breaking news
Anantapur Latest News
-
కర్ణాటక న్యాయవాదిపై ‘పచ్చ’ మూక దాడి
కళ్యాణదుర్గం: స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోఓ కేసులో వాదనలు వినిపించి తిరిగి బళ్లారికి వెళుతున్న కర్ణాటక న్యాయవాది, బళ్లారి బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు వై.కొట్రేష్పై స్థానిక టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. వివరాలు... కళ్యాణదుర్గం టీడీపీకి చెందిన ఓ నేత తన కుమార్తెను బళ్లారికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పుట్టింటికి చేరుకుని భర్త, అత్తపై వరకట్న వేధింపులు, చిత్రహింసల కేసు పెట్టింది. ఈ కేసు విషయంగా స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వివాదం నడుస్తోంది. ఇదే కేసులో ఆమె భర్త, అత్తకు అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో కక్షిదారులతో కలసి బుధవారం కళ్యాణదుర్గంలోని కోర్టుకు న్యాయవాది వై.కొట్రేష్ హాజరయ్యారు. సాయంత్రం వారెంట్ను రద్దు చేయించి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. బైపాస్ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకోగానే గోళ్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాన్ని అడ్డుగా పెట్టి న్యాయవాది కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న న్యాయవాదితో పాటు అతని క్లయింట్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. స్థానికులు వారిస్తున్నా వినకుండా ‘లాయర్ అయితే ఏంటి.... జడ్జి అయితే ఏంటి...’ అంటూ దుర్భాషలతో రెచ్చిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న దుకాణాల నిర్వాహకులు దాడిని అడ్డుకుని న్యాయవాదిని సురక్షితంగా కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్కు చేర్చారు. అయితే అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకుని న్యాయవాదికి సహకరించిన స్థానికులపై దాడికి యత్నించారు. విధుల్లో ఉన్న సీఐ హరినాథ్ వెంటనే ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం న్యాయవాది ఫిర్యాదు మేరకు గోళ్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటేష్తో పాటు 8 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే టీడీపీ నేతల నుంచి ఫిర్యాదు స్వీకరించి న్యాయవాది వై.కొట్రేష్పై కేసు నమోదు చేశారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు కర్ణాటక న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ కళ్యాణదుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి, వైస్ ప్రెసిడెంట్ టి.రామాంజినేయులు, సీనియర్ న్యాయవాదులు హనుమంతరెడ్డి, దేవేంద్ర, కరణం తిప్పేస్వామి, మల్లికార్జున, బీటీ రామాంజనేయులు, సంపత్కుమార్, తిమ్మప్ప చౌదరి, పట్టాభి, హరిచక్రవర్తి, సుదర్శన్, ముత్యాలు, తిప్పేస్వామి, మంజు, టీపీ కిరణ్తో పాటు పలువురు రెండు రోజుల పాటు విధులను బహిష్కరించి, కోర్టు ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. బళ్లారి బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు వై. కొట్రేష్పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ కేసు విషయంగా కళ్యాణదుర్గం కోర్టుకు హాజరై బళ్లారికి వెళ్తుండగా ఘటన న్యాయవాది కారుకు ద్విచక్ర వాహనాన్ని అడ్డుపెట్టి దాడి చేసిన వైనం -
‘ఎస్ఐఆర్’పై అవగాహన కల్పించాం
● సీఈఓకు తెలిపిన కలెక్టర్ ఆనంద్ అనంతపురం అర్బన్: ఓటరు జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై అధికారులు, సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామని రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్కు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఎస్ఐఆర్ సన్నాహక కార్యకలాపాలపై సీఈఓ గురువారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు డీఆర్ఓ ఎ.మలోల, ఎన్నికల విభాగం డీటీ కనకరాజు పాల్గొన్నారు. ఎలక్టోరల్ రోల్స్, ఓటరు మ్యాపింగ్, ఎస్ఐఆర్పై సీఈఓ పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లాలో చేపట్టిన ప్రక్రియపై కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ 25.91 శాతం పూర్తయ్యిందన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 330 పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ) నియామకానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం ఎస్ఏ శామ్యూల్ బెంజిమన్, టెక్నికల్ అసిస్టెంట్ శివ పాల్గొన్నారు. వివాహిత ఆత్మహత్యాయత్నం కళ్యాణదుర్గం రూరల్: తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇవ్వలేదంటూ ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాలు.. కళ్యాణదుర్గంలోని కమ్మరచెట్ల వీధికి చెందిన వివాహిత శైలు.. స్థానిక వాల్మీకి సర్కిల్లోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకుంది. బంగారాన్ని విడిపించుకునేందుకు గురువారం ఫైనాన్స్ కంపెనీకి వెళ్లిన సమయంలో ఖాతా హోల్డ్లో ఉండడంతో సొత్తు ఇవ్వడం కుదరదని సిబ్బంది తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటికి చేరుకుని పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పామిడి ఏపీఎంఎస్ విద్యార్థుల మధ్య గొడవ పామిడి: స్థానిక ఏపీ మోడల్స్కూల్లో చదువుకుంటున్న కత్రిమల గ్రామ విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి బస్సులో గ్రామానికి వెళుతున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు గొడవ పడ్డారు. ఓ విద్యార్థి తన చేతిలోని వాటర్ బాటిల్తో దాడి చేయబోతుండగా అది వెళ్లి పక్కనే ఉన్న 7వ తరగతి విద్యార్థి తలకు తగిలి రక్తగాయమైంది. క్షతగాత్రుడికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై పామిడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్రిచక్ర వాహనాల కోసం దరఖాస్తు గడువు పొడిగింపు అనంతపురం సిటీ: అర్హులైన దివ్యాంగులకు వంద శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాల మంజూరుకు దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు జి.అర్చన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన వారు www.apdascac.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. -
షోకాజ్కు వివరణ ఇచ్చేందుకు వస్తే ‘క్లాస్’ పీకిన డీఈఓ
అనంతపురం సిటీ: షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు వచ్చిన కణేకల్లు మండలం ఎర్రగుంట్ల ఉన్నత పాఠశాలకు చెందిన గ్రేడ్–2 హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్కు డీఈఓ ప్రసాద్బాబు ‘క్లాస్’ పీకారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో మాక్ అసెంబ్లీ నిర్వహణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రతిభ ఆధారంగా ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పన విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్ర శాఖ కార్యాలయానికి జిల్లా విద్యాధికారులు పంపారు. అయితే రాయదుర్గం నియోజకవర్గం నుంచి రెండో పేరుగా ఉన్న విద్యార్థిని ఎంపిక చేయడాన్ని ఆక్షేపిస్తూ మొదటి పేరు విద్యార్థి తల్లిదండ్రులు... కణేకల్లు మండలం ఎర్రగుంట్ల పాఠశాల ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆ పాఠశాల హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో సంజాయిషీ ఇచ్చేందుకు గురువారం కార్యాలయానికి చేరుకున్న వారిని డీఈఓ తీవ్ర స్థాయిలో మందలించినట్లు సమాచారం. కాగా, ఇదే అంశంపై తమ పాఠశాలలో మొదటి, రెండో స్థానంలో కాకుండా మూడో స్థానంలో ఉన్న విద్యార్థిని ఎలా ఎంపిక చేశారంటూ డీఈఓ కార్యాలయానికి చేరుకొని ప్రశ్నించిన తపోవనం పాఠశాల హెడ్మాస్టర్, మరో ఇద్దరు ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు గురువారం విజయవాడలోని కమిషనర్ విజయరామారావు వద్ద హాజరు పరిచారు. కంబదూరు పంచాయతీ కార్యదర్శిపై వేటు రాప్తాడు రూరల్: కంబదూరు పంచాయతీ కార్యదర్శి అశ్వత్థరెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్లో సెల్ నంబర్లు, ఆధార్ అప్డేషన్ అంశంపై గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అసెస్మెంట్ల పోర్టల్లో మొబైల్ నంబర్లు నమోదు చేయడంలో అలసత్వం వహించిన కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ క్రమంలో దాదాపు 200 అసెస్మెంట్లకు ఒకే మొబైల్ నంబరు నమోదు చేసిన అశ్వత్థరెడ్డిన సస్పెండ్ చేస్తూ డీపీఓ ఉత్తర్వులు చేశారు. నేడు పదోన్నతుల కౌన్సెలింగ్ : జిల్లాలో అర్హులైన 120 గ్రేడ్–6 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–5 కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించేందుకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు డీపీఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుందని డీపీఓ నాగరాజునాయుడు తెలిపారు. నేటి నుంచి స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ : డీటీసీ అనంతపురం సెంట్రల్: ప్రైవేటు స్కూల్, కళాశాలలకు చెందిన బస్సులపై శుక్రవారం నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకూ స్పెషల్డ్రైవ్ చేపట్టనున్నట్లు జిల్లా ఉపరవాణా కమిషనర్ (డీటీసీ) వీర్రాజు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ... భద్రతాపరమైన అంశంలో ఏవైనా లోపాలుంటే సవరణ చేసుకోవాలని ఇప్పటికే ఆయా యాజమాన్యాలకు నోటీసులు పంపినట్లు వివరించారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు అనంతపురం సిటీ: యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షకు సంబంధించి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ దరఖాసుకు గడువును డిసెంబర్ 3వ తేదీ వరకు పొగించారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూ కొఠారి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలకు 95502 50770, 97042 04905 నంబర్లలో సంప్రదించవచ్చు. 29న నార్పలలో జాబ్మేళా శింగనమల(నార్పల): జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నార్పలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 29న జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డేవిడ్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాప్రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ స్థాయిలోని పది ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై.. ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను ఎంపిక చేయనున్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన వారు అర్హులు. -
రైతుల ఆదాయం పెంపే లక్ష్యం
● కేంద్ర నోడల్ అధికారి సుజాత శర్మ అనంతపురం అర్బన్: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా రాబోవు ఆరేళ్లకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) కేంద్ర నోడల్ అధికారి సుజాత శర్మ ఆదేశించారు. పీఎండీడీకేవై పథకంపై గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్, జేసీ శివ్ నారాయణ్ శర్మతో కలిసి అధికారులతో ఆమె సమీక్షించారు. పీఎండీడీకేవై పరిధిలోని 11 శాఖలకు సంబంధించి 36 పథకాలను సమన్వయంతో అమలు చేయాలన్నారు. ఎఫ్పీఓ (రైతు ఉత్పత్తి సంఘాలు) ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. ఉద్యాన పంటల్లో నూతన రకాలను పరిచయం చేయడంతో పాటు సాగు, ఉత్పత్తి పెంచడంపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులను చైతన్యపరచాలని ఆదేశించారు. పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్య శాఖల పరిధిలో కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. జిల్లాలో పీఎం ఫసల్బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫామింగ్, పీఎం కృషి వికాస్ యోజన, తదితర పథకాల అమలును కలెక్టర్ వివరించారు. సమావేశంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు ఉమామహేశ్వరమ్మ, ఉమాదేవి, రఘునాథరెడ్డి, ప్రేమ్చంద్, విజయకుమార్, చంద్రశేఖర్రెడ్డి, లక్ష్మానాయక్, సీపీఓ అశోక్ కుమార్, కేవీకే శాస్త్రవేత్త మల్లీశ్వరి, డ్వామా పీడీ సలీమ్బాషా, డీసీఓ అరుణకుమారి, ఎల్డీఎం నరేష్రెడ్డి, డీఆర్డీఏ పీడీ శైలజ, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. = రాప్తాడు: మండలంలోని హంపాపురం, రామినేపల్లి గ్రామాల్లో కేంద్ర నోడల్ అధికారి సుజాత శర్మ పర్యటించారు. దానిమ్మ, ద్రాక్ష పంటలను పరిశీలించారు. పంటల సాగు వివరాలు, దిగుబడి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, సస్యరక్షణపై స్థానిక రైతులతో ఆరా తీశారు. ఆమె వెంట జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఏఓ ఉమామహేశ్వరమ్మ, డీహెచ్ఓ ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘనాథ రెడ్డి తదితరులు ఉన్నారు. -
అసలే తండా.. అభివృద్ధి తంటా
శింగనమల: మండలంలోని నాగులగుడ్డం తండా అభివృద్ధికి నోచుకోవడం లేదు. నిధుల లేమితో ఈ పరిస్థితి దాపురించిందని అనుకుంటే పొరపాటే. గ్రామాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.కోటి నిధులను స్వాహా చేసేందుకు సిద్ధమైన టీడీపీ నేతలు మూడు గ్రూపులుగా విడిపోయి గ్రామాభివృద్ధిని పూర్తిగా అడ్డుకోవడం గమనార్హం. అసలే మారుమూల తండా ప్రాంతం, పైగా గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు తమ ఆధిపత్యం కోసం చివరకు తాగునీరు కూడా అందకుండా చేశారు. గ్రామాభివృద్ధికి కేంద్రం నిధులు ‘ధర్తీ ఆబా జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తూ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన గిరిజన తండాల్లో అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులు మంజూరు చేసింది. తొలి విడతలో జిల్లాలోని మూడు గిరిజన తండాలను ఎంపిక చేయగా.. అందులో శింగనమల మండలంలోని నాగులగుడ్డం తండా ఒకటి. ఈ క్రమంలో పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి నాగులగుడ్డం తండాలో వారంలో ఒక రోజు చొప్పన గ్రామస్తులతో అధికారులు సమావేశాలు నిర్వహించి, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆరా తీసి, నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇందులో సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన్లు, గృహ నిర్మాణాలు, పంచాయతీ భవనం, కమ్యూనిటీ భవనం తదితర పనులు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ తొలి విడతలో రూ.కోటికి పైగా నిధులను తొమ్మిది నెలల క్రితం మంజూరు చేసింది. ఇందులో గ్రామంలో సీసీ రహదారులకు రూ.48 లక్షలు, తాగునీటి పైప్లైన్ కోసం రూ.25 లక్షలు, పంచాయతీ భవన నిర్మాణానికి రూ.35 లక్షలు చొప్పున కేటాయించారు. అలాగే నూతన గృహ నిర్మాణాలనూ మంజూరు చేసింది. ముందుకు సాగని పనులు టీడీపీ నేతల ఆధిపత్య పోరులో నాగులగుడ్డం తండాలో అభివృద్ధి పనులు పూర్తిగా పడకేశాయి. టీడీపీలో నాయకులు మూడు గ్రూపులుగా విడిపోయి పనులు తమకు కావాలంటే తమకు కావాలని పోటీ పడ్డారు. అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో తాగునీటి కోసం కేటాయించిన రూ.25 లక్షలతో బోరుబావి తవ్వించి, మోటారు ఏర్పాటు చేశారు. గ్రామంలో పైప్లైన్ వేశారు. అయితే ఇది నచ్చని టీడీపీ నేతలు రాత్రికి రాత్రే బోరు ఉంచి మోటారును లాగేసి పక్కకు పడేశారు. దీంతో నాగులగుడ్డం తండా వాసుల పరిస్థితి ‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అనే చందంగా మారింది. గ్రామాల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకూ పైసా నిధులు కేటాయించలేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనైనా గ్రామాల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయా అంటే.. అది కూడా టీడీపీ నేతల ధన దాహానికి బలవుతున్నాయి. ప్రస్తుతం గుక్కెడు తాగునీటి కోసం తండా వాసులు పొలాల వెంట పరుగు తీయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కాస్త వెనక్కు మళ్లే అవకాశముంది. మోటారు బిగించాలని చెప్పానే... నాగులగుడ్డం తండాలో తాగునీటి పథకానికి సంబంధించిన విద్యుత్ మోటారును బోరు నుంచి పెకలించినట్లుగా తెలిసింది. అయితే దీనిపై అప్పట్లోనే స్పందించాం. మోటారును వెంటనే బిగించాలని చెప్పాం. ఇప్పటి వరకూ బిగించలేదా? ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. – భాస్కర్, ఇన్చార్జ్ ఎంపీడీఓ, శింగనమల ‘తమ్ముళ్ల’ కుమ్ములాటతో పడకేసిన గిరిజన గ్రామాభివృద్ధి అభివృద్ధి పనులకు అడుగడుగునా ఆటంకాలు తాగునీరు సైతం అందకుండా మోటారు పెకలించిన టీడీపీ నేతలు మురిగిపోనున్న రూ.కోట్ల నిధులు -
మట్కా బీటర్ల అరెస్ట్
తాడిపత్రి టౌన్: స్థానిక విజయలక్ష్మి థియేటర్ సమీపంలో ఐదుగురు మట్కా బీటర్లను తాడిపత్రి పట్టణ సీఐ ఆరోహణరావు, ఎస్ఐ గౌస్ మహమ్మద్ గురువారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో మేకల పుల్లయ్య, దూదేకుల కుళ్లాయప్ప, లింగుట్ల కొండమనాయుడు, ఉదయగిరి మాబున్నీ, షేక్ రహమత్ ఉన్నారు. వీరి నుంచి రూ.2.01 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రోహిత్కుమార్ మాట్లాడుతూ.. తాడిపత్రిలో జూదాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. పేకాట, మట్కా నిర్వాహకుల కుటుంబాలతో పాటు వారి సమీప బందువుల వివరాలనూ సేకరించామన్నారు. వారి బ్యాంక్ ఖాతాలపై నిఘా ఉంచామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు.ఒకవేళ కుటుంబ సభ్యులు, బంధువులు విదేశాల్లో ఉంటే వారి పాస్పోర్టులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఉపాధి పనులపై సామాజిక తనిఖీ అనంతపురం టౌన్: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై సామాజిక తనిఖీలు చేపట్టనున్నట్లు డ్వామా పీడీ సలీంబాషా తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 2024–25ఆర్థిక సంవత్సరానికి గాను ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల పరిధిలోని 10 మండలాల్లో రూ.80 కోట్లతో ఉపాధి పనులు చేపట్టిన డ్రైల్యాండ్ హార్టికల్చర్, కందకాల తవ్వకాలు, చెరువుల్లో పూడికతీత పనులు, సీసీరోడ్లు, డ్రైయినేజీ తదితర పనులపై సామాజిక తనిఖీలు ఉంటాయన్నారు. 20 రోజుల పాటు సాగే ఈ ప్రక్రియకు ఆయా గ్రామ పంచాయతీల్లోని ఉపాధి కూలీలు సహకరించాలని కోరారు. ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక గుంతకల్లు: ఉత్తరప్రదేశ్లోని లక్నో వేదికగా డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకూ జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు గుంతకల్లులోని సరస్వతీ జూనియర్ కళాశాల ఫస్ట్ ఇయర్ విద్యార్థి టి.రాజేష్ ఎంపికయ్యాడు. ఈ మేరకు కోచ్ దొరై గురువారం వెల్లడించారు. జాతీయ స్థాయిలో జరిగే 200, 400 మీటర్ల పరుగు పోటీలతో పాటు వంద మీటర్ల రిలే పరుగు పోటీల్లో అండర్–17 విభాగంలో ఏపీ తరఫున రాజేష్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. -
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అనంతపురం: జాతీయ లోక్ అదాలత్లో అధికంగా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమారావు పేర్కొన్నారు. జిల్లా కోర్టులో గురువారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ ఉంటుందన్నారు. రాజీ కాదగిన క్రిమినల్, ఎకై ్సజ్ కేసులతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించే దిశగా చొరవ చూపాలన్నారు. సమావేశంలో మొదటి అడిషనల్ జిల్లా జడ్జి సత్యవాణి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వర్షసూచన అనంతపురం అగ్రికల్చర్: నైరుతి బంగాళా ఖాతంలో వాయుగుండం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో రాగల మూడు రోజులు వర్షాలు పడొచ్చన్నారు. అక్కడక్కడా 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని తెలిపారు. వీఆర్కు యాడికి సీఐ ఈరన్న యాడికి: మండలంలోని అప్గ్రేడ్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ ఈరన్నను వీఆర్కు పంపుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ ఈరన్న యాడికిలో విధులు నిర్వహించిన 16 నెలల వ్యవధిలోనే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు ఆయనను వీఆర్కు పంపడం గమనార్హం. పెద్దవడుగూరు సీఐ రామసుబ్బయ్యను యాడికి అప్గ్రేడ్ సీఐగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఐ ఈరన్న ఆదేశాల మేరకు పోలీసు స్టేషన్లో ఇష్టారాజ్యంగా విధులు నిర్వహించిన మరో ఇద్దరిపై కూడా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. డిగ్రీ నూతన సిలబస్కు ఆమోదం అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కోర్సులకు సంబంధించి నూతన సిలబస్ను ఆమోదించారు. గురువారం వర్సిటీలో ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత ఆధ్వర్యంలో సీడీసీ డీన్ ప్రొఫెసర్ కే. రాంగోపాల్ అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యామండలి రూపకల్పన చేసిన సిలబస్ను ఎస్కేయూలో అమలు చేయడానికి వీలుగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు ఆమోదం తెలిపారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా కళాశాల– పరిశ్రమకు అనుసంధానం చేసేలా సిలబస్ రూపకల్పన జరిగినట్లు వీసీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మునినారాయణప్ప, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. స్తంభించిన పీఏబీఆర్ కుడి కాలువ గేట్లు కూడేరు: పీఏబీఆర్ వద్ద ధర్మవరం కుడి కాలువ గేట్లు స్తంభించి పోయాయి. దీంతో కుడి కాలువకు నీటి విడుదల మళ్లీ వాయిదా పడింది. గేట్లు ఎత్తేందుకు అధికారులు మోటర్ ఆన్ చేయగానే రోప్ ఇనుప తాళ్లు కూడా తెగిపోతుండడం గమనార్హం. ఈ క్రమంలో గురువారం విజయవాడకు చెందిన అధికార బృందం కుడి కాలువ గేట్లు పరిశీలించింది. ఏళ్ల క్రితం అమర్చిన గేట్లు కావడంతో స్తంభించిపోయినట్లు గుర్తించారు. విజయవాడ నుంచి నిపుణులను పంపి మరమ్మతులు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో రిజర్వాయర్ భద్రత దృష్ట్యా గురువారం రాత్రి 4వ గేటును ఎత్తి మిడ్ పెన్నార్ డ్యాంకు నీటిని విడుదల చేశారు. 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎస్ఈ సుధాకర్ రావు తెలిపారు. డ్యాంలోకి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా 660 క్యూసెక్కులు, హెచ్చెల్సీ ద్వారా 40 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని వివరించారు. -
సేవాభావంతో పని చేసిన ‘రాక్రీట్’పై నిందలా?
అనంతపురం ఎడ్యుకేషన్: నిరుపేదలకు మూడు సెంట్ల స్థలంలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టించి ఇస్తామని ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీని అమలు చేయలేక నేడు ప్రతిపక్షంపై నిందలు మోపుతున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో కేంద్రం నుంచి 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించారని, 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. రూ.1.80 లక్షల యూనిట్ వ్యయంతో పేదలకు ఇళ్లు నిర్మించాలని గత ప్రభుత్వంలో పెద్దపెద్ద కాంట్రాక్టర్లను అడిగితే ఎవరూ ముందుకురాలేదన్నారు. ఆ తరుణంలో ‘రాక్రీట్’ సంస్థ సేవాభావంతో పనులు చేసిందన్నారు.ఆప్షన్–3 లబ్ధిదారులకు ఆర్సీ లెవల్ వరకు మాత్రమే ఇళ్లు నిర్మించి ఇస్తామని ఒప్పందం చేసుకుందని, తక్కిన పనులకు లబ్ధిదారులు రూ.35 వేలు భరించాల్సి ఉందన్నారు. ఈ పనులు కూడా రాక్రీట్ చేపట్టాల్సి ఉందంటూ నిందలు వేస్తున్నారని వాపోయారు. ఒప్పందం మేరకు ఇళ్లు నిర్మిస్తామంటూ రాక్రీట్ సంస్థ అనేకమార్లు కలెక్టర్లు, హౌసింగ్ డైరెక్టరు, జిల్లా అధికారులకు లేఖలు రాసిందని తెలిపారు. కేవలం తనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో 50 వేల కుటుంబాలను నాశనం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ రూ.36 కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉందని, దీనిపై కోర్టుకు వెళ్తే ప్రభుత్వం కనీసం కౌంటరు దాఖలు చేయలేదని విమర్శించారు. బీజేపీ కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఆప్షన్–3 బెస్ట్ ఆప్షన్ ఆప్షన్–3 కింద చేపట్టిన 3 లక్షల ఇళ్లలో 2 లక్షల ఇళ్లు పూర్తి చేశారంటే దాదాపు 70 శాతం సక్సెస్ రేటు అన్నారు. 1,2 ఆప్షన్లలో 18 లక్షల ఇళ్లకు గాను 6 లక్షలు మాత్రమే పూర్తయినట్లు హౌసింగ్ మంత్రి చెబుతున్నారని, అంటే 33 శాతం మంది మాత్రమే కట్టుకున్నారని తెలిపారు. ఈ 6 లక్షల మంది కనీసం చేతినుంచి ఒక్కొక్కరు అదనంగా రెండు లక్షల దాకా పెట్టుకున్నా రన్నారు. ఈ లెక్కన రూ. 12 కోట్లు నష్టపోయారన్నారు.తక్కిన 12 లక్షల మంది కూడా ఇళ్లు నిర్మించుకోవాలంటే మరో రూ. 24 కోట్లు నష్టపోవాల్సి వస్తుందన్నారు. 70 శాతం సక్సెస్ రేటున్న ఆప్షన్–3 ఇళ్ల గురించి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు, వైఎస్సార్సీపీ నాయకులు మీనుగ నాగరాజు, నారాయణరెడ్డి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. 3 సెంట్లలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చాక పూర్తిగా పక్కన పెట్టింది రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజం -
బిలాస్పూర్–యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బిలాస్పూర్–యలహంక మధ్య వారాంతంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. 5 సర్వీసులు మాత్రమే నడుపుతున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 2వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు బిలాస్పూర్ జంక్షన్ (08261)లో రైలు బయలుదేరి మరుసటి రోజు (బుధవారం) సాయంత్రం 6.30 గంటలకు యలహంక జంక్షన్కు చేరుతుందన్నారు. అదేవిధంగా యలహంక జంక్షన్ (08262) నుంచి డిసెంబర్ 3 బుధవారం రాత్రి 9 గంటలకు బయలుదేరి శుక్రవారం తెల్లవారుజూమున 4.30 గంటలకు రైలు చేరుతుందన్నారు. భాతాపుర, రాయపూర్, దుర్గ్, చందా పోర్ట్, సిరిపూర్, మంచర్ల, ఖాజాపేట్, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, కృష్ణా, రాయచూరు, మంత్రాలయం, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. రైళ్లలో 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయన్నారు. -
మందకొడిగా రబీ
● 48 వేల హెక్టార్లలో ‘సాగు’తోన్న పంటలు అనంతపురం అగ్రికల్చర్: రబీ మందకొడిగా ‘సాగు’తోంది. సకాలంలో విత్తన పప్పుశనగ, విత్తన వేరుశనగ పంపిణీ చేయకపోవడం, వర్షాభావ పరిస్థితులు వెరసి పంటల సాగు తక్కువగానే ఉన్నట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడిస్తోంది. ఈ రబీలో 1,07,261 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతానికి 45 శాతంతో 48 వేల హెక్టార్లలో పంటలు వేశారు. అందులో వర్షాధారంగా ప్రధానపంట పప్పుశనగ 65,017 హెక్టార్లకు గానూ ప్రస్తుతానికి 40 వేల హెక్టార్లలో సాగు చేశారు. నీటి వసతి కింద 17,982 హెక్టార్లుగా అంచనా వేసిన వేరుశనగ 1,700 హెక్టార్లలో ‘సాగు’తోంది. 7,888 హెక్టార్లకు గానూ మొక్కజొన్న 2,100 హెక్టార్లు, 5 వేల హెక్టార్లకు గానూ 2,500 హెక్టార్లలో జొన్న సాగు చేశారు. ఇవి కాకుండా సజ్జ, రాగి, కొర్ర, పెసర, అలసంద, మినుము, ఉలవ, పొద్దుతిరుగుడు, ఆముదం, కుసుమ, సోయాబీన్, పత్తి తదితర పంటలు నామమాత్రంగా విత్తుకున్నారు. 6,069 హెక్టార్లు అంచనా వేసిన వరి నాట్లు ఇప్పుడే మొదలు పెట్టారు. డిసెంబర్ 15 వరకు వేరుశనగ సాగుకు అనుకూలం కాగా డిసెంబర్ ఆఖరు వరకు వరికి అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పప్పుశనగ సాగుకు ఈనెల 15తో అదను ముగిసిపోవడం గమనార్హం. -
‘చలి’గింతలు
● భారీగా పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులుఅనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘చలి’ గింతలు పెరిగాయి. చలి పంజా మొదలు కావడంతో ప్రజలు గజగజలాడిపోతున్న పరిస్థితి నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 32 డిగ్రీల మధ్య కొనసాగుతుండగా... రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గురువారం మరింత తగ్గిపోవడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు కమ్ముకుంటోంది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గురువారం వేకువజామున మడకశిర మండలంలో 12.7 డిగ్రీలు, శెట్టూరులో 13.9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ప్రస్తుతానికి ఇవే కనిష్ట ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. రొద్దం 13.8 డిగ్రీలు, సోమందేపల్లి 13.9, బెళుగుప్ప 14.1, అమరాపురం 14.1, గుడిబండ 14.3, గుమ్మఘట్ట 14.5, వజ్రకరూరు 14.9 డిగ్రీలు ఇలా చాలా మండలాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్, జనవరి నెలల్లో చలి తీవ్రత మరింత పెరిగే సూచనలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 నుంచి 12 డిగ్రీలకు పతనం కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో హీటర్లు, స్వెట్లర్లకు గిరాకీ పెరిగింది. రాత్రిళ్లు, ఉదయం పూట చలి నుంచి కాపాడుకునేందుకు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్దులు, బాలింతలు, గర్భిణులు, రోగులు, ఉదయం శ్రామిక వర్గాలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. -
ఇక ‘అక్రమ’ సర్వేయర్ల వంతు..
రాప్తాడురూరల్: అనంతపురం నగర శివారులోని పాపంపేట శోత్రియం భూముల వ్యవహారంలో ప్రస్తుత సర్వేయర్ రఘునాథ్, మాజీ సర్వేయర్ ప్రతాప్రెడ్డిపై విచారణ నివేదిక ఇచ్చి తదుపరి చర్యలకు సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్కు సిఫార్సు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ఈ భూముల వ్యవహారంలో వీఆర్ఓ రఘుయాదవ్ పాత్రపై ఉన్నతాధికారులకు స్పష్టత వచ్చింది. ఆరు సర్వే నంబర్లలో 29.96 ఎకరాల్లో రాచూరి వెంకటకిరణ్ అనుభవంలో ఉన్నాడంటూ 2024 ఆగస్టు 13న వీఆర్ఓ పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చాడు. అసలు వీఆర్ఓకు ఈ అధికారమే ఉండదు. అయినా మొండి ధైర్యంతో ముందుకెళ్లాడు. కఠిన చర్యలు తీసుకునే క్రమంలో కలెక్టర్ ఆనంద్ ఆర్టికల్ చార్జెస్ ఫ్రేమ్ నోటీసు ఇవ్వడం ఉలికిపాటుకు గురి చేసింది. తాజాగా సర్వేయర్ల పాత్రపై స్పష్టత వచ్చింది. రాచూరి వెంకట కిరణ్ అందజేసిన డాక్యుమెంట్లు 984/1910, 1607/ 1952, 324/1956, 1628/1958 మేరకు విస్తీర్ణం 300 ఎకరాలుగా ఉన్నట్లు పూర్వ సర్వేయర్ ప్రతాప్రెడ్డి 2024 జూన్ 24న నివేదిక ఇచ్చాడు. ఈయన క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎలాంటి సర్వే చేయలేదు. కేవలం డాక్యుమెంట్ల ఆధారంగా నివేదిక ఇచ్చాడు. సమాచారం ఇవ్వకుండానే.. ప్రస్తుత సర్వేయర్ రఘునాథ్ బరి తెగించి నివేదిక ఇచ్చాడు. చుట్టుపక్కల వారికి కనీసం సమాచారం ఇవ్వకుండా భూములు సర్వే చేశాడు. పైగా చుట్టుపక్కలంతా రైతులే ఉన్నారని వారందరికీ వాట్సాప్లో నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నాడు. నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి రాచూరి వెంకటకిరణ్, వారి కుటుంబ సభ్యుల పేరిట సుమారు 160 ఎకరాలు హక్కు అనుభవంలో ఉన్నట్లు ఏకపక్షంగా రిపోర్ట్ ఇచ్చాడు. ఈయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే వెంకటకిరణ్, ఆయన కుటుంబ సభ్యులు, వారిద్వారా జీపీఏ చేయించు కున్న వారు మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకుని హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. డైరెక్టర్కు సిఫార్సు చేసిన డిప్యూటీ డైరెక్టర్ పాపంపేట భూ వివాదంలో సర్వేయర్ల పాత్రపై టాస్క్ఫోర్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పూర్వపు సర్వేయర్ ప్రతాప్రెడ్డి, ప్రస్తుత సర్వేయర్ రఘునాథ్పై చర్యలు తీసుకోవాలంటూ సర్వే డిప్యూటీ డైరెక్టర్ పి.హరికృష్ణ ఏపీ ప్రభుత్వ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాఖ డైరెక్టర్కు లేఖ రాశారు. త్వరలోనే ఇద్దరు సర్వేయర్లు, వీఆర్ఓపై చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు. పాపంపేట భూ వ్యవహారంలో ఇద్దరు సర్వేయర్లపై చర్యలకు నివేదిక ఇప్పటికే వీఆర్ఓ రఘుయాదవ్కు చార్జెస్ ఆఫ్ ఫ్రేమ్ నోటీసు జారీ ముగ్గురిపై వేటుకు రంగం సిద్ధం -
అరటి రైతు ఆర్తనాదాలు చేస్తున్నా చంద్రబాబు సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదు. ధరలు పతనమై పెట్టుబడి ఖర్చులు చేతికందే పరిస్థితి లేక అరటి గెలలు తెంపేసి రోడ్డుపాలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దుర్భర పరిస్థితులు నెలకొన్నా మొద్దునిద్ర పాటిస
నాడు.. కరోనా కాలంలో రైతుల దగ్గరుండి అరటి ఉత్పత్తులు అమ్మకాలు సాగిస్తున్న ఆర్ఎస్కే అసిస్టెంట్లు (ఫైల్) అనంతపురం అగ్రికల్చర్: 2021 నుంచి 2024 మధ్య టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు మంచి ధరలు పలకడంతో చాలా మంది రైతులు అరటి సాగుపై దృష్టి సారించారు. ఈ ఏడాది 39 వేల ఎకరాల్లో అరటి సాగులో ఉండగా 7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడులు అంచనా వేశారు. అందులో మొదటి పంట కింద డిసెంబర్ నుంచి కోతలు మొదలు కానుండగా... 3.92 లక్షల మెట్రిక్ టన్నులు రావొచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రెండు, మూడో విడత పంట కోతలు జరుగుతున్నాయి. కానీ నెల రోజులుగా టన్ను రూ.2 వేలకు మించి పలకకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మూడో విడత పంట అయితే టన్ను రూ.400 నుంచి రూ.500 కూడా అడగడం లేదని రైతులు వాపోతున్నారు. కష్టకాలంలో చేయూత ఇవ్వాల్సిన చంద్రబాబు సర్కారు అరటి రైతు గురించి కనీస ఆలోచన చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కారు వెన్నుదన్ను.. 2020 ఫిబ్రవరిలో కరోనా విపత్తు సంభవించిన విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మారి విలయతాండవంతో దేశవ్యాప్తంగా రవాణా స్తంభించిపోగా, ప్రధాన మార్కెట్లు నిరవధికంగా మూతబడ్డాయి. అంతటి కష్టకాలంలో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు అన్నదాతకు అడుగడుగునా అండగా నిలిచింది. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనంత స్థాయిలో రైతుల్లో మనోధైర్యం నింపి ఉద్యాన ఉత్పత్తుల అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ యంత్రాంగం, ఆర్బీకే సిబ్బంది, వలంటీర్లు, ఇతరత్రా అన్ని శాఖలను సమన్వయం చేసి వెన్నుదన్నుగా నిలిచింది. అప్పట్లో ఉద్యాన ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలు, ఉత్తరాది ప్రాంతాలకు పండ్ల ఉత్పత్తులు రవాణా చేశారు. 2020 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కరోనా కాలంలో జిల్లాలో రైతులు పండించిన అన్ని రకాల పండ్ల ఉత్పత్తులు 10 లక్షల టన్నులకు పైగా క్రయ విక్రయాలు జరిగినట్లు ఉద్యాన శాఖ నివేదిక వెల్లడిస్తుండడం గమనార్హం. మొదట్లో ధరల తగ్గుదల, కఠిన నిబంధనలతో కొంత ఇబ్బందులు పడినా రానురాను పరిస్థితి మెరుగుపడటంతో ఢిల్లీలోని అజాద్పూర్ మార్కెట్తో పాటు హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, నాగపూర్ లాంటి దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లకు జిల్లా నుంచి చీనీ, మామిడి, అరటి, బొప్పాయి, మెలన్స్, ద్రాక్ష, దానిమ్మ లాంటి పంట ఉత్పత్తులు రవాణా చేశారు. సరాసరి ధరల ప్రకారం కరోనా కాలంలో రూ.1,400 కోట్ల విలువ చేసే ఫలసాయం అమ్మకాలు సాగించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అప్పట్లో పత్తాలేని బాబు బ్యాచ్.. 2020 మార్చి నుంచి అదే ఏడాది ఆగస్టు వరకు కరోనా మహమ్మారి కారణంగా రైతులు అవస్థలు పడుతున్న సమయంలో చంద్రబాబు బ్యాచ్ పత్తాలేకుండా పోయింది. సాయం కోసం రైతులు దిక్కులు చూస్తున్న సమయంలో కనీసం పలకరించి మనోధైర్యం చెప్పాల్సిన చంద్రబాబు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా హైదరాబాద్లో ఉండి పోవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ‘కరోనా’ కష్టాల్లోనూ అన్నదాతకు వైఎస్ జగన్ సర్కారు వెన్నుదన్ను లాక్డౌన్లతో మార్కెట్లు మూతపడినా ఉద్యాన రైతుకు చేయూత 2020లో ప్రభుత్వం, పాలనా యంత్రాంగం దగ్గరుండి రైతు ఉత్పత్తులకు మార్కెటింగ్ నేడు అరటి రైతులు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం -
అధ్యక్షా! మైదానాల్లేవ్.. మొక్కలు ఎక్కడ నాటాలి?
కళ్యాణదుర్గం రూరల్: ‘అధ్యక్షా! కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రభుత్వ బడుల్లో మైదానాల్లేవ్.. ఇక మొక్కలు ఎక్కడ నాటాలి?’ అంటూ విద్యాశాఖ మంత్రిపై ప్రతిపక్ష సభ్యురాలు తలారి అభిజ్ఞ ధ్వజమెత్తారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి వేదికగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో బుధవారం నిర్వహించిన మాక్ అసెంబ్లీ సమావేశంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలోనూ ప్రతి విద్యార్థీ ఓ మొక్కను నాటి సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు జీఓ పాస్ చేయాలని కోరారు. ఈ అంశాన్ని మాక్ అసెంబ్లీలో కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన రమేష్, చంద్రకళ దంపతుల కుమార్తె అభిజ్ఞ ఆక్షేపించారు. ‘ప్రతి విద్యార్థి మొక్క నాటాలని జీఓ జారీ చేయాలనడం సబబుగానే ఉన్నా... మా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విరామ సమయంలో క్రీడలు ఆడుకునేందుకు మైదానాలూ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కలు ఎక్కడ నాటాలో గౌరవ మంత్రివర్యులు చెప్పాలి’. ముందుగా పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరిస్తే... ఆ తర్వాత అన్నీ సర్దుకుపోతాయి. ఆ దిశగా ఇప్పటికై నా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని చురకలు అంటించేలా మాట్లాడారు. మాక్ అసెంబ్లీ సమావేశంలో దుర్గం నియోజకవర్గ విద్యార్థిని ఆసక్తికర ప్రశ్న -
రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి
● కలెక్టర్ ఆనంద్ అనంతపురం అర్బన్: ‘‘ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనది. మహోన్నతమైన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ప్రజలకు బాధ్యతగా మెరుగైన సేవలు సత్వరం అందించాలి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ ప్రజల మదిలో ఉన్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మనమంతా పేదల అభ్యున్నతి, సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. అరటి రైతులను ఆదుకుంటాం శింగనమల (నార్పల): జిల్లాలో అరటి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం నార్పల మండలంలోని గడ్డం నాగేపల్లి పరిధిలో అరటి పంటను పరిశీలించారు. పంట సాగు విధానంపై రైతులతో ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. అరటి నాణ్యత పెరగడానికి ఏం చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించాలని ఉద్యాన శాఖాధికారులకు సూచించారు. ఒక పంటను పదేపదే సాగు చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయని, పంట మార్పిడి చేయాలన్నారు. రైతుల వద్ద తీసుకునే అరటికి కేజీ రూ.6, ఎగుమతి చేసే అరటికి రూ.8 అందించాలని కంపెనీల నిర్వాహకులకు సూచించామన్నారు. తీవ్రంగా నష్టపోయామని రైతులు విన్నవించగా, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా ఉద్యాన అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ ఏపీడీ ధనంజయ తదితరులు ఉన్నారు. ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించండి అనంతపురం సిటీ: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చిలో ప్రారంభం కానున్నట్లు డీఈఓ ప్రసాద్బాబు బుధవారం తెలిపారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు డిసెంబర్ ఒకటి నుంచి 15వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఏపీ ఆన్లైన్ సేవా కేంద్రం లేదా ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా నేరుగా చెల్లించవచ్చని వివరించారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు, రూ.25 అపరాధ రుసుముతో 11 నుంచి 12వ తేదీ వరకు, రూ.50తో 13 నుంచి 15 వరకు చెల్లించవచ్చన్నారు. పరీక్ష ఫీజు వివరాలకు వెబ్సైట్ www.apopenschool.ap.gov.in చూడాలని సూచించారు. దరఖాస్తు గడువు పొడిగింపుఅనంతపురం సిటీ: జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ బాలికల ఎయిడెడ్ పాఠశాల, ఆర్సీఎం ఎయిడెడ్ ప్రైమరీ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు గడువును డిసెంబర్ 10వ తేదీ వరకూ పొడిగించినట్లు వెల్లడించారు. విందు భోజనం తిని 20 మందికి అస్వస్థత ఓడీచెరువు: మండల పరిధిలోని బత్తినపల్లిలో బుధవారం జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొని విందుభోజనం ఆరగించిన వారిలో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో బంధువులు వారిని ఓడీచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఏడుగురిని కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, బత్తినపల్లిలోనూ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని స్థానిక వైద్యుడు కమల్ రోహిత్ తెలిపారు. అయితే కలుషితమైంది ఆహారమా...నీరా అన్న విషయం తెలియాల్సి ఉందన్నారు. -
మా డబ్బు తిరిగివ్వండి!
రాప్తాడు/రాప్తాడు రూరల్: రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయనగర్ సమీపంలోని జగనన్న కాలనీలో రౌడీషీటర్, టీడీపీ నాయకుడు ఉప్పర శ్రీనివాసులు నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో ఆందోళన నెలకొంది.‘ప్లాట్లు వద్దు, ఏమీ వద్దు.. మా డబ్బులు మాకు తిరిగివ్వండి’ అంటూ నిలదీసినట్లు తెలి సింది. వివరాలు.. చిన్మయనగర్ సమీపంలోని జగనన్న కాలనీలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అనంతపురం నగరానికి చెందిన 650 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనంతపురం, రాప్తాడు ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, పరిటాల సునీత ప్రధాన అనచరుడు, రౌడీషీటర్ ఉప్పర శ్రీనివాసులు ఈ జగనన్నకాలనీలో ‘పరిటాల సునీతమ్మ కాలనీ’ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి మొత్తం భూమిలో సెంటున్నర ప్రకారం 512 ప్లాట్లు వేసి లేఔట్ తయారు చేసి బేరంపెట్టాడు. ఒక్కో ప్లాటు రూ. 2 లక్షల చొప్పున ఇప్పటికే దాదాపు 300 ప్లాట్లు అమ్మేశాడు. ఈ వైనంపై ‘సాక్షి’లో మంగళవారం ‘పేదల ప్లాట్లపై పచ్చ రాబందు’ శీర్షికతో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అసలు విషయం తెలియక, ఎవరో చెప్పిన మాటలు విని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆ ప్రాంతానికి వచ్చి ఆరా తీశారు. తక్కువ ధరకు వస్తుందనే ఆశతో ప్లాట్లు కొనుగోలు చేశామని భవిష్యత్తులో ఇవి ఉంటాయా.. లేదంటే ప్రభుత్వం తీసుకుంటుందా అంటూ వాపోయినట్లు తెలిసింది. తొంగిచూడని అధికారులు కలెక్టరేట్కు 5 కిలోమీటర్ల దూరంలోనే ప్రభుత్వ ఆస్తిని పబ్లిక్గా బేరం పెట్టి అమ్ముతున్నా అధికారులు ఆవైపు తొంగిచూడక పోవడం అనుమానాలకు తావిస్తోంది. అటు కార్పొరేషన్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు తప్పితే ఈ ప్రాంతాన్ని పరిశీలించకపోవడం గమనార్హం. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఉన్నతాధికారులు కూడా వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాధితులు కలెక్టర్ను కలిసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. తమకు కేటాయించిన ప్లాట్లను అమ్మకాలు చేశారని, విచారించి ప్లాట్లు తిరిగి ఇప్పించాలంటూ విన్నవించనున్నట్లు సమాచారం. ఎవరూ రారు.. మేం చూసుకుంటాం! ఉప్పర శ్రీనివాసులు నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో కొందరు ఆయనతో పాటు అనుచరులను కలిసినట్లు తెలిసింది. ‘రేప్పొద్దున ప్రభుత్వం వీటిని తీసుసుకుంటే మా పరిస్థితి ఏమిటి? ప్లాట్లు వద్దు, మా డబ్బు మాకివ్వండి’ అని నిలదీయగా.. ‘మీ ప్లాట్ల జోలికి ఎవరూ రారు. ఎవరు వచ్చినా మేము చూసుకుంటాం’ అని అభయమిచ్చినట్లు తెలిసింది. రాప్తాడు మండలం చిన్మయనగర్ జగనన్న కాలనీకి బాధితుల క్యూ మీ ప్లాట్ల జోలికి ఎవరూ రారని చెబుతున్న అక్రమార్కులు -
‘ప్రైవేటు’కు డీఎల్జారీ ప్రక్రియ
● త్వరలో అమల్లోకి నూతన విధానం అనంతపురం సెంట్రల్: రవాణా శాఖలో కీలకమైన డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్) మంజూరు ప్రక్రియ త్వరలో ప్రైవేటు చేతుల్లోకి చేరనుంది. దరఖాస్తు చేసుకునే వారికి శిక్షణతో పాటు లైసెన్స్ మంజూరు చేసే అధికారాలు కూడా ప్రైవేటు వారికే కల్పించనున్నారు. రవాణా శాఖ ద్వారా వాహనదారులకు అందిస్తున్న సేవల్లో డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు ప్రధానమైనది. రోజూ వందల మంది వాహనదారులు డీఎల్, ఎల్ఎల్ఆర్ టెస్ట్ల కోసం రవాణా శాఖ కార్యాలయానికి వస్తుంటారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఆటోమేటిక్ టెస్ట్ డ్రైవ్ సెంటర్ ద్వారా, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణ దుర్గం ప్రాంతీయ కార్యాలయాల్లో ఫిజికల్ టెస్ట్ల ద్వారా డీఎల్ మంజూరు చేస్తున్నారు. జిల్లాకు మూడు కేంద్రాలు... జనాభా ప్రాతిపదికన డ్రైవింగ్ టెస్ట్ లైసెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. 5 లక్షల నుంచి 6 లక్షలకు ఓ సెంటర్ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ లెక్కన జిల్లాలో మూడు సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. జిల్లాలో ఎక్కడైనా సెంటర్లు ఏర్పాటు చేయవచ్చని, ఇందుకు ఫిబ్రవరి 26 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు డీటీసీ వీర్రాజు తెలిపారు. రెండు ఎకరాల స్థలం, ఏదైనా ఎన్జీఓ, ఆర్గనైజేషన్ పేరుతో ఫర్మ్, రూ. 50 లక్షల ష్యూరిటీ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ నుంచి సర్టిఫికెట్ తదితర నిబంధనలు ఉన్నాయి. ఇప్పటికే రెండు దరఖాస్తులు అందగా.. మరో రెండు పరిశీలనలో ఉన్నాయి. టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు ఒకటి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నిర్వీర్యం దిశగా రవాణా శాఖ... రవాణా శాఖ ద్వారా అందిస్తున్న సేవలన్నీ ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం అవుతున్నాయి. ఇప్పటికే వాహన రిజిస్ట్రేషన్ను ఆయా షోరూంలకు, ఫిట్నెస్ ప్రక్రియను శివశంకర్ ఎంటర్ప్రైజెస్కు అప్పగించారు. తాజాగా డ్రైవింగ్ లైసెన్స్లు జారీ ప్రక్రియను కూడా ప్రైవేటుకు అప్పజెబుతుండడం గమనార్హం. దీంతో ఇకపై వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సిన పని ఉండదు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ప్రైవేటుకు అప్పజెబుతున్నట్లు చెబుతున్నా.. ప్రైవేటు ఏజెన్సీలపై పర్యవేక్షణ బాధ్యతలు ఆర్టీఏ అధికారులకు లేకపోవడం చూస్తే అక్రమాలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఎర్రవంక మాయం
సాక్షి టాస్క్పోర్స్: తాడిపత్రిలో టీడీపీ నేతల ధన దాహానికి ఎర్ర వంక కనుమరుగవుతోంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అండ చూసుకుని తాడిపత్రిలో రూ.కోట్లు విలువ చేసే ఎర్ర వంకను పూడ్చి వెంచర్లు వేసి విక్రయాలు చేపట్టారు. ఫలితంగా చిన్నపాటి వర్షానికే తాడిపత్రిలోని శివానగర్, టైలర్స్ కాలనీలు జలమయమవుతున్నాయి. పట్టించుకోని అధికారులు తాడిపత్రికి శివారు ప్రాంతమైన ఆటో నగర్ నుంచి బైపాస్ రోడ్డు వెంబడి కడప రోడ్డు వరకూ దాదాపు 3 కిలోమీటర్ల మేర ఎర్రవంక విస్తరించి ఉంది. ఇటీవల పట్టణం విస్తరించడంతో బైపాస్ రోడ్డు పరిధిలోని భూములకు రెక్కలొచ్చాయి. ఎకరా భూమి రూ.కోట్లలో ధర పలుకుతోంది. దీంతో ఎర్ర వంకపై టీడీపీ నేతలు కన్నేశారు. వంక పోరంబోకు భూములను ఆక్రమించి వెంచర్లు వేసి విక్రయిస్తున్నారు. కొన్ని ప్లాట్లలో అక్రమ నిర్మాణాలూ కొనసాగుతున్నాయి. టీటీడీ కల్యాణమంటపం సమీపంలో టీడీపీ నేత ఒకరు ఏకంగా వంకను పూడ్చి చిన్న పాటి కాలువగా మార్చేశాడు. మిగులు భూమిలో వెంచర్ వేసి అమ్మకానికి పెట్టాడు. ఇంత జరుగుతున్నా.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు అటుగా కన్నెత్తి కూడా చూడడం లేదు. అక్రమార్కులు టీడీపీ నేతలు కావడంతో అడ్డుకునేందుకు సాహసించలేకపోతున్నారు. వంకను పూడ్చి రియల్ దందా మొదలు పెట్టిన టీడీపీ నేతలు రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి విక్రయాలను మౌనంగా చూస్తున్న అధికారులు -
ఉన్నత స్థాయికి ఎదగాలి
అనంతపురం అర్బన్: కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యా శాఖ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో వక్తృత్వ, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 15 మంది విద్యార్థులను బుధవారం కలెక్టర్ తన చాంబర్లో అభినందిస్తూ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో డీఈఓ ప్రసాదరావు, ఏపీసీ శైలజ తదితరులు పాల్గొన్నారు. పతాక దినోత్సవం నిధికి విరాళాలివ్వండి సాయుధ దళాల పతాక దినోత్సవం నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లోని మినీకాన్ఫరెన్స్ హాల్లో సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయుధ దళాల ఫ్లాగ్డే సంక్షేమ నిధికి సంబంధించిన కార్ ఫ్లాగ్, స్టిక్కర్లను అధికారులతో కలసి కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. సైనిక సంక్షేమ అధికారి తిమ్మప్ప మాట్లాడుతూ.. విరాళాలు ఇవ్వదలిచిన వారు జిల్లా సైనిక సంక్షేమ అధికారి, అనంతపురం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నెంబరు 6207 695 6433, ఐఎఫ్ఎస్సీ కోడ్ BIN0021438 కు పంపించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, బీసీ సంక్షేమాధికారి కుష్బూకొఠారి, మైనారిటీ సంక్షేమాధికారి రామసుబ్బారెడ్డి, డీఐపీఆర్ఓ బాలకొండయ్య పాల్గొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద ఎంపికై న గ్రామాల్లో మంజూరైన అభివృద్ధి పనులు నెలరోజుల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మొత్తం 84 పనులు ఆమోదించగా పెండింగ్లో ఉన్న 24 పనులను నెలలో పూర్తి చేసి బిల్లులను జిల్లా పరిషత్కు పంపించాలన్నారు. రెండవ దశలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కణేకల్లు మండలం గరుడచేడు పంచాయతీ మీనహళ్లి, పెద్దవడుగూరు మండలం పెనకలపాడు పంచాయతీ కోడూరు ఎంపికయ్యాయన్నారు. ఈ గ్రామాల్లో అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. శిథిలావస్థ గదుల్లో బోధన వద్దు పాఠశాలల్లో శిథిలావస్థలో ఉన్న గదుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. వాటి మరమ్మతుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి (ఆర్ఓ) ప్లాంట్లు పనిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సంక్షేమ, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ బడిఈడు పిల్లలు కచ్చితంగా బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మునిసిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు కలెక్టర్ ఆనంద్ సూచన -
‘సాయం’ అందేది ఎన్నడు?
రాయదుర్గం: రైతు ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించక జిల్లాలోని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6 వేలు ప్రయోజనం చేకూరేలా.. మూడు విడుతలుగా రూ.2 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ పథకం కింద లబ్ధిదారుల వివరాలు నమోదుకు 2019, జనవరి 31నాటికి తుది గడువును విధించారు. దీంతో జిల్లాలోని 31 మండలాల్లో 4.20 లక్షల మంది రైతులు ఉండగా దరఖాస్తు చేసుకున్న వారిలో 2,75,642 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. మిగిలిన వారు అప్పటి నుంచి నేటి వరకూ పథకం లబ్ధి కోసం ఎదురు చూస్తున్నారు. విశిష్ట సంఖ్య వచ్చినా నిరాశే.. కేంద్ర ప్రభుత్వ పథకం ఏదీ పొందాలన్నా విశిష్ట గుర్తింపు కార్డు ఉండేలా కార్యచరణ చేపట్టారు. ఈ మేరకు ప్రతి రైతుకు ఆధార్ తరహా 11 అంకెలతో కూడిన సంఖ్యను కేటాయించారు. పోటీపడి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విశిష్ట సంఖ్య పొందితే కిసాన్ సమ్మాన్ పథకం తప్పక వర్తిస్తుందని ఆశపడ్డారు. కానీ నిరాశే ఎదురైంది. దీనికి తోడు పెట్టుబడి సాయం అందించడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కొర్రీలు విధించాయి. అర్హత జాబితా నుంచి చాలా మందిని తొలగిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పీఎం కిసాన్– రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా 2.94 లక్షల మందికి రూ.200.20 కోట్లకు పైగా సాయం అందింది. కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా నాన్చుడు దోరణి అవలంభిస్తూ వచ్చింది. ఈ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేయడంతో కొత్త లబ్ధిదారుల ఎంపిక కాస్త అటకెక్కింది. పీఎం కిసాన్ నమ్మాన్ నిధి కోసం రైతుల ఎదురుచూపు 2019 జనవరి 31 తర్వాత ఆగిన లబ్ధిదారుల ఎంపిక పట్టించుకోని చంద్రబాబు సర్కార్ జిల్లాలో మొత్తం రైతులు ః 4.20 లక్షల మంది పీఎం కిసాన్లబ్ధిదారులుః 2,75,642 మంది -
వైఎస్ జగన్ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం
అనంతపురం సెంట్రల్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తే సహించబోమని ఆ పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు చవ్వా రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాల్లో అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం రెండో పట్టణ పోలీసులకు పార్టీ లీగల్సెల్ జిల్లా అధ్యక్షుడు ఉమాపతితో కలసి బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులతో కలిసి చంద్రబాబు, పవన్కళ్యాణ్ను చంపేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి కుట్ర చేస్తున్నట్లు ఎక్స్, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ వేదికలుగా కొందరు టీడీపీ నాయకులు దుష్ప్రచారం సాగిస్తున్నారన్నారు. అసత్య, నిరాధరమైన వీడియోను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ తరహా కుట్రలకు తెరతీశారని మండిపడ్డారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు వీడియో మూలాలను డిజిటల్ ఫొరెన్సిక్ విశ్లేషణ ద్వారా గుర్తించి వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రాజేష్రెడ్డి, అనిల్కుమార్గౌడ్, మహేష్గౌడ్, హనుమంతరెడ్డి, రషీద్ఖాన్, శ్రీనివాసులు, లీగల్సెల్ నాయకులు గౌని నాగన్న, శ్రీనివాసరెడ్డి, వెంకటరాముడు, నాగరాజుబాబు, నారప్పరెడ్డి, పద్మావతి, కవితారెడ్డి, జ్యోతి, రేవతి తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో విష ప్రచారాలు బాధాకరం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకుల డిమాండ్ -
సోషలిజం వైపు అందరి చూపు
● సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీరాఘవులు అనంతపురం అర్బన్: పెట్టుబడిదారీ విధానాల దుర్లక్ష్యాలతో యావత్ ప్రపంచం ఇబ్బందుల్లో పడుతోందని, ఇలాంటి తరుణంలో దేశాలన్నీ సోషలిజం వైపు దృష్టి సారించాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ‘సోషలిజం విశిష్టత– సామ్రాజ్యవాద వైఫల్యం’ అంశంపై సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనంతపురంలోని లలిత కళాపరిషత్లో బుధవారం అవగాహన సదస్సు జరిగింది. అంతకు ముందు స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి లలిత కళాపరిషత్ వరకు రెడ్ కవాతు నిర్వహించారు. సదస్సులో బీవీ రాఘవులుతో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ మాట్లాడారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రజల సమస్యలను పరిష్కరించకపోగా మరింత జఠిలం చేసిందన్నారు. భారత దేశంలో ఈ విధానం వల్ల ఒక్క శాతంగా ఉన్న ధనికుల వద్ద 51 శాతం దేశ సంపద కేంద్రీకృతమైందన్నారు. ఒక వైపు సంపన్నులు సంపద పెంచుకుంటూ ఉంటే మరో వైపు పేదరికం పెరిగిపోతోందన్నారు. 129 దేశాల ఆకలి సూచికలో మన దేశం 124వ స్థానంలో ఉండడం బాధాకరమన్నారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ప్రజలందరికీ ఆక్షరాస్యత, సొంత ఇల్లు, వైద్యం వంటి కనీస సదుపాయాలను ప్రభుత్వాలు అందించలేకపోయాయని విమర్శించారు. 1917లో రష్యాలో ఏర్పడిన సోషలిస్టు ప్రభుత్వం అప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న బ్రిటన్, అమెరికాకు దీటుగా పలు విజయాలను సాధించిందన్నారు. అలాంటి వ్యవస్థ కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారన్నారు. అమెరికాలోనే పలు నగరాలకు మేయర్లుగా సోషలిస్టు నాయకులు ఎన్నికకావడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వ పాలనలో విఫలమైందని రాంభూపాల్ విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోతోందన్నారు. 12 గంటల పని విధానం అమలు దుర్మార్గమన్నారు. సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, రాష్ట్ర నాయకులు ఓబులు, జిల్లా నాయకులు నాగేంద్రకుమార్, బాలరంగయ్య, చంద్రశేఖర్రెడ్డి, ఆర్డీనాయుడు, ముత్తుజా, రామిరెడ్డి, వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచకాలు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ‘అనంత’ మండిపాటు అనంతపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి విమర్శించారు. బుధవారం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి ‘అనంత’ ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కుల, మత, వర్గాలకతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు అందడానికి కారణం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ మేన్నారు. అంబేడ్కర్ దూరదృష్టితో రాజ్యాంగ రూపకల్పన చేశారన్నారు.చంద్రబాబు ప్రభుత్వంలో కొన్ని దుష్టశక్తులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పవిత్రమైన రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం చాలా శక్తివంతమైనదన్నారు. రాష్ట్రపతి మొదలు సామాన్యుడి వరకు అందరూ సమాన హక్కులు అనుభవిస్తున్నారంటే రాజ్యాంగం గొప్పదనమనేని పేర్కొన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం క్షమించరానిదన్నారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ప్రజల గొంతు నొక్కేలా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలను పంచుకున్నా అక్రమ కేసులు బనాయించడం చంద్రబాబు ప్రభుత్వానికి తగదన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయశిల్పి డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తే దాన్ని రక్షించలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. దీనిపై అందరూ శాంతియుతంగా పోరాటాలు చేసి గాంఽధీజీ బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. అనంతరం జెడ్పీ కార్యాలయం వద్ద ఉన్న బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు అనంత చంద్రా రెడ్డి, మీసాల రంగన్న, రాష్ట్ర మైనార్టీ విభాగం జనరల్ సెక్రటరీ కాగజ్ ఘర్ రిజ్వాన్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు , పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస రెడ్డి, అమరనాథ రెడ్డి, వెన్నం శివారెడ్డి, జానీ, సాకే కుళ్లాయప్ప, సాకే చంద్రలేఖ, శ్రీనివాస నాయక్, చామలూరు రాజగోపాల్, భారతి, రాధాయాదవ్, అంజలి, శోభ, కసిరెడ్డి కేశవరెడ్డి, రాధాకృష్ణ, వెన్నపూస రామచంద్రారెడ్డి, కమల్భూషణ్, మల్లెల వేణు, కై లాష్, గుజ్జల లక్ష్మణ్, రహంతుల్లా, టీవీ చంద్రమోహన్ రెడ్డి, జావీద్, అనిల్కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులే కూలీలుగా మారి..
ఉరవకొండ: స్థానిక ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఇటుకలు, మట్టి మోస్తూ బుధవారం కూలీలుగా కన్పించారు. తరగతి గదుల్లో ఉంటూ చదువుకోవాల్సిన సమయంలో వారితో ఇటుకలు, మట్టిని ఆ పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు మోయించారు. ఇది చూసిన పలువురు ఆశ్చర్యపోయారు. తమ పిల్లలను ప్రయోజకులుగా చూడాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు బడులకు పంపితే అక్కడ ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఎరువుల దుకాణాల్లో తనిఖీలు కణేకల్లు: మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను బుధవారం ఫర్టిలైజర్ స్క్వాడ్ అధికారి సత్యనారాయణ, ఏఓ జగదీష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆదర్శ భారతి రైతుసేవా సహకార సంఘంలో ఎరువులకు సంబంధించిన రిజిస్టర్, గోదాములో నిల్వలకు పొంతన లేకపోవడంతో రూ.1.50 లక్షలు విలువ చేసే ఎరువుల విక్రయాల నిలుపుదల చేస్తూ నోటీసు ఇచ్చారు. స్థానిక పీఏసీఎస్లో రూ.70వేలు విలువ చేసే ఎరువుల విక్రయాలకు స్టాఫ్ సేల్స్ నోటీసు జారీ చేశారు. మరో ఫర్టిలైజర్ షాపులో రూ.6.59 లక్షలు విలువ చేసే ఎరువుల విక్రయాలను నిలుపుదల చేశారు. గురువారం లోపు సరైన ఇన్వాయిస్లు చూపకపోతే రూ.2.49 లక్షల విలువైన ఎరువులను జప్తు చేస్తామని సంబంధిత యజమానిని అధికారులు హెచ్చరించారు. -
తీవ్ర సంక్షోభంలో అన్నదాత
అనంతపురం:జిల్లాలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. జిల్లాలో అరటి రైతులను ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్తో మంగళవారం కలెక్టర్ ఓ. ఆనంద్ను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలను కలెక్టర్కు వివరించారు. ఎకరా అరటి సాగుకు రూ.1.50 లక్షల పెట్టుబడి పెడితే.. కనీసం రూ.5 వేలు కూడా రైతుకు అందడం లేదని పేర్కొన్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పొలాల్లోనే ట్రాక్టర్తో అరటి పంటను దున్నేస్తున్న పరిస్థితిని వివరించారు. దిగుబడి వచ్చిన అరటి గెలలను కలెక్టర్కు చూపించారు. ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్ ఎదుటే అరటికాయలు అమ్మి నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తక్షణమే అరటిని కొనుగోలు చేయాలి.. జిల్లా నుంచి రైతుల వలసలు అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి వాపోయారు. జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో అరటి సాగైతే 8 లక్షల టన్నుల దిగుబడి వస్తోందన్నారు. టన్ను కేవలం రూ.1,000 నుంచి రూ.2,000 పలుకుతుండడంతో రైతు పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రస్తుతం అరటి రైతులు గిట్టుబాటు ధర లేక పంటలను తోటల్లోనే వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అరటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కల్పించి రైతుల వద్దే నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అరటి ఎగుమతి చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ రైల్ను ఏర్పాటు చేసి ఢిల్లీకి తరలించిన పరిస్థితి ఉండేదని ఆయన వివరించారు. ఆ ఫ్లెక్సీలు ఏమయ్యాయో? ఇటీవల జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించిన సమయంలో టీడీపీ నాయకులు ఇక్కడ పెద్ద ఫ్లెక్సీ కట్టారని, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని ప్రగల్భాలు పలికారని, నేడు ఆ ఫ్లెక్సీలు ఎక్కడ ఉన్నాయో అంటూ మాజీ ఎంపీ, పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఎద్దేవా చేశారు. అరటికి కనీస మద్దతు ధర ఎందుకు కల్పించడం లేదని నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో నేరుగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించామన్నారు. ఇప్పుడు అరటికి కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసినట్లు కనీసం ఒక్క చోటైనా చూపించండి అంటూ సవాలు విసిరారు. రైతులకు ఏం చేశారో చెప్పాలి.. అరటి పంటను పొలాల్లో ట్రాక్టర్తో దున్నేస్తుంటే బాధేస్తోందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అనే విధానంతో పాలన సాగిస్తూ రైతన్నలను చిన్నచూపు చూస్తున్నారన్నారు. జిల్లాలో అరటి రైతన్న కుదేలవుతున్నాడన్నారు. హార్టికల్చర్ వైపు వెళ్లాలంటేనే రైతులు నిరుత్సాహపడుతున్నారని, ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ‘మీ కోసం రైతన్నా’ అంటూ డ్రామాలకు తెరతీసిందని దుయ్యబట్టారు. 18 నెలల కాలంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర ఇచ్చారా? రాయితీలు ఇచ్చారా అనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి, పంచాయతీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, మారుతీ నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, శివశంకర్ నాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస నాయక్, పార్టీ వ్యవసాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్ రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వై. నారాయణ రెడ్డి, జెడ్పీటీసీలు భోగాతి ప్రతాప్ రెడ్డి, నీలం భాస్కర్, బొమ్మల శ్రీరామిరెడ్డి, ముసలన్న, మండల కన్వీనర్లు పూల ప్రసాద్, కన్వీనర్ ఎల్లా రెడ్డి, కన్వీనర్ గువ్వల శ్రీకాంత్ రెడ్డి, ఖాదర్ వలి, శివశంకర్, మహేష్ రెడ్డి, కల్లూరు సూర్యనారాయణ రెడ్డి, చికెన్ నారాయణ స్వామి, శ్రీనివాస రెడ్డి, తిమ్మాపురం రాఘవ రెడ్డి, చింత కుంట మల్లికార్జున రెడ్డి, ఎల్లుట్ల శేఖర్, బాలరాజు, తిరుపతయ్య, భయేశ్వర రెడ్డి, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుకు పెత్తందార్లపై ఉన్న ప్రేమ రైతన్నలపై లేదు అన్నదాతను ఆదుకోకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి ధ్వజం పార్టీ నేతలు శైలజానాథ్, రంగయ్య, విశ్వతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం -
అంతా మా ఇష్టం
● ఉండబండ వీరభద్రేశ్వరాలయంలో సిబ్బంది, అర్చకుల ఇష్టారాజ్యం ● గర్భగుడికి తాళం వేయడంపై సర్వత్రా విమర్శలు విడపనకల్లు: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉండబండ వీరభద్రస్వామి దేవాలయంలో అంతా ఇష్టారాజ్యంగా మారింది. మంగళవారం ఏకంగా అర్చకులు గర్భగుడికి తాళం వేశారు. దీంతో భక్తులు ఆలయ ఆవరణంలోనే కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించి వెళ్లిపోయారు. ఆలయ కార్యకలాపాలు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నా భక్తులకు కనీస సౌకర్యాలు కూడా లేకుండా పోయాయి. ఆలయంలో పది మంది వరకూ అర్చకులు, 8 మంది దేవదాయ శాఖ సిబ్బంది ప్రతి నెలా దేవుని సొమ్మును జీతంగా తీసుకుంటున్నా అందుబాటులో ఉండటం లేదని భక్తులు వాపోతున్నారు. దేవదాయ శాఖ అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాట చందాన మారిందని మండిపడుతున్నారు. ఆలయ ఈఓ ఎక్కడ ఉంటారో కూడా తెలియడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఐసీడీఎస్లో కలకలం
● శిశుగృహలో చిన్నారి మృతికి కారణమైన ఉద్యోగులపై వేటు ● ఒకేసారి ఏకంగా ఏడుగురి తొలగింపు ● కలెక్టర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం అనంతపురం సెంట్రల్: మహిళా,శిశు సంక్షేమశాఖలో కలకలం రేగింది. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్న శిశుగృహలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిని తొలగిస్తూ కలెక్టర్ ఆనంద్ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత నెల 2న శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారి నిరూప్ మృతి ఘటన పర్యవసానంగా వారిపై వేటుపడింది. ఐసీడీఎస్ చరిత్రలోనే ఒకేసారి.. ఒక విభాగంలో పనిచేస్తున్న అందరినీ తొలగించిన దాఖలాలు లేవు. కలెక్టర్ ఆనంద్ తీసుకున్న నిర్ణయంతో శిశుగృహ మొత్తం ప్రక్షాళన జరిగినట్లయింది. మేనేజర్ దీప్తితో పాటు సోషల్ వర్కర్ లక్ష్మిదేవి, ఏఎన్ఎం గుణవతి, ఆయాలు, ఆదిలక్ష్మి, నూర్జహాన్, ప్రభావతి, వాచ్మెన్ రాజశేఖర్ను తొలగించారు. విభేదాలతో చిన్నారుల సంక్షేమం గాలికి.. మగబిడ్డకు జన్మనిచ్చిన కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన ఓ మహిళ కాసేపటికే పసికందును వదులుకోవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు పసికందును అక్కున చేర్చుకొని జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో చికిత్సలు అందించిన అనంతరం శిశుగృహలో అప్పగించారు. అయితే ఇక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది నిత్యం విభేదాలతో గొడవలకు దిగేవారు. ఇదే క్రమంలో ఈ ఏడాది అక్టోబర్ 2న ఓ ఆయా ఉన్న ఫళంగా విధులకు హాజరుకాలేదు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన మేనేజర్ దీప్తి పట్టించుకోలేదు. విధుల్లో ఉన్న ఒక్క ఆయా అందరినీ చూసుకోలేకపోవడంతో ఆకలితో అలమటించి చిన్నారి నిరూప్ మృతి చెందాడు. విషయాన్ని బయటకు పొక్కకుండా గుట్టుచుప్పుడు కాకుండా శ్మశానవాటికలో ఖననం కూడా చేయడం విమర్శలకు దారి తీసింది. కనీసం కలెక్టర్, ఆ శాఖ డైరెక్టరేట్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వలేదు. దీనిపై ‘సాక్షి’లో కథనం రావడంతో స్పందించిన ఐసీడీఎస్ రాష్ట్ర డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి జిల్లాకు వచ్చి ఘటనపై ఆరా తీశారు. కలెక్టర్ ఆనంద్ త్రిసభ్య కమిటీని నియమించారు. పై అధికారులకు సమాచారం ఇవ్వలేదనే కారణంతో వెంటనే అప్పటి పీడీ నాగమణిని సస్పెండ్ చేశారు. శభాష్ కలెక్టర్.. తాజాగా శిశుగృహ విషయంలో కలెక్టర్ ఆనంద్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. తొలినుంచి శిశుగృహ సిబ్బందిపై అవినీతి ఆరోపణలున్నాయి. ఓ ఎన్ఆర్ఐ మహిళను బంగారు, డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో ఏకంగా కేంద్ర మంత్రి వరకూ ఫిర్యాదుల వెళ్లాయి. హిందూపురం పట్టణానికి చెందిన మహిళతో నగరంలోని ఓ బంగారు దుకాణంలో నెక్లెస్ కొనుగోలు చేయించుకున్న వైనం వెలుగుచూసింది. తరుచూ అవినీతి ఆరోపణలు వస్తున్నా గతంలో పనిచేసిన ఐసీడీఎస్ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాట చందాన మారింది. చివరికి చిన్నారి ప్రాణం బలి తీసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ అనంతరం కలెక్టర్ ఆనంద్ శిశుగృహ సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. శిశుగృహలో చిన్నారులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయంగా వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను నియమించిన తర్వాత వేటు వేశారు. త్వరలో శిశుగృహలో నూతనంగా సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. -
పెన్షనర్లు.. అష్టకష్టాలు
● రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో చంద్రబాబు సర్కారు చెలగాటం ● బెనిఫిట్లు అందించడంలో తాత్సారం ● 30 ఏళ్లలో ఇలా లేదంటున్న పెన్షనర్లు అనంతపురం అర్బన్: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పెన్షనర్ల కష్టాలు చెప్పనలవిగా మారాయి. ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఆర్థిక ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. చేతిలో డబ్బు లేక కొందరు పెన్షనర్లు ఇళ్లలో జరగాల్సిన శుభకార్యాలయాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. గ్రాట్యూటీ రూ.94.88 కోట్లు పెండింగ్ ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం గ్రాట్యుటీ కింద గరిష్టంగా రూ.16 లక్షలు చెల్లి స్తుంది. జిల్లాలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు వివిధ హోదాల్లో 593 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందినట్లు సమాచారం. వీరికి గ్రాట్యుటీ రూపంలో అందాల్సిన రూ.94.88 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇక.. సర్వీసులో ఉండగా ఉద్యోగులు మిగుల్చుకున్న ఎర్న్ లీవ్లకు (ఈఎల్) రిటైర్మెంట్ సమయంలో డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఉద్యోగి దాదాపు 300 రోజులు (పది నెలలు) ఎర్న్ లీవులను వెనక్కి ఇస్తారు. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి సగటున రూ.8 లక్షలుగా 593 మందికి రూ.47.44 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్ ఉంచిందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం.. రిటైర్మెంట్ బెనిఫిట్లను ప్రభుత్వం చెల్లించకపోవడంపై కొందరు పెన్షనర్లు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రెవెన్యూ శాఖలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన కొందరు కోర్టులో కేసు వేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ఉద్యోగి రిటైర్మెంట్ తరువాత బెనిఫిట్లను ప్రభుత్వం మూడు నెలలకు మించి పెండింగ్లో ఉంచరాదని సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదని పెన్షనర్ల సంఘం నాయకులు చెబుతున్నారు. పెన్షనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. 18 నెలలుగా రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేదు. 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు. ఉద్యోగి రిటైర్ అయిన 3 నెలల్లోపు బెనిఫిట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ప్రభుత్వం నుంచి డబ్బులు రాక పెన్షనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. – శీల జయరామప్ప, పెన్షనీర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
తాడిపత్రిలో ‘తమ్ముళ్ల’ పేకాట పంచాయితీ
తాడిపత్రి టౌన్: తాడిపత్రిలో జేసీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఇన్నాళ్లూ ప్రతిపక్ష పార్టీనే టార్గెట్ చేసి నానా రచ్చ చేసిన జేసీ వర్గీయులు... తాజాగా సొంతపార్టీ నేతలనే టార్గెట్ చేశారు. ముందునుంచీ వైరివర్గంగా ఉంటున్న ‘కాకర్ల’ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం తాడిపత్రి మండల పరిధి లోని హునాపురం గ్రామ సమీపంలో ఉన్న టీడీపీ నాయకుడు కాకర్ల రంగనాఽథ్కు చెందిన మామిడి తోటపై పోలీసులు దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న 16 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.89,020 నగదు, మూడు కార్లు, 13 మోటార్ సైకిళ్లు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు దాడి చేసిన సమయంలో చాలా మంది పారిపోయారని, వారిలో కాకర్ల సోదరుడు, బంధువులు ఉన్నారని, వారిని కావాలనే పోలీసులు వదిలేశారని జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు ఆరోపించారు. దాదాపు వంద మంది జేసీ అనుచరులు ఏఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లి కాకర్ల సోదరుడితో పాటు కుటుంబీకులను అరెస్ట్ చేయాలని ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో ఒక్కసారిగా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే టీడీపీ పెద్దల సూచనలతో ఆందోళన చేయకుండానే జేసీ వర్గం నాయకులు అక్కడి నుంచి నిష్క్రమించారు. అనంతరం మంగళవారం రాత్రిపొద్దుపోయాక తాడిపత్రి అప్గ్రేడ్ స్టేషన్ సీఐ శివగంగాధర్రెడ్డి 16 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారిలో కాకర్ల జగన్నాథ్, కాకర్ల రంగనాథ్, కాకర్ల చంద్ర, గాలి సురేష్ రెడ్డి, తమ్మినేని శివకృష్ణ, షేక్ మహబూబ్ బాషా,రామినేని భాస్కర్, ఎల్లనూరు శివకృష్ణ, కోడూరు శ్రీనివాసులు, కడవకల్లు నాగేంద్ర, మీసాల విష్ణు, మారినేని కృష్ణమోహన్, కూచివారిపల్లి పట్టాభిరామయ్య, గన్నె నరేష్ కుమార్ నాయుడు, మాలపాటి లోకేశ్వర రెడ్డి, గుత్తి రవి కుమార్ ఉన్నట్లు ప్రకటించారు. అయితే పోలీసులు జేసీ ఒత్తిడితోనే తన వర్గంపై కేసు అక్రమ కేసులు నమోదు చేశారని టీడీపీ నాయకుడు కాకర్ల వర్గం ఆరోపించింది. మొత్తంగా తాడిపత్రిలో తమ్ముళ్ల పేకాట పంచాయితీ చర్చనీయాంశంగా మారింది. పాలవాయిలో వెలుగు అధికారుల పర్యటన కళ్యాణదుర్గం: ‘యానిమేటర్ భర్త చేతివాటం’ శీర్షికన ఈ నెల 22న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై వెలుగు అధికారులు స్పందించారు. మండలంలోని పాలవాయి గ్రామంలో ఓ వ్యక్తి బోగస్ సంఘాలను ఏర్పాటు చేసుకుని తప్పుడు రికార్డులు సృష్టించాడు. రూ.30 లక్షలు స్వాహా చేశాడు. ఈ విషయంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే మంగళవారం ఏపీఎం నారాయణస్వామి పాలవాయిలో పర్యటించారు. గతంలో పనిచేసిన యానిమేటర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో యానిమేటర్ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక.. రూ. లక్షలు స్వాహా జరిగిన సమయంలో పనిచేసిన సీసీలు తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ‘చంద్రబాబు రైతులను పట్టించుకోవడం లేదు’ యాడికి: సీఎం చంద్రబాబు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ ఓ రైతు మండిపడ్డారు. మంగళవారం యాడికి రైతు సేవా కేంద్రం వద్ద ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఏఓ మహబూబ్బాషా పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఆదినారాయణ నాయుడు అనే రైతు మాట్లాడుతూ గత ఏడాది తన పొలంలో సాగు చేసిన పంటకు ఇన్పుట్ సబ్సిడీ ప్రీమియం చెల్లించినా నష్ట పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే ఈ ఏడాది బీమా ప్రీమియం కట్టలేదన్నాడు. గతంలో ప్రభుత్వమే ఇన్పుట్ సబ్సిడీ ప్రీమియం కట్టి రైతులకు నష్ట పరిహారం అందజేసిందని, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రైతులను పట్టించుకోలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. -
‘ఎస్ఐఆర్’పై అవగాహన ఉండాలి
● ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరి ● అధికారులకు డీఆర్ఓ మలోల ఆదేశం అనంతపురం అర్బన్: ఓటరు జాబితా సవరణకు సంబంధించి త్వరలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సంబంధిత అధికారులను డీఆర్ఓ మలోల ఆదేశించారు. ఎస్ఐఆర్పై కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్ఓ), ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ల (ఈడీటీ)లతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఎస్ఐఆర్ నిర్వహణ షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ త్వరలో విడుదల చే యనుందన్నారు. గతంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్ ) నిర్వహించే వారని గుర్తు చేశారు. ప్రస్తుతం దాని స్థానంలో ఎస్ఐఆర్ను ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇందులో ఏవైనా సందేహాలు తలెత్తితే నివృత్తి చేసుకున్న తరువాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. తొందరపాటు నిర్ణయాలతో తలెత్తే ఇబ్బందులకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో ఈఆర్ఓలుగా ఉన్న ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, ఏఈఆర్ఓలుగా ఉన్న తహసీల్దార్లు, ఎన్నికల విభాగం డీటీలు పాల్గొన్నారు. -
సైన్స్ సెంటర్లో నేటి నుంచి శిక్షణ
అనంతపురం సిటీ: జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యం పరిధిలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, ల్యాబ్ ఇన్చార్జ్ ఉపాధ్యాయులకు బుధవారం నుంచి అనంతపురంలోని సైన్స్ సెంటర్లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు సైన్స్ సెంటర్ జిల్లా అధికారి బాలమురళీకృష్ణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అటల్ టింకరింగ్కు సంబంధించి ల్యాబ్ నిర్వహణ, నిధుల వినియోగం, ప్రాజెక్టుల తయారీ, రికార్డుల నిర్వహణ వంటి అన్ని అంశాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. పాముకాటుతో యువరైతు మృతి పుట్లూరు: మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన యువరైతు యలగాని ప్రతాప్ (30) పాముకాటుతో మృతిచెందాడు. గ్రామ సమీపంలో ఉన్న పత్తి పొలానికి నీరు పెట్టడానికి మంగళవారం ఉదయం వెళ్లిన సమయంలో పాము కాటుకు గురయ్యాడు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య శరణ్య, ఐదు నెలల కుమార్తె ఉంది. కాగా, భర్త మృతిపై శరణ్య అనుమానాలు వ్యక్తంచేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వివాహిత బలవన్మరణం పెద్దపప్పూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన అనిత (30)కు ఎనిమిదేళ్ల క్రితం పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన మంగల శ్రీరాములుతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని నెలల క్రితం దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకోడంతో అనిత పుట్టింటికి చేరుకుంది. ఆ సమయంలో పెద్దలు పంచాయితీ చేసి సర్దిచెప్పడంతో తిరిగి భర్త వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో భర్త వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన అనిత.. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చిన్నారుల ఏడుపులను విన్న స్థానికులు ఇంటి తలుపులు తెరిచి చూడడంతో విషయం వెలుగు చూసింది. కాగా, అప్పటికే భర్త, అత్తమామలు పరారయ్యారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంజాయి ముఠా అరెస్ట్ అనంతపురం సెంట్రల్: విశాఖపట్నం నుంచి గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను మంగళవారం అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం త్రీటౌన్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ రాజేంద్రనాథ్యాదవ్ వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురంలోని ఎర్రనేల కొట్టాలకు చెందిన రహమత్, ఆరో రోడ్డులో నివాసముంటున్న అస్లాంబాషా, 3వ రోడ్డుకు చెందిన రవికుమార్, టీవీ టవర్ ప్రాంతానికి చెందిన సాలోమన్, తపోవనంలో నివాసముంటున్న జ్యోతుల ప్రవీణ్కుమార్, కళ్యాణదుర్గం బైపాస్ ప్రాంతానికి చెందిన దినేష్గౌడ్, బెళుగుప్పకు చెందిన మనోజ్కుమార్ ఉన్నారు. వీరి నుంచి 4.5 కిలోల గంజాయి, 8 సెల్ఫోన్లు, రూ. 2,700 నగదు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కురుగుంటకు చెందిన హాజీ రహమత్ అలియాస్ బువమ్మతో కలసి మనోజ్కుమార్, షేక్ అస్లాంబాషా ఇటీవల విశాఖపట్నం జిల్లా తునికి వెళ్లి అక్కడ ఓ వ్యక్తి నుంచి కిలో రూ. 5వేలు చొప్పున 10 కిలోల గంజాయిని కొనుగోలు చేసి అక్రమంగా రైలులో అనంతపురానికి తీసుకువచ్చారు. ఇందులో నాలుగు కిలోల గంజాయిని కర్ణాటకలోని బాగేపల్లిలో విక్రయించారు. 100 గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టి నగర పరిసరాల్లో ప్యాకెట్ రూ.2 వేలు చొప్పున విక్రయించేందుకు చూస్తుండగా పక్కా సమాచారంతో అరెస్ట్ చేసినట్లు సీఐ వివరించారు. -
వారసత్వ సంపదను కాపాడుకుందాం
● కలెక్టర్ ఆనంద్ అనంతపురం కల్చరల్: వారసత్వ సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత అని కలెక్టర్ ఆనంద్ అన్నారు. నగరంలో వారం రోజులుగా సాగుతున్న ప్రపంచ వారసత్వ వారోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్థానిక కల్లూరు సుబ్బారావు పురావస్తు ప్రదర్శన శాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు అందించిన సహకారం ఎంతో ప్రోత్సాహమిచ్చిందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులనందించారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన కవులు, రచయితలను సత్కరించారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ ఏడీ స్వామినాయక్, పర్యాటక శాఖ అధికారి జయకుమార్, డిస్కవర్ ఏజీ అనిల్కుమార్రెడ్డి, లేడీస్క్లబ్ సెక్రటరీ పద్మానారాయణరెడ్డి, ఇన్నర్వీల్ జయంతి, ఇంటాక్ కన్వీనర్ రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిళ్లు తాళలేక లైన్మెన్ ఆత్మహత్యాయత్నం
ఉరవకొండ: అధికారిక ఒత్తిళ్లు తాళలేక స్థానిక శివరామిరెడ్డి, డ్రైవర్స్, తదితర కాలనీల విద్యుత్ శాఖ లైన్మెన్ ఎన్.రమేష్ మంగళవారం కార్యాలయంలోనే పురుగుల మందు తాగాడు. గమనించిన సహచర ఉద్యోగులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. కాగా, విద్యుత్ బిల్లుల బకాయిలు కట్టించాలంటూ కొన్ని నెలలుగా రమేష్పై ఉన్నతాధికారులు ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, అయితే అతనికి కేటాయించిన కాలనీల్లో ఎక్కువ శాతం మంది పేద, బడుగు వర్గాలు వారు ఉండటంతో వారు సమయానికి బిల్లులు చెల్లించకపోయేవారుగా తెలుస్తోంది. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక అఘాయిత్యానికి పాల్పడినట్లుగా సమాచారం. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
రైతులను తక్షణమే ఆదుకోవాలి
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఉరవకొండ: పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులను తక్షణమే ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మొక్కజొన్న, మినుములు, శనగలు, పత్తి, అరటి, మిర్చితో పాటు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. దీనికి తోడు అన్నదాత సుఖీభవ పథకం అందకపోవడంతో రైతులపై ఆర్థిక భారం పెరిగిపోతోందన్నారు. పంటకు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక ఈ 18 నెలల కాలంలోనే వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం క్వింటా రూ.2,400 మద్దతు ధర ప్రకటించిందని, అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తూ రైతులను దగా చేస్తోందని మండిపడ్డారు. ఇదే అవకాశంగా భావించిన దళారులు క్వింటా మొక్కజొన్నను రూ.1,400కు మించి కొనుగోలు చేయడం లేదన్నారు. విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పెట్టుబడుల సేకరణ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విదేశీ పర్యటనలు సాగిస్తున్నారని విమర్శించారు. యోగా డే పేరుతో రూ.300 కోట్లను వృథాగా ఖర్చు పెట్టారన్నారు. ఇప్పటికై నా రైతాంగ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బాల్య వివాహాలు లేని జిల్లాగా మారుద్దాం ● జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్రాబు రాప్తాడు రూరల్: బాల్య వివాహాలు లేని జిల్లాగా అనంతను మారుద్దామని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీసీఎల్ఏ) కార్యదర్శి, న్యాయమూర్తి రాజశేఖర్బాబు పిలుపునిచ్చారు. అనంతపురం రూరల్ పరిధిలోని కురుగుంట కేజీబీవీలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ‘బేటీ బచావో బేటీ పడావో’, ‘బాల్య వివాహాలు అరికట్టడం’ అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్న వయసులోనే ఆడ పిల్లలకు పిల్లలకు పెళ్లిళ్లు చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. ఉన్నతస్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా బాగా చదువుకోవాలని సూచించారు. ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ అరుణకుమారి మాట్లాడుతూ.. బాలల రక్షణ చట్టాలపై చైతన్య పరిచేలా జిల్లాలోని 32 కేజీబీవీల్లో 16 రోజుల పాటు ఈ అవగాహన సదస్సులు కొనసాగుతాయన్నారు. లోక్ అదాలత్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు బాలికల్లో చైతన్యం తెస్తాయన్నారు. అనంతరం విద్యార్థినులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మిషన్ వాత్సల్య కోఆర్డినేటర్ బీఎన్ శ్రీదేవి, చైల్డ్హెల్ప్ లైన్ జిల్లా సమన్వయకర్త కృష్ణమాచారి, కేజీబీవీ ప్రిన్సిపాల్ నర్మద, లీగల్ ఆఫీసర్ సంధ్యారాణి, రెడ్స్ ఎన్జీఓ సీఈఓ భానూజ పాల్గొన్నారు. -
అజ్ఞాతంలోకి చిట్టీ నిర్వాహకురాలు
● లబోదిబోమంటున్న బాధితులు గుంతకల్లు టౌన్: స్థానిక ధర్మవరం రైల్వేగేట్ ప్రాంతంలో నివాసముంటున్న చిట్టీ నిర్వాహకురాలు దిల్షాద్ తన ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. చిట్టీ కట్టించుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో గత ఆదివారం ఆమె ఇంటి ఎదుట బాధితులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఐపీ నోటీసులు పంపిస్తానని, తననేమీ ఎవరూ ఏమీ చేయలేరంటూ దిల్షాద్ బెదిరింపులకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా బాధితులు వినలేదు. దాదాపు ఐదు గంటలకు పైగా దిల్షాద్ ఇంటి ఎదుటే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చివరకు తన ఇంటిని విక్రయించి డబ్బు చెల్లిస్తానంటూ పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్న దిల్షాద్ సోమవారం రాత్రికి రాత్రే తన ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న బాధితులు అరుణమ్మ, చాంద్బీ, షాకీరా, మంజుల, శ్రీమేఘన, పర్వీన్, రాబర్ట్, రాబియా తదితరులు మంగళవారం మరోసారి దిల్షాద్ ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు విజయజ్యోతి, కేజీఎన్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ మాలిక్ సాహెబ్, కాంగ్రెస్ నాయకులు మహేంద్ర, ఫిరోజ్ఖాన్ తదితరులు మద్దతు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకూ రోజూ దిల్షాద్ ఇంటి ఎదుట నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. -
రుణాలు ఇస్తామంటూ మహిళలకు కుచ్చుటోపీ
● ఒక్కొక్కరితో రూ.3 వేలు వసూలు చేసి ఉడాయించిన మోసగాళ్లు రాయదుర్గం టౌన్: స్థానిక ముత్తరాసి కాలనీ, శనీశ్వరాలయం, గ్యాస్ గోడౌన్ ఏరియాతో పాటు మండలంలోని ఆయతపల్లి గ్రామంలో రుణాలు మంజూరు చేస్తామంటూ ఒక్కో మహిళతో రూ.3 వేలు చొప్పున ఇద్దరు వ్యక్తులు వసూలు చేసుకుని ఉడాయించారు. ‘ఉషోదయ ఫైనాన్స్ కంపెనీ నుంచి వచ్చాం. రూ.55 వేల నుంచి రూ.2 లక్షల వరకూ రుణాలు ఇస్తాం. క్రమం తప్పకుండా కంతులు చెల్లిస్తే చాలు’ అంటూ మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మోసపోయి ఇప్పటి వరకూ బయట పడిన వారిలో ముత్తరాసికాలనీకి చెందిన రాజి, చౌడమ్మ, ముత్యమ్మ, అనంతమ్మ, కృష్ణమ్మ, సరస్వతి, గంగమ్మ, లోకమ్మ తదితరులు మొత్తం 11 మంది ఉన్నారు. తీసుకున్న రుణానికి సంబంధించి నెలవారీ కంతులు చెల్లించే అవకాశం ఉంటుందని నమ్మించి గత శనివారం ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరితో రూ.3 వేలు చొప్పున వసూలు చేసుకుని గిఫ్ట్ కింద ఓ నాసిరకం ఫ్యాన్ను అంటగట్టి వెళ్లారని బాధితులు వాపోయారు. ఆ తర్వాత రుణం కోసం వారిచ్చిన ఫోన్ నంబర్కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోందని, దీంతో తాము మోసపోయినట్లుగా గుర్తించామని వివరించారు. మోసగాళ్లపై చర్యలు తీసుకుని తమ డబ్బు వెనక్కు ఇప్పించాలని కోరారు. -
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబసభ్యులు కళ్యాణదుర్గం రూరల్: కుటుంబ పరువు కోసం తమ కుమారుడిని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ బాధిత కుటుంబసభ్యులు మంగళవారం కళ్యాణదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన తొలిచేటి గోవిందు కుమార్తె తరుచూ బ్రహ్మసముద్రం మండలం యానకల్లులోని వారి బంధువుల ఇంటికి వచ్చేదని, ఈ క్రమంలో యానకల్లుకు చెందిన బోయ ఆనంద్తో అయిన పరిచయం ప్రేమగా మారిందని గుర్తు చేశారు. ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు తమ బంధువుల యువకుడికి ఇచ్చి పెళ్లి జరిపించారన్నారు. ఆ తర్వాత యువతి ప్రేమ విషయం తెలుసుకున్న భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడని, నాలుగు రోజుల క్రితం బెంగళూరులో ఉన్న ఆనంద్కు ఆ యువతి ఫోన్ చేసి కళ్యాణదుర్గం వస్తే పెళ్లి చేసుకుందామని తెలిపిందన్నారు. దీంతో ఈ నెల 21న కళ్యాణదుర్గానికి వచ్చిన ఆనంద్ బైపాస్ వద్ద పురుగుల మందు సేవించి.. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని ఆనంద్ తండ్రి వెంకటేశులు, అతని సోదరి వరలక్ష్మి పేర్కొన్నారు. ఈ అంశంలో లోతైన దర్యాప్తు చేపట్టి వాస్తవాలు నిగ్గుతేల్చాలంటూ బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఎస్ఆర్ఐటీకి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్ఆర్ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాలకరు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించిందని ఆ కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్ఆర్ఐటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో 5 బీటెక్ కోర్సులకు టైర్–1 కింద నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు దక్కిందన్నారు. ఈ గుర్తింపుతో రాయలసీమ జిల్లాల్లోనే నంబర్–1 స్వయం ప్రతిపత్తి ఇంజినీరింగ్ కళాశాలగా ఖ్యాతి దక్కిందన్నారు. 2017లో న్యాక్ ఏ–గ్రేడ్, 2018లో మూడు బీటెక్ కోర్సులకు (ఎన్బీఏ) టైర్–2 గుర్తింపు, 2019లో స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా లభించిందని గుర్తు చేశారు. తాజాగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ), సివిల్ ఇంజినీరింగ్ (సీఐవీ), మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంఈసీ) కోర్సులకు (ఎన్బీఏ) టైర్–1 గుర్తింపు దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు. -
మనల్నెవడ్రా ఆపేది!
అనంతపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ఖనిజాన్ని తవ్వి తరలించేస్తున్నారు. గతంలో భారీగా జరిమానాలు విధించి సీజ్ చేసిన క్వారీల్లో సైతం తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ‘ప్రభుత్వం మాదే మమ్మల్ని ఎవడ్రా ఆపేది’ అన్న రీతిలో టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జేబులు నింపుకుంటున్నారు. విషయం గనులశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు అందినా క్వారీల వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిగో సాక్ష్యం.. శెట్టూరు మండలం యాటకల్లు గ్రామ సమీపంలో కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన డి.శివప్రసాద్ 1.07 హెక్టార్లలో రోడ్డు మెటల్ క్వారీకి లీజు తీసుకున్నాడు. గనుల శాఖకు ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా దాదాపు 6,700 క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ను అక్రమంగా తవ్వేశాడు. గనులశాఖ అధికారులు 2024 మేలో క్వారీని పరిశీలించి రూ.43 లక్షల మేర నిర్వాహకునికి జరిమానా నోటీసులు జారీ చేసి క్వారీని సీజ్ చేశారు. ప్రస్తుతం క్వారీ నిర్వాహకుడు కళ్యాణదుర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అండతో యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నాడు. గనులశాఖ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా క్వారీ వైపు కన్నెత్తి చూడడం లేదంటే ఏస్థాయిలో అధికార బలాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చట్టరీత్యా నేరం అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న క్వారీలకు జరిమానాలు విధించాం. వాటిని చెల్లించిన తర్వాతే మళ్లీ కార్యకలాపాలు చేపట్టాలి. పైసా చెల్లించకుండా తవ్వకాలు చేయడం చట్టరీత్యా నేరం. విచారణ చేపట్టి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. – ఆదినారాయణ, డిప్యూటీ డైరెక్టర్, గనులశాఖ గతంలో సీజ్ చేసిన క్వారీల్లో మళ్లీ తవ్వకాలు జరిమానా వేసిన వాటిల్లోనూ దందా శెట్టూరు మండలం యాటకల్లులో వేల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ తరలింపు అటు వైపు కన్నెత్తి చూడని అధికారులు చియ్యేడు గ్రామ పొలం సర్వే నం. 231లో హెక్టార్ భూమిలో రోడ్డు మెటల్ క్వారీకి ఎం. గాయత్రి పేరిట లీజు తీసుకున్నారు. రాయల్టీ చెల్లించకుండా భారీ ఎత్తున మెటల్ను తరలించడంతో గతంలో గనులశాఖ, విజిలెన్సు అధికారుల బృందం సంయుక్తంగా క్వారీని పరిశీలించింది. అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించి రూ. 76 లక్షల మేర నిర్వాహకులకు జరిమానా విధించి క్వారీని సీజ్ చేసింది. నిర్వాహకులు మాత్రం పైసా కూడా చెల్లించకుండానే ఇటీవల క్వారీలో తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇది అనంతపురం రూరల్ మండలం క్రిష్ణంరెడ్డిపల్లి సమీపం చియ్యేడు పొలం సర్వే నంబర్ 231లో ఏర్పాటైన రోడ్డు మెటల్ క్వారీ. ఇక్కడ ఒక హెక్టార్లో రోడ్డు మెటల్ తవ్వకాలకు లీజు పొందిన ఎం.జ్ఞానేశ్వర్ గనులశాఖకు ఎలాంటి రాయల్టీ చెల్లించకుండానే వేల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ను తవ్వి తరలించేశాడు. 2022 మార్చి 10న గనులశాఖ అధికారులు క్వారీని తనిఖీ చేసి రూ.1.31 కోట్ల మేర ఖనిజాన్ని అక్రమంగా తరలించారని నిర్ధారించి క్వారీని సీజ్ చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్వారీలో మళ్లీ తవ్వకాలు ప్రారంభించిన నిర్వాహకుడు.. ఇప్పటికే వేల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ను అక్రమంగా తరలించేశాడు. -
ఆశావాద దృక్పథంతో పనిచేయాలి
● అధికారులకు ఎల్బీఎస్ఎన్ఏఏ డైరక్టర్ శ్రీరామ్ తరణికంటి ఆదేశం అనంతపురం అర్బన్: వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఆశావాద దృక్పథంతో పనిచేయాలని జిల్లా అధికారులకు ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ) డైరెక్టర్ శ్రీరామ్ తరణికంటి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో కలెక్టర్ ఓ.ఆనంద్, డీఆర్ఓ ఎ.మలోలతో కలసి జిల్లా అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. పాలనా వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న జిల్లా అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని ఐఏఎస్ అధికారులకు ఇచ్చే శిక్షణలో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు. సమస్య ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించి ఆచరణలో పెడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న జిల్లా అధికారులకు సృజనాత్మకత జోడించేందుకు ముస్సోరీలో శిక్షణ ఇస్తే ప్రయోజనకంగా ఉంటుందని డీఆర్ఓ కోరగా.. అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సౌత్ జోన్ క్రికెట్ జట్టుకు క్రీడాకారుల ఎంపిక అనంతపురం కార్పొరేషన్: అండర్ –14 సౌత్ జోన్ క్రికెట్ జట్టుకు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ సంఘం సోమవారం జట్టును ప్రకటించింది. ఎంపికై న వారిలో మోక్షన తేజ్(కళ్యాణదుర్గం), హేమచంద్రా నాయక్ (అనంతపురం), పంకజ్ (గుత్తి), కె.రోహిత్ (హిందూపురం) కీలక జట్టులో చోటు దక్కించుకోగా, క్రిటిక్ సాయి (పరిగి) స్టాండ్బైగా ఎంపికయ్యాడు. వ్యక్తి బలవన్మరణంఅనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలోని పీటీసీ ఫ్లై ఓవర్ పైనుంచి కిందకు దూకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 45 సంవత్సరాలున్న వ్యక్తి గుంతకల్లుకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్ తీసుకున్నాడు. అంతకు మించి అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని సర్వజనాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని సీఐ రాజేంద్రనాథయాదవ్ కోరారు. యువతి ఆత్మహత్యగుంతకల్లు: స్థానిక ధర్మవరం రైల్వే ఎల్సీ గేట్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని హనుమేష్ నగర్కు చెందిన వీరన్న, సుంకమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు కాగా, వీరిలో చిన్న కుమార్తె లక్ష్మి (20) మానసిక సమస్యతో బాధపడుతోంది. దీంతో తరచూ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయేది. కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన లక్ష్మి... ఉదయం 11.30 గంటల సమయంలో ధర్మవరం గేట్ సమీపంలో గూడ్స్ రైలు వెళ్తున్న పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకుంది. మొండెం నుంచి తల వేరుపడింది. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికతాడిపత్రి టౌన్: జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో తాడిపత్రికి చెందిన అయేషా ఎంపికై ంది. ఈ మేరకు కోచ్ నరసింహ సోమవారం వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 24 వరకు మచిలీపట్నంలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్ 14 బాలికల విభాగంలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లుగా వివరించారు. జాతీయ స్థాయి పరుగు పోటీలకు ఎంపిక గుంతకల్లు రూరల్: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో డిసెంబర్ 11 నుంచి జరిగే జాతీయ స్థాయి పరుగు పోటీలకు గుంతకల్లు మండలం నరసాపురం జెడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థిని వర్షిత ఎంపికై ంది. అండర్–17 విభాగంలో ఎంపికై న వర్షితను ఆ పాఠశాల హెచ్ఎం మరియమ్మ, పీడీ చల్లా ఓబులేసు, ఇతర ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు. నేటి నుంచి విద్యాశాఖ అధికారుల బడిబాట అనంతపురం సిటీ: జిల్లాలో పాఠశాలల పనితీరును పర్యవేక్షించేందుకు మంగళవారం నుంచి విద్యాశాఖ అధికారులు బడిబాట పట్టనున్నారు. ఇటీవల నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో కమిషనరేట్ జారీ చేసిన ఆదేశాల మేరకు రూట్మ్యాప్ను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. బోధనాంశాలు, పాఠశాలల ప్రగతి, విద్యార్థుల పురోగతి, గడువులోపు సిలబస్ పూర్తి చేయడం, పదో తరగతి పరీక్షల నిర్వహణ, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల జారీ, పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పరిశీలన, మెరుగైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధం చేసి పాఠశాల కమిషనరేట్కు పంపనున్నారు. అలాగే విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయుల పని తీరును మదింపు చేయాలని జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. -
జయహో దీపిక..
క్రికెట్లో భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ గెలిచి నెల తిరగకముందే ఉమ్మడి జిల్లాకు చెందిన దీపిక నేతృత్వంలో మరో ప్రపంచకప్ మన సొంతమైంది. అది కూడా అంధ మహిళల టీ20 విభాగంలో మొట్టమొదటి ప్రపంచకప్ కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలోని అందరి దృష్టి టీసీ దీపికపై పడింది. ఎవరీ దీపిక? ఏ ప్రాంతానికి చెందిన వారనేది హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో దీపిక గురించి తెలుసుకోవాలంటే శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి పంచాయతీ తంబాలహట్టి గ్రామానికి చేరుకోవాల్సిందే. నిరుపేద కుటుంబానికి చెందిన దీపిక తల్లిదండ్రులు చిత్తమ్మ, చిక్కతిమ్మప్ప వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. దీపిక ఐదు నెలల ప్రాయంలో ఉన్న సమయంలో చేతి వేలు గోరు తగిలి ఒక కంటి చూపు పోయింది. కొన్నాళ్లు తల్లిదండ్రులు బాధపడినా.. ఆ తర్వాత పాపకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎంత కష్టమైనా తామే పడాలని నిర్ణయించుకున్నారు. కన్నడ మాధ్యమంలోనే విద్యాభ్యాసందీపిక స్వగ్రామం కర్ణాటక సరిహద్దున ఉండడంతో కర్ణాటకలోని తుమకూరు జిల్లా దొడ్డ బాణగెరలోని సర్కారీ ప్రౌఢశాలలో 1 నుంచి 4వ తరగతి వరకూ చదువుకుంది. కంటి చూపు సక్రమంగా లేకపోవడంతో స్థానిక ఉపాధ్యాయుల సహకారంతో 2012 –13లో తుమకూరు జిల్లా కుణిగల్లోని అంధుల పాఠశాలలో 5 నుంచి 7వ తరగతి వరకూ చదువుకుంది. అనంతరం మైసూరులోని రంగారావు మెమోరియల్ స్కూల్ ఫర్ డిసేబుల్డ్లో చేరి 8 నుంచి 10వ తరగతి వరకు, ఆ తరువాత శిర తాలుకా బరగూరులోని జ్ఞాన జ్యోతిలో పీయూసీ (ఇంటర్) పూర్తి చేసింది. అనంతరం బెంగళూరులోని విజయనగర ఫస్ట్గ్రేడ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది.టీ–20 ప్రపంచకప్లో అజేయంగా...శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా ఈ ఏడాది నవంబర్లో అంధ మహిళల క్రికెట్ టీ–20 ప్రపంచ కప్ టోర్నీ జరిగింది. ఈ పోటీల్లో ప్రాతినిథ్యం వహించిన భారత జట్టుకు దీపికనే కెప్టెన్గా వ్యవహరించి, అన్ని మ్యాచ్ల్లోనూ జట్టును విజయతీరాలకు చేరేలా సభ్యులను దిశానిర్దేశనం చేస్తూ జట్టును ఫైనల్స్కు చేర్చింది. ఈ నెల 23న జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టుతో తలపడిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 12.1 ఓవర్లలోనే 117 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది.క్రీడలో రాణించింది ఇలా.. 2016లో మైసూరులో 8వ తరగతి చదువుతుండగా పాఠశాల స్థాయిలో క్రికెట్ పోటీ నిర్వహించారు. ఇందులో ఏకంగా 100 పరుగులు చేసిన దీపికలోని క్రీడాప్రతిభను ఉపాధ్యాయులు గుర్తించి, ఆ దిశగా ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చారు. అదే ఏడాది బెంగళూరు వర్సెస్ మైసూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో దీపిక 3 వికెట్లు తీయడంతో పాటు 78 పరుగులు చేసింది. ఇదే ఆమెలోని ఆత్మవిశ్వాసం పెంపొందేందుకు తొలి మెట్టుగా మారింది. ఇంటి ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోవడానికి తోడు సరైన ఆర్థిక ప్రోత్సాహం లేక కొన్ని రోజుల పాటు జిల్లా స్థాయి క్రికెట్కే పరిమితమైంది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సమయంలో బెంగళూరులోని ఐడీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో పాల్గొన్న దీపిక ఏకంగా మరో సెంచరీతో బెంగళూరులోని సమర్థనం సంస్థ దృష్టిని ఆకర్షించింది. సంస్థ నిర్వాహకులు వెంటనే దీపిక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి క్రికెట్లో ఉన్నతశ్రేణి శిక్షణ ఇప్పించేందుకు అయ్యే ఖర్చు భరించారు. అప్పటి నుంచి దీపిక వెనుతిరిగి చూడలేదు. వరుస మ్యాచ్ల్లో రాణిస్తూ భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ స్థాయికి ఎదిగింది.కలెక్టర్ కావాలని ఉంది..నా ప్రతి విజయం వెనుక అమ్మ, నాన్న ప్రోత్సాహం మరువలేను. చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలని నా ఆశ. అయితే పేదరికం కారణంగా యూపీఎస్సీకి సిద్ధం కాలేకపోతున్నా. ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కానీ సహకరిస్తే ఈ కలను సాకారం చేసుకుని ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తా. – టీసీ దీపిక, తంబాలహట్టి, అమరాపురం మండలం -
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ మృతి
గార్లదిన్నె: మండల పరిధిలోని యర్రగుంట్ల వీఆర్ఏ వెంకటరాముడు (51) సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు, బంధువులు తెలిపిన మేరకు.. వెంకటరాముడు గత కొన్నేళ్లుగా యర్రగుంట్ల వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం గార్లదిన్నె తహసీల్దార్ కార్యాలయంలో విధులు ముగించుకొని ద్విచక్రవాహనంలో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో మర్తాడు క్రాస్ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి గార్లదిన్నె పీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే వెంకటరాముడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం ఉన్నట్లు తెలిసింది. -
గ్రేడ్–1 మున్సిపాలిటీగా రాయదుర్గం
రాయదుర్గంటౌన్: ప్రథమ శ్రేణి (గ్రేడ్–1) మునిసిపాలిటీగా రాయదుర్గంను అప్గ్రేడ్ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కమిషనర్ దివాకర్రెడ్డి తెలిపారు. దీనిపై మున్సిపల్ చైర్మన్ పొరాళ్ల శిల్ప హర్షం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేయాలని గత నెలలో జరిగిన కౌన్సిల్ మీట్లో తీర్మానించి ప్రభుత్వానికి నివేదించినట్లు గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ పాలకవర్గంలో ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కావడం తమకు గర్వంగా ఉందన్నారు. 1963 అక్టోబర్1న రాయదుర్గం పురపాలక సంఘం ఏర్పాటైంది. 2001 మే 18న ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. తాజాగా ప్రథమశ్రేణికి చేరడంతో పట్టణంలో సౌకర్యాల కల్పనతో పాటు నిధుల వెసులుబాటు కలిగి అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుంది. ముగిసిన సత్యసాయి శత జయంతి వేడుకలు ప్రశాంతి నిలయం: సత్యసాయి శత జయంతి వేడుకలు సోమవారంతో ముగిశాయి. నవంబర్ 13 నుంచి 24వ తేదీ వరకు జరిగిన వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్తో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అలాగే దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి సేవా సెంటర్లను కలుపుతూ ప్రపంచ సదస్సును నిర్వహించింది. నవంబర్ 18న జరిగిన సత్యసాయి రథోత్సవం భక్తులను సాయినామంతో పులకింపజేసింది. 22న జరిగిన సత్యసాయి విద్యాసంస్థల 44వ స్నాతకోత్సవ సంబరం అంబరమంటింది. 23న సత్యసాయి శత జయంతితో బాబా భక్తకోటి మురిసిపోయింది. లక్షలాది భక్తులు ఒక్కచోట చేరి సత్యసాయికి ఆత్మనివేదనను అర్పించుకున్నారు. చిత్రావతి నదిపై, సత్యసాయి హిల్వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన లేజర్ షోలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాల సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 లక్షల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. 40 శాతం సబ్సిడీతో విత్తన వేరుశనగ అనంతపురం అగ్రికల్చర్: రబీ పంటగా నీటి వసతి కింద వేరుశనగ సాగు చేసే రైతులకు 40 శాతం సబ్సిడీతో విత్తనం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లాకు 7,300 క్వింటాళ్లు కేటాయించగా అందులో కే–6 రకం 6 వేల క్వింటాళ్లు, టీసీజీఎస్–1694 రకం 1,300 క్వింటాళ్లు కేటాయించినట్లు వ్యవసాయ, ఏపీ సీడ్స్ అధికారులు తెలిపారు. క్వింటా పూర్తి ధర రూ.9,200 కాగా అందులో 40 శాతం రూ.3,680 పోనూ రూ.5,520 ప్రకారం రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 30 కిలోలు కలిగిన మూడు బస్తాలు పంపిణీ చేస్తామని తెలిపారు. నీటి వసతి కలిగిన రైతులు ఆర్ఎస్కేల్లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వేరుశనగ విత్తుకునేందుకు ఈనెల 15 నుంచి డిసెంబర్ 15 వరకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలిపారు. -
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
కళ్యాణదుర్గం రూరల్: రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్డీఓ వసంతబాబును కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మార్కెట్లో వ్యాపారులు, దళారులు సిండికేట్గా ఏర్పడి తక్కువ ధరతో పంటను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఫలితంగా జిల్లాలో మొక్కజొన్న, అరటి రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అలాగే యాటకల్లు, ఐదుకల్లు గ్రామాల మధ్య కొండల్లో అక్రమంగా సాగుతున్న మైనింగ్ను అరికట్టాలని కోరారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న టీడీపీ నేతలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, జెడ్పీటీసీ బొమ్మన్న, రైతు విభాగం నేత నరేంద్రరెడ్డి, అభిలాష్రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ ఎర్రంపల్లి కృష్ణమూర్తి, కన్వీనర్లు గోళ్ల సూరి, చంద్రశేఖర్రెడ్డి, ఎంఎస్ హనుమంతురాయుడు, రామాంజినేయులు, మురళి, అంజి, కృష్ణారెడ్డి, దొడగట్ట నారాయణ, పాతలింగ, మల్లి, చరణ్, రామచంద్ర, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కళ్యాణదుర్గంలోని అంబేడ్కర్ సర్కిల్లో సోమవారం ఆయన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ సుఽధీర్, కౌన్సిలర్ లక్షన్న, బిక్కిహరి, సురేష్, జాకరీర్, గంగాధర్, హబీబ్, లత, హలీం, అరుణ, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ -
కుప్పకూలిన ఒడిశా
● 124 పరుగులకు ఆలౌట్ ● రాణించిన లోహిత్, కార్తీక్ రెడ్డి ● అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ అనంతపురం కార్పొరేషన్: ఆంధ్ర బౌలర్లు లోహిత్, కార్తీక్ రెడ్డి విజృంభించడంతో ఒడిశా జట్టు 124 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆంధ్ర జట్టుకు 158 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. ఆర్డీటీలోని రాయలసీమ క్రికెట్ మైదానంలో కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 మ్యాచ్లో రెండో రోజు ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ 246/7తో ప్రారంభించి 282 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఏఎన్వీ లోహిత్ 71 పరుగులు చేశాడు. తడబడిన ఓడిశా.. అనంతరం బరిలో దిగిన ఒడిశా జట్టు ఆరంభం నుంచే తడబడింది. 63.1 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆంధ్ర బౌలర్లు ఏఎన్వీ లోహిత్ 37/4, కార్తీక్ రెడ్డి 47/4తో ఒడిశాను కట్టడి చేశారు. ఓడిశా జట్టులో సుభాసిస్ మల్లిక్ 40, ప్రశాంత్ మోక్షిత్ 35 పరుగులు చేశారు. అనంతరం ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. -
అన్నదాత ఆక్రందనలు పట్టవా?
అనంతపురం: వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. అదే సిద్ధాంతంతో అన్నదాతలను నట్టేట ముంచుతున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ విమర్శించారు. ఆయన సోమవారం అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, ఒక్క క్వింటాలు ధాన్యాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలాలు లేవని తెలిపారు. అన్నదాతల ఆక్రందనలు పట్టించుకోవడం లేదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరటి తోటలను పంట ఉండగానే ట్రాక్టర్లతో దున్నేస్తున్న పరిస్థితి చూస్తున్నామన్నారు. అరటి కిలో ఒక్క రూపాయికి కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదన్నారు. అరటి, ఉల్లి, మొక్కజొన్న, వరి ధాన్యం ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతన్నలు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు పంచ సూత్రాలు వల్లె వేయడం శోచనీయమన్నారు. శాసీ్త్రయ వ్యవసాయం అంటూనే 99 పైసలకే కారు చౌకగా భూములను కార్పొరేట్కు కట్టబెడుతున్నారని విమర్శించారు. యూరియా బ్లాక్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం పండుగ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని, ఉచిత విద్యుత్ పథకంతో రైతన్నలకు వెలుగు వచ్చిందని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ అన్నదాతలకు తోడుగా నిలిచారన్నారు. రైతు భరోసా కేంద్రాలు, ఉచిత విద్యుత్, ధరల స్థిరీకరణ నిధి, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా పథకాల ద్వారా అన్నదాతలకు దన్నుగా నిలిచారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇవన్నీ ఏమీ లేవన్నారు. దాదాపు రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రైతులకు చెల్లించాల్సి ఉన్నా..పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనని చంద్రబాబుకు తెలుసని, రైతులను ఆదుకునే మనసు లేదని విమర్శించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో అనంతపురం జిల్లాలో ఏకంగా 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. రోమ్ నగరం తగలబడుతుంటే.. ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి తరహాలో చంద్రబాబు పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి రోజూ ప్రత్యేక విమానాల్లో లగ్జరీగా తిరుగుతున్నారని, ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతన్నలకు తోడుగా వైఎస్సార్సీపీ నిలుస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అరటి, వేరుశనగ పంటలకు గిట్టుబాటు ధర దక్కేలా ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. నేడు కలెక్టర్ దృష్టికి రైతుల సమస్యలు శింగనమల: నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను మంగళవారం కలెక్టర్ ఆనంద్ను కలిసి వివరించనున్నట్లు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు లేక అరటి, మొక్కజొన్న, తదితర పంటల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ క్రమంలో అన్నదాతల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ను కలుస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొంటున్నట్లు తెలిపారు. రైతులు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ శ్రేణులు హాజరుకావాలని కోరారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదు విలేకరులతో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ -
5, 12న షీప్ సొసైటీల ఎన్నికలు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల (షీప్ సొసైటీ) ఎన్నికల నిర్వహణకు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో షీప్ డెవలప్మెంట్ విభాగం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ 350 సొసైటీలు రిజిష్టర్ చేసుకోగా... ఇందులో డిపార్ట్మెంట్ యూనియన్ పరిధిలో 215 సొసైటీలు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఉమ్మడి జిల్లా పరిధిలో 130 సంఘాలకు ఎన్నికలు పూర్తికాగా, పెండింగ్లో ఉన్న అనంతపురం జిల్లాలో 39 సొసైటీలకు, సత్యసాయి జిల్లాలో 45 సొసైటీలకు డిసెంబర్ 5, 12న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కోర్టు పరిధిలో ఉన్న మదిగుబ్బ సొసైటీకి ఎన్నిక నిర్వహించడం లేదు. ఎన్సీడీసీ కింద రుణాలు తీసుకుని డిఫాల్టర్లుగా మారిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని అధికారులు పేర్కొన్నారు. మహిళా దొంగకు దేహశుద్ధి● మరో ఇద్దరి పరారీ గుత్తి: స్థానిక స్పందన శారీ సెంటర్లో సోమవారం ముగ్గురు మహిళా దొంగలు చీరలు అపహరిస్తూ నిర్వాహకులు శ్రీనివాసులు, అభి, సిబ్బందికి పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరు తప్పించుకుని పారిపోయారు. పట్టుబడిన ఓ మహిళను అక్కడున్న మహిళలు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. రూ. 20 వేలు విలువైన చీరలను కట్టెల బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోయేందుకు ప్రయత్నించినట్లుగా సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, లోతైన విచారణ చేపట్టారు. వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ‘సంకల్ప్’● ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ అనంతపురం సిటీ: ఇంటర్మీడియట్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సోమవారం నుంచి సంకల్ప్ కార్యక్రమం ప్రారంభమైందని ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యాచరణ 2026 ఫిబ్రవరి 20వ తేదీ వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో అభ్యసనా లోపాలను గుర్తించి, వారిపై వ్యక్తిగత శ్రద్ధ వహించేలా ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. అలాగే సంకల్ప్ షెడ్యూల్ సక్రమంగా అమలయ్యే అంశంపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. డీవీఈఓలు వారానికి మూడు కళాశాలలు, ప్రాంతీయ సంచాలకుడు వారానికి రెండు కళాశాలలు సందర్శించి, సంకల్ప్ షెడ్యూల్పై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 20 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 20 నుంచి ప్రత్యేక రివిజన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. విద్యార్థుల ఫలితాలకు ప్రిన్సిపాళ్లు, కేర్ టేకర్లు, సబ్జెక్టు అధ్యాపకులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
పెళ్లిలో జగనన్న పాట.. వద్దన్న పోలీసులపై ప్రజల ఆగ్రహం
కూడేరు: పెళ్లి ఊరేగింపులో జగనన్న డీజే పాట రావడంతో కూడేరు పోలీసులు ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని ఊరేగింపును అడ్డుకున్నారు. వైఎస్ జగన్ పాటను పెట్టరాదంటూ హుకుం జారీ చేశారు. దీంతో పోలీసులపై స్థానికులు తిరగబడ్డారు. ఈ ఘటన కూడేరు మండలం కలగళ్లలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు... కలగళ్లలో వడ్డే శ్రీకాంత్, రూప వివాహం ఆదివారం జరిగింది. అదే రోజు రాత్రి ఊరేగింపులో కుటుంబసభ్యులు డీజే ఏర్పాటు చేసి బంధు మిత్రులతో కలసి సరదాగా డ్యాన్స్ చూస్తూ సందడి చేయసాగారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రూపొందించిన పాట ప్లే కావడంతో పిల్లలు, యువత రెట్టింపు ఉత్సాహంతో ఈలలు వేస్తూ స్టెప్పులు వేశారు.ఈ విషయంపై గిట్టని వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై కలగళ్లకు చేరుకుని డీజే పెట్టరాదంటూ రెండు గంటల పాటు అడ్డుకున్నారు. దీంతో వేడుక జరుపుకోవడం కూడా నేరమేనా? అని పెళ్లి వారు వాదనకు దిగారు. అయితే వైఎస్ జగన్ పాటలు పెట్టరాదని పోలీసులు చెప్పడంతో పోలీసుల తీరుపై పెళ్లి వారితో పాటు పలువురు గ్రామస్తులు మండిపడ్డారు. ఇదే గ్రామంలో టీడీపీ వారు పెళ్లి ఊరేగింపులో డీజే పెట్టి టీడీపీ పాటలు పెట్టి సంబరాలు జరుపుకున్నారని, ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఎందుకు వచ్చిందని నిలదీశారు. ప్రజలు తిరగబడడంతో పోలీసులు మారుమాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఏ మొహం పెట్టుకుని రైతుల ముందుకొస్తావ్?
● సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి ధ్వజం ఉరవకొండ: సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్క రోజైనా రైతుల గురించి ఆలోచించని చంద్రబాబు నేడు ఏ మొహం పెట్టుకుని వారి ముందుకొస్తారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఒక్క గింజ అయినా కొన్నారా అని నిలదీశారు. అరటి రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి కన్పించదా అంటూ ప్రశ్నించారు. గతంలో అరటి టన్ను రూ.25 వేలు పలికితే నేడు రూ. 2 వేలు కూడా పలకడం లేదని, దీంతో అన్నదాతల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. టమాట, ఉల్లి రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు. పత్తికి ప్రభుత్వం క్వింటా రూ.7 వేలు మద్దతు ధర ప్రకటించినా ఎక్కడా కొనుగోలు మాత్రం చేయడం లేదని దుయ్యబట్టారు. జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న పంటను 5 లక్షల ఎకరాల్లో సాగు చేశారని, ప్రభుత్వం క్వింటాకు రూ. 2,400 మద్దతు ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. చాలా ప్రాంతాల్లో రైతులు క్వింటా రూ. 1,600కే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏడాదికి రూ.20 వేల చొప్పున అందించాల్సి ఉండగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ఇప్పటి వరకూ కేవలం రూ.10 వేలు చెల్లించారని, ఇంకా రూ. 30 వేలు చెల్లించకుండా మోసగించారని మండిపడ్డారు. రబీలో జిల్లాలోనే అత్యధికంగా ఉరవకొండ ప్రాంతంలో పప్పుశనగ సాగు చేస్తారని, అయితే చంద్రబాబు ప్రభుత్వం రాయితీపై విత్తనం అందించకపోవడంతో రైతులు బయటి మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చిందని వాపోయారు. విత్తనం వేసి కలుపులు తీసే సమయంలో రైతులను మభ్యపెట్టడానికి విత్తనం ఇస్తున్నట్లు డ్రామా ఆడి చివరికి వాటిని కూడా టీడీపీ నేతలు అమ్ముకొనేలా చేశారన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే రైతు సంక్షేమం.. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉద్యాన రైతులకు అడుగడుగునా అండగా నిలిచారని ‘విశ్వ’ గుర్తు చేశారు. పంటలను ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసి రైతులకు మేలు చేశారన్నారు. జగనన్న హయాంలో 54 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి ఆదుకుందని, చంద్ర బాబు ప్రభుత్వంలో మాత్రం ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే చెల్లించాలని చెప్పడంతో కేవలం 19 లక్షల మంది మాత్రమే చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. హార్టికల్చర్ రైతులకు కోట్లాది రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో వైఎస్ జగన్ అందించారని కొనియాడారు. గ్రామాల్లోనే రైతులకు ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించి కష్టం లేకుండా చూశారన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్, పార్టీ రాష్ట్ర నాయకులు హవళిగి భరత్రెడ్డి, బసవరాజు, ఓబన్న, రాజేష్, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్దార్థ్, పార్టీ నాయకులు జిలాన్, ఆసీఫ్, పచ్చిరవి తదితరులు పాల్గొన్నారు. -
కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు నిర్మించాలి
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం అనంతపురం అర్బన్: పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, సచివాలయాలు, దేవాలయాలు, ఆర్టీసీ బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు నిర్మించడంతో పాటు ప్రతి శుక్రవారం అందరూ డ్రై డే పాటించేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా వాటర్, శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి పంచాయతీలోనూ రెండు చొప్పున వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయడంతో పాటు నిర్మాణాలూ పూర్తి చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 60 గ్రామాల్లో వ్యక్తిగత సోక్పిట్ల కోసం పరిపాలన అనుమతులు తీసుకుని డిసెంబరు 20 నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. జనవరి మూడో శనివారం నాటికి మరో 100 గ్రామాలకు పరిపాలన అనుమతులు తీసుకుని ఫిబ్రవరి 20వ తేదీలోపు సోక్పిట్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పాడైన బోరుబావులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక గార్బెజ్ పాయింట్ను గుర్తించి చెత్తనూ పూర్తిగా తొలగించి, అక్కడ మొక్కలు నాటాలన్నారు. డ్వామా, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, డీపీఓ నాగరాజునాయుడు, డ్వామా పీడీ సలీమ్బాషా, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, హెచ్చెల్సీ ఎస్ఈ సుధాకర్రావు, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు. -
తిరుగుతూనే ఉన్నాం.. కనికరించండి
● పరిష్కార వేదికలో ప్రజల వేడుకోలు ● వివిధ సమస్యలపై 450 వినతులు అనంతపురం అర్బన్: ‘ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము.. కనికరించి మా సమస్యలు పరిష్కరించండి’ అంటూ అధికారులను ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్తో పాటు డీఆర్ఓ ఎ.మలోల, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి, రమేష్రెడ్డి, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 450 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నిర్ణీత వ్యవధిలో సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు వినతుల్లో కొన్ని... ● శింగనమల మండలం వెస్ట్ నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తగినన్ని తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, గ్రామంలో సర్వే నంబరు 152–1లో 2.98 ఎకరాల గ్రామ కంఠం భూమిని పాఠశాలకు కేటాయించాలని కృష్ణారెడ్డి, గ్రామస్తులు కోరారు. ● సర్వజనాస్పత్రిలో సర్జన్ డాక్టర్ నాగప్రసాద్ సుదీర్ఘకాలంగా విధులకు హాజరు కాకపోయినా వేతనం మాత్రం తీసుకుంటున్నారని జైభీమ్ రావ్ భారత్పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్పనాయక్ ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలన్నారు. ● అట్రాసిటీ కేసు బాధితులకు ఎక్స్గ్రేషియాకు సంబంధించి రిలీఫ్ ఫండ్ విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నెరమెట్ల ఎల్లన్న కోరాడు. ● ముసలివారమనే కనికరం కూడా లేకుండా ఇంటి నుంచి తమ కోడలు వెళ్లగొడుతోందని, తగిన చర్యలు తీసుకోవాలని రాప్తాడుకు చెందిన వృద్ధ దంపతులు నాగన్న, నాగమ్మ విజ్ఞప్తి చేశారు. ఇద్దరు కుమారులు సంతానం కాగా, ఇద్దరికీ పెళ్లయ్యిందన్నారు. రాప్తాడులో ఆటో స్టాండ్ పక్కనే రూ.8 కోట్ల విలువ చేసే రెండున్నర ఎకరాల పొలాన్ని ఇద్దరు కుమారులకు పంచి ఇవ్వడంతో పాటు మూడు సెంట్లలో మూడు ఇళ్లు కట్టించామన్నారు. ఇటీవల ఒక కుమారుడు చనిపోగా, అప్పటి నుంచి అతని భార్య తమను ఇంటి నుంచి వెళ్లగొడుతోందని వాపోయారు. తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. -
ప్రేమమూర్తి.. నిత్యస్ఫూర్తి
ప్రశాంతి నిలయం: దేహం నిండుగా సాయి తత్వాన్ని నింపుకుని ఇలవేల్పు సత్యసాయికి అశేష భక్తకోటి ‘సాయిరాం’ అంటూ శతసహస్ర వందనాలు తెలపగా.. వేడుకలకు హాజరైన అతిరథ మహారథులు సాయిభక్తుల సంకల్పాన్ని చూసి అచ్చెరువొందగా.. పుట్టపర్తి వేదికగా హిల్వ్యూ స్టేడియంలో జరిగిన సత్యసాయి శతవర్ష జయంతి వేడుకలు ఓ విశ్వవేడుకను తలపించాయి. ఇసుకవేస్తే రాలనంతగా స్టేడియం నిండిపోయింది. ఆదివారం ఉదయం నుంచే భక్తులు హిల్వ్యూస్టేడియానికి క్యూ కట్టారు. ఉదయం 9 గంటలకు సత్యసాయి స్వర్ణ రథోత్సవంతో శత వర్ష జయంతి వేడుకలు ప్రారంభించారు. ప్రశాంతి నిలయం నుంచి స్వర్ణరథంపై సత్యసాయే భౌతికంగా ఆశీనులయ్యారా అనిపించేలా ఏర్పాటు చేసిన చిత్రపటాన్ని కొలువుదీర్చి ఊరేగించారు. హిల్వ్యూ స్టేడియం వేదిక వరకు స్వర్ణ రథోత్సవం సాగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సత్యసాయి సేవా సంస్థల సభ్యులు, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్కు చెందిన ఆయా దేశాల సభ్యులు సత్యసాయి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ బాబా బోధనలను, మానవతా విలువలను, వారివారి ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనతో ముందు నడవగా.. వెనుక వేదపండితుల వేదఘోష.. ఆ వెనుక సత్యసాయి స్వర్ణ రథం కదిలింది. సత్యసాయి స్వర్ణ రథం మైదానంలోకి అడుగిడగానే భక్తులందరూ ఆధ్యాత్మిక పరవశంతో ‘ఓం సాయిరాం, జై సాయిరాం’ అంటూ నినదించారు. ప్రముఖ గాయకుడు మనో ‘కదిలింది.. కదిలింది..సాయి రథం.. స్వర్ణ రథం’ అంటూ పాడిన గీతానికి భక్తులు పరవశిస్తూ స్వర్ణ రథం వెంట నడిచారు. ప్రముఖ స్వరకారుడు శివమణి లయబద్ధంగా సృష్టించిన స్వరాల నడుమ రథోత్సవం ఓ దివ్య వేడుకను తలపించింది. సేవకు ప్రతిరూపం సత్యసాయి సత్యసాయి బాబా అహింస, ప్రేమ, నిస్వార్థ సేవలకు ప్రతిరూపమని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. ‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్’, ‘హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్’’ అన్న సత్యసాయి నినాదాలు కోట్లాది హృదయాలను సేవ వైపు కదిలించాయన్నారు. అంతకుముందు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు ప్రారంభోపన్యాసం చేశారు. సత్యసాయి కారణ జన్ముడని, పుట్టపర్తిలో పుట్టి తన జీవనయాత్రను ప్రారంభించి.. ఇక్కడే నిర్యాణం పొందారని, తన జననానికి, కర్మలను ఆచరించేందుకు పుట్టపర్తినే ఎంచుకోవడం ఈ ప్రాంత విశిష్టతను తెలియజేస్తుందన్నారు. త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ సత్యసాయి బాబా మానవాళి శ్రేయస్సు కోసం ఏడు దశాబ్దాల క్రితం స్థాపించిన సత్యసాయి ట్రస్ట్ నేడు ప్రపంచ వ్యాప్తంగా సేవా ఉద్యమంగా మారిందన్నారు. మానవతా విలువల వికాసానికి సత్యసాయి చేసిన సేవలు అపూర్వమన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సత్యసాయి అవతార పురుషుడని, మానవతా విలువలను, ఆధ్యాత్మిక చింతనను బోధిస్తూ నూతన అధ్యాయం లిఖించారని కొనియాడారు. ప్రజలకు ఆయన చేసిన సేవలు వెలకట్ట లేనివన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రజలలో దేవుడిని చూస్తూ.. మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించిన మహానుభావుడు సత్యసాయి అని అభివర్ణించారు. సత్యసాయి లక్ష్యాలను, ఆశయాలను మరింత విస్తరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేడుకలలో భాగంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల బాలవికాస్ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో మైమరిపించారు. ఘనంగా సత్యసాయి శత వర్ష జయంతి పుట్టపర్తిలో అంబరమంటిన సంబరం సత్యసాయి నామస్మరణతో పులకించిన భక్తజనం -
చిట్టీల పేరుతో మోసం
గుంతకల్లు టౌన్: స్థానిక ధర్మవరం రైల్వేగేట్ ప్రాంతంలో నివాసముంటున్న దిల్షాద్ అనే మహిళ చిట్టీల వ్యాపారంతో తమను మోసం చేసిందంటూ పలువురు బాధితులు ఆదివారం ఆమె ఇంటి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ బైఠాయించారు. ఇలాహి ఫొటో స్టూడియోతో పాటు కొన్నేళ్లుగా చిట్టీలను దిల్షాద్ నిర్వహిస్తోంది. ఆమె వద్ద అరుణమ్మ, మేఘన, పర్వీన్, అలీమా, షాహీన్, చాంద్బీ, రాబర్ట్, మంజుల, రాబియా, వెంకటరాముడు తదితరులు చిట్టీలు కట్టారు. గడువు ముగిసినా డబ్బు ఇవ్వకపోవడంతో బాధితులు నేరుగా కలిసి ఆరా తీశారు. ఆ సమయంలో దిల్షాద్ ఎదురు బెదిరింపులకు దిగింది. ఐపీ నోటీసులు పంపిస్తానని, తననేమీ చేయలేరంటూ హెచ్చరికలు జారీ చేసింది. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇతర అవసరాల కోసం చిట్టీలు వేసి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని బాధితులు ఆదివారం ఆమె ఇంటి ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించినా బాధితులు వినలేదు. దాదాపు ఐదారు గంటలపాటు అక్కడే భీష్మించారు. ఆందోళనకు ఎమ్మార్పీఎస్ నాయకురాలు విజయజ్యోతి, తదితరులు మద్దతు పలికారు. చిట్టీలు కట్టిన వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని ఎస్పీని కోరుతూ దిల్షాద్ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. నిర్వాహకురాలి ఇంటి ఎదుట బాధితుల ధర్నా -
జాబ్ కార్డులు గల్లంతు!
● జిల్లా వ్యాప్తంగా 26 వేల ఉపాధి జాబ్కార్డుల తొలగింపు ● తొలగింపులో రాజకీయ కుట్ర అనంతపురం టౌన్: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి పథకంలో పని చేస్తున్న శ్రామికుల జాబ్కార్డుల తొలగింపు పక్రియను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. శ్రామికులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా జాబ్కార్డుల తొలగింపుల పక్రియను చేపట్టింది. ఒక్క రాప్తాడు గ్రామంలోనే ఏకంగా 500కు పైగా జాబ్ కార్డులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం గమనార్హం. క్షేత్రస్థాయిలో ఉపాధి శ్రామికులతో చర్చించి వారి వివరణ తీసుకున్న తర్వాత జాబ్కార్డులను తొలగించాల్సి ఉండగా... ఇందుకు విరుద్ధంగా రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి ఇష్టానుసారంగా జాబ్ కార్డులను తొలగించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో 5.38 లక్షల మంది శ్రామికులు జిల్లా వ్యాప్తంగా 3.16లక్షల జాబ్కార్డులు, 5.38లక్షల మంది ఉపాధి శ్రామికులు ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉపాధి శామ్రికుల జాబ్కార్డుతో ఆధార్ అనుసంధానం, ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే అదనుగా ఉపాధి శ్రామికుల ప్రమేయం లేకుండానే జాబ్కార్డులను తొలగించేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 90 వేల మందిపై వేటు జిల్లా వ్యాప్తంగా ఉపాధిహామి పథకంలో పని చేస్తున్న శ్రామికుల కుటుంబాలకు సంబంధించి 26 వేల జాబ్కార్డులను తొలగించారు. ఈ లెక్కన దాదాపు 90వేల మందికి పైగా శ్రామికుల జాబ్కార్డులు మాయమయ్యాయి. కొన్ని నెలలుగా ఉపాధి పనులకు రావడం లేదని? జాబ్కార్డు ఉన్న స్థానికంగా అందుబాటులో లేరంటూ మరి కొందరి జాబ్కార్డులను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రాజకీయ కుట్రలతోనే చాల మంది జాబ్కార్డులను కోల్పోవాల్సి వచ్చిందంటూ ఉపాధి శ్రామికులు వాపోతున్నారు. -
ప్రతిభకు పట్టం..
స్నాతకోత్సవంలో భాగంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ పరిధిలోని వివిధ విభాగాల్లో ప్రతిభ చాటిన 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. బంగారు పతకాలు పొందిన వారిలో గుండా నవ్యసాయి, సాయి శ్రీరాం, బెల్లపురవ్వల శ్రేయ, చెరుకూరి సాయి కార్తీక్, సానియా, అనిరుధ్ బండారి, ప్రియాన్షు చెత్రి, సాయి శరణ్య, సాయి సుమిత్ర దోర, గుడ్ల నటరాజ్, ముని లింబు, ప్రశాంత్, పంచాంగం నరసింహమూర్తి, హరిశ్రీ నారాయణ, ఆరాధ్య, సాయి గణేష్, ఆశిష్దీప్ చెత్రి, రాజ్కుమార్ ఠాకూర్, విక్రమ్ కృష్ణ, రితురాజ్ ప్రదాన్ తదితరులు ఉన్నారు. మరో 14 మందికి పరిశోధన రంగంలో డాక్టరేట్లు, 521 మందికి డిగ్రీ పట్టాలను ముఖ్య అతిథి, భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా అందజేశారు. జాతీయ గీతాలాపన అనంతరం చాన్సలర్ చక్రవర్తి స్నాతకోత్సవం ముగించారు. కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యులు నాగానంద, డాక్టర్ మోహన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఉద్యోగులను బానిసలుగా చూడొద్దు
● హంస రాష్ట్ర అధ్యక్షుడు అరవపాల్ అనంతపురం మెడికల్: నిబంధనల పేరుతో ఉద్యోగులను బానిసలుగా చూస్తే ఊరుకునేది లేదని, ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హంస రాష్ట్ర అధ్యక్షుడు అరవపాల్ డిమాండ్ చేశారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో హంస అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా అరవపాల్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కొందరు ఉద్యోగులు ఎఫ్ఆర్ఎస్ వేయాలన్న ఆత్రుతతో అధిక ఒత్తిళ్లు, తదితర కారణాలతో కొందరు ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారని చెప్పారు. ఎఫ్ఆర్ఎస్ విధానంపై ప్రభుత్వం పునరాలోచించి, వైద్య శాఖ సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. రీ డిప్లాయ్మెంట్ పేరుతో ఉద్యోగులను బానిసలకంటే హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో హంస జిల్లా అధ్యక్షుడు షఫీ, కార్యదర్శి సంగ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పామన్న, కోశాధికారి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు అరుణకుమారి, కార్యనిర్వహణ కార్యదర్శి డీ మహేంద్ర, నాయకులు భక్తర్ వలీఖాన్, ఎల్లప్ప, సుదర్శన్రెడ్డి, మంజుల, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయికి తొమ్మిది నమూనాల ఎంపిక
అనంతపురం సిటీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే పుస్తక పరిజ్ఞానం ఒక్కటే సరిపోదని సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ అన్నారు. పోటీని తట్టుకోవాలన్నా.. ఏ రంగంలోనైనా రాణించాలన్నా తొలుత నైపుణ్యం అవసరమన్నారు. బుక్కరాయసముద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో శనివారం నిర్వహించిన వ్యక్తిగత నైపుణ్య పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 800 మంది విద్యార్థులు హాజరై 250కు పైగా ప్రాజక్ట్ నమూనాలు ప్రదర్శించారు. జీసీడీఓ కవిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏపీసీ శైలజ, డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, జిల్లా ఒకేషనల్ అధికారి వెంకటరమణ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం తొమ్మిది నమూనాలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అనంతరం విద్యార్థులను అభినందిస్తూ, వారికి మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందించారు. -
సత్యసాయి మార్గం అనుసరణీయం
ప్రశాంతి నిలయం: సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవ సంబరం అంబరమంటింది. శనివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గౌరవ అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. తొలుత సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థుల బ్రాస్బ్యాండ్ నడుమ అతిథులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్, మేనేజ్మెంట్ కౌన్సిల్ సభ్యులు ప్రత్యేక వేదిక వద్దకు చేరుకున్నారు. యూనివర్సిటీ చాన్సలర్ చక్రవర్తి స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాఘవేంద్ర ప్రసాద్ ప్రారంభోపన్యాసం చేశారు. సత్యసాయి ఆశయాలు, బోధనలను అనుసరించి మానవతా విలువలు, శాస్త్రసాంకేతికతతో కూడిన ఆదర్శ విద్యను ఆధునిక గురుకుల విద్యావిధానం ద్వారా సత్యసాయి విద్యాసంస్థల్లో అందిస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామన్నారు. సమసమాజ స్థాపన మీ వల్లే సాధ్యం! ‘సత్యసాయి విద్యాసంస్థలు మానవతా విలువలు, ఆధ్యాత్మికతతో కూడిన విద్యనందించడం గొప్ప విషయం. స్నాతకోత్సవంలో సత్యసాయి విద్యార్థులను చూస్తుంటే సమసమాజ స్థాపన మీ వల్ల సాధ్యమవుతుందన్న భావన కలుగుతోంది’ అని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. అందరూ సమానమని చెప్పే సత్యసాయి బోధనలను దేశ విదేశాలకు తీసుకెళ్లడానికి ఇక్కడి విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎదగాలన్నారు. శాస్త్రసాంకేతికత ఆధారంగా నూతన అవిష్కరణలవైపు దృష్టి సారించాలన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. వైభవంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపరాష్ట్రపతి 20 మందికి బంగారు పతకాలు, 14 మందికి డాక్టరేట్లు, 521 మందికి డిగ్రీల ప్రదానం ప్రశాంతి నిలయం: ‘అందరినీ ప్రేమించు...అందరినీ సేవించు’ అని చెప్పడంతో పాటు పాటించిన సత్యసాయి మార్గం అందరికీ అనుసరణీయమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సత్యసాయి శతజయంతి వేడుకల్లో శనివారం ఆమె పాల్గొన్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. నేరుగా ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరానికి చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మాతృ వందనం నమోదుకు కష్టాలు
తాడిపత్రి రూరల్: జిల్లాలో ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. సర్వర్తో పాటు సెల్ఫోన్లలో సాంకేతిక కారణాలతో గర్భిణులు, నవజాతి శిశువుల వివరాల నమోదు అరకొరగానే సాగుతోంది. జిల్లాలో నేటి వరకూ కేవలం 4,725 మంది లబ్ధిదారులను మాత్రమే ఎన్రోల్మెంట్ చేశారు. నమోదుకు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో అంగన్వాడీ టీచర్లు తల పట్టుకుంటున్నారు. మొదటికాన్పుకు రూ.5 వేలు... మాతృవందనం పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన మహిళలు గర్భం దాల్చిన సమయంలో, జన్మనిచ్చిన తరువాత పోషకాహారం, మందుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోంది. మొదటి కాన్పు అయితే వారి బ్యాంకు ఖాతాల్లో రూ.5 వేలు జమచేస్తారు. అందులో భాగంగానే గర్భిణిగా నమోదు చేసుకున్న సమయంలో రూ.1000, బిడ్ట జన్మించినప్పుడు రూ.2 వేలు, బిడ్డకు టీకాలు వేయించే సమయంలో మరో రూ.2 వేలు అందిస్తారు. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే మరో రూ.6 వేలు జమచేస్తారు. అరకొరగానే నమోదు మాతృ వందనం పథకం అమలు కోసం ఐసీడీఎస్ ప్రాజెక్టులోని కొందరు సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. వారు మరికొందరు అంగన్వాడీ టీచర్లకు కొంత మేరకు తర్ఫీదు ఇచ్చారు. వారి ద్వారా అంగన్వాడీ సెంటర్లకు చెందిన టీచర్లు తమ వద్ద ఉన్న సెల్ఫోన్లల్లో యాప్లు వేసుకొని మాతృ వందనం కింద లబ్ధిదారుల వివరాలను నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లతో పాటు తమ వద్ద ఉన్న సెల్ఫోన్ల ద్వారా సైతం వివరాల నమోదు కోసం ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు. సర్వర్తో పాటు సెల్ఫోన్లల్లోని సాంకేతిక కారణాలతో అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీ సెంటర్లల్లోని రొటిన్ కార్యక్రమాలను పక్కనబెట్టి సెల్ఫోన్లతో కుస్తీ పడుతున్నా గర్భిణులు, నవజాతి శిశువుల నమోదు అరకొరగానే జరుగుతోంది. అంగన్వాడీలపై ఒత్తిడి మాతృ వందనం పథకం నమోదులో జరుగుతున్న జాప్యంపై ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక అంగన్వాడీ టీచర్లను గ్రూపులుగా చేసి ఒక సెంటర్కు రప్పించి వారిచేత సూపర్వైజర్ల ఆధ్వర్యంలో నమోదు పక్రియ చేస్తున్నారు. సెల్ఫోన్ల స్థానంలో ల్యాప్ట్యాప్ల ద్వారా గర్భిణులు, నవజాతి శిశువుల నమోదు ప్రక్రియ చేయిస్తున్నారు. లబ్ధిదారుల ఎదురుచూపు జిల్లాలో పెద్ద సంఖ్యలో గర్భిణులు మాతృ వందనం పథకం కింద అందే ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నుంచి వైద్యశాఖ నుంచి సమగ్ర శిశు సంక్షేమశాఖకు బదలాయించింది. ఇప్పటికే పలు యాప్లతో పనిభారం పెరిగి పలు ఇబ్బందులు పడుతున్నామని, నూతన బాధ్యతలు తలకు మించిన భారమయ్యాయని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. సక్రమంగా పనిచేయని సెల్ఫోన్లతో ఉన్న యాప్లకు తోడు మాతృ వందన యోజన పథకం కింద అదనంగా వచ్చిన యాప్తో ఎలా వివరాలు నమోదు చేయాలని అంగన్వాడీ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. పాత సెల్ఫోన్ల స్థానంలో కొత్తవాటిని పంపిణీ చేయాలని ఈ ఏడాది ఆగస్టులో అంగన్వాడీ టీచర్లు మూకుమ్మడిగా సెల్ఫోన్లను సీడీపీఓలకు అందజేశారు. కొత్త సెల్ఫోన్లను త్వరలో ఇస్తామని బూటకపు హామీలు ఇచ్చి తమపై ఒత్తిడి తెచ్చి మరి ఇచ్చిన సెల్ఫోన్లను తిరిగి తీసుకునేటట్టు చేశారని, నాలుగు నెలలు కావస్తున్నా కొత్తసెల్ఫోన్లను ఇవ్వకుండా డొక్కు సెల్ఫోన్లతో పనిచేయాలని ఒత్తిడులు తెస్తున్నారని వాపోతున్నారు. తాడిపత్రి ఫస్ట్ .. కణేకల్లు లాస్ట్ జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో పీఎంఎంవీవై పథకం కింద శనివారం వరకు మొత్తం 4,725 మంది లబ్ధిదారుల వివరాలు మాత్రమే నమోదు చేశారు. అందులో తాడిపత్రి ప్రాజెక్టు 1855తో మొదటిగా ఉండగా కణేకల్లు ప్రాజెక్టు కేవలం 110 లబ్ధిదారుల ఎన్రోమెంట్తో చివరి స్థానంలో ఉంది. సక్రమంగా పనిచేయని సెల్ఫోన్లు ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీ టీచర్లు జిల్లాలో నేటికీ కేవలం 4,725 మంది మాత్రమే నమోదు ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు -
వెంటాడుతున్న ‘పాపం’పేట అక్రమాలు
● వీఆర్ఓ రఘుయాదవ్కు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు ● కఠినమైన చర్యలు తప్పవా? రాప్తాడు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అనంతపురం శివారులోని పాపంపేట భూ కబ్జా వ్యవహారంలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తప్పుడు పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసి అక్రమార్కులకు అండగా నిలబడడాన్ని కలెక్టర్ ఆనంద్ సీరియస్గా పరిగణించారు. ఈ క్రమంలో ఇప్పటికే మండల సర్వేయర్ రఘునాథ్, పాపంపేట వీఆర్ఓ రఘుయాదవ్ పాత్రపై విచారణ పూర్తయింది. మరోవైపు తన సంతకాన్ని రాచూరి వెంకటకిరణ్ అనే వ్యక్తి ఫోర్జరీ చేశారని వీఆర్ఓ వివరణ ఇచ్చారు. దీంతో ఆర్డీఓ కేశవనాయుడు అనంతపురం రూరల్ పోలీస్స్టేషన్లో రాచూరి వెంకటకిరణ్పై ఫిర్యాదు చేయగా.. క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆర్డీఓ నివేదిక ఆధారంగా రెండు రోజుల కిందట కలెక్టర్ ఆనంద్.. వీఆర్ఓ రఘుయాదవ్కు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు జారీ చేశారు. గతంలో చాలా సందర్భాల్లో వచ్చిన ఆరోపణలపై సస్పెన్షన్ వేటు వేసేవారు. కేవలం సస్పెన్షన్లతో భయం ఉండదని భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వీఆర్ఓ రఘుయాదవ్కు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు జారీ చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే వీఆర్ఓ మెడకు ఉచ్చు పూర్తిగా బిగుస్తున్నట్లు అర్థమవుతోంది. ఎలా వెలుగులోకి వచ్చిందంటే..? కొందరు ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరడంతో మండల సర్వేయర్ రఘునాథ్, వీఆర్ఓ రఘుయాదవ్లు జారీ చేసిన తప్పుడు పొజిషన్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగు చూసింది. వివిధ సర్వే నంబర్లలో 176.82 ఎకరాల్లో రాచూరి కుటుంబ సభ్యులు, వారిద్వారా జీపీఏ చేయించుకున్న వారి ఆధీనంలో ఉన్నట్లు మండల సర్వేయర్ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆరు సర్వే నంబర్లలో 29.96 ఎకరాల్లో రాచూరి వెంకటకిరణ్ అనుభవంలో ఉన్నాడంటూ 2024 ఆగస్టు 13న అప్పటి పాపంపేట వీఆర్ఓ రఘుయాదవ్ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. వీరిద్దరూ ఇచ్చిన నివేదికల ఆధారంగానే అక్రమార్కులు మ్యుటేషన్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. బయటపడ్డాక.. బుకాయింపు పొజిషన్ల సర్టిఫికెట్ల జారీ వ్యవహరం వెలుగులోకి వచ్చిన తర్వాత తన సంతకాలు ఫోర్జరీ చేశారని వీఆర్ఓ బుకాయిస్తున్నారు. దాదాపు ఏడాది కిందట సంతకాలు చేసినట్లు తెలిసినా.. ఇన్ని రోజులు మౌనంగా ఉండడానికి కారణం, కనీసం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన తప్పించుకునే అవకాశం లేదని చార్జెస్ నోటీసుకు ఏది జవాబు ఇచ్చినా ఇరుక్కోవడం తథ్యమని, కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా మసలుకునే విధంగా గుణపాఠం చెప్పాలని, తప్పుడు నివేదికలు ఇచ్చిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని పాపంపేట భూముల బాధితులు కోరుతున్నారు. కాగా మండల సర్వేయర్ రఘునాథ్కు కూడా చార్జెస్ నోటీసు జారీ చేస్తారని తెలిసింది. -
సుబ్బరాయసాగర్ షట్టర్లు ఎత్తేందుకు నిపుణుల రాక
పుట్లూరు: మండలంలోని సుబ్బరాయసాగర్ వద్ద షట్టర్లు పైకి లేవకపోవడంతో నాలుగు రోజులుగా హెచ్చెల్సీ అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు. సాగర్ నుంచి చెరువులకు నీటిని సరఫరా చేయడానికి షట్టర్లు ఎత్తిన సమయంలో పూర్తిస్థాయిలో లేవకపోవడంతో సమస్య ఏర్పడింది. సమస్య పరిష్కారం కోసం శివమొగ్గకు చెందిన ఇంజినీరింగ్ నిపుణులను శనివారం రప్పించారు. వారు సమస్యను పరిశీలించిన తర్వాత షట్టర్లను పైకి లేపడానికి అవసరమైన పరికరాలను తాడిపత్రి ఆటోనగర్లో సిద్ధం చేయించారు. వాటి ద్వారా షట్టర్లను ఎత్తడానికి ప్రయత్నాలు చేపడుతున్నట్లు హెచ్చెల్సీ అధికారులు తెలిపారు. పీఏబీఆర్లో ఆగిన జల విద్యుదుత్పత్తి కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ జలాశయం వద్ద ఏర్పాటైన ఏపీ జెన్ కో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఏపీ జెన్కో ఏడీ కేశవయ్య తెలిపారు. విద్యుత్ తయారు చేసే టర్బైన్లో సమస్య తలెత్తి అందులోకి నీరు వస్తోందని పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారులు 450–750 క్యూసెక్కుల లోపు నీటిని విడుదల చేయడంతో ఒక టర్బైన్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వచ్చామన్నారు. రెండున్నర నెలలో 16.59 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందన్నారు. సాంకేతిక నిపుణులకు సమాచారమిచ్చామని, వారు వచ్చి టర్బైన్కు మరమ్మతులు చేపడితే తిరిగి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. -
పిల్లలు చిన్న పదాలు కూడా రాయలేకపోతున్నారు
● డీఈఓ ప్రసాద్ బాబు ఆవేదన అనంతపురం సిటీ: ‘ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు చిన్న పదాలు కూడా రాయలేకపోతున్నారు. చదవలేకపోతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. విధి నిర్వహణలో ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పని చేసి పిల్లలందరూ చదివేలా.. రాసేలా శిక్షణ ఇవ్వండి. అంతకంటే ముందు పిల్లల్లో క్రమశిక్షణ, చిన్న పెద్ద గౌరవం లేకుండాపోతోంది. ఉపాధ్యాయులపై తిరగబడే పరిస్థితి వస్తోంది. వారికి నైతిక విలువల గురించి నేర్పించండి ’ అని జిల్లా విద్యాశాఖాధికారి కడప ప్రసాద్బాబు ఉపాధ్యాయులకు సూచించారు. అనంతపురం బుడ్డప్పనగర్లోని రాజేంద్రప్రసాద్ మున్సిపల్ స్కూల్లో శనివారం అర్బన్, రూరల్ పరిధిలోని 11 కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. కాంప్లెక్స్ సమావేశాలను డీఈఓ పరిశీలించారు. పిల్లల్లో నేరప్రవృత్తి పెరిగిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గారభంగా కాకుండా క్రమశిక్షణ, విలువలతో పెంచాలని సూచించారు. ఏపీఓ మంజునాథ, పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ఆర్యూపీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పది ఫెయిల్ అయిన వారికి మరో అవకాశం అనంతపురం సిటీ: గతంలో పదో తరగతి ఫెయిల్ అయి తిరిగి పరీక్ష రాసే అవకాశం లేక అర్ధంతరంగా చదువు ఆపేసిన విద్యార్థుల కోసం సార్వత్రిక విద్యాపీఠం మంచి అవకాశం కల్పించినట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అలాంటి విద్యార్థులు సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఫెయిలైన సబ్జెక్టులు రాసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తాము చదివిన పాఠశాలలోగాని, ఆంధ్రప్రదేశ్ విద్యాపీఠం వెబ్సైట్ www.apopenschool.ap.gov.in లో నేరుగా జిల్లా పేరు, స్కూల్ పేరు సెలక్ట్ చేసి అడ్మిషన్ పొందవచ్చన్నారు. అందుకు అడ్మిషన్ ఫీజు కింద రూ.300 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. రసవత్తరంగా బాస్కెట్బాల్ పోటీలు నూజివీడు: నూజివీడులో నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్ బాలుర, బాలికల అండర్–17 రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 13 బాలుర జట్లు, 13 బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. బాలికల విభాగంలో వైజాగ్ జట్టు అనంతపురంపై గెలుపొందింది. బాలుర విభాగంలో అనంతపురం జట్టు పశ్చిమగోదావరిపై 32–8తో విజయం సాధించింది. అలాగే మరోమ్యాచ్లో అనంతపురం జట్టు విజయనగరంపై 29–0 గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్స్లో గుంటూరు జట్టు అనంతపురంపై 35–17 తేడాతో విజయం సాధించింది. కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, వైజాగ్ జట్లు సెమీస్కు చేరాయి. ఇళ్లు పరిశీలించాకే విద్యుత్ కనెక్షన్ అనంతపురం టౌన్: విద్యుత్ కొత్త కనెక్షన్ల కోసం కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకునే వినియోగదారుల ఇళ్లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి విద్యుత్ వినియోగం ఏ మేరకు ఉంటుందో అంచనా వేసి విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని విద్యుత్శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ ఒక ప్రకటనలో సిబ్బందికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా చాల మంది విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టకుండా తక్కువ కాంట్రాక్టు లోడ్తో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా చేస్తే భవిష్యత్లో వినియోగదారులు మరో మారు కాంట్రాక్టు లోడ్కు అదనంగా చెల్లించే పరిస్థితి వస్తుందన్నారు. కొత్త విద్యుత్ కనెక్షన్కు దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధించిన లైన్మెన్లు వినియోగదారుని ఇంటిని పరిశీలించి డబుల్, సింగల్ బెడ్రూం, డూప్లెక్స్ ఇళ్లా అని పరిశీలించి ఏమేర విద్యుత్ వినియోగం ఉంటుందో అంచనా వేసి ఎన్ని కిలోవాట్లు విద్యుత్ అవసరం ఉంటుందో ఆమేరకు డిపాజిట్ కట్టించాలన్నారు. ఇష్టారాజ్యంగా విద్యుత్ కనెక్షన్లు తక్కువ కాంట్రాక్టు లోడ్తో మంజూరు చేస్తే విద్యుత్ సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయంపై విద్యుత్ ఏఈలు సిబ్బందికి అవగాహన కల్పించాలని కోరారు. 29న క్రికెట్ సంఘం ఎన్నికలు అనంతపురం కార్పొరేషన్: అనంతపురం క్రికెట్ సంఘం ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ఆ సంఘం కార్యదర్శి భీమలింగారెడ్డి ఓ ప్రకటనలో విడుదల చేశారు. క్రికెట్ సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారిలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ నెల 24న నామినేషన్ల స్వీకరణ, 25న నామినేషన్ల స్క్రూట్నీ, అదే రోజు సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల జాబితా విడుదల, 26న ఉదయం 10 గంటల నుంచి 4 గంటలలోపు విత్ డ్రా, 26న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల బరిలో దిగే వారి జాబితా విడుదల, 29న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున మధ్యాహ్నం 1 గంటకు ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. -
ఆలరించిన ‘సాయి కథ’
ప్రశాంతి నిలయం: సత్యసాయి బాల్యం...అవతార వైభవం..సేవా, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వివరిస్తూ విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను ఎంతగానో అలరించింది. సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం సత్యసాయి హయ్యర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు, సిబ్బంది ‘సాయి కథ’ పేరుతో కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ కొందరు గీతాలు ఆలపించగా..మరికొందరు అత్యాధునిక సంగీత వాయిద్యాలతో భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించారు. అరటికి గిట్టుబాటు ధర కల్పించాలి రాప్తాడు: అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని హార్టికల్చర్ అధికారులకు జేసీ శివ్ నారాయణ శర్మ సూచించారు. శనివారం గొందిరెడ్డిపల్లిలో రైతు మిడతల శీనయ్య అరటికి గిట్టుబాటు ధర లేదని 3 ఎకరాల్లో పంట తొలగించాడు. విషయం తెలుసుకున్న జేసీ శివ్ నారాయణ శర్మ, హర్టికల్చర్ అధికారులతో కలిసి గొందిరెడ్డిపల్లిలో తొలగించిన అరటి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అరటి రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధరలు వచ్చేలా చూడాలని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి నివేదిక పంపి గిట్టుబాటు ధరతో పాటు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేశారు. కార్యక్రమంలో డీడీ ఉమాదేవి, తహసీల్దార్ విజయ కుమారి పాల్గొన్నారు. -
సెల్ఫోన్లు పనిచేయడం లేదు
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకంపై అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వలేదు. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు యాప్కు సపోర్టు చేయడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుస్తీ పడితే ఒక లబ్ధిదారురాలి వివరాలు ఎన్రోల్మెంట్ చేయడం కష్టంగా ఉంది. సూపర్వైజర్లు మాత్రం టీచర్లపై వత్తిడి తెస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. యాప్పై వెంటనే టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి. – రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి,అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ -
నేడు రాప్తాడుకు జగన్
● తోపుదుర్తి రాజశేఖరరెడ్డి కుమార్తె వివాహానికి హాజరుకానున్న మాజీ సీఎం ● లింగనపల్లి రోడ్డు వద్ద హె లిప్యాడ్● ఏర్పాట్లను పర్యవేక్షించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి రాప్తాడు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం రాప్తాడుకు రానున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి, తోపుదుర్తి నయనతారెడ్డి దంపతుల కుమార్తె మోక్షిత విష్ణుప్రియారెడ్డి, తేజేష్ రెడ్డిల వివాహం రాప్తాడులో జరగనుంది. ఇందుకోసం 44వ జాతీయ రహదారి హెచ్పీ పెట్రోలు బంక్ ఎదురుగా కల్యాణ వేదికను అద్భుతంగా సిద్ధం చేశారు. ఈ వివాహానికి వైఎస్ జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. బెంగళూరులో ఉదయం 10 గంటలకు యలహంక నుంచి బయల్దేరి 10.20 గంటలకు జక్కూరు ఏరోడ్రోమ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉదయం 11.30 గంటలకు రాప్తాడులోని లింగనపల్లి రోడ్డు హెలిప్యాడ్కు చేరుకుంటారు. 11.40 గంటలకు రోడ్డు మార్గంలో బయల్దేరి 11.55కు కల్యాణమండపం చేరుకుంటారు. 12.15 గంటల వరకు పెళ్లి వేడుకల్లోనే ఉంటారు. మధ్యాహ్నం 12.30కు రాప్తాడు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 1.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటారు. వివాహానికి హాజరయ్యే జగన్ను చూసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. అందుకు తగిన సౌకర్యాలు, హెలిప్యాడ్ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పరిశీలించారు. -
‘మాక్ అసెంబ్లీ’ ఎంపికలో గందరగోళం
తాడిపత్రిటౌన్: రాష్ట్ర విద్యాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మాక్ అసెంబ్లీ’ విద్యార్థుల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్కో నియోజకవర్గంలోని ఆయా ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థుల్లో నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేసి ఈనెల 26న విజయవాడలో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీకి పంపనున్నారు. అయితే తాడిపత్రి నియోజకవర్గంలో విద్యార్థుల ఎంపికలో గందరగోళం చోటు చేసుకుంది. మూడు రోజలు క్రితం మాక్ అసెంబ్లీకి తాడిపత్రి పట్టణానికి చెందిన ప్రకాశం హైస్కూల్లో 9వతరగతి చదువుతున్న నాగమల్లికార్జునను అధికారులు ఎంపిక చేశారు. అయితే శనివారం ఉన్నఫలంగా యాడికి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అనిల్కుమార్ను మాక్ అసెంబ్లీకి పంపుతున్నట్లు అధికారులు ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన నాగమల్లికార్జునను కాదని తృతీయస్థానంలో నిలిచిన అనిల్కుమార్ను ఎలా ఎంపిక చేస్తారని నాగమల్లికార్జున తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎంఈఓ నాగరాజును ‘సాక్షి’ వివరణ కోరగా విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. కణేకల్లు: మాక్ అసెంబ్లీ ఎంపికకు రాయదుర్గం పట్టణంలో వ్యాసరచన, వకృత్వపోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో యర్రగుంట జెడ్పీ హైస్కూల్కు చెందిన హేమలత మొదటి బహుమతి సాధించింది. ఈమెను నవంబర్ 26న అమరావతిలో జరగనున్న రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీకి ఎంపిక చేశారు. ఆదివారం అమరావతికి హేమలత బయలుదేరాల్సిన సమయంలో విద్యాశాఖ అధికారులు పేరును తారు మారు చేశారు. హేమలతకు బదులు రెండోస్థానంలో ఉన్న లింగదాళ్కు చెందిన గంగోత్రిని ఎంపిక చేశారు. మాక్ అసెంబ్లీకి రెడీ కావాలని ఆ విద్యార్థికి కబురు పెట్టారు. దీంతో పోటీల్లో టాపర్గా నిలిచిన హేమలత కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారడంతో విద్యాశాఖ అధికారులు కంగుతిన్నారు. నాగ మల్లికార్జున హేమలత -
శత ఉత్సవం.. భక్తజన సంబరం
● నేడు సత్యసాయి శత జయంత్యుత్సవం ● ఏర్పాట్లు పూర్తి చేసిన సత్యసాయి ట్రస్ట్ ● ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి ప్రశాంతి నిలయం: భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న ప్రేమమూర్తి భగవాన్ సత్యసాయి శతజయంతి వచ్చేసింది. ఆదివారం హిల్వ్యూ స్టేడియంలో వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని ప్రత్యేక ఫల, పుష్ప దళాలతో తీర్చిదిద్దారు. ప్రశాంతి నిలయం విద్యుత్ కాంతుల నడుమ వెలిగిపోతోంది. వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరై భక్తులనుద్దేశించి ప్రసంగించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి కార్యక్రమంలో పాల్గొననున్నారు. వేడుకల నిర్వహణ ఇలా... ప్రపంచ ఆధ్యాత్మిక గురు సత్యసాయి శతజయంతి వేడుకలు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్నాయి. హిల్వ్యూ స్టేడియంలో సత్యసాయి స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటలకు విద్యార్థుల వేదపఠనం, 9.40 గంటలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు ప్రారంభోపన్యాసం చేస్తారు. 9.50 గంటలకు తమిళనాడు బాలవికాస్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన, 9.55కు కర్ణాటక బాలవికాస్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన, 10 గంటలకు రాష్ట్ర మంత్రి నారాలోకేష్ ప్రసంగం, 10.05 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం, 10.15కు ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం, 10.25గంటలకు ముఖ్య అతిథి భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రసంగం, సత్యసాయి జయంతి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు సత్యసాయి జోలోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ది ఎటర్నల్ ‘సింపోనియం ఆఫ్ సెల్ఫ్లెస్ లవ్’ పేరుతో కచేరీ ఉంటుంది. -
అధికారుల తప్పు.. విద్యార్థులకు శిక్ష
పుట్లూరు: ఆర్టీసీ అధికారులు విద్యార్థుల కోసం సమయానికి బస్సును నడపకపోవడంతో శనివారం కోమటికుంట్ల, గరుగుచింతపల్లి, గోపురాజుపల్లి గ్రామాల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రోజూ ఉదయం, సాయంత్రం విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. అయితే శనివారం మండలంలోని అన్ని పాఠశాలలకు కాంప్లెక్స్ సమావేశాలను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో సాయంత్రం పాఠశాలల్లో ఉండాల్సిన విద్యార్థులను మధ్యాహ్నమే ఇళ్లకు పంపించారు. గ్రామాలకు వెళ్లడానికి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ గరుగుచింతలపల్లి బస్సు రాకపోవడంతో విద్యార్థులు కాలినడకన ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు చేరేలా చర్యలు తీసుకోవాల్సిన ఉపాధ్యాయులు ఈ విషయంపై ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చామనిచెప్పి చేతులు దులుపుకుంటున్నారు. మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు గుమ్మఘట్ట: ఓ మహిళ ప్రాణాలను పోలీసులు కాపాడిన ఘటన మండలంలోని బైరవానితిప్ప ప్రాజెక్టులో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు .. రాయదుర్గం పట్టణానికి చెందిన లక్ష్మీకి ప్రభుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. అయితే తాగుడుకు బానిసైన భర్త రోజూ భార్యతో గొడవ పడుతుండటంతో పోరు పడలేక అక్కడ నుంచి రాయదుర్గం పట్టణంలోని తల్లి అజ్జమ్మ వద్దకు చేరుకుని తన బాధ చెప్పుకుంది. భర్త దగ్గరే ఉండాలని తల్లి నచ్చచెప్పింది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విరక్తి చెందిన లక్ష్మీ బీటీప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బీటీపీకి చేరుకున్న ఆత్మహత్యకు యత్నిస్తుండగా గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న ఎస్ఐ ఈశ్వరయ్య ఆమెను రక్షించి తల్లి అజ్జమ్మకు అప్పగించారు. మహిళ ప్రాణం కాపాడడంతో ఎస్ఐ ఈశ్వరయ్య, పోలీస్ సిబ్బందిని రూరల్ సీఐ వెంకటరమణ అభినందించారు. -
గడ్డివామికి నిప్పు
యాడికి: మండలంలోని దైవాలమడుగులో గురువారం రాత్రి దుండగులు నిప్పు పెట్టడంతో గడ్డివామి పూర్తిగా కాలిపోయింది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రైతు పుల్లారెడ్డి రూ.లక్షతో కొనుగోలు చేసిన జొన్నసొప్ప, వరిగడ్డిని గ్రామ సమీపంలోని తన కల్లంలో వామిగా వేశాడు. అక్కడే ఉన్న రేకుల షెడ్డులో పత్తి బస్తాలను నిల్వ చేశాడు. గురువారం రాత్రి ఎనుములను కల్లంలో కట్టేసి ఇంటికెళ్లి నిద్రించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గడ్డి వామికి నిప్పంటుకున్నట్లు సమాచారం అందుకున్న పుల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సాయంతో ఎనుములను తప్పించి పక్కకు తోలారు. మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాగా, పెట్రోల్ వెదజల్లి నిప్పు పెట్టినట్లుగా అక్కడ ఆనవాళ్లు లభ్యమయ్యాయి. గడ్డి వామితో పాటు షెడ్డులోని పత్తి బస్తాలపై దుండగులు పెట్రోల్ వెదజల్లారు. గడ్డివామికి నిప్పు పెట్టి ఉడాయించారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, విషయం తెలుసుకున్న లక్షుంపల్లి సర్పంచ్ పద్మనాభరెడ్డి, గ్రామ రైతులు శుక్రవారం ఉదయం క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఘటనపై బాధిత రైతుతో ఆరా తీశారు. -
మాజీ మంత్రి శైలజనాథ్కు మాతృ వియోగం
అనంతపురం : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ తల్లి సాకే గంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు పలువురు అనంతపురంలోని నాయక్నగర్లో ఉన్న శైలజనాథ్ ఇంటికి చేరుకుని గంగమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు. రూ.9 లక్షల విలువైన ఎరువుల సీజ్ ఉరవకొండ: పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను కళ్యాణదుర్గం ఏడీఏ యల్లప్ప, ఉరవకొండ, విడపనకల్లు మండలాల వ్యవసాయాధికారులు రామకృష్ణుడు, పెన్నయ్య.. శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సాయి ఆగ్రో ఏజెన్సీలో రూ.5,93,900, లక్ష్మీవెంకటేశ్వర ఏజెన్సీలో రూ.2,80,300, మహలక్ష్మీ ఫర్టిలైజర్స్లో రూ. 1,12,810 విలువైన అనుమతుల్లేని ఎరువుల విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ మూడు షాపుల్లోనూ మొత్తం రూ.9,87,900 విలువ చేసే ఎరువులను సీజ్ చేశారు. విడపనకల్లు: మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాపులో శుక్రవారం కళ్యాణదుర్గం ఏడీఏ యల్లప్ప, స్థానిక వ్యవసాయాధికారి పెన్నయ్య తనిఖీలు చేపట్టారు. రికార్డులకు నిల్వలకు వ్యత్యాసాలను గుర్తించి 32.9 టన్నుల ఆర్గానిక్ పటాస్ ఎరువులను సీజ్ చేశారు. -
ఆత్మవిశ్వాసం ఆయుధమై
ప్రోత్సాహం తోడై.. అనంతపురం కార్పొరేషన్: తండ్రి ప్రోత్సాహానికి తోడు ఆత్మవిశ్వాసం జతకట్టడంతో క్రికెట్లో తనకు ఎదురు లేదని నిరూపిస్తున్నాడు రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామానికి చెందిన మచ్చా రామలింగారెడ్డి, లక్ష్మి దంపతుల కుమారుడు మచ్చా దత్తారెడ్డి. క్రీజులో కాసేపు నిలదొక్కుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించేలా బంతిని అలవోకగా బౌండరీలు దాటిస్తూ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో పాటు వికెట్ కీపర్గానూ ప్రతిభ కనబరుస్తున్నాడు. ఆంధ్ర క్రికెట్ అకాడమీలో సభ్యుడిగా ఉన్న సమయంలో భారత మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ వద్ద కీపింగ్లో మెలకువలు అభ్యసించాడు. ఈ సీజన్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 41 స్టంపింగ్లు, క్యాచ్లు పట్టి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అండర్ –12, 14, 16, 19, 23 ఇలా అన్ని ఫార్మాట్లలో అంచనాలకు మించి రాణించి, 20 ఏళ్లకే ఆంధ్ర రంజీ స్క్వాడ్లో చోటు దక్కించుకున్నాడు. అతనిలోని క్రీడాకారుడికి పట్టం కడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇటీవల అండర్ –23 ఏపీ జట్టుకు ఎంపిక చేసింది. జిల్లా సీనియర్ క్రికెటర్లలో ఒకరైన తన తండ్రి మచ్చా రామలింగారెడ్డి స్ఫూర్తి,తోనే తాను కూడా క్రికెట్లోకి అడుగు పెట్టానని, తనకు అన్ని విధాలుగా వెన్నంటి ఉంటూ ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అందిస్తున్న ప్రోత్సాహాన్ని మరువలేనని మచ్చా దత్తారెడ్డి అంటున్నాడు. భారత జట్టులో చోటు దక్కించుకోవడమే తన అంతిమ లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు పేర్కొంటున్నాడు. అధిగమించిన మైలు రాళ్లు ● బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగిన అండర్ –19, 23 క్రికెట్ మ్యాచ్ల్లో మచ్చా దత్తారెడ్డి 1,500 పరుగులు సాధించాడు. వికెట్కీపర్గా, బ్యాటర్గా బీసీసీఐ టోర్నీలో ఈ ఘనత సాధించిన వారిలో దత్తారెడ్డి ప్రథముడు కావడం గమనార్హం. ● ఆంధ్ర ప్రీమియర్ లీగ్– 4 లో విజేతగా నిలిచిన తుంగభద్ర వారియర్స్ జట్టులో దత్తారెడ్డి కీలక ఆటగాడిగా ఖ్యాతి దక్కించుకున్నాడు. ● గత మూడేళ్లలో జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొని హర్యానాపై 172 నాటౌట్, మణిపూర్పై 105 నాటౌట్గా క్రీజ్లో నిలిచాడు. అండర్ –23 డెబ్యూట్లో గోవా జట్టుపై 103 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ● అండర్ –19 కూచ్బెహర్ ట్రోఫీ 2021–22 సీజన్లో 250, 2022–23 సీజన్లో 470 పరుగులు చేశాడు. ● 2022–23 లో జరిగిన అండర్ –19 వినోద్ మన్కడ్ ట్రోఫీలో 150 పరుగులు సాధించాడు. ● 2023–24 సీజన్లో అండర్ –23 సీకే నాయుడు ట్రోఫీలో 140 పరుగులు సాధించాడు. వికెట్కీపర్గా, బ్యాటర్గా రాణిస్తున్న మచ్చా దత్తారెడ్డి 20 ఏళ్లకే రంజీ స్క్వాడ్లో చోటు అన్ని రకాల ఫార్మాట్లలోనూ దూకుడు -
వైఎస్ జగన్ పర్యటన ఖరారు
● రేపు రాప్తాడుకు రాక రాప్తాడు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారైంది. ఈ నెల 23న ఆయన రాప్తాడుకు రానున్నారు. పర్యటన షెడ్యూల్ను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. రాప్తాడులో 44వ జాతీయ రహదారిపై హెచ్పీ పెట్రోలు బంక్ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న కల్యాణ మండపంలో తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి, తోపుదుర్తి నయనతారెడ్డి దంపతుల కుమార్తె మోక్షిత విష్ణుప్రియారెడ్డి, తేజేష్రెడ్డి వివాహానికి వైఎస్ జగన్ విచ్చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం హెలిప్యాడ్ సిద్ధం చేసున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పర్యటన ఇలా... వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఉదయం 10 గంటలకు బెంగళూరులోని యలహంక నుంచి బయలుదేరుతారు. రోడ్డు మార్గంలో 10.20 గంటలకు జక్కూరు ఏరోడ్రోమ్కు చేరుకుంటారు. 10.30 గంటలకు జక్కూరు ఏరోడ్రోమ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. 11.30కు రాప్తాడులోని లింగనపల్లి రోడ్డులో బొమ్మేపర్తి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమ ప్రవేశ ద్వారం సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్కు చేరుకుంటారు. 11.40కు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. 11.55 గంటలకు కల్యాణ మండపానికి రోడ్డు మార్గాన చేరుకుంటారు. 11.55 నుంచి 12.15 గంటల వరకు పెళ్లి వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. 12.25కు హెలిప్యాడ్కు చేరుకుంటారు. 12.30 గంటలకు రాప్తాడు హెలిప్యాడ్ నుంచి బయలుదేరుతారు. 1.30 గంటలకు జక్కూరు ఏరోడ్రోమ్ బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.40 గంటలకు బయల్దేరి యలహంకలోని నివాసానికి చేరుకుంటారు. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
కళ్యాణదుర్గం: జిల్లాలో రైతులు పండించిన వివిధ రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి వద్ద మొక్కజొన్న, కంది, అరటి పంటలను పార్టీ శ్రేణులతో కలసి శుక్రవారం ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో రంగయ్య మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. రూ.లక్షలు వెచ్చించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడులు సైతం చేతికి అందడం లేదన్నారు. అరటికి ధర లేక పొలాల్లోనే దున్నేస్తున్నారంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఏపీ పీఎం కిసాన్ రైలును పునరుద్ధరించి, పంట దిగుబడులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తే కొద్ది వరకై నా రైతులకు మేలు చేకూరుతుందన్నారు. అరటి, ఆలు, ఎర్రగడ్డ, అరటి పంటలను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్వింటా కందికి ప్రభుత్వం రూ.8 వేలు, మొక్కజొన్న క్వింటాకు రూ.2400 మద్దతు ధర ప్రకటించిందని, అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రూ.6 వేలతో కంది, రూ.1,600లతో మొక్కజొన్నను వ్యాపారులు కొనుగోలు చేస్తూ రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నారన్నారు. అమెరికా, లండన్ నుంచి విశాఖకు పరిశ్రమలు తెస్తామని రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని గొప్పలు చెబుతున్న ప్రభుత్వ పెద్దలకు రైతుల గురించి కనీసం ఆలోచించే తీరిక లేకుండా పోతోందన్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి డీఆర్డీఏ, వెలుగు కార్యాలయాల ద్వారాా మహిళా సంఘాల సభ్యులతో పంటల కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారం లోపు ఈ ప్రక్రియ చేపట్టకపోతే రైతులతో కలిసి ఉద్యమాలకు తెర లేపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శోభారాణి, జెడ్పీటీసీ బొమ్మన్న, ఎంపీపీలు మారుతమ్మ, భీమేష్, పార్టీ కన్వీనర్లు చంద్రశేఖర్ రెడ్డి, కదిరిదేవరపల్లి రాయుడు, వివిధ విభాగాల తాలూకా అధ్యక్షులు పాటిల్ అభిలాష్, పాతలింగ, స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, బలరాం, కేశవరెడ్డి, గోళ్ల మోహన్రెడ్డి, భాస్కర్రెడ్డి, సత్తిరెడ్డి, సంజప్ప, అంజినరెడ్డి, కొండారెడ్డి, రామిరెడ్డి, దొడగట్ట నారాయణ, సర్పంచ్ హనుమంతప్ప, జయరామిరెడ్డి, మంజునాథ రెడ్డి, మహదేవరెడ్డి, వైఎస్ చిత్తయ్య, గణేష్, రాము, హనుమంతరెడ్డి, మల్లికార్జున, చరణ్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ రైలు సేవలను పునరుద్ధరించాలి పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలి వారంలోపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఉద్యమం తప్పదు మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య -
సాయి సన్నిధి.. జ్ఞాన పెన్నిధి
ప్రశాంతి నిలయం: ‘‘చదువంటే జ్ఞానాన్ని సముపార్జించడం కాదు.. మనిషిలో దాగి ఉన్న దైవత్వాన్ని వెలికితీసి సమాజానికి పంచే సాధనం’’ అని బోధించిన సత్యసాయి తన విద్యాసంస్థల్లో పాఠ్యాంశాలతో పాటు మానవతా విలువలు, సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను బోధించే ఆధునిక విద్యా వ్యవస్థను రూపొందించారు. ప్రాచీన గురుకుల విద్యా విధానాన్ని అధునికీకరించి... విద్యార్థిని పరిపూర్ణంగా తీర్చిదిద్దేలా నూతన విద్యావిధానాన్ని రూపకల్పన చేశారు. సత్యసాయి ఆదర్శాలకు అనుగుణంగా నడుస్తున్న సాయి విద్యాసంస్థలు ప్రపంచంలోని మేటి విద్యాసంస్థల నరసన నిలుస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. ఇక్కడ చదువుకున్న ఎందరో విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అంతలా పేరుగాంచిన సత్యసాయి విద్యాసంస్థల 44వ స్నాతకోత్సవం శనివారం అట్టహాసంగా జరుగనుంది. ఇందుకోసం సెంట్రల్ ట్రస్టు ఏర్పాట్లు చేసింది. 1981 సంవత్సరంలో సమున్నత లక్ష్యాలతో సత్యసాయి స్థాపించిన విద్యాలయాలు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తూ నేటితో 44 వసంతాల వేడుకను జరుపుకుంటున్నాయి. 1981లో ఆవిర్భవించిన సత్యసాయి యూనివర్సిటీకి 1986లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్లో శాశ్వత సభ్యత్వం దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా సమూల మార్పులతో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థగా ఎదిగింది. 2002లో నేషనల్ అసోసియేషన్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్)ఏ++ గ్రేడును కేటాయిస్తూ జాతీయ స్థాయి అత్యున్నత విద్యాసంస్థగా గుర్తించింది. 2008లో సత్యసాయి డీమ్డ్ టూబీ యూనివర్సిటీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. నూతన ఆవిష్కరణల ద్వారా సమాజాభివృద్ధికి పాటుపడేలా విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో 2018 సంవత్సరంలో పుట్టపర్తిలోని విద్యాసంస్థలకు అనుబంధంగా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దేశ విదేశాల్లోని అత్యున్నత వేదికలపై సత్యసాయి విద్యార్థులు తమదైన ముద్ర వేస్తూ సత్తాచాటుతున్నారు. ● సత్యసాయి విద్యాసంస్థల్లో 8:1 నిష్పత్తిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉంటారు. 90 శాతం మంది విద్యార్థులు ఏటా ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ● సత్యసాయి విద్యాసంస్థల్లో బోధించే వారిలో 74 శాతం మంది పీహెచ్డీలు పూర్తి చేసిన వారే కావడం గమనార్హం. సత్యసాయి యూనివర్సిటీ పరిధిలో నాలుగు క్యాంపస్లున్నాయి. రాష్ట్రంలో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం క్యాంపస్, అనంతపురంలోని మహిళా క్యాంపస్, కర్ణాటక రాష్ట్రంలోని ముద్దేన హళ్లి వద్ద నందగిరి క్యాంపస్, బృందావన్ క్యాంపస్లున్నాయి. ఈ నాలుగు క్యాంపస్ల ద్వారా ఏడు విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ), ఐదు విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ), మూడు ప్రొఫెషనల్ కోర్సులను నిర్వహిస్తున్నారు. నేడు స్నాతకోత్సవం సాయి విద్యాలయాలు.. ఆధునిక దేవాలయాలు ఆదర్శంగా నిలుస్తున్న సత్యసాయి విద్యాసంస్థలు నేడు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం ముఖ్య అతిథిగా హాజరు కానున్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్టన్ 20 మందికి బంగారు పతకాలు, 18 మందికి డాక్టరేట్లు ప్రధానం నాలుగు క్యాంపస్లు.. 44 వసంతాల వేడుక.. సత్యసాయి శతజయంతి వేడుకల్లో భాగంగా శనివారం సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం ఘనంగా జరగుంది. ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్నాతకోత్సవ వేడుకను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న కార్యక్రమం 6.30 గంటలకు ముగియనుంది. ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి రాధా కృష్ణన్ హాజరై విద్యార్థులకు స్నాతకోత్సవ ఉపన్యాసం, బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలు, డాక్టరేట్ల ప్రదానం ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వేడుకల్లో పాల్గొననున్నారు. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి స్నాతకోత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా 20 మందికి బంగారు పతకాలు, 521 మందికి డిగ్రీపట్టాలు, 14 మంది పరిశోధన విద్యార్థులకు డాక్టరేట్లు ప్రదానం చేయనున్నారు. ఇందుకోసం పూర్ణచంద్ర ఆడిటోరియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
బుక్కరాయసముద్రం: గిట్టుబాటు ధర లేక జిల్లా అరటి రైతులు రూ.700 కోట్ల మేర పెట్టుబడులు నష్టపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ పేర్కొన్నారు. అరటి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రెడ్డిపల్లిలోని అరటి తోటలను ఆయన పరిశీలించి, మాట్లాడారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, నాయకులు శివారెడ్డి, శ్రీనివాసులు, నాగేంద్ర, రైతులు పాల్గొన్నారు. 1న అప్రెంటిస్షిప్ దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన అనంతపురం క్రైం: ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న ఐటీఐ అభ్యర్థుల సర్టిఫికెట్లను డిసెంబర్ 1న కర్నూలులోని ఆర్టీసీ జోనల్ శిక్షణ కళాశాలలో పరిశీలించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ నజీర్ అహమ్మద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. పూర్తి వివరాలకు 08518–257025 లో సంప్రదించవచ్చు. యువకుడి ఆత్మహత్య కళ్యాణదుర్గం రూరల్: ఉద్యోగ అవకాశాలు దక్కకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బ్రహ్మసముద్రం మండలం ఎనకల్లు గ్రామానికి చెందిన వెంకటేశులు, వరలక్ష్మి దంపతుల ఏకై క కుమారుడు బోయ ఆనంద్(21) డిగ్రీ వరకు చదువుకుని, రెండేళ్లుగా ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అయితే అవకాశాలు దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన అతను గురువారం కళ్యాణదుర్గంలోని రాయదుర్గం బైపాస్ రోడ్డు వద్ద పురుగుల మందు తాగి, కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలిపాడు. దీంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ఆనంద్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతపురంలోని జీజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేటి నుంచి ‘ఉపాధి’ గ్రామ సభలు అనంతపురం టౌన్: ఉపాధి హామీ పథకం పనులపై శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలను నిర్వహించనున్నారు. ఈ మేరకు డ్వామా పీడీ సలీంబాషా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తొలగించిన, రద్దు చేయబడిన జాబ్కార్డుల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి అర్హులైన వారివి పునరుద్ధరణకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే కొత్త జాబ్కార్డులకు వినతులు స్వీకరించనున్నారు. -
బాధితులకు అండగా ఉంటాం
అనంతపురం మెడికల్: టీడీపీ నాయకులు కారు ఢీకొని తీవ్రంగా గాయపడి ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న పాతూరుకు చెందిన బాషా, ఆజాద్నగర్కు చెందిన ఇబ్రహీంలను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి శుక్రవారం పరామర్శించారు. అండగా ఉంటామని బాధితులకు భరోసా కల్పించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ను కోరారు. 31 మందికి ఉద్యోగోన్నతి అనంతపురం రూరల్: పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ గ్రేడ్–1గా ఉన్న 31 మందికి గ్రామ, వార్డు సచివాలయ ఆఫీసర్ ( మండల స్థాయి అధికారులు)గా ఉద్యోగోన్నతి కల్పించినట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజునాయుడు తెలిపారు. ప్రమోషన్ పొందిన వారికి త్వరలోనే మండలాలు కేటాయిస్తామన్నారు. మండల స్థాయి అధికారులుగా పదోన్నతి పొందిన వారు వారికి కేటయించిన మండలంలో గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు పోర్టల్లో నమోదు చేసుకోవాలి అనంతపురం మెడికల్: జిల్లాలో నూతనంగా ప్రారంభించే ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్ల నిర్వాహకులు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రేషన్ కోసం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. పోర్టర్లో నమోదు చేసుకోని వారు ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను అనుసరించి ఆస్పత్రి అనుమతి, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులని తెలిపారు. ఇప్పటికే నిర్వహణలో ఉన్న ఆస్పత్రుల వారు కూడా 15 రోజుల్లో తప్పనిసరిగా పోర్టల్లో నమోదు చేయాలన్నారు. లేనిపక్షంలో వారి లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవాలి శబరిమలకు వెళ్లే యాత్రికులు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నదుల్లో స్నానం ఆచరించేటప్పుడు ముక్కు మూసుకుని, నది నీరు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్సూ దరి చేరవన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం అనంతపురం: వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా తాడిపత్రికి చెందిన కంచం రామ్మోహన్రెడ్డి, గూడూరు సూర్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ లేఅవుట్లకు సహకరిస్తే చర్యలు ● డీపీఓ హెచ్చరిక అనంతపురం రూరల్: పంచాయతీ అధికారులు అక్రమ లే అవుట్లకు సహకరిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజు నాయుడు హెచ్చరించారు. శుక్రవారం అక్రమ లేఅవుట్లపై ‘తమ్ముళ్ల రియల్ దందా’ శీర్షికన ‘సాక్షి’లో వెలువడిన కథనానికి ఆయన స్పందిచారు. అహుడా అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. అలాంటి వెంచర్లను ఎప్పటిక్పప్పుడు అడ్డుకోవాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులపై ఉందన్నారు జిల్లాలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పట్ల ఉదాసీనత ప్రదర్శించడం తగదన్నారు. పంచాయతీ ఆదాయాలకు గండికొట్టే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ, ఆత్మకూరు మండలం వడ్డుపల్లి పంచాయతీల్లో వెలసిన అక్రమ లేఅవుట్లపై నివేదిక ఇవ్వాలని ఆయా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. -
కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి
విడపనకల్లు: వీధి కుక్కల దాడిలో 18 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన విడపనకల్లు మండలం హవళిగి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కురుబ రవి, గురుస్వామి శుక్రవారం ఉదయం 65 గొర్రె పిల్లలను స్థానిక జెడ్పీ హైస్కూల్ వద్ద పొలంలో ఏర్పాటు చేసిన దొడ్డిలో భద్రపరిచి మిగిలిన గొర్రెలను మేపునకు అటవీ ప్రాంతంలోకి తోలుకెళ్లారు. ఎవరూ లేని సమయంలో కుక్కలు దొడ్డిలోకి చొరబడి 18 గొర్రె పిల్లలను కొరికి చంపేశాయి. మిగిలినవి గాయాల పాలయ్యాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. దాదాపు రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. -
చదువుపై ఆసక్తి లేక.. భవిష్యత్తుపై బెంగతో..
● ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం తాడిపత్రి రూరల్/పెద్దపప్పూరు: మండలంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం అహమ్మదాబాద్ నుంచి తిరుచనాపల్లికి వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కో–పైలెట్ నుంచి సమాచారం అందుకున్న తాడిపత్రి ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్, కానిస్టేబుల్ సుబ్బారెడ్డి అక్కడకు చేరుకుని, పరిశీలించారు. అదే సమయంలో మృతుడి జేబులోని సెల్ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి మాట్లాడారు. దీంతో మృతుడు పెద్దపప్పూరు మండలం తబ్జుల గ్రామానికి చెందిన రామాంజులు కుమారుడు వంశీ (21)గా నిర్ధారణ అయింది. జరిగిన విషయాన్ని ఫోన్లోనే మృతుడి సోదరుడు మహేష్కు తెలపడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. చిత్తూరులో ఉన్న శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ (ఎస్వీసీఈటీ)లో బీటెక్ చేస్తున్న వంశీ.. ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చాడని, అయితే చదువుపై ఆసక్తి లేకపోవడంతో తిరిగి కళాశాలకు వెళ్లలేదని వివరించారు. ఈ క్రమంలోనే భవిష్యత్తుపై బెంగతో మనోవేదనకు లోనడయ్యాడన్నారు. శుక్రవారం పొలానికి వెళుతున్నట్లు ఇంట్లో ద్విచక్రవాహనంపై బయలుదేరి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
పుట్టపర్తి టౌన్: సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పుట్టపర్తికి విచ్చేస్తున్నారు. ఈ మేరకు పటిష్టమైన భధ్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో డీఐజీ డాక్టర్ షిమోషి, ఎస్పీ సతీష్కుమార్ శుక్రవారం బందోబస్త్కు వచ్చిన డీఎస్పీలు, సీఐలతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్రపతి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి శనివారం ఉదయం 10.50 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో బయలుదేరి హిల్ వ్యూ స్డేడియం చేరుకుని సత్యసాయి బాబా జయంత్యువాల్లో పాల్గొంటారన్నారు. సాయంత్రం 3.30 గంటలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారని, అక్కడి నుంచి ప్రత్యే కాన్యాయ్లో ప్రశాంతి నిలయానికి వెళ్తారన్నారు. ఈ నేపథ్యంలో సత్యసాయి విమానాశ్రయం, కాన్వాయ్ వెళ్లే మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డైవర్షన్ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విమానాశ్రయం నుంచి సాయి కుల్వంత్ హాలుకు వెళ్లే సమయంలో బందోబస్త్పాయింట్లలలో జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. అలాగే పబ్లిక్ గ్యాలరీల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్లు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు ఆర్ఐలు పాల్గొన్నారు. -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. చలి వాతావరణం కొనసాగుతోంది. ఈశాన్యం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
‘మీ డబ్బు.. మీ హక్కు’పై అవగాహన కల్పించండి అనంతపురం అర్బన్: లావాదేవీలు నిర్వహించకపోవడంతో ఖాతాల్లో నిలిచిపోయిన సొమ్మును డిపాజిటర్లు లేదా వారి వారసులకు చేర్చాలనే లక్ష్యంతో చేపట్టిన ‘మీ డబ్బు.. మీ హక్కు’ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బ్యాంకర్లకు సూచించారు. జేసీ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో లీడ్ బ్యాంక్ మేనేజర్ నరేష్రెడ్డి, బ్యాంకర్లతో కలిసి ‘మీ డబ్బు.. మీ హక్కు’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ జిల్లాలో క్లెయిమ్లు కాని ఖాతాలు మొత్తం 4.87 లక్షలు ఉన్నాయన్నారు. వీటిలో రూ.107.65 కోట్లు నిల్వ ఉందన్నారు. వీటిలో వ్యక్తిగత డిపాజిటర్ల ఖాతాల్లో రూ.86.74 కోట్లు, సంస్థాగత ఖాతాల్లో రూ.8.80 కోట్లు, ప్రభుత్వ ఖాతాల్లో రూ.12.1 కోట్లు ఉన్నాయన్నారు. క్లెయిమ్లు కాని ఈ డిపాజిట్లను తిరిగి పొందేందుకు ప్రజలకు బ్యాంకులు సులభమైన మార్గాలను అందుబాటులో ఉంచాయన్నారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ప్రధాన బ్రాంచ్ డీఎం హేమంత్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు. -
పారిశుధ్య కార్మికుడిపై టీడీపీ నేతల దాడి
అనంతపురం క్రైం: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న కదిరప్పపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన కదిరప్పను స్థానికులు ఆస్పత్రికి చేర్చారు. బాధితుడు తెలిపిన మేరకు.. అనంతపురంలోని వేణుగోపాల్ నగర్లో శుక్రవారం చెత్త సేకరణకు వెళ్లిన సమయంలో స్థానిక టీడీపీ బూత్ కన్వీనర్ గోపి ఇంటి వద్ద వారు పెంచుకుంటున్న కుక్క కదిరప్పపై దాడి చేసింది. గతంలో మూడు సార్లు కరిచింది కూడా. ప్రస్తుతం నగర పాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టడంతో వారి దృష్టికి వేణుగోపాల్ నగర్లో తరచూ ఇబ్బంది పెడుతున్న కుక్క గురించి కదిరప్ప తీసుకెళ్లాడు. దీంతో శుక్రవారం కుక్కను పట్టుకునేందుకు బండిని వేణుగోపాల్ నగర్కు పంపారు. టీడీపీ నేత గోపి ఇంటి వద్ద కుక్కను బంధించ పోతుండగా ఆయన అడ్డుకున్నాడు. ఆ సమయంలో కుక్కలను పట్టేవారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో కదిరప్ప జోక్యం చేసుకుని సర్దిచెబుతూ గతంలో పలుమార్లు తనపై కుక్క దాడి చేసి గాయపరిచిందని, ఇదే విషయాన్ని తాను వారికి తెలిపినట్లుగా వివరించాడు. దీంతో కదిరప్ప మీద గోపి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కులం పేరుతో దూషిస్తూ టీడీపీ నేతలు కె.నాగరాజు, మహమ్మద్ రఫీ, రాజా, మురళితో కలసి కర్రలతో దాడికి తెగబడ్డాడు. స్థానికులు అడ్డుకుని గాయపడిన కదిరప్పను ఆస్పత్రికి చేర్చారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కాగా, కదిరిప్పపై దాడిని కార్మిక సంఘాల నేతలు ఖండించారు. బాధితుడికి న్యాయం చేయకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
జెడ్పీ ఉద్యోగులకు పదోన్నతి
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పని చేస్తున్న తొమ్మిది మంది సీనియర్ అసిస్టెంట్లకు పాలనాధికారులు(ఏఓ)గా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్లను కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులను జెడ్పీలోని తన చాంబర్లో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ శుక్రవారం అందజేశారు. అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాసులును జెడ్పీలోనే ఏఓగా నియమించారు. అలాగే ఏకాంబరయ్యను గోరంట్లకు, పి.సురేష్రెడ్డిని తాడిమర్రికి, పూర్ణ ఖలందర్ను వజ్రకరూరుకు, పీఆర్ క్యూసీ సబ్ డివిజన్లో పని చేస్తున్న రవిని బుక్కరాయసముద్రం, వజ్రకరూరులో పనిచేస్తున్న శ్రీధర్శర్మను కనగానపల్లికి, కదిరి పీఆర్ఐ సబ్ డివిజన్లో పని చేస్తున్న అశోక్కుమార్రెడ్డిని నల్లచెరువుకు బదిలీ చేశారు. సోమందేపల్లి నుంచి అబ్దుల్ రహిమాన్ను గుడిబండకు బదిలీ చేశారు. కార్యక్రమంలో సీఈఓ జీసీ శంకర్, డిప్యూటీ సీఈఓ జీసీ సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఖ్యాతిని చాటిచెప్పండి ● మాక్ అసెంబ్లీకి ఎంపికై న విద్యార్థులతో డీఈఓ ప్రసాద్బాబు అనంతపురం సిటీ: రాష్ట్ర స్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటి చెప్పేలని మాక్ అసెంబ్లీకి ఎంపికై న విద్యార్థులకు డీఈఓ ప్రసాద్బాబు సూచించారు. జిల్లా నుంచి ఎంపికై న 8 మంది విద్యార్థులు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులను శుక్రవారం తన చాంబర్లో ఆయన అభినందించి, మాట్లాడారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ మునీర్ఖాన్, డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి, ఏఎస్ఓ శ్రీనివాసులు, ఏపీడీఓ మంజునాథ్, నోడల్ ఆఫీసర్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మార్చి నెలాఖరులోపు పనులన్నీ పూర్తి కావాలి ● పీఆర్ ఎస్ఈ చిన్న సుబ్బరాయుడు అనంతపురం సిటీ: ఏపీ గ్రామీణ రహదారుల ప్రాజెక్ట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద చేపట్టిన రహదారులు, వంతెనల నిర్మాణాలను మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను పంచాయతీరాజ్ ఇంజినీర్(ఎస్ఈ) వై.చిన్న సుబ్బరాయుడు ఆదేశించారు. అనంతపురంలోని సర్కిల్ కార్యాలయంలోని తన చాంబర్లో శుక్రవారం నిర్వహించిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్ట్ ఈఈలు శంకరయ్య, శ్రీరాములు, డీఈఈలు మురళీ, నారాయణస్వామి, నాగేంద్రకుమార్, సుధాకర్ నాయక్, తిరుమలరెడ్డి, ఏఈఈలు హుస్సేన్బాషా, లక్ష్మీదేవి, కాంట్రాక్టర్లు హాజరయ్యారు. చేపట్టిన పనుల పురోగతిపై ఎస్ఈ ఆరా తీశారు. నిర్దేశిత గడువులోపు పూర్తి చేయకపోతే నిధులు వెనక్కు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. -
పంటల బీమా పథకాలు అస్తవ్యస్తం
అనంతపురం అగ్రికల్చర్: రబీలో పంటల బీమా పథకాలపై చంద్రబాబు సర్కారు నోరు మెదపడం లేదు. అమలులోకి వచ్చినట్లు చెబుతున్నా... రైతులు వినియోగించుకునేలా వ్యవసాయశాఖ ఇంకా బహిరంగ ప్రకటన చేయకపోవడం విశేషం. 2019–24 మధ్య కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఈ–క్రాప్ ఆధారంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు ఉచితంగా వాతావరణ బీమా, ఫసల్బీమా పథకాలు అమలు చేసిన విషయం తెలిసిందే. రైతులపై నయాపైసా భారం మోపకుండా ఉచితంగా అమలు చేయడంతో పాటు నాలుగేళ్ల పాటు పెద్ద మొత్తంలో బీమా కింద పరిహారం అందించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో రాగానే గత రబీ నుంచి ఉచిత బీమా పథకాలకు మంగళం పాడింది. రైతులపై ప్రీమియం భారం మోపడంతో పాటు బీమా పథకాలను అస్తవ్యస్తంగా మార్చేశారు. 2023 ఖరీఫ్, రబీ, 2024 ఖరీఫ్, రబీకి సంబంఽధించి ఇప్పటికీ బీమా కింద రైతులకు పైసా పరిహారం ఇవ్వకుండా మోసం చేస్తున్న పరిస్థితి నెలకొంది. బీమా పథకాలపై ప్రకటనేదీ? అనధికార సమాచారం ప్రకారం ఈ రబీలో పప్పుశనగ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు ఫసల్బీమా, అలాగే వాతావరణ బీమా కింద టమాటకు బీమా వర్తింపజేశారు. వ్యవసాయ పంటలకు 1.5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం చొప్పున బీమా ప్రీమియం డిసెంబర్ 15 లోపు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పప్పుశనగ ఎకరాకు రూ.450 ప్రకారం, వేరుశనగ ఎకరాకు 480, జొన్నకు రూ.315, మొక్కజొన్నకు రూ.325, వరికి రూ.630, టమాటకు రూ.1,600 ప్రకారం రైతులు ప్రీమియం చెల్లించాలి. రుణాలు పొందుతున్న రైతులు బ్యాంకుల్లోనూ, రుణాలు లేని రైతులు కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్సీ), సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ (ఎన్సీఐపీ)లో తమ వాటా చెల్లించాలి. మామిడి పంటకు బీమా వర్తింపజేశారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. పంట కోత ప్రయోగాల ఫలితాలు, ఆటోమేటిక్ వెదర్ రిపోర్టు ఆధారంగా బీమా పరిహారం లెక్కించి రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బీమా కింద నోటిఫై అయిన పంటలు, పథకం వివరాలు, ప్రీమియం, ఆఖరి గడువు తదితర అంశాలపై వ్యవసాయశాఖ ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవతున్నాయి. రబీ పంటల బీమాపై చంద్రబాబు సర్కారు మౌనం అమలులో ఉన్నా.. ప్రకటన చేయని వ్యవసాయశాఖ -
మొక్కు‘బడి’ సమావేశాలు
అనంతపురం సిటీ: పాఠశాలల్లోని సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం.. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి విద్యాబోధన సాఫీగా సాగేలా చూడాల్సిన తల్లిదండ్రుల సమావేశాలు మొక్కుబడి తంతుగా మారాయి. ప్రతి నెలా నిర్వహించాల్సిన సమావేశాలను ప్రధానోపాధ్యాయులు పుస్తకాల్లో తమకు తోచింది రాసేయడం, పాఠశాల కమిటీ చైర్మన్, సభ్యులను విడివిడిగా పిలిపించుకొని మినిట్స్ పుస్తకాల్లో సంతకాలు పెట్టించుకోవడం పరిపాటిగా మారింది. పాఠశాలల్లో ఏం జరుగుతోందో పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండాపోతోంది. పర్యవేక్షించాల్సిన ఎంఈఓలు పత్తా లేకుండాపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది.జరక్కపోయినా.. జరిగినట్లుజిల్లా వ్యాప్తంగా సుమారు 90 శాతం పాఠశాలల్లో ప్రతి నెలా తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు నిర్వహించడం లేదని ఉపాధ్యాయ వర్గాలే చెబుతున్నాయి. ప్రతి నెలా సమావేశాలకు పిలిస్తే తల్లిదండ్రులు రావడం లేదనే కారణం చెబుతు న్నారు. వాస్తవంగా ప్రతి నెలా సమావేశం నిర్వహించి పిల్లల ప్రవర్తన, చదువు, తోటి విద్యార్థులతో వారు ఎలా మసలుకుంటున్నారనే అంశాలను తల్లిదండ్రుల దృష్టికి ఉపాధ్యాయులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే అటువంటి ప్రయత్నాలేవీ జరిగిన దాఖలాల్లేవు. ప్రభుత్వం నిబంధన పెట్టింది కాబట్టి తమకు తప్పదన్నట్లు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు కలసి సమావేశాలు నిర్వహించినట్లు రికార్డులు రాసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాళ్లే కొన్ని సమస్యలు అడిగినట్లు నమోదు చేసుకోవడం చివరగా సంతకాలు పెట్టి, చైర్మన్, సభ్యులను విడివిడిగా పిలిపించుకొని సంతకాలు పెట్టించుకోవడం పరిపాటిగా మారిందంటున్నారు.మెగా పీటీఎం సమావేశాలకే ప్రాధాన్యంమెగా పీటీఎం సమావేశాలకు ఇచ్చే ప్రాధాన్యం నెలవారీ సమావేశాలకు ఇవ్వడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు సర్కారు వచ్చాక 2024 డిసెంబర్ 24న తొలి సమావేశం నిర్వహించగా, ఈ ఏడాది జూలై 25న మెగా పీటీఎం–2.0 సమావేశం నిర్వహించారు. ఇక అప్పటి నుంచి మళ్లీ నిర్వహించలేదు. అయితే, ఆయా సమావేశాల్లో గుర్తించిన సమస్యలు, చర్చించిన అంశాలేవీ ఇంత వరకు అమలైన దాఖలాల్లేవని ఉపాధ్యాయ వర్గాల ద్వారా తెలిసింది.ఎంఈఓలు ఏం చేస్తున్నట్లు..?ప్రతి నెలా తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారా.. లేదా అని పర్యవేక్షించాల్సిన ఎంఈఓలు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు: 1,236ప్రాథమికోన్నత పాఠశాలలు: 59ఉన్నత పాఠశాలలు: 435మొత్తం విద్యార్థుల సంఖ్య: 2,06,654 -
జూనియర్ అసిస్టెంట్పై కేసు నమోదుకు ఆదేశం
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న భూసంరక్షణ విభాగం (సాయిల్ కన్సర్వేషన్) జూనియర్ అసిస్టెంట్ బి.హసీనాపై పోలీసు కేసు నమోదుకు జేడీఏ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. క్రమశిక్షణా రాహిత్యం, మోసం, చెక్కుల దుర్వినియోగా నికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై జూనియర్ అసిస్టెంట్ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. వివరాలు... ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తమతో హసీనా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు కలెక్టరేట్తో పాటు జేడీఏ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై గుత్తి ఏడీఏ ఎం.వెంకటరాముడు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. కలెక్టరేట్లో పనిచేస్తున్నానంటూ నమ్మించి రూ.లక్షలకు లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. బాధితుల నుంచి ఒత్తిళ్ల పెరగడంతో జూనియర్ అసిస్టెంట్ హసీనా తన కార్యాలయంలో డిపార్ట్మెంట్కు చెందిన 15 చెక్కులను ఫోర్జరీ చేసి బాధితులకు చూపిస్తూ వస్తున్నట్లు కూడా గుర్తించారు. ఈ క్రమంలోనే జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశాల మేరకు ఈనెల 12న జూనియర్ అసిస్టెంట్పై సస్పెన్షన్ వేటు వేశారు. పోలీసు కేసు నమోదు చేయించాలని ఆ శాఖ డీడీ ఓబుళపతిని తాజాగా ఆదేశించారు. గురువారం ఆయన వన్టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వివరాలు అందించారు. అయితే కేసు నమోదు చేయలేదని తెలిసింది. ఓ జూనియర్ అసిస్టెంట్ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడం, చెక్కులను వాడుకోవడంపై ఆ శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపుఅనంతపురం సిటీ: మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు డీసీఈబీ గంధం శ్రీనివాసులు గురువారం తెలిపారు. ఈ నెల 30లోపు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 నుంచి 5 వరకూ, రూ.200 రుసుముతో డిసెంబర్ 6 నుంచి 10 వరకూ, రూ.500తో అదే నెల 11 నుంచి 15వ తేదీలోపు చెల్లించవచ్చని పేర్కొన్నారు.రూ.1.30 కోట్ల ఆర్థిక లావాదేవీలపై విచారణఉరవకొండ: తెలంగాణలోని నాగర్కర్నూలులో రూ.1.30 కోట్ల ఆర్థిక లావాదేవీల వ్యవహారంపై అనుమానాస్పదంగా ఉన్న ఉరవకొండకు చెందిన మైనారిటీ ప్రముఖుడిని విచారణ చేసేందుకు గురువారం నాగర్కర్నూలు పోలీసులు వచ్చారు.అనుమానితుడిని స్థానిక పీఎస్కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పలువురు మైనారిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నాయకుడిని ఎలా తీసుకెళతారంటూ పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. విచారణ కోసమే పిలుచుకొచ్చామని, ఎలాంటి కేసు నమోదు చేయలేదని నాగర్కర్నూలు పోలీసులు తెలపడంతో మైనారిటీలు శాంతించారు. తాము నాగర్కర్నూలుకు వచ్చి విచారణకు సహకరిస్తామని చెప్పడంతో పోలీసులు వెనుతిరిగారు.దొంగలకు దేహశుద్ధియాడికి: మండలంలోని దైవాలమడుగు గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరు దొంగలకు రైతులు దేహశుద్ధి చేశారు. ఇటీవల యాడికి మండల వ్యాప్తంగా వ్యవసాయ పొలాల వద్ద కేబుల్ వైర్లు, ట్రాక్టర్లలో బ్యాటరీలు చోరీకి గురవుతున్నాయి. దీంతో రైతులు రాత్రి వేళ పొలాల వద్ద కాపలా కాస్తున్నారు. పెద్దవడుగూరు మండల కేంద్రానికి చెందిన రఘు, రాజులు బుధవారం అర్ధరాత్రి దైవాలమడుగు సమీపంలోని కొండల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలివ్వడంతో దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దైవాల మడుగుకు చేరుకొని నిందితులను యాడికి పోలీసుస్టేషన్కు తరలించారు. -
రైతుల సంక్షేమమే లక్ష్యం కావాలి: కలెక్టర్ ఆనంద్
అనంతపురం అర్బన్: ‘రైతులకు అన్ని విధాల తోడుగా ఉంటూ వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి. సాంకేతికతను రైతులు అందింపుచ్చుకునేలా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి. ముఖ్యంగా నేషనల్ బ్యాంబూ మిషన్ కింద వెదురు సాగుకు రైతులను గుర్తించాలి. ఏపీఎంఐపీ కింద రోజూ 200 మంది నుంచి నాన్ సబ్సిడీ కలెక్షన్ వసూలు చేయాలి’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, అనుబంధ శాఖల అఽధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 1,07,261 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 43,348.2 హెక్టార్లలో పంటలు సాగయ్యాయన్నారు. జిల్లాలో 36,651 టన్నుల యూరియా, డీఏపీ, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఎరువులు రైతులకు అందేలా చూడాలని ఆదేశించారు. హార్ట్టికల్చర్ అభివృద్ధికి రెండేళ్ల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పశు రైతులకు ‘పీకేసీసీ’ కార్డులు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అఽధికారులు ఉమామహేశ్వరమ్మ, ఉమాదేవి, రఘునాథరెడ్డి, పెన్నేశ్వరి, లక్ష్మానాయక్, పద్మలత, డీసీఓ అరుణకుమారి, ఎల్డీఎం నరేష్రెడ్డి, నాబర్డ్ ఏజీఎం అనురాధ పాల్గొన్నారు. అమృత్ పనులు వేగవంతం చేయాలి.. ‘అమృత్’ పథకం కింద నగర, పురపాలక సంఘాల పరిధిలో చేపట్టిన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రజారోగ్య, నగర పాలక సంస్థ, మునిసిపల్ అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతపురం కార్పొరేషన్, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్లో ఉన్న లెగసీ వేస్ట్ పనుల పూర్తికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో మున్సిపల్ ఆర్డీ నాగరాజు పాల్గొన్నారు. నిబంధనలు పాటించాలి ..బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలుష్య నియంత్రణ చర్యలపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లు, క్లినిక్లు, డయాగ్నస్టిక్ కేంద్రాల్లో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సమీక్షలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కిషోర్, డీఎంహెచ్ఏ ఎస్బీ విష్ణుముర్తి, ప్రజారోగ్యశాఖ ఈఈ ఆదినారాయణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, డీసీహెచ్ఎస్ డేవిడ్ సెల్వన్రాజు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. -
26న గోల్ షాట్బాల్ జట్టు ఎంపిక
కదిరి అర్బన్: మండలంలోని ఎరుకులవాండ్లపల్లిలోని హరీష్ పాఠశాలలో ఈ నెల 26న ఉమ్మడి జిల్లా గోల్ షాట్బాల్ సబ్ జూనియర్స్ బాలబాలికల జిల్లా జట్లను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు గోల్ షాట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ప్రసన్నకుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులు. వెంట ఆధార్ కార్డు తీసుకుని బుధవారం ఉదయం 11 గంటలకు హరీష్ పాఠశాలకు చేరుకోవాలి. పూర్తి వివరాలకు 97041 40510 లో సంప్రదించవచ్చు.బీకేఎస్లో రేపు నైపుణ్య పోటీలుఅనంతపురం సిటీ: ఈ నెల 22న స్థానిక కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి నైపుణ్య పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ గురువారం వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఒకేషనల్ కోర్సు నిర్వహిస్తున్న 73 పాఠశాలల్లో ఎంపిక చేసిన విద్యార్థులు ఒక్కో ఒకేషనల్ ట్రైనర్ ద్వారా రెండు నమూనాలతో హాజరు కావాలన్నారు. -
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ జేడీ ఆదేశాల మేరకు గురువారం గుత్తి ఏడీఏ ఎం.వెంకటరాముడు, అనంతపురం రూరల్ ఏఓ వెంకట్కుమార్ బృందం జిల్లాలోని పలు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఉన్న ఉమా గోడౌన్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన రూ.2.08 లక్షలు విలువ చేసే 220 లీటర్ల ద్రవరూప ఎరువులు, అలాగే రుద్రంపేటలోని న్యూ శ్రీనివాస ఫర్టిలైజర్స్లో రూ.97 వేలు విలువ చేసే 1.20 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేసినట్లు ఏడీఏ వెంకటరాముడు తెలిపారు. ఈ నెల 30 వరకు తనిఖీలు కొనసాగుతాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్రయ విక్రయాలు చేపట్టినా, రైతులను మోసం చేసే చర్యలు చేపట్టినా శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కళ్యాణదుర్గం రూరల్: స్థానిక గాంధీ చౌక్లోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర ట్రేడర్స్కు చెందిన నాలుగు ఎరువుల గోడౌన్లలో గురువారం వ్యవసాయాధికారి రవి తనిఖీలు చేపట్టారు. గడువు ముగిసిన, అనుమతుల్లేకుండా రైతులకు విక్రయిస్తున్న రూ.15,24,380 విలువైన 6.75 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేశారు. అలాగే ముదిగల్లు రోడ్డులో ఉన్న మనగ్రోమోర్ సెంటర్ను తనిఖీ చేసి, అనుమతుల్లేని రూ.3,30,410 విలువైన 465 లీటర్ల రసాయన మందులను సీజ్ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ యల్లప్ప, ఏఓ శ్రావణ్కుమార్, పాల్గొన్నారు. నా భర్తను రక్షించండి ● కల్పవృక్ష డెవలప్మెంట్ సొసైటీ నిర్వాహకురాలు బొగ్గు పుష్ప వేడుకోలు అనంతపురం టవర్క్లాక్: కిడ్నాప్కు గురైన తన భర్త బొగ్గు శ్రీరాములును కాపాడాలంటూ కల్పవృక్ష డెవలప్మెంట్ సొసైటీ నిర్వాహకురాలు బొగ్గు పుష్ప వేడుకున్నారు. గురువారం అనంతపురంలోని ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సొసైటీని స్థాపించి వివిధ ప్రాజెక్టులు చేపట్టామన్నారు. పెట్టుబడులు పెట్టిన కొందరు రెట్టింపు డబ్బు కావాలని ఒత్తిళ్లు పెంచారన్నారు. ఇటీవల తన భర్తను కర్ణాటకలోని జగలూరుకు చెందిన తిరుమలేసు, పూజ, తిమ్మక్క కిడ్నాప్ చేశారని, అప్పగి నుంచి అతని ఆచూకీ తెలియడం లేదని వాపోయారు. ఈ అంశంపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు వివరించారు. సమావేశంలో చంద్రశ్చర్ల హరి, నరేష్ కొడవండ్ల తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనపై ప్రజా తిరుగుబాటు తప్పదు
ఉరవకొండ: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సీఎం చంద్రబాబు సాగిస్తున్న దుర్మార్గపు పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం స్థానిక బాలాజీ థియేటర్ సర్కిల్ వద్ద నిర్వహించిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమంలో విశ్వ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే సీఐ సతీష్కుమార్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. పరకామణి కేసులో వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పాలని ఆయన్ను ప్రభుత్వ పెద్దలు మానసికంగా వేధించారన్నారు. ఈ విషయంపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడినందుకు ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసి రోజంతా తిప్పి కోర్టులో హాజరుపరిచారన్నారు. దీనిపై న్యాయస్థానం పోలీసులకు చీవాట్లు పెట్టి బెయిల్ మంజూరు చేసిందన్నారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను సీఎం చంద్రబాబు కించపరుస్తూ మాట్లాడటంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక, కర్షక లోకం తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతూ ముఖ్యమంత్రి వాఖ్యలను ఖండిస్తున్నాయని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రభుత్వం చురుగ్గా అడుగులు వేస్తోందని, ఇప్పటికే మిట్టల్ సంస్థకు అప్పగించాలని చూస్తోందన్నారు. రాష్ట్రం దూసుకెళ్తోంది అప్పుల్లోనే.. సంపద సృష్టిస్తామంటూ అధికారం చేపట్టిన చంద్రబాబు నేడు అప్పులు చేయడంలో దూసుకెళ్తున్నారని ‘విశ్వ’ విమర్శించారు. అప్పులు అడుక్కుని వచ్చేందుకు ఆర్థిక మంత్రిగా కేశవ్ను ఏర్పాటు చేసుకున్నారన్నారు. ‘కాగ్’ నివేదిక ప్రకారం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 వేల కోట్లు అప్పులు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం 17 నెలల కాలంలోనే 2 వేల కోట్లకు పైగా అప్పులు చేసి రికార్డు సృష్టించందన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని స్వయంగా ‘కాగ్’ తన నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీఐ సతీష్కుమార్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ధ్వజం -
విధిగా నిర్వహించాల్సిందే
ప్రతి నెలా తల్లిదండ్రుల సమావేశాలు విధిగా నిర్వహించాలి. ఇదే విషయంపై హెచ్ఎంలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. క్షేత్రస్థాయిలో ఎంఈఓలు పర్యవేక్షించాలి. ప్రతి నెలా క్రమం తప్పకుండా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల ప్రగతి, ఎటువంటి సమస్యలు ఉన్నాయో అర్థమవుతుంది. అనంతరం వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కచ్చితంగా సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – ప్రసాద్బాబు, డీఈఓ -
చి‘వరి’ దశలో ‘కీటక’ దాడి
జిల్లాలో ఖరీఫ్ వరి పంట కీలక దశకు చేరింది. మరో 20 నుంచి 25 రోజుల్లో కోతకు రానుంది. పంట చివరి దశలో వరి చేలపై కీటక దాడి విజృంభిస్తోంది. ప్రధానంగా హెచ్చెల్సీ ఆయకట్టుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సుడిదోమ, ఆకు ఎండు తెగులు (బీఎల్బీ), ఆకుముడత, కాండం తొలుచు పురుగు ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల రాత్రి సమయంలో చలి తీవ్రత పెరిగి అక్కడక్కడా అగ్గితెగులు వ్యాప్తి మొదలైంది. ● దెబ్బతింటున్న వరి చేలు ● వాతావరణంలో మార్పులతో ఇబ్బందుల్లో రైతులు రాయదుర్గం: జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 53,548 ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. ఇందులో అత్యధికంగా 80 శాతానికి పైగా వరి సాగు హెచ్చెల్సీ ఆయకట్టు పరిధిలోనే ఉంది. సాగు ఆరంభం నుంచే ఆకుఎండు తెగులు (బీఎల్బీ) సమస్యాత్మకంగా మారింది. నారుమడి, పిలకలు తోడిగే దశలో ఇది అధిక ప్రభావం చూపినట్లు వ్యవసాయ నిపుణులు గుర్తించారు. అకాల వర్షాలు, చేలలో నీరు చేరడం, నత్రజని అధికంగా చల్లడం, గట్లపై గడ్డి ఏపుగా పెరగడం తదితర కారణాలతో గింజ పాలుపోసుకునే దశలో తెగులు ఉధృతి మరింత పెరిగింది. దీని ప్రభావంతో తాలు గింజలు పెరిగి దిగుబడి దెబ్బతినే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సుడిదోమ ఉధృతి కనిపిస్తోంది. ఇది కూడా పంట దిగుబడిపై ప్రభావం చూపనుంది. మొత్తానికి హెచ్చెల్సీ ఆయకట్టు పరిధిలో సుడిదోమ, కంకినల్లి, అగ్గితెగుళ్లు అధికంగా వ్యాప్తిచెందింది. -
యాజమాన్యం పాటించాలి
ప్రధానంగా ఈ సీజన్లో వరిలో సుడిదోమ, కాండం తొలుచు, దోమపోటు, అగ్గితెగులు, పోడతెగులు, మానుతెగులు ఆశిస్తాయి. వీటి నివారణకు రైతులు సరైన యాజమాన్య పద్దతులు పాటించాలి. పురుగు నివారణకు ఎకరాకు ఆరు కిలోల కార్టఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు వెదజల్లాలి. అలా కానిపక్షంలో ఎకరాకు 200 మి.గ్రా. గ్లామర్ పౌడర్ వినియోగించాలి. పొలాల్లో మురుగునీరు ఉండరాదు. తెగుళ్ల నివారణకు ఎకరాకు 200 మి.లీ.ప్రాఫిఫోనాజల్ లేదా ఆజాస్రీ్ట్రసోభిన్ పైరు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. – డాక్టర్ ఈ.చండ్రాయుడు, ప్రధాన శాస్త్రవేత్త, కేవీకే, కళ్యాణదుర్గం -
కుడి కాలువకు నీటి విడుదల మళ్లీ వాయిదా
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి ధర్మవరం కుడి కాలువకు ఈ నెల 22న నీటిని విడుదల చేయాలని హెచ్చెల్సీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని మళ్లీ వాయిదా వేశారు. కుడి కాలువ షట్టర్లు మరమ్మతులకు నోచుకోకపోవడమే వాయిదాకు కారణంగా తెలుస్తోంది. ఈ నెల 25న కుడి కాలువకు నీటిని విడుదల చేయినున్నట్లు హెచ్చెల్సీ ఎస్ఈ సుధాకర్ రావు గురువారం వెల్లడించారు. పార్ట్ టైం టీచర్ల భర్తీకి రేపు డెమో అనంతపురం రూరల్: ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో గెస్ట్, పార్ట్ టైం ప్రాతిపాదికన ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డెమో కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయ అధికారి జయలక్ష్మి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. బి.పప్పూరు పాఠశాలలో హిందీ, జూనియర్ లెక్చరర్ కెమిస్ట్రీ, ములుగూరు పాఠశాలలో పీజీటీ మ్యాథ్స్, కాలసముద్రం పాఠశాలలో టీజీటీ పీఎస్, పీజీటీ మ్యాథ్స్, రొళ్ల పాఠశాలలో టీజీటీ హిందీ, పీజీటీ ఇంగ్లిష్, మ్యాథ్స్, కురుగుంట బాలికల పాఠశాలలో జూనియర్ లెక్చరర్ తెలుగు, పీజీటీ ఇంగ్లిష్, తిమ్మాపురం బాలికల పాఠశాలలో పీజీటీ మ్యాథ్స్, టీజీటీ పీఎస్, నల్లమాడ బాలికల పాఠశాలలో జూనియర్ లెక్చరర్ ఇంగ్లిష్, అమరాపురం బాలికల పాఠశాలలో జూనియర్ లెక్చరర్ కెమిస్ట్రీ, టీజీటీ పీఎస్, ఉరవకొండ బాలికల పాఠశాలలో జూనియర్ లెక్చరర్ మ్యాఽథ్స్, బ్రహ్మసముద్రం బాలికల పాఠశాలలో జూనియర్ లెక్చరర్ హిస్టరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు డిగ్రీ, పీజీ, బీఈడీ, టెట్ సర్టిఫికెట్లతో ఈ నెల 22న కురుగుంటలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించే డెమోకు హాజరు కావచ్చు. రేపు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా క్లస్టర్స్ కాంప్లెక్స్ సమావేశాలు శనివారం నిర్వహించాలని డీఈఓప్రసాద్బాబు గురువారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల సహాయకులు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 100 శాతం హాజరు కావాలని పేర్కొన్నారు. గైర్హాజరయ్యే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ‘విద్యా శాఖ అధికారులు అందుబాటులో ఉండాలి’ అనంతపురం సిటీ: ప్రభుత్వ పని దినాల్లో విద్యా శాఖలో తలెత్తే సమస్యల పరిష్కారానికి రోజూ డీఈఓలు, ఎంఈఓలు గంటపాటు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓలు రోజూ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఎంఈఓలు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విధిగా కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చారు. జూడో క్రీడాకారుడికి ఎస్కేయూ వీసీ అభినందన అనంతపురం: ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు రాజస్తాన్లోని ఉదయ్పూర్లో జరిగే ఖేలో ఇండియా పోటీల్లో జూడో విభాగంలో ఏపీ తరఫున పాల్గొంటున్న ఎస్కేయూ ఎంబీఏ రెండో సంవత్సరం విద్యార్థి పి.భాస్కర్ను వర్సిటీ ఇన్చార్జ్ వీసీ బి.అనిత గురువారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఎస్కేయూ క్రీడా కార్యదర్శి డాక్టర్ బి. జెస్సీ, కోచ్ ఎస్.మహమ్మద్ ఉన్నారు. -
ఘనంగా గంగా హారతి
అనంతపురం హెచ్చెల్సీ కాలనీలో గురువారం రాత్రి గంగా హారతి కార్యక్రమం ఘనంగా సాగింది. కార్తీక అమావాస్యను పురస్కరించుకుని స్థానిక మంజునాథస్వామి దేవస్థానంలో నిర్వహించిన భజనల్లో పెద్ద సంఖ్యలో శివస్వాములు పాల్గొన్నారు. భక్తిగీతాలతో పరమేశ్వరుడికి నీరాజనాలర్పించారు. అనంతరం హెచ్చెల్సీ వద్ద గంగాహారతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు వెలిగించిన దీపాలతో కాలువ పరిసరాలు నూతన శోభ సంతరించుకున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
శతాధిక వృద్ధురాలి మృతి
రాయదుర్గం టౌన్: స్థానిక మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్సీ శేషాద్రి సతీమణి లీలావతమ్మ(103) గురువారం కన్నుమూశారు. రాయదుర్గం మండలంలోని రాయంపల్లి గ్రామానికి చెందిన లీలావతమ్మ రెండు నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని పెద్ద కోడలి వద్ద ఉంటూ చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో గురువారం ఆమె మృతి చెందారు. కాగా, ఎన్సీ శేషాద్రి 1955లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది శాసనసభ్యుడిగా ప్రజలకు సేవలందించారు. 30 ఏళ్ల క్రితం ఆయన మృతి చెందగా స్వగ్రామంలోనే భార్య లీలావతమ్మ నివాసముంటూ వచ్చారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అంత్యక్రియలను హైదరాబాద్లోనే చేయనున్నట్లు బంధువులు పేర్కొన్నారు. కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు ఆత్మకూరు: స్థానిక పంపనూరు వద్ద ఉన్న సిటీ పార్క్లో గురువారం ఫొటో సూట్ కోసం వచ్చిన అనంతపురానికి చెందిన ఓ కుటుంబం తిరుగు ప్రయాణంలో వడ్డుపల్లి కొండ వద్ద టైర్ పంక్చర్ కావడంతో కారు బోల్తాపడింది. అందులోని ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ ద్వారా జీజీహెచ్కు తరలించారు. -
బైకును ఢీకొన్న టీడీపీ నేతల కారు
● ఇద్దరి పరిస్థితి విషమం ● ‘పచ్చ’ నాయకులను కాపాడేందుకు పోలీసుల యత్నం అనంతపురం సెంట్రల్: నగరంలో ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఎదుట అంబేడ్కర్ ఫ్లైఓవర్పై గురువారం రాత్రి టీడీపీ నాయకుల కారు ఇద్దరిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలో పాతూరుకు చెందిన మహబూబ్పీరా కుమారుడు బాషా, ఆజాద్నగర్కు చెందిన రోహన్ఖాన్ కుమారుడు ఇబ్రహీం ద్విచక్రవాహనంపై రామ్నగర్ వైపు నుంచి నగరంలోకి వస్తున్నారు. అదే సమయంలో నగరంలో నుంచి రామ్నగర్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు అతివేగంగా ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో ఎగిరి కిందపడిన బాషా, ఇబ్రహీం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తీరుపై విమర్శలు.. ఇటీవల ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమితులైన వెంకటప్ప, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు లక్ష్మినారాయణ, సీనియర్ నాయకుడు రాయల్మురళీ కారులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో స్థానికులు ప్రశ్నిస్తే వారిపై టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగినట్లు తెలిసింది. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడేసరికి అక్కడి నుంచి జారుకున్నారు. వారిని కాపాడేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నాలు చేయడం, ప్రమాదంలో వారి తప్పేమీ లేదని ట్రాఫిక్ సీఐ వెంకటేష్నాయక్ చెప్పడం విమర్శలకు దారి తీసింది. తొలుత కారులో టీడీపీ నాయకులు ఎవరూ లేరని చెప్పిన పోలీసులు.. ఘటనాస్థలంలో స్థానికులు తీసిన ఫొటోలు బయటకు రావడంతో చేసేది లేక కారులో టీడీపీ నేతలు ఉన్నారని చెప్పడం గమనార్హం. కారులో ప్రయాణిస్తున్న వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయలేదని, కేవలం ఘటనలో గాయపడిన వారికి మాత్రమే చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఇబ్రహీం, బాషా -
సాయి నామం.. మధురగానం
ప్రశాంతి నిలయం: సాయి నామం.. మధురగానాలతో పర్తిక్షేత్రం ఆధ్యాత్మిక అనుభూతులు పంచుతోంది. దేశ విదేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన అశేష భక్తజనం మధ్య సత్యసాయి శత జయంత్యుత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ సంగీత విద్యాంసులు సాయీశ్వరున్ని కీర్తిస్తూ కచేరీలు నిర్వహిస్తుండగా..భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. సత్యసాయి సేవా సంస్థల అంతర్జాతీయ సదస్సులో భాగంగా గురువారం సాయంత్రం సత్యసాయి సేవా సంస్థల బృందం సభ్యులు ‘సత్యసాయి రాగమాల’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయి అవతార వైభవం.. ఆయన చూపిన మార్గాన్ని చక్కటి గీతాలతో వినిపించారు. సంగీత కళాకారులతో భక్తులు కూడా గొంతు కలపడంతో సభా మందిరం సత్యసాయి నామంతో మార్మో గింది. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.అట్టహాసంగా సేవా సంస్థల జాతీయ సదస్సుగురువారం ఉదయం సత్యసాయి సేవా సంస్థల 11వ జాతీయ సదస్సును అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తొలుత సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులనుద్దేశించి ప్రసంగించారు. -
భయపడొద్దు.. అండగా ఉంటాం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అనంతపురం: ‘చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారనే అక్కసుతో వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. నాయకులు, కార్యకర్తలకు పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుంది’ అని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు కావడంపై ఆయన స్పందించారు. న్యాయస్థానం తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తోందని దుయ్యబట్టారు. హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయ ధ్వంసం, కారుమూరి వెంకటరెడ్డి కేసు ఘటనలో పార్టీ నాయకులు, లీగల్ టీం, కార్యకర్తలు స్పందించిన తీరు ప్రశంసనీయమన్నారు. పార్టీ నాయకుడికిగానీ, కార్యకర్తకు గానీ ఎలాంటి కష్టం వచ్చినా వైఎస్సార్సీపీ లీగల్ టీం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కారుమూరి వెంకటరెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారని, అయితే అంతిమంగా న్యాయస్థానంలో తమకు న్యాయం జరిగిందన్నారు. ఇందుకు చొరవ చూపిన లీగల్ టీం సభ్యులు హరినాథ రెడ్డి, ఉమాపతి, రాజశేఖర్ యాదవ్, శ్రీనివాస రెడ్డి, ఎన్వీ భాస్కర్ రెడ్డి, ప్రభులను జిల్లా అధ్యక్షుడు ‘అనంత’ అభినందించారు. అరటికి గిట్టుబాటు కల్పించండి అనంతపురం అగ్రికల్చర్: అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. బుధవారం ‘సాక్షి’లో ‘అరటి రైతుల ఆక్రందన’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. ఉద్యానశాఖ, మార్కెటింగ్, డీఆర్డీఏ, మెప్మా అధికారులతో పాటు అరటి ఎగుమతిదారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఎందుకీ పరిస్థితి తలెత్తిందని ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ కష్టపడి పండించిన అరటి పంటను రోడ్డు పాలు చేయడం బాధ కలిగిస్తోందన్నారు. ఈ పరిస్థితి నుంచి రైతులను గట్టెక్కించాలని సూచించారు. నాణ్యతను బట్టి టన్ను రూ.6 వేల నుంచి రూ.8 వేలకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి, ఏడీ దేవానందకుమార్, మార్కెటింగ్శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్, డీఆర్ డీఏ పీడీ శైలజ, ఎస్కే బనానా తదితర ఎగుమతిదారుల కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యాన పంటలపై ఆసక్తి పెంచుకోవాలి ఉరవకొండ: జిల్లా రైతాంగం ఉద్యాన పంటలపై ఆసక్తి పెంచుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ పథకం నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో మైక్రో ఇరిగేషన్ ద్వారా సులువుగా పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో 46 లక్షల మంది రైతులకు ప్రభుత్వం సాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, ఏడీ లక్ష్మినారాయణ, ఏడీఏ సత్యనారాయణ, ఏఓ రామకృష్ణుడు పాల్గొన్నారు. -
బియ్యం నొక్కేస్తూ.. కాసులు బొక్కేస్తూ
అనంతపురం అర్బన్: మండల లెవల్ స్టాక్ పాయింట్ల (ఎంఎల్ఎస్) కేంద్రంగా బియ్యం బొక్కుడు వ్యవహారం చోటు చేసుకుంటోంది. కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ చౌకదుకాణాలకు సరఫరా చేసే బియ్యం ‘సైడ్’ చేస్తున్నారు. బస్తాలో 50 కిలోల కంటే తక్కువ బియ్యం ఉంటున్నా డీలర్లకు మాత్రం 50 కిలోల లెక్కలోనే కట్టబెట్టేస్తున్నారు. సరఫరా చేసే బియ్యం సంచి బరువు (టేయిర్ వెయిట్) కూడా ఇవ్వడం లేదని తెలిసింది. వాస్తవంగా గోనె సంచితో కలిపి 50.500 కిలోలు ఇవ్వాలి. అయితే డీలర్లకు సరఫరా చేస్తున్న బస్తాల్లో 44 కిలోలు, 46, 45 కిలోలు అందిస్తూ నాలుగు నుంచి ఆరు కిలోలు మిగుల్చుకుంటున్నారు. ప్రతి నెలా 30 టన్నులు నల్లబజారుకు.. జిల్లాలోని 6.65 లక్షల కార్డుదారులకు 9,800 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సగటున 800 టన్నుల బియ్యం డీలర్లకు సరఫరా అవుతున్నాయి. వాస్తవంగా డీలర్ ఇండెంట్ ఆధారంగా కోటా మేరకు బియ్యం సరఫరా చేయాలి. చౌక దుకాణానికి 150 క్వింటాళ్లకు 50 కిలోలవి 300 బస్తాలు ఇస్తున్నారు. ప్రతి 50 కిలోల బస్తాలో తూకం తక్కువ ఉంటోంది. 150 క్వింటాళ్ల మీద రెండు క్వింటాళ్ల బియ్యం తక్కువగా సరఫరా అవుతున్నాయి. ఇలా నెలసరిగా దాదాపు 30 వేల కిలోల (30 టన్నులు) బియ్యం మిగుల్చుకుని నల్లబజారుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా వ్యాపారులు.. బొక్కేస్తున్న బియ్యం నల్లబజారుకు తరలించేందుకు ప్రత్యేకంగా కొందరు వ్యాపారులు ఉన్నట్లు తెలిసింది. గోదాము నుంచి వీరు సరుకును వేరే ప్రదేశాలకు తరలిస్తారని సమాచారం. వాటికి కొంత మెరుగుపెట్టి బ్రాండెడ్ పేరు ఉన్న సంచుల్లో నింపిన అనంతరం కర్ణాటక ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. తూకం తగ్గినా మాట్లాడకూడదు.. తూకం తగ్గినా డీలర్లు మాట్లాడకూడదని, ఎదిరించి మాట్లాడితే ఇబ్బందులు తప్పవని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక.. తూకం తక్కువపై కొందరు అధికారులు మాట్లాడే తీరును ముక్కున వేలేసుకోవాల్సిందే! డీలర్లను ఎంఎల్ఎస్ పాయింట్ వద్దకు వచ్చి తూకం వేయించుకుని తీసుకెళ్లమనండని చెబు తుండడం గమనార్హం. డీలర్లు ఎలాగో రాలేరని, వచ్చినా తమ ముందు మాట్లాడలేరని తెలిసే అలా అంటుంటారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని పలు ఎంఎల్ఎస్ పాయింట్లలో కక్కుర్తి వ్యవహారం మిగులు బియ్యంతో అక్రమ వ్యాపారం నల్లబజారుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం -
బాల్ బ్యాడ్మింటన్ భారత జట్టుకు ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: భారత బాల్ బ్యాడ్మింటన్ జట్టులో జిల్లాకు చెందిన మందాల పావని చోటు దక్కించుకుంది. ఈ మేరకు బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి వై రాజారావు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు తమిళనాడులోని దిండిగల్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పావని ప్రతిభ కనబర్చి భారత ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికై ంది. అక్కడ కూడా రాణించడంతో ప్రధాన జట్టులో స్థానాన్ని పదిలం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 5వ తేదీ వరకు నేపాల్ రాజధాని ఖాట్మాండు వేదికగా జరిగే అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత జట్టు తరఫున ఆమె ప్రాతినిథ్యం వహించనుంది. కాగా, మందాల పావని స్వగ్రామం తాడిమర్రి మండలం ఆత్మకూరు. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు వీరప్ప, శివమ్మ. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో రాణించి జిల్లాకు మంచిపేరు తెస్తానని అన్నారు. తన ఎదుగుదలకు బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ అందించిన సహకారం మరువలేనన్నారు. పావని ఎంపికపై బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, కార్యదర్శి వెంకటేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. 30లోగా అకౌంట్ టెస్టుకు దరఖాస్తు చేసుకోండిఅనంతపురం సిటీ: ఈ నెల 30వ తేదీలోపు అకౌంట్ టెస్ట్ (పేపర్–1, 2)కు దరఖాస్తు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు డీఈఓ ప్రసాద్బాబు సూచించారు. ఈ మేరకు బుధవారం వెల్లడించారు. పరీక్ష ఫీజును గేట్వే పద్ధతి ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. రెండు పేపర్లు రాయాలనుకునే వారు రూ.150, ఒక పేపర్ రాయాలనుకునే వారు రూ.100 ఫీజును ఈ నెల 24 నుంచి 30వ తేదీలోపు చెల్లించాలన్నారు. దరఖాస్తును డిసెంబర్ 1వ తేదీలోపు ప్రభుత్వ పరీక్షల విభాగ కార్యాలయం, కమలానగర్, అనంతపురంలో అందజేయాలన్నారు. హాస్టళ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్ అనంతపురం రూరల్: గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా గిరిజన సంక్షేమ శాఖ రెండు ప్రత్యేక యాప్లను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాలు.. పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్య వివరాలు, ఆహారం, వ్యర్థ పదార్థాల తొలగింపు తదితర వివరాలను ఎప్పటికప్పుడు హెచ్పీటీఎస్, ఐహెచ్ఎమ్ఎస్ యాప్లలో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ అంశంపై ఇప్పటికే వార్డన్లకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. అధిక మోతాదులో మందులు మింగి వృద్ధుడి మృతి శెట్టూరు: మండల కేంద్రానికి చెందిన బోయ రామాంజనేయులు(74) అధిక మోతాదులో మందులు మింగి మృతి చెందాడు. ఐదేళ్లుగా బీపీ, షుగర్తో పాటు మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆయనను అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యుడు ఇచ్చిన మందులను మంగళవారం రాత్రి మింగిన కాసేపటికే పరిస్థితి విషమించింది. దీంతో వెంటనే కళ్యాణదుర్గంలోని ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అనంతపురానికి రెఫర్ చేశారు. చికిత్సకు స్పందించక బుధవారం ఆయన మృతి చెందాడు. మృతుడి కుమారుడు చంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుందాం
●కలెక్టర్ ఆనంద్ అనంతపురం కల్చరల్: చరిత్ర వారసత్వాన్ని కాపాడుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. ఇంటాక్, పర్యాటక శాఖ, మ్యూజియం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలను బుధవారం వేడుకగా నిర్వహించారు. తొలిరోజు హెరిటేజ్ వాక్ను కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రారంభించారు. చరిత్రాత్మక కట్టడాల ప్రాధాన్యతను విద్యార్థులకు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వివరించారు. యువత, విద్యార్థులు తరచు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తూ వాటి ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు. చరిత్ర స్పృహను పెంపొందించుకుని వారసత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం చిన్నారులకు కాన్వాస్ బ్యాగులు, మ్యాగ్నెట్ మగ్లు, క్యాలెండర్లు, బ్యాడ్జ్లను డిస్కవర్ అనంతపురం నిర్వాహకులు ఉచితంగా అందించారు. అంతకు ముందు వందలాది మంది విద్యార్థులు, అధికారులు, పలు శాఖల సిబ్బందితో కలిసి కలెక్టరేట్ నుంచి జిల్లా మ్యూజియం వరకూ హెరిటేజ్ వాక్ సాగింది. కార్యక్రమంలో డీఈఓ ప్రసాద్బాబు, పురావస్తు శాఖ ఏడీ స్వామినాయక్, పర్యాటక శాఖ అధికారి జయకుమార్, ఏఎంసీ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ పావని, డిస్కవర్ అనంతపురం ఏజీ అనిల్కుమార్రెడ్డి, రమేష్నారాయణ, ఇంటాక్ కన్వీనర్ రామకుమార్, ప్రతినిధులు పి.కృష్ణమూర్తి, షరీఫ్, రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
అండర్ –14 క్రీడా జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: త్వరలో జరిగే ఎస్జీఎఫ్ అండర్–14 రాష్ట్ర స్థాయి బేస్బాల్, వాలీబాల్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక బుధవారం జరిగింది. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో చేపట్టిన ఈ ప్రక్రియను ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల, లక్ష్మీనారాయణ, సుహాసిని పర్యవేక్షించారు. ఎంపికై న వాలీబాల్ బాలుర జట్టులో చరణ్ నాయక్, మోహన్, శ్రీకాంత్, మణికంఠ, సాకేత్, బాబాఫకృద్దీన్, అఖిల్సాయి, భరత్, ముఖేష్, స్కంద, చరణ్, దీరజ్ రెడ్డి ఉన్నారు. బాలిక జట్టులో నిహారిక, అఫ్రీన్, మోక్షిత, అమీనా, అవంతి, శరణ్య, తస్మియా, సింధు, వర్షిత, లావణ్య, చైత్ర, హర్షిత చోటు దక్కించుకున్నారు. అలాగే బేస్బాల్ బాలిక జట్టుకు స్వాతి, లాస్య, అను, స్వాతి, ఇంతియాజ్, లిఖిత, పూజిత, సౌమ్యశ్రీ, ఝాన్సీ, మౌనిక, లోకేశ్వరి, అప్సనా, శ్రీలత, విజయలక్ష్మి, అక్షయ, పవిత్ర ఎంపిక కాగా, బాలుర జట్టులో రాకేష్, గోకుల్, వరుణ్, కసి నాయక్, అశోక్ చక్రవర్తి, వరుణ్కుమార్, రోహిత్కుమార్, చరణ్ నాయక్, బద్రీనాథ్, చైతన్యకుమార్, నరేష్, హర్షవర్ధన్, సంతోష్, అరుణ్, బన్నీ, చేతన్రెడ్డి, సాఫ్ట్బాల్ బాలుర జట్టులో సందీప్, రాజు, వెంకటేష్, ఉమేష్చంద్ర, చైతన్య, నితిన్నాని, శివప్రసాద్, హరిసాత్విక్, ప్రవీణ్, భానుప్రభాస్, సాకేత్, ఓంకార్, శివ సంజయ్, మారుతి, అభిరామ్ చోటు దక్కించుకున్నారు. -
‘కాలవ’పై టీడీపీ సీనియర్ల ఆగ్రహం
కణేకల్లు: రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులుపై టీడీపీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ చూస్తుండగానే తీవ్ర స్వరంతో నిలదీశారు. వివరాలు.. కణేకల్లులో బుధవారం ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సొల్లాపురం గ్రామానికి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన సొల్లాపురం ఎంపీటీసీ కేశవరెడ్డితోపాటు మరికొందరిని వేదికపైకి ఎమ్మెల్యే కాలవ ఆహ్వానించి పెద్దపీట వేయడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పటి వరకూ కింద కూర్చొని ఉన్న అదే గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు ప్రసాద్, వేణు, రామ్మోహన్తో పాటు పలువురు ఒక్కసారిగా కాలవను చుట్టుముట్టారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన తమకు ప్రాధాన్యతినివ్వకుండా ఇతర పార్టీ నుంచి కొత్తగా వచ్చిన వారికి ఎలా గుర్తింపునిస్తున్నారంటూ నిలదీశారు. సీనియర్లంటే లెక్కలేదా? కొత్త వారే నీకు ఎక్కువయ్యారా? అంటూ ప్రశ్నించారు. దీంతో కార్యక్రమం కాస్త రసాభాసగా మారింది. పలువురు బుజ్జగించే ప్రయత్నం చేయగా... ‘మీకు ఇలాగే జరిగితే గమ్మునుంటారా?’ అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో కాలవ సైగలతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలో దిగి పార్టీ సీనియర్ నేతలను పక్కకు పిలుచుకెళ్లారు. డ్రిప్ పంపిణీ వేగవంతం చేయాలి● ప్రాజెక్టు ఆఫీసర్ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశం అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఏపీఎంఐపీ అధికారులను ఆ ప్రాజెక్టు ఆఫీసర్ (పీఓ) ఎం.వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం ఆయన గుంటూరు నుంచి జిల్లా అధికారులు, కంపెనీ డీసీఓలు, ఎంఐ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాకు కేటాయించిన 18 వేల హెక్టార్ల లక్ష్యంలో ఇప్పటి వరకూ 8,947 హెక్టార్లకు మంజూరు ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఇప్పటి వరకు 38,138 హెక్టార్లకు డ్రిప్ కావాలని రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని, రక్షేతస్థాయిలో 19,816 హెక్టార్ల ప్రాథమిక పరిశీలన పూర్తి చేసినట్లు పీడీ రఘునాథరెడ్డి, ఏపీడీ ధనుంజయ వివరించారు. తుది పరిశీలన కూడా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. రిమాండ్కు దుర్గా ఆటో మొబైల్స్ యజమానిఅనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలో మారుతీ సుజికి – దుర్గా ఆటో మొబైల్స్ షోరూం నిర్వహిస్తున్న రాజేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు అనంతపురం వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన వివరాలను వెల్లడించారు. స్థానిక గుత్తి రోడ్డులో మారుతీ సుజికి కార్ల షోరూం నిర్వహిస్తున్న రాజేష్ భారీగా అప్పులు చేసి ఇటీవల అనేక మందికి ఐపీ నోటీసులు ఇచ్చాడు. దీనికి తోడు కొత్తగా కార్లు కొనుగోలుకు వెళ్లిన వారు చెల్లించిన మొత్తాన్ని సొంతానికి వాడుకుని వాహనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశాడు. ఇలాంటి బాఽధితులు 30 మందికి పైగా ఉండగా ఇటీవల ముగ్గురు వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం బుధవారం రాజేష్ను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
బ్యాట్ పడితే పరుగుల వర్షమే
గుంతకల్లు: స్థానిక నాయీ బ్రాహ్మణ కాలనీలో నివాసముంటున్న బట్నపాడు ధనుంజయ, లీలా దంపతులకు అమూల్య, నందని అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కుల వృత్తితో ధనుంజయ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేసి ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మరొకరు సెకండియర్ చదువుతున్నారు. చిన్నప్పుడు సరదాగా బ్యాటింగ్ చేస్తూ సందడి చేస్తున్న కుమార్తెల ఆసక్తిని గమనించిన ధనుంజయ వారిని క్రికెట్ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు. ఆర్డీటీ సహకారంతో.. గుంతకల్లులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ చదువుతున్న నందిని, అమూల్య.. 2019లో గుంతకల్లులోని ఎస్జేపీ హైస్కూల్లో ఆర్డీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంపులో తొలిసారిగా పాల్గొన్నారు. ఆ సమయంలో వారిలోని ఆసక్తిని గమనించిన స్థానిక కోచ్ జోషి.. ఏసీఏ కోచ్లు యుగంధర్రెడ్డి (యోగి), నరేష్... ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిలోని క్రీడానైపుణ్యాలకు మెరుగుపడుతూ వచ్చారు. వారి శిక్షణలో అక్క అమూల్య వికెట్ కీపింగ్తో పాటు ఓపెనర్గా, చెల్లెలు నందిని ఆల్రౌండర్గా రాటు దేలుతున్నారు అమూల్య.. ఆట తీరే వేరు వికెట్ కీపర్గాను, బ్యాటింగ్ ఓపెనర్గా అమూల్య తనదైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటోంది. 2022–23, 2023–24 జోనల్ పోటీలు, ఏపీఎల్ టోర్నీల్లో పాల్గొంది. ఇప్పటి వరకూ 68 మ్యాచ్లు ఆడిన అమూల్య.. 1,089 పరుగులు సాధించి, 100కు పైగా క్యాచ్లు పట్టింది. ఆల్రౌండర్గా నందిని.. రైట్ హ్యాండ్ మీడియం పేస్ బౌలర్గా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో నందిని తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 2022–23, 2023–24లో ఆర్డీటీ నిర్వహించిన పలు టోర్నీలతో పాటు, ఏపీఎల్ పోటీల్లోనూ ఉత్తమ ఆల్రౌండర్గా గుర్తింపు పొందింది. పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన అండర్–15 జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించి, జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించింది. మొత్తం 72 మ్యాచ్ల్లో 979 పరుగులు చేసి 78 వికెట్లను సొంతం చేసుకుని ప్రత్యేకతను చాటుకుంది. క్రికెట్లో రాణిస్తున్న బట్నపాడు సిస్టర్స్ ఆర్డీటీ సహకారంతో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తాఆర్డీటీ సహకారం మరువలేను క్రీడలను ప్రోత్సహిస్తున్న ఆర్డీటీ సహకారం మరువలేను. ఇండియా జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా వారు సాగిస్తున్న ప్రయత్నాలకు స్థానిక దాతలు కొందరు గొప్ప మనసుతో సహకరిస్తున్నారు. – బట్నపాడు ధనుంజయ, గుంతకల్లు -
చీనీ చెట్ల నరికివేత
యాడికి: మండలంలోని ఓబుళాపురం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు 70 చీనీ చెట్లను నరికి వేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గుట్టలపల్లి గ్రామానికి చెందిన రైతు గొల్ల రంగస్వామి.. ఆరేళ్ల క్రితం యాడికి మండలం ఓబుళాపురం గ్రామ సమీపంలో 9 ఎకరాలను కొనుగోలు చేసి పంటల సాగు చేపట్టాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం 1,140 చీనీ మొక్కలను నాటాడు. మంగళవారం రాత్రి తోటలోకి దుండగులు ప్రవేశించి 70 చీనీ చెట్లను నరికివేశారు. బుధవారం ఉదయం తోటకు వెళ్లిన రంగస్వామి.. చీనీ చెట్లను నరికివేసిన విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో సీఐ ఈరన్న అక్కడు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి దుర్మరణంశింగనమల(నార్పల): ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొండూరుకు చెందిన శ్రీనివాసులు (37) వ్యక్తిగత పనిపై బుధవారం నార్పలకు వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై బత్తలపల్లి మీదుగా తిరుగు ప్రయాణమైన ఆయన.. నార్పల మండలం బొందలవాడ వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి ఓ కుమారుడు ఉన్నాడు. భార్య లేదు. ఘటనపై నార్పల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం సిటీ: రాష్ట్రీయ సేవా సమితి(రాస్) ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహిస్తున్న ప్రతిభావంతుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.వెంకటరత్నం బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్పెషల్ ఎడ్యుకేషన్ బీఎడ్ చేసి, రిహాబిలిటేషన్ ఆఫ్ ఎండియా(ఆర్సీఐ) గుర్తింపు కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు 0877–224204లో సంప్రదించవచ్చు. తల్లిపై కొడుకు కత్తితో దాడిగార్లదిన్నె: మండలంలోని కల్లూరులో షేక్ మాబున్నీపై బుధవారం ఆమె కుమారుడు దూద్వలి కత్తితో దాడి చేశాడు. తన పేరున ఇల్లు రాసివ్వలేదని ఆగ్రహంతో కత్తితో దాడి చేయడంతో మాబున్నీ ఎడమ చేతిపై తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబసభ్యులు అనంతపురంలోని జీజీహెచ్కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
దున్నపోతును ఢీకొని ద్విచక్ర వాహనదారుడి మృతి
గుమ్మఘట్ట: రోడ్డుకు అడ్డంగా వచ్చిన దున్నపోతును ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రాయదుర్గం పట్టణానికి చెందిన మహేష్ (30), అభి, రాజు ముగ్గురూ ఒకే ద్విచక్ర వాహనంపై బుధవారం బంజయ్యనగర్కు వెళ్లారు. అక్కడ పని ముగించుకున్న అనంతరం రాత్రి తిరుగు ప్రయాణమైన వారు... గుమ్మఘట్ట మండలం సిరిగెదొడ్డి వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా దున్నపోతు వచ్చింది. ఆ సమయంలో వేగాన్ని నియంత్రించుకోలేక నేరుగా వెళ్లి ఢీకొన్నారు. ఘటనలో మహేష్ గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. అబి, రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అటుగా వెళుతున్న వారు గమనించి క్షతగాత్రులను రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మహేష్ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై గుమ్మఘట్ట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో పోస్టల్ బీపీఎం మృతి
శెట్టూరు: మండలంలోని ములకలేడు గ్రామానికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం) తిప్పేస్వామి (57) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు... తిప్పేస్వామి సోమవారం విధులు ముగించుకొని సొంత పని నిమిత్తం అమరాపురం గ్రామానికి వెళ్లాడు. పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంలో నాగేపల్లిగేటు, పరుశురాంపురం మీదుగా ములకలేడు సొంత గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే కర్ణాటక రాష్ట్రం పరుశురాంపురం మండల పరిధిలోని గౌరిపురం వద్ద గతుకులుగా ఉన్న రోడ్డులో బైక్ అదుపు తప్పింది. తీవ్రంగా గాయపడిన తిప్పేస్వామిని అటుగా వస్తున్న వారు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలపారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి కుమారుడు సాయినాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసినట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. పోస్టల్ ఉద్యోగి తిప్పేస్వామి మృతి విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య ములకలేడులో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చామలూరు రాజ్గోపాల్ తదితరులున్నారు. -
మట్టి తవ్వకాల అడ్డగింత
బొమ్మనహాళ్: మండల కేంద్రం సమీపంలోని ఆంధ్రా–కర్ణాటక సరిహద్దులోని హెచ్చెల్సీ కాలువ పక్కనే జరుగుతున్న మట్టి తవ్వకాలపై అధికారులు స్పందించారు. ఈనెల 17న ‘సాక్షి’లో ‘యథేచ్చగా తవ్వకాలు .. రైతుల కంగారు’ శీర్షిక ప్రత్యేక కథనం ప్రచురితమైంది. స్పందించిన సరిహద్దు, బొమ్మనహాళ్ హెచ్చెల్సీ ఏఈఈలు రంజిత్కుమార్, అల్తాఫ్ మంగళవారం మట్టి తవ్వకాలు జరిపిన స్థలాన్ని పరిశీలించారు. హెచ్చెల్సీ కాలువకు దగ్గరగా మట్టి తవ్వితే కాలువ బలహీనపడే ప్రమాదం ఉందని గుర్తించి పొలం రైతు చంద్రన్నకు ఇకపై ఏ విధమైన తవ్వకాలు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. మరోసారి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే తవ్విన గుంతలను వెంటనే పూడ్చేలా చర్యలు తీసుకున్నారు.కారు ఢీకొని యువకుడి మృతి కూడేరు: మండల కేంద్రమైన కూడేరు – ముద్దలాపురం గ్రామాల మధ్యలో అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారిపై కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు బాట పెద్దన్న (22) మృతి చెందాడు. మరో యువకుడు శ్రీకాంత్ గాయపడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. కూడేరుకు చెందిన బాట మారెన్న కుమారుడు బాట పెద్దన్న , ఈడిగ ఎర్రిస్వామి కుమారుడు శ్రీకాంత్ ముద్దలాపురం వద్ద ఉన్న సుజలాన్ కంపెనీ గాలి మరల ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటాకా విధులు ముగించుకొని ఇద్దరూ బైక్పై ఇంటికి బయలుదేరారు. పోలీసుస్టేషన్కు కొంత దూరంలో ఉరవకొండ వైపు వెళుతున్న కారు అదుపు తప్పి స్కూటర్ను ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న పెద్దన్న తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. శ్రీకాంత్ గాయపడ్డాడు. అదే సమయంలో అటు వెళుతున్న భాస్కర్ కూడా గాయపడగా.. క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాలుజారి కింద పడి మహిళ మృతి బెళుగుప్ప: మండల పరిధిలోని వీరాంజనేయ కొట్టాల సమీపంలో మంగళవారం అరటి తోటకు రసాయన మందు పిచికారీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన ద్రావణాన్ని తాగి 20 మేకలు, ఒక పొట్టేలు మృతి చెందాయి. ఘటనను చూసేందుకు ఆత్రుతతో వెళ్లిన సమీప పొలానికి చెందిన దుద్దేకుంట గ్రామానికి చెందిన కాశెప్పగారి రామాంజినమ్మ (49) కాలు మడతపడటంతో కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషపు ద్రావణం తాగిన మరో 15 మేకలకు పశువైద్య సహాయకులు ఎర్రిస్వామి, పశువైద్యాధికారి మంజునాథ పర్యవేక్షణలో చికిత్స అందించారు. 21 జీవాల మృతితో రూ.3 లక్షలు నష్టం వాటిల్లిందని సంజీవులు, మారెన్న ఆవేదన వ్యక్తం చేశారు. శవమై తేలిన తిప్పేస్వామి కణేకల్లు: మూడ్రోజుల క్రితం అదృశ్యమైన కణేకల్లుకు చెందిన బోయ తిప్పేస్వామి (34) మంగళవారం తుంబిగనూరు శివారులోని హెచ్చెల్సీ కాలువలో శవమై తేలాడు. పోలీసుల కథనం మేరకు... స్థానిక నేసేపేటకు చెందిన బోయ తిప్పేస్వామి టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య భారతి, ఇద్దరు కుమారులున్నారు. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిన తిప్పేస్వామి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తల్లీ లక్ష్మీదేవి తన కుమారుడు అదృశ్యమయ్యాడని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. మూడ్రోజుల తర్వాత తిప్పేస్వామి హెచ్చెల్సీ కాలువలో శవమై కన్పించాడు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. సేవాఘడ్ను సందర్శించిన విశ్రాంత అధికారులు గుత్తి రూరల్: మండలంలోని సేవాఘడ్ను విశ్రాంత జిల్లా వ్యవసాయాధికారులు మంగళవారం సందర్శించారు. వ్యవసాయశాఖ విశ్రాంత జేడీఏ ఠాగూర్నాయక్ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వ్యవసాయశాఖలో వివిధ హోదాలలో ఉన్నత స్థాయి అధికారులుగా పని చేసి పదవీ విరమణ చేసిన 20 మంది అధికారులు సేవాఘడ్లో పర్యటించారు. ముందుగా వారు బాచుపల్లి బాట సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి వారు సేవాఘడ్కు చేరుకొని సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్, మాతా జగదాంబ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. -
జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలి
అనంతపురం సిటీ: జాతీయ స్థాయిలో సత్తా చాటి జిల్లా కీర్తిని చాటాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్–2025 జాతీయ స్థాయి సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనలో పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రవళ్లిక, కళ్యాణి, షబానా రూపొందించిన సోలార్ బేస్డ్ మెడిసిన్ స్ప్రేయర్ ప్రాజెక్ట్ ఎంపికై ంది. దేశ వ్యాప్తంగా 72 వేల నమూనాల నుంచి ఎంపిక చేసిన 100 బెస్ట్ నమూనాల్లో మన జిల్లా విద్యార్థినుల నమూనా ఉండడం గమనార్హం. ఏఐఎం అటల్ ఇన్నోవేషన్ వారు ఫైనల్గా 30 నమూనాలు ఎంపిక చేయనుండగా, అందుకు డిసెంబర్లో మరోసారి జాతీయ స్థాయి పోటీ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అందుకు అవసరమైన శిక్షణను ముగ్గురు బాలికకు అనంతపురం సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేశారు. మంగళవారం బాలికలను కలెక్టర్ ఆనంద్ వద్దకు విద్యా శాఖాధికారులు తీసుకెళ్లారు. బాలికలను కలెక్టర్ అభినందిస్తూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం, ఫిజిక్స్ ఉపాధ్యాయులు, గైడ్ టీచర్లు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకుఎంపిక
గుంతకల్లు: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ హైవే నుంచి దొనిముక్కల బ్రిడ్జి మధ్య జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలను మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగానే పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అండర్–14 బాయ్స్ విభాగంలో బి.మనోజ్ (కొనకొండ్ల). ఎం.శివశంకర్ (గడేకల్), దినేష్సాయి (వజ్రకరూరు), అర్.లిఖిత్నాయక్ (వజ్రకరూరు) ఎంపికయ్యారు. అలాగే అండర్–14 గ్లర్స్ విభాగంలో ఖాజాబీ (గుంతకల్లు). షబీనా (వజ్రకరూరు), నిత్యశ్రీ (గడేకల్), జయశ్రీ (కొనకొండ్ల) ఎంపికయ్యారు. అండర్–17 గ్లర్స్ విభాగంలో సంజన (కొనకొండ్ల). ప్రణితి (గడేకల్), అపూర్వ (గుంతకల్లు), షణ్ముఖ (గడేకల్) ఎంపికై నట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ విజయవాడ సమీపంలోని మున్నా అనే గ్రామంలో జరిగే రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో వారు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమశేఖర్, జాయింట్ సెక్రటరీ నారాయణ, ఎంఈఓలు సుబ్బరాయుడు, మల్లికార్జున, హెచ్ఎంలు నారాయణరెడ్డి, పుండరీకాక్ష తదితరులు పాల్గొన్నారు. -
జగన్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
రాప్తాడు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23న జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి, తోపుదుర్తి నయనతారెడ్డి దంపతుల కుమారై మోక్షిత విష్ణుప్రియారెడ్డి, తేజేష్రెడ్డి వివాహానికి వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం 44వ జాతీయ రహదారిపై హెచ్పీ పెట్రోలు బంక్ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న కల్యాణ మండపం, గంగలకుంట రోడ్డులో సిద్ధం సభకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలం, లింగనపల్లి రోడ్డులో బొమ్మేపర్తి సచ్చిదానంద స్వామి ప్రవేశ ద్వారం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసే హెలిప్యాడ్ ప్రాంతాన్ని పార్టీ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. వివాహ మహోత్సవానికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేసులు, సీఐ శ్రీహర్షతో నేతలు చర్చించారు.చంద్రబాబు ప్రభుత్వంలో రాయలసీమకు అన్యాయం ● మాజీ మంత్రి శైలజనాథ్ అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. అనంతపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమలో న్యాయ యూనివర్సిటీ, హైకోర్టు వంటి వాటిని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయకుండా కక్ష గట్టి వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు రాయలసీమలో పుట్టినా .. రాయలసీమ ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రంగా విడిపోయిన తర్వాత శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధానితో పాటు, ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఎన్నో ఒప్పందాలు జరిగాయన్నారు. చివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ రాయలసీమకు అభివృద్ధి చేకూర్చే విధంగా కొన్ని ప్రతిపాదనలు చేసిందని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత రాయలసీమ ప్రయోజనాలను విస్మరించారన్నారు. -
ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
కళ్యాణదుర్గం రూరల్: ఆర్థిక సమస్యలు తాళలేక లక్షన్న (60) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవార చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లుకు చెందిన లక్ష్మన్న, నాగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల లక్ష్మన్న కుటుంబ పోషణ కోసం రూ.5 లక్షలు అప్పులు చేశాడు. అప్పు తీర్చే మార్గంలేక మనోవేదనతో గ్రామ సమీపంలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఉరివేసుకొని మరొకరు .. అనంతపురం సెంట్రల్: నగరంలోని ఓ యుడకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. శింగనమలకు చెందిన తిరుమలేసు (41) సోమవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్నాడు. రోజంతా పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు సేకరించగా వచ్చే డబ్బులతో జీవనం సాగించేవాడు. అశోక్నగర్లోని గుజిరి షాపులోనే ఉంటున్నాడు. మనస్థాపంతో సోమవారం రాత్రి ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రొఫెసర్పై వరకట్న వేధింపుల కేసు నమోదు గుత్తి: గుత్తికి చెందిన డాక్టర్ ప్రియాంకను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసిన ఘటనలో ఆమె భర్త, ప్రొఫెసర్ ధనుంజయ కుమార్, ఆయన తల్లిదండ్రులు నాగేశం, రామ తులసిపై మంగళవారం రాత్రి వరకట్న వేధింపుల కేసు నమోదైంది. అనంతపురానికి చెందిన ధనుంజయ కుమార్, గుత్తికి చెందిన డాక్టర్ ప్రియాంకను 2022లో వివాహం చేసుకున్నాడు. ఇటీవల అతనితో పాటు ఆయన తల్లిదండ్రులు ప్రియాంకను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. రెండు రోజులు క్రితం ప్రియాంక వరకట్న వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన గుత్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ‘మిగులు భూమి’లో సాగుపై నోటీసు రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండల పరిధిలోని అనంతపురం–చైన్నె జాతీయ రహదారి పక్కన కందుకూరు పొలం 430–2 సర్వే నంబరులో 85 సెంట్ల ప్రభుత్వ భూమిలో మామిడి మొక్కలు నాటి, ఉలవలు విత్తిన కృష్ణంరెడ్డిపల్లికి చెందిన టీడీపీ నాయకుడు తిరుతపయ్యకు తహసీల్దార్ మోహన్కుమార్ నోటీసు జారీ చేశారు. వీఆర్ఓ గోవిందనాయక్ అందజేశాడు. రూ. 2.20 కోట్ల విలువైన ఈ 85 సెంట్ల స్థలం ప్రభుత్వ రికార్డుల్లో మిగులు భూమిగా ఉంది. ఈ భూమిని కొందరు కొట్టేయాలని స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే మామిడి మొక్కలు నాటడంతో పాటు ఉలవ పంట సాగు చేశారు. ఈ వ్యవహారంపై ఈనెల 6న ‘సాక్షి’లో ‘మిగులు భూమిని మింగేద్దామని’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ ఆనంద్ స్పందించి రెవెన్యూ, డ్వామా అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద మామిడి మొక్కలు సాగు చేశారనే ఆరోపణల నేపథ్యంలో డ్వామా పీడీ సలీంబాషా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించిన టెక్నికల్ అసిస్టెంట్ ఓబులేసు ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటలేదని వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిలో ఎలా సాగు చేస్తావంటూ తాజాగా రెవెన్యూ అధికారులు తిరుపతయ్యకు నోటీసు జారీ చేశారు. 24న విచారణకు హాజరుకాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యాలయంలోని రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
దూడకు ఆర్థోపెడిక్ సర్జరీ
అనంతపురం అగ్రికల్చర్: ప్రమాదవశాత్తూ ఏడాది వయస్సున్న పెయ్యదూడ దవడ విరిగిపోవడంతో పశుశాఖ ఏడీ డాక్టర్ జి.పద్మనాభం బృందం సర్జరీ చేసి బాగు చేసింది. రాయదుర్గానికి చెందిన ఎలుగు సతీష్కుమార్ అనే రైతుకు చెందిన పెయ్యదూడకు ప్రమాదంలో దవడ విరిగి చిట్లి పోయింది. మేత, నీళ్లు లేక బలహీనంగా తయారైంది. సంబంధిత పశువైద్యుడి దృష్టికి తీసుకెళ్లడం, సీరియస్ కేసు కావడంతో శింగనమల ఏడీ డాక్టర్ జి.పద్మనాభానికి సిఫారసు చేశారు. రాయదుర్గం నుంచి దూడను అనంతపురం పశువుల ఆస్పత్రికి తరలించి పరీక్షించారు. ఆర్థోపెడిక్ ఆపరేషన్ చేసేందుకు రైతు అంగీకారంతో నాలుక కింద ప్యాలెట్ ముకోసా చీరుకుపోయిన, చిట్లిపోయిన దూడ దవడ ఎముకకు 4.5 మి.మీ స్టెయిన్లెస్ స్టీల్ స్కాంజ్ పిన్ను అమర్చారు. ముక్కలైన దూడ దవడ ఎముకలను యథాస్థానంలో ఉండేలా శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం దూడ చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. శస్త్రచికిత్సలో అంబులెన్స్ డాక్టర్లు సునీత, సుచరిత, పారావెట్ ఆకాష్, ట్రైనీ డాక్టర్లు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 18 బాల, బాలికల అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు మంగళవారం రాప్తాడు జెడ్పీహెచ్ఎస్లో జరిగాయి. ఎంపికై న జట్లు త్వరలో జరగబోయే అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొంటాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, సుహాసిని పేర్కొన్నారు. ఖోఖో బాలురు జట్టు ఆంజనేయులు, నాగరాజు, గణేష్, చరణ్, లోహిత్రాజు, మహీంద్ర, సిద్ధార్థ, ప్రతాప్, న వదీప్, సాయికుమార్, ధనుష్కుమార్, నవదీప్కుమార్ బాలికల జట్టు చైతన్య, శాంతి, శరణ్య, భార్గవి, ఉదయ్, శ్రీ చందన, యజ్ఞశ్రీ, జాషుప్రియ, కావ్యశ్రీ, ప్రవల్లిక, వర్షిని, స్రవంతి అథ్లెటిక్స్ బాలురు ఏ అరవింద్, ఎస్ భరత్, టీ రాజేష్, ఏ సుశాంత్, వై మణిదీప్, భరత్కుమార్, హేమంత్బాబు, ఏ భార్గవ్, ఎస్ జాన్ అబ్బాస్, ఎం భరత్, కే దివాకర్, పీ సులేమాన్, సంతోష్, వీ అభి, ముర్తుజావలి, కే భరత్కుమార్, కే వర్షిత్, అరవాజ్ఖాన్, రాజశేఖర్, ఎన్ ఖాదర్, సెల్వనాథకుమార్ నాయక్ బాలికల జట్టు ఎం అంజుమ్, ఆర్ లిఖితారెడ్డి, ఇందులేఖ, ఇంద్రలేఖ, బిందు, వర్షిత, దీక్షిత, మౌనిక, వర్షిత, వెంకటలక్ష్మి, అవంతిక, సవిత, మన్విత, వర్షిణి, లిఖితరెడ్డి, లాస్యప్రియ, కోవెల, రమ్యశ్రీ, నవ్య, అలేఖ్య, శాలిని, మేఘన, రమ్య, క్రాంతి, సోఫియా, నాగవేణి. -
నేడు ప్రధాని మోదీ రాక
పుట్టపర్తి టౌన్: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పుట్టపర్తికి రానున్నారు. భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకోనున్నారు. అనంతరం ప్రత్యేక కాన్వాయిలో వెళ్లి సత్యసాయి మహా సమాధిని దర్శించుకోనున్నారు. అనంతరం శత జయంతి వేడుకల్లో పాల్గొని బాబా జీవితం, బోధనలు, శాశ్వత వారసత్వాన్ని స్మరించేందుకు రూపొందించిన స్మారక నాణెం, తపాలా స్టాంపుల సమితిని విడుదల చేయనున్నారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సులో పాల్గొననున్నారు. ఈ మేరకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేసింది. హిల్వ్యూ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ప్రధానితోపాటు పలువురు ప్రముఖుల కోసం వేదిక సిద్ధం చేశారు. మూడు రోజులుగా ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించి పోలీస్ సిబ్బంది భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. విమానాశ్రం నుంచి పుట్టపర్తి వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. సీఎంకు ఘనస్వాగతం సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి, చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మంగళవారం సాయంత్రం 5.15 గంటలకు పుట్టపర్తి విమానాశ్రం చేరుకున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ విజయానంద్, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగానే పుట్టపర్తి చేరుకున్న సీఎం, మంత్రులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన పోలీస్ యంత్రాంగం -
వేదన.. అరణ్య రోదన
అనంతపురం క్రైం: రాత్రనకా, పగలనకా కష్టించి పనిచేసిన కార్మికుల పీఎఫ్ ఖాతాల రికార్డులు కనిపించకుండా పోయాయి. అనంతపురం నగరపాలక సంస్థలో 1990–2010 కాలంలో పని చేసిన సుమారు 400 మంది కార్మికులకు రూ.3 కోట్ల మేర పీఎఫ్ డబ్బు నేటికీ అందలేదు. ఏళ్ల తరబడిగా తిరుగుతున్నా రికార్డుల్లేవంటూ అధికారులు చేతులెత్తేస్తుండడంతో బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. కార్మికుడి వేతనాన్ని బట్టి పీఎఫ్ ఉంటుంది. ఒక్కో కార్మికుడి వేతనం నుంచి నెలకు సుమారు రూ.600 చొప్పున పీఎఫ్ కట్ చేస్తారు. ఇలా ఏడాదికి రూ.7,200 ప్రకారం 9 ఏళ్లకు 64,800 అవుతుంది. ఇక కాంట్రాక్టర్ వైపు నుంచి కూడా కార్మికుడి పీఎఫ్ ఖాతాకు రూ.64,800 జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి అందే వడ్డీని కలిపితే రూ.1.34 లక్షలవుతుంది. ఏడాదికి కొంత వడ్డీ కలుపుతూ పోయినా ఒక్కో కార్మికుడికి రూ.3 లక్షల మేర జమ కావాలి. 15 ఏళ్లకు వడ్డీతో కలిపి నగదు రావాల్సి ఉన్నా, వారి కష్టార్జితానికి దిక్కూమొక్కు లేకుండా పోవడం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యం.. ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రి, ధర్మవరం, రాయదుర్గం, గుత్తి మున్సిపాలిటీల్లో 2002 నుంచే పీఎఫ్ రికార్డులు ఉండగా, అనంతపురంలో మాత్రం 2010కి ముందు పీఎఫ్ రికార్డులే లేకపోవడం ఇక్కడి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అధికారులు వాటిని చెత్త కుప్పల్లో వేసినట్లు తెలుస్తోంది. ఎండనక, వాననక మురికి కాలువల్లో మలమూత్రాలను సైతం ఎత్తివేశామని, అలాంటి తమ గోడు పట్టించుకోకపోవడం అన్యాయమని బాధితులు వాపోతున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. పారిశుధ్య కార్మికులకు రూ. 3 కోట్ల మేర అందని పీఎఫ్ డబ్బు పట్టించుకోని నగరపాలక అధికారులు రికార్డుల్లేవంటూ చేతులెత్తేస్తున్న వైనం -
ఒట్టిమాటలు.. ఉత్తచేతులు
అనంతపురం అగ్రికల్చర్: చంద్రబాబు సర్కారు తీరు మారడం లేదు. రైతులను దగా చేస్తూనే ఉన్నారు. అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 14 నెలల పాటు రైతులకు నయాపైసా అందించలేదు. ఏకంగా రూ.400 కోట్ల మేర ఎగ్గొట్టారు. తాజాగా ఈ ఏడాది అమలు చేస్తున్న ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ పథకంలోనూ కొర్రీలు వేసి ఉత్తచేతులు చూపుతున్నారు. గత ఆగస్టులో మొదటి విడతగా కేంద్రం నుంచి రూ.2 వేలు, రాష్ట్రం వాటాగా రూ.5 వేలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో రకరకాల కారణాలతో ఇప్పటికీ 5 వేల మందికి పైగా సొమ్ము జమ కాని పరిస్థితి. సాయం కోసం అధికారులు, బ్యాంకుల చుట్టూ ఇప్పటికీ బాధితులు తిరుగుతూనే ఉన్నారు. కనీసం రెండో విడతలోనైనా సొమ్ము జమ అవుతుందని ఆశ పెట్టుకున్న వారికి మళ్లీ నిరాశే మిగిలింది. అప్పటికి, ఇప్పటికి ఎంతో తేడా.. రెండో విడతగా పీఎం కిసాన్ కింద 2.55 లక్షల మంది రైతులకు రూ.51.16 కోట్లు, అన్నదాత సుఖీభవ ద్వారా 2.75 లక్షల మంది రైతులకు రూ.137.82 కోట్లు బుధవారం విడుదల చేయనున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అయితే, గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో సాయం అందుకున్న లబ్ధిదారులకు, నేడు చంద్ర బాబు సర్కారులో చూపుతున్న లెక్కలకు పొంతన లేకపోవడం గమనార్హం. గతంలో ‘పీఎం కిసాన్’ కింద 2.85 లక్షల మంది, ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద 2.94 లక్షల మంది వరకు రైతులకు క్రమం తప్పకుండా సొమ్ము జమ చేయగా.. నేడు ‘పీఎం కిసాన్’లో రైతుల సంఖ్యను 2.55 లక్షలకు కుదించారు. అంటే దాదాపు 30 వేల మంది రైతులను జాబితా నుంచి తొలగించేశారు. అలాగే ‘సుఖీభవ’ కింద 2.75 లక్షల మందికి మాత్రమే ఇస్తూ 20 వేల మంది రైతులకు కుచ్చుటోపీ పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి ఏడాది పూర్తిగా.. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన చంద్రబాబు మాటలు.. ఆయన ముఖ్యమంత్రి కాగానే ఒట్టివిగానే మిగిలిపోయాయి. ఇదిగో అదిగో అంటూ నెలల పాటు కాలం గడిపి... చివరకు పీఎం కిసాన్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.14 వేలు ఇస్తామన్నారు. కనీసం రూ.14 వేల ప్రకారం మొదటి ఏడాది ఇచ్చి ఉంటే జిల్లా రైతులకు రూ.400 కోట్ల మేర లబ్ధి చేకూరేది. కానీ, రైతులకు పైసా అందించకుండా పంగనామాలు పెట్టేశారు. సాధారణంగా ఏటా రైతుల సంఖ్య, భూమి పాస్పుస్తకాల సంఖ్య కొంతైనా పెరుగుతూ ఉంటుంది. ఈ లెక్కన గత ప్రభుత్వంలో కన్నా రైతుల సంఖ్య పెరగాల్సి ఉండగా అందుకు భిన్నంగా తగ్గిపోవడం గమనార్హం. ఈ–కేవైసీ, ఎన్పీసీఐ లింక్, మ్యాపింగ్ లేదంటూ సాయం అందించకుండా మోసం చేస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు. తీరు మారని చంద్రబాబు సర్కారు ‘పీఎం కిసాన్– అన్నదాత సుఖీభవ’లో కొర్రీలతో సాయం ఎగనామం 50 వేల మంది రైతులకు కుచ్చుటోపీ -
డీ హీరేహాళ్ ఎంపీడీఓ ‘పచ్చ’ భక్తి
సాక్షి టాస్క్ఫోర్స్: ‘పచ్చ’ భక్తిని చాటుకున్న డీ హీరేహాళ్ ఎంపీడీఓ దాసనాయక్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ డీ హీరేహాళ్ మండల కన్వీనర్ మోహన్రెడ్డిని మంగళవారం ఏకంగా ఎంపీడీఓ కార్యాలయంలోనే సన్మానించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ జీతం తీసుకుంటూ టీడీపీ నాయకుల సేవలో తరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీఓ తీరుపై రాయదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గౌని ప్రతాప్రెడ్డి, బీఎస్పీ ఇన్చార్జ్ చిందనూరు నాగరాజు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని టీడీపీ కార్యాలయంగా మార్చేయడం అన్యాయమన్నారు. కలెక్టర్, జెడ్పీ సీఈఓ స్పందించి ఎంపీడీఓతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 20న మెగా జాబ్మేళా అనంతపురం టౌన్: ఉప్పరపల్లి సమీపంలోని ఏఎఫ్ ఏకాలజీ సెంటర్లో ఈనెల 20న మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి పీవీ ప్రతాప్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ ఆపై విద్యార్హతలున్న నిరుద్యోగ యువతి, యువకులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 90100 39901 నంబర్లో సంప్రదించాలన్నారు. -
నైపుణ్య శిక్షణతోనే ఉపాధి అవకాశాలు
అనంతపురం టౌన్/రాప్తాడు: నైపుణ్య శిక్షణతోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ ఆనంద్ అన్నారు. మంగళవారం స్థానిక పంగల్ రోడ్డులోని టీటీడీసీలో స్కిల్ కళాశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ కేంద్రంలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టి నిరుద్యోగ యువతకు శిక్షణ అందించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువత శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు పొంది తల్లిదండ్రులకు బాసటగా నిలవాలన్నారు. నైపుణ్య శిక్షణపై గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు సూచనలివ్వాలన్నారు. అనంతరం టీటీడీసీ ఆవరణంలో కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శైలజా, జిల్లా మేనేజర్ సూర్యనారాయణ, డీపీఎం ఫైనాన్స్ సత్యనారాయణ, ఏపీఎం శ్రీనివాసులు, ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలి పెద్దవడుగూరు: రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని పి.వీరన్నపల్లి సమీపంలో రూ. 16.75 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడారు. బ్రిడ్జి నిర్మాణం ఎత్తుగా ఉండటంతో దారి సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని తహసీల్దార్ ఉషారాణిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పీజీఆర్ఎస్ అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారించారు. పత్తి పంట పొలాన్ని పరిశీలించి రైతు సుంకన్నతో మాట్లాడారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆయనతో వాపోయారు. కార్యక్రమంలో ఎస్ఈ సుబ్బరాయుడు, ఈఈ శ్రీరాములు, డీఈ డీఎల్ మురళీ, జేఈ పాండురంగారెడ్డి, ఎంపీడీఓ బారన్సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆనంద్ -
ఆటో బోల్తా – వ్యక్తి మృతి
వజ్రకరూరు: మండలంలోని చిన్నహోతురు సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. వజ్రకరూరు మండలం గడేహోతురు గ్రామానికి చెందిన ఆటో సోమవారం మధ్యాహ్నం ప్రయాణికులతో ఉరవకొండ నుంచి గడేహోతురుకు బయలుదేరింది. చిన్నహోతురు సమీపంలోకి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డుపై ఆటో బోల్తాపడింది. ఘటనలో పామిడి మండలం రామగిరి గ్రామానికి చెందిన కురుబ తిరుపతయ్య (55), గడేహోతురుకు చెందిన బెస్త మారుతి, సావిత్రమ్మ, గుత్తికి చెందిన లింగమ్మ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ప్రైవేట్ వాహనంలో గుంతకల్లులోని ప్రైవేట్ ఆస్పత్రికి క్షతగాత్రులను చేర్చారు. చికిత్స పొందుతూ తిరుపతయ్య మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ మోకా సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేపట్టారు. వివాహిత దుర్మరణం ● మరో ముగ్గురికి తీవ్ర గాయాలు గార్లదిన్నె: లారీ ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై కుటుంబసభ్యులతో కలసి వెళుతున్న వివాహిత దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు.. శింగనమలకు చెందిన పోతన్న, రమాదేవి (35) దంపతులు తమ కుమారుడు శివతో కలసి పామిడిలో నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత పనిపై ముగ్గురూ శింగనమలకు వెళ్లిన వారు సోమవారం ఉదయం తమ బంధువు శేఖర్తో కలసి నలుగూరు ఒకే ద్విచక్ర వాహనంపై పామిడికి తిరుగు ప్రయాణమయ్యారు. గార్లదిన్నె మండలం తిమ్మంపేట క్రాస్ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన పార్శిల్ సర్వీసు లారీ ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన రమాదేవి తలపై లారీ చక్రాలు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోతన్న, శివ, శేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లారీతో పాటు ఉడాయించాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రులను అనంతపురంలోని జీజీహెచ్కు తరలించింది. విషయం తెలుసుకున్న గార్లదిన్నె పీఎస్ ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా వెంటనే స్పందించి కల్లూరు వద్ద లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వివాహిత హత్య కేసులో మరో ఇద్దరి అరెస్ట్ బెళుగుప్ప: మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఈ నెల 13న చోటు చేసుకున్న వివాహిత శాంతి హత్య కేసులో ముగ్గురిపై కేసు నమోదు కాగా, ఇప్పటికే భర్త ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. సోమవారం తిప్పేస్వామి, జయసింహను గుండ్లపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
జనరేటర్లోకి దూరి అజ్ఞాత వ్యక్తి మృతి
అనంతపురం సెంట్రల్: జనరేటర్లోకి దూరిన వ్యక్తి కరెంట్ షాక్కు గురై మృతిచెందాడు. తొమ్మిది రోజుల ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... సోమవారం ఉదయం అనంతపురంలోని సాయినగర్ మొదటి క్రాస్లో ఉన్న భారతీ హాస్పిటల్కు చెందిన జనరేటర్ వద్ద దుర్వాసన వెదజల్లుతుండడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. జనరేటర్ తలుపు తీసి చూడగా వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆస్పత్రి వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా ఈ నెల 8న రాత్రి చలి తీవ్రతకు వణుకుతూ 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మతి స్థిమితం లేని వ్యక్తి జనరేటర్ తలుపు తీసి లోపలకు ప్రవేశిస్తున్న దృశ్యాలు కనిపించాయి. మృతదేహం పూర్తిగా ఉబ్బి గుర్తు పట్టలేని విధంగా మారింది. వీఆర్వో రాజారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అనంతపురం రెండో పట్టణ సీఐ శ్రీకాంత్యాదవ్ తెలిపారు. -
పంట నష్ట పరిహారం అందించాలి
అనంతపురం అర్బన్: అకాలవర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారాన్ని అందించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌస్బేగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మారుతీనాయుడు, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ... ఈ ఏడాది మార్చిలో కురిసిన అకాల వర్షాలకు పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, పెద్దవడుగూరుతో పాటు పలు మండలాల్లో అరటి, మొక్కజొన్న, దానిమ్మ తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. రూ.47.47 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి అప్పటి కలెక్టర్ వినోద్కుమార్ నివేదిక కూడా పంపించారన్నారు. అయితే ఇప్పటికీ రైతులకు పరిహారం అందలేదన్నారు. రైతులకు పరిహారం అందించకపోతే రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రోడ్డెక్కిన అరటి రైతు అరటి పంటను ప్రభుత్వమే గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట పండ్ల తోటల రైతు సంఘం ఆధ్వర్యంలో ఉద్యాన రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పండ్ల తోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి శివారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. టన్ను రూ.15వేలతో ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం అందజేశారు. అరటికి గిట్టుబాటు ధర కల్పించాలి అరటికి గిట్టుబాటు ధర కల్పించి టన్ను రూ.22 వేలతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నప్ప యాదవ్, చిరుతల మల్లికార్జున డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అరటి రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కౌలు రైతులకు ‘సుఖీభవ’ వర్తింపజేయాలి అన్నదాత సుఖీభవ పథాకం కింద కౌలు రైతులకు ఒకేసారి రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఎన్నికల హామీ మేరకు నూతన కౌలు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడారు. అనంతరం కలెక్టర్ ఆనంద్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ నాయకుల డిమాండ్ పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేత -
పుట్టపర్తికి పెరిగిన భక్తుల రద్దీ
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నేపథ్యంలో ప్రశాంతి నిలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైలు మార్గం ద్వారా ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ చేరుకుంటున్నారు. దీంతో స్టేషన్ ఆవరణ భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుండి రాత్రి వరకూ భక్తులు వస్తూనే ఉన్నారు. సోమవారం ప్రశాంతి రైల్వే స్టేషన్ మీదుగా 16 రైళ్లు రాక పోకలు సాగించాయి. ఇందులో 6 రైళ్లు బెంగళూరు నుంచి రాగా, మిగతా 10 రైళ్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చాయి. రైల్వే స్టేషన్కు వచ్చిన భక్తులకు, సిబ్బందికి అక్కడే మూడు పూటలా భోజన వసతి, వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడే హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం చేరుకునేందుకు ఉచిత ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో సత్యసాయిసేవాదళ్ సభ్యులు ఎప్పటికప్పుడు స్టేషన్ ఆవరణను శుభ్రం చేస్తున్నారు. కొన.. సాగుతున్న ఏర్పాట్లు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల కోసం చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిలో చంద్రబాబు ప్రభుత్వం నత్తతో పోటీ పడుతోంది. శత జయంతి వేడుకలు ప్రారంభమై 6 రోజులైనా ఇప్పటికీ పట్టణంలో నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ 19న పుట్టపర్తికి విచ్చేస్తున్న నేపథ్యంలో ప్రధాన రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించి వాహన రాకపోకలను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. అయితే ఆయా రోడ్ల నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండటం.. హిటాచీలు, జేసీబీలు ట్రాక్టర్లు అడ్డు వస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిత్రావతి నదిని ఆనుకుని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఇంకా తారువేయడంలోనే ఉన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, కలెక్టర్ ఏర్పాట్లపై పలు మార్లు సమీక్షలు చేసినా... కాంట్రాక్టర్లు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ● చిత్రావతి నది రహదారితో పాటు ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటు చేస్తున్న చిన్న పార్కు పనులు ఇంకా నాలుగు రోజులైనా పూర్తయ్యే అవకాశం లేదు. ఇప్పటికీ కూలీలు నిర్మాణ పనుల్లోనే కనిపిస్తున్నారు. ● రైల్వే స్టేషన్ నుంచి పుట్టపర్తికి వచ్చే ప్రధాన రహదారి డివైడర్ల మధ్య మొక్కలు కత్తిరింపు పనులు కూడా సోమవారం నాటికీ పూర్తి కాలేదు. ● మామిళ్లకుంట క్రాస్ వద్ద డివైడర్ల మధ్య పిచ్చి మొక్కలు తొలగించడం, శుభ్రం చేసే పనులు రోజుల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. మరో 5 రోజుల్లో ఉత్సవాలు ముగుస్తాయని, ఆలోపైనా పనులు పూర్తి చేస్తారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్ -
ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ అంటూ భక్తులు చేసిన నామస్మరణతో జిల్లా మార్మోగింది. కార్తీక మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని పోటెత్తిన భక్తులతో పరమేశ్వరుడి ఆలయాలు కిటకిటలాడాయి. మహాదేవుడిని మనసారా కొలిచిన భక్తులు ఆలయ ఆవరణాల్లో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. బుక్కరాయసముద్రం మండలం ముసలమ్మ కట్ట వద్ద ఉన్న కాశీవిశ్వేశ్వర ఆలయంలో గంగా హారతి సందర్భంగా సందడి నెలకొంది. ఆద్యంతం భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
ఐదుకల్లులో అక్రమ మైనింగ్ ఆపండి
అనంతపురం అర్బన్: శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామం వద్ద టీడీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న అక్రమ మైనింగ్ను వెంటనే నిలిపి వేయించాలని వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య కోరారు. సోమవారం కలెక్టర్ ఆనంద్ను కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ పొలం సర్వే నంబరు 185లోని 292.55 ఎకరాల ఐదుకల్లు కొండను టీడీపీ నాయకులు పిండి చేస్తున్నారన్నారు. కొండపై పురాతన దేవాలయాలు, నీటి కొలనులు ఉన్నాయని, వన్యప్రాణులు ఆవాసం ఏర్పరచుకున్నాయని, వృక్ష సంపద కూడా అధికంగా ఉన్న ఇలాంటి కొండను కాపాడుకోవాల్సింది పోయి అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బ్లాస్టింగ్ కారణంగా రైతుల బోరుబావులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యంతో గ్రామ ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలతో ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. అక్రమాలపై ప్రశ్నించిన ఐదుకల్లు గ్రామస్తులు భూలక్ష్మి, రామాంజనేయులు, ఎస్.నాగరాజు, బి.మంజులమ్మ, జ్యోతిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అక్రమ కేసు బనాయించారన్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి బ్లాస్టింగ్ నిలిపివేయించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చామలూరు రాజగోపాల్, జెడ్పీటీసీ మంజనాథ్, ఎంపీపీలు చంద్రశేఖర్రెడ్డి, సోమనాథరెడ్డి, అంజి, సర్పంచులు ఈరన్న, విజయ్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, మునిసిపల్ మాజీ చైర్మన్ రాజ్కుమార్, మండల కన్వీనర్లు గోళ్ల సూరి, సుధీర్, హనుమంతరాయుడు, చంద్రశేఖర్రెడ్డి, ఎంఎస్ రాయుడు, నాయకులు బిక్కిహరి, జిల్లా కార్యదర్శులు ఎర్పంపల్లి కృష్ణమూర్తి, రామాంజనేయులు యాదవ్, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు గోపాల్రెడ్డి, పాత లింగ, దొడగట్ట మురళి, కనుమక్కపల్లి మల్లి, నారాయణ స్వామి, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ను కోరిన మాజీ ఎంపీ తలారి రంగయ్య -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పెద్ద కుట్ర
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పెద్ద కుట్ర అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. సోమవారం స్థానిక జేఎన్టీయూ సమీపంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా విద్యార్థులు, యువత సంతకాలు చేయడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం పట్ల వారి అభిప్రాయాలను సైతం రాయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాబు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వ వైద్య కళాశాలల విషయంలో వైఎస్ జగన్ ఆలోచన చాలా గొప్పదని పలువురు అభిప్రాయపడగా, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కొంతమంది రాయడం గమనార్హం. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్ ఉన్న నాయకుడన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలని, ఆ కళాశాలకు అనుబంధంగా సూపర్స్పెపాలిటీ ఆస్పత్రి ఉండాలని భావించి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా రాష్ట్రానికి కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారన్నారు. మూడేళ్లలో ఏడు మెడికల్ కళాశాలలను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారన్నారు. తక్కిన 10 కళాశాలలు 30 నుంచి 70 శాతం పనులు పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజా ఆస్తినంతటినీ ప్రైవేట్కు ధారాదత్తం చేయాలని కుట్ర పన్నిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభీష్టమే గొప్పదని, మెడికల్ కళాశాలల అంశంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. ఖాకీ జులుం ప్రజలపై చూపించినా, పార్టీ ముసుగులో దౌర్జన్యాలు చేయాలని చూసినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి, అమర్నాథరెడ్డి, ఇంటలెక్చువల్ ఫోరం శంక రయ్య, దాసిరెడ్డి, తానీషా, నాయకులు నాగార్జున రెడ్డి, కార్పొరేటర్ సంపంగి రామాంజనేయులు, మోక్షిత్ సుబ్బారెడ్డి, నిజాముద్దీన్, హరి, లబ్బే రాఘవ, ఎగ్గుల శ్రీనివాసులు, ఫయాజ్, స్థానిక నాయకులు కుడేటి మహేష్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు, విజయ్ కుమార్, ప్రతాప్, సాయిచరణ్, దత్త, ప్రభాకర్, చంద్రమోహన్రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు మేలు చేయాలనే వైఎస్ జగన్ ఆలోచన గొప్పది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
చీటీల పేరుతో మోసం చేశారని ఇంటిపై దాడి
గుంతకల్లు:చీటీల పేరుతో మోసం చేశారంటూ నిర్వాహకురాలి ఇంటిపై బాధితులు దాడి చేసిన ఘటన గుంతకల్లులో జరిగింది. వివరాలు.. పట్టణంలోని ధర్మవరం గేట్ సమీపంలో షాహి ఫొటో స్టూడియో నిర్వాహకురాలు దిల్షాద్బేగం చీటీలు నడిపేది. తెలిసిన వాళ్లతో పాటు ఇరుగుపొరుగు చాలా మంది ఆమె వద్ద చీటీలు వేశారు. అయితే చీటీల గడువు పూర్తయినా దిల్షాద్బేగం డబ్బు మాత్రం ఇవ్వలేదు. చీటీలు వేసిన వారు అనేక సార్లు ఆమె ఇంటి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు పర్వీన్, షాకీరా, కౌసర్ తదితరులు ఎంఆర్పీఎస్ నాయకురాలు జ్యోతి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం దిల్షాద్బేగం ఇంటిని చుట్టుముట్టారు. దిల్షాద్బేగంతో పాటు తండ్రి మైనును బయటకు లాగి కళ్లలో కారం చల్లి దాడి చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.ఈ క్రమంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని దిల్షాద్బేగం, ఆమె తండ్రిని పోలీసుస్టేషన్కు తరలించడంతో అంతా స్టేషన్కు వెళ్లారు. స్పౌజ్ కోటా కింద అంతర్ జిల్లాల బదిలీలు అనంతపురం సిటీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అంతర్ జిల్లాల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. స్పౌజ్ కోటా కింద మాత్రమే బదిలీలకు అవకాశం కల్పించింది. కేవలం ‘రిక్వెస్ట్’పైనే బదిలీలుంటాయని జీఓలో పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా యూనిట్గా బదిలీలు నిర్వహిస్తారు. క్రమశిక్షణ చర్యలు, ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న వారికి అర్హత లేదు. నో డ్యూ సర్టిఫికెట్ విధిగా ఉండాలి. మెరిట్ ర్యాంక్ ఆధారంగా సీనియారిటీ జాబితా రూపొందిస్తారు. క్లియర్ వేకెన్సీ ఉన్నప్పుడు మాత్రమే బదిలీ చేస్తారు. కొత్త జిల్లాలో చివరి ర్యాంక్ కేటాయిస్తారు. సీనియారిటీ తరువాత డేట్ ఆఫ్ బర్త్ను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నెల 30లోపు ప్రక్రియ పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది. వెల్లువెత్తిన వినతులు ● పరిష్కార వేదికకు 395 అర్జీలు అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. ప్రజల నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్తో పాటు డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రమేష్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు.వివిధ సమస్యలపై మొత్తం 395 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా, ప్రతి సమస్యకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. వినతుల్లో కొన్ని... ● రాజకీయ ఒత్తిళ్లతో తనపై 6ఏ కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారని గుత్తి మండలం ఎంగన్నపల్లి చౌక దుకాణం (1206038) డీలర్ నాగన్న చౌదరి ఫిర్యాదు చేశాడు. దీనిపై పలుమార్లు అర్జీ ఇచ్చానని చెప్పాడు. సమగ్ర విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని కోరాడు. ● తమకు అందాల్సిన ‘తల్లికి వందనం’ డబ్బులు వేరొకరి ఖాతాలో జమయ్యాయని, దీనిపై ఏడు సార్లు అర్జీ ఇచ్చినా పరిష్కారం కాలేదని నార్పల గ్రామానికి చెందిన ఎం.శ్రీనివాసులు వాపోయాడు. ● తమ ప్రాంతంలో రోడ్లు, కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని అనంతపురం నగరంలోని భాగ్యనగర్ 3వ క్రాస్కు చెందిన బి.రాధిక విన్నవించింది. దీంతో స్థానికులు, ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని, కాలనీలో రోడ్లు, కాలువలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ● కామారుపల్లి వద్ద ఇచ్చిన ఇంటి పట్టా రద్దు చేసి కొత్తగా ఇంటి స్థలం మంజూరు చేయాలని అనంతపురం నగర పరిధిలోని అంబేడ్కర్ నగర్కు చెందిన దివ్యాంగురాలు బి.బాలకొండమ్మ వేడుకుంది. -
●బాబా అవతార ప్రకటనకు వేదిక ఉరవకొండ
ఉరవకొండ: సత్యసాయి తనను తాను బాబాగా అవతార ప్రకటన చేసింది ఉరవకొండలోనే. 1926, నవంబర్ 23న పుట్టపర్తిలోని పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకు నాల్గో సంతానంగా జన్మించిన సత్యనారాయణరాజు అక్కడికి దగ్గరలో ఉన్న బుక్కపట్నం గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత ఉరవకొండలోని శ్రీకరిబసవస్వామి బోర్డు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తన పెద్ద అన్న శేషమరాజు వద్దకు చేరుకుని దాదాపు ఏడాది పాటు అదే పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 1940 అక్టోబర్ 20న పాఠశాలకు వెళ్లిన సత్యనారాయణరాజు.. తిరిగి ఇంటికి చేరుకుని చేతిలోని పుస్తకాల సంచిని లోపలకు విసిరేసి అక్కడికి సమీపంలోని అబ్కారీ బంగాళా వద్ద ఉన్న రాతి గుండుపై కూర్చొని ‘మాయ వీడింది.. నేను సత్యనారాయణను కాదు సత్యసాయిబాబాను, నా కర్తవ్యాన్ని నిర్వహించాల్సి ఉంది. నన్ను నా భక్తులు పిలుస్తున్నారు నేను వెళ్తున్నానంటూ’ ధ్యానంలోకి వెళ్లిపోయారు. మానవజాతిని అసత్యం నుంచి సత్యం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు నడిపించే గురుచరణములను ప్రవచించి, దుర్భరమైన సంసార సాగరాన్ని దాటడానికి ప్రయత్నించండి అంటూ తొలిసారిగా ‘మానస భజరే గురుచరణం’ గీతాన్ని భక్తులతో ఆలపింప చేశారు. సత్యనారాయణరాజు అవతార ప్రకటన విషయాన్ని శేషమరాజు ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు ఉరవకొండకు చేరుకుని బాబాను పుట్టపర్తికి పిలుచుకెళ్లారు. నాడు బాబా అవతార ప్రకటన చేసిన రాతి గుండుకు స్థానికులు పూజలు చేస్తూ వస్తున్నారు. ఆ ప్రాంతంలో 2003లో గురుచరణ భజన మందిరాన్ని డాక్టర్ నలబాల ఆంజనేయులు నిర్మించారు. అప్పటి నుంచి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. -
దోపిడీకి తెరలేపిన ఎమ్మెల్యేలు
రాప్తాడు రూరల్: మళ్లీ అధికారం దక్కడం కష్టమని తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నంతలో దోచుకునేందుకు తాపత్రయపడుతున్నారని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. సోమవారం అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న బీజీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గంలోని మాజీ స్టోర్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వలంటీర్లు, యానిమేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈవీఎంల వల్లనే వైఎస్సార్సీపీ ఓడిపోయిందనే అభిప్రాయం చాలామందిలో ఉందన్నారు. ఇదే వాస్తమని నిర్ధారించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రకటించిన మేనిఫోస్టోను అధికారం చేపట్టిన తర్వాత అమలు చేయడంలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమలయ్యారన్నారు. దోచుకోవడమే పరిటాల కుటుంబం విధానం ఇది చివరి అవకాశంగా భావిస్తూ ఉన్నకాటికి ఊడ్చుకుని పోదాం... అందినకాటికి దోచుకుందాం అనే విధానంతో పరిటాల కుటుంబం పని చేస్తోందన్నారు. ప్రజలకు మంచి చేద్దామని కానీ, ఇచ్చిన హామీలు అమలు చేద్దామని కాని వారు ఆలోచించడం లేదన్నారు. సీఎం చంద్రబాబు కూడా అమరావతి అభివృద్ధి పేరుతో రూ. లక్ష కోట్ల దోపిడీకి రాజమార్గం ఏర్పాటు చేసుకున్నారన్నారు. రాయలసీమ, ఉత్తరాంఽధ్ర, వెనుకబడిన జిల్లాల గురించి ఆలోచించడం లేదన్నారు. జగనన్న లేని లోటు తెలుస్తోంది..జగనన్న అధికారంలో లేనిలోటు రాష్ట్రమంతా తెలిసివచ్చిందన్నారు. గతంలో ఇళ్ల వద్దకే పథకాలు, ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, పురుగు మందులు గ్రామాల్లోనే పంపిణీ చేసేవారన్నారు. నేడు కనీసం యూరియా కూడా ఇవ్వలేని అసమర్థత పాలన సాగుతోందని మండిపడ్డారు. ఎవరు రక్షకుడో, ఎవరు భక్షకులో పాపంపేట, కక్కలపల్లికాలనీ, చిన్మయానగర్ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైందన్నారు. ఇప్పుడు మార్పు మొదలైందన్నారు. ఈ విషయం అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు మండలాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భవిష్యత్తు వైఎస్సార్సీపీదేనని స్పష్టం చేశారు. సమావేశంలో అనంతపురం, రాప్తాడు, రామగిరి మండలాల కన్వీనర్లు బండి పవన్కుమార్, సాకే వెంకటేశు, మీనుగ నాగరాజు, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, నాయకులు గంగుల సుధీర్రెడ్డి, అమర్నాథరెడ్డి, గోపాల్రెడ్డి, ఓబుగారి హరినాథరెడ్డి, ఎస్కేయూ లింగారెడ్డి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. మళ్లీ అధికారం దక్కదనే అరాచకం ఇది చివరి అవకాశంగా భావించిన పరిటాల కుటుంబం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి -
యథేచ్ఛగా తవ్వకాలు.. రైతుల కంగారు
బొమ్మనహాళ్: కర్ణాటక–ఆంధ్రా సరిహద్దు వద్ద తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పక్కనే మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కాలువ గట్టుపై కన్నేసిన స్వార్థపరులు భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. ఇప్పటికే వీరి నిర్వాకంతో అక్కడ పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. హెచ్చెల్సీ గట్టును ఆనుకొనే తవ్వుతుండడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో కాలువ బలహీనపడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కర్ణాటక పరిధిలోని భూమిలో తవ్వుతున్నారనే నెపంతో మిన్నకుండిపోతున్నారు. హెచ్చెల్సీ అధికారులు కూడా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే తవ్వకాలను నిలిపివేయకపోతే ప్రమాదం తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై బొమ్మనహాళ్ తహసీల్దార్ మునివేలును సంప్రదించగా.. ఆయన స్పందించారు. సరిహద్దులో హెచ్చెల్సీ పక్కన మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు ఆదివారం సాయంత్రం తన దృష్టికి వచ్చిందని, వెంటనే స్థానిక ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లి మట్టి తవ్వకాలను నిలిపి వేయించామన్నారు. సోమవారం విచారణ చేసి కాలువ పక్కన మళ్లీ మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయమై బొమ్మనహాళ్ హెచ్చెల్సీ ఏఈఈ అల్తాఫ్ మాట్లాడుతూ మట్టి తవ్వకాలతో కాలువకే ప్రమాదం ఏర్పడుతుందన్నారు.కర్ణాటక అధికారుల దృష్టికి తీసుకెళ్లి మట్టి తవ్వకాలు జరపకుండా చూస్తామన్నారు. హెచ్చెల్సీ సమీపంలోనే మట్టి తవ్వకాలు చేపడుతున్న స్వార్థపరులు పట్టించుకోని అధికారులు -
అశాంతి‘పురం’గా మారుస్తున్నారు
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రోద్బలంతోనే ఆయన పీఏల ఆదేశాల మేరకు టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని పార్టీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్రెడ్డి అన్నారు. హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, మాజీ ఎంపీ తలారి రంగయ్యతో కలిసి ఆయన ఆదివారం హిందూపురంలో టీడీపీ గూండాల చేతిలో ధ్వంసమైన వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రమేష్రెడ్డి మాట్లాడుతూ.. హిందూపురం నియోజకవర్గంలో భూ దందాలు ఎక్కువ అయ్యాయని, మద్యం ఏరులై పారుతోందని, అవినీతి అక్రమాలు వెలుగులోకి తెస్తున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త దీపికను చూసి ఓర్వలేక దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. టీఈపీ నేతలు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తోన్న ఓ ఆడబిడ్డపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం పిరికిపంద చర్య అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశాంతమైన హిందూపురాన్ని అశాంతి పురంగా మారుస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యాలయంపై జరిగిన దాడులకు నియోజకవర్గంలో పర్యటిస్తోన్న ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యత వహించాలన్నారు. నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు ఫయాజ్ బాషా, రాష్ట్ర కార్యదర్శి మధుమతిరెడ్డి ఉన్నారు. టీడీపీ డైరెక్షన్లోనే పోలీసులు ఎవరైతే వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారో.. వారందరికీ త్వరలోనే గుణపాఠం చెబుతామని హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక హెచ్చరించారు. అధికార మదంతోనే దాడులు చేస్తున్నారని.. రేపు ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో టీడీపీ వాళ్ల ఊహకే వదిలేస్తున్నామన్నారు. -
ఆంక్షలు.. అడ్డగింతలు
సాక్షి నెట్వర్క్:జిల్లాలో అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ గూండాలు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయ ధ్వంసమే ఇందుకు నిదర్శనం. ‘రెడ్బుక్’ పాలనలో వారు చెలరేగిపోతున్నా..పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. పైగా ప్రతిపక్ష పార్టీ నేతలపై నిర్బంధాలు విధిస్తూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కునూ కాలరాస్తున్నారు. ‘పురం’ వైఎస్సార్సీపీ కార్యాలయంపై శనివారం టీడీపీ అల్లరి మూకల దాడి నేపథ్యంలో ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి ఆదివారం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పలువురు ముఖ్య నేతలు బయలుదేరారు. అయితే..వారిని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ నిర్బంధించారు. హిందూపురం పట్టణంలో ర్యాలీలు, ధర్నాలు చేయకూడదని వైఎస్సార్సీపీ నియోజక వర్గ నేత వేణురెడ్డికి నోటీసులు అందించగా.. ఆయన అందుకు ఒప్పుకున్నా పార్టీ ముఖ్య నేతలను ‘పురం’లోకి అడుగుపెట్టనీయకుండా కట్టడి చేయడం ద్వారా ఖాకీలు తమ‘వైఖరి’ని బయటపెట్టుకున్నారు. హిందూపురం బయలుదేరిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డిని మార్గమధ్యంలోని కదిరిలో పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా ఆయన్ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి స్వగృహంలో నిర్బంధించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కునూ ప్రభుత్వం కాలరాస్తోందని సతీష్రెడ్డి ధ్వజమెత్తారు. కొట్నూరు వద్ద పోలీసుల ఓవరాక్షన్.. హిందూపురానికి వస్తున్న వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలను హిందూపురం పట్టణ సమీపంలోని కొట్నూరు ఇందిరమ్మ కాలనీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎవరూ హిందూపురంలోకి రాకుండా ఆదివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు అన్ని దారులనూ దిగ్బంధించారు. అనంత వెంకటరామిరెడ్డిని అనంతపురంలోని ఆయన స్వగృహం వద్దే టూటౌన్ సీఐ శ్రీకాంత్, పోలీసులు అడ్డుకున్నా.. వారి తీరుపై మండిపడ్డ ‘అనంత’ చివరకు హిందూపురం సమీపంలోని కొట్నూరు వద్దకు చేరుకోగా.. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, బూత్ కమిటీల జిల్లా అధ్యక్షుడు అమరనాథ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. పురంలోకి అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి బస్సులో హిందూపురం వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు కిందికి దించేశారు. అనంతరం ఎస్కార్టుతో అనంత, పెద్దారెడ్డి, ఇతర నేతలను అనంతపురం టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో స్థానిక కోర్టు రోడ్డుకు చేరుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పెనుకొండలో ఉషశ్రీ అడ్డగింత.. హిందూపురంలో పార్టీ కార్యాలయాన్ని పరిశీలించి.. కార్యకర్తలను పరామర్శించేందుకు జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆదివారం ఉదయం పెనుకొండ నుంచి బయల్దేరుతుండగా పోలీసులు అక్కడికి చేరుకుని గృహనిర్బంధం చేసేందుకు యత్నించారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీసుల తీరును తప్పు పడుతూ నినాదాలు చేశారు. ఉషశ్రీచరణ్ హిందూపురం వెళ్లకుండా ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు మూడు గంటలపాటు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. డీఎస్పీ నరసింగప్ప అక్కడికి చేరుకుని, శాంతిభద్రతలకు సహకరించాలని కోరడంతో ఉషశ్రీచరణ్ ఆగిపోయారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీ నర్ బోయ నరసింహ, గోరంట్ల మండల కన్వీనర్ వెంకటేషులు, సోమందేపల్లి జెడ్పీటీసీ అశోక్, నాయకులు నాగలూరు బాబు, ప్రభాకర్రెడ్డి, సురేష్రెడ్డి, శ్రీనివాసులు, మిల్ట్రీ బాషా, సి.నారాయణరెడ్డి, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. గృహ నిర్బంధాలు.. హిందూపురంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఆదివారం స్థానిక టూ టౌన్ సీఐ రెడ్డెప్ప, పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కేతిరెడ్డి బయటకు రాకుండా గస్తీ నిర్వహించారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అనంతపురంలోనే హౌస్ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డికి నోటీసులిచ్చి ‘పురం’ వెళ్లకుండా చూశారు. కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బుల్ను మార్గమధ్యంలోనే అడ్డుకుని.. లేపాక్షి పోలీసుస్టేషన్కు తరలించారు. పార్టీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో పరిశీలనకు వస్తున్న వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు ఎమ్మెల్యే బాలకృష్ణ డైరెక్షన్లో ప్రజాస్వామ్యం ఖూనీ పోలీసుల తీరుపై మండిపడిన వైఎస్సార్సీపీ నేతలు కొట్నూరు వద్ద అనంత, పెద్దారెడ్డి తదితరుల నిరసన పెనుకొండలో రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి ఉషశ్రీ -
సాయి స్ఫూర్తి.. సేవా దీప్తి
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి చూపిన బాటలో నడుస్తున్న భక్తులు సేవాభావంతో గ్రామాల రూపురేఖలు మారుస్తున్నారు. ముఖ్యంగా సత్యసాయిబాబా దర్శనార్థం ప్రశాంతి నిలయానికి వచ్చే విదేశీ భక్తులు ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకొని తమ వంతుగా సహకారం అందిస్తూ విద్యావ్యాప్తికి, పేద ప్రజలకు తోడ్పాటునందిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా విడదీయరాని బంధం.. పుట్టపర్తితో విదేశీయుల బంధం మూడు దశాబ్దాలుగా సాగుతోంది. తొలినాళ్లలో సత్యసాయి దర్శనార్థం వచ్చే విదేశీ భక్తులు నెలల తరబడి ప్రశాంతి నిలయంలోనే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే సమీపంలోని గ్రామాలను సందర్శించి ఆయా గ్రామాల్లోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించేవారు. అనంతరం తమవంతుగా సాయం అందించేవారు. ముఖ్యంగా అటవీ ప్రాంత గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే విదేశీయులు వచ్చారంటే గ్రామస్తుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. వారికి సాదర ఆహ్వానం పలకడం, పూల మాలలు వేసి సత్కరించడం చేస్తుంటారు. విదేశీయులు కూడా ఆయా గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లి పిల్లలను ఆప్యాయంగా పలకరించేవారు. వారికి కావాల్సిన నోటు పుస్తకాలు, పెన్నులు, దుస్తులు ఇచ్చేవారు. కొంతకాలం తర్వాత ఉపాధ్యాయుల సూచనలతో పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తూ వస్తున్నారు. పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇలా.. ● నెదర్లాండ్కు చెందిన ‘లిసాయ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గంగిరెడ్డిపల్లిలో రూ.20 లక్షలు వెచ్చించి రెండు అదనపు గదులు, రేకుల షెడ్డు, ప్రాథమిక పాఠశాలలో బెంచ్లు, టైల్స్ ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం ఫిల్టర్ అందుబాటులోకి తెచ్చారు. ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ సీపీయూ, ప్రింటర్ అందజేశారు. ● వెంగళమ్మచెరువు, పుట్టపర్తి ఉన్నత పాఠశాలల్లో విదేశీయుల సహకారంతో సుందరవళ్లి అనే భక్తురాలు రూ.5 లక్షల చొప్పున వెచ్చించి రెండు రీడింగ్ షెడ్లు నిర్మింపజేశారు. ● అమగొండపాళ్యం, బొంతలపల్లి, కప్పలబండ, భవిత కేంద్రం తదితర చోట్ల కావాల్సిన మౌలిక వసతులు కల్పించి ఆదుకున్నారు. చెర్లోపల్లి గ్రామాభివృద్ధికి విశేష కృషి మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామాభివృద్ధికి విదేశీయులు విశేష సహకారం అందించారు. గ్రీసు దేశానికి చెందిన జార్జి బెబిలిడీస్ బృందం చెర్లోపల్లి అభివృద్ధి బాటలు వేశారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో అదనపు గదులతో పాటు విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లకు నూతన సీపీయూలు అందించి విద్యాభివృద్ధికి పాటు పడ్డారు. గతంలో పాఠశాలలో పని చేసిన హెచ్ఎం చెన్నకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చెర్లోపల్లి పాఠశాలను జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు. తరచూ గ్రామాన్ని సందర్శించే విదేశీయులు విద్య ప్రాముఖ్యను తెలిపేలా పాఠశాల గోడలపై పెయింటింగ్స్తో పాటు దేశ నాయకుల ఫొటోలు వేయించారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజనానికి అవసరమైన గ్లాసులు, ప్లేట్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. సత్యసాయి మార్గాన్ని అనుసరిస్తున్న విదేశీయులు ప్రశాంతి నిలయం రాక.. గ్రామాల సందర్శన సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్న వైనం పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యా సామగ్రి అందజేత పాడి ఆవులు, కుట్టుమిషన్ల పంపిణీతో మహిళలకు ఆర్థిక చేయూత ‘అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు’ అన్న సత్యసాయి బాబా సూక్తిని విదేశీ భక్తులు తూచ తప్పకుండా పాటిస్తున్నారు. తరచూ ప్రశాంతి నిలయానికి వచ్చే విదేశీయులు తప్పకుండా సమీపంలోని గ్రామాలను సందర్శిస్తున్నారు. అక్కడి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తీరుస్తూ సేవాభావాన్ని చాటుతున్నారు. మహిళాభివృద్ధికి చేయూత.. మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు కూడా విదేశీయులు చేయూత ఇచ్చారు. బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి మండలాల్లోని పలు గ్రామాల్లోని పాడి రైతులను గుర్తించి పాడి ఆవులను అందజేశారు. అలాగే పుట్టపర్తి మండలం పెడపల్లిలో పలువురు మహిళలకు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఇలా ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో కృషి చేశారు. -
కుక్కల దాడి.. 15 గొర్రెల మృతి
పెద్దపప్పూరు: వీధి కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందాయి. పెద్దపప్పూరు మండలం అమ్మలదినెన్న గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జీవాల పోషణతో జీవనం సాగిస్తున్న గ్రామానికి చెందిన పుట్టయ్య యాదవ్.. ఆదివారం రాత్రి తన ఇంటి సమీపంలోని షెడ్డులో గొర్రెలను వదిలి, ఇంట్లో నిద్రించాడు. ఆదివారం తెల్లవారుజామున షెడ్డులోకి చొరబడిన వీధి కుక్కలు 15 గొర్రెలను కొరికి చంపేశాయి. ఘటనతో దాదాపు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాదితుడు వాపోయాడు. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారి డాక్టర్ సువర్ణ, ఆర్బీకే సిబ్బంది ఆ గ్రామానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడికి పరిహారం అందేలా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా వారికి సీపీఐ, సీపీఎం నాయకులు విన్నవించారు. యువకుడి దుర్మరణం తాడిపత్రి రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుమ్మఘట్ట మండలం దేవరెడ్డిపల్లికి చెందని వరప్రసాద్ నాయక్ (28) బంధువులు తాడిపత్రి మండలం చుక్కలూరు క్రాస్లోని బండల పాలీస్ యూనిట్లో కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారితో కలసి ఉపాధి పొందడానికి నాలుగు నెలల క్రితం తాడిపత్రికి చేరుకున్న వరప్రసాద్ నాయక్.. స్థానికంగా పెయింటింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి చుక్కలూరు – సజ్జలదిన్నె రోడ్డపై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో సహా ఉడాయించాడు. ఘటనపై తాడిపత్రి అప్గ్రేడ్ పీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కారును ఢీకొన్న ఐచర్ యాడికి: ఎదురుగా వస్తున్న కారును ఐచర్ ఢీకొని రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. యాడికి మండలం రాయలచెరువులోని గుత్తికి వెళ్లే మార్గంలో కరుణాకర్ రైస్ మిల్లు ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది. గుత్తి వైపుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఐచర్ వాహనం.. గుంతకల్లు నుంచి తాడిపత్రికి వెళుతున్న కారును ఢీకొని బోల్తాపడింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న భార్య, భర్తతో పాటు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐచర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ ఈరన్న అక్కడుక చేరుకుని పరిశీలించారు. రోడ్డుకు అడ్డుగా పడిన ఐచర్ వాహనాన్ని పక్కకు లాగించి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
పశుశాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఏర్పాటు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక సాయినగర్లోని పశువుల ఆస్పత్రి ప్రాంగణంలో ఆదివారం ఉమ్మడి జిల్లా పశుసంవర్ధకశాఖ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆల్ క్యాడర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా బి.మహేంద్ర, ప్రధాన కార్యదర్శిగా ఆర్.బాబునాయుడు, ఉపాధ్యక్షులుగా సి.వరప్రసాద్, ఏఎల్ సురేష్బాబు, జాయింట్ సెక్రటరీలుగా ఎం.రామాంజనేయులు, ఎం.ఆదినారాయణ, కోశాధికారిగా టి.విశ్వనాథ్, అలాగే కమిటీ సభ్యులుగా ఎం.నాగపవన్, డి.ఆదినారాయణ, వై.రేవతి, ఎం.నరసింహులు ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా మహేంద్ర, ప్రధాన కార్యదర్శిగా బాబునాయుడు -
నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
అనంతపురం అర్బన్: ఏపీ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం అనంతపురంలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.మల్లేశ్వరావు, ఇ.మద్దిలేటి పర్యవేక్షణలో కార్యవర్గంలోని 9 స్థానాలకు ఎన్నికల నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.సుబ్రహ్మణ్యం, సహాయ అధికారిగా రాష్ట్ర కార్యదర్శి కె.రమణ వ్యవహరించారు. తొమ్మిది స్థానాలకు తొమ్మిది నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో కార్యవర్గం ఏకగ్రీవమైంది. జిల్లా అధ్యక్షుడిగా తోట చెన్నప్ప, సహ అధ్యక్షుడిగా పి.వెంకటరామిరెడ్డి, ఉపాధ్యక్షులుగా కె.శ్రీహరి, బి.నాగరాజు, కార్యదర్శిగా ఎం.పెద్దరెడ్డప్ప, సంయుక్త కార్యదర్శులుగా డి.రాధమ్మ, డి.వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శిగా బి.ఫక్కీరప్ప, కోశాధికారిగా ఎస్.జాఫర్వలి ఎన్నికయ్యారు. గుంతకల్లు పశువుల ఆస్పత్రిలో అగ్నిప్రమాదం గుంతకల్లు రూరల్: స్థానిక మార్కెట్ యార్డులోని పశువుల ఆస్పత్రిలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పశువుల ఆస్పత్రి నుంచి పొగలు వస్తుండడం మార్కెట్ యార్డులో గొర్రెల సంతకు వచ్చిన రైతుల ద్వారా సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది అక్కడకు చేరుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడు చేరుకుని కొద్ది పాటి మంటలను ఆర్పివేశారు. కాగా, అప్పటికే దాదాపు రూ.10 లక్షల విలువైన మందులు, ఫ్రిడ్జ్ ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా నిర్ధారణ అయింది. 23న కళ్యాణదుర్గంలో జిల్లా స్థాయి చెకుముకి సంబరాలు అనంతపురం కల్చరల్: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 23న జిల్లా స్థాయి చెకుముకి సంబరాలను కళ్యాణదుర్గంలో నిర్వహించనున్నారు. ఆదివారం స్థానిక సంఘమేష్ నగర్లోని జేవీవీ కార్యాలయంలో చిత్తప్ప జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరరాజు వెల్లడించారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా నాయకులు రామిరెడ్డి, గాంగేనాయక్, ప్రసాద్, లక్ష్మీనారాయణ, నరసింహుడు తదితరులు పాల్గొన్నారు. -
విత్తుకు వేళాయే... విత్తనం లేదాయే!
అనంతపురం అగ్రికల్చర్: రబీలో పప్పుశనగ తర్వాత రెండో ప్రధానపంటగా వేరుశనగకు ఉమ్మడి జిల్లా రైతులు సిద్ధమయ్యారు. ఈ రబీలో 18 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ సాగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 నుంచి డిసెంబర్ 15 లోపు వేరుశనగ సాగుకు అనువైన సమయమని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం రైతులకు రాయితీ విత్తనాలు ఇవ్వలేకపోతోంది. గత ఖరీఫ్లో చాలా ఆలస్యంగా అరకొరగా వేరుశనగ ఇచ్చిన ప్రభుత్వం ఈ రబీలో ప్రధాన పంట పప్పుశనగ విత్తుకునే సమయం చివరి దశకు చేరకున్న తర్వాత కేవలం 1,200 క్వింటాళ్లు మాత్రమే రాయితీ విత్తనం ఇచ్చి చేతులు దులుపుకుంది. ప్రస్తుతం వేరుశనగ విత్తుకునే సమయం వచ్చినా ఇప్పటికీ విత్తనాన్ని అందుబాటులో తీసుకురాలేదు. ఉమ్మడి జిల్లాకు 15 వేల క్వింటాళ్లు కేటాయించారు. కానీ రాయితీలు, ధరలు, పంపిణీ ఎప్పుడనేది మాత్రం ప్రకటించలేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నీటి వసతి కింద 22కి పైగా మండలాల్లో 1,000 హెక్టార్ల విస్తీర్ణంలో విత్తు వేశారు. నెలాఖరులోపు విత్తుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయినా సర్కారు మాత్రం విత్తనం ఇవ్వకుండా నాన్చుడి ధోరణి అవలంభిస్తోంది. 2024 రబీలోనూ విత్తన వేరుశనగ ఇసామని ఊరించి చివరకు ఇవ్వకుండా మోసం చేశారు. దీంతో గతేడాది 20 వేల హెక్టార్లు అంచనా వేయగా... విత్తనం అందుబాటులో లేక కేవలం 10 వేల హెక్టార్లకు మాత్రమే రబీ సాగు పరిమితమైంది. మొత్తమ్మీద కరువు మండలాలు, ఇన్పుట్, ఇన్సూరెన్స్ ఇవ్వకుండా రైతులను అడుగడుగునా మోసపుచ్చుతున్న చంద్రబాబు ప్రభుత్వం కనీసం రాయితీ విత్తనం కూడా ఇవ్వకుండా దగా చేస్తుండటంతో రైతులు మండిపడుతున్నారు. రబీ పంటగా 18 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు అంచనా ఉమ్మడి జిల్లాకు 15 వేల క్వింటాళ్ల కేటాయింపు క్షేత్రస్థాయిలో కనిపించని విత్తన వేరుశనగ -
వాటర్ క్యాన్ రూపాయికే..
2011లో విదేశీయుల సహకారంతో చెర్లోపల్లి పంచాయతీ కార్యాలయంలో రూ.10 లక్షల వ్యయంతో వాటర్ ఫిల్టర్ను ఏర్పాటు చేశారు. క్యాన్ వాటర్ రూపాయికే ఇన్నాళ్లూ అందించారు. నిర్వహణ ఖర్చు పెరగడంతో ఇటీవల ఒక్కో కుటుంబం నుంచి నెలకు రూ.90 వసూలు చేస్తున్నారు. గ్రామ పెద్దల సహకారంతో పాటు విదేశీయుల ఆర్థిక చేయూత తోడు కావడంతో తాగునీరు నిర్విరామంగా తాగుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇక గ్రామానికి సమీపంలో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి విదేశీయులు రూ.3 లక్షల వరకూ విరాళం ఇచ్చారు. -
అధికారం శాశ్వతం కాదు
హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేయడం హేయం. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన టీడీపీ గూండాలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదు. అధికారం శాశ్వతం కాదని అందరూ గుర్తు పెట్టుకోవాలి. – తలారి రంగయ్య, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త దాడి గర్హనీయం -
ముగిసిన ‘సహకార’ అసోసియేషన్ ఎన్నికలు
అనంతపురం అగ్రికల్చర్: మూడేళ్ల కాలపరిమితి కలిగిన సహకార శాఖ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నికలు ఆదివారం ముగిశాయి. సహకారశాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ కె.లీలావతి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించి గెలుపొందిన అభ్యర్థులకు డిక్లరేషన్ అందజేశారు. కమిటీలో 9 పోస్టులకు గానూ ఎన్నికలకు ముందే జాయింట్ సెక్రటరీగా ఆర్.రమణమాధవి, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ సెక్రటరీగా పి.నరసింహమూర్తి, ఎం.లతీఫ్ ఏకగ్రీవం అయ్యారు. కేవలం 56 ఓట్లు ఉన్న మిగిలిన ఆరు పదవులకు ఎన్నికలను నిర్వహించారు. రెండు ప్యానళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలీసు బందోబస్తు మధ్య గుర్తులు లేకుండా అభ్యర్థుల పేర్ల మీద పోలింగ్ నిర్వహించారు. డీసీఓ, డీసీఏఓ కార్యాలయాలతో పాటు డీఎల్సీఓ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు 52 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా బి.మల్లరాయుడు, కార్యదర్శిగా ఎస్.కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎం.సృజన్, ఉపాధ్యక్షుడిగా వై ఎండీ ఇస్మాయిల్, జాయింట్ సెక్రటరీగా టి.రమేష్బాబు ట్రెజరర్ పోస్టు కోసం పోటీ పడిన ఎం.వెంకటేశ్వర్లు, జి.సతీష్కుమార్కు చెరి 26 ఓట్లు సమానంగా రావడంతో... ఇరువురు అభ్యర్థుల అంగీకారంతో మొదటి ఏడాదిన్నర ఎం.వెంకటేశ్వర్లు, రెండో టర్మ్ కింద ఏడాదిన్నర పాటు జి.సతీష్కుమార్కు అవకాశం కల్పించారు. అధ్యక్షుడిగా మలరాయుడు, సెక్రటరీగా కుమార్ గెలుపు -
బిర్సా ముండా జీవితం ఆదర్శప్రాయం
● కలెక్టర్ ఆనంద్ అనంతపురం రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జీవితం యువతకు ఆదర్శమని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్లో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ‘జాతీయ గౌరవ్ దివస్’ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బిర్సా ముండా అన్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి బ్రిటీష్ వారిపై పోరాటాలు చేశారన్నారు. బిర్సా ముండా చేసిన పోరాటాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 15న జాతీయ గౌరవ్ దివస్గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని గిరిజనులు తమ పిల్లలను ఉన్నతంగా చదివించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రేపు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’ అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 17న కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. సమస్యపై గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. అర్జీ పరిష్కార స్థితి ఏ దశలో ఉందనే విషయాన్ని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా mee kosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని కోర్టుల్లో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమారావు ఆదేశాలతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్ శనివారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజీ చేయదగ్గ ఎక్సైజ్, క్రిమినల్ కేసుల వివరాలు సేకరించాలన్నారు. అధిక సంఖ్యలో రాజీ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్.రేవతి, సీఐలు భాస్కర్ గౌడ్, రాజేంద్రనాథ్ యాదవ్, ఎన్.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
దశ మారని స్కిట్
అనంతపురం: స్కిట్ (శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కళాశాల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇటీవల జేఎన్టీయూ (ఏ) పరిధిలోకి వచ్చిన సమయంలో మళ్లీ కళాశాల పూర్వ వైభవం సంతరించుకుంటుందని అందరూ భావించారు. అయితే, ప్రచారం కల్పించడంలో వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం, చంద్రబాబు ప్రభుత్వ అలసత్వం వెరసి ఆదిలోనే హంసపాదుగా తయారైంది. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పేరున స్వామివారి దివ్య సన్నిధికి సమీపంలో ‘స్కిట్’ను 1997–98లో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఏకై క ఇంజినీరింగ్ కళాశాల కావడం.. నాణ్యమైన బోధన, మంచి ఫలితాలు వస్తుండడంతో అనతి కాలంలోనే మంచి పేరు వచ్చింది. అయితే, 2013 నుంచి విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ప్రారంభమైంది. 2016 నాటికి ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. ఆ తర్వాత మూడు సంవత్సరాలు అడ్మిషన్లే లేవు. కళాశాలలో 29 మంది బోధన, 36 మంది బోధనేతర ఉద్యోగులుండడంతో ఇటీవల 33 సంవత్సరాల లీజుకు జేఎన్టీయూ (ఏ)కు ఇస్తూ కాన్స్టిట్యూట్ కళాశాలగా నిర్దేశిస్తూ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 42 మంది విద్యార్థులే అడ్మిషన్.. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఏపీఈఏపీసెట్ ద్వారా ‘స్కిట్’లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. 70 మందికి సీట్లు కేటాయించగా కేవలం 42 మంది రిపోర్ట్ చేసు కోవడం గమనార్హం. దీంతో ‘స్కిట్’ క్యాంపస్లో కాకుండా అన్నమయ్య జిల్లాలోని కలికిరి జేఎన్టీయూలో వర్సిటీ అధికారులు తరగతులను ప్రారంభించారు. ‘స్కిట్’లో భవనాల మరమ్మతుల నేపథ్యంలో కలికరికి మార్చినట్లు చెబుతున్నారు. అయితే, ‘స్కిట్’ అధ్యాపకులకు జీతాలు ఇవ్వడం వృథా అని భావించే కలికిరికి మార్చారని, జేఎన్టీయూ ఉన్నతాధికారులకు ‘స్కిట్’ను తీసుకోవడం ఇష్టం లేకనే పొమ్మనలేక పొగ పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ‘స్కిట్’ భవి తవ్యంపై నీలినీడలు కమ్ముకున్న సమయంలో అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బంది హైకోర్టును ఆశ్రయించగా, నెలకు కనీసం రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా ‘స్కిట్’ కార్యకలాపాలను కలికిరికి మార్చడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. ● తాము శ్రీకాళహస్తిలోని కళాశాలను ఎంపిక చేసుకోగా, నేడు కలికిరిలో చదవాలని చెప్పడం ఎంత వరకూ సమంజసమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.కళాశాల క్యాంపస్నే మార్చివేసి ఇబ్బందికి గురిచేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేయాలి స్కిట్ కళాశాలలో భవనాలను మరమ్మతులు చేయాలని నిర్ణయించాం. ఈ నేపథ్యంలో కలికిరి కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నాం. మరమ్మతులు పూర్తయ్యాక శ్రీకాళహస్తిలోనే తరగతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – సుదర్శనరావు, వీసీ, జేఎన్టీయూ (ఏ) కళాశాలలో చేరేందుకు కేవలం 70 మంది విద్యార్థుల ఆసక్తి వీరిలోనూ 42 మందే జాయిన్ జేఎన్టీయూ (ఏ) ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే దుస్థితి! -
అరాచక శక్తుల ‘పురం’
సాక్షి టాస్క్ఫోర్స్: హిందూపురంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయి. ప్రశ్నించిన గొంతులను నొక్కేస్తూ ఫ్యాక్షన్కు ఆజ్యం పోస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురాన్ని అరాచక శక్తుల చేతిలో పెట్టి సినిమాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే పీఏల అరాచకాలను ప్రశ్నిస్తోన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ప్రశ్నించే పాత్రికేయులపైనా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. వైఫల్యాలను ఎత్తిచూపడం ఓర్వలేకనే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూపురం నియోజకవర్గంలో అక్రమాలు పెరిగిపోయాయి. ఎమ్మెల్యే పీఏల ఆగడాలు ఎక్కువై పోయాయి. నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన టీడీపీ నేతలు, కార్యకర్తలతో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. ప్రతి మద్యం దుకాణంలోనూ ఎమ్మెల్యే పీఏలకు వాటాలున్నాయి. దీనికితోడు పోలీసులను ఇష్టానుసారం వినియోగించడంతో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోయాయి. మట్టి, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. సహజ వనరులు కొల్లగొడుతున్నారు. దీంతో టీడీపీపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. ఇదే క్రమంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలకు విశేష స్పందన లభిస్తోంది. దీంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ‘పచ్చ’ నేతలు బరితెగిస్తున్నారు. అందులో భాగంగానే శనివారం హిందూపురంలో ఏకంగా వైఎస్సార్ సీపీ కార్యాలయంపై దాడి చేశారు. రాడ్లు, రాళ్లతో పార్టీ కార్యాలయంలోకి చొరబడిన టీడీపీ అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. అడ్డుకున్న పార్టీ నేతలు లోకేష్, దివాకర్రెడ్డిపై దాడి చేసి గాయపరిచారు. ఎమ్మెల్యే పీఏలే అల్లరి మూకలతో దాడులు చేయించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో హిందూపురం నియోజకవర్గవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అవినీతి తాండవం... చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూపురం నియోజకవర్గంలో అవినీతి తాండవం చేస్తోంది. హిందూపురం మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలు పక్కదారి పడుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రత్యేక నిధులను కొల్లగొడుతూ జేబులు నింపుకుంటున్నారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. చిలమత్తూరు మండలంలో సొంత అవసరాలకు పొలాల మధ్య ప్రభుత్వ నిధులతో రోడ్లు వేసుకుంటున్నారు. చెరువుల్లో మట్టిని యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. సీసీ రోడ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నాసిరకంగా నిర్మాణాలు చేపడుతున్నారు. హిందూపురంలో పూర్తిగా లోపించిన శాంతిభద్రతలు ఫ్యాక్షన్కు ఆజ్యం పోస్తున్న ‘తమ్ముళ్లు’ వైఎస్సార్ సీపీ కార్యాలయంపై దాడితో ఉలిక్కిపడ్డ ప్రజలు బాలయ్య ఇలాకాలో ఇప్పటికే అవినీతి తాండవం పచ్చ నేతల దాడులు, దౌర్జన్యాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి గర్హనీయం అనంతపురం అర్బన్: హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి చేయడం గర్హనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కార్యదర్శులు పాళ్యం నారాయణస్వామి, వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నాయకుల వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉంటే ప్రతి విమర్శల ద్వారా సమాధానం చెప్పాలే కానీ దాడులకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నాయకులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. -
ప్రజాస్వామ్య విలువలు పతనం
హిందూపురం వైఎస్సార్ సీపీ కార్యాలయంపై దాడి టీడీపీ రౌడీయిజానికి నిదర్శనం. పట్ట పగలే టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్, కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేయడం, కార్యాలయంలోని వారిపై భౌతిక దాడులకు పాల్పడటం హేయం. పోలీసుల సమక్షంలో జరిగిన ఈ దాడి చూస్తుంటే ప్రజాస్వామ్య విలువలు పతనమైనట్టు కనిపిస్తోంది. ప్రశాంతంగా ఉన్న హిందూపురంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు టీడీపీ గూండాలు తెరలేపారు. ఇప్పటికే హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రం మరో బిహార్లా మారింది. టీడీపీ నేతలు ఆటవిక చర్యలకు స్వస్తి పలకాలి. లేనిపక్షంలో దీటుగా సమాధానం చెప్తాం. – మాలగుండ్ల శంకరనారాయణ, పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్, వైఎస్సార్ సీపీ -
ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దాడి
ఎమ్మెల్యే బాలకృష్ణ పోద్బలంతోనే వైఎస్సార్ సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడులు చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. టీడీపీ నాయకులు రౌడీల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి చొరబడి రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేస్తున్నా...పోలీసులు ప్రేక్షకుల్లా చూడటం తగదు. ఇప్పటికై నా పోలీసులు టీడీపీ గూండాలపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. లేకపోతే పోలీసు వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం పోతుంది. – బీఎస్ మక్బూల్ అహ్మద్, వైఎస్సార్ సీపీ కదిరి సమన్వయకర్త -
ప్రజాస్వామ్యం లేదు
హిందూపురంలోని పార్టీ కార్యాలయంపై జరిగిన దాడితో ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టు స్పష్టమైంది. మరీ ఇంత దౌర్జన్యమా..? ఇంత రౌడీయిజమా..? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? ఎప్పుడూ ఏదొక అంశంలో హిందూపురం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇక ఉపేక్షించబోం.. అధికారం మాకూ వస్తుంది. అప్పుడు మేమేంటో చూపెడతాం. – ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు అధికారం శాశ్వతం కాదు త్వరలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు న్యాయపరంగా చేయాల్సినవి చేస్తాం. అధికారం అన్నది శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకుంటే మంచిది. మేము ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే రకం కాదు. అవినీతి అక్రమాలపై పోరాటాలు చేస్తూనే ఉంటాం. – వేణురెడ్డి, వైఎస్సార్ సీపీ నేత -
శోత్రియం భూముల అన్యాక్రాంతంపై రైతుల ఆగ్రహం
శెట్టూరు: శోత్రియం భూముల అన్యాక్రాంతంపై సాగుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను కాపాడాలని శనివారం వందమంది రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 172–1లోని మూడు ఎకరాల్లో శాశ్వత నివాసాలు, గుడి, చర్చిలు ఉన్నాయన్నారు. అలాగే సర్వే నంబర్ 285, 16, 179–5, 119, 139–1, 293–2, 275–2లోని భూములను 40 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే తమకు తెలియకుండా టీడీపీ నేత సుధాకరశెట్టి, ఆయన కుటుంబానికి చెందిన బాబుప్రసాద్లు తమ అనుభవంలో ఉన్న భూములు, స్థలాలను అక్రమంగా చేయించుకుని, ఇతరులకు అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. సుధాకర శెట్టి కుటుంబ సభ్యులు గ్రామంలో ఉన్న కుంట, వంక, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని తహసీల్దార్ ఈశ్వరమ్మ ఎదుట బోరున విలపించారు. 2008 సంవత్సరంలో పలువురు రైతులకు ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసిందని, ఏడో విడత భూ పంపిణీలో సుమారు 20 మందికి డీ పట్టాలు మంజూరు చేసిందని, వీటిని కూడా సుధాకర శెట్టి కుటుంబానికి రెవెన్యూ అధికారులు కట్టబెట్టారన్నారు. రెవెన్యూ అధికారులు గ్రామంలో పర్యటించి సాగులో ఉన్న తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మంజునాథ, రైతులు పూజారి తిమ్మన్న, పూజారి పాలయ్య, వడ్డే నాగరాజు, వడ్డే సుబ్బరాయుడు, రామాంజనమ్మ, పాలమ్మ, ఎస్.వై.లింగప్ప, గిరిజమ్మ, స్వామి, పుట్టంపుర్ల గోవింద, ప్రభు , పగటి వేశగాళ్ళ ఎర్రిస్వామి, శేఖర్, కోటగుడ్డ మంజునాథ, వడ్డే హనుమంతు, బొమ్మలాట రవి, ముచ్చర్లపల్లి నరసింహులు, మారజ్జప్ప, నరసింహ, రాజప్ప తదితరులు పాల్గొన్నారు. -
చలిగింతలు!
శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అనంతపురం క్లాక్ టవర్ ఏరియా అనంతపురంలోని గుత్తి రోడ్డులో విద్యుత్ లైట్ల మధ్య నుంచి కురుస్తున్న మంచు చలిలోనే పొట్టకూటి కోసం బయలుదేరిన దృశ్యంచలి కాలం మొదలైంది. రాత్రి నుంచి మంచు కురుస్తోంది. అప్పుడే చలిగాలులు వణికిస్తున్నాయి. ఎదుటి మనుషులు, వాహనాలు కనిపించలేనంతగా మంచు దుప్పటి కప్పేస్తోంది. దీంతో ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా వాహనాలను లైట్ల వెలుతురులో నడపాల్సి వస్తోంది. ఇక చిరు వ్యాపారులు ఎంత చలి ఉన్నా తమ బతుకు పోరాటం కొనసాగిస్తున్నారు. వ్యాపారులు, కూలీలు, హమాలీలు స్వెట్టర్లు, తలకు కుళ్లాయిలు వేసుకుని తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. చలిమంటలతో పాటు వేడివేడిగా టీ, కాఫీలు తాగుతూ చలి నుంచి కాసింత ఉపశమనం పొందుతున్నారు. మంచుతెరలు ఉండగానే రైతులు, కూలీలు పొలాలబాట పడుతున్నారు. పొలాలు, అటవీ ప్రాంత సమీపంలో కాపరులు జీవాలతో ఆరుబయట చలిలోనే తమ దినచర్యను ప్రారంభిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం పాతూరులో తెల్లవారుజామున టెంకాయలు అన్లోడ్ చేస్తున్న దృశ్యం చలిలో గరం చాయ్ అనంతపురం రూరల్ మండలం సోమలదొడ్డి వద్ద గొర్రెల మంద వద్ద కాపర్లు నాగిరెడ్డిపల్లి వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు ఆకుకూరలు అమ్ముకునేందుకు వృద్ధురాలి పాట్లు చలిలోనే రోడ్డు ఊడుస్తున్న మున్సిపల్ కార్మికురాలు -
సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనలో మెరిసిన చీమలవాగుపల్లి విద్యార్థినులు
అనంతపురం సిటీ: స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్–2025 జాతీయస్థాయిలో నిర్వహించిన సైన్స్ ప్రాజె క్టుల ప్రదర్శనలో పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రవల్లిక, కళ్యాణి, షబానా మెరిశారు. వీరు రూపొందించిన ‘సోలార్ టేస్డ్ మెడిసిన్ స్ప్రేయర్ ప్రాజెక్ట్–సౌరశక్తి ఆధారిత పిచికారీ యంత్రం’ జాతీయ స్థాయిలో జిల్లాకు కీర్తి తెచ్చిపెట్టిందని జిల్లా సైన్స్ సెంటర్ అధికారి బాలమురళీకృష్ణ శనివారం తెలిపారు. జాతీయస్థాయిలో మొత్తం 72 వేల ప్రాజెక్టులు ప్రదర్శనకు రాగా.. అందులో 1000 ప్రాజెక్టులను ఎంపిక చేశారన్నారు. రెండో రౌండ్లో 100 ప్రాజెక్టులు మాత్రమే పోటీకి ఎంపికై నట్లు వివరించారు. అందులో చీమలవాగుపల్లి విద్యార్థినులు రూపొందించిన ప్రాజెక్ట్ ఉండడం గర్వంగా ఉందని చెప్పారు. ఏఐఎం అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు ఫైనల్గా ఎంపిక చేసే 30 ప్రాజెక్టుల్లో మన జిల్లా అమ్మాయిలు రూపొందించిన ప్రాజెక్ట్ ఎంపికై తే ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం డెల్ కంపెనీ వారు ఇంటర్న్షిప్ కల్పిస్తారని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ రూపకల్పనలో అవసరమైన శాసీ్త్రయ సహకారాన్ని అందించడంతో పాటు విద్యార్థినులకు అనంతపురం డిగ్రీ కళాశాల అధ్యాపకుడు జీఎల్ఎన్ ప్రసాద్ గైడ్గా కూడా వ్యవహరించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ను డీఈఓ ప్రసాద్బాబు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజాచౌదరి అభినందించారు. -
లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
పెద్దవడుగూరు: జాతీయరహదారిపై నిల్చున్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. వివరాల్లోకెళితే... టీవీకే ట్రావెల్స్కు చెందిన ఎన్ఎల్ 018 2229 నంబరు గల ప్రైవేట్ బస్సు శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరింది. శనివారం తెల్లవారుజామున పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్ ప్లాజా దాటిన అనంతరం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బస్సు వేగంగా ఢీకొంది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై గట్టిగా కేకలు వేశారు. అప్రమత్తమైన స్థానికులు బస్సులోని ప్రయాణికులను బయటకు దింపి మరొక వాహనంలో పంపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన బస్సును పక్కకు తీయించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూశారు. ప్రయాణికులకు ఎవ్వరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఇప్పటి వరకు ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి గుత్తి: వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నాయకుడు రౌడీ మూకలతో దాడి చేయించిన ఘటన గుత్తిలో చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు... పట్టణంలోని బాలాజీ లాడ్జి సమీపంలో మస్తాన్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త రోడ్డు పక్కన పూలబండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆ పక్కనే టీడీపీ నాయకుడు నౌషద్కు చెందిన దుకాణం ఉంది. శనివారం నౌషద్ అనంతపురం నుంచి ఏడుగురు రౌడీమూకలను కారులో పిలిపించాడు. వారు వచ్చీ రాగానే మస్తాన్తో అకారణంగా గొడవ పెట్టుకున్నారు. పూలబండిని, బీడీల బాక్సుతో పాటు బైకును కిందపడేసి ధ్వంసం చేశారు. అనంతరం కట్టెలతో మస్తాన్ను చావబాదారు. స్థానికులు వచ్చి విడిపించి బాధితుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నౌషద్తో ఎటువంటి గొడవలూ లేవని, మనసులో ఏదో పెట్టుకునే తనపై దాడి చేయించాడని మస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారుతో యువకుడి హల్చల్ పామిడి: ఓ యువకుడు కారు నడుపుతూ రోడ్డుపైకొచ్చి హల్చల్ చేశాడు. వాహనాన్ని నియంత్రించలేక ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాలను ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పామిడికి చెందిన మణి అనే యువకుడు శనివారం రాత్రి బీసీసీ రోడ్డు సమీపంలోని ఓ గ్యారేజీ నుంచి ఏపీ 40 హెచ్ఈ 2774 నంబరు గల కారును తీసుకుని రోడ్డుపైకొచ్చాడు. డ్రైవింగ్పై పట్టులేని ఆ యువకుడు సంజీవ బండల షాపువద్ద గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన పురుషోత్తమ్, బాబా ఫక్రుద్దీన్ను ఢీకొనడంతో వారు గాయాలపాలయ్యారు. భయంతో కారు ఆపకుండా ముందుకు దూసుకొచ్చే క్రమంలో ఈద్గా మసీదు వద్ద ద్విచక్రవాహనంపై వస్తున్న ఎల్ఐసీ ఏజెంట్ ఖాజాహుసేన్తో పాటు, ఐదేళ్ల చిన్నారిని ఢీకొట్టాడు. దీంతో వారిద్దరూ గాయపడ్డారు. అనంతరం కారు ఆగిపోవడంతో కిందకు దిగి వచ్చిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అర్చకుడికి ‘తమ్ముళ్ల’ బెదిరింపులు శింగనమల: స్థానిక దుర్గాంజనేయ దేవాలయ పూజారి రమణకు తెలుగు తమ్ముళ్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని అర్చకుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆలయంలో కొన్నేళ్లుగా ఆగమశాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తున్న తమను అవమానించి, దేవాలయం నుంచి బయటకు పంపడానికీ చూస్తున్నారని ఆరోపించారు. వారి బెదిరింపుల కారణంగా బయటకు రాలేకపోతున్నామని అవేదన వ్యక్తం చేశారు. తనకు ఏదైనా జరిగితే సదరు ‘తెలుగు తమ్ముళ్లే’ కారణమని స్పష్టం చేశారు.


