breaking news
Anantapur Latest News
-
మహిళ బలవన్మరణం
ధర్మవరం అర్బన్: కడుపునొప్పి తాళలేక మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధర్మవరం పట్టణంలో సోమవారం జరిగింది. టూ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన చాంద్బా షా, పఠాన్ రోష్ని (30) దంపతులు. చాంద్బాషా సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోష్ని కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతుండేది. ఆసుపత్రుల్లో చికిత్సలు పొందినా కడుపు నొప్పి తగ్గలేదు. దీంతో మనస్తాపానికి గురైన రోష్ని సోమవారం ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతురాలి తల్లి పర్హానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. నీటి సంపులోకి జారిపడి బాలుడి మృత్యువాత కళ్యాణదుర్గం రూరల్: నీటి సంపులోకి జారిపడి బాలుడు మృత్యువాత పడిన ఘటన ‘దుర్గం’లో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన మేరకు... హైదరాబాద్కు చెందిన రవి, మీన దంపతులు. చాలా ఏళ్ల క్రితమే వ్యాపార నిమిత్తం కళ్యాణదుర్గానికి వలస వచ్చారు. స్థానిక విద్యానగర్లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. రెండో కుమారుడు సామ్యూల్ (16) సోమవారం తన స్నేహితులతో కలిసి కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో ఐదుకల్లు రోడ్డు వద్ద ఉన్న వ్యవసాయ తోటలో నీటిసంపు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి సంపులో పడిపోయాడు. ఆలస్యంగా గమనించిన స్నేహితులు సామ్యూల్ను బయటకు లాగి స్థానిక సీహెచ్సీకి తరలించగా... పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధరించారు. పట్టణ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
పోలీసులు న్యాయం చేయలేదని.. సెల్ టవర్ ఎక్కాడు!
పుట్టపర్తి టౌన్: పోలీసులు న్యాయం చేయడం లేదంటూ లక్ష్మినారాయణ అనే టీడీపీ కార్యకర్త సెల్ టవర్ ఎక్కి, పార్టీ జెండా పట్టుకుని నిరసన తెలిపాడు. ఈ ఘటన కొత్తచెరువులో సోమవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొత్తచెరువు మండలం కదిరేపల్లికి చెందిన లక్ష్మినారాయణకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె శ్రావణిని దిగువ గంగంప ల్లికి చెందిన వెంకటరమణకు ఇచ్చి 2014 సంవత్సరంలో వివాహం చేశాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు. తాము కట్నంగా ఇచ్చిన బంగారం, నగదు తిరిగి ఇప్పించాలంటూ రెండు నెలల క్రితం కొత్తచెరువు అప్గ్రేడ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ మారుతీ శంకర్ ఇరువురినీ పిలిపించి ‘పంచాయితీ’ చేశారు. అయితే..శ్రావణి, లక్ష్మినారాయణ వినకపోవడంతో వారిని తమదైన శైలిలో దూషించారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన లక్ష్మినారాయణ శుక్రవారం ఉదయం కొత్తచెరువులోని బీఎస్ఎన్ఎల్ సెట్ టవర్ ఎక్కి టీడీపీ జెండాను పట్టుకుని కూర్చొని నిరసన తెలిపాడు. సీఐ మారుతీ శంకర్ సిబ్బందితో వచ్చి న్యాయం చేస్తామని, కిందకు దిగాలని అతనికి సూచించారు. పోలీసులపై నమ్మకం పోయిందని, తక్షణమే న్యాయం జరిగేదాకా దిగేది లేదని అతను తేల్చిచెప్పాడు. ఈ క్రమంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. పోలీసులు ఎలాగోలా సర్దిచెప్పి చివరకు కిందకు రప్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులపై తిరగ బడ్డారు. ఆడపిల్లకు న్యాయం చేయలేని మీరు ఎందుకు యూనిఫాం వేసుకున్నారు? లంచాలు తీసుకోవడానికా? అంటూ శ్రావణి నిలదీయడంతో సమాధానం చెప్పలేక సీఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీడీపీ నాయకులను, పోలీసులను ఆశ్రయించినా తన కుమార్తెకు న్యాయం జరగలేదని, అందుకే సెల్ టవర్ ఎక్కానని లక్ష్మినారాయణ చెప్పాడు. -
పశుశాఖ జేడీ ప్రేమ్చంద్కు రాష్ట్ర స్థాయి అవార్డు
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్కు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. అలాగే, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్డీఏ)లో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) డాక్టర్ శ్రీకాంత్కు రాష్ట్రస్థాయి అవార్డు ప్రకటించారు. రాయలసీమ జిల్లాల్లోనే తొలిసారిగా ‘అనంత పాలధార’ పేరుతో పాల దిగుబడి పోటీలు, లేగదూడల ప్రదర్శన, ఉచిత గర్భకోశవ్యాధి శిబిరాన్ని అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి వేదికగా విజయవంతంగా నిర్వహించడం, పైలెట్ ప్రాజెక్టు కింద లింగనిర్ధారిత వీర్యం (సెక్స్ సార్టెడ్ సెమన్–ఎస్ఎస్ఎస్) పథకం విజయవంతంగా అమలు చేయడంతో రాష్ట్ర స్థాయి అవార్డు దక్కినట్లు జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్ తెలిపారు. అవార్డు రావడానికి సహకరించిన పశుశాఖ డీడీలు, ఏడీలు, వీఏఎస్, పారాస్టాఫ్ తదితరులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో పశుశాఖ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ ఉత్తమ కానిస్టేబుల్గా రాజశేఖర్ అనంతపురం క్రైం:ఆర్టీసీ ఉత్తమ కానిస్టేబుల్గా రాజశేఖర్ అవార్డు అందుకున్నారు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయనకు సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక తిరుమల రావు అవార్డు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సహచరులు రాజశేఖర్కు అభినందనలు తెలిపారు. ఎకై ్సజ్ సీఐ మహేష్కు రాష్ట్రస్థాయి పురస్కారం రాయదుర్గం: విధి నిర్వహణలో ప్రతిభ చూపిన రాయదుర్గం ఎకై ్సజ్ సీఐ మహేష్కుమార్ను రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విజయవాడలో ఎకై ్సజ్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రాహుల్దేవ్శర్మ చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రం అందుకున్నారు. జిల్లాస్థాయిలోనూ ఆయన అవార్డుకు ఎంపిక కావడం గమనార్హం. ఈ సందర్భంగా సీఐ మహేష్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఒకేసారి అవార్డులు దక్కడం గర్వకారణమన్నారు. మరింత బాధ్యతగా విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత విడపనకల్లు: మండల పరిధిలోని పాల్తూరు గ్రామంలో సోమవారం పోలీసులు భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు. వివరాలు.. మండలంలో టీడీపీ నాయకుల అండదండలతో కొందరు రేషన్ బియ్యం అక్రమంగా కర్ణాటక ప్రాంతానికి తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పాల్తూరు నుంచి ఐషర్లో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన ఐషర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. వాహనంలోని 155 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సత్యసాయి వాటర్ ప్లాంట్ ఉద్యోగి అదృశ్యం బత్తలపల్లి: మండల కేంద్రానికి చెందిన మన్నీల సతీష్కుమార్ కనిపించకుండా పోయాడని అతని భార్య మన్నీల లీలావతి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీష్కుమార్ 28 సంవత్సరాలుగా తాడిమర్రి మండలంలోని శ్రీసత్యసాయి వాటర్ ప్లాంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ శనివారం ఉదయం విధులకు వెళ్లిన ఆయన తిరిగిరాలేదు. బంధువులు, పరిసర గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సోమవారం భార్య ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. -
అగ్ని ప్రమాదంలో గాయపడిన బాలిక మృతి
గుత్తి రూరల్: మండలంలోని బేతాపల్లిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలిక నాగసముద్రం లక్ష్మి (10) సోమ వారం రాత్రి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రామాంజనేయులు, శ్రీనివాసులు వరుసకు అన్నదమ్ములు. ఈ నెల 16న ఇద్దరు చిన్నపాటి విషయంపై గొడవ పడ్డారు. రామాంజనేయులు తన అన్న శ్రీనివాసులుపై తొండ విసరగా అది అతడి మెడను కరిచింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసులు అదే రోజు రాత్రి రామాంజనేయులు ఇంటిపై పెట్రోల్ బాటిల్ విసిరి నిప్పు పెట్టాడు. ఈ ప్రమాదంలో రామాంజనేయులు భార్య అశ్విని, కుమారుడు శివగంగ త్రుటిలో తప్పించుకోగా మంటల్లో చిక్కుకొని నాగసముద్రం లక్ష్మి తీవ్రంగా గాయపడింది. బాలికను మొదట గుత్తి ఆసుపత్రికి, అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందింది. ఘటనకు కారణమైన శ్రీనివాసులును గుత్తి పోలీసులు ఈ నెల 19న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాలిక మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కళ్యాణదుర్గంలో భారీ చోరీ
కళ్యాణదుర్గం: పట్టణంలోని మారెంపల్లిలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఇంటి యాజమానికి ఆరోగ్యం బాగోలేదని అనంతపురం ఆసుపత్రికి వెళ్తే రాత్రికి రాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారు, వెండిని కొల్లగొట్టడం కలకలం రేపింది. బాధితులు తెలిపిన మేరకు... మారెమ్మ కాలనీలో షఫీ, ఖాసీం బీ దంపతులు చికెన్ కబాబ్ సెంటర్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఓ శుభకార్యం జరగడంతో ఖాసీంబీ బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలతో పాటు కుమార్తె, కోడలు, అల్లుడికి చెందిన ఆభరణాలు సైతం తన వద్దే ఉంచుకుంది. ఆదివారం షఫీ అనారోగ్యానికి గురికావడంతో దంపతులిద్దరూ అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఆలస్యం కావడంతో రాత్రికి అక్కడే బంధువుల ఇంట్లో బస చేశారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న వారికి గేటు తాళాలు పగులగొట్టిన స్థితిలో కనిపించాయి. లోపల బీరువాను సైతం పగులగొట్టినట్లు గుర్తించారు. బీరువాలో ఉంచిన 11 తులాల బంగారు నగలు, కిలో వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో బోరున విలపించారు. వెంటనే విషయాన్ని కళ్యాణదుర్గం పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ హరినాథ్ క్లూస్ టీం సభ్యులను ఘటనాస్థలికి పంపారు. ఇంట్లో పలు చోట్ల క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. చోరీకి గురైన వాటి విలువ రూ.19 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు వాపోయారు. ఈ మేరకు కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 11 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాల అపహరణ -
దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
అనంతపురం: హక్కులతో పాటు రాజ్యాంగం కల్పించిన బాధ్యతలను పౌరులు గుర్తించుకోవాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమారావు అన్నారు. అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పునాది అయిన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా భారత్ విరాజిల్లడానికి రాజ్యాంగబద్ధమైన పాలనే కారణమన్నారు. దానిని పరిరక్షించుకోవాలని కోరారు. విశిష్ట సేవలకు సత్కారం అనంతపురం: అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీ ఖ్యాతిని ఇనుమడింప చేసిన మాజీ ప్రొఫెసర్లకు ఎస్కేయూ విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేసింది. పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో స్థానం సంపాదించిన ప్రొఫెసర్ రాజూరి రామకృష్ణారెడ్డి, ప్రపంచంలోని కెమిస్ట్రీ శాస్త్రవేత్తల జాబితాలో రెండో స్థానం దక్కించుకున్న దివంగత ప్రొఫెసర్ ఎంసీఎస్ శుభ ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీరికి ఎస్కేయూ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ అనిత పురస్కారాలు అందజేసి, సత్కరించారు. పల్లెల్లో మొదలైన రాజకీయ వేడి● త్వరలో ముగియనున్న సర్పంచ్ల పదవీకాలం ● పోటీ చేయడానికి ఆశావహుల తీవ్ర ప్రయత్నాలు ● రిజర్వేషన్లు మార్పులపై కూటమి నేతల కసరత్తు బొమ్మనహాళ్: పల్లెల్లో అప్పుడే ‘స్థానిక’ రాజకీయం మొదలైంది. త్వరలోనే సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, రాప్తాడు నియెజకవర్గాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు పోటీ చేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 2021 ఫిబ్రవరి 17న సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 80 శాతం మంది వైఎస్సార్సీపీ మద్దతు దారులే విజయం సాధించారు. 20 శాతం మంది టీడీపీ మద్దతుదారులు గెలిచారు. అయితే ఏప్రిల్ 2న సర్పంచులు బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రకారం వారి పదవీకాలం 2026 ఏప్రిల్ 2 వరకు ఉంది. అయితే ఎన్నికలు జరిగిన రోజు నుంచి లెక్కించి, వచ్చే నెల 17కు పదవీకాలం ముగియనుందని పేర్కొంటూ ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్పు చేయించాలని కసరత్తు చేస్తున్నారు. ఈసారి వైఎస్సార్సీపీ, టీడీపీతో పాటు బీజేపీ, జనసేన తరఫున కూడా అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తే తాము న్యాయస్ధానాలను ఆశ్రయిస్తామని ప్రస్తుత సర్పంచ్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్ధితుల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం లేదని, స్పెషలాఫీసర్ల ద్వారా పాలన రావొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
● విరబూసిన ఆశలు
ఆత్మకూరు: ఈ ఏడాది మామిడి చెట్లకు పూత విపరీతంగా పూసింది. దీంతో రైతులు పంటపై ఆశలు పెంచుకున్నారు. గత ఏడాది సరైన ధరలు లేక నష్టాలు చవిచూశారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పూత విరబూసింది. చాలా చోట్ల ముందస్తుగా మామిడి కాయలు కూడా కాశాయి. గత ఏడాది టన్ను రూ.10 వేలకు మించి అమ్ముడుపోలేదు. ప్రస్తుతం సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మార్కెట్లో టన్ను మామిడి కాయల ధర రూ.80 వేలకుపైగా పలుకుతోంది. తమ దిగుబడి మార్కెట్కు వచ్చే వరకు ఆ స్థాయిలో ధర ఉంటే లాభదాయకంగా ఉంటుందని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. -
బాబు పాలనలో ప్రాథమిక హక్కులకు భంగం
అనంతపురం: భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను చంద్రబాబు ప్రభుత్వం కాల రాస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. సోమవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను అనంత వెంకటరామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాజ్యాంగం సమాన హక్కులు, సమాన అవకాశాలను అందరికీ కల్పించిందని చెప్పారు. ఈ రోజు దేశమంతా అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై గాంధీజీ చూపిన మార్గంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో తమ పార్టీ పోరాడుతోందని చెప్పారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో దేశానికే తలమానికంగా 206 అడుగుల ఎత్తుతో విజయవాడలో మహనీయుడు అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అంబేడ్కర్ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు దాసరి వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్రెడ్డి, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శులు గౌని నాగన్న, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్మోహన్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, బూత్కమిటీ జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, ఉపాధ్యక్షురాలు రాధా యాదవ్, రాష్ట్ర కార్యదర్శి గౌస్బేగ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, జావెద్, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వత్థ నాయక్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్గౌడ్, మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, న్యాయవాది హనుమన్న, కార్పొరేటర్లు గోగుల రాధాకృష్ణ, ఎం.శ్రీనివాసులు, గురు శేఖర్బాబు, రాజేశ్వరి, సాకే చంద్రలేఖ, జయలలిత, రహంతుల్లా, వైఎస్సార్సీపీ నాయకులు సాకే కుళ్లాయిస్వామి, మహమ్మద్ ఆసిఫ్, రామచంద్ర, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఫయాజ్, మహిళా నాయకులు దేవి, శోభా రాణి, శోభా బాయి, ఉషా, అంజలి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
జిల్లాలో తరిగిన పశుసంపద
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో పశుసంపద తరిగిపోతోంది. పశువులు, ఎద్దుల సంఖ్య భారీగా తగ్గివడం ఆందోళన కలిగిస్తోంది. పశుసంవర్ధకశాఖ గతేడాది చేపట్టిన పశుగణన (సెన్సస్)లో మిశ్రమ గణాంకాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. 2025 పశుగణన ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ‘సాక్షి’కి అందిన సమాచారం మేరకు.. గత 2012తో పాటు 2019 పశుగణనతో పోల్చితే పశువులు, ఎద్దుల సంఖ్య బాగా తగ్గిపోగా... అదే సందర్భంలో గొర్రెలు, మేకల సంపద, పౌల్ట్రీ పరిశ్రమ భారీగా పెరగడం గమనార్హం. పశు సంపదకు ప్రోత్సాహమేదీ..? వ్యవసాయంలో ట్రాక్టర్ల వినియోగం పెరగడంతో ఎద్దుల సేద్యం కనుమరుగవుతూ వస్తోంది. పశువుల ఎరువు తగ్గిపోవడం, పంటల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం కూడా పెరిగిపోయింది. దేశీయ(నాటీ) పశువులు, గేదెల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా... వాటి స్థానంలో పాడిపై ఆధారపడిన ప్రజలు సంకరజాతి, ముర్రా జాతి పశువులు, గేదెలు మాత్రమే పెంపకం చేస్తున్న పరిస్థితి నెలకొంది. యాంత్రీకరణ పెరగడంతో గడ్డి ఉత్పత్తి కూడా బాగా తగ్గిపోయింది. ఇక ప్రభుత్వం నుంచి దాణా, సైలేజ్, దాణామృతం (టీఎంఆర్) లాంటి వాటిని రాయితీతో పంపిణీ ఆపేసింది. అక్కడక్కడా కంటి తుడుపుగా దాణా ఇచ్చారు. ఖరీఫ్, రబీ, వర్షాకాలంలో గడ్డి పెంపకానికి ప్రోత్సాహం కరువైపోయింది. అలాగే పశుబీమా అమలు పడకేయడం, పాడికి సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకపోవడం వల్ల పాడి పోషణ భారంగా పరిణమిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రకృతి సేద్యం విస్తరించడంతో పాటు ప్రభుత్వం నుంచి పాడికి ప్రోత్సాహం లభిస్తేనే పశుసంపద మనుగడ సాధ్యమవుతుందని అంటున్నారు. పెరిగిన జీవ సంపద.. ఇక జీవసంపద గణనీయంగా పెరిగింది. 2012లో 19.10 లక్షలు ఉండగా 2019 నాటికి 22.94 లక్షలకు చేరింది. ఇపుడు ఏకంగా 29 లక్షలకు చేరుకున్నట్లు సమాచారం. ఇందులో ఉరవకొండ డివిజన్లో ఏకంగా 38 శాతం పెరగ్గా.. అనంతపురం డివిజన్లో 14 శాతం పెరిగాయి. అలాగే మేకల విషయానికి వస్తే 2012లో 3.44 లక్షలు ఉండగా 2019 నాటికి 4.02 లక్షలకు చేరాయి. ఇపుడు 4.82 లక్షలకు పెరిగాయి. అందులో ఉరవకొండ డివిజన్లోనే 27 శాతం పెరగ్గా, అనంతపురం డివిజన్ పరిధిలో ఒక శాతం పెరిగినట్లు చెబుతున్నారు. పౌల్ట్రీ (కోళ్ల పెంపకం)లో కూడా 2012లో 8 లక్షల సంఖ్యలో ఉండగా 2019 నాటికి 10 లక్షలకు పెరగ్గా... ఇపుడు రెట్టింపు స్థాయిలో 21.54 లక్షలకు చేరుకుంది. ఇక్కడ కూడా ఉరవకొండ డివిజన్లోనే 120 శాతం పెరగ్గా, అనంతపురం డివిజన్లో 110 శాతం పెరిగినట్లు అంచనా వేశారు. ఇక పందులు, కుక్కలు సంఖ్య దాదాపు స్థిరంగా కొనసాగుతుండగా.. గాడిదలు, గుర్రాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 2019 గణనతో పోల్చితే 10 నుంచి 12 శాతం తగ్గిన ఆవులు, గేదెలు యాంత్రీకరణ, గడ్డి, దాణా కొరత, ప్రోత్సాహం లేక పాడి తగ్గుముఖం -
గణతంత్ర వైభవం
పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్, ఎస్పీ జగదీశ్ అనంతపురం అర్బన్/ అనంతపురం కల్చరల్: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని సోమవారం 77వ గణతంత్ర వేడుకలు జిల్లా అంతటా ఘనంగా జరిగాయి. ఊరూ, వాడా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అంతటా గణతంత్ర వైభవం కొనసాగింది. దేశభక్తి వెల్లివిరిసింది. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లాస్థాయి వేడుకలు నిర్వహించారు. ఇన్చార్జ్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, నగర పాలక సంస్థ మేయర్ వసీం, అహుడా చైర్మన్ టి.సి.వరుణ్, మార్కెట్ యార్డు చైర్పర్సన్ బల్లా పల్లవి, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, ఎస్పీ పి.జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, డీఆర్ఓ మలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి గీతం.. దేశభక్తి ప్రబోధితం గణతంత్ర దినోత్సవం రాకతో దేశభక్తి ఉట్టిపడింది. కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ‘నింగి వంగి నేల పొంగి’ అంటూ దేశమాతను కీర్తించి నర్తించిన శెట్టూరు మండలం యాటకల్లు జెడ్పీ పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి దక్కింది. హెల్మెట్లు వాడకపోవడం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ ఏజీ అనిల్కుమార్రెడ్డి బృందం రూపొందించిన ‘ఓ అన్నా జాగ్రత్త’ అంటూ సాగిన గీతాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఆటపాటలను ప్రదర్శించిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతిని, ‘దేశం కోసం జీవిద్దాం’ అనే పాటతో కురుగుంట కేజీబీవీ విద్యార్థినులు తృతీయ బహుమతిని, ‘ఇదే మన భారతం’ అన్న పాటతో వచ్చిన రక్షక్ ప్రీ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు ప్రోత్సాహక బహుమతిని అందుకున్నారు. ఆకట్టుకున్న శకటాలు, స్టాల్స్ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రభుత్వ శాఖలు ప్రగతి శకటాల ప్రదర్శన నిర్వహించాయి. వివిధ శాఖలు ప్రదర్శించిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. ప్రధానంగా పోలీసు జాగిలాల విన్యాసాలు ఆహూతులను ఆశ్చర్యానికి గురి చేశాయి. చివరలో దేశసేవలో తరించిన ఐదుకల్లు సదాశివన్, పీజీ కొండయ్య, మేడా వెంకటాచలం వంటి స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను కలెక్టర్, ఇతర అధికారులు ఘనంగా సత్కరించారు. అనంతరం విశిష్ట సేవలందించిన 451 మందికి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జునుడు, రామ్మోహన్, తిప్పనాయక్, జిల్లా సైనిక సంక్షేమాధికారి తిమ్మప్ప, జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజు నాయుడు, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, విభాగాల సూపరింటెండెంటు వసంతలత, యుగేశ్వరిదేవి, రియాజుద్దీన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. -
ఎందరో వీరుల త్యాగఫలం
అనంతపురం కల్చరల్: గణతంత్ర దినోత్సవ రాకతో జిల్లా వ్యాప్తంగా దేశభక్తి ప్రబోధితంగా మారింది. దేశమాతకు నీరాజనాలర్పించే సాంస్కృతిక సంబరాలు సిద్ధమయ్యాయి. ఎటు చూసినా మువ్వన్నెల జెండాల రెపరెపలు కనిపిస్తున్నాయి. బ్రిటీష్ ప్రభుత్వ దాస్యశృంఖలాల నుంచి భరతమాతను స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేసిన ఎంతో మంది మేధావులలో ‘అనంత’వాసులూ ఉన్నారు. ఆ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ఊర్లకు, వీధులకు త్యాగధనుల పేర్లు పెట్టారు. కేవలం స్వాత్రంత్య్రోద్యమంలోనే కాకుండా రాజ్యాంగ నిర్మాణంలోనూ జిల్లా వాసులు పాలు పంచుకున్నారు. అనంత త్యాగధనుడు.. జిల్లాలో తొలి స్వాతంత్ర ఖైదీగా పేరొందిన కల్లూరు సుబ్బారావు జీవితం ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా సాగింది. అరుదైన వ్యక్తిత్వంతో జిల్లాలో జాతీయోద్యమాన్ని ప్రభావితం చేశారు. బళ్లారిలో మహాత్మునితో కలిసిన తర్వాత ఆయన జీవితం మరింత విలక్షణంగా మారింది. దత్తమండలాలకు రాయలసీమ అని నామకరణం చేసిన వారిలో ఆయన ముందున్నారు. తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్, నీలం సంజీవరెడ్డి తదితరులు.. కల్లూరు సుబ్బారావు శిష్యులు కావడం విశేషం. రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకుని ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇక జిల్లా కేంద్రంలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన, టవర్క్లాక్ నిర్మాణంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. నిక్కమైన నీలం.. శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, లోకసభ స్పీకర్గా అన్నింటిని మించి దేశ ప్రథమ పౌరుడిగా ‘అనంత’ ఖ్యాతిని హస్తినలో రెపరెపలాడించిన నీలం సంజీవరెడ్డి 1931లో జాతీయోద్యమంలో కాలు పెట్టిన అనతి కాలంలోనే 1947 నాటికి భారత రాజ్యాంగ రూపకల్పన బృందంలో సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆయనతో పాటూ తొలి ఎంపీగా పనిచేసిన కేఎం రహంతుల్లా సైతం రాజ్యాంగ నిర్మాణంలో సహకారమందించారు. వీరందరి స్ఫూర్తిని జెండా పండుగలొచ్చినప్పుడల్లా జిల్లా వాసులు నెమరేసుకుంటూనే ఉంటారు. దేశభక్తికి ప్రతిరూపం టవర్క్లాక్.. దేశాన్ని బానిసత్వం నుంచి విడిపించడానికి అవిశ్రాంత పోరాటం చేసి అమరులైన అనంత వాసుల జ్ఞాపకార్థం నగరం నడిబొడ్డున టవర్క్లాక్ను నిర్మించారు. తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ దీనిని ప్రారంభించిన అనంతరం పీటీసీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. స్వాతంత్రమొచ్చిన సంవత్సరానికి గుర్తుగా టవర్ క్లాక్ 47 అడుగుల పొడవుతో, ఆగస్టు నెలను ప్రతిబింబిస్తూ 8 భుజాలతో, తేదీకి చిహ్నంగా 15 అడుగుల వెడల్పుతో అపురూపంగా నిలించింది. రాజ్యాంగ నిర్మాణంలో ‘అనంత’ వాసులూ భాగస్వాములే -
జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా పాఠ్యాంశాలు
అనంతపురం: భారతీయ జ్ఞాన పరంపరను ప్రతిబింబించే రీతిలో రూపకల్పన చేసిన నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా పాఠ్యాంశాలు ఉండాలని యూజీసీ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ జితేంద్ర కుమార్ త్రిపాఠి పేర్కొన్నారు. ‘పాఠ్యక్రమంలో భారతీయ జ్ఞాన పరంపర– సమన్వయం’ అంశంపై సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో ఆరు రోజుల పాటు నిర్వహించిన సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యూజీసీ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ జితేంద్ర కుమార్ త్రిపాఠి కీలకోపాన్యసం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వీసీ డాక్టర్ ఎస్ఏ కోరి మాట్లాడుతూ.. నూతనత్వాన్ని ప్రోత్సహించడంలో సెంట్రల్ యూనివర్సిటీ ముందంజలో నిలిచిందన్నారు. పాఠ్యక్రమ మార్పు జరగాలంటే నిరంతర అధ్యాపక శిక్షణా కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ సి. షీలా రెడ్డి, సదస్సు సమన్వయకర్త డాక్టర్ జి. మాలతి , రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్బీ ఖివాడే తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ చట్టాన్ని కొనసాగించాలి: సీపీఐ అనంతపురం అర్బన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి పేరు మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించాలనే డిమాండ్తో సీపీఐ ఆధ్వర్యంలో దళవారీ ఉద్యమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి తెలిపారు. ఆదివారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో కుళ్లాయిస్వామి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో నారాయణస్వామి మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదల వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఇప్పుడు ఏకంగా చట్టాన్ని వీబీజీరామ్జీ పథకంగా మార్చివేసిందన్నారు. దీని వల్ల ఉపాధి కూలీలకు ఒరిగేదేమి లేదన్నారు. సగటు వేతనం రూ.260 నుంచి రూ.240కు తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని విమర్శించారు. వీటన్నిటినీ వ్యతిరేకిస్తూ పాత చట్టాన్ని కొనసాగించాలనే డిమాండ్తో చేపట్టనున్న దశల వారీ ఉద్యమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, జె.రాజారెడ్డి, నాయకులు సంజీవన్ప, గోపాల్, పద్మావతి, గోవిందు, లింగమయ్య, రమణయ్య, రాజేష్గౌడ్, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర జయభేరి..అనంతపురం కార్పొరేషన్: విదర్భతో జరిగిన రంజీ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలి ఇన్నింగ్స్లో తడబడినా.. రెండో ఇన్నింగ్స్లో విదర్భను తక్కువ స్కోర్కు కట్టడి చేయడంతో పాటు అదే ఇన్నింగ్స్లో ఆంధ్ర బ్యాటర్ రషీద్ అద్భుత సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆంధ్ర జట్టు ఆరు పాయింట్లు దక్కించుకుని రంజీ ఎలైట్లో 28 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకింది. ఆంధ్ర, విదర్భ రంజీ మ్యాన్ను భారత జట్టు సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజా తిలకించారు. సెంచరీతో కదంతొక్కిన రషీద్.. 259 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆంధ్ర జట్టు 93/1తో ఓవర్ నైట్ స్కోర్తో తన ఆటను కొనసాగించింది. జట్టు స్కోర్ 114 పరుగుల వద్ద వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ 43 (5ఫోర్లు) పరుగులకు అవుటయ్యాడు. ఈ దశలో ఎస్కే రషీద్కు, కెప్టెన్ రికీభుయ్ తోడయ్యాడు. వీరిద్దరూ వికెట్ పడకుండా చూడచక్కని షాట్లతో అలరించారు. ఏ దశలోనూ తడబడకుండా చెలరేగిపోయారు. ప్రధానంగా రషీద్ ఫోర్లతో చెలరేగాడు. అవకాశం దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ 144 బంతుల్లో 132 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రికీభుయ్ 92 బంతుల్లో 7 బౌండరీలు, రెండు భారీ సిక్సర్లతో 64 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరూ మూడో వికెట్ భాగస్వామ్యానికి 145 పరుగులు చేశారు. ముగింపు కార్యక్రమం.. ముగింపు కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్కుమార్, ఏసీఏ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఆర్వీసీహెచ్ ప్రసాద్, జీఎం టి.శివకుమార్, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్రెడ్డి ముక్యఅతిథులుగా హాజరయ్యారు. టోర్నీలో సెంచరీ చేసిన విదర్భ ఆటగాడు రాథోడ్, ఆంధ్ర ఆటగాడు రషీద్, ఐదు వికెట్లు తీసిన కేఎస్ రాజును అభినందిస్తూ బ్లేజర్లను ఎస్పీ సతీష్కుమార్, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్ అందించారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ అశ్విన్ పాల్గొన్నారు. -
చట్టాలనే నిర్వీర్యం చేస్తారా?
అనంతపురం: అధికార పార్టీ ప్రాపకం కోసం క్రిమినల్ చట్టాలనే పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారని, ఇందుకు యల్లనూరు ఘటననే నిదర్శమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 1న యల్లనూరులో వైఎస్సార్సీపీకి చెందిన 12 మందిపై టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారన్నారు. ఘటనలో గాయపడింది వైఎస్సార్సీపీ నేతలేనని పేర్కొన్నారు. అయినా వీరందరూ ప్రస్తుతం జైలులో ఉన్నారని, దాడికి పాల్పడిన టీడీపీ నేత డి.రామాంజినేయులు అలియాస్ డాన్, దొడ్లో పవన్, దొడ్లో చిన్న ఓబులేసు, దొడ్లో ఓబులేసు, దొడ్లో కిరణ్, బాబు తదితరులపై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. వీరందరిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయకుండా పోలీసులు మిన్నకుండి పోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. హత్యాప్రయత్నాన్ని శిక్షార్హమైన నేరంగా సెక్షన్ 307 ఐపీసీ పరిగణిస్తుందన్నారు. నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. ఒకవేళ బాధితులెవరికైనా హాని కలిగితే జీవిత ఖైదు పడే అవకాశమూ ఉందన్నారు. ఇంతటి తీవ్రమైన సెక్షన్లో కేవలం ముగ్గురిని అరెస్ట్ చేసి, మిగిలిన వారిని గాలికి వదిలేసి పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు దొడ్లో రామాంజనేయులు స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని, ఎమ్మెల్యే కార్యాలయం వద్దనే ఉంటున్నాడనే విషయం పోలీసులకు కూడా తెలుసునన్నారు. అయినా అరెస్ట్ చేయకుండా వదిలేయడంతో గ్రామంలో రైతులు వరి పైరుకు నీరు పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. ఈ లెక్కన పోలీసుల తీరు చూస్తుంటే గ్రామ కక్షలకు ఆజ్యం పోసే రీతిలో ఉందని మండిపడ్డారు. యల్లనూరు ఘటనలో నిందితులుగా ఉన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ ఎస్పీని కలసి విన్నవిస్తామని పేర్కొన్నారు. పోలీసుల తీరును ప్రశ్నించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ -
బాబోయ్.. ఈ స్టేషన్ మాకొద్దు!
అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలో వసూళ్లకు కేంద్రంగా మారిన వన్టౌన్ పోలీసు స్టేషన్లో పోస్టింగ్ అంటే ఓ హాట్ కేక్లాంటిది. సిఫార్సు లేఖలతో ఇక్కడకు పలువురు అదే పనిగా పోస్టింగ్ తెచ్చుకుని వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ‘ఈ స్టేషన్ ... మాకొద్దు’ అంటూ పలువురు బదిలీకి దరఖాస్తులు చేసుకుంటున్నారు. బదిలీ కాకపోయినా కనీసం డిప్యుటేషన్ౖపైనెనా తమను ఇక్కడి నుంచి పంపేయండి అంటూ ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఈ జాబితాలో నలుగురు కానిస్టేబుళ్లు ఉండగా... త్వరలో మరికొందరు అదే బాటలో పయనించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓ ఏఎస్ఐ, మరో కానిస్టేబుల్ అందరిపై పెత్తనం చెలాయిస్తుండడం.. ‘స్టేషన్ బాస్’ తరుచూ బూతులతో విరుచుకుపడుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వారానికి రూ.లక్షల్లోనే వసూళ్లు.. అనంతపురంలోని వన్టౌన్ పీఎస్లో ప్రొటోకాల్ విధులు నిర్వహిస్తున్న ఓ ఏఎస్ఐ, కానిస్టేబులుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మట్కా నిర్వాహకులు, వైన్షాపులు, బార్లు, లాడ్జీలు ఇలా అవకాశమున్న ప్రతి చోటా వారం మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి. కేవలం ఈ ఇద్దరి కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తోందని ఆ శాఖలోని పలువురు బాహటంగానే పేర్కొంటున్నారు. క్రైంపార్టీ సిబ్బంది ఎక్కడైనా దాడులు చేసినా.. నేరస్తులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించినా మరుక్షణమే సదరు ఏఎస్ఐ, కానిస్టేబులు అక్కడ ప్రత్యక్షమై పైరవీలకు తెరలేపుతుంటారు. పట్టుబడిన వ్యక్తి కావాల్సిన వాడని, వదిలేయాలంటూ హుకుం జారీ చేస్తారు. కాదూకూడదని అంటే క్రైం పార్టీ సిబ్బంది వైఖరిని వెంటనే ‘బాస్’ దృష్టికి తీసుకెళుతుంటారు. ఈ విషయాన్ని ఆ బాస్ కాస్త తీవ్రంగా పరిగణిస్తూ బూతులతో రెచ్చిపోతుండడం పరిపాటిగా మారింది. ఇటీవల నూతన సంవత్సరం రోజున అసభ్యపదజాలంతో దూషించాడంటూ పలువురు కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో రెండు మూడేళ్లలో ఉద్యోగ విరమణ పొందే ఓ సీనియర్ ఉద్యోగిపై సైతం అందరూ చూస్తుండగానే బూతులతో రెచ్చిపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. తన సర్వీసులో ఈ స్థాయిలో ఎన్నడూ అవమానపడలేదంటూ సదరు ఉద్యోగి తన సహచరులతో చెప్పుకుని కన్నీరు పెట్టినట్లుగా తెలిసింది. గాడిలో పెట్టేరా? నగరంలోని పోలీసు స్టేషన్లపై డీఎస్పీ శ్రీనివాసరావు పెద్దగా దృష్టిసారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల నేరాల కట్టడి, సిబ్బంది పనితీరుపై ఎలాంటి సమీక్షలు జరగకపోవడమే ఇందుకు నిదర్శనం. అనంతపురం డివిజన్తో పాటు ఇన్చార్జ్ రూరల్ డీఎస్పీగా విధులు ఆయనే నిర్వర్తిస్తున్నారు. గతంలో ఎస్సీ,ఎస్టీ సెల్, ట్రాఫిక్ , సీసీఎస్లకు ప్రత్యేక డీఎస్పీలు ఉండేవారు. ఇప్పుడవన్నీ ఒకేఒక్కరికి అప్పగించారు. దీంతో ఆయనెప్పుడూ బిజీ గానే ఉండిపోతున్నారు. ఫలితంగా పోలీసు స్టేషన్లలో పాలన గాడి తప్పుతోంది. ఇప్పటికై నా గాడితప్పిన అనంతపురం వన్టౌన్ పీఎస్ను జిల్లా పోలీసు బాస్ గాడిలో పెడతారో? లేదో వేచి చూడాలి! అనంతపురంలోని వన్టౌన్ పీఎస్ అనంతపురం వన్టౌన్ పీఎస్లో పనిచేయడానికి హడలిపోతున్న సిబ్బంది ఇతర పోలీసుస్టేషన్లకు డిప్యుటేషన్పై వెళ్లేందుకు దరఖాస్తు అధికారుల మితిమీరిన పెత్తనమే కారణం -
సునామ జకినీ మాత ఉత్సవాలకు వేళాయె
గుత్తి: స్థానిక ఆర్ఎస్ మార్గంలో వెలసిన ఆరె కటికల ఆరాధ్య దైవం సునామ జకినీ మాత ఉత్సవాలు ఈ నెల 29, 30 తేదీల్లో జరుగనున్నాయి. ఏటా మాఘమాసంలో క్రమం తప్పకుండా ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడి అమ్మవారు విరాజిల్లుతున్నారు. భారత దేశంలోనే ఏకై క సునామ జకినీ మాత ఆలయం గుత్తిలో మాత్రమే ఉండడం విశేషం. దీంతో ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా ఆరె కటికలు తరలి రానుండడంతో అదే స్థాయిలో ఏర్పాట్లను ఆలయ కమిటీ నిర్వాహకులు పూర్తి చేశారు. 29న సునామ జకినీ మాత, మల్కూమా జకినీ మాత మూలవిరాట్లకు ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు ఉంటాయి. అనంతరం ఉత్సవ మూర్తులను ఊరేగించనున్నారు. సాయి బాబా గుడి వద్ద నుంచి పట్టణ పుర వీధుల గుండా అమ్మవారి ఆలయం వరకూ జరిగే ఈ శోభాయాత్రలో కన్యలు, ముత్తయిదువులు పూర్ణ కుంభాలతో పాల్గొంటారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. 30వ తేదీన సామూహిక కుంకుమార్చన, అయ్యప్ప ఆలయంలో సునామ జకినీ మాతకు గంగా స్నానం, పూర్ణ పాల కుంభాలతో ఊరేగింపు, అఽతిథుల ప్రసంగాలు, పది, ఇంటర్, డిగ్రీ తరగతుల్లో అత్యధిక మార్కులు సాదించిన ఆరె కటిక సామాజిక విద్యార్థులకు బహుమతుల ప్రదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాలను జయప్రదం చేయాలని సునామ జకినీ మాత ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆలూరు లక్ష్మణ రావు, ఉపాధ్యక్షుడు ఎంకే బాబురావు, ఆలయ ధర్మకర్త సురేష్ రావు పిలుపునిచ్చారు. దేశం నలుమూలల నుంచి తరలి రానున్న ఆరె కటికలు -
గణతంత్ర వేడుకకు వేళాయె..
అనంతపురం అర్బన్: గణతంత్ర వేడుకలకు పోలీసు పరేడ్ మైదానం ముస్తాబయ్యింది. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సోమవారం ఉదయం 8.55 గంటలకు జాతీయ పతాకాన్ని ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆవిష్కరిస్తారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఉదయం 9.20 గంటలకు ఇన్చార్జ్ కలెక్టర్ తన సందేశాన్ని వినిపిస్తారు. 10 గంటలకు ప్రభుత శాఖల శకటాల ప్రదర్శన, ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఉత్తమ సేవ పురస్కారానికి 12 మంది అధికారులు, 417 మంది ఉద్యోగులను ఎంపిక చేశారు. స్వచ్ఛంద సంస్థలకూ అవార్డులు ప్రదానం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం ముగుస్తుంది. గణతంత్ర దినోత్సవం ఏర్పాట్లను ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్, ఎస్పీ జగదీశ్ ఆదివారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. -
తాడిపత్రిలో రౌడీ రాజ్యం
సాక్షి టాస్క్ఫోర్స్: తాడిపత్రిలో రౌడీ రాజ్యం నడుస్తోంది. మామూళ్లు, ఆధిపత్యం, రాజకీయ ప్రేరేపిత దాడులతో రణరంగం సృష్టిస్తున్నాయి. నిత్యం గొడవలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తాడిపత్రి పట్టణంలోని పాత కూరగాయాల మార్కెట్, గాంధీకట్ట, శివాలయం వీధి, టైలర్స్ కాలనీ, యల్లనూరు రోడ్డు, నందలపాడులో మట్కా, పేకాట స్థావరాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ఆదాయం భారీగా వస్తుండటంతో కొందరు అధికార పార్టీ నేతలు యువకులను చేరదీసి వారితో రౌడీగ్యాంగ్లు నడుపుతున్నారు. కొన్ని గ్యాంగ్లు మట్కా, పేకాట కేంద్రాలు నిర్వహిస్తుంటే.. మరికొన్ని గ్యాంగ్లు అటువంటి కేంద్రాల నుంచి మామూళ్లు వసూళ్లు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నాయి. మామూళ్ల కోసం ఒక్కోసారి ఒక గ్యాంగ్పై మరొక గ్యాంగ్ దాడులకు పాల్పడి భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. అధికార పార్టీ ముఖ్య నాయకుల మెప్పుకోసం ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇళ్లపై దాడులకు తెగబడుతూ, ఆస్తులను విధ్వంసానికి పాల్పడుతున్నాయి. రౌడీ గ్యాంగ్లకు అధికారపార్టీ నాయకుల అండదండలు ఉండటంతో పోలీసులు వారిని కట్టడి చేయడం లేదు. బాధితులు ఫిర్యాదు చేస్తున్నా కేసుల నమోదుకు వెనకాడటమే ఇందుకు నిదర్శనం. సినీ ఫక్కీలో గ్యాంగ్ వార్.. రౌడీ గ్యాంగ్ల మధ్య గొడవలు సినీ ఫక్కీలో జరుగుతున్నాయి. ఈ నెల నాలుగో తేదీ రాత్రి గాంధీకట్ట వద్ద మట్కా డాన్ లఫ్పా ఖాజా గ్యాంగ్ నుంచి మట్కా మామూళ్ల కోసం టీడీపీ చోట నాయకుడు వద్ద వున్న సాదక్వలి అలియాస్ పండు గ్యాంగ్ రాళ్లు, కర్రలతో దాడికి దిగింది. ప్రతిగా లఫ్పా ఖాజా గ్యాంగ్ కూడా దాడి చేయడంతో పండు తీవ్రగాయాలపాలయ్యాడు. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రెండు గ్యాంగ్లనూ చెదరగొట్టి కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రెండు గ్యాంగ్లు అధికార పార్టీ మద్దతుదారులు కావడంతో ఫిర్యాదు లేదన్న కారణంగా పోలీసులు వారిని వదిలేశారు. ఇలాంటి గొడవలు పట్టణంలో చీకటి పడితే చాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. ముసుగు ధరించి దాడులు.. కొన్ని రౌడీ గ్యాంగ్లు అధికారపార్టీ నాయకుల మెప్పు కోసం రాత్రి వేళల్లో ముసుగులు ధరించి వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడటం, ఆస్తులను ధ్వంసం చేయడం, ద్విచక్ర వాహనాలను తగలబెట్టడం చేస్తున్నాయి. ఒంటరిగా ఉన్న ప్రత్యర్థులపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. ఇప్పటి వరకు పట్టణంలో దాదాపు 20 మందిపై దాడులకు పాల్పడినట్లు సమాచారం. మామూళ్లు, ఆధిపత్యం కోసమే.. అధికారపార్టీ నేతల అండదండలు పుష్కలం -
ఆదిత్యాయ నమః
అనంతపురం కల్చరల్: రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా వ్యాప్తంగా సామూహిక సూర్యనమస్కారాతో నీరాజనాలర్పించారు. వివేకానంద యోగకేంద్రం ఆధ్వర్యంలో తెల్లవారుజామున నగరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో సామూహిక సూర్యనమస్కార యజ్ఞం జరిగింది. నిర్వాహకులు యోగా విశిష్టతను, సూర్యనమస్కారాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగా శిక్షకులు సూర్యభగవానుని స్తుతిస్తూ సాగిన మంత్రాలకనుగుణంగా వందలాది మంది యోగా సాధకులు 108 సామూహిక నమస్కారాలు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ ఇంజినీరు శ్రీరాం సుధాకర్, వివేకానంద యోగ కేంద్ర అధ్యక్షుడు మెళవాయి రాజశేఖరరెడ్డి తదితరులు యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఒత్తిడి నిండిన జీవితానికి యోగా మాత్రమే పరిష్కారమార్గమన్నారు. రోజూ సూర్యనమస్కారాలు చేయడం వల్ల చక్కటి వ్యాయామంతో పాటూ రోగాలు దరిచేరవని, మనసు ఉల్లాసంగా ఉంటుందన్నారు. అనంతరం యోగా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులనందించారు. -
నేడు ‘పరిష్కార వేదిక’ లేదు
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లేదని ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినమైనందన కార్యక్రమం నిర్వహించడం లేదని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు బ్రహ్మాస్త్రం ● ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ అనంతపురం అర్బన్: ప్రజాస్వామ్యంలో ఓటు బ్రహ్మాస్త్రం వంటిదని ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ‘నా భారత్... నా ఓటు...భారత ప్రజాస్వామ్య హృదయంలో పౌరుడు’ అనే నినాదంతో 16వ జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఇన్చార్జ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రతిజ్ఞతో ప్రారంభించారు. అనంతరం భారత ఎన్నికల కమిషన్ డాక్యుమెంటరీ వీడియోని అందరూ తిలకించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్లు వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అవ్వాలన్నారు. 17 ఏళ్లు నిండిన వారు ప్రాస్పెక్టివ్ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని మంచి నేతను,, సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం యువ ఓటర్లకు ఎపిక్ కార్డులను అందజేశారు. సీనియర్ సిటిజన్లను సన్మానించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, ఇతర పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, మల్లికార్జునుడు, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, అర్ట్స్ కళాశాల సహ ప్రిన్సిపల్ సహదేవుడు, విభాగాల అధిపతులు వసంతలత, యుగేశ్వరిదేవి, రియాజుద్ధీన్, తహసీల్దార్లు మోహన్కుమార్, విజయకుమారి, ఎనికల విభాగం డీటీ కనకరాజు, ఎస్ఏ శామ్యూల్ బెంజిమన్, ఎన్నికల సిబ్బంది, విద్యార్థులు, పాల్గొన్నారు. ఉత్తమ పనితీరుకు అవార్డులు.. ఎన్నికల విధుల్లో ఉత్తమ పనితీరు కనపరిచిన 13 మందికి అవార్డులను ఇన్చార్జ్ కలెక్టర్ ఆందజేశారు. అవార్డు అందుకున్న వారిలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు హబీబ్ఖాన్, ఆంజనేయులు, లక్ష్మీదేవి, 1950 ఆపరేటరల్ శరణ్య, ఆఫీస్ సబార్డినేట్ మహేష్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మహబూబ్, దివ్యమానస, నీలకంఠ కుమార్, నరేష్ కుమార్, మాథ్యూస్పాల్, గౌతమి, శ్రీకాంత్, రఘుప్రసాద్ ఉన్నారు. -
దగ్గుపాటి అనుచరుడు గంగారాం అరెస్ట్
అనంతపురం సెంట్రల్: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు కోనంకి గంగారాంను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం షాప్కు నిప్పంటించిన కేసులో అతనితోపాటు ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీరికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. అరెస్టు వివరాలను నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ జగదీష్ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12న అర్ధరాత్రి దాటిన తర్వాత జాతీయ రహదారిలోని నంబూరి వైన్స్కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. రూ.3 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. పెట్రోల్పోసి నిప్పంటిస్తున్న తతంగం మొత్తం సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ కేసులో ఇప్పటికే లక్ష్మీనగర్కు చెందిన మోహన్కుమార్, అతని తమ్ముడు అఖిల్కుమార్, కళావతి కొట్టాలకు చెందిన బాబాఫక్రుద్దీన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా ప్రధాన నిందితుడైన నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన కోనంకి గంగారాం, అతని డ్రైవర్లు రుద్రంపేటకు చెందిన వీరేంద్రబాబు, డొక్కా హరిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పెచ్చుమీరిన ఆగడాలు.. ఎమ్మెల్యే దగ్గుపాటి ముఖ్య అనుచరుడిగా చలామణి అవుతున్న గంగారాం ఆగడాలు నగరంలో పెచ్చుమీరిపోయాయి. అందులో భాగంగా ఇటీవల రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకున్ని బెదిరించాడు. అలాగే వాటా ఇవ్వలేదని జాతీయ రహదారి పక్కన ఉన్న నంబూరి వైన్స్ షాపునకు నిప్పు పెట్టించాడు. మరో టీడీపీ మహిళా నేత బంధువులకు చెందిన స్థలం కబ్జాకు యత్నించాడు. ఈ మూడు ఘటనలపై గంగారాంపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అంతా హైడ్రామా.. మద్యం షాపునకు నిప్పు పెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దీన్ని ఎస్పీ జగదీష్ సీరియస్గా తీసుకున్నారు. అయితే కేసులు నమోదైన వెంటనే గంగారాం, అతని అనుచరులు జిల్లా నుంచి పరారయ్యారు. ఇతర రాష్ట్రంలో తలదాచుకున్న గంగారాంను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి, జిల్లాకు తీసుకొచ్చారు. మీడియా ఎదుట హాజరుపరుస్తారని అందరూ భావించారు. అయితే శనివారం నుంచి హైడ్రామా నడిచింది. చివరకు సెలవు దినమైన ఆదివారం న్యాయమూర్తి నివాసంలో గంగారాంను హాజరుపరిచారు. అరాచకాలలో ఉద్యోగుల పాత్ర! ఎమ్మెల్యే అనుచరుల అరాచకాలలో ఆయన వద్ద పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాలు పంచుకుంటున్నట్లు మరోసారి నిరూపితమైంది. ఎగ్జిబిషన్ నిర్వాహకున్ని బెదిరించేందుకు స్వయంగా ఎమ్మెల్యే దగ్గుపాటి గన్మెన్ షెక్షావలి వెళ్లడాన్ని ఎస్పీ జగదీష్ తీవ్రంగా పరిగణించారు. ఆయన్ను సస్పెండ్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయించారు. ఆదివారం ప్రధాన నిందితుడు గంగారాం అరెస్ట్ – రిమాండ్ తరలింపు సమయంలో టీడీపీ నాయకులు కాకుండా ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏ శ్రీరాములు (డీఆర్డీఏ–వెలుగు ఏపీఎం) పాల్గొనడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఇటీవల గంగారాం దౌర్జన్యాల వెనుక ఎమ్మెల్యే హస్తమున్నట్లు పత్రికలతో పాటు పలువురు రాజకీయ నాయకులు ఆరోపించడంపై దగ్గుపాటి తీవ్రస్థాయిలో స్పందించారు. వారి గొడవలతో తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. అయితే నగరంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు తదితర ఘటనలన్నింటిలో ఆయన సహాయకులు పాల్గొంటున్నారు. దీన్ని బట్టి చూస్తే అన్ని నేరాల వెనుక ఎమ్మెల్యే ఉన్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వైన్స్ షాప్కు నిప్పంటించిన కేసు.. ఇద్దరు డ్రైవర్లు వీరా, హరి కూడా అరెస్ట్ ముగ్గురికీ 14 రోజుల రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్ -
జూద కేంద్రాల నియంత్రణలో విఫలం
తాడిపత్రిటౌన్: తాడిపత్రి పట్టణంలో మట్కా, పేకాట వంటి జూద కేంద్రాలను నియంత్రించడంలో పోలీస్ వ్యవస్థ విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాడిపత్రిలో ఏ వీధిలో చూసినా మట్కా, పేకాట స్థావరాలు కనిపిస్తున్నాయన్నారు. సామాన్య ప్రజలు జూదాల వలలో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులు మట్కా, పేకాట నిర్వాహకుల నుంచి మామూళ్ల కోసం గొడవలకు దిగుతున్నారన్నారు. గ్యాంగ్వార్లు జరుగుతున్నా పోలీసులు కేసులు నమోదు చేయడానికి జంకుతున్నారన్నారు. పోలీస్ అధికారులు జేసీకి కొమ్ముకాస్తూ రౌడీ మూకలు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, ఆస్తుల విధ్వంసం చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. బాధితుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండా.. వారిపైనే కేసులు నమోదు చేస్తామని భయపెడుతున్నారని తెలిపారు. ఇక సోషల్మీడియాలో పోస్ట్ పెట్టారని వైఎస్సార్సీపీ నాయకులను చిత్రహింసలు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ వారు సోషల్మీడియాలో పెట్టిన పోస్టులు పోలీసులకు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. జిల్లా పోలీస్ అధికారులు తాడిపత్రి వైపు దృష్టి సారించి జూద కేంద్రాలను నియంత్రించి, గ్యాంగ్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఏ వీధిలో చూసినా మట్కా, పేకాటే తాడిపత్రిని జూదకేంద్రంగా మార్చేశారు పట్టించుకోని పోలీసులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజం -
ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం 15 నెలల క్రితం రూ.20 వేలు డీడీ చెల్లించాను. కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరగడంతో నెల కిందట ఆరు విద్యుత్ స్తంభాలు, దానికి సరిపడే కండక్టర్ ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్ అడిగితే మీ సీరియల్ రాలేదు... వచ్చే వరకు ఆగాలంటూ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బోరు వేయించి ఏడాదిన్నర అవుతోంది. నీళ్లున్నా పొలాన్ని బీడుగా వదిలేయాల్సి వచ్చింది. ఇకనైనా అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలి. – కుళ్లాయప్ప, బూదేడు, గార్లదిన్నె మండలం -
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
అనంతపురం అర్బన్: జాతీయ ఓటర్ల దినోత్సవం ఆదివారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ముందుగా భారత ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి ప్రసంగాన్ని వర్చువల్ విధానంలో తిలకిస్తారు. దినోత్సవం పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలు అందించిన 13 మంది ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేస్తారు. అలాగే యువ ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తారు. వయసు 80 ఏళ్లు పైబడిన ఓటర్లను సన్మానిస్తారు. నేటి నుంచి కొండమీదరాయుని బ్రహ్మోత్సవాలు బుక్కరాయసముద్రం: మండల కేంద్రం బుక్కరాయసముద్రంలో కొండమీదరాయస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. పది రోజులపాటు ఉత్సవాలు సాగుతాయి. ఆదివారం సాయంత్రం స్థానిక లక్ష్మీ నారాయణస్వామి దేవాలయంలో నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను కొండపైకి తీసుకెళ్తారు. ఉదయం 8 గంటలకు దేవరకొండపై ఉత్సవ విగ్రహాలకు పుణ్యాహవచనం, అంకురార్పణ, దేవతా హోమాలు, ధ్వజారోహనం, గరుడ ఆహ్వాన పూజ నిర్వహిస్తారు. 26వ తేదీ రాత్రి 8 గంటలకు స్వామి వారికి పుష్ప పల్లకీ సేవ నిర్వహించనున్నారు. 27న రాత్రి సింహ వాహనం, 28న రాత్రి శేష వాహనం, 29న హనుమద్వాహనం, 30న రాత్రి గరుడ వాహనంపై ఊరేగిస్తారు. 31న రాత్రి శ్వేత గజ వాహనంపై ఊరేగిస్తారు. 1న శ్రీవారి కల్యాణోత్సవం, రథోత్సవం ఫిబ్రవరి ఒకటో తేదీ వేకువ జామున నాలుగు గంటలకు మండల కేంద్రంలో స్వామి వారికి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటలకు సూర్యప్రభ వాహనంపై గరుడాద్రి బ్రాహ్మణ సంఘం ఆద్వర్యంలో లక్ష్మీ నారాయణస్వామి దేవాలయం నుంచి పురవీధుల్లో ఊరేగించనున్నారు. సాయంత్రం మండల కేంద్రంలో కనుల పండువగా రథోత్సవం నిర్వహిస్తారు. రెండో తేదీ రాత్రి 8 గంటలకు స్వామి వారిని అశ్వవాహనం, 3న రాత్రి హంస వాహనంపై ఊరేగిస్తారు. ఈ తిరుణాలలో భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. గురుకులాల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సక్షేమ (డాక్టర్ బీఆర్ అండేడ్కర్) గురుకులాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు, 6–9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి కె.విజయలక్ష్మి కోరారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 19లోగా రూ. 100 రుసుంతో వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఎస్సీ గ్రూప్–1కు 5 శాతం, ఎస్సీ గ్రూప్–2కు 32.5 శాతం, ఎస్సీ గ్రూప్–3కు 37.5 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ–సీలకు 11 శాతం, బీసీలకు 5 శాతం, ఓసీలకు 3 శాతం ప్రకారం సీట్లు రాష్ట్ర కార్యాలయ అధికారులు కేటాయిస్తారని స్పష్టం చేశారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిద్దాం
అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ప్రశ్నిద్దామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా నియమించిన క్లస్టర్ ఇన్చార్జ్లు, పరిశీలకులు, సచివాలయాల ఇన్చార్జ్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ, అనుబంధ విభాగాల కమిటీలను ఫిబ్రవరి 10లోగా పూర్తి చేయాలని కోరారు. 85 సచివాలయాలకు గాను సచివాలయాల వారీగా వైఎస్సార్సీపీ కమిటీలతో పాటు అనుబంధ యువజన, విద్యార్థి, మహిళ, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ట్రేడ్ యూనియన్, సోషల్ మీడియా కమిటీలను గడువులోగా నియమించాలని తెలియజేశారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేవాళ్లను గుర్తించి కమిటీల్లోకి తీసుకోవాలని సూచించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రచార ఆర్భాటానికి మాత్రమే పరిమితమైందని మండిపడ్డారు. 19 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. -
గుమ్మనూరు వన్మ్యాన్ షో
● ఆర్యూబీకి రెండోసారి భూమి పూజ ● ముఖం చాటేసిన రైల్వే అధికారులు ● ఎంపీ అంబికాకు అందని ఆహ్వానం గుంతకల్లు: ఆయనకు అధికారులే కాదు ప్రజాప్రతినిధులన్నా గౌరవం లేదు. టీడీపీ అధిష్టానం మాటన్నా లెక్కలేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని సొంత సామ్రాజ్యంగా భావిస్తున్నారు. అందులో ఎవ్వరి జోక్యం ఉండరాదనుకుంటున్నారు. అందుకే అంతా తానై వ్యవహరిస్తూ వన్మ్యాన్ షో చేస్తున్నారు. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శనివారం గుంతకల్లు పట్టణంలోని ధర్మవరం రైల్వే లెవల్ క్రాసింగ్ (ఎల్సీ) గేట్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) పనులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం భూమి పూజ చేశారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ భవాని, ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్, తహసీల్దార్ రమాదేవి హాజరయ్యారు. దాదాపు రూ.10 కోట్ల విలువైన ఈ రైల్వే పనుల భూమి పూజకు ఏ ఒక్క రైల్వే అధికారి కూడా రాలేదు. రైల్వే పనుల భూమి పూజలో ప్రొటోకాల్ ప్రకారం అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణకు ఆహ్వానించాలి. కానీ ఎంపీకి ఆహ్వానమే అందలేదు. మళ్లీ మళ్లీ భూమి పూజ వాస్తవానికి ధర్మవరం రైల్వే ఎల్సీ గేట్ అండర్ బ్రిడ్జి పనులకు 2024 మార్చి 16న అప్పటి ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి, రైల్వే అధికారులు సీనియర్ డీఈఎన్ కోర్డినేషన్ అక్కిరెడ్డి, సీనియర్ డీఎఫ్ఎం ప్రదీప్బాబు ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఆనాడు వై.వెంకటరామిరెడ్డి చొరవతో ఈ ధర్మవరం లెవెల్ క్రాసింగ్ గేట్ (నం.157) వద్ద ఆర్యూబీ పనుల కోసం ప్రభుత్వం రూ.8.50 కోట్లు నిధులు మంజూరు చేసింది. టెండర్లు ప్రక్రియ కూడా ఆప్పుడే పూర్తిచేశారు. ఇక పనులు ప్రారంభించే సమయంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఆర్యూబీ పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే ఎప్పుడో నిధులు మంజూరై, టెండర్ల ప్రక్రియ పూర్తయి, భూమి పూజ కూడా జరిగిన ఈ పనులకు శనివారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మళ్లీ భూమి పూజ చేయడం గమనార్హం. ఎంపీని ఎందుకు దూరం పెట్టారు?.. భూమి పూజ కార్యక్రమానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు ఆహ్వానం అందలేదు. కావాలనే ఎంపీనీ దూరం పెట్టారని, ఆయన్ను అవమానించాలనే ఉద్దేశంతోనే ఆహ్వానం పంపలేదని సమాచారం. ఎంపీని ఈ విధంగా అవమానించడం వెనుకు గుమ్మనూరు సోదరుల ఆక్రోశం దాగి ఉంది. ఇటీవల ఓ రైల్వే కాంట్రాక్ట్ విషయంలో 10 శాతం వాటా కమీషన్గా చెల్లించే విషయంలో ఎంపీ అంబికాకు, ఎమ్మెల్యే గుమ్మనూరుకు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఎంపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి నుంచి ఎంపీపై గుమ్మనూరు రగిలిపోతున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న గుమ్మనూరు.. ప్రొటోకాల్ను పక్కన పెట్టి ఎంపీని అవమానించారని తెలుస్తోంది. రైల్వే అధికారుల డుమ్మా.. ఈ భూమి పూజ కార్యక్రమానికి రైల్వే అధికారులు హాజరు కాలేదు. పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని రైల్వే అధికార యంత్రాంగం బహిష్కరించింది. ఈ బహిష్కరణ వెనుక ఓ చిన్న కథ నడిచింది. తనకు ఆహ్వానం అందని విషయాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నేరుగా రైల్వే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రొటోకాల్ నిబంధనల గురించి రైల్వే అధికారులకు ఎంపీ గుర్తు చేసినట్లు సమాచారం. ఎంపీకి అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఎమ్మెల్యే గుమ్మనూరు వన్మ్యాన్ షో తీరుతో అనవసరంగా మాట పడాల్సి వచ్చిందని రైల్వే ఉన్నతాధికారులు భావించారు. ఫలితంగా ఈ భూమి పూజకు డుమ్మా కొట్టి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
మేథావుల పురిటిగడ్డ ‘ఉమ్మడి అనంత’
పెనుకొండ: మేథావుల పురిటిగడ్డ ఉమ్మడి అనంతపురం జిల్లా అని వక్తలు పేర్కొన్నారు. సామాన్య కుటుంబాల్లో పుట్టిన ఎంతో మంది తమ అసామాన్య ప్రతిభతో జిల్లా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నారని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం రాత్రి ‘అనంత ఆణిముత్యాలు పురస్కార ప్రదానోత్సవం’ ఘనంగా జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, తెలంగాణ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణా రావు, రిటైర్డ్ డీజీపీ డాక్టర్ కే. అరవిందరావు, ప్రొఫెసర్ నరహరి, స్టేఫిట్ ఫౌండర్ గణపతిరెడ్డి, ఐఎంవీ మొబైల్ సీఈఓ విశ్వనాథ్ ఎల్లురి, ప్రొఫెసర్ అనంతసురేష్, హైదరాబాద్ జేజే హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ జయంతిరెడ్డి, సైంటిస్ట్ కే. కల్యాణి, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫీసర్ (ఫారెస్ట్) చింతా చైతన్యకుమార్రెడ్డి, ముంబైకి చెందిన చట్టనాథన్, టైగ్లోబల్ ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం, మీనాక్షమ్మ ఫౌండేషన్ ఫౌండర్ రమణ, ఆదర్శరైతు గోపాల్, ఆర్ఏ అసోసియేట్స్కు చెందిన రామకృష్ణగుప్తా, క్రీడాకారులు బి. అనూష్, ఎం. అనూష, ఫోక్ సింగర్ పెద్దక్క, మౌంటెనీర్ ఉపేంద్ర, కుంచే తిప్పేస్వామి, జానపద కళాకారుడు ఆదినారాయణలకు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మేథావులకు కొదవలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడి జిల్లా ఖ్యాతిని ఘనంగా చాటుతున్నారన్నారు. అనంత గడ్డలో పుట్టడం ఒక వరమని, పట్టుదల, కృషి ఉంటే ఉన్నత స్థానాలకు చేరడం సమస్యే కాదన్నారు. ప్రతి ఒక్కరూ ఆణిముత్యంగా తయారు కావాలని, ఉన్నత స్థానాలకు చేరాలని కోరారు. అనంత ఆణిముత్యాల కార్యక్రమం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాలని పేర్కొన్నారు. ఎంతో శ్రమించి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకుడు ప్రతాపరెడ్డిని అభినందించారు. హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన తాను ఎంఏ తెలుగు చదివి లెక్చరర్గా పని చేశానని, అవకాశం రావడంతో సినిమా రంగంలోకి ప్రవేశించి రాణించానన్నారు. నిర్వాహకుడు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో సాహితీ గగన్మహల్ ట్రస్ట్ నుంచి రూ. 3 కోట్లతో పాఠశాలలకు వసతులు కల్పించినట్లు వెల్లడించారు. స్వార్థ చింతన లేకుండా 3 సంవత్సరాలకు ఒకసారి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు. సన్మానం అందుకుంటున్న రామకృష్ణారావు, జస్టిస్ సురేష్రెడ్డి, చిత్రంలో బ్రహ్మానందం, అరవిందరావు పట్టుదల, కృషి ఉంటే ఉన్నత స్థానాలకు చేరడం సమస్యే కాదు ‘అనంత ఆణిముత్యాలు పురస్కార ప్రదానోత్సవం’లో వక్తలు ముఖ్య అతిథిగా హాజరైన హాస్యనటుడు బ్రహ్మానందం -
27 నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో 17 కేటగిరీలకు సంబంధించిన పోస్టుల భర్తీకి ఈ నెల 27 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. నిర్వహణ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని డీఆర్ఓ మలోల అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై డీఆర్ఓ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ ప్రశాంత్కుమార్, సెక్షన్ ఆఫీసర్ మల్లికార్జునరెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. 27 నుంచి 28 వరకు రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహనం పరీక్ష ఉంటుందన్నారు. 29, 30, 31 తేదీల్లో ఉదయం మాత్రమే జరుగుతుందన్నారు. నాలుగు కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 27న ఉదయం 1,533 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 36 మంది, 28న ఉదయం 99 మంది, మధ్యాహ్నం 623 మంది, 29 ఉదయం 251 మంది, 30 ఉదయం 873 మంది, 31వ తేదీ ఉదయం 251 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, వివిధ అధికారులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు గణతంత్ర దినోత్సవ వేడుక కన్నుల పండుగలా నిర్వహించాలని, ఇందుకోసం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఇన్చార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణకు పోలీసు పరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను ఇన్చార్జ్ కలెక్టర్ శనివారం రాత్రి అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోలతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఏర్పాట్లకు సంబంధించి అప్పగించిన బాధ్యతలను ఆయా అధికారులు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ, ఫ్లాగ్ ఏర్పాటు, కవాతు ప్రాంత అలంకరణ, విద్యుత్ సరఫరా, స్టాళ్లు, శకటాలు, సిట్టింగ్, మౌలిక సదుపాయాలు తదితర ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అమిలినేని అనుచరుడి దౌర్జన్యం
సాక్షి, టాస్క్ఫోర్స్: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరుడు అధికార దాహంతో వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంటి నిర్మాణాలను దౌర్జన్యంగా కూల్చివేశాడు. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలం కదరంపల్లిలో రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. కదరంపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త నాగలక్ష్మి దంపతులు గ్రామంలో ఇల్లు, ప్రహరీ, మరుగుదొడ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. అయితే నాగలక్ష్మి ఇంటికి ఆనుకొని టీడీపీ నేత వెంకటేశులు (ఎమ్మెల్యే అమిలినేనికి ముఖ్య అనుచరుడు) ఇంటిని కొన్నేళ్ల క్రితం నిర్మించుకున్నాడు. అధికారమదంతో సదరు టీడీపీ నేత ఎమ్మెల్యే పేరు చెప్పుకొని నాగలక్ష్మి నిర్మించుకున్న ప్రహరీ, మరుగుదొడ్డిని తొలగించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు పలుమార్లు కాంపౌండ్ వాల్, మరుగుదొడ్డిని తొలగించాలని నాగలక్ష్మికి సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదేశాలతో ఆమెకు నోటీసులు అందించారు. నోటీసులు అందుకోకపోవడంతో పోలీసులతో భయపెట్టిన టీడీపీ నేత .. శుక్రవారం సాయంత్రం నాగలక్ష్మి దంపతులను స్టేషన్కు రావాలని పోలీసులతో ఒత్తిడి చేయించారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో నాగలక్ష్మి నిర్మించుకున్న ప్రహరీ, మరుగుదొడ్డిని దౌర్జన్యంగా జేసీబీతో తొలగింపజేశారు. ఇదంతా టీడీపీ నేత వెంకటేశులు తన ఇంటికి దారి ఏర్పాటు చేసుకునేందుకే వైఎస్సార్సీపీ కార్యకర్త నిర్మాణాలను కూల్చివేశాడని గ్రామస్తులు అంటున్నారు. ఎమ్మెల్యే అండతోనే ఇలా దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు అంటున్నారు. అయితే ప్రభుత్వ స్థలంలో నిర్మించినందుకే తొలగించారని పోలీసులు నాగలక్ష్మి దంపతులను స్టేషన్కు పిలిపించి విచారించడం కొసమెరుపు. -
..తం సూర్యం ప్రణమామ్యహం
● ఉరవకొండ మండలంలో రెండు చారిత్రక ఆలయాలు ● సైన్స్కు అంతు చిక్కని రహస్యాలు అనంతపురం కల్చరల్/ఉరవకొండ రూరల్: ఆరోగ్య ప్రదాతగా పూజలందుకునే ఆదిత్యుడికి భక్తినీరాజనాలర్పించే రోజుగా చెప్పుకునే పర్వదినం రథసప్తమి రానే వచ్చింది. సమస్త ప్రాణకోటికి జీవనాధారమై.. ఆయురారోగ్యాలనందించే ఈ పర్వదినం ఈసారి సూర్యదేవునికి ప్రీతికరమైన ఆదివారం రావడంతో జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతపురంలోని హెచ్చెల్సీ కాలనీలో ఉన్న మంజునాథ ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు బసవరాజస్వామి తెలిపారు. అనంతకు ప్రత్యేకం.. ఏడు అశ్వాలపై ఆశీనుడై సూర్యభగవానుడు రథసప్తమి నాడు గగనతలంలో పయనిస్తూ మానవాళిని అనుగ్రహిస్తాడని, అందుకు కృతజ్ఞతగా చేసే పూజలే దీర్ఘాయుష్షును కలిగిస్తాయని భక్తులు భావిస్తారు. ఈ పర్వదినం రాకతో ఆలయాలు ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాయి. అనంతపురంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం, పాతూరులోని విరూపాక్షేశ్వరాలయం, మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వరాలయం, శివకోటి, శివబాలయోగి ఆశ్రమం తదితర చోట్ల రథసప్తమి పర్వదినం నాడు సాగే విశేష పూజోత్సవాలకు, నగరోత్సవాలకు ఆలయాలను సిద్ధం చేశారు. నగరంలో పలు చోట్ల ఆదివారం తెల్లవారుజామునే సూర్యప్రభ వాహనంపై వేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను ఊరేగించనున్నారు. నమస్కార ‘యోగ’ం అనంతపురంలోని వివేకానంద యోగ కేంద్రం ఆధ్వర్యంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆదివారం ఉదయం 5.45 గంటలకు సామూహిక సూర్యనమస్కార యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ కళాశాలలోని బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఈ వేడుక జరుగనుంది. 108 సూర్యనమస్కార మంత్రాలతో సాగే ఈ మహా యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు రాజశేఖరరెడ్డి, యోగా గురువు దివాకర్ పిలుపునిచ్చారు. అరుదైన సూర్య భగవానుడి ఆలయాలు ఉరవకొండ మండలం బూదగవి, ఆమిద్యాల గ్రామాల్లోలోకానికి వెలుగులు పంచే సూర్యభగవానుడికి సంబంధించి చారిత్రక ఆలయాలు ఉన్నాయి. ఈ రెండు ఆలయాలకు వేర్వేరు ప్రత్యేకతలు ఉండటం విశేషం. సాధారణంగా సూర్యభగవానుడు తూర్పు అభిముఖంగా కొలువుదీరి ఉంటాడు. అయితే ఇందుకు భిన్నంగా ఆమిద్యాల గ్రామంలో పశ్చిమ అభిముఖంగా దర్శనమిస్తే, బూదగవిలో దక్షిణముఖంగా కనిపిస్తాడు. ఆమిద్యాలలోని సూర్యదేవాలయానికి దాదాపు 800 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చెబుతోంది. చెన్నకేశవ స్వామి ఆలయంగా పిలిచే ఈ ఆలయంలో చెన్నకేశవస్వామి, శివుడు, సూర్యభగవానుడి విగ్రహాలకు ప్రత్యేక గర్భాలయాలు ఉన్నాయి. వందల ఏళ్ల కిందట నిర్మించిన ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే తొలుత చెన్నకేశవ స్వామి దర్శనమిస్తాడు. తూర్పు దిక్కుగా ఉన్న శివలింగానికి ఎదురుగా సప్తాశ్వాలపై సూర్యభగవానుడు కొలువుదీరి ఉంటాడు. భక్తులు శివకేశవులను ఒకేసారి సందర్శించొచ్చు. ఇక బూదగవిలో క్రీస్తు శకం 13వ శతాబ్ధంలో చోళరాజులు సూర్యదేవాలయం నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోనే దక్షిణాభిముఖంగా ఉన్న ఏకై క సూర్యదేవాలయం. ఇక్కడ సూర్యనారాయణస్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా కనిపిస్తారు. అలాగే రథసప్తమి నాడు ఉరవకొండలోని బూదగవి, తాడిపత్రి లోని చింతల వేంకటరమణస్వామి ఆలయంలో నేరుగా సూర్యకిరణాలు మూలవిరాట్ను తాకడం సైన్స్కు అంతు చిక్కని రహస్యం. బూదగవిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం జరి గే రథసప్తమిని పురస్కరించుకొని ఏర్పాట్లు చేశారు. నేడు పెన్నహోబిలంలో రథసప్తమి ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఉదయం మూలవిరాట్కు సహస్ర నామార్చన చేస్తారు. అనంతరం లక్ష్మీ నృసింహస్వామికి సూర్యప్రభ, గోవాహన, హనుమంత వాహనోత్సవం, గరుడ వాహనోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం 11 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం జరగనుంది. క్రీ.శ. 13వ శతాబ్దం నాటి బూదగవి సూర్యనారాయణస్వామి ఆలయం, స్వామివారి మూలవిరాట్ సందర్భం నేడు రథసప్తమి వేడుక -
కొనుగోలుమాల్
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కురుగుంటతో పాటు చియ్యేడులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండుచోట్ల ప్రైవేట్ వ్యక్తులే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. వీరికి కందులు కొనుగోళ్లు పెద్ద వ్యాపారంగా మారింది. తూకాల్లోనూ, నాణ్యతలోనూ, హమాలీ చార్జీల వసూళ్లలోనూ వీరు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతుంటే ప్రభుత్వం క్వింటాకు రూ. 8 వేలుతో కొనుగోలు చేస్తుందంటే అంత ఆశపడ్డారు. అయితే అధికార పార్టీ కార్యకర్తలకు కొనుగోలు బాధ్యతలు అప్పగించి రైతుల నడ్డి విరుస్తున్నారు. ఇదిలాఉండగా బాధిత రైతుల్లో కరుడుగడ్డిన టీడీపీ కార్యకర్తలూ ఉన్నారు. ఎవరినీ వదలడం లేదంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. గతేడాది రూ. 60 మాత్రమే వసూలు గతేడాది సొసైటీల ద్వారా కందులు కొనుగులు చేశారు. అప్పుడు హమాలీల చార్జీలు క్వింటాకు రూ. 60 మాత్రమే వసూలు చేశారు. ఈ మొత్తం హామీల కష్టానికి పూర్తి స్థాయిలో సరిపోతుందని అధికారులు చెప్తున్నారు. మరి ఈసారి ప్రైవేట్ వ్యుక్తలు మాత్రం క్వింటాకు రూ. 150 వసూలు చేస్తున్నారు. అంటే ఒక క్వింటాకు రూ. 90 అదనం. ఈసారి కంది దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఒక్క అనంతపురం రూరల్ మండలంలోనే దాదాపు 10 క్వింటాళ్ల దాకా అమ్మకాలు జరుగుతుయాని అంచనా. అదే జరిగితే ఒక్క హమాలీల చార్జీల్లోనూ అక్షరాలా రూ. 9 లక్షల దాకా దోపిడీ చేస్తున్నారు. నాణ్యత లేదని, తేమశాతం, ఇతర సాకులతో ఒక్కో బ్యాగుకు 51.250 కిలోలు పట్టాల్సి ఉన్నా...51.500 కిలోల నుంచి 52.500 కిలోల దాకా పడుతున్నారు. ఏమి మాట్లాడినా నాణ్యత లేవని, ఇవి పట్టమని చెప్తూ బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి గతేడాది కాస్తా పుచ్చులు ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఇప్పుడు తీసుకుంటున్నా కొనుగోలు దారులకు మరింత చేతులు తడిపితే ఇవేవీ పట్టించుకోరని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులకు అన్నీ తెలుసు.. ప్రైవేట్ వ్యక్తులు సాగిస్తున్న దోపిడీ సంబంధిత మార్కెట్ఫెడ్ అధికారులకు అన్నీ తెలుసు. ధైర్యంగా ప్రశ్నించలేకపోతున్నారు. కొనుగోలు చేస్తున్న వారికి అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధుల అండ ఉండడంతో ఏమీ మాట్లాడలేకపోతున్నారు. కళ్లెదుటే రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వారు గుర్తించినా మాట మాట్లాడలేకపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కందుల కొనుగోల్లో సాగిస్తున్న దోపిడీని నిలువరించాలని రైతులు వేడుకుంటున్నారు. రైతుల నుంచి కంది కొనుగోలు కేంద్రం ప్రతినిధుల దోపిడీ టీడీపీ కార్యకర్తలే కొనుగోలు కేంద్రాల ప్రతినిధులు హమాలీల పేరుతో క్వింటాకు రూ.150 వసూలు క్వింటాకు కేజీ నుంచి 3 కేజీల దాకా దోపిడీ లబోదిబోమంటున్న రైతులు... పట్టించుకోని అధికారులు అనంతపురం రూరల్ మండలం కామారుపల్లికి చెందిన మహిళా రైతు అవిలిగొండ మనెమ్మ ఆరు ఎకరాల్లో కందిసాగు చేయగా, మొత్తం 42 బ్యాగుల (21 టన్నులు) దిగుబడి వచ్చింది. ఇటీవల కురుగుంట సమీపంలోని చంద్రప్రియనగర్లోని గోడౌన్లో విక్రయించింది. శనివారం ఆమె మొబైల్కు 10 బ్యాగులు (ఐదు టన్నులు) తిరస్కరించినట్లు మెసేజ్ వచ్చింది. అదే గ్రామానికి చెందిన భోగే పార్వతి తన 12.53 ఎకరాల్లో 29 క్వింటాళ్ల కంది దిగుబడి వచ్చింది. కురుగుంట గోడౌన్లో విక్రయించింది. ఈమెకు 5 క్వింటాళ్లు తిరస్కరించినట్లు మెసేజ్ పంపారు. అనంతపురం రూరల్ మండలం గొల్లపల్లికి చెందిన రైతు మలిరెడ్డి 40 క్వింటాళ్లు విక్రయించాడు. హమాలీలకు క్వింటాకు రూ.150 చొప్పున రూ. 6 వేలు ఇవ్వాలని అడిగారు. ఇదేమని ప్రశ్నించగా రూ. 6 వేలు చెల్లించాల్సిందేనని చెప్పడంతో నిస్సహాయస్థితిలో ఉండిపోయాడు. కందుల మాటున సాగుతున్న దోపిడీకి ఈ ఉదంతాలే నిదర్శనం. -
హోరాహోరీగా రాతి దూలం లాగుడు పోటీలు
కుందుర్పి: లక్ష్మీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాతిదూలం లాగుడు పోటీలు, పానకం బండ్ల ఊరేగింపు నిర్వహించారు. స్థానిక హైస్కూల్ ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు పారప్రారంభమైన రాతిదూలం లాగుడు పోటీల్లో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి 8 జతల వృషభాలు పాల్గొన్నాయి. మొదటి బహుమతి రూ.30 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందించారు. సాయంత్రం పానకం బండ్ల ఊరేగింపు ఆకట్టుకుంది. మొదటి పానకం బండితో కదరంపల్లి శివారెడ్డి గ్రామోత్సవంగా వచ్చిన అనంతరం గ్రామస్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. రేపటి నుంచి బొలికొండ రంగనాథ బ్రహ్మోత్సవాలు గుత్తి రూరల్: బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26న ప్రారంభం కానున్నాయి. జక్కలచెరువు నుంచి శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి, తొండపాడుకు పల్లకీలో తీసుకొస్తారు. అనంతరం ధ్వజారోహణం, అంకురార్పణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. 27న సింహ వాహనోత్సవం, 28న శేషవాహనోత్సవం, 29న హను మద్ వాహనోత్సవం, 30న గరుడ వాహనోత్సవం, 31న గజవాహనం, కల్యాణోత్సవం, ఫిబ్ర వరి 1న రథోత్సవం, 2న పార్వేట, అశ్వవాహ నం, 3న వసంతోత్సవం, హంసవాహనం జరగనుందని ఆలయ ఈఓ శోభ తెలిపారు. విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకోండి అనంతపురం టౌన్: ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాసయాదవ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆర్థిక భరోసా కల్పించే విధంగా విశ్వకర్మ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఏడు రోజుల నుంచి 15 రోజుల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. టైలర్, చీపురు తయారీ, బార్బర్, వడ్రంగి, తాపీ పని, దండలు, చేపల వలలు, బొమ్మల తయారీ తదితర రంగాల్లో నైపుణ్య శిక్షణతోపాటు టూల్ కిట్ అందజేయనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు దాటిన యువతీయువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అందుబాటులో నాన్ జ్యుడీషియల్ స్టాంపులు అనంతపురం టౌన్: నాన్ జ్యుడీషియల్ స్టాంపులను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అందుబాటులోకి తెచ్చారు. కొన్ని నెలలుగా స్టాంప్లు అందుబాటులో లేక క్రయ, విక్రయదారులు ఇబ్బందులు పడ్డారు. అధిక ధరలకు ఈ స్టాంప్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. రూ.100 స్టాంప్ కావాలంటే రూ.150 వరకు చెల్లించాల్సి వచ్చేది. ఎట్టకేలకు మహారాష్ట్రలోని నాసిక్ నుంచి జ్యుడీషియల్ స్టాంపులు తీసుకొచ్చారు. అనంతపురం రామ్నగర్, రూరల్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.10, 20, 50, రూ.100 స్టాంప్లు అందుబాటులో ఉంచినట్లు జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని లక్ష్మీపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహేష్ (30) మృతి చెందాడు. గ్రామానికి చెందిన మహేష్ ద్విచక్రవాహనంపై బొట్టువానిపల్లి నుంచి లక్ష్మీపురం వైపు వెళ్తుండగా, నూతి మడుగు నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బొలెరో ఢీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేష్.. సీహెచ్సీకి చికిత్స నిమిత్తం తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి మహేష్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థుల ఎంపిక వజ్రకరూరు:చిన్నహోతూరు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం శ్రీనివాసరెడ్డి, పీడీ ప్రభా కర్ తెలిపారు. శనివారం స్థానిక పాఠశాలలో జాతీయ పోటీలకు ఎంపికయిన విద్యార్థులను అభినందించారు. ఈనెల 22న ఏలూరులో జరిగిన అండర్ 14 నేషనల్ సబ్ జూనియర్ ఖోఖో పోటీల్లో సి.అనిత (9 వ తరగతి), బి.శ్రీసూర్య (9వ తరగతి) ప్రతిభ కనబరిచి, ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు హర్యానాలో జరగనున్న జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయిని పద్మజ రూ.2వేలు, సర్పంచు సుంకులమ్మ భర్త విజయ్కుమార్ రూ.1000,స్పోర్ట్స్ కిట్ అందించారు. -
యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేయాలి
● విభజన హామీలు తక్షణమే అమలు చేయాలి ● ప్రాంతీయ సదస్సులో వక్తలు కడప సెవెన్రోడ్స్ : రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు రానున్న బడ్జెట్లో అఽధిక ప్రాధాన్యత ఇవ్వాలని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.నారాయణరెడ్డి అధ్యక్షతన కడపలోని బీసీ భవన్లో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలి.. సీఈఎస్ఎస్ ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు అభివృద్ధిలోనూ వెనకబడ్డాయని, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. వ్యవసాయం, దాని ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చేయాలన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అమరావతిపైనే దృష్టి కేంద్రీకరిస్తోందన్నారు. 2వేల ఎకరాల్లో రాజధాని నిర్మించొచ్చని, మూడు పంటలు పండే జరి భూములను సేకరించడం సరికాదన్నారు. రాజధాని కోసం అప్పు చేసి లక్షల కోట్లు ఖర్చుచేస్తామంటున్న ప్రభుత్వం.. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు రూ. కోటి మంజూరు చేయడం లేదని విమర్శించారు. బాబూ ఇదేం సంపద సృష్టి.. సంపద సృష్టిస్తామని అధికారంలోకొచ్చిన చంద్రబాబునాయుడు అమరావతి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తే సంపద సృష్టి జరుగుతుందా? అని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ ప్రశ్నించారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం క్విడ్ ప్రోకోకు ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడితే సమాధానం చెప్పలేక కేసులు బనాయించడం అన్యాయమన్నారు. వీటిపై మంత్రులతో సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ప్రాజెక్టులు, పరిశ్రమలపై ఎందుకు సబ్ కమిటీలు ఏర్పాటు చేయదని ప్రశ్నించారు. విభజన హామీలు అమలు కావడం లేదన్నారు. సొంత మీడియాలో విజన్–2047 అంటూ ప్రచారం తప్ప చేసిన అభివృద్ధి ఏమీలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి సదస్సుకు అధ్యక్షత వహించిన నారాయణరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం మెట్ట ప్రాంతాలకు ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 194 మెట్ట ప్రాంత మండలాలలో 23 లక్షల ఎకరాలకు సాగునీరు, రెండున్నర కోట్ల మందికి తాగునీరు అందుతుందన్నారు. కడప స్టీల్ ప్లాంటు, కడప–బెంగుళూరు రైల్వేలైన్, ఇతర విభజన హామీల అమలు కోసం పోరాడతామని తెలిపారు. పలువురు వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్దివేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్, ఉపాధ్యక్షులు వైవీ శివయ్య, అనంతపురం జిల్లా అధ్యక్షులు జి.నారాయణరెడ్డి, కేవీ రమణ, వైఎస్సార్ సీపీ నాయకుడు బూసిపాటి కిశోర్కుమార్, ఏఐఎస్బీ జాతీయ కన్వీనర్ జయవర్దన్, పీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరాయుడు, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గుర్రప్ప, పీఆర్ఎస్వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కె.శంకర్, కాంగ్రెస్ నాయకులు సత్తార్ పాల్గొన్నారు. -
గెలుపు దిశగా ఆంధ్ర
● రెండో ఇన్నింగ్స్లో 191 పరుగులకు కుప్పకూలిన విదర్భ ● ఆంధ్ర లక్ష్యం 259..ప్రస్తుతం 93/1 అనంతపురం కార్పొరేషన్: ఆంధ్రజట్టు గెలుపు దిశగా పరుగులు పెడుతోంది. ఆంధ్ర బౌలర్లు సమష్టిగా రాణించడం..రెండో ఇన్నింగ్స్లో విదర్భ జట్టును తక్కువ స్కోర్కే పరిమితం చేయడంతో పాటు ఆంధ్ర జట్టు ఆటముగిసే సమయానికి 93/1 పరుగులతో గెలుపు దిశగా ముందుకుసాగుతోంది. కుప్పకూలిన విదర్భ: అనంతపురం క్రికెట్ గ్రౌండ్లో మూడో రోజు జరిగిన మ్యాచ్లో విదర్భ జట్టు ఓవర్నైట్ స్కోర్ 4/0తో ప్రారంభించింది. విదర్భ జట్టును ఆంధ్ర బౌలర్లు కట్టిడి చేసి కేవలం 191 పరుగులకు పరిమితం చేశారు. ఆంధ్ర బౌలర్ సాయితేజ నాలుగు వికెట్లు తీసుకొని విదర్భను కోలుకోలేని దెబ్బతీశాడు. సాయితేజకు తోడుగా సౌరబ్కుమార్ 2, నితీష్కుమార్ రెడ్డి 2, విజయ్, కేఎస్ఎన్ రాజు చెరో వికెట్ తీసి విదర్భ పతనాన్ని శాసించారు. విదర్భ జట్టులో వైవీ రాథోడ్ 56 (7ఫోర్లు, సిక్సర్), ఆర్. సమర్థ్ 47(4పోర్లు) రాణించగా, మిగితా బ్యాట్స్మెన్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. 259 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్లో ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 93 పరుగులు చేసింది. జట్టులో వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ 27 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఆటకు ఆదివారం చివరి రోజు. ఇదిలా ఉండగా ఆంధ్ర, విదర్భ మ్యాచ్ను భారత జట్టు సెలెక్టర్ ప్రజ్ఞ్యాన్ ఓజా తిలకించారు. -
సార్ ప్లీజ్.. ఒక్కరోజు ఆగండి
ఉరవకొండ: ‘సార్ ప్లీజ్ ఒక్కరోజు టైం ఇవ్వండి.. నేను వెళ్లి ‘అన్న’తో కలిసి వారు ఏం చెబితే అదే చేస్తా’ అంటూ జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ను గవిమఠం ఇన్చార్జ్ ఏసీ రాణి ప్రాధేయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఏసీ గంజి మల్లికార్జున ప్రసాద్కు ఉరవకొండ గవిమఠం ఇన్చార్జ్ ఏసీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ, ధర్మదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బాధ్యతలు తీసుకునేందుకు శుక్రవారం ఆయన గవిమఠంలోని ఏసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు రాణి నిరాకరించారు. తనకు ఒక్క రోజు సమయమివ్వాలని, తన బాధ్యతలు కొనసాగించేలా అన్నతో సిఫారసు చేయించుకుని వస్తానని పేర్కొనడం చర్చానీయాంశమైంది. ఆమె తీరుతో కంగుతిన్న మల్లికార్జున సైతం తాను ఇక్కడకు రాకముందే అన్నీ చూసుకోవాలని, ఉత్తర్వులు వచ్చిన తర్వాత తననేమీ చేయమంటారు అంటూ ప్రశ్నించారు. దీంతో ప్టీజ్ సార్.. ప్లీజ్ అంటూ రాణి ప్రాధేయపడడంతో మల్లికార్జున అక్కడి నుంచి వెనుతిరిగారు. -
ఆంధ్ర తడబాటు.. ఆధిక్యంలో విదర్భ
● 228 పరుగులకు ఆలౌట్ ● 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో విదర్భ అనంతపురం కార్పొరేషన్: రంజీ మ్యాచ్లో భాగంగా అనంతపురం క్రికెట్ గ్రౌండ్లో శుక్రవారం రెండో రోజు విదర్భ బౌలర్ల ధాటికి ఆంధ్ర జట్టు తడబడింది. జట్టులో అభిషేక్ రెడ్డి, సౌరభ్కుమార్ అర్ధసెంచరీలు చేయగా, నితీష్కుమార్ రెడ్డి పర్వాలేదనిపించాడు. ఇక మిగిలిన బ్యాటర్లు ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆంధ్ర క్రికెట్ జట్టు 228 పరుగులకు కుప్పకూలింది. 267/7తో ఓవర్నైట్ స్కోర్తో విదర్భ జట్టు రెండో రోజు ఆట కొనసాగించిన కాసేపటికే సౌరభ్కుమార్ బౌలింగ్లో జి.నల్కేండే అవుటయ్యాడు. అనంతరం సెంచరీ హీరో వైవీ రాథోడ్ 115 పరుగులు చేసి సాయితేజ బౌలింగ్లో కీపర్ కేఎస్ భరత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 89.3 ఓవర్ల వద్ద 295 పరుగులకు విదర్భ జట్టు ఆలౌట్ అయింది. ఆంధ్ర బౌలర్లలో కేఎస్ రాజు 5, కె.సాయితేజ 3, సౌరభ్కుమార్, నితీష్కుమార్ రెడ్డి చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్ర జట్టు 23 పరుగుల వద్ద కేఎస్ భరత్ (9) అవుటయ్యాడు. అనంతరం ఎస్కే రషీద్, కెప్టెన్ రికీ భుయ్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ దారి పట్టారు. ఈ క్రమంలో ఓపెనర్ అభిషేక్రెడ్డితో నితీష్కుమార్రెడ్డి జత కట్టాడు. కీలక దశలో అభిషేక్రెడ్డి (73)ని ఏఎస్ థాకరే అవుట్ చేశాడు. ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన సౌరభ్కుమార్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అవకాశం దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ 87 బంతుల్లో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. నితీష్కుమార్ రెడ్డి 35, త్రిపురణ విజయ్ 17 పరుగులు చేశారు. దీంతో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 228 పరుగులకు ఆలౌట్ కాగా విదర్భకు 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. విదర్భ బౌలర్లలో నల్కండే, థాకరే, భూతే, పీఆర్ రేఖడే చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం విదర్భ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. మ్యాచ్ను తిలకించిన ఇండియన్ సెలెక్టర్ ఓజా భారత జట్టు సెలెక్టర్ (సౌత్జోన్) ప్రజ్ఞాన్ ఓజా శుక్రవారం అనంతపురం క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర, విదర్భ జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ను తిలకించారు. ఆయన వెంట ఏసీఏ సెలెక్షన్ ఛైర్మన్ ఆర్వీసీహెచ్ ప్రసాద్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛోఫెర్రర్ తదితరులు ఉన్నారు. -
గెలుపే లక్ష్యంగా శ్రమిద్ధాం
● వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేద్దామంటూ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై. విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణంపై ఉరవకొండ పట్టణానికి చెందిన పార్టీ ముఖ్యనేతలు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులతో శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశమై మాట్లాడారు. నియోజకవర్గంలోని 86 పంచాయతీలు 108 గ్రామాలకు గాను ఇప్పటికే 80 శాతం కమిటీల నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రతి మండలానికి 18 అనుబంధ విభాగాల కమిటీలను 198 మందితో పూర్తి చేసినట్లు వివరించారు. కమిటీలను ప్రతి స్థాయిలో డిజిటలైజేషన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గ నాయకులను సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరచాలని మండల, గ్రామ కమిటీల సభ్యులకు సూచించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు పాలనపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. పాలన చేత కాక సీఎం స్థాయిలో చంద్రబాబు నిస్సుగ్గుగా అబద్ధాలు చెబుతూ ప్రజలను వంచిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నియోజకవర్గ డిజిటల్ మేనేజర్ మఠం వీరేష్, రాష్ట్ర నాయకులు యోగేంద్రరెడ్డి, బసవరాజు, వైస్ ఎంపీపీ, పట్టణ కన్వీనర్ ఈడిగప్రసాద్, మండల సమన్వయకర్త ఓబన్న పాల్గొన్నారు. -
లోకేష్ పుట్టిన రోజు వేడుకల్లో తమ్ముళ్ల రగడ
బుక్కరాయసముద్రం: మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం బీకేఎస్లో నిర్వహించిన వేడుకల్లో టీడీపీ నేతల మధ్య గొడవ చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని సచివాలయం వద్ద ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గీయులు, స్టేట్బ్యాంక్ సమీపంలో ద్విసభ్య కమిటీ వర్గీయులు వేర్వేరుగా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఇరు వర్గాల వారు టపాసులు పేలుస్తూ ర్యాలీలో పరస్పరం ఎదురు పడగానే గొడవ మొదలైంది. పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. -
భూ రీసర్వే మార్గదర్శకాలను పాటించాలి : డీఆర్వో
కూడేరు: భూ రీసర్వే ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సంబంధిత సిబ్బందిని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోల ఆదేశించారు. కూడేరు మండలం గొటుకూరులో కొనసాగుతున్న రీసర్వే ప్రక్రియను శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. రైతుల సమక్షంలోనే వారి భాగస్వామ్యంతో హద్దులు నిర్ధారణ చేయాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి సర్వే నిబంధనలు, రికార్డులోని భూ విస్తీర్ణాన్ని చదివి వినిపించి రైతుల అంగీకారం మేరకే ఖరారు చేయాలని ఆదేశించారు. ఏకపక్షంగా వ్యవహరించి తప్పిదాలకు చోటిస్తే బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.కార్యక్రమంలో తహసీల్దార్ మహబూబ్ బాషా, మండల సర్వేయర్లు ప్రసాద్, అయేషా సిద్ధిఖీ, వీఆర్వో కుళ్లాయిస్వామి పాల్గొన్నారు. యూరియా కలిపిన నీరు తాగి.. రాప్తాడు రూరల్: ప్రమాదవశాత్తు విషపూరిత నీరు తాగడంతో 39 పొట్టేళ్లు మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే.. రాప్తాడుకు చెందిన బుల్లే గంగాధర్ స్థానిక 44వ జాతీయ రహదారి సమీపంలో తన తోటలో షెడ్డు ఏర్పాటు చేసి 68 పొట్టేళ్లను పెంచుతున్నాడు. సాగు చేసిన మొక్కజొన్న పంటకు శుక్రవారం ఉదయం యూరియా కలిపిన నీటిని డ్రిప్ ద్వారా వదిలాడు. విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకోవడంతో పైపులో యూరియా నిలిచిపోయింది. ఈ విషయం తెలియని గంగాధర్ పైప్లను తీసి నీటి తొట్టెలో వేశాడు. కాసేపటి తర్వాత కరెంట్ రావడంతో మోటార్ ఆన్ చేయగానే పైపుల్లో ఉన్న యూరియా తొట్టెలోకి చేరుకుంది. పొట్టేళ్లను నీరు తాగేందుకు వదిలి గంగాధర్ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. కాసేపటి తర్వాత తొట్టె వద్దకు రాగా... చూస్తుండగానే 38 పొట్టేళ్లు చనిపోయాయి. వెంటనే విషయాన్ని పశుసంవర్ధక శాఖ ఏడీ ప్రకాష్ దృష్టికి తీసుకెళ్లడంతో సిబ్బందితో కలసి అక్కడకు చేరుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 29 పొట్టేళ్లను కాపాడారు. మరొకటి మృతి చెందింది. ఘటనతో రూ.4.50 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. -
వలస కూలీలకు విద్యుత్ షాక్
పుట్లూరు: మండలంలోని ఓబుళాపురం సమీపంలో శుక్రవారం విద్యుత్ షాక్కు గురై పశ్చిమ బెంగాల్కు చెందిన షరీపుల్తో పాటు మరో ఇద్దరు జార్ఖండ్ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. అరటి గెలలను తరలించడానికి లారీలో వెళుతున్న సమయంలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు కూలీలకు తగిలాయి. క్షతగాత్రులను వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్న ఒకరిని కర్నూలులోని సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తే క్రిమినల్ కేసు ● గనుల శాఖ డీడీ ఆదినారాయణ అనంతపురం టౌన్: ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తామంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదినారాయణ హెచ్చరించారు. శింగనమల మండలం తరిమెలలో గురువారం అర్ధరాత్రి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వెంటనే సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని ఇసుక తవ్వకాలకు ఉపయోగిస్తున్న హిటాచీని సీజ్ చేసినట్లు వివరించారు. పెద్దవడుగూరు మండలం చిత్రచేడు, మొలకతాళ్ల, యల్లనూరు మండలం లింగారెడ్డిపల్లి, యల్లనూరు, కనేకల్లు మండలం రచ్చుమర్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన రీచ్ల ద్వారానే ఇసుక తరలించుకోవాలన్నారు. అలా కాదని నిబంధనలు ఉల్లంఘించేవారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. అనంతరం సీజ్ చేసిన హిటాచీని శింగనమల పోలీసులకు అప్పగించారు. టీడీపీ నేతల నిర్బంధంలో ఎకై ్సజ్ అధికారులు? చెన్నేకొత్తపల్లి: కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన ఎకై ్సజ్ అధికారులను స్థానిక టీడీపీ నేతలో ఓ గదిలో నిర్బంధించినట్లు సమాచారం. చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు... చెన్నేకొత్తపల్లి ఎకై ్సజ్ ఎస్ఐ శివప్రసాద్, సిబ్బంది శుక్రవారం ముష్టికోవెలలో తనిఖీలు చేపట్టారు. టీడీపీకి చెందిన ఓ వ్యక్తి నిర్వహిస్తున్న బెల్టు షాపులో కర్ణాటక మద్యం నిల్వలు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని పీఎస్కు తరలిస్తుండగా బెల్టు షాపు నిర్వాహకుడితో పాటు గ్రామంలోని టీడీపీ నేతలు తిరగబడ్డారు. పట్టుబడిన మద్యాన్ని తీసుకెళ్లకువండా, ఎకై ్సజ్ అధికారులను గ్రామ పొలిమేరలు దాటకుండా నిర్బంధించారు. నాలుగు గోడల మధ్య దుప్పటి పంచాయితీ నిర్వహించారు. పట్టుబడిన మద్యాన్ని చివరకు కూడా అక్కడే వదిలేయడంతో ఎకై ్సజ్ అధికారులను వదిలేశారు. ఈ ఘటనపై ఎకై ్సజ్ ఎస్ఐ శివకుమార్ను వివరణ కోరగా.. గ్రామంలో తనిఖీలు చేపట్టిన మాట వాస్తవమని, అయితే తమపై ఎవరూ తిరగబడలేదని పేర్కొన్నారు. హత్య కేసులో నిందితుడి అరెస్ట్ అనంతపురం సెంట్రల్: ఈ నెల 21న అనంతపురంలోని యల్లమ్మకాలనీలో చోటు చేసుకున్న వివాహిత హత్య కేసులో హతురాలి భర్తను అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. యల్లమ్మకాలనీలో నివాసముంటున్న లక్ష్మీ గంగ (27) ప్రవర్తనపై కొంత కాలంగా భర్త రామాంజనేయులు అనుమానాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే గత బుధవారం రాత్రి భార్యతో తీవ్ర స్థాయిలో గొడవపడి కత్తితో ఆమె గొంతు కోసి ఉడాయించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రామాంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. అనుమానంతోనే తన భార్యను హతమార్చినట్లు అంగీకరించడంతో కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. -
మహిళలపై వీధి కుక్కల దాడి
ఉరవకొండ: మేజర్ గ్రామపంచాయతీ ఉరవకొండలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో 30 మంది పిల్లలు, మహిళలపై దాడులు చేశాయి. తాజాగా శుక్రవారం సత్యనారాయణపేట, చెంగలవీధిలో నలుగురు మహిళలలను కరిచి గాయపరిచాయి. అంతటితో ఆగక ఆడుకుంటున్న చిన్నారులపైకి దూసుకెళ్తుండటంతో కాలనీ వాసులు వాటిని తరిమికొట్టారు. అనంతరం ఆయా కాలనీవాసులు మూకుమ్మడిగా పంచాయతీ కార్యాలయానికి చేరుకుని కుక్కలబారి నుంచి తమను రక్షించాలని ఈఓ మహ్మద్రఫీ వద్ద మొరపెట్టుకున్నారు. ఈఓ స్పందిస్తూ కుక్కలను పట్టుకుని దూరంగా వదులుతామని చెప్పారు. రీ సర్వేకు రైతులు సహకరించాలి ● ఇన్చార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ గుత్తి రూరల్: ఏపీ రీసర్వే పథకం కింద గ్రామాల్లో చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని ఇన్చార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ కోరారు. మండలంలోని ఊబిచెర్ల గ్రామంలో జరుగుతున్న నాలుగవ విడత భూముల రీసర్వే పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ గడువులోగా రీసర్వే పనులు పూర్తి చేయాలన్నారు. గ్రౌండ్ ట్రూథింగ్ నోటీసులు జారీ చేశారా లేదా అని కలెక్టర్ ఆరా తీయగా.. అందించారని రైతులు తెలిపారు. సర్వే నంబర్ 56లో పొజిషన్ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రైతులు అడిగిన పలు సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీనివాస్, సర్వే ఏడీ రూప్లనాయక్, తహసీల్దార్ పుణ్యవతి, వీఆర్ఓలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. పీఎస్ హెచ్ఎంల సమస్యలు పరిష్కరించాలి అనంతపురం: ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల (పీఎస్ హెచ్ఎం) సమస్యలు పరిష్కరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంఘం నేతలు కోరారు. ఈ మేరకు శుక్రవారం డీఈఓ ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గోసల నారాయణస్వామి, ప్రధాన కార్యదర్శి రమణ ప్రసాద్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి గోవిందరెడ్డి ,రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటరమణ ,రాష్ట్ర కార్యదర్శి మర్రి స్వామి, జిల్లా కోశాధికారి ఈశ్వరయ్య ,కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి,ఆంజనేయులు,మురళీ ప్రసాద్, నాగరాజు, ఈశ్వరయ్య, సుధాకర వర్మ, శివయ్య, హరి నారాయణ, వెంకటకేశవులు పాల్గొన్నారు. -
ఒత్తిళ్లతో బిల్లులు నిలిపేస్తే ఎలా..?
వజ్రకరూరు: గ్రామ పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో నిలిపివేస్తే ఎలా అంటూ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల బిల్లులు కావాలంటే అధికార పార్టీ నియోజకవర్గ ముఖ్యనేతలను కలవాలని, అక్కడి నుంచి అనుమతి వస్తేనే గ్రీన్సిగ్నల్ ఇస్తామని అధికారులు చెప్పడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీపీ రమావత్దేవి, వైస్ ఎంపీపీ సుంకమ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారంటూ మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. బంగారు తాకట్టుపెట్టి తీసుకొచ్చిన డబ్బుతో అభివృద్ధి పనులు చేస్తే అధికారుల నిర్వాకం వల్ల కన్నీళ్లు మిగులుతున్నాయన్నారు. దీనికితోడు సర్పంచులకు 18 నెలలుగా, ఎంపీటీసీలకు 28 నెలలుగా గౌరవవేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో వీధిదీపాలు కూడా వేయనీకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని, అభివృద్ధి పనుల శిలాఫలకాల్లో పేర్లు విస్మరించి అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. సర్పంచులు సోమశేఖర్రెడ్డి, మల్లెల జగదీష్, మోనాలిసా, కొర్రా శివాజీనాయక్, తిరుపాల్యాదవ్, భూమా కమలమ్మ, జ్యోతిబాయి, ఎంపీటీసీ సభ్యులు రామక్రిష్ణ, మునయ్య, ముద్దయ్య, పాపన్న, ఈశ్వరమ్మ, పాల్గొన్నారు. -
అలజడికి సిద్ధమై.. హంగామాతో సరి
● పారని జేసీ ప్రభాకర్రెడ్డి కుయుక్తులుతాడిపత్రిటౌన్: వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి అలజడి సృష్టించాలనుకున్న టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి కుయుక్తులు పారలేదు. శాంతిభద్రతలు అదుపుతప్పకుండా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. తాడిపత్రి అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. ఇదే సమయంలో పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు జేసీ ప్రభాకర్రెడ్డి టీడీపీ శ్రేణులకు పిలుపునివ్వడంతో పాటు జూనియర్ కళాశాల ప్రాంగణంలో టిప్పర్లతో రాళ్ల కుప్పలు విడిపించారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశముందని గ్రహించిన ఏఎస్పీ రోహిత్కుమార్ ముందస్తు చర్యలు చేపట్టారు. శుక్రవారం దాదాపు 300 మంది పోలీసు బలగాలతో ఇరుపార్టీ నాయకుల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కళాశాల మైదానంలో ఉన్న రాళ్లకుప్పలను ఎత్తివేయించారు. ఇరువురి గృహాల వద్ద నిఘా పటిష్టం చేశారు. చేసేది లేక జేసీ ప్రభాకర్రెడ్డి తన నివాసానికి కార్యకర్తలను పెద్ద సంఖ్యలో పిలిపించుకుని మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహం వద్ద హంగామా చేశారు. అక్కడికే తహసీల్దార్ సోమశేఖర్, ఎంపీడీఓ వెంకటాచలపతిని పిలిపించుకొని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించిన ‘పట్టణంలోని ఎర్రవంక ఆక్రమణలు, మండల నిధుల దుర్వినియోగం’పై వాస్తవాలు నిగ్గు తేల్చాలని అర్జీలు అందజేశారు. అయితే దారి మధ్యలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటివైపు వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ మూకలను జేసీ వద్దంటూ వారించడం కనిపించింది. గన్లైసెన్స్ రెన్యూవల్లో అవమానం తాను, తన కుమారుడు ఎమ్మెల్యే అస్మిత్రెడ్డి గన్ లైసెన్సుల రెన్యూవల్ కోసం హోం మంత్రి అనితకు లేఖ రాసినా ఎటువంటి స్పందనా లేదని జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక ఎమ్మెల్యే సొంత గన్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంలో తమకు అవమానం జరిగినట్టుగానే భావిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డి వ్యవహారశైలి కారణంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేసీ వర్గీయులు కళాశాల మైదానాన్ని రణరంగానికి సిద్ధం చేసుకుంటున్నారు. మైదానంలో రాళ్లు వదలడం, అక్కడి నుంచే సమీపంలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి పైకి రువ్వుతుండటం పరిపాటిగా మారింది. రెండేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జేసీ తీరును ఏవగించుకుంటున్నారు. -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం కొనసాగుతోంది. ఆగ్నేయం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
భూముల మార్కెట్ విలువ పెంపు! ● అర్బన్ ప్రాంతాల్లో పెంచేందుకు కసరత్తు ● ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న వైనం ● చంద్రబాబు ప్రభుత్వం ధరలు పెంచడం ఇది రెండోసారి ● రియల్ ఎస్టేట్ రంగంపై చూపనున్న తీవ్ర ప్రభావం అనంతపురం టౌన్: భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పెరిగిన మార్కెట్ ధరలతో అల్లాడిపోతున్న ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం మరోమారు భారం మోపేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు భూముల విలువలపై నివేదికలను ఇవ్వాలని ఆయా జిల్లా రిజిస్ట్రార్లకు స్టాంప్స్ అండ్ రిజిస్ష్రేషన్ శాఖ ఐజీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఉత్తర్వులను జారీ చేశారు. పెంపుపై స్పష్టత కరువు భూముల విలువలను ఎంత మేర పెంచాలన్నదానిపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత లేదు. కేవలం అర్బన్ ఏరియాల్లో పెంచాలనే విషయాన్ని స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2025 ఫిబ్రవరిలో జిల్లా వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు, అగ్రికల్చర్ భూములపై 20 నుంచి 30 శాతం మేర మార్కెట్ విలువలను పెంచారు. మళ్లీ ఏడాది గడిచే సమయానికే భూముల విలువను పెంచేందుకు సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఎంత మేర పెంచుతారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పెరిగిన భూముల విలువతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది. మళ్లీ పెంచితే ఈ రంగంపై తీవ్ర ప్రభావం పడనుందని రియల్టర్లు పెదవి విరుస్తున్నారు. ఈసారి కూడా 30 శాతం మేర పెంచే అవకాశం లేకపోలేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు పేర్కొంటుండటం గమనార్హం. భూముల మార్కెట్ విలువల పెంపు విషయంపై జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. -
అనంతపురం అర్బన్లో అరాచకపర్వంపై పత్రికల్లో కథనాలు వచ్చినా, రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తినా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీరు ఇసుమంతైనా మారడం లేదు. ఆదాయం కోసం ప్రతీ అవకాశాన్నీ అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దారికి రానివారిని తన ముఠాతో ప
● అపార్ట్మెంట్ బిల్డర్ నుంచి రూ.30 లక్షల డిమాండ్ ● లేఅవుట్ చెరిపేసి ముస్లిం సోదరుల నుంచి డబ్బుల కోసం ఒత్తిడి ● టీటీడీ కల్యాణమంటపం, శిల్పారామం నిర్వాహకుడికి బెదిరింపు ● నిర్వాహకుడు లొంగలేదని సీఐని ఉసిగొలిపిన వైనం ● ‘దండుపాళ్యం’ బ్యాచ్ ఆగడాలపై అధిష్టానం, ప్రభుత్వానికి ఫిర్యాదుల వెల్లువ ● అనంతపురంలో అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు! ● అందులో భాగంగానే పోలీసుల అదుపులో ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు గంగారామ్ సాక్షిప్రతినిధి అనంతపురం: తరచూ వివాదాలతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వార్తల్లోకెక్కుతున్నారు. ప్రజాసేవకుడిగా కాకుండా ప్రజలను పీడించుకుతినే వ్యక్తిగా ముద్ర వేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా రుద్రంపేట పరిధిలోని పిస్తా హౌస్ సమీపాన ఓ అపార్ట్మెంట్ నిర్మిస్తున్న బిల్డర్ను రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. మొదట మధ్యవర్తిగా వీఆర్ఓ వెళ్లి మాట్లాడారు. అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి ఒప్పుకోని బిల్డర్.. టీడీపీలో ఉన్న తన మేనల్లుడి ద్వారా రూ.15 లక్షలు ఇచ్చారు. అలాగే రాజీవ్ కాలనీలో ఇద్దరు ముస్లిం మైనార్టీలు తమకున్న రెండెకరాల్లో వెంచర్ వేసుకున్నారు. రోడ్లు వేసి, సరిహద్దు రాళ్లు కూడా ఏర్పాటు చేశారు. వీరిని పిలిపించి డబ్బులు డిమాండ్ చేశారు. తాము రియల్టర్లం కాదని, తమ ఆస్తిని వెంచర్ వేసుకుని విక్రయిస్తున్నామని చెబితే రాళ్లను పూర్తిగా చెరిపేశారు. ఎమ్మెల్యేను కలిసి మాట్లాడుకోవాలని అధికారులు చెప్పారు. ఈ దందాలకు పూర్తిగా అధికారులే సహకరిస్తున్నారు. మధ్యవర్తులుగా వీఆర్ఓలు, రెవెన్యూ అధికారులే వెళ్లి ‘ఎమ్మెల్యేతో మాట్లాడాలని’ చెబుతున్నారంటే వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. ఫెడ్కాన్ సుధాకర్రెడ్డికి బెదిరింపులు! నగరంలోని టీటీడీ కల్యాణమంటపం, శిల్పారామం నిర్వహణ కాంట్రాక్టును టెండర్ ద్వారా ‘ఫెడ్కాన్’ యజమాని, బీజేపీ నేత సుధాకర్రెడ్డి దక్కించుకున్నారు. ఈయన్ను పిలిపించి ఎమ్మెల్యే రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ.20 లక్షలు ఇవ్వాలని అడిగారు. దీంతో టీటీడీ కల్యాణమంటపం, శిల్పారామానికి రూ.1.50 కోట్లు ఖర్చు చేశానని, ఆ డబ్బులు తనకు ఇచ్చేసి నిర్వహణ బాధ్యత మీరే తీసుకోండని సుధాకర్రెడ్డి చెబితే.. ‘అవన్నీ కుదరవు.. డబ్బులు ఇవ్వాలం’టూ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. ఇందుకు సుధాకర్రెడ్డి ససేమిరా అన్నారు. దీంతో ఓ సీఐ ద్వారా సుధాకర్రెడ్డిని బెదిరించి ఒప్పించే ప్రయత్నం చేశారు. దీంతో రెండిటినీ మూసేసి, ‘రాజకీయ నేతల ఒత్తిళ్లతో మూసేస్తున్నాను’ అని బ్యానర్ కట్టేస్తానని సుధాకర్రెడ్డి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో డబ్బులు ఇంకా చేతులు మారలేదు. ప్రశాంత ‘అనంత’లో అలజడి రాయలసీమలో అత్యంత ప్రశాంత జీవనం గడిపే నగరం అనంతపురం. కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు నుంచి వందలాది కుటుంబాలు ఉద్యోగాల నిమిత్తం ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాయి. వ్యాపారులు, ఇతర వర్గాల వారిని బెదిరించడం, అలజడి సృష్టించడం, అందులో పోలీసులు, అధికారులు పావులుగా మారడం ‘అనంత’లో గతంలో ఎప్పుడూ లేదు. తొలిసారి వీఆర్ఓల నుంచి పోలీసులు, నగరపాలక సంస్థ అధికారులు, ఇతర వర్గాలు పూర్తిగా ఎమ్మెల్యే దందాలకు సహకరిస్తూ అలజడిలో భాగం అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. టౌన్ప్లానింగ్లో ఓ అధికారిణి పూర్తిగా ఎమ్మెల్యే అండతో పెత్తనం చెలాయిస్తున్నారు. ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా ఎమ్మెల్యే ఆదేశాలు లేనిదే అనుమతి ఇవ్వడం లేదు. ‘ఎమ్మెల్యేను కలిసి రావాల’ని చెబుతున్నారు. చిన్న ఇల్లు నిర్మించినా కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఆగడాలపై ఫిర్యాదుల వెల్లువ ఎమ్మెల్యే దగ్గుపాటి, ఆయన వర్గీయుల ఆగడాలపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై అనంతపురం టీడీపీ ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్ర (నాని), పార్టీ ఆఫీసు ఇన్చార్జ్ సునీల్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి, మరికొంతమంది ఇక్కడ విషయాలను అధిష్టానానికి చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. అరాచకాల కారణంగా శాంతిభద్రతలు అదుపు తప్పడంతో ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్చంద్ర లడ్హా కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆగడాలకు అడ్డుకట్ట వేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీశ్కు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అలాగే కార్పొరేషన్, ఇతర శాఖల అధికారులు కూడా దందాలకు సహకరించకుండా చూడాలని కలెక్టర్కు ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఎమ్మెల్యేకు పూర్తిగా తొత్తులుగా మారి, దందాలకు సహకరించిన వారి జాబితాను కూడా కలెక్టర్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. వీరిపై కూడా బదిలీవేటు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. -
ఆదుకున్న రాథోడ్
అనంతపురం కార్పొరేషన్: ఆంధ్రతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో విదర్భ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వైవీ రాథోడ్ స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా.. సమయోచితంగా ఆడి గౌరవప్రదమైన స్కోర్కు బాటలు వేశాడు. సెంచరీతో నాటౌట్గా నిలిచాడు. ఫలితంగా విదర్భ జట్టు తొలి రోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. రంజీ ట్రోఫీలో భాగంగా అనంతపురం క్రికెట్ గ్రౌండ్లో గురువారం ఆంధ్ర, విదర్భ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ నెగ్గిన విదర్భ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రాణించిన రాజు ఆంధ్ర బౌలర్ కేఎస్ రాజు చక్కని లైన్ అండ్ లెంగ్త్తో విదర్భ జట్టును ఆదిలోనే కట్టడి చేశాడు. జట్టు స్కోర్ 29 పరుగుల వద్ద ఓపెనర్ మోఖడేను 21 పరుగులకు క్లీన్బౌల్డ్ చేయగలిగాడు. వన్డౌన్లో వచ్చిన బ్యాటర్ దినేష్ మలేవార్ను డకౌట్ చేశాడు. జట్టు స్కోర్ 38 పరుగుల వద్ద ఉన్న సమయంలో మరో ఓపెనర్ అథర్వ టైడే వికెట్ను కూలదోశాడు. జట్టు స్కోర్ 47 పరుగుల వద్ద సమర్థ్ను (9పరుగులు) పెవిలియన్ బాట పట్టించాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రాథోడ్, వికెట్ కీపర్ రోహిత్.వి.బినకర్ జోడి వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. 37 పరుగులు చేసిన రోహిత్ను సాయితేజ పెవిలియన్ బాటపట్టించాడు. కెప్టెన్ హర్షదూబే(9పరుగులు)ను నితీష్కుమార్ రెడ్డి అవుట్ చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న రాథోడ్ అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆట ముగిసే సమయానికి రాథోడ్ 104 పరుగులు, బూతే 25 పరుగులతో నాటౌట్గా నిలిచారు. మ్యాచ్ను ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛోఫెర్రర్, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్, కార్యదర్శి యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఆరేళ్ల నరకం.. అరుదైన వైద్యం
కర్నూలు(హాస్పిటల్): అరుదైన వ్యాధితో బాధపడుతూ జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళకు కర్నూలు పెద్దాసుపత్రి వైద్యులు ఊపిరి పోశారు. వివరాలు ఇలా... అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన తులసి(30) ఆరేళ్లుగా తీవ్రమైన శరీర నొప్పులు, కండరాల బలహీనతతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. చికిత్స కోసం రూ.5లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. విషయం తెలుసుకున్న సన్నిహితుల నచ్చచెప్పి ఆ ప్రయత్నాన్ని విరమింపజేశారు. వారి సలహాతో దివ్యాంగుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆమె నిర్ధారణ పరీక్షలకు తనకు కేటాయించిన ఆదోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని సదరం క్యాంపునకు హాజరైంది. ఆ సమయంలో ఆమెను ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నాగరాజు ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు. పాస్ఫరస్ తగ్గడం వల్ల ఇలా జరిగిందని నిర్ధారించుకుని, పూర్తిస్థాయి వైద్యపరీక్షలు, చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు గత సంవత్సరం అక్టోబర్ 25న రెఫర్ చేశారు. ఎండోక్రైనాలజి విభాగాధిపతి పి.శ్రీనివాసులు, రాధారాణి బృందం ఆమెకు సమగ్ర వైద్యపరీక్షలు చేయించారు. పీఈటీ స్కాన్లో వెన్నుముక చివర కణితి ఉన్నట్లు గుర్తించారు. దీని కారణంగానే శరీరంలో పాస్ఫరస్ తగ్గుతోందని తెలుసుకున్నారు. అవసరమైన శస్త్రచికిత్స కోసం స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. అక్కడ సర్జికల్ ఆంకాలజిస్టులు డాక్టర్ ఎస్.చైతన్యవాణి, డాక్టర్ జి.బీసన్న గత నవంబర్ 10న శస్త్రచికిత్స ద్వారా కణితి తొలగించారు. ఆపరేషన్ జరిగిన 24 గంటల్లోనే ఆమె ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. వారం వ్యవధిలోనే ఆమె స్వయంగా నడవగలిగే స్థాయికి చేరుకుంది. గురువారం ఆమెను మీడియా సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టారు. సీఎస్ఆర్ఎం పద్మజ, ఆర్ఎంఓ వెంకటరమణ, అనెస్తెటిస్ట్ భారతి, రేడియాలజిస్టు ఎస్.వినోద్కుమార్ పాల్గొన్నారు. -
తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్
తాడిపత్రి టౌన్/రూరల్: తాడిపత్రి పట్టణంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్లర్లకు మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పన్నాగం పన్నినట్లు తెలిసింది. శుక్రవారం తన నివాసం వద్ద నిర్వహించే మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలకు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి రావా లంటూ పిలుపునివ్వడం, అదే సమయంలో ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో టిప్పర్లతో రాళ్ల కుప్పలు తోలడంతో పట్టణంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఎప్పుడేం జరుగుతుందోనని పట్టణవాసులు భయభ్రాంతులకు గురవుతు న్నారు. ఎర్రవంక ఆక్రమణలతో పాటు తాడిపత్రి పట్టణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని వారం క్రితం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన ప్రకటనతో జేసీ ప్రభాకర్రెడ్డి ఉలిక్కిపడ్డారు. జరిగిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో చేసేది లేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్రలకు తెరతీసినట్లు తెలి సింది. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడులకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. గతంలో పెద్దారెడ్డి ఇంటిపై జరిగిన దాడి వీడియోలను జేసీ అనుచరులు వాట్సప్ గ్రూపులలో అప్లోడ్ చేస్తూ, మరో సంగ్రామానికి సిద్ధం కావాలని పిలుపునివ్వడం ఇందుకు బలం చేకూరుస్తోంది. పటిష్ట బందోబస్తు.. జేసీ పన్నాగం పసిగట్టిన పోలీసుశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా గురువారం పట్టణంలోని జేసీ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, వారి మాటలను జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టించుకోలేదని తెలిసింది. ఈ క్రమంలో విషయాన్ని వారు ఎస్పీ, తాడిపత్రి ఏఎస్పీల దృష్టికి తీసుకెళ్లి ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లరిమూకలు జేసీ నివాసానికి రాకుండా నియంత్రిస్తున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు జేసీ నివాసానికి చుట్టుపక్కల అన్ని రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పార్టీల నేతలకు నోటీసులు జారీ చేసి ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసే అవకాశమున్నట్లు తెలిసింది. శుక్రవారం అదనపు పోలీసు బలగాలు రానున్నట్లు తెలియవచ్చింది. పెద్దారెడ్డిపై కేసు.. తాడిపత్రిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సీఐ ఆరోహణరావును ‘సాక్షి’ వివరణ కోరగా ఆయన స్పందించారు. మంత్రి లోకేష్ బర్త్డే సందర్భంగా జేసీ ఇంటి వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే కళాశాల వద్ద మరుగుదొడ్ల నిర్మాణాలకు గాను రాళ్లు వదిలారని తెలిపారు. సోషల్మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్ల ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు రవితేజారెడ్డితో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పన్నాగాలు ఆపని జేసీ మరోసారి అల్లర్లకు కుట్ర పెద్దారెడ్డి ఇంటి సమీపంలో రాళ్లకుప్పలు తోలిన వైనం అప్రమత్తమైన పోలీసుశాఖ -
●నిరీక్షించి.. నీరసించి
చంద్రబాబు ప్రభుత్వంలో దివ్యాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. పింఛన్ రీ వెరిఫికేషన్ కోసం నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. గురువారం సర్వజనాస్పత్రికి వచ్చిన వారి కష్టాలు చెప్పనలవిగా మారాయి. పరీక్షల కోసం క్యూలో నిరీక్షించి నీరసించిపోయారు. కొందరు తమ కుటుంబీకులను లైన్లో నిల్చోబెట్టి ఒకచోట కూర్చుండి పోయారు. తమ పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని పలువురు మండిపడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం సర్వజనాస్పత్రి అల్ట్రాసౌండ్ గది వద్ద వృద్ధుల ఎదురుచూపులు -
జీజీహెచ్లో చిన్నారికి పునర్జన్మ
అనంతపురం మెడికల్: ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారికి జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రి చిన్న పిల్లల వైద్య విభాగం వైద్యులు, స్టాఫ్ నర్సులు మెరుగైన వైద్యం అందించి పునర్జనను ప్రసాదించారు. వెంటిలేటర్పై ఉన్న కేసును 34 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుతూ సాధారణ స్థితికి తీసుకువచ్చారు. వివరాలను గురువారం ఆర్ఎంఓ డాక్టర్ హేమలతతో కలసి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి మీడియాకు వెల్లడించారు. తీవ్ర జ్వరం, మూర్చ, దద్దుర్లతో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరుకున్న తన 9 ఏళ్ల కుమార్తె వైష్ణవిని గతేడాది డిసెంబర్ 9న జీజీహెచ్కు కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన నాగేంద్ర తీసుకువచ్చాడు. ఈ కేసును సీరియస్గా పరిగణించిన చిన్నపిల్లల విభాగం హెచ్ఓడీ డాక్టర్ రవికుమార్ నేతృత్వంలో అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ సంజీవప్ప, డాక్టర్ ప్రవీణ్దీన్కుమార్ వివిధ రక్తపరీక్షలు చేయించారు. మెదడువాపు, స్క్రబ్టైఫస్, సివియర్ నిమోనియాతో బాధపడుతున్నట్లుగా నిర్ధారించుకుని అత్యవసర వైద్యసేవలు మొదలు పెట్టారు. నాలుగు రోజుల పాటు పీఐసీయూలో ఉంచి వెంటిలేటర్పైనే చికిత్స అందించారు. రూ.7 వేలు విలువ చేసే అత్యంత ఖరీదైన మందులను అందజేస్తూ వచ్చారు. వెంటిలేటర్పైనే వారం రోజులపైగా వైష్ణవికి సేవలందించారు. అనంతరం సీ ప్యాప్, ఆక్సిజన్తో వైద్యం అందించి కోలుకున్న తర్వాత సాధారణ వార్డుకు షిప్ట్ చేశారు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ వైద్యాన్ని ఉచితంగా అందించారు. పూర్తిగా కోలుకున్న వైష్ణవిని గురువారం మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. చిన్నారి కోలుకోవడంలో చిన్నపిల్లల విభాగంలోని వైద్యులు, స్టాఫ్నర్సులు అందించిన వైద్య సేవలను జీజీహెచ్ సూపరింటెండెంట్ మళ్లీశ్వరి, ఆర్ఎంఓ హేమలత కొనియాడారు గతేడాది డిసెంబర్లో వెంటిలేటర్పై ఉన్న వైష్ణవి కోలుకున్న వైష్ణవితో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, తదితరులు -
వైఎస్సార్టీఏ క్యాలెండర్ ఆవిష్కరణ
అనంతపురం: వైఎస్సార్టీఏ క్యాలెండర్, స్టిక్కర్ క్యాలెండర్, డైరీలను డీఈఓ ప్రసాద్బాబు గురువారం ఆవిష్కరించారు. వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు ఎస్. నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ రాధాకృష్ణా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట రమణప్ప, జిల్లా గౌరవాధ్యక్షుడు రవీంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్, సహాయ కార్యదర్శులు వెంకట్ రెడ్డి, రామకృష్ణ, కృష్ణా నాయక్, సిద్ధ ప్రసాద్, చెన్నారెడ్డి, నరేష్ , డీవైఈఓ మల్లారెడ్డి, ఏడీలు మునీర్ , శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల ప్రోగ్రాంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను డీఈఓ దృష్టికి రు తీసుకెళ్లారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి తగదని పేర్కొన్నారు. గుంతకల్లులో భారీ చోరీ గుంతకల్లు: స్థానిక ఆదర్శనగర్లోని రైల్వే విశ్రాంత ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... ఈ నెల 20న రైల్వే విశ్రాంత ఉద్యోగి అబ్దుల్ ఖాదరీ జిలానీ తన కుమారుడు, కోడలిని బెంగళూరులో వదలడానికి వెళ్లాడు. గురువారం ఉదయం ఇంటికి వేసిన తాళం బద్ధలుగొట్టి ఉండడం గమనించిన స్థానికులు వెంటనే బెంగళూరులో ఉన్న అబ్దుల్ ఖాదరీకి ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. దీంతో ఆయన బెంగళూరు నుంచి కారులో బయలుదేరి గుంతకల్లుకు చేరుకుని తన ఇంటిని పరిశీలించిన అనంతరం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మనోహర్, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్, క్లూస్ టీం బృందం అక్కడకు చేరుకుని నిందితులు వదలి వెళ్లిన ఆధారాల కోసం గాలించారు. బెడ్రూమ్లోని బీరువాను ధ్వంసం చేసి అందులో దాచిన 21 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి సామగ్రి అపహరణకు గురైనట్లు బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఉన్నతి పథకానికి దరఖాస్తుల స్వీకరణ అనంతపురం టౌన్: ఉన్నతి పథకానికి సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ మేరకు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్యాసింజర్ ఆటో, ఫుట్వేర్ షాప్, టిఫెన్ సెంటర్, ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయ తదితర యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డ్వాక్రా మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 175 యూనిట్లను అందజేయనున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేల మేర సబ్సిడీ ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని డీఆర్డీఏ తరఫున రుణాన్ని అందజేయనున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు మండల కేంద్రాల్లోని ఏపీఎంల వద్ద దరఖాస్తులు అందజేయాలి. స్పెల్–బీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అనంతపురం: రాష్ట్ర స్థాయి స్పెల్–బీ పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపికయ్యారు. గురువారం కడపలో జోనల్ స్థాయి పోటీలు జరిగాయి. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులు జోనల్ స్థాయి పోటీల్లో తలపడ్డారు. ఇందులో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన ఆర్.నిఖిలేశ్వర్ (6వ తరగతి, ఏపీఎంఎస్, రాప్తాడు), ఎం. వెంకటలక్ష్మి (7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, గొడసలపల్లి). పి.నందిత (9వ తరగతి, ఎస్ఆర్కే మున్సిపల్ స్కూల్, గుంతకల్లు), వై.వీణామాధురి (ఇంటర్, ఏపీఎంఎస్, యల్లనూరు) రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. -
అన్నింటా పైసా వసూల్
● వన్టౌన్లో ‘వసూల్ రజా’ ● ప్రొటోకాల్ విధుల మాటున భారీగా వసూళ్లు ● స్టేషన్ బాస్ తీరుపై సర్వత్రా విమర్శలు అనంతపురం సెంట్రల్: నగరంలో వన్టౌన్ పోలీసుస్టేషన్ పూర్తిగా గాడి తప్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల స్టేషన్లో పనిచేసే ‘వసూల్ రజా’ ‘సింగిల్ స్టార్’లా వెలిగిపోతున్నట్లు తెలిసింది. సీఐ ప్రొటోకాల్ డ్యూటీ మాటున ప్రతి నెలా వైన్షాపులు, బార్లు, మట్కా నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుంటున్నారని సమాచారం. మద్యం షాపుల నిర్వాహకుల ఇష్టారాజ్యం.. పెత్తనం మొత్తం స్టేషన్ బాస్ ఆయనకే కట్టబెట్టారనే విమర్శలూ ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని అన్ని పోలీసుస్టేషన్లు ఒకెత్తయితే వన్టౌన్ పోలీసుస్టేషన్ మరో ఎత్తు. ఎక్కువ పరిధితో పాటు నగరంలో సింహభాగం వాణిజ్య కార్యకలాపాలు స్టేషన్ పరిధిలోనే జరుగుతాయి. బార్లు, మద్యం దుకాణాలు, ధాబాలు కూడా వన్టౌన్ పరిధిలో అధికంగా ఉన్నాయి. వీటి నిర్వాహకులు నెలనెలా ‘వసూల్ రజా’కు భారీగా ముడుపులు ముట్టజెబుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు చేపడుతున్నారు. ఏ ధాబాలోనైనా మద్యం ఫుల్లుగా తాగొచ్చు. సమయపాలన అంటూ లేకుండా లిక్కర్ విక్రయాలు జరుపుతున్నారు. ఇటీవల వన్టౌన్ పరిధిలో జరిగిన నేరాల్లో ఎక్కువ శాతం నిందితులు మద్యం మత్తులో అకృత్యాలకు పాల్పడడం, మద్యం షాపులు, బార్ల వద్దే నేరాలు జరుగుతుండడం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు లాడ్జీలు అడ్డాగా మారుతున్నా పట్టించుకునేవారు లేరు. గంజాయి, పేకాట, మట్కా మూడు పువ్వులు.. ఆరు కాయలు చందాన విరాజిల్లుతున్నాయి. స్టేషన్ పరిధిలో 70 మంది వరకూ మట్కా బీటర్లు ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. అందులో క్రియాశీలకంగా 20 మంది ఉన్నట్లు తెలిసింది. వారిపై ఇటీవల కాలంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నలిగిపోతున్న సిబ్బంది సీఐ ప్రొటోకాల్ డ్యూటీ కోసం సదరు ‘సింగిల్ స్టార్’ ఏకంగా ఓ మంత్రి నుంచి రెకమండేషన్ తెచ్చుకున్నారంటేనే ఏ స్థాయిలో ‘ఆశించి’ వచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఈ ‘వసూల్ రజా’ కారణంగా స్టేషన్లో పనిచేసే సిబ్బంది మధ్య కోల్డ్వార్ ప్రారంభమైంది. దీనికితోడు స్టేషన్ బాస్ బండబూతులు తిడుతుండడంతో తమ బాధ ఎవరికి చెప్పు కోవాలో తెలియక సిబ్బంది నలిగిపోతున్నారు. ఈ క్రమంలో ఎవరిని కదిలించినా స్టేషన్లో పరిస్థితి ఏమాత్రమూ బాగోలేదంటున్నారు. స్టేషన్ పరిధిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిన స్పెషల్ బ్రాంచ్ వారు పట్టించుకోకపోవడంతోనే ‘వసూల్ రజా’ ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
రహదారి నిబంధనలు పాటించాలి
● ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ అనంతపురం సెంట్రల్: ప్రతి ఒక్కరూ బాధ్యతగా రహదారి నిబంధనలు పాటించాలని ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ పిలుపునిచ్చారు. గురువారం రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి టవర్క్లాక్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 37 ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్స్పాట్స్) గుర్తించి, అవసరమైన మరమ్మతులు, ఆడిటింగ్ పూర్తి చేశారన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డీటీసీ వీర్రాజు మాట్లాడుతూ జిల్లాలో ఏటా సగటున 360 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని, అందులో ఎక్కువ శాతం 25 సంవత్సరాలలోపు వారేనని తెలిపారు. ఇక నుంచి హెల్మెట్ లేకపోతే రూ. 1,000, లైసెన్స్ లేకపోతే రూ. 5 వేలు జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విన్ మనిదీప్, ఆర్డీఓ కేశవ నాయుడు, ఆర్టీఓ సురేష్నాయుడు, డీఎస్పీ మహబూబ్బాషా, పోలీసు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
మహాసేనాయ ధీమహి..
"K… ™èl™èl$µ-Æý‡$-ÚëĶæ$ ѧýlÃõßæ Ð]l$à-õÜ-¯éĶæ$ «©-Ð]l$íßæ ‘ ™èl¯ø² çÜP…§ýl@ {ç³^ø§ýlĶæ*™Œæ ॥' A…r* ç³Ñ{™èl Ð]l*çœ$-Ð]l*-çÜ…ÌZ çÜ${º-çßæÃ-×ôæÅÔèæÓÆý‡ ÝëÓÑ$ ¯éÐ]l$çÜÃ-Æý‡×æ çßZÆð‡-†¢-´ù™ø…-¨. D {MýSÐ]l$…ÌZ Mør…-MýSÌZ çÜÓĶæ$…¿¶æ$-Ð]l#V> ÐðlÌS-íܯ]l VýS$…sìæ-MìS…§ýl çÜ${ºçßæÃ-×ôæÅ-ÔèæÓÆý‡ ÝëÓÑ$ {ºçßZÃ-™èlÞ-ÐéË$ D ¯ðlÌS 25 ¯]l$…_ A…VýS-Æý‡…VýS OÐðl¿ýæ-Ð]l…V> {´ëÆý‡…¿ýæ… M>¯]l$-¯é²Æ‡$$. గార్లదిన్నె: ఏటా మాఘమాసంలో గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తుంటారు. నాలుగు వారాల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో వేలాది భక్తుల నడుమ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకూ ఉత్సవాలను నేత్ర పర్వంగా నిర్వహించనున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఆలయ విశిష్టత ఇలా.. కోటంక గ్రామంలో వెలసిన గుండు కింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం చుట్టూ 16 కిలో మీటర్ల మేర ప్రకృతి అందాలు కనువిందు చేస్తుంటాయి. స్వయంభువుగా స్వామి వారు ఇక్కడ వెలిసినట్లుగా ఆలయ చరిత్ర చెబుతోంది. మూలవిరాట్ ఉన్న గుండు కింద ఓ కోనేరులో నీరు ఎల్లప్పుడూ ఉంటోంది. ఈ నీటిని సేవిస్తే సకల రోగాలు నయమవుతాయని, ఆ నీటిని తీసుకెళ్లి పొలాలపై చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయని, కుజ దోషాలు, సర్ప దోషాలతో బాధపడేవారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. కోనేరులో ఉన్న నీటిని ఎంత తోడినా అడుగంటకుండా ఉంటోంది. వరుసగా 9 ఆదివారాలు కానీ, 11 లేదా 16 ఆదివారాలు ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు అంటున్నారు. ఆలయంలో 108 సాలగ్రామ శివలింగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆలయానికి వచ్చిన భక్తులు వీటిని స్వయంగా నీటితో అభిషేకించి తమ ఆభీష్టాలను విన్నవిస్తుంటారు. ఇక ఉత్సవాల సమయంలో ప్రతి రోజూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఉంటుంది. కోటంక కొండల్లో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆలయంలోని స్వామి మూలవిరాట్ మూలవిరాట్ గుండు కింద ఉన్న నీటి కొలను అన్ని ఏర్పాట్లు పూర్తి కోటంకలో గుంటికింద సుబ్రహ్మణ్యస్వామి తిరునాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఆదివారం అన్నదానం ఉంటుంది. తిరునాల సందర్భంగా వచ్చే భక్తులకు అనంతపురం నుంచి ఆలయం వరకూ ఆర్టీసీ వారు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. – ఆలయ ఈఓ ఈశ్వర్ రెడ్డి ఉత్సవాలు ఇలా.. 25న మొదటి ఆదివారం శ్రీవారి ఏకవార రుద్రాభిషేకం, సహస్ర నామార్చనతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఫిబ్రవరి 1న రెండో ఆదివారం స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 7న శనివారం రాత్రి 8 నుంచి 2 గంటల వరకు రథోత్సవం ఉంటుంది. ఫిబ్రవరి 8న మూడో ఆదివారం ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు శ్రీవల్లిదేవసేన సమేత శ్రీవారి కల్యాణోత్సవం, తిరునాల ఉంటాయి. ఫిబ్రవరి 14న గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 15న నాల్గో ఆదివారం రుద్రాభిషేకం. మహా శివరాత్రి సందర్భంగా సాలగ్రామ శివలింగాలకు విశేష పూజలు ఉంటాయి. భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న గుంటికింద సుబ్బరాయుడు ఈ నెల 25 నుంచి కోటంకలో సుబ్రహ్మణ్యేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 7న రథోత్సవం 8న కల్యాణోత్సవం -
సుమోల పేరిట మోసం... ఇద్దరికి ఆరు నెలల జైలు
యల్లనూరు: టాటా సుమోల పేరిట మోసం చేసిన ఇద్దరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తాడిపత్రి కోర్టు జడ్జి అనిల్కుమార్ నాయక్ తీర్పు వెలువరించారు. పుట్లూరు సీఐ సత్యబాబు, ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపిన మేరకు... 2015లో యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన సోమిరెడ్డి, అతని అల్లుడు శివ గౌతం రెడ్డిలు గొడ్డుమర్రి గ్రామానికి చెందిన నాగరాజు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని 40 శాతం తగ్గింపు అంటూ టాటా సుమోలు కట్టబెట్టారు. ఇది జరిగిన కొంత కాలానికే ఫైనాన్స్ వాళ్లు వచ్చి సుమోలను తీసుకొని వెళ్లారు. మోసపోయా నని గ్రహించిన నాగరాజు తన నుంచి తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని సోమిరెడ్డి, శివగౌతం రెడ్డిని నిలదీస్తే అందుకు వారు నిరాకరించారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు యల్లనూరు పోలీస్స్టేషన్లో 2015 ఆగస్టు 25న కేసు నమోదైంది. తాడిపత్రి కోర్టులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. నిందితులు, సాక్షులను విచారించిన న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. శివగౌతంరెడ్డి, సోమిరెడ్డిపై నేరం రుజువు కావడంతో ఇద్దరికీ ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ జడ్జి అనిల్కుమార్ నాయక్ తీర్పు చెప్పారు. నిందితులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా కూడా విధించారు. రేపటి నుంచి నాలుగు రోజులు బ్యాంకుల మూత అనంతపురం అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. నాలుగో శనివారం, ఆదివారం సెలవు, ఇక రిపబ్లిక్డే సందర్భంగా సోమవారం అధికారికంగా సెలవు ఉంటుంది. సమ్మె కారణంగా మంగళవారం కూడా బ్యాంకులు మూతపడనున్నట్లు ఉద్యోగ వర్గాలు తెలిపాయి. సమ్మె విరమణకు జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నందున ఇంకా స్పష్టత లేదన్నారు.ఇప్పటికై తే అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. వరుసగా నాలుగు రోజులు అంటే లావాదేవీలు బాగా స్తంభించే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు. భల్లూకం.. భయంభయం కూడేరు: మండల పరిధిలోని మరుట్ల–2వ కాలనీలో భల్లూకం సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం వేకువ జామున రైతులు తమ పొలాల నుంచి వస్తుండగా ఎలుగుబంటి దాడి చేసేందుకు యత్నించింది. రైతులు పరుగులు తీసి ఎలాగోలా తప్పించుకున్నారు. రెండు రోజుల క్రితం ఎలుగుబంటి ఓ రైతు పొలంలో పైపులైన్ను ధ్వంసం చేసినట్లు తెలిసింది. అటవీశాఖ అధికారులు స్పందించి భల్లూకం బారి నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు. ‘అధ్వాన భోజనం’పై విచారణ రాప్తాడురూరల్: రాప్తాడు మండల పరిధిలోని చిన్మయానగర్లోని వినయ్కుమార్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంపై జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు విచారణకు ఆదేశించారు. భోజనం నాణ్యత, రుచిగా లేకపోవడంతో పలువురు విద్యార్థులు రోజూ ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకుని భోజనం చేస్తుండడం, పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్సులో ‘భోజనం రుచిగా ఉండడం లేదు ఫాదర్’ అంటూ విద్యార్థులు రాసిన లేఖలు ఎంఈఓ దృష్టికి వెళ్లిన వైనంపై గురువారం ‘సాక్షి’లో ‘మధ్యాహ్న భోజనం అధ్వానం’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై డీఈఓ స్పందించారు. అనంతపురం డీవైఈఓ శ్రీనివాసరావు, రాప్తాడు ఎంఈఓ మల్లికార్జునను విచారణకు ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడి నివేదిక ఇవ్వాలని సూచించారు. భోజనం నాణ్యత తగ్గినా, రుచి లేకపోయినా, శుభ్రంగా ఉండకపోయినా ఉపేక్షించేదే లేదన్నారు. నిరుపేద విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం పూర్తిస్థాయి పాదర్శకంగా అమలు కావాల్సిందేనన్నారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని డీఈఓ స్పష్టం చేశారు. -
అక్రమాలకు ఆద్యులు.. విచారణలో పూజ్యులు
బ్రహ్మసముద్రం: ఉపాధి హామీ పథకంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో.. వారే విచారణ సమయంలో అధికారులకు గౌరవప్రదమైన వ్యక్తులుగా మారారు. గమనించిన స్థానిక పాడి రైతులు నివ్వెరపోయారు. అక్రమాలపై విచారణలో పారదర్శకత లేకుండా పోతోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే.. ఉపాధి హామీ పథకం కింద బ్రహ్మసముద్రం మండలంలో గోకులం షెడ్లు మంజూరయ్యాయి. అయితే వీటి నిర్మాణంలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. షెడ్లు నిర్మించకుండానే మొత్తం బిల్లులు ఊడ్చేశారు. ఈ అంశంపై గత సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గొంచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం గొంచిరెడ్డిపల్లిలో డ్వామా అధికారులు విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ చేపట్టాల్సిన అధికారులు కాస్త అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలతో చేతులు కలిపారు. ముందస్తుగానే సమాచారం ఇచ్చి పెండింగ్లో ఉన్న గోకులం షెడ్ల నిర్మాణాలను ఈ నాలుగు రోజుల్లోనే అరకొరగా పూర్తి చేయించారు. ఈ క్రమంలో గురువారం అక్రమాలకు పాల్పడిన వారిని వెంటబెట్టుకుని తనిఖీలు చేపట్టారు. బావా.. తమ్ముడు అంటూ వరుసలు కలిపి టీడీపీ నేతలను గౌరవిస్తూ మరీ తమ వాహనంలో వెంట బెట్టుకుని తిరగాడడం వివాదాస్పదమైంది. ‘డోంట్ వర్రీ నేను ఉన్నా.. మాట్లాడుతా’ అంటూ అక్రమార్కులకు అన్ని విధాలుగా వత్తాసు పలికిన డ్వామా విజిలెన్స్ అధికారి తీరుపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టకుండా కేవలం చుట్టపు చూపుగా అలా చుట్టి వచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో కూర్చొని టీడీపీ నేతలతో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చొవడం గమనించిన పాడి రైతులు విస్తుపోయారు. టీడీపీ నేతల అక్రమాలకు వత్తాసు పలికి విచారణను డ్వామా విజిలెన్స్ అధికారి పక్కదారి పట్టించారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి అక్రమాలపై టీడీపీ నేతలతో కలసి అధికారుల తనిఖీలు విచారణలో పారదర్శకత లోపించిందంటూ విమర్శలు -
మెరుగైన సేవలందిస్తాం
● ఉద్యోగులు జవాబుదారీగా ఉండాలి ● నూతన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అనంతపురం అర్బన్: ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూస్తామని నూతన జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్గా నియమితులైన ఆయన బుధవారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్గా శివ్ నారాయణ్ శర్మ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ తన ఉద్యోగ ప్రస్థానం, ఇతర అంశాలను వివరించారు. రెవెన్యూ సమస్యను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ క్రమంలో ముందుగా జిల్లా పరిస్థితి ఏమిటనే దానిపై అధికారులతో సమీక్షిస్తానన్నారు. జిల్లా జీడీపీ పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ క్రమంలో ప్రైమరీ, సెండరీ, ఇలా అన్ని సెక్టార్లపైన ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. ఉద్యోగులు తమ విధి నిర్వహణలో జవాబుదారీగా ఉండాలని సూచించారు. డ్యూటీ చార్ట్ ప్రకారం పనిచేసేలా చైతన్యం చేస్తూ, వారికి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు. జేసీకి శుభాకాంక్షలు జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన విష్ణుచరణ్కు అధికారులు, ఉద్యోగులు పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్కు చేరుకున్న ఆయనకు డీఆర్ఓ మలోల, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, సూపరింటెండెంట్లు వసంత లత, యుగేశ్వరిదేవి, రియాజుద్ధీన్, దేవదాయ శాఖ ఏసీ మల్లికార్జున స్వాగతం పలికారు. జేసీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, ఎస్డీసీ ఆనంద్, ఆర్డీఓ కేశవనాయుడు, సీపీఓ అశోక్కుమార్, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునరెడ్డి, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ గంగాధర్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు హరికుమార్, వేణుగోపాల్, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
పదేపదే బెదిరిస్తూ నిప్పు పెట్టించాడు
● ఎమ్మెల్యే దగ్గుపాటిపై టీడీపీ కేంద్ర కార్యాలయానికి నంబూరి వైన్స్ నిర్వాహకుడి ఫిర్యాదు అనంతపురం సెంట్రల్: మద్యం షాపు నడుపుకోవాలంటే తనకు మామూలు ఇవ్వాలంటూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పదేపదే బెదిరిస్తూ చివరకు తన మద్యం షాపునకు నిప్పు పెట్టించాడని టీడీపీ కేంద్ర కార్యాలయానికి నంబూరి వైన్స్ నిర్వాహకుడు నంబూరి వెంకటరమణ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బుధవారం విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రజా గ్రీవెన్స్లో పార్టీ పెద్దలకు వినతి పత్రం అందజేసి, ఎమ్మెల్యే దగ్గుపాటి అక్రమాలపై ఏకరవు పెట్టాడు. అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అభ్యునత్ని కోసం పనిచేస్తూ వచ్చిన తన పట్లనే ఇంత నిర్దయగా ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యవహరిస్తున్నాడంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోలేమని వివరించినట్లు సమాచారం. ఎమ్మెల్యే దూకుడుకు అడ్డుకట్ట వేసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లి న్యాయం చేస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు బాధితుడు నంబూరి వెంకటరమణ తెలిపారు. ఏపీఈసెట్ కన్వీనర్గా దుర్గాప్రసాద్అనంతపురం: ఏపీ ఈసెట్ –2026 నిర్వహణ బాధ్యతను దక్కించుకున్న జేఎన్టీయూ(ఏ)... సెట్ కన్వీనర్గా మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ను నియమించింది. దీంతో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను ఏపీ ఈసెట్ చైర్మన్, వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అభినందించారు. కాగా, ఏపీఈసెట్ నిర్వహణ బాధ్యతను పదో దఫా జేఎన్టీయూ (ఏ)కు అప్పగించడం విశేషం. ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ రెండో సారి కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. ఏడు దఫాలు ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి, ఒకసారి ప్రస్తుత ఏపీపీఎస్సీ చైర్మెన్గా ఉన్న ప్రొఫెసర్ సి.శశిధర్ కన్వీనర్గా వ్యవహరించారు. 30న బసివినుల గ్రీవెన్స్అనంతపురం అర్బన్: బసివినుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న ప్రత్యేక పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశాల మేరకు అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రత్యేక పరిష్కార వేదిక ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. -
గ్యాస్ ‘గమనించండి’
హౌసింగ్బోర్డులో నివాసముంటున్న మల్లికార్జున ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో దానికి సీల్ లేదు. ఎందుకు తొలగించారని డెలివరీ బాయ్ని ప్రశ్నిస్తే గ్యాస్ లీకేజీ చెక్ చేసేందుకని బుకాయించి వెళ్లిపోయాడు. అయితే ఆ సిలిండర్లోని గ్యాస్ నెల రోజులు కూడా రాకపోవడంతో తమను డెలివరీ బాయ్ మోసం చేసినట్లుగా నిర్ధారించుకున్నాడు. అనంతపురం అర్బన్: వంట గ్యాస్ సిలండర్లకు కంపెనీ వేసిన సీలు ఉందా లేదా? గ్యాస్ నిర్ణీత బరువు ఉందా... లేదా? అనేది వినియోగదారులు గమనించాలి. ఇటీవల కొందరు డెలివరీ బాయ్స్ సిలిండర్ల సీల్ తొలగించి వాటిలోని వంట గ్యాస్లో కొద్ది మేర దొంగలించి సరఫరా చేస్తున్నారు. సీల్ ఉందా లేదో చూసుకోండి గ్యాస్ సిలిండర్ నాబ్కి సదరు కంపెనీ సీల్ వేసి పంపుతుంది. అలా సీల్ని ఒకసారి గమనించి అది బిగుతా లేకుండా ఊడిపోయినట్లుగా ఉంటే వెంటనే తిరస్కరించాలి. దానికున్న సీల్ తొలగించడం నేరం. అలాంటి సిలిండర్లను సరఫరా చేస్తే సంబంధిత ఏజెన్సీతో పాటు డెలివరీ బాయ్పై కఠిన చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంది. కాబట్టి ఎవరైనా సీల్ తొలగించి సిలిండర్ సరఫరా చేసినట్లయితే తక్షణమే అధికారులు ఫిర్యాదు చేయాలి. గ్యాస్ లీకేజీపై అప్రమత్తత అవసరం రెగ్యులేటర్ అమర్చే నాబ్ వద్ద రబ్బర్ వాచర్ సరిగ్గా లేకపోతే గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి సిలిండర్ నుంచి గ్యాస్ లీకవుతోందా, లేదా అనేది చెక్ చేయించుకోవాలి. బాయ్ మీ ఎదుటనే సిలిండర్ నాబ్కు వేసిన సీల్ను తొలగించి రెగ్యులేటర్ అమర్చి గ్యాస్ లీకేజీ ఉందో, లేదో చెప్పేస్తాడు. ఒకవేళ గ్యాస్ లీకవుతోంటే వాచర్ మారుస్తాడు. అలాగే మీరు కూడా బాయ్ను అడిగి ఒకటో రెండో వాచర్లు తీసుకోండి. ఎప్పుడైనా గ్యాస్ లీకవుతుంటే మీరే స్వయంగా వాచర్ మార్చుకోవచ్చు. స్ప్రింగ్ త్రాసు తప్పని సరి వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్ వెంట తప్పని సరిగా స్ప్రింగ్ త్రాసు ఉండాలనే నిబంధన ఉంది. గృహ అవసర సిలిండర్లో నికరంగా గ్యాస్ 14.200 కేజీలు, సిలిండర్ బరువు 15.300 కేజీలు కలిపి మొత్తం 29.500 కేజీలు ఉండాలి. డెలివరీ బాయ్స్ తమ వెంట తెచ్చుకున్న స్రింగ్ త్రాసుతో తూకం వేసిన తర్వాతనే వినియోగదారుడికి సిలిండర్ అందజేయాలి. బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానం వస్తే తక్షణం తూకం వేయించండి. స్ప్రింగ్ త్రాసు లేదని చెబితే ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. -
చిన్న అగ్గి రవ్వ పడిందంటే క్షణాల్లో అంతా బూడిదైపోతోంది. చిన్నచిన్న తప్పిదాలతో నిప్పు రవ్వ కాస్త దావాగ్నిగా మారితే రూ.లక్షల విలువైన ఆస్తులు బుగ్గయిపోతున్నాయి. గుంతకల్లు నియోజకవర్గంలో నెలకొన్న ఈ దయనీయ పరిస్థితిపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పందించడం లేదంటూ
గుత్తి రూరల్: గుంతకల్లు నియోజకవర్గంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే ఆస్తులు బుగ్గవుతున్నాయి. నియోజకవర్గంలోని మూడు మండలాలకు కలిపి ఒకే ఒక్క అగ్నిమాపక వాహనం ఉండటంతో సకాలంలో ప్రమాదాలు నివారించేందుకు వీలుకావడం లేదు. గుత్తి పట్టణంలో అగ్నిమాపక కేంద్రం స్థాపన అనేది ఓటు బ్యాంక్ రాజకీయంగానే మారింది. మూడు దశాబ్ధాలుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి, గుత్తి, గుంతకల్లు మండలాలతో పాటు పక్కనున్న ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాల్లోని వజ్రకరూరు, పెద్దవడుగూరు మండలాలకు కలిపి ఒకే ఒక్క అగ్నిమాపక వాహనం ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో ఘటనా స్ధలానికి చేరుకుని నష్టం తీవ్రతను అరికట్టడం సాధ్యం కావడం లేదు. వరుస అగ్ని ప్రమాదాలతో జనం బెంబేలు గుంతకల్లు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో గత రెండేళ్లలో దాదాపు వందకు పైగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రూ.లక్షల్లో బాధితులు నష్టపోయారు. గత ఏడాది 26న గుత్తి మండలంలోని వన్నేదొడ్డిలో రైతు బండి లక్ష్మీనారాయణకు చెందిన వేరుశనగ పొట్టు వామి కాలి రూ.60 వేలు నష్టం వాటిల్లింది. అదే ఏడాది ఫిబ్రవరి 13న అనగానదొడ్డిలో రైతులు పోతుల కృష్ణయ్య, మూలింటి రంగన్న, రామాంజనేయులుకు చెందిన వాములు దగ్ధమయ్యాయి. దీంతో రూ.5 లక్షలు నష్టపోయారు. మార్చి 20న శ్రీపురంలో రైతు ఉండ్ర శివ మినుము పంట తొలగించి నూర్పిడి కోసం పొలంలో వామి వేసి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలి బూడిదైంది. రూ. 2 లక్షలు నష్టం వాటిల్లింది. అదే నెల 29న ఊబిచెర్లలో గట్టు ఆంజనేయస్వామి ఆలయ దారిలో విద్యుత్ స్తంభం కూలి మంటలు చెలరేగడంతో పెద్ద సంఖ్యలో చెట్లు కాలిపోయాయి. జూన్ 29న బసినేపల్లి గ్రామ శివారున రైల్వే బ్రిడ్జి కింద బెల్లం పాకంతో వెళుతున్న ట్యాంకర్ టైర్లు వేడెక్కి మంటలు చెలరేగడంతో ట్యాంకర్ మొత్తం కాలిపోయింది. ఈ నెల 6న ఊబిచెర్ల గ్రామంలో రైతులు చలపతి, రమేష్కు చెందిన గడ్డివాములకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో రూ.25వేలు నష్టం వాటిల్లింది. ఈ నెల 18న రాత్రి గుత్తి పట్టణంలోని పారిశ్రామిక వాడలో అగ్గి ప్రమాదం చోటు చేసుకుంది. గుంతకల్లు నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోపు భారీ నష్టం వాటిల్లింది. గుత్తిలో అగ్నిమాపక వాహనం ఉండ ఉంటే నిమిషాల వ్యవధిలో ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపు చేయడం ద్వారా నష్టం తీవ్రత తగ్గేదని బాధితులు వాపోయారు. ఎమ్మెల్యేకు పట్టని సమస్య అగ్ని మాపక వాహనాల సంఖ్య పెంచడంతో పాటు గుత్తిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు అంశంపై గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దృష్టి సారించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ నాలుగు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మొదటి సమావేశంలో రెండు బిల్లులు ప్రవేశపెట్టగా రెండింటినీ సభ్యులు ఆమోదించారు. అలాగే రెండో సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి అన్నింటినీ ఆమోదించారు. మూడో సమావేశంలో 9 బిల్లులు ప్రవేశపెట్టి తొమ్మిదింటినీ, నాలుగు సమావేశంలో 23 బిల్లులు ప్రవేశపెట్టి అన్నింటికీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే ఇప్పటి వరకూ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏనాడూ గుంతకల్లు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న అగ్ని ప్రమాదాలపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రస్తావించింది లేదు. మూడు దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన గుత్తిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కూడా ప్రస్తుతం కలగానే మిగిలిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే జయరాం స్పందించాలని, అగ్ని ప్రమాదాల నివారణకు వాహనాల సంఖ్యను పెంచడంతో పాటు గుత్తిలో కేంద్రం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. గుత్తి మండలం బసినేపల్లిలో దగ్ధమైన అరటి చెట్లు (ఫైల్) రెండేళ్లలో వందకు పైగా అగ్ని ప్రమాదాలు గుత్తిలో ప్రతిపాదనలకే పరిమితమైన అగ్నిమాపక కేంద్రం మూడు మండలాలకు కలిపి ఒక్కటే వాహనం సమస్య పరిష్కారంపై దృష్టి సారించని ఎమ్మెల్యే గుమ్మనూరు8 గడ్డి వాములు దగ్ధం గుత్తి: స్థానిక బీసీ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో బుధవారం వరుసగా ఉన్న ఎనిమిది వరి గడ్డి, సొప్ప, వేరుశనగ పొట్టు వాములు కాలి బూడిదయ్యాయి. దీంతో రైతులు హరికృష్ణ, రామకృష్ణ, తిమ్మారెడ్డి, లక్ష్మీదేవి, ప్రభావతి రూ. 8 లక్షలకు పైగా నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. సంఘటనా స్థలాన్ని సీఐ రామారావు పరిశీలించారు. గడ్డివాములు బూడిదైన తర్వాత గుంతకల్లు నుంచి ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకోవడం గమనార్హం. ప్రభుత్వానికి నివేదించాం గుత్తిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాం. అనేక ఏళ్లుగా ఇందుకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు కలెక్టరేట్ వరకే వెళ్లాయి. ఇక మా శాఖ తరఫున ప్రభుత్వానికి నేరుగా విన్నవించాం. అనుమతులు మంజూరై భూమి కేటాయింపులు జరిగితే గుత్తిలో ఫైర్ స్టేషన్ను అందుబాటులోకి తెస్తాం – అశ్వత్థ, ఏడీఎస్ఓ, గుంతకల్లు -
విసిరేసిన మాతృత్వం..
మానవత్వం మంట కలుస్తోంది. జన్మించిన గంటల వ్యవధిలోనే కన్న పేగును నిర్దయగా వదిలించుకున్నారు. కారణమేదైనా అమానవీయ ఈ ఘటన గుత్తిలో చోటు చేసుకుంది. గుత్తి: ఓ మాతృమూర్తి నవమాసాలు మోసి కన్న ముక్కుపచ్చలారని కుమార్తెను మానవత్వం మరిచి ఓ ఇంటి గడప వద్ద వదిలి వెళ్లిన ఘటన గుత్తి పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుత్తిలోని కుంట కట్ట వద్ద నివాసముంటున్న మైనుద్దీన్ ఇంటి ఎదుట బుధవారం ఉదయం ఓ ప్లాస్టిక్ కవర్లో నవజాత ఆడశిశువు కనిపించింది. తల్లి గర్భం నుంచి బయటపడే సమయంలో దేహానికి అంటిన రక్తపు మరకలు కూడా అలాగే ఉన్నాయి. అప్పటికే స్థానికులు గుమికూడారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ నాగమాణిక్యం, సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ప్రాణముందన్న ఆశతో ఆగమేఘాలపై ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు శిశువు మృతి చెందినట్లు నిర్దారించారు. అయితే శిశువును ఎవరు వదిలి వెళ్లారో తెలియడం లేదు. ఈ ఘటనపై సీఐ రామారావు, సీడీపీఓ యల్లమ్మ, సూపర్వైజర్ రాజేశ్వరి, 1098 సిబ్బంది లోతుగా విచారణ చేపట్టారు. ఒకవేళ శిశువు ముందే మృతి చెంది ఉంటే మానవత్వంతో ఖననం చేయడమో లేక, ఇష్టం లేకపోతే నిర్మానుష్య ప్రాంతంలోనో పడేసేవారు. ప్రాణముండడంతో ఎవరైనా తీసుకెళ్లి పెంచుకుంటారనే ఆశతోనే ఓ ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఊపిరి ఆడేలా కవర్ మూత తీసి పెట్టి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మృత శిశువును గుత్తి ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. నవజాత ఆడశిశువును శిశువును వదిలి వెళ్లిన వైనం స్థానికులు గమనించేలోపు మృతి -
అలరించిన ‘రంగోత్సవ్’
● ఉత్సాహంగా ఆడిపాడిన అనంతపురం జిల్లా చిన్నారులు ● రాష్ట్ర స్థాయి పోటీలకు 8 మంది ఎంపిక పుట్టపర్తి అర్బన్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కళానైపుణ్యాలను వెలికితీసేందుకు నిర్వహించిన ‘రంగోత్సవ్’ అందరినీ అలరించింది. బుక్కపట్నంలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి ‘రంగోత్సవ్’ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల విద్యార్థులు పోటీపడి తమ ప్రతిభను చాటారు. డ్రాయింగ్, హ్యాండ్రైటింగ్, ఫోక్ డాన్స్, రోప్ప్లే తదితర విభాగాల్లో పోటీ పడ్డారు. ఆయా విభాగాల్లో సత్తా చాటిన విద్యార్థులకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా స్థాయి ‘రంగోత్సవ్’ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన 8 మంది విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని, వారంతా 23వ తేదీన విజయవాడ వేదికగా జరగనున్న పోటీల్లో పాల్గొంటారని డైట్ ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. రంగోత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధ్యాపకులను, ఉపాధ్యాయులను అభినందించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులు.. ● రంగోళి విభాగం: పి.ఉషోదయ, అనూశ్రీ (అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట ఉన్నత పాఠశాల) ● డ్రాయింగ్: జి.ప్రీతి (అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం దోసలుడికి ఉన్నత పాఠశాల) ● హ్యాండ్ రైటింగ్: కె. జాహ్నవి (శ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండలం వశిష్ట ఇంగ్లిష్ మీడియం స్కూల్) ● ఫోక్ డ్యాన్స్: వర్షిత, వర్షిణీ, మహతేజ్, మనుశ్రీ (అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లి ఉన్నత పాఠశాల) -
అడ్డగోలుగా డీటీ పదోన్నతులు
● కేటాయింపులో శ్రీసత్యసాయి జిల్లాకు కోత ● నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్లు అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు కల్పించే క్రమంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. గతంలో తహసీల్దారు బదిలీల్లోనూ ఏకంగా ఐదుసార్లు ఉత్తర్వులను మార్చారు. తాజాగా డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతి కల్పించిన క్రమంలో అనుసరించిన విధానం మరోసారి చర్చనీయాంశమైంది. అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ కల్పించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీసత్యసాయి జిల్లాకు కోత రెవెన్యూ శాఖలో 16 మంది సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించారు. ఆ తరువాత పోస్టింగ్ ఇచ్చే విషయంలో శ్రీసత్యసాయి జిల్లాకు కోత పెట్టారు. 16 పోస్టుల్లో ప్యానల్ ప్రకారం 12 పోస్టులు శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించాలి. నాలుగు పోస్టులు అనంతపురం జిల్లాకు కేటాయించాలి. అయితే తొలి ఆర్డర్లో శ్రీసత్యసాయి జిల్లాకు నాలుగు పోస్టులు, అనంతపురం జిల్లాకు 12 పోస్టులు కేటాయించారు. ఇది వివాదం కావడంతో లాటరీ నిర్వహించి మరో ముగ్గురికి శ్రీసత్యసాయి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఆ జిల్లాకు ఏడు పోస్టులు ఇచ్చినట్లయ్యింది. వాస్తవంగా ప్యానల్ ప్రకారం 12 పోస్టులు ఇవ్వకుండా ఏడు పోస్టులతో సరిపెట్టారు. ఇక అనంతపురం జిల్లాకు నాలుగు పోస్టులు ఉంటే 9 పోస్టులు కేటాయించారు. ఇది పూర్తిగా అసంబద్ధ చర్య అని సీనియర్ రెవెన్యూ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దారు, చెక్పోస్ట్ డిప్యూటీ తహసీల్దారు పోస్టుల్లో రెగ్యులర్ డీటీలను నియమించాల్సి ఉంటుందని సీనియర్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే పదోన్నతుల ద్వారా నియమించారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. ఇక పదోన్నతులు కల్పిస్తూ డీటీలకు ఇచ్చిన పోస్టింగ్ ఒక చోట పనిచేయాల్సిన ప్రదేశం మరోచోట చూపడం కూడా సరైన విధానం కాదని చెబుతున్నారు. తప్పుదోవ పట్టించిన అధికారులు సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు డీటీలుగా పదోన్నతులు కల్పించే విషయంలో ఉన్నతాధికారిని కూడా ఇక్కడి కొందరు అధికారులు తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. ప్రధానంగా జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లు శాంక్షనింగ్ పోస్టుల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. డీటీలుగా పదోన్నతులు కల్పించే విషయంలో చిక్కులు ఉన్న కారణంగానే గత కలెక్టర్ పెండింగ్ లో ఉంచారని రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి. -
రైతుల సహనానికి పరీక్ష
గుంతకల్లు రూరల్: కందుల కొనుగోలులో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తోంది. దళారుల చేతిలో తక్కువ ధర– తూకాలతో మోసపోవడం కన్నా మద్దతు ధరతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ఉపశమనం పొందుదామనుకుంటే నిరాశే ఎదురవుతోంది. వెల్లువలా వస్తున్న సరుకును అధికారులు నత్తనడకన కొనుగోలు చేస్తుండటంతో రైతులు కేంద్రం వద్దే తిండీ తిప్పలు మాని, చలిలో వణుకుతూ నిద్రలేక అవస్థలు పడుతున్నారు. గుంతకల్లు మార్కెట్యార్డులో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి మార్క్ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో కందుల కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు రూ.8వేలుగా నిర్ణయించింది. బయటి మార్కెట్లో దీనికన్నా ధర తక్కువగా ఉండటంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రానికి సరుకును తీసుకొస్తున్నారు. ధాన్యాన్ని మార్క్ఫెడ్ సంస్థ ఎప్పటికప్పుడు తరలించకపోవడంతో కొనుగోలు కేంద్రం పూర్తిగా కందుల స్టాకుతో నిండిపోయింది. రైతుల నుంచి కొత్తగా కొనుగోలు చేసే కందులను ఉంచేందుకు అవసరమైన స్థలం లేదు. దీనికితోడు గోనెసంచుల సరఫరా నిలిచిపోయింది. దీంతో కొనుగోళ్ల ప్రక్రియ మందగించింది. ఈ పరిస్థితుల్లో పంటను విక్రయించేందుకు మార్కెట్యార్డుకు వచ్చిన రైతులు రెండు, మూడు రోజులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. రాత్రిపూట విపరీతమైన చలి ఉండటం, దానికితోడు దోమల బెడద కూడా ఎక్కువగా ఉండటంతో రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా, కందుల కొనుగోళ్లు సక్రమంగా, సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతు.. దాన్ని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల నిర్వాకంతో తిండీ, నిద్ర మాని మార్కెట్యార్డులో నిరీక్షిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాదిరిగా స్థానికంగా రైతు భరోసా కేంద్రంలో పంట ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా.. అందరినీ ఒకేచోటకు సరుకు తీసుకొచ్చి అమ్ముకోవాలని చంద్రబాబు ప్రభుత్వం చెప్పడంతో రైతుల అవస్థలు రెట్టింపయ్యాయి. నత్తనడకన కందుల కొనుగోళ్లు సరుకుతో నిండిన గుంతకల్లు మార్కెట్యార్డు సరిపడ గోనెసంచులూ అందుబాటులో లేని వైనం స్టాకు కదిలేదాకా కొనేది లేదంటున్న అధికారులు కేంద్రం వద్ద రోజుల తరబడి రైతుల పడిగాపులు గుంతకల్లు మండల వ్యాప్తంగా ఖరీఫ్లో 35,250 ఎకరాల విస్తీర్ణంలో కంది సాగు చేశారు. మొత్తం 1.41 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ నెల 9 నుంచి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 550 మంది రైతుల నుంచి 10,860 క్వింటాళ్ల కందులు మాత్రమే కొనుగోలు చేశారు. దీంతో తమవంతు రావడానికి రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. మందకొడి కొనుగోళ్లు రైతుల సహనానికి పరీక్షగా నిలుస్తున్నాయి. -
రంజీకి రంగం సిద్ధం
● నేటి నుంచి ఆంధ్ర–విదర్భ మ్యాచ్ ● ప్రవేశం ఉచితంఅనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురంలో రంజీ మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి అనంతపురం క్రికెట్ గ్రౌండు (ఆర్డీటీ మైదానం)లో ఆంధ్ర–విదర్భ జట్ల మధ్య నాలుగు రోజుల పాటు బీసీీసీఐ రంజీ ట్రోఫీ మ్యాచ్ జరగనుంది. జిల్లాలోని క్రికెట్ ప్రేమికులు సంబరాల్లో మునిగారు. భారతజట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులు పాల్గొంటుండడంతో వారి ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఎదురు చూస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉచిత ప్రవేశం కల్పించారు. అభిమానులు కూర్చుని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశారు. ఇప్పటికే ఇరుజట్ల క్రీడాకారులు రెండు రోజుల పాటు సాధన చేశారు. మ్యాచ్ అధికారులు గ్రౌండ్ను తనిఖీ చేశారు. మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించడానికి గ్రౌండ్, టర్ఫ్ వికెట్, మార్కింగ్లు, స్టంప్లు, బాల్స్, ఇతర వస్తువులను పరిశీలించారు. మ్యాచ్ కోసం పచ్చని మైదానం, టర్ఫ్ పిచ్ను సిద్ధం చేశారు. మ్యాచ్ రిఫరీ అజయ్ కుడువా, అంపైర్లు వైభవ్ ధోక్రే, ప్రణవ్ జోషి, స్కోరర్లు కేఎం షణ్ముఖం, ఏఎల్ నరసింహం, వీడియో విశ్లేషకులు ఎస్.ఇమ్రాన్ పాషా, జీఎన్ శ్రీనివాస్రావు, ఏసీఎల్ఓ కేఏ ఫయాజ్ అహ్మద్, ఇరుజట్ల మేనేజర్లు, కెప్టెన్లతో సమావేశం నిర్వహించారు. మ్యాచ్ నిర్వహణ అధికారులు ఆట పరిస్థితులను వివరించారు, మ్యాచ్ కోసం అనుసరించాల్సిన ఆటగాళ్ల ప్రవర్తనను కెప్టెన్లు, మేనేజర్కు తెలియజేశారు. ఆంధ్ర జట్టు కెప్టెన్గా రికీ భుయ్, విదర్భ జట్టు కెప్టెన్గా హర్షదుబే వ్యవహరించనున్నారు. మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశామని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్, కార్యదర్శి యుగంధర్రెడ్డి తెలిపారు. -
ఫిబ్రవరి వరకు హంద్రీ–నీవాకు నీరు
అనంతపురం సెంట్రల్: హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఫిబ్రవరి నెలాఖరు వరకు కృష్ణా జలాలు వచ్చే అవకాశముందని జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్ (సీఈ) నాగరాజ తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కర్నూలు జిల్లా మల్యాల వద్ద ఇప్పటి వరకు 39.5100 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో అనంతపురం జిల్లా సరిహద్దుకు 37.557 టీఎంసీలు వచ్చాయన్నారు. జీడిపల్లి జలాశయం నుంచి 34.543 టీఎంసీలు, గొల్లపల్లి రిజర్వాయర్కు 20.990 టీఎంసీలు, అన్నమయ్య జిల్లాకు 3.972 టీఎంసీలు వెళ్లాయన్నారు. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఇప్పటి వరకు 200 చెరువులు నింపినట్లు చెప్పారు. ప్రాజెక్టులు ప్రారంభిస్తాం అనంతపురం అర్బన్: పీఎం కుసుమ్ కింద జిల్లాలో 111 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేపట్టిన ప్రాజెక్టులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్కు ఇన్చార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ తెలిపారు. పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం, ఎన్ఆర్ఈడీసీఏపీ ప్రాజెక్టులపై ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం నుంచి వైఎస్సార్ కడప, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి ఇన్చార్జ్ కలెక్టర్తో పాటు ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం కుసుమ్ కింద 20 ప్రాంతాల్లో 111 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం చేపట్టిన అన్ని ప్రాజెక్టులనూ పది రోజుల్లో మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చలిమంటలో పడి.. ప్రాణాలు కోల్పోయి.. యాడికి: మద్యం మత్తులో ఓ వ్యక్తి చలిమంటలో పడి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. తూట్రాళ్లపల్లికి చెందిన రామాంజనేయరెడ్డి (55) ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. గత నెల 31న విపరీతంగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. చలిగా ఉందని ఇంటి వద్ద మంట వేశాడు. చలి కాచుకుంటున్న సమయంలో మద్యం మత్తులో తూలి మంటలో పడిపోయాడు. తీవ్రగాయాలైన అతన్ని స్థానికులు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రామాంజనేయరెడ్డి బుధవారం మృతి చెందాడు. తాడిపత్రిలో మాతృ మరణం ● ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన తాడిపత్రి రూరల్: ప్రైవేట్ ఆస్పత్రిలో మాతృమరణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండల కేంద్రానికి చెందిన లావణ్య (27), ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడైన పుట్లూరు మండలం కుమ్మనమలకు చెందిన శరత్బాబు దంపతులు. లావణ్య గర్భం దాల్చింది. ఆమెకు తాడిపత్రిలోని కృష్ణాపురం మూడవ రోడ్డులో గల నిహిర నర్సింగ్ హోంలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. నెలలు నిండటంతో మంగళవారం స్వగ్రామం నుంచి నర్సింగ్హోంలో చేర్చారు. సాధారణ ప్రసవం కష్టమని, సిజేరియన్ చేయాల్సి ఉందని వైద్యురాలు తెలిపారు. బుధవారం ఉదయం సిజేరియన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ గర్భసంచికి రంధ్రం ఏర్పడి రక్తస్రావం మొదలైంది. వైద్యురాలు పరిశీలించి.. లావణ్యకు మూడు బాటిళ్ల రక్తం ఎక్కించారు. అయినా పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే లావణ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహించి మృతదేహాన్ని తాడిపత్రికి తీసుకొచ్చి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సిజేరియన్ సమయంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయాయని, డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు వచ్చి ఆందోళనకారుల వద్దకు వచ్చి సర్దిచెప్పి, శాంతింపజేశారు. ఇదిలా ఉండగా లావణ్య ప్రసవించిన మగ శిశువు ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. -
మధ్యాహ్న భోజనం అధ్వానం
● వినయ్కుమార్ ఎయిడెడ్ స్కూల్ ఫిర్యాదుల బాక్సులో విద్యార్థుల లేఖలు రాప్తాడురూరల్: రాప్తాడు మండల పరిధిలోని చిన్మయనగర్లోని వినయ్కుమార్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటోందంటూ విద్యార్థులు ఫిర్యాదుల బాక్సుల్లో లేఖలు పెట్టారు. ఇటీవల ఈ ఫిర్యాదుల బాక్సును స్వయంగా మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున ఓపెన్ చేయగా అందులో పలువురు విద్యార్థులు ‘భోజనం రుచిగా ఉండడం లేదు ఫాదర్’ అంటూ రాసిన లేఖలు కనిపించాయి. ఇక్కడ 6–10 తరగతి విద్యార్థులు వందలాదిమంది చదువుతున్నారు. కూలీనాలి చేసుకునే కుటుంబాల పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారికి మధ్యాహ్న భోజనం వరంలా ఉంటుంది. అయితే వినయ్కుమార్ స్కూల్లో పెడుతున్న భోజనం రుచి, నాణ్యతగా లేకపోవడంతో పిల్లలు తినలేకపోతున్నారు. దీంతో తమ పిల్లలకు ఇంటినుంచి క్యారియర్లు పంపుతున్నామని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంఈఓ మల్లికార్జున మాట్లాడుతూ వినయ్కుమార్ స్కూల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఫిర్యాదులు అందాయన్నారు. తాను స్వయంగా స్కూల్లో ఫిర్యాదుల బాక్సు ఓపెన్ చేస్తే అందులోనూ విద్యార్థులు అన్నం రుచిగా లేదంటూ రాసిన లేఖలను పరిశీలించానన్నారు. నిర్వాహకులు తీరు మార్చుకోకపోతే ఏజెన్సీని మార్పు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎంఈఓ స్పష్టం చేశారు. -
కుక్కలను తప్పించబోయి యువకుడి మృతి
రాప్తాడు రూరల్: రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కలను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్కడప జిల్లా రైల్వే కొండాపురం మండలం పి.అనంతపురం గ్రామానికి చెందిన రామచంద్రుడు, నాగలక్ష్మి దంపతుల ఏకై క కుమారుడు ఎక్కలూరి శ్రీకాంత్ (25) నాలుగేళ్లుగా అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి సమీపంలోని ఎస్ఆర్ బాలుర జూనియర్ కళాశాల మెస్ ఇన్చార్జ్గా పని చేస్తున్నాడు. రెసిడెన్షియల్ బ్రాంచ్ కావడంతో అక్కడే ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం వ్యక్తిగత పనిపై అనంతపురానికి వచ్చి అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. కొడిమి క్రాస్ వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కలను తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఘటనతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ను అటుగా వెళ్తున్న వారు గమనించి 108 ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆ స్థలాలు స్వాధీనం చేసుకోండి
● అధికారులకు ఎమ్మెల్యే గుమ్మనూరు ఆదేశం గుంతకల్లు రూరల్ : నిరుపేదల సొంతింటి కల సాకారాన్ని సాక్షాత్తూ నియోజకవర్గ ప్రజాప్రతినిధే భగ్నం చేయడానికి పూనుకున్నారు. తనకు కావలసిన వారికి లబ్ధి చేకూర్చేందుకు పేదలపై కక్ష కట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో శ్రీనవరత్నాలు – పేదలందరికీ ఇళ్లుశ్రీ కింద గుంతకల్లు మండలంలో అర్హులైన వారికి నివేశన స్థలాలు మంజూరు చేశారు. పక్కాగృహాలు మంజూరు చేశారు. అయితే కొందరు పేదలు పునాదులు వేసుకున్నారు. మరికొందరు ఆర్థిక శక్తి లేక నిదానంగా ఇల్లు నిర్మించుకుందామనుకున్నారు. ఇంతలో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. అప్పట్లో లబ్ధి పొందిన వారి పొట్టకొట్టి.. అధికార టీడీపీకి చెందిన వారికి ఆ స్థలాలను కట్టబెట్టేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని ఆదేశించారు. ఈ పక్రియను మార్చి 30లోపు పూర్తి చేయాలని అధికారులకు డెడ్లైన్ విధించారు. ఆ స్థలాల్లో 500 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయం తెలిసి పేదలు ఎమ్మెల్యే తీరును తప్పు పడుతున్నారు. అధికార పార్టీ వారికి ప్రయోజనం చేకూర్చేందుకు తమ స్థలాలను పీక్కోవాలని చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నిబంధనల మేరకు కందుల కొగుగోలు కూడేరు: ప్రభుత్వ నిబంధన మేరకు రైతుల నుంచి కందులు కొగుగోలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి రవి ఆదేశించారు. కూడేరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని వ్యవసాయ గోదాములో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన కందుల నాణ్యతను, తేమ శాతాన్ని, గ్రేడింగ్ విధానాన్ని పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కందుల కొనుగోలు చేయాలని, సకాలంలో వారికి నగదు అందేలా చూడాలని ఏజెన్సీ నిర్వాహకుడు చింతల నాయుడును ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్దతు ధరతో ప్రభుత్వం కందులు కొనుగోలు చేస్తోందని, రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏఓ శుభకర్ తదితరులు పాల్గొన్నారు. నూతన జేసీ నేడు బాధ్యతల స్వీకరణ అనంతపురం అర్బన్: నూతన జాయింట్ కలెక్టర్గా సి.విష్ణుచరణ్ బుధవారం ఉదయం 10.30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్గానూ బాధ్యతలు తీసుకుంటారు. మన్యుసూక్తహోమం గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం మన్యుసూక్త హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ యాగశాలలో కలశ ప్రతిష్ట గావించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మన్యుసూక్తహోమాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తిని పల్లకీలో కొలువుదీర్చి ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు. -
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం కొనసాగుతోంది. గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా గాలి వీచింది.
మీ అభిమానం మరువలేనిది ● ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ అనంతపురం అర్బన్: జిల్లాలో పనిచేయడం చాలా సంతృప్తినిచ్చిందని, అధికారులు, ఉద్యోగుల అభిమానం మరువలేనిదని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీపై వెళుతున్న ఆయనకు జిల్లా యంత్రాంగం మంగళవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన సేవలను జిల్లా అధికారులు కొనియాడారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో సహకరించిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ను అధికారులు సన్మానించి మొమెంటో అందజేశారు. కార్యక్రమంలో అస్టింట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్కు సన్మానం అనంతపురం క్రైం: బదిలీపై వెళ్తున్న ఇన్చార్జ్ కలెక్టర్, అహుడా వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మను మంగళవారం కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. అహుడ చైర్మన్ టి.సి.వరుణ్, కార్యదర్శి రామకృష్ణారెడ్డిలు ఇన్చార్జ్ కలెక్టర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఈ రేవంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, కేఎండీ ఇసాక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దుశ్యంత్, జీపీఓ హరీష్ చౌదరి, సర్వేయర్ శరత్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఎంటెక్, ఎమ్మెస్సీ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో నిర్వహించిన ఎంటెక్ (ఆర్–21), రెగ్యులర్, సప్లిమెంటరీ, ఎమ్మెస్సీ మూడో సెమిస్టర్ (ఆర్–21) నాలుగో సెమిస్టర్ (ఆర్–21), రెగ్యులర్, సప్లిమెంటరీ, మూక్స్ (కన్వెన్షనల్ మోడ్) ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు మంగళవారం విడుదల చేశారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ ఎం.అంకారావు, డాక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. హోరాహోరీగా రాష్ట్ర స్థాయి వృషభాల బలప్రదర్శన పామిడి: స్థానిక కొండూరు మార్గంలో వెలసిన అంకాలమ్మ, కుంటెమ్మ జాతర సందర్భంగా మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన 13 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. ప్రథమ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా పులేటిపల్లి రైతు బి.భాస్కర్ వృషభాలు, ద్వితీయ స్థానంలో కర్నూలు జిల్లా రైతు వెంకటగిరి వృషభాలు, తృతీయ స్థానంలో నంద్యాల జిల్లా బేతంచెర్ల రైతు ఎం.భానుజా వృషభాలు నిలిచాయి. వీరితో పాటు అలాగే తర్వాతి ఆరు స్థానాల్లో విజేతగా వృషభాల యజమానులను అభినందిస్తూ నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు. బుధవారం న్యూ కేటగిరి విభాగంలో వృషభాల బలప్రదర్శన ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. -
●వాసవీ మాతా పాహిమాం
అనంతపురం కల్చరల్: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం మంగళవారం అనంతపురంలోని అమ్మవారి శాలల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాతూరు అమ్మవారి శాలలో ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, దేవదాయశాఖ ఏడీ మల్లికార్జున ప్రసాద్, డీఆర్వో మలోల, పంపనూరు ఆలయ ఈవో బాబు, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వన్నూరుస్వామి తదితరులు వాసవీమాతకు పట్టు వస్త్రాలను అధికార లాంఛనాలతో సమర్పించారు. అనంతరం అమ్మవారికి జరిగిన మహా పుష్పయాగంలో పాల్గొన్నారు. ఉదయం సుప్రభాత సేవలు, కన్యక పూజలను పండితులు జరిపించారు. ఆత్మార్పణ దిన ప్రత్యేకతను వివరించారు. అనంతరం వాసవీ మహిళా మండలి సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో పుష్పార్చన, సామూహిక కుంకుమార్చనతో అమ్మవారికి భక్తినీరాజనాలర్పించారు. అలాగే కొత్తూరు వాసవీమాతకు ప్రత్యేకంగా బంగారు చీర అలంకార సేవలు నిర్వహించడంతో భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. వాసవీ హోమం, మధ్యాహ్నం తీర్థప్రసాద వినియోగం, అన్నదానం జరిగాయి. అనంతపురం కొత్తూరు అమ్మవారి శాలలో వాసవీమాత చిత్రపటం వద్ద పూజలు చేస్తున్న దృశ్యం అమ్మవారికి హారతులు ఇస్తున్న భక్తులు -
విజయవంతంగా కుక్కల నియంత్రణ
అనంతపురం క్రైం: ప్రజల భద్రత, జంతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల సంతాన నివారణ కింద చేపట్టిన రెండు విడతలు విజయవంతమయ్యాయని అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, పశుసంవర్ధక శాఖ అధికారి సురేష్ తెలిపారు. మంగళవారం నగరంలోని గుత్తి రోడ్డులో గల స్నేహ్ సంస్థ సెంటర్ను పలు శాఖల అధికారులతో కలసి వారు సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో 4,900 వరకు కుక్కలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. సంతాన నివారణతో కుక్కల బెడద తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. కుక్కల సంతాన నియంత్రణ బాధ్యతను స్నేహ్ సంస్థకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అనంతపురం నగరంలో 34 రోజుల వ్యవధిలో 917 వీధికుక్కలకు నియంత్రణ చికిత్సలు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇక రాయదుర్గం పట్టణంలో 199, కళ్యాణదుర్గంలో 162, తాడిపత్రిలో 308 వీధికుక్కలు ఉన్నట్లు గుర్తించామన్నారు. గుత్తిలో కుక్కల పూర్తి వివరాల సేకరణ జరుగుతోందన్నారు. గుంతకల్లులో 259 వీధికుక్కలు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో కుక్కల సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు, యాంటీ–రేబీస్ టీకాలు, ఆరోగ్య పరీక్షలు మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. జంతువులపై హింసకు తావులేకుండా, శాసీ్త్రయ విధానంలో కుక్కల సంతాన నియంత్రణ (యానిమల్ బర్త్ కంట్రోల్– ఏబీసీ) కార్యక్రమం అమలు చేస్తూ ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలు ఎక్కడైనా పెంపుడు కుక్కలను ఎక్కడ పట్టుకుపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంతాన నియంత్రణ చికిత్స చేసి, మంచి ఆహారం అందించి, అనంతరం తిరిగి ఎక్కడ కుక్కలను అక్కడ వదిలేస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ స్పష్టం చేశారు. -
టమాట రైతులు ఆశ – నిరాశ నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. అలా ధరలు పెరిగాయి గాడిన పడబోతున్నాం అనుకునే లోపే అగాథంలోకి నెట్టేస్తున్నాయి. దీంతో పెట్టుబడులు సైతం తిరిగిరాని పరిస్థితి నెలకొంటోంది. ఆరుగాలం శ్రమించి చివరకు అప్పులపాలవ్వాల్సి వస్తోందని రైతులు బోరుమంటున్
అనంతపురం అగ్రికల్చర్: టమాట ధరలు మళ్లీ పడిపోయాయి. దీంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. సీజన్ ఆరంభం అంటే గత జూన్, జూలై, ఆగస్టులో ధరలు ఆశాజనకంగా ఉండటంతో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సెప్టెంబర్, అక్టోబర్లో మార్కెట్ పరిస్థితి తారుమారైంది. ధరలు అమాంతం పడిపోయాయి. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్లో ధరలు పుంజుకున్నాయి. దీంతో సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో 40,130 ఎకరాల భారీ విస్తీర్ణంలో టమాట సాగయ్యింది. ఇప్పుడు మార్కెట్ మళ్లీ నేలచూపు చూస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా అనంతపురం శివారులోని కక్కలపల్లి మార్కెట్టో 15 కిలోల టమాట బాక్సు ధర గరిష్టంగా రూ.270 ఉండగా.. సగటు ధర రూ.180, కనిష్టం రూ.100 పలుకుతోంది. తేమ ఉన్నవి, మచ్చ వచ్చిన కాయలను కొనడానికి వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. అలాంటివి బాక్సు రూ.50 కూడా పలకడం లేదు. గరిష్ట ధర కూడా నాణ్యమైన కొన్ని లాట్లకు మాత్రమే లభిస్తోంది. మిగతావన్నీ రూ.100 నుంచి రూ.200 మధ్య పలుకుతుండంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం రోజూ మార్కెట్కు 1,500 నుంచి 2 వేల టన్నుల వరకు టమాట వస్తోంది. గిట్టుబాటు కాని ధరలు ఎకరాకు 15 నుంచి 18 టన్నుల వరకు టమాట దిగుబడి వస్తోంది. కట్టెలు, తీగలు కట్టిన పొలంలో ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. సాధారణ పద్ధతిలో సాగు చేస్తే రూ.60 వేల వరకు పెట్టుబడి వస్తోంది. కిలో రూ.22 నుంచి రూ.25 పలికితే పెట్టుబడి పోయి కొంత వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పలుకుతున్న ధరలు చూస్తే కూలీలు, రవాణా, మార్కెట్లో కమీషన్లకు కూడా చాలడం లేదంటున్నారు. ఈ ఏడాది 8 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు జిల్లా పరిధిలో టమాట అమ్మకాలు సాగిస్తున్న అన్ని మార్కెట్లలో ధరల పరిస్థితి ఇలాగే ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ధర లేక ఆత్మకూరు వద్ద రోడ్డు పక్కన పడేసిన నాణ్యమైన టమాటాలు పది రోజులుగా ధరలు పతనం 15 కిలోల బాక్స్ సగటు ధర రూ.180 కనిష్ట ధర రూ.100కు పడిపోవడంతో రైతులకు నష్టాలు -
సిలిండర్ డెలివరీలో అవకతవకలు
● గ్యాస్ ఏజెన్సీకి రూ.10 వేల జరిమానా బొమ్మనహాళ్: గ్యాస్ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ శంకర్ మంగళవారం బొమ్మనహాళ్లో తనిఖీలు నిర్వహించారు. సిలిండర్ డెలివరీ వాహనంలో తూకం వేసే మిషన్ లేకపోవడంతో పాటు గ్యాస్ సరఫరా ధ్రువీకరణ పత్రం చూపించడంలో గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యం బయటపడింది. దీంతో రూ.10 వేలు జరిమానా విధించారు. నిర్దేశించిన ధర కన్నా సిలిండర్పై అధికంగా వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఇంటి వద్ద డెలివరీ చేయాల్సిన సిలిండర్లను రోడ్డుపైనే వదిలేస్తున్నారని, బలహీనులు, వృద్ధులు సిలిండర్లను మోసుకెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏజెన్సీ నిర్వాహకులు తమకు అనుకూలంగా ఉన్నవారికి 10 నుంచి 20 సిలిండర్లు ఇస్తున్నారని, ఇష్టారాజ్యంగా విక్రయించుకుంటున్నారని ఆరోపించారు. తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మరోసారి సిలిండర్ల డెలివరీలో అవకతవకలకు పాల్పడితే ఏజెన్సీ రద్దు కోసం ఉన్నతాధికారుకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. బొమ్మనహాళ్లో సిగరేట్ ప్యాకెట్ ధర రూ.100 ఎమ్మార్పీ ఉంటే.. అదనంగా రూ. 20 వసూలు చేస్తున్న వారికి రూ.5 వేల జరిమానా ఆన్లైన్ ద్వారా కట్టించినట్లు వెల్లడించారు. శ్రీధరఘట్టలో త్రాసుకు లీగల్ మెట్రోలజీ శాఖ ముద్ర అనుమతి పత్రాలు లేనందున కేసు నమోదు చేసి, రూ.5 వేలు జరిమానా వేశామన్నారు. బొమ్మనహాళ్లో వ్యాపారుల తూనికలు, కొలతల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ శిబిరం నిర్వహించారు. వ్యాపారులందరూ తమ తూనిక, కొలతల యంత్రాలు ఏటా తప్పని సరిగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. -
●అధినేతతో భేటీ
ఉరవకొండ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ప్రణయ్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న ఉన్నారు. చేనేత చట్టం ఉల్లంఘనపై కేసు నమోదు ధర్మవరం అర్బన్: చేనేత రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘించిన పవర్ లూమ్స్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. స్థానిక శారదానగర్లోని అక్కిలి లోకేష్ పవర్లూమ్స్లో మంగళవారం హ్యాండ్లూమ్ ఏడీ మంజునాథ్ తనిఖీలు చేపట్టిన సమయంలో మరమగ్గాలపై చేనేత మగ్గాలపై నేసే పట్టు చీరలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆయన ఫిర్యాదుతో నిర్వాహకుడు లోకేష్పై కేసు నమోదు చేశారు. -
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి
● ఉద్యోగులకు ఇన్చార్జ్ కలెక్టర్ సూచన అనంతపురం అర్బన్: ‘విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఈ క్రమంలో వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాబట్టి ఎవరూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి’ అంటూ రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు, ఉద్యోగులకు ఇన్చార్జ్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ సూచించారు. రెవెన్యూ, సర్వే ఉద్యోగుల కోసం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును లాంఛనంగా ప్రారంభించారు. శిబిరంలో ఏర్పాటు చేసిన వివిధ వైద్య పరీక్షల విభాగాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆరోగ్య శ్రేయస్సును ఆకాంక్షించి జిల్లా వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖల సమన్వయ సహకారాలతో ప్రత్యేకంగా మూడు రోజులపాటు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 21 వరకు మూడు రోజుల పాటు వైద్య శిబిరం ఉంటుందన్నారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో రోగ నిర్ధారణ పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ ఉంటుందన్నారు. రెవెన్యూ, సర్వే శాఖల్లోని అన్నిస్థాయిల ఉద్యోగులు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, డీఎంహెచ్ఓ ఈబీ దేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ గంగాధర్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, తహసీల్దార్ హరికుమార్ పాల్గొన్నారు. -
పశువుల షెడ్డు.. ‘పచ్చ’ నేతలకు ఫుడ్డు
సాక్షి, టాస్క్ఫోర్స్: పాడి రైతుకు వెన్నదన్నుగా నిలిచేందుకు ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న పశువుల షెడ్లు తెలుగు తమ్ముళ్లకు కాసుల పంటను కురిపిస్తున్నాయి. ఉపాధి హామీ అధికారులు వత్తాసు పలకడంతో అడ్డగోలు అవినీతికి తెరలేపారు. షెడ్లు నిర్మించకుండానే ఏకంగా పూర్తి బిల్లులు స్వాహా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.1.72 లక్షలు బ్రహ్మసముద్రం మండలంలోని గొంచిరెడ్డిపల్లిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబ్–జీ రామ్జీ) కింద పాడి రైతులకు 10 పశువుల షెడ్లు మంజూరయ్యాయి. ఒక్కో పశువుల షెడ్డుకు రూ.1.72 లక్షలకు పైగా నిధులు కేటాయించారు. రెండు షెడ్లను హడావుడిగా నిర్మించి బిల్లులు చేసుకున్నారు. మిగిలిన ఎనిమిది షెడ్లూ అసంపూర్తిగానే ఉన్నాయి. అయితే ఈ నిర్మాణాలన్నీ పూర్తి అయినట్లుగా టీడీపీ నేతలు రికార్డులు సృష్టించి రూ.లక్షల్లో బిల్లులు నొక్కేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈసీ కనుసన్నల్లోనే.. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల్లో ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకున్న అవినీతి మరే నియోజకవర్గంలోనూ జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా బ్రహ్మసముద్రం మండలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఓ ఈసీ అంతా తానై టీడీపీ నేతలతో జత కట్టి అక్రమాలకు తెర లేపినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో సదరు ఈసీ ఏకంగా రూ.లక్షలను తన కుటుంబసభ్యుల వ్యక్తిగత ఖాతాలకు జమ చేసుకున్న వైనంపై సాక్ష్యాధారాలతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. అయితే సదరు ఈసీపై అక్రమాలపై చేపట్టిన విచారణను అధికారులు కాసులకు కక్కుర్తి పడి పక్కదోవ పట్టించినట్లుగా ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఈసీని గతంలో ఉన్నతాధికారులు టెంపరరీ అవుట్ ఆఫ్ కాంటాక్ట్ (టీఓసీ) లోకి పంపినా.. తిరిగి అదే మండలంలో విధులకు హాజరుకావడం గమనార్హం. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వ్యక్తి గొంచిరెడ్డిపల్లిలో చోటు చేసుకున్న ఉపాధి అక్రమాలు, అవినీతిపై ఇటీవల ఓ వ్యక్తి కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో నేరుగా కలెక్టర్ను కలసి ఫిర్యాదు చేశాడు. దీంతో పశువుల షెడ్ల అక్రమాల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇదంతా డ్వామా ఉన్నతాధికారులకు తెలిసినా.. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం కొసమెరుపు. అయితే లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడటంలో ఆంతర్యం ఏమిటని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఉపాధి అధికారుల అండతో టీడీపీ నేతల అక్రమాలు షెడ్లు నిర్మించకుండానే బిల్లులు చేసుకున్న వైనం పక్కదారి పట్టిన రూ.లక్షల నిధులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదుతో వెలుగు చూసిన అక్రమాలు పై చిత్రంలోని ఈ నిర్మాణం ఉపాధి హామీ పథకం కింద బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లిలోని పూజారి హరీష్కు చెందిన పశువుల షెడ్డు. అసంపూర్తిగా ఉన్న ఈ కట్టడాన్ని పూర్తి చేసినట్లుగా రికార్డులు చూపి ఈ నెల 11న బోయ నాగమణి పేరిట రూ.1.72 లక్షలను అధికారులు మంజూరు చేశారు. స్థానిక టీడీపీ నేతలతో కుమ్మకై ్కన ఉపాధి హామీ పథకం ఈసీ.. మొత్తం నగదు డ్రా చేసినట్లుగా తెలుస్తోంది. -
సహాయకుడు లేడని నిర్దయ
గుత్తి రూరల్: సహాయకుడు లేని కారణంగా క్షతగాత్రుడిని తరలించలేమంటూ 108 సిబ్బంది పేర్కొనడంతో మూడు రోజులుగా గుత్తిలోని ప్రభుత్వాస్పత్రిలోనే ఆకలిదప్పికలతో ఓ క్షతగాత్రుడు అలమటిస్తున్నాడు. వివరాలు.. మండలంలోని కొత్తపేట గ్రామ శివారున 67వ జాతీయ రహదారిపై ఈ నెల 18న అర్ధరాత్రి సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తు తెలియని, మతిస్థిమితం లేని యువకుడి (యాచకుడు)ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న విషయం తెలిసిందే. అటుగా వెళుతున్న వారి సమాచారంతో క్షతగాత్రుడిని 108 సిబ్బంది చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. కుడి కాలు విరిగి తీవ్రంగా గాయపడిన యువకుడికి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి రెఫర్ చేశారు. అయితే అనంతపురానికి తీసుకెళ్లేందుకు 108 వాహన సిబ్బంది నిరాకరించారు. సహాయకులు ఎవరూ లేకపోవడంతో ఒక్కడిని తీసుకెళ్లడం కుదరదంటూ తేల్చి చెప్పారు. దీంతో మూడు రోజులుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో అన్నపానీయాలు లేక నీరసించిపోయాడు. ఇప్పటికై నా అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని అనాథ వ్యక్తిని జీజీహెచ్కు తరలించి మెరుగైన వైద్యం అందించేలా చొరవ తీసుకోవాలని ఆస్పతి సిబ్బంది కోరుతున్నారు. -
అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ
● ఎస్సీఆర్ జీఎం సంయ్కుమార్ శ్రీవాత్సవ్ గుంతకల్లు: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉన్నప్పుడే ప్రమాదాలను నివారించగలుగుతామని సిబ్బందికి దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాత్సవ్ సూచించారు. మంగళవారం ప్రత్యేక రైలులో గుంతకల్లు రైల్వేస్టేషన్ చేరుకున్న జీఎంకు డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా, ఏడీఆర్ఎం యూ.సుధాకర్లు స్వాగతం పలికారు. ఏఆర్టీ (యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్), ఎంఆర్టీ (మెడికల్ రిలీవ్ వ్యాన్)ను పరిశీలించారు.అనంతరం క్రూ లాబీని తనిఖీ చేశారు. రన్నింగ్ స్థాఫ్ వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం రైల్వేస్టేషన్లోని మీటింగ్ చాంబర్ సేఫ్టీ సెమినార్ను నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైలు మార్గం, సిగ్నిల్ పాయింట్ల వద్ద భద్రతాపై నిఘా పెంచాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఆటోమెటిక్ సిగ్నిల్ అండ్ లోకేషన్ ఆఫ్ రైట్ హ్యండ్ సిగ్నిల్స్ బ్రోచర్లను విడుదల చేశారు. అనంతరం రైల్వే భద్రత పర్యవేక్షణలో భాగంగా బళ్లారి–గుంతకల్లు–డోన్–నంద్యాల సెక్షన్లోని రైలు మార్గాలను ప్రత్యేక రైళ్లల్లో పరిశీలించారు. కార్యక్రమంలో జోనల్ పీసీఓఎం పద్మజ, పీసీఈ ఆంజనేయులురెడ్డి, డీఈ సందీప్జైన్, పీసీహెచ్ఓ వెంకటరమణారెడ్డి, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
అరాచకాల దగ్గుపాటిని వెంటనే బర్తరఫ్ చేయాలి
అనంతపురం: అంతులేని అరాచకాలకు పాల్పడుతున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ను తక్షణమే బర్తరఫ్ చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బుసిరెడ్డి శ్రీదేవి డిమాండ్ చేశారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ మహిళా విభాగం నేతలతో కలసి ఆమె మాట్లాడారు. అనంతపురం నగరంలో ఎమ్మెల్యే దండుపాళ్యం బ్యాచ్ ఆగడాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరి భూమిపై వారి కన్ను పడుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నెలకోసారి స్థిరాస్తుల వివరాలను ఆన్లైన్ సరిచూసుకోవాలని, లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్తో వాటిని కాజేసే ప్రమాదముందని హెచ్చరించారు. తన భూమినే కాజేయాలని ప్రయత్నిస్తున్నారంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి అరాచకాలను ఇటీవల టీడీపీ మహిళా నాయకురాలు స్వప్న బయటపెట్టారని గుర్తు చేశారు. కంటి వైద్యురాలి భర్తను పరుష పదజాలంతో దూషించిన ఆడియో వైరల్ అవుతోందన్నారు. ఓ ముస్లిం మహిళ అని కూడా దుర్భాషలాడిన ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఎస్సీని డిమాండ్ చేశారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై ఏకంగా దాడి చేసి దౌర్జన్యానికి పాల్బడ్డారని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించినప్పుడే .. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను తక్షణమే బర్తరఫ్ చేసి అనంతపురం నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడాలని డిమాండ్ చేశారు. మహిళలను కించరిచేలా మాట్లాడినందుకు వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాయాదవ్, కార్యదర్శి భారతి, ఎస్టీ సెల్ కార్యదర్శి శోభాబాయి, నగర ప్రధాన కార్యదర్శి ప్రసన్న, నగర కార్యదర్శి చంద్రకళ, ఎగ్జిక్యూటీవ్ మెంబర్ సుగుణ తదితరులు పాల్గొన్నారు. దండుపాళ్యం బ్యాచ్ ఆగడాలపై అప్రమత్తంగా ఉండాలి వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి డిమాండ్ -
జాతీయ స్థాయి సదస్సులో మోనాలిసా ప్రసంగం
వజ్రకరూరు: సామూహిక వనరుల సంరక్షణ అంశంపై హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ కార్యాలయంలో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థ, ఫౌండేషన్ ఫర్ ఎకాలజికల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలోమంగళవారం నిర్వహించిన సదస్సులో వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా ప్రసంగించారు. సామూహిక వనరుల సంరక్షణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అందుబాటులో యూరియా అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా 5,860 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జేడీఏ ముదిగల్లు రవి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ రబీలో 27,232 మెట్రిక్ టన్నుల యూరియా లక్ష్యంగా కాగా, ఇప్పటికే 24,450 మెట్రిక్ టన్నులు సరఫరా అయిందన్నారు. ఇందులో పంపిణీ పోనూ ప్రస్తుతం 5,860 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వివరించారు. కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టించినా, యూరియాను పక్కదారి పట్టించినా... అక్రమంగా నిల్వ చేసినా... ఎంఆర్పీకి మించి విక్రయాలు సాగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు రద్దు చేస్తామని ఎరువుల దుకాణదారులను హెచ్చరించారు. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం బ్రహ్మసముద్రం : మహిళల ఆర్థికాభివృధ్దే లక్ష్యంగా ఆర్డీటీ పనిచేస్తున్నట్లు ఆ సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, మహిళా సాధికారత డైరెక్టర్ విశా ఫెర్రర్ అన్నారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో మంగళవారం బ్రహ్మసముద్రంలో ప్రీతి మహిళా పరస్పర సహాయక సహకార పొదుపు పరపతి సంఘం లిమిటెడ్ బ్యాంక్ను వారు ప్రారంభించి, మాట్లాడారు. స్వయం సమృద్ధి, స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాలతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా వారికి సమాజంలో గౌరవం పెరుగుతుందన్నారు. సొంతంగా మహిళలే కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంక్ రుణ సదుపాయం కల్పిస్తుందన్నారు. అనంతరం మాంఛో ఫెర్రర్ దంపతులను స్వయం సహాయక సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సాగర్ మూర్తి, ఆర్డీలు సుబ్బారావు, మల్లికార్జున, ఏటీఎల్ ఓబులేసు, సుశీల, వెంకటేశులు, సీఓలు రామకృష్ణ, మలోబన్న, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న స్పెల్–బీ జిల్లా స్థాయి పోటీలు అనంతపురం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి స్పెల్–బీ పోటీలు ఆకట్టుకున్నాయి. పోటీల్లో జిల్లాలోని 68 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఈఓ ఎం.ప్రసాద్బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంగ్లిష్ బాష ప్రాముఖ్యతను వివరించారు. డీఈఓ కార్యాలయ ఏడీ మునీర్ ఖాన్, డీసీఈబీ కార్యదర్శి గంధమనేని శ్రీనివాసులు, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు. కాగా, జిల్లా స్థాయి పోటీల్లో ఆర్ నిఖిలేశ్వర్ ( 6వ తరగతి, ఏపీఎంఎస్ రాప్తాడు), ఎం.వెంకటలక్ష్మి (7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, గొడసలపల్లి), టి.లిఖిత్ (8వ తరగతి, భార్గవ్ రైల్వే స్కూల్, గుంతకల్లు), పి నందిత (9వ తరగతి, ఎస్ఆర్కే మునిసిపల్ స్కూలు, గుంతకల్లు), జ్ఞాన సాయి స్వరూప్ (10వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, హవళిగి), వై.వీణామాధురి (జూనియర్ ఇంటర్, ఏపీఎంఎస్, యల్లనూరు), ఎస్. షనవాజ్ (ఏపీఎంఎస్, గార్లదిన్నె) విజేతలుగా నిలిచారు. వీరిని అభినందిస్తూ సర్టిఫికెట్లను డీఈఓ అందజేశారు. కాగా, జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన వారిని ఈ నెల 22న జరిగే జోనల్ స్థాయి పోటీలకు పంపనున్నారు. పట్టపగలే బ్రాందీ షాపులో చోరీ గుత్తి: స్థానిక ఆర్ఎస్లోని మెయిన్ బజారులో ఉన్న బ్రాందీ షాపులో మంగళవారం పట్టపగలే చోరీ జరిగింది. ఉదయం 8.30 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు బ్రాందీ షాపు వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించారు. క్యాష్ బాక్సులో ఉన్న రూ. 2,500 నగదు అపహరించారు. చోరీ చేసి బయటకు వస్తున్న సమయంలో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితులను హైదరాబాద్కు చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన చోరీ చేస్తున్న దృశ్యాలను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
న్యాయ విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున కుమార్తె భవాని (19) ఆత్మహత్య చేసుకుంది. అనంతపురంలోని అశోక్ నగర్లో ఉన్న ప్రైవేట్ బాలికల హాస్టల్లో ఉంటూ నగరంలోని ఓ ప్రైవేటు లా కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఆమె మంగళవారం సాయంత్రం తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సహచర విద్యార్థినులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. భవాని మృతదేహాన్ని జీజీహెచ్లోని మార్చురీకి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వన్టౌన్ పీఎస్ ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లి.. కణేకల్లు: మండలంలోని యర్రగుంట శివారులో హెచ్చెల్సీలో చేపలు పట్టేందుకు వెళ్లిన కణేకల్లుకు చెందిన చాంద్బాషా (42) ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. కణేకల్లులోని మత్స్య కార్మికుల కాలనీలో నివాసముంటున్న చాంద్బాషా, మున్నీ దంపతులు కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం తన స్నేహితుడు ఉలిగప్పతో కలిసి యర్రగుంట శివారులోని హెచ్చెల్సీలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. కాలువలో వల వేసే క్రమంలో అదుపు తప్పి నీటిలో పడ్డాడు. ఈత రాకపోవడం, లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగిపోయాడు. సోమవారం సాయంకాలం వెళ్లిన భర్త మంగళవారం ఉదయమైనా రాకపోవడంతో భార్య మున్ని పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఉలిగప్పను విచారించగా జరిగిన ఘటనను వివరించాడు. మంగళవారం ఉదయం హెచ్చెల్సీలో తేలిన చాంద్బాషా మృతుదేహాన్ని వెలికి తీయించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లారీని ఢీకొన్న కారు బత్తలపల్లి: స్థానిక 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు.. చిత్తూరు నుంచి గుంతకల్లుకు వెళుతున్న కారు మంగళవారం తెల్లవారుజామున బత్తలపల్లి టోల్ఫ్లాజా వద్దకు చేరుకోగానే రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న గుంతకల్లులోని మదీనాబాద్ ప్రాంతానికి చెందిన వేణుగోపాల్, ప్రేమలత తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నవీన్కుమార్, చార్లెస్ వరప్రసాద్, షారూణ్ హర్ష సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స పొందిన అనంతరం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు పేర్కొన్నారు. -
అక్రమార్కుల్లో అలజడి
కళ్యాణదుర్గం: ఉపాధి హామీ పనుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 2024–25 ఏడాదికి సంబంఽధించి పూర్తయిన ఉపాధి పనులపై ప్రస్తుతం సామాజిక తనిఖీ జరుగుతోంది. అయితే తనిఖీల్లో లోపించిన పారదర్శకతపై ‘ఉత్తుత్తి తనిఖీలు’ శీర్షికన ఈ నెల 19న ‘సాక్షి’లో కథనం వెలువడడంతో జిల్లా స్థాయి ఉపాధి అధికారులు కళ్యాణదుర్గం నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఎక్కడా లేని విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అవినీతి జరిగిందంటూ సిబ్బందిపై డ్వామా పీడీ విరుచుకుపడినట్లు సమాచారం. ఈ అంశంపై రెండు రోజుల్లో విచారణ చేపట్టి వాస్తవాలు నిగ్గు తేల్చనున్నట్లు ఉద్యోగులను ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. అయితే జరిగిన అవినీతిని కప్పి పుచ్చుతారా? లేక బహిర్గతం చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. -
ఎమ్మెల్యే దగ్గుపాటి చిత్రపటాల దహనం
అనంతపురం అర్బన్: మహిళలను అగౌరవ పరిచేలా మాట్లాడుతున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ తీరును ఆక్షేపిస్తూ ఏపీ మహిళా సమాఖ్య నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ ముస్లిం మహిళపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం అనంతపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి చిత్రపటాలను దహనం చేశారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పార్వతీప్రసాద్, పద్మావతి మాట్లాడారు. మహిళలను అత్యంత అభినంగా గౌరవించిన గొప్ప నాయకుడు ఎన్టీరామారావు అని, అలాంటి మహానుభావుడి వారసులు గా చెప్పుకుంటూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న దగ్గుపాటి క్షమార్హుడని పేర్కొన్నారు. ఆయన ఇంట్లోనూ మహిళలు ఉంటారనే కనీస విచక్షణ, విజ్ఞత లేకుండా మాట్లాడుతుండడం సిగ్గుచేటన్నారు. ఽభూకబ్జాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు, మద్యం దందాలు, మహిళలకు కనీస గౌరవం ఇవ్వని ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా అనర్హుడని అన్నారు. దగ్గుపాటి తీరుపై ఈ నెల 21న విజయవాడలో మహిళా కమిషనర్ను కలసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నేత వరలక్ష్మి, నగర అధ్యక్షురాలు యశోదమ్మ, ఆజాబీ, ప్రమీల, జానకి, హసీనా, లీల, మస్తానమ్మ, పాల్గొన్నారు. -
ఉపాధి చట్టం పేరు మార్పు తగదు : సీపీఎం
గుత్తి/రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు తగదని, ఆ పేరును యథాతథంగా కొనసాగించాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. గుత్తిలో సోమవారం ఇంటింటికీ సీపీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్అండ్బీ బంగ్లా వద్ద బైక్ ర్యాలీని రాంభూపాల్ ప్రారంభించి, మాట్లాడారు. గుత్తి నుంచి ఊటకల్లు వరకూ బైక్ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఊటకల్లు, బేతాపల్లి, యంగన్నపల్లి, ధర్మాపురం, బాచుపల్లి, కరిడికొండ గ్రామాల్లో ఇంటింటికీ సీపీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చైతన్య పరిచారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి నిర్మల, సీనియర్ నాయకులు రేణుక, రేవతి, మల్లికార్జున, మల్లేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. బెళుగుప్పలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం బెళుగుప్ప: స్థానిక వెంకటనాయుడు రైస్ మిల్లు వద్ద కందుల కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి ఫృథీసాగర్ సోమవారం ప్రారంభించారు. మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయని చంద్రబాబు సర్కార్ తీరుపై ‘మద్దతు ఇవ్వని బాబు సర్కార్’ శీర్షికన ఈ నెల 14న ‘సాక్షి’లో వెలువడిన కథనానికి అధికారులు స్పందించి, కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. క్వింటా రూ.8వేల మద్దతు ధరతో కందులు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. నిబంధనలు వర్తిస్తాయన్నారు. అరటి పంటకు నిప్పు గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత పాటిల్ చంద్రశేఖర్రెడ్డి తనకున్న నాలుగు ఎకరాల్లో సాగు చేసిన అరటి తోటకు సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతుండడంతో గమనించిన చుట్టుపక్కల పొలాల్లోని రైతుల నుంచి సమాచారం అందుకున్న బాధిత రైతు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో మంటలు ఆర్పే లోపు రెండు ఎకరాల్లోని 300 చెట్లు, అరటి గెలలు కాలిపోయాయి. మరో రెండు రోజుల్లో కోత కోయాల్సిన తరుణంలో నిప్పు పెట్టడంతో రూ.3.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు వై.రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కుట్ర అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అండ చూసుకుని కొందరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
31 వరకు పశువైద్య శిబిరాలు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 వరకు పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆ శాక జేడీ డాక్టర్ ప్రేమ్చంద్ తెలిపారు. సోమవారం స్థానిక పశుశాఖ కార్యాలయంలో డీడీ డాక్టర్ వై.రమేష్రెడ్డి, డీఎల్డీఏ ఈఓ డాక్టర్ జి. వెంకటేష్, ఏడీలు శ్రీనివాసరావు, రాధిక, వీఏఎస్ డాక్టర్ గోల్డ్స్మన్ తదితరులతో కలసి ఆయన పోస్టర్లు విడుదల చేసి మాట్లాడారు. ప్రతి మండలంలో రెండు బృందాలు ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన వైద్య శిబిరాలు నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ముందరోజు ఆ గ్రామంలో దండోరా వేస్తారని, పాడి రైతులు, జీవాల కాపర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బావిలో పడి యువకుడి మృతి కుందుర్పి: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కుందుర్పి మండలంబెస్తరపల్లికి చెందిన గోవిందప్ప కుమారుడు రవికుమార్ (33) అవివాహితుడు. ఏడాదిగా మతి స్థిమితం లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ నెల11న బహిర్భూమికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన రవికుమార్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. బంధువుల ఊరికి వెళ్లి ఉంటాడని కుటుంబసభ్యులు భావించారు. సోమవారం ఉదయం గ్రామ శివారులోని బావిలో మృతదేహం తేలియాడుతుండడం గమనించిన గొర్రెల కాపర్ల సమాచారంతో గ్రామస్తులు వెళ్లి పరిశీలించారు. ఆనవాళ్లను బట్టి రవికుమార్గా గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెంది ఉంటాడని కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిట్టి చేతులు.. బరువైన పనులు బొమ్మనహాళ్: విద్యాబుద్ధులు నేర్పించే గురువులు గతి తప్పారు. బరువైన పనులను చిన్నారులతో చేయించి వివాదానికి తెరలేపారు. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి సెలవులు ముగియడంతో సోమవారం పాఠశాలను తెరిచారు. అయితే దుమ్ముతో పేరుకుపోయిన బెంచీలను చిన్నారులతో బయటకు మోయించారు. వాటిని శుభ్రం చేయించి, తడి బట్టతో తుడిపించి, తిరిగి తరగతి గదుల్లోకి మోయించారు. బరువైన బెంచీలను మోయలేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. బరువైన పనులను ఇతరులతో చేయించకుండా చిన్నారులతో చేయించడం వివాదానికి తెరదీసింది. మోయలేని స్థితిలో బెంచీ విద్యార్థుల కాళ్లపై పడితే బలమైన గాయం కావడం ఖాయమని, ఈ పనిని చిన్నారులతో కాకుండా ఇతరులెవరితోనైనా చేయించి ఉంటే బాగుండునని పలువురు పేర్కొన్నారు. -
విధులు సక్రమంగా నిర్వర్తించాలి
● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం టవర్క్లాక్: విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ మంచి పేరు గడించాలని పదోన్నతి పొందిన ఉద్యోగులకు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ సూచించారు. జెడ్పీ పరిధిలోని ఉమ్మడి జిల్లాకు చెందిన 54 మంది జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు పదోన్నతుల ఉత్తర్వులను సోమవారం జెడ్పీలోని తన చాంబర్లో గిరిజమ్మ అందజేసి, మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా ప్రమోషన్లు అందక జెడ్పీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ వచ్చారని అన్నారు. ఇటీవల డిప్యూటీ ఎంపీడీఓలకు ఎంపీడీఓలుగా, సీనియర్ అసిసెంట్లకు డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు కల్పించామన్నారు. తాజాగా 24 మంది టైపిస్టులు, 30 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించామన్నారు. కార్యక్రమంలో సీఈఓ శివశంకర్, ఏఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
పరిష్కార వేదికకు 122 వినతులు
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 122 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కాగా, సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ఇస్కాన్ సహకారంతో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. మహిళలు, చిన్నారుల సంరక్షణకు చర్యలు జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతకు విస్తృత చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సంరక్షణా కార్యదర్శులను ఎస్పీ జగదీష్ ఆదేశించారు. సోమవారం పోలీసు కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సచివాలయాల పరిధిలోని ఇళ్లను క్రమం తప్పకుండా సందర్శించాలన్నారు. సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. డయల్ 100, 112 సేవలు, మహిళా, బాలికల రక్షణా చట్టాలు, శక్తియాప్లపై చైతన్య పరచాలన్నారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన
● మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ శింగనమల: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. పార్టీ సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేసి చంద్రబాబు వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరుస్తామని పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ మండలాల అధ్యక్షులు, మండల అబ్జర్వర్లు, క్లస్టర్ గ్రామ పంచాయతీ అబ్జర్వర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకులు ఎల్.ఎం.మోహన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ.. పిన్నెళ్లిలో దళిత కార్యకర్త సాల్మన్ మృతి ఘటనలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆక్షేపించారు. రాష్ట్రంలో దళితులు, పేదలు, బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్సీపీ సహించదన్నారు. ఇప్పటికే ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేక వచ్చిందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరిచేలా సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మండల, గ్రామ స్థాయిలో బాధ్యతలు, స్పష్టత, సమన్వయం, ప్రజలతో నిరంతర అనుసంధానం ఉండేలా సంస్థాగత కమిటీలు పనిచేస్తాయన్నారు. ఈ నెల 25న గార్లదిన్నెలోని మర్తాడు క్రాస్లో ఉన్న టీ కన్వెన్షన్ హాల్లో శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరిమెల వంశీగోకుల్రెడ్డి, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ బొమ్మన శ్రీరామిరెడ్డి, ఎంపీపీ నాగేశ్వరావు, జెడ్పీటీసీ నీలం భాస్కర్, మండల కన్వీనర్లు గువ్వల శ్రీకాంత్రెడ్డి, ఖాదర్వలి ఖాన్, యల్లారెడ్డి, మహేశ్వరరెడ్డి, శివశంకర్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాలు, నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రా.. మజాకా!
● మంత్రి క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వ భవనాలు ● ఉన్నఫళంగా ఖాళీ చేయించిన వైనం ఉరవకొండ: ‘ఎవరేమనుకున్నా.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడినా... మేము మారము. మేమింతే’ అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ తనదైన మార్క్ను బయటపెట్టుకున్నారు. మంత్రా.. మజాకా అనే రీతిలో ఉన్నఫళంగా ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయించి తన క్యాంప్ కార్యాలయంగా మార్చేసుకున్నారు. ఇందుకు ఉరవకొండలోని వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన భవనం వేదికగా మారింది. పాలనా సౌలభ్యం కోసం బ్రిటీష్ పాలకులు కట్టించిన ఈ భవనాలు నేటికీ చెక్కు చెదరలేదు. దశాబ్దాలుగా ఈ భవనాల్లో రెవెన్యూ, సబ్ ట్రెజరీ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఈ భవనాల్లోనే వీఆర్ఓల కార్యాలయం కూడా ఉంది. మంత్రి క్యాంపు కార్యాలయానికి పట్టణంలో చాలా భవనాలు అందుబాటులో ఉన్నాయి. అయినా పట్టుబట్టి ఈ భవనాలనే ఎంచుకుని మరీ ఖాళీ చేయించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మంత్రి పోరు పడలేక అధికారులు తలలు పట్టుకున్నారు. గత్యంతరం లేని స్థితిలో కొన్నేళ్లుగా మూతపడిన ఉరవకొండ సబ్ జైలు భవనంలోకి రెవెన్యూ రికార్డులను చేర్చారు. ప్రస్తుతం సబ్ జైలు భవనంలోనే రెవెన్యూ అధికారులు విధులు నిర్వర్తిస్తూ డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇక సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని వివేకానంద ఇంగ్లిష్ మీడియం స్కూల్ పక్కన ఉన్న పురాతన భవనంలోకి రాత్రికి రాత్రే మార్చేశారు. గతంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ రెండు కార్యాలయాలు ఎంతో అనువుగా ఉండేవి. ప్రస్తుతం ఈ రెండు కార్యాలయాలను సుదూరంగా మార్చేడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పవని పలువురు పేర్కొంటున్నారు. -
ఆలకించండి.. ఆదుకోండి
● సమస్యలపై పోటెత్తిన ప్రజలు ● పరిష్కార వేదికలో 390 వినతులు ● ఈ దివ్యాంగుని పేరు గట్టు శ్రీరాములు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీ బీజేపీ కాలనీలో నివాసముంటున్నాడు. 2023లో బ్రెయిన్కు ఆపరేషన్ జరిగింది. 2024 ఫిబ్రవరి 13న 45 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. ఎడమ చేయి పూర్తిగా పనిచేయదు. చేతికర్ర ఆసరా లేనిదే నడవలేడు. పింఛను కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని వాపోయాడు. అధికారులను అడిగితే కలెక్టరేట్కు వెళ్లాలని చెప్పడంతో ఇక్కడకు వచ్చానన్నాడు. అనంతపురం అర్బన్: వివిధ సమస్యలపై అర్జీదారులు పోటెత్తారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు ప్రజల నుంచి 390 అర్జీలు స్వీకరించారు. ఇందులో చాలామంది పింఛన్ కోసం అర్జీలు అందజేశారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో ఇన్చార్జ్ కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అర్జీల్లో కొన్ని... ● వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామం బీసీ కాలనీకి చెందిన వడ్డే ఆంజనేయులు విన్నవించాడు. తన వయసు 66 ఏళ్లు దాటిందని చెప్పాడు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదన్నాడు. దయచూపి పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కోరాడు. ● చేనేత పింఛను మంజూరు చేయాలని తాడిపత్రి పట్టణం రాగితోటపాళెంకు చెందిన వి.లక్ష్మినరసింహులు కోరాడు. తాను చేనేత పనిచేస్తూ జీవనం సాగిస్తున్నానని చెప్పాడు. పని అంతంతమాత్రంగా ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపాడు. పింఛను మంజూరు చేస్తే కొంత ఊరట కలుగుతుందని వేడుకున్నాడు. -
25న పెన్నహోబిలంలో రథసప్తమి వేడుకలు
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో ఈ నెల 25న రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ ఈఓ తిరుమల్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రథసప్తమి రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నృసింహస్వామి మూలవిరాట్లకు ప్రత్యేక పంచామృతాభిషేకాలు, సహస్త్రనామార్చన, సూర్యప్రభ, గోవాన, హనుమంత, గరుడ వాహనోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ ఇన్చార్జ్ ఈఓ తెలిపారు. భద్రతా ప్రమాణాలు లేవు ● స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ తనిఖీలో తేల్చిన అధికారులు బొమ్మనహాళ్: నేమకల్లు శివారులోని రామాంజినేయ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో జిల్లా అధికారులు తనిఖీలు చేపట్టారు. కన్వేయర్ బెల్టు దగ్గర ప్రెజర్ వీల్ విడిపోయి బలంగా తగలడంతో నరసింహులు అనే హెల్పర్ మృతి చెందిన విషయం విదితమే. ‘ఫ్యాక్టరీల్లో భద్రత గాలికి’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి డీసీఐఎఫ్ రాధాకృష్ణ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మురళీ కృష్ణ, ఏఎస్ఐ హనుమంతరెడ్డి స్పందించి సోమవారం రామాంజినేయ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. హెల్పర్ చనిపోయిన ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించారు. ఫ్యాక్టరీలో కార్మికుల భద్రతకు ఎలాంటి రక్షణ పరికరాలు అందుబాటులో లేవని, కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ప్రాథమికంగా నిర్ధారించారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు లేవని, మృతి చెందిన కార్మికునికి ఆ సౌకర్యాలు ఉంటే కుటుంబానికి ఇన్సూరెన్స్ వచ్చేదన్నారు. ప్రమాదం జరిగిన చోట విద్యుత్ లైట్లు కూడా లేకపోవడం ఏమిటని యజమాన్యాన్ని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. విద్య.. దేశ నిర్మాణానికి దోహదపడాలి అనంతపురం: ‘విద్య కేవలం డిగ్రీలకే పరిమితం కాకూడదు. దేశ నిర్మాణానికి దోహదపడినపుడే నిజమైన విద్య’ అని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు వీసీ ప్రొఫెసర్ ఎన్.కృష్ణన్ అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలోని మాలవ్య మిషన్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ‘పాఠ్యక్రమంలో భారతీయ జ్ఞాన పరంపర – సమన్వయం’ అనే అంశంపై ఆరు రోజుల కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ఎన్.కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉన్నత విద్య డిగ్రీల ప్రదానానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యత, దేశ నిర్మాణం దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తిరువళ్లువర్ రచనలు, అలాగే కర్ణాటక సంగీత త్రయం అయిన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి సంప్రదాయాలను ఉదహరిస్తూ, నైతికత, సంస్కృతి, దైనందిన జీవన విధానాల రూపకల్పనలో భారతీయ జ్ఞాన పరంపర శాశ్వత ప్రాసంగికతను వివరించారు. ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన సెంట్రల్ వర్సిటీ ఆఫ్ ఏపీ వీసీ కోరి మాట్లాడుతూ భారతీయ జ్ఞాన పరంపర అనుభవాత్మక, సమగ్ర విద్యకు బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. దేశంలోని విద్యావంతులలో యువత సుమారు 60 శాతం ఉన్న నేపథ్యంలో, సమకాలీన సామాజిక, నైతిక, సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవడానికి, సుస్థిర జాతీయ అభివృద్ధిని సాధించడానికి ఏఐ సమన్వయం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు డీన్ ప్రొఫెసర్ సి.షీలారెడ్డి మాట్లాడారు. డాక్టర్ సరళ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. -
ప్రభుత్వ విద్య మిథ్యే!
అనంతపురం: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ విద్య మిథ్యగా మారిపోతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో అడ్మిషన్లు తగ్గిపోయాయి. బడి బయటి పిల్లలను సైతం పట్టించుకోవడం లేదు. ఇదే క్రమంలో పైవేట్ స్కూళ్లల్లో అడ్మిషన్లు పెరగడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 3,362 మంది విద్యార్థులు డ్రాపౌట్స్గా ఉన్నారు. ఒక్క అనంతపురం నగరంలోనే 820 మంది డ్రాపౌట్ కావడం విద్యా శాఖ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. గుంతకల్లులో 416, రాయదుర్గం 216, తాడిపత్రిలో 204, కళ్యాణదుర్గం పరిధిలో 154 మంది డ్రాపౌట్స్ ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఉపాధి కోసం పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు వలస వెళ్లడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ పాఠశాలలకు హాజరు కాకుండా తల్లిదండ్రుల వద్దే ఉంటూ చిన్నా,చితకా పనులకు వెళ్తున్నారు. వీరందరూ బడి బయట పిల్లలు. డ్రాపౌట్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ ఏదీ? డ్రాపౌట్ పిల్లలకు ప్రత్యామ్నాయంగా విద్యను అందించాల్సిన గురుతర బాధ్యత పాఠశాల విద్యా శాఖదే. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. తరగతితో సంబంధం లేకుండా ఏ వయస్సులో ఉంటారో ఆ తరగతిలో నేరుగా అడ్మిషన్ కల్పించాల్సి ఉంటుంది. డ్రాపౌట్స్ను పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. ప్రైవేట్ పాఠశాలలను ఓ వైపు ప్రోత్సహిస్తూ.. మరో వైపు ప్రభుత్వ పాఠశాలలను విస్మరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోయేలా ఉన్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా సంస్కరణలు అమలు చేసింది. ఈ క్రమంలోనే సీబీఎస్ఈ స్కూళ్లను ప్రవేశపెట్టారు. 2024 జూన్ నుంచి వీటిని ఒక్కొక్కటిగా చంద్రబాబు సర్కార్ రద్దు చేసింది. పేద పిల్లలను ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ‘టోఫెల్’ను రద్దు చేశారు. ఐబీ సిలబస్ను ఆరంభంలోనే నిలిపివేశారు. విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడాన్ని ఆపేశారు. మన బడి నాడు–నేడు పనులను ఒక్క అడుగు కూడా మందుకు పడనీయలేదు. మధ్యాహ్న భోజనం నాణ్యతను గాలికి వదిలేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పెరిగిన చేరికలు ● 2024–25లో ఒకటో తరగతిలో 37,465 మంది విద్యార్థులు ఉండగా.. 2025–26 విద్యా సంవత్సరానికి 36,412 మందికి తగ్గిపోయారు. అంటే 1,053 మంది ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లారు. రెండో తరగతిలో 37,645 మంది ఉండగా, 36,828 మందికి తగ్గి, 637 మందిప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరారు. ప్రతి తరగతిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 4,38,247 మంది విద్యార్థులు ఉండగా, ఒక్క ప్రైవేట్ పాఠశాలల్లోనే 2,28,691 మంది చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2,09,556 మంది విద్యార్థులు చదువుతున్నారు. 10,500 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో కంటే అరకొరగా ఉపాధ్యాయులు ఉండే ప్రైవేట్ పాఠశాలల్లోనే అధికంగా విద్యార్థులు ఉండడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న ప్రవేశాలు చంద్రబాబు ప్రభుత్వంలో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు బడి బయట పిల్లల పరిస్థితిని పట్టించుకోని దుస్థితి 3,362 మంది విద్యార్థులు వలస వెళ్లినా పట్టని విద్యాశాఖ -
జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. చలి వాతావరణం కొనసాగుతోంది. తూర్పు దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
నిజాలు నిగ్గుతేలేనా..? ● నిధుల దుర్వినియోగంపై గుట్టుగా విచారణ తాడిపత్రిటౌన్: గ్రామపంచాయతీల్లో నిధుల దుర్వినియోగంపై జిల్లాస్థాయి అధికారుల విచారణ గుట్టుగా జరుగుతుండటం విమర్శలకు తావిస్తోంది. నిజాలు నిగ్గు తేల్చకుండా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల నేపథ్యంలో విచారణను మమ అనిపిస్తారేమోనన్న చర్చ జరుగుతోంది. తాడిపత్రి మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనుల పేరిట అధికార పార్టీ నాయకులు చేయని పనులకు బిల్లులు చేసుకుని రూ.5 కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గత నెల 29న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. సమగ్ర విచారణకు అధికారులను ఆదేశించింది. అయితే విచారణ రెండుదఫాలు వాయిదా పడింది. ఈ క్రమంలో ఎవ్వరికీ తెలపకుండా శనివారం జిల్లా అధికారులు మండలపరిషత్ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. గంగాదేవిపల్లి, ఊరుచింతల, తేరన్నపల్లి, ఇగుడూరు, భోగసముద్రం, దిగువపల్లి, చల్లవారిపల్లి, గన్నెవారిపల్లి తదితర 13 పంచాయతీలలో 2024 నుంచి 2026 వరకు జరిగిన అభివృద్ధి పనులు, వాటి బిల్లులకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలని ఆయా పంచాయతీల కార్యాదర్శులను కోరినట్లు తెలిసింది. అయితే విచారణ అత్యంత గోప్యంగా సాగుతుండటం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నాయకులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా విచారణ నివేదిక రూపొందించనున్నట్లు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. -
యుగపురుషుడు యోగి వేమన
అనంతపురం కల్చరల్: తెలుగు జాతి యుగపురుషుడు యోగి వేమన జీవితం ఆదర్శప్రాయమని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రజాకవి వేమన జయంతి సోమవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న వేమన విగ్రహం వద్ద రెడ్డి సంఘాల ప్రతినిధులు, రచయితలు, కవులు, వివిధ రాజకీయపార్టీల నాయకులతో పాటు వందలాది మంది సాహితీ అభిమానులు నీరాజనాలర్పించారు. యోగి వేమన రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో ఉదయం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటూ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి ఆత్మా రామిరెడ్డి, అనంత చంద్రారెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, సంఘం కార్యదర్శి ‘రూట్స్ స్కూల్’ గోపాలరెడ్డి, తదితరులు మాట్లాడారు. ఆటవెలది పద్యాలతో జన చైతన్యం తెచ్చిన సంఘ సంస్కర్త వేమన జీవితాన్ని అన్ని తరాల వారు గుర్తుంచుకునేలా విస్తృత ప్రచారం చేయాలని తీర్మానించారు. జయంతి, వర్ధంతులను రాష్ట్ర పండుగలా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో యోగా కేంద్రం అధ్యక్షులు మెళవాయి రాజశేఖరరెడ్డి, కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజీఆర్ గోపాలరెడ్డి, నరసింహారెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో ఈ ఏడాది ఉద్యాన పంటలు, వాటి క్రయవిక్రయాల ద్వారా రూ.21,149 కోట్ల టర్నోవర్ జరుగుతుందని, ఆ మేరకు ‘గ్రాస్ వాల్యూ యాడెడ్–జీవీఏ’ రానుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయడంపై అటు ఉద్యానశాఖ, ఇటు రైతులు ఆశ్చర్యంతో పాటు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వేల
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల పరిధిలో ఉద్యాన ఉత్పత్తుల ద్వారా ఈ ఏడాది రూ.1,77,422 కోట్ల స్థూల విలువ (గ్రాస్ వాల్యూ యాడెడ్–జీవీఏ) ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో రూ.21,149 కోట్లతో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో రూ.13,456 కోట్ల అంచనాతో శ్రీసత్యసాయి జిల్లా ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాగా ఉన్నప్పుడు ఏనాడూ రూ.15 వేల కోట్లకు మించింది లేదు. మరి ఇపుడు రెండు జిల్లాలకు ఏకంగా రూ.35 వేల కోట్ల వరకు జీవీఏ రానుందని లెక్క వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా ఈ ఏడాది పొడవునా చీనీ టన్ను గరిష్ట ధర రూ.20 వేలకు మించలేదు. సరాసరి రూ.15 వేలతో అమ్ముడుబోవడంతో రైతులు భారీగా నష్టపోయారు. అలాగే రెండు నెలల పాటు అరటి టన్ను ధర రూ.2 వేలు దాటలేదు. ఇక ఎండుమిరప ధర కూడా భారీగా పతనమైంది. బొప్పాయి, కళింగర, కర్బూజ లాంటి వాటి ధరలు సైతం తగ్గాయి. మామిడి టన్ను రూ.20 వేల కన్నా ఎక్కువ పలికిన దాఖలాలు లేవు. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో అంత భారీ స్థాయిలో టర్నోవర్ ఎలా సాధ్యం అవుతుందో అధికారులు, పాలకులే చెప్పాలి. మొత్తం మీద రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ఆశించి అంచనాలు వేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఆ తర్వాత రూ.13,444 కోట్లతో వైఎస్సార్ కడప, రూ.10,690 కోట్ల జీవీఏతో కర్నూలు, రూ.10,572 కోట్లతో అన్నమయ్య, రూ.8,096 కోట్లతో నంద్యాల, రూ.7,012 కోట్లతో చిత్తూరు, రూ.4,395 కోట్లతో తిరుపతి ఉండటం గమనార్హం. ఉత్తుత్తి లెక్కలేనా..? అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ–క్రాప్ నివేదిక ప్రకారం ఈ ఏడాది 100 రకాల వరకు ఉద్యాన పంటలు సాగు చేశారు. అందులో 30 రకాల పండ్లతోటలు, 50 రకాల వరకు కూరగాయలు, ఆకుకూర పంటలు, మరో 20 రకాల వరకు పూలు, ఔషధ పంటలు సాగు చేశారు. మొత్తంగా 3.15 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. వాటి ద్వారా 28 లక్షల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల ఫలసాయం రానుందని ఉద్యాన శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది ఫిబ్రవరి 5న నిర్వహించిన ‘హార్టికల్చర్ కాంక్లేవ్’లో ఐదు ప్రధాన పంటలను ‘గ్రోత్ ఇంజిన్లు’గా గుర్తించి వాటి ద్వారా జీవీఏ అధికంగా రానుందని లెక్క వేశారు. అందులో చీనీ ద్వారా ఏటా రూ.1,562 కోట్లు, ఎండు మిరప ద్వారా రూ.1,205 కోట్లు, అరటి ద్వారా రూ.1,204 కోట్లు, టమాట ద్వారా రూ.997 కోట్లు, మామిడి ద్వారా రూ.567 కోట్ల మేర జీవీఏ లెక్కవేశారు. ప్రధానంగా గుర్తించిన ఈ ఐదు పంటల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఫలసాయం వస్తుండగా.. వాటి ద్వారా టర్నోవర్ లెక్కేసినా రూ.5,535 కోట్లు మాత్రమే. ఏ రకంగా చూసినా రూ.21,149 కోట్లు ఎలా సాధ్యమనేది అంతుచిక్కడం లేదని ఆ శాఖ వర్గాలతో పాటు రైతులు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మిరప సాగు సగానికి పైగా తగ్గిపోయింది. మిరప ద్వార అంచనా వేసిన రూ.1,205 కోట్లలో రూ.300 కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి ఎలా రూ.21 వేల కోట్లకుపైగా సాధ్యమవుతుందనేది అర్థం కావడం లేదు. ఏ పంట ద్వారా ఏ మేర జీవీఏ అంచనా వేశారనే దానిపై ఉద్యానశాఖ వద్ద వివరాలు కూడా లేకపోవడం చూస్తే... ప్రభుత్వం ఉత్తుత్తి లెక్కలు వేసిందనేది స్పష్టమవుతోంది. జిల్లా ఉద్యాన పంట ఉత్పత్తుల టర్నోవర్ అంచనా రూ.21,149 కోట్లు ఇందులో రూ.10 వేల కోట్లు అయినా చేరుకుంటుందా అన్నది సందేహమే గ్రోత్ ఇంజిన్లుగా చీనీ, మామిడి, అరటి, మిరప, టమాట గుర్తింపు -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 13 మందికి తీవ్ర గాయాలు
నల్లమాడ: మండల పరిధిలోని పులగంపల్లి సమీపాన ఆదివారం సాయంత్రం ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన మేరకు.. కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో హిందూపురం వెళ్తోంది. మార్గమధ్యంలో పులగంపల్లి దాటిన తరువాత రోడ్డు మలుపులో ఓడీ చెరువు వైపునుంచి కదిరికి వస్తున్న సిమెంట్ లారీ, బస్సు పరస్పరం ఢీకొన్నాయి. ఈ క్రమంలోనే బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి రక్తగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఎన్పీ కుంట మండలం పెడబల్లికి చెందిన కాల్వపల్లి గంగాదేవి, గోరంట్ల మండలం కలిగేరికి చెందిన ఎం. నాగరాజు, నల్లమాడ మండలం ఆదిఆంధ్రపల్లికి చెందిన వీ. ఉమాదేవి, కదిరి కుమ్మరవాండ్లపల్లికి చెందిన కే. వెంకటనారాయణమ్మ, హిందూపురం ప్రశాంతి నగర్కు చెందిన ఎం. సాయి సందీప్, ఎం. లక్ష్మి, పందలకుంటకు చెందిన కే. శాంతమ్మ, కే. ముసలరెడ్డి, ఎన్. సాహిత్య, కదిరి శివాలయం వీధికి చెందిన కే.మహమ్మద్, కొండకమర్లకు చెందిన మహబూబ్ బీ, పఠాన్ షబానా, రాయచోటికి చెందిన కే. అయూబ్ ఖాన్, కే. షాహానా ఉన్నారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. సమాచారం తెలుసుకున్న పులగంపల్లి, కాయలవాండ్లపల్లి, బొగ్గిటివారిపల్లి గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మానవత్వం చాటుకున్న మక్బూల్.. వైఎస్సార్ సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ మానవత్వం చాటుకున్నారు. పులగంపల్లి వద్ద ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న ఆయన ఘటనా స్థలంలో క్షతగాత్రుల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. తక్షణమే 108కు ఫోన్ చేసి క్షతగాత్రులను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. -
అడిగేదెవరు.. అడ్డుకునేదెవరు...
● ధనార్జనే ధ్యేయంగా ఇసుక దందా ● ‘పచ్చ’నేత కనుసన్నల్లోనే దోపిడీ సాక్షి, టాస్క్ఫోర్స్: జిల్లాలోని కర్ణాటక సరిహద్దున ఉన్న బొమ్మనహాళ్ మండలంలో టీడీపీ ముఖ్య నాయకుడు కనుసన్నల్లో ఇసుక అక్రమ దందా ఊపందుకుంది. ధనార్జనే ధ్యేయంగా రేయింబవళ్లూ ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ముందు నుంచే ఇసుక అక్రమ తరలింపులు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కణేకల్లు మండలం రచ్చుమర్రి, గుండ్లపల్లి క్రాస్ వద్ద వేదావతి హగరి నదిలోని ఇసుకను టిప్పర్లలో లోడు చేసి బొమ్మనహాళ్ మీదుగా సరిహద్దు దాటించి బళ్లారి సమీపంలో పెద్ద ఎత్తున డంప్ చేశారు. రోజూ 30 నుంచి 40 టిప్పర్లకు పైగా ఇసుక తరలిస్తున్నట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కో టిప్పర్ రూ.లక్షకు పైగా విక్రయిస్తున్నట్లుగా సమాచారం. ‘అధికారం మాది.. అడిగేదెవరూ.. అడ్డగించేదెవరూ’ అనే రీతిలో టీడీపీ నేత రెచ్చిపోతుండడంతో అధికారులు మిన్నకుండి పోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఇసుక అక్రమ తరలింపులపై బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరసూల్ మాట్లాడుతూ.. అవసరాలకు కాకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని అన్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ సరిహద్దులు దాటి ఇసుక టిప్పర్లు వెళ్లలేదని పేర్కొన్నారు. -
ఉత్తుత్తి తనిఖీలు
కళ్యాణదుర్గం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు వెలుగు చూడకుండా స్థానిక టీడీపీ నేతల కుట్రలకు అధికారులు, సిబ్బంది వత్తాసు పలికారు. ఇందుకు ఏకంగా సామాజిక తనిఖీ బృందాలను లోబర్చుకుని భారీ దోపిడీకి ఎత్తుగడ వేశారు. దీంతో నియోజకవర్గంలో తనిఖీ బృందాల అక్రమాలు నానాటికీ పేట్రేగిపోతున్నాయి. నియోజకవర్గంలో అధికంగా టీడీపీ కార్యకర్తలే ఫీల్డ్ అసిస్టెంట్లుగా అవతారమెత్తి అందిన కాడికి దోచిన వైనంపై సాక్ష్యాధారాలతో ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో 2024–25 ఏడాదికి సంబంధించి కళ్యాణదుర్గం రూరల్, కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల్లో రూ.61.86 కోట్లతో పూర్తి చేసిన పనులకు ప్రస్తుతం సామాజిక తనిఖీ జరుగుతోంది. సామాజిక తనిఖీల పేరుతో అడ్డగోలు యవ్వారం.. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగే అక్రమాలు గుర్తించడంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సామాజిక తనిఖీ బృందాలది కీలకపాత్ర. పని ప్రాంతంలో లేని కూలీల పేరుతో వేతనాలు కాజేసినా, తప్పుడు హాజరుతో అక్రమాలకు పాల్పడినా, తక్కువ విస్తీర్ణంలో చేసిన పనిని ఎక్కువ విస్తీర్ణంగా చూపి నిధులు నొక్కేసినా ఈ సామాజిక తనిఖీ బృందాలు గుర్తించి తగిన చర్యలకు సిఫారసు చేస్తాయి. అయితే సామాజిక తనిఖీల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన సామాజిక తనిఖీ బృందాలు ఒక్కో పంచాయతీ పరిధిలో చేసిన పనుల విలువ ఆధారంగా గరిష్టంగా రూ. 2 లక్షల వరకూ ముడుపులు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో పనుల్లో లోపాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అధికారులకు అనుమానం రాకుండా ఒకటి, రెండు పనుల్లో చిన్నపాటి లోపాలున్నట్లు చూపించి మమ అనిపిస్తున్నారు. తాము కోరిన మేరకు డబ్బు ఇవ్వని ఫీల్డ్ అసిస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నారు. కూలీల మస్టర్లలో దిద్దుబాట్లు ఉన్నాయని, తక్కువ పనిని ఎక్కువగా చూపించారంటూ తప్పుడు నివేదికలు రాస్తున్నారు. తప్పనిసరిగా నిర్వహించాల్సిన ఏడు రికార్డులు అందుబాటులో లేవంటూ క్షేత్రస్థాయి సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. ముడుపులతో అవినీతిని కప్పిపెడుతున్న వైనం.. గతంలో సామాజిక తనిఖీలకు వెళ్లేటప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది భోజనం ఏర్పాటు చేసినా బృందం సభ్యులు తిరస్కరించేవారు. వాళ్లే సొంతంగా వసతి ఏర్పాట్లు చేసుకునేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనిఖీ బృందం సభ్యుల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. తమకు వసతి, భోజన సదుపాయం కల్పించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశిస్తున్నారు. పనులను తనిఖీ చేసే ప్రాంతంలోనే బహిరంగంగానే కమీషన్లు దండుకుంటున్నారు. లక్ష రూపాయల విలువైన పనికి రూ.10 వేలు చొప్పున కమీషన్ను ఇవ్వాల్సిందేనని ఫీల్డ్ అసిస్టెంట్లను డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సామాజిక తనిఖీ బృందాల బెడద పడలేక ఫీల్డ్ అసిస్టెంట్లు తప్పనిసరి పరిస్థితుల్లో వారికి కమీషన్లు ముట్టజెబుతున్నట్లుగా సమాచారం. ఈ సొమ్మును తిరిగి సంపాదించుకునేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు సైతం అడ్డ దారులు తొక్కుతున్నారు. ఈ అడ్డగోలు యవ్వారం మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగుతున్నట్లుగా ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. సామాజిక తనిఖీల మాటున దోపిడీ క్షేత్ర స్థాయి పరిశీలనలకు తిలోదకాలు ముడుపులతో అవినీతిని కప్పిపెడుతున్న వైనం మొక్కుబడి తనిఖీలతో మమ అనిపిస్తున్న టీడీపీ నేతలు -
జల విద్యుత్ ఉత్పత్తిపై నీలి నీడలు
కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తిపై నీలి నీడలు వీడలేదు. టర్బైన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో గత ఏడాది నవంబర్ 22 నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేశారు. మరమ్మతులకు స్థానిక సాంకేతిక నిపుణులు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో తుంగభద్ర డ్యాం గేటును డిజైన్ చేసిన నిపుణుల బృందం వచ్చి మరమ్మతులు పూర్తి చేసింది. ఆ సమయంలో అధికారులు ట్రయల్ రన్ చేసి టర్బైన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయినా జల విద్యుత్ ఉత్పత్తిని అధికారులు చేపట్టలేదు. వేసవిలో తాగునీటి ప్రాజెక్టులకు నీటి కొరత తలెత్తకుండా జలవిద్యుత్ ఉత్పత్తికి నీటి పారుదల శాఖ అధికారులు అంగీకరించడం లేదని జెన్కో ఏడీ కేశవయ్య ఆదివారం తెలిపారు. నీటి గుంతలో పడ్డ ఐదేళ్ల చిన్నారి ఉరవకొండ: ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడ్డాడు. సకాలంలో కుటుంబసభ్యులు గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాలు... ఉరవకొండలోని భద్రప్ప బావి వద్ద తాగునీటి పైప్లైన్లో డ్త్రెనేజీ నీరు కలుస్తుండడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరమ్మతు చేపట్టారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం పెద్ద గుంతను తీసి నాలుగు రోజుల క్రితం మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం గుంతను పూడ్చకుండా అలాగే వదిలేశారు. ఆదివారం ఉదయం ఐదేళ్ల చిన్నారి ప్రణీత్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తన ఇంటి ఎదురుగా ఉన్న సదరు గుంతల్లో పడిపోయాడు. నీటిలో మునిగిపోతుండగా గమనించిన ఏడేళ్ల వయసున్న అన్న లింగేష్ వెంటనే ప్రణీత్ జట్టు పట్టుకుని గట్టిగా కేకలు వేయడంతో తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని చిన్నారిని వెలికి తీశారు. మరికొద్ది నిమిషాలు ఆలస్యమై ఉంటే చిన్నారి ప్రాణాలు ప్రమాదంలో పడేవని కాలనీ వాసులు వాపోయారు. విషయం తెలుసుకున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అక్కడకు చేరుకోవడంతో కాలసీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటీఎం దొంగ అరెస్ట్ తాడిపత్రి రూరల్: స్థానిక కడప మార్గంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోని కియోస్క్ను పెద్ద బండరాయితో పగులకొట్టే ప్రయత్నం చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి రూరల్ అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరుకు చెందిన దుర్గానాయుడు, తన తండ్రితో కలసి పని కోసం తాడిపత్రికి వచ్చాడు. వ్యసనాలకు బానిసైన దుర్గానాయుడు జల్సాలు తీర్చుకునేందుకు ఈజీ మనీ కోసమని ఆదివారం తెల్లవారుజామున ఏటీఎంలోని యంత్రాన్ని ధ్వంసం చేసి డబ్బు అపహరించేందుకు ప్రయత్నించాడు. విషయాన్ని గుర్తించిన ముంబయిలోని సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకోగానే దుర్గానాయుడిని అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. విచారణ అనంతరం దుర్గానాయుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘క్రైస్తవులపై దాడులు అమానుషం’
అనంతపురం కల్చరల్: రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ నెల 4న కొర్రకోడులో క్రైస్తవులపై, చర్చి వ్యాన్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆదివారం సాయంత్రం నగరవీధుల్లో ఐక్య క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో కోర్టురోడ్డు గాస్పెల్హాలు నుంచి ఎస్ఐయూ చర్చి వరకు ర్యాలీ జరిగింది. వైఎస్సార్సీపీ క్రిస్టియన్ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు, గాస్పల్హాల్ సంఘ కాపరి వరప్రసాదరెడ్డి, వైఎస్ థామస్రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, వైఎస్సార్ కడప జిల్లా నుంచి విచ్చేసిన పాస్టర్ అభినయ్, సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ ఉపాధ్యక్షుడు డాక్టర్ బెన్హర్బాబు, పాస్టర్లు జాన్ విజయ్కుమార్, మోసెస్ అనిల్కుమార్, మనుష్యే, రెడ్డివారి నెహమ్యా నాగరాజు తదితరులు మాట్లాడారు. దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడడంతో వారు యథేచ్ఛగా తిరుగుతున్నారని, ఈ చర్యల కారణంగా మరోసారి దాడి జరగదన్న గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికై నా మతోన్మాదులను కఠినంగా శిక్షించి, ప్రత్యేక జీఓ ద్వారా క్రైస్తవులకు రక్షణ కల్పించాలని డిమాండు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తమ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గాస్పెల్ హాలు ప్రతినిధులు ఆదినారాయణ, హెరాల్డ్, దేవవరం, ప్రసాదు, ఆప్సా, డేనియల్, బైబిల్ మిషన్ బందెల రాజు, విజయకుమారి, గుత్తి చర్చి నుండి విచ్చేసిన జాకోబు, సాల్మన్రాజ్, అబ్రహాం, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జానీ, బ్రదర్ సతీష్, చర్చి సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏఐసీసీ, ఏఐసీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆటవెలదులే ఆయుధంగా..
భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వంబు తానౌను విశ్వదాభిరామ ! వినుర వేమ ! .. అంటూ కార్మిక, శ్రామిక గొప్పతనాన్ని, వివరించిన ప్రజాకవి యోగి వేమన.. తనదైన సాహిత్యంలో ఆటవెలదులనే ఆయుధంగా మార్చుకుని అంధ విశ్వాసాలపై సంధించిన అస్త్రాలు నేటికీ బహుళ ప్రాచుర్యంలో నిలిచాయి. అభ్యుదయ భావజాలంతో సాగిన యోగి వేమన సాహిత్యానికి తొలి నుంచి అనంత వాసులు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేమన జయంతిని సోమవారం స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తున్నారు. అనంతపురం కల్చరల్: వేమన సాహిత్యం ఆద్యంతం విలక్షణంగా సాగింది. మత మౌఢ్యాన్ని ప్రచారం చేసే వారిపై వందల ఏళ్ల క్రితమే విరుచుకుపడి జనంలో చైతన్యం తీసుకువచ్చారు. మధ్యయుగంలో జీవించిన వేమన కేవలం కవిగానే కాకుండా సంస్కరణాభిలాషిగా, కులాలను నిరసించిన మానవతామూర్తిగా, పరభాషా ఆధిపత్యాన్ని ప్రశ్నించిన తిరుగుబాటుదారుడిగా తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. పరిశోధకులకు దిక్సూచి.. వేమన పద్యాలపై సుప్రసిద్ధ కవి అనంత కృష్ణామాచార్యులు సుదీర్ఘ పరిశోధనలు చేసి ‘వేమన’ గ్రంథాన్ని వెలువరించారు. అదే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పరిశోధకులకు దిక్సూచిగా నిలిచింది. తెలంగాణకు చెందిన డాక్టర్ పొన్నగంటి హనుమంతరెడ్డి గతంలో అనంతకొచ్చి ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ‘వేమన కవితా సౌందర్యం’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. శ్రీసత్యసాయి జిల్లా కటారుపల్లిలో వేమనకు ఆలయం ఉండగా.. 1980లో నగరంలోని చెరువుకట్టపై వేమన ఆలయం నిర్మించారు. అయితే పాలకుల నిర్లక్ష్యం కారణంగా అది కాస్త శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలో ఆ ఆలయాన్ని వేమన అభిమానులు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. అనంతపురంలోని టెలీభవన్కు ‘వేమన’ పేరు పెట్టుకుని గౌరవాన్ని చాటుకున్నారు.అలాగే టవర్క్లాక్ వద్ద గతంలో ఏర్పాటు చేసిన వేమన విగ్రహాన్ని రోడ్డు విస్తరణలో భాగంగా ఆర్ట్స్ కాలేజీ వద్దకు మార్చారు. పద్య పఠన పోటీలతో చైతన్యం .. వేమన సాహిత్యమే ప్రచార లక్ష్యంగా చేసుకున్న వేమన ఫౌండేషన్.. 2020లో మాజీ డీజీపీ చెన్నూరు ఆంజనేయరెడ్డి గౌరవాధ్యక్షుడిగా ఏర్పాటైంది. విశ్రాంత ఉపకులపతి డాక్టర్ కాడా రామకృష్ణారెడ్డి అధ్యక్షుడిగా, కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరిస్తూ వేమన కోరుకున్న సమసమాజ స్థాపనకు, తెలుగు భాషా పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో వేమనపై అధ్యయనం, విస్తరణ కోసం ప్రత్యేక సంస్థ కావాలని, కటారుపల్లెలో వేమన సమాధి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న డిమాండుతో అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది 128 పాఠశాలల్లో పద్య పఠన పోటీలతో వేమన సాహిత్యంపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకురానున్నారు. నేడు జయంతి వేడుకలు.. వేమన జీవిత ప్రచారమే లక్ష్యంగా ఏర్పడిన ‘వేమన రెడ్డి సేవా సంఘం’ ఆధ్వర్యంలో నారాయణరెడ్డి, గోపాలరెడ్డి బృందాలు కొన్నేళ్లుగా పెద్ద స్థాయిలో వేమన జయంతిని నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉన్న వేమన విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. సన్మానాలు, సందేశాలు, నారాయణ సేవ కార్యక్రమాలు ఉంటాయి. సందర్భం : నేడు యోగి వేమన జయంతి వేమన పద్యాలకు ‘అనంత’ సాహిత్య సంస్థల బాసట -
మానవతకు ప్రతిరూపం హాస్యం
అనంతపురం: మానవత్వానికి, సాత్వికతకు హాస్యం ప్రతీకగా నిలుస్తుందని పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి అన్నారు. హాస్య రచయిత తరిమెల అమరనాథరెడ్డి రచించిన ‘కాసేపు నవ్వుకుందాం’ పుస్తకావిష్కరణ ఆదివారం అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. జేవీవీ సభ్యుడు లక్ష్మీనారాయణ ‘మాయమై పోతున్నాడమ్మా.. మనిషన్నవాడు’ అంటూ ఉద్దీపన గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాంతాబయోటిక్స్ డాక్టర్ వరప్రసాదరెడ్డి, యూపీపీఎస్సీ మాజీ సభ్యుడు డాక్టర్ వై.వెంకటరామిరెడ్డి, మానవతా కో కన్వీనర్ సలీంమాలిక్, జనప్రియ కవి ఏలూరు యంగన్న, విరసం కవయిత్రి శశికళ, తెలుగు వెలుగు సంస్థ వ్యవస్థాపకుడు టీవీరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ గుంటి మురళీకృష్ణ, అయూబ్ఖాన్ తదితరులు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. డాక్టర్ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. నిత్య జీవితంలో హాస్యం ప్రాధాన్యతను వివరించారు. ఒత్తిడి నిండిన జీవితాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి నవ్వడమే దివ్య ఔషధమని అన్నారు. కార్యక్రమంలో ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ శాంతినారాయణ, పతికి రమేష్ నారాయణ, డిప్యూటీ మేయర్ విజయభాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, డాక్టర్ ప్రసూన, ఎస్ఎస్బీఎన్ కరస్పాండెంట్ పీఎల్ఎన్ రెడ్డి, యోగా కేంద్రం అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, రైపర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మనాభ రెడ్డి, ప్రొఫెసర్ కేవీ రమణారెడ్డి, ఎస్ఎం బాషా, రచయితలు వెంకటేశులు, రియాజుద్దీన్, గోవిందరాజులు, నగరూరు రసూల్, జూటూరు తులసీదాసు, జగర్లపూడి శ్యామసుందరశాస్త్రి, ఆశ్రయ కృష్ణారెడ్డి, ఇంటాక్ చైర్మన్ రాంకుమార్రెడ్డి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ది వేదిక ప్రతినిధి కేవీ రమణ, ఐఆర్ఎస్ విశ్రాంత అధికారి నరసింహప్ప, ఆనందభాస్కర్రెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, డాక్టర్ నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వరప్రసాదరెడ్డి -
అడవుల సంరక్షణకు చర్యలేవీ?
కుందుర్పి: అడవుల సంరక్షణను అధికారులు గాలికొదిలేశారు. తగినంత సిబ్బంది లేరన్న కారణంతో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఖాళీల భర్తీపై దృష్టి సారించకపోవడంతో అడవులు పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. కుందుర్పి మండలం కలిగొలిమి సమీపంలో జంబుగుంపల అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం నిప్పంటుకుంది. ఆకతాయిలెవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా.. ప్రమాదవశాత్తూ నిప్పు రాజుకుని మంటలు వ్యాపించాయో తెలియదు. ఆ రోజు నుంచి నిరంతరాయంగా కాలుతూనే ఉంది. జంబుగుంపల అటవీ ప్రాంతం 6,800 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం అటవీ ప్రాంతంలోని ఊరకొండ, ఉచ్చికాయల పెంట, దావానుపెంట, గౌరమ్మపెంట, పావురాల గుండ ప్రాంతం, పుల్లల ఈగలగొంది, బూదిగుండ్లు తదితర ప్రాంతాల్లో ఉన్న టేకు, గాలిబుడుగు, తుమ్మ,జాలి, చీమచిగురు, శ్రీగంధం, దాదారు, నీరద్ది, వెదురు, కానుగ, పచ్చారి వంటి విలువైన మొక్కలు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. వృక్ష సంపదతో పాటు ఆలువలు, ముళ్లపందులు, ఉడుములు, యంటువలు, కుందేళ్లు వంటి వన్యప్రాణులు మంటల్లో చిక్కుకుని చనిపోయాయని చెబుతున్నారు. సిబ్బంది ఏరీ..? జంబుగుంపల అటవీ ప్రాంతం సంరక్షణకు కనీసం నలుగురు సిబ్బంది అవసరం. కానీ ఒక్క బీట్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు. పక్కనున్న మూడు వేల ఎకరాల్లోని కర్ణాటక పుట్రాళ్లపల్లి అటవీ ప్రాంతానికి ఎనిమిది మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 6,800 ఎకరాల విస్తీర్ణం కలిగిన జంబుగుంపల అటవీ ప్రాంతానికి ఉన్న ఒక్క అధికారి కళ్యాణదుర్గం రేంజ్ కార్యాలయంలో జరిగే సమావేశాలు, ఇతర పనులకు పరిమితమైపోయారని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. హడావుడిగా అవగాహన సదస్సులు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది అటవీశాఖ అధికారుల పనితీరు. ‘జంబుగుంపల అడవికి నిప్పు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో కళ్యాణదుర్గం అటవీ సెక్షన్ అధికారులు మల్లికార్జున, సూర్యనారాయణ, జంబుగుంపల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరమేశ్వరప్ప తదితరులు స్పందించారు. అప్పిలేపల్లి, కుందుర్పి, జంబుగుంపల గ్రామాల్లో అడవులకు నిప్పు పడకుండా తీసుకోవాల్చిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తరచూ అగ్నికి ఆహుతవుతున్న అడవులు ఏకధాటిగా కాలిపోతున్న జంబుగుంపల ఫారెస్ట్ వివిధ రకాల వృక్షాలతో పాటు పలు వన్యప్రాణులు బుగ్గి సిబ్బందిని నియమించాలి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే జంబుగుంపల అడవి అతిపెద్దది. నలుగురు సిబ్బందికి గాను ఒక్కరు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. గతంలో అడవుల సంరక్షణకు ప్రభుత్వం సిబ్బందితో పాటు ప్రైవేటు వ్యక్తులను ప్రొటెక్షన్ వాచర్లుగా నియమించేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో అడవుల పరిరక్షణ కరువైంది. – అతావుల్లా, రైతు సంఘం నేత, కుందుర్పి నిప్పు పెడితే చట్టపరమైన చర్యలు అడవులకు నిప్పు పెట్టినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలతో పాటు జిల్లా అటవీశాఖ ఆదేశాలతో క్రిమినల్ కేసులు సైతం పెడతాం. అడవుల పరిరక్షణలో భాగంగా నిఘా ఉంచాం. త్వరలోనే ఆకతాయిలను గుర్తించి చర్యలు తీసుకుంటాం. – పరమేశ్వరప్ప, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జంబుగుంపల -
ఫ్యాక్టరీల్లో భద్రత గాలికి
కనీస సౌకర్యాలు లేవునేను పని చేస్తున్న స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో యాజమాన్యం కనీస వసతులు కల్పించడం లేదు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు అంతంతమాత్రమే. చివరకు పనికి తగిన వేతనాలు కూడా ఇవ్వడం లేదు. అనారోగ్యానికి గురైనా యజమాన్యం పట్టించుకోవడం లేదు. వేతనాలు, సౌకర్యాలు గురించి ప్రశ్నిస్తే పనుల్లో నుంచి తీస్తేస్తున్నారు. ప్రమాదాల మధ్యనే పనిచేస్తున్నాం. ఏ ఒక్క అధికారీ ఫ్యాక్టరీని తనిఖీ చేసిందే లేదు. ఫ్యాక్టరీ యజమానులు ఏది చేప్పితే అదే వేదం.– ఓ కార్మికుడి ఆవేదనఅధికారుల దృష్టికి తీసుకెళ్లాంనేమకల్లు గ్రామ శివారులో ఉన్న రామాంజినేయ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో శనివారం కన్వేయర్ బెల్ట్ దగ్గర పనిచేస్తుండగా ప్రెజర్ వీల్ విడిపోయి నరసింహులు అనే హెల్పర్ చనిపోయాడు. ఈ విషయంపై కార్మిక శాఖ అధికారులకు, కలెక్టర్కు సమాచారం చేరవేశారు. జిల్లా ఉన్నతాధికారులు ఫ్యాక్టరీని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే మృతుడి భార్య ఫిర్యాదు మేరకు బొమ్మనహాళ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.– మునివేలు, తహసీల్దార్ బొమ్మనహాళ్ బొమ్మనహాళ్: కార్మికుల భద్రత చట్టాలను పలు ఫ్యాక్టరీల యజమానులు అమలు చేయడం లేదు. లాభాలపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రతపై పెట్టడం లేదు. ఫలితంగా ప్రమాదాల బారిన పడి ఎంతోమంది కార్మికుల జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. బొమ్మనహాళ్, డీ.హీరేహాళ్ మండలాల్లోని స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీల్లో స్థానికులతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకకు చెందిన ఎంతోమంది కార్మికులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీల్లో యాజమాన్యం కార్మికుల కోసం కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. యంత్రాల వద్ద పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలను సైతం సమకూర్చడం లేదు. అనుభవం ఉన్న కార్మికులను విధుల్లో పెట్టుకుంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని.. అనుభవం లేని కార్మికులను పనుల్లో పెట్టుకుంటున్నారు. కార్మికులకు రక్షణ పరికరాలను ఇవ్వకపోవడం, యంత్రాల పనితీరుపై అవగాహన లేకపోవడం, ప్రమాదాలు సంభవిస్తే తప్పించునే జాగ్రత్తలు తెలియకపోవడంతో చిన్నచిన్న ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కొన్ని ఘటనల్లో కార్మికులు మృత్యువాత పడుతున్నారు. సదరు బాధిత కుటుంబాలను ఆదుకోవడంలోనూ యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలు పదుల సంఖ్యలో ఉన్నా ఒక్క ఫ్యాక్టరీలో కూడా సేఫ్టీ ఆఫీసర్లు లేకపోవడం గమనార్హం.అధికారుల పర్యవేక్షణ కరువు..స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న వారికి కార్మిక చట్టాలు.. రక్షణ పరికరాల గురించి అవగాహన లేదు. ఇదే అదునుగా భావిస్తున్న యజమాన్యాలు తమ ఫ్యాక్టరీల్లో 100 మంది కార్మికులు విధులు నిర్వహిస్తే.. అందులో 40 మందికి కూడా ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం అంతర్రాష్ట్ర కార్మిక చట్టాలను కూడా అమలు చేయడం లేదు. ఈ అంశాలపై ఫ్యాక్టరీల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలను ఏడాదికి ఒక్కసారి కూడా తనిఖీ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కార్మికుల భద్రతపై చర్యలు తీసుకున్న దాఖలాలూ లేవు.స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ ప్రమాదాల్లోమచ్చుకు కొన్ని..● ఈ నెల 17న బొమ్మనహాళ్ మండలం నేమకల్లు శివారులోని రామాంజినేయ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో బోయ నరసింహులు (35) అనే హెల్పర్ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో కన్వేయర్ బెల్ట్ దగ్గర పనిచేస్తుండగా ప్రెజర్ వీల్ విడిపోయి అతని కాలుకు, మర్మాంగానికి బలంగా తగిలింది. దీంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు.● 2021 మే 30న రామాంజినేయ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో గోపాల్ అనే యువకుడు పని చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో కుడి చేయి పోగొట్టుకున్నాడు.● గత మూడేళ్ల కిత్రం ఓ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలోని పంప్ హౌస్ హాట్ వాటర్లో పడి ఓ కార్మికుడు మృత్యువాత పడ్డాడు.● గడిచిన ఏడేళ్లలో దాదాపు 20 మందికి పైగా ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ గాయాలపాలయ్యారు.రక్షణ పరికరాలు సమకూర్చనియాజమాన్యాలుతరచూ ప్రమాదాలతోబలైపోతున్న కార్మికులుకొరవడిన అధికారుల పర్యవేక్షణ -
మందకొడిగా కందుల కొనుగోళ్లు
అనంతపురం అగ్రికల్చర్: నాఫెడ్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన కందుల కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటా రూ.8 వేల ప్రకారం 31 మండలాల్లోనూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 1,900 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతానికి 20 మండలాల పరిధిలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, పెద్దవడుగూరు ప్రాంతాల్లో మాత్రమే కొనుగోళ్లు కాస్త ఎక్కువగా జరుగుతుండగా.. మిగతా ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి. బెళుగుప్ప, బ్రహ్మసముద్రం, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, గుమ్మఘట్ట, నార్పల, పామిడి, పెద్దపప్పూరు, పుట్లూరు, శింగనమల, తాడిపత్రి మండలాల్లో ఇంకా కొనుగోళ్లు మొదలు కాలేదు. అంచనాకు మించి సాగు.. ఈ ఏడాది అంచనాకు మించి ప్రధానపంట వేరుశనగను వెనక్కు నెట్టి జిల్లాలో 1.35 లక్షల హెక్టార్ల (3.37 లక్షల ఎకరాలు)లో రైతులు కంది సాగు చేశారు. అంతోఇంతో పంట చేతికి వచ్చినా.. బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.7,500కు మించి ధర లభించడం లేదు. దీంతో ఎంఎస్పీ సెంటర్ల ద్వారా అమ్ముకునేందుకు వేచిచూస్తున్నారు. ఈ–క్రాప్ ఆధారంగా ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున కొనుగోలుకు అనుమతించారు. ఈ లెక్కన 3.37 లక్షల ఎకరాల నుంచి 1.35 లక్షల మెట్రిక్ టన్నుల మేర కంది పంట చేతికిరావచ్చని అంచనా వేశారు. కావాలనే కొనుగోళ్లలో ఆలస్యం! ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి 24,838 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే 13,200 మంది రైతులు 28 వేల మెట్రిక్ టన్నుల వరకు అమ్ముకునేందుకు ఆర్ఎస్కేల్లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇంకా మరికొంతమంది రైతులు కందులు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అనుకున్నంత వేగంగా కొనుగోళ్లు జరగకపోవడంతో రిజిస్ట్రేషన్లు చేసుకున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఆలస్యం చేస్తే అంత మేర రైతులు బయట అమ్ముకునేందుకు మొగ్గు చూపుతారనే ఆలోచనతోనే కొనుగోళ్లు నెమ్మదిగా చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు 1,900 మెట్రిక్ టన్నుల సేకరణ 28 వేల మెట్రిక్ టన్నులకు రైతుల రిజిస్ట్రేషన్లు -
సెపక్తక్రా జాతీయ జట్టు ప్రాబబుల్స్కు మానస
ఉరవకొండ: సెపక్తక్రా జాతీయ జట్టు ప్రాబబుల్స్కు గుంతకల్లుకు చెందిన విద్యార్థి మానస ఎంపికై ంది. స్పోర్ట్స్ అఽథారిటి ఆఫ్ ఇండియా, అఖిల భారత సెపక్తక్రా సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఖేలో ఇండియా జాతీయ స్థాయి పోటీలో అద్భుత ప్రతిభ కనబరినందుకు గాను ఆమెను ఈ క్యాంప్నకు ఎంపిక చేశారు. ఈ మేరకు సెపక్తక్రా అసోసియేషన్ జిల్లా చైర్మన్ సప్తగిరి మల్లికార్జున ఆదివారం వెల్లడించారు. ఈ నెల 20 నుంచి థాయ్లాండ్లోని బ్యాంకాక్లో నిర్వహించనున్న ఇండియన్ క్యాంపులో మానస పాల్గొననుంది. అక్కడ ప్రతిభ కనబరిస్తే జాతీయ జట్టులో చోటు దక్కించుకుని ఢిల్లీలో నెల రోజుల శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. ఇక్కడ కూడా రాణిస్తే భారత్ తరఫున ఆసియా గేమ్స్లో ప్రాతినిథ్యం వహించే అవకాశముంది. ఈ క్రమంలో మానస బ్యాంకాక్ వెళ్లడానికి పూర్తి ఖర్చులను స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియా, అఖిల భారత సెపక్తక్రా సంఘం భరించనుంది. ఆమె ఎంపికపై సెపక్తక్రా సంఘం ప్రెసిడెంట్ షాహిన్, పీడీలు శ్యామల, అనిత హర్షం వ్యక్తం చేశారు. నేడు డయల్ యువర్ సీఎండీ అనంతపురం టౌన్: తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అనంతపురం విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 89777 16661 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. వేర్వేరు ప్రాంతాల్లో.. ఇద్దరి అనుమానాస్పద మృతి అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడుకు చెందిన సాకే వెంకటేష్ (40) ప్రస్తుతం అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి పంచాయతీ ఎన్ఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. భార్య విడాకులు ఇవ్వడంతో తన తల్లి నారాయణమ్మతో కలసి ఉంటూ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తాగుడుకు బానిసయ్యాడు. మూర్ఛ వ్యాధితో కూడా ఇబ్బందిపడేవాడు. శనివారం బయటకు వచ్చిన అతను తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆదివారం ఉదయం ఆదిమూర్తి నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద విగతజీవిగా కనిపించాడు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ యాదవ్ కేసు నమోదు చేశారు. టీవీ టవర్ సమీపంలో మరొకరు.. నగరంలోని టీవీ టవర్ సమీపంలో నివాసముంటున్న లక్ష్మీనారాయణ (26)కు బుక్కరాయ సముద్రం మండలం బొమ్మలాటపల్లి గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహమైంది. దంపతుల మధ్య చోటు చేసుకున్న మనస్పర్థల కారణంగా గతంలో లక్ష్మీనారాయణపై హత్యాయత్నం జరిగింది. దీంతో గొంతు వద్ద వైద్యులు ఆపరేషన్ చేసి ఓ పరికరాన్ని అమర్చారు. రెండు రోజుల క్రితం మరోసారి గొడవ పడడంతో శనివారం వన్టౌన్ పోలీసులు స్టేషన్కు పిలిపించినట్లు సమాచారం. ఏమైందో తెలియదు కానీ ఆదివారం ఇంట్లోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. గొంతు వద్ద ఉన్న పరికరాన్ని తొలగించి ఉంది. అతనే తొలగించుకున్నాడా.. లేదా ఎవరైనా చంపే ప్రయత్నంలో తొలగించారా? అనేది తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైలు పట్టాలపై యువతి మృతదేహం గుంతకల్లు: రైలు పట్టాలపై ఓ యువతి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. జీఆర్పీ ఏఎస్ఐ ప్రేమ్కుమార్ కథనం మేరకు.. గుంతకల్లు పట్టణంలోని ఆలూరు రోడ్డు సీఐటీయూ కాలనీలో నివాసముంటున్న సుజాత కుమార్తె కౌశల్య(19) ఎంఎల్టీ కోర్సు పూర్తి చేశారు. స్థానిక పద్మావతి నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని రోజూ గుంతకల్లు – హనుమాన్ రైల్వేస్టేషన్ మార్గం దాటి ఇంటికి వెళ్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరిన కౌశల్య రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉంది. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో జీఆర్పీ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈమె ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందిందా.. లేదా ఆత్మహత్య చేసుకుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. -
మక్కాలో గుంతకల్లువాసి కన్నుమూత
గుంతకల్లుటౌన్: ముస్లింల అత్యంత పవిత్రమైన ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా, మదీనాల సందర్శనార్థం వెళ్లిన గుంతకల్లు పట్టణం అల్లీపీరా కాలనీకి చెందిన జైబూన్నీసాబేగం (65) మక్కాలో శనివారం మృతి చెందింది. ఈ నెల 11వ తేదీన తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లిన జైబూన్నీసా బేగం ఐదు రోజుల పాటు మక్కాను సందర్శించి ప్రార్థనలు చేసింది. శనివారం తెల్లవారుజామున నిద్రలోనే ఆమె కన్నుమూసింది. ఈ విషయాన్ని యాత్రకు వెళ్లిన బంధువులు ఫోన్ చేసి తెలియజేసినట్లు ఆమె కుమారుడు అక్రమ్ తెలిపాడు. జైబూన్నీసా భౌతిక కాయాన్ని మక్కాలోనే ఖననం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. జైబూన్నీసా బేగం మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ యువనేత మంజునాథరెడ్డి, నాయకులు నూర్నిజామి, గాదిలింగేశ్వరబాబు, ఖలీల్, సుంకప్ప, మౌలా, బాసిద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఆటో బోల్తా.. వ్యక్తి మృతి
గుంతకల్లుటౌన్: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణ శివారులో జరిగింది. గుంతకల్లు వన్టౌన్ పోలీసుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన బేల్దారి వడ్డే సుబ్రహ్మణ్యం (40) శనివారం తన తల్లి పార్వతమ్మతో కలిసి వజ్రకరూరులో తన పెద్దమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చాడు. అంత్యక్రియల అనంతరం తిరిగి తన స్వగ్రామం వెళ్లేందుకు ఆటోలో గుంతకల్లుకు బయల్దేరాడు. సుమారు 10 మందితో బయలుదేరిన ఆటో కొనకొండ్ల రోడ్డులోని మారెమ్మ గుడి సమీపంలో కల్వర్టు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ క్రమంలో కిందపడిన వడ్డే సుబ్రహ్మణ్యం తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న గుంతకల్లు మండలం చింతలాంపల్లికి చెందిన కలిశెట్టి శ్రీదేవి, వజ్రకరూరుకు చెందిన నీలమ్మ, వెంకటరాముడు, తులసమ్మ గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటోడ్రైవర్ ఉడాయించినట్లు తెలిసింది. కళ్లెదుటే కుమారుడు మృతి చెందడంతో సుబ్రహ్మణ్యం తల్లి పార్వతమ్మ గుండెలవిసేలా రోదించింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు తెలిసింది. ఘటనాస్థలాన్ని వన్టౌన్ సీఐ మనోహర్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.● మరో నలుగురికి గాయాలు -
అందుబాటులోకి అడ్వాన్స్డ్ విద్యుత్ రైలింజన్
గుంతకల్లు: అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన మరో విద్యుత్ రైలింజన్ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. జీ5 3–ఫేజ్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్ 44080 వ్యాగ్–9 హెచ్సీ (మైక్రో ప్రాసెసర్ బేస్డ్ హెవీ క్యాబులిటీ లోకోమోటివ్)ను శనివారం గుంతకల్లు రైల్వే లోకోషెడ్లో డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా, ఏడీఆర్ఎం సుధాకర్ జెండా ఊపి ప్రారంభించారు. డీఆర్ఎం మాట్లాడుతూ ఈ విద్యుత్ రైలింజన్ ప్రస్తుతం ఉన్న లోకోమోటివ్ల కంటే వేగంగాను, ఎక్కువ వ్యాగిన్లు (బోగీ)లు లాగే సామర్థం కలిగి ఉంటుందన్నారు. తొలుత ఈ లోకోను గూడ్స్రైళ్లకు ఉపమోగిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రయాణికుల రైళ్లకు అనుగుణంగా మార్పు చేసి ఎక్స్ప్రెస్ రైళ్లకు కూడా వినియోగిస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ డీఈఈ వీరయ్య, టీఆర్డీఈ సుదర్శన్, ఈఎల్ఎస్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. హెచ్చెల్సీకి నీటి సరఫరా బంద్ బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు వచ్చే నీటిని తుంగభద్ర బోర్డు అధికారులు శుక్రవారం బంద్ చేశారు. దీంతో శనివారం ఆంధ్ర సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్ద కాలువలో 90 శాతం మేర నీటి సరఫరా తగ్గుముఖం పట్టింది. గత ఏడాది జూలై 17న తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీరు విడుదల చేయగా.. అదే నెల 19న ఆంధ్ర సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్దరు నీరు చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి 180 రోజులు ఏకధాటిగా నీరు సరఫరా కొనసాగిందని హెచ్చెల్సీ అధికారులు తెలిపారు. హెచ్చెల్సీ వాటా 27.755 టీఎంసీలు, కేసీ కెనాల్ మళ్లింపు కోటా కింద మరో 3 టీఎంసీలు కలిపి మొత్తం 30.755 టీఎంసీలు కేటాయింపు చేసిన ట్లు వెల్లడించారు. నీటి సరఫరా నిలిపివేయడంతో హెచ్చెల్సీ కింద మిరప సాగు చేసిన ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరు వరకు నీరు ఇస్తే తప్ప గట్టెక్కే పరిస్ధితి లేదని చెబుతున్నారు. కణేకల్లు హెచ్చెల్సీ సబ్ డివిజన్ పరిధిలో ఐదు వేల ఎకరాలు, ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో జీబీసీ కింద 25 వేల ఎకరాల్లో మిరప సాగైంది. ప్రస్తుతం పూత, పిందె దశల్లో ఉంది. ఈ నెలాఖరు వరకు నీటిని సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. పొంచి ఉన్న జల గండం అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు జల గండం ముప్పు పొంచి ఉంది. అననుకూల వర్షాల నడుమ ఈసారి సాధారణ వర్షపాతం నమోదు కాని పరిస్థితి. ఈ ఏడాది (జూన్ – మే వరకు) ఇప్పటి వరకు 460 మి.మీకు గాను 456 మి.మీ వర్షం కురిసింది. తాజాగా 93 ఫిజోమీటర్ల నుంచి సేకరించిన గణాంకాల ప్రకారం భూగర్భజలాల నీటిమట్టం 9.56 మీటర్లుగా నమోదైంది. ఇక నుంచి వర్షాలు కురిసే పరిస్థితి లేనందున ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నీటిమట్టం మరింత తగ్గనుందని అంచనా వేస్తున్నారు. డేంజర్ జోన్లోని మండలాలు భూగర్భజలశాఖ తాజా నివేదిక పరిశీలిస్తే... 13 మండలాల్లో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. అందులో రాయదుర్గం, అనంతపురం రూరల్, గుమ్మఘట్ట, బెళుగుప్ప, కణేకల్లు, బ్రహ్మసముద్రం, కంబదూరు, తాడిపత్రి, కూడేరు, పామిడి, డి.హిరేహాల్, కళ్యాణదుర్గం, కుందుర్పి మండలాలు ఉన్నాయి. ఇక పుట్లూరు, యాడికి, శెట్టూరు మండలాల్లో ఇప్పటికే ప్రమాదకరస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మండలాలన్నీ క్రమంగా నీటిమట్టం తగ్గుతూ వస్తుండటంతో ‘డేంజర్ జోన్’ కింద గుర్తించారు. సురక్షిత మండలాలు ఇవే.. జిల్లాలోని పెద్దపప్పూరు, గార్లదిన్నె, ఉరవకొండ మండలాలు పూర్తిగా సేఫ్ జోన్లో నిలిచాయి. బొమ్మనహాళ్, రాప్తాడు, గుంతకల్లు, విడపనకల్లు, ఆత్మకూరు, యల్లనూరు, పెద్దవడుగూరు, అనంతపురం అర్బన్, వజ్రకరూరు, నార్పల, బుక్కరాయసముద్రం, గుత్తి, శింగనమల మండలాల్లో కూడా భూగర్భజలాల పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు నివేదిక వెల్లడిస్తోంది. -
జోరుగా గ్యాస్ రీ–ఫిల్లింగ్ దందా
అనంతపురం అర్బన్: జిల్లాలో అక్రమంగా వంటగ్యాస్ రీ ఫిల్లింగ్ దందా జోరుగా సాగుతోంది. డెలివరీ బాయ్స్, వ్యాపారులు కుమ్మకై ్క గృహావసర వంటగ్యాస్ను పక్కదారి పట్టిస్తున్నారు. గ్యాస్ స్టవ్ల విక్రయాలు, రిపేరీ, చిన్న సిలిండర్ల విక్రయ దుకాణాలు ఏర్పాటు చేసుకున్న కొందరు ఆ మాటున యథేచ్ఛగా రీ–ఫిల్లింగ్ వ్యాపారం సాగిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారం జిల్లాలో నెలసరి రూ.60 లక్షలు పైగానే ఉంటోందని తెలిసింది. మొక్కుబడిగా దాడులు జిల్లాలో రోజూ 12,000 సిలిండర్లు డెలివరీ అవుతుంటాయి. వీటిలో దాదాపు 1,000 సిలిండర్లు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు బహిరంగంగానే వినవస్తున్నాయి. ఫిల్లింగ్ దుకాణాల వ్యాపారులు డెలివరీ బాయ్స్కు రూ.200 అదనంగా ముట్టజెప్పి గృహావసర వంటగ్యాస్ 14.2 కిలోల సిలిండర్ను కొనుగోలు చేస్తున్నారు. అలా కొన్న సిలిండర్ నుంచి గ్యాస్ను చిన్న సిలిండర్లకు కిలో రూ.150తో నింపి సిలిండర్పై రూ.1,000 వరకు లాభం ఆర్జిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా అనంతపురం నగరంతోపాటు జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో అక్రమంగా వంటగ్యాస్ రీ–ఫిల్లింగ్ దందా సాగుతున్నప్పటికీ అధికారులు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక దృష్టిసారిస్తేనే ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వినవస్తున్నాయి. బాయ్లకు బహుళ కనెక్షన్లు ఏజెన్సీల్లో పనిచేస్తున్న డెలివరీ బాయ్లు కొందరు బహుళ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు సమాచారం. కొందరు బాయ్లు తమ పేరున, తమ కుటుంబ సభ్యుల పేరున కనెక్షన్లు కలిగి ఉన్నట్లు తెలిసింది. ఆ కనెక్షన్ల ద్వారా సిలిండర్లను పొంది వాటిని బ్లాక్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరు తమ రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్న రీ–ఫిల్లింగ్ దుకాణాలు, హోటళ్లకు సిలిండర్ ధరపై రూ.200 అదనంగా విక్రయిస్తున్నట్లు తెలిసింది. నగరంలోని ఒక దుకాణంలో అక్రమంగా ఉంచిన గృహావసర వంటగ్యాస్ సిలిండర్లు, గృహావసర సిలిండర్ నుంచి చిన్న సిలిండర్కు గ్యాస్ నింపుతున్న దృశ్యం పక్కదారి పడుతున్న గృహావసర సిలిండర్లు దుకాణాల్లో యథేచ్ఛగా వ్యాపారం జిల్లాలో రోజుకు 1,000 సిలిండర్ల అక్రమ డెలివరీ -
●ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది ●చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం ●వైఎస్ జగన్ను మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యం ●కమిటీల సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో నేతల దిశానిర్దేశం
వైఎస్సార్సీపీ హయాంలో దేశంలోనే స్ఫూర్తిదాయక పరిపాలనతో పాటు చరిత్రలో నిలిచిపోయే రీతిలో సంక్షేమ పథకాలు అందించాం. పేదల పక్షాన, నిజమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేసే మనకు గుర్తింపు ఉండాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మనకు గుర్తింపు లభిస్తుంది. కార్యకర్తల ఆలోచనలు, సూచనలు ప్రతి అంశమూ వైఎస్ జగన్మోహన్రెడ్డికి చేరేందు కోసమే డిజిటలైజేషన్ వ్యవస్థను తెచ్చాం. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రతి సూచన/ సలహానూ విశ్లేషించి వైఎస్ జగన్మోహన్రెడ్డికి చేరుస్తుంది. – నరేష్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు రాచమల్లు శివప్రసాద్రెడ్డి, చిత్రంలో అనంత వెంకటరామిరెడ్డి, నరేష్కుమార్రెడ్డి, వజ్ర భాస్కర్రెడ్డి తదితరులు వైఎస్సార్సీపీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ స్థాయి గ్రామ–సచివాలయ స్థాయి కమిటీల సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులుఅనంతపురం: అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ.. అరాచకాలకు పరాకాష్టగా నిలుస్తున్న ‘రెడ్బుక్ రాజ్యాంగాన్ని’ దీటుగా ఎదుర్కొందామని వైఎస్సార్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై అక్రమ కేసు పెట్టినా.. వేధించినట్లు ఒక్క ఫోన్ కాల్ వచ్చినా వేలాది మందిగా జగనన్న సైన్యం కదం తొక్కాలని, ప్రతి కార్యకర్తకూ అండగా నిలుద్దామని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. జనరంజక పాలన కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేద్దామని దిశానిర్దేశం చేశారు. శనివారం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పార్టీ గ్రామ–సచివాలయ స్థాయి కమిటీల సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ సభ్యుడు రాచమల్లు శివప్రసాద్రెడ్డి, అనంత పురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్కుమార్రెడ్డి, రాష్ట్ర సెక్రటరీ (ఆర్గనైజింగ్) వజ్ర భాస్కర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, సీఈసీ సభ్యుడు నదీం అహమ్మద్, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, మేయర్ వసీం సలీం, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి, డిప్యూటీ మేయర్లు దాసరి వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు అశ్వత్థనాయక్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు తదితరులు పాల్గొన్నారు. నిరాశ వద్దు.. నిలిచి గెలవాలి ‘గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు కుట్రలు, కుతంత్రాలు, ఈవీఎం మోసాలతో గెలిచారు. వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. అందుకు ఎన్నికల్లో వచ్చిన ఓట్లే నిదర్శనం. ఓడిపోయామని నిరాశా నిస్పృహలకు లోనుకావొద్దు’ అని వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంత వెంకటరామిరెడ్డికి 83 వేల ఓట్లు వచ్చాయని, మన బలం ఎక్కడా తగ్గలేదని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో మరింతకష్టపడి పనిచేసి, ఓటమి రుచి చూసిన చోటే ఘన విజయంతో గెలిచి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఐకమత్యంతోనే ఇది సాధ్యమని, పార్టీ ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్విర్తించాలని అన్నారు. అందుకే ఆధార్ కార్డు తరహాలోనే పార్టీ కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు ఇస్తున్నామని, జగన్ 2.0లో నడిచిన ప్రతి కార్యకర్తా గుర్తుంటారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేయాలని కూటమి పార్టీల నేతలు చూస్తున్నారన్నారు. అక్రమ కేసులకు ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను చట్టం ముందు నిలబెడతామని భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ 10 వేల నుంచి 16 వేల మందితో జగనన్న సైన్యం తయారు చేస్తున్నాం. వీరందరికీ వైఎస్సార్సీపీ తరఫున గుర్తింపు కార్డులిస్తాం. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి కమిటీలు దోహదపడతాయి. గుర్తింపు కార్డులు ఉన్నవారికి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోను, నామినేటెడ్ పదవుల్లోనూ సముచిత స్థానాలు కల్పిస్తారు. – వజ్ర భాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సెక్రెటరీ (ఆర్గనైజింగ్). సలహాల కోసమే డిజిటలైజేషన్జగనన్న సైన్యం సిద్ధం -
రబీ సాగు అంతంత మాత్రమే
● 1.07 లక్షల హెక్టార్లకు గాను 77 వేల హెక్టార్లలో సాగు ● రాయితీ విత్తనం, పంటల బీమా లేనందున అనాసక్తి అనంతపురం అగ్రికల్చర్: రబీ కింద పంటలు అంతంత మాత్రంగానే సాగులోకి వచ్చాయి. సీజన్ ముగిసే దశకు వచ్చినా ఆశించినస్థాయిలో పంటలు సాగు చేయలేదని వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడిస్తోంది. 1.07 లక్షల హెక్టార్లు అంచనా వేయగా.. 72 శాతంతో అంటే 77 వేల హెక్టార్లకు మాత్రమే సాగు పరిమితమైంది. అక్టోబర్లో సాధారణ వర్షపాతం నమోదైనా నవంబర్, డిసెంబర్లో వర్షాలు కురవకపోవడంతో సాగు మందగించినట్లు తెలుస్తోంది. ప్రధానపంట వర్షాధారంగా పప్పుశనగ 65 వేల హెక్టార్ల అంచనా కన్నా అధికంగా సాగులోకి వస్తుందని అనుకున్నా.. రాయితీ విత్తనం ఇవ్వకపోవడంతో సాగు బాగా తగ్గించినట్లు అవగతమవుతోంది. 50 వేల హెక్టార్ల వద్ద పప్పుశనగ ఆగిపోయింది. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కింద పరిహారం ఇవ్వకపోవడం, ఇక ఈ ఏడాది పంటల బీమా పథకం కూడా అమలు చేయకపోవడంతో రైతులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇక వేరుశనగ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. 18 వేల హెక్టార్లు అంచనా వేయగా ప్రస్తుతానికి 8 వేల హెక్టార్ల వద్ద ‘సాగు’తోంది. జొన్న, మొక్కజొన్న సాగుపై రైతులు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. జొన్న 4,900 హెక్టార్లకు గాను 3,700 హెక్టార్లలో సాగు చేశారు. మొక్కజొన్న 7,888 హెక్టార్లకు గాను 10 వేల హెక్టార్ల పైచిలుకు విస్తీర్ణంలో సాగు చేశారు. ఉలవ 1,387 హెక్టార్లు, కుసుమ 800 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 785 హెక్టార్లు, పత్తి 115 హెక్టార్లు, మినుము 280 హెక్టార్లు, పెసర 250 హెక్టార్లు... ఇలా కొన్ని పంటలు నామమాత్రంగా సాగులోకి వచ్చాయి. నీటి వసతి కింద వరి 6,069 హెక్టార్లు అంచనా వేయగా.. ప్రస్తుతానికి 1,400 హెక్టార్ల వద్ద ‘సాగ’వుతోంది. ఈ–క్రాప్ ప్రక్రియ ఇంకా 10 శాతం కూడా పూర్తి చేయకపోవడం విశేషం. ఫిబ్రవరి 28 లోపు పూర్తీ చేయాలని ఆదేశాలు ఉన్నా... సాగు మాదిరిగానే ఈ–క్రాప్ కూడా మందకొడిగా చేపడుతున్నారు. -
మట్కాకు ముకుతాడు వేయరా?
● తాడిపత్రిలో విచ్చలవిడిగా మట్కా ● నిర్వాహకులు అధికార పార్టీ వారే ● గొడవలు జరుగుతున్నా పట్టని పోలీసులు ● బీటర్లపైనే ప్రతాపం.. నిర్వాహకులపై కేసులు నిల్ తాడిపత్రి టౌన్: మట్కా మాఫియాకు తాడిపత్రి ప్రాంతం కేరాఫ్గా నిలుస్తోంది. సులభంగా సంపాదించాలనే ఆశతో మట్కాకు ఆకర్షితులైన వారు నిలువునా నష్టపోతున్నారు. ఆర్థికంగా కుదేలై కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారు. సమూలంగా మట్కా నిర్మూలిస్తామంటున్న పోలీసులు ఆ దిశగా పురోగతి సాధించడం లేదు. దీంతో మట్కా రోజురోజుకూ విస్తరిస్తూ పోతోంది. పోలీసులు మామూళ్లు స్వీకరిస్తూ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రి పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్, నందలపాడు, శ్రీనివాసపురం, ఆర్టీసీ బస్టాండ్, గన్నెవారిపల్లి, విజయనగర్ కాలనీల్లోని టీడీపీ నాయకులు మట్కా నిర్వాహకలుగా అవతారమెత్తి ఆయా ప్రదేశాల్లోని హోటళ్లు, లాడ్జీలు, చిన్నపాటి అంగళ్లను మట్కా కేంద్రాలుగా మార్చారు. రోజూ పట్టణం నుంచే రూ.50 లక్షల వరకు మట్కా వ్యాపారం టర్నోవర్ జరుగుతోందని సమాచారం. ఆధిపత్యం కోసం గొడవలు మట్కా వ్యాపారంలో రూ.లక్షల ఆదాయం వస్తుండటంతో నిర్వాహకులు కొంతమంది యువకులను గ్యాంగ్లుగా తయారు చేస్తున్నారు. ఆయా మట్కా కేంద్రాల వద్ద ఆధిపత్యం కోసం ఒక గ్యాంగ్ మరో గ్యాంగ్పై దాడులకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుస్తున్నాయి. అయితే దాడులకు పాల్పడిన రెండు గ్యాంగ్లు అధికారపార్టీకి చెందిన వారే కావడంతో పోలీసులు ఫిర్యాదు అందలేదన్న సాకుతో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని తెలుస్తోంది. రెండు వారాల క్రితం పాత కూరగాయల మార్కెట్, పెద్ద బజార్లలో రెండు మట్కా గ్యాంగ్ల నడుమ రాళ్లదాడులు చోటు చేసుకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం పట్టణ ప్రజలను నిర్ఘాంతపోయేలా చేస్తోంది. నిర్వాహకులపై కేసులేవీ? తాడిపత్రి పట్టణ, రూరల్ పరిధిలోని పోలీసులు నిత్యం మట్కా బీటర్లపై కేసులు నమోదు చేస్తూ.. వారి వద్ద కొంతమేర నగదు దొరికిందని చూపుతున్నారు. అయితే ఇంతవరకు ఒక్క మట్కా నిర్వాహకున్ని కూడా పట్టుకోకపోవడంతో పోలీస్ చర్యలు ఎలా ఉన్నాయో అర్థం అవుతోంది. మట్కా నిర్వాహకుల నుంచి ప్రతి నెలా పోలీస్ అధికారులకు మామూళ్ల వెళ్తున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రజలను మభ్యపెట్టేందుకు మట్కా బీటర్ను అరెస్ట్ చూపుతూ సాయంత్రానికి బెయిల్పై ఇంటికి పంపుతూ పోలీసులు చేతులు దులుపుకుంటున్నారు. -
శ్రుతిమించిన ఎమ్మెల్యే దగ్గుపాటి అరాచకాలు
● సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మండిపాటు ● ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా అనంతపురం సెంట్రల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆయన అనుచరుల అరాచకాలు మితిమీరిపోయాయని సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మండిపడ్డారు. శనివారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ఎస్పీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించిన అనంతరం అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ఎమ్మెల్యే సీటు కోసం రూ. 30 కోట్లు, ఓట్ల కోసం రూ. 40 కోట్లు ఖర్చు చేశానని చెబుతూ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే దగ్గుపాటి దందాలు ప్రారంభించాడని ఆరోపించారు. సప్తగిరి సర్కిల్లోని అలెగ్జాండర్ హోటల్ నిర్వాహకులను బెదిరించాడని, మద్యం షాపుల నుంచి ముడుపులు డిమాండ్ చేయడంతో పాటు ఆశా హాస్పిటల్ స్థలాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి తాళాలు వేశాడన్నారు. శారదనగర్లో ఓ ఉపాధ్యాయురాలు చనిపోతే ఆమెకు చెందిన రూ. 3 కోట్ల ఆస్తిని రాంబందుల్లా పీక్కుతినాలని చూశారని దుయ్యబట్టారు. బుడగ జంగాల ప్రజలు పాత చీరలు అమ్ముకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకున్న మూడున్నర ఎకరాలను కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. టీడీపీకే చెందిన వీరశైవ లింగాయత్ చైర్మన్ స్వప్న 49 సెంట్ల స్థలాన్ని మింగేయాలని ఎమ్మెల్యే అనుచరుడు గంగారం చూశాడన్నారు. సూర్యనగర్ రోడ్డులో రజకులకు చెందిన రెండు కోట్ల ఆస్తిని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్నారు. జనశక్తి నగర్లో టీడీపీ సాలార్బాషా సోదరుడు మక్బూల్ బాషాకు చెందిన 9 సెంట్ల స్థలంలో బండలు పాతారన్నారు. కళ్యాణదుర్గం రోడ్డులో బ్రాహ్మణులకు చెందిన 9 సెంట్ల స్థలాన్ని, రాజీవ్ కాలనీలో రెండున్నర ఎకరాలను కబ్జా చేశారని విమర్శించారు. తాజాగా ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని రూ. 20 లక్షలు ఇవ్వాలని బెదిరించడమే కాకుండా దాడులకు దిగారని, టీడీపీకే చెందిన నంబూరి వైన్స్ నిర్వాహకుడు వెంకటరమణను బెదిరించినా డబ్బులు ఇవ్వకపోవడంతో అనుచరులను ఉసిగొల్పి షాపునకు నిప్పు పెట్టించాడన్నారు. ఎమ్మెల్యే అరాచకాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించి చర్యలు తీసుకోవాలని, భూకబ్జాలు, దౌర్జన్యాలు చేస్తున్న వారిని జిల్లా బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈనెల 25న అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ జగదీష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రమణ, పద్మావతమ్మ, లింగమయ్య, సంతోష్కుమార్, కుళ్ళాయిస్వామి, నగర సహాయ కార్యదర్శి కృష్ణుడు, అల్లీపీరా, నారాయణస్వామి, రామాంజనేయులు, రాజు, శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి ఉమా మహేష్, మంజునాథ్, ఆనంద్, శ్రీనివాసు, యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ష్.. గప్చుప్!
అనంతపురం సెంట్రల్: ఉమ్మడి అనంత పురం జిల్లాలోనే సంచలనం సృష్టించిన ఓ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. చిన్నచిన్న కేసులపై సైతం మీడియా సమావేశాలు నిర్వహించి చాకచక్యంగా కేసు ఛేదించామని ప్రకటించుకునే పోలీసులు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుల అరెస్ట్ను మాత్రం ఎవరికీ తెలియకుండా అలా ముగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసు ప్రారంభం నుంచి కూడా మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నాల్గో పట్టణ సీఐ జగదీష్ జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్న చిన్న ప్రెస్మీట్లకు కూడా హాజరయ్యే డీఎస్పీ శ్రీనివాసరావు కూడా ఎక్కడా జోక్యం చేసుకోలేదు. శనివారం నిందితుల వివరాలను ఒక ప్రకటన ద్వారా సీఐ జగదీష్ వెల్లడించారు. లక్ష్మీనగర్కు చెందిన మోహన్కుమార్, అతని సోదరుడు అఖిల్కుమార్, కళావతి కొట్టాలకు చెందిన బాబా ఫకృద్దీన్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎకై ్సజ్ కోర్టులో హాజరుపరచగా నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించినట్లు వివరించారు. అంతకుమించి కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, కుదరదని చెప్పడంతో మద్యం దుకాణానికి నిప్పు పెట్టించాడని ఇటీవల బాధితుడే బహిరంగంగా చెప్పడంతో పాటు రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశాడు. అయితే బాధితుని ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేయకపోగా చర్యలు కూడా తీసుకోలేదు. ఈ క్రమంలోనే బాధితుడు శనివారం ఎస్పీ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తానని ప్రకటించడంతో రాయబారం పంపి వ్యతిరేకత రాకుండా పోలీసు అధికారులు జాగ్రత్త పడినట్లు తెలిసింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పోలీసులు ఈ కేసును పూర్తిగా ఏకపక్షంగా మార్చేశారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నంబూరి వైన్స్కు నిప్పు పెట్టిన ఘటనలో నిందితుల అరెస్ట్ గుట్టుగా రిమాండ్కు తరలింపు పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు -
కరెంట్ షాక్తో రైతు మృతి
తాడిపత్రి రూరల్: కరెంట్ షాక్కు గురై రైతు మృతి చెందిన ఘటన మండలంలోని బ్రహ్మణపల్లిలో విషాదం నింపింది. అప్గ్రేడ్ పోలీసుస్టేషన్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి (52), ఉమా మహేశ్వరి దంపతులు. రామసుబ్బారెడ్డి తన నాలుగెకరాల పొలంలో చీనీ, అరటి సాగు చేశాడు. అరటి పంటకు నీళ్లు పెట్టేందుకు శనివారం ఉదయం తోటకు వెళ్లాడు. స్టార్టర్ పనిచేయకపోవడంతో ఫ్యూజ్ వేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే కరెంట్ షాక్కు గురై పడిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు రామసుబ్బారెడ్డి మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది కుమారుల మృతి.. రామసుబ్బారెడ్డి, ఉమామహేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు శేఖర్, శివానందరెడ్డి సంతానం కాగా, గతేడాది జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. ఉగాది పండుగను పురస్కరించుకొని గుత్తి సమీపంలోని బాట సుంకులమ్మ ఆలయంలో మొక్కు తీర్చుకుని బైకులో తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో కారు ఢీకొనడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకే సారి ఇద్దరు కుమారులు దూరం కావడంతో రామసుబ్బారెడ్డి, ఉమామహేశ్వరి కుంగిపోయారు. బాధ నుంచి కోలుకుంటున్న సమయంలోనే కరెంట్ షాక్తో భర్త మృతి చెందడంతో ఉమామహేశ్వరి వేదన వర్ణనాతీతంగా మారింది. భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. మృతి చెందిన రామసుబ్బారెడ్డి -
టీడీపీది దళిత వ్యతిరేక భావజాలం
● మాజీ మంత్రి శైలజానాథ్ మండిపాటు అనంతపురం: దళిత వ్యతిరేక భావజాలంతోనే టీడీపీ ఆవిర్భవించిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. దళితులపై దాడులు, హత్యాకాండలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ హత్యను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు ఆధ్వర్యంలో శనివారం అనంతపురంలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ తన భార్యను చూసేందుకు గ్రామానికి వెళ్తున్న మందా సాల్మన్పై టీడీపీ గూండాలు అత్యంత కిరాతకంగా దాడి చేసి హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై హత్యలు, దాడులు, అత్యాచారాల పరంపర కొనసాగుతోందని మండిపడ్డారు. పిన్నెల్లి ఘటనపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతి స్పందించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని మేయర్ వసీం డిమాండ్ చేశారు. ఎస్సీలపై దాడులు అధికమయ్యాయని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. సాల్మన్పై దాడి చేసిన టీడీపీ గుండాలను వెంటనే కఠినంగా శిక్షించాలని ఎస్సీ సెల్ నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏసీ ఎర్రిస్వామి, నాయకులు పసలూరు ఓబులేసు, మిద్దె కుళ్లాయప్ప, పామిడి ఓబులేసు, కమల్భూషణ్, టైలర్ వన్నూరుస్వామి, సాకే కుళ్లాయిస్వామి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ కాగజ్ఘర్ రిజ్వాన్ పాల్గొన్నారు. ఇంకా పార్టీ బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, రాష్ట్ర కార్యదర్శి గౌస్ బేగ్, ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి అనిల్కుమార్ గౌడ్, మహిళా నేతలు శోభారాణి, శోభాబాయి, భారతి, ఉష, అంజలి, రాధాయాదవ్, ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానీషా, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శంకరయ్య, సోషల్ మీడియా నేత షేక్ బాబా సలామ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి రిపబ్లిక్ డే శిబిరానికి ఎంపిక
గుమ్మఘట్ట: రాష్ట్ర స్థాయి రిపబ్లిక్ డే శిబిరానికి ముగ్గురు ఎన్సీసీ విద్యార్థినులు ఎంపికై నట్లు రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ చదువుతున్న ఆసియాబాను,బి.లీలావతి, బి.సుప్రియ ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఒకే విభాగం నుంచి ముగ్గురు విద్యార్థినులు ఎంపిక కావడం కళాశాల చరిత్రలో మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ఈ నెల 26న విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకోనున్నట్లు వివరించారు. సీటీఓ కిరణ్ మాట్లాడుతూ విద్యార్థినులు పట్టుదలతో శిక్షణ పొంది ఈ స్థాయికి చేరుకోవడం గర్వించదగ్గ విషయమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుని రాయదుర్గం ఖ్యాతిని ఇనుమడింపజేయాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకుల బృందం ఎంపికైన విద్యార్థినులను ఘనంగా సత్కరించి అభినందించారు. -
మద్యం షాపు తగలబెట్టిన కేసులో మలుపు
అనంతపురం సెంట్రల్: నగరంలో జాతీయ రహదారి పక్కన నంబూరి వైన్స్ షాప్కు నిప్పు పెట్టిన ఘటనలో కేసు మలుపు తిరిగింది. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కీలక నిందితుడు అఖిల్కుమార్తో పాటు మరొకరు బాబా ఫక్రుద్దీన్ శుక్రవారం నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. తాను పెయింటింగ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నానని, ఆ రోజు మధ్యాహ్నం మందు కోసం సదరు వైన్షాపుకు వెళ్లి ఫోన్పేలో డబ్బులు వేసినా రాలేదని చెప్పడంతో నిప్పు పెట్టానని కీలక నిందితుడు చెబుతుండగా.. సీఐ జగదీష్, ఎస్ఐ ప్రసాద్ అడ్డుకుని, అతడిని స్టేషన్లోకి తీసుకెళ్లారు. నిందితులను శనివారం అరెస్టు చూపనున్నట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై విమర్శలు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులపై బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే పోలీసులు ఆ కేసుల గురించి మాట్లాడే ధైర్యం చేయడం లేదు. డబ్బు కోసం బెదిరించడమే కాకుండా దాడి చేసిన ఘటనపై బాధితుడు ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే నంబూరి వైన్స్ నిర్వాహకుడు వెంకటరమణ కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి బెదిరించాడని, అతని అనుచరులతో తన వైన్ షాపును తగలబెట్టించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులకు సంబంధించి నాల్గవ పట్టణ పోలీసులు నోరుమెదపడం లేదు. ఎమ్మెల్యే సిఫార్సుతో పోస్టింగ్ తెచ్చుకోవడం వల్లే.. సీఐ చెప్పినట్లు నడుచుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసు నీరు గార్చేందుకు కుట్రలు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనను రూ.20 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నాడు. నేను కూడా టీడీపీ కోసం పనిచేశాను. నేనెందుకు డబ్బు ఇవ్వాలని ఎదురు తిరిగినందుకే వైన్స్ షాప్కు నిప్పు పెట్టించాడు. నిందితులు ఎవరన్నది సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. కానీ ఫోన్ పేలో డబ్బులు వేసినా.. మద్యం ఇవ్వలేదని నిందితునితో సాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఊరికే చెప్పడం కాదు.. నిరూపించాలి. నిష్పక్షపాతంగా విచారణ చేయించి, న్యాయం చేయాలని కోరుతూ శనివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి ఎస్పీని కలవాలని నిర్ణయించుకున్నాం. – నంబూరి వెంకటరమణ, నంబూరి వైన్షాపు నిర్వాహకుడు పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు నిందితులు ఫోన్పేలో డబ్బు వేసినా మద్యం ఇవ్వలేదని నిప్పు పెట్టానంటున్న కీలక నిందితుడు రూ.20 లక్షలు ఇవ్వలేదని ఎమ్మెల్యేనే తగులబెట్టించాడని బాధితుడి ఆరోపణ -
నేత్రపర్వం.. చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవం
ఉరవకొండ: చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవం ఉరవకొండలో నేత్రపర్వంగా సాగింది. గురువారం ఉదయం గంగాజలాన్ని ఊరేగించి అమ్మవారిని అభిషేకించారు. వేలాది మంది భక్తజనం మధ్య అమ్మవారి జ్యోతుల ఊరేగింపు అర్ధరాత్రి 12.30 నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. తొగటవీర క్షత్రియులు పురామాను కట్ట చౌడేశ్వరి ఆలయానికి సంబంధించిన జ్యోతులను చౌడేశ్వరి కాలనీ నుంచి మేళతాళాల నడుమ ఊరేగించి ఆలయానికి చేర్చారు. కోటలోని చౌడేశ్వరి ఆలయం నుంచి దేవాంగులు జ్యోతులను పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి తిరిగి అమ్మవారి ఆలయానికి చేర్చారు. ఊరేగింపులో వివిధ ప్రాంతాల కళాకారులు అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. అమ్మవారికి ప్రీతికరమైన ఖడ్గ పద్యాలతో స్తుతిస్తూ భక్తులు మైమరిచిపోయారు. 101 కలశాలతో మహిళలు ఊరేగింపులో పాల్గొన్నారు. జ్యోతుల వేడుకల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో పాటు ప్రసిద్ధిగాంచిన ఉరగాద్రి చౌడేశ్వరీదేవి ఆలయాన్ని భక్తులు, ప్రముఖులు దర్శించకున్నారు. ఆలయ ధర్మకర్త కొత్త శరత్ భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. 101 కలశాలతో ఊరేగింపుగా వస్తున్న మహిళలు జ్యోతులతో నృత్యం చేస్తున్న భక్తులు -
ప్రత్యేక జీవనోపాధి కలే?
అనంతపురం క్రైం: మున్సిపల్ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక జీవనోపాధి కల్పించడంలో మెప్మా (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) చతికిలపడింది. లక్ష్యాల సాధనలో వెనుకబడిపోతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక జీవనోపాధి (స్పెషల్ లైవ్లీహుడ్) కింద 277 యూనిట్లు లక్ష్యం నిర్దేశించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇంతవరకూ మార్గదర్శకాలే విడుదల చేయలేదు. ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగియనుంది. అయితే అధికారులు 118 యూనిట్లను పూర్తి చేసినట్లుగా పేర్కొంటుండటం గమనార్హం. ఇతర యూనిట్లను స్పెషల్ లైవ్లీహుడ్లో చూపించి మమ అనిపిస్తున్నట్లు అర్థమవుతోంది. లోపించిన సమన్వయం.. స్పష్టత అధికారుల్లో సమన్వయ లోపం, క్షేత్రస్థాయి పర్యవేక్షణలో నిర్లక్ష్యం, ప్రాజెక్టుల ఎంపికలో స్పష్టత లేకపోవడం వల్లే లక్ష్య సాధనలో వెనుకబడటానికి కార ప్రధాన తప్పిదాలుగా కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సామర్థ్యాన్ని అంచనా వేయకుండా, ఒకే విధమైన ప్రాజెక్టులను ప్రతిచోటా అమలు చేయాలనే ప్రయత్నం బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. మార్కెట్ అవసరాలకు సరిపోని యూనిట్లు, సరైన శిక్షణ లేకుండా ప్రారంభించిన ప్రాజెక్టులు కొద్ది కాలంలోనే నిలిచిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. యూనిట్లు మంజూరైనా.. బ్యాంకు లింకేజీ రుణాలు సక్రమంగా లేకపోవడం, సబ్సిడీ విడుదలలో ఆలస్యం కావడం వల్ల లబ్ధిదారుల్లో నిరుత్సాహం పెరిగింది. అవసరాలకు అనుగుణంగా చేపడితేనే.. మునిసిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం పనిచేసే మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలోని అనంతపురం నగరపాలక సంస్థతో పాటు తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుత్తి, గుంతకల్లు మున్సిపాలిటీలకు స్పెషల్ లైవ్లీహుడ్ కింద 277 యూనిట్లు మంజూరు చేసింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలనేది దీని ఉద్దేశం. అయితే సంప్రదాయ చిరు వ్యాపారాలకే పరిమితం చేయకుండా పట్టణ అవసరాలకు అనుగుణంగా సేవా రంగం, రీసైక్లింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, డిజిటల్ సేవలు వంటి రంగాల వైపు విస్తరించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రాజెక్ట్ ఎంపికలో మార్కెట్ అధ్యయనం తప్పనిసరిగా చేయాలి. అలాగే, జిల్లా–మున్సిపల్ స్థాయిలో ప్రత్యేక టాస్క్ టీమ్లు ఏర్పాటు చేసి, ప్రాజెక్టుల పురోగతిని నెలనెలా సమీక్షించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెప్మా స్పెషల్ ప్రాజెక్టులు లక్ష్యాలకు మాత్రమే కాదు, పట్టణ పేదల జీవితాల్లో నిజమైన మార్పునకు దోహదపడతాయి. తృప్తి క్యాంటీన్ నమూనా లక్ష్యసాధనలో ‘మెప్మా’ చతికిల విడుదల కాని మార్గదర్శకాలు ప్రత్యేక యూనిట్లపై స్పష్టత కరువు మరో రెండు నెలల్లో ముగియనున్న గడువు -
మాటలు కాదు.. బహిరంగ చర్చకు రా
● జేసీ సవాల్ స్వీకరిస్తున్నా ● తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం: రాయలసీమ పౌరుషంపై వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టడం కాదు.. దమ్ముంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఇందుకు సిద్ధమైతే వెంటనే తేదీ ఖరారు చేసి, ఎస్పీ ద్వారా అనుమతులు తీసుకోవాలని, చర్చ ఎక్కడ పెట్టినా తాను సిద్ధమని పేర్కొన్నారు. ‘కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద పెడతవా? అనంతపురంలోని టవర్ క్లాక్ సెంటర్ను ఎంచుకుంటావా? లేదా కడపలోని కోటిరెడ్డి సర్కిల్ కావాలో ఎక్కడైనా సరే చర్చిద్దాం’ అంటూ సవాల్ చేశారు. తాను, తన కుటుంబ సభ్యులు మాత్రమే వస్తామని స్పష్టం చేశారు. అనంతపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మగతనం కాదని తెలుసుకోవాలన్నారు. ప్రతిసారీ తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ జేసీ ప్రగల్భాలకు పోతున్నారన్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డి 30 ఏళ్ల పాలనపై... ఎమ్మెల్యేగా ఐదేళ్ల తన పాలనపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అమాయకులను రెచ్చగొట్టి తాడిపత్రిలో అక్రమ కేసులు పెట్టిస్తామంటే ఎవరూ మౌనంగా ఉండబోరన్నారు. తాడిపత్రి డివిజన్లో పోలీసులు దాదాపు జేసీ కనుసన్నల్లోనే నడుస్తున్నారు తప్ప.. ఎస్పీ ఆదేశం అక్కడ పనిచేయదన్నారు. మట్కా అంశంలో అసలు సూత్రధారులను అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటూ సాధారణ బీటర్లను బలి పశువులను చేసి మట్కాను కూకటి వేళ్లతో పెకలిస్తున్నామంటూ బీరాలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వాస్తవాలు మాట్లాడితే జేసీ ప్రభాకర్రెడ్డికి ఎందుకు అంత ఉలుకో అర్థం కావడం లేదన్నారు. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై విమర్శ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాయలసీమ పౌరుషం ఏమిటో చూడాలనుకుంటే అమాయకులను రెచ్చగొట్టకుండా రెండు కుటుంబాల వారు మాత్రమే తేల్చుకుందామంటూ మరో సవాల్ విసిరారు. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతల అక్రమాలపై ఇప్పటికే కలెక్టర్కు రెండు సార్లు ఫిర్యాదు చేశానని, విచారణ జరక్కుండా జేసీ ప్రభాకర్రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు.సాక్షాత్తూ కలెక్టర్కు వినతి పత్రం అందజేసినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. -
ప్రమాదమా.. హత్యా?
కూడేరు: మండలంలోని ఎన్సీసీ నగర్ వద్ద జాతీయ రహదారి పక్కన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. గొటుకూరు వీఆర్వో కుళ్లాయిస్వామి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దాదాపు 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండవచ్చునని అంచనా వేశారు. నుదుటన, శరీరంపై బలమైన రక్తగాయాలు ఉన్నాయి. రహదారి వెంట నడుచుకుంటూ వెళుతుండగా వాహనం ఢీకొని మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి, మృతదేహాన్ని సర్వజనాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఎక్కడైనా హత మార్చి ఇక్కడ పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. -
కర్ణాటకలో విక్రయించాం
నాకున్న ఐదు ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో 20 క్వింటాళ్ల దిగుబడులను మద్దతు ధర కన్నా తక్కువకు కర్ణాటక వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. పొలం వద్దకే అధికారులను పంపి ఆన్లైన్ మార్కెటింగ్ విధానంతో పంట కొనుగోలు చేపట్టింది. జగన్ ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలి. – రైతు శ్రీనివాసులు, యలగలవంక, బెళుగుప్ప మండలం -
దండుపాళ్యం బ్యాచ్ తరహాలో అకృత్యాలు
అనంతపురం: ప్రశాంతతకు మారుపేరైన అనంతపురం నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ‘దండుపాళ్యం బ్యాచ్’ తరహాలో ప్రత్యేక ముఠా ఏర్పాటు చేసి అడ్డగోలు దోపిడీకి తెగబడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజా సేవ చేస్తానని, అభివృద్ధి పనులు చేపట్టి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పి ఇప్పుడు దోపిడీ ముఠా నాయకుడిగా దగ్గుపాటి చలామణి అవుతున్నారని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి సమీప బంధువులను తీసుకొచ్చి నగరంలో ఒక ముఠాగా ఏర్పాటు చేసి.. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, భూములను కబ్జా చేసేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రశ్నించినా, ఎదురు తిరిగినా వారిపై దాడులు, బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఎ.నారాయణపురం పంచాయతీ పరిధిలో బుడగజంగాలకు చెందిన ఐదున్నర ఎకరాల భూమి కబ్జా చేశారన్నారు. కక్కలపల్లిలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి భరత్ బంధువులకు చెందిన మూడున్నర ఎకరాలు ఆక్రమించడానికి ప్రయత్నించారన్నారు. కోస్తా ప్రాంతం నుంచి వచ్చి శారదానగర్లో స్థిరపడిన ప్రొఫెసర్ కనకదుర్గ రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. నకిలీ పత్రాలతో ఆమె ఇంటిని కబ్జా చేయడానికి దగ్గుపాటి బ్యాచ్ ప్రయత్నించిందని విమర్శించారు. టీడీపీకి చెందిన లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్వప్ప కూడా బాధితురాలేనని పేర్కొన్నారు. ముడుపులు ఇవ్వలేదని టీడీపీకే చెందిన ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్పై దౌర్జన్యం చేశారన్నారు. ముడుపులు ఇవ్వలేదని వెంకటరమణ అనే టీడీపీ వ్యక్తికి చెందిన వైన్ షాప్కు నిప్పు పెట్టారన్నారు. ఇన్ని ఘటనలు జరిగినా ముఠాకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని ఎస్పీ, డీఎస్పీ, డీఐజీలు ప్రశ్నించకపోవడం విమర్శలకు తావిస్తోందన్నారు. దోపిడీలో చంద్రబాబు, లోకేష్లకూ వాటాలట! ‘ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టి టికెట్ తెచ్చుకున్నాం. మరిప్పుడు సంపాదించుకోకుంటే ఎలా..? అయినా వసూళ్లు చేసిన డబ్బులో సీఎం చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్కు వాటాలు పంపుతున్నాం’ అంటూ ‘దగ్గుపాటి బ్యాచ్’ జనంపై పడి దోచుకుంటున్నారని అనంత విమర్శించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలే కాకుండా తాతముత్తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తులను కూడా కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. థియేటర్లో సినిమా ప్రదర్శించాలన్నా.. నగరంలో చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా.. ఏదైనా కొత్త షోరూం ప్రారంభించాలన్నా ‘ఎమ్మెల్యే ఆఫీస్’ అనుమతి అనివార్యం అనే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడంతో పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లినా ముందుగా ‘ఎమ్మెల్యే ఆఫీస్కు వెళ్లండ’ని సలహా ఇస్తున్నారన్నారు. లాడ్జీల్లో తమవారికి గదులు ఇవ్వకపోతే దగ్గుపాటి బ్యాచ్ దాడులకు తెగబడుతోందన్నారు. లాడ్జీల్లో పేకాట, మట్కా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులు అనంతపురంలో ‘దగ్గుపాటి బ్యాచ్’ ఎక్కడ దారి దోపిడీకి పాల్పడుతుందోనని బెంబేలెత్తిపోతున్నారన్నారు. 19 నెలలుగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆయన బంధువులు అశోక్, స్వరూప్, గంగారామ్ అరాచకాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారంటూ అని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. భయపడొద్దు.. అండగా ఉంటాం అక్రమార్కులు, దౌర్జన్యపరులకు ప్రజలు భయపడాల్సిన పనిలేదని, వైఎస్సార్సీపీతో పాటు అనంతపురంలో ప్రశాంతత కోరుకునే అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మీకు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఇది పాలేగాళ్ల రాజ్యం కాదు.. తస్మాత్ జాగ్రత్త..! పోలీసులు కూడా అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు ఒత్తొద్దు అని సూచించారు. ‘దండుపాళ్యం ముఠా’లో పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారన్నారు. వాళ్ల లావాదేవీలు చూస్తే అన్నీ బయటకు వస్తాయన్నారు.అనంతపురంలో ఖాళీ జాగా కనిపిస్తే కబ్జానే.. ఇల్లు కట్టాలన్నా, షాపు పెట్టాలన్నా, పరిశ్రమ నెలకొల్పాలన్నా కప్పమే దగ్గుపాటి బ్యాచ్ దౌర్జన్యాలు, అకృత్యాలతో టీడీపీ నేతలు సైతం బెంబేలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం -
ఖాద్రీశా.. జగదీశ అంటూ భక్తులు కీర్తించగా...కదిరి లక్ష్మీనరసింహ స్వామి విల్లంభులు చేతబట్టి పార్వేట ఉత్సవానికి బయలుదేరాడు. మానవాళికి హాని చేసే దృష్ట, భయంకర మృగాలను వేటాడి విజయ గర్వంతో తిరిగి వస్తున్న శ్రీవారికి భక్త జనం నమో నారసింహ అంటూ జయజయ ధ్వానాలు పలకగా
● ఘనంగా ఖాద్రీశుని పులి పార్వేట ఉత్సవం ● కుందేలును పట్టుకోవడానికి ఎగబడ్డ భక్తజనం ● శ్రీవారి దర్శనంతో పునీతులైన భక్తులు ● నారసింహ నామంతో ప్రతిధ్వనించిన కదిరి ఖాద్రీశుడి పార్వేట ఉత్సవానికి హాజరైన భక్త జనసందోహం కదిరి అర్బన్: సంక్రాంతిని పురస్కరించుకుని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి పులి పార్వేట ఉత్సవం శుక్రవారం భక్తుల కోలాహలం మధ్య కనుల పండువగా జరిగింది. ఏటా మకర సంక్రాంతి మరుసటి దినం, కనుమ రోజున పులి పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆయుధం ధరించి వన విహారానికి వెళ్లేవారని దృష్ట, భయంకర మృగాలను వేటాడి విజయ గర్వంతో తిరిగి వస్తారని అందుకే పార్వేట ఉత్సవం నిర్వహిస్తారని భక్తుల నమ్మకం. ఆలయంలో ప్రత్యేక పూజలు.. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆలయంలో శ్రీవారికి నిత్యపూజలు, నివేదనలు జరిగాయి. ఉదయం 9 గంటల అనంతరం స్వామి వారు పార్వేట ఉత్సవం కోసం కదిరి కొండకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారికి పూజ, నివేదన, ప్రసాద వినియోగాలు జరిగాయి. పాల పొంగుల ఉత్సవం.. శ్రీవారు కదిరి కొండ నుంచి కుమ్మరవాండ్లపల్లిలోని పాల పొంగిలి మంటపం చేరి పూజలు అందుకున్నారు. అక్కడ స్వామి కాపులైన గొల్లవారు మట్టికుండల్లో పాలు పొంగించి ఆ పాలను శ్రీ వారికి నైవేద్యంగా సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారిని పల్లకీలో కొలువుదీర్చి పార్వేట మంటపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పార్వేట విశిష్టతను తెలియజేశారు. ఆకట్టుకున్న పార్వేట ఉత్సవం.. పాల పొంగుల ఉత్సవం ముగిశాక ఖాద్రీశుడు రైల్వేస్టేషన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ మధ్యలో ఉన్న పార్వేట మంటపానికి చేరుకున్నారు. అప్పటికే అశేష భక్తజనాల కోలాహలంతో ఆ ప్రాంతం గోవిందనామస్మరణతో మార్మోగిపోయింది. ఎప్పటిలాగే ఆచారం ప్రకారం కుందేళ్లను జనం మధ్యకు వదిలారు. కుందేళ్లను పట్టుకోవడానికి భక్తజనం పోటీ పడ్డారు. కొందరు భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. పూర్వం కుందేలు స్థానంలో పులిని వదిలేవారని భక్తులు చెపుతున్నారు. పార్వేట ఉత్సవం ముగిశాక స్వామివారు రాయచోటి రోడ్డులోని ఉట్టివద్ద శమీమంటపం చేరి పూజలు అందుకున్నారు. అశ్వవాహనంపై ఖాద్రీశుడు.. శమీమంటపం వద్ద పూజలు అందుకున్న అనంతరం శ్రీవారు ప్రత్యేక అలంకరణతో అశ్వవాహనంపై పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం తిరిగి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద చోరసంవాదం నిర్వహించాక స్వామివారు తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో పార్వేట ఉత్సవం ముగిసింది. పార్వేటకు హాజరైన అశేషభక్తజనం.. పులి పార్వేట ఉత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాక పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. ఉదయం స్వామి వారిని దర్శించుకుని పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పలువురు పట్టణ ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పార్వేట ఉత్సవాన్ని తిలకించారు. డీఎస్పీ శివనారాయణస్వామి, పట్టణ, రూరల్ సీఐలు నారాయణరెడ్డి, నిరంజన్రెడ్డి పటిష్ట బందోబస్తు నిర్వహించారు. -
పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
గుంతకల్లు: స్థానిక రైల్వే జీఆర్పీ పరిధిలోని గుంతకల్లు–నంచర్ల రైల్వేస్టేషన్ల మధ్య హంద్రీ–నీవా కాలువ సమీపంలోని పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడు చేరుకుని పరిశీలించారు. 30 సంవత్సరాల వయసున్న మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. శరీరంపై ఎలాంటి దుస్తులు లేవు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. రైలు ముందుకు లాక్కెళ్లడంతో ముఖం ఓ వైపు నల్లగా కందిపోయింది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే గుంతకల్లు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఆర్పీఎఫ్ ఎస్ఐ ప్రేమ్కుమార్ కోరారు. -
టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా
● 2 లారీలను సీజ్ చేసిన అధికారులు కుందుర్పి: టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా సాగుతున్న విషయం మరోసారి బట్టబయలైంది. నిత్యమూ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు రాత్రి సమయాల్లో కుందుర్పి మీదుగా వందల సంఖ్యలో లారీలు, టిప్పర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న అంశంలో అధికారుల తీరుపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో మంగళవారం అర్ధరాత్రి జిల్లా కేంద్రానికి ఇసుకను తరలిస్తున్న రెండు భారీ వాహనాలను కుందుర్పి మండలం వెంకటాంపల్లి వద్ద గనుల శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ఆ వాహనాలను సీజ్ చేసినట్లు గనుల శాఖ ఏజీ నారాయణ తెలిపారు. కాగా, మండలంలోని జంబుగుంపల, నిజవళ్లి, ఎనుములదొడ్డి, అల్లాపురం, బసాపురం పంచాయతీల పరిధి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా కర్ణాటక ప్రాంతాలతో పాటు కళ్యాణదుర్గానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లుగా ఆరోపణలున్నాయి. సంక్రాంతి ఆటవిడుపు బత్తలపల్లి: అనంతపురం, బత్తలపల్లి వైద్యుల మధ్య సంక్రాంతి ఆటవిడుపుగా గురువారం నిర్వహించిన క్రికెట్ పోటీ ఉత్సాహంగా సాగింది. బత్తలపల్లిలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో నిర్వహించిన ఈ పోటీల్లో బత్తలపల్లి వైద్యుల జట్టులో ఎస్పీ సతీష్కుమార్, ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్, సీఐలు నాగేంద్ర ప్రసాద్, ప్రభాకర్గౌడు ఆడారు. టాస్ గెలిచిన బత్తలపల్లి డాక్టర్ల జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. జట్టులో ఇర్ఫాన్ 90 పరుగులు, ఎస్పీ సతీష్కుమార్ 31 పరుగులు, ధర్మవరం టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ 30 పరుగులు, రూరల్ సీఐ ప్రభాకర్గౌడ్ 14 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ బరిలో దిగిన అనంతపురం డాక్టర్ల జట్టు 24 ఓవర్లలో 185 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. 28 పరుగులతో బత్తలపల్లి డాక్టర్ల జట్టు విజయం సాధించింది. ఎస్పీ సతీష్కుమార్ 3 వికెట్లు సాధించారు. బ్యాటింగ్లో రాణించిన ఇర్ఫాన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎస్పీ అందజేశారు. -
గ్యాస్ లీకై .. మంటలు చెలరేగి
ఉరవకొండ రూరల్: స్థానిక డ్రైవర్స్ కాలనీలోని ఓ షెడ్డులో వంట గ్యాస్ లీకై భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రూ.25 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన మేరకు... డ్రైవర్స్ కాలనీలో నివాసముంటున్న దాదాఖలందర్ కురుకురె తదితర చిరుతిళ్ల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో స్టాక్ నిల్వ చేసేందుకు ఇంటి సమీపంలోనే ఓ రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం ఉదయం సరుకులను తరలించేందుకు సిద్ధమైన ఆయన ఒమినీ వాహనాన్ని షెడ్డులో ఉంచి వంట గ్యాస్ సిలిండర్ నుంచి వాహనంలోని సిలిండర్లోకి గ్యాస్ బదలాయిస్తుండగా లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షెడ్డులో ఉంచిన బుల్లెట్ వాహనాన్ని మంటలు చుట్టుముట్టడంతో వేడికి పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. రూ.25 లక్షలకు పైగా విలువైన తినుబండారాల ప్యాకెట్లు, ఒమినీ, బుల్లెట్ వాహనాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. -
వ్యాపారం ముసుగులో భారీ మోసం
తాను చేస్తున్న వ్యాపారంలో రూ. లక్ష పెట్టుబడి పెడితే రోజూ రూ.2 వేలు చొప్పున ఆదాయం ఉంటుందంటూ విసిరిన పాచిక పారింది. నమ్మి రూ.లక్షల్లో జనం పెట్టుబడి పెట్టసాగారు. ఈ మోసాన్ని స్థానిక పోలీసులు పసిగట్టలేకపోయారు. చివరకు ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తం చేయడంతో రంగంలో దిగే లోపు జనం భారీగా మోసపోయారు. బొమ్మనహాళ్: జనం అత్యాశను తెలివిగా సొమ్ము చేసుకున్నాడు ఓ మోసగాడు. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు నెలల క్రితం గ్రామానికి చేరుకున్న ఓ ఆగంతకుడు తన పేరు మహేష్రెడ్డి అని, సొంతూరు గుంతకల్లు పట్టణమని, చక్కెర, సిగరెట్ల వ్యాపారం చేస్తుంటానని, ఉద్దేహాళ్లో తెలిసిన వారు ఉండడంతో ఇక్కడ బ్రాంచ్ తెరుస్తున్నట్లుగా పరిచయం పెంచుకున్నాడు. గ్రామంలోని రాధిక కాంప్లెక్స్లో ఓ గదిని అద్దెకు తీసుకుని వ్యాపారం పేరుతో జనాన్ని పోగేశాడు. ఈ క్రమంలో తాను చేస్తున్న వ్యాపారంలో రూ. లక్ష పెట్టుబడి పెడితే రోజూ రూ.2 వేలు ఆదాయం సమకూరుతుందని నమ్మించాడు. ఈ క్రమంలో కొందరు నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టారు. దీంతో వారికి రోజూ రూ.2 వేలు చొప్పున ఇస్తూ మరికొందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. నమ్మిన చాలా మంది అప్పులు చేసి మరీ డబ్బు పెట్టుబడిగా ఇస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన రంగారెడ్డి, మల్లేష్, వీరేష్, ఫృథ్వీతో పాటు మరికొందరితో ఎలాంటి రాతపూర్వక ఆధారాలు లేకుండా భారీ మొత్తాన్ని వసూలు చేశాడు. ఈ లెక్కన గ్రామస్తులతో రూ.1.50 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలిసింది. ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన వన్నూరుస్వామితో సన్నితంగా ఉంటూ అతని ద్వారా గ్రామానికి చెందిన జోగి సిద్దన్న, మురిడప్ప, లింగన్నకు చెందిన 50 గొర్రెలు, నేమకల్లు గ్రామానికి చెందిన గోవిందరాజు వద్ద నుంచి 40 గొర్రెలను కొనుగోలు చేయించాడు. జోగి సిద్దన్న, మురిడప్ప, లింగన్నకు రూ. 1 లక్ష, గోవిందరాజుకు రూ.500 అడ్వాన్సు మాత్రమే చెల్లించాడు. వెలుగులోకి వచ్చింది ఇలా.. కాగా, మహేష్రెడ్డి అనే నయవంచుకుడి చేతిలో గతంలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వాసులు దారుణంగా మోసపోయారు. ఈ ఘటనకు సంబంధించి ప్రకాశం జిల్లా పోలీసులు కేసులు నమోదు చేసి, మోసగాడి కోసం గాలింపు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఉద్దేహాళ్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా గుర్తించిన వారు రెండు రోజుల క్రితం బొమ్మనహాళ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంగళవారం సాయంత్రం పోలీసులు ఉద్దేహాళ్కు చేరుకుని ఆరా తీయడం మొదలు పెట్టారు. అప్పటికే నయవంచకుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయి ఉంది. డ్రైవర్లు సైతం అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులు తాము మోసపోయినట్లుగా నిర్ధారించుకున్నారు. మహేష్రెడ్డికి గొర్రెలు ఇచ్చి మోసపోయిన కాపరులు ఎస్ఐ నబీరసూల్ను ఆశ్రయించి, తమకు న్యాయం చేయాలని విన్నవించారు. కాగా, ఇప్పటి వరకూ ఎవరూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, యర్రగొండపాలెం పోలీసుల సమాచారంతో గ్రామంలో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రూ.లక్ష డిపాజిట్ చేస్తే రోజూ రూ.2 వేలు ఆదాయం అంటూ విసిరిన వల ప్రకాశం జిల్లా పోలీసుల సమాచారంతో బట్టబయలైన నయవంచన స్థానిక పోలీసుల రంగ ప్రవేశంతో అజ్ఞాతంలోకి రూ.1.50 కోట్లు, 90 గొర్రెలతో ఉడాయించిన మోసగాడు -
గొర్రెల దొంగల అరెస్ట్
పెద్దవడుగూరు: ఈ నెల 9న పెద్దవడుగూరుకు చెందిన కాపరి నెట్టికంటయ్య పోషిస్తున్న గొర్రెలను అపహరించిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం స్థానిక పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ ఆంజనేయులుతో కలసి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి వెల్లడించారు. గొర్రెల అపహరణపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పక్కా ఆధారాలతో బుధవారం రాప్తాడు మండలం చిన్మయనగర్లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన డేరంగుల విజయ్కుమార్, అనంతపురంలోని చంద్రబాబుకొట్టాలకు చెందిన మొండి నాగార్జున అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. నేరాన్ని అంగీకరించడంతో వారి నుంచి రూ.7.50 లక్షల విలువైన 30 గొర్రెలు, 30 మేకలు, 12 పొట్టేళ్లు, టాటా పికప్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వానరానికి అంత్యక్రియలు గుంతకల్లు రూరల్: స్థానిక మస్తాన్వలి దర్గా సమీపంలో బుధవారం ఓ వానరం మృతి చెందడంతో సమాచారం అందుకున్న గోహిత సేవా సమితి సభ్యులు అక్కడకు చేరుకుని పట్టణ శివారు ప్రాంతంలో ఖననం చేశారు. కార్యక్రమంలో సమితి సభ్యులు వరప్రసాద్, వాల్మీకి వంశీ, పురుషోత్తం, అనిల్ అరీఫ్ బాషా, ఫకృద్ధీన్ తదితరులు పాల్గొన్నారు. అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి తాడిపత్రి రూరల్: స్థానిక గన్నెవారిపల్లి కాలనీకి చెందిన శివశంకర్రెడ్డి (36) అతిగా మద్యం సేవించి నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ మేరకు తాడిపత్రి అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్రెడ్డి వెల్లడించారు. బుధవారం అతిగా మద్యం సేవించిన శివశంకరరెడ్డి మత్తులో రావివెంకటాంపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మద్యానికి బానిసగా మారి జులాయిగా తిరుగుతుండడంతో శివశంకరరెడ్డిని గతంలో భార్య వదిలేసిందని, ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడని పోలీసులు వివరించారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై వినూత్న నిరసన
అనంతపురం: చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలు, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. వైఎస్సార్సీపీ నాయకులు పార్టీ జిల్లా కార్యాలయం ముందు చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు తెచ్చిన జీఓ ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. ప్రభుత్వ అహం ఈ మంటల్లో తొలగిపోవాలని నినదించారు. చంద్రబాబు నిరంకుశత్వ విధానాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణ పేదలు, మైనార్టీ విద్యార్థులు డాక్టర్ కావాలనే కలను ఛిద్రం చేసిందని ఆవేదన చెందారు. పేద విద్యార్థుల శ్రేయస్సుకు విఘాతం కలిగించే పీపీపీ జీఓను వెనక్కు తీసుకునేలా చంద్రబాబుకు దేవుడు మంచిబుద్ధి ప్రసాదించాలని పేర్కొన్నారు. పెత్తందార్ల శ్రేయస్సుకే ప్రైవేటీకరణ పెత్తందార్ల శ్రేయస్సు కోసమే ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు పీపీపీ విధానం తీసుకొచ్చారని చంద్రబాబు సర్కారుపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ధ్వజమెత్తారు. నాణ్యమైన వైద్యవిద్యను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు అందించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఏకంగా 17 కొత్త మెడికల్ కళాశాలలను మంజూరు చేయించారన్నారు. స్వాతంత్య్రం తరువాత ఏ రాష్ట్రంలోనూ ఒకే దఫా 17 మెడికల్ కళాశాలలు రాలేదన్నారు. రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తే కళాశాలల భవన నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. 16 నెలల కాలంలో రూ.2లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వానికి.. రూ.5వేల కోట్ల నిధులు మెడికల్ కాలేజీలకు కేటాయించలేరా అని నిలదీశారు. ఉద్దేశ పూర్వకంగానే ప్రైవేటీకరణ పేరుతో పెత్తందార్లకు రూ.లక్ష కోట్ల ప్రజల ఆస్తిని ధారాదత్తం చేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. పార్టీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్, మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్లు దాసరి వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆలమూరు శ్రీనివాస రెడ్డి, నాగన్న (న్యాయవాది) తదితరులు చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, బూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు అమర్నాథరెడ్డి, దామోదర్రెడ్డి, ఇంటెలెక్చువల్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శంకరయ్య, ప్రధాన కార్యదర్శి తానీషా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, న్యాయవాది హనుమన్న, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదా ఖలందర్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, కార్యదర్శి అనిల్కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఇంకా నాయకులు లక్ష్మన్న, ముక్తియార్ అహమ్మద్, గంగాధర్, రాఘవ, సురేష్, సాకే అశోక్, చెన్నారెడ్డి, రాజా, వెంకటేశ్, రమేష్ గౌడ్, వేణుగోపాల్, కోనా రాజారెడ్డి, మహిళా నాయకులు రాధాయాదవ్, భారతి, కార్పొరేటర్లు సాకే చంద్రలేఖ, కమల్ భూషణ్, శేఖర్బాబు, రాజేశ్వరి, ఇసాక్, రహంతుల్లా, నాయకులు సాదిక్, నాగార్జునరెడ్డి, దాదు, సాకే కుళ్లాయిస్వామి, రాధాకృష్ణ, మహబూబ్బీ తదితరులు పాల్గొన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కు తీసుకోవాలి చంద్రబాబుకు దేవుడు మంచిబుద్ధి ప్రసాదించాలి -
ఆదరణ కోల్పోయి.. ఉపాధి కరువై
● బతుకు భారమైందంటున్న గంగిరెద్దుల కళాకారులు తాడిపత్రి రూరల్: సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు, హరిదాసులు, గంగిరెద్దుల కళాకారుల శోభ కంటి ముందు కదలాడుతూ ఉంటుంది. పల్లెల్లో అయితే గంగిరెద్దులను సాక్షాత్తూ దైవస్వరూపంగా భావించి పూజించేవారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి శోభ కాస్త సన్నగిల్లింది. అరటి తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోయిన రైతులు పండుగ జరుపుకోవడంలో ఉదాసీనంగా ఉండిపోయారు. పండుగ చేయాలంటే చేయాలి అనే ధోరణి గ్రామాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో గంగిరెద్దులకు ఆదరణ కరువైంది. దీంతో పట్టణ ప్రాంతానికి గంగిరెద్దుల కళాకారులు చేరుకుని ఇంటింటికీ తిరుగుతూ వారిచ్చే కానుకలను తీసుకోవడం కనిపించింది. గమనించిన ‘సాక్షి’ వారిని పలకరిస్తే చెమ్మగిల్లిన కళ్లతో తమ కష్టాన్ని వారు పంచుకున్నారు. -
కేబుల్ దొంగల అరెస్ట్
యాడికి: మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ బోరు బావులకు అమర్చిన విద్యుత్ కేబుల్ను అపహరించుకెళ్లిన కేసుల్లో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యాడికి పీఎస్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ శ్రీనివాసులు వెల్లడించారు. యాడికి మండలం చందన, రాయలచెరువు, పెద్దపేట, దైవాలమడుగు, వేములపాడు గ్రామాల్లో ఇటీవల బోరు బావులకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ కేబుల్ను దుండగులు అపహరించారు. ఆయా ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నలుగురు వ్యక్తులు రాయలచెరువులోని గుజరీ వ్యాపారి వద్ద కేబుల్, కేబుల్ కాల్చడం ద్వారా బయటపడిన రాగిని అమ్ముతుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వ్యవసాయ బోరు బావుల వద్ద నుంచి కేబుల్ను అపహరించినట్లుగా అంగీకరించారు. వీరి నుంచి 500 మీటర్ల పొడవైన కేబుల్, 30 కిలోల కాపర్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పసుపులేటి రమేష్, నగిరి చెన్నమనాయుడు, నూతన కమలాకర్, మిడుతూరు మౌలాలీ ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేబుల్ అపహరణ : మండలంలోని రాయలచెరువు గ్రామానికి చెందిన రైతులు ఇంటూరు ప్రసాద్ నాయుడు, సాయి నాయుడు, మధుసూదన్ నాయుడు, రంగస్వామి, చింతలకొండ, ఆర్పీ రమేష్, చెలంకూరు బాబు, కోనాపురం రామాంజి.. తోటల్లో వ్యవసాయ బోరుబావులకు అమర్చిన వంద మీటర్లకు పైగా కేబుల్ను మంగళవారం రాత్రి దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పండుగపూట అంతులేని విషాదం
● వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం పామిడి: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకుల మృతితో పండుగ పూట రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన మేరకు.. పామిడిలోని వెంగమనాయుడు కాలనీకి చెందిన ద్వారక గజని (21) బుధవారం సాయంత్రం కాలినడకన ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద 44వ జాతీయ రహదారి దాటుతుండగా బెంగుళూరు వైపు నుంచి గుత్తి వైపుగా వెళుతున్న లారీ ఢీకొంది. ఘటనలో గజని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన 10 వతరగతి విద్యార్థి ప్రేమ్ మృతి చెందాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన తల్లితో కలసి గుత్తిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన ప్రేమ్.. పెద్దవడుగూరు మండలం మిడుతూరులోని పెద్దమ్మను చూసేందుకు స్కూటర్పై వెళ్లాడు. అనంతరం స్కూటర్పై పామిడికి బయలుదేరిన బాలుడు.. స్థానిక వై జంక్షన్ వద్దకు చేరుకోగానే వెనుకనే వస్తున్న టాటా ఏఎస్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రేమ్ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని సర్వజనాస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలి బలవన్మరణం అనంతపురం సెంట్రల్: జీవితంపై విరక్తితో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని నవయుగ కాలనీకి చెందిన శంకరమ్మ (67) మానసిక స్థితి సరిగా లేదు. కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె మంగళవారం సాయంత్రం హెచ్చెల్సీలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నాల్గో పట్టణ సీఐ జగదీష్ తెలిపారు. సౌత్జోన్ జట్టుకు 8 మంది ఎంపిక అనంతపురం కార్పొరేషన్: అండర్ –14 సౌత్జోన్ క్రికెట్ జట్టుకు అనంతపురం జిల్లాకు చెందిన 8 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎంపికై న వారిలో ఆర్.హవీష్రెడ్డి, జగదీష్ యాదవ్, ఎస్.మహమ్మద్తన్వీర్, దిషిక్రెడ్డి, సగప్రతీక్, పి.రేహాన్, వి.చరణ్తేజ్, జి.ధనుష్ ఉన్నారు. -
పండుగ వాతావరణమే లేదు
మా చిన్నప్పుడు సంక్రాంతి అంటేనే సంబరంగా భావించేవాళ్లం. ఇంటికి కొత్త ధాన్యం చేరిక, అల్లుళ్లు, కూతుళ్లు, వారి పిల్లలు, బంధువుల రాకతో సందడిగా ఉండేది. గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు చెవికి వినసొంపుగా ఉండేవి. ఆ సంప్రదాయాలే కనుమరుగయ్యాయి. అరకొరగా చేసే పండుగ కూడా ఈ ఏడాది భారమైంది. సరైన పంటలు చేతికందక, సంక్షేమ పథకాలు దరి చేరక ఏ ఇంట చూసిన ‘సంభ్రాంతి’గా మారింది. గత ప్రభుత్వంలో ఏదో ఓ సంక్షేమం పథకం ద్వారా లబ్ధి చేకూరేది. పేదల అవసరాలు తీరేవి. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో అలాంటివేవీ కనిపించడం లేదు. – బ్రహ్మానందరెడ్డి, కణేకల్లు మండలం -
నేటి నుంచి ఉరవకొండలో చౌడేశ్వరీ ఉత్సవాలు
ఉరవకొండ: స్థానిక చౌడేశ్వరీ అమ్మవారి జ్యోతుల ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఐదేళ్లకు ఓసారి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఉత్సవాలకు దేవాంగ, తొగటవీరక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడళ్లను రంగురంగుల విద్యుత్ దీపాలు, అమ్మవారి భారీ కటౌట్లతో ముస్తాబు చేశారు. గురువారం అర్ధరాత్రి జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. శతాధిక వృద్ధుడి మృతి బెళుగుప్ప: స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ మార్గంలో నివాసముంటున్న మోతుబరి రైతు, కళాకారుడు అక్కిశెట్టి దొణప్ప(101) బుధవారం మృతిచెందారు. వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో తన నివాసంలోనే ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మనుమలు, మనుమరాళ్లు, మునిమనువలతో కలసి వందమందికి పైగా ఉన్నారు. రంగస్థల నటుడిగా ధర్మరాజు, కృష్ణుడు పాత్రలతో మెప్పించిన దొణప్ఫ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురుబోధన తీసుకున్న ఆయన అంత్యక్రియలు స్థానిక బ్రహ్మంగారి మఠం ఈశ్వరస్వామి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. వ్యక్తి ఆత్మహత్య బెళుగుప్ప: మండలంలోని గుండ్లపల్లిలో నివాసముంటున్న వేంపల్లి నాగేశ్వరరాజు (53) ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆయన 20 ఏళ్లుగా గుండ్లపల్లిలో అద్దె గదిలో నివాసముంటున్నా డు. డీఎంసీ కంకర యూనిట్లో ఆపరేటర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం తాను నివాసముంటున్న అద్దె గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బెళుగుప్ప పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కళ్యాణదుర్గంలోని సీహెచ్సీలో ఉన్న మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రైలులో వృద్ధురాలి మృతి ధర్మవరం అర్బన్: రైలులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలు మృతిచెందింది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. దైవదర్శనం కోసం మంత్రాలయం వెళ్లిన కర్ణాటకలోని తుమకూరు జిల్లా యద్దెనహళ్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవమ్మ(65) బుధవారం షోలాపూర్ నుంచి హాసన్కు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలులో తిరుగు ప్రయాణమైంది. అనంతపురం దాటిన తర్వాత అస్వస్థతకు లోనైన ఆమె ధర్మవరానికి రైలు చేరుకునేలోపు మృతి చెందింది. స్థానిక రైల్వే స్టేషన్కు రైలు చేరుకోగానే మృతదేహాన్ని రైల్వే పోలీసులు కిందకు దించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
డీపీఓలో సంక్రాంతి సంబరాలు
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జగదీష్, హేమ దంపతులు భోగి మంటలు వెలిగించి సంబరాలను ప్రారంభించారు. గాలిపటాలు ఎగురవేయడం, ఉట్టి కొట్టడం తదితర సాంప్రదాయ క్రీడలు ఆసక్తిగా జరిగాయి. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎస్పీ సతీమణి హేమ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి అశ్విని మణిదీప్, ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్బాషా, డీఎస్పీలు శ్రీనివాసరావు, నీలకంఠేశ్వరరెడ్డి, పలువురు సీఐలు, పోలీసు అధికారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. అలరించిన సంగీత విభావరి ప్రశాంతినిలయం: సత్యసాయిని స్మరిస్తూ నిర్వహించిన సంగీత విభావరి భక్తులను మంత్ర ముగ్దులను చేసింది. బుధవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో ప్రశాంతి నిలయం బృందావన్, నందగిరి క్యాంపస్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నేడు సంక్రాంతి వేడుకలు సత్యసాయి సన్నిధిలో సంక్రాంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే సత్యసాయి మహా సమాధిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. ఇటీవల నిర్వహించిన సత్యసాయి క్రీడా సాంస్కృతిక సమ్మేళనంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సంక్రాంతి వేడుకల్లో భాగంగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. -
ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలి
అనంతపురం:సంక్రాంతి వేళ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆనందాలు వెల్లివిరియాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆకాంక్షించారు. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్సార్సీపీ శ్రేణులకు ఆయన మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అనంతపురం అర్బన్: జిల్లా ప్రజలకు ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవుని కరుణ, కటాక్షాలు, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఇల్లూ సిరిసంపదలు తులతూగాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం గడపాలని కోరుకున్నారు. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. జీతాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు బిల్లులు ● డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసుల జారీ అనంతపురం ఎడ్యుకేషన్: పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించకుండానే చెల్లించినట్లు బిల్లులు పెట్టుకున్నారు. తప్పుడు రికార్డులతో నిధులు పక్కదారి పట్టించారు. ఎట్టకేలకు అధికారులు గుర్తించి గుంతకల్లు డిప్యూటీ ఎంపీడీఓ, నెలగొండ పంచాయతీ కార్యదర్శిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నెలగొండ గ్రామ పంచాయతీలో 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదులు అందాయి. ఈక్రమంలో ఇటీవల డీపీఓ నాగరాజునాయుడు నెలగొండ గ్రామాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనలకు విరుద్ధంగా, గ్రామ పంచాయతీ నుంచి ఆమోదం లేకుండా డ్రా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించకుండానే చెల్లింపులు చేసినట్లు, తప్పుడు రికార్డులతో నిధులు మళ్లించినట్లు గుర్తించారు. అప్పటి పంచాయతీ కార్యదర్శి రమావత్ రమేష్ నాయక్, పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శించిన డిప్యూటీ ఎంపీడీఓ నాగభూషణకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా హాజరై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ -
నేడు హెచ్చెల్సీకి నీరు బంద్
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి నీటి సరఫరాను గురువారం బంద్ చేస్తున్నట్లు తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. 2025–26 నీటి సీజన్ ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది జూలై 17న తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీరు విడుదల చేయగా.. 19వ తేదీ ఆంధ్ర సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్దకు చేరింది. అప్పటి నుంచి 180 రోజులు ఏకధాటిగా నీటి సరఫరా కొనసాగిందని హెచ్చెల్సీ అధికారులు తెలిపారు. హెచ్చెల్సీ వాటా 25.755 టీఎంసీలు, కేసీ కెనాల్ మళ్లింపు కోటా కింద మరో 3 టీఎంసీలు కలిపి 28.755 టీఎంసీలు కేటాయింపు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 28.843 టీఎంసీల నీరు సరఫరా కాగా.. సరిహద్దులో 25.978 టీఎంసీల నీరు చేరాయి. నేడు టీబీ డ్యాంలో హెచ్చెల్సీకి నీరు బంద్ చేస్తే.. శుక్రవారం సాయంత్రానికి సరిహద్దులో నీటి మట్టం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్ర సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్ద 1,050 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇక జలాశయంలో 1604.73 అడుగుల నీటి మట్టం వద్ద 28.280 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 3,474 క్యూసెక్కుల అవుట్ఫ్లో రూపంలో వివిధ కాలువల ద్వారా నీరు బయటికి పోతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. -
కర్షక వనం.. కాశీపురం
గుమ్మఘట్ట: రాయదుర్గం మండలం కాశీపురమంటే గ్రామం ఒకప్పుడు పోలీసులకు సైతం కునుకు పట్టేది కాదు. ఆ గ్రామం మీదుగా జుంజురాంపల్లి, మలకాపురం, కెంచానపల్లికి వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు. చీకటి పడగానే గ్రామం దాటి వెళ్లిన దాఖలాలు లేవు. 250 కుటుంబాలు నివాసముంటున్న ఆ గ్రామంలో ప్రస్తుతం 1,250 మంది నివాసముంటున్నారు. కావలి, హరిజనులు మాత్రమే జీవిస్తున్నారు. 750 ఎకరాల పట్టా భూములు, 112 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. దుర్భర పరిస్థితులు తాళలేక కాశీపురం గ్రామానికి ఎలాంటి సాగునీటి వనరులు లేవు. గ్రామానికి సంబంధించి చెరువు, కుంట లాంటివి కూడా లేదు. ఉన్న 750 ఎకరాల పట్టా భూములతో పాటు 112 ఎకరాల ప్రభుత్వ బంజరు భూముల్లో వ్యవసాయాధిరత పంటలను అక్కడి వారు సాగు చేస్తూ జీవనం సాగించేవారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం 1995లో కరువు విలయతాండవానికి కాశీపురం వాసులు గజగజ వణికిపోయారు. చినుకు నేల రాలకపోవడంతో పంటలు సాగు చేయలేకపోయారు. ఇళ్లలో నిల్వ ఉన్న తిండి గింజలు చూస్తుండగానే అయిపోయాయి. కరువు కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లోనూ పనులు లేక ఇబ్బంది పడసాగారు. ఆకలితో ఏడుస్తున్న పిల్లల బాధను చూడలేక చివరకు రైతులు కాస్త సమీపంలోని పట్టణ ప్రాంతాలకు చేరుకుని భిక్షమెత్తుకునేందుకు సిద్ధమయ్యారు. అక్కడ వారికి ఛీత్కారాలు తప్పలేదు. ‘చూసేందుకు కాళ్లూచేతులు బాగానే ఉన్నాయి కదా? ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా?’ అంటూ హేళనగా మాట్లాడుతుంటే మౌనంగా కన్నీరు పెట్టుకోవడం తప్ప మరో గత్యంతరం లేకపోయింది. కష్ట కాలంలో ఆదుకోవాల్సిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతు బాగోగులు పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో దిక్కుతోచలేదు. పిల్లల ఆకలి తీర్చేందుకు మరో మార్గం కనిపించని పరిస్థితుల్లో ఓ రోజు రాత్రి తమ గ్రామం మీదుగా పొరుగూరికి వెళుతున్న వ్యక్తిని అటకాయించి అతని వద్ద ఉన్న డబ్బు మొత్తం దోచేశారు. ఆ డబ్బుతో ఓ పూట పిల్లల ఆకలి తీరింది. దీంతో తాము బతకాలంటే దొంగతనాలు తప్ప మరో మార్గం లేదని భావించిన కొందరు దారిదోపిడీలను మార్గంగా ఎంచుకున్నారు. దొంగతనాలకు స్వస్తి పలికి కాలానుగుణంగా అక్కడి ప్రజల్లోనూ మార్పు వచ్చింది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రైతు కష్టాలు ఒక్కొక్కటిగా దూరమవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే కాశీపురం వాసుల్లోనూ మార్పు వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందిపుచ్చుకుంటూ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించారు. మొక్కజొన్న, మిరప, వేరుశనగ, టమాట, మామిడి, కంది, అరటి, సపోట తదితర పంటల సాగు చేపట్టి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతూ వచ్చారు. తమలా భవిష్యత్తులో పిల్లలు ఇబ్బంది పడకూడదని భావించిన గ్రామస్తులు తమ పిల్లలను చదువులపై దృష్టి సారించేలా చేశారు. 120 మందికి పైగా ఉన్నత చదువులు అభ్యసించారు. ప్రభుత్వ కొలువుల్లో ముగ్గురు స్థిరపడ్డారు. పాడి పోషణతో గణనీయ ఆర్థిక పురోభివృద్ధి సాధించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జలయజ్ఞం పథకం ద్వారా మెట్ట భూముల్లో బోరుబావులు ఏర్పాటు చేసుకుని వ్యవసాయాన్ని సుసంపన్నం చేయగలిగారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ రైతుభరోసా, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, అమ్మవడి, వైఎస్సార్ ఆసరా, పక్కా గృహాలు, జగనన్న చేదోడు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాలతో కష్టాల నుంచి గట్టేక్కి దొంగతనాలకు పూర్తిగా స్వస్తి పలికారు. ప్రస్తుతం రైతుగా సమాజంలో గౌరవ స్థానాన్ని అంది పుచ్చుకున్నారు. రత్నాకరుడనే దొంగ పశ్చాత్తాపంతో వాల్మీకిగా మారి రామాయణం రాసి మహర్షిగా లోకానికే ఆదర్శంగా నిలిచాడు. అచ్చం అలాగే బాటసారులను నిలువుదోపిడీ చేసే కాశీపురం వాసులు కర్షకులుగా మారి రైతులకే ఆదర్శంగా నిలిచారు. ఒకప్పుడు ఆ గ్రామం మీదుగా వెళ్లాలంటే హడలెత్తిపోయేవారు... నేడు పంటల సాగు గురించి తెలుసుకునేందుకు కాశీపురం వెళ్తున్నారు. నాడు కాశీపురం వెళ్లి నిలువు దోపిడీకి గురయ్యామని చెప్పేవారు...నేడు సాగులో పాఠాలు నేర్చుకుంటున్నామని చెబుతున్నారు. నాడు దొంగలుగా సమాజానికి దూరంగా బతికిన కాశీపురం వాసులు ఇప్పుడు హలం పట్టి వివిధ రకాల పంటల సాగుతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కరువుతో ఒకప్పుడు చోరీలకు నిలయం పాడిపంటలతో నేడు అభివృద్ధికి పర్యాయపదం సమాజానికి ఆదర్శంగా నిలిచిన గ్రామం -
అతిక్రమిస్తే చర్యలు తప్పవ్ : డీటీసీ
● అధిక చార్జీలు వసూలు చేసిన రెండు బస్సులపై కేసు ● పర్మిట్, ట్యాక్స్ లేని 14 బస్సులపై కూడా కేసుల నమోదు అనంతపురం సెంట్రల్: సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సుల్లో టికెట్ చార్జీలు అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) వీర్రాజు మంగళవారం హెచ్చరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫేర్ మానిటరింగ్ టీమ్స్ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేసినట్లు వివరించారు. ఆర్టీసీ నిర్దేశించిన చార్జీలపై గరిష్టంగా 50 శాతం మాత్రమే ప్రైవేట్ ట్రావెల్స్లో అదనంగా వసూలుకు అవకాశముందన్నారు. అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఐదు రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో అధిక చార్జీలు వసూలు చేసిన రెండు బస్సులపై కేసు నమోదు చేసి, రూ. 20వేలు జరిమానా విధించామన్నారు. ట్యాక్సు చెల్లించని, పర్మిట్ లేని 14 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1.96 లక్షల జరిమానా విధించినట్లు వివరించారు. ఈ తనిఖీలు ఈనెల 18 వరకూ కొనసాగుతాయని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నంబర్ 9281607001కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
తల్లి మందలింపు.. యువకుడి బలవన్మరణం
పెద్దవడుగూరు: తల్లి మందలింపుతో క్షణికావేశానికి లోనై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం నాగలాపురం గ్రామానికి చెందిన మాదిగ నవీన్(19) అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రోజూ కళాశాలకు వెళ్లి వచ్చేవాడు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇంటి వద్దనే ఉంటూ జులాయిగా తిరుగుతుండడంతో మంగళవారం తల్లి లక్ష్మి మందలించింది. ఏదైనా పనికి వెళితే పండుగ ఖర్చుకు డబ్బులు వస్తాయని హితవు పలికింది. దీంతో తల్లితో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం గ్రామ శివారున పొలాల్లో పురుగుల మందు సేవించి ఆపస్మారక స్థితిలో పడి ఉండడంతో గమనించిన రైతుల నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వెంటనే పామిడిలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. చికిత్సకు స్పందించక అనంతపురంలోని ఆస్పత్రిలో నవీన్ మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గొరిదిండ్ల సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా ఆత్మకూరు: మండలంలోని గొరిదిండ్ల, గొరిదిండ్ల తండా, ముట్టాల, పాపంపల్లి గ్రామాలకు గొరిదిండ్ల సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరాను అధికారులు చేపట్టారు. సబ్ స్టేషన్ను ప్రారంభించి నాలుగు నెలలవుతున్నా విద్యుత్ సరఫరా చేపట్టక పోవడంతో ఆత్మకూరు సబ్ స్టేషన్ నుంచి ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేవారు. ఈ క్రమంలో లో ఓల్టేజీ కారణంగా ఒకే రోజు 70 మోటార్లు కాలిపోయిన అంశంపై ‘ప్రచార ఆర్భాటం.. రైతుకు శాపం’ శీర్షికన ఈ నెల 7న ‘సాక్షి’లో ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన మండల ఏఈ దాస్.. సిబ్బందితో కలసి మరుసటి రోజు ఆయా గ్రామాల్లో పర్యటించి రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులతో చర్చించి గొరిదిండ్ల సబ్స్టేషన్ ద్వారా మంగళవారం నుంచి విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులపై ఫిర్యాదు..! అనంతపురం సెంట్రల్: ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరుడు గంగారం, మరికొందరు తమ భూమిని కబ్జా చేస్తున్నారని టీడీపీకి చెందిన రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్వప్న మంగళవారం రాత్రి నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ మండలం ఏ.నారాయణపురం పొలంలో 179 సర్వే నంబర్లోని 43 సెంట్లు స్థలం ఇటీవల వివాదాస్పదంగా మారింది. తమ పూర్వీకుల నుంచి వస్తున్న స్థలాన్ని ఎవరో కబ్జా చేశారని డిసెంబర్ 29న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ జగదీష్ను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే అందులో ఎవరిపేర్లూ లేకపోవడంతో మరోసారి ఫిర్యాదు ఇవ్వాలని పోలీసు అధికారుల స్వప్నకు సూచించారు. దీంతో మంగళవారం రాత్రి ఆమె నాల్గో పట్టణ పోలీసుస్టేషన్లో మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే చైర్పర్సన్ స్వప్న మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. వివరాలు చెప్పేందుకు పోలీసులు సైతం నిరాకరించారు. -
రెచ్చగొట్టేవారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అనంతపురం అర్బన్: విద్వేషాలతో రెచ్చగొడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. అనంతపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సహాయ కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, జె.రాజారెడ్డి, ఇతర నాయకులతో కలిసి మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని, పేదలకు సంక్షేమ పథకాల కల్పనలో దుర్మార్గపు నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పీపీపీ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులతో బుధవారం భోగిమంటల కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేస్తామన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్రపూరిత ఆలోచనను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న నరిగమ్మ ఆలయ అంశంలో కోర్టు ఉత్తర్వులను అమలు పర్చాలని డిమాండ్ చేశారు. గుడి పేరుతో ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తున్న వ్యక్తులు, సంఘాలను ఉపేక్షించకూడదన్నారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేష్గౌడ్, రామాంజనేయులు, మండల కార్యదర్శి నరేష్, తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
అనంతపురం సెంట్రల్: నగరంలోని పాతూరు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు ఆవరణలో ఈ నెల 8న చంద్రబాబు కొట్టాలకు చెందిన బోయ ఆంజనేయులు హత్య చేసిన ఘటనలో నిందితుడు మేకల వంశీని అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. నగర పాలక సంస్థ తాగునీటి విభాగంలో పనిచేస్తున్న ఆంజనేయులు, వంశీ మధ్య కొంత కాలంగా మనస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 8న రాత్రి 2 గంటల సమయంలో విధుల్లో ఉన్న సమయంలో వంశీ రాయితో తలకు బాదడంతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. 55 శాతం రాయితీతో డ్రిప్ ఆటోమేషన్ అనంతపురం అగ్రికల్చర్: ఉద్యాన తోటల్లో సూక్ష్మ సాగు సేద్యానికి దోహదపడేలా ఆటోమేషన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయని ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆటోమేషన్ అనుసంధానం వల్ల నీటితో పాటు ఎరువులను సరైన విధానంలో మొక్క వేర్లకు అందించేందుకు వీలవుతుందన్నారు. నీటి వృథా, ఎరువుల వృథా బాగా తగ్గిపోతుందన్నారు. పొలంలో ఏ భాగానికి నీరు ఇవ్వాలో వాల్వులు, ఇతరత్రా వాటిని చేతిలో తిప్పాల్సిన పనిలేకుండా సెన్సార్ వ్యవస్థ ద్వారా యంత్రాలే నియంత్రిస్తాయన్నారు. వర్షం పడుతున్నపుడు, నీరు ఎక్కువగా వెళుతున్నపుడు సెన్సార్ వ్యవస్థకు సమాచారం అందడంతో ఆటోమేటిక్గా పంపు ఆఫ్ అవుతుందని తెలిపారు. రూ.40 వేలు విలువ చేసే వీటిని సన్న, చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 55 శాతం రాయితీ, మిగిలిన రైతులకు 45 శాతం రాయితీతో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన రైతులు ఏపీఎంఐపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బంగారు గొలుసు అపహరణ గుమ్మఘట్ట: రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో నివాసముంటున్న వివాహిత సునీత మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించారు. బాధితురాలు తెలిపిన మేరకు.. భర్త రాజన్నతో కలసి చిల్లకొట్టు దుకాణం నిర్వహిస్తున్న సునీత మంగళవారం ఉదయం దుకాణంలో ఉన్న సమయంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు వచ్చారు. ఇద్దరూ హెల్మెట్ ధరించి ఉన్నారు. వీరిలో ఒకరు బైక్పై ఉండగా, మరొకరు సునీత వద్దకెళ్లి రూ.100 ఇచ్చి సిగరెట్లు, కూల్డ్రింక్ బాటిళ్లు ఇవ్వాలని అడిగాడు. అతను అడిగిన వాటిని ఇచ్చి చిల్లర ఇచ్చే సమయంలో ఆమె మెడలోని 1.5 తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కొని ద్విచక్ర వాహనంపై సహచరుడితో కలసి ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. ప్రమాదంలో కౌన్సిలర్కు తీవ్ర గాయాలు రాయదుర్గం టౌన్: స్థానిక మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు కౌన్సిలర్ (వైఎస్సార్సీపీ) ఐనాపురం మంజునాథ్ మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం నుంచి మొలకాల్మూరు వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పైతోట సమీపంలో జాతీయ రహదారిపై వాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. మంజునాథ తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గమనించి 108 అంబులెన్స్ ద్వారా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్కు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. కాగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తాళం వేసిన ఇంట్లో చోరీ రాయదుర్గం టౌన్: స్థానిక 29వ వార్డు కుమ్మరగుండ్ల వీధిలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... గార్మెంట్స్ పరిశ్రమలో పనిచేస్తున్న తౌఫిక్ ఆదివారం ఇంటికి తాళం వేసి కర్ణాటకలోని హోస్పేటలో బంధువుల ఇంట జరుగుతున్న శుభకార్యానికి కుటుంబసభ్యులతో కలసి వెళ్లాడు. సోమవారం రాత్రి తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి తలుపులు తీసి ఉండడంతో లోపలకు వెళ్లి పరిశీలించారు. బీరువాలో దాచిన రూ.1.40 లక్షల నగదు, 18 తులాల వెండి నగలు, తులం బరువున్న రెండు బంగారు ఉంగరాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. -
20న ఉద్యోగులకు మెగా వైద్య శిబిరం
అనంతపురం అర్బన్: రెవెన్యూ, సర్వే భూరికార్డుల శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల 20, 21 తేదీల్లో కలెక్టరేట్ ప్రాంగణంలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ వెల్లడించారు. వైద్య శిబిరం నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో డీఆర్ఓ మలోలతో కలిసి వైద్యారోగ్యశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఆరోగ్య శ్రీ కో–ఆర్డినేటర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు సమన్వయ సహకారంతో వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. క్యాన్సర్, దంత, నేత, నరాల బలహీనత, కిడ్నీ సమస్యలు, వెన్నెముక నొప్పులు, తదితర వ్యాధ్యులకు నిపుణులైన వైద్యులు సేవలందిస్తారన్నారు. సమావేశంలో ఆర్డీఓ వసంతబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ గంగాధర్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, విభాగాల సూపరింటెండెంట్లు హరికుమార్, యుగేశ్వరిదేవి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దివాకర్, నాయకుడు శ్రీనివాసమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే ఆదాయ వనరులు మెరుగుపడాలి
● దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథూర్ గుంతకల్లు: రైల్వే ఆదాయ వనరులు మరింత మెరుగు పడాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్యోగులకు దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథూర్ పిలుపునిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి గుంతకల్లు డివిజన్ విడిపోయి దక్షిణ కోస్తా రైల్వేలో విలీనం కానున్న నేపథ్యంలో తొలిసారిగా దక్షిణ కోస్తా రైల్వే జీఎం గుంతకల్లు, విజయవాడ, గుంటూరు డివిజన్ల అధికారులతో మంగళవారం వీసీలో మాట్లాడారు. గుంతకల్లు నుంచి డీఆర్ఎం చంద్రశేఖర గుప్తా, ఏడీఆర్ఎం సుధాకర్, వివిధ శాఖ డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంతకల్లు డివిజన్ సమగ్ర సమాచారాన్ని మాథూర్ అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అనంతరం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, ఉద్యాన శాఖ అధికారులతో డీఆర్ఎం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఉద్యాన పంటల ఎగుమతులకు అన్ని విధాలుగా సహకరిస్తామని డీఆర్ఎం పేర్కొన్నారు. ప్రత్యేక గూడ్స్ రైళ్లు నడపడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు నష్టపోకుండా టైమ్ టేబుల్ ప్రకారం నిర్ణీత సమయంలో పంట దిగుమతులను గమ్యస్థానాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్ సూచించారు. అరటి ఎగుమతికి ప్రత్యేక చర్యలు అనంతపురం అర్బన్: జిల్లా నుంచి అరటి ఎగుమతులకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబుకు ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. రైలు మార్గం ద్వారా సకాలంలో రవాణా జరగడం లేదన్నారు. అరటి ఎగుమతులపై ముఖ్యకార్యదర్శి మంగళవారం విజయవాడ నుంచి కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి ఇన్చార్జ్ కలెక్టర్తో పాటు ఉద్యాన శాఖ డీడీ పద్మావతి, గుంతకల్లు రైల్వే డివిజన్ డీఆర్ఎం చంద్రశేఖర్గుప్త, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైలు మార్గం ద్వారా అరటి ఎగుమతులు అధికంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లాజిస్టిక్ సమస్యల వల్ల రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ఎగుమతి దారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. తాడిపత్రితో పాటు జంగాలపల్లి, ప్రసన్నాయలపల్లి, మరికొన్ని రైల్వే స్టేషన్ల నుంచి ఎగుమతులకు అవకాశం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
వైఎస్సార్సీపీ శింగనమల కన్వీనర్ పూల ప్రసాద్ మృతి
శింగనమల: మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ పూల ప్రసాద్ (47) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం అస్వస్థతకు గురి కాగానే కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో సోమవారం అర్ధరాత్రి ఆయన మృతిచెందారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో శింగనమల ఎంపీటీసీగా గెలుపొందారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరిమెల గోకుల్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నార్పల సత్యనారాయణరెడ్డి, గువ్వల శ్రీకాంత్రెడ్డి తదితరులు మంగళవారం శింగనమలకు చేరుకుని ప్రసాద్ మృతదేహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండలాల కన్వీనర్లు గువ్వల శ్రీకాంత్రెడ్డి, యల్లారెడ్డి, ఖాదర్వలి ఖాన్, మహేశ్వరరెడ్డి, శివశంకర్, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ బొమ్మన శ్రీరామిరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు నాయక్, ఎంపీపీలు నాగేశ్వరరావు, భూమిరెడ్డి రాఘవ రెడ్డి, జెడ్పీటీసీలు భాస్కర్, భాస్కర్రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాలు, నాయకులు వీరాంజనేయులు, బండ్లపల్లి ప్రతాప్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనరు సాకే హరి, కాంగ్రెస్ నేత దాదా గాంధీ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సోమర జయచంద్రనాయుడు, పలువురు ఎంపీటీసీ, సర్పంచులు ఉన్నారు. మంగళవారం ఆయన అంత్యక్రియలను శింగనమలలో అశ్రునయనాలతో నిర్వహించారు. గుండెపోటుతో ఆదివారం అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిక పరిస్థితి విషమించి సోమవారంఅర్ధరాత్రి కన్నుమూత స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు -
కలిపేసుకుందాం.. కాదనేదెవరు?
సాక్షి టాస్క్ఫోర్స్: అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ నేతకు ప్రభుత్వ భూమిపై కన్నుపడింది. తన భూమికి ఆనుకుని ఉండటం, అక్కడ సెంటు స్థలం రూ.10లక్షల దాకా పలుకుతుండటంతో ఏకంగా 60 సెంట్లు ఆక్రమించేశాడు. రాయదుర్గం నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండ చూసుకుని ఏకంగా ఆక్రమిత స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణ పనులు చకచకా చేసేస్తున్నాడు. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్లో ఈ భూ కబ్జా వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉద్దేహాళ్లో బళ్లారి – కళ్యాణదుర్గం ఆర్అండ్బీ రోడ్డు పక్కన 227 సర్వే నంబర్లో ఉన్న 5.36 ఎకరాల అసైన్డ్ భూమిని గతంలో ఓ కరణం.. ఓ మహిళకు ధారాదత్తం చేశాడు. అయితే ఆమె ఆ భూమి వైపు ఎన్నడూ రాలేదు. ఆమె మరణానంతరం కోడలు వచ్చి అందులో సగం భూమిని తన పేరు మీద చేయించుకుంది. మిగిలిన సగం భూమి ప్రస్తుతం ముగ్గురు వ్యక్తుల ఆధీనంలో ఉంది. ఈ గ్రామంలోని సినిమా థియేటర్ యజమాని అయిన కణేకల్లు మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ఫక్రుద్దీన్ కూడా ఆ ముగ్గురిలో ఒకరు. చుట్టుపక్కల ఊళ్లకు ఉద్దేహాళ్ సెంటర్ కావడంతో ఇక్కడ భూములు/ స్థలాల ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. పై అసైన్డ్ భూమి (ప్రభుత్వ భూమి) రోడ్డు పక్కనే 600 మీటర్ల మేర పొడవుగా ఉండటం, అదీ తన భూమి పక్కనే కావడంతో అక్కడ కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకోవాలని భావించాడు. అంతే అందులో 60 సెంట్ల భూమి ఆక్రమణకు యత్నించాడు. అయితే అప్పట్లో స్థానిక గ్రామ సర్పంచ్ మారుతీప్రసాద్ అడ్డుకున్నాడు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ఫక్రుద్దీన్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. పొరుగు మండలం నుంచి వచ్చి ఆక్రమించుకోవడంపై స్థానిక టీడీపీ నాయకులు కన్నెర్రజేశారు. ఈ నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి దగ్గరకు తీసుకెళ్లారు. ‘అది ఏమైనా మీ భూమా.. ప్రభుత్వ భూమే కదా.. వాళ్ల భూమి ముందు ఉంది. ఆక్రమించుకుంటే మీకేంటి నష్టం?’ అంటూ చివాట్లు పెట్టడంతో స్థానిక నేతలు మిన్నకుండిపోయారు. ముఖ్య ప్రజాప్రతినిధి అభయహస్తంతో ఫక్రుద్దీన్ ఇటీవల సదరు 60 సెంట్ల భూమిని ఆక్రమించి.. అందులో రేకుల షెడ్లతో కూడిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాడు. ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోరాదని రెవెన్యూ అధికారులకు కూడా మౌఖిక ఆదేశాలు అందడంతో మిన్నకుండిపోయారని ఉద్దేహాళ్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రూ.6కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించిన టీడీపీ నేత నుంచి రెవెన్యూ అధికారులకు కూడా రూ.10 లక్షల దాకా ముడుపులు అందాయని, అందుకే ఇటువైపు తొంగి చూడటం లేదని ఆరోపిస్తున్నారు. బరి తెగించిన టీడీపీ నేత ఉద్దేహాళ్లో 60 సెంట్ల ఆక్రమణ చకచకా కమర్షియల్ కాంప్లెక్స్ పనులు


