యుకేషన్: తోపుదుర్తి భాస్కర్రెడ్డి అంతిమయాత్ర ఆదివారం ఉదయం 8 గంటలకు అనంతపురంలోని రామచంద్రనగర్ ఇంటివద్ద నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి తెలిపారు. యాత్ర ఆత్మకూరు మండలం తోపుదుర్తి వరకు సాగుతుందని, అక్కడ ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు.భాస్కర్రెడ్డి భౌతికకాయానికి పూల మాల వేస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి -
ప్రమాదకరం.. విద్యార్థుల ప్రయాణం
శింగనమల: చిన్నపాటి వర్షం కురిస్తే చాలు శింగనమల మండలం తరిమెల – కల్లుమడి గ్రామాల మధ్య ఉన్న పులుసు వంక ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వంకపై బ్రిడ్జి ఎత్తు పెంచాలని పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరిమెల, కల్లుమడి గ్రామాల మధ్య రాకపోకలు సాగించాలంటే ఈ మార్గం తప్ప మరొకటి లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షానికి వంక బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని రోజులుగా విద్యార్థులు అతి కష్టంపై ప్రవాహాన్ని దాటుకుని పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి బ్రిడ్జి ఎత్తు పెంచేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు భాస్కర్, రామాంజనేయులు కోరుతున్నారు. -
ఓటమి.. భవిష్యత్తు గెలుపునకు నాంది
● రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల ప్రారంభోత్సవంలో వక్తలు బత్తలపల్లి: ఓటమి భవిష్యత్తు గెలుపునకు నాంది కావాలని, ఆ దిశగా ప్రతి క్రీడాకారుడు శ్రమించాలని వక్తలు పిలుపునిచ్చారు. బత్తలపల్లి మండలం రామాపురంలోని జెడ్పీహెచ్ఎస్ మైదానంలో రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల 10వ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులు పాటు ఈ పోటీలు జరగనున్నాయి. రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. అనంతరం జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో తూర్పు గోదావరి జిల్లా జట్టుపై ప్రకాశం జట్టు, విజయనగరం జట్టుపై అనంతపురం జట్టు విజయం సాధించాయి. అలాగే బాలికల విభాగంలో నెల్లూరుపై శ్రీకాకుళం జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్, మౌలిక వసతుల డైరెక్టర్ గోనుగుంట్ల విజయ్కుమార్, ధర్మవరం మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ అయ్యప్పనాయుడు, ప్రధానోపాధ్యాయులు వెంకటనాయుడు, రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ ప్రెసిడెంట్ విజయశంకర్రెడ్డి, చైర్మన్ వెంకట్రావు, జనరల్ సెక్రటరీ బాలాజి, డైట్ ప్రిన్సిపాల్ రామకృష్ణ, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య, జనరల్ సెక్రటరీ వెంకటేష్, ఫిజికల్ డైరెక్టర్ తలారి లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రోడ్డు పాలైన నవజాత శిశువు కళ్యాణదుర్గం: పేగు తెంచుకుని పుట్టిన ఆ ఆడబిడ్డ ఏ తల్లికి భారమైందో ఏమో.. తెలియదు కానీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన మరుక్షణమే రోడ్డు పక్కన ముళ్ల పొదల్లోకి చేరింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు వెంటనే చేరదీశారు. కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని ధర్మవరం రోడ్డులో ఉన్న గ్యాస్ గోడౌన్ సమీపంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సీఐ యువరాజ్, మహిళా కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని ఆరా తీశారు. శిశువును స్థానిక ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మీప్రసన్న, సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం ఆర్డీటీ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న నవజాత శిశువు ఆరోగ్యంపై స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు. -
పత్రికా స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యానికి గీటురాయి
ఏ దేశంలోనైనా పత్రికా స్వేచ్ఛ ఉందంటే అక్కడ ప్రజాస్వామ్యం ఉందని అర్థం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే భయపడుతున్నారు. అధికారంలో ఉన్న వాళ్లు ఆ స్థాయిలో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఏదో స్టేట్మెంట్ ప్రచురించారని కేసులు పెట్టడం దారుణం. ప్రజాస్వామ్యవాదులు పత్రికా సంకెళ్లు, అక్రమ కేసులను ఖండించాలి. ప్రభుత్వ దమననీతిపై ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యం కోసం పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – డాక్టర్ తలారి రంగయ్య, మాజీ ఎంపీ, అనంతపురం -
చిన్నారిని బలిగొన్న బాటిల్ మూత
గుత్తి రూరల్: వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని రక్షత్రామ్ (18 నెలలు) అనే చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన గుత్తి మండలం వన్నేదొడ్డి గ్రామ శివారులోని పవర్గ్రిడ్ కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం నగరానికి చెందిన మౌనిక పవర్గ్రిడ్ కేంద్రంలో ఏపీ ట్రాన్స్కో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం రాత్రి నైట్ షిఫ్ట్ డ్యూటీకి కుమారుడు రక్షత్రామ్ను తీసుకుని వెళ్లారు. కుమారుడు ఆడుకోవడానికి వాటర్ బాటిల్ ఇచ్చి విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో బాటిల్ మూత తీసి మింగడానికి ప్రయత్నించడంతో గొంతులో ఇరుక్కుని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన ఏడీఈ, పవర్గ్రిడ్ ఉద్యోగులు వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుమారుడి మృతితో తల్లి మౌనిక కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
యూరియా లారీలను అడ్డుకున్న రైతులు
బొమ్మనహాళ్: తమ గ్రామానికి యూరియా సరఫరా కావడం లేదంటూ శుక్రవారం రాత్రి ఉప్పరహాళ్కు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. శ్రీధరఘట్ట సొసైటీకి యూరియాను తరలిస్తున్న లారీలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి చెందిన రైతులకు ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు... శుక్రవారం శ్రీధరఘట్ట సొసైటీకి ఒక లారీ, సింగానహళ్లి గ్రామంలో ఓ ప్రైవేట్ డీలర్కు మరో లారీలో యూరియ బస్తాలు తరలిస్తున్న విషయం తెలుసుకున్న ఉప్పరహాళ్ గ్రామ రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. దీంతో రెండు లారీలను గ్రామంలో అడ్డుకున్నారు. శనివారం ఉదయం గ్రామంలో యూరియాను గ్రామంలోని రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరసూల్, సిబ్బందితో కలసి ఉప్పరహాళ్ గ్రామానికి చేరుకుని రైతులతో చర్చించారు. తమ గ్రామానికి చెందిన రైతులకు ఇప్పటి వరకూ ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదని, తాము పంటలు సాగు చేయడం లేదా అని ప్రశ్నించారు. రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లితే శ్రీధరఘట్ట గ్రామానికి చెందిన రైతులకు మాత్రమే ఇచ్చారన్నారు. ఈ లారీల్లో ఉండే యూరియా బస్తాలను ఇక్కడే ఇవ్వాలని అని డిమాండ్ చేశారు. దీంతో వ్యవసాయ, రెవెన్యూ, సొసైటీ అధికారులతో ఎస్ఐ నబీరసూల్ మాట్లాడి ఉప్పరహాళ్ గ్రామానికి ఒక లారీ యూరియా కేటాయిస్తూ ఇక్కడే పంపిణీ చేయాలని సూచించారు. ఈ లారీలు ఇక్కడి నుంచి శ్రీధరఘట్ట సొసైటీకి వెళ్లాలంటే ఉప్పరహాళ్ రైతులకు హామీ ఇస్తేనే లారీలను పంపిస్తారని, లేకపోతే పరిస్థితి చెయ్యి దాటుతుందని హెచ్చరించారు. దీంతో ఉప్పరహాళ్ గ్రామానికి ప్రత్యేకంగా లారీ యూరియా పంపిణీ చేస్తామని అధికారులు హామీనివ్వడంతో రైతులు శాంతించారు. -
వివాహిత ఆత్మహత్య
రాయదుర్గం టౌన్: మండలంలోని పల్లేపల్లికి చెందిన వివాహిత చాముండి(22) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. పల్లేపల్లిలో నివాసముంటున్న నాగమ్మకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు కాగా, రెండో కుమార్తె చాముండికి ఏడాదిన్నర క్రితం కర్ణాటకలోని బళ్లారి జిల్లా కురుగోడుకు చెందిన చిరంజీవితో వివాహమైంది. చిన్నపాటి విషయానికి భార్యతో గొడవపడేవాడు. అనుమానంతో ఆమెను వేధింపులకు గురిచేస్తుండేవాడు. ప్రస్తుతం చాముండి నాలుగు నెలల గర్భిణి. అనారోగ్యంతో బాధపడుతున్న తన అక్కను చూసేందుకు పది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అనంతరం రెండు రోజుల క్రితం భర్త అత్తింటికి చేరుకున్నాడు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. అనుమానంతో ఆమెను దూషించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చాముండి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ● భర్త వేధింపులే కారణం -
జాతీయ స్థాయి వర్సిటీ పోటీల్లో సత్తా చాటాలి
● స్పోర్ట్స్ కౌన్సిల్ సమావేశంలో జేఎన్టీయూ వీసీ సుదర్శనరావు అనంతపురం: దక్షిణ భారతదేశ అంతర వర్సిటీ, జాతీయ స్థాయి పోటీల్లో జేఎన్టీయూ(ఏ) విద్యార్థులు సత్తా చాటాలని ఆ వర్సిటీ వీసీ హెచ్.సుదర్శనరావు పిలుపునిచ్చారు. జేఎన్టీయూ (ఏ)లో గురువారం నిర్వహించిన 16వ స్పోర్ట్స్ కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి, మాట్లాడారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ క్రీడలను నిర్వహించే కాలేజీలను ,క్రీడాభివృద్ధికి సంబంధించిన అంశాలను స్పోర్ట్స్ కౌన్సిల్కు వివరించారు. జాతీయ, దక్షిణ భారత అంతర వర్సిటీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు వర్సిటీ తరపున తగిన ఆర్థిక చేయూతనందిస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్టార్ ఎస్.కృష్ణయ్య, డీఏపీ ఎస్వీ సత్యనారాయణ, డీఈ వి.నాగప్రసాదనాయుడు, ఓటీపీఆర్ఐ డైరెక్టర్ సుబ్బారెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి, పులివెందుల కళాశాల ప్రిన్సిపాల్ డి. విష్ణువర్ధన్, ఫిజికల్ డైరెక్టర్ బి.జోజిరెడ్డి, జేఎన్టీయూ స్పోర్ట్స్ సెక్రెటరీ డాక్టర్ టి.నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దు చేయాలి
తాడిపత్రిటౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హమీలను నెరవేర్చలేదంటూ ఏపీటీఎఫ్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ మోసాన్ని నిరసిస్తూ తాడిపత్రిలోని పురపాలక పాఠశాలలో గురువారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి వెంటనే పాత పెన్సన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. 12వ పీఆర్సీని నియమించి వెంటనే ఐఆర్ ప్రకటించాలన్నారు. అన్ని రకాల బకాయిలు చెల్లించాలన్నారు. ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలన్నారు. యాప్లను, అసెస్మెంట్ బుక్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు జయచంద్ర, సుధాకర్రావు, రంగనాథ, లీలావతి, మల్లికార్జున, ఉపేంద్రం, జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్యారమ్స్ ఆడుతుండగా గొడవ.. ముగ్గురికి గాయాలు
గుత్తి రూరల్: క్యారమ్ బోర్డు ఆడుతూ గురువారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తి మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన కంబయ్య, రాజు, సుధాకర్ గ్రామ శివారులోని టీ కేఫ్ వద్ద రోజూ చెట్నేపల్లికి చెందిన మౌలి, రాజేష్, రామాంజి, బాలు, రమేష్, శేఖర్తో కలసి క్యారమ్ బోర్డు ఆడేవారు. ఈ క్రమంలో గురువారం కాయిన్ వేసే విషయంలో గొడవ చోటు చేసుకుంది. చెట్నేపల్లి యువకులు సోడా సీసాలు, రాళ్లు, కర్రలతో దాడులు చేయగా బసినేపల్లి కంబయ్య, రాజు, సుధాకర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కంబయ్యను మెరుగైన చికిత్స కోసం స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.చింతలరాయుడి హుండీ ఆదాయం రూ.8.75 లక్షలుతాడిపత్రి రూరల్: స్థానిక చింతల వేంకటరమణస్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు చేపట్టారు. గత ఏడాది నవంబర్ 28 నుంచి ఈ నెల 11వ తేదీ వరకు హుండీ ద్వారా రూ.8,75,824 భక్తులు కానుకల రూపంలో అందజేసినట్లు ఆలయ ఈఓ రామాంజనేయులు తెలిపారు.చాంపియన్ షిప్ దక్కించుకున్న మధ్యప్రదేశ్ జట్టు అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–19 ఇన్విటేషన్ కప్ క్రికెట్ టోర్నీ చాంపియన్ షిప్ను మధ్యప్రదేశ్ జట్టు దక్కించుకుంది. బరోడా జట్టు రన్నరప్గా నిలిచింది. గురువారం జరగాల్సిన మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన మధ్యప్రదేశ్ జట్టును విజేతగా నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ భారత క్రికెటర్ జాకబ్ మార్టిన్, జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పీఎల్ ప్రకాష్రెడ్డి, కార్యదర్శి వి. భీమలింగారెడ్డి, సంయుక్త కార్యదర్శి మురళీకృష్ణ, కోచ్లు చిన్నబాబు, పి.శర్మాస్వలి, కె.నరేష్, ఆర్.కుమార్, కె.ఇనాయతుల్లా, ఆర్.ప్రవీణ్, భార్గవ్, శంకర్ ధావన్ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ సరికాదు
● ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన అనంతపురం ఎడ్యుకేషన్: మెడికల్ కళాశాలలను ప్రైవేట్కు ధారదత్తం చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను రాష్ట్ర ప్రభుత్వం దూరం చేస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గిరి, కార్యదర్శి ఓతూరు పరమేష్ మండిపడ్డారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం అనంతపురంలోని టవర్క్లాక్ కూడలిలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలో విద్యారంగంలో నెలకొన్న ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదన్నారు. దీనికి తోడు కొత్త సమస్యలను సృష్టించడమే లక్ష్యంగా కూటమి సర్కారు పాలన సాగిస్తోందన్నారు. నీట్ విధానం తమ రాష్ట్రానికి వద్దంటూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసుకుని కేంద్రంతో పోరాటం సాగిస్తుంటే ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం నీట్కు వ్యతిరేకంగా పోరాటం సాగించకుండా మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి శివ, నాగభూషణ, సోము, విజయ్, జయ, శశి కుమార్, సాయి పాల్గొన్నారు. బస్సును ఢీకొన్న కారు బుక్కరాయసముద్రం: మండలంలోని బాట్లో కొత్తపల్లి గ్రామం సమీపంలో నిలబడి ఉన్న బస్సును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. శింగనమల మండలం తరిమెల పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా పని చేస్తున్న అక్తర్జాన్, మరో ఉపాధ్యాయుడు, అదే మండలంలోని ఆనందరావు పేట పాఠశాలలో పని చేస్తున్న మరో ఇద్దరు ఉపాధ్యాయులు కారులో పాఠశాలకు వెళుతుండగా లోలూరు వద్ద నిలబడి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ప్రమాదంలో అత్తర్జాన్కు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయండి ● సాంఘిక సంక్షేమశాఖ డీడీ కుష్బూకొఠారి అనంతపురం రూరల్: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకానికి సంబంధించి విద్యార్థుల వివరాల రిజిస్ట్రేన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ (ఇన్చార్జ్) కుష్బూకొఠారి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ విద్యార్థులకు పోస్ట్మెట్రిక్ స్కాలర్ షిప్ అందించాలంటే విద్యార్థుల వివరాలను వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. కళాశాల యాజమాన్యాలు, సచివాలయ సిబ్బంది విద్యార్థుల వివరాలను వెంటనే జ్ఞానభూమి లాగిన్లో నమోదు చేయాలన్నారు. -
జక్కల ఆదిశేషుకు కన్నీటి వీడ్కోలు
తనకల్లు: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, నల్లమాడ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు జక్కల ఆదిశేషు అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం బొంతలపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. కాగా, బొంతలపల్లికి గురువారం కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహమ్మద్ చేరుకుని జక్కల ఆదిశేషు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జక్కల ఆదిశేషు భార్య జెడ్పీటీసీ సభ్యురాలు జక్కల జ్యోతి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, మాజీ ఎమ్మెల్యేలు దేశాయి తిప్పారెడ్డి, డాక్టర్ సిద్దారెడ్డి, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ అశోక్రెడ్డి, ఉపాధ్యక్షుడు ముస్తఫా, పలువురు జిల్లా నాయకులు, మండల కమిటీ సభ్యులు తదితరులు జక్కల ఆదిశేషు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘అనంత’ నేతల నివాళి జక్కల ఆదిశేషు మృతదేహాన్ని గురువారం వైఎస్సార్సీపీ రాస్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, పార్టీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, అనంతపురం జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు అమరనాతరెడ్డి, గౌడ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కల లక్ష్మీనరసింహగౌడ్, బీసీ సంఘం ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సంపంగి గోవర్ధన్, కదిరి సాయి, జై గౌడ రాష్ట్ర నాయకులు రాజ్కుమార్, వాల్మీకి అంజి, పవన్, బెస్త వెంకటేష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
రైతులకు మార్కెటింగ్ వసతి కల్పిస్తాం
రాప్తాడు: బత్తాయి, అరటి పంటలకు సరైన మార్కెటింగ్ వసతి, మెరుగైన ధర కల్పించి రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు అన్నారు. రాప్తాడు మండలం మరూరులో గురువారం ఆయన పర్యటించి బత్తాయి, అరటి పంటలను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. బత్తాయి, అరటి పంటల సాగుకు రూ.లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ క్రమంలో పంట ఉత్పత్తులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేక నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలాల్లోనే పంటను వదిలేయాల్సి వస్తోందన్నారు. బత్తాయి, అరటి రైతులకు మార్కెటింగ్ వసతితో పాటు మెరుగైన ధర కల్పిస్తామంటూ శ్రీనివాసులు భరోసానిచ్చారు. వివిధ ఉద్యాన పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారులు ఉమాదేవి, చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, ఏపీడీ ధనుంజయ, ఏడీ దేవానంద్, పాల్గొన్నారు.చాబాలలో క్షుద్రపూజల కలకలంవజ్రకరూరు: మండలంలోని చాబాలలో గురువారం క్షుద్రపూజల కలకలం రేగింది. గాలిమరలకు వెళ్లేదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. మధ్యాహ్నం అటుగా వెళ్తున్న గొర్రెల కాపరులు చూసి గ్రామస్తులకు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
‘సూపర్ ఎస్కేప్’ అయ్యారు
● ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఉరవకొండ: సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన సూపర్ సిక్స్ సభలో అవాస్తవాలతో ప్రజలను మభ్య పెట్టి సూపర్ ఎస్కేప్ అయ్యారని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 50 సంవత్సరాల వాళ్లకు పింఛన్ లేదు, వికలాంగుల పింఛన్ తొలగించటం, అర్హత గల కొత్త పింఛన్లు మంజూరు చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గత సంవత్సరం 66.34 లక్షలు ఉన్న పింఛన్లను 6192లక్షలకు తగ్గించారన్నారు. తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ఇప్పటికీ వారి ఖాతాలో నగదు జమ కాలేదని, ఆడ బిడ్డ నిధి లేదని, నిరుద్యోగ భృతి ఊసే లేదని ప్రభుత్వానికి గుర్తు చేశారు. రెండు నెలలుగా యూరియా కోసం రైతులు నానాయాతలు పడుతున్నా పట్టించుకోకుండా సంబరాలు నిర్వహించుకోవడం సిగ్గు చేటన్నారు. విశ్వకర్మ యోజనకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం రూరల్: విశ్వకర్మ యోజన కింద అందించే రుణాలకు ఉమ్మడి జిల్లాలోని ముస్లిం, దూదేకుల, క్రిస్టియన్ మైనార్టీల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్ ఈడీ జగన్మోహన్రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. చేతివృత్తిదారులు, స్వర్ణకారులు, కార్పెంటర్లు, శిల్ప కళాకారులు, కొలిమి.. బుట్టలు.. చాపలు.. పరకలు అల్లేవారు, చెప్పులు కుట్టేవారు, రజక, కుమ్మరి, టైలర్లు, తాపీ కార్మికులు, బార్బర్లు, రాళ్లు కొట్టువారు, బొమ్మలు, పూలదండలు, తాళాలు తయారీదారులు అర్హులు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తారు. రుణాలు పొందిన వారు 5 శాతం వడ్డీతో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. గత ఐదేళ్లలో పీఎంఈజీపీ, సీఎం స్వానిధి, ముద్రా రుణాలు పొందిన వారికి ఈ పథకం వర్తించదు. www.pmvishwakarma.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గుత్తి కొండను కమ్మేసిన పొగమంచు గుత్తి: పొగ మంచు చుట్టేయడంతో గురువారం ఉదయం గుత్తి కొండ కనిపించకుండా పోయింది. జనాలు ఎంతో ఆసక్తిగా ఈ దృశ్యాన్ని తిలకించారు. ఓ వైపు వర్షం, మరో వైపు మంచు కారణంగా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. -
ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట
● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం సిటీ: ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. జెడ్పీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి సెప్టెంబర్లోనే ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ప్యానల్ రూపొందించిన నేపథ్యంలో గిరిజమ్మతో పాటు సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ సుబ్బయ్యను జెడ్పీ ఉద్యోగులు గురువారం ఘనంగా సన్మానించారు. ఏఓలు విజయభాస్కర్రెడ్డి, రత్నాబాయి, శ్రీవాణి, షబ్బీర్ నియాజ్, మహబూబ్ వలి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. గిరిజమ్మను కలిసిన పీఆర్ ఎస్ఈ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మను పంచాయతీరాజ్ రాయలసీమ సర్కిల్ కార్యాలయ సూపరింటెండెంట్(ఎస్ఈ) వై.చిన్నసుబ్బరాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పల్నాడులో పని చేస్తూ పదోన్నతిపై అనంతపురం ఎస్ఈగా వచ్చిన ఆయన.. జిల్లా పరిషత్ కార్యాలయంలోని చాంబర్లో చైర్పర్సన్ కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఆయనకు గిరిజమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం సబ్ డివిజన్–1, 2 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు లక్ష్మీనారాయణ, కృష్ణజ్యోతి పాల్గొన్నారు. -
జిల్లా నూతన కలెక్టర్గా ఆనంద్
అనంతపురం అర్బన్: జిల్లా నూతన కలెక్టర్గా ఓ.ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ కలెక్టర్గా ఉన్న వి.వినోద్కుమార్ను బాపట్ల కలెక్టర్గా నియమించారు. ఓ.ఆనంద్ ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఉన్నారు. 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆనంద్ గూడూరు సబ్ కలెక్టర్గా 2018 అక్టోబరు నుంచి 2019 ఆగస్టు వరకు పనిచేశారు. 2019 ఆగస్టు నుంచి 2022 ఏప్రిల్ వరకు పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2022 జూలై నుంచి 2022 అక్టోబరు వరకు పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా పనిచేశారు. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ వరకు పార్వతీపురం జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 జూలై వరకు విశాఖపట్నం వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్గా పనిచేశారు. 2025 సెప్టెంబర్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు.బాపట్ల కలెక్టర్గా వినోద్కుమార్బాపట్ల జిల్లా కలెక్టర్గా వినోద్కుమార్ నియమితులయ్యారు. ఎన్నికల సమయంలో ఇక్కడ కలెక్టర్గా ఉన్న ఎం.గౌతమిని బదిలీ చేస్తూ వినోద్కుమార్ను నియమించారు. 2024 ఏప్రిల్ 4వ తేదీన కలెక్టర్గా వినోద్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడాదిన్నర కాలం జిల్లాలో పనిచేశారు.డీఎఫ్ఓ విగ్నేష్ అప్పావు బదిలీఅనంతపురం సెంట్రల్: జిల్లా అటవీశాఖ అధికారి విగ్నేష్ అప్పావు బదిలీ అయ్యారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా డీఎఫ్ఓ విగ్నేష్ అప్పావును ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్) డిప్యూటీ డైరెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో జిల్లా అటవీశాఖ అధికారిగా ఎవరినీ నియమించలేదు. తాత్కాలికంగా శ్రీ సత్యసాయి జిల్లా డీఎఫ్ఓ చక్రపాణికి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.సూపర్ సిక్స్ సభకు వెళ్లిన వ్యక్తి అదృశ్యంబొమ్మనహాళ్: అనంతపురంలో బుధవారం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సూపర్ సిక్స్ సభకు వెళ్లిన బొమ్మనహాళ్ మండలం కురువల్లి గ్రామానికి చెందిన సురేష్ కనిపించకుండా పోయాడు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. బుధవారం ఉదయం 10 గంటలకు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన బస్సులో అనంతపురానికి వెళ్లిన ఆయన.. తిరిగి ఇంటికి చేరుకోలేదు. గురువారం కూడా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులకు ఆందోళనతో బొమ్మనహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్ఐ నబీరసూల్ మాట్లాడుతూ.. సురేష్ తప్పిపోయినట్లుగా తమ దృష్టికి వచ్చిందని, అయితే అనంతపురం పరిధిలోని అంశం కావడంతో అక్కడి పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
అనంతపురం కార్పొరేషన్: ‘47 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏనాడూ రాయలసీమకు న్యాయం చేయలేదు. విభజన హామీల్లో భాగంగా జిల్లాకు కేటాయించిన ఎయిమ్స్ను మంగళగిరికి తరలించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చీ రాగానే జీఓ తీసుకువచ్చి అడ్డుకున్నారు. హంద్రీ–నీవాను శంకుస్థాపనలకే పరిమితం చేసి సీమకు తీరని అన్యాయం చేశారు. అసలైన రాయలసీమ ద్రోహి చంద్రబాబు’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీ–నీవాను 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు చంద్రబాబు కుదించారని, 1995–2004 వరకు సీఎంగా ఉన్న ఆయన హంద్రీ–నీవా, గాలేరు నగరి పనులు కనీసం 50 శాతం పూర్తి చేసి ఉన్నా ఈ రోజున నికర జలాలు అందేవన్నారు. వైఎస్సార్తోనే ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ.. జిల్లా సస్యశ్యామలంగా ఉందంటే అది దివంగత నేత వైఎస్సార్ కృషితోనే సాధ్యమైందని, ఆయన హయాంలోనే ప్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా మారిందని ‘అనంత’ చెప్పారు. వైఎస్సార్ హయాంలో హంద్రీ–నీవా ప్రాజెక్టును 40 టీఎంసీలుగా మార్చి 90 శాతం పనులు పూర్తి చేశారన్నారు. 2012 నుంచి జిల్లాకు హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయన్నారు. జీడిపల్లి, గొల్లపల్లి, శ్రీనివాసపురం, అడివిపల్లి రిజర్వాయర్లను నిర్మించిన ఘనత వైఎస్సార్ దేనని గుర్తు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం అనంతపురం సభలో నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడారన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ రూపొందించి పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. జిల్లాలో బీటీపీ, పేరూరు, మడకశిర బ్రాంచ్ కెనాళ్లపై నిర్దిష్టమైన హామీని ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. హంద్రీ–నీవా లైనింగ్ పనులను ఆగమేఘాలపై పూర్తి చేసి జిల్లా రైతుల పొట్టకొట్టారన్నారు. ఆ వేగంతోనే జిల్లాలో నీటి ప్రాజెక్ట్లను పూర్తి చేస్తానని ఎందుకు చెప్పలేకపోయారని నిలదీశారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని కించపరిస్తే మాట్లాడరా? ‘మహిళలకు అన్యాయం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. కానీ, ఇటీవల స్వయానా ఆయన సోదరి, ఆయన శ్రీమతికి వదిన, దివంగత ఎన్టీఆర్ కోడలు, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని వారి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కించపరిస్తే బాబు ఒక్క మాట మాట్లాడలేదు. ప్రశ్నిస్తే రైల్వే ట్రాక్పై పడుకోబెడతామని, అనుమతి లేకుండా నియోజకవర్గాల్లోకి అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించిన వారి గురించి కూడా ఎందుకు మాట్లాడలేదో చెప్పాలి’ అని అనంత అన్నారు. 50 ఏళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ విషయంలో జిల్లాకు చెందిన ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడలేదని, పెనుకొండ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పెనుకొండ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలోకి తీసుకొస్తున్న విషయంపై మంత్రి సవిత మాట్లాడకుండా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. సమావేశంలో మేయర్ వసీం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివరామిరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, కార్పొరేటర్లు శ్రీనివాసులు, చంద్రమోహన్రెడ్డి, నాయకులు పుల్లయ్య, జానీ, సాకే కుళ్లాయస్వామి, రామచంద్ర దితరులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా సీమను వంచించిన ఘనుడు అలాంటి వ్యక్తి రతనాల సీమ అంటే ప్రజలు ఎలా నమ్ముతారు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించినా చర్యల్లేవ్ ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ, పెనుకొండ వైద్య కళాశాల ప్రైవేటీకరణపై ప్రజాప్రతినిధులు మాట్లాడరా? వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత మండిపాటు -
యల్లనూరులో కుండపోత
● జిల్లావ్యాప్తంగా ఒకే రోజు 47.6 మి.మీ వర్షపాతం ● 120 హెక్టార్లలో పంట నష్టం అనంతపురం అగ్రికల్చర్: జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది. అత్యధికంగా యల్లనూరు మండలంలో 106.4 మి.మీ వర్షపాతం నమో దైంది. 31 మండలాల పరిధిలో ఒకే రోజు ఏకంగా 47.6 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. యల్లనూరు తర్వాత కణేకల్లు 94 మి.మీ, ఉరవకొండ 90.2, పామిడి 88.6, గుత్తి 86.2, విడపనకల్లు 79, రాప్తాడు 78.4, వజ్రకరూరు 77.8, గుంతకల్లు 74.2 మి.మీ భారీ వర్షం కురిసింది. అలాగే నార్పల 64.6 మి.మీ, పుట్లూరు 60.2, యాడికి 57.2, కళ్యాణదుర్గం 50.2, పెద్దవడుగూరు 47, బుక్కరాయసముద్రం 45, తాడిపత్రి 44.2, గార్లదిన్నె 43.4, డీ హీరేహాళ్ 37.2, అనంతపురం 36, పెద్దపప్పూరు 31.8, ఆత్మకూరు 30.2 మి.మీ నమోదైంది. మిగతా మండలాల్లో కూడా జడితో కూడిన మోస్తరు వర్షం కురిసింది. గురువారం పగలంతా కూడా తేలికపాటి జడి కురిసింది. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 110.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 60.8 మి.మీ నమోదైంది. 22 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కాగా 19 మండలాల్లో సాధారణం కన్నా అధికంగానూ, 10 మండలాల్లో సాధారణం, రెండు మండలాల్లో మాత్రమే సాధారణం కన్నా తక్కువగా వర్షం కురిసింది. భారీ వర్షాలు కురిసిన తాడిపత్రి, ఉరవకొండ డివిజన్ల పరిధిలో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. జలపాతాలు కళ సంతరించుకున్నాయి. 120 హెక్టార్లలో పంట నష్టం భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 120 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 100 హెక్టార్లలో వరి, వేరుశనగ దెబ్బతినడంతో రూ.25 లక్షలకు పైగా నష్టం జరిగిందన్నారు. టమాట, నర్సరీలు, ఇతర ఉద్యాన పంటలు 50 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. -
పేరుకే 100 .. ఉండేది 50 !
రాయదుర్గం: స్థానిక ఏరియా ఆస్పత్రిని సమస్యలు నీడలా వెన్నాడుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2021లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసింది. రూ.17 కోట్ల వ్యయంతో భవన నిర్మాణ పనులు చేపట్టారు. రెండేళ్ల పాటు పనులు చకచక సాగాయి. దాదాపు 85 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఎన్నికల కోడ్ అడ్డురావడం... ఆ తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పనులు పూర్తిగా పడకేశాయి. దీంతో పేరుకే 100 పడకలైనా 50 పడకలతోనే సర్దుకోవాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఒకే బెడ్డుపై ముగ్గురు రాయదుర్గం మండల వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభించాయి. ఈ నేపథ్యంలో ఏరియా ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. సాధారణ రోజుల్లో 500 నుంచి 600 నమోదయ్యే ఓపీ.. ప్రస్తుతం800 నుంచి వెయ్యికి పైగా ఉంటోంది. రోగులను అడ్మిట్ చేస్తే ఒకే బెడ్డుపై ఇద్దరు లేదా ముగ్గురిని ఉంచాల్సి వస్తోంది. సౌకర్యాలు లేక రోగుల సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరుబయట నిద్రిస్తే దోమల ఉధృతి కారణంగా మరుసటి రోజే అస్వస్థతకు గురవ్వాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల్లేక ఇబ్బంది సరిపడ వైద్యులు, సిబ్బందిలేక అత్యవసర విభాగాలతో పాటు ఓపీ సేవల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. 23 మంది వైద్యులు ఉండాల్సిన ఈ ఆస్పత్రిలో కేవలం 10 మందితోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ఓపీ వేళల్లో వైద్యులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. నర్సింగ్, ఇతర విభాగాల్లో 73 మంది ఉండాలి. కేవలం 20 మంది మాత్రమే ఉంటున్నారు. రోజు వెయ్యి మంది రోగులు ఓపీ సేవలను అందుకుంటున్నారు. ఆగిన రాయదుర్గం ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణంఒక బెడ్డుపై ఇద్దరు ముగ్గురు సర్దుకుంటున్న రోగులు ఏళ్లుగా సాగుతున్న వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులు రాయదుర్గం ఏరియా ఆస్పత్రిని వీడని సమస్యలు పట్టించుకోని కూటమి సర్కారుఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమే. రోగులకు ఇబ్బంది కలగకుండా వైద్యం అందిస్తున్నాం. నూతన ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తి చేసేలా కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకొస్తాం. కొత్త ఆస్పత్రి ప్రారంభమైతే మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ మెర్సీ జ్ఞానసుధ, ఆస్పత్రి సూపరింటెండెంట్, రాయదుర్గంవైద్యులను నియమించాలి రాయదుర్గం ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. వెంటనే వైద్యులను నియమించాలి. గత ప్రభుత్వంలో 100 పడకల ఆస్పత్రిగా అప్డేట్ చేశారు. రూ.17 కోట్లతో నూతన భవనం నిర్మాణ పనులు చేపట్టారు. 85 శాతం పనులు పూర్తయాయి. మిగిలిన 15 శాతం పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. – గోనబావి లుబ్నగజాల, కౌన్సిలర్, రాయదుర్గంఒక్కో బెడ్డుపై ఇద్దరు పేరుకే వంద పడకల ఆస్పత్రి. ఇక్కడ ఒక్కో బెడ్డుకు ఇద్దరు, ముగ్గురిని కేటాయించి చికిత్స చేస్తున్నారు. నూతన ఆస్పత్రి భవన నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా 50 పడకలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. – కొట్రేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు, రాయదుర్గం -
ఉపాధి పనులు లేవు
మూడు వారాల కూలి రావాలివ్యవసాయ సీజన్ అని చెప్పి గ్రామంలో మూడు నెలలుగా ఉపాధి పనులు కల్పించ లేదు. కనీసం వ్యవసాయ కూలి పనులతోనైనా నెట్టుకొద్దామంటే ఆ పనులూ అరకొరగానే ఉన్నాయి. వారంలో రెండు రోజులు పనికి వెళ్తే మిగిలిన ఐదు రోజులూ ఇంటి వద్దనే ఖాళీగా ఉండాల్సి వస్తోంది. దీంతో కుటుంబాలతో కలసి కొడుకులు వలస పోయారు. ఉన్న దాంట్లోనే ఓ పూట తిని, మరో పూట పస్తులుంటున్నాం. – భీమా నాయక్, నక్కనదొడ్డి తండా ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సంబంధించి మూడు వారాల కూలి ఇప్పటి వరకూ ఇవ్వలేదు. దీనికి తోడు మూడు నెలలుగా పనులు ఆపేశారు. వర్షాలు లేక వ్యవసాయ పనులూ లేకుండాపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఊరి వదిలి వెళ్లకతప్పలేదు. – సాలమ్మ, నక్కనదొడ్డి తండా పనులు నిలిపిన మాట వాస్తవం వ్యవసాయ సీజన్ కారణంగా ఉపాధి పనులు నిలిపిన మాట వాస్తవం. ఉపాధి పనులకు గ్రామస్తులు హాజరయ్యేలా ఉంటే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా డిమాండ్ పెట్టిస్తే వెంటనే పనులు కల్పిస్తాం. – కృష్ణమూర్తి, ఏపీఓ, డ్వామా -
మాయ చేయడం బాబుకు కొత్తేమీ కాదు
● మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య కళ్యాణదుర్గం: జనాలను మాయ చేయడం సీఎం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అంటూ సూపర్ మోసం సభను నిర్వహించారంటూ వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య విమర్శించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన తర్వాత ఏడాది పాటు పథకాలు ఎగ్గొట్టి అన్ని పథకాలు ఇచ్చామంటూ మోస చేశారన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో మొదటి పథకమైన ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ హామీ ఇప్పటి వరకూ నెరవేర్చలేదన్నారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి వందల కిలోమీటర్లు దూరంలో ఉన్న తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు తరలించుకెళ్లడంపై ఉన్న శ్రద్ధ, జీడిపల్లికి కూతవేటు దూరంలో ఉన్న బీటీపీకి నీళ్లిచ్చే విషయంలో ఏమైందని ప్రశ్నించారు. జిల్లా ప్రజలకు కల్పతరువుగా ఉన్న ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోయారని నిలదీశారు. ప్రజలను మాయ చేసేందుకే సభల పేరుతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం సిగ్గుచేటన్నారు. పాముకాటుతో యువకుడి మృతి ● పైళ్లెన నాలుగు నెలలకే విషాదం బొమ్మనహాళ్: పాముకాటుతో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు.. బొమ్మనహాళ్ మండలంలోని లింగదహాళ్ గ్రామానికి చెందిన కృష్ణమ్మ, తిప్పేస్వామి దంపతుల కుమారుడు రంజిత్ (22)కు నాలుగు నెలల క్రితం కర్ణాటకలోని కమ్మరచేడు గ్రామానికి చెందిన మహాలక్ష్మితో వివాహమైంది. దానిమ్మ చెట్ల కటింగ్తో జీవనం కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం అనంతపురం సమీపంలోని ఓ తోటలో దానిమ్మ చెట్ల కటింగ్ చేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. దీంతో అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స అనంతరం స్వగ్రామానికి వచ్చిన తర్వాత నాటు వైద్యం చేయించుకున్నాడు. మంగళవారం పరిస్ధితి విషమించడంతో బళ్లారిలోని ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బెల్టు షాపు సీజ్
తాడిపత్రి టౌన్: మండలంలోని గంగాదేవిపల్లి సమీపంలో ఉన్న ఇగుడూరు గంగమ్మ ఆలయం వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన బెల్టు షాపును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఆలయ సమీపంలో షెడ్డు వేసి అక్రమంగా మద్యం విక్రయాలు చేపట్టిన అంశంపై ఈ నెల 10న ‘ఆలయ ప్రతిష్ట గంగ పాలు’ శీర్షికన ‘సాక్షి’లో వెలువడిన కథనానికి ఎక్సైజ్ సీఐ నాయుడు స్పందించారు. సిబ్బందితో కలసి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బెల్టు షాప్ తెరిచి మద్యం విక్రయిస్తున్నట్లుగా గుర్తించి 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. షెడ్డును సీజ్ చేశారు. నిందితుడు సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. అలాగే తాడిపత్రిలోని పాతకోట, వాహిని థియేటర్ సమీపంలో టున్న కల్లు దుకాణాల్లో నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపారు.యువకుడి ఆత్మహత్యపెద్దవడుగూరు: స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ప్రకాష్ (19 ) ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం పురుగుల మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడు. కాగా, ప్రకాష్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.చాంపియన్ షిప్కు అడుగు దూరంలో మధ్యప్రదేశ్అనంతపురం : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–19 ఇన్విటేషన్ టోర్నీలో చాంపియన్ షిప్ దక్కించుకునేందుకు అడుగు దూరంలో మధ్యప్రదేశ్ జట్టు నిలిచింది. ఆర్డీటీ క్రీడా మైదానంలో బుధవారం జరిగిన మ్యాచ్ల్లో మధ్యప్రదేశ్, బరోడా జట్లు విజయం సాధించాయి.ఆంధ్రా ప్రెసిడెంట్ – మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ను ఎంపిక చేసుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. హర్షిత్ దూబే 133 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 136 పరుగులు సాదించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆంధ్రా ప్రెసిడెంట్ జట్టు 24.3 ఓవర్ల వద్ద 154 పరుగులకే చతికిల పడింది. కోగటం హనీష్ వీరారెడ్డి కేవలం 27 బంతుల్లో 8 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 63 పరుగులు సాధించాడు.ఫలితంగా మధ్యప్రదేశ్ 128 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆంధ్రా సెక్రెటరీ, బరోడా జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రా సెక్రెటరీ జట్టు 49.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. బ్యాటర్ రక్షణ్ 123 బంతుల్లో 147 పరుగులు సాధించాడు. తర్వాత బరిలో దిగిన బరోడా జట్టు 47.3 ఓవర్ల వద్ద నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు సాధించి గెలుపొందింది. పాయింట్ల పట్టికలో ఆధిక్యంలో ఉన్న జట్టు టోర్నీ చాంపియన్గా నిలవనుంది. ఈ లెక్కన ఇప్పటి వరకూ మధ్యప్రదేశ్ జట్టు అగ్రస్థానంలో ఉండడంతో ఈ జట్టు చాంపియన్గా నిలవడం దాదాపు ఖరారైంది. గురువారం రెండు మ్యాచ్ల అనంతరం చాంపియన్ను ప్రకటించనున్నారు. -
పేదల వైద్యం.. ప్రైవేటు పరం
పెనుకొండ: నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడం..వైద్య విద్యనభ్యసించే విద్యార్థులకు మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి తెచ్చేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున నూతన మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టింది. ఈక్రమంలోనే 2021 అక్టోబర్ 31న అప్పటి సీఎం వైఎస్ జగన్ వర్చువల్ పద్ధతిలో పెనుకొండ మెడికల్ కళాశాలకు కూడా శంకుస్థాపన చేశారు. దీంతో ఈ ప్రాంత వాసులంతా ఎంతో సంతోషించారు. మెడికల్ కళాశాల, సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు కావడంపై హర్షించారు. పెనుకొండకు ప్రత్యేక గుర్తింపుతో పాటు పేదలకు మేలు జరుగుతుందని సంబరపడ్డారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేస్తుండడంపై ఆవేదనకు గురవుతున్నారు. వడివడిగా పనులు.. పెనుకొండ మెడికల్ కళాశాలకు వైఎస్సార్ సీపీ హయాంలో రూ. 475 కోట్లు మంజూరయ్యాయి. మెడికల్ కళాశాలతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నర్సింగ్ ఆస్పత్రి నిర్మాణానికి గత ప్రభుత్వమే శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్పటి ఎమ్మెల్యే శంకరనారాయణ అధికారులను పరుగులు పెట్టించి పనులు వేగవంతం చేశారు. కానీ కళాశాల ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో బండరాళ్లు ఉండటంతో వాటిని బ్లాస్టింగ్ చేస్తూ పనులు చేపట్టారు. ఈ క్రమంలో పనులు కాస్త ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని భవనాలకు పిల్లర్లను నిర్మించడమే కాక కొన్ని భవనాలకు పైకప్పు పనులు సైతం పూర్తి చేశారు. అప్పటి ఎమ్మెల్యే శంకరనారాయణ, ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉన్న ఉషశ్రీచరణ్, కలెక్టర్, ఇతర అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి పనులు ముందుకు సాగేలా చూశారు. కూటమి రాకతో ఆశలు ఆవిరి.. కూటమి ప్రభుత్వం వచ్చాక పెనుకొండ మెడికల్ కళాశాల పనులు నిలిచిపోయాయి. పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థను ఇక్కడి నుంచి పాలకులు సాగనంపారు. ఇక కొత్త కాంట్రాక్ట్ సంస్థకు ఇస్తారని ప్రజలు భావించినా... అందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు అప్పగిస్తూ కేబినెట్లో తీర్మానించడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఉచిత వైద్యం అందుతుందనుకుంటే ముక్కు పిండి వసూలు చేసే ప్రైవేటు విధానం అమల్లోకి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా రూ.వందల కోట్ల విలువైన వైద్య కళాశాల భూమిని ఎకరా ఏడాదికి కేవలం రూ.100తో లీజుకు ఇవ్వడంపై మండిపడుతున్నారు. కూటమి సర్కార్ చర్యల వల్ల ఈప్రాంత ప్రజలకు ఉచిత వైద్యం అందకపోగా, ఈ ప్రాంత యువత వైద్యవిద్యకూ అడ్డంకులు ఎదురవుతాయంటున్నారు. ఇప్పటికైనా కూటమి సర్కార్ తన నిర్ణయాన్ని విరమించుకుని పెనుకొండ కళాశాలను పూర్తి చేసి ఈప్రాంత పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందేలా చూడాలని కోరుతున్నారు. పెనుకొండ మెడికల్ కళాశాలపై కాల ‘కూటమి’ విషం పీపీపీ పేరుతో ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం కరువు ప్రజలకు కార్పొరేట్ ఉచిత వైద్యం ఇక కలే ఎకరా రూ.2 కోట్ల విలువైన భూమిని ఏడాదికి రూ.100తో లీజు -
వెంటాడుతున్న యూరియా కష్టాలు
అనంతపురం అగ్రికల్చర్: అన్నదాతను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. బస్తా, రెండు బస్తాల యూరియా కోసం బారులు తీరుతున్నారు. ఉదయం ఏడింటికే ఆర్ఎస్కేలు, సొసైటీలు, ప్రైవేట్ దుకాణాల వద్దకు చేరుకుంటున్నారు. మండుటెండలో నిలబడ లేక వరుసల్లో చెప్పులు, బ్యాగులు, టవాళ్లు పెట్టి గంటల కొద్దీ వేచి చూస్తున్న దుస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి యంత్రాంగం మొత్తం జిల్లాకు చేరుకున్న బుధవారం కూడా చాలా ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు తిప్పలు పడటం కనిపించింది. ఒక్క బస్తా కూడా లేదు.. వారం రోజులుగా మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు సూపర్ హిట్ సభ కోసం జిల్లా కేంద్రంలో మకాం వేసినా రైతులు పడుతున్న కష్టాలపై ఒక్కరు కూడా స్పందించలేదు. వైఎస్సార్సీపీ పోరాటం ఫలితంగా అంతో ఇంతో యూరియా సరఫరా అవుతోంది. అది కూడా కంటి తుడుపుగా సరఫరా చేస్తూ రైతులందరికీ యూరియా దక్క కుండా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 436 ఆర్ఎస్కేలు, మూడు డీసీఎంఎస్లు, 13 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), రెండు ఎఫ్పీఓలు, మూడు ప్రైవేట్ హోల్సేల్ డీలర్లు, 460 రీటైల్ దుకాణాల్లో యూరియా నిల్వలు దాదాపు అడుగంటిపోయాయి. అధికార పార్టీ నేతల కోసం బఫర్స్టాక్ కింద మాత్రం 500 మెట్రిక్ టన్నులు పెట్టుకున్నారు. ఇటీవల మూడు కంపెనీల నుంచి వచ్చిన అరకొర యూరియా వచ్చింది వచ్చినట్లే ఖాళీ అవుతుండటంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సీజన్లో 30 వేల మెట్రిక్ టన్నులకు పైగా పంపిణీ చేశామని చెబుతున్నా కచ్చితమైన లెక్కలు మాత్రం చూపడం లేదు. ఈ క్రమంలోనే యూరియా ఎక్కువగా వాడొద్దంటూ ఉచిత సలహాలిస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనిది యూరియా వాడకంపై నేడు కరపత్రాలు, వాల్పోస్టర్లు, సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అనంతపురం నగరంలో వందలాది దుకాణాలు ఉన్నా ఎక్కడా ఒక బస్తా యూరియా లభించే పరిస్థితి లేదు. బ్లాక్మార్కెట్కు తరలించడంతోనే.. ఆగస్టులో వర్షాలు పడడంతో వరి నాట్లు పెరిగాయి. ఇప్పటికే 20 వేల హెక్టార్లలో వరి సాగులో ఉంది. ప్రస్తుతం నాట్లు కుదురుకోవాలంటే తప్పనిసరిగా యూరియా అవసరం ఉండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. అలాగే మొక్కజొన్న 22 వేల హెక్టార్లు, అరటి 10 వేల హెక్టార్లు, వేరుశనగ 79 వేల హెక్టార్లు, కంది 94 వేల హెక్టార్లు, ఆముదం 15 వేల హెక్టార్లలో సాగు చేసిన అన్ని పంటలకు అంతో ఇంతో యూరియా వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నందున రైతుకు ఇబ్బందిగా మారింది. జిల్లాకు చేరిన యూరియాను చాలా వరకు బ్లాక్మార్కెట్కు తరలించడంతోనే దుస్థితి తలెత్తిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2019–2024 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున పంటలు సాగులోకి వచ్చినా ఎన్నడూ ఎక్కడా యూరియా సమస్య ఎదురుకాలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అనంతపురంలో ఎక్కడా ఒక్క బస్తా కూడా దొరకని వైనం ఉచిత సలహాలు ఇస్తుండటంపై అన్నదాతల మండిపాటు -
వద్దు బాబోయ్!
అనంతపురం: ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్’ పేరుతో బుధవారం అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే జనం ఇళ్ల బాట పట్టారు. ముఖ్యమంత్రి ప్రసంగం సగం కూడా పూర్తి కాకనే గ్యాలరీలన్నీ ఖాళీ అయ్యాయి. జనాన్ని ఆపేందుకు టీడీపీ కేడర్, పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.అడిగి మరీ చప్పట్లు !సీఎం చంద్రబాబు ప్రసంగం కూడా ఆద్యంతం ‘ఆత్మస్తుతి–పరనింద’ చందాన సాగింది. తాము చేసిన కార్యక్రమాల గురించి గొప్పలు చెబుతూనే చప్పట్లు కొట్టాలని సీఎం పదేపదే జనాన్ని కోరడంతో వచ్చిన వారు విసుగెత్తిపోయారు. సీఎం కోరినా చప్పట్లు కొట్టడానికి ఆసక్తి చూపించకపోవడంతో ‘ఏమయ్యా నేను ఉచితంగా గ్యాస్ ఇచ్చాను. అది వినియోగిస్తున్నారు కదా కనీసం చప్పట్లు అయినా కొట్టండి’ అంటూ బతిమాలుకోవడం గమనార్హం. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో జనసేన నాయకులు జెండాలను ఎగురవేయడంతో వాటిని కిందికి దించాలని సీఎం పదేపదే కోరారు. అయినా జనసేన కార్యకర్తలు పోటాపోటీగా జెండాలను ప్రదర్శించడం కనిపించింది. దీనిపై టీడీపీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తన ప్రసంగాన్ని ఐదు నిమిషాల్లోపే ముగించడంపై పలువురు చలోక్తులు విసిరారు. ‘సూపర్ సిక్స్’ పూర్తి స్థాయిలో అమలు చేయకనే సూపర్ హిట్ కార్యక్రమం ఏర్పాటు చేయడంపై ఆయనకు ఇష్టం లేదేమో! అంటూ పలువురు చర్చించుకున్నారు.నానా అవస్థలు..సభా ప్రాంగణం వద్ద జనం నానా అవస్థలు పడ్డారు. మండుటెండలో ఉక్కపోతతో అల్లాడిపోయారు. పలువురు వేడి తట్టుకోలేక వాంతులు చేసుకున్నారు. కేవలం కొన్ని గ్యాలరీల్లోనే కుర్చీలు వేసి, చాలా చోట్ల వేయకపోవడంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిల్చోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎందుకు ఇక్కడికి వచ్చాం దేవుడా అంటూ నిట్టూర్చారు.పోలీసు ఆంక్షలతో కష్టాలు ..సూపర్ సిక్స్ సభ సందర్భంగా జిల్లాలో పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం గమనార్హం. ఏకంగా అనంతపురం నగరానికి 5 కిలోమీటర్ల దూరం నుంచే బస్సులను, వాహనాలను దారి మళ్లించడంతో ప్రయాణికులకు దిక్కుతోచని స్థితి నెలకొంది. అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. హైదరాబాద్–బెంగళూరు మార్గంలో వాహనాలను వడియంపేట– బుక్కరాయసముద్రం–నాయనపల్లి క్రాస్– నార్పల– ధర్మవరం–ఎన్ఎస్ గేట్ మీదుగా మళ్లించడంతో తీవ్ర ఇక్కట్లు పడాల్సి వచ్చింది. మధ్యలో నార్పల–బత్తలపల్లి మార్గం సరిగా లేకపోవడంతో ప్రయాణంలో నరకం కనిపించింది. సాధారణంగా అనంతపురం నుంచి పెనుకొండ వద్ద ఉన్న కియా కంపెనీకి ఉద్యోగులు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోయేది. కానీ బుధవారం అదనంగా మరో 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది.యంత్రాంగానికీ ఇక్కట్లు..సభ పూర్తిగా పార్టీ కార్యక్రమమే అయినా అధికార యంత్రాంగాన్ని భాగస్వాములను చేశారు. దాదాపు 10 జిల్లాల నుంచి పోలీసులను కేటాయించారు. ఈ క్రమంలో ఖాకీలు కూడా ఇబ్బందులు పడ్డారు. బందోబస్తు చర్యలను పర్యవేక్షించాల్సింది పోయి జనం సభ నుంచి వెళ్లిపోకుండా కాపలా కాయాల్సి వచ్చింది. -
సచివాలయాలకు మూత
అనంతపురం కార్పొరేషన్: కూటమి పార్టీల కార్యక్రమం నేపథ్యంలో సచివాలయాలు మూతపడ్డాయి. పైగా ఈ కార్యక్రమానికి తరలించేందుకు సచివాలయ సిబ్బందితోనే జన సమీకరణ చేయించడం గమనార్హం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్ బస్సుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లారు. మహిళా సంఘాల సభ్యులు వచ్చారో లేదో నమోదు చేసుకున్నారు. సమావేశానికి రాని వారికి ఫోన్లు చేసి పిలిపించారు. అనంతరం తమ పరిధిలో ఎంత మందిని బస్సుల్లో ఎక్కించారో ఆ వివరాలను ఆయా గ్రూపుల్లో నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అనంతపురంలో అయితే ఎంత మంది బస్సుల్లో ఉన్నారు.. పూర్తి స్థాయిలో వచ్చారా.. తదితర వివరాలు ఆరా తీసేందుకు అధికారులు సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. ఉద్యోగులను పార్టీల కార్యక్రమాలకు వాడుకోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. -
కర్షక లోకం కన్నెర్ర
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం రెవెన్యూ డివిజన్కు సంబంధించి జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి క్లాక్టవర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీలు మంగమ్మ, వై.శివరామిరెడ్డి, మాజీ మంత్రి, పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దారెడ్డి పాల్గొని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కేశవనాయుడుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వై.ఈశ్వర ప్రసాద్ రెడ్డి, పార్టీ అనంతపురం పార్లమెంటు పరిశీలకులు నరేష్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర నాయకులు రమేష్రెడ్డి, రమేష్ గౌడ్, ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వర్థ్ నాయక్, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ ఘర్ రిజ్వాన్ పాల్గొన్నారు. ● కళ్యాణదుర్గంలో వాల్మీకి సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ కళ్యాణదుర్గం, రాయదుర్గం సమన్వయకర్తలు తలారి రంగయ్య, మెట్టు గోవిందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు తిప్పేస్వామి, మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయ ఏఓ చంద్రశేఖర్కు వినతి పత్రం అందించారు. ● గుంతకల్లులో నిర్వహించిన ర్యాలీలో పార్టీ శ్రేణులు, రైతులు కదం తొక్కారు. ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల నుంచి రైతులు తరలివచ్చారు. పార్టీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయ ఏఓ నాగభూషణంకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ భవాని, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వర బాబు, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న పాల్గొన్నారు. రైతుల్ని బాధపెడితే ప్రభుత్వాలే కూలుతాయి అన్నం పెట్టే రైతన్నను బాధపెడితే ప్రభుత్వాలు కూలిపోతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడూ రైతుల ప్రయోజనాలపై దృష్టి సారించలేదు. కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే యూరియా బ్లాక్మార్కెట్కు తరలిపోయింది. వ్యవసాయానికి చంద్రబాబు అనే తెగులు, చీడ పట్టుకుంది. ఓ వైపు తుంగభద్ర, శ్రీశైలం నుంచి నీరు సముద్రం పాలవుతుంటే.. మరోవైపు జిల్లాలో సౌత్, నార్త్ కెనాల్కు నీరు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. జిల్లా ప్రజలను పస్తులు పెట్టి కుప్పానికి నీరు తరలించడం సరికాదు. హంద్రీ–నీవా వెడల్పుతో పాటు హెచ్ఎల్సీ ద్వారా ప్రజలకు నీరందించాలి. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూటకపు సర్కారుపై భగ్గుమన్న అన్నదాతలు వైఎస్సార్ సీపీ తోడుగా కదం తొక్కిన రైతన్నలు సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు ఎరువుల బ్లాక్మార్కెటింగ్, యూరియా కొరతపై మండిపాటు వైఎస్సార్ సీపీ ‘అన్నదాత పోరు’ విజయవంతం వ్యవసాయానికి చంద్రబాబు పీడ: పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం -
కేసులు నమోదు చేస్తామనడమేంది బాబూ
యూరియా అందక రైతులు సోషల్ మీడియా వేదికగా మాట్లాడితే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పడమేంటి? అధికారులతో గణాంకాలు తెప్పించుకోవడమే కాదు, క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా అందిందో లేదో చంద్రబాబు తెలుసుకోవాలి. యూరియాను పక్కదారి పట్టించిన వారిపై కేసులు నమోదు చేయాలి. – నరేష్కుమార్ రెడ్డి, పార్టీ పార్లమెంట్ పరిశీలకులుఅవహేళన చేస్తారా? రైతులు రోడ్డెక్కి ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అవహేళనతో మాట్లాడడం సరికాదు. గతంలో రైతులకు మేలు చేసేందుకు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, జలయజ్ఞం తదితర వాటిని అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది. – రమేష్గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మోసానికి బ్రాండ్ అంబాసిడర్ మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. అధికారం కోసం ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చి మోసం చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో రెండు పథకాలను అసలు అమలే చేయలేదు. మిగిలిన వాటిని కూడా అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకున్నారు. అయినా నేడు ఏం ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారో అర్థం కావడం లేదు. – గోరంట్ల మాధవ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ● -
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ● మహిళ స్నేహపూర్వక గ్రామం – పంచాయతీ థీమ్ పై శిక్షణ ప్రారంభంఅనంతపురం సిటీ: మెరుగైన సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకంగా ఉంటోందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. ఏపీ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ‘మహిళ స్నేహపూర్వక గ్రామం–పంచాయతీ థీమ్–9’ అంశంపై రెండు రోజుల శిక్షణ తరగతులు అనంతపురంలోని జెడ్పీ క్యాంపస్లో ఉన్న డీపీఆర్సీ భవన్లో మంగళవారం ప్రారంభమయ్యాయి. గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంత మహిళల భద్రత, సమానత్వం, సమగ్రాభివృద్ధి వైపు ప్రోత్సహించే దిశగా కార్యక్రమాన్ని రూపొందించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలో సానుకూల మార్పుల కోసం పని చేసే దిశగా సమర్థవంతంగా తీర్చిదిద్దడమే శిక్షణ ఉద్దేశమని పేర్కొన్నారు. మహిళా స్నేహపూర్వక గ్రామ పంచాయతీ కింద జిల్లాలోని ఆరు మండలాల్లో ఒక్క పంచాయతీ చొప్పున మొత్తం ఆరు గ్రామ పంచాయతీలను ఎంపిక చేశామని సీఈఓ శివశంకర్ తెలిపారు. ఇందులో ఆత్మకూరు మండలంలో తోపుదుర్తి, బత్తలపల్లి మండలంలో బత్తలపల్లి, కంబదూరు మండలంలో చెన్నంపల్లి, కనగానపల్లి మండలంలో తగరకుంట, తాడిపత్రి మండలంలో ఊరచింతల, వజ్రకరూరు మండలంలో పాత కడమలకుంట గ్రామాలు ఉన్నాయన్నారు. ఒక్కో పంచాయతీ నుంచి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, వెల్ఫెర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఏఎన్ఎం, వీఓ లీటర్లు ముగ్గురు చొప్పున ఒక్కో పంచాయతీ నుంచి మొత్తం తొమ్మిది మందిని ఎంపిక చేసి, వారికి రెండ్రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్య తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను తమ పంచాయతీల్లో అమలయ్యేలా చూడాలని కోరారు.డీడీఓ నాగశివలీల, డీపీఆర్సీ శిక్షణ కేంద్రం జిల్లా మేనేజర్ నిర్మల్దాస్ పాల్గొన్నారు. -
చేతి పంపు చుట్టూ రింగు ఏర్పాటు
బొమ్మనహాళ్: మండలంలో కల్లుదేవనహాళ్లి వద్ద హగరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న చేతిపంపు భద్రతకు అధికారులు రింగులను ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలతో దాదాపు 8 అడుగుల మేర అందనంత ఎత్తునకు చేతి పంపు చేరుకుంది. ఈ నేపథ్యంలో చేతి పంపు విరిగి పోకుండా గ్రామస్తులు ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మకు కట్టి అతి కష్టంపై తాగునీటి సేకరించుకోసాగారు. ఈ అంశాన్ని ‘ఇసుకాసురల పాపం.. ఇదే సాక్ష్యం’ శీర్షికన ఈ నెల 8న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎంపీడీఓ దాస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ శ్రీనానాయక్ వెంటనే చర్యలకు ఉపక్రమించారు. చేతి పంపు విరిగిపోకుండా చుట్టూ రింగు ఏర్పాటు చేసి మంగళవారం ఉదయం సిమెంట్ కాంక్రీట్ వేశారు. అలాగే గ్రామస్తులు తాగునీటి పట్టుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
జిల్లాకు వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులు ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం విడుదల చేసిన బులెటిన్లో తెలిపారు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు మోస్తరు వర్షం పడే సూచన ఉందన్నారు. 10న ఒక మి.మీ, 11న 15 మి.మీ, 12న 8 మి.మీ, 13న 15 మి.మీ, 14న 13 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33.7 డిగ్రీల నుంచి 34.1 డిగ్రీలు, కనిష్టం 23.3 డిగ్రీల నుంచి 23.4 డిగ్రీల మధ్య నమోదవుతాయన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 76 నుంచి 80, మధ్యాహ్నం 50 నుంచి 52 శాతం మధ్య రికార్డు కావొచ్చన్నారు. పశ్చిమ దిశగా గాలులు గంటకు 13 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. మైనార్టీ గురుకులంలో విద్యార్థి అదృశ్యం గార్లదిన్నె: మండల కేంద్రంలోని ముస్లిం,మైనార్టీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్య మయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం నగరానికి చెందిన సాకే గౌతమ్ గార్లదిన్నె ముస్లిం, మైనార్టీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి బయటకు వెళ్లిన గౌతమ్ తిరిగి రాలేదు. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లో వెతికినా తల్లిదండ్రులకు ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లాకు 800 మెట్రిక్ టన్నుల యూరియా అనంతపురం అగ్రికల్చర్: ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్) కంపెనీ నుంచి 800 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. మంగళవారం ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్పాయింట్కు వ్యాగన్ల ద్వారా చేరిన యూరియా బస్తాలను ఆయన పరిశీలించారు. ఇండెంట్ల మేరకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి మార్క్ఫెడ్కు 560 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 240 మెట్రిక్ టన్నులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పశువుల మేతగా ఉల్లి, టమాట! తాడిపత్రి టౌన్: మార్కెట్లో ఉల్లి, టమాట దిగుబడులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పంటను పశువుల మేతగా వదిలేస్తున్నారు. మార్కెట్కు తరలించిన పంటకు గిట్టుబాటు ధర లభ్యం కాకపోవడంతో తాడిపత్రి మండలంలోని చుక్కలూరు సమీపంలో రోడ్డుపై రైతులు ఉల్లి, టమాట దిగుబడులను పారబోసి తమ దీనస్థితిని వ్యక్తం చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో 243 ఎకరాల్లో ఉల్లి, 515 ఎకరాల్లో టమాట పంటను రైతులు సాగుచేశారు. ఆరుగాలం శ్రమించి సాధించిన పంటల దిగుబడిని మార్కెట్కు తరలిస్తే కనీసం కిలో టమాట రూ.5, ఉల్లి రూ.10తో వ్యాపారులు అడుగుతున్నారని, ఈ లెక్కన అమ్మితే పెట్టుబడి కూడా చేతికి దక్కడం లేదంటూ వాపోయారు. నేడు సీఎం చంద్రబాబు రాక అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు జిల్లా కేంద్రంలోని అగస్థ్య అపార్టుమెంట్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.45 గంటలకు అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సభలో పాల్గొంటారు. 4.40కు హెలికాప్టర్లో ఉండవల్లికి బయలుదేరి వెళతారు. -
యూరియా కోసం రైతుల ఆందోళన
కణేకల్లు: మండలంలోని కణేకల్లు క్రాస్లో ఉన్న కోరమాండల్ వద్ద మంగళవారం యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. కోరమాండల్కు ఒక లోడు (280 బస్తాలు) యూరియా రావడంతో మంగళవారం ఉదయం కణేకల్లు మండలంతో పాటు చుట్టుపక్కల మండల రైతులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో చాలా మంది రైతులకు టోకన్లు దొరకలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వేచి ఉన్నా తమకు టోకన్లు ఇవ్వలేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. కోరమాండల్ మేనేజర్ సోము సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో తహసీల్దార్ బ్రహ్మయ్య, ఏఓ జగదీష్ అక్కడకు చేరుకున్నారు. దీంతో అధికారులను రైతులు నిలదీశారు. పక్క మండలాల రైతులను మినహాయించి స్థానిక మండల రైతులకు ఏఓ దగ్గరుండి ఒక్కొక్కరికి ఒక బస్తా చొప్పున ఇచ్చేలా టోకన్లు జారీ చేయించారు. విద్యార్థులకు ‘సూపర్’ మోసం ● వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్యాదవ్ అనంతపురం ఎడ్యుకేషన్: రాష్టంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులను సూపర్ మోసం చేసిందని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్యాదవ్ మండిపడ్డారు. బుధవారం జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబు.. విద్యార్థి సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంంట్ ఇవ్వలేదన్నారు. ఫలితంగా కోర్సులు పూర్తయినా కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి కరువయ్యాయన్నారు. ఈ అంశంగా హైకోర్టు హెచ్చరించినా ప్రభుత్వంలో ఏమాత్రం మార్పు రాలేదన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులు ఉచితంగా వైద్య విద్య అభ్యసించేందుకు వీలుగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిని ప్రైవేట్కు అప్పగించి వైద్యాన్ని మార్కెట్లో సరుకుగా మార్చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలు బయటికి రాకుండా చీకటి జీఓను తెచ్చి మోసం చేశారన్నారు. డిగ్రీ ప్రవేశాలకు అనుమతులు ఇవ్వకుండా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాళం వేసిన ఇంట్లో చోరీ గుంతకల్లు టౌన్: స్థానిక భాగ్య నగర్లో నివాసముంటున్న షమీమ్ ఇంట్లో చోరీ జరిగింది. సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి అల్లీపీరా కాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తాళం వేసిన ఇంటిని గుర్తించిన దుండగులు లోపలకు చొరబడి బీరువాలోని 11 గ్రాముల బంగారు, రూ.20 వేల నగదు అపహరించారు. మంగళవారం ఉదయం చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో వన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ వేగవంతం చేయండి
● ఉద్యానశాఖ కమిషనర్ శ్రీనివాసులు అనంతపురం అగ్రికల్చర్: డ్రిప్, స్ప్రింక్లర్ల మంజూరు ప్రక్రియ మరింత వేగవంతంగా కొనసాగాలని సంబంధిత అధికారులను ఉద్యానశాఖ కమిషనర్ కె.శ్రీనివాసులు, ఓఎస్డీ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశించారు. డ్రిప్ పరికరాల పంపిణీపై మంగళవారం వారు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. జిల్లా ఉద్యాణ శాఖ కార్యాలయం నుంచి ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి, ఏపీడీ బీసీ ధనుంజయ, ఎంఐ ఇంజనీర్లు, కంపెనీ డీసీఓలు పాల్గొన్నారు. ప్రస్తుత 2025–26లో 18 వేల హెక్టార్లు టార్గెట్ కాగా ఇప్పటి వరకూ 4,011 మంది రైతులకు 5,402 హెక్టార్లకు మంజూరు చేశారని, ఇందులోనూ ఇన్స్టాలేషన్లు తక్కువగానే ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. 31,804 హెక్టార్లకు రిజిష్ట్రేషన్ చేసుకున్న 22,650 మంది రైతులకు సంబంధించి సీనియార్టి వారీగా ప్రాథమిక పరిశీలన వేగవంతం చేయాలని ఆదేశించారు. వెనువెంటనే బీఓక్యూ, బీఎంసీ, రైతు వాటా కట్టించి వారం రోజుల్లోనే అడ్మినిస్ట్రేటివ్ అనుమతులతో రైతులకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో మంజూరు చేసిన రైతుల పొలాల్లో ఈనెల 22 లోపు పరికరాలు బిగించాలన్నారు. -
రెండు పదుల వయస్సులోనే గుండెపోటు
● వివాహిత మృతి ● గ్రామంలో విషాదఛాయలురాప్తాడు: రెండు పదుల వయస్సులోనే గుండెపోటుకు గురై ఓ వివాహిత మృతి చెందింది. ఘటనతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వివరాలు.. రాప్తాడుకు చెందిన జానగొండ రాముడు, వెంకటలక్షి దంపతుల పెద్ద కుమారుడు భాస్కర్కు ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన బులగొండ నాగలక్ష్మి, నాగరాజు దంపతుల పెద్ద కుమారై నందిని (22)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. సోమవారం సాయంత్రం కళ్లు తిరిగి కిందపడిపోయిన నందిని ని కుటుంబ సభ్యులు అనంతపురానికి పిలుచుకెళ్లి చికిత్స చేయించుకుని వచ్చారు. రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ పడిపోవడంతో కుటుంబసభ్యులు స్థానిక ఆర్ఎంపీని పిలుచుకొచ్చి చూపించారు. పరిస్థితి విషమంగా ఉందని ఆర్ఎంపీ తెలపడంతో వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు సర్వజనాస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు స్పందించక రాత్రి 11 గంటలకు నందిని మృతి చెందింది. ‘లో బీపీ’ కారణంగా గుండె పోటుకు గురై మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అర్థరాత్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు, వైఎస్సార్సీపీ మండల మాజీ కన్వీనర్ జూటూరు శేఖర్, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ జూటూరు లక్ష్మన్న, వైఎస్సార్ సీపీ నాయకులు సాకే చంద్ర, చింతకాయల జయన్న, టీడీపీ మండల కన్వీనర్ పంపు కొండప్ప, మాజీ కన్వీనర్ సాకే నారాయణ స్వామి, సర్పంచ్ సాకే తిరుపాలు తదితరులు నందిని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. మంగళవారం ఉదయం నందిని అంత్యక్రియలు నిర్వహించారు. -
మోసం చేసి విజయోత్సవమా?
● సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి ధ్వజం ● సీఎంకు బహిరంగ లేఖ అనంతపురం అర్బన్: హామీలు అమలు చేయకుండా మోసం చేసి విజయోత్సవం జరుపుకోవడం ప్రజలను మభ్యపెట్టడంలో ఓ భాగంగా భావించాల్సి వస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి విమర్శించారు. సీపీఐ తరఫున ముఖ్యమంత్రికి పంపిన బహిరంగ లేఖను మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో సీపీఐ సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ, కార్యవర్గ సభ్యులతో కలసి నారాయణస్వామి విడుదల చేసి, మాట్లాడారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి, ఒక ఏడాది తరువాత రూ.13 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా? అని ప్రశ్నించారు. సీ్త్రశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని చెప్పి, ఏడాది తరువాత ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ సర్వీసులకు మాత్రమే పరిమితం చేయడం వాగ్ధాన భంగం కాదా? అన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి, కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో కలిసి రూ.7 వేలు ఇవ్వడం రైతులను దగా చేయడం కాదా? అని నిలదీశారు. 19 నుంచి 59 ఏళ్లు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క రూపాయి కూడా జమ చేయకపోవడం, నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడం... నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం చంద్రబాబు మోసాలకు నిదర్శనమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్వహించేది సూపర్ హిట్ సభ కాదని, అది సూపర్ ప్లాప్ సభ అని దుమ్మెత్తి పోశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కేశవరెడ్డి, శ్రీరాములు, రమణ, సంతోష్కుమార్, రాజేష్గౌడ్, దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ ప్రతిష్ట ‘గంగ’ పాలు
తాడిపత్రి టౌన్: మండలంలోని ఇగుడూరు గంగమ్మ ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా స్థానిక టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఆలయానికి మంగళ, ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అమ్మవారికి జంతు బలులతో మొక్కులు తీర్చుకుంటుంటారు. దీనిని ఆసరాగా చేసుకున్న టీడీపీ నేతలు.. అక్కడ ఓ షెడ్డు ఏర్పాటు చేసి ఏకంగా మద్యం దుకాణం తెరిచారు. ఈ విషయం తెలిసినా అధికారులు, పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆలయం వద్ద మద్యం అమ్మకాల కారణంగా తాగుబోతుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఆలయ ప్రశాంతత దెబ్బతినడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి ఆలయం వద్ద మద్యం విక్రయాలను ఆపాలని పలువురు మహిళలు కోరుతున్నారు. -
సెక్యూరిటీ గార్డు దుర్మరణం
తాడిపత్రి రూరల్: మండలంలోని బుగ్గ వద్ద నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు మస్తాన్(50)పై లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపిన మేరకు.. తాడిపత్రి పట్టణానికి చెందిన మస్తాన్.. హైవే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుక్క వద్ద ఆదివారం రాత్రి విధులకు వెళ్లిన మస్తాన్ సోమవారం వేకువ జామున షెడ్లో నిద్రకు ఉపక్రమించాడు. అదే సమయంలో నంద్యాల నుంచి తాడిపత్రి వైపుగా వస్తున్న లారీ రేకుల షెడ్ను ఢీకొని దూసుకెళ్లింది. ఘటనలో మస్తాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాత్కాలిక బిషప్గా బెన్హర్బాబు అనంతపురం కల్చరల్: సుదీర్ఘఽ చరిత్ర కల్గిన సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ తాత్కాలిక బిషప్గా రెవరెండ్ బెన్హర్బాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా బిషప్ రెవరెండ్ డాక్టర్ పి.ఐజాక్ వరప్రసాదరెడ్డి టర్కీ వెళ్లిన నేపథ్యంలో రెవరెండ్ బెన్హర్బాబుకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆయనను పాస్టర్లు మనుష్యే, మార్క్, జీఆర్ ఆనంద్, జహంగీర్, జాషువా, చార్లెస్ నాయక్ తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. రైల్వేస్టేషన్లో వృద్ధుడి మృతి గుంతకల్లు: స్థానిక రైల్వేస్టేషన్లోని మూడో ప్లాట్ఫారంపై ఓ గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి ప్లాట్ ఫారంలోని 22వ పోల్ వద్ద అనారోగ్యంతో మృతి చెందాడు. చామఛాయ రంగు కలిగి ఉన్నాడు. గడ్డం పెరిగి ఉంది. ఆచూకీ తెలిసిన వారు 98661 44616కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు. ప్రమాదంలో కర్ణాటక వాసి మృతి రాయదుర్గం టౌన్: మిత్రులతో సరదాగా గడిపేందుకు వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని దావణగెర జిల్లా తొలహునిసె గ్రామానికి చెందిన శివ (40) అవివాహితుడు. రాయదుర్గంలోని తన మిత్రులు రాము, మల్లికార్జునను కలిసేందుకు ఆదివారం మధ్యాహ్నం వచ్చాడు. అదే రోజు రాత్రి రాత్రి 10 గంటల సమయంలో వాల్మీకినగర్లోని మిట్టపై రోడ్డు దాటుతున్న శివను రాయదుర్గం నుంచి మెచ్చిరి గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళుతున్న భాస్కర్, కృష్ణ ఢీకొన్నారు. ఘటనలో గాయపడిన ముగ్గురినీ స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక శివ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పురాతన నగరేశ్వరాలయంలో ఉబికి వస్తున్న నీరు గుత్తి: పట్టణంలోని కోట ముఖ ద్వారం వద్ద ఉన్న పురాతన నగరేశ్వరాలయ గర్భగుడిలో నీరు ఉబికి వస్తోంది. గత 15 రోజులుగా నీరు ఉబికి వస్తుండడంతో మోటార్ల సాయంతో పంపింగ్ చేస్తున్నారు. ఉత్సాహంగా జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీలు ఉరవకొండ రూరల్: మండలంలోని నింబగల్లు జెడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో ఆ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం జిల్లాస్థాయి బాలబాలికల సెపక్ తక్రా పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 12 జట్లు పాల్గొన్నాయి. ఎంఈఓ ఈశ్వరప్ప ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలకు సీసీ కెమెరాలను పూర్వ విద్యార్థులు వితరణ చేశారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
పచ్చదనంపై వేటు!
రాయదుర్గం/బొమ్మనహాళ్: దశాబ్ధాలుగా నీడ నిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్న భారీ వృక్షాలు గొడ్డలి వేటుకు కనుమరుగవుతున్నాయి. నడి రోడ్డైనా, అటవీ ప్రాంతమైనా, ఇళ్ల వద్దనైనా ఎక్కడైనా సరే పచ్చని చెట్లను నరికేసి కలప అక్రమ రవాణా సాగిస్తున్నారు. దీంతో రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు క్రాస్ నుంచి బొమ్మనహాళ్ మీదుగా కర్ణాటకలోని బళ్లారికి వెళ్లే ప్రధాన మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలు కనుమరుగయ్యాయి. దేవగిరిక్రాస్ సమీపాన ప్రధాన రహదారి పక్కన ఉన్న భారీ వృక్షాన్ని ఇటీవల అందరూ చూస్తుండగా కూల్చి కలపను వాహనాల్లో తరలించారు.పలు గ్రామాల్లోని చింతచెట్లు కూల్చి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లోని చాలా మండలాల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో పచ్చదనం తరిగిపోతుంది. వాల్టా .. ఉల్టా ! జిల్లాలోని కర్ణాటక సరిహద్దున ఉన్న రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో వాల్టా (నీరు, భూమి, వృక్షం) చట్టం అమలు కాగితాలకే పరిమితమైపోయింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు కావస్తున్నా వాల్టా చట్టం పై ఏనాడు సమీక్షా సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా బోర్లు తవ్వుతున్నారు. వృక్ష సంపదను నేల కూలుస్తున్నారు. అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తూ వాగులు, గుట్టలను కొల్లగొడుతున్నారు. బొమ్మనహాళ్ మండలంలో నరికేసిన చెట్లుదేవగిరి సమీపంలో భారీ వృక్షాన్ని నరికి కలపను తరలిస్తున్న దృశ్యం పరిశీలించి చర్య తీసుకుంటాం కలప అక్రమ రవాణాను కట్టడి చేశాం. దేవగిరి సమీపంలో రోడ్డు పక్కన ఉండే భారీ వృక్షాన్ని కూల్చింది ఎవరో విచారించి చర్యలు తీసుకుంటాం. అటవీశాఖ అనుమతుల్లేకుండా చెట్టు నరికితే క్రిమినల్ చర్యలు చేపడతాం.వాల్టా చట్టం అమలుకు తప్పక కృషి చేస్తాం. – దామోదరరెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, రాయదుర్గం దశాబ్దాలుగా నీడనిచ్చిన చెట్ల కూల్చివేత యథేచ్ఛగా కలప అక్రమ రవాణా -
భూములు బీడు.. రైతుల గోడు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ పంటల సాగు 2.56 లక్షల హెక్టార్లకు చేరింది. ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 3.43 లక్షల హెక్టార్లు కాగా 75 శాతం విస్తీర్ణంలో పంటలు వేసినట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక విడుదల చేసింది. ఈ లెక్కన ఇంకా 87 వేల హెక్టార్లు బీడు భూములుగా మిగిలాయి. ఒక్క ఎకరా కూడా ఖాళీగా ఉండకూడదని కూటమి సర్కారు చెబుతున్నా.. ఆ దిశగా బీడు భూములు సాగులోకి వచ్చేలా ప్రత్యామ్నాయం చూపడం లేదు. అక్టోబర్ నుంచి రబీ ప్రారంభం కానుండటంతో ప్రత్యామ్నాయం కింద ఉలవ, కొర్ర, జొన్న లాంటి విత్తనాలు ఇచ్చే పరిస్థితి ఇప్పట్లో లేదు. సాగు గణాంకాలపై అనుమానాలు: వేరుశనగ, కంది, ఆముదం, పత్తి లాంటి ప్రధాన పంటలు విత్తుకునేందుకు నెల రోజుల కిందటే గడువు ముగిసినా ఇప్పటికీ వారం వారం విడుదల చేస్తున్న నివేదికలో విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రతి వారం 20 నుంచి 30 వేల హెకార్లు పెంచుతూ గణాంకాలు విడుదల చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 10 నాటికి 1.68 లక్షల హెక్టార్లు, ఆగస్టు 26 నాటికి 2.21 లక్షల హెక్టార్లు, సెప్టెంబర్ ఒకటి నాటికి 2.44 లక్షల హెక్టార్లు, సెప్టెంబర్ 8న 2.56 లక్షల హెక్టార్లు... ఇలా ఖరీఫ్ పెరుగుతోంది. ఆగస్టు, సెప్టెంబర్లో ప్రత్యామ్నాయ పంటల విస్తీర్ణం పెరగాల్సి ఉండగా.. వేరుశనగ, కంది, ఆముదం, పత్తి పెరగడం విశేషం. మరోపక్క ఈ–క్రాప్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. 2.55 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి రాగా ఇందులో సగం విస్తీర్ణం కూడా పంట నమోదు చేయని పరిస్థితి. ఈ–క్రాప్కు కూటమి సర్కారు ప్రాధాన్యత తగ్గించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉలవ, పెసర, అలసంద, మినుము, కొర్ర, జొన్న, సోయాబీన్, పొద్దుతిరుగుడు లాంటి ప్రత్యామ్నాయ పంటలు నామమాత్రంగా సాగులోకి వచ్చాయి. జిల్లాలో సాగైన పంటల వివరాలు.. కంది 93,657 హెక్టార్లు వేరుశనగ 78,131 హెక్టార్లు పత్తి 22,687 హెక్టార్లు మొక్కజొన్న 21,146 హెక్టార్లు ఆముదం 14,448 హెక్టార్లు సజ్జ 3,385 హెక్టార్లు వరి 18,716 హెక్టార్లు జిల్లా వ్యాప్తంగా 87 వేల హెక్టార్లు బీళ్లుగానే దర్శనం ప్రత్యామ్నాయం చూపని కూటమి సర్కారు ఖరీఫ్ సాగు విస్తీర్ణం లెక్కలపై అనుమానాలువర్షాభావ పరిస్థితులు అన్నదాతలను కుదేలు చేశాయి. ఫలితంగా ఖరీఫ్లో పంట వేసుకునే అవకాశాలు లేక పలువురు రైతులు తమ పొలాలను బీడుగా వదిలేశారు. ప్రత్యామ్నాయం చూపాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో అన్నదాతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. -
ఉపాధి అవకాశాలు కల్పించాలి
● కలెక్టరేట్ ఎదుట ఆటో కార్మికుల నిరసన అనంతపురం అర్బన్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతో బాడుగలు లేక జీవనోపాధి కోల్పోయిన తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ప్రభుత్వాన్ని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. భగత్సింగ్ ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. సంఘం కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడారు. వాహన మిత్ర పథకం కింద ప్రతి ఆటో కార్మికునికి రూ.30 వేలు ఇవ్వాలన్నారు. పట్టణ, మండల కేంద్రాల్లో ఆటో పార్కింగ్ స్థలాలు కేటాయించాలన్నారు. ఓలా, ఊబర్, రాపిడ్ సర్వీసులను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వమే యాప్ నిర్వహించాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం డీఆర్ఓ మలోలకు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు చిన్నముత్యాలు, ప్రసాద్బాబు, వెంకటరెడ్డి, స్వాతి, ఆరీఫ్, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ బస్సుల ఢీ ● ముగ్గురికి గాయాలు చెన్నేకొత్తపల్లి: స్థానిక 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకరికి కాలు విరిగింది. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. కేరళలోని అలపూరకు చెందిన ఏడుగురు యువకులు హైదరాబాద్లో కావడి ఉత్సవాన్ని ముగించుకుని తమ మినీ బస్సులో ఆదివానం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం ఉదయం చెన్నేకొత్తపల్లి వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారి పక్కన ఆపిన కియా కంపెనీను వెనుక నుంచి ఢీకొనడంతో మినీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కేరళకు చెందిన అర్జున్కు ఎడమ కాలు పాదం వద్ద విరిగింది. అగిల్, రాహుల్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక పీహెచ్సీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రేషన్ బియ్యం పట్టివేత తాడిపత్రి రూరల్: పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లి కాలనీలో సోమవారం 99 బస్తాల్లోని 45.7 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 50 బస్తాల్లోని 18.5 క్వింటాళ్ల జొన్నలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ చేసిన నాగార్జునను అరెస్ట్ చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎస్ఐ నాగేంద్రభూపతి, సీఎస్డీటీ మల్లేష్, వీఆర్వో వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
‘కేఎస్ఎన్’ హాస్టల్లో పాముల కలకలం
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని కేఎస్ఎన్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల హాస్టల్లో విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గదుల్లో నిద్రపోతున్న విద్యార్థినులను ఇటీవల ఎలుకలు కరిచి ఆస్పత్రి పాలైన సంగతి మరవకముందే తాజాగా పాముల సంచారం బెంబేలెత్తిస్తోంది. ఆదివారం అర్ధరాత్రి హాస్టల్ ఆవరణలో రెండు పాములు కనిపించాయి. ఓ పామును కట్టెతో కొట్టి చంపేశారు. మరోపాము కనిపించకుండా పోయింది. రాత్రి 11.30 గంటల సమయంలో చదువుకుంటున్న కొందరు విద్యార్థినులు బాత్రూంకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గట్టిగా కేకలు వేయడంతో ఇతర గదుల్లో ఉన్న అమ్మాయిలందరూ బయటకు వచ్చారు. పాములు చూసి భయంతో చాలామంది విద్యార్థినులు గదుల్లోకి పరుగు తీశారు. -
ఇమామ్, మౌజన్లకు దగా
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో ఇమామ్, మౌజన్లు దగా పడ్డారని వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం నాయకులు ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే ప్రతి నెలా ఇమామ్లకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5వేలు గౌరవ వేతనం ఇస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు విస్మరించారని మండిపడ్డారు. 11 నెలలుగా గౌరవేతనం కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తోందన్నారు. తక్షణం పెండింగ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొఘల్ సైఫుల్లా బేగ్ అధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట మైనారిటీ నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. సైఫుల్లాబేగ్తో పాటు ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీమ్ అహమ్మద్, మేయర్ వసీం సలీమ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్బాషా, రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర రిజ్వాన్ మాట్లాడారు. ముస్లిం మైనారిటీల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఇమామ్, మౌజన్లకు 11 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వకుండా నిలిపివేశారన్నారు. దీంతో మత పెద్దలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం గౌరవ వేతనం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అబుసలేహా, ఇషాక్, రహంతుల్లా, వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మైనారిటీ నాయకులు గౌస్బేగ్, వేముల నదీమ్, కొర్రపాడు హుసేన్ పీరా, మన్సూర్బాషా, ఆసిఫ్, ఖాజా, మహబూబ్బాషా, ఖమర్తాజ్, షేక్ జావీద్, ఖాదర్బాషా, రియాజ్, అంజాద్ ఖాన్, జిలాన్, ఖాజాపీర్, షకీల్, దాదాపీర్, సాదిక్, సలాం, అన్సర్, హుసేన్, మీరన్బాషా, ఎంఏ జిలాన్, శర్మాస్, షమీ, రియాజ్, అమ్రుల్లా, అఫ్రోజ్, అప్జల్, షేక్షావలి, దాదు, ఇబ్రహీం, జాకీర్, ఖాసీం, అబ్దుల్ రెహమాన్, చాంద్బాషా, ఎండీఆర్ ఖలీల్, నూర్ నిజామీ, ఫ్లయింగ్ మాబూ, కరీమ్ఖాన్, తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీని విస్మరించిన సీఎం చంద్రబాబు 11 నెలలుగా గౌరవవేతనమూ నిలిపివేత కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం ధర్నా -
రూ.12.80 లక్షల విలువైన వాహనాల స్వాధీనం
అనంతపురం: నగరంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలను అపహరిస్తున్న పాతూరులోని పెద్దమ్మగుడి ప్రాంతంలో నివాసముంటున్న ఖాదర్ బాషా కుమారుడు షేక్ ఖాజాపీర్ను అరెస్ట్ చేసినట్లు అనంతపురం రెండో పట్టణ పీఎస్ ఎస్ఐ రుష్యేంద్రబాబు తెలిపారు. ప్రసన్నాయపల్లి రైల్వే గేట్ సమీపంలో అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ వద్ద సోమవారం అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఖాజాపీర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో విషయం వెలుగు చూసిందన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రూ.12.80 లక్షల విలువ చేసే మూడు ఆటోలు, ఆరు బైక్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కాగా, ఇదివరకే ద్విచక్ర వాహనాల అపహరణ కేసులో ఖాజాపీర్ పాత నేరస్తుడని, రిమాండ్కు వెళ్లి విడుదలైన అనంతరం తన పంథాను కొనసాగిస్తూ వస్తున్నాడని తెలిపారు. -
జాగ్రత్తగా వ్యవహరించండి : కలెక్టర్
అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో జన సమీకరణలో జాగ్రత్తలు పాటించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వి.వినోద్కుమార్ సూచించారు. సీఎం పర్యటనపై సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి డీఆర్డీఏ, మెప్మా, డ్వామా శాఖల అధికారులు, కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందితో కలెక్టర్ సమీక్షించారు. జనాల తరలింపు కార్యక్రమాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించాలన్నారు. మండలాల నుంచి ఏ సమయానికి బస్సు బయలుదేరాలి అనేది ముందుగానే గుర్తించాలన్నారు. మ్యాపింగ్ ప్రకారం నిర్ధేశించిన పార్కింగ్కు బస్సులు వెళ్లాలన్నారు. పార్కింగ్ ప్రదేశంలోనే అందరూ దిగేలా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ మలోల, ఎస్డీసీ తిప్పేనాయక్, డీఆర్డీఏ పీడీ శైలజ, డ్వామా పీడీ సలీంబాషా, మెప్మా పీడీ విశ్వజ్యోతి, ఇతర అధికారులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి కణేకల్లు: విద్యుత్ షాక్కు గురై ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ సురేష్ (25) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బొమ్మనహాళ్ మండలం గోనేహాళ్కు చెందిన సురేష్కు భార్య పవిత్ర, తల్లిదండ్రులు లింగమ్మ, వన్నూరుస్వామి ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎలక్ట్రీషియన్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం కణేకల్లు మండలం ఎస్ఆర్ఎన్ క్యాంపులో రైతు పొలంలో విద్యుత్ సమస్య తలెత్తడంతో మరమ్మతు చేసేందుకు వెళ్లాడు. స్టార్టర్ వద్ద పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కుప్పకూలాడు. గమనించిన రైతులు వెంటనే బళ్లారిలోని విమ్స్కు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై కణేకల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. పాము కాటుకు చిన్నారి బలి బ్రహ్మసముద్రం: పాము కాటుకు గురై ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లికి చెందిన హరిజన బడిగే మల్లికార్జున, మారెక్క దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరి పెద్ద కుమార్తె హేమాశ్రీ (6) ఈ నెల 5న పాము కాటుకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆగమేఘాలపై కళ్యాణదుర్గంలోని ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. మూడు రోజుల అనంతరం పరిస్థితి విషమించి సోమవారం బాలిక మృతి చెందింది. సోమవారం సాయంత్రం చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు. పోకిరీకి దేహశుద్ధి కదిరి అర్బన్: వివాహితను వేధించిన పోకిరీకి స్థానికులు దేహశుద్ధి చేశారు. కదిరి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లమాడ మండలానికి చెందిన యువకుడు మహేష్ మద్యం మత్తులో ఓ వివాహితతో ఆమె ఇంటి వద్ద అసభ్యంగా ప్రవర్తిస్తూ తన కోరిక తీర్చాలని గొడవకు దిగాడు. గమనించిన భర్త, బంధువులు వెంటనే మహేష్ను పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా, ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. -
అన్నదాతకు తోడుగా నేడు వైఎస్సార్ సీపీ పోరు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక్క బస్తా యూరియా దొరికినా చాలు అంటూ తెల్లార్లూ జాగారం చేస్తున్న పరిస్థితి. ఏ ఊరికెళ్లినా యూరియా కోసం బారులు తీరిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. రైతన్నల ఇబ్బందులపై సామాజిక మాధ్యమాల్లోనూ శరపరంపరగా పోస్టులు కన్పిస్తున్నాయి. సర్కారు తీరుపై సామాన్యులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత జరుగుతున్నా దగ్గరుండి రైతుల కష్టాలు తీర్చాల్సిన మంత్రులు అసలు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. ‘మీరు ఏం చావు చస్తే మాకేమిటీ’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం సభ ఏర్పాట్లలో ఉండగా.. అధికారులు కూడా రైతుల సమస్యలు గాలికొదిలి సీఎం సభ కోసమే పనిచేస్తున్నారు. సగం కేబినెట్ అనంతపురంలోనే.. రాష్ట్రంలో ఒక జిల్లాలోనో, ఒక నియోజకవర్గంలోనో కాదు ఊరూరా యూరియా కష్టాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వారికి అండగా నిలవాల్సిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సభ ఏర్పాట్లే ముఖ్యమయ్యాయని సామాన్యులు వాపోతున్నారు. ఈ నెల 10న ‘సూపర్ సిక్స్–సూపర్హిట్’ అనే కార్యక్రమాన్ని అనంతపురంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం 10 మంది మంత్రులు వారం రోజులుగా ఇక్కడే ఉన్నారు. సీఎంతో పాటు పవన్కల్యాణ్, లోకేష్ సభకు వస్తున్నారని, అట్టహాసంగా చేయాలన్న ఆలోచనతో మంత్రులు ఈ ఏర్పాట్లలోనే నిమగ్నమయ్యారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, రాంప్రసాద్రెడ్డి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నారాయణ తదితరులంతా ఇక్కడే ఉన్నారు. నేడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా రానున్నారు. ఇక రాయలసీమ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు కూడా రైతుల సమస్యలు గాలికొదిలి అనంతపురంలో మకాం వేశారు. నియోజకవర్గాల్లో ఒక్కరూ లేరు.. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలంతా సీఎం సభ ఏర్పాట్లలోనే తరిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో గడిచిన పక్షం రోజులుగా ఇక్కడ యూరియా లేదు. కానీ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అనంతపురం వదిలి అక్కడికి వెళ్లడం లేదు. మడకశిర నియోజకవర్గంలో రెండ్రోజుల క్రితం తాగునీరు లేక ప్రజలు రోడ్డెక్కారు. కానీ ఆ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాత్రం అనంతపురంలోనే ఉన్నారు. ఉరవకొండ, కళ్యాణ దుర్గం, పుట్టపర్తి, రాప్తాడు..ఇలా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలూ సీఎం సభ కోసమే పనిచేస్తున్నారు. సభ సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం కోసం ఒకర్ని మించి ఒకరు పోటీపడుతున్నారు. వీరి తీరును రైతులు, ప్రజలు ఏవగించుకుంటున్నారు.అనంతపురం కార్పొరేషన్: రైతులను దగా చేసిన సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహింస్తున్నారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలో ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై టవర్క్లాక్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం చేరుకుంటుందన్నారు. అక్కడ ఆర్డీఓకు వినతి పత్రం అందిస్తామన్నారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, రైతులు, రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం చంద్రబాబు, కూటమి ప్రజాప్రతినిధులకు పట్టడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ అధిష్టానం ‘అన్నదాత పోరు’కు పిలుపునిచ్చిందని తెలిపారు. -
ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
యాడికి/డోన్ టౌన్: కర్నూలు జిల్లా డోన్లోని బీసీ బాలుర కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఇంటర్ విద్యార్థి శ్యాంసుందర్ (16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డోన్ సీఐ ఇంతియాజ్బాషా తెలిపిన మేరకు.. యాడికికి చెందిన చేనేత కార్మికులు రమేష్, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్యాంసుందర్ డోన్లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వెళ్లిన విద్యార్థి ఆదివారం తిరిగి వసతి గృహానికి చేరుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున బాత్ రూంలో శ్యాంసుందర్ ఉరేసుకుని కనిపించాడు. ఉదయం కాలకృత్యాల కోసం బాత్రూంకు వెళ్లిన విద్యార్థులు గమనించి హాస్టల్ వార్డెన్ మేరీ సూర్యకుమారి, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ ఇంతియాజ్బాషా, ఎస్ఐలు శరత్కుమార్ రెడ్డి, నరేంద్రకుమార్, ఆర్డీఓ నరసింహులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కాగా విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, బీజేపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని హాస్టల్ ఎదుట ఆందోళన చేశారు. అన్ని కోణాల్లో విచారించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని సీఐ తెలిపారు. -
యూరియా ఇవ్వకుండా సభలంట
ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా. ఇప్పుడు పంటకు యూరియా చాలా అవసరం. పంట దిగుబడి రావాలంటే యూరియా వేయాలి. రెండు నెలలుగా రైతు సేవా కేంద్రం చుట్టూ తిరుగుతూ.. వ్యవసాయ అఽఽధికారులను అడిగినా యూరియా రాలేదని చెబుతున్నారు. మా లాంటి రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే అధికారులు, పాలకులేమో సూపర్ సిక్స్ పథకాలు హిట్ అయ్యాయని సభలు పెట్టుకోవడం సిగ్గుచేటు. –గొల్ల శివన్న, రైతు, కదిరిదేవరపల్లి, కంబదూరు మండలం -
ఎన్నాళ్లీ నరకం?!
అనంతపురం మెడికల్: సర్వజనాస్పత్రిలో బాలింతలు, గర్భిణులకు అవస్థలు తప్పడం లేదు. చాలీచాలని పడకల నడుమ వారు నరకం చూస్తున్నారు. ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.300 కోట్లతో ఎంసీహెచ్, సర్జికల్ బ్లాక్, మెన్, ఉమెన్ పీజీ హాస్టళ్లు మంజూరయ్యాయి. అప్పట్లోనే సర్జికల్, పీజీ హాస్టళ్ల పనులు ప్రారంభమయ్యాయి. వైద్య కళాశాల ఎదురుగా ఉన్న ఆర్అండ్బీ కార్యాలయంలో ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.అయితే, సార్వత్రిక ఎన్నికలు రావడం.. కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. నిర్మాణం కలగా.. వచ్చీ రాగానే చంద్రబాబు ప్రభుత్వం ఈ రూ.300 కోట్ల ప్రాజెక్ట్పై గుదిబండ వేసింది. ఏకంగా రూ.78 కోట్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు కలగా మారింది. ప్రజారోగ్య పరిరక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సింది పోయి ఉన్న వాటిపైనే కక్ష కట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కష్టాలమయం.. ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో గైనిక్ విభాగానికి నాలుగు యూనిట్లు ఉన్నాయి. 120 పడకలు అందుబాటులో ఉంచారు. ఇంకా లేబర్ వార్డు, లేబర్ ఐసీయూ, యాంటీ నేటల్, పోస్టునేటల్, గైనిక్, గైనిక్ ఐసీయూ, ఆరోగ్య శ్రీ, హై డిపెండెన్సీ యూనిట్లో 240 మంది గర్భిణులు, బాలింతలను ఉంచి సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో రోజూ 20 నుంచి 25 ప్రసవాలు జరుగుతున్నాయి. అందులో 5 సిజేరియన్లు ఉంటాయి. గైనిక్ విభాగానికి సంబంధించి వార్డులు దూరందూరంగా ఉన్నాయి. చిన్నపిల్లల వార్డు ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉంది. వసతులు లేని దృష్ట్యా మధ్యాహ్నం వరకే ఆపరేషన్లు చేస్తుండడంతో ఆ సమయం దాటాక మొదటి అంతస్తులో ఉన్న మెయిన్ ఓటీకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో గర్భిణులు, బాలింతలు నరకం చూడాల్సి వస్తోంది. ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటై ఉంటే ఒకే చోటే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలందించే అవకాశం ఉండేది. బ్లాక్లో కొత్తగా మరో 200 పడకలు ఏర్పాటు చేస్తే పదుల సంఖ్యలో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్నర్సులు, తదితర పోస్టులు మంజూరయ్యే అవకాశం ఉండేది. ముగ్గురు మంత్రులున్నా.. కూటమి ప్రభుత్వంలో సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జిల్లాకు మేలు చేసే విధంగా ఒక్క పని ఆయన చేయలేదు. గతంలో మంజూరైన ప్రాజెక్టులనైనా ఆచరణలోకి తీసుకువచ్చి పేదలకు మేలు చేద్దామనే ఆలోచన కూడా చేయకపోవడం గమనార్హం. ఇక మంత్రులు పయ్యావుల కేశవ్, సవితకు వారి నియోజకవర్గాల్లో వ్యవహారాలను చూసుకునేందుకు తీరికలేని పరిస్థితి నెలకొందనే విమర్శలు ఉన్నాయి. సర్వజనాస్పత్రిలో అటకెక్కిన ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణం చాలీచాలని పడకలతో గర్భిణులు, బాలింతలకు తప్పని అవస్థలు -
ఉద్యోగోన్నతి లేక ఉసూరు
● డీటీలకు అడహక్ పదోన్నతులపై దృష్టి సారించని ఉన్నతాధికారులు ● జేఏల విషయంలోనూ అలసత్వం ● నిరాశ నిస్పృహల్లో ఉద్యోగులుఅనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగాన్ని ముందుండి నడిపించే రెవెన్యూ శాఖ ఉద్యోగుల్లో నిర్లిప్తత నెలకొంది. ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి ఉద్యోగులను నిరాశ నిస్పృహల్లోకి నెడుతోంది. ఈ ప్రభావం వారి పనితీరుపైనా పడుతోంది. జిల్లాలో ఏడు చోట్ల తహసీల్దారు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని కూడేరు మండలంలో ఏడాది దాటినా రెగ్యులర్ తహసీల్దార్ను నియమించలేదు. తాడిపత్రి, వజ్రకరూరు, విడపనకల్లు తహసీల్దారు స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. కళ్యాణదుర్గం, అనంతపురం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయాల్లో పరిపాలనాధికారి, కలెక్టరేట్లో భూ సంస్కరణల విభాగంలో స్థానాలు భర్తీ కాలేదు. అడహక్ పదోన్నతులేవీ..? తహసీల్దారు పదోన్నతి ప్యానల్లో ఉన్న డిప్యూటీ తహసీల్దార్లకు అడహక్ పదోన్నతి కల్పించి ఖాళీగా ఉన్న ఆయా స్థానాల్లో పోస్టింగ్ ఇస్తారు. దీంతో ఇన్చార్జ్ పాలనకు ఆస్కారం ఉండదు. గతంలో అనేక సార్లు ఇలానే అడహక్ పదోన్నతులు కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ దిశగా ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదోన్నతుల కల్పనలో జాప్యం రెవెన్యూ శాఖలో పదోన్నతులు ఎండమావులుగా మారాయి. ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెవెన్యూశాఖలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 32 ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో పదోన్నతికి అర్హులైన జూనియర్ అసిస్టెంట్లు 30 మంది ఉన్నా ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంపై ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. పని నాణ్యతపై ప్రభావం ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసులో కోరుకునేది పదోన్నతే. దీనికితోడు శాఖా పరంగా అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో పొందితే ఉత్సాహంగా విధులు నిర్వర్తిస్తారు. అలాంటి కీలక విషయాల్లో తీవ్ర జాప్యం జరిగితే మానసిక వేదనకు గురవుతారు. ఆ ప్రభావం పడి పనిలో నాణ్యత లోపిస్తుంది. రెవెన్యూశాఖలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. పదోన్నతులపై ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రెవెన్యూ ఉద్యోగులు కోరుతున్నారు. -
పడిగాపులు.. నిలదీతలు.. వాగ్వాదాలు
కూడేరు/కణేకల్లు/యల్లనూరు: యూరియా కోసం రైతులకు పడిగాపులు తప్పడం లేదు. గంటల తరబడి వేచి ఉన్నా తగినంత యూరియా కూడా దొరక్కపోవడంతో కడుపు మండిన అన్నదాతలు అధికారులను నిలదీస్తున్నారు.● కణేకల్లులో యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు సోమవారం ఉదయం 7 గంటలకే ఏఓ కార్యాలయం వద్ద బారులు తీరారు. క్యూలో నిల్చొని టోకెన్లు తీసుకొన్నారు. 11 గంటల తర్వాత ఎండతీవ్రత ఎక్కువ కావడంతో నిల్చునే ఓపిక లేక పాసుపుస్తకాలు, బ్యాగులను వరుసలో పెట్టి చెట్ల కిందకు చేరుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ‘నేను ముందు.. కాదు నేనే ముందు’ అంటూ పలువురు రైతులు కౌంటర్ వద్ద పరస్పరం గొడవకు దిగారు. అయితే, ఎంత సేపు వేచి ఉన్నా ఒక్కో రైతుకు 2 బస్తాలే ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ● కూడేరులోని వ్యవసాయ గోదాము వద్ద సోమవారం యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. అయితే, స్టాక్ తక్కువ ఉంది.. ఒక్కో రైతుకు ఒక బస్తానే ఇస్తామని ఏఓ శుభకర్ చెప్పడంతో కడుపు మండిన రైతులు రెండు బస్తాలివ్వాలంటూ ఆయనతో వాగ్వాదానికి దిగారు. ● యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లి సచివాలయానికి యూరియా రాకపోవడంతో రైతులు సోమవారం మండల కేంద్రంలోని సొసైటీ వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు. ఇన్చార్జ్ వ్యవసాయాధికారి మధుకుమార్ రైతులతో ఫోన్లో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. మంగళవారం సాయంత్రానికి లోడు వస్తుందని చెప్పడంతో రైతులు శాంతించారు. -
ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు బాబూ?
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సూటి ప్రశ్న అనంతపురం కార్పొరేషన్: ‘ఎన్నికల ముందు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఏదేదో చేసేస్తాం అంటూ నమ్మబలికారు. సూపర్ సిక్స్తో పాటు 143 హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక తూతూమంత్రంగా కొన్ని పథకాలు అమలు చేశారు. ఇప్పుడేమో అన్నీ అమలు చేసినట్లు సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అంటూ సభ ఏర్పాటు చేస్తున్నారు. అసలు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారో అర్థం కావడం లేదు’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10న జిల్లా కేంద్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు అసలు సిగ్గుందా? అని ప్రశ్నించారు. ఆయన రాజకీయ జీవితమంతా పచ్చి అబద్ధాలేనన్నారు. ‘సూపర్ సిక్స్’లో మొదటి హామీ అయిన నిరుద్యోగ భృతికే దిక్కు లేదన్నారు. ఇంట్లోని ప్రతి పిల్లాడికీ ‘తల్లికి వందనం’ అందిస్తామని చెప్పి అర్హులకు అన్యాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. జిల్లాలో 2.75 లక్షల మందికి ‘అన్నదాత సుఖీభవ’ ఇచ్చినట్లు అధికారులు లెక్కల్లో చూపుతున్నారని, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇంకా 30 వేల మందికి నగదు అందలేదని వివరించారు. ఇంతకన్నా దారుణం ఎక్కడా ఉండదన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించేసి రైతులను రోడ్డెక్కే పరిస్థితికి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. ఏటా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి కేవలం రెండు సిలిండర్లతో సరిపెట్టారన్నారు. వందకుపైగా హామీలను నెరవేర్చలేదన్నారు. గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తప్పక బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. వినతుల వెల్లువ అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. మొత్తం 410 అర్జీలు అందాయి. డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వినతుల్లో కొన్ని... ● వైకల్యం తక్కువగా ఉందంటూ పింఛను తొలగించారని రాయదుర్గం పట్టణం పాపట్ల బావి వీధికి చెందిన జి.బసవరాజు విన్నవించాడు. ఏళ్లుగా అందుతున్న పింఛన్ నిలిపేయడంతో ఇబ్బందులు పడుతున్నానని, రీ వెరిఫికేషన్ చేసి న్యాయం చేయాలన్నాడు. ● ఇల్లు బాగుందంటూ 2023 నుంచి వస్తున్న వృద్ధాప్య పింఛను తొలగించారని అనంతపురం రూరల్ మండలం రుద్రంపేటకు చెందిన నారాయణస్వామి వాపోయాడు. పునరుద్ధరించాలని వేడుకున్నాడు. ● డీడీ చెల్లించి ఐదు నెలలవుతున్నా ట్రాన్స్ ఫార్మర్ మంజూరు చేయలేదని రాప్తాడు మండలం మరూర్ చెర్లోపల్లికి చెందిన దివ్యాంగుడు నాగేంద్ర వాపోయాడు. ఈ ఏడాది మే 2న రూ.24 వేలు డీడీ చెల్లించానని, పదేపదే తిరగలేనని విన్నవించినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందాడు. జిల్లాకు 871 మెట్రిక్ టన్నుల యూరియా అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాకు 871 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. కోరమాండల్ కంపెనీ నుంచి 601 మెట్రిక్ టన్నులు, పారాదీప్ ఫాస్పేట్ కంపెనీ నుంచి 270 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరిందన్నారు. ఇందులో మార్క్ఫెడ్కు 530 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 341 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. జేసీ ఆదేశాల మేరకు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. -
యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ రాప్తాడు: యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఆదివారం ఆయన రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లి పంచాయతీ అయ్యవారిపల్లి రోడ్లో ఉన్న మార్క్ఫెడ్ గోడౌన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంత వరకు ఎంత యూరియా వచ్చింది.. రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్లకు ఎంత పంపించారు తదితర వివరాలను గోడౌన్ సిబ్బందితో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఏఐడీ యాప్ ద్వారా యూరియా సరఫరా సజావుగా చేపట్టాలన్నారు. యూరియా కొనుగోలులో సమస్యలు ఉన్నట్లయితే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. గోడౌన్కు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మరో 500 మెట్రిక్ టన్నులు వస్తోందన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, గోడౌన్ మేనేజర్ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. ఎరువుల విషయంపై ఫిర్యాదులకు టోల్ఫ్రీ అనంతపురం అర్బన్: ఎరువులకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదివారం తెలిపారు. ఎరువుల కొరత, అధిక ధరలకు విక్రయం, అక్రమ రవాణా, పంపిణీలో అవకతవకలు తదితర ఫిర్యాదులనుకమాండ్ కంట్రోల్ రూమ్ 85002 92992 నంబరుకు ఫోన్ చేసి తెలపాలని కలెక్టర్ సూచించారు. -
అస్పష్టత.. అయోమయం
● డీఎస్సీ–25 సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియలో పొరబాట్లు ● తల పట్టుకుంటున్న అధికారులు ● అన్ని సబ్జెక్టులను కలపడంతోనే దుస్థితి అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–25పై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అటు అభ్యర్థులు, ఇటు వెరిఫికేషన్ అధికారులను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. గతంలో డీఎస్సీ నిర్వహణలో మెరిట్ జాబితాలు ప్రకటించగానే సబ్జెక్టుల వారీగా నిపుణులను ఏర్పాటు చేసుకుని సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేపట్టేవారు. కేటాయించిన సబ్జెక్టులో మెరిట్ సమస్య ఉత్పన్నమైనా ఎక్కడ పొరబాటు జరిగిందో ఇట్టే తెలిసిపోయేది. వెంటనే సరిదిద్దేవారు. తర్వాత ఎంపిక జాబితాను ప్రకటించేవారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభ్యర్థులను పక్కన పెడితే సంబంధిత అధికారులకే స్పష్టత లేక తలలు పట్టుకుంటున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయినా రీవెరిఫికేషన్, క్రాస్ వెరిఫికేషన్ దుస్థితి తలెత్తుతుండడంతో టెన్షన్ పడుతున్నారు. జిల్లాలో మొత్తం 807 వివిధ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మెరిట్ జాబితా విడుదల చేసినా ఏ పోస్టులో ఏయే కేటగిరీ అభ్యర్థులకు ఎక్కడ మొదలై, ఎక్కడ కటాఫ్ అవుతుందనే వివరాలు లేవు. నేరుగా అభ్యర్థుల మొబైళ్లకు కాల్ లెటర్లు పంపి ఆ జాబితా మాత్రమే విద్యాశాఖ అధికారులకు పంపారు. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచారంటూ చాలామంది అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వాస్తవానికి తక్కువ మార్కులు వచ్చిన వారు ఏదో ఒక రిజర్వేషన్ కేటగిరీ కింద వచ్చి ఉంటారు. పూర్తిస్థాయి జాబితా అధికారుల వద్ద లేకపోవడంతో దీనిపై స్పష్టత ఇవ్వలేక వారు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలనకు మొత్తం 16 టీంలు ఏర్పాటు చేశారు. ఒక టీంకు ఒక సబ్జెక్టు అభ్యర్థులను కేటాయించి ఉంటే ఆ సబ్జెక్టుకు ఏయే సర్టిఫికెట్లు ఉండాలనేది ఒకటికి రెండుసార్లు పరిశీలించి అన్నీ కరెక్టుగా ఉన్నాయా...లేదా అని చూసేందుకు సులువుగా ఉండేది. ఎస్జీటీ, ఎస్జీటీ కన్నడ, ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులు, టీజీపీ, పీజీటీ అన్ని సబ్జెక్టులు, ప్రిన్సిపాల్స్, పీడీ, పీఈటీ ఇలా మొత్తం 16–20 సబ్జెక్టుల అభ్యర్థులను ప్రతిటీంకూ కేటాయించడం సమస్యగా మారింది. ఒక్కో టీం అన్ని సబ్జెక్టులకు సంబంధించి 50 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఆయా బృందాల అధికారులు తికమకపడ్డారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే చిన్న పొరబాటు జరిగినా అర్హుడు అనర్హత జాబితాలోకి, అనర్హుడు అర్హత జాబితాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఒత్తిడిలో కొన్ని తప్పులు జరిగాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. 2017కు ముందు ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ నిబంధన వర్తించదు. 2011లో 48 శాతంతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థిని పొరబాటున అనర్హత జాబితాలోకి చేర్చారు. మళ్లీ సరిదిద్దారు. ఇలా రీవెరిఫికేషన్, క్రాస్ వెరిఫికేషన్ సమయంలో 10 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల నమోదులో జరిగిన పొరబాట్లను గుర్తించారు. ఈ క్రమంలో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్న ప్రతిసారీ పొరపాట్లు బయటపడుతుండడం అధికారులను కలవరపెడుతోంది. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల నుంచి ‘ప్రిఫరెన్స్’ తీసుకోవడంతో సమస్య నెలకొంది. ఎస్జీటీ, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్ ఇలా చాలా మంది అభ్యర్థులు 2,3,4 పోస్టులకు ఎంపికయ్యారు. అవగాహన లేక పోస్టుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఎస్జీటీ పోస్టుకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు అదే వారిపాలిట శాపంగా మారింది. ఇదే పోస్టు తీసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేయడంతో కొందరు అభ్యర్థులు తెలివిగా సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఎస్జీటీ సర్టిఫికెట్లు లేవని చెప్పారు. ఎస్జీటీ సర్టిఫికెట్లు లేకుంటే తర్వాత (ఎస్ఏ, పీజీటీ, టీజీటీ) పోస్టు ఇస్తారు. ఎన్ని పోస్టులకు ఎంపికై ఉంటే అన్ని పోస్టుల సర్టిఫికెట్లు జత చేస్తేనే అర్హుల జాబితాలో చేర్చాలని, లేదంటే అనర్హులుగా పరిగణించాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆయా అభ్యర్థుల వెంట పడి మరీ సర్టిఫికెట్లను తెప్పించుకుని రీ వెరిఫికేషన్ చేశారు. ఒత్తిడిలో తప్పులు.. ‘ప్రిఫరెన్స్’తోనే తంటా.. -
బసంపల్లిలో మృతదేహం ఖననానికి అడ్డంకులు
చెన్నేకొత్తపల్లి: మండలంలోని బసంపల్లిలో మాల సామాజిక వర్గానికి చెందిన నారాయణ (85) ఆదివారం వేకువజామున మృతి చెందాడు. స్థల సమస్య కారణంగా ఖననానికి ఇబ్బందులు ఎదురుకావడంతో మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచుకోవడం కలకలం రేపింది. గ్రామంలో దళితుల శ్మశాన స్థల వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ, ఆనంద్, ప్రకాష్తో పాటు దళిత వర్గీయుల మధ్య స్థల వివాదం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. దీంతో దళితుల కుటుంబాల్లో ఎవరు మరణించినా వారి మృతదేహాన్ని ఖననం చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం నారాయణ కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందిని తెలుసుకున్న తహసీల్దార్ సురేష్కుమార్, ఎస్ఐ సత్యనారాయణ గ్రామానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించారు. ప్రస్తుతం శ్మశాన స్థల వివాదం కోర్టులో ఉందని, పరిష్కారం అయ్యే వరకూ మృతదేహాలను మరో చోట ఖననం చేయాలని సూచించారు. అయితే.. ఆనవాయితీ మేరకు అదే స్థలంలోనే ఖననం చేసేలా అనుమతులు ఇవ్వాలని అధికారులను దళితులు కోరారు. -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి. వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను ‘పరిష్కార వేదిక’లోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కసాపురం ఆలయం మూసివేత గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానాన్ని ఆదివారం మూసివేశారు. రాత్రి 9.50 నుంచి 12.24 గంటల వరకూ సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకే ఆలయంలో మధ్యాహ్నిక, సాయంకాల ఆరాధనలు, హారతులు నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం అనంతరం సోమవారం వేకువజామున ఆలయ శుద్ధి, సంప్రోక్షణతో మూలవిరాట్కు నిత్యాభిషేకం నిర్వహించి ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. మౌనగిరి క్షేత్రంలో కర్ణాటక హైకోర్టు జడ్జి రాప్తాడు: మండలంలోని హంపాపురం వద్ద 44వ జాతీయ రహదారి సమీపంలో ఉన్న మౌనగిరి క్షేత్రాన్ని జిల్లా అదనపు జడ్జి సత్యవాణితో కలసి ఆదివారం కర్ణాటక హైకోర్టు జడ్జి దేవదాస్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా వారికి క్షేత్రం పీఠాధిపతి ఈశ్వరయ్యస్వామి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. క్షేత్రంలోని ఏకశిలా ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ సమీపంలో దక్షిణమూర్తి దేవాలయ నిర్మాణానికి న్యాయమూర్తి దంపతులు భూమిపూజ చేశారు. -
అది హిట్ కాదు.. సూపర్ చీట్ సభ
● చంద్రబాబు 14 నెలల్లో జిల్లాకు వెలగబెట్టింది శూన్యం ● రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఫైర్ రాప్తాడురూరల్: ‘చంద్రబాబు ఎన్నికల ముందు 200కు పైగా హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్లో రెండు పథకాలు అరకొరగా అమలు చేయగానే ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్’ అంటున్నారు. అది సూపర్ హిట్ కాదు సూపర్ చీట్ సభ’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న తలపెట్టిన ‘అన్నదాత పోరు’కు సంబంధించిన వాల్పోస్టర్లను ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలకు రూ. 10 లక్షల కోట్లు అవసరం అవుతాయని, ఇప్పటిదాకా కనీసం రూ. 50 వేల కోట్ల పథకాలు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే ప్రతినెలా రూ. 2 వేలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారన్నారు. జిల్లాలో ఉపాధి లేక వలసలు వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. జగన్మోహన్రెడ్డి ఇస్తున్న పథకాలేవీ ఆపను... వాటితో పాటు అదనంగా ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ‘చేయూత, ఆసరా, నేతన్న నేస్తం’ అందించలేదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దుష్ప్రచారం చేసి అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పి ఈరోజు ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు యూరియా కొరత కనిపించలేదా.. బ్లాక్మార్కెట్కు తరలించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 14 నెలల్లో ఏం వెలగబెట్టారు? ఈ 14 నెలల్లో జిల్లాకు చంద్రబాబు ఏం వెలగబెట్టారని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్ను తిడుతూ లోకేష్ వద్ద మెప్పు పొందాలని చూస్తున్నారన్నారు. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పి ఒక్క ఇల్లయినా ఇచ్చారా అని దుయ్యబట్టారు.గత ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి ఏడింటి నిర్మాణాలు కూడా పూర్తి చేశారన్నారు. నేడు చంద్రబాబు వాటిని సంపూర్ణంగా ప్రైవేట్పరం చేశారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి ఆర్నెల్లలో ప్రజలకు రూ. 16 వేల కోట్ల వాతలు పెట్టారన్నారు. గ్రేటర్ రాయలసీమ పరిధిలో రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తే సంపూర్ణంగా నీటి ప్రాజెక్టులు పూర్తవుతాయని, అలాంటి వాటిని పక్కన పెట్టేసి అమరావతికి మాత్రమే పరిమితమయ్యారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోలేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు అనుమతులు తీసుకురావడంపై ఎందుకు చిత్తశుద్ధి చూపించడం లేదని విమర్శించారు. హంద్రీ–నీవా వెడల్పులో భాగంగా గత ప్రభుత్వం 6,300 క్యూసెక్కులకు అనుమతులిచ్చి పనులు ప్రారంభిస్తే దానిని 3,800 క్యూసెక్కులకు కుదించడం వంచన కాదా అన్నారు. కేవలం చిత్తూరు జిల్లాకు నీటిని తీసుకెళ్లేందుకు యుద్ధప్రాతిపదికన లైనింగ్ పనులను పూర్తి చేయడం జిల్లా రైతులను మోసం చేయడం కాదా అని నిలదీశారు. అన్ని వర్గాలనూ మోసగించిన చంద్రబాబుకు ‘అనంత’కు రావడానికి అర్హత ఉందా అని ప్రశ్నించారు. పయ్యావుల కేశవ్ ఫెయిల్యూర్ మినిస్టర్ అని, మరో మంత్రి సవితమ్మకు పులివెందుల వెళ్లి దొంగ ఓట్లు వేయించే శ్రద్ధ జిల్లా ప్రజల పట్ల లేదని విమర్శించారు. మంత్రి సత్యకుమార్ ధిల్లీలో ఉంటారో, లక్నోలో ఉంటారో, బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంటారో ఎవరికీ తెలీదన్నారు. ఆ ఎమ్మెల్యేలు అన్నమే తింటున్నారా? అనంతపురం, రాప్తాడు ఎమ్మెల్యేలు కనీసం కడుపునకు అన్నం తింటున్నారా అని మండిపడ్డారు. వారి నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఇళ్ల నిర్మాణాలను 14 నెలలుగా విజిలెన్స్ తనిఖీల పేరుతో నిలబెట్టారని, ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారంటే ఆ ఇద్దరికీ సిగ్గుందా అని దుయ్యబట్టారు. అసమర్థ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధనాపేక్ష కోసం పేదల ఇళ్ల నిర్మాణాలు అటకెక్కించారని ధ్వజమెత్తారు. సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్, వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, బండి పవన్, లింగారెడ్డి, లోకనాథరెడ్డి, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
●ఇసుకాసురుల పాపం.. ఇదే సాక్ష్యం
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుకాసురులకు హద్దే లేకుండా పోయింది. కాసుల కక్కుర్తితో యథేచ్ఛగా ఇసుకను కొల్లగొడుతున్నారు. వారు చేస్తున్న పాపాలు సామాన్యులకు శాపాలుగా మారాయి.అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈచిత్రం. బొమ్మనహాళ్ మండలం కల్లుదేవనహళ్లి వద్ద హగరి నదిలో గతంలో చేతి పంపు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి హగరి నదిలో ఇసుక కొల్లగొట్టడం ప్రారంభించిన ‘పచ్చ’ నేతలు.. నదిలోని చేతి పంపు చుట్టూ ఇసుక తోడేసి గుంతలు మిగిల్చారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వేదావతి హగరి పొంగి ప్రవహించడంతో చేతి పంపు చుట్టూ ఉన్న కొద్దిపాటి ఇసుక కూడా కొట్టుకుపోయింది. దీంతో ప్రస్తుతం అందనంత ఎత్తుకు చేతి పంపు చేరింది. ఒకప్పుడు సులువుగా నీటిని పట్టుకున్న స్థానికులు నేడు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. కల్లుదేవనహళ్లిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ శీనానాయక్ దృష్టికి తీసుకెళ్లగా,పరిశీలించి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. – బొమ్మనహాళ్: -
రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
● ప్రతి నెలా బ్లాక్ మార్కెట్కు టన్నుల కొద్దీ రేషన్ బియ్యం ● పేదల పొట్ట కొడుతున్న డీలర్లు ● కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసుల కనుసన్నల్లోనే దందా రేషన్ మాఫియా అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చివరకు కార్డుదారులకు పంపిణీ చేయకముందే బియ్యాన్ని నల్లబజారుకు తరలించేస్తున్నారు. బియ్యం కావాలని ఎవరైనా అడిగితే.. వచ్చే నెలలో తీసుకోమని చెబుతున్నారు. జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసుల కనుసన్నల్లోనే టీడీపీ నేతలు అక్రమ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రి టౌన్: జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు టీడీపీ నేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్ కావడం, అందులో అధికారులతో జరిగిన ఒప్పందాలపై ప్రస్తావించడం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ క్రమంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లబ్ధిదారులకు డీలర్లు నగదు అంటగడుతూ రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్కు తరలించేస్తున్నారు. ఒక్క తాడిపత్రి నియోజకవర్గం నుంచే ప్రతి నెలా వందల టన్నుల రేషన్ బియ్యాన్ని మాఫియా బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. అధికార పార్టీ అండతో పోలీసులను లోబర్చుకున్న కొందరు టీడీపీ నేతలు తాడిపత్రి నియోజకవర్గంలో రేషన్ మాఫియాకు తెరలేపారని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. కేవలం 30 రోజుల వ్యవధిలోనే యాడికి, తాడిపత్రిలో వందల కొద్దీ టన్నుల రేషన్ బియ్యం నిల్వలను అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఆ రెండు మండలాల్లో అత్యధికం.. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి, తాడిపత్రి మండలాల్లో టీడీపీ నాయకుల అండతో కొందరు డీలర్లు ఒకట్రెండు రోజులు మాత్రమే లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేసి, మిగిలిన వారి వేలి ముద్రలు తీసుకుని రేషన్ స్టాక్ లేదని చెబుతూ నగదు ముట్టజెబుతున్నారు. ఇంకొందరు డీలర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వేలి ముద్రలు తీసుకుని నగదు అందజేస్తూ దందాకు తెరలేపారు. తాడిపత్రిలోని భగత్సింగ్ నగర్, నందలపాడు, గన్నెవారిపల్లి కాలనీ, రంగప్ప కాలనీ, శ్రీనివాసపురం, జయనగర్ కాలనీ, తాడిపత్రి మండలంలోని చిన్నపొలమడ, యాడికి, రాయలచెరువు ప్రాంతాల్లో మాఫియాను తలదన్నేలా రేషన్ దందా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా 150 టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని పదుల సంఖ్యలో లారీలు, ఐచర్లలో పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తాడిపత్రి మండలం పెద్ద పొలమడ వద్ద ఉన్న గోదాము నుంచే నేరుగా బ్లాక్ మార్కెట్కు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. రేషన్ బియ్యం పట్టివేత వజ్రకరూరు: మండలంలోని రాగులపాడు క్రాస్ వద్ద ఆదివారం ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగస్వామి తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, ఆటోను సీజ్ చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఉరవకొండలోని స్టాక్ పాయింట్కు తరలించినట్లు సీఎస్డీటీ సుబ్బలక్ష్మి తెలిపారు. -
బొప్పాయి రైతులకు తిప్పలు
● మార్కెట్లో ధరలేక నష్టాలు ● చెట్లపైనే వదిలేసిన కాయలు గుమ్మఘట్ట: మార్కెట్లో ధరల్లేక బొప్పాయి సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని ఉద్యాన పంటలపై దృష్టి సారించిన రైతులు జిల్లా వ్యాప్తంగా 630 ఎకరాల్లో బొప్పాయి సాగు చేపట్టారు. ఉద్యానవఅధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ అధిక దిగుబడులూ సాధించారు. అయితే పంట చేతికి వచ్చే సరికి మార్కెట్లో ధరలు పతనమయ్యాయి. కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో తోటల్లో చెట్లపైనే కాయలను రైతులు వదిలేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న దళారులు కిలో రూ.7 చొప్పున కొనుగోలు చేస్తామంటూ వేదనను మిగిలిస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో బొప్పాయి సాగుకు రూ. లక్ష వరకు ఖర్చు పెట్టినట్లు రైతులు తెలిపారు. -
ఈతకు వెళ్లి యువకుడి మృతి
రాప్తాడు: స్థానిక పండమేరు వంకలోకి ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి మృతి చెందాడు. వివరాలు.. మండలంలోని పండమేరు వంకపై అయ్యవారిపల్లి చెక్ డ్యాం వద్ద ఆదివారం ఈత కొట్టేందుకు స్నేహితులతో కలసి రాప్తాడుకు చెందిన తలారి గిరీష్కుమార్ (27) వెళ్లాడు. లోతైన ప్రాంతానికి వెళ్లి తిరిగి రాలేక నీట మునిగాడు. స్నేహితులు గాలించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు. సాయంత్రం 6 గంటల సమయంలో మృతదేహం బయటపడింది. ఘటనతో రాప్తాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. ‘హంద్రీ–నీవా’లో తెలంగాణ వాసి గల్లంతు వజ్రకరూరు: మండల పరిధిలోని హంద్రీ–నీవా కాలువలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తెలంగాణలోని నల్గొండ జిల్లా కందుకూరు మండలం శాంతిగూడెం గ్రామానికి చెందిన నాగిరెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మహాలయ పౌర్ణమిని పురస్క రించుకుని బెంగళూరు నుంచి తన స్నేహితులతో కలసి వజ్రకరూరు మండలం పీసీ.ప్యాపిలికి ఆదివారం వచ్చాడు. ఈ క్రమంలో పీసీ ప్యాపిలి వద్ద ఉన్న హంద్రీనీవా ప్రధాన కాలువ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లిన నాగిరెడ్డి... ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి గల్లంతయ్యాడు. కళ్ల ఎదుటే నీటిలో కొట్టుకు పోతున్న నాగిరెడ్డిని కాపాడేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నాగిరెడ్డి స్నేహితుడు రాజశేఖర్ సమాచారంతో పోలీసులు రంగంలో దిగి గాలింపు చర్యలు చేపట్టారు. బైక్ పై నుంచి కిందపడి వ్యక్తి మృతిపరిగి: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పరిగి మండలం గణపతిపల్లికి చెందిన వెంకటస్వామి (60)కి భార్య ముత్యాలమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యక్తిగత పనిపై ఆదివారం పైడేటి క్రాస్కు వచ్చిన వెంకటస్వామి పని ముగించుకుని సాయంత్రం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. స్వగ్రామానికి సమీపంలోకి చేరుకోగానే వాహనం అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వెంటనే 108 అంబులెన్స్లో హిందూపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
అరుదైన వ్యాధి.. అంతులేని వ్యథ
చూడడానికి బాగానే కనిపిస్తారు.. మంచంపై నుంచి కాలు కింద మోపలేరు.. చేతులు పైకెత్తలేరు.. దేనినీ పట్టుకోలేరు.. సొంత పనులూ చేసుకోలేరు.. ఏ తోడు లేకుండా ఒక్క ఇంచు కూడా కదల్లేరు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. జీవశ్చవం. అరుదైన ఎంఎన్డీ వ్యాధితో మంచానికి పరిమితమైన గార్లదిన్నె మండలం పాతకల్లూరులోని నిరుపేద వివాహిత కన్నీటి గాథ ఇది. గార్లదిన్నె: మండలంలోని పాతకల్లూరు ఎస్సీ కాలనీలో నివాసముంటున్న బాలయ్య, నాగేంద్రమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. మిగిలిన ఇద్దరు కుమార్తెలు ఇంటి వద్దేనే ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం నాగేంద్రమ్మ కాళ్లు చేతులు సచ్చు పడడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. నయం కాకపోవడంతో బెంగళూరు, గోవా తదితర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. కబళించిన అరుదైన వ్యాధి.. రూ.లక్షలు ఖర్చు పెడుతున్నా వ్యాధి నయం కాకపోవడంతో బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి నాగేంద్రమ్మను కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అరుదైన మోటారు న్యూరాన్ వ్యాధి (ఎంఎన్డీ) బారిన పడినట్లుగా నిర్ధారించారు. నరాల బలహీనత వల్ల కాళ్లు, చేతులు సచ్చు పడిపోయాయని, శస్త్రచికిత్స చేస్తే నయమయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇందుకు రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో నిరుపేద కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకూ వైద్యానికి చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. రూ.4 వేల విలువైన మందులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన తల్లికి శస్త్రచికిత్స చేయించి ప్రాణభిక్ష పెట్టాలని కుమార్తె శ్రీలక్ష్మి వేడుకుంటోంది. అందని ప్రభుత్వ పింఛన్.. రెండున్నర సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన నాగేంద్రమ్మకు పింఛన్ మంజూరు చేయడంలో నిబంధనలు అడ్డు వస్తున్నాయి. దివ్యాంగుల పింఛన్ రావాలంటే సదరం సర్టిఫికెట్ ఉండాలని అధికారులు అంటున్నారు. దీంతో సదరంలో స్లాట్ బుక్ చేసుకునేందుకు సచివాలయానికి వెళితే అప్పటికే గడువు ముగిసినట్లుగా అక్కడి సిబ్బంది తెలిపారు. ఇలా ఇప్పటి వరకూ ఐదారు సార్లు జరిగినట్లు కుటుంబసభ్యులు వాపోతున్నారు. అరుదైన వ్యాధితో మంచాన పడిన వివాహిత దిక్కుతోచని స్థితిలో భర్త, పిల్లలు ఇప్పటికే బెంగళూరు, గోవాలో వైద్యానికి రూ.లక్షల ఖర్చు శస్త్రచికిత్సతో ఫలితముంటుందన్న నిపుణులు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబం సాయం చేయదలిస్తే.. పేరు : శ్రీలక్ష్మి (కుమార్తె) బ్యాంకు : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, కల్లూరు, గార్లదిన్నె మండలం బ్యాంకు ఖాతా : 3354 766 8711 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్ 0002737 ఫోన్ నంబర్ : 91006 46288 -
వసూళ్లలో మార్కెట్ కమిటీల డీలా
● అనంతపురం, ఉరవకొండ మినహా మిగతావన్నీ వెనుకంజ అనంతపురం అగ్రికల్చర్: వివిధ రకాల మార్కెట్ ఫీజు వసూళ్లలో జిల్లాలోని చాలా మార్కెట్ యార్డులు డీలా పడ్డాయి. అనంతపురం, ఉరవకొండ మార్కెట్ కమిటీలు మాత్రమే లక్ష్యసాధనలో ముందంజలో ఉండగా.. మిగిలిన ఏడు కమిటీలు వసూళ్లలో వెనుకబడ్డాయి. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో ఉన్న 9 మార్కెట్ కమిటీలు, 15 చెక్పోస్టుల ద్వారా రూ.13.49 కోట్లు రాబట్టాలని మార్కెటింగ్ శాఖ లక్ష్మ నిర్ధేశన చేసింది. ఆగస్టు నెలాఖరుతో ముగిసిన ఐదు నెలల కాలంలో రూ.4.68 కోట్లు వసూలైంది. అనంతపురం టార్గెట్ రూ.5.10 కోట్లు కాగా ఇప్పటికే 45.60 శాతంతో రూ.2.32 కోట్లు సాధించారు. అలాగే ఉరవకొండ టార్గెట్ రూ.90 లక్షలు కాగా 57.84 శాతంతో రూ.52 లక్షలు వసూలు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుత్తి మార్కెట్ కమిటీ కేవలం 13 శాతం వసూళ్లతో అట్టడుగున కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో రాప్తాడు 17 శాతం, గుంతకల్లు 20 శాతం, కళ్యాణదుర్గం 21 శాతంతో లక్ష్యానికి అందనంత దూరంలో పయనిస్తున్నాయి. రాయదుర్గం 24 శాతం, తాడిపత్రి 26 శాతం, శింగనమల 32 శాతంతో కాస్త ఫరవాలేదన్నట్లుగా ఉన్నాయి. గత నాలుగేళ్లుగా అనంతపురంతో పోటీ పడి అగ్రస్థానం సాధిస్తూ వస్తున్న శింగనమల మార్కెట్ కమిటీలో వసూళ్లు దారుణంగా పడిపోవడం విశేషం. -
వీర విజృంభణ
అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–19 ఇన్విటేషన్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ల్లో కోగటం హనీష్ వీరారెడ్డి దూకుడు ప్రదర్శించాడు. కేవలం 40 బంతుల్లో 107 పరుగులు సాధించి ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. వివరాలు.. ఆర్డీటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం ఆంధ్రా ప్రెసిడెంట్, ఆంధ్రా సెక్రటరీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి సెక్రటరీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 48.5 ఓవర్ల వద్ద 167 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఆర్దిత్ రెడ్డి 37 పరుగులు, జి.మన్విత్ రెడ్డి 31 పరుగులు చేశారు. ప్రెసిడెంట్ జట్టు బౌలర్ షాహుల్ హమీద్ ఐదు వికెట్లు తీసి సెక్రెటరీ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. అనంతరం బ్యాటింగ్ బరిలో దిగిన ఆంధ్రా ప్రెసిడెంట్ జట్టు కేవలం 27.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 170 పరుగుల లక్ష్మాన్ని ఛేదించింది. బ్యాటర్ కోగటం హనీష్ వీరారెడ్డి 40 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 107 పరుగులు సాధించాడు. మెరుపు ఇన్నింగ్స్తో జట్టు విజయానికి బాటలు వేశాడు. మధ్యప్రదేశ్ వరుస విజయాలు.. మధ్యప్రదేశ్ జట్టు వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మధ్యప్రదేశ్, బరోడా జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 48.1 ఓవర్ల వద్ద 218 పరుగులకు ఆలౌట్ అఇంది. యశ్వర్ధన్ సింగ్ 128 బంతుల్లో 106 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు 38.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌట్ అయింది. 88 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్ జట్టు గెలుపొందింది. 40 బంతుల్లో 107 పరుగులు -
అంతిమ విజయం న్యాయానిదే
గుంతకల్లు టౌన్: వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి సర్కారు ఎన్ని కుట్రలు చేసి అక్రమ కేసులు బనాయించినా అంతిమ విజయం న్యాయానిదే అవుతుందని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మద్యం అక్రమ కేసులో విశ్రాంత అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసినా... వారిని జైలు నుంచి విడుదల చేయకుండా అడ్డుకుంటున్న జైలు అధికారుల తీరుపై మండిపడ్డారు. గౌరవ న్యాయస్థానాల ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందన్నారు. గతంలో తాడిపత్రికి వెళ్లడానికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చినా సంబంధిత అధికారులు బేఖాతరు చేశారన్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు చంద్రబాబు ఇకనైనా స్వస్తి పలకాలని హితవు పలికారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న దుర్మార్గమైన పరిస్థితులపై ప్రధాని మోదీ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భవాని, మాజీ చైర్మన్ జింకల రామాంజి, కౌన్సిలర్లు నీలావతి, కుమారి, లింగన్న, సుమో బాషా, కోఆప్షన్ సభ్యుడు ఫ్లయింగ్మాబు, నూర్నిజామి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి -
‘అనంత’ వాసులకు పురస్కారాలు
అనంతపురం కల్చరల్: అనంతపురానికి చెందిన పలువురు జాతీయస్థాయి పురస్కారాలను అందుకున్నారు. ఐదు దశాబ్దాలుగా కళాకారుల సేవలను గుర్తిస్తూ వారికి గౌరవ సత్కారాలనందిస్తున్న బళ్లారి కల్చరల్ యాక్టివిటీస్ అసోసియేషన్ వారు 53వ వార్షికోత్సవ వేడుకలు శనివారం బళ్లారిలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా జిల్లావాసులు జనప్రియకవి ఏలూరు యంగన్న, పద్యకవి ఒంటెద్దు రామలింగారెడ్డిలకు జోళదరాశి చంద్రశేఖరరెడ్డి పురస్కారం, రఘునాథ్కు విశ్వావసు ఉగాది పురస్కారం, ‘అనంత’ రంగస్థలానికి చిరస్మరణీయ సేవలందిస్తున్న రామగోవిందసాగర్, సాధుశేఖర్కు బళ్లారి రాఘవ స్మారక అవార్డులను నిర్వాహకులు డాక్టర్ బ్రహ్మయ్య, యశ్వంత్రాజ్ నాగిరెడ్డి తదితరులు అందించి సత్కరించారు. జాతీయ అవార్డులను అందుకున్న అనంత కళాకారులకు లలితకళాపరిషత్తు కార్యదర్శి గాజుల పద్మజ, కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు. -
కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
● పీఎంఎఫ్ఎంఈ కింద 35 శాతం రాయితీ ● ఎఫ్పీఎస్ ఈఓలు ఉమాదేవి, చంద్రశేఖర్ అనంతపురం అగ్రికల్చర్: ఆహారశుద్ధికి సంబంధించి కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూర్స్కు రాయితీలతో ప్రోత్సహిస్తున్నట్లు రెండు జిల్లాల ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఎఫ్పీఎస్) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (ఈఓలు) డి.ఉమాదేవి, జి.చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ప్రధానమంత్రి ఆహారశుద్ధి క్రమబద్ధీకరణ పథకం (పీఎం ఎఫ్ఎంఈ) కింద ఆసిక్తి కలిగిన వ్యాపారవేత్తలు, యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, ఎఫ్పీఓలు, రైతు సహకార సంఘాలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మహిళా పొదుపు సంఘాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. చిన్నపాటి కుటీర పరిశ్రమల ఏర్పాటు వల్ల స్వయం సమృద్ధి సాధించడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలనేదే ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రాజెక్టు విలువలో 10 శాతం లబ్ధిదారులు భరిస్తే... 35 శాతం ప్రభుత్వం రాయితీ రూపంలో ఇస్తుందన్నారు. మిగతా 55 శాతం బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఇందులో గరిష్టంగా రూ.10 లక్షల వరకు రాయితీ వర్తిస్తుందన్నారు. జిల్లాలో వేరుశనగ ఆధారిత ఉత్పత్తుల తయారీ యూనిట్లు అంటే వేరుశనగ నూనె, చిక్కీల తయారీ లాంటికి ప్రాధాన్యత ఇస్తూనే... సోలార్ డీహైడ్రేషన్, పొటాటో చిప్స్, చెక్కిలాలు, ఊరగాయలు, రోటీ మేకర్, మసాలా పొడులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్, శనగపప్పు, బేకరీ ఉత్పత్తులు, జెల్లీ, సాస్, మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులు, బొరుగులు, రైస్ బేస్డ్ ప్రొడక్ట్స్, చింతపండు తదితర మరో 20 నుంచి 30 రకాల ఉత్పత్తుల తయారీకి రాయితీలతో ప్రోత్సహిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు అనంతపురం జిల్లా ఈఓ డి.ఉమాదేవి (79950 86792), రీసోర్స్ పర్సన్ బి.హరీష్ (96767 96974), అలాగే శ్రీసత్యసాయి జిల్లా ఈఓ చంద్రశేఖర్ (79950 86791), రీసోర్స్ పర్సన్ (78933 47474)ను సంప్రదించాలని సూచించారు. -
వైఎస్సార్సీపీ నాయకులకు 41ఏ నోటీసుల జారీ
చెన్నేకొత్తపల్లి: రాప్తాడుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు సత్యనారాయణరెడ్డి, రామాంజనేయులు, వెంకటేష్కు చెన్నేకొత్తపల్లి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. వీరు గత నెలలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీకి చెందిన ఫణీంద్ర ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురినీ ఎస్ఐ సత్యనారాయణ శనివారం స్టేషన్కు పిలిపించి, కౌన్సెలింగ్ చేసి.. 41ఏ నోటీసులు అందజేశారు. 13న బీఎస్ఎన్ఎల్ లోక్ అదాలత్ అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ జిల్లా జనరల్ మేనేజర్ షేక్ ముజీబ్ పాషా శనివారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ కోర్టుల్లో నిర్వహించనున్న లోక్ అదాలత్లో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ఫోన్/ఎఫ్టీటీహెచ్ ఫోన్ల వినియోగదారులు తమ బకాయిలను రాయితీపై చెల్లించే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. క్లోజ్ చేసిన ఫోన్లకు సంబంధించిన వినియోగదారులకు న్యాయ సేవాధికార సంస్థల ద్వారా నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అటువంటి వారు లోక్ అదాలత్కు ముందే బకాయిలు చెల్లిస్తే లోక్ అదాలత్కు హాజరు కావాల్సిన అవసరం ఉండదన్నారు. -
9న ఎకాలజీలో ‘ఫార్మా’ అడ్మిషన్ మేళా
అనంతపురం అగ్రికల్చర్: ఫార్మా రంగంలో శిక్షణ, ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 9న అనంతపురం ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో అడ్మిషన్, ఉద్యోగ మేళా ఏర్పాటు చేసినట్లు ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికై న యువతీ యువకులకు స్వర్ణభారత్ ట్రస్ట్, విజయవాడలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ, వసతి సదుపాయం ఉంటుందన్నారు. ఫార్మా సెక్టార్ స్కిల్స్పై నైపుణ్యతతో కూడిన శిక్షణ, వివిధ ఫార్మాకంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 2023, 2024, 2025లో బీఎస్సీ లేదా ఎంఎస్సీ (బీజెడ్సీ) కెమిస్ట్రీ, డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలెక్ట్రానిక్స్, కెమికల్ ఇంజినీరింగ్, బీ–ఫార్మా లేదా డీ ఫార్మా లేదా ఎం ఫార్మా, బీఎస్సీ లేదా ఎంఎస్సీ (మైక్రోబయాలజీ), బీఈ లేదా బీటెక్ (కెమికల్ ఇంజినీరింగ్) అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 9న బయోడేటాతో మేళాకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు స్థానిక ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఎకాలజీ కార్యాలయం లేదా 81217 17846 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మూడో విడతలో ముగ్గురు అభ్యర్థులు ● నేడు సర్టిఫికెట్ల పరిశీలన అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–25లో మూడో విడతలో మరో ముగ్గురు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ముగ్గురి జాబితా శనివారం రాత్రి డీఈఓ కార్యాలయానికి అందింది. అభ్యర్థులకు మెసేజ్లు వెళ్లాయి. ఆదివారం ఉదయం డీఈఓ కార్యాలయంలో వారికి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డీఈఓ ఎం.ప్రసాద్బాబు తెలిపారు. ఇదిలాఉండగా జిల్లాలో మొత్తం 807 వివిధ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటిదాకా రెండు విడతల్లో 757 మంది అభ్యర్థులకు కాల్లెటర్లు అందాయి. వారందరి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. తాజాగా ముగ్గురి పేర్లు రావడంతో మొత్తం 760 మందికి కాల్లెటర్లు అందాయి. తక్కిన అభ్యర్థుల పరిస్థితిపై జిల్లా అధికారులకే స్పష్టత లేదు. ఇంతటితో ఆగిపోతుందా? ఇంకా ఎవరికై నా కాల్లెటర్లు వస్తాయా? అనేది అర్థంకాక అటు అధికారులు, ఇటు అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారు. భూ సమస్య పరిష్కారానికి చర్యలు అనంతపురం అర్బన్: పేద దళితుడు జి.కుళ్లాయిస్వామి భూమి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. అనంతపురం రూరల్ మండలం ఆలమూరు గ్రామానికి చెందిన జి.కుళ్లాయిస్వామి భూమి సమస్య గురించి ఈనెల 1న ‘సాక్షి’లో కథనం ప్రచురితమయ్యింది. దీనిపై అనంతపురం రూరల్ తహసీల్దారు మోహన్కుమార్ క్షేత్రస్థాయికి వెళ్లి బాధితుడు కుళ్లాయిస్వామి సమక్షంలో విచారణ చేశారు. కుళ్లాయిస్వామికి చెందిన భూమిని సాగు చేస్తున్న వారితో మాట్లాడారు. రికార్డు ప్రకారం సర్వే నంబరు 334–17లోని ఎకరా భూమి కుళ్లాయిస్వామికి చెందుతుందని, వెంటనే దాన్ని అప్పగించాలని చెప్పారు. త్వరలో సర్వే చేయించి హద్దులు నిర్ణయించి భూమిని స్వాధీనం చేస్తామని తహసీల్దారు హామీ ఇచ్చారని బాధితుడు కుళ్లాయిస్వామి తెలిపాడు. మనల్ చౌహాన్ అద్భుత సెంచరీ అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–19 ఇన్విటేషన్ టోర్నమెంట్ ఆర్డీటీ మైదానంలో కొనసాగుతోంది. శనివారం జరిగిన మ్యాచ్ల్లో ఆంధ్రా సెక్రెటరీ, మధ్యప్రదేశ్ జట్లు విజయం సాధించాయి. ● మధ్యప్రదేశ్, ఆంధ్రా ప్రెసిడెంట్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆంధ్రా ప్రెసిడెంట్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. మధ్యప్రదేశ్ జట్టు 48.2 ఓవర్లలో 283 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మనాల్ చౌహాన్ అద్భుత సెంచరీ (94 బంతుల్లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 126 పరుగులు) సాధించి జట్టుకు భారీ స్కోరును అందించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆంధ్రా ప్రెసిడెంట్ జట్టు 31.3 ఓవర్లలో 154 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మధ్యప్రదేశ్ జట్టు 138 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ● ఆంధ్రా సెక్రెటరీ, బరోడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత ఆంధ్రా సెక్రెటరీ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆంధ్రా సెక్రెటరీ జట్టు నిర్ధేశించింది. జి.మన్విత్రెడ్డి 82 పరుగులు (77 బంతుల్లో 4 ఫోర్లు, ఆరు సిక్సర్లు), రక్షణ్ 64 బంతుల్లో 57 పరుగులు (5 ఫోర్లు, మూడు సిక్సర్లు) సాధించి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు 40.5 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆంధ్రా సెక్రెటరీ జట్టు 77 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. -
ఇమామ్లు, మౌజన్లకు బాబు మొండిచేయి
● గౌరవ వేతనం ఇవ్వనందుకు 8న నిరసన అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం గత 11 నెలలుగా ఇమామ్ (రూ.10వేలు ఒక్కొక్కరికి), మౌజన్లకు(రూ.5వేలు) గౌరవ వేతనం ఇవ్వకుండా మొండి చేయి చూపుతోందని వైఎస్సార్సీపీ అనుబంధ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్ ధ్వజమెత్తారు. ఈ నెల ఎనిమిదిన కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి, అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందిస్తామని తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కూటమి మేనిఫెస్టోలో ఇమామ్, మౌజన్లకు గౌరవవేతనం ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. సీఎం చంద్రబాబు ముస్లిం మైనార్టీల పట్ల కపటప్రేమ ప్రదర్శిస్తున్నారన్నారు. మైనార్టీల అభ్యున్నతికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబం చొరవ తీసుకుందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో రెండు అడుగులు ముందుకేసి మైనార్టీలను ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 10న జిల్లాలో కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్– సూపర్ హిట్’ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం సిగ్గుచేటన్నారు. ఏం ఉద్ధరించారని ఏర్పాటు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఫయాజ్, నాయకులు కొర్రపాడు హుస్సేన్ పీరా, కమర్తాజ్, మన్సూర్బాషా, రహంతుల్లా, ఖాజా, ఖాజీపీరా, దాదాఖలందర్, ఆసిఫ్, మహబూబ్బాషా, జావేద్, ఖాదర్ పాల్గొన్నారు. -
యూరియా ఎక్కడ ఉంటే అక్కడికే!
● పరుగులు పెడుతున్న రైతులుశింగనమల: మండలంలో యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడుతున్నారు. మండలంలో ఎక్కడ పంపిణీ చేస్తున్నారని తెలిసినా వెంటనే అక్కడికి పరిగెత్తుతున్నారు. శనివారం శింగనమలలోని సింగిల్ విండో కార్యాలయానికి 10 టన్నుల యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే, వచ్చిన యూరియా మధ్యాహ్నం లోపు ఖాళీ కావడం గమనార్హం. దీంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. మండలంలో కల్లుమడి, తరిమెల, నిదన వాడ, రాచేపల్లి, ఉల్లికల్లు, కొరివిపల్లి, చీలేపల్లి, జూలకాల్వ, పి.జలాలపురం, పెరవలి, పోతురాజు కాల్వ, చక్రాయిపేట, సీ.బండమీదపల్లి, శివపురం, శింగనమల, గోవిందరాయునిపేట, సోదనపల్లి, గురుగుంట్ల, మదిరేపల్లి, లోలూరు గ్రామాల్లో వ్యవసాయ బోరు బావుల కింద వరి పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటకు యూరియా అవసరం ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏఓ అన్వేష్కుమార్ మాట్లాడుతూ కల్లుమడి, తరిమెల సింగిల్ విండో కార్యాలయాలకు యూరియా సరఫరా చేశామని, మంగళవారంలోపు శింగనమల,రాచేపల్లి,కొరివిపల్లి, ఉల్లికల్లుకి సరఫరా చేస్తామని చెప్పారు. -
ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు
గుంతకల్లు టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్న సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం తగదని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు మంజునాథ్, సుదర్శన్, పుష్యమి అన్నారు. వార్డు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా అధికార వర్గాలు ప్రవర్తిస్తున్న తీరుకు వ్యతిరేకంగా శనివారం జేఏసీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సచివాలయ కార్యదర్శులను వలంటీర్లుగా మార్చడం తగదన్నారు. గతంలో వలంటీర్లకు ఒక క్లస్టర్ను పరిమితం చేస్తే ఇప్పుడు ఒక్కో కార్యదర్శికి మూడు క్లస్టర్లకు మ్యాప్ చేసి బలవంతంగా ఉద్యోగం చేయించడం సరికాదన్నారు. సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీదేవికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురంలో నిరసనాగ్రహం.. అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం క్లస్టర్ విధులను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో సచివాలయ ఉద్యోగులు నిరసననాగ్రహాన్ని ప్రదర్శించారు. శనివారం నగరపాలక సంస్థలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సచివాలయ ఉద్యోగుల జేఎసీ నాయకులు మాట్లాడుతూ పెండింగ్ అరియర్స్, పదోన్నతులు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్, కల్పించడంలో ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తూ ఉద్యోగులకు అన్యాయం చేస్తోందన్నారు. తమను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని, ఆందోళన కార్యక్రమాలకు వెనుకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు లక్ష్మి నారాయణ, డీ సుధాకర్, రామకృష్ణ, చీరాల చంద్ర, శివశంకరయ్య, వరప్రసాద్, మౌలాలమ్మ, తేజశ్రీ, విమల పాల్గొన్నారు. -
రేపు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఈనెల 7న కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. బాలల చట్టాలపై అవగాహన అనివార్యం అనంతపురం: బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమా రావు అన్నారు. శనివారం పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్. చినబాబు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులు, పోలీసులతో జిల్లా కోర్టులో సమావేశం నిర్వహించారు. బాలల రక్షణ చట్టాల్లోని కీలక అంశాలను చర్చించారు. ఏపీ హైకోర్టులో సెప్టెంబర్ 14న రాష్ట్రస్థాయి జువైనల్ జస్టిస్ కమిటీ సదస్సు జరగనుందని, జిల్లాకు సంబంధించిన వివరాలు సమగ్రంగా అందజేయాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోరారు. కోర్టుల తనిఖీ..గుత్తి: పట్టణంలోని కోర్టులను జిల్లా జడ్జి భీమారావు శనివారం తనిఖీ చేశారు. పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన ఏడీజే, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ్ చారి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంటు)గా పలువురిని నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. కర్నూలు జిల్లాకు చెందిన మొలగవళ్లి మహేంద్రనాథ్రెడ్డికి కళ్యాణదుర్గం అసెంబ్లీ, అనంతపురం జిల్లాకు చెందిన కే.రమేష్రెడ్డికి ధర్మవరం, శింగనమల అసెంబ్లీ స్థానాలు, నార్పల సత్యనారాయణ రెడ్డికి రాప్తాడు, ఉరవకొండ అసెంబ్లీ స్థానాలు, ఎల్ఎం మోహన్ రెడ్డికి రాయదుర్గం, తాడిపత్రి అసెంబ్లీ స్థానాలు, బోయ తిప్పేస్వామికి గుంతకల్లు, అనంత పురం అర్బన్ అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. వీరు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు కృషి చేయనున్నారు. -
‘కూటమి’ మెడలు వంచైనా న్యాయం
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వ మెడలు వంచైనా రైతులకు న్యాయం చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు కనువిప్పు కలిగించేందుకే ఈ నెల 9న ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శని వారం స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ‘అన్నదాత పోరు’ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులను ప్రకృతి కూడా కరుణించలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ సహకారమూ కరువై రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అన్నదాతల సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవించినా ఎటువంటి మార్పులేదన్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ‘అన్నదాత పోరు’ తలపెట్టినట్లు వెల్లడించారు. తన రెక్కల కష్టంతో సమాజానికి అన్నం పెట్టే రైతన్నలకు మద్దతుగా ప్రతి ఒక్కరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9న ఉరవకొండ, కళ్యాణదుర్గం, అనంతపురం రెవెన్యూ డివిజన్లలో ర్యాలీలు నిర్వహించి ఆర్డీఓలకు వినతి పత్రం అందిస్తామన్నారు. అనంతపురంలో జెడ్పీ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. రైతులు, రైతు సంఘాలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపు నిచ్చారు. జిల్లాలో గత ఖరీఫ్, రబీలో వర్షాభావ పరిస్థితులతో పంటలన్నీ దెబ్బతిన్నాయన్నారు. పెట్టుబడి కూడా తిరిగి రాలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో విత్తనాల నుంచి ఎరువుల వరకూ ఏ ఒక్కటీ సరఫరా చేయలేని దుస్థితి నెలకొందన్నారు. బ్లాక్ మార్కెట్కు యూరియాను తరలించారన్నారు. రూ.260 అమ్మాల్సిన యూరియా బస్తాను రూ.350 నుంచి రూ.400కు విక్రయిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. జిల్లాలో 8.50 లక్షల ఎకరాల సాగుభూమి ఉంటే 4.30 లక్షల్లోనే పంటలు సాగు చేశారన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను ఏమాత్రమూ పట్టించుకోలేదన్నారు. హెచ్ఎల్సీ ద్వారా సౌత్,నార్త్ కెనాల్కు నీరందించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీదేవి, సైపుల్లాబేగ్, చంద్రశేఖర్ యాదవ్, ఓబిరెడ్డి, సాకే చంద్రశేఖర్, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు నాయక్, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, పార్టీ రాష్ట్ర నేతలు వెన్నంశివరామిరెడ్డి, చుక్కలూరు దిలీప్ రెడ్డి, మారుతీనాయుడు, జానీ, కృష్ణవేణి, కార్పొరేటర్లు కమల్భూషణ్, సంపంగి రామాంజినేయులు, నాయకులు రాధాయాదవ్, అనిల్కుమార్ గౌడ్, సాకే కుళ్లాయస్వామి, చింతకుంట మధు, థామస్, జావెద్, ఉదయ్, రాధాయాదవ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుకు కనువిప్పు కలిగించేందుకే ‘అన్నదాత పోరు’ రైతన్నలకు మద్దతుగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
అన్నదాతలతో చెలగాటం
కూటమి ప్రభుత్వం అన్నదాతలతో చెలగాటమాడుతోంది. బోరుబావుల కింద సాగు చేసుకుంటున్న పంటల అవసరానికి తగ్గట్లు యూరియా అందించకపోవడంతో ఇప్పటికే రైతులు అల్లాడిపోతున్నారు. మరోవైపు రిజర్వాయర్లలో నీరున్నా ఆయకట్టు భూములకు వదలకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండడంతో రైతన్నలకు దిక్కుతోచడం లేదు. అనంతపురం సెంట్రల్: వర్షాలకు తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. నెలన్నర రోజులుగా గేట్ల ద్వారా దిగువకు నీరెళ్లిపోతోంది. ఈ సమయంలో జిల్లాలో ఆయకట్టుకు ఎలాంటి ఢోకా ఉండదని అందరూ భావించారు. కానీ కూటమి ప్రభుత్వంలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కీలకమైన సాగునీటి సలహామండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించకపోవడంతో ఆయకట్టు భూములు ఇప్పటికీ బీడుగా దర్శనమిస్తున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులకు తీరిక లేకపోవడంతో సమావేశానికి ముహూర్తం కుదరడం లేదని తెలిసింది. గత ప్రభుత్వంలో జూలైలోనే.. ఆగస్టులోపే ఐఏబీ సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా జూలైలోనే సమావేశం నిర్వహించేవారు. ఉపకాలువలకు ఎప్పటి నుంచి నీటిని విడుదల చేస్తారు.. ఎన్ని రోజులు వదులుతారు.. తదితర వివరాలు అధికారికంగా ప్రకటించేవారు. దీనికి తగ్గట్టుగా రైతులు పంటలు సాగు చేసుకునేవారు. కానీ, కూటమి ప్రభుత్వంలో పరిస్థితి పూర్తి భిన్నంగా మారడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి. నెలరోజులుగా తిరుగుతున్నా... ఐఏబీ సమావేశం నిర్వహణ తేదీ ఖరారు కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారులు కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందన లేదు. బిజీగా ఉన్నామంటూ తిప్పి పంపిస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అపాయింట్ మెంట్ అసలు దొరకడమే లేదని తెలిసింది. ఆయకట్టుకు నీరందిస్తే త్వరితగతిన పంటలు సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఖరీఫ్ సీజన్ ముగిసి రబీలోకి ప్రవేశిస్తున్నా నీరివ్వకపోవడంతో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం వద్ద బోసిపోతున్న తుంగభద్ర ఎగువ కాలువ ఐఏబీ వెంటనే నిర్వహించాలి ఐఏబీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. ఆగస్టులోనే సమావేశం నిర్వహించాల్సి ఉంది. గత నెల 25న జరిగిన జిల్లా రివ్యూ కమిటీ సమావేశంలో నేను ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించా. ఆయకట్టుకు నీరు ఎప్పుడు వదులుతారు.. ఎంత కాలం నీటి లభ్యత ఉంటుందనే విషయాలపై స్పష్టత లేక రైతులు పంటలు సాగు చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ స్పందించి ఐఏబీ సమావేశం ఏర్పాటు చేయాలి. – వై.శివరామిరెడ్డి,ఎమ్మెల్సీ త్వరలో తేదీ ఖరారు ఈ ఏడాది తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు నిండడంతో జిల్లాకు త్వరగా నీరు వస్తోంది. హెచ్చెల్సీతో పాటు హంద్రీ–నీవా ద్వారా వస్తున్న నీటిని పీఏబీఆర్, ఎంపీఆర్లలో నిల్వ చేస్తున్నాం. త్వరలో కలెక్టర్, ప్రజాప్రతినిధుల అనుమతి తీసుకొని సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహిస్తాం. –సుధాకర్రావు, ఎస్ఈ, హెచ్చెల్సీ ఐఏబీ సమావేశం నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం ప్రజాప్రతినిధులకు తీరిక లేక కుదరని ముహూర్తం -
గురువుల పాత్ర కీలకం
అనంతపురం ఎడ్యుకేషన్: డాక్టర్ కావడానికి గురువు...ఇంజినీరు కావడానికి గురువు.. ఇలా సమాజంలో ఏరంగంలో రాణించాలన్నా గురువుల పాత్ర కీలకమని, సర్వస్వం గురువేనని వక్తలు కొనియాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. డీఈఓ ప్రసాద్బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ వినోద్కుమార్ సమాజంలో ఏ వృత్తికీ లేని గౌరవం ఉపాధ్యాయ వృత్తికి ఉందన్నారు. సమాజ మార్గదర్శకులు గురువులేనన్నారు. గురువులు లేని సమాజం ఊహించుకోలేమన్నారు. ఏరంగంలో ఏస్థాయికి వెళ్లినా దాని వెనుక గురువుల కృషి ఉంటుందన్నారు. అలాంటి గురువుల సేవలను సమాజం ఎప్పటికీ మరువదన్నారు. తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టమని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి వారం గంటపాటు వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఆన్లైన్ శిక్షణ ఇస్తామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ సమాజంలో గురువులకు విశిష్టస్థానం ఉందన్నారు. గొప్ప సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర చాలా ఉందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నడయాడిన ఆర్ట్స్ కళాశాలలోనే గురువులను సన్మానించుకోవడం అదృష్టమన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో గురువులకు ఎనలేని గౌరవం ఉందన్నారు. డీఈఓ ప్రసాద్బాబు, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ అడుగుజాడల్లో నడిచేందుకు ప్రతి గురువూ కృషి చేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలందించిన 77 మంది టీచర్లకు జిల్లాస్థాయి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి, డీసీఈబీ కార్యదర్శి గంధం శ్రీనివాసులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై పోరుబాటు
అనంతపురం కార్పొరేషన్: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. రైతు సమస్యలపై ఈ నెల తొమ్మిదో తేదీన రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రైతులు, రైతుసంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతు సమస్యలపై ఈ నెల 9న ర్యాలీలు నిర్వహించి, ఆర్డీఓలకు వినతిపత్రాలు అందజేయ నున్నట్లు చెప్పారు. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లో పంటలు దెబ్బతింటే ఇప్పటి వరకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ అందించలేదన్నారు. ఇక ఈ ఖరీఫ్లో రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులను అందించకుండా తాత్సారం చేస్తోందని ధ్వజమెత్తారు. జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గినా.. యూరియాను పూర్తిస్థాయిలో ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. మంత్రులు, అధికారులపై కేసులు పెట్టాలి ప్రజాప్రతినిధులు, అధికారుల అండతో డిస్ట్రిబ్యూటర్లు యూరియాను రాష్ట్రం దాటించేశారని అనంత ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తామంటూ సీఎం చంద్రబాబు బెదిరించడమేంటన్నారు. యూరియా పక్కదారి పట్టిన ఘటనలో వ్యవసాయ శాఖా మంత్రి, కమిషనర్, జాయింట్ డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు, తదితరులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యూరియాను బ్లాక్మార్కెట్కు తరలించేశాక ఇప్పుడు విజిలెన్స్ విచారణలంటూ డ్రామాకు తెరలేపారన్నారు. బ్లాక్మార్కెట్కు తరలించిన సొమ్ము మీకు అందిందా చంద్రబాబూ అని ప్రశ్నించారు. ప్రజా ఉద్యమం తప్పదు ‘మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుుకు, పేద విద్యార్థులకు వైద్యవిద్య అందించేందుకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 నూతన కళాశాలలను తేవాలన్న నిర్ణయం విప్లవాత్మకం. అటువంటి గొప్ప నిర్ణయానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెలువడితే.. ఇవాళ చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేందుకు వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని కేబినెట్లో తీసుకున్న నిర్ణయం సరికాదు. అలాగే ఆరోగ్యశ్రీని బీమా పరిధిలోకి తీసుకెళ్లాలన్న నిర్ణయం కూడా మంచిది కాదు. వీటిని తక్షణం ఉపసంహరించుకోకపోతే ప్రజా సంఘాలతో కలుపుకుని ప్రజా ఉద్యమం చేపడతామని’ అనంత హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలు ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెచ్చారన్నారు. కూటమి ప్రభుత్వంలో పది వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్వహించేందుకు కేబినెట్ తీసుకున్న నిర్ణయం దారుణమన్నారు. కేబినెట్లోని మంత్రి నారాయణ, విద్యా సంస్థలు నడుపుతున్న వారికి మెడికల్ కళాశాలలను ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవంగా 2019 వరకు రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవని, అందులో 2,185 సీట్లు ఉండేవని తెలిపారు. జగనన్న సీఎం అయ్యాక మరో 2,550 సీట్లు సమకూర్చేలా 17 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే బీమా పద్ధతిని తీసుకువస్తున్నారని విమర్శించారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, రాష్ట్ర నాయకులు గోకుల్రెడ్డి, వెన్నం శివరామిరెడ్డి, జానీ, నాయకులు శేఖర్బాబు, గుజ్జల శివయ్య, తదితరులు పాల్గొన్నారు. పంటలు నష్టపోయినా ఆదుకోని సర్కారు యూరియా పంపిణీలోనూ తాత్సారం ఈ నెల 9న అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ర్యాలీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
నంది విగ్రహం అపహరణ
● అనుమానం రాకుండా మరొకటి ఏర్పాటు చెన్నేకొత్తపల్లి: మండలంలోని ముష్టికోవెల సమీపంలో ఉన్న పురాతన శివాలయంలో నంది విగ్రహాన్ని గురువారం రాత్రి దుండగులు అపహరించారు. శుక్రవారం ఉదయం పూజలు చేసేందుకు వెళ్లిన అర్చకుడు.. అక్కడ నంది విగ్రహం కనిపించకపోవడంతో వెంటనే స్థానికులను అప్రమత్తం చేశాడు. దీంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పరిశీలించారు. శివలింగానికి ఎదురుగా ప్రతిష్టించిన నందిని పెకలించి తీసుకెళ్లడంతో పాటు ఎవరికీ అనుమానం రాకుండా ఆలయం ప్రాంగణంలో ఉన్న మరో నంది విగ్రహాన్ని తీసుకెళ్లి అక్కడ ఉంచారు. గతంలోనూ ఈ ఆలయంలో కొందరు క్షుద్రపూజలు చేసి, చోరీకి ప్రయత్నం చేశారని, గుప్తనిధుల కోసమే నంది విగ్రహాన్ని ఎత్తుకెళ్లి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై గ్రామస్తులు మూకుమ్మడిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న జేఎన్టీయూ ప్రొఫెసర్లు
అనంతపురం: గురువు అనే పదానికి వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లకు ఉత్తమ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. శుక్రవారం విజయవాడ వేదికగా జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డులను ప్రొఫెసర్ బి. ఈశ్వరరెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.శారద, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఓం ప్రకాష్ అందుకున్నారు. -
ప్రజారోగ్యంతో కూల్డ్రింక్స్ ఏజెన్సీ నిర్వాహకుల చెలగాటం
హిందూపురం: ప్రజారోగ్యంతో కూల్డ్రింక్స్ ఏజెన్సీ నిర్వాహకులు చెలగాటమాడారు. కాలం చెల్లిన కూల్ డ్రింక్ బాటిళ్లను రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడేయడంతో అటుగా వెళుతున్న వారు, స్థానికులు, చిన్నారులు గుర్తించి కేసులకు కేసులే ఎత్తుకెళ్లారు. చిన్నారులు కొందరు అక్కడే బాటిళ్ల మూతలు తీసి కూల్ డ్రింక్స్ తాగుతూ కనిపించారు. కాగా, కాలం చెల్లిన కూల్డ్రింక్స్ విషపూరితంగా మారుతాయని, వాటిని సేవిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన పడేయడం వివాదాస్పదమైంది. -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఉక్కపోత పెరిగింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. పశ్చిమ దిశగా గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
టమాటా కిలో రూ.15 కక్కలపల్లి మండీలో శుక్రవారం కిలో టమాట గరిష్ట ధర రూ.15, కనిష్టం రూ.9, సరాసరి రూ.12 ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయి. మసీదు నమూనాలతో ప్రదర్శనగా వెళ్తున్న దృశ్యంయూరియాను అక్రమంగా తరలిస్తే చర్యలు శింగనమల: జిల్లాలో యూరియాను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం శింగనమల మండలం నాయనపల్లి క్రాస్లోని శ్రీలక్ష్మీ నరసింహ ఆగ్రో ఏజెన్సీ ఎరువుల దుకాణాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం అక్కడి వచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ● పి.జలాలపురంలోని రైతు సుబ్బరాయుడు సాగు చేసిన చీనీ తోటను కలెక్టర్ పరిశీలించారు. ఉద్యాన శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి క్షేత్ర స్థాయి లో పంటల సాగుపై సలహాలు, సూచనలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ డీడీ ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘనాథరెడ్డి, మార్క్ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, తహసీల్దార్ శేషారెడ్డి, ఉద్యాన అధికారి శైలజా, ఏఓ ఆన్వేష్కుమార్, ఏఎస్ఐ చితంబరయ్య పాల్గొన్నారు. ఆందోళన చెందవద్దు యూరియా కొరత లేదని, రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయాధికారి ఉమా మహేశ్వరమ్మ అన్నారు. శుక్రవారం తరిమెల గ్రామంలోని భైరవ, నిత్య ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు మాత్రమే విక్రయించాలని, అనవసరమైన ఎరువులు జోడించి అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుత్తి ఏడీఏ వెంకటరాముడు, మండల వ్యవసాయాధికారి ఆన్వేష్కుమార్, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. గుత్తి–అనంతపురం రూటు డేంజర్ జిల్లాలోనే ఎక్కువగా గుత్తి నుంచి అనంతపురం రూటు బస్సుల్లో బంగారు చోరీలు జరుగుతున్నాయి. సుమారు 10 నుంచి 15 దొంగల బ్యాచ్లు ఈ రూటులో ఉన్నట్లు తెలిసింది. బ్యాగులో బంగారం పెట్టుకుని వెళ్లారా అంతే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఈ మార్గంలో రోజూ ఒక మహిళ మెడలో గొలుసైనా చోరీ జరుగుతోంది. ఈ రూటులో ప్రయాణించే మహిళా ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులే చెబుతున్నారు. -
విత్తన సొమ్ము పక్కదారి!
అనంతపురం అగ్రికల్చర్: ప్రభుత్వ ఆధీనంలోని ఏపీ సీడ్స్కు చెల్లించాల్సిన విత్తనం సొమ్మును ఆర్ఎస్కే అసిస్టెంట్లు కొందరు సొంతానికి వాడుకున్నారు. పంపిణీ చేసిన రోజు లేదా మరుసటి రోజే ఏపీ సీడ్స్ ఖాతాకు జమ చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో ఏపీ సీడ్స్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము కాస్త పక్కదారి పట్టింది. రూ.77 లక్షలు బాకీ ఖరీఫ్లో ఏపీ సీడ్స్ ద్వారా 40 శాతం రాయితీతో విత్తన వేరుశనగ, విత్తన వరి, 50 శాతం రాయితీతో పచ్చిరొట్ట విత్తనాలు (గ్రీన్ మెన్యూర్ సీడ్) రైతులకు పంపిణీ చేశారు. రాయితీ పోనూ రైతులు తమ వాటాగా (నాన్సబ్సిడీ) ఆర్ఎస్కే అసిస్టెంట్లకు రూ.26,93,71,674 చెల్లించారు. ఇందులో ఇప్పటి వరకూ ఏపీ సీడ్స్కు 26.61 కోట్లు చెల్లించినట్లుగా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మరో రూ.32.54 లక్షలకు పైగా సొమ్ము ఏమైందో అంతుచిక్కడం లేదు. అలాగే శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో రూ.35,55,61,081 విలువ చేసే రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు. అందులో ఏపీ సీడ్స్కు రూ.35.11 లక్షలు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.44.21 లక్షలకు లెక్క తేలాల్సి ఉంది. విత్తన పంపిణీ ముగిసి రెండు నెలలు కావస్తున్నా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.77 లక్షల వరకు ఏపీ సీడ్స్కు బకాయిలు పేరుకుపోయాయి. ప్రధానంగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి ఆర్ఎస్కే ద్వారా రూ.8.11 లక్షలు, వెస్ట్కోడిపల్లి ఆర్ఎస్కే నుంచి రూ.3.69 లక్షలు, ఉరవకొండ మండలం వెలిగొండ ఆర్ఎస్కే నుంచి రూ.3.05 లక్షలు, కుందుర్పి మండలం అపిలేపల్లి ఆర్ఎస్కే నుంచి రూ.2.04 లక్షలు, గుమ్మఘట్ట మండలం కలుగోడు ఆర్ఎస్కే నుంచి రూ.1.82 లక్షలు, కుందుర్పి మండలం బెస్తరపల్లి ఆర్ఎస్కే నుంచి రూ.1.24 లక్షలు... ఇలా ఏపీ సీడ్స్ సొమ్మును తమ సొంతానికి ఆర్ఎస్కే అసిస్టెంట్లు వాడుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలోనూ ఓడీసీ మండలం తంగేడుకుంట, మడకశిర మండలం ఎర్రబొమ్మనహళ్లి, రామగిరి మండలం కుంటిమద్ది, తాడిమర్రి మండలం పెదకోట్ల, గాండ్లపెంట మండలం గొడ్డువెలగల, ఎన్పీ కుంట మండలం ఎదురుదొన, నల్లమాడ మండలం దొన్నికోట–2, అమరాపురం మండలం మద్దనకుంట ఆర్ఎస్కేల నుంచి రూ.లక్షల బకాయిలు పేరుకుపోయాయి. సొమ్ము చెల్లించకుండా నెలల తరబడి జాప్యం చేస్తున్న ఆర్ఎస్కే అసిస్టెంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వ్యవసాయశాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీడ్స్కు చెల్లించని ఆర్ఎస్కే అసిస్టెంట్లు ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన రూ.77 లక్షల బకాయిలు ఉదాసీనంగా వ్యవవహరిస్తున్న వ్యవసాయాధికారులు -
అమ్మవారి సొమ్ము తిరిగొచ్చింది!
బుక్కరాయసముద్రం: అమ్మవారి సొమ్ము తిరిగొచ్చింది.ఆలయ హుండీలో డబ్బు ఎత్తుకెళ్లిన దుండగులు నెలన్నర తరువాత అదే ఆలయంలో వదిలి వెళ్లారు. అక్కడ ఒక లేఖ కూడా ఉంచారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ముసలమ్మ తల్లి దేవాలయంలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... ముసలమ్మ ఆలయంలోకి ఈ ఏడాది జూలై 22న గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి హుండీని పగలకొట్టారు. అందులోని నగదుతో పాటు ఆలయంలోని సీసీ కెమెరాలను సైతం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై అప్పట్లోనే ఆలయ నిర్వాహకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా.. శుక్రవారం ఉదయం పూజారి ఆలయం తలుపులు తీసి పూజలు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా కరెన్సీ నోట్లు కన్పించాయి. వెంటనే ఆలయ ధర్మకర్తకు ఫోన్లో సమాచారమిచ్చారు. ఆలయం వద్దకు చేరుకుని పరిశీలించగా.. డబ్బుతో పాటు లెటరు కూడా కన్పించింది. డబ్బు లెక్కించగా రూ.1.86 లక్షలు ఉంది. ఇక లేఖలో.. ‘మేము నలుగురు కలసి అమ్మవారి డబ్బులు ఎత్తుకెళ్లాము. తరువాత మా కుటుంబాల్లో పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. అమ్మవారి సొమ్ములో కొంత తీసుకుని మా పిల్లలను బాగు చేయించుకుంటున్నాము. అమ్మా.. మమ్మల్ని క్షమించాల’ని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆలయ ధర్మకర్త సుశీలమ్మ స్పందిస్తూ.. అమ్మవారు చాలా శక్తివంతమైనవారని, అమ్మవారి సొమ్ము తీసుకుని ఎవరూ జీర్ణించుకోలేరని అన్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చారు. నూతనంగా అమర్చిన సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ముసలమ్మ తల్లి, అమ్మవారి ఆలయంలో డబ్బులు లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది -
ఎరువుల సరఫరాలో ‘కూటమి’ వైఫల్యం
ఉరవకొండ: రైతులకు ఎరువులు అందించలేని దౌర్భగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మేకల సిద్దార్థ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగా యూరియా కొరత నెలకొని రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతుల బలహీనతను ఆసరాగా చేసుకుని కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే బస్తా యూరియా ఇస్తామంటూ నిబంధన పెట్టడం దుర్మార్గమన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు విచిత్రంగా స్పందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ముఖ్యనేతలను అరెస్ట్ చేస్తూ అణిచివేత, నిర్భంధాలకు తెరలేపారని మండిపడ్డారు. రాయలసీమ జిల్లాలకు జీవనాడిగా ఉన్న హంద్రీ–నీవా ద్వారా 6.50లక్షల ఎకరాలకు సాగునీరు ఇప్పటి వరకూ ఎన్ని ఎకరాలకు నీరిచ్చారో చెప్పే దమ్ము ప్రభుత్వానికి, మంత్రి కేశవ్కు లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాదిన్నర కాలంలో హంద్రీ–నీవా ద్వారా జిల్లాకు కనీసం 10 టీఎంసీల నీటిని కూడా తీసుకు రాలేకపోయారన్నారు. నిరంకుశ ధోరణితో లక్షలాది మందికి పైగా రైతులను పంట బీమా పథకానికి దూరం చేశారన్నారు. పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తామని చెప్పి నేటికీ చాలా మందికి చెల్లించకుండా దగా చేశారని మండిపడ్డారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 9న గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులను దగా చేసిన చంద్రబాబు ఈ నెల 9న గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను విజయవంతం చేయండి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి -
‘కమాటి’ మాయాజాలం
ఉరవకొండ: స్థానిక గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో రెగ్యులర్ కమాటిగా పనిచేస్తున్న రమణమ్మ మూడేళ్లుగా విధులకు డుమ్మా కొడుతున్నా.. అధికారులు మాత్రం ప్రతి నెలా జీతం చెల్లిస్తున్నారు. రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు జీతం తీసుకుంటూ విధులకు గైర్హాజరవుతున్న ఆమె తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పష్టమైన సమాచారం గిరిజన శాఖ ఉన్నతాధికారులకు ఉన్నా.. మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, కమాటికి ప్రిన్సిపాల్ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రిన్సిపాల్ అండ చూసుకుని మూడేళ్లుగా బినామీని ఏర్పాటు చేసి 225 మంది విద్యార్థినులకు వంట చేయిస్తున్నట్లుగా సమాచారం. ఇందుకు ప్రతి నెలా రూ.6వేలు కూలి చెల్లిస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రిన్సిపాల్ మాత్రం రోజూ కమాటి రమణమ్మ విధులకు హాజరవుతున్నట్లు రికార్డులు సృష్టించి ప్రతి నెలా జీతాలు మంజూరయ్యేలా చేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశంలో ప్రిన్సిపాల్కూ అంతోఇంతో కమాటి రమణమ్మ ముట్టజెపుతున్నట్లు ఆరోపణలున్నాయి.అనారోగ్యంతో రావడం లేదు గురుకులంలో రెగ్యులర్ కమాటి మూడేళ్లుగా అనారోగ్యంతో విధులకు హాజరుకావడం లేదు. దీంతో తానే బినామీని ఏర్పాటు చేసి వంట చేయిస్తోంది. కమాటికి హాజరు వేయడం ద్వారా ప్రతి నెలా జీతాలు అందిస్తున్నాం. లేకపోతే విద్యార్థులకు వంట చేసి పెట్టే వారు రారు. దీంతో తప్పని పరిస్థితుల్లో అటెండెన్స్ వేయాల్సి వస్తోంది. – అరుణ, ప్రిన్సిపాల్, గిరిజన బాలికల గురుకుల పాఠశాల, ఉరవకొండ గిరిజన బాలికల గురుకులంలో మూడేళ్లుగా విధులకు డుమ్మా అయినా ఠంచన్గా జీతం అందజేస్తున్న అధికారులు -
తాగుడుకు డబ్బివ్వలేదని ఆత్మహత్య
రాప్తాడు: తాగుడుకు డబ్బు ఇవ్వలేదంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడు మండలం యర్రగుంటకు చెందిన ఉప్పర గౌతమికి రామగిరి మండలం కుంటిమద్ది గ్రామానికి కోడిగ సంజీవయ్య (31)తో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. యర్రగుంటలోనే కాపురం ఉంటున్నారు. అదే గ్రామంలో ఐసీఆర్పీ సంస్థలో గౌతమి ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మద్యానికి బానిసైన సంజీవయ్య ఎలాంటి పనిపాటా చేయకుండా జులాయిగా మారాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకుని మద్యం మత్తులో తరచూ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చేవాడు. తాగేందుకు డబ్బు ఇవ్వాలని కొట్టేవాడు. పలుమార్లు పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి నచ్చచెప్పినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఈ నెల 4న తాగేందుకు డబ్బు ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో గడ్డి మందు తాగి బాత్రూమ్లో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక గురువారం రాత్రి సంజీవయ్య మృతి చెందాడు. గౌతమి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
బైపాస్కు మోక్షమెన్నడో?
రాయదుర్గం: ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ అనంతపురం నుంచి మొలకాల్మూరు వరకూ ఎన్హెచ్–54 జాతీయ రహదారి నిర్మాణ పనులు రాయదుర్గం వద్ద అర్ధంతరంగా ఆగిపోయాయి. కళ్యాణదుర్గం నుంచి రాయదుర్గం మీదుగా మొలకాల్మూరు వరకు రూ.194 కోట్ల ప్యాకేజీతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రాయదుర్గం పట్టణంలోకి భారీ వాహనాలు ప్రవేశించకుండా 74 ఉడేగోళం వైఎస్సార్ సర్కిల్ నుంచి బీటీపీ ప్రధాన రహదారి దాటుకుని శ్మశాన వాటిక వరకు రోడ్డు ఓవర్ (ఆర్ఓబీ) బ్రిడ్జి నిర్మించారు. కోతిగుట్ట సమీపంలో రైల్వే లైనుపై బోస్టరింగ్ గడ్డర్ నిర్మాణానికి రైల్వే అధికారులు అనుమతులు జారీ చేయకపోవడంతో ఈ పనులు కాస్త ఆగిపోయాయి. దీంతో అప్పటి జగన్ సర్కార్ ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే అధికారుల్ని ఒప్పించి నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్లేలా కృషి చేసింది. ఈ లోపు ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినా ఈ పనులు పూర్తి చేయలేక వదిలేసింది. దీంతో పట్టణంలోకి వచ్చే భారీ వాహనాల సంఖ్య ఎక్కువైంది. 12, 16, 18 చక్రాల లారీలు ఇరుకై న వినాయక సర్కిల్లో తిప్పుకోలేక డ్రైవర్లు నానా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో ట్రాఫిక్ స్తంభిస్తోంది. అంతేకాక భారీ వాహనాల రాకతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బైపాస్ పూర్తయితే భారీ వాహనాలన్నీ అటుగా వెళ్లగలిగితే సగం ట్రాఫిక్ తగ్గుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. చిన్న పని పూర్తి చేసేలా అధికారులు, పాలకులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తాం హైవే పనులన్నీ పూర్తయ్యాయి. కోతిగుట్ట సమీపంలో రైల్వే లైనుపై బోస్టరింగ్ గడ్డర్ నిర్మాణం మాత్రమే పెండింగ్లో ఉంది. దీంతో బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇప్పటికే లక్నో, హుబ్లీ, చైన్నె ప్రాంతాల నుంచి రైల్వే అధికారుల బృందాలు వచ్చి పరిశీలించి వెళ్లాయి. ఇటీవల ఫైనల్ కమిటీ సభ్యులు కూడా చూసి వెళ్లారు. త్వరలో పనులు ప్రారంభించి పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. – కుల్లాయ్రెడ్డి, ఎన్హెచ్ ఏఈ, అనంతపురం రూ.194 కోట్లతో ఎన్హెచ్–54 నిర్మాణం రైల్వే బోస్ట్ రింగ్ గడ్డర్ నిర్మాణ పనుల్లో జాప్యం ఎటూ తేల్చక వదిలేసిన అధికారులు పట్టణంలోకి భారీ వాహనాలు.. తరచూ ప్రమాదాలు -
విశ్రాంత గురువులను సన్మానించిన వైఎస్సార్టీఏ
అనంతపురం ఎడ్యుకేషన్: సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ తమ బోధనతో ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువులను గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సన్మానం పొందిన వారిలో రిటైర్డ్ హెచ్ఎం ఆర్.సీతారామారావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఆర్.కాంతయ్య, ఎ.రామచంద్రయ్య, ఎం.రోగప్ప, జి.రామదాసు, జి.రామ్మోహన్రెడ్డి, ఎంసీ సుధాకిరణ్ ఉన్నారు. కార్యక్రమంలో పీడీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కూరపాటి నరసింహారెడ్డి, వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు గోవిందరెడ్డి, రవీంద్రారెడ్డి, సిద్ధప్రసాద్, వెంకటరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, ఓబిరెడ్డి, విశ్వనాథరెడ్డి, రాజశేఖర్రెడ్డి, రామకృష్ణ, గోపాల్ పాల్గొన్నారు. -
ఏడుగురికి ఎంపీడీఓలుగా పదోన్నతి
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడుగురికి ఎంపీడీఓలుగా పదోన్నతి దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న 156 మందికి ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మొత్తం ఏడుగురు ఉన్నారు. ఏఓలు ఉమాదేవి (జెడ్పీ–అనంతపురం), జి.శ్రీనివాసులు (బత్తలపల్లి), జయరాములు(వజ్రకరూరు) ఎంపీడీఓగా పదోన్నతి పొందారు. డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్ నుంచి శకుంతల (నల్లచెరువు), మాధవి(డీపీఆర్సీ–అనంతపురం), ఆనంద్ (రాప్తాడు), కమలాబాయ్(పెనుకొండ) ఉన్నారు. ● ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన వారికి ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ శివశంకర్ గురువారం రాత్రి తెలిపారు. ఈ మేరకు వారందరికీ సమాచారం ఇచ్చామని వివరించారు. -
●కలలు మావైనా.. సాకారం ఆయనతోనే
సాధారణంగా టీచర్లు పిల్లలకు పాఠాలు నేర్పుతారు. కానీ ఈ గురువు పాఠాలతో పాటు విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. ఆయనే తాడిపత్రి పట్టణంలోని శ్రీ సుధా శ్రీరాములు మెమోరియల్ మునిసిపల్ హైస్కూల్లో పని చేస్తున్న హిందీ పండిట్ కె.సుకుమార్. ఈయన పని చేసిన ప్రతిచోటా చదువులో ఆసక్తి చూపే విద్యార్థులను గుర్తించి, ఆర్థిక ఇబ్బందులతో వారు వెనకడుగు వేయకూడదని భావించి ఆర్థిక అండగా నిలుస్తూ వారి చదువులకు భరోసా ఇస్తున్నారు. తన జీతంలో కొంత మేరకు డబ్బు వారికోసం ఖర్చు చేస్తూ అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. చదువు పూర్తయిన తర్వాత కూడా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తనవంతు సహకారం అందిస్తున్నారు. ఇలా ఈయన ఇచ్చిన చేయూతతో చదువుకున్న పలువురు విద్యార్థులు నేడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. సుకుమార్ చేయూతతో విద్యార్థి పి. రాజు – 2017లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఎంపికై ప్రస్తుతం అనంతపురం పట్టణ ప్రణాళిక ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. పి. చెండ్రాయుడు 2022లో ఉద్యోగం సాధించి, ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర గ్రామీణ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నాడు. డీఎస్సీ–2025 ఎస్. ఇంజు స్కూల్ అసిస్టెంట్ (ఫిజిక్స్), ఎస్జీటీ రెండు పోస్టులకు ఎంపికయ్యాడు. ఎస్.కె. షరీఫ్ ఎస్జీటీ ఉద్యోగం సాధించాడు. ‘మా జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది మా కుటుంబం మాత్రమే కాదు. మా గురువు సుకుమార్ సర్ కూడా. ఆయన లేకపోతే చదువు మధ్యలో వదిలేసేవాళ్లం’ అని ఆ శిష్యులు చెబుతున్నారు. విజయాలు సొంత కృషితోనే అయినా, ఆ కృషికి దిశ, బలం ఇచ్చింది సుకుమార్ సార్ అని గర్వంగా చెబుతున్నారు. సుకుమార్తో పాటు సైన్స్ టీచర్ కె. రామకృష్ణ, తెలుగు టీచరు మల్లికార్జున తమను వెన్నుతట్టి ప్రోత్సహించారని గుర్తు చేసుకుంటున్నారు. -
పురంలో ‘గణ’వీడ్కోలు
జై బోలో గణేశ్ మహరాజ్కీ జై .. గణపతి బొప్పా మోరియా అంటూ భక్తుల జయ జయ ధ్వానాలతో హిందూపురం వీధులన్నీ ప్రతిధ్వనించాయి. ఎటు చూసినా భక్తుల కోలాహలం... తప్పెట వాద్యాలు.. చెక్క భజనలు, బ్యాండు మేళాలు, భక్తి గీతాలాపనలు, యువకుల ఈలలు, కేరింతలే దర్శనమిచ్చాయి. 9 రోజులపాటు పూజలందుకుందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఏకదంతుడైన వినాయకుడి నిమజ్జనం గురువారం హిందూపురం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగింది. పట్టణంలో కొలువు దీరిన 138 వినాయక విగ్రహాలను గుడ్డం కోనేరులో నిమజ్జనం చేశారు. – హిందూపురం -
రైతులను కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి
అనంతపురం అగ్రికల్చర్: రైతు ఇంట ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. కోతకు వచ్చిన సమయంలో గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. ధరలు నేలచూపులు చూస్తున్నందున రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. ఈ ఖరీఫ్లో జిల్లాలోని రాయదుర్గం ప్రాంతంలో 600 ఎకరాలు, మిగతా ప్రాంతంలో మరో 600 నుంచి 700 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఖర్చు చేశారు. కోతకు వచ్చిన సమయంలో ధరలు పతనం కావడంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంట కోత, నూర్పిడి, అరబెట్టేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎకరాకు గరిష్టంగా 50 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తున్నా.. క్షేత్రస్థాయిలో క్వింటా రూ.500 పలకడం కూడా గగనంగా మారింది. క్వింటా రూ.1,200 ప్రకారం కొనాలి.. : పెట్టుబడి కూడా చేతికిరాక అన్నదాత నష్టపోతున్నా... కూటమి సర్కారు చోద్యం చూస్తోంది. కర్నూలు, బళ్లారి మార్కెట్లకు వెళదామన్నా రానుపోనూ ఖర్చులు కూడా వెనక్కివచ్చే పరిస్థితి లేక రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానశాఖ అధికారులు పరామర్శించడం మినహా సాయం చేయలేని పరిస్థితిల్లో ఉన్నారు. గురువారం ఉద్యాన శాఖ డీడీ డి.అనురాధ రాయదుర్గం ప్రాంతంలో పర్యటించి ఉల్లి రైతుల స్థితిగతులు తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీస మద్ధతు ధర (ఎంఎస్పీ) క్వింటా రూ.1,200 ప్రకారం ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తే కనీసం పెట్టుబడులైనా దక్కుతాయని రైతులు పేర్కొన్నారు. గురుకులంలో అక్రమాలపై కమిషనర్ సీరియస్ ఉరవకొండ: వజ్రకరూరు మండలం రాగులపాడు బాలుర గిరిజన గురుకుల పాఠశాలలో ఇటీవల హాజరు నమోదులో జరిగిన అక్రమాలపై గురుకులాల రాష్ట్ర కమిషనర్ గౌతమి సీరియస్ అయ్యారు. ‘హాజరు కనికట్టు.. బిల్లులు కొల్లగొట్టు’ శీర్షికన ఈనెల 1న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. విచారణ చేసి 24 గంటల్లో పూర్తి స్థాయిలో నివేదిక అందచేయాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావును ఆదేశించారు. దీంతో పాటు గురుకులానికి ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎలా నియమిస్తారంటూ ప్రశ్నించారు. గురుకులంలో పని చేసే హెడ్ కుక్ వారం రోజుల నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా వెళ్తాడని, అతని స్థానంలో ప్రవేట్ వ్యక్తిని పెట్టుకుంటే విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎలా అందుతుందని కూడా మండిపడ్డారు. -
ప్రైవేటు టీచర్లకూ అవార్డులు ఇవ్వాలి
దశాబ్దాలుగా విద్యార్థులనే నా పిల్లలుగా భావించి ఎక్కువ శాతం వారి వద్దనే గడపడానికి ప్రయత్నిస్తున్నా. వారు కూడా నన్ను అమ్మలాగానే చూస్తారు. సైన్స్ ఫేర్, వివిధ రకాల పోటీల్లో విద్యార్థులను చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నా. ప్రభుత్వ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా నిబద్ధత, నిజాయితీతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం. ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించకపోవడం అన్యాయం. ఈ తీరు మారాలి. – మహ్మద్ షమీమ్, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు, అనంతపురం -
నేత్రదానం ఎంతో గొప్పది
● కలెక్టర్ వినోద్కుమార్ అనంతపురం మెడికల్: నేత్రదానం ఎంతో గొప్పదని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా గురువారం రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్క్లాక్, సప్తగిరి సర్కిల్, జిల్లా పరిషత్ మీదుగా తిరిగి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ సాగింది. కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ నేత్రదానంపై అపోహలు వీడాలన్నారు. దివంగత కన్నడ నటుడు రాజ్కుమార్, ఆయన కుమారుడు పునీత్ రాజ్కుమార్ స్ఫూర్తితో ఇటీవల విజయవాడలో తన సతీమణితో కలసి నేత్రదాన ప్రతిజ్ఞ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ సైదన్న తదితరులు పాల్గొన్నారు. -
పాలన చేతకాకపోతే తప్పుకోండి
బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జన జీవనం అస్థవ్యస్థంగా మారిందని, పాలన చేతకానప్పుడు తప్పుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ ధ్వజమెత్తారు. గురువారం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.యూరియా కొరతతో రైతులు రోజంతా బారులు తీరుతున్నా.. ఒక్క బస్తా కూడా అందించలేని అసహాయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ‘అంతు చూస్తాం... తప్పుడు వార్తల సృష్టి’ అంటూ ఎదురు దాడి చేస్తూ కేసులు బనాయిస్తున్నారని మండి పడ్డారు. శింగనమల నియోజకవర్గంలో ఏడాది అవుతున్నా పంట సాగుకు చుక్క నీరు కూడా వదల్లేదని, పాలనలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రైతు సమస్యలపై ఈ నెల 9న అనంతపురంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట తలపెట్టిన రైతు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీ భాస్కర్, 6 మండలాల కన్వీనర్లు గువ్వల శ్రీకాంత్రెడ్డి, పూల ప్రసాద్, ఖాదర్వలి, యల్లారెడ్డి, శంకర్, నాగలింగారెడ్డి, ముసలన్న, సర్పంచ్ పార్వతి, పూల నారాయణస్వామి, లలితాకళ్యాణి, లక్ష్మీరెడ్డి, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. కూటమి సర్కార్పై మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ధ్వజం రైతు పోరుకు సిద్దం కావాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపు -
రూ.లక్ష పలికిన వినాయకుడి లడ్డూ
ఉరవకొండ: స్థానిక మాస్టర్ సీవీవీ నగర్లో శ్రీ విద్యా వినాయక ఉత్సవ సమితి అధ్వర్యంలో కొలువుదీర్చిన గణనాథుడి లడ్డూ రికార్డు స్థాయిలో రూ.లక్ష పలికింది. గురువారం ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. ఆదోనికి చెందిన కురుబ రాజేష్ రూ.లక్ష పాడి లడ్డ్డూను దక్కించుకున్నాడు. స్వామి వారి వెండి గొలుసు కురుబ రంజిత్, కురుబ గోపి రూ.26,100, వెండి విగ్రహన్ని గుండ్లపల్లి తిమ్మారెడ్డి రూ.22వేలు, కలశాన్ని కురుబ సాయినాథ్ రూ.20,116, వెండి కడియాన్ని శ్రావణ్ రూ. 16,500, వెండి ఉంగరాన్ని కిరణ్స్వామి రూ.5,600, శాలువను రాజేష్ రూ.4,100కు దక్కించుకున్నారు. అనంతరం వినాయక ప్రతిమలను భారీ ఊరేగింపుగా నిమర్జనానికి తరలించారు. బుగ్గ రామలింగేశ్వరుడిని తాకిన సూర్యకిరణాలు తాడిపత్రి రూరల్: పట్టణంలోని పార్వతీ సమేత బుగ్గ రామలింగేశ్వరస్వామిని గురువారం సాయంత్రం సూర్యకిరణాలు తాకాయి. ఏటా రెండు పర్యాయాలు స్వామి వారిని సూర్యకిరణాలు తాకుతాయని ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామి వారిని అర్చకులు ప్రత్యేక పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. స్వామి వారిని తాకిన సూర్య కిరణాలను కనులారా చూసిన భక్తులు పరవశించిపోయారు. -
గుంతకల్లులో ఫీవర్ సర్వే
గుంతకల్లు టౌన్: పట్టణంలో విజృంభిస్తున్న విషజ్వరాలపై ‘గుంతకల్లుకు జ్వరమొచ్చింది’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై జిల్లా వైద్యాధికారులు స్పందించారు. జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు గురువారం యూపీహెచ్సీ, గుత్తి మలేరియా సబ్యూనిట్ సిబ్బందితో కలసి ఎస్ఎన్ పేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సజీవ్కుమార్ సోఫియాస్ట్రీట్లో పర్యటించి ఫీవర్ సర్వే చేపట్టారు. జ్వరం, దగ్గు, జలుబు తదితర కారణాలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించారు. కాలనీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, దోమల నివారణ చర్యలు చేపట్టారు. ప్రజలకు మలేరియా, డెంగీ, చికూన్గున్యా, టైఫాయిడ్ జ్వరాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. జ్వరలక్షణాలుంటే వెంటనే ప్రభుత్వాస్పత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకుని మెరుగైన వైద్యసేవలు పొందాలన్నారు. సూపర్వైజర్ పద్మ, హెల్త్ అసిస్టెంట్ సుధాకర్, నారాయణస్వామి, ఏఎన్ఎం మంజుల, ఆశా వర్కర్ వాణి పాల్గొన్నారు. కాగా, పట్టణంలోని అన్ని వార్డుల్లో జ్వరపీడితులు అత్యధికంగా ఉంటే కేవలం సోఫియా స్ట్రీట్లో మాత్రమే మెడికల్ క్యాంప్, ఫీవర్ సర్వే నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. -
జేఎన్టీయూ ప్రొఫెసర్లకు అవార్డులు
అనంతపురం: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ టీచర్ల అవార్డులకు జేఎన్టీయూ (ఏ)లో పనిచేస్తున్న ముగ్గురు ప్రొఫెసర్లు ఎంపికయ్యారు. ఎంపికై న కంప్యూటర్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి. ఈశ్వరరెడ్డి, కెమికల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.శారద, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఓం ప్రకాష్ను వర్సిటీ ఉద్యోగులు అభినందించారు. శుక్రవారం విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డులను వీరు అందుకోనున్నారు. కాగా, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి తాజాగా నిరాశ ఎదురైంది. ఈ దఫా ఏ ఒక్క ప్రొఫెసర్ సైతం బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపిక కాలేదు. ఎస్కేయూలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆంజినేయులు, ప్రొఫెసర్ రమణ పేర్లు ప్రతిపాదించినా.. ప్రభుత్వం నిర్ధేశించిన స్కోరు లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యారు. డాక్టర్ ఎస్.శారద డాక్టర్ ఓంప్రకాష్ ప్రొఫెసర్ ఈశ్వరరెడ్డి -
తాగుడు మానేయాలంటూ భర్తపై దాడి
ఉరవకొండ రూరల్: పదేపదే ప్రాధేయపడిన తాగుడు మానేయకపోవడంతో అసహనానికి లోనైన వివాహిత తన భర్తపై కట్టెతో దాడి చేసింది. వివరాలు.. ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామానికి చెందిన ఓబులేసు, ఉలిగమ్మ దంపతులు. కూలి పనులతో జీవనం సాగించేవారు. ఈ క్రమంలో భర్త తాగుడుకు బానిసై కూలి పనులు చేయకుండా నిత్యమూ మద్యం మత్తులో జోగేవాడు. తాగుడుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ భార్యతో గొడవ పడేవాడు. తాగుడు మానాలని భార్య పలుమార్లు ప్రాధేయపడింది. అయినా ఓబులేసులో మార్పు రాలేదు. గురువారం ఉదయం మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న ఓబులేసును మరోసారి భార్య మందలించింది. తాగుడు మానేసి బుద్ధిగా తనతో పాటు కూలి పనులకు రావాలని హితవు పలికింది. ఆమె మాటలతో ఏకీభవించని ఓబులేసు వాగ్వాదానికి దిగాడు. దీంతో అసహనానికి గురైన ఉలిగమ్మ చేతికి అందుబాటులో ఉన్న కట్టె తీసుకుని భర్తపై దాడి చేసింది. అనంతరం స్థానికులతో కలసి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పిచ్చికుక్క దాడిలో 10 మందికి గాయాలు బెళుగుప్ప: మండల కేంద్రంలోని పలు కాలనీల్లో గురువారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. వినాయక నగర్, దళిత వాడ, కమ్మర వీధిలో తిరుగుతూ 10 మందిని గాయ పరిచింది. కూలి పనులతో జీవనం సాగిస్తున్న అంజినమ్మ, సుశీలమ్మ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు స్థానిక పీహెచ్సీలో చికిత్స అందజేశారు. సుశీలమ్మను అనంతపురానికి రెఫర్ చేశారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకురాలుగా కవిత శింగనమల: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.జి.కవిత.. రాష్ట్ర స్థాయి ఉత్తమ అద్యాపకురాలుగా ఎంపికయ్యారు. చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురంలోని కేఎస్ఆర్, పామిడి, గుత్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్గా ఆమె పని చేశారు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో 94 శాతం ఉత్తీర్ణతను సాధించినందుకు గాను అవార్డుకు ఎంపిక చేసినట్లుగా సమాచారం. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాలు.. కళ్యాణదుర్గం రూరల్: రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన వన్నూరుస్వామి (39) ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున అనంతపురం నుంచి ఆటోలో రాయదుర్గం వైపు బయలుదేరిన వన్నూరు స్వామి కళ్యాణదుర్గం మండలం గోళ్ల సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసకొచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వన్నూరు స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పుట్లూరు: మండలంలోని సి.వెంగన్నపల్లి గ్రామానికి చెందిన అంబటి సుధాకరరెడ్డి (38)కి భార్య హైమావతి, ఓ కుమార్తె ఉన్నారు. సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో గురువారం విధులకు వెళ్లేందుకు సిద్ధమైన సుధాకరరెడ్డి ద్విచక్ర వాహనంపై తాడిపత్రి వైపుగా వెళుతుండగా పుట్లూరు మండలం శనగలగూడురు వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన సుధాకరరెడ్డిని వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో మృతిచెందాడు. ఘటనపై పుట్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏమార్చి ఏటీఎం నుంచి నగదు డ్రా గార్లదిన్నె: బ్యాంక్ ఖాతాదారుడిని ఏమార్చి అతని ఏటీఎం ద్వారా నగదు డ్రా చేసుకున్న ఘటన గార్లదిన్నెలో కలకలం రేపింది. వివరాలు.. గార్లదిన్నె మండలం కొట్టాలపల్లికి చెందిన పురుషోత్తం గురువారం బుక్కరాయసముద్రం మండలం వడియంపేటలోని ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. అయితే నగదు రాకపోవడంతో అక్కడే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి సాయాన్ని కోరాడు. ఆ సమయంలో పురుషోత్తం వద్ద ఏటీఎం కార్డు తీసుకుని యంత్రంలో ఉంచిన అనంతరం పిన్ నంబర్ నమోదు చేస్తుండగా గుర్తించాడు. నగదు డ్రా కాకపోవడంతో మాటల్లో మభ్య పెడుతూ ఏటీఎం కార్డు మరోకటి చేతికి ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నాడు. దీంతో పురుషోత్తం గార్లదిన్నెకు చేరుకోగానే తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.22 వేలు నగదు డ్రా అయినట్లుగా మొబైల్కు మెసేజ్ అందింది. దీంతో వెంటనే గార్లదిన్నె యూనియన్ బ్యాంకు మేనేజర్ను సంప్రదించగా ఖాతాను పరిశీలించారు. ఒకే రోజు మూడు సార్లు ఏటీఎం ద్వారా రూ.22 వేలు నగదు డ్రా చేసినట్లు తెలిపారు. దీంతో తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును పరిశీలించుకుంటే అది తనది కాకపోవడంతో మోసపోయినట్లుగా నిర్ధారించుకుని బ్యాంక్ ఖాతాను బ్లాక్ చేయించాడు. బాలుడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితులకు రిమాండ్ బుక్కరాయసముద్రం: మైనర్ బాలుడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ పుల్లయ్య తెలిపారు. బీకేఎస్ మండలం కొట్టాలపల్లిలో ఓ బాలుడు 2022, ఏప్రిల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి తల్లి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు నలుగురు యువకులపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. పాత కేసులు త్వరగా పూర్తి చేయాలన్న ఎస్పీ ఆదేశాల మేరకు.. బాలుడు ఆత్మహత్య కేసులో లోతైన విచారణ అనంతరం నలుగురు యువకులను అరెస్ట్ చేసి గురువారం న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
జిల్లాస్థాయిలో 76 మంది ఉత్తమ గురువులు
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాల విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న 76 మందిని ఈ విద్యా సంవత్సరం జిల్లాస్థాయిలో ఉత్తమ సేవా అవార్డులకు ఎంపిక చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో జరిగే ‘గురు పూజోత్సవ వేడుక’ల్లో వీరికి అవార్డులు అందజేయనున్నారు. ఎంపిక జాబితాను గురువారం సాయంత్రం విద్యాశాఖ విడుదల చేసింది. అవార్డులు అందుకునే వారిలో అనంతపురంలోని జీహెచ్ఎస్ నం.–2 పనిచేస్తున్న ఎస్.నవీద, కె.శ్రీనివాసులురెడ్డి, 15 వార్డులోని పాఠశాల ఉపాధ్యాయుడు అశోక్నాయక్, ఎస్ఎస్బీఎన్లో పనిచేస్తున్న ఎం.నాగరాజు, నందమూరి నగర్ ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు జి.నారాయణస్వామి, కేఎస్ఆర్ స్కూల్ టీచర్ ఎం.శ్రీదేవి, పాపంపేటలో పని చేస్తున్న టీఎం వెంకటేశులు, బి.గీతాలక్ష్మి, కె.పండరీనాథ్ (74 ఉడేగోళం), ఈ.వేణుగోపాల్ (కొనకొండ్ల), కె.సోమశేఖర్ (రామసాగరం), ఎన్.ఆదిశంకర్ (నేత్రాపల్లి), ఎ.వెంకటేశులు (పాలవాయి), సీకే సుబ్రహ్మణ్యం (గోనబావి), ఎన్.సుధ (అబ్బేదొడ్డి), ఎం.డానియల్ (రాయలచెరువు), సర్వమంగల (పాల్తూరు), జి.శ్రీనివాసులు (కళ్యాణదుర్గం), వాణిశ్రీ చూడామణి (ఉప్పరహాళ్), ఎం.సాయిలీల (బొమ్మనహాళ్), సుశీల(చౌళూరు), ఎం.సిద్ధేశ్వరస్వామి (కంబదూరు), కె.రవీంద్ర (హనకనహాళ్), కె.శ్రీధర (గంగలాపురం), బి.సూరిబాబు (యలగలవంక), జి.రఘురాం (యలగలవంక), ఎన్.కృష్ణమోహన్రెడ్డి (పి.వెంగన్నపల్లి), ఎ.వెంకటజయశంకర్ (కొట్టాలపల్లి), జె.వెంకోబరావు (పూలకుర్తి), జేకే శివశరణరప్ప (ఆవులదట్ల), పి.నందకుమార్ (ముట్టాల), ఎస్.రవీంద్ర (పెద్ద యక్కలూరు), టి.రజనీకుమారి (చిన్నహోతూరు), జి.విజయమేరీ (చిత్రచేడు), ఆర్.తులసీనాయక్ (రామసాగరం), ఎస్ఆర్ రాజమణి (వెస్ట్ నరసాపురం), పి.సునీత (బి.యాలేరు), కేఆర్ సునీత (హొసగుడ్డం), వీణ కాళిదాసరాజు (గోనెహాళ్), ఈ.మాధవి ఎడ్వర్డ్స్ (పాతకొత్తచెరువు), కె.సరిత (హనకనహాళ్), జె.సూర్యనారాయణ (బెస్తరపల్లి), డి.అగస్టీన్ కుమార్ (తాడిపత్రి), ఎం.కళాసుధాకర్రావు (కొనకొండ్ల), కె.హెప్సి సరోజ (గుత్తి), యూ.కోటప్ప (అంకంపల్లి), ఎం.జయరాముడు(ఆకులేడు), బి.సరహ్సుజన్ (పూలకుంట), కె.కృష్ణమూర్తి (చెన్నంపల్లి), ఎ.పవన్కుమార్ (ఉద్దేహాళ్), ఎం.హరినాథ్ (హవళిగి), పి.లక్ష్మన్న (రాప్తాడు), పి.శివప్రసాద్నాయుడు (ఊబిచెర్ల), పి.వేణుగోపాల్ (గోనబావి), జి.చిత్తయ్య (కళ్యాణదుర్గం), ఎ.ప్రభావతి (పాతకొత్తచెరువు), ఎం.చంద్రశేఖర్ (రాకెట్ల), ఆర్సీ అక్కులప్ప (కూడేరు), ఎ.శ్రీరాములు (గోపులాపురం), పి.వజీర్బాషా (కోనంపల్లి), ఎన్.సరళ (రామరాజుపల్లి), వి.మారెన్న (ఎన్.గుండ్లపల్లి), బి.నాగలక్ష్మి (కొండాపురం), యూ.శ్రీనివాసులు (యలగలవంక), వైకేఎల్ రంగమ్మ (నెలగొండ), పి.సరస్వతి (దుద్దేకుంట), ఎన్.వినీత (మానిరేవు), పి.రాధ (గొల్లలదొడ్డి), కె.శ్రీదేవి (దుద్దేకుంట), ఎస్.ఆశా (గార్లదిన్నె), ఎ.అర్జున్ (హనిమిరెడ్డిపల్లి), కె.వన్నప్ప (జె.కొట్టాల), ఎం.వెంకటాచలపతి (చింతకాయమంద), ఎస్.మహేష్కుమార్ (కేకే తండా), ఎల్.రాజేశ్వరి (అనంతసాగర్కాలనీ), సీహెచ్ బాలగోవిందు (వెంకటాపురం) ఉన్నారు. నేడు అవార్డుల అందజేత ఉదయం 10 గంటలకు ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో వేడుకలు -
సంకల్పానికి తలొగ్గిన ప్రకృతి
● చౌడు భూమిలో సిరుల పంటలు ● పర్మా కల్చర్తో ఆదర్శంగా నిలిచిన మహిళా రైతు పామిడి: సెంట్రల్ ఎకై ్సజ్ శాఖలో సెక్రటరీగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన పెమ్మక కదిరి నీలారెడ్డి... ప్రస్తుతం 64 ఏళ్ల వయస్సులో వ్యవసాయంలో రాణిస్తున్నారు. ప్రకృతిని అనుసరిస్తూ తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి సాధించేలా పర్మా కల్చర్ చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆమె సంకల్పానికి ప్రకృతి తలొగ్గింది. వందేళ్లకు పైగా బీడుగా ఉన్న నిస్సారమైన చౌడు నేల నేడు సారవంతంగా మారింది. ఒకటి రెండు కాదు.. మామిడి, మల్బరీ, నేరెడు, సపోటా, నిమ్మ, బత్తాయి, చీనీ, జామ, మునగ, కళింగర, సొర, చిక్కుడు, టమాట తదితర 35 రకాల ఉద్యాన పంటలను సాగు చేస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలిచారు. సొంతూరిపై మమకారం పామిడి మండలానికి చెందిన పెమ్మక కదిరి నీలారెడ్డి ఉద్యోగ విరమణ అనంతరం తన సొంతూరిపై మమకారంతో పి.కొత్తపల్లికి చేరుకున్నారు. ఈ క్రమంలో తన పూర్వీకుల వ్యవసాయ విధానాలకు జీవంపోస్తూ పంటల సాగు చేపట్టాలని నిర్ణయించుకుని ఓబుళాపురం గ్రామంలోని 6.5 ఎకరాల పొలాన్ని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశారు. అయితే వందేళ్లుగా ఆ భూమిలో ఒక్క పంటను కూడా పండించలేదు. చౌడు శాతం ఎక్కువగా ఉండడంతో పంటల సాగుకు యోగ్యంగా లేదని బీడుగా వదిలేశారు. అలాంటి భూమిని కొనుగోలు చేస్తున్న సమయంలో నీలారెడ్డి శ్రమ వృధా అవుతుందని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ పర్మాకల్చర్ విధానాలతో చౌడు భూమిని సారవంతం చేశారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ ఉద్యాన పంటల సాగు చేపట్టారు. ప్రస్తుతం ఆమె నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతుండడం గమనించిన రైతులు పర్మాకల్చర్ విధానాలను అడిగి తెలుసుకుంటున్నారు. -
ఏఎస్పీ కార్యాలయానికి బందోబస్తు
తాడిపత్రిటౌన్: తాడిపత్రి పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయం వద్ద బుధవారం వందలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత నెల 31న పట్టణంలో నిర్వహించిన వినాయక విగ్రహాల శోభాయాత్రలో టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటనలో ఇరు వర్గాలకు చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతపురం తరలించారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్రెడ్డి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తన ఇంటి వద్దకు రావాలని వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం రావడంతో బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, అనివార్య కారణాలతో ఆందోళన కార్యక్రమం వాయిదా పడిందని జేసీ వర్గీయులు చెప్పడం గమనార్హం. ఒక్కసారిగా ఏఎస్పీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకోవడంతో తాడిపత్రి పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. 22 మండలాల్లో వర్షం అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 22 మండలాల పరిధిలో 4.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కళ్యాణదుర్గం 17.2 మి.మీ, కంబదూరు 15.4, నార్పల 11.6, విడపనకల్లు 11.2, ఉరవకొండ 10.6, కుందుర్పి 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 110.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 12.9 మి.మీ నమోదైంది. ఓవరాల్గా జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 218 మి.మీ గానూ 20 శాతం అధికంగా 261.4 మి.మీ నమోదైంది. 21 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కాగా... 17 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా, 10 మండలాల్లో సాధారణం, మిగతా 4 మండలాల్లో తక్కువగా వర్షపాతం నమోదైంది. సీఎం పర్యటన ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలి ● అధికారులకు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 10న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక శ్రీనగర్ కాలనీలో ఉన్న జీఎంఆర్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కో– ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజు, ఎస్పీ పి.జగదీష్తో కలిసి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెలీప్యాడ్, సభాస్థలి, పార్కింగ్, తదితర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, ఆర్డీఓ కేశవనాయుడు పాల్గొన్నారు. ఆ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు రాయదుర్గం: తప్పతాగి విధులకు హాజరైన ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాలు.. రాయదుర్గం ఏరియా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన రేడియోగ్రాఫర్గా విధులు నిర్వర్తిస్తున్న మదన్కుమార్ మంగళవారం పూటుగా మద్యం సేవించి ఆస్పత్రికి వచ్చాడు. ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు. మదన్కుమార్ వ్యవహారంపై కలెక్టర్ వినోద్కుమార్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు డీసీహెచ్ఎస్ బుధవారం రాయదుర్గం ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. సూపరింటెండెంట్ మెర్జీ జ్ఞానసుధతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రేడియోగ్రాఫర్ తీరుపై కలెక్టర్ సీరియస్ అయ్యారన్నారు. సస్పెండ్ చేసి విచారణ చేయాలని ఆదేశించారన్నారు. వ్యక్తిగత సమస్యలతో మద్యం సేవించాల్సి వచ్చిందని సదరు రేడియోగ్రాఫర్ చెప్పాడన్నారు. ఈ విషయంపై నివేదికను కలెక్టర్, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపుతామని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ వైద్యులు మహేష్కుమార్ పాల్గొన్నారు. -
బదిలీల్లో ఘోర పరాభవం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఇప్పటికే రోజుకో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు, కింది స్థాయి కేడర్కు మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య పోరు పతాక స్థాయికి చేరినట్లు తెలిసింది. ఏ నియోజకవర్గంలో అయినా సరే ఎంపీ మాట నెగ్గే పరిస్థితి లేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఎంపీలు డమ్మీలుగా మారారని, ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని టీడీపీ నాయకులే పెదవి విరుస్తున్నారు. టీటీడీ లెటర్లు ఇవ్వడానికి మినహా దేనికీ పనికిరావడం లేదంటున్నారు. మా అనుమతి లేనిదే.. ఎలాంటి అనధికార కార్యక్రమాలకూ తమకు తెలియకుండా ఎంపీలు వెళ్లడానికి వీల్లేదంటూ ఎమ్మెల్యేలు హుకుం జారీచేశారు. తాజాగా అనంతపురం అర్బన్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాతూరు మార్కెట్ పరిశీలనకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేకు, ఎంపీకి తీవ్ర వాగ్వాదం జరిగింది. ‘నా అనుమతి లేకుండా వెళ్లడానికి మీరెవరు’ అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి విరుచుకుపడినట్టు తెలిసింది. తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం, కదిరి వంటి నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో కూడా ఎంపీలకు తెలియదు! నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టులు కానీ, కేటాయింపులు చేసే అధికారాలు కూడా ఎంపీలకు లేవు. ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యేలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇసుక, మట్టి, మద్యం ఇలా ఏదైనా కానీ ఎంపీలకు దక్కడానికి వీల్లేకుండా చేశారు. ‘పేరుకే ఎంపీ.. అంతా ఎంప్టీ’ అన్న చందాన తయారైంది పరిస్థితి. ఇటీవల శింగనమల నియోజకవర్గంలో ఎంపీ అంబికా లక్ష్మినారాయణ తమకొద్దంటూ టీడీపీ కార్యకర్తలే ధర్నా చేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది. ఆయనకు అడుగడుగునా.. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చివరి నిమిషంలో ఇచ్చింది చాలు అన్నట్టు ఎంపీ సీటు దక్కించుకుని గెలిచినా.. ఉమ్మడి జిల్లాలో ఆయన మాట ఎక్కడా చెల్లుబాటు కావడం లేదు. ఇక.. సొంత నియోజకవర్గం పెనుకొండలో అయితే మంత్రి సవితకు, ఎంపీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఏ పనిలోనూ ఎంపీకి చిన్న భాగస్వామ్యం కూడా లేదు. కదిరి, హిందూపురం, ధర్మవరం, రాప్తాడు ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పార్థసారథి మాట చెల్లుబాటు కావడం లేదని ఆయన వర్గీయులు వాపోతున్నారు. ఎంపీలను లెక్కచేయని శాసనసభ్యులు అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకూడదని హుకుం ఇటీవల ఎంపీ అంబికాతో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ఢీ శింగనమలలో ఎంపీపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు పెనుకొండలో మరీ ఘోరంగా ఎంపీ పార్థసారథి పరిస్థితి ఆవేదనలో ఎంపీల అనుచరులు టీటీడీ లెటర్లకు తప్ప ఎందుకూ ఉపయోగపడటం లేదని నిట్టూర్పు ఇటీవల జరిగిన బదిలీల్లో ప్రభుత్వ సిబ్బందికి ఇచ్చిన సిఫార్సు లేఖల్లో ఎంపీల సిఫార్సు లేఖలు బుట్టదాఖలయ్యాయి. నియోజకవర్గంలో తమ సిఫార్సు కాదని ఎంపీల సిఫార్సు లేఖలు తీసుకోవద్దంటూ అధికారులకు ఎమ్మెల్యేలు హుకుం జారీచేశారు. చివరకు ఎంపీ ల్యాడ్స్ కింద పనులు చేసినా తమ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. కాబట్టి తమకు వాటా దక్కాల్సిందేనని పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో బయటకు చెప్పుకోలేక, ఎమ్మెల్యేలను ఎదుర్కొనే శక్తి లేక ఎంపీలు లోలోపల కుమిలిపోతున్నారు. ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా అధిష్టానం పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో నలిగిపోతున్నారు. తమకంటే నామినేటెడ్ పోస్టులు దక్కించుకుంటున్న వారే నయమని ఎంపీలు సన్నిహితులతో వాపోతున్నారు. -
హక్కుల సాధనకు ఉద్యమించాలి
అనంతపురం అర్బన్: హక్కుల సాధనకు ఏకమై ఉద్యమించాలని మహిళలకు ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురంలోని లలితకళాపరిషత్లో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల అధ్యక్షతన జిల్లా మహాసభలు జరిగాయి. పుణ్యవతితో పాటు రాష్ట్ర కోశాధికారి సావిత్రి, డాక్టర్ ప్రసూన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో మహిళలు సగభాగం ఉన్నా.. వారు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. మహిళలపై వివక్ష, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్ ఆగడాల నుంచి మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. మహిళలపై ఆత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు, గృహహింస నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగడాలకు మద్యం, మత్తు పదార్థాలు కూడా కారణమన్నారు. ప్రతి మహిళ చైతన్యవంతమైన హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకురాళ్లు చంద్రిక, అశ్విని, శంసాద్, రామాంజినమ్మ, సుజాత, తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక ఐద్వా జిల్లా మహాసభల్లో 13 మందితో కూడిన జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలిగా శ్యామల, కార్యదర్శిగా చంద్రిక, కోశాధికారిగా అశ్విని, కార్యదర్శివర్గ సభ్యులుగా షంషాద్, రామాంజినమ్మ, సుజాత, గీత, శైలజ, రేణుక, రంగమ్మ, కృష్ణవేణి, లక్షమ్మదేవి, నడిపక్క ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా 26 మందిని ఎన్నుకున్నారు. మహిళలకు ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి పిలుపు -
భారత క్రికెట్ జట్టులో స్థానమే అంతిమ లక్ష్యం కావాలి
అనంతపురం: భారత క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకోవడమే అంతిమ లక్ష్యంగా శ్రమించాలని క్రికెటర్లకు కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో బుధవారం ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ అండర్–19 క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆంధ్రా ప్రెసిడెంట్, బరోడా జట్ల మధ్య మ్యాచ్ను ప్రారంభించి, మాట్లాడారు. క్రీడలకు ఆర్డీటీ నిలయంగా మారడం గర్వకారణమన్నారు. క్రికెట్తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కార్యదర్శి భీమలింగా రెడ్డి, వెటరన్స్ క్రికెట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగా రెడ్డి, ఏసీఏ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అచ్యుతరావు, సెలెక్టర్ లీలా మోహన్రెడ్డి, ట్రెజరర్ షబ్బీర్ అహమ్మద్, మాజీ రంజీ ప్లేయర్ సురేష్, ఏడీసీఏ సభ్యులు చంద్రమోహన్రెడ్డి, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆసక్తిగా తొలి రౌండ్ మ్యాచ్లు తొలి రౌండ్ మ్యాచ్ల్లో బరోడా, ఆంధ్రా సెక్రెటరీ జట్టు గెలిచాయి. ఆంధ్రా సెక్రెటరీ, మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిమధ్యప్రదేశ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆంధ్రా సెక్రెటరీ జట్టు 40.4 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఈశ్వర్ రిత్విక్ 78 పరుగులు, పి.సిద్ధు కార్తీకర్ రెడ్డి 67 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు 48.1 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్ అయింది. ఆంధ్రా ప్రెసిడెంట్ , బరోడా జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రా ప్రెసిడెంట్ జట్టు 46.5 ఓవర్లలో పది వికెట్ల నష్టానికి 235 పరుగులు సాధించింది. కోగటం హనీష్ వీరారెడ్డి 68 బంతుల్లో 97 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ బరిలో దిగిన బరోడా జట్టు కేవలం 38.1 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో విశ్వాస్ పటేల్ 82 బంతుల్లో 105 పరుగులు సాధించాడు. కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ -
పేరుకుపోతున్న చెత్తాచెదారం
గుంతకల్లు పట్టణంలో ఎటు చూసినా చెత్తాచెదారం పేరుకుపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఆటోల ద్వారా చెత్త సేకరణ సక్రమంగా జరిగేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆ ఆటోలు తిరగట్లేదు. ఉన్న అరకొర ట్రాక్టర్లు, నాలుగైదు ఆటోలతో వారానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే చెత్త సేకరిస్తున్నారు. ఇక డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో పాటు పైప్లైన్ ఏర్పాటు పేరిట రోడ్లను ధ్వంసం చేయడంతో వీధులన్నీ చిత్తడి చిత్తడిగా మారాయి. ఎటు చూసినా వర్షం నీరు, మురుగు నిల్వ ఉంటోంది. పట్టపగలే దోమల చెలరేగిపోతున్నాయి. దోమల నివారణ చర్యలు చేపట్టడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. గత కౌన్సిల్ సమావేశాల్లోనూ వార్డుల్లో లోపించిన పారిశుధ్యంపై అధికారులను సభ్యులు నిలదీశారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడం తప్ప అధికారులు సాధించిన పురోగతి అంటూ ఏదీ లేదు. రోజూ తాము పనిచేస్తున్నట్లుగా అపరిశుభ్రత ప్రాంతాల్లో ఫొటోలు దిగి వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం తప్ప.. చెత్తాచెదారాన్ని తొలగించడం లేదు. మున్సిపల్ అధికారుల తీరుపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. -
డీపీఆర్వో రమణకు పదోన్నతి
అనంతపురం అర్బన్: జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డీపీఆర్ఓ)పి.వెంకటరమణకు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పదోన్నతి కల్పిస్తూ బాపట్ల జిల్లాకు ప్రభుత్వం బదిలీ చేసింది. పదోన్నతిపై వెళుతున్న రమణను కార్యాలయ సిబ్బంది బుధవారం ఘనంగా సన్మానించారు. డీఐపీఆర్ఓ బాలకొండయ్య మాట్లాడుతూ డీపీఆర్ఓగా వెంకటరమణ అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఏపీఆర్ఓ ఫకృద్ధీన్, పీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, సిబ్బంది ప్రభావతి, దామోదర్రెడ్డి, కమల్, ఆంజనేయులు, భాస్కర్, ఖాసీమ్ పాల్గొన్నారు. ఉల్లి పంట పరిశీలనగుమ్మఘట్ట: మండలంలో రైతులు సాగు చేసిన ఉల్లి పంటను జిల్లా ఉద్యాన అధికారి ఉమాదేవి బుధవారం పరిశీలించారు. ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గత నెల 31న ‘కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి’ శీర్షికన ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ఆమె స్పందించారు. గుమ్మఘట్ట మండలం 75వీరాపురం గ్రామ సమీపంలో రైతులు సాగు చేసిన ఉల్లి పంటను పరిశీలించారు. అధిక వర్షాల కారణంగా దిగుబడిలో నాణ్యత లోపించినట్లుగా గుర్తించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. దిగుబడుల, మార్కెటింగ్ తదితరాలపై ఆరా తీశారు. బహిరంగ మార్కెట్లో ఽఉల్లి ధరలు దారుణంగా పడిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను గ్రేడింగ్ చేసి సమీపంలోని బెంగళూరు, దావణగెర మార్కెట్లకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట స్థానిక ఉద్యాన అధికారి కృష్ణతేజ, సర్పంచ్ నాగరాజు తదితరులు ఉన్నారు. జిల్లాకు 1,923 మెట్రిక్ టన్నుల ఎరువులుఅనంతపురం అగ్రికల్చర్: స్పిక్ కంపెనీ నుంచి 1,922.75 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు సరఫరా కాగా, ఇందులో 904.5 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్పాయింట్కు బుధవారం వ్యాగన్ల ద్వారా చేరిన ఎరువులు, యూరియాను పరిశీలించారు. 904.5 మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 507.85 మెట్రిక్ టన్నుల డీఏపీ, 255.2 మెట్రిక్ టన్నుల 20–20–0–13, 255.2 మెట్రిక్ టన్నుల 10–26–26 రకం కాంప్లెక్స్ ఎరువులు చేరాయన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు యూరియాకు సంబంధించి కోటా మేరకు 399.915 మెట్రిక్ టన్నులు అనంతపురం మార్క్ఫెడ్కు, 200.655 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ హోల్సేల్ డీలర్లకు కేటాయించగా... 303.93 మెట్రిక్ టన్నులు శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. కాంప్లెక్స్, డీఏపీలు 90 శాతం మేర ప్రైవేట్ హోల్సేల్ డీలర్లకు 10 శాతం మార్క్ఫెడ్కు కేటాయించినట్లు వివరించారు. 9 బార్ల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అనంతపురం: నూతన బార్ పాలసీలో భాగంగా గత వారం జారీ చేసిన 9 బార్ల ఏర్పాటు నోటిషికేషన్కు ఎలాంటి దరఖాస్తులు అందకపోవడంతో తాజాగా మరోసారి నోటిఫికేషన్ను జిల్లా ఎకై ్సజ్ అధికారులు జారీ చేశారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువుగా నిర్ధేశించినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 15న లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేస్తామన్నారు. అనంతపురంలో 3, గుంతకల్లు 2, గుత్తి, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఎలుగుబంట్ల దాడిలో కాపరికి తీవ్ర గాయాలురొళ్ల: రెండు ఎలుగుబంట్లు దాడి చేయడంతో మేకల కాపరి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన బుధవారం శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలంలో జరిగింది. టీడీ పల్లి ఎస్సీ కాలనీకి చెందిన రంగధామప్ప మేక పిల్లల మేత కోసం గ్రామ పొలిమేర వద్ద గడ్డి కోస్తుండగా పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి రెండు పెద్ద ఎలుగుబంట్లు హఠాత్తుగా వచ్చి దాడి చేశాయి. తప్పించుకోవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. వెంబడించి మరీ ఎడమ చేయి, భుజం, కుడికాలు తొడ కింద భాగాన తీవ్రంగా రక్కి గాయపరిచాయి. అతి కష్టంపై తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే రొళ్ల సీహెచ్సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. -
పనితీరులో మార్పు రావాలి
అనంతపురం సిటీ: ‘గతంలో ఎలా పని చేశారో నాకు అనవసరం. ఇకపై పరస్పర సహకారం, సమన్వయంతో పని చేయాలి. మెరుగైన ఫలితాలు సాధించాలి. పనితీరులో మార్పు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని పంచాయతీరాజ్ ఉద్యోగులను ఆ శాఖ ఎస్ఈ వై.చిన్నసుబ్బరాయుడు హెచ్చరించారు. పదోన్నతిపై బాపట్ల నుంచి వచ్చిన ఆయన అనంతపురంలోని సర్కిల్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ పీఏ రాజేంద్రప్రసాద్, సూపరింటెండెంట్లు ఖాజీ మొహిద్దీన్, రమాదేవి, డీఈఈలు కృష్ణజ్యోతి, కె.లక్ష్మీనారాయణ, శ్రీనివాసకుమార్, ఏఈఈ హుస్సేన్బాషా, ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈఈ ప్రభాకర్రెడ్డితో కలసి తన చాంబర్లో ఉద్యోగులతో సమావేశమై మాట్లాడారు. రెగ్యులర్ ఉద్యోగులు ఎవరెవరు, ఇన్చార్జ్లుగా కొనసాగుతున్నదెవరు, డిప్యూటేషన్లపై ఎవరెవరు ఉన్నారని ఆరా తీశారు. అన్ని శాఖలకంటే పంచాయతీరాజ్ శాఖ పురోగతిలో ముందు వరుసలో ఉండాలన్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ ప్రణాళికా బద్ధంగా మసలుకోవాలన్నారు. కేటాయించిన పనులు ఎప్పటికప్పుడు పూర్తి కావాలన్నారు. గ్రూపు రాజకీయాలు నడిపితే సహించేది లేదన్నారు. పీఆర్ ఉద్యోగుల సమీక్షలో ఎస్ఈ చిన్న సుబ్బరాయుడు -
చాలా జాగ్రత్తలు పాటించాలి
గుంతకల్లు టౌన్: వాతావరణంలో మార్పుల మాట ఎలా ఉన్నా.. గుంతకల్లులో లోపించిన పారిశుధ్యం కారణంగా విష జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. జ్వర పీడితులతో ప్రభుత్వ ఏరియా, అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ లోపం కారణంగా గత ఇరవై రోజులుగా వరుసగా కురిసిన వర్షాలతో ఎటు చూసినా నీరు నిల్వ ఉండిపోయింది. దీనికి తోడు దోమలు విపరీతంగా వృద్ధి చెందాయి. గత ప్రభుత్వంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ఆదర్శంగా నిలిచిన గుంతకల్లు మున్సిపాల్టీలో ప్రస్తుతం అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు గగ్గోలు పెడుతున్నా.. అధికారులు స్పందించడం లేదనే విమర్శలున్నాయి. చిన్నారులే అత్యధికంగా... గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోజూ 650 నుంచి 700 మంది వరకు ఓపీ నమోదవుతోంది. గత 20 రోజులుగా ఔట్ పేషెంట్లల్లో సుమారు 35 శాతం మంది జ్వరపీడితులే ఉంటున్నారు. వీరిలో టైఫాయిడ్, దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్న వారే అఅత్యధికంగా ఉన్నట్లు ఆస్పత్రి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో చిన్నపిల్లలే ఎక్కువగా ఉండడం ఆందోళన కరం. బుధవారం ఇన్ పేషెంట్గా చికిత్స పొందుతున్న 60 మందిలో 40 మంది జ్వరంతో బాధపడుతున్న వారు కాగా, వీరిలో 25 మంది చిన్నారులు ఉన్నారు. దీంతో ఆస్పత్రిలోని మూడు ఎంఎల్, చిన్నారుల వార్డులు జ్వరపీడితులతో నిండిపోయాయి. ఆస్పత్రిలోని ల్యాబ్లో రోరజూ 80 నుంచి 120 మందికి రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో 35 నుంచి 40 వైరల్ ఫీవర్ కేసులు బయటపడుతున్నాయి. గుంతకల్లులోని నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లల్లోనూ ఇదే పరిస్థితి. చిన్నపిల్లల ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యులు ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు ఎడతెరపి లేకుండా వైద్యమందిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుంతకల్లులోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు జ్వర పీడితులతో కిక్కిరిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు ఓపీలో 35 శాతం జ్వర పీడితులే ఈ సీజన్లో పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాలి. వాతావరణ మార్పుల కారణంగా విష జ్వరాలు పెరిగిపోతున్నాయి. 20 రోజులుగాటైఫాయిడ్, దగ్గు, జలుబు, గొంతునొప్పి కేసులే ఎక్కువగా వస్తున్నాయి. ప్రధానంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉంటే దోమలు వ్యాప్తి చెంది జ్వరాల బారిన పడే ప్రమాదముంది. జ్వరం అధికంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. – డాక్టర్ శ్రీనివాసయాదవ్, గుంతకల్లు -
యువతి ఆత్మహత్య
గుంతకల్లు రూరల్: మండలంలోని ఓబుళాపురం గ్రామానికి చెందిన పుష్పలత (19) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. నాగిరెడ్డి, తిరుమలమ్మ దంపతులకు బీటెక్ చదువుతున్న కుమారుడితో పాటు కుమార్తె పుష్పలత ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన పుష్పలత కొన్ని సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధ పడుతుంది. తల్లిదండ్రులు చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. నొప్పి తీవ్రత తాళలేక బుధవారం ఉదయం తల్లి ఇంటి బయట దుస్తులు ఉతుకుతుండగా ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న కసాపురం పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకూ పోరాటం
● ఏపీ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతినాయుడు అనంతపురం రూరల్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం దగా చేసిందని ఏపీ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతినాయుడు మండిపడ్డారు. డిమాండ్ సాధనలో భాగంగా బుధవారం ఏపీ వాల్మీకి, బోయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవయ్య ఆధ్వర్యంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. రుద్రంపేటలోని వాల్మీకి భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకులను పోలీసులు అడ్డుకుని నాల్గో పట్టణ పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా క్రాంతినాయుడు మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చే వరకూ తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేష్, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు రమేష్, నాయకులు మేకల శివ, నాగేంద్ర, బాలకృష్ణ పాల్గొన్నారు. -
గుమ్మనూరు క్షమాపణ చెప్పాల్సిందే
● రైతుల పక్షాన పోరాడితే చంపుతామంటారా? ● రైతు సంఘాల నాయకుల మండిపాటుఅనంతపురం అర్బన్: రైతుల తరఫున పోరాడితే చంపుతామంటారా అంటూ రైతు, కార్మిక, రైతు కూలీ, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నించారు. తమ సంఘం నాయకులపై నోరుపారేసుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక రైతు సంఘం కార్యాలయంలో విలేకరులతో రైతు, రైతు కూలీ, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, ఆర్.చంద్రశేఖర్రెడ్డి, నాగరాజు, నాగేంద్రకుమార్, కృష్ణమూర్తి మాట్లాడారు. గుత్తి, పామిడి మండలాల్లో సోలార్ ప్రాజెక్టుకు జరుగుతున్న భూసేకరణను పరిశీలించేందుకు వెళ్లిన రైతు సంఘం నాయకులను ఎమ్మెల్యే జయరామ్ అసభ్య పదజాలంతో దూషించారన్నారు. ‘అరగంటలో వెళ్లకపోతే చంపుతాం, తరిమికొడతాం’ అంటూ ఫోన్లో బెదిరింపులకు దిగారన్నారు. ఆయన బెదిరింపులకు భయపడేవారెవరూ లేరన్నారు. గుంతకల్లు నియోజకవర్గంలోని బేతాపల్లిలో ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా రైతులను మభ్యపెట్టి, బెదిరింపులకు దిగి కంపెనీకి భూములు ఇచ్చేలా చేస్తున్నారన్నారు. కంపెనీ యాజమాన్యంతో ఎమ్మెల్యే కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జిల్లాను హార్టికల్చర్ హబ్గా మారుస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నాయకులు నేడు ఎడారిగా మార్చేందుకు సిద్ధపడ్డారని మండిపడ్డారు. రైతుల కోసం వెనకడుగు వేసేది లేదని, ఎంతవరకై నా పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. సంఘాల నాయకులు, శివారెడ్డి, నాగమణి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపిక
అనంతపురం ఎడుకేషన్/కల్చరల్: రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్ అవార్డులకు జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపికయ్యారు. ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్న శైలజ, గుత్తి మండలం అబ్బెదొడ్డి జెడ్పీహెచ్ఎస్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు, పామిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అరు ణను ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న విజయవాడలో జరగనున్న గురుపూజోత్సవం కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు. ● అవార్డుకు ఎంపికై న బయాలజీ టీచర్ శైలజ 1996లో పోస్టుకు ఎంపికయ్యారు. అనంతపురం రూరల్ విద్యారణ్యనగర్ పాఠశాలలో వృత్తి జీవితం ప్రారంభించారు. చిన్నారుల్లో అంతర్లీనంగా ఉండే ప్రతిభా పాటవాలను గుర్తిస్తూ ప్రోత్సహిస్తున్నారు. గతంలో ఉరవకొండ పాఠశాలలో శైలజ పని చేసిన సమయంలో విద్యార్థులు రెండు సార్లు జాతీయ స్థాయి సైన్సు కాంగ్రెస్కు ఎంపిక కావడం గమనార్హం. గంగవరంలో పని చేసిన సమయంలోనూ విద్యార్థులు సైన్సు కాంగ్రెస్కు వెళ్లినట్లు తెలిసింది. శైలజకు రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్ రావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ● రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఫిజిక్స్ టీచర్ శ్రీనివాసులు 1996లో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 16 ఏళ్లుగా డిజిటల్ పద్ధతిలో తరగతులు బోధిస్తున్నారు. 15 ఏళ్లు రిసోర్స్ పర్సన్గా కూడా విధులు నిర్వర్తించారు. అవార్డుకు ఎంపికై న శ్రీనివాసులుకు పలువురు టీచర్లు అభినందనలు తెలిపారు. ● పామిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అరుణ విద్యార్థులను అమ్మలా ఆదరిస్తూ బోధిస్తున్నారు. తరగతి గదిలోనే కాకుండా హాస్టల్స్ను విజిట్ చేస్తూ సాదకబాధకాలు తెలుసుకుంటున్నారు. అవార్డు తనలో బాధ్యత పెంచిందని అరుణ ఈ సందర్భంగా తెలిపారు. అరుణ శ్రీనివాసులు శైలజ -
విషాదం నింపిన వినాయక నిమజ్జనం
ఉరవకొండ (విడపనకల్లు): ఆ బాలుడు ఎంతో ఇష్టంగా బుల్లి మట్టి వినాయకుడిని తయారుచేశాడు. నిత్యం పూలు పెట్టి పూజలు చేశాడు. వినాయకుడిని గంగమ్మ ఒడికి చేర్చి వీడ్కోలు పలుకుదామని ఉత్సాహంగా వెళ్లిన అతడిని మృత్యువు మింగేసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడిని దూరం చేసి తల్లిదండ్రులకు తీరని శోకం నింపింది. వివరాలు.. విడపనకల్లు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన రామాంజినేయులు, రేణుక దంపతులకు ఇద్దరు కుమార్తెలతో పాటు 3వ తరగతి చదువుతున్న కుమారుడు వరుణ్ (8) ఉన్నాడు. తాను మట్టితో తయారు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయాలని బుధవారం ముగ్గురు స్నేహితులతో కలిసి కాలనీ సమీపంలోని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) 6వ డిస్ట్రిబ్యూటరీ వద్దకు వరుణ్ వెళ్లాడు. గణేశుడి ప్రతిమను నీటిలోకి వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడ్డాడు. గమనించిన స్నేహితులు పరుగున వెళ్లి కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులకు చెప్పారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వారు నీళ్లలో కొట్టుకుపోతున్న వరుణ్ను బయటకు తీసి ఉరవ కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వరుణ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడు కళ్ల ముందే మృత్యు ఒడికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
●ప్రశాంతి నిలయంలో ఓనం వైభవం
కళాకారుల నాటక ప్రదర్శనసంగీత కచేరీ నిర్వహిస్తున్న బాలవికాస్ చిన్నారులుప్రశాంతి నిలయం: కేరళీయులు పవిత్రంగా ఆచరించే ఓనం వేడుకలు బుధవారం ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను పురస్కరించుకుని సాయికుల్వంత్ సభా మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత కేరళ సంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లం ఎంపీ ఎన్కె.ప్రేమ చంద్రన్ ప్రసంగిస్తూ.. ఓనం పర్వదిన విశిష్టతను, సత్యసాయి నిస్వార్థ సేవలను వివరించారు. ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలన్నారు. అనంతరం శ్రీశైలానికి చెందిన శ్రీసత్యసాయి విద్యాపీఠం విద్యార్థులు ‘‘దీ పాథ్ ఆఫ్ ట్రూ డివోషన్’’ పేరుతో నృత్యరూపకం ప్రదర్శించారు. శబరి భక్తి ప్రపత్తులను వివరిస్తూ అద్భుతంగా ఆడిపాడారు. -
రెచ్చిపోయినఏసీబీ సీఐ హమీద్ఖాన్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఏసీబీ సీఐ హమీద్ఖాన్ రెచ్చిపోయారు. ఓ డాక్యుమెంటు రైటర్ అసిస్టెంట్ పై చేయి చేసుకున్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది తెలిపిన మేరకు.. ఎనీవేర్ (ఎక్కడైనా) రిజిస్ట్రేషన్ పరిశీలనకు ఏసీబీ అధికారులు బుధవారం స్థానిక అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. అంతకు రెండు రోజులు ముందే ఏసీబీ సీఐ హమీద్ఖాన్ ఒక స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇందు కోసం డాక్యుమెంటు రైటర్ మురళి రూ.6,500 తీసుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన హమీద్ఖాన్ డాక్యుమెంటు రైటర్కు ఫోన్ చేసి తన దగ్గరే ఎక్కువగా డబ్బు తీసుకుంటారా అని గద్దించారు. ఇందుకు డాక్యుమెంట్ రైటర్ మురళి బదులిస్తూ డాక్యుమెంటును బట్టి చార్జీలుంటాయని సమాధానమిచ్చారు. దీంతో కోపోద్రిక్తుడైన సీఐ హమీద్ఖాన్ అక్కడే ఉన్న డాక్యుమెంటు రైటర్ అసిస్టెంట్ కార్తీక్పై చేయి చేసుకున్నారు. ఏసీబీ సీఐ దురుసు ప్రవర్తనపై డాక్యుమెంటు రైటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైటర్ నచ్చకపోతే వేరే దగ్గర చేయించుకోవాలి గానీ, ఎక్కువ తీసుకున్నారని కొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. -
కన్నేసి కాటేస్తూ..
అనంతపురం: ఆడబిడ్డలకు భద్రత కొరవడింది. బడిలో, బస్సులో, ఇంటా, బయట ఇలా ఎక్కడ చూసినా కాచుకుని కన్నేస్తున్న మృగాళ్లు ఒక్కసారిగా కాటేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడబిడ్డ తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పడం లేదు. గత పది నెలల్లో చిన్నారులపై లైంగిక దాడుల కేసులు 12 నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బయటకు చెబితే పరువు పోతుందనే భయంతో చాలామంది తల్లిదండ్రులు మిన్నకుండిపోతున్నారు. చాలా తక్కువ ఘటనలే పోలీస్స్టేషన్ల వరకు వెళ్తున్నాయి. బరి తెగిస్తున్న ‘పచ్చ’ నాయకులు కూటమి ప్రభుత్వంలో అకృత్యాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. తామేం చేసినా చెల్లుబాటవుతుందనే అహంకారంతో అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. ఇటీవలే కణే కల్లు మండలం యర్రగుంట గ్రామంలో ఓ ‘పచ్చ’ నేత 8వ తరగతి చదివే బాలికను మానసికంగా, శారీరకంగా హింసించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె హెచ్చెల్సీలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అదృష్టవశాత్తూ తల్లిదండ్రులు అప్రమ్తతమై కుమార్తెను కాపాడుకున్నారు. వివాహితుడైనప్పటికీ, వావివరసలు మరచి బాలికను వేధించిన తీరు సభ్యసమాజాన్ని సిగ్గు పడేలా చేసింది. మచ్చుకు కొన్ని ఘటనలిలా.. పుట్లూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన రవితేజ అదే గ్రామానికి చెందిన బాలికను తాడిపత్రి మార్కెట్ యార్డు సమీపంలో నిలిపి ఉన్న ఐచర్ వాహనంలోకి బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించి అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీనిపై బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు రవితేజపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ● మూడు నెలల క్రితం నార్పల మండల కేంద్రంలో ఓ బాలికపై మహేష్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన మహేష్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోక్సో కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. చట్టం ఉన్నా.. బాలికలు, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడితే పోక్సో కేసు నమోదు చేస్తారని తెలిసినా మృగాళ్లు వెనక్కి తగ్గడం లేదు. ఇలాంటి కేసుల్లో జీవిత ఖైదు, లేదా 7 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయినా లైంగిక దాడులు ఆగకపోవడం మృగాళ్ల బరితెగింపునకు అద్దం పడుతోంది. నేటి స్మార్ట్ యుగంలో చిన్న పిల్లలకు సైతం స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉండంతో పిల్లలు చెడుమార్గం పట్టే అవకావం ఉందని సైకాలజిస్టులు, విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నారనే విషయాలతో పాటు వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలంటున్నారు. కూటమి ప్రభుత్వంలో బాలికలపై పెరిగిన అకృత్యాలు ఆడబిడ్డ ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రుల్లో ఆందోళన అధికార మదంతో ‘పచ్చ’ నేతల దురాగతాలు చట్టమున్నా రెచ్చిపోతున్న వైనం -
రైతాంగానికి వెన్నుదన్ను
దివంగత నేత వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రజలు ఆయనకు ఘన నివాళులర్పించారు. మంగళవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. మహానేతను మనసారా స్మరించారు. ఆయన అందించిన సంక్షేమ పాలనను గుర్తు చేసుకున్నారు. సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి చాటారు. పేదల పెన్నిధి వైఎస్సార్ అంటూ కొనియాడారు. అనంతపురం జెడ్పీలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన దృశ్యంఅనంతపురం కార్పొరేషన్: స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక సంస్కరణలకు వైఎస్సార్ శ్రీకారం చుట్టారన్నారు. రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకురావడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, 104, 108 తదితర పథకాలతో పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దార్శనికుడు వైఎస్సార్ అని కొనియాడారు. అనంతరం జెడ్పీ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. ● కళ్యాణదుర్గంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్యర్యంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ వైఎస్సార్ను ప్రజలు మరువరన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, మండల కన్వీనర్లు సుధీర్, గోళ్ల సూరి, ఎంపీపీ మారుతమ్మ పాల్గొన్నారు. ● రాయదుర్గంలోని శాంతినగర్లో వైఎస్సార్ విగ్రహానికి సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి, మునిసిపల్ చైర్పర్సన్ పొరాళ్ల శిల్ప నివాళులర్పించారు. సంక్షేమ ప్రదాత వైఎస్సార్ అని కొనియాడారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ● డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన సువర్ణ అధ్యాయమని వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సీనియర్ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, ఐడీసీ మాజీ చైర్మన్ బుక్కచెర్ల నల్లప రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కురుబ నాగిరెడ్డి అన్నారు. రాప్తాడులో వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు. ● గుంతకల్లులో వైఎస్సార్ విగ్రహం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ భవాని, వైస్ చైర్పర్సన్ నైరుతిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఘన నివాళులర్పించారు. గుత్తి, పామిడిలో మాజీ సర్పంచ్ హుస్సేన్ పీరా, జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్కుమార్ తదితరులు వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ● తాడిపత్రిలోని వైఎస్సార్ సర్కిల్లో, మండ లంలోని సజ్జలదిన్నె పార్క్లో వైఎస్సార్ విగ్రహాలకు వైఎస్సార్ సీపీ శ్రేణులు నివాళులర్పించాయి. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్రెడ్డి, జిల్లా నేత ఫయాజ్బాషా తదితరులు పాల్గొన్నారు. ● శింగనమల నియోజకవర్గంలోని అన్ని మండ లాల్లో వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేతలు వీరాంజనేయులు, నార్పల సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలు వైఎస్సార్కు ఘన నివాళులర్పించిన ప్రజలు సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి చాటిన వైఎస్సార్ సీపీ శ్రేణులు జనం గుండెల్లో నిలిచిన నేత వైఎస్సార్: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ‘జలయజ్ఞం’ ద్వారా ఎన్నో తాగు, సాగునీటి ప్రాజెక్ట్లను పూర్తి చేసి రైతాంగానికి వైఎస్సార్ వెన్నుదన్నుగా నిలిచారని వైఎస్సార్ సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర రెడ్డి కొనియాడారు. ఉరవకొండలో వైఎస్సార్ విగ్రహానికి ఆయన ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి వైఎస్సార్ పెద్ద పీట వేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, సర్పంచ్ లలితమ్మ పాల్గొన్నారు. -
కొల్లగొడుతున్నా కనిపించదా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి అధికార పగ్గాలు చేపట్టాక జిల్లాలో సహజ వనరుల లూటీ యథేచ్ఛగా జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. నదులు, గుట్టలను చెరబట్టి మీటర్ల కొద్దీ తవ్వి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన గనుల శాఖ అసలు పట్టించుకోవడమే లేదు. ఎమ్మెల్యేల ఒత్తిళ్లా.. మామూళ్లు అందుతుండడమా.. అనేది తెలియడం లేదు. రోజూ వందలకొద్దీ టిప్పర్లు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. గనుల శాఖ, పోలీసులు చేస్తున్న ‘మౌనవ్రతం’ దుష్పరిణామాలకు దారి తీస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కరిగిపోయిన కొండలు... రాప్తాడు నియోజకవర్గంలోని క్రిష్ణంరెడ్డిపల్లె, ఆలమూరు కొండలు, గుట్టలు ఇప్పటికే కరిగిపోయాయి. టీడీపీ నేతల అక్రమాలకు అడ్డేలేకుండా పోయింది. ఆలమూరు కొండను దాదాపుగా నేలమట్టం చేశారు. క్రిష్ణంరెడ్డిపల్లెలో భారీ గుట్టల నుంచి రోజూ మట్టిని తరలిస్తున్నారు. ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనే రోజూ లక్షల రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు తేలింది. అయినా, దీనిపై గనుల శాఖ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కర్ణాటకకు విచ్చలవిడిగా.. రాయదుర్గం నియోజకవర్గం ఖనిజ అక్రమ రవాణాకు కేంద్రబిందువుగా మారింది. డీ హీరేహాళ్ మండలం కాదలూరు నుంచి మీటర్ల కొద్దీ హగరి నదిని తవ్వేసి ఇసుకను కర్ణాటకలోని మొలకల్మూర్ నియోజకవర్గం గుండా బళ్లారికి తరలిస్తున్నారు. టీడీపీ కీలక నేత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దందా విలువ రూ. కోట్లలో ఉంటుందని అంచనా. అయినా, గనుల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. రోజూ 200 టిప్పర్లు కర్ణాటకకు వెళుతున్నా పోలీసులూ పట్టించుకోవడం లేదు. తాడిపత్రి, శింగనమలలో.. తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల పరిధిలో ఉన్న వంకలు, వాగులు స్వరూపమే కోల్పోయాయి. కొన్ని గ్రామాల్లో ప్రజలే అడ్డుకుంటున్నా అక్రమార్కులపై చర్యలు లేవు. ఇక తాడిపత్రి నియోజకవర్గంలో అయితే పెన్నా నదిలో ఇసుక పూర్తిగా అడుగంటి పోయింది. సుమారు 20 మీటర్ల లోతులో జేసీబీలతో తవ్వి టిప్పర్లతో తరలిస్తున్నారు. ప్రధాన జాతీయ రహదారిపైనే అక్రమంగా ఇసుక టిప్పర్లు వెళ్తున్నా స్పందించే దిక్కు లేదు. కూడేరులో అనుమతుల్లేకుండానే.. కూడేరు మండలంలోని పీఏబీఆర్ సమీపంలో అనుమతులు లేకుండా ఇటీవల భారీగా గ్రానైట్ తవ్వకాలు మొదలుపెట్టారు. గనుల శాఖ అధికారులను అడిగితే తాము అనుమతులు ఇవ్వలేదని చెప్పడం గమనార్హం. రోజూ 30 టిప్పర్ల ద్వారా అక్కడ కార్యకలాపాలు నడిచాయి. దీనిపై కొన్ని రోజుల క్రితం ‘సాక్షి’లో కథనం రాగానే మైనింగ్ ఆపేశారు. తట్టెడు మట్టికూడా మిగలదు.. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో సహజ వనరులను కొల్లగొడుతుండడం చూస్తే భవిష్యత్ తరాలకు తట్టెడు మట్టి కూడా మిగలదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొండలు నేలమట్టమయ్యాయి. నదుల్లో ఇసుక అడుగంటిపోయింది. భవిష్యత్లో ఇళ్లు కట్టాలంటే ఇసుక కనిపించే పరిస్థితి లేదు. దీంతో వచ్చే రోజుల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. . గనుల శాఖ మౌనవ్రతం సహజ వనరుల లూటీ జరుగుతున్నా కానరాని చర్యలు రాప్తాడులో గుట్టలు, కొండల్ని పిండిచేసిన ‘తమ్ముళ్లు’ శింగనమల, తాడిపత్రిలో అక్రమార్కుల చెరలో వంకలు, వాగులు రాయదుర్గం నుంచి రోజూ వందల టిప్పర్ల ఇసుక కర్ణాటకకు గనుల శాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు -
నేమ్ బోర్డులో వైఎస్సార్ పేరు తొలగింపు
● మండిపడ్డ వైఎస్సార్ సీపీ శ్రేణులు ● గుంతకల్లు మార్కెట్ యార్డ్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన గుంతకల్లు: స్థానిక మార్కెట్ యార్డులోని రైతు బజార్ కేంద్రం నేమ్ బోర్డులో వైఎస్సార్ పేరు తొలగించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. దీనిపై వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డు చైర్మన్ సుగాలి లక్ష్మీదేవి భర్త మృతనాయక్ చెప్పడంతోనే వైఎస్సార్ పేరు తొలగించినట్లు యార్డు సెక్రటరీ బాలాజీరావు పేర్కొనడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి మాట్లాడుతూ రైతు బాంధవుడిగా పేరుగాంచిన వైఎస్సార్ పేరును తొలగించడం అన్యామన్నారు. ఈ నెల 6న తమ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అన్నదాతల సమస్యలపై ఉద్యమం చేపడుతున్నామని, అంతలోపు వైఎస్సార్ పేరును నేమ్ బోర్డ్లో చేర్చకపోతే మార్కెట్ యార్డును దిగ్బంధిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ చైర్పర్సన్ భవానీ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్ పేరు తొలగించారన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వరబాబు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రాజన్న ఎంతగానో పాటుపడ్డారన్నారు. గుంతకల్లు మార్కెట్ అభి వృద్ధికి చర్యలు తీసుకున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో యార్డులో షెడ్లు ఏర్పాటు చేశారని, డ్రైనేజీ సమస్య పరిష్కరించారని గుర్తు చేశారు. 6వ తేదీలోపు వైఎస్సార్ పేరును చేర్చకపోతే మార్కెట్యార్డును దిగ్బంధిస్తామని హెచ్చరించి ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జింకల రామాంజినేయులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఖలీల్, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఆర్.బాబు రావు,అబ్దుల్బాసిద్, రంగనాయకులు, కొనకొండ్ల అంజి, బావన్న, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఎస్వీఆర్ మోహన్, కౌన్సిలర్లు లింగన్న, సమోబాషా, జేసీబీ చాంద్బాషా, నీలావతి, మున్సిపల్ వింగ్ జిల్లా అధ్యక్షుడు సుంకప్ప, నాయకులు హరి, గోవింద్నాయక్, సాంబ, మౌలా, ఆరీఫ్, మల్లారెడ్డి, షాబుద్దీన్, పవన్, ఆనంద్, శివాజీ, నాగాంజినేయులు పాల్గొన్నారు. -
కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా
● మహిళ దుర్మరణం ● మరో ముగ్గురికి గాయాలు గుంతకల్లుటౌన్: అడ్డు వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. మరో ముగ్గురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. వన్టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా మద్దికెర భోగప్పబావి వీధికి చెందిన లలితమ్మ (55) ఇరుగుపొరుగు వారితో కలిసి అరుణాచలం ఆలయానికి వెళ్లేందుకని ఆటోలో గుంతకల్లు రైల్వేస్టేషన్కు బయల్దేరారు. స్టేషన్ ప్రవేశమార్గంలో ఉన్న క్రాస్ వద్ద ఆటోకు కుక్క అడ్డురావడంతో దానిని తప్పించేందుకని డ్రైవర్ యత్నించాడు. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. తీవ్రగాయాలపాలైన లలితమ్మను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మరో ముగ్గురు మహిళలు సావిత్రమ్మ, ఈశ్వరమ్మ, స్వాతి స్వల్పంగా గాయపడ్డారు. మృతురాలి కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. -
యూరియా కోసం ఎదురుచూపే
అనంతపురం అగ్రికల్చర్: యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వరి, మొక్క జొన్న, అరటితో పాటు వేరుశనగ, కంది, ఆముదం రైతులకు యూరియా అవసరం ఏర్పడింది. అధికారులేమో అనవసరంగా యూరియా వాడొద్దని సూచనలు చేస్తున్నారు. మోతాదుకు మించి వాడటం వల్ల పంట దిగుబడులు తగ్గిపోతాయని చెబుతున్నారు. యూరియా కొరత ఏర్పడటంతో రైతుల దృష్టి మళ్లించడానికి అధికారులు ఈ రకమైన సలహాలు ఇస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటల వారీగా ఎంత యూరియా వాడాలనే దానిపై కరపత్రాలతో అవగాహన కల్పించే కార్యక్రమానికి తెరతీశారు. ఇన్నేళ్లలో ఎపుడూ యూరియా వాడకంపై అవగాహన కల్పించని జిల్లా యంత్రాంగం ఇప్పుడు హడావుడి చేస్తుండటంపై రైతులు విస్తుపోతున్నారు. ఈ ఖరీఫ్లో అన్ని రకాల ఎరువులు 1.08 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని ప్రణాళిక అమలు చేస్తున్నారు. అందులో యూరియా టార్గెట్ 26,839 మెట్రిక్ టన్నులు. మిగతావి డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్, సూపర్ ఎరువులు ఉన్నాయి. కంపెనీల వారీగా, నెల వారీగా సరఫరా టార్గెట్లు విధించారు. అందుబాటులో 31,266 మెట్రిక్ టన్నులు ఈ సీజన్లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26,839 మెట్రిక్ టన్నుల యూరియా ప్రణాళిక అమలు చేస్తున్నారు. అలాగే గత ఖరీఫ్, రబీకి సంబంధించి మిగులు 15,241 మెట్రిక్ టన్నులు ఉండటం ఈసారి కొంత వరకు కలిసొచ్చిన అంశం. అది లేకుండా ఉండి ఉంటే ఈపాటికి జిల్లాలో యూరియా సమస్య తీవ్రస్థాయిలో ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా మిగులుతో పాటు ఈ ఖరీఫ్ ప్రణాళికలో ఇప్పటి వరకు 16,025 మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 31,266 మెట్రిక్ టన్నులు అందుబాటులో పెట్టామని చెబుతున్నారు. సెప్టెంబర్ నెల టార్గెట్ 6,827 మెట్రిక్ టన్నులుగా నిర్ణయించారు. అయితే సీజన్ టార్గెట్, సరఫరా పరిగణనలోకి తీసుకుంటే ఇంకా 10,814 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరాలి. సరిహద్దులు దాటినట్లు అనుమానాలు ఏప్రిల్, మే నెలలో యూరియా వాడకం తక్కువగా ఉండటం, అలాగే జూన్, జూలైలో వర్షాలు లేక యూరియా వినియోగం అంతంత మాత్రంగానే ఉండటంతో పక్కదారి పట్టడానికి అవకాశం ఏర్పడినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో యూరియా జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు ప్రాంతంలో యూరియా కేటాయింపులు తక్కువగా ఉండటం, అలాగే పక్క జిల్లాల్లో యూరియా వాడకం కాస్త ఎక్కువగా ఉండటంతో జిల్లా నుంచి తరలించి కొందరు సొమ్ము చేసుకున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీరికి అధికారులు కొందరు సహకరించారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టులో విస్తారంగా వర్షాలు రావడం, వరి నాట్లు ఊపందుకోవడం, మొక్కజొన్న విస్తీర్ణం పెరగడం, అరటికి వాడకం, అలాగే వేరుశనగ, కంది, ఆముదం తదితర పంటలకు పైపాటుగా వేయాల్సి ఉండటంతో ఒక్కసారిగా యూరియాపై రైతులు దృష్టిసారించారు. కానీ నిల్వలు తక్కువగా ఉండటంతో రైతులు రొడ్డెక్కారు. 20 రోజులుగా యూరియా సమస్య రైతులను పీడిస్తున్నా... తగినంత అందుబాటులో పెట్టించడంలో కూటమి సర్కారు, జిల్లా యంత్రాంగం, వ్యవసాయశాఖ విఫలమైంది. కూటమి సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రెవెన్యూ, పోలీసు, వ్యవసాయశాఖ, విజిలెన్స్, సహకారశాఖ తదితర శాఖలను రంగంలోకి దింపి యూరియా వ్యవహారంపై తనిఖీలు, సోదాలు చేస్తున్నా పెద్దగా ఫలితం కనిపంచడం లేదని చెబుతున్నారు. ఇక ఈనెల 6న వైఎస్సార్సీపీ యూరియాపై పోరుకు పిలుపు ఇవ్వడంతో కూటమి సర్కారు, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై రైతులు రోడ్డెక్కకుండా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోటా మేరకు ఇంకా 10,814 మెట్రిక్ టన్నులు రావాలి యూరియా వాడకంపై జిల్లా యంత్రాంగం హడావుడి ఈ నెల 6న యూరియా అంశంపై వైస్సార్సీపీ నిరసన -
అవుట్ సోర్సింగ్.. ఏజెన్సీపరం
అనంతపురం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేఎన్టీయూఏ) పరిధిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ నుంచి తప్పించి ఏజెన్సీ పరిధిలోకి తెచ్చారు. చిరుద్యోగుల జీవితాలను చిదిమేసే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల 2008లో యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. వర్సిటీ కార్యకలాపాల నిర్వహణకు అవుట్ సోర్సింగ్ కింద నియామకాలు చేపట్టారు. యూనివర్సిటీలో 274, వర్సిటీ పరిధిలోని కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో 120, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలో 150, క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో 80, ఓటీఆర్ఐలో 26 మంది చొప్పున మొత్తం 650 మంది పనిచేస్తున్నారు. వీరందరికి ప్రభుత్వమే జీతాలు చెల్లించేది. అప్పటి నుంచి ఉద్యోగాలు చేస్తున్నవారిని ఇప్పుడు ఏజెన్సీ పరిధిలోకి తీసుకురావడంతో ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. కూటమి ప్రభుత్వం వస్తే తమ జీతాలు పెరుగుతాయని ఆశిస్తే.. ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. అంతలోనే ఎంత తేడా.. చిరుద్యోగులకు దన్నుగా నిలిచేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఆప్కాస్ను ఏర్పాటు చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం చెల్లించేది. ఉద్యోగులను ఇష్టానుసారం తొలగించే పరిస్థితి లేకుండా భద్రత కల్పించింది. పీఎఫ్ సౌకర్యం ఉండేది. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆప్కాస్ నుంచి జీతాలు చెల్లించలేమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేసే ఉద్యోగులకు ఆప్కాస్ కింద జీతాలు చెల్లిస్తున్నారు. ఒక్క జేఎన్టీయూ అనంతపురంలో మాత్రం ఏజెన్సీ కిందకు తెచ్చారు. దీంతో యూనివర్సిటీ అంతర్గత వనరుల నుంచి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో జేఎన్టీయూ అనంతపురంలో ఇద్దరు, కలికిరిలో 5 మందిని మాత్రమే ఉద్యోగాల్లో తీసుకున్నారు. మొత్తం 650 మందిలో గత ప్రభుత్వంలో ఏడుగురిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. 643 మంది గతంలో నుంచి కొనసాగుతున్న వారే. తాజాగా ఏజెన్సీ కిందకు తీసుకరావడంతో జీతాల చెల్లింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏజెన్సీ దయాదాక్షిణ్యాలపైనే ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీంతో జేఎన్టీయూ అనంతపురం ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరో వైపు జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ హాస్టళ్లలో ఆహారం సరఫరాకు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే అంశంపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో ఈ తరహాలో ఏజెన్సీ ఆహారం సరఫరా చేస్తోంది. ఇదే జరిగితే హాస్టళ్లలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. ఎస్కేయూలోనూ అభద్రతే! శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 80 మంది అకడమిక్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. యూనివర్సిటీలో రెగ్యులర్ ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొరత అధికంగా ఉంది. మొత్తం 50 మంది ప్రొఫెసర్లు కూడా రెగ్యులర్గా లేరు. ఈ నేపథ్యంలో వీరికి సహాయంగా పీహెచ్డీ, నెట్, సెట్ అర్హత పొందిన వారిని అకడమిక్ కన్సల్టెంట్లుగా నియామకం చేసుకున్నారు. వీరికి అవర్ బేస్డ్ జీతాలు ఇస్తున్నారు. ఏడాదికోసారి నియామకాలు చేస్తారు. దీంతో వీరికి ఆదివారంతో గడువు పూర్తయింది. తిరిగి రెన్యూవల్ చేయకుండా తాత్సారం చేశారు. దీంతో వీరిలోనూ అభద్రత వెంటాడుతోంది. గడువులోపే రెన్యూవల్ చేసి ఉంటే తరగతులకు విఘాతం కలిగి ఉండేది కాదు. ఈ 80 మంది అకడమిక్ కన్సెల్టెంట్లను కొనసాగించి.. తరగతులకు ఆటంకం లేకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. అధికారుల బాధ్యాతారహిత్యానికి నిదర్శనం అని విద్యార్థులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. జేఎన్టీయూఏ పరిధిలో 650 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత ప్రభుత్వంలో ఆప్కాస్ ద్వారా వేతనాలు ఏజెన్సీకి మార్పు చేసిన కూటమి సర్కారు -
గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నాం
● కలెక్టర్తో బొప్పాయి రైతు ఓబయ్య ఆవేదన కూడేరు: వర్షాల వల్ల ఢిల్లీ, కోల్కతా, ముంబై, ఇతర ప్రాంతాలకు బొప్పాయి ఎగుమతి సరిగా లేదు. దీంతో స్థానికంగా గిట్టుధర లేక నష్టపోతున్నామని రైతు ఓబయ్య కలెక్టర్ వినోద్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ మంగళవారం కమ్మూరులో పర్యటించారు. బొప్పాయి సాగు చేసిన ఓబయ్య పొలాన్ని సందర్శించి.. ఎన్ని కోతలయ్యాయి. మార్కెటింగ్ సదుపాయం ఉందా, ఎంత ధరతో విక్రయిస్తున్నారని ఆరా తీశారు. ఇదివరకు కిలో బొప్పాయి రూ.20 వరకు విక్రయించామని, ఇప్పుడు వర్షాలతో కిలో రూ.5లోపే వ్యాపారస్తులు కొనుగోలు చేసి బెంగళూరుకు తరలిస్తున్నారని రైతు తెలిపారు. కనీసం కిలో రూ.10 ఉన్నా గిట్టుబాటు అవుతుందని రైతు తెలిపారు. బొప్పాయిని కోల్డ్ స్టోరేజ్లో ఎన్ని రోజులు పెట్టొచ్చని హార్టికల్చర్ అధికారులతో కలెక్టర్ ఆరా తీయగా.. వారం రోజులు కంటే ఎక్కువ రోజులు ఉండదని వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంపీ పీడీ రఘనాథ్ రెడ్డి , ఏపీడీ ధనుంజయ్య,, నియోజక వర్గ హార్టికల్చర్ ఆఫీసర్ యామిని , తహసీల్దార్ మహబూబ్ బాషా, ఎంపీడీఓ పాల్గొన్నారు. ప్రజోపయోగ పనులకు సహకరించాలి అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగం చేపడుతున్న ప్రజోపయోగ పనులకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ వినోద్కుమార్ సూచించారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి భూసేకరణ అంశంపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రి మండలం గన్నేవారిపల్లిలో రైల్వే క్రాసింగ్ 159పైన ఫ్లైఓవర్ నిర్మాణానికి 3.79 ఎకరాల పట్టాభూమి సేకరించాల్సి వస్తుందన్నారు. పరిహారం విషయంలో భూ యజమానులైన రైతులు సహకరించాలన్నారు. ఎకరాకు రూ.38 లక్షలు పరిహారం చెల్లించేలా తీర్మానించామన్నారు. అదే విధంగా తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు మండలాల్లోని 15 గ్రామాల్లో అదానీ రెన్యువబుల్ ఎనర్జీ ద్వారా ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్మిషన్ టవర్ల నిర్మాణానికి పరిహారం చెల్లింపు విషయంపై రైతులతో కలెక్టర్ చర్చించారు. జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, తాడిపత్రి తహసీల్దారు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
చదరంగంలో జిల్లా టాపర్గా జునైరా
గుంతకల్లు: చదరంగంలో రాపిడ్ విభాగంలో గుంతకల్లుకు చెందిన జునైరా అనే విద్యార్థిని 1,698 అత్యధిక రేటింగ్ సాధించి జిల్లా టాపర్గా నిలిచినట్లు కోచ్లు అనిల్కుమార్, రామారావు తెలిపారు. గత నెలలో బెంగళూరులో జరిగిన ఇంటర్ నేషనల్ రాపిడ్ ఇండిపెండెన్స్ కప్ చెస్ టోర్నీమెంట్లో జునైరా విజయం సాధించి రికార్డు సృష్టించినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రపంచ చదరంగ సమాఖ్య, అఖిల భారత చదరంగ సమాఖ్య సంయుక్తంగా ఈ నెల ఒకటిన విడుదల చేసిన చదరంగ జాబితాలో జునైరా చోటు సంపాదించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా జునైరాను తల్లిదండ్రులుతోపాటు సెయింట్ పీటర్స్ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, కోచ్లు అభినందిచారు. సమగ్రశిక్ష ఐఈడీ పోస్టుకు రీ నోటిఫికేషన్ అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్రశిక్షలో ఆరు సెక్టోరియల్ అధికారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో ఐఈడీ కోఆర్డినేటర్ పోస్టుకు ఒక అభ్యర్థి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఆయన కూడా నాట్విల్లింగ్ ఇవ్వడంతో ఆ పోస్టుకు కలెక్టర్ ఆదేశాల మేరకు రీ నోటిఫికేషన్ జారీ చేస్తూ మంగళవారం సమగ్రశిక్ష ఏపీసీ శైలజ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 6లోగా httpr://rama frarhikhaatp.bofrpot.comవెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు కల్గి ఉండాలని పేర్కొన్నారు. నోటిఫికేషన్ తేదీ 01–09–28 నాటికి 55 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. క్రమశిక్షణ చర్యలు పెండింగ్ ఉన్న టీచర్లు డిప్యుటేషన్కు పరిగణించబడరని స్పష్టం చేశారు. సమగ్ర శిక్షలో ఐదేళ్లు నిరంతర లేదా వేర్వేరు కాలాల్లో డిప్యుటేషన్పై పని చేసిన వారు అనర్హులని పేర్కొన్నారు. 6వ తేదీ సాయంత్రం 5.30 గంటల తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని జిల్లాలో పని చేస్తున్న ఆసక్తిగల ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్ టీచర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మట్టిలో చిక్కుకుని ఇద్దరు కూలీలు మృతి యశవంతపుర: ఉపాధి కోసం కర్ణాటకకు వలస వెళ్లిన ఇద్దరు అనంతపురం జిల్లా కూలీలు పునాది తవ్వుతున్న సమయంలో మట్టిదిమ్మెలు విరిగిపడి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని యలహంకలో ఎంబసీ గ్రూప్కు చెందిన భారీ భవన నిర్మాణం కోసం కూలీలు పునాదులు తవ్వుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మట్టిదిమ్మెలు విరిగి అనంతపురం జిల్లాకు చెందిన కూలీలు శివ (35), మధుసూదనరెడ్డి (48)పై పడ్డాయి. తోటి కూలీలు మట్టిని తొలగించి వారిని బయటకు తీయగా.. అప్పటికే శివ చనిపోయాడు. మధుసూదన్రెడ్డిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి వదులుగా మారి విరిగిపడినట్లు కూలీలు చెబుతున్నారు. యలహంక పోలీసులు భవన యజమానిపై కేసు నమోదు చేశారు. ‘సోలార్’ ఏర్పాటును ఉపసంహరించుకోవాలి గుత్తి: రైతులకు తీరని నష్టం కలిగించే సోలార్ ఇండస్ట్రీ ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. గుత్తి మండలం బేతాపల్లిలోని సోలార్ ఇండస్ట్రీని మంగళవారం ఆయన ఏపీ రైతు సంఘం నాయకులు, సీపీఎం నాయకులతో కలిసి పరిశీలించారు. సోలార్ ఇండస్ట్రీకి భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడారు. అనంతరం గుత్తి ఆర్అండ్బీ బంగ్లాలో విలేకరులతో మాట్లాడారు. సోలార్ ఇండస్ట్రీ వల్ల పంట భూములు నాశనం అవుతాయన్నారు. రైతుకు ఎకరాకు రూ.30 వేలు ఇచ్చి 30 ఏళ్లు లీజుకు తీసుకుంటారన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా రైతులు ఢిల్లీకి వెళ్లి గోడు చెప్పుకోవలసి వస్తుందన్నారు. బేతాపల్లిలో ఏకంగా 17 వేల ఎకరాల భూములు తీసుకున్నారన్నారు. ఆ భూములపై ఇక రైతులు ఆశలు వదులుకోవలసిందేనన్నారు. ప్రభుత్వం పునరాలోచించి సోలార్ ఇండస్ట్రీకి భూములు తీసుకోవడం ఆపేయాలన్నారు. లేకపోతే ఏపీ రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా నాయకులు దస్తగిరి, ఈశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మతిస్థిమితం లేని యువతిపై ఆటో డ్రైవర్ దాడి
కదిరి టౌన్: మున్సిపల్ పరిధిలోని నాగిరెడ్డిపల్లిలో మతిస్థిమితం లేని యువతిపై మంగళవారం ఆటో డ్రైవర్ ముబారక్ మద్యం మత్తులో మటన్ కొట్టే కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని అభిజ్ఞ ఫౌండేషన్ సభ్యులు అలి, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.‘కూటమి పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం’ లేపాక్షి: కూటమి పాలనలో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. మంగళవారం లేపాక్షిలోని టూరిజం గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేపరం చేయాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, యూనివర్సిటీలను ప్రైవేటుపరం చేయడానికి పూనుకున్నారన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తే చంద్రబాబు చరిత్రహీనుడవుతారని స్పష్టం చేశారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే అవకావాలు ఉన్నా ప్రైవేటుపరం చేయడానికి సమాయత్తమవుతున్నారని, దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, రూ.260 యూరియా బస్తాను రూ.500కు విక్రయిస్తున్నారని, డీఏపీపైనా రూ.200 అదనంగా దండుకుంటున్నారని మండిపడ్డారు. జన గణనతోపాటు కుల గణన చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటమయ్య పాల్గొన్నారు. -
ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్, అనుబంధ విభాగాల్లో పని చేసే ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా తాము పని చేస్తున్నామని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పీ, అనుబంధ విభాగాల్లో పని చేస్తూ అకాల మృత్యువాతపడ్డ ఉద్యోగులకు సంబంధించిన వారసులు తొమ్మిది మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగావకాశం కల్పించారు. వారందరికీ జెడ్పీ చైర్పర్సన్ తన చాంబర్లో నియామకపత్రాలను మంగళవారం అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న వారిలో ఎన్.మమత (పీఆర్ఐ సబ్ డివిజన్–మడకశిర), శోభ (ఎంపీపీ ఆఫీస్–మడకశిర), కేఆర్ రాఘవేంద్రరావు (ఎంపీపీ ఆఫీస్ –శెట్టూరు), వి.శకుంతల (జెడ్పీహెచ్ఎస్ – చెన్నేకొత్తపల్లి), సి.భార్గవి (జెడ్పీహెచ్ఎస్ – చుక్కలూరు), వై.ప్రసన్నకుమార్, పి.దీపక్ (జెడ్పీ–అనంతపురం), కె.బంధ నవాజ్ (పీఆర్ఐ, పీఐయూ–అనంతపురం), ఎస్.ధనలక్ష్మి (ఎంపీపీ ఆఫీస్ –బుక్కరాయసముద్రం) ఉన్నారు. వారినుద్దేశించి చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో బాధ్యతలను సమర్థవంతంగా అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్య, ఏఓలు షబ్బీర్ నియాజ్, విజయభాస్కర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్వ‘జన’ కష్టాలు
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వసతులు రోజురోజుకూ దారుణంగా పడిపోతున్నాయి. పేద రోగులకు చుక్కలు కనపడుతున్నాయి. ఇటీవల జిల్లాపై విష జ్వరాలు పంజా విసిరాయి. దీంతో సర్వజనాస్పత్రికి జ్వర పీడితుల సంఖ్య పెరిగింది. ఇక్కడేమో ఓపీ చీటీ తీసుకునేందుకే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ‘అభా’ రిజిస్ట్రేషన్ పేరుతో వైద్య సిబ్బంది చుక్కలు చూపుతున్నారు. ఈ క్రమంలో మహిళలు చంటిబిడ్డలను ఎత్తుకుని క్యూలో నిల్చోలేక నరకం అనుభవిస్తున్నారు. నిద్రమత్తులో పర్యవేక్షణాధికారి.. వాస్తవంగా ‘అభా’ రిజిస్ట్రేషన్ ఒకసారి చేయిస్తే చాలు. ఇందుకోసం వార్డుల వారీగా ప్రత్యేకంగా ఓపీలు ఏర్పాటు చేసి కంప్యూటర్లు సమకూర్చాల్సి ఉంది. ఈ క్రమంలో అదే సమస్యపై మళ్లీ రోగి వచ్చినప్పుడు నేరుగా ప్రత్యేక ఓపీకి వెళ్తే సరిపోతుంది. కానీ, ఉమ్మడి జిల్లాకే పెద్ద దిక్కైన సర్వజనాస్పత్రిలో ఆ సౌకర్యం లేకుండా పోయింది. ‘అభా’ కింద ప్రత్యేకంగా కంప్యూటర్లు, ఇతర సామగ్రి మంజూరయ్యాయని చెబుతున్నా.. అవి ఎక్కడున్నాయో తెలియని దుస్థితి నెలకొంది. ‘అభా’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన డాక్టర్ సౌజన్య కుమార్ నిద్రమత్తులో ఉన్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రి ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో పేద రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఎంఎన్ఓల నిర్లక్ష్యం సర్వజనాస్పత్రిలో రోగులకందే సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో ఎంఎన్ఓ (మేల్ నర్సింగ్ ఆర్డర్లీ)లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైద్యులు, ఇతర సిబ్బందితోనూ ఒక్కోసారి దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సోమవారం సర్జికల్ వార్డులో అడ్మిషన్లో ఉన్న రామగిరి మండలం పోలేపల్లికి చెందిన కిష్టప్పకు వైద్యులు సిటీ స్కాన్కు రెఫర్ చేయగా... ఎంఎన్ఓ పత్తా లేక పోవడంతో రోగి కుటుంబీకులే అతికష్టం మీద మొదటి ఫ్లోర్లో ఉన్న సర్జరీ విభాగం నుంచి సిటీ స్కాన్ గదికి వీల్చైర్పై తీసుకెళ్లారు. చిన్నారులతో చెలగాటం సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో చిన్నారుల పట్ల వైద్యులు, కొందరు స్టాఫ్నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వార్డులో ఆయాసం ఉన్న పిల్లలకు సిబ్బంది పర్యవేక్షణలో నెబులైజేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తల్లులే నెబ్యులైజర్ ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి పట్టడం గమనార్హం. ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు ఓంకారమ్మ. కుందుర్పి గ్రామానికి చెందిన ఈమెకు ఇటీవల జ్వరం వచ్చింది. ఓంకారమ్మ 11 నెలల కుమారుడు అభినయ్ కూడా జ్వరం బారిన పడ్డాడు. వారం రోజుల క్రితం ఇద్దరూ కర్ణాటకలోని ఓ ఆస్పత్రిలో చూపించుకున్నా జ్వరం తగ్గలేదు. దీంతో సోమవారం మెరుగైన వైద్యం కోసం ఇద్దరూ అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చారు.ఇక్కడ చూస్తే ఓపీ చీటీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో క్యూలో నిల్చునే ఓపిక లేక ఇలా తల్లీకుమారుడు కూర్చుండిపోయారు. ఓంకారమ్మ మాత్రమే కాదు.. నిత్యం సర్వజనాస్పత్రిలో ఎంతో మంది ఇలాగే ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. జీజీహెచ్లో దయనీయ పరిస్థితులు ఓపీ కోసం గంటల తరబడి నిరీక్షణ చిన్నపిల్లల వార్డులో అవస్థలు రోగులకు తప్పని ఇబ్బందులు -
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం
కర్నూలు(టౌన్): అఽధికారం కోసం అబద్దాలు చెప్పిన సీఎం చంద్రబాబును నిలదీద్దామంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి పిలుపు నిచ్చారు. సోమవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో వైఎస్సార్సీపీ మహిళా జోనల్ సదస్సు పార్టీ జిల్లా అధ్యక్షురాలు శశికళ అధ్యక్షతన జరిగింది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తొలుత వరుదు కళ్యాణి ప్రసంగించారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఏడాదిన్నర గడిచినా ఒక్కటీ అమలు చేయలేకపోయారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పాలనలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు ఏడాదిన్నర కాలంలోనే ప్రజల నెత్తిన రూ.2 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపారన్నారు. రాష్ట్రంలో 24 శాతం మద్యం అమ్మకాలు పెరగడంతోనే మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయన్నారు. జగనన్న వల్లే మహిళా సాధికారత సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో ఆయననే ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. జగనన్న కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తామన్నారు. జగనన్న హయంలో మహిళలు బంగారం కొనుగోలు చేస్తే, ఈ ప్రభుత్వంలో బంగారాన్ని అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయన్నారు. సమావేశంలో సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు సి.నాగమణి తదితరులు పాల్గొన్నారు. సంపద సృష్టి పేరుతో ప్రజల నెత్తిన రూ.2 లక్షల కోట్ల అప్పుల భారం ఇంటింటికి తిరిగి చంద్రబాబు మోసాలు వివరించాలని పిలుపు వైఎస్సార్సీపీ మహిళా జోనల్ సదస్సులో రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి -
మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
పుట్లూరు: భూ వివాదం నేపథ్యంలో పుట్లూరు మండలం చిన్నమల్లేపల్లికి చెందిన మహిళా రైతు సావిత్రమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన మేరకు... చింతలపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 72లో 5 ఎకరాల భూమి తన పేరుపై ఉన్నట్లుగా సావిత్రమ్మ చెబుతోంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కులంధర్రెడ్డి, వెంకటనారాయణరెడ్డి ఆ భూమిని తాము కొనుగోలు చేశామంటూ సోమవారం ట్రాక్టర్తో సేద్యం పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న సావిత్రమ్మ అక్కడకు చేరుకుని సేద్యం పనులు అడ్డుకుంది. అయినా వారు పనులు కొనసాగించడంతో మనస్తాపం చెందిన ఆమె ఇంటికి చేరుకుని పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఇంటి బయట అరుగుపై పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, ఈ భూ వివాదంపై గతంలో పలుమార్లు ఇరువర్గాల వారు అధికారులకు ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
టీడీపీ వర్గీయుల...
● వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ప్రహరీ ధ్వంసం● అడ్డొచ్చిన వారిపై దాడిరాప్తాడు: కూటమి ప్రభుత్వం వచ్చాక రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. సోమవారం రాప్తాడు మండలం భోగినేపల్లిలో ఓ మహిళ, మరో వ్యక్తిపై టీడీపీ శ్రేణులు కిరాతకంగా దాడికి పాల్పడ్డాయి. వివరాలు.. భోగినేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త అవిలిగొండ శివయ్య తన ఇంటి కుడి పైపు మూడు అడుగుల స్థలం వదిలి నూతన ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. పక్కనే టీడీపీ కార్యకర్త వలగోండ కదిరప్పకు చెందిన పాడుబడిన ఇంటితో పాటు మరొక ఇల్లు ఉంది. శివయ్య ఇంటిపక్కనే ఉన్న మూడు అడుగుల స్థలం కూడా తనదేనంటూ కదిరప్ప కబ్జా చేసేందుకు పూనుకున్నాడు. సోమవారం ఉదయం శివయ్య స్థలానికి సంబంధించిన పాత గోడను కూల్చివేసేందుకు సిద్ధపడ్డాడు. శివయ్య, ఆయన భార్య జానకమ్మ అడ్డు చెప్పగా.. ‘ఈ స్థలం నాది. ఇప్పుడున్నది మా ప్రభుత్వం. అడ్డొస్తే ఇక్కడే పాతి పెడతా’ అంటూ దాడికి దిగాడు. దీనిపై శివయ్య కుమార్తె శోభా, అన్న అవిలిగొండ ఆదెప్ప నిలదీయగా.. వారిపైనా దాడి చేశాడు. కదిరప్పతో పాటు భార్య శివమ్మ, కుమారుడు సాయికుమార్, టీడీపీ నాయకులు ధనారెడ్డి, గోపాలప్ప ఇనుపరాడ్లు, గడ్డర్లు తీసుకుని వచ్చి దాడి చేశారు. దాడిలో అవిలిగొండ శోభా చేయి విరిగింది. ఆదెప్ప తల పగిలింది. శివయ్య, జానకమ్మకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు అడ్డుకోకుంటే టీడీపీ నాయకులు చంపేసేవారని స్థానికులు చెప్పారు. -
నాలుగు కళ్ల సీతాకోక చిలుక ప్రత్యక్షం
రాప్తాడు: మండలంలోని మరూరు గ్రామంలో నాలుగు కళ్ల సీతాకోక చిలుక ప్రత్యక్షమైంది. గ్రామం నుంచి ధర్మవరానికి వెళ్లే మార్గంలో ఉన్న కుళ్లాయప్ప హోటల్ వద్ద కనిపించిన సీతాకోక చిలుక రెక్కలపై నాలుగు కళ్లు ఉండడంతో జనం ఆసక్తిగా గమనించారు. తమ మొబైల్స్లో ఫొటోలు తీసేందుకు పోటీ పడ్డారు. నాలుగు గ్రామాల్లో మ్యాజిక్ డ్రైయిన్లుఅనంతపురం టౌన్: స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్రా కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న కూడేరు మండలం ముద్దలాపురం, పామిడి మండలం నీలూరు, గుమ్మఘట్ట మండలం 75 వీరాపురం, పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరు గ్రామాల్లో మ్యాజిక్ డ్రైయిన్లు ఏర్పాటు చేస్తున్నట్లు డ్వామా పీడీ సలీంబాషా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీఆర్ శాఖ అధికారుల నుంచి నివేదికలు అందగానే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఏసీబీ చార్జెస్పై ప్రజెంటింగ్ అధికారి నియామకంఅనంతపురం అర్బన్: అవినీతి కేసులో విశ్రాంత తహసీల్దారు, మరికొందరు రెవెన్యూ అధికారులపై ఏసీబీ అధికారులు ఫ్రేమ్ చేసిన చార్జెస్పై ప్రజెంటింగ్ అధికారిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు సోమవారం జారీ అయ్యాయి. 2020, జనవరి 24న ముదిగుబ్బ తహసీల్దారు కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు, ఆన్లైన్లో నమోదు, మ్యుటేషన్ తదితర వ్యవహారాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అప్పటి తహసీల్దారు అన్వర్ హుస్సేన్ (పస్తుతం ఉద్యోగ విరమణ చేశారు), డిప్యూటీ తహసీల్దారు రామకృష్ణ, మండల సర్వేయర్ రత్నాకర్బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్–1 సందీప్కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఏఎస్ఓ చంద్రశేఖర్, మరికొందరిపై ఏసీబీ చార్జెస్ ఫైల్ చేసింది. ఈ వ్యవహారంలో ప్రస్తుతం ప్రజెంటింగ్ అధికారిని ప్రభుత్వం నియమించింది. ఏసీబీ చార్జెస్పై ప్రజెంటింగ్ అధికారి విచారణ చేపట్టి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ‘పచ్చ’ నేతలు.. డబ్బుల కట్టలు! శింగనమల: కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక, మట్టిని ‘తమ్ముళ్లు’ చెరబట్టారు. పేకాటతో జేబులు నింపుకుంటున్నారు. తాజాగా ‘పచ్చ’ నేతలు ఓ చోట కూర్చుని నోట్ల కట్టలు లెక్కిస్తున్న వీడియో బయటకు రాగా.. కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వసూళ్లు చేశారని టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లోనే తీవ్ర చర్చ సాగడం గమనార్హం. నియోజకవర్గ టీడీపీలో ఇప్పటికే రెండు గ్రూపులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బయటకి వచ్చిన వీడియోని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గ నాయకులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నియోజకవర్గంలో విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలిప్పిస్తామంటూ రూ.లక్షల్లో వసూలు చేశారంటూ పోస్టులు పెడుతున్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే టీచర్ ఉద్యోగం కోల్పోయా
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ(ఎస్కేయూ) నిర్లక్ష్యం వల్ల తాను టీచర్ పోస్టుకు ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోయానని డీఎస్సీ–25లో స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ) ఫిజికల్ ఎడ్యుకేషన్లో జిల్లాలో 14వ ర్యాంకు సాధించిన దాసరి మహేష్కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన సోమవారం విద్యాశాఖ అధికారులను కలిసి తన సమస్యను వివరించారు. ‘ఇటీవల ప్రకటించిన డీఎస్సీ–25 ఫలితాల్లో ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలో నేను 84 మార్కులతో 14వ ర్యాంకు సాధించాను. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాగా, బీపీఈడీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ మే 15వ తేదీలోపు లేనందున టీచర్ పోస్టుకు అనర్హుడిగా ప్రకటించారు. జీఓ–17లో అర్హత అనేది సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో చూపించాలనేది స్పష్టంగా ఉంది. నేను కూడా పరిశీలన సమయానికి సర్టిఫికెట్లను చూపించినా అధికారులు ఒప్పుకోలేదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి, ఏప్రిల్ మొదటి వారంలోనే ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాయి. కానీ ఎస్కేయూ మాత్రం నిర్వహించలేదు. చివరి సెమిస్టర్ పరీక్షలను దాదాపు ఐదు నెలలు ఆలస్యంగా నిర్వహించింది. డీఎస్సీ–25కి అన్ని యూనివర్సిటీల విద్యార్థులు అర్హత సాధించినా, ఎస్కేయూలో చదివి మంచి మార్కులు సాధించిన నాకు మాత్రం అన్యాయం జరిగింది. ప్రభుత్వం, విద్యాశాఖ, ఎస్కేయూ నిర్లక్ష్యం వల్ల నేను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. సకాలంలో పరీక్షలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్పై ఉంది. విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించి నాకు న్యాయం చేయాలి’ అని దాసరి మహేష్కుమార్ కోరారు. 14వ ర్యాంకర్ ఆవేదన -
తల్ సైనిక్ క్యాంప్నకు ఎంపిక
గుంతకల్లు టౌన్: ఢిల్లీ వేదికగా జాతీయ స్థాయిలో జరిగే తల్ సైనిక్ క్యాంప్నకు గుంతకల్లులోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ హెచ్.మల్లికార్జున ఎంపికయ్యాడు. ఏపీ, తెలంగాణ నుంచి 8 మంది ఎన్సీసీ క్యాడెట్లను ఎంపిక చేయగా ఇందులో ఎస్కేపీ కళాశాల బీఏ (సెకండియర్) విద్యార్థి మల్లికార్జున అర్హత సాధించడంపై ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య, ఎన్సీసీ అధికారి లెఫ్ట్నెంట్ బాలకృష్ణ అభినందించారు.రోగులకు ‘కరెంట్’ కష్టాలుఉరవకొండ: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులకు కరెంట్ కష్టాలు వెన్నాడుతున్నాయి. జనరేటర్, ఇన్వర్టర్ ఉన్నా ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకే ఎక్స్రే తీయించుకునేందుకు 60 మంది రోగులు సంబంధిత విభాగం వద్దకు చేరుకున్నారు. అయితే తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎక్స్రే విభాగం వద్ద రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. అయినా జనరేటర్ జోలికి ఎవరూ వెళ్లలేదు. చివరకు రోగుల్లో అసహనం వ్యక్తమవడంతో ఐదు గంటల తర్వాత జనరేటర్ ఆన్ చేశారు.40.3 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాలు నిలుపుదలబ్రహ్మసముద్రం: మండలలోని వేపులపర్తిలో ఉన్న లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్స్ దుకాణంలో స్టాక్ రిజిస్టర్కు డీబీటీకు మధ్య వ్యత్యాసం ఉన్న, అనుమతి పత్రాలు లేని పలు రకాల కంపెనీలకు చెందిన 40.3 మెట్రిక్ టన్నుల ఎరువులకు స్టాఫ్ సేల్స్ నోటీసులు జారీ చేసినట్లు మండల వ్యవసాయ క్వాలిటీ కంట్రోల్ అధికారి శ్రావణ్కుమార్, విస్తరణాధికారి నందకిరణ్ తెలిపారు. సోమవారం ఎరువుల దుకాణంలో వారు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రూ.11.48 లక్షల విలువ చేసే ఎరువులకు సంబంధించి రికార్డుల్లో వ్యత్యాసాలు గుర్తించి విక్రయాలు నిలుపుదల చేశారు. -
కనికరించండి సారూ
అనంతపురం అర్బన్: కనికరించి.. కరుణ చూపండి అంటూ అధికారులను ప్రజలు వేడుకున్నారు. పదేళ్ల తమ కుమారుడు సోమశేఖర్ బుద్ధిమాంద్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడని, పింఛను రూ.15 వేలు వచ్చేలా చూడాలని కలెక్టర్ వినోద్ కుమార్కు అనంతపురం నాల్గో రోడ్డులో నివాసముంటున్న లావణ్య, శ్రీనివాసులు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రజల నుంచి కలెక్టర్తో పాటు జేసీ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోల తదితరులు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 380 వినతులు అందాయి. ● తమ భూమి తమకు ఇప్పించాలని అనంతపురం రూరల్ మండలం ఆలమూరుకు చెందిన కుళ్లాయిస్వామి కోరాడు. తన తండ్రి హరిజన నారాయణ కు సర్వే నంబరు 334–17లో ఎకరా భూమికి 1976లో ప్రభుత్వం డి.పట్టా మంజూరు చేసింద న్నాడు. 2018లో తండ్రి చనిపోగా.. భూమిని వేరేవాళ్లు ఆక్రమించారన్నాడు. అధికారులు ఆక్రమణ దారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, సమస్య పరిష్కరించకుంటే తమకు చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. -
లక్ష్యాలకు అనుగుణంగా ‘ఉపాధి’
రాప్తాడు రూరల్: లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధి పనులు చేపడుతూ సమగ్ర గ్రామీణాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం రూరల్ మండలం చియ్యేడు గ్రామంలో ఆయన పర్యటించారు. ఉపాధి హామీ పథకం కింద రూ. 2.30 లక్షల నిధులతో నిర్మించిన గోకులం షెడ్డును ప్రారంభించారు. అనంతరం అక్కడే కంపోస్ట్ పిట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద కలెక్టర్ మొక్కలు నాటారు. ఎస్డబ్ల్యూపీసీ కేంద్రానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని, నీటి సౌకర్యం కల్పించాలని, వర్మీ కంపోస్ట్ అమ్మకాలు చేపట్టాలని ఆదేశించారు. అక్కడే నాడప్ ఫిట్స్ను ప్రారంభించిన అనంతరం ఎండోమెంట్ భూమిని పరిశీలించారు. రూ. 35 వేలతో నిర్మించిన పశువుల నీటి తొట్టెను ప్రారంభించారు. కలెక్టర్ వెంట సర్పంచ్ టి.గంగాధర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ శైలజ, డీపీఓ నాగరాజునాయుడు, జెడ్పీ సీఈఓ శివశంకర్, డ్వామా పీడీ సలీం బాషా, తహసీల్దార్ మోహన్ కుమార్, ఎంపీడీఓ దివాకర్, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. కలెక్టర్ వినోద్ కుమార్ -
హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయండి
పుట్లూరు: హామీలు అమలు చేయకపోవడంపై కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ శైలజా నాథ్, కేతారెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పుట్లూరు మండల కేంద్రంలో పార్టీ మండల కన్వీనర్ పొన్నపాటి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్కుమార్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా వారు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు అండ్ కో ఇష్టారాజ్యంగా హామీలను ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక నేడు అన్ని వర్గాలనూ దారుణంగా మోసగిస్తోందన్నారు. ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ పథకాలు అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకోవడం సీఎం చంద్రబాబు కపటత్వానికి నిదర్శనమన్నారు. ‘ఆడబిడ్డ నిధి’ ద్వారా ప్రతి నెలా రూ.1,500 అందిస్తామని నేడు మరిచిపోయారన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో పరిశీలిస్తే చాలా పథకాలు ప్రజలకు అందలేదన్నారు. టీడీపీ నాయకులు ఇళ్ల దగ్గరకు వస్తే ప్రభుత్వం బాకీ పడ్డ మొత్తాన్ని ఇవ్వాలని నిలదీయాలన్నారు. ప్రతి ఇంటికీ కనీసం రూ.లక్ష నుంచి రూ. 2 లక్షలు బకాయి ఉన్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి, బీసీ నారాయణరెడ్డి, వంశీ గోకుల్రెడ్డి, జెడ్పీటీసీ నీలం భాస్కర్, జిల్లా కార్యదర్శి విష్ణునారాయణ, శింగనమల నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ఫణీంద్ర, మండల కన్వీనర్లు యల్లారెడ్డి, పూల ప్రసాద్, నార్పల ఖాదర్వలీఖాన్, నాయకులు సర్పంచ్ రామక్రిష్ణారెడ్డి, లాయర్ భాస్కర్రెడ్డి, మడుగుపల్లి నాగేశ్వరరెడ్డి, కంచెం శ్రీనివాసులరెడ్డి, శివారెడ్డి, నారాయణస్వామి, మాజీ సర్పంచ్ రామాంజులరెడ్డి, రామమోహన్రెడ్డి, శ్యామ్ సుంద ర్రెడ్డి, కేతిరెడ్డి సురేష్రెడ్డి, దోశలేడు నరసింహారెడ్డి, రమణారెడ్డి, మద్దిలేటి, వెంకటేశ్వరరెడ్డి, సుధాకర్, సూరి, రామమోహన్, రసూల్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు ప్రతి కుటుంబానికీ ఈ ప్రభుత్వం రూ. 2 లక్షల వరకూ బాకీ: సమన్వయకర్తలు శైలజానాథ్, పెద్దారెడ్డి -
24 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో 24 మండలాల్లో వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 24 మండలాల పరిధిలో 6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. విడపనకల్లు మండలంలో 22 మి.మీ, వజ్రకరూరు 21, గార్లదిన్నె 20.8, ఆత్మకూరు 18.2, కణేకల్లు 12, పామిడి 11.4, పెద్దవడుగూరు 11.2, ఉరవకొండ 10.2 మి.మీ వర్షం కురిసింది. మిగతా మండలాల్లో తేలికపాటి నుంచి తుంపర్లు పడ్డాయి. సెప్టెంబర్లో 110.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 210 మి.మీ గానూ 19 శాతం అధికంగా 254 మి.మీ నమోదైంది. ఓవరాల్గా 20 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. 19 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా, 9 మండలాల్లో సాధారణం, మిగతా 3 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షాలు కురిశాయి. ‘మారథాన్’లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా ‘స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్’లో మంగళవారంలోపు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు, జిల్లా సైన్స్ అధికారి బాలమురళీకృష్ణ సూచించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ, సైన్స్ పరిశోధన సంస్థ సంయుక్తంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి విద్యార్థుల్లో సైన్స్ పట్ల జిజ్ఞాసను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఆలోచన, విశ్లేషణ, అన్వేషణ సామర్థ్యాలను అభివృద్ధి పరిచి వారినుంచి నూతన ఆవిష్కరణలు తయారు చేసేలా ప్రోత్సహించాలన్నారు. సైన్స్ పరిజ్ఞానాన్ని ప్రదర్శించుకునేందుకు, పెంపొందించుకునేందుకు స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ చక్కని అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రతి స్కూల్లోనూ కనీసం 50 మంది విద్యార్థులను గ్రూపులుగా విభజించి వారితో ఆవిష్కరణలు చేయించాలని సూచించారు. ఆ విద్యార్థులకు స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ సభ్యులు సహకరిస్తారన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి బాలమురళీకృష్ణను సంప్రదించాలని సూచించారు. రాగులపాడు గురుకులంలో అక్రమాలపై విచారణ ఉరవకొండ: రాగులపాడు గురుకుల పాఠశాలలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేస్తామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస రావు తెలిపారు. వజ్రకరూరు మండలంలోని రాగులపాడు గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థుల హాజరులో చోటు చేసుకుంటున్న అక్రమాలకు సంబంధించి సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయనపై స్పందించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ అక్రమాలపై రెండు రోజుల్లో విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. గత 5 రోజుల నుంచి నమోదు చేసిన విద్యార్థుల హాజరును పరిశీలిస్తామన్నారు. తప్పు చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే రెగ్యులర్ ఉద్యోగికి పాఠశాల ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. అందుబాటులో యూరియా అనంతపురం సెంట్రల్: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 16,025 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ప్రైవేటు డీలర్ల వద్ద 822 మెట్రిక్ టన్నులు, సొసైటీల వద్ద 77 మెట్రిక్ టన్నులు, 326 రైతు సేవా కేంద్రాల వద్ద 109 మెట్రిక్ టన్నులు, మార్క్ఫెడ్, హోల్సేలర్ల వద్ద 1,027 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రవాణా (ట్రాన్సిట్) 649 మెట్రిక్ టన్నులు ఉందన్నారు. ఆగస్టు 30న జిల్లాకు ఆర్సీఎఫ్ కంపెనీకి చెందిన 388 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు. ఈ వారంలో స్పిక్ కంపెనీకి చెందిన 904 మెట్రిక్ టన్నులు, ఐపీఎస్ కంపెనీకి చెందిన 800 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు తెలిపారు. -
జెడ్పీలో అతిథి గృహాల ప్రారంభం
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ క్యాంపస్లోని అతిథి గృహాలను జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ సోమవారం సాయంత్రం పునఃప్రారంభించారు. రూ.30 లక్షలతో ఇటీవల అతిథి గృహాలను ఆధునికీకరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శివశంకర్, పంచాయతీరాజ్ సబ్ డివిజన్–1 డీఈఈ కె.లక్ష్మీనారాయణ, ఏఈఈ శేషయ్య, జెడ్పీ ఏఓలు షబ్బీర్ నియాజ్, భాస్కర్రెడ్డి, రత్నాబాయి, శ్రీవాణి, మహబూబ్ వలి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.డీజే సౌండ్.. గుండెపోటుతో కార్మికుడి మృతి రాయదుర్గం టౌన్: వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్ కారణంగా స్థానిక మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుడు పూలకుంట శ్రీనివాసులు (36) గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రాయదుర్గంలోని అంబేడ్కర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు కాలనీలో కొలువుదీర్చిన గణేష్ నిమజ్జనంలో ఆదివారం రాత్రి పాల్గొన్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల ప్రాంతంలో డీజే శబ్ధాలకు తీవ్ర అస్వస్థతకు లోనై ఇంటికి చేరుకున్నాడు. సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. కాగా, రెండు నెలల క్రితమే ఆయన గుండె సంబంధిత చికిత్స పొందినట్లు బంధువులు, తోటి కార్మికులు తెలిపారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ దివాకర్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్రయాదవ్, పారిశుధ్య మేసీ్త్రలు అంబేడ్కర్ కాలనీకి చేరుకుని మృతుడికి నివాళులర్పించారు. అంత్యక్రియల నిమిత్తం కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. నివాళులర్పించిన వారిలో వైస్ చైర్మన్లు శ్రీనివాసయాదవ్, వలీబాషా, కౌన్సిలర్లు ఉన్నారు.జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కమిటీ ఎంపికఅనంతపురం రూరల్: జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం అనంతపురంలోని షారోన్ ఆరాధన మందిరంలో నిర్వహించిన సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. సొసైటీ ప్రెసిడెంట్గా రెవరెండ్ డాక్టర్ ఎస్.యెషయా, వైస్ ప్రెసిడెంట్గా రెవరెండ్ డా.అనిల్కుమార్, సెక్రటరీగా రెవరెండ్ ఎం.వరప్రసాద్, జాయింట్ సెక్రటరీగా కురియన్ డానియల్, కోశాధికారిగా అడమ్, ఈసీ సభ్యులుగా డేవిడ్రాజ్, రాజశేఖర్, ఎస్.జీవరత్నం, డేనియల్ కొండయ్యను ఎన్నుకున్నారు.బాస్కెట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికఅనంతపురం: బాస్కెట్ బాల్ జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు జిల్లాకు చెందిన పుట్లూరు సోహన ఎంపికై ంది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు పంజాబ్లోని లూథియానాలో జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి. -
పేదల అర్జీలు.. బుట్టదాఖలు!
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు సమర్పించే చాలా అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. పేద ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి ఇస్తున్న వినతిపత్రాలు ఆన్లైన్లో నమోదు కావడం లేదు. ప్రధానంగా విభాగాల సూపరింటెండెంట్లకు వెళ్లే అర్జీలు నమోదు కావడం లేదని తెలిసింది. దీంతో అర్జీదారులకు రసీదు అందని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో పరిష్కార వేదికలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, ఇతర అధికారులకు సమర్పిస్తారు. అందిన అర్జీలను ఎప్పటికప్పుడు కలెక్టరేట్ ఆవరణలో పరిష్కార వేదిక కౌంటర్లకు సిబ్బంది చేరవేస్తారు. అక్కడి సిబ్బంది వీటిని స్కాన్ చేసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. అటు తరువాత అర్జీదారునికి రసీదు ఇస్తారు. నమోదైన అర్జీలు ఆయా శాఖలకు ఆన్లైన్లోనే పంపిస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా అర్జీలను చాలా సందర్భాల్లో అధికారులు కలెక్టరేట్లోని విభాగాల సూపరింటెండెంట్లకు అందిస్తున్నారు. వీరు దాన్ని తీసుకుని తమ వద్ద ఉంచుకుంటున్నారే తప్ప కౌంటర్లకు పంపడం లేదని తెలిసింది. దీంతో ఆ వినతిపత్రాలు ఎటూ కాకుండా పోతున్నాయి. ఈ క్రమంలో అర్జీదారునికి రసీదు అందక పరిష్కార స్థితిని కూడా తెలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది. దీనిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ‘పరిష్కార వేదిక’లో సమర్పించే ప్రతి అర్జీ తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’ అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి. వినోద్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు అర్జీతో పాటు ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. అర్జీ స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను ‘పరిష్కార వేదిక’లోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గుంతకల్లు ఆస్పత్రిలో కరెంటు కష్టాలు గుంతకల్లు: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఆదివారం కూడా సాయంత్రం 7 గంటల నుంచి దాదాపు 2 గంటలకు పైగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా చిన్నపిల్లల వార్డులో పురిటి బిడ్డలు, బాలింతలు ప్రత్యక్ష నరకం అనుభవించారు. ఒక వైపు దోమల తాకిడి, మరోవైపు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఆస్పత్రికి గుంతకల్లు పట్టణ, మండలంలోని ప్రజలతో పాటు ఉరవకొండ, కర్నూలు జిల్లా ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలకు చెందిన రోగులు వస్తుంటారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆస్పత్రిని 150 పడకలకు అప్గ్రేడ్ చేసి రూ.13 కోట్లతో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దినప్పటి నుంచి రోగుల సంఖ్య మరింతగా పెరిగింది. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన జనరేటర్లో ఇటీవల తరచూ సమస్యలు తలెత్తుతుండడం రోగులకు శాపంగా మారింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రతిసారీ చుక్కలు కనబడుతున్నాయి. ఆస్పత్రిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన కూటమి ప్రభుత్వ పెద్దలు అలసత్వం ప్రదర్శిస్తుండడం మరింత ఇబ్బందిగా మారింది. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయవర్దన్రెడ్డిని వివరణ కోరగా ఆయన స్పందించారు. జనరేటర్లో వైర్ల వ్యవస్థ దెబ్బతిందని చెప్పారు. నూతన వైర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
భూములు లాక్కోవాలని చూస్తే సహించం
● జనార్ధనపల్లి సర్పంచ్, టీడీపీ నేతల దౌర్జన్యంపై పోరాడుతాం ● వైఎస్సార్సీపీ నేతల స్పష్టీకరణ ఉరవకొండ: అధికారాన్ని అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా భూములు లాక్కోవాలని చూస్తే సహించబోమని, బాధిత రైతులతో కలసి విస్తృత పోరాటాలు సాగిస్తామని టీడీపీ నేతలను వైఎస్సార్సీపీ నాయకులు హెచ్చరించారు. ఉరవకొండకు చెందిన బాధిత రైతు జయకుమార్తో కలసి ఆదివారం స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు ఏసీ ఎర్రిస్వామి, సింగాడి తిప్పయ్య, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కౌడిగి గోవిందు, పార్టీ మండల సమన్వయకర్త మూలగిరిపల్లి ఓబన్న తదితరులు మాట్లాడారు. జనార్ధనపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 141లో 21.05 ఎకరాల భూమిని సాయిప్రసాద్, వెంకటశర్మ, భానుప్రకాష్రావు నుంచి 2023, జూన్ 24న రైతు జయకుమార్ కొనుగోలు చేసి, పంటల సాగు చేపట్టాడన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ భూమిని కబ్జా చేసేందుకు కొందరు టీడీపీ నేతలు ప్రయత్రిస్తూ జయకుమార్ను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కేశవ్ అండతో జనార్ధనపల్లి గ్రామ సర్పంచ్ (టీడీపీ) రామంగి జనార్ధననాయుడు, టీడీపీ నాయకులు సుధాకర్, ముప్పారపు పాండురంగ, కురుపాటి కృష్ణమూర్తి దౌర్జన్యాలకు తెరలేపారన్నారు. తమది కాని భూమిలో చొరబడి కంది పంట సాగుచేయడానికి పొలాన్ని దుక్కి చేశారన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన బాధిత రైతుపై దౌర్జన్యం చేశారన్నారు. దీంతో రైతు జయకుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. అయినా టీడీపీ నేతలు దౌర్జన్యం సాగిస్తూ మొత్తం 21 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కుట్రలు సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా టీడీపీ నేతలు తమ దౌర్జన్యాలకు స్వస్తి చెప్పకపోతే బాధిత రైతు తరఫున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో చాబాల సర్పంచ్ జగదీష్, నాయకులు సుంకన్న, మర్రిస్వామి, డిష్ వెంకటేష్, సురేష్, రామాంజనేయులు పాల్గొన్నారు. హెచ్ఎం అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారిగా విజయభాస్కరరెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: ప్రధానోపాధ్యాయుల (హెచ్ఎం) సంఘం రాష్ట్ర కమిటీలో జిల్లాకు కీలక పదవి లభించింది. సంఘం రాష్ట్ర కోశాధికారిగా ఉరవకొండ మండలం బూదగవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.విజయభాస్కర్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం విజయవాడలోని లయోలా కళాశాలలో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు అనంతపురం జిల్లా హెచ్ఎం అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు. బాత్రూంలో జారిపడి అర్చకుడి మృతి కనగానపల్లి: మండలంలోని తగరకుంట గ్రామంలో ఆదివారం బాత్రూంలో కాలుజారి పడి అర్చకుడు సతీష్కుమార్ (45) మృతి చెందాడు. రాప్తాడు మండలం పాలచర్ల రామాలయంలో ఆయన పూజారిగా పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఇంటి వద్ద బాత్రూంలోకి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు గుర్తించి ధర్మవరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా, సతీష్కుమార్కు భార్య, కుమారుడు ఉన్నారు. -
సీ్త్ర శక్తికి తప్పని నిరీక్షణ
గుంతకల్లు/ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం అమలు చేసిన సీ్త్ర శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నరకం చూపుతోంది. పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతానికి వెళ్లే అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచిత ప్రయాణం లేదంటూ కండక్టర్లు స్పష్టం చేస్తుండడంతో గంటల తరబడి బస్టాండులో పడిగాపులు కాయక తప్పడం తప్పడం లేదు. గుంతకల్లు–బళ్లారి మార్గంలోని పెంచలపాడు, గడేకల్లు, డోనేకల్లు గ్రామాల మహిళలకు ఉచిత ప్రయాణ యోగం దక్క లేదు. రోజూ ఈ ప్రాంత ప్రజలు ఏదో ఒక పనిపై గుంతకల్లుకు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో మహిళా ప్రయాణికులు సైతం తప్పని పరిస్థితుల్లో టికెట్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అలాగే గుత్తి–గుంతకల్లు–బళ్లారి, తాడిపత్రి–గుత్తి–గుంతకల్లు–బళ్లారి అంతర్రాష్ట్ర సర్వీసు బస్సులో గుంతకల్లు నుంచి గుత్తి, తాడిప్రతి వెళ్లాలన్నా ఈ పథకం వర్తించడం లేదు. కనీసం ఆంధ్ర సరిహద్దు నుంచైనా అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని మహిళ ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయమై గుంతకల్లు ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్ను వివరణ కోరగా అంతర్రాష్ట్ర సర్వీసులకు సీ్త్ర శక్తి పథకం వర్తించదని స్పష్టం చేశారు. గంటల తరబడి పడిగాపులు అనంతపురం – బళ్లారి మార్గంలో ఉన్న ఈ ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాల్లో ఆత్మకూరు మండలం పంపనూరు క్షేత్రానికి భక్తులు పోటెత్తుతుంటారు. ఇందులో అధిక సంఖ్యలో మహిళా భక్తులే ఉంటున్నారు. ఉన్న అరకొర ఎక్స్ప్రెస్ బస్సులకు అంతర్రాష్ట్ర సర్వీసు అని బోర్డు పెడుతున్నారు. దీంతో గంటల తరబడి పంపనూరు బస్టాఫ్ వద్ద మహిళా భక్తులకు పడిగాపులు కాయక తప్పడం లేదు. మాములు రోజుల్లో కాకపోయినా... ఆది, మంగళవారాల్లో ఆత్మకూరు మీదుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. అంతరాష్ట్ర సర్వీసుల్లో ‘సీ్త్ర శక్తి వర్తించదు’ గంటల తరబడి బస్టాండ్లోనే మహిళల పడిగాపులు -
బాబు సర్కారులో ‘బీమా’య
● రైతన్నకు కుచ్చుటోపీ ● 2023, 2024 వాతావరణ బీమా పరిహారం ఇవ్వని వైనం అనంతపురం అగ్రికల్చర్: చంద్రబాబు సర్కారు కరువు రైతుకు కుచ్చుటోపీ పెడుతోంది. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో మొదటి ఏడాది పైసా ఇవ్వకుండా రైతులను దారుణంగా మోసపుచ్చింది. ఇటీవల అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ కింద పెట్టుబడి సాయం విడుదల చేసినా.. అందులోనూ వేలాది మందికి కోత విధించింది. ఈ ఒక్క సాయం మినహా చంద్రబాబు సర్కారు రైతు సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. తాజాగా వాతావరణ బీమా కింద పరిహారం ఇవ్వకుండా నిలువునా మోసం చేసే పరిస్థితి నెలకొంది. మూడు సీజన్లకు రూ.77.49 కోట్లే... ఇటీవల ఫసల్బీమా కింద మూడు సీజన్లకు కలిపి (2023 ఖరీఫ్, 2023 రబీ, 2024 ఖరీఫ్) ఫ్యూచర్ జనరిక్ బీమా కంపెనీ ద్వారా కేవలం రూ.77.49 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. అందులో 2023 ఖరీఫ్కు సంబం ధించి కంది, ఎండుమిరప, జొన్న రైతులకు రూ.3.39 కోట్లు, రబీలో పప్పుశనగ, వేరుశనగ రైతులకు రూ.15.26 కోట్లు విడుదల కానుండగా 2024 ఖరీఫ్కు సంబంఽధించి కంది, జొన్న రైతులకు రూ.58.83 కోట్లు.. మొత్తంగా మూడు సీజన్లకు కలిపి ఫసల్బీమా కింద రూ.77.49 కోట్లు మంజూరు చేసింది. ఒక్క సీజన్కే ఇంతకన్నా అధిక మొత్తంలో పరిహారం ఇవ్వాల్సి ఉండగా మూడు సీజన్లకు చాలా తక్కువగా పరిహారం ఇచ్చి రైతులకు అన్యాయం చేసింది. రెండేళ్లుగా బీమా లేదు.. 2023లో అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయకుండా ఈ–క్రాప్ ఆధారంగా సాగు చేసిన ప్రతి పంటకూ ఉచితంగా అటు ఫసల్బీమా ఇటు వాతావరణ బీమా పథకాన్ని వర్తింపజేసింది. 2024 జూన్లో ప్రభుత్వం మారడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. చంద్రబాబు సర్కారు నిబంధనల మేరకు బీమా కింద రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉన్నా దాటవేత ధోరణి అవలంబిస్తోంది. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2018 ఖరీఫ్కు సంబంధించి పంటల బీమా కింద పెద్ద మొత్తంలో పరిహారం అందించింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 2023 ఖరీఫ్, రబీ బీమా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల హయాంలో రైతులపై పైసా భారం మోపకుండా ఉచిత పంటల బీమా కింద ఏకంగా 6.47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.1,161 కోట్ల బీమా పరిహారం జమ చేయడం గమనార్హం. ఆశగా రైతన్న.. 2023లో ఖరీఫ్లో అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఖరీఫ్లో వాతావరణ బీమా కింద వేరుశనగ, పత్తి, చీనీ, దానిమ్మ, టమాట పంటలకు, ఫసల్బీమా కింద కంది, వరి, జొన్న, మొక్కజొన్న, ఆముదం, ఎండుమిరపకు పరిహారం అందించింది. తొలిసారిగా ఆముదం పంటను కూడా బీమా పరిధిలోకి తెచ్చింది. 2023 ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా 3.70 లక్షల హెక్టార్లకు గానూ 2.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం 28 మండలాలతో కరువు జాబితా కూడా ప్రకటించింది. 2023 రబీలో వాతావరణ బీమా కింద అరటి, టమాటకు ఇవ్వగా ఫసల్బీమా కింద పప్పుశనగ, వేరుశనగ, వరి, జొన్న, మొక్కజొన్నకు వర్తింపజేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు విధిలేని పరిస్థితుల్లో ఖరీఫ్లో ఉచిత పంటల బీమాను అమలు చేసింది. వాతావరణ బీమా కింద వేరుశనగ, పత్తి, అరటి, టమాట, చీనీ, దానిమ్మ పంటలు, ప్రధాన మంత్రి ఫసల్బీమా పథకం కింద కంది, వరి, జొన్న, మొక్కజొన్న, ఆముదం, ఎండుమిరప పంటలకు వర్తింపజేసింది. 2024 ఖరీఫ్లో కూడా అననుకూల వర్షాలతో 3.47 లక్షల హెక్టార్లకు గానూ 3.20 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. అయితే 2024 రబీ నుంచి ప్రీమియం వసూలు చేస్తూ బీమా పథకాలు అమలు చేశారు. అందులో వాతావరణ బీమా కింద టమాట, మామిడి, ఫసల్బీమా కింద పప్పుశనగ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు వర్తింపజేశారు. 2023, 2024లో అతివృష్టి, అనావృష్టి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడులు తగ్గిపోవడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ఈ నాలుగు సీజన్లకు సంబంధించి చంద్రబాబు సర్కారు ఇప్పటి వరకు వాతావరణ బీమా కింద పరిహారం ఇవ్వకుండా దాటవేస్తూ కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నాలు చేస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. -
నిన్న బుక్ పోస్టు.. నేడు రిజిస్టర్ పోస్టు రద్దు
దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన బుక్ పోస్టును రద్దు చేసిన కేంద్ర తపాలా శాఖ.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. సాంకేతిక అందిపుచ్చుకున్న నేటి తరంలోనూ ఏమాత్రం ఆదరణ తగ్గని రిజిస్టర్ పోస్టును ఈ నెల 1 నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని స్పీడ్ పోస్టులో విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడనుంది. అనంతపురం సిటీ: తక్కువ ఖర్చుతో అనువైన తపాలా సేవగా రిజిస్టర్ పోస్టు.. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ సేవలను రద్దు చేస్తూ స్పీడ్ పోస్టులో విలీనం చేస్తూ కేంద్రంలోని కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన పత్రాలు సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలు, ప్రభుత్వ పెద్దలు, అధికారులకు చేరాలంటే రిజిస్టర్ పోస్టును ఏకై క మార్గంగా ప్రజలు భావించేవారు. తపాలా ఉద్యోగులు కూడా అంతే నమ్మకంతో సేవలందిస్తూ వచ్చారు. దీంతో ఎప్పటి నుంచో రిజిస్టర్ పోస్టుకు ఎనలేని ఆదరణ ఉంది. స్పీడ్ పోస్టుతో ఖర్చు తడిసిమోపెడు రిజిస్టర్ పోస్టు సేవలను రద్దు చేస్తూ స్పీడ్ పోస్టులోకి విలీనం చేయడం ద్వారా వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. సాధారణంగా ఒక ఎన్వలప్ కవర్లో ఏదైనా పత్రం ఉంచి దానిని సాధారణ పోస్టు ద్వారా పంపాలంటే రూ.5 స్టాంపు వేస్తే సరిపోయేది. అదే రిజిస్టర్ పోస్టులో అయితే రూ.17 స్టాంప్ జోడించాల్సి వచ్చేది. ఈ లెక్కన రూ.22తో వారి పత్రాలు భద్రంగా అవతలి వ్యక్తులకు చేరేవి. అయితే అంతే బరువు కలిగిన కవర్ స్పీడ్ పోస్టులో పంపాలంటే రూ.45 చెల్లించుకోక తప్పడం లేదు. -
ప్రయోజనం లేదు
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రిజిస్టర్ పోస్టు ఎంతో ఉపయోగకరం. తక్కువ ఖర్చుతో విలువైన డాక్యుమెంట్లను పంపించేవారం. రిజిస్టర్ పోస్టును రద్దు చేసి స్పీడ్ పోస్టులో కలపడం దురదృష్టకరం. ఇది మంచి పద్ధతి కాదు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలపై భారం వేయడాన్ని ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి. – సాయిపల్లవి, చిరుద్యోగి, అనంతపురం ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేసేందుకే.. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ కార్పొరేటర్లకు అనుకూలంగా ఉంటున్నాయి. తాజాగా ఎన్నో ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్న రిజిస్టర్ పోస్టు రద్దు చేయడం క్షమించరానిది. ప్రైవేట్ కొరియర్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు మంచిది కాదు. – రహత్ బాషా, మెడికల్ రెప్, అనంతపురం -
హాజరులో కనికట్టు... బిల్లులు కొల్లగొట్టు
● రాగులపాడు గిరిజన గురుకుల పాఠశాలలో మాయాజాలం ● అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ప్రిన్సిపాల్ బాధ్యతలు ఇవ్వడంతో నిర్వాకం ఉరవకొండ: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి గిరిజన గురుకులాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులకు అందించే భోజనం విషయంలోనూ అవకతవకలకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు. పండుగలు, సెలవుల సమయాల్లో ఇళ్లకెళ్లిన విద్యార్థులను కూడా హాజరైనట్లు నమోదు చేసి బిల్లులు నొక్కేస్తున్నారు. వజ్రకరూరు మండలం రాగులపాడులోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 76 మంది ఉన్నారు. వినాయక చవితి పండుగ కోసం ఆగస్టు 26నే విద్యార్థులు వారి సొంత ఊళ్లకు వెళ్లారు. పిల్లలు పాఠశాలలో లేకున్నా అందరూ ఉన్నట్లుగా గత నెల 30 వరకూ ఆన్లైన్లో వంద శాతం హాజరు నమోదు చేయడం గమనార్హం. ఆదివారం కూడా గురుకులంలో నలుగురు విద్యార్థులే ఉన్నారు. ఈ క్రమంలో సరుకులను పక్కదారి పట్టించి రోజుకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకూ నొక్కేసినట్లు తెలిసింది. బాధ్యతలివ్వడమే వివాదాస్పదం.. రాగులపాడు గురుకుల పాఠశాల రెగ్యులర్ ప్రిన్సిపాల్ ఇటీవల దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడ పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి బాల్యనాయక్కు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఏకంగా ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమైంది. పాఠశాలలో ఏమైనా జరిగితే ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎలా బాధ్యత వహిస్తారనే విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల హాజరు నమోదులో అవకతవకలు బయటకు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నాణ్యమైన భోజనమూ కరువు.. గురుకులంలో పనిచేసే హెడ్కుక్ కూడా ఆరు రోజులుగా లేరు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారు. దీంతో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనమూ అందడం లేదు. గత్యంతరం లేక ఓ ప్రవేట్ వంట మనిషిని ఏర్పాటు చేసుకోని ఉన్న కొద్దిమంది పిల్లలకు భోజనం అందిస్తున్నారు. వీటిపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విచారణ చేపట్టాలి.. రాగులపాడు గురుకులంలో విద్యార్థులు లేకపోయినా వంద శాతం హాజరువేసి బిల్లులు నొక్కేయడం దుర్మార్గం. రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యతలు ఇవ్వడంతోనే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలి. – శివశంకర్నాయక్, జీవీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు