breaking news
Anantapur Latest News
-
●నేత్రపర్వం.. శ్రీవారి అలుకోత్సవం
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి అలుకోత్సవం బుధవారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. అనంతరం స్వామి వారు అశ్వవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. చతురంగ బలాల్లో అత్యంత ప్రధానమైనది అశ్వ బలమని, కలియుగాంతంలో తాను అశ్వ వాహనంపై వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తానని చాటి చెప్పడం కోసమే శ్రీవారు అశ్వవాహనంపై ఊరేగుతారని వేద పండితులు వివరించారు. అంతకుముందు యాగశాలలో నిత్యహోమం చేశారు. అనంతరం శ్రీవారిని విశేషంగా అలంకరించి ఆలయానికి సమీపంలో ఉన్న సుద్దుల మండపం వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న భక్తులు ‘ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవింద’ అంటూ కీర్తించారు. ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చక పండితులు బ్రహ్మోత్సవాలతో పాటు అలుకోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. అన్ని ఉత్సవాలకు ఉభయదారులుగా భక్తులు వ్యవహరిస్తే ఆనవాయితీ ప్రకారం అలుకోత్సవానికి ఆలయ సహాయ కమిషనర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నేడు తీర్థవాది ఉత్సవం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తీర్థవాది ఉత్సవం గురువారం భృగుతీర్థం(కోనేరు)లో భక్తుల కోలాహలం మధ్య వైభవంగా జరగనుంది. బ్రహ్మోత్సవాల ప్రారంభం నాడు ఆలయం ముందున్న ప్రధాన ధ్వజ స్తంభానికి కట్టిన కంకణాలు గురువారం మధ్యాహ్నం విప్పేస్తారు. అంటే ధ్వజావరోహణం చేస్తారు. దీంతో తీర్థవాది ఉత్సవం ముగుస్తుంది. అనంతరం స్వామివారు ఆలయంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి నారసింహుడు యాగశాలలోనే గడిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆలయం తలుపులు మూసివేస్తారు. తిరిగి శుక్రవారం ఉదయం నుండి స్వామివారు ఆలయంలో యథావిధిగా భక్తులకు దర్శనమిస్తారు. -
అరటి ధర పతనంతో అలజడి
అనంతపురం అగ్రికల్చర్: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సాగు చేసిన అరటి.. కోతకు వచ్చేసరికి ధర పతనమవడం రైతుల్లో తీవ్ర అలజడి రేపుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న టన్ను రూ.22 వేలు ఉన్న అరటి ధర క్రమంగా తగ్గుతూ ఇపుడు రూ.7 వేలకు చేరింది. రోజురోజుకూ రైతుల పరిస్థితి దీనంగా మారుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టడం లేదు. ఇక జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు కూడా వీరి గురించి పట్టించుకునే తీరిక లేకపోయింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అరటి కోతలకు సిద్ధంగా ఉన్నా.. ధర పడిపోవడం, వ్యాపారులు మొగ్గు చూపకపోవడంతో అయినకాటికి అమ్మేసుకునే దుస్థితి నెలకొంది. అరటి ఎగుమతులపై వార్ ఎఫెక్ట్ జిల్లా వ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో అరటి సాగైంది. ఈ సీజన్లో మొదటి పంట కింద 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. అందులో ఇప్పటికే సగానికి పైగా అమ్ముకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయిల్– ఇరాన్ మధ్య యుద్ధం మొదలు కావడంతో అది కాస్తా గల్ఫ్ దేశాలు అంతటా విస్తరించడంతో అరటి ఎగుమతులు పూర్తిగా ఆగిపోయినట్లు చెబుతున్నారు. దీంతో ఉత్తరాది వ్యాపారులు అరటి కొనుగోలుకు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. టన్ను రూ. 7 వేలు లేదా రూ.8 వేలకు అమ్ముడుబోయినా పెట్టుబడి తిరిగివచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మృతి
గుత్తి: మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లికి వెళ్లే మార్గంలో రైల్వే బ్రిడ్జి వద్ద ఓ గుర్తు తెలియని మహిళ (38) మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం పడి ఉన్న స్థితి, అక్కడి ఆనవాళ్లను బట్టి అత్యాచారం చేసి హతమార్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా, మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఆమె ఒంటరిగా చెట్నేపల్లి రోడ్డు వైపు వెళుతుండగా గమనించామని చెట్నేపల్లి వాసులు గుర్తు చేశారు. ఇదే విషయాన్ని వారు పోలీసులకు తెలిపారు. మృతదేహం పక్కన పురుషులకు సంబంధించిన చెప్పులు ఉన్నాయి. శరీరంపై చీర చిందర వందరగా పడి ఉంది. ఆ ప్రాంతంలో పోకిరీలు, గంజాయి బ్యాచ్ ఎక్కువగా సంచరిస్తూ ఉంటారని స్థానికులు తెలిపారు. ఆరోగ్యంగా నడుచుకుంటూ వెళ్లిన మహిళ తెల్లవారేసరికి శవమై తేలడం వెనుక ఆంతర్యమేమిటో తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పేదలకు అండ.. వైఎస్సార్సీపీ జెండా
● ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటం ● నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినం ● జిల్లా అంతటా సంబరాలు అనంతపురం: వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీ 2011 మార్చి 12న ఆవిర్భవించింది. విలువలు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. తిరుగులేని శక్తిగా అవతరించింది. ప్రతిపక్షంలో ఉన్నా...అధికారంలో ఉన్నా జనహితమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోంది. ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తోంది. ‘నేనున్నానంటూ’ భరోసా.. వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమయ్యాక.. అప్పటి రాజకీయ పరిస్థితులు వైఎస్ జగన్ను ప్రజలకు దగ్గర చేశాయి. వైఎస్సార్సీపీ ఆవిర్భవించాక... వైఎస్ జగన్ మోహన్రెడ్డి 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. 14 నెలల పాటు 3,648 కి.మీ దూరం మేర సాగిన ఈ పాదయాత్రలో పేదల కష్టాలను ఆయన కళ్లారా చూశారు. లక్షలాది మందికి ‘నేనున్నానంటూ’ అభయమిచ్చారు. వేలాది మందికి అప్పటికప్పుడే ఆపన్నహస్తం అందించారు. ఫలితంగా 2019లో జరిగిన ఎన్నికల్లో జనం చంద్రబాబు దుర్మార్గపు పాలనను కూకటి వేళ్లతో పెకలించారు. వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని అందించారు. 50 శాతానికి పైగా ఓట్లు, 151 శాసనసభ (87 శాతం), 22 లోక్సభ(88 శాతం) స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. ప్రజల ముంగిటకే పాలన వైఎస్ జగన్మోహన్రెడ్డి పగ్గాలు చేపట్టాక జనరంజక పాలన సాగించారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని ముందుకు సాగారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకే తీసుకెళ్లారు. ఐదేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లోకి నేరుగా ఆర్థికసాయం జమ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపి పెద్దకొడుకుగా నిలిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయినా.. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడింది. జిల్లా ప్రజలకు ఎంతో లబ్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన (2019–2024)లో జిల్లా ప్రజలు కుల, మతాలు, పార్టీలకతీతంగా లబ్ధి పొందారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 5 లక్షల మంది రైతులకు రూ.1767.09 కోట్లు, సున్నా వడ్డీ, పంట రుణాల ద్వారా రూ.900 కోట్లు, ఉచిత పంటల బీమా కింద రూ.918.57 కోట్లు అందింది. వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా 3 లక్షల మందికి రూ.4,500 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద రూ.10 వేల కోట్లు, వైఎస్సార్ బీమా కింద రూ.90 కోట్లు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 150 కోట్లు, జగనన్న అమ్మ ఒడి పథకం కింద రూ1200.49 కోట్ల మేర లబ్ధి అందింది. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 43,301 మందికి రూ162.38 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.414..91 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. నేడు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ ఆవిర్భవించి గురువారం నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగిడుతోంది. ఈ సందర్భంగా జిల్లా వ్యాపంగా పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నాయి. అన్ని నియోజక వర్గాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడంతో పాటు రక్తదానం, అన్నదానం, రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీకి సిద్ధమయ్యారు. రెండేళ్లకే తారుమారు రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరి రెండేళ్లవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదు. పైగా పన్నుల మోతతో జనానికి వాతలు పెట్టారు. నాటి సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. చివరకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కూడా అందని పరిస్థితుల్లో యువత భవిత ప్రశ్నార్థకమైంది. బీమా, ఇన్పుట్ సబ్సిడీలకు మంగళం పాడిన చంద్రబాబు కనీసం విత్తనాలు, ఎరువు కూడా ఇవ్వకపోవడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిత్యావసర ధరలను నియంత్రించకపోవడంతో సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఇప్పుడు మళ్లీ అందరూ వైఎస్సార్సీపీవైపు చూస్తున్నారు. జగన్ పాలన కోసం జై కొడుతూ బాబు ప్రభుత్వంపై తిరుగు‘బావుటా’ ఎగురవేస్తున్నారు. -
రేపు చివరి విడత ‘పీఎం కిసాన్– సుఖీభవ’ సొమ్ము
అనంతపురం అగ్రికల్చర్: పీఎం కిసాన్– అన్నదాత సుఖీభవ కింద ఈ ఏడాదికి సంబంధించి చివరి (మూడో) విడతగా శుక్రవారం రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ కానుందని వ్యవసాయశాఖ జేడీ రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 2న మొదటి విడతగా రూ.7 వేలు, రెండో విడతగా నవంబర్లో రూ.7 వేలు ప్రకారం జమ చేశారు. ఇప్పుడు మూడో విడత కింద కేంద్రం నుంచి రూ.2 వేలు, రాష్ట్రం వాటా కింద రూ.4 వేల ప్రకారం మొత్తం రూ.6వేలు జమ చేస్తారన్నారు. జిల్లాకు సంబంధించి సుఖీభవ కింద 2,75,642 మంది రైతులకు రూ.110.26 కోట్లు, పీఎం కిసాన్ కింద 2.58 లక్షల మంది రైతులకు రూ.53.01 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఉరవకొండ నియోజకవర్గానికి రూ.28.32 కోట్లు, రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాలకు రూ.13.46 కోట్లు, శింగనమలకు రూ.31.52 కోట్లు, గుంతకల్లుకు రూ.16.31 కోట్లు, కళ్యాణదుర్గానికి రూ.30.27 కోట్లు, రాయదుర్గానికి రూ.25.01 కోట్లు, తాడిపత్రికి రూ.18.16 కోట్లు, అనంతపురం అర్బన్ పరిధిలో రైతులకు రూ.21 లక్షలు మేర నిధులు విడుదల అవుతున్నట్లు తెలిపారు. కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు బుధవారం రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ‘స్క్రైబ్’ కష్టాలు అనంతపురం ఎడ్యుకేషన్: కొందరు హెచ్ఎంల నిర్లక్ష్యం కారణంగా దివ్యాంగ విద్యార్థులకు స్క్రైబ్ కష్టాలు వచ్చి పడ్డాయి. నిబంధనల ప్రకారం స్క్రైబ్ కోసం దరఖాస్తు ప్రక్రియను పాఠశాల హెడ్మాస్టర్ ద్వారా పూర్తి చేస్తే సరిపోతుంది. అయితే ఈ నిబంధనను కొందరు హెచ్ఎంలు విస్మరించి, విద్యార్థులను నేరుగా డీఈఓ కార్యాలయానికి వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే హెచ్ఎంల సూచనతో పుట్లూరు విద్యార్థులు వరుణ్, దీక్షిత, పుట్లూరు మండలం కొండేపల్లి విద్యార్థి సంధాని బుధవారం డీఈఓ కార్యాలయానికి తల్లిదండ్రులతో కలసి వచ్చాకు. వైకల్యంతో బాధపడుతున్న వారు ఎండల్లో అష్ట కష్టాలు పడి డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. వారి ప్రాంతాల నుంచి నేరుగా బస్సులు లేకపోవడంతో పిల్లలను పిలుచుకుని తల్లిదండ్రులు పుట్లూరు నుంచి తాడిపత్రికి ఆటోలో వచ్చి అక్కడి నుంచి అనంతపురానికి బస్సులో ప్రయాణించారు. పాఠశాల స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యను హెడ్మాస్టర్ల నిర్లక్ష్యం కారణంగా పెద్ద సమస్యగా మారింది. ‘పిల్లాడు సరిగ్గా నడవలేడు పరీక్ష రాయడానికి స్క్రైబ్ కావాలి. హెచ్ఎంలు చేయాల్సిన పనికి మమ్మల్ని జిల్లా కార్యాలయానికి పంపించారు’ అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘దూకుడు’కు ముకుతాడు!
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) కేశవనాయుడు సెలవుపై వెళ్లారు. ఈ నెల 7 నుంచి 20 దాకా సెలవు పెట్టారు. ఇటీవల కాలంలో ఆయనపై వస్తున్న విపరీతమైన ఆరోపణల నేపథ్యంలో సెలవుపై వెళ్లడం రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పైకి అనారోగ్యం అని చెబుతున్నా... అసలు కారణం వేరేనని కార్యాలయ ఉద్యోగులే చెబుతున్నారు. భూ వివాదాల కేసుల్లో ఆర్డీఓ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు డివిజన్లోనే కాదు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. రిటైర్డ్మెంట్ దగ్గర పడడంతో పెద్ద ఎత్తున వసూళ్లకు తెర తీశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగానే జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ప్రతివారం 100కు పైగా ఆర్ఓఆర్ కేసులను విచారణకు పిలుస్తుండడాన్ని రెవెన్యూ ఉద్యోగులు, న్యాయవాదులు తప్పుపడుతున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఉత్తర్వులు ఇస్తూ వివాదాలను మరింత జఠిలం చేస్తున్నారని వాపోతున్నారు. ఈయన ఇచ్చిన చాలా తీర్పులపై హైకోర్టు మొటిక్కాయలు వేస్తూ డిస్మిస్ చేసింది. అక్రమాలపై గుట్టుగా విచారణ పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ‘రెవెన్యూ అధికారి దూకుడు’ శీర్షికతో ‘సాక్షి’లో గతనెలలో వెలువడిన కథనం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు ఉద్యోగులు, బాధితులు రాష్ట్రస్థాయి సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో దుమారం రేగింది. చివరకు సీఎంఓ దృష్టికి కూడా వెళ్లింది. ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. కొందరు బాధితులు, తహసీల్దార్లు, మరీ ముఖ్యంగా బాధితులుగా ఉన్న వీఆర్ఓలతో మాట్లాడి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ఇదే క్రమంలో కలెక్టర్ కూడా గుట్టుగా విచారణ చేయించారు. ఓ జిల్లాస్థాయి అధికారిని నియమించి విచారణ నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలోనే ఓ రైతు స్వయంగా కార్యాలయంలో అధికారిని నిలదీసినట్లు తెలిసింది. తాను ఇచ్చిన డబ్బును వెనక్కు ఇవ్వాలంటూ గట్టిగా కేకలు వేయడంతో ఉద్యోగులంతా బెంబేలెత్తినట్లు సమాచారం. ఎట్టకేలకు అధికారి వ్యవహారం వెలుగులోకి రావడంతోనే దూకుడుకు కూడా కొద్దివరకు స్పీడ్ బ్రేకర్ పడిందని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. అధికార పార్టీకి బలంగా మద్దతిచ్చే సామాజిక వర్గం వ్యక్తి కావడంతోనే ఆయనపై చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఆలోచనలో పడినట్లు తెలిసింది. పైగా ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఈయనకు బహిరంగంగానే మద్దతిస్తున్నారనే అపవాదు ఉంది. అన్నింటికీ అడ్డుపుల్ల వేస్తున్న కీలక అధికారి ఆర్డీఓ కార్యాలయంలో కీలక విధులు నిర్వహిస్తున్న ఓ డీటీ ప్రతి ఫైలుకూ అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలిసింది. ఈయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనంగా కార్యాలయంలో అమలవుతోంది. ఈయన చెప్పినమాటే ఆర్డీఓకు కూడా వేదం అని అంటున్నారు. ఈయన దెబ్బకు వీఆర్ఓలు, బాధిత రైతులు ఆర్డీఓ కార్యాలయానికి రావాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా చుక్కల భూమి, 22ఏ ఫైళ్లకు సంబంధించి ఆర్డీఓ కంటే ముందు ఈయనే కొర్రీలు వేస్తున్నాడు. వీఆర్ఓ, ఆర్ఐ, డీటీ, తహసీల్దారు సంతకాలతో తయారు చేసిన ఫైళ్లను కనీసం చూడకుండా తిరస్కరిస్తున్నట్లు తెలిసింది. ఒకటికి పదిసార్లు పరిశీలించుకుని పెట్టిన ఫైళ్లను తమకంటే కిందిస్థాయి ఉద్యోగి తిరస్కరించడాన్ని తహసీల్దార్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన దెబ్బకు కొందరు తహసీల్దార్లు ఆయన చాంబరులోకి వెళ్లాలంటే కూడా జంకుతున్నారు. ఇక వీఆర్ఓల పరిస్థితి అయితే మరీ దారుణం. ఈ పోస్టులో తహసీల్దారు స్థాయి ఉద్యోగిని నియమించాల్సి ఉన్నా.. అనుకూలత కోసం డిప్యూటీ తహసీల్దారును నియమించారనే ఆరోపణలున్నాయి. ప్రతిదీ కిందిస్థాయి ఉద్యోగితో చెప్పించుకోవాల్సి రావడంపై తహసీల్దార్లు రగిలిపోతున్నారు. కలెక్టర్ దృష్టి సారించి ఇక్కడ డీటీ స్థాయి అధికారి సాగిస్తున్న దందాపై విచారణ జరిపించాలని తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు. మరీ ముఖ్యంగా వీఆర్ఓలు విజ్ఞప్తి చేస్తున్నారు. 20 వరకు సెలవు పెట్టిన అనంతపురం ఆర్డీఓ విపరీతమైన ఆరోపణల నేపథ్యంలోనే లీవ్ గుట్టుగా విచారణ చేసిన జిల్లాస్థాయి అధికారులు ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా... ప్రభుత్వానికి నివేదిక -
ఆర్డీటీ కోసం ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం
కళ్యాణదుర్గం/కుందుర్పి: కరువు పీడిత అనంతపురం జిల్లా అభివృద్ధికి, పేదల జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్న ఆర్డీటీని కాపాడుకోవడంలో భాగంగా అవసరమైతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలంటూ కుందుర్పిలో మంగళవారం కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆధ్వర్యంలో లక్ష పోస్టు కార్డుల ఉద్యమం కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్, డాక్టర్ తలారి రంగయ్య, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, సీఈసీ సభ్యుడు మాదినేని ఉమామహేశ్వరనాయుడు, నియోజకవర్గ పరిశీలకులు మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఆర్డీటీలా ఆదుకునే దమ్ముందా? అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... ఆర్డీటీలా రాజకీయాలకు అతీతంగా, నిస్వార్థంగా పేదలను ఆదుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఎస్సీ, బీసీ కాలనీల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరో వైపు ఆదాయం కోసం మద్యాన్ని వరదలా ప్రవహింపజేస్తున్నారని మండిపడ్డారు. ఓ వైపు పంటలు ఎండిపోతున్నా హంద్రీ–నీవా ద్వారా నీటి ప్రవాహాన్ని 11 వేల క్యూసెక్కులకు పెంచి అన్ని చెరువులకూ నీళ్లిస్తామనే స్పష్టత కూడా ఇవ్వలేని అసమర్థ స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన పాలకులు గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. చాలా ప్రభుత్వాలు పట్టించుకోని రోజుల్లో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆర్డీటీ సైకిళ్లు, ఎద్దులబండ్లు, గుర్రపు బండ్ల ద్వారా నీటిని అందించిందన్నారు. స్నానానికి కూడా మినరల్ వాటర్ వాడే టీడీపీ ప్రభుత్వ పెద్దలకు పేదల కష్టాలు పట్టడం లేదన్నారు. సహజ సిద్ధంగా లభ్యమయ్యే నీటిని సైతం పాలకుల చేతకానితనం వల్ల రూ.5తో కొనుగోలు చేసి తాగాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టకపోయి ఉంటే పేదల పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. జిల్లా ప్రజలకు మేలు చేస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేసే అంశంపై ఏప్రిల్ 2 వరకు వేచి చూస్తామని, అప్పటికీ చేయకపోతే పరిపాలనను పూర్తిగా స్తంభింపజేస్తామని హెచ్చరించారు. మతం ముద్ర వేసి పేదలకు ఆర్డీటీని దూరం చేసే కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎంత కష్టమొచ్చినా ఆర్డీటీకి అండగా వైఎస్సార్సీపీ ఉంటుందన్నారు. ప్రభుత్వాలు దిగివచ్చేలా పోరాటం మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. తాను కూడేరులోని ఆర్డీటీ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేశానని గుర్తు చేశారు. ఆ సమయంలో ఆర్డీటీ సేవల్లోని నిబద్ధతను ఏ ప్రభుత్వాల్లోనూ తాను చూడలేదన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలోని ఎస్సీ కాలనీల్లో ఓ స్కూల్ నెలకొల్పడమే కాకుండా ప్రత్యేకంగా టీచర్ను నియమించి విద్యాభివృద్ధికి ఆర్డీటీ చేసిన అందించిన సేవల కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. వేలాది మంది చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ అంశంలో ప్రభుత్వాలు దిగి వచ్చే వరకూ అనంత వెంకట్రామిరెడ్డి, తలారి రంగయ్య నాయకత్వం కింద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటాలు సాగిస్తామని అన్నారు. ఆర్డీటీకి మద్దతుగా మాట్లాడే ధైర్యం టీడీపీ నేతలకు లేదన్నారు. వారే కనుక ప్రశ్నించి ఉంటే ఆర్టీటీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీని కలిసి జిల్లాలో ఆర్డీటీ ఆవశ్యకతను వివరించి, ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయించి తీరుతామని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో మాంఛో ఫెర్రర్ గళం విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా అభివృద్ధి, పేదల కోసం ఆయన గొంతు విప్పాలని, అవసరమైతే ఆర్డీటీని కాపాడుకునేందుకు 3 వేల గ్రామాల ప్రజానీకం ఆయన వెనుకే నిలుస్తుందని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో పోరాడాలి వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఆర్డీటీ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి పోరాడాలని పిలుపునిచ్చారు. లక్షలాది మంది జీవన స్థితిగతుల మార్చిన ఫాదర్ ఫెర్రర్కు కళ్యాణదుర్గం ప్రాంతంలో గుడి కట్టారంటే ఆర్డీటీ అందించిన సేవలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చునన్నారు. మతం పేరు చెప్పి ఆర్డీటీని ప్రజలకు దూరం చేయాలనుకోవడం మూర్ఖత్వమవుతుందన్నారు. ఇప్పటికై నా పాలకుల వైఖరి మారి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. 56 ఏళ్లుగా జిల్లాలో పేదల అభ్యున్నతికి ఆర్డీటీ చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రభుత్వానికి సమాంతరంగా అన్ని రంగాల్లోనూ విస్తృత సేవలు అందిస్తోందన్నారు. క్రీడా రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో అనంతపురం జిల్లా పేరు వినిపిస్తోందంటే దానికి ఆర్డీటీనే కారణమన్నారు. ఆర్డీటీ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. ● ఎమ్మెల్సీ మంగమ్మ మాట్లాడుతూ.. కరువు పీడిత అనంతపురం జిల్లాలో రైతుల పక్షాన నిలిచి వ్యవసాయాన్ని సుసంపన్నం చేసింది ఆర్డీటీనే అని అన్నారు. డ్రిప్ పరికరాలు సమకూర్చడంతో పాటు విస్తృతంగా నీటి కుంటలు, చెక్డ్యాంలు నిర్మించి భూగర్భజలాల అభివృద్ధికి ఆర్డీటీ తీసుకున్న చొరవను కొనియాడారు. ఇలాంటి సంస్థను దూరం చేయడం కూటమి నేతలకు సరి కాదన్నారు. ఆర్డీటీ పరిరక్షణకు అందరూ కదలి రావాలన్నారు. కార్యక్రమంలో పార్టీ వివిధ విభాగాల రాష్ట్ర కార్యదర్శులు కె.నాగరాజు, ములకనూరు తిమ్మరాయుడు, దొడగట్ట నారాయణ, టైలర్ వన్నూరుస్వామి, జానీ, రామాంజనేయులు, ఈ.రాము, గుర్రం లింగప్ప, జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, ఎంపీపీలు కమలా నాగరాజు, చంద్రశేఖర్రెడ్డి, సోమనాథ్రెడ్డి, మారుతమ్మ, భీమేష్, నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల కన్వీనర్లు కురబ హనుమంతరాయుడు, సుధీర్, గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, గొల్ల హనుమంతరాయుడు, వెంకటప్ప, ఎంపీటీసీలు, సర్పంచులు, పెద్ద సంఖ్యలో ఆర్డీటీ లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులు, ఆర్డీటీ లబ్ధ్దిదారులు సమావేశంలో మాట్లాడుతున్న వెఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి (చిత్రంలో) తలారి రంగయ్య, డాక్టర్ శైలజానాథ్, వై.విశ్వేశ్వరరెడ్డి, మాదినేని ఉమా, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మసమయం లేదు.. మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. గత వెఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏనాడూ ఆర్డీటీకి కష్టం రాలేదన్నారు. 66 బోర్లు వేయిస్తే అన్నింటిలో సమృద్ధిగా నీరు పడ్డాయని గుర్తు చేశారు. ఆర్డీటీ పరిరక్షణ అంశంలో ఇక ఉపేక్షించాల్సిన సమయం లేదని, గాంధీ మహాత్ముడు చెప్పినట్లుగా డూ ఆర్ డై సిద్ధాంతాన్ని అనుసరిస్తూ మరణమా.. శరణమా అంటూ ప్రభుత్వాలను నిలదీయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. పార్టీ తరపున ఈ ప్రాంతం, ఈ ప్రజల కోసం ఆర్డీటీ పరిరక్షణను భుజాలకు ఎత్తుకున్నామన్నారు. మన గొంచిగాడు... మన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు జీడిపల్లి నుంచి బీటీపీకి నీళ్లు ఇవ్వలేదు కానీ ఎక్కడో ఉన్న కుప్పానికి మాత్రం నీళ్లు తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. ఉప్పు సత్యాగ్రహంతో బ్రిటీష్ పాలకుల మెడలు వచ్చిన గాంధీజీ పోరాట స్ఫూర్తితో 50 పైసల పోస్టు కార్డు రాసి కేంద్ర ప్రభుత్వంలో కదలిక తెద్దామని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ ఉప్పెనలా సాగాలన్నారు. దీనిపై త్వరలో డిజిటలైజేషన్ చేసి, ఉద్యమాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. బైకు ర్యాలీలు, పాదయాత్రలు చూసి ఆర్డీటీ వచ్చేసిందంటూ హేళనగా మాట్లాడిన ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలిగేలా పోరాటాన్ని ఉధృతం చేద్దామన్నారు. ఎఫ్సీఆర్ఏ రెన్యువల్పై టీడీపీ నేతలకు ప్రశ్నించే ధైర్యం లేదు త్వరలో రాష్ట్రపతి, పీఎంనూ కలుస్తాం ఏప్రిల్ 2న డెడ్లైన్ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్, సమన్వయకర్త తలారి రంగయ్య -
యువకుడి ఆత్మహత్య
బొమ్మనహాళ్: క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన వెంకటేశులు, శ్రీదేవి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో బేకరీ నిర్వహిసూత కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుమారుడు తిరుమల (21) కర్ణాటకలోని బళ్లారిలో ఉన్న ఇండో–అమెరికన్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలో వదిలేసి ఖాళీగా ఉంటున్నాడు. బుద్ధిగా చదువుకోవాలని తల్లిదండ్రులు పలుమార్లు సూచించినా తిరుమలలో మార్పు రాలేదు. ఇదే విషయంగా సోమవారం రాత్రి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మందలించారు. దీంతో గదిలోకి తలుపు వేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో బద్ధలుగొట్టి లోపలకు వెళ్లి చూశారు. అప్పటికే ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతున్న తిరుమలను గమనించి కన్నీరుమున్నీరుగా విలపించారు. సమచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తండ్రి వెంకటేశులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
విజయవాడ వెళ్లిన కలెక్టర్
అనంతపురం అర్బన్: కలెక్టర్ ఆనంద్ మంగళవారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొననున్నారు. ఆయన తిరిగి ఈ నెల 13న విధులకు హాజరవుతారని కలెక్టర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. యూట్యూబర్పై కేసు నమోదు అనంతపురం సెంట్రల్: వ్యవసాయశాఖ ఏడీ అల్తాఫ్ అలీఖాన్ను బెదిరించి, పరువుకు భంగం కలిగించిన కేసులో యూట్యూబర్ హనుమంత రెడ్డిపై అనంతపురం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీఐ శ్రీకాంత్యాదవ్ మంగళవారం వెల్లడించారు. గత ఫిబ్రవరిలో అల్తాఫ్ఖాన్ను యూట్యూబర్ హనుమంతరెడ్డి కలిసి తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నీ కథ చూస్తానని బెదిరించాడని తెలిపారు. ఏడీ ఫొటో వాడుకుని యూట్యూబ్ చానల్లో రీల్ వైరల్ చేశాడని వివరించారు. దీంతో తన పరువు, ప్రతిష్టతలను దెబ్బతీశాడంటూ ఫిబ్రవరి 23న పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించారన్నారు. దీంతో యూట్యూబర్పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా యూట్యూబర్ హనుమంతరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గల్లంతైన వ్యక్తి మృతి ఉరవకొండ రూరల్: మండల పరిధిలోని హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన వడ్డే శ్రీనివాసులు మృతదేహమై తేలాడు. ఇంద్రావతి గ్రామానికి చెందిన శ్రీనివాసులు సోమవారం సాయంత్రం తన పొలం నుంచి ఇంటికెళుతూ మార్గమధ్యంలో స్నానం చేసేందుకు హంద్రీ–నీవా కాలువలో దిగాడు. ఆ సమయంలో నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు, సమీప బంధువులు పరిసరాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం మోపిడి గ్రామ సమీపంలో శ్రీనివాసులు మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, వెలికి తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కొడిగెనహళ్లి ఏపీఆర్ఎస్లో ప్రవేశానికి దరఖాస్తులు పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి గురుకుల ప్రతిభావంతుల ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని విద్యాసంస్థల జిల్లా కన్వీనర్, పాఠశాల ప్రిన్సిపాల్ నరేంద్ర తెలిపారు. ఈ నెల 31 లోపు ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం 4వ తరగతి చదివే విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశం కోసం, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు జూనియర్ కళాశాలలో ప్రవేశానికి అర్హులన్నారు. ఏప్రిల్ 24న నిర్వహించే ఏపీఆర్ఎస్ క్యాట్, ఏపీఆర్జేసీ సెట్లో వచ్చే మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఏపీఆర్ఎస్ ప్రిన్సిపాల్ (87126 25065), ఏపీఆర్జేసీ ప్రిన్సిపాల్ (87126 25078)ను సంప్రందించాలని కోరారు. వాహన షోరూంలలో అక్రమాలపై డీటీసీ తనిఖీలు అనంతపురం సెంట్రల్: ఆర్టీఏ అధికారుల పేర్లు చెప్పి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని వాహన షోరూం నిర్వాహకులను ఉపరవాణా కమిషనర్ (డీటీసీ) ఎం. వీర్రాజు హెచ్చరించారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారి వద్ద నుంచి ఆర్టీఏ అధికారుల పేరు చెప్పి అదనపు సొమ్ము వసూలు చేస్తున్నట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంగళవారం డీటీసీతో పాటు ఆర్టీఓ సురేష్నాయుడు, ఆరుగురు ఎంవీఐలు నాలుగు బృందాలుగా విడిపోయి నగరంలోని ఎనిమిది వాహన షోరూంలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రతి షోరూంలో ఎక్స్ షో రూం ధర, వాహన పన్ను, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్ సేఫ్టీ సెస్ తదితర వివరాలతో కూడిన ధరల పట్టిక లేకపోవడంతో డీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కున్ హుందాయ్, రిత్విక మోటార్స్, జయలక్ష్మి మారుతీ షోరూంలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదనపు ధర వసూలు చేసినట్లు వాహనదారులు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే షోరూం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంవీఐలు శ్రీనివాసులు, సునీత, సునీల్, రాజగోపాల్, రఘునాథ్, లహరి తదితరులు పాల్గొన్నారు. -
గుత్తి కోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
● అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం అనంతపురం అర్బన్: ఈ నెల 14, 15 తేదీల్లో గుత్తి కోట ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జేసీ విష్ణుచరణ్ ఆదేశించారు. గుత్తికోట ఉత్సవాల నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జేసీ సమీక్షించారు. ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు బాధ్యతగా పనిచేయాలని, బందోబస్తు పటిష్టంగా ఉండాలని సూచించారు. మొబైల్ టాయిలెట్లు, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని, క్లిన్ అండ్ శానిటేషన్ అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేశారు.సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, జిల్లా పర్యాటక అఽధికారి జయకుమార్బాబు, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్, గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం
● ఆర్డీటీ కోసం పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించిన వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం/కుందుర్పి: విద్య, వైద్యం, వ్యవసాయం, స్వయం ఉపాధి తదితర రంగాల్లో పేదలకు ఇతోధికంగా సాయమందిస్తున్న ఆర్డీటీ సంస్థ పరిరక్షణ కోసం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరించాలని కోరుతూ వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆధ్వర్యంలో మంగళవారం కుందుర్పిలో లక్ష పోస్టు కార్డుల కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ,, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, సీఈసీ సభ్యుడు మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, నియోజకవర్గ పరిశీలకుడు మహేందర్రెడ్డి హాజరయ్యారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల ద్వారా లక్ష పోస్టుకార్డులను ప్రధాని నరేంద్ర మోదీకి పంపనున్నారు. -
భక్తుల ‘బ్రహ్మ’రథం
కదిరి: శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నారసింహుడి బ్రహ్మ రథోత్సవంలో 3 లక్షల మంది దాకా భక్తులు పాల్గొన్నట్లు అంచనా. ● బ్రహ్మరథం సరిగ్గా ఉదయం 8.25 గంటల నుంచి 8.45 గంటల మధ్య ప్రారంభించాల్సి ఉండగా ఉదయం 9.35 గంటలకు ముందుకు కదిలింది. ● గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బాగా ఆలస్యంగా నడిచింది. సరిగ్గా సాయంత్రం 3.08 గంటలకు తేరు యథాస్థానం చేరుకుంది. ● ఆనవాయితీగా వస్తున్న మూర్తిపల్లి, బేరిపల్లి, కుటాగుళ్ల, నాగిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు రథానికి సండ్ర మొద్దులు, తెడ్లు వేస్తూ రథ గమనాన్ని నియంత్రిస్తుంటే పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మ రథాన్ని లాగారు. ● తిరు వీధుల ఆక్రమణల కారణంగా బ్రహ్మరథం లాగేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. ● రథోత్సవంలో బీజేపీ నేత విష్ణువర్దన్రెడ్డి పాల్గొన కుండా హౌస్ అరెస్ట్ చేయించడంపై భక్తులు ఎమ్మెల్యే కందికుంటపై ఆగ్రహించారు. కొందరు శాపనార్థాలు పెట్టారు. అయితే, తాము అతన్ని హౌస్ అరెస్ట్ చేయలేదని పోలీసు అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేయడం కొసమెరుపు. ● రథం తిరువీధుల గుండా వెళ్తుంటే భక్తులు దవణం, మిరియాలు, అరటి పండ్లు రథంపైకి విసిరి స్వామి వారిని స్మరించుకున్నారు. ● రథం వెళ్లాక రోడ్డుపై పడిన మిరియాలను భక్తులు ఒక్కోటి సేకరించడం కన్పించింది. అవి కొన్ని రకాల వ్యాధులను నయం చేస్తాయని వారి నమ్మకం. ● జేబు దొంగలు ఈసారి కూడా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారు. ఎంతో మంది భక్తులు బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లు పోగొట్టుకొని లబోదిబోమన్నారు. ● మిద్దెలపై నుంచి కొందరు రథంలాగే భక్తుల మీదకు బిందెలతో నీళ్లు చల్లారు. మరి కొందరు నీళ్ల ప్యాకెట్లు విసిరారు. ● బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, ఆయన కుమారుడు వంశీకృష్ణ ఎప్పటిలాగానే రథంపై నిల్చొని రథ కదలికలను మైకు ద్వారా తెలియ జేశారు. భక్తులతో గోవింద నామస్మరణలను పలికించి వారిని ఉత్సాహపరుస్తూ వచ్చారు. ● భక్తుల కోసం పట్టణంలో ఈసారి కూడా అడుగడుగునా ఉచిత అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ● నృసింహాలయంలో భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. ● తలనీలాలు సమర్పించుకునేందుకు వచ్చిన భక్తుల నుంచి గుండుకు రూ. 200 వసూలు చేసినట్లు పలువురు ఆరోపించారు. ● తేరు శివాలయం దాటి కాస్త ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా భక్తుల తోపులాటతో ఆరుగురు భక్తులు తేరు కుడివైపు ఉన్న ముందు చక్రం కింద పడ్డారు. వారిని బయటకు తీయడానికి 40 నిమిషాలు పట్టింది. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. -
చైన్స్నాచర్ అరెస్ట్
బుక్కరాయసముద్రం: మహిళపై దాడి చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పీఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను అనంతపురం రూరల్ డీఎస్పీ మహబూబ్బాషా వెల్లడించారు. గత నెల 14న బీకేఎస్లోని గాంధీనగర్ సమీపంలో ఓ హోటల్లో ఉన్న ముత్యాల శ్రీదేవి తలపై చైన్ స్నాచర్ ఇనుప రాడ్తో దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. ఘటనపై బాధివతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బీకేఎస్ సీఐ పుల్లయ్య, ఎస్ఐ రాంప్రసాద్ మంగళవారం తడకలేరు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో అనుమానస్పదంగా కనిపించిన ఓ యువకుడిని అడ్డుకుని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పీఎస్కు తరలించి తమదైన శైలిలో ప్రశ్నించడంతో చైన్ స్నాచింగ్కు పాల్పడిన విషయం బహిర్గతమైంది. యువకుడిని ధర్మవరం మండలం వసంతపురం గ్రామానికి చెందిన చెడిపోతుల మహేష్గా గుర్తించారు. ప్రస్తుతం అనంతపురంలోని ఓబులదేవనగర్లో నివాసముంటున్నాడు. నాలుగు తులాల బంగారు గొలుసు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. ఎన్ఐసీ డీఐఓగా భారతి అనంతపురం అర్బన్: కలెక్టరేట్ ఆవరణలోని జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారిగా (డీఐఓ)గా టి.భారతి నియమితులయ్యారు. మంగళవారం ఎన్ఐసీలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఐఓగా ఉన్న ఎం.రవిశంకర్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు బదిలీ అయ్యారు. దీంతో ఏడీఐఓగా ఉన్న భారతికి ఇన్చార్జ్ డీఐఓగా బాధ్యతలు అప్పగించారు. రవిశంకర్ చేతుల మీదుగా ఆమె బాధ్యతలను అందుకున్నారు. -
ఏసీబీ సోదాలతో అలజడి
అనంతపురం క్రైం: భవన నిర్మాణాల అనుమతి అంశంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం అనంతపురం నగరపాలక సంస్థలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి, సీఐ హమీద్ ఖాన్ నేతృత్వంలోని 20 మంది సభ్యులతో కూడిన బృందం ఉదయం 10.30 గంటలకు చేరుకుని టౌన్ప్లానింగ్ విభాగాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. నగరంలో అక్రమ కట్టడాలు, సెట్బ్యాక్ నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలు, నివాస గృహాల పేరుతో కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించిన అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టారు. టౌన్ప్లానింగ్ ఆఫీసర్ ల్యాప్టాప్, సిబ్బంది వినియోగించే కంప్యూటర్లలోని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. భవన నిర్మాణ దరఖాస్తులు... అనుమతులు.. పెండింగ్లో ఉంచడానికి గల కారణాలు.. ప్లానింగ్ మేరకు భవనాలు నిర్మించారా.. అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఏసీబీ రాకతో జారుకున్న అధికారులు ఏసీబీ రాకతో కీలక విభాగాల అధికారులు క్షణాల వ్యవధిలో నగరపాలక సంస్థ ఆవరణం నుంచి జారుకున్నారు. రెవెన్యూ విభాగం, ఇంజినీరింగ్ విభాగం పూర్తిగా ఖాళీ అయ్యింది. ఇదిలా ఉండగా సాయంత్రం 4 గంటల దాకా టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు చేసిన ఏసీబీ బృందాలు అనంతరం ఇంజినీరింగ్ విభాగంలో కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీ బిల్లుల వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలు చాలా కాలంగా దుమారం రేపుతున్నాయి. సంబంధిత విభాగాల అధిపతులు ఈ ఆరోపణలపై కనీస విచారణ కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది అధికారుల వివరాలను ఆరా తీసిన ఏసీబీ అధికారులు కొన్ని ఇంజినీరింగ్ పనుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ‘రెవెన్యూ’లో రాబందులు నగర పాలక సంస్థలోని రెవెన్యూ విభాగంలో రాబందులు చేరాయి. పేదల రక్తాన్ని జలగల్లా తాగుతున్నాయి. ఏసీబీ అధికారుల బృందం ఓ వైపు సోదాలు చేస్తుంటే.. మరో వైపు ఆ విభాగంలోని కొంతమంది ఆర్ఓల సూచనల మేరకు కీలక రికార్డులను కార్యాలయం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు తెలిసింది. వీటిలో చాలా వరకు నూతన నిర్మాణాల పన్ను విధింపు, పేరు మార్పు, గుత్తల మార్పులు, చేర్పులున్నట్లు తెలిసింది. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్లియర్ చేయకుండా లంచం కోసం చాలా కాలంగా పెండింగ్ ఉంచడం, కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం పరిపాటిగా ఉంటోంది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఎక్కడ సోదాలు చేస్తారోనని భయపడి గుత్తల వసూళ్ల పేరుతో బయటికెళ్లిపోయారు. ఫిర్యాదులపై సోదాలు.. నగరంలో అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులపై అందిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని సోదాలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం రికార్డుల పరిశీలన కొనసాగుతోందన్నారు. బుధవారం క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాలు, సెట్బ్యాక్ తనిఖీలు చేపడతామన్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అనుమతులు జారీ చేసే విధానంలో అవకతవకలు జరిగాయన్న అనుమానాల నేపథ్యంలో కీలక ఫైళ్లు, పత్రాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. నగరపాలక సంస్థలో నిశ్శబ్దం టౌన్ప్లానింగ్లో రికార్డులు, ఫైళ్లు స్వాధీనం ఫిర్యాదులపై నేడు క్షేత్రస్థాయిలో నిర్మాణాల పరిశీలన -
యశ్వంత్పూర్–కతిహార్ మధ్య వారాంతపు ఎక్స్ప్రెస్
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి బిహార్ రాష్ట్రంలోని కతిహార్ జంక్షన్ నుంచి యశ్వంత్పూర్ రైల్వేస్టేషన్కు ప్రత్యేక వారాంతపు ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 10 నుంచి 31 వరకు మంగళవారాల్లో (4 సర్వీసులు) యశ్వంత్పూర్ జంక్షన్ (06571) నుంచి ఉదయం 7 గంటకు బయలుదేరి మూడవ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు కతిహార్ జంక్షన్కు చేరుతుందన్నారు. ఇక తిరుగు ప్రయాణంలో కతిహార్ జంక్షన్ (06572) నుంచి ఈ నెల 13 నుంచి ఏప్రిల్ 3 వరకు ప్రతి శుక్రవారం (4 సర్వీసులు) ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మూడవ రోజు తెల్లవారుజామున 4 గంటలకు యశ్వంత్పూర్ జంక్షన్కు చేరుతుందన్నారు. ఈ రైళ్లు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, నంద్యాల, మార్కాపూర్రోడ్డు, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, భువనేశ్వర్ మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ఏసీ త్రీటైర్తోపాటు స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సర్వే ఏడీగా విజయసారథి అనంతపురం అర్బన్: సర్వే భూ రికార్డుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా విజయసారథికి పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడీగా ఉన్న రూప్లానాయక్ గతనెల 28న ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా ఇన్స్పెక్టర్ సర్వేగా ఉన్న విజయసారథిని ఏడీ (ఎఫ్ఏసీ)గా నియమించారు. ఓపెన్ పది హాల్ టికెట్ల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీ ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం) ద్వారా ఈ నెల 16 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు హాల్టికెట్లను ఏపీ ఓపెన్స్కూల్ అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అలాగే ఏఐ సెంటర్ల నుంచి కూడా పొందవచ్చన్నారు. వాట్సాప్–మనమిత్ర ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. 95523 00009కు ‘ఏజీ’ అని మెసేజ్ పంపాలి. ‘చూస్ సర్వీస్’ లేదా ‘సేవను ఎంచుకోండి’పై క్లిక్ చేయాలి. తర్వాత ‘ఎడ్యుకేషన్ సర్వీస్’ లేదా ‘విద్యా సేవలు’ ఎంచుకోవాలి. ఆ తర్వాత ‘ఏపీ ఓపెన్స్కూల్ ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్, మార్చ్–2026 హాల్ టికెట్స్’ను ఎంచుకోవాలి. తర్వాత విద్యార్థి ‘అడ్మిషన్ నంబరు, పుట్టినతేదీ’ నమోదు చేయాలి. అనంతరం ‘కన్ఫమ్’పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుందని డీఈఓ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్ తెలిపారు. ‘పది’ పరీక్షల నిర్వహణపై నేడు శిక్షణ పదో తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు మంగళవారం ఒక్కరోజు శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటలకు నగరంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో ప్రారంభమయ్యే శిక్షణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు తప్పకుండా రావాలని డీఈఓ ప్రసాద్బాబు స్పష్టం చేశారు. కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ పేర్కొన్నారు. ప్రతి కేజీబీవీలో 6వ తరగతికి 40 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్ల చొప్పున అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. 7, 8, 9, 10 తరగతి, ఇంటర్ రెండో సంవత్సరంలో ప్రస్తుతం ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. https://apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆఫ్లైన్ ద్వారా అందజేసే దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఎంపికై న విద్యార్థుల జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తారని పేర్కొన్నారు. 13 నుంచి 17 వరకు సంబంధిత కేజీబీవీల్లో ధ్రువపత్రాలు పరిశీలించి సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. -
పరిష్కారం..అసంతృప్తికరం
● నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్: ‘జిల్లా కేంద్రానికి వస్తున్న రెవెన్యూ సమస్యల్లో అత్యధికంగా మండల స్థాయిలో పరిష్కారం కావాల్సినవే. భూ సమస్యలను పరిష్కరిస్తున్న తీరు సంతృప్తికరంగా లేదు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా నాణ్యతగా పరిష్కరించాలి’ అని కలెక్టర్ ఆనంద్ ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్పై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ మలోలతో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు తమ పరిధిలో మెరుగైన సేవలు అందించి అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. కోర్టు కేసులు, పరిష్కరించడం సాధ్యం కానివాటి గురించి అర్జీదారులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. అప్పుడే రెవెన్యూ క్లినిక్కు వచ్చే ఫిర్యాదులు తగ్గుతాయన్నారు. మండలస్థాయిలో సమస్య పరిష్కారమైనప్పుడే ప్రజల్లో అధికారులపై నమ్మకం పెరగుతుందన్నారు. సమావేశంలో ఆర్డీఓలు వసంతబాబు, శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు యుగేశ్వరిదేవి, రియాజుద్ధీన్, పరిష్కార వేదిక ఇన్చార్జి జయశ్రీ, తహసీల్దార్లు పాల్గొన్నారు. భూ సమస్యలు పరిష్కరించండి కార్యాలయం చుట్టూ తిరిగి అర్జీలు అందజేస్తున్నా భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇకనైనా సమస్య పరిష్కరించాలంటూ అధికారులకు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ ఆనంద్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు అర్జీలు స్వీకరించారు. పరిష్కార వేదికలో భాగంగా భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. ప్రజల నుంచి 463 అర్జీలు అందగా వాటిలో భూ సమస్యలకు సంబంఽధించి 326 అర్జీలు, ఇతర సమస్యలపైన 137 అర్జీలు అందాయి. -
మాజీ ఎంపీ తలారి రంగయ్యకు భద్రత కల్పించాలి
అనంతపురం సెంట్రల్: కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన ఈ– స్టాంప్ కుంభకోణంపై పోరాడుతున్న మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్యకు ప్రాణహాని ఉందని, ఆయనకు పోలీసు భద్రత కల్పించాలంటూ ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కళ్యాణదుర్గం కేంద్రంగా వెలుగు చూసిన ఈ – స్టాంప్ కుంభకోణంపై సమగ్ర విచారణ కోరుతూ హైకోర్టులో తలారి రంగయ్య పిల్ దాఖలు చేశారని గుర్తు చేశారు. ఈ కుంభకోణం వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. భారీ కుంభకోణానికి సంబంధించి ఆధారాలు బయట పెడుతుండడంతో ప్రత్యర్థుల నుంచి ఆయనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రంగయ్యకు 2 ప్లస్ 2 గన్మెన్ భద్రత కల్పించాలని పోలీసు అధికారులను కోరినట్లు వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు దొడగట్ట నారాయణ, ములకనూరు తిమ్మరాయుడు, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, జెడ్పీటీసీ నాగరాజు, ఎంపీపీలు ఆంజనేయులు, భీమేష్, కన్వీనర్లు చంద్రశేఖరరెడ్డి, సూరి, హనుమంతరాయుడు, నాయకులు మురళి, రామాంజనేయులు యాదవ్, మల్లి, నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ – స్టాంప్ కుంభకోణంపై పోరాడుతుండడంతో ప్రాణహాని ఎస్పీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకుల వినతి -
కర్కశంగా చంపి.. మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి..
తాడిపత్రి రూరల్/పెద్దపప్పూరు: వివాహేతర సంబంధం ఓ ఇల్లాలి ప్రాణాలను బలిగొంది. కట్టుకున్న భర్తే ఆమెను చంపి, కర్కశంగా మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి అటవీ ప్రాంతంలో పడేశాడు. అనంతరం నేరుగా వెళ్లి పోలీసులకు లొంగి పోయాడు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రి మండలం గద్దరగుట్టపల్లి గ్రామానికి చెందిన గంగరాజు, రంగమ్మ దంపతులు కొన్నేళ్ల క్రితం తాడిపత్రిలోని జయనగర్ కాలనీలో స్థిరపడ్డారు. గంగరాజు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వీరి కుమార్తె శ్రీలేఖకు 8 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మేడిమాకులపల్లి గ్రామానికి చెందిన సమీప బంధువులు సుంకన్న, రాములమ్మ దంపతుల కుమారుడు ఎరికల సుధాకర్తో వివాహమైంది. పెళ్లి సమయంలో 10 తులాల బంగారు నగలను కట్నంగా శ్రీలేఖ తల్లిదండ్రులు ఇచ్చారు. మేడిమాకులపల్లిలోనే కాపురముండేవారు. వీరికి కుమారులు ఏడేళ్ల వరుణ్సాయి, ఆరేళ్ల దీక్షిత్, ఐదేళ్ల రిత్విక్ ఉన్నారు. ఉపాధి కోసం భర్త దూరంగా.. రెండేళ్ల క్రితం సుధాకర్ తన భార్య వద్ద ఉన్న 8 తులాల బంగారు నగలను అమ్మి ఆ డబ్బు తీసుకుని సంపాదన పేరుతో దుబాయి వెళ్లాడు. దీంతో శ్రీలేఖ పుట్టింటికి చేరుకుని అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి సపర్యలు చేస్తూ జీవనం సాగిస్తూ వచ్చింది. భర్తకు దూరంగా ఉండడంతో మరో వ్యక్తితో శ్రీలేఖ వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. దుబాయి నుంచి వచ్చిన భర్త.. లారీ డ్రైవర్గా జీవనం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో భార్య వివాహేతర సంబంధం బయటపడడంతో పలు మార్లు నచ్చచెప్పాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. గొడవ పెరిగి తాడిపత్రి అప్గ్రేడ్ పీఎస్లో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఇరువురినీ పోలీసులు మందలించి పంపారు. అనంతరం భర్తను వదిలి వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తితో కలసి శ్రీలేఖ వెళ్లిపోయింది. దీంతో పోలీసులను సుధాకర్ ఆశ్రయించి వారి ద్వారా ఆమెను తిరిగి పిలుచుకుని వచ్చాడు. ఆ తర్వాత కూడా శ్రీలేఖ భర్తకు దూరంగా ఉంటూ తాడిపత్రిలోని యల్లనూరు రోడ్డులో ఉన్న పీజీకి మకాం మార్చింది. ఫిర్యాదుకు నిరాకరణ తనతో కాపురం చేయకుండా మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని జీర్ణించుకోలేని సుధాకర్ భార్యను హతమార్చడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పీజీ వద్దకెళ్లిన సుధాకర్ మాయమాటలతో తన భార్యను పిలుచుకుని లారీలో పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట అటవీ ప్రాంతంలోని మొదటి మలుపు వద్దకు పిలుచుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతుకు చున్నీ బిగించి హతమార్చిన అనంతరం కాలికి చున్నీ కట్టి మృతదేహాన్ని లారీలో నుంచి లాగి కిందకు పడేశాడు. కాలికి కట్టిన చున్నీతోనే రోడ్డు పక్కన ఈడ్చుకుంటూ వెళ్లి మోరీ కింద పడేసి నేరుగా పెద్దపప్పూరు పీఎస్కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి, శ్రీలేఖ మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న హతురాలి కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. హతమార్చిన అల్లుడు కానీ, అతని కుటుంబసభ్యులు కాని ఆస్పత్రికి వచ్చేవరకూ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వబోమని భీష్మించారు. దీంతో ఆరు గంటల పాటు పోస్టుమార్టం ఆగిపోయింది. తల్లి హత్యకు గురవ్వడం, తండ్రి జైలు పాలు కావడంతో చిన్నారులు అనాథలయ్యారంటూ మార్చురీ వద్ద బంధువులు రోదించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. చివరకు హతురాలి తల్లి రంగమ్మకు పోలీసులు నచ్చచెప్పి ఫిర్యాదు స్వీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇల్లాలిని బలిగొన్న వివాహేతర సంబంధం అనాథలైన ముగ్గురు చిన్నారులు -
కదిరి తేరు చూత ము రారండి
● నేడు ఖాద్రీశుడి బ్రహ్మ రథోత్సవం కదిరి: ఎక్కడెక్కడి నుంచో విచ్చేసిన జనం... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే తరుణం. బ్రహ్మే రథసారథిగా మారే సందర్భం. ఉగ్రుడైన లక్ష్మీనారసింహుడు శాంతమూర్తిగా రథంపై కొలువుదీరి భక్తులకు కనిపించే కమనీయ దృశ్యం. లక్షలాదిమంది ఒకచోట చేరే ఆధ్యాత్మిక సౌరభం. అదే ఖాద్రీశుడి బ్రహ్మరథోత్సవం. మంగళవారం ఉదయం సరిగ్గా 8.45 గంటలకు ప్రారంభం కానుంది. దేశంలోనే మూడో పెద్ద తేరు తమిళనాడు ఆండాల్ అమ్మవారు శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూర్ జిల్లాలోని తిరువార్ రథం తర్వాత దేశంలో అతిపెద్ద రథంగా కదిరి తేరు ప్రసిద్ధి చెందింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అతిపెద్ద బ్రహ్మరథం ఇదే. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు. 125 ఏళ్ల క్రితం తయారు చేసిన రథం చక్రాలు ఒక అడుగు, ఒక అంగుళం వెడల్పుతో 8 అడుగుల డయామీటర్తో ఉన్నాయి. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను టేకుతో అందంగా చెక్కారు. వివిధ భంగిమల్లో చెక్కిన ఈ బొమ్మలు అప్పటి శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రథ చక్రాలకు ఈ మధ్యే మరమ్మతులు కూడా చేశారు. రథోత్సవంలో 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఐరావతంపై నారసింహుడుకదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు సోమవారం రాత్రి తెల్లటి ఐరావతం(గజవాహనం)పై భక్తులకు దర్శనమిచ్చారు. హిరణ్య కస్యపుని సంహరించిన నారసింహుడి ఉగ్ర రూపాన్ని చూడలేని దేవతాగణం మరోసారి యథారూపంలో ప్రసన్నం కావాలన్న కోరగా... స్వామి వారు వారి కోరిక మేరకు తెల్లటి ఐరావతంపై దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. ఐరావతంపై విహరించే ఖాద్రీశుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు ఆలయ అర్చకులు తొలుత యాగశాలలో నిత్య హోమాలు నిర్వహించి రథ కలశ పూజలు చేసిన అనంతరం కలశాన్ని శ్రీవారి బ్రహ్మ రథంపై ప్రతిష్టించారు. స్వామివారికి నిత్య కై ంకర్య సేవలు నిర్వహించిన మీదట బ్రహ్మరథం వద్ద శుద్ధి పుణ్య హవచనం, వాస్తు హోమాలు, రథాంగ హోమాలు, రథ సంప్రోక్షణ చేశారు. ఐరావతంపై ఊరేగిన అనంతరం శ్రీవారు తిరిగి ఆలయంలోకి వెళ్లారు. -
హంద్రీ–నీవా సీఈగా నాగరాజ మళ్లీ నియామకం
● తొలిసారి విశ్రాంత ఉద్యోగికి అవకాశం అనంతపురం సెంట్రల్: హంద్రీ–నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు సీఈగా నాగరాజ మళ్లీ నియమితులయ్యారు. తొలిసారి విశ్రాంత ఉద్యోగి ఉన్నతాధికారి స్థానంలో కొనసాగనున్నారు. ఈ విషయంపై గత నెల 10న ‘సాక్షి’లో ‘ఆయనే కావాలి’ శీర్షికన కథనం వెలువడింది. అనుకున్న విధంగానే ఏడాదిపాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ (కాంట్రాక్టు పద్ధతిలో) ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 30న సీఈ నాగరాజ ఉద్యోగ విరమణ పొందారు. అయితే తన సర్వీసును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. రూ.వేల కోట్లతో హంద్రీ–నీవా లైనింగ్పనులు చేపట్టారు. దాదాపు 90శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనే ఉంటే బిల్లుల మంజూరుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో కొంతమంది మంత్రి, ఎమ్మెల్యేల ద్వారా సిఫార్సు చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యనేతల అండదండలు ఉండడంతో తొలిసారిగా ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తిని తిరిగి అదే స్థానంలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
ఆర్డీటీపై కక్ష సాధింపు తగదు
● పేదలకందిస్తున్న సేవలను గుర్తించండి ● ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయండి ● మహా ధర్నాలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ: పేదలకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఇతోధిక సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో ఇబ్బందులకు గురిచేయడం తగదని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర రెడ్డి అన్నారు. మతం రంగు పులమకుండా పేదలకు చేస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని సంస్థ సేవలు కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఆర్డీటీ సేవలు కొనసాగేలా ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, దళిత, ప్రజా సంఘాలతో కలిసి సోమవారం ఉరవకొండలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించారు. తొలుత భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు అధ్యక్షతన జరిగిన ధర్నాలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు ఆర్డీటీ ద్వారా అందుతున్న సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ల అసమర్థత వల్లే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కాలేదన్నారు. ఏడాది కాలంగా ఆర్డీటీ సంస్థ విషయంలో మభ్యపెట్టి జిల్లా ప్రజలను తీవ్రంగా మోసగిస్తున్నారన్నారు. కరువు పీడిత అనంతపురం జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, విద్య, వైద్యం, మహిళా సాధికారతకు కృషి చేసిన ఆర్డీటీకి విదేశీ నిధులు రాకుండా చేయడంతో సంస్థ మనుగడ కష్టంగా మారిందన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉందని, సంస్థ తమ ఆస్తులు అమ్ముకుని మరో దేశానికి తరలిపోయే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వై.మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయిస్తామని నమ్మబలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్.. అందుకు విరుద్ధంగా వ్యవహరించి నిలువునా మోసం చేశారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మత రాజకీయాలను ఆర్డీటీకి అంటగడుతూ విదేశీనిధులు రాకుండా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి.రమణ మాట్లాడుతూ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరించే వరకు ఆర్డీటీ ద్వారా పేదలకు అందుతున్న సేవలు కొనసాగేందుకు వెంటనే బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ఒకసారి చర్చిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. అనంతరం వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ప్రణయ్రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేశవరెడ్డి, సీపీఎం జిల్లా నాయకులు కృష్ణమూర్తి, దళిత, గిరిజనుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మీనుగ గోపాల్, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మధు, బీహెచ్పీ నేత తిప్పేస్వామి తదితరులు ప్రసంగించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినపతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, జెడ్పీటీసీ ఏసీ పార్వతమ్మ, సర్పంచ్ లలితమ్మ, మార్కెట్ యార్డు మాజీ చైర్పర్సన్ సుశీలమ్మ పాల్గొన్నారు. ధర్నాలో ప్రసంగిస్తున్న వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, ధర్నాలో పాల్గొన్న అఖిల పక్ష పార్టీల ముఖ్యనేతలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు -
గుత్తి కోట ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న గుత్తి కోట ఉత్సవాలకు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యల పాల్గొనేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, పర్యాటక శాఖ అధికారి జయకుమార్బాబు, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు, ఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. బాలికల ఆరోగ్య రక్షణకే హెచ్పీవీ టీకా బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్పీవీ టీకా ఎంతో కీలకమని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు దోహదపడే ఈ టీకాను 14 ఏళ్ల వయసున్న బాలికలకు తప్పనిసరిగా వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హెచ్పీవీ టీకాపై ప్రజలను చైతన్యపరుస్తూ ముద్రించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ నెల 11 నుంచి హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. 9వేల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్, డీఆర్ఓ ఎ.మలోల, జీజీహెచ్ పరిపాలనాధికారి మల్లికార్జునరెడ్డి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ శ్రీనివాసరెడ్డి, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ గంగాధర్రెడ్డి, డీఐఓ శశిభూషణ్రెడ్డి పాల్గొన్నారు. పరిశ్రమల నిర్వాహకులకూ ‘ఉద్యమ్’ తప్పనిసరిఅనంతపురం టౌన్: ఇప్పటికే పరిశ్రమలు నిర్వహిస్తున్న వారు సైతం తప్పసరిగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పరిశ్రమల శాఖ అసిస్టెండ్ డైరెక్టర్ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్పై సోమవారం అనంతపురం, గుత్తిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ర్యాంప్ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు నిర్వహిస్తున్న వారు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు పొందేందుకు అర్హులవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐపీఓ రవీంధ్రనాథరెడ్డి, నిషాంత్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 14 నుంచి విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలుఅనంతపురం టౌన్: ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకూ విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి హాజరు కానున్నారు. కబడ్డీ, వాలీబాల్, షటిల్, బాల్ బ్యాడ్మింటన్ తో పాటు వివిధ రకాల పోటీలు ఉంటాయి. ఆసక్తి ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని విద్యుత్ శాఖ ఉద్యోగులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. గుర్తుతెలియని వ్యక్తి మృతిఅనంతపురం సెంట్రల్: ఈ నెల 1న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. స్థానిక రుద్రంపేట సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పిస్తాహౌస్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో 65 ఏళ్ల వయసున్న వ్యక్తి గాయపడడంతో స్థానికులు గుర్తించి, అదే రోజు సర్వజనాస్పత్రిలో చేర్పించారు. సోమవారం పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందాడు. సంబంధీకులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని అనంతపురం ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ కోరారు. బీటెక్ విద్యార్థి ఆత్మహత్యఅనంతపురం: ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన కృష్ణయ్య, శారదమ్మ దంపతుల కుమారుడు గొల్ల హరిప్రసాద్ (19).. అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలోని హాస్టల్లో ఉంటూ బీటెక్ (ఈసీఈ) మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు బెంగళూరుకు వలస వెళ్లి బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్నారు. కారణాలేమిటో గానీ సోమవారం మధ్యాహ్నం హాస్టల్లోని తన గదిలో హరిప్రసాద్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తల్లిదండ్రులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘పచ్చ’ మూకబీభత్సం
బెళుగుప్ప: రోడ్డు ఆక్రమణపై ఫిర్యాదు చేశారని వైఎస్సార్సీపీ మద్దతుదారులపై ‘పచ్చ’ మూక దాడికి తెగబడింది. ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి దాడులతో భయానక వాతావరణ సృష్టించింది. బాధితుల కథనం మేరకు... గుండ్లపల్లిలోని శివాలయం వద్ద నివాసాలకు వెళ్లే రోడ్డును టీడీపీ నాయకుడు క్రిష్టప్ప ఆక్రమించి మరుగుదొడ్డి నిర్మాణానికి గుంతలు తవ్వించాడు. రోడ్డును ఆక్రమించి కట్టుకుంటే ఇబ్బంది అవుతుందని గ్రామపెద్దలు అభ్యంతరం తెలిపారు. అయినా లెక్క చేయలేదు. దీంతో ఈ నెల 7న పోలీసులకు, సచివాలయ అధికారులకు వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఈశ్వరప్ప కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోక పోవడంతో క్రిష్టప్ప ఈసారి గుంతల్లోకి రింగులు దించాడు. రోడ్డు పూర్తిస్థాయిలో బంద్ అవుతుండటంతో సోమవారం మరోమారు ఈశ్వరప్ప కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు క్రిష్టప్ప, గోవిందు, కరెప్ప, ఐదుకల్లు క్రిష్ట, భానుప్రసాద్, విరుపాక్షి, బంతి క్రిష్ట ఆగ్రహంతో ఈశ్వరప్ప ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి కుటుంబ సభ్యులను బయటకు ఈడ్చుకెళ్లి దాడి చేశారు. అంతు చూస్తాం అంటూ బెదిరించారు. దాడిలో ఈశ్వరప్ప, అతని కుమారుడు మంజునాథ, కుమార్తె నిమిత గాయపడ్డారు. తమకు జరిగిన అవమానం.. అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, రక్షణ కల్పించాలని కోరారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. అనంతరం బాధితులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. దాడి సరికాదు ఇళ్ల మధ్య దశాబ్దాలుగా ఉన్న దారిని ఆక్రమించి బాత్రూమ్ నిర్మాణం చేపట్టడమే కాకుండా ఫిర్యాదు చేశారన్న అక్కసుతో ఈశ్వరప్ప కుటుంబంపై టీడీపీ నాయకుడు క్రిష్టప్ప మరికొంతమందితో కలిసి దాడి చేయడాన్ని సర్పంచ్ పురుష్తోతం, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మచ్చన్న ఖండించారు. అమ్మాయని చూడకుండా దాడిచేయడం సరికాదన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టి.. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. గుండ్లపల్లిలో టీడీపీ నేత రోడ్డు ఆక్రమించి బాత్రూమ్ నిర్మాణం పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ మద్దతుదారు కుటుంబంపై ఆగ్రహం ఇంట్లోకి దూరి కుటుంబ సభ్యులను ఈడ్చుకొచ్చి విచక్షణా రహితంగా దాడి -
టిప్పర్ ఢీ.. యువతి దుర్మరణం
పుట్లూరు: టిప్పర్ ఢీకొని యువతి దుర్మరణం చెందింది. ఇదే ప్రమాదంలో ఆమె తాత గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పుట్లూరు మండలం సంజీవపురం గ్రామానికి చెందిన ఈదుల శివారెడ్డి, నాగరత్నమ్మ దంపతుల కుమార్తె ఈదుల అఖిల (23) అనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎమ్మెస్సీ చదువుతోంది. సెలవులు రావడంతో ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. ఆదివారం తాత పెద్ద కుళ్లాయిరెడ్డితో కలిసి తాడిపత్రికి ద్విచక్రవాహనంపై వెళ్లింది. అక్కడ పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. ఎ.కొండాపురం 544డీ జాతీయ రహదారిపై వీరి ద్విచక్రవాహనాన్ని వేగంగా వస్తున్న ఎస్ఆర్సీ కంపెనీకి చెందిన టిప్పర్ తాకింది. బ్యాగు తగిలించుకున్న అఖిలను టిప్పర్ కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అఖిల మృతి చెందింది. పెద్దకుళ్లాయిరెడ్డి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యువతి మృతితో సంజీవపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. బాబు విధానాలతో రైతుల పరిస్థితి దయనీయం ● మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొక్కజొన్నవ, పప్పుశనగ ధరలు దారుణంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్న క్వింటాలు మద్దతు ధర రూ.2,400 ఉంటే.. మార్కెట్లో దళారులు రూ.1,600 కంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారని, ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. పప్పుశనగను కూడా మద్దతు ధర కంటే తక్కువకే కొంటున్నారన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవడం వల్ల రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి, దారుణంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. తక్షణమే మద్దతు ధరతో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నేటి నుంచి ‘ఈ–క్రాప్’ సామాజిక తనిఖీ ● తప్పులుంటే 14 లోపు సవరణకు అవకాశం ● 16న ప్రభుత్వానికి తుది ముసాయిదా అనంతపురం అగ్రికల్చర్: రబీ ఈ–క్రాప్ నమోదు పూర్తయినందున సోమవారం నుంచి ఆర్ఎస్కేల్లో సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ముదిగల్లు రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ఎస్కేల్లో జాబితాలు ప్రదర్శించడంతో పాటు గ్రామసభలు నిర్వహించి ఈ–క్రాప్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సంబంధిత రికార్డులతో ఫిర్యాదు అందజేసి సవరించుకునే వీలుందని పేర్కొన్నారు. ఈ నెల 14 వరకు సామాజిక తనిఖీ ఉంటుందని, ఈ నెల 16న రబీ ఈ–క్రాప్ తుది ముసాయిదా ప్రభుత్వానికి పంపుతామని వెల్లడించారు. వివిధ పథకాల వర్తింపునకు ఈ–క్రాప్కు ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇకపోతే ఈ రబీలో వంద శాతం ఈ–క్రాప్ నమోదు జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 5,91,938 సర్వే నంబర్లకు సంబంధించి 12,17,464 ఎకరాల్లో పంట నమోదు పూర్తి చేశామని తెలిపారు. అదులో వ్యవసాయ పంటలు 3,63,399 ఎకరాలు, ఉద్యాన పంటలు 30,392 ఎకరాలు, మల్బరీ 167 ఎకరాలతో పాటు 8,23,506 ఎకరాలు బీడుభూములు, ఇతరత్రా వ్యవసాయేతర భూములు ఉన్నట్లు ఈ–క్రాప్లో నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ క్రాప్ పారదర్శకత కోసం వివిధ స్థాయిలో సూపర్చెక్ పూర్తి చేశామని తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆర్ఎస్కేల్లో వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఏలను సంప్రదించి సవరించుకోవాలని సూచించారు. -
సివిల్స్లో పట్టువదలని విజయం
● నాలుగో ప్రయత్నంలో నెగ్గిన గిరిరాజ్ సాయికృష్ణ తాడిపత్రిటౌన్: సివిల్ సర్వీసెస్ ఆయన కల. మూడు దఫాలు ఆశాభంగమే కలిగింది. అయినా వెనకడుగు వేయలేదు. మరింత ఏకాగ్రత పెంచి నాలుగోసారి విజయం సాధించారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు తాడిపత్రికి చెందిన గిరిరాజ్ సాయికృష్ణ. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 125వ ర్యాంకు సాధించారు. సాయిక్రిష్ణ తండ్రి ఉమా మహేశ్వరావు ఆటోమొబైల్ వర్క్షాపు నిర్వహిస్తుండగా.. తల్లి విజయలక్ష్మి గృహిణి. తాడిపత్రిలో శ్రీవాణి పాఠశాలలో ప్రాథమిక విద్య, హైదరాబాద్ నారాయణ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. రాజస్తాన్లోని బిట్స్ పిలానిలో ఇంజినీరింగ్ చేసి.. అనంతరం సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం సాధించారు. అలా ఐదేళ్లపాటు పనిచేశాక.. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2021లో తొలిసారి సివిల్స్ పరీక్ష రాశారు. 2022లో ఇంటర్వ్యూ వరకు చేరుకున్నారు. 2023లో గ్రూప్– 1 పరీక్షల్లో నెగ్గడంతో ఎంపీడీఓగా ఎంపికయ్యారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 2024లో సివిల్స్ రాసినా రాణించలేకపోయారు. అయినా నిరాశ చెందకుండా ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోవాలని ఉద్యోగానికి సెలవు పెట్టి.. ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న తన భార్య సుప్రియ వద్దకు వెళ్లారు. ఆమె సహకారం కూడా తోడవడంతో ఈసారి వెనుదిరిగి చూడలేదు. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాశారు. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 125వ ర్యాంకు, తెలుగు రాష్ట్రాల్లో 5వ ర్యాంకు సాధించి తన కల నిజం చేసుకున్నారు. సాయికృష్ణ విజయంపై కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. -
జయహో భారత్
ఎగిరి గంతేశారు. వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా మోత మోగించారు. ఆదివారం టీ–20 వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగితేలారు. అనంతపురంలో టవర్క్లాక్ వద్దకు యువత పెద్ద ఎత్తున చేరుకుని వేడుకలు చేసుకున్నారు. కేక్లు కట్ చేసి సంతోషం పంచుకున్నారు. పలువురు జాతీయ జెండాలు చేతబట్టి ‘జయహో భారత్’ నినాదాలు మార్మోగించారు. – అనంతపురం -
జగన్తోనే మహిళాభ్యున్నతి సాధ్యం
అనంతపురం: వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితేనే మహిళాభ్యున్నతి సాధ్యమవుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా చేయూతనందించి మహిళల ఆర్థిక స్వావలంబనకు పాటుపడ్డారని గుర్తు చేశారు. ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ సమాన అవకాశాలు కల్పించడంతోపాటు విద్య, ఆర్థికంగా చేయూతనందించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్కే దక్కిందన్నారు. చట్టసభలు, నామినేటెడ్, పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేసి వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేశారని కొనియాడారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్ తదితర హామీలు అమలు చేయకుండా నిలువునా మోసం చేశారన్నారు. ఎవరైనా హామీలపై నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతుండటంతో మత్తులో దాడులకు తెగబడుతున్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, గుత్తి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వరలక్ష్మి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి దేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, సర్పంచ్ భూమా కమలమ్మ, కార్పొరేటర్లు సాకే చంద్రలేఖ, రాజేశ్వరి, హసీనా, పార్టీ నేతలు సుశీలమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు సుజాత, రాధాయాదవ్, జిల్లా కార్యదర్శి భారతి, అంజలి, పార్వతి, ప్రసన్న, చంద్రకళ, సుగుణమ్మ, జయమ్మ, లక్ష్మీదేవి, లక్ష్మీ, పద్మావతి, లలిత, రుద్రంపేట, లక్ష్మీ, అంజినమ్మ, సువర్ణ, కుళ్లాయమ్మ, సులోచన, రాజేశ్వరి, కమలమ్మ, అనూరాధ, రమీజా, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
నేడు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్ : కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయవచ్చని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. భూసమస్యలు ఉన్నవారు రెవెన్యూ క్లినిక్లో తహసీల్దార్లకు అర్జీలు సమర్పించాలని సూచించారు. కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ పంపవచ్చన్నారు. నేడు డయల్ యువర్ విద్యుత్ శాఖ ఎస్ఈ అనంతపురం టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఈ శేషాద్రి శేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 91547 90350, 08554 272943 నంబర్లో సంప్రదించాలన్నారు. సమస్యలను సకాలంలో పరిష్కరించనున్నట్లు తెలిపారు. స్కూళ్లలో ‘వాటర్ బెల్’ అనంతపురం ఎడ్యుకేషన్: ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి గంటకూ ఒకసారి తాగునీరు అందించే ‘వాటర్ బెల్’ విధానాన్ని అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్బాబు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలో శారీరక కార్యకలాపాలు నిర్వహించవద్దని ఆదేశించారు. పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం సమృద్ధిగా ఉండేలా చూడాలన్నారు. అవసరమైతే గ్రామ పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనంతో పాటు మజ్జిగ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన విద్యార్థులను వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి అవసరమైతే 108 సేవలకు సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం టౌన్: పరిశ్రమలు నెలకొల్పే ఆసక్తి ఉన్న యువ పారిశ్రామిక వేత్తల నుంచి స్థలాల కేటాయింపు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్లాట్లు కావాల్సిన పారిశ్రామిక వేత్తలు తమ డీపీఆర్ ప్రాజెక్టు నివేదికతో ఏపీఐఐజీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెంటనే వాటిని పరిశీలించి సకాలంలో స్థలాలను కేటాయిస్తామని పేర్కొన్నారు. నగరంలోని సిరికల్చర్ కార్యాలయ ఆవరణలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇందులో సైతం షాప్లను ఏర్పాటు చేసి పారిశ్రామిక వేత్తలకు అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు భూమి విలువపై 75 శాతం మేర ప్రభుత్వం రాయితీలను అందిస్తోందన్నారు. www.apiic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. మరిన్ని వివరాలకు ఏపీఐఐజీ మేనేజర్ సెల్: 9666330666 ను సంప్రదించాలన్నారు. అప్పు చెల్లించలేదని చెంప కొరికాడు! బొమ్మనహాళ్: అప్పు తిరిగి చెల్లించలేదన్న కోపంతో చెంపపై కొరికి గాయపరిచిన సంఘటన గోవిందవాడలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు... శశిధర్ అనే వ్యక్తి గ్రామానికి చెందిన రాజన్నతో రెండేళ్ల క్రితం రూ.5 వేలు అప్పు తీసుకున్నాడు. డబ్బు తిరిగివ్వాలని రాజన్న శనివారం సాయంత్రం అడిగాడు. ఉగాది తర్వాత ఇస్తానని శశిధర్ చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. రాజన్న కోపంలో శశిధర్ చెంపపై కొరకడంతో తీవ్ర గాయమైంది. బళ్లారి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని వచ్చిన శశిధర్ ఆదివారం బొమ్మనహాళ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
అనంతపురం: మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాంచాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. జేఎన్టీయూ (ఏ) ఆడిటోరియంలో ఆదివారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి కలెక్టర్ ఆనంద్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖ, తదితర శాఖలు మహిళలకు జీవనోపాధులు పెంపొందించుకునేందుకు అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారని, వాటిపై విస్తృత అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో 4,250 మంది దాకా చిన్న వయసులో పెళ్లి చేసుకుని టీనేజ్ ప్రెగ్నెన్సీ కలిగిన వారు ఉండడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో బాల్య వివాహాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, జేఎన్టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, వీర శైవ లింగాయత్ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్పర్సన్ స్వప్న, అనంతపురం మార్కెట్ యార్డు చైర్పర్సన్ బల్లా పల్లవి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, డీఆర్డీఏ పీడీ శైలజ, మెప్మా పీడీ విశ్వజ్యోతి, డీఎంహెచ్ఓ డాక్టర్ ఇ.బి.దేవి, బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొఠారి, డీసీఓ అరుణకుమారి, జిల్లా హార్టికల్చర్ అధికారి ఉమాదేవి, డీఎస్డీఓ మంజుల, బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి సుభాషిణితో పాటు స్వయం సహాయక సంఘం సభ్యులు, మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళలు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. -
గరుడ వాహనంపై ఖాద్రీశుడు
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజైన ఆదివారం రాత్రి మరోసారి గరుడారూఢుడై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మ ప్రజల కోరిక మేరకు తన ఇష్ట వాహనమైన గరుత్మంతున్ని నారసింహునికి వాహనంగా మరోసారి పంపుతారు. దీన్నే ప్రజా గరుడసేవ.. మలి గరుడసేవ అని కూడా అంటారు. మోహినీ ఉత్సవంలో ముందు రోజు తిరు వీధుల్లో ఊరేగిన శ్రీవారు సాయంత్రానికి తిరిగి ఆలయం చేరుకున్నారు. నిత్యపూజలు, గ్రామోత్సవం అనంతరం మళ్లీ రాత్రి సమయంలో గరుడవాహనంపై ఆలయ ప్రాంగణంలో కొలువుదీరారు. విశేషాలంకరణ ముగిసిన వెంటనే స్వామి వారికి ప్రధాన అర్చకులు దివ్య మంగళ హారతినిచ్చారు. అప్పటికే రాజగోపురం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు తమ ఇలవేల్పు దేవున్ని దర్శించుకున్నారు. తర్వాత స్వామి వారు తిరువీధుల్లో విహరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవ ఉభయదారులుగా ఆలయ కమిటీ మాజీ చైర్మెన్ రెడ్డెప్పశెట్టి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గిరి ప్రదక్షిణ... లక్ష్మీ నారసింహుని జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని భక్తులు ఆదివారం ఉదయాన్నే పెద్ద సంఖ్యలో కదిరి కొండ వద్దకు చేరుకొని ప్రదక్షిణ చేశారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. భక్తులు గత ఏడాది బ్రహ్మోత్సవాల నుంచి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. భవిష్యత్లో గిరి ప్రదక్షిణకు భక్తుల సంఖ్య బాగా పెరగవచ్చని ఆలయ అధికారులు చెబుతున్నారు. నేడు గజ వాహనం.. ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి సోమవారం రాత్రి తెల్లటి ఐరావతంపై తిరువీధుల్లో తన భక్తులకు దర్శనమిస్తారు. -
కొందరు మనుషులు మృగాల కన్నా హీనంగా మారారు. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాలు చేసిన గాయాలతో శరీరం పుండుగా మారింది. అయినా వదల్లేదు. తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో గర్భం దాల్చి రోడ్డున అనాథగా సంచరిస్తున్న ఆమెను మానవతావ
అనంతపురం కల్చరల్: మతిస్థిమితం లేని యువతిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటన కళ్యాణదుర్గం ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. అయినా నేటికీ దోషులెవరో బయటపడలేదు. వారు చేసిన పాపం యువతి గర్భంలో పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. అనాథగా రోడ్డుపై సంచరిస్తూ... కొన్ని నెలల క్రితం కళ్యాణదుర్గంలోని రహదారులపై మతిస్థిమితం లేకుండా ఒంటరిగా తిరుగుతున్న యువతిని ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శశికళ గమనించింది. పలకరించే ప్రయత్నం చేయడంతో సమాధానం ఇవ్వలేదు. ఆకలిగా ఉందా? అని ప్రశ్నించినా మౌనమే సమాధానమైంది. దీంతో అప్పటికప్పుడు ఆహారాన్ని కొనుగోలు చేసి యువతి చేతికి ఇవ్వడంతో ఎన్నాళ్లుగా ఆకలితో ఉందో తెలియదు కానీ గబగబా మొత్తం తినేసింది. ఆ సమయంలో యువతి బెదురు చూపులు గమనించిన శశికళ... ఆమె ఏదో ప్రమాదంలో ఉందని గ్రహించి, విషయాన్ని వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సాయంతో యువతిని అనంతపురం రూరల్ పరిధిలోని కాట్నేకాలువలో ఉన్న ఆశ్రయ అనాథాశ్రమానికి చేర్చారు. శరీరమంతా పుండుగా మారి.. మతి స్థిమితం కోల్పోయి బెదురు చూపులతో ఆశ్రమానికి చేరుకున్న యువతిని నిర్వాహకులు కృష్ణారెడ్డి, దేవి దంపతులు అప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. 25 ఏళ్ల వయస్సులోనూ ఆరేళ్ల చిన్నారిలా ప్రవర్తిస్తున్న ఆ యువతిని ఎంత ప్రశ్నించినా తన తల్లిదండ్రులెవరో చెప్పలేని స్థితిలో ఉంది. శరీరంపై గాయాలు ఉండడంతో ఆస్పత్రికి పిలుచుకెళ్లి చూపించారు. ఆ సమయంలో గాయాలను పరిశీలించిన వైద్యులు అవి మానవ మృగాలు చేసినవిగా నిర్ధారించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె గర్భంతో ఉన్నట్లుగా ధ్రువీకరించారు. ఆ సమయంలో అత్యాచారం జరిగిన విషయం గాని తెలియని స్థితిలో యువతి అమాయకంగా చూస్తుండడం గమనించిన వైద్యులు, సిబ్బంది హృదయాలు ద్రవించి పోయాయి. చికిత్స అనంతరం ఆమెను ఆశ్రమానికి చేర్చిన కృష్ణారెడ్డి దంపతులు అప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. పుండుగా మారిన శరీరాన్ని రోజూ శుభ్రం చేస్తూ ఆమెకు పౌష్టికాహారాన్ని అందజేస్తూ వచ్చారు. ప్రస్తుతం యువతి నిండు గర్భిణి. రేపో.. మాపో ప్రసవమయ్యే సూచనలు ఉన్నాయి. తలుచుకుంటేనే భయమేస్తోంది మానవత్వమున్న ఉపాధ్యాయురాలు గుర్తించి ఈ యువతిని మా ఆశ్రమానికి చేర్చారు. ఆమె ఆశ్రమానికి వచ్చేనాటికి శరీరం మొత్తం పుండుగా మారి ఉంది. మానవ మృగాలు ఎంత పైశాచికంగా పాడు చేశారో తలుచుకుంటేనే భయమేస్తోంది. కనీసం తన తల్లిదండ్రులెవరు అనే విషయం కానీ, తనపై అత్యాచారం జరిగిందనే విషయం గాని ఆమెకు తెలియదు. ఎంతో అమాయకంగా ఉంది. ఆమె భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తోంది. ఆశ్రమంలో ఎందరో అనాథలు ఉన్నారు. వీరెవ్వరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవు. వీరి దైన్య స్థితిపై అధికారులు స్పందించి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు చేస్తే ఆదుకునే అనాథాశ్రమాలకు ఎంతో మేలు చేసిన వారవుతారు. – దేవి, ఆశ్రయ అనాథాశ్రమ నిర్వాహకురాలు ఆమె పరిస్థితి చూసి చలించిపోయాను నేను ప్రస్తుతం ఆత్మకూరు మండలం పంపనూరులోని ఎంపీపీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నిరాశ్రయులైన మహిళలెవరైనా కనిపిస్తే అనాథశ్రమాలకు చేరుస్తుంటాను. అలా ఒకసారి కళ్యాణదుర్గంలోని పోలీసుస్టేషన్ సమీపంలో డివైడర్ వద్ద రెండేళ్లుగా దిక్కు లేకుండా కూర్చొని ఉన్న ఓ యువతి కనిపించింది. ఆ సమయంలో ఆమె పరిస్థితి చూసి చలించిపోయాను. వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి, వారి సహకారంతోనే ఆశ్రయ అనాథాశ్రమానికి చేర్చాను. రోజులు గడుస్తుండగా ఆమె శరీరంలో మార్పులు గమనించి వైద్యులకు చూపిస్తే గర్భిణి అని తెలిసింది. ఈ అమానుషంపై ఎవరూ స్పందించకపోవడం బాధాకరం. – శశికళ, ఉపాధ్యాయురాలు మానవ మృగాలు చేసిన గాయాలతో పుండుగా మారిన శరీరం గర్భం దాల్చి రోడ్డున పడ్డ అనాథ గుర్తించి అనాథాశ్రమానికి చేర్చిన ఉపాధ్యాయురాలు అక్కున చేర్చుకున్న ‘ఆశ్రయ’ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ కలచి వేస్తున్న అభాగ్యురాలి కన్నీటిగాథ -
పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు
● మండుటెండలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళా రైతు నిరసన యాడికి: తన పొలంలోకి వెళ్లకుండా రస్తాని కొందరు అడ్డుకుంటున్నారంటూ పెద్దపప్పూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బొందలదిన్నె గ్రామానికి చెందిన మహిళా రైతు జ్ఞానేశ్వరి శనివారం మండు టెండలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఈ సందరం్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ పొలానికి వెళ్లడానికి పూర్వపు రస్తా ఉందని, ఇది రెవెన్యూ మ్యాప్లోనూ స్పష్టంగా పేర్కొన్నారని వివరించింది. అయితే కొంతకాలంగా అక్కడ రస్తా లేదంటూ కొందరు దౌర్జన్యానికి పాల్పడుతూ పొలంలో కాలు పెట్టకుండా తమను అడ్డుకుంటున్నారని వాపోయింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, అయినా స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం సమస్యకు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించింది. పొలానికి రస్తా చూపించి న్యాయం చేయాలని, లేకపోతే తన భర్త ప్రతాపరెడ్డితో కలసి కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపడతానని హెచ్చరించింది. కట్టడంపై నుంచి జారిపడి కార్మికుడి మృతి ఉరవకొండ రూరల్: నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి కింద పడి ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండకు చెందిన సలీం(30)కు భార్య యాస్మిన్, ఐదేళ్లలోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడాదిగా తన భార్య పుట్టినిల్లైన ఆమిద్యాలలోనే నివాసముంటూ బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం ఆమిద్యాలలో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి క్యూరింగ్ చేస్తూ రెండో అంతస్తుపై నుంచి అదుపు తప్పి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రేపు వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి బూత్ కమిటీ సమావేశం అనంతపురం: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీల సమావేశాన్ని సోమవారం నిర్వహించనున్నారు. బూత్ కమిటీల రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరుకావాలని అనంతపురం జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు వై.అమరనాథరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఎల్ఓల నియామకం, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అంశాలపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు. సూపర్ మార్కెట్లో చోరీ కళ్యాణదుర్గం రూరల్: స్థానిక బళ్లారి మిట్టపై ఉన్న మెట్రో సూపర్ మార్కెట్లో చోరీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగులు క్యాష్ కౌంటర్లోని రూ.30 వేలు అపహరించారు. యజమాని ఫిర్యాదు మేరకు శనివారం క్షేత్ర స్థాయిలో పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ హరినాథ్ తెలిపారు. టీడీపీ వర్గీయులపై జనసేన నేతల దాడి శింగనమల: మండలంలోని నాగులగుడ్డం తండాలో శనివారం సాయంత్రం టీడీపీ, జనసేన నాయకుల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. వారం రోజుల క్రితం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం విషయంలో టీడీపీ, జనసేన నాయకులు ఘర్షణ పడ్డారు. సమస్య సద్దుమణుగుతున్న సమయంలో శనివారం టీడీపీ నాయకుడు నాగభూషణంనాయక్ ఇంట్లోకి జనసేన నాయకులు దూసుకెళ్లి సామగ్రిని చెల్లాచెదురు చేశారు. తలుపులు పగులగొట్టారు. విషయం తెలుసుకున్న సీఐ కౌలుట్లయ్య వెంటనే శింగనమల, గార్లదిన్నెలు ఎస్ఐ విజయకుమార్, గౌస్, సిబ్బందితో అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. కాగా, పరస్పర దాడిలో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. రేషన్ బియ్యం పట్టివేత తాడిపత్రి టౌన్: స్థానిక శివాలయం సమీపంలో బైపాస్ రోడ్డుపై బొలెరో వాహనంలో 35 బస్తాల్లో తరలిస్తున్న 15.75 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శనివారం సీఐ ఆరోహణరావు సీజ్ చేసారు. యాడికి మండలం కేశవరాయునిపేటకు చెందిన వాహన యజమాని గంగాధర్, డ్రైవర్ కంబన్నను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీఎస్డీటీ మల్లేషుకు అప్పగించారు. -
బహిరంగ వేలం.. ఏకపక్షం
● చక్రం తిప్పిన మున్సిపల్ రెవెన్యూ అధికారులు గుంతకల్లుటౌన్: స్థానిక మున్సిపాలిటీ ఆదాయ వనరులపై శనివారం నిర్వహించిన వేలం ప్రక్రియ ఏకపక్షంగా సాగింది. ఏటా కౌన్సిల్ హాల్లో అందరి సమక్షంలో వేలం పాటను నిర్వహించే అధికారులు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి చాంబర్లో ఈ ప్రక్రియను ముగించారు. టీడీపీ ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు టీడీపీ మద్దతుదారుడికే అధికారులు నాలుగు కాంట్రాక్ట్లను కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఉదయం 11 గంటలకు వేలంపాటను నిర్వహిస్తామంటూ రెండు రోజుల ముందు ప్రకటించిన అధికారులు నిర్ణీత సమయం కంటే ముందే ఈ ప్రక్రియను ముగించేయడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో అధికారులను కాంట్రాక్టర్లు హుస్సేన్ సాహెబ్, నాసీర్, రామాంజనేయులు నిలదీశారు. ఇష్టం వచ్చినట్లు వేలంపాటను ఎలా నిర్వహిస్తారని మున్సిపల్ ఆర్ఐ ఎర్రిస్వామి, సీకే రామాంజనేయులను వారు ప్రశ్నించారు. కార్యాలయంలోనే ఉన్న తమకు కనీస సమాచారం కూడా ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టుగా వేలం ప్రక్రియ మున్సిపల్ కమిషనర్ చాంబర్లో జరిగిన వేలం పాటలో ఒకే వర్గానికి చెందిన కేవలం నలుగురు కాంట్రాక్టర్లు మాత్రమే పాల్గొన్నారు. వీరిలో పత్తిపాటి చంద్రశేఖర్ నాయుడుకు నాలుగు కాంట్రాక్టులు దక్కాయి. రూ.46.18 లక్షలతో దినసరి పబ్లిక్ మార్కెట్లో సుంకం వసూలు చేసుకునే హక్కు, రూ.3.23 లక్షలతో మాంసపు9 విక్రయాల సుంకం వసూలు హక్కు, రూ. 2.04 లక్షలతో పశు వధుశాల, విక్రయాలపై సుంకం వసూలు హక్కు, రూ.2.20 లక్షలతో జీవాల వధశాల, మాంసం విక్రయాలపై సుంకం వసూలు హక్కును పొందాడు. అధికారులు ఏకపక్షంగా కాకుండా కాంట్రాక్టర్లందరి సమక్షంలో వేలం పాట నిర్వహించి ఉంటే పోటీ పెరిగి మున్సిపాలిటీకి ఆదాయం మరింత పెరిగేదని పలువురు పేర్కొన్నారు. ఈ మొత్తం అక్రమాలను తెర వెనుక నుంచి మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఇద్దరు తిప్పినట్లుగా ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కలెక్టర్ చొరవ తీసుకుని వేలం ప్రక్రియను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఆర్డీటీ సేవలు కొనసాగించాలి
● రేపటి ధర్నాకు తరలిరండి ● వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి పిలుపుఉరవకొండ: కరువు పీడిత జిల్లాలో పేదలకు ఆర్డీటీ సేవలు కొనసాగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపి కేంద్రంతో చర్చించాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం ఈ నెల 9న ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలతో కలసి వైఎస్సార్సీపీ నిర్వహించబోయే మహాధర్నాపై చర్చించేందుకు శనివారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఐదు దశాబ్దాలుగా విద్య, వైద్యం, మహిళా సాధికారత లాంటి రంగాల్లో సేవలందిస్తున్న ఆర్డీటీని కేంద్రం గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతి ఏటా ఆర్డీటీకి విదేశీ నిధుల ద్వారా రూ.600 కోట్లు వచ్చేవని, ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయకపోవడంతో ప్రస్తుతం ఒక్క పైసా కూడా రాలేదని తెలిపారు. దీని వల్ల ఆర్డీటీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయిస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చెప్పినా ఇప్పటి వరకూ ఎటువంటి స్పందనా లేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రి కేశవ్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు ఉత్సవ మూర్తుల్లా మారార విమర్శించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ అయ్యే వరకు ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు ఆర్థికంగా తోడ్పాటునందించాలని కోరారు. సోమవారం నాటి ధర్నాకు స్వచ్ఛందంగా అందరూ తరలివచ్చి ఆర్డీటీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సీపీ వీరన్న, సర్పంచ్ మీనుగ లలితమ్మ, కాంగ్రెస్ నాయకులు సోనియా శీనా, అబ్బాస్, ఎస్సీ, ఎస్టీ హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మీనుగ గోపాల్, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక నాయకులు మధు, ఎస్సీ, ఎస్టీ నాయకులు రాజశేఖర్, ఏఐఎఫ్డీఎస్ జిల్లా అధ్యక్షులు నందు, తరుణ్, వైఎస్సార్ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పురుషోత్తం, రైతు సంఘం అధ్యక్షులు సిద్దార్థ్, పార్టీ నాయకులు ఈడిగ ప్రసాద్, బసవరాజు, ఓబన్న, ఎర్రిస్వామిరెడ్డి, పచ్చిరవి, గంగాధర్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి -
ముత్యాలమ్మ ఆలయంలో చోరీ
● రెండేళ్లలో వరుసగా నాలుగో సారి ఘటన రామగిరి: ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలోనూ ప్రఖ్యాతి గాంచిన రామగిరి మండలంలోని నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తలుపులు ధ్వంసం చేసి ఆలయంలోకి చొరబడిన దుండగులు సుమారు రూ.లక్షకు పైగా విలువ చేసే అమ్మవారి వెండి ఆభరణాలను అపహరించారు. టీడీపీ ప్రభుత్వమేర్పడిన ఈ రెండేళ్లలో వరుసగా నాలుగోసారి చోటు చేసుకున్న చోరీపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఓ కుటుంబం కబంధహస్తాల్లో ఉన్న ఈ ఆలయాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోకి చేర్చింది. అనంతరం ఆలయం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. భక్తులకు సౌకర్యాల కల్పనతో పాటు వారి భద్రతకు అన్ని చర్యలూ తీసుకున్నారు. అయితే ఈ రెండేళ్లలో ఆలయానికి భద్రత కరువు కావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రైలు కిందకు దూసుకెళ్లిన గొర్రెలు
● 30 జీవాల మృతి డి హీరేహాళ్(రాయదుర్గం): రైలు కిందకు జీవాలు దూసుకెళ్లిన ఘటనలో 30 గొర్రెలు మృతి చెందాయి. డి.హీరేహాళ్ మండలం హొసగుడ్డం శివారున ఈ ఘటన చోటు చేసుకుంది. హొసగుడ్డం గ్రామానికి చెందిన చౌడిక ముక్కన తనకున్న 72 గొర్రెలను శనివారం మేపు కోసమని అటవీ ప్రాంతానికి తోలుకెళ్లాడు. మార్గమధ్యంలో రైలు పట్టాల పక్కన మేస్తున్న గొర్రెల్లో ఓ గొర్రె అప్పటికే శరవేగంగా వచ్చిన ఎక్స్ప్రెస్ రైలు నుంచి త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుంటూ అవతలి వైపుగా వెళ్లింది. దానిని అనుసరిస్తూ మిగిలిన గొర్రెలు కూడా రైలు కిందకు దూసుకెళుతూ ఒకదాని వెనుక ఒకటి చొప్పున 30 జీవాలు మృతి చెందాయి. ఐదు గొర్రెలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ సమయంలో కాపరి ఎంత అడ్డుకున్నా సాధ్యం కాలేదు. వాటిని కాపాడబోయిన ఇద్దరు కాపర్లు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. ఘటనతో రూ.3 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ద్విచక్ర వాహనాల ఢీ – ఒకరి మృతి శింగనమల: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శింగనమల మండలం జూలకాల్వ గ్రామానికి చెందిన తలారి బయ్యన్న (57) శనివారం వ్యక్తిగత పనిపై నాయనపల్లి క్రాస్కు వచ్చాడు. సాయంత్రం పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైన ఆయన జలాలపురం వద్దకు చేరుకోగానే ఎదురుగా ద్విచక్ర వాహనంపై శరవేగంగా దూసుకొచ్చిన జూలకాల్వకు చెందిన అశోక్ ఢీకొన్నాడు. ప్రమాదంలో తలారి బయ్యన్న ఎగిరి రోడ్డు పక్కన ఉన్న కంపచెట్లలో పడ్డాడు. అటుగా పోతున్న వారు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బయ్యన్న మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సౌరవిద్యుత్ పనులు వేగవంతం చేయాలి శింగనమల: సౌర విద్యుత్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శనివారం ఆయన శింగనమల నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. శింగనమల మండలం పెరవలిలో పీఎం కుసుమ్ పథకం కింద ఏర్పాటు చేస్తున్న 4 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, మేఘా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సౌరవిద్యుత్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని 20 సబ్ స్టేషన్లలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం నాయనపల్లి క్రాస్ వద్ద పీఎం సూర్య ఘర్ లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించారు. అలాగే బుక్కరాయసముద్రం మండలం పసలూరులో ఆర్డీ్ఎస్ఎస్ పనులను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. విద్యుత్ స్తంభాలు, డీటీఆర్లను ఏర్పాటు చేసే సమయంలో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులకు సహకరించాలన్నారు. అంతకుముందు రేకులకుంటలో అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్, మండల పరిషత్ ప్రాథఽమిక పాఠశాలను తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు పిల్లలు ఉన్నారా లేదా అని పరిశీలించారు. పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ శేషాద్రి శేఖర్, ఈఈ జేవీ రమేష్, డీఈ రఘు, శ్రీకాంత్రెడ్డి, ఏఈ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసిన దివ్య
అనంతపురం సెంట్రల్: యూపీఎస్సీ ఫలితాల్లో అనంతపురానికి చెందిన సోమాసి దివ్య అనే యువతి ఆలిండియా స్థాయిలో 394వ ర్యాంకు సాధించింది. ఈమె తండ్రి రమేష్ కళ్యాణదుర్గం ఆర్టీఓగా పనిచేస్తున్నారు. నంద్యాలలో 6 నుంచి 10వ తరగతి, హైదరాబాద్లో ఇంటర్, ఐఐటీ– బాంబేలో బీటెక్ పూర్తి చేశారు. కాలిఫోర్నియాలో బర్కిలీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేశారు. తర్వాత యూపీఎస్సీ కోసం హైదరాబాద్లో శిక్షణ తీసుకుని రాణించారు.సేవా రుసుం మూడింతల పెంపు అనంతపురం అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం పేదల జేబుల నుంచి లాక్కుని సంపద సృష్టించే మార్గానికి రాచబాట వేసింది. కొత్త బియ్యం కార్డు, డూప్లికేట్ బియ్యం కార్డు, బియ్యం కార్డులో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు కార్డు విభజన వంటి అన్ని సేవల దరఖాస్తు రుసుంను ఏకంగా మూడింతలు పెంచింది. దీంతో ఇప్పటి వరకూ ఉన్న రూ.24 సేవా రుసుం కాస్తా రూ.100కు చేరింది. బియ్యం కార్డు విభజనకు ఇప్పటి వరకు తీసుకుంటున్న రూ.48 సేవా రుసుం రూ.200కు పెంచింది. ఇందుకు సంబంధించి సచివాలయ సిబ్బంది గ్రూపుల్లో సమాచారం పంపించింది. -
మోహినీ అవతారమెత్తిన శ్రీవారు
కదిరి: భక్తుల చేత వసంత వల్లభుడిగా, కాటమరాయుడిగా, ప్రహ్లాద వరదుడిగా కదిరిలో పూజలందుకుంటున్న ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా, అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజైన శనివారం స్వామివారు మోహినీ అవతారమెత్తారు. ఈ అవతారంలోని శ్రీవారి కుచ్చుల వాలు జడ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడతారు. అమృతాన్ని పంచడానికి శ్రీమహా విష్ణువు మోహినీ అవతారమెత్తాడని భక్తుల నమ్మకం. దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి, అసురులను మభ్యపెట్టేందుకు శ్రీవారు మోహినీ అవతారమెత్తారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వయ్యారాలు ఒలకపోసే సోయగాలతో, చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తుంటే చూడడానికి రెండు కళ్లు సరిపోలేదు. ధగ ధగా మెరిసే పట్టు చీరలో అందరినీ అకట్టుకొనే స్వామి వారిని గుభాళించే కదిరి మల్లెలతో అలంకరించారు. ఈ ఉత్సవ ఉభయదారులుగా కోటా గోపాలక్రిష్ణయ్య గుప్త కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణమంతా ఊరేగనున్న శ్రీవారు తిరు వీధుల దర్శనానంతరం స్వామివారు రాత్రంతా పట్టణంలోని ప్రతి వీధికి వెళ్లి ఆలయానికి రాలేకపోతున్న తన భక్తుల ఇళ్ల వద్దకే వెళ్లి దర్శనమిస్తారు. ఆదివారం సాయంత్రం తిరిగి ఆలయం చేరుకొని అలంకరణ అనంతరం ప్రజా గరుడ సేవలో భాగంగా మరోసారి గరుడవాహనంపై స్వామివారు తన భక్తులకు తిరువీధుల్లో దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీవారి రథోత్సవం ఈ నెల 10న జరగనుంది. -
ఎంపీటీసీ భర్తపై హత్యాయత్నం
● బండరాయితో మోదిన టీడీపీ నేత బొమ్మనహాళ్: రెడ్బుక్ అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. విపక్ష వైఎస్సార్సీపీ శ్రేణులపై విరుచుకుపడుతున్నారు. అధికారంలో ఉన్నాం.. ఏమైనా చేయగలం అనే ధీమాతో అరాచకశక్తులుగా మారి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. తాజాగా మండల కేంద్రం బొమ్మనహాళ్లో ఎంపీటీసీ సభ్యురాలు శివశంకరమ్మ భర్త యువరాజ్ స్వామిపై టీడీపీ నేత బక్కసూరి హత్యాయత్నం చేశారు. బాధితుడి కథనం మేరకు... యువరాజ్స్వామి శనివారం ఉదయం తన కుమారుడు, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై ఓ హోటల్కు వెళ్లాడు. టిఫెన్ పార్సిల్ కట్టించుకుని బయటకు వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నేత బక్క సూరి.. యువరాజ్స్వామిని దూషిస్తూ విరుచుకుపడ్డాడు. ‘ఎక్కడినుంచో బతకడానికి బొమ్మనహాళ్కు వచ్చి ఎంపీటీసీ అయ్యారు.. ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి కాకుండా వైఎస్సార్సీపీకి సపోర్ట్ చేస్తారా.. నీ అంతు చూస్తా.. లం.... కొడకా.. నువ్వు ఎంత రా..’ అంటూ పత్రికల్లో రాయలేని విధంగా దుర్భాషలాడాడు. అక్కడితో ఆగకుండా ద్విచక్ర వాహనంపై కూర్చున్న యువరాజ్స్వామిపై బండరాయితో దాడి చేశాడు. తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. బైక్ను సైతం ధ్వంసం చేశాడు. ఈ హఠాత్పరిణామంతో పిల్లలు భయంతో వణికిపోయారు. ఇంతలో అక్కడున్న స్థానికులు కలగజేసుకుని స్వామిని రక్షించారు. అనంతరం బాధితుడు కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కాలవ అండతోనే దాడులు బొమ్మనహాళ్: టీడీపీ అరాచక పాలన పరాకాష్టకు చేరిందని, వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు పెరిగిపోయాయని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అండదండలతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. బొమ్మనహాళ్లో టీడీపీ గూండా బక్క సూరి దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ శివశంకరమ్మ భర్త యువరాజ్స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న మెట్టు గోవిందరెడ్డి స్థానిక నాయకులతో కలిసి శనివారం సాయంత్రం బాధితుడిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీటీసీ భర్తపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. రెండు నెలల క్రితం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో అనెగ్జర్ ఫారం 1, 2 సమర్పించేందుకు వైఎస్సార్సీపీ నాయకులతో ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లినప్పుడు టీడీపీ మూకలు తమ నాయకులపై దాడి చేశారన్నారు. ఘటనపై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. తామే టీడీపీ నాయకులపై దాడి చేశామంటూ పోలీసులు తప్పుడు కేసులను నమోదు చేశారన్నారు. ఎంపీపీ ఎన్నికలప్పటి నుంచి యువరాజ్స్వామి కుటుంబాన్ని టీడీపీ నాయకులు అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ గూండా బక్క సూరి తన కారుమీద రాయితో దాడి చేశాడని, దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదన్నారు. ప్రశాంతంగా ఉండే రాయదుర్గం నియోజకవర్గంలో అరాచకాలకు కాలవ శ్రీనివాసులు ఆజ్యం పోయడం దారుణమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామాంజనేయులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంసీహెచ్ రాజ్కుమార్, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం సెక్రెటరీ పరమేశ్వర, బీసీ సెల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు మారెంపల్లి మారెన్న, మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, వైస్ ఎంపీపీ రమేష్, నాయకులు పాల్గొన్నారు. -
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కరెంట్ కోత
అనంతపురం: ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కరెంటు కోత రోగులను ఇబ్బందులకు గురి చేసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రాంగణంలో శుక్రవారం రాత్రి ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల స్నాతకోత్సవం నిర్వహించారు. ఆ రాత్రి విధుల్లో ఉన్న ఎలక్ట్రీషియన్లు శనివారం ఉదయం 10 గంటల వరకు రాలేదు. దీంతో ఓపీ చీటీలు ఇవ్వడానికి అవరోధం ఏర్పడింది. ఈ క్రమంలో రోగుల క్యూ భారీగా పెరిగిపోయింది. షెడ్యూల్ ప్రకారం చేయాల్సిన ఆపరేషన్లను కాస్తా సోమవారానికి వాయిదా వేశారు. వాస్తవానికి ముగ్గురు ఎలక్ట్రీషియన్లు సూపర్ స్పెషాలిటీలో విధులు నిర్వహించాల్సి ఉంది. వీరిలో ఇద్దరు ఆడవారు కావడంతో.. వాచ్మెన్ విధులకే పరిమితయ్యారు. ఉదయం పది తర్వాత కరెంటు పునరుద్ధరించారు. అప్పటి వరకు రోగులు పడిన అవస్థల గురించి కలెక్టర్ ఆనంద్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆ ఇద్దరినీ బదిలీ చేశారు. ఒకరిని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు, మరొకరిని ప్రభుత్వ సర్వజనాస్పత్రికి బదిలీ చేశారు. నైపుణ్యం ఉన్న ఎలక్ట్రీషియన్లనే సూపర్స్పెషాలిటీకి బదిలీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
మహిళాభ్యున్నతే లక్ష్యంగా ముందడుగు..
అనంతపురం: సంక్షేమ పథకాలను నేరుగా మహిళలకే అందజేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశంసించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అనంత శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ, కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న మహిళలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో అడుగు వేయాలని ఆకాంక్షించారు. మహిళాభ్యున్నతే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. సీ్త్రలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఆర్థికంగా చేయూతే కాకుండా లక్షలాది పేద కుటుంబాలలో వెలుగు నింపేందుకు వైఎస్సార్సీపీ ఐదేళ్ల కాలంలో నవరత్నాల కింద ఏకంగా రూ.1,89,519 కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారని తెలియజేశారు. కానీ నేడు చంద్రబాబు పాలనలో మహిళా సాధికారత, మహిళాభ్యున్నతి, మహిళల రక్షణ అనేవి మేడిపండు చందంగా మారిపోయాయని విమర్శించారు. -
యుద్ధం.. మానవ మనుగడకు ఆటంకం
అనంతపురం: యుద్ధం వల్ల కేవలం రెండు దేశాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి పసిపిల్లల మరణాలు మరింత బాధాకరమన్నారు. యుద్ధం అనేది ఎన్నటికీ సమస్యకు పరిష్కారం కాదన్నారు. అంతేకాక ప్రపంచ శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయన్నారు. ఈ యుద్ధాల వల్ల మానవ మనుగడకు ఆటంకం కలుగుతుందన్నారు. ఆధిపత్య పోరులో ఆయుధాల వ్యాపారులకు తప్ప ఇతరులకు ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని ఆయా దేశాలు గ్రహించాలని కోరారు. ముఖ్యంగా ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, విద్య, ఆరోగ్య రంగాలపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వేల సంవత్సరాల నుంచి భారతదేశానికి ఇరాన్కు మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. మెడికల్ షాపుల్లో తనిఖీలు రాయదుర్గం టౌన్: పట్టణంలోని పలు మెడికల్ షాపుల్లో జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా అసిస్టెంట్ డైరక్టర్ వీరకుమార్రెడ్డి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు మాధవి, కేశవరెడ్డి మూడు బృందాలుగా విడిపోయి బళ్లారి రోడ్డులోని దాదాపు ఐదారు మెడికల్ షాపుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. బిల్లులు నిర్వహణ, స్టాక్ రిజిస్టార్లు, రికార్డులు, జీఎస్టీ తగ్గింపు మేరకు విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే విషయాలతో పాటు నిషేధిత మందుల విక్రయాలు, నిల్వలను పరిశీలించారు. నిబంధనలు పాటించని ఐదు దుకాణాదారులకు నోటీసులు జారీ చేశారు. కాగా, తనిఖీల విషయం తెలియగానే రాయదుర్గంలోని పలు మెడికల్ షాపులకు తాళం వేసి నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. సాకే శైలజానాథ్ -
నేడు జేఎన్టీయూలో జిల్లాస్థాయి మహిళా దినోత్సవం
అనంతపురం అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మహిళా దినోత్సవం నిర్వహణపై ఐసీడీఎస్, డీఆర్డీఏ, మెప్మా అధికారులకు తగిన సూచనలిచ్చారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభించాలన్నారు. మహిళ సాధికారత, లింగ వివక్ష, బాల్య వివాహాల నిర్మూలనతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన వారిని అతిథుల ద్వారా సత్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, మహిళలు, ప్రజలు పాల్గొన్ని జయప్రదం చేయాలన్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు. -
జాతీయ స్థాయి గుర్తింపుతో అగ్రగామిగా జేఎన్టీయూ
● వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు అనంతపురం: ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను ప్రపంచానికి అందించిన ఖ్యాతి జేఎన్టీయూ(ఏ) సొంతమని, నాణ్యమైన విద్యను అందిస్తూ జాతీయ స్థాయి గుర్తింపుతో అగ్రగామిగా నిలిచిందని ఆ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అన్నారు. జేఎన్టీయూ (ఏ) ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి అధ్యక్షతన శనివారం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమాలకు విద్యార్థులు భారీగా హాజరయ్యారు.ఆద్యంతం కన్నుల పండుగగా కార్యక్రమాలు జరిగాయి. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను వీసీ ప్రారంభించి, మాట్లాడారు. కళాశాల పూర్వ విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఉన్నారని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. కళాశాల పురోభివృద్ధిలో పూర్వ విద్యార్థుల సహకారాన్ని కొనియాడారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, ఓఎస్డీటూవీసీ ఓ.దేవన్న, స్పోర్ట్స్ సెక్రెటరీ డాక్టర్ టి.నారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దిలీప్కుమార్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జోజిరెడ్డి , విద్యార్థుల తరపున కో–ఆర్డినేటర్లు యు.సాయిహేమంత్, కె.అనురాగ్ శ్యాం, డి.సాయి విష్ణు, కె.రోహిత్ పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి వీసీ చేతుల మీదుగా మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. -
రాకెట్లలో రాయల కాలం నాటి తామ్ర శాసనాలు లభ్యం
ఉరవకొండ: రాయల కాలం నాటి తామ్ర శాసనాలు రాకెట్ల గ్రామంలో లభ్యమయ్యాయి. తూమటి సుధాకర్ ఇంట్లో మూడు తామ్రపత్రాలను పురావస్తు శాఖ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్కడి నుంచే మైసూరులోని భారత పురావస్తు శాఖ శాసన విభాగం డైరెక్టర్ మునిరత్నంకు పంపించారు. తామ్రపత్రాల గురించి చరిత్రకారుడు బుక్కపట్నం గోపి మీడియాకు వివరాలు వెల్లడించారు. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయులు రాయించిన శాసనాలుగా శాసనవిభాగం డైరెక్టర్ గుర్తించినట్లు తెలిపారు. వీటిని క్రీ.శ.1527 నవంబర్ 5న కార్తీక సోమవారం రోజున తెలుగు, సంస్కృత భాషల్లో రాయించారని పేర్కొన్నారు. ఇందులో శ్రీకృష్ణదేవరాయల ఘనత, యుద్ధవిజయాలు, నాటి శాసనాలు, ఇచ్చిన కానుకల గురించి వివరిస్తున్నాయని తెలిపారు. దీంతో పాటు మహభాష్యకారుడు, యజుర్వేద పండితులు చెన్న భట్టార్యులకు కృష్ణదేవరాయలు కడప జిల్లా రాజుపాలెం మండలం దద్దనాల గ్రామాన్ని అగ్రహరంగా ఇచ్చినట్లు శాసనాల్లో లిఖించారని పేర్కొన్నారు. జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల శాసనాలు 30 వరకు గుర్తించినట్లు తెలిపారు. తాజాగా రాకెట్లలో వెలుగు చూసిన శాసనాలతో అనంతపురంలో శ్రీకృష్ణదేవారాయల సామ్రాజ్య ప్రభావం ఎంతో కీలకంగా ఉందని స్పష్టం అవుతోందన్నారు. -
కూలీ దుర్మరణం
అనంతపురం సెంట్రల్: నగరంలోని బైరవ నగర్ 7వ క్రాస్ సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కూలీ దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లికి చెందిన రామాంజనేయులు (57) ఇటుక పెళ్లల పరిశ్రమలో కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం బైరవనగర్లో పెళ్లలు దించేందుకు టీవీ టవర్ వద్ద ఉన్న ఫ్యాక్టరీ నుంచి ట్రాక్టర్లో బయలుదేరాడు. 7వ క్రాస్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ పక్కన కూర్చొన్న అతను కుదుపులకు అదుపు కిందపడడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. లారీ ఢీకొని దంపతులకు గాయాలు గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారున 67వ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో దంపతులు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తపేట గ్రామానికి చెందిన నరసింహులు, సాలమ్మ దంపతులు వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంలో గుత్తికి వచ్చారు. పని ముగించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమైన వారు కొత్తపేట బైపాస్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే కర్నూలు వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడి గాయపడిన సాలమ్మ, నరసింహులును స్థానికులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న సాలమ్మను అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఎంపీఈఓలను క్రమబద్ధీకరించాలి : ఎమ్మెల్సీ
ఉరవకొండ: వ్యవసాయ శాఖలో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల (ఎంపీఈఓ)ను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి కోరారు. శుక్రవారం శాసన మండలిలో ప్రత్యేక నివేదన ద్వారా ఆయన మాట్లాడారు. వ్యవసాయశాఖలో ఎంతో ముఖ్య భూమిక పోషిస్తున్న ఎంపీఈఓలు చాలీచాలని జీతంతో పనిచేస్తున్నారన్నారు. పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటోందన్నారు. వారి జీతాలను పెంచడంతో పాటు ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని విన్నవించారు. చెత్త ప్రాసెసింగ్కు రూ.30 కోట్లు! అనంతపురం క్రైం: స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0లో భాగంగా జిల్లాలోని నగర పాలక సంస్థతో పాటు గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం మున్సిపాలిటీల పరిధిలో తడి, పొడి చెత్త ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూ.30.55 కోట్ల నిధులను కేటాయించారు. ఈ పనులను అనంతపురానికి చెందిన ఎంఎస్ తిరుమల కన్స్స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ అంచనా విలువ రూ.30.70 కోట్లు కాగా టెండర్లో 0.5 శాతం తక్కువ ధరతో రూ.30.55 కోట్లకు పనులు అప్పగించారు. రోజుకు 209 టన్నుల తడి చెత్త, 171 టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గుంతకల్లులో 80 టన్నులు, గుత్తిలో 30 టన్నులు, అనంతపురంలో 170 టన్నులు, తాడిపత్రిలో 50 టన్నులు, రాయదుర్గంలో 30 టన్నులు, కళ్యాణదుర్గంలో 20 టన్నుల చెత్త ప్రాసెసింగ్కు సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఈ పనులను మరో రెండు ప్రైవేట్ సంస్థలతో కలసి సంయుక్తంగా తిరుమల కన్స్ట్రక్షన్స్ చేపట్టనున్నట్లు సమాచారం. -
గ్రంథాలయాలు.. సమస్యల నిలయాలు
విజ్ఞాన భాండాగారాలుగా పేర్కొనే గ్రంథాలయాలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరంలో ఉంటున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన కొత్త పుస్తకాలను అందించలేక పోతున్నాయి. డిజిటల్ గ్రంథాలయాలుగా సాంకేతికతను అందిపుచ్చుకోలేని దుస్థితి కొనసాగుతోంది. ప్రజలు చెల్లించే ఆస్తి పన్ను నుంచి గ్రంథాలయ సెస్సును చెల్లించకపోవడమే ఇందుకు కారణం. దీనికి తోడు ప్రభుత్వం నుంచి నిధులు సైతం సక్రమంగా మంజూరు కాకపోవడం గమనార్హం. అనంతపురం కల్చరల్: పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే చందంగా ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాలు ఉంటున్నాయి. రాష్ట్రంలోనే జిల్లా కేంద్రంలో తొలి డిజిటల్ గ్రంథాలయం ఏర్పడిందని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడేగానీ సాంకేతిక పరిజ్ఞానమనేదే కనపడదు. నిధుల కొరత కారణంగా ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని స్దితి నెలకొంది. బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం గ్రంథాలయాల అభివృద్ధి అంశంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలకు రూ.130 కోట్లు అవసరం కాగా 2025–26 బడ్జెట్లో కేవలం రూ.40 కోట్లు మాత్రమే విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం. నెలల తరబడి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే.. సెస్సు వసూలు చేసుకుని తీసుకోండంటూ ఉచిత సలహా ఇచ్చి చేతులు ఎత్తేసింది. దీంతో సెస్సు బకాయిలు వసూలు కాక, ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ సరిపోక ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో కేంద్ర గ్రంథాలయంతో కలిపి 70 గ్రంథాలయాలు ఉండగా, వీటిల్లో గ్రేడ్ 1 స్థానంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం, ధర్మవరం, రాయదుర్గం, గుంతకల్లు, గ్రేడ్ – 2 స్థానంలో గుత్తి, ఉరవకొండ, పెనుకొండ, కదిరి, మడకశిర, తాడిపత్రి, కళ్యాణదుర్గం, అనంతపురంలోని ఉమెన్స్ లైబ్రరీతో కలిపి మొత్తం 8 ఉన్నాయి. మిగిలిన 58 గ్రంథాలయాలు గ్రేడ్ 3 పరిధిలో ఉంటున్నాయి. ఇవి కాక మరో 80 బీసీడీలు (పుస్తక నిక్షిప్త కేంద్రాలు) ఉన్నాయి. బీసీడీల్లోనూ కొన్ని బిల్లులు చెల్లించలేని స్థితిలో మూతపడుతున్నాయి. వీటన్నింటిలో రెగ్యులర్ ఉద్యోగులు 71 మంది, ఔట్ సోర్సింగ్ కింద 21 మంది పనిచేస్తున్నారు. 59 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరి నెల వారి జీతాలతో పాటు కంటెంజెంట్, పేపర్, ఎలక్ట్రికల్ బిల్లులు తదితరాలకు కలపి నెలకు దాదాపు రూ.92 లక్షలు చొప్పున అవసరం అవుతాయి. ఈ లెక్కన ఏడాదికి ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల అవసరాలకు రూ.10.92 కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం కేవలం రూ.4 .40 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఉద్యోగ విరమణ చేసిన వారికి కొంత కాలంగా ఎలాంటి బెనిఫిట్స్ అందలేదు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కీలకమైన గ్రంథాలయ సెక్రటరీ పోస్టుతో పాటు గ్రేడ్–2లో 3, గ్రేడ్ –3లో 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టు 1, రికార్డు అసిస్టెంటు పోస్టులు 6, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 21, వాచ్మెన్ పోస్టులు 11, ఔట్సోర్సింగ్ కింద విలేజ్ లైబ్రేరియన్ పోస్టులు 5 ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 గ్రంథాలయాలకు శాశ్వత భవనాలున్నాయి. ఇందులో అనంతపురంలో 20, శ్రీసత్యసాయి జిల్లాలో 24 ఉన్నాయి. ఫ్రీ రెంట్ భవనాలు అనంతలో 10, శ్రీసత్యసాయి జిల్లాలో 7 చొప్పున మొత్తం 17 ఉన్నాయి. అద్దెతో నడుస్తున్న గ్రంథాలయాలు మొత్తం 9 ఉన్నాయి. ఇందులో నాలుగు అనంతపురం జిల్లాలో, 5 శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో ఉన్నాయి. వీటన్నింటి నెలసరి అద్దె సుమారు రూ.30 వేలకు పైగా ఉంటుంది. పంచాయతీలు, నగర, పురపాలికల్లో ఏటా వసూలు చేసే ఆస్తి పన్నులోనే 8 శాతం గ్రంథాలయ సెస్సు విధిగా ఉంటుంది. వీటిని జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాకు జిల్లా పంచాయతీ శాఖ, నగర, పురపాలికలు జమ చేయాల్సి ఉంది. ఈ సెస్సు నిధులతోనే గ్రంథాలయాల్లో అభివృద్ధి పనులు, మరమ్మతులు, అవసరమైన మేరకు శాశ్వత భవనాలు, గదుల నిర్మాణం చేపడుతుంటారు. దిన, వార, మాస పత్రికలు, కుర్చీలు, టేబుళ్లు, అట్టలు, పార్ట్టైం ఉద్యోగుల జీతాలు, విద్యుత్తు బిల్లులూ చెల్లిస్తుంటారు. అయితే సెస్సు చెల్లింపుల్లో ఆయా సంస్థలు నిర్లక్ష్యం వహిస్తుండడంతో గ్రంథాలయాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. జీతాలకే దిక్కు లేక అల్లాడిపోతున్న ఉద్యోగులు స్పష్టంగా కనపడుతున్న నిర్వహణా లోపం ఆస్తి పన్నులో 8 శాతం ఖాళీలు బోలెడు శాశ్వత భవనాలూ కరువే అసంతృప్తిలో ఉద్యోగులు సెస్సు బకాయిలు చాలా ఉన్నాయి జీతభత్యాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న మాట వాస్తవం. ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి. ఉమ్మడి జిల్లా పరిధిలో మున్సిపాలిటీలు, పంచాయతీల ద్వారా ఈ ఏడాది మార్చి వరకు రూ.10.80 కోట్ల మేర సెస్సు బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సెస్సు వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. – కమ్మన్న ,సెక్రటరీ, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ -
నీటి ఎద్దడి తలెత్తకూడదు
అనంతపురం అర్బన్: వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకూడదని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్, జిల్లా పరిషత్, డీపీఓ శాఖలు ప్రణాళిక మేరకు అవసరమైన నిధులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మూడు, నాలుగు నెలలకు ఎంత తాగునీరు అవసరం అవుతుంది.. పీఏబీఆర్లో అవసరమైన మేరకు నీటి నిల్వ ఉందా.. అనే వివరాలను నివేదించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి ఫిర్యాదు అందిన 24 గంటల్లో పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా సమస్యలు ఉంటే పదిరోజులు ముందుగానే గుర్తించాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి బోర్వెల్స్ ఏర్పాటు, మరమ్మతులు చేపట్టాలన్నారు. అవసరమైతే జిల్లా మినరల్ ఫండ్ కింద నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో నీటి వాడకం సరిగ్గా లేదన్నారు. నీటి వినియోగంపై దృష్టిపెట్టాలన్నారు. పట్టణాల్లో రెయిన్వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. నీటి వినియోగానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, జెడ్పీ సీఈఓ శివశంకర్, డీపీఓ నాగరాజునాయుడు, డ్వామా పీడీ సలీంబాషా, ప్రజారోగ్య శాఖ ప్రాంతీయ అధికారి రామ్మోహన్రెడ్డి, ఈఈ సూర్యనారాయణ, హెచ్చెల్సీ ఎస్ఈ సుధాకర్రావు, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు. తాగునీటి సమస్యలపైకంట్రోల్ సెంటర్ అనంతపురం ఎడ్యుకేషన్: వేసవి కాలం ప్రారంభం కానుండడంతో జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజనాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా పంచాయతీ కార్యాలయం ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా సంబంధిత సమస్యలు ఎదురైతే ప్రజలు బి.మదన్ మోహన్ 95504 80972 నంబరులో సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదులు అందిన తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేసి, వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్నారు. రేపు గురుకుల ప్రవేశ పరీక్ష అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని 16 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో (అంబేడ్కర్ గురుకులాలు) 6–10వ తరగతుల ప్రవేశాలకు ఈ నెల 8న పరీక్ష నిర్వహించనున్నట్లు గురుకులాల ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి కె.విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. 6, 7 తరగతుల ప్రవేశాలకు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు, 8, 9, 10 తరగతుల ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. కేటాయించిన పరీక్ష కేంద్రాల్లోనే పరీక్ష రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హాల్టికెట్లు https://apbragcet.apcfss.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఏవైనా సందేహాలుంటే హెల్ప్డెస్క్ నంబర్లు 99493 54106, 94409 49528, 90102 23222లో సంప్రదించాలని సూచించారు. మొలకలచెరువులో స్టాపింగ్కు అనుమతిగుంతకల్లు: తిరుపతి – అంకోలా మధ్య నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైళ్లను మొలకలచెరువు రైల్వేస్టేషన్లో ఒక్క నిమిషం స్టాపింగ్కు అనుమతులు ఇచ్చినట్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. గుంతకల్లు డివిజన్ పరిధిలోని కదిరి– మదనపల్లి రోడ్డు సెక్షన్లో మొలకల చెరువుకు తిరుపతి – అంకోలా (07605) ఎక్స్ప్రెస్ రైలు మధ్యాహ్నం 2.49 గంటలకు చేరుకుంటుందన్నారు. అలాగే అంకోలా నుంచి తిరుపతి (07606) ఎక్స్ప్రెస్ రైలు అర్ధరాత్రి 02.34 గంటలకు చేరుతుందన్నారు. ఈ హాల్ట్ను వెంటనే అమల్లోకి తెచ్చినట్లు డివిజన్ అధికారులు వెల్లడించారు. -
ఆర్డీటీ కోసం పోస్టుకార్డుల ఉద్యమం
● మాజీ ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం రూరల్: ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేయాలనే డిమాండ్తో తలపెట్టిన లక్ష పోస్టు కార్డుల ఉద్యమాన్ని జయప్రతం చేయాలని ప్రజలకు కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం కళ్యాణదుర్గంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతలతో కలిసి పోస్టు కార్డులను ఆయన ప్రదర్శించి మాట్లాడారు. పాలకులు, ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ పనులను ఆర్డీటీ ఎంతో సమర్థవంతంగా చేస్తూ వస్తోందన్నారు. అలాంటి సంస్థ ఏఫ్సీఆర్ఏను రెన్యువల్ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఆర్డీటీ పరిరక్షణకు ఈ నెల 10న కుందుర్పిలోని ఫెర్రర్ ఆలయం నుంచి లక్ష పోస్టు కార్డుల ఉద్యమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోదీ దిగివచ్చే దాకా ఉద్యమం కుందుర్పి: కరువు జిల్లా జీవనాడిగా ఉన్న ఆర్డీటీ పరిరక్షణ అంశంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దిగి వచ్చే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తలారి రంగయ్య స్పష్టం చేశారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్దరించాలనే డిమాండ్తో ఈ నెల 10న కుందుర్పి నుంచి తలపెట్టిన పోస్టు కార్డుల ఉద్యమంపై స్థానిక ఫెర్రర్ ఆలయంలో పార్టీ నేతలు, స్థానికులతో ఆయన సమావేశమై చర్చించారు. జిల్లాకు ఆర్డీటీ ఆవశ్యకతను వివరించారు.ఎక్కడేగాని లేని విధంగా ఇక్కడ రూ.6 కోట్లతో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్కు ఆలయాన్ని నిర్మించి, కులమతాలకు అతీతంగా పూజలు, ప్రార్థనలు చేస్తున్నారంటే ఆర్డీటీ సేవలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. ఈ ఆలయం వద్దనే లక్ష పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి తరలివచ్చే ప్రజలు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా వసతులు కల్పించాలని స్థానిక నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులతో పాటు కుందుర్పి, కంబదూరు మండలాలకు చెందిన ఆలయ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ఆర్డీటీ లబ్ధిదారులు పాల్గొన్నారు. -
డిమాండ్లు నెరవేర్చే వరకూ పోరాటం
● గ్రామ సర్వేయర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సందీప్ అనంతపురం అర్బన్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే దాకా పోరాటం కొనసాగిస్తామని గ్రామ సర్వేయర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సందీప్ స్పష్టం చేశారు. గ్రామ సర్వేయర్లు శుక్రవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ ఆవరణలోని సర్వే భూ రికార్డుల ఏడీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగలందరికీ ఒకే తరహా బేసిక్ పే ఉండాలన్నారు. అలా కాకుండా గ్రామ సర్వేయర్లకు తక్కువ స్కేల్ ఇవ్వడం అన్యాయం చేయడమేనన్నారు. గ్రామ సర్వేయర్లకు రూ.30 వేలు బేసిక్ పే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేతప్ప బేసిక్ పే స్కేల్ పెంచకుండా హోదా మార్పు చేస్తే ఆర్థికంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. అలాంటి హోదా తమకు ఎందుకంటూ ప్రశ్నించారు. గ్రామ సర్వేయర్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. రీ–సర్వే అలవెన్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఫ్రిబవరి ఆఖరుకు డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందన్నారు. అందులో భాగంగా ఈ నెల 9న ‘చలో విజయవాడ’ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సర్వే భూరికార్డుల శాఖ ఇన్చార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ విజయసారథికి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్, జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్, ఉపాధ్యక్షుడు నాజర్, పెద్ద సంఖ్యలో గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలి
అనంతపురం అర్బన్: మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై యువతకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు. జేఎన్టీయూ ఎన్ఎస్ఎస్, మైభారత్, యువజన వ్యవహారాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 8న నిర్వహించనున్న ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్–5కే రన్’ కార్యక్రమ పోస్టర్లను కలెక్టర్ శుక్రవారం తన చాంబర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మాదక ద్రవ్యాలు సేవిచడం ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయనేదానిపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నషా ముక్త్ అభియాన్ లక్ష్యాలను ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడం కోసం 5కే రన్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఆదివారం ఉద యం అనంతపురంలోని క్లాక్టవర్ వద్ద ప్రారంభమై సప్తగిరి సర్కిల్, ఐరన్ బ్రిడ్జి, సంగమేష్ సర్కిల్, కలెక్టరేట్ మీదుగా జేఎన్టీయూ వరకు 5కే రన్ కొనసాగుతుందన్నారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ‘డ్రగ్స్ రహిత అనంతపురం–డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం’లో తమవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గెలుపొందిన వారికి బహుమతి 5కే రన్ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి రూ.11 వేలు, ద్వితీయ బహుమతి రూ.7 వేలు, తృతీయ బహుమతి రూ.5వేలు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. అదనంగా ఐదుగురికి రూ.3 వేలు చొప్పున కొన్సలేషన్ బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ మమ త, మై భారత్ ప్రతినిధి బిసాతి భరత్, ప్రోగ్రామ్ సూపర్వైజర్ శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు బిసాతి జీవన్కుమార్, జయమారుతి, వలంటీర్లు శేషాద్రి, అంబరీష్బాబు పాల్గొన్నారు. -
ఖాద్రీశుడి వైభవం.. భక్తజన పరవశం
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిదవ రోజైన శుక్రవారం స్వామివారు పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై ఊరేగుతూ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. లోకంలో పుట్టడం, పెరగడం, నశించడం అనే మూడు ప్రక్రియలు కాలాధీనాలు. ఆ కాల స్వరూపుడిని తానే అంటూ చాటి చెబుతూ స్వామివారు సూర్య, చంద్ర ప్రభలను అధిష్టించి దర్శనమిచ్చారు. సూర్య మండల మధ్యస్తుడైన శ్రీ మహా విష్ణువుకు నారాయణుడని పేరు. పగటికి సూర్యుడు రారాజైతే, రేయికి చంద్రుడు అధిపతి. సృష్టికి ఎంతో ముఖ్యమైన ఈ రేయింబవళ్లను శ్రీమహావిష్ణువు రెండు కళ్లుగా కలిగివుండి, వాటినే వాహనాలుగా మార్చుకుని సృష్టిలో సర్వమూ తానే అని చాటిచెబుతూ తిరువీధుల్లో దర్శనమిచ్చినట్లు అర్చక పండితులు తెలిపారు. నేడు మోహినీ ఉత్సవం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి శనివారం మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. -
ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలి
● జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం టవర్క్లాక్: పేదల పాలిట పెన్నిధిలా ఉన్న ఆర్డీటీ సేవలు కొనసాగించాలంటే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ కోరారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని డీపీఆర్సీ భవన్లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన దిశా (జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్స్న్ గిరిజమ్మ తోపాటు కలెక్టర్ ఆనంద్, సీఈఓ శివశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజమ్మ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థ చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు. అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ కాకుండా ఇబ్బందులు పెట్టడం దారుణమన్నారు. ఆర్డీటీ సేవలు ఆగిపోతే.. ఆ సంస్థపై ఆధారపడి జీవించే కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదివరకే మంత్రి నారా లోకేష్ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయించామని స్టేట్మెంట్లు ఇచ్చారని, కానీ ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదన్నారు. తక్షణమే మరోమారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రెన్యూవల్ చేయించాలన్నారు. 108 అంబులెన్స్ సేవలు మెరుగుపరచండి సకాలంలో ఆస్పత్రుల్లో చేర్పించి ప్రాణాలు కాపాడే 108 అంబులెన్స్ సేవలను మెరుగుపరచాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 108 సర్వీసులు సకాలంలో రావడం లేదని, స్పందన సరిగా ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇకనైనా సేవల మెరుగుకు చర్యలు చేపట్టాలన్నారు. బాల్య వివాహాల నియంత్రణలో నిర్లక్ష్యం జిల్లాలో ఇటీవల బాల్య వివాహాలు నమోదవుతున్నాయని జెడ్పీ చైర్పర్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాల నియంత్రణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న వయసులోనే వివాహాలు జరగడం వల్ల బాలికలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారన్నారు. తక్షణం జిల్లాలో బాల్య వివాహాలు నియంత్రించాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఫిర్యాదులు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం నాణ్యతలేని భోజనం పెడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని గిరిజమ్మ తెలిపారు. విద్యార్థుల పొట్టకొట్టి పాపాలు మూటకట్టుకోవద్దని హితవు పలికారు. తాజా కూరగాయలతో రుచికరంగా వంట వండి వడ్డించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏప్రిల్ 1 నుంచి నూతన ఉపాధి హామీ పథకం కింద 100 నుంచి 125 పని దినాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గొయ్యి తీసి.. మట్టి దోచి
● శ్మశానంలో ‘పచ్చ’ నేతల బరితెగింపు విడపనకల్లు: అక్రమార్జన కోసం ‘పచ్చ’ నేతలు బరితెగించారు. అనుమతి లేకుండా ఎడాపెడా మట్టి దోపిడీకి తెగబడుతున్నారు. ఈ క్రమంలో మరింత బరితెగించి శ్మశానంలోకి ప్రవేశించి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకున్నారు. చీకలగురికి గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బూదగవి క్రాస్ నుంచి చీకలగురికి రూ.1.50 కోట్లతో బీటీ రోడ్డు నిర్మించారు. రోడ్డు కోసం అవసరమైన మట్టిని చౌకగా తీసుకుని కాసులు మిగుల్చుకోవడం కోసం కాంట్రాక్టర్ స్థానిక టీడీపీ నేతల సహకారం తీసుకున్నాడు. ఇంకేముంది టీడీపీ నేతలు గ్రామ సమీపంలోని చెరువు వద్ద మట్టి తవ్వకాలు చేపడుతూ క్రమేణా శ్మశానం లోకి అడుగు పెట్టారు. సమాధులను పెకలిస్తూ 20 అడుగుల మేర లోతు వరకు మట్టి తవ్వకాలు చేపట్టారు. శ్మశానంలో ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. వర్షా కాలంలో ఈ గోతులు నీటితో నిండిపోనున్నాయి. అక్కడ శవాలను పాతిపెట్టే సమయంలో ప్రమాదాల బారినపడే పరిస్థితులు కనిపిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసం టీడీపీ నేతలు – కాంట్రాక్టర్ కలిసి శ్మశానానిన్న తవ్వేసినా రెవెన్యూ అధికారులు కానీ, పోలీసులు కానీ, మైనింగ్ అధికారులు కానీ తమకేమీ పట్టనట్టు ఉండటంపై మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చీకలగురికిలో శ్మశానం వద్ద మట్టిని తవ్వేయడంతో ఏర్పడిన గుంతలు -
13న ఎస్ఆర్ఐటీలో జాతీయ సదస్సు
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్ఆర్ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 13న జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవం, ఉన్నత విద్యా ప్రదర్శన, తరంగ్–2కే సదస్సులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆ కళాశాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ శుక్రవారం ఎస్ఆర్ఐటీలో విడుదల చేసి, మాట్లాడారు. సదస్సుకు కళాశాల చైర్ పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి, కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రవిచంద్ర, డాక్టర్ రషీద్, డాక్టర్ మహేశ్వరి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పీఎస్హెచ్ ప్రాజెక్ట్ పనుల పరిశీలన
యాడికి: యాడికి మండలం కమలపాడు, చింతలాయపల్లి, కుందనకోట గ్రామాల పరిసరాల్లో జల విద్యుత్ ఉత్పత్తి, పవర్ నిల్వకు సంబంధించి చేపట్టిన పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ (పీఎస్హెచ్) నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జెన్కో అధికారులను జేసీ విష్ణుచరణ్ ఆదేశించారు. ఆయా గ్రామాల రైతుల అందిస్తున్న భూములను శుక్రవారం జేసీ క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో మ్యుటేషన్, ఎఫ్లైన్ దరఖాస్తులు, పీజీఆర్ఎస్ అర్జీలపై తీసుకున్న చర్యలను సమీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రతాపరెడ్డి, డీటీ శ్రీనివాసులు, జెన్కో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఆదినారాయణ, డిప్యూటీ ఇంజనీర్లు ఆంజనేయులు, రవి, మండల సర్వేయర్ శేషసాయి, వీఆర్వోలు గంగన్న, భీమేశ్వ రెడ్డి, సచివాలయ సర్వేయర్ మౌలాలీ పాల్గొన్నారు. భూ సేకరణ వేగవంతం చేయండి అనంతపురం అర్బన్: జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టలకు సంబంధించి భూ సేకరణ, బదలాయింపు ప్రక్రియలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. జాతీయ రహదారులు, రైల్వే, ఇతర ప్రాజెక్టులకు భూసేకరణ, తదితర అంశాలపై శుక్రవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ భవనం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జేసీ సమీక్షించారు. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుని పెండింగ్ లేకుండా చూడాలన్నారు. కోర్టు వివాదాలు ఉంటే త్వరతిగతిన పరిష్కరమయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో ఎన్హెచ్ పీడీ తరుణ్, భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్ధీన్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జ్యోతిర్లింగాల దర్శనం కోసం సైకిల్ యాత్ర
ఉరవకొండ రూరల్: చత్తీస్ఘడ్లోని రాయ్పూర్కు చెందిన యువకుడు వినయ్ దేశంలోని 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం సైకిల్ యాత్ర చేపట్టాడు. గత ఏడాది ఏప్రిల్ 15న చేపట్టిన ఈ యాత్ర శుక్రవారం చిన్నముష్టూరు సమీపంలోకి చేరుకుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించింది. ఇప్పటి వరకూ 10 జ్యోతిర్లింగాల దర్శనం పూర్తి చేసినట్లు వినయ్ వివరించాడు. ప్రస్తుతం రామేశ్వరం వెళుతున్నానని పేర్కొన్నాడు. మార్గ మధ్యంలోని ఆలయాల్లో పెట్టే అన్న దానం, ప్రజలు ఇచ్చే ఆహారంతో యాత్ర సాగిస్తున్నట్లు తెలిపాడు. మత్స్యశాఖ అసిస్టెంట్కు మెమో జారీ కూడేరు: పింఛన్ల పంపిణీలో అక్రమాలకు తెరలేపిన కూడేరు మండలం కొర్రకోడు సచివాలయ మత్స్య శాఖ అసిస్టెంట్ విజయ్కుమార్కు అధికారులు మెమో జారీ చేశారు. సామాజిక భధ్రతా పింఛన్ల పంపిణీ విషయంలో పలువురు లబ్ధిదారులతో వేలిముద్రలు తీసుకుని నగదు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై ‘పింఛన్ల పంపిణీలో చేతివాటం’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ఎంపీడీఓ కుళ్లాయిస్వామి స్పందించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర వివరణను రాతపూర్వకంగా ఇవ్వాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, విజయకుమార్ ఇచ్చే వివరణ ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తదుపరి చర్యల నిమిత్తం మత్స్యశాఖ ఉన్నతాధికారులకు సిఫారసు చేయనున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. లక్ష్యానికి మించి ‘డ్రిప్’ ● ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది లక్ష్యానికి మించి డ్రిప్, స్ప్రింక్లర్లు పంపిణీ చేసినట్లు ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి, ఏపీడీ బీసీ ధనుంజయ తెలిపారు. డ్రిప్ పంపిణీలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 18 వేల హెక్టార్లకు రాయితీతో పరికరాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే 21 వేల హెక్టార్లకు పైబడి ఇచ్చారు. ఈ సంఖ్య నెలాఖరు నాటికి 22 వేల హెక్టార్లకు చేరుకోనుంది. 17 వేల మంది రైతులు లబ్ధి పొందారు. ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను 19,500 హెక్టార్లకు డ్రిప్ అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం డ్రిప్, స్ప్రింక్లర్లతో పాటు కొత్తగా ఆటోమేషన్ పరికరం పంపిణీపై దృష్టి సారించారు. రూ.40 వేలు విలువ చేసే ఈ పరికరంపై 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు 55 శాతం, మిగిలిన రైతులకు 45 శాతం రాయితీ ఉంటుంది. ఆటో బోల్తా – నలుగురికి గాయాలు కళ్యాణదుర్గం రూరల్(కంబదూరు): ఆటో బోల్తాపడిన ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మండల కేంద్రం కంబదూరులోని చెరువు కట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతపురానికి చెందిన పలువురు తమ బంధువుల ఇంటికని ఆటోలో వస్తుండగా చెరువు కట్ట వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి ఆటో దూసుకెళ్లి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న రాజు, ఉమాపతి, రాఘవేంద్ర, లక్ష్మీదేవి గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను 108 అంబులెన్స్లో కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తరలించారు. ఘటనపై కంబదూరు పోలీసులు విచారణ చేపట్టారు. 10 ఎకరాల్లోని మామిడి తోట దగ్ధం హిందూపురం: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో దాదాపు 10 ఎకరాల్లోని మామిడి తోట దగ్ధమైంది. బాధితులు తెలిపిన మేరకు.. హిందూపురం మండలం బాలంపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నారాయణమ్మకు చలివెందుల గ్రామ రెవెన్యూ పరిధిలో 10 ఎకరాల మామిడి తోట ఉంది. సీజన్ మొదలు కావడంతో పంట ఆశాజనకంగా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తోటకు సమీపంలోని ఎండు గడ్డికి నిప్పు రాజేశారు. దీంతో మంటల చెలరేగి తోటను చుట్టుముట్టాయి. మూడు ఎకరాల్లోని మామిడి చెట్టన్నీ కాలిపోయాయి. మిగిలిన చెట్లు పాక్షికంగా మాడిపోయాయి. ఘటనతో రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని, పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ బాధిత మహిళా రైతు కన్నీటి పర్యమైంది. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. -
సైన్స్ సెంటర్ యాప్, వెబ్సైట్ ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా సైన్స్ సెంటర్కు ఉపయుక్తంగా ఉండేలా ‘సైన్స్ సెంటర్ విజిట్ మానటరింగ్ యాప్’, ‘ప్రత్యేక వెబ్సైట్’ను అగస్త్య ఫౌండేషన్ సీఈఓ పుష్ప, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప మాట్లాడారు. తాడిపత్రిలోని సీవీ రామన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థి చాంద్ హఫీజ్ నవాజ్ ‘జిల్లా సైన్స్ సెంటర్ ఆండ్రాయిడ్ యాప్’, ‘వెబ్సైట్’ను రూపొందించడం గర్వకారణమన్నారు. నూతన ఆవిష్కరణ ఆలోచనలతో ఉన్న విద్యార్థులు జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ బాలమురళీకృష్ణను కలవాలన్నారు. వారిలోని విభిన్న ఆలోచనలు కార్యరూపం దాల్చేలా ఆయన కృషి చేస్తారని తెలిపారు. డీఈఓ ప్రసాద్ బాబు మాట్లాడుతూ.. చాంద్ హఫీజ్ ఆలోచ సరళిని ప్రశంసించారు. సైన్స్ సెంటర్ క్యూరేటర్ మాట్లాడుతూ.. సైన్స్ సెంటర్కు చాంద్ హఫీజ్ నవాజ్ తరచూ వస్తుండేవాడని, విద్యార్థిలోని ఆసక్తిని గమనించి ప్రాజెక్టును అప్పగించినట్లు వివరించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా ప్రాజెక్టును, అనుకున్న దానికంటే చాలా గొప్పగా రూపొందించడం అభినందనీయమన్నారు. -
క్రీడలతో నాయకత్వ లక్షణాలు
అనంతపురం: క్రీడలతో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని విద్యార్థులకు జేఎన్టీయూ (ఏ) రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య సూచించారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటై 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం స్పోర్ట్స్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా కృష్ణయ్య హాజరై, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. సామాజిక నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా ఓ క్రీడలో రాణించాలన్నారు. మెదడు చురుగ్గా పనిచేయడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, ఏకాగ్రత పెరగడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి మాట్లాడుతూ... జీవితంలో గెలుపు, ఓటములు సహజమని, క్రీడలు ఆడటం ద్వారా గెలుపు కోసం పడే శ్రమను అర్థం చేసుకోవడమే కాకుండా ఓటమిని ధైర్యంగా స్వీకరించే ధోరణి కూడా అలవడుతుందన్నారు. వైస్ ప్రిన్సిపాల్ బి.దిలీప్కుమార్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. స్పోర్ట్స్ డే సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడల్లో విజేతలైన అధ్యాపకులు, విద్యార్థులకు ట్రోఫీలు, సర్టిఫికెట్లను రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్ అందజేశారు. విద్యార్థుల తరఫున స్పోర్ట్స్ జనరల్ కెప్టెన్ మహేంద్ర (సివిల్ విభాగం) పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ బి. జోజిరెడ్డి, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రొఫెసర్ టి.నారాయణరెడ్డి, అన్ని విభాగాల హెచ్ఓడీలు, కో–ఆర్డినేటర్లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. జేఎన్టీయూ రిజిస్ట్రార్ కృష్ణయ్య -
సబ్జెక్ట్ సీనియార్టీ జాబితాలో పీఎస్ హెచ్ఎంలను చేర్చాలి
అనంతపురం ఎడ్యుకేషన్: సబ్జెక్ట్ సీనియార్టీ జాబితాలో పీఎస్ హెచ్ఎం (స్కూల్ అసిస్టెంట్లు) పేర్లను చేర్చాలని పీఎస్ హెచ్ఎం అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం డీఈఓ ఎం.ప్రసాద్బాబును అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పి.రంగారెడ్డి కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. 2025 బదిలీల్లో భాగంగా రేషనలైజేషన్ ప్రక్రియలో దాదాపు 530 మంది స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు లేవని పీఎస్ హెచ్ఎం/ఎస్ఏ డిజిగ్నేషన్తో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో 2026 బదిలీల కంటే ముందే జీరో సర్వీస్తో విల్లింగ్ ఉన్న పీఎస్ హెచ్ఎం/ఎస్ఏలను వారివారి సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్లను తిరిగి ఉన్నత పాఠశాలలకు పంపాలని కోరారు. వీరిని స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ జాబితాలో పొందుపరచాలన్నారు. పీఎ్స్హెచ్ఎంలకు జాబ్చార్ట్ ఇవ్వాలన్నారు. డీఈఓను కలిసిన వారిలో నాయకులు సర్దానప్ప, శివశంకర్ రెడ్డి, జగదీష్ ఉన్నారు. పెండింగ్ ‘ఎల్ఆర్ఎస్’ను పరిష్కరించండి ● అహుడా వైస్ చైర్మన్ విష్ణుచరణ్ అనంతపురం క్రైం: అహుడా (అనంతపురం–హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలో అపరిష్కృతంగా ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను అహుడా వైస్ చైర్మన్ సి.విష్ణుచరణ్ అదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల అంశంపై సంబంధిత అధికారులతో గురువారం అనంతపురంలోని అహుడా కార్యాలయంలో అహుడా చైర్మన్ టి.సి.వరుణ్, సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. అనధికార లే అవుట్లు, ప్లాట్ల నియంత్రణ పథకం కింద వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలన్నారు. అనుమతి లేకుండా ప్లాట్లు వేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కందుకూరు, కుణుతూరు లేఅవుట్లలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో అహుడా పీఓ ఇషాక్, ఇంజినీర్ దుష్యంత్, ఈఓ అరుణకుమారి, ఏఓ రవిచంద్రన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, జేపీఓ హరీష్చౌదరి, డీఈ రేవంత్, సర్వేయర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. బంగారు గొలుసు అపహరణ బుక్కరాయసముద్రం: స్థానిక దేవరకొండ సమీపంలో చైన్ స్నాచింగ్ చోటు చేసుకుంది. వివరాలు.. బీకేఎస్ మండలం పసులూరు గ్రామానికి చెందిన ప్రమీల, శివయ్య దంపతులు గురువారం రాత్రి అనంతపురం నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దేవరకొండ సమీపంలో ఇద్దరు యువకులు ఆపారు. ఈ దారి ఏ ఊరుకెళుతుందంటూ వారి దృష్టిని ఏమార్చి ఓ యువకుడు ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని పక్కనే సిద్ధంగా ఉంచుకున్న బైక్పై తన సహచరుడితో కలసి ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ పరిశీలకుల నియామకం
అనంతపురం: జిల్లాలోని అసెంబ్లీ నియోజకర్గాలకు వైఎస్సార్సీపీ పరిశీలకులను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గుంతకల్లు నియోజకవర్గ పరిశీలకుడిగా లింగాల శివశంకర్ రెడ్డి, రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకుడిగా డాక్టర్ బత్తల హరి ప్రసాద్, తాడిపత్రి నియోజకవర్గ పరిశీలకుడి గా అత్తార్ చాంద్బాషా, కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిశీలకుడిగా ఎం. మహేంద్రనాథ్ రెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ పరిశీలకుడిగా కే.రమేష్ రెడ్డి, శింగనమల నియోజకవర్గ పరిశీలకుడిగా ఎల్ఎం మోహన్ రెడ్డి, అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిశీలకుడిగా బోయ తిప్పేస్వామి నియమితులయ్యారు. నేడు దిశ సమావేశం అనంతపురం టవర్క్లాక్: జిల్లా పరిషత్ కార్యాలయంలోని డీపీఆర్సీ భవనంలో శుక్రవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కలె క్టర్ మెంబరు సెక్రటరీగా వ్యవహరిస్తారన్నారు. నాల్గో త్రైమాసికానికి సంబంధించి పురోగతిపై ‘దిశ’ చైర్మన్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సమీక్షిస్తారన్నారు. అధికారులు తప్పకుండా హాజరుకావాలని కోరారు. క్వింటా చింతపండు రూ.22 వేలు హిందూపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో క్వింటా చింతపండు గరిష్టంగా రూ.22 వేలు పలికింది. గురువారం యార్డుకు 5,650 క్వింటాళ్ల చింతపండు రాగా, అందులో కరిపులి రకం గరిష్టంగా రూ.22 వేలు, కనిష్టంగా రూ.10,100 ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయని కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. అలాగే ఫ్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.12,300, కనిష్టంగా రూ.6 వేల ప్రకారం ధర పలికినట్లు వెల్లడించారు. మార్కెట్ యార్డులో ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరుగుతాయన్నారు. రైతులు నాణ్యమైన సరుకు తీసుకొచ్చి మంచి ధర పొందాలని కార్యదర్శి సూచించారు. ఇకపై రుసుం చెల్లిస్తేనే జనన, మరణ ధ్రువపత్రాలు అనంతపురం: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో జనన, మరణ ధ్రువపత్రాలు పొందాలంటే ఇక నుంచి రుసుము చెల్లించాల్సి ఉంటుందని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు. జనన, మరణ ధ్రువపత్రం పొందాలంటే రూ.50 చెల్లించాలి. జనన ధ్రువీకరణ పత్రంలో బిడ్డ పేరు నమోదుకు (పుట్టిన సంవత్సరం తరువాత) రూ.250 చెల్లించాలి. జనన, మరణ అదనపు పత్రాలు పొందడానికి ఒక కాపీకి రూ.50, జనన, మరణ రిజిస్టర్లో మొదటి సంవత్సరం శోధనకు రూ.50, ప్రతి అదనపు సంవత్సరం శోధనకు రూ.25, జనన, మరణ వివరాల నమోదుకు 21 రోజుల నుంచి 31 రోజుల ఆలస్యమైతే రూ.25 ఆలస్య రుసుం, 31 రోజుల నుంచి సంవత్సరంలోపు రూ.250, ఏడాది దాటితే రూ.500 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జనన, మరణ ధ్రువపత్రాలు అందించేందుకు కూడా రుసుం వసూలు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఉచితంగా అందించిన ప్రతి సేవకు నేడు డబ్బు వసూలు చేయడం మంచి పద్ధతి కాదని బాహాటంగానే ప్రజలు విమర్శిస్తున్నారు. -
‘ఐ’ జాతీయ సదస్సుకు జేఎన్టీయూ సన్నద్ధం
అనంతపురం: ఈ నెల 24, 25 తేదీల్లో జేఎన్టీయూ (ఏ) ఇంజినీరింగ్ క్యాంపస్ కళాశాలలోని ఎలక్ట్రికల్ విభాగంలో ఐ (ఈవైఈ)–2026 పేరుతో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను వర్సిటీ వీసీ డాక్టర్ హెచ్.సుదర్శనరావు గురువారం ఆవిష్కరించారు. ప్రాజెక్ట్ ఎక్స్పో, హెక్తాన్, పేపర్ ప్రజెంటేషన్, వర్క్ షాప్, టెక్నికల్ క్విజ్, సర్క్యూట్ హంట్, జంక్ టు పవర్, పవర్ కోడ్, పోస్టర్ ప్రజంటేషన్ తదితర అంశాల ప్రాధాన్యతగా సదస్సు జరగనుంది. సదస్సు కన్వీనర్గా ఎలక్ట్రికల్ విభాగాధిపతి డాక్టర్ ఎం.రామశేఖర్రెడ్డి వ్యవహరించనున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ బి.దిలీప్ కుమార్, ప్రొఫెసర్ పి.సుజాత, ప్రొఫెసర్ ఆర్.కిరణ్మయి, డాక్టర్ బి.జితేంద్రగౌడ్, డాక్టర్ ఎస్.శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు, మాజీ రిజిస్ట్రార్ వి.శంకర్, ఏఈ శ్యాంబాబు, ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్ ఎం.నాగ చైత్ర, ఫిర్దోసి కౌసర్ అహమ్మదీయ, విద్యార్థుల కో–ఆర్డినేటర్లు కె.విజయకుమార్, డి.మోనికా పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనదారుల హల్‘సెల్’
డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నట్లయితే ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల వాహనదారుడితో పాటు ఎదుటివారికి కూడా ప్రమాదమే. డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత ముఖ్యమనే విషయాన్ని అటకెక్కించి పలువురు సెల్ఫోన్లు చూస్తూ... మాట్లాడుతూ గురువారం ఉదయం అనంతపురం నగర రహదారులపై రయ్యిమంటూ దూసుకెళ్లారు. ఇందులో పోలీసులు సైతం ఉండడం గమనార్హం. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్లో మాట్లాడడం, వీడియోలు చూడడం, ఇయర్ఫోన్స్ వినియోగించడం వంటి చర్యలు ప్రమాదకరమైనవే కాకుండా శిక్షార్హమైనవి అని అందరూ చెబుతుంటారు. అయితే పాటించడాన్ని మాత్రం అటకెక్కిస్తుండడం గమనార్హం. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
●పేదల పెన్నిధికి పెద్ద కష్టం
ఫోన్ చేస్తే చాలు నిమిషాల్లోనే చేరుకుని ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడే పేదల పెన్నిధి 108కు పెద్ద కష్టం వచ్చి పడింది. చంద్రబాబు సర్కారు చిన్నచూపు కారణంగా ఆ వ్యవస్థకే గ్రహణం పట్టింది. అందుకు నిదర్శనమే ఈ ఘటన. గురువారం అనంతపురం నగరం నుంచి రాప్తాడు వైపు వెళ్తున్న ఓ 108 వాహనం రుద్రంపేట సమీపంలో నడిరోడ్డుపై ఆగిపోయింది. డ్రైవరు ఎన్నిమార్లు ప్రయత్నం చేసినా ఇంజిన్ స్టార్ట్ కాలేదు. దీంతో సమీపంలో ఉన్న ప్రజలు తలా ఒకచేయి వేసి వాహనాన్ని పక్కకు తోశారు. చంద్రబాబు ప్రభుత్వం 108 వాహనాల గురించి పెద్దగా పట్టించుకోని కారణంగా ఇలాంటి దుస్థితి నెలకొందని పలువురు చర్చించుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగిని తరలిస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఎలా అని వాపోయారు. – అనంతపురం ఎడ్యుకేషన్ -
అరటి రైతు అరణ్య రోదన
అనంతపురం అగ్రికల్చర్: అరటి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. గత నవంబర్లో టన్ను రూ.2 వేలకు పడిపోవడంతో రెండో పంట కింద వచ్చిన అరటి అమ్ముకోలేక నానా అవస్థలు పడ్డారు. విధి లేని పరిస్థితుల్లో కొందరు దున్నేయగా, మరికొందరు పశువులకు వదిలేసి, తోటలకు నిప్పు పెట్టి తొలగించుకున్నారు. అరటి రైతుల ఆక్రందనలు మిన్నింటినా చంద్రబాబు సర్కారు కనికరించలేదు. ఆదుకునేందుకు కనీస చర్యలు చేపట్టకపోవడంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకున్నారు. కొన్నిరోజులకు మార్కెట్ పరిస్థితి కొంత మెరుగవ్వడంతో ఇబ్బంది లేదనకున్నారు. కానీ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఈ సారి మొదటి పంట కావడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో భారీ నష్టాలను తలచుకుని వణికిపోతున్నారు. 60 శాతంపైగా కోతలు.. అనంతపురం జిల్లాలో 39 వేల ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 3 వేల ఎకరాల్లో రైతులు అరటి సాగు చేశారు. మొదటి పంటకు ఎకరాకు రూ. 1.50 లక్షలు, రెండో పంటకు ఎకరాకు రూ. లక్ష వరకు ఖర్చు చేశారు. 9 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఫలసాయం రావొచ్చని అధికారులు అంచనా వేశారు. డిసెంబర్ 15 నుంచి మొదటి పంట కింద 5 లక్షల మెట్రిక్ టన్నులు, ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి రెండు, మూడు పంటల కింద 4 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడులు లెక్క వేశారు. కొన్నిరోజులుగా జిల్లా వ్యాప్తంగా మొదటి పంట కోతలు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 60 శాతానికి పైగా కోతలు పూర్తయినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కోతలకు సిద్ధంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉంది. భారీగా ధర పతనం.. మొదటి పంట కోతలు మొదలైన డిసెంబర్ 15 తర్వాత అరటి టన్ను రూ.15 వేలతో ప్రారంభమై జనవరి 15 నాటికి రూ.20 వేలకు చేరుకుంది. ఫిబ్రవరిలో రూ.22 వేల నుంచి రూ.25 వేలు పలకడంతో తమ పంట పండిందని రైతులు సంబరపడ్డారు. నష్టాల నుంచి గట్టెక్కినట్లేనని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ధర రూ.15 వేలకు పడిపోవడంతో అరటి రైతులు ఉలిక్కిపడ్డారు. ఇదే క్రమంలో మరింత పతనమై నేడు టన్ను రూ.10 వేలకు చేరుకోవడంతో వణికిపోతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం మొదలు కావడం... అది కాస్త గల్ఫ్ దేశాలకు విస్తరించడం.. దీంతో ఉత్తరాది వ్యాపారులు అరటి కొనుగోలుకు వెనుకాడుతుండడం వెరసి మన అరటి రైతుల మీదికొచ్చినట్లయింది. వారం రోజులుగా కొనుగోలు చేసిన అరటి కూడా గోదాములకే పరిమితం కావడంతో వ్యాపారులు కొత్త సరుకు కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదు. ధర ఇంకా పతనం కావొచ్చని ప్రచారం సాగుతుండటంతో అరటి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2 లక్షల మెట్రిక్ టన్నుల అరటి అమ్మకాకు సంబంధించి రైతులకు రూ.200 కోట్లకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 15 రోజుల క్రితం రూ.25 వేలు.. నేడు రూ.10 వేలు రానున్న రోజుల్లో ధర మరింత పతనమవుతుందని ఆందోళన నష్టాలను తలచుకుని వణికిపోతున్న అన్నదాతలు అదే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న చంద్రబాబు సర్కారు -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
ఉరవకొండ: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా విద్యార్థులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రశ్నించారు. గురువారం శాసనమండలి సమావేశాల్లో ప్రత్యేక నివేదన ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మంత్రి నారా లోకేష్ను శివరామిరెడ్డి గట్టిగా నిలదీశారు. మొత్తం రూ.6,300 కోట్ల మేర బకాయిలు పేరుకుపోతే కేవలం రూ.1,200కోట్లు మాత్రమే ఎలా విడుదల చేస్తామనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అది కూడా ప్రస్తుతానికి రూ.1,200 కోట్లు ఇవ్వలేమని, ప్రత్యామ్నాయంగా సదరు బకాయిల మొత్తానికి బ్యాంకుల ద్వారా 8 శాతం వడ్డీతో రుణం ఇప్పిస్తామని, నిధులు విడుదలయ్యాయి అసలు ప్రభుత్వం జమ చేస్తే వడ్డీని కళాశాల యాజమాన్యాలే భరించాలని మంత్రి నారా లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్బకాయిలు చెల్లింపులపై పూటకో మాట మారుస్తూ కాలయాపన చేయడం సబబు కాదని హితవు పలికారు. 8 శాతం వడ్డీతో రుణం ఇప్పిస్తామనే ఆలోచనను విరమించి, తక్షణమే మొత్తం బకాయిలు చెల్లించి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ శివరామిరెడ్డి డిమాండ్ -
●శేషవాహనా గోవింద
కదిరి: శేషవాహనంపై దేవేరులతో కలిసి మాఢవీధుల్లో ఊరేగిన ఖాద్రీశుడి దర్శనంతో భక్తజనం పరవశం చెందారు. లక్ష్మీ నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు శేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్గించారు. ప్రతి ఉత్సవంలోనూ నారసింహుడు మాత్రమే తిరు వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చేవారు. అయితే శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత ఖాద్రీశుడు తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవ ప్రత్యేకత. స్వామివారి దివ్య మంగళరూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందారు. అర్ధరాత్రి వరకూ నిత్యాన్నదానం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరగటంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతోంది. వీరి కోసం ఆలయంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ నిత్యాన్నదానం కొనసాగుతోంది. స్వామివారి గోవింద నామస్మరణతో ఖాద్రీ క్షేత్రం మార్మోగిపోతోంది. కదిరి కొండపై జ్యోతిని వెలిగించడంతో కదిరి ప్రజలందరూ ఆసక్తిగా తిలకించారు. దివి నుంచి భువికి వైకుంఠంలో స్వామి నిత్యం పవళించే శేషతల్పం ఆ స్వామితో పాటే భువికి దిగి వచ్చిందని భక్తుల విశ్వాసం. అందుకే బ్రహ్మోత్సవాల్లో స్వామివారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిస్తున్నారని వారి నమ్మకం. ‘శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి’ అని అర్చక పండితులు పేర్కొన్నారు. సాయం సంధ్య వేళలో యాగశాల ప్రవేశం, నిత్య హోమాలు నిర్వహించి స్వామివారిని సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. ఆచార్య రుత్వికులను ఆలయ మర్యాదలతో అర్చకులు ఆహ్వానించారు. శేష వాహనంపై ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే సర్పదోషం తొలగుతుందని భక్తుల విశ్వాసం. భక్తుల కాలక్షేపం కోసం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవ ఉభయదారులుగా యాదాలం శ్రీనివాసులు, బాలాజీ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
పప్పుశనగ కొనుగోలులో దగా
ఉరవకొండ: రబీలో సాగు చేసిన పప్పుశనగను కొనుగోలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బీహెచ్ రాయుడు మండిపడ్డారు. పప్పుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలంటూ గురువారం ఉరవకొండలోని ఏడీఏ కార్యాలయం ఎదుట రైతులతో కలసి చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. గోదాముల్లో రైతులు నిల్వ ఉంచిన పంటకు ప్రభుత్వమే అద్దె చెల్లించాలన్నారు. కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లిస్తూ పంటను కొనుగోలు చేస్తోందని, ఇదే తరహాలో రాష్ట్రంలోనూ క్వింటా రూ.5,650 మద్దతు ధరతో పాటు రూ.2,350 బోనస్ కలిపి రూ.8 వేలతో కొనుగోలు చేయాలని లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏడీ సత్యనారాయణకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మధు, రంగారెడ్డి, శీనప్ప, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు. జనగణనలో జాగ్రత్త వహించాలి ● అధికారులకు జేసీ విష్ణుచరణ్ సూచనఅనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనాభా లెక్కల సేకరణలో జాగ్రత్తగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. జనగణన ప్రక్రియపై జేఎన్టీయూ వేదికగా అధికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ గురువారం ముగిసింది. చివరి రోజున జేసీ హాజరై మాట్లాడారు. మొదటి దశలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి మే 31వ తేదీ వరకు గృహ గణన నమోదు ప్రక్రియ నిర్వహించాలన్నారు. ప్రతి గృహానికి ప్రత్యేక నంబర్ కేటాయించాలని, అందులో నివసించే సభ్యుల వివరాలు నమోదు చేయాలని చెప్పారు. మౌలిక సదుపాయాలు, గృహోపకరణాలు, ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు, ఫ్లోరింగ్, తాగునీటి వినియోగం, మరుగుదొడ్లు తదితర వివరాలు సేకరించాలన్నారు. సేకరించే గణాంకాలు గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఆధారమవుతాయన్నారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అధికారులు తమ విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. వివరాలను కంప్యూటర్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎంఎంఎస్) ద్వారా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. హెచ్ఎల్ఓ మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశమూ ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ జగన్నాథ్ మజ్హి, మాస్టర్ ట్రైనర్ మోహన్ రమవణా, గణాంక అధికారి గిరిధర్, కో–ఆర్డినేషన్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గ్రామ సర్వేయర్ల పోరుబాట
● నిలిచిపోనున్న రీ–సర్వే ప్రక్రియ అనంతపురం అర్బన్: న్యాయమైన కోర్కెల సాధనకు గ్రామ సర్వేయర్లు పోరుబాట పట్టారు. మార్చి 4వ తేదీలోపు డిమాండ్లు పరిష్కరించకపోతే 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ పాటిస్తామని గత నెల 25న గ్రామ సర్వేయర్ల సంఘం నాయకులు ప్రభుత్వ పెద్దలకు నోటీసు ఇచ్చారు. అయితే వారి డిమాండ్లు పరిష్కరించే విషయంలో సర్కారు నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో గురువారం నుంచి సహాయ నిరాకరణ చేపట్టారు. దీంతో నాల్గో విడత కింద జిల్లాలో 90 గ్రామాల్లో చేపట్టిన రీ–సర్వే నిలిచిపోనుంది. జనవరి 27న తొలిసారి.. డిమాండ్ల పరిష్కారం కోసం తొలిసారి ఈ ఏడాది జనవరి 27న సర్వేయర్లు సహాయ నిరాకరణ చేపట్టారు. జనవరి 30న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అధ్యక్షతన గ్రామ సర్వేయర్ల రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారు. స్వర్ణ గ్రామ వ్యవస్థలో సహచర సాంకేతిక ఉద్యోగులతో సమాన పేరోల్లో బేసిక్ పే, పదోన్నతులు కల్పిస్తామన్నారు. ఫిబ్రవరి 15వ తేదీన ప్రతిపాదనల నివేదిక తయారు చేస్తామని హామీ ఇచ్చారు. రీ–సర్వే నిర్వహణకు ప్రతి గ్రామానికి ఒక ల్యాప్టాప్, రోవర్, ప్రతి మండలానికి ఒక ప్రింటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రీ–సర్వే బిల్లులు ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేస్తామన్నారు. కానీ, హామీలు అమలు కాకపోవడంతో తాజాగా మరోసారి సర్వేయర్లు సహాయ నిరాకరణకు దిగారు. డిమాండ్లు పరిష్కరించే వరకు కొనసాగింపు సర్వేయర్ల డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలు కావు. పేస్కేల్ మార్చకుండా పోస్టు పేరు మారిస్తే నయాపైసా ప్రయోజనం ఉండదు. డిమాండ్లు పరిష్కరించకపోతే మార్చి 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ చేపడతామని గత నెల 25న నోటీసులిచ్చినా సానుకూల స్పందన రాలేదు. దీంతో ఉద్యమబాట పట్టాం. డిమాండ్లు పరిష్కరించే వరకు కొనసాగిస్తాం. – మహేష్నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్రామ సర్వేయర్ల సంఘం -
పగిలిన శ్రీరామరెడ్డి పైప్లైన్
బ్రహ్మసముద్రం : మండలంలోని నాగిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో గురువారం శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించిన పైప్లైన్ ఎయిర్ వాల్ పగిలిపోయింది. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. ఘటనతో నాగిరెడ్డిపల్లి, ఆపై గ్రామాలకు తాగునీరు అందకుండా పోయింది. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని పైప్లైన్ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సైన్స్ సమగ్ర మహోత్సవ్లో విద్యార్థుల ప్రతిభరాయదుర్గం టౌన్: సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సమగ్ర శిక్ష సంయుక్తంగా నిర్వహించిన సైన్స్ సమగ్ర మహోత్సవ్–2026లో రాయదుర్గంలోని కళ్లీమఠం మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గత నెల 27న విజయవాడ వేదికగా సాగిన ఈ వేడుకలో బేబీ బోర్వెల్ రెస్క్యూ మిషన్ ప్రాజెక్ట్ను పాఠశాల విద్యార్థులు రామాంజనేయులు, బాలాజీ ప్రదర్శనకు రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం దక్కింది. అంతేకాక ఏసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ చోటు దక్కింది. ప్రతిభ చాటిన విద్యార్థులను గురువారం పాఠశాలలో హెచ్ఎం తాజున్బీ, ఉపాధ్యాయులు, ఎంఈఓలు మహమ్మద్ ఇర్షాద్, వెంకటరమేష్ ఘనంగా సత్కరించారు. దాత కాలవ భరత్ చేత రూ.10 వేలు నగదు పురస్కారాన్ని అందజేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాలువలోకి దూసుకెళ్లిన కారు కళ్యాణదుర్గం రూరల్: స్థానిక మున్సిపాలిటి పరిధిలోని ఒంటిమిద్ది గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న బీటీపీ కాలువలోకి గురువారం తెల్లవారుజామున కారు దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి పట్టణానికి చెందిన ఎర్రిస్వామి, రాహుల్, పవన్ వ్యక్తిగత పనిపై చిత్రదుర్గం వెళ్లి గురువారం తిరుగు ప్రయాణమయ్యారు. ఒంటిమిద్ది గ్రామం వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఘటనలో కారులో ఉన్న ముగ్గురూ గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చారు. మెరుగైన చికిత్స కోసం రాహుల్, ఎర్రిస్వామిని అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు ఆరా తీశారు. వ్యక్తి ఆత్మహత్యయాడికి: వ్యాధి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిసిన మేరకు.. యాడికి లోని కోట వీధిలో నివాసముంటున్న ఓగేటి నాగరాజు(60) షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. మూడేళ్ల క్రితం ఎడమ కాలిలోని రెండు వేళ్లను వైద్యులు తొలగించారు. వారం రోజులుగా వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుండడంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన బుదవారం రాత్రి ఎలుకల మందు తాగాడు. గమనించిన బార్య హైమావతి వెంటనే బందువుల సాయంతో అనంతపురంలోని వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్సకు స్పందించక గురువారం ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోరాహోరీగా వృషభాల బలప్రదర్శన యాడికి: మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీలకు 14 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన రైతు శివకృష్ణ వృషభాలు 1831.09 అడుగులు దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. రెండో స్థానంలో నంద్యాల జిల్లా పెద్దకొట్టాల గ్రామ రైతు కేశవరెడ్డి వృషభాలు, మూడో స్థానంలో వైఎస్సార్ కడప జిల్లా చౌటుపల్లి గ్రామ రైతు ఓబులరెడ్డి వృషభాలు, నాల్గో స్థానంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్ పల్లికి చెందిన రైతు నాగయ్య వృషభాలు, ఐదో స్థానంలో పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లికి చెందిన రైతు రామసుబ్బారెడ్డి వృషభాలు నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో చవ్వా గోపాలరెడ్డి, జూటూరు అబ్దుల్ రజాక్, ఉమ్మడిపాల ప్రభాకరరెడ్డి, అబ్దుల్ రెహమాన్, వెంగన్నపల్లి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
పరిహారం చెల్లించి పనులు చేయండి
గుత్తి రూరల్: తమ భూమలకు పరిహారం చెల్లించిన తర్వాతనే పనులు చేపట్టాలంటూ రెన్యూ సోలార్ ప్లాంట్ అధికారులతో గురువారం బాధిత రైతులు వాగ్వాదానికి దిగారు. గుత్తి మండలం ఊటకల్లులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామ శివారులోని తమ పొలాల మీదుగా వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న టవర్ల పనులను రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న రెన్యూ సోలార్ప్లాంట్ అధికారులు అక్కడకు చేరుకుని రైతులతో చర్చించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో రైతులకు పరిహారం ఇస్తామని నమ్మబలికి పనులు పూర్తి చేసి నేటికీ పట్టించుకోలేదని రైతులు మండిపడ్డారు. తమకు పరిహారం చెల్లించి పనులు చేపట్టాలని, లేదా చెల్లిస్తామంటూ లిఖిత పూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ రామారావు, ఎస్ఐ సురేష్, సిబ్బంది అక్కడకు చేరుకుని రైతులు, సోలార్ ప్లాంట్ అధికారులతో మాట్లాడారు. సామరస్యంగా మాట్లాడుకుని పరిహారం పొందాలని రైతులకు సీఐ రామారావు సూచించారు. అయినా రైతులు వెనక్కు తగ్గలేదు. ఎంత పరిహారం ఇస్తారో చెప్పి అందుకు సంబంధించి లిఖిత పూర్వకంగా ఇచ్చిన తర్వాతనే పనులు చేపట్టాలన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ పుణ్యవతి సైతం అక్కడకు చేరుకుని రైతులకు సర్ధి చెప్పేందుకు ప్రయత్నించారు. పరిహారం తక్కువ ఇస్తున్నట్లు అభ్యంతరాలు ఇస్తే కలెక్టర్కు పంపుతానని, అప్పటి వరకూ పనులు అడ్డుకోరాదని అన్నారు. అయితే రైతులు తమకు నమ్మకం లేదని, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఇప్పుడే పరిహారం విషయం తేల్చాలని ఆందోళన చేపట్టారు. విద్యుత్ టవర్ ఎక్కిన రైతు సోలార్ ప్లాంట్ అధికారులతో రైతుల వాగ్వాదం సోలార్ ప్లాంట్ నిర్వాహకులు రైతులను మోసం చేస్తున్నారంటూ నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం యల్లమ్మగుట్ట తండా గ్రామానికి చెందిన రైతు బాబూ నాయక్ విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. రైతులకు న్యాయం చేసే వరకూ టవర్ దిగేది లేదని పైనే ఉండిపోయాడు. పనులు మొదలు పెట్టే సమయంలో ఒక మాట చెప్పి, పనులు పూర్తయ్యాక నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, ఈ విషయంగా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు, పోలీసులు సర్ది చెప్పి కిందకు దింపారు. అనంతరం కర్నూలు, నంద్యాల జిల్లాల రైతులు అక్కడకు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. -
రైలులో ప్రయాణికురాలి బంగారు గొలుసు అపహరణ
గుంతకల్లు: రన్నింగ్ రైలులో ప్రయాణికురాలి బంగారు గొలుసును లాక్కుని దుండగుడు ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన సౌందర్య, జీవన్ దంపతులు ఏడాది వయస్సు గల కూతురుతో కలిసి మంగళవారం రాత్రి జైపూర్ నుంచి మైసూర్ వెళ్లే ఎక్స్ప్రెస్ (12796) రైలులో (ఎస్–2 కోచ్) బెంగళూరుకు బయలుదేరారు. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో గుంతకల్లు సమీపంలోని మల్లప్పగేట్ రైల్వేస్టేషన్ వద్ద నిదానంగా వెళ్తోంది. అదే సమయంలో సౌందర్య తన కుమార్తెకు పాలు పడుతోంది. రైలులోనే ప్రయాణిస్తున్న ఓ దుండగుడు ఇదే అదనుగా భావించి సౌందర్య మెడలోని 3 తులాల బంగారు తాళిబొట్టు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేస్తూ గొలుసును చేత్తో పట్టుకుంది. దీంతో అటువైపు నుంచి బలంగా లాగడంతో సగం బంగారు గొలుసు చేతికి రాగానే దుండగుడు కదులుతున్న రైలులోంచి కిందకు దూకి పారిపోయాడు. బాధితురాలు గుంతకల్లులో జీఆర్పీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శఠగోపం దొంగలు దొరికారు బుక్కరాయసముద్రం: భక్తుని ముసుగులో వచ్చి శఠగోపం తస్కరించుకుపోయిన దొంగలు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్లో సీఐ పుల్లయ్య, ఎస్ఐ రాంప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఫిబ్రవరి 25న చెరువుకట్టపైనున్న షిర్డీసాయిబాబా ఆలయంలో దర్శనం కోసం వచ్చిన వ్యక్తి మూడు ప్రదక్షిణలు చేసి.. శఠగోపానికి మొక్కి మరీ తన బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోయాడు. ఈ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో సీఐ పుల్లయ్య, ఎస్ఐ రాం ప్రసాద్ సీసీ టీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ముసలమ్మ కట్ట వద్ద వెళ్తున్న ఓ ఆటోను ఆపి.. పరిశీలించగా సాయిబాబా ఆలయ శఠగోపం కనిపించింది. ఆటోను, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, స్టేషన్కు తరలించారు. తమదైన శైలిలో విచారించగా అనంతపురం సాయినగర్కు చెందిన కుణుతూరు మహేశ్వరరెడ్డి, రెండో రోడ్డుకు చెందిన బళ్లారి షానవాజ్ బాషా శఠగోపం చోరీకి పాల్పడినట్లు తేలింది. నిందితులిద్దరినీ కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. -
నిబంధనల మేరకు పోలీసులను బదిలీ చేయాలి
● శాసన మండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఉరవకొండ: పోలీసు సిబ్బందిని నిబంధనల మేరకు సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి శాసన మండలిలో ప్రత్యేక నివేదన కింద ప్రస్తావించారు. జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు పోలీసు శాఖలో ఏఆర్ సిబ్బందిని తాత్కాలికంగా ‘ఆర్డర్ టూ సర్వ్ డ్యూటీ’ అంటూ లోకల్ స్టేటస్ నిబంధన పాటించకుండా విభజించారన్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో ఒక్క పోలీసు శాఖలోనే నిబంధనలను పక్కనపెట్టి ఇష్టానుసారంగా సిబ్బందిని కొత్త జిల్లాలకు కేటాయించారన్నారు. ముఖ్యంగా ఏఆర్ సిబ్బంది సొంత జిల్లాలు వదిలి వేరే జిల్లాల్లో పనిచేస్తూ తల్లిదండ్రులు, పిల్లల చదువులు చూసుకోలేక అవస్థలు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు విన్నవిస్తే గెజిట్ తర్వాత సొంత జిల్లాలకు పంపుతామని తెలిపారన్నారు. నాలుగేళ్లుగా ‘ఆర్డర్ టూ సర్వ్’ నిబంధన మీద పనిచేస్తున్న ఏఆర్ సిబ్బందిని సొంత జిల్లాలకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై హోం మంత్రి అనిత సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. -
●గరుడ వాహనంపై దేవదేవుడు
కదిరి: అశేష భక్త జన గోవింద నామస్మరణల మధ్య ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బుధవారం గరుడ వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మదేవుడు తనకు ఇష్ట వాహనమైన గరుత్మంతున్ని నారసింహుడికి వాహనంగా పంపుతారని, అందుకే ఈ ఉత్సవాన్ని బ్రహ్మ గరుడ సేవ అంటారని అర్చక పండితులు నరసింహాచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సమస్త వాహనాల్లో సర్వ శ్రేష్టమైన గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని, ఇహ పరమైన ఈతి బాధల నుండి విముక్తి కల్గుతుందని భక్తుల నమ్మకం. నారసింహుని బ్రహ్మోత్సవాల సమయంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే కాబట్టి...ఈ వాహన సేవకు అంతటి ప్రాధాన్యత ఉంది. రాజగోపురం వద్ద దర్శనం కోసం... తమ ఇష్టదైవం ఖాద్రీశుడు తూర్పు రాజగోపురం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ‘శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవింద’ అని భక్తులు కీర్తించగా..ఆ ప్రాంతం మార్మోగింది. బ్రహ్మ గరుడ సేవలో ప్రధాన గోపురం వద్ద స్వామి వారిని దర్శించుకుంటే మరింత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు తమ ఇలవేల్పును అక్కడ దర్శించు కోవడానికి పోటీ పడ్డారు. విద్యుద్దీపాలంకరణ, కదిరి మల్లెలతో శ్రీవారిని విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. -
మహిళలపై లాఠీచార్జ్ చేస్తారా?
అనంతపురం: వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ చెల్లించాలని తదితర డిమాండ్ల సాధన కోసం విజయవాడలో ఆందోళన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల సమస్యలపై చర్చలకు పిలుస్తామని తెల్లవారుజామున శిబిరాల్లోకి దూరి మగ పోలీసులతో దాడులు చేయిస్తారా.. మహిళలని కూడా చూడకుండా లాఠీచార్జ్ చేయడమేంటి? అంటూ మండిపడ్డారు. లాఠీచార్జ్ సమయంలో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబిరాణికి గాయాలవడం దురదృష్టకరమన్నారు. అంగన్వాడీల అరెస్టును వైఎస్సార్సీపీ ఖండిస్తోందన్నారు. గతంలో విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరితే గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చిన చంద్రబాబు.. సీఎం అయ్యాక తొలి ఏడాది ఒక్క హామీనీ అమలు చేయలేదని విమర్శించారు. హామీలపై నిలదీస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రశ్నించిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. భృతి.. అంతా భ్రాంతి సూపర్ సిక్స్ హామీల్లో నిరుద్యోగ భృతి ఇప్పటి దాకా అమలు చేయలేదని, నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేశారని అనంత విమర్శించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 అందిస్తామన్నారని, 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేస్తామని చెప్పి రెండేళ్లయినా అమలు చేయలేదన్నారు. ఇక ఉద్యోగులకు ఒక డీఏతో సరిపెట్టి.. ఐఆర్ ఇవ్వకుండా, పీఆర్సీ కమిటీ వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదన్నారు. పోలీస్శాఖలో కొందరు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పరిశ్రమలు పోతున్నాయ్ అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో పరిశ్రమ స్థాపనకు 121 ఎకరాలను జిన్ ఫ్రా కంపెనీకి కేటాయించారని, శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్కు 70 ఎకరాలు కేటాయించారని అనంత తెలిపారు. అయితే అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కమీషన్లు ఇవ్వలేక ప్రభుత్వం ఇచ్చిన భూములు సైతం వద్దనుకుని వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రెండేళ్లుగా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ సీఎం చంద్రబాబు అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చేశారని అనంత విమర్శించారు. 2014 – 2019 వరకు రాజధాని పేరుతో ఎలాంటి అభివృద్ధీ చేయలేదన్నారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే లీకులు ఇచ్చి తనకు కావాల్సిన వాళ్లు భూములు కొనుగోలు చేసుకునేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. ఈ 21 నెలల్లో ఏకంగా 47 వేల కోట్ల రూపాయలు అమరావతి పేరుతో అప్పు చేశారన్నారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అనువుకాని ప్రదేశాల్లో నిర్మాణాలు చేపట్టడం మాత్రం తప్పు అని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, కల్చరల్ విభాగం నగరాధ్యక్షుడు కేశవ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు అంజి పాల్గొన్నారు. అంగన్వాడీలకిచ్చిన హామీలు ఏమయ్యాయి? వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
ప్రభుత్వ ఉదాసీనత.. వైద్యుల నిర్లక్ష్యం.. చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తోంది. సకాలంలో వైద్యం అందక ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వం మాతాశిశు మరణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో కనిపించడం లేదు. గడిచిన ఏడాదిన్నర కాలం
అనంతపురం: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతనిథ్యం వహిస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్యం దయనీయంగా మారింది. అందుకు తాజా ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. బుక్కరాయసముద్రం మండలం బీజేపీ కాలనీకి చెందిన దామోదర్, లక్ష్మీదేవి(33) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. అయితే కుమారుడు గతంలోనే చనిపోయాడు. కొడుకు కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో లక్ష్మీదేవి నాలుగోసారి గర్భం దాల్చింది. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్రమం తప్పకుండా చికిత్స చేయిస్తూ వచ్చారు. పది నెలలు పూర్తవడంతో ప్రసవం నిమిత్తం ఫిబ్రవరి 27న అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేర్పించారు. అయితే పురిటినొప్పులు రాకపోవడంతో ఈ నెల ఒకటో తేదీన సిజేరియన్ చేద్దామని, అందుకు అవసరమైన రక్తం ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబ సభ్యులకు ఓ డాక్టర్ సూచించారు. అంతలోనే మరో డాక్టర్ జోక్యం చేసుకుని సిజేరియన్ వద్దు.. నార్మల్ డెలివరీ చేద్దామని సలహా ఇచ్చారు. దీంతో ఈ నెల రెండో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి లేబర్ రూంలోనే ఉంచారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో లక్ష్మీదేవి పరిస్థితి విషమించింది. అప్పటికప్పుడు వైద్యులు సిజేరియన్ చేసి మగశిశువును బయటకు తీశారు. అయితే పురిట్లోనే శిశువు చనిపోయినట్లు తెలిపి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆరోగ్య పరిస్థితిపై చెప్పేవారేరీ? సర్వజనాస్పత్రిలో ఐదు రోజుల కిందట ప్రసవం కోసం చేర్పించామని లక్ష్మీదేవి భర్త దామోదర్ తెలిపారు. అప్పటి నుంచి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పరిస్థితి చేయిదాటాక డాక్టర్లు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భ సంచి కూడా తొలగించేశారని తెలిపారు. కుమారుడి కోసం ఎదురు చూసిన తమకు వైద్యుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని విలపించారు. మృతదేహంతో నిరసన శిశువు మృతదేహంతో దామోదర్ కుటుంబ సభ్యులు మంగళవారం సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. శిశువు మృతికి కారణమైన వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు గంటల సేపు ఆందోళన చేపట్టినా.. ఎవ్వరూ పట్టించుకోలేదు. తమ బిడ్డను తమకు తెచ్చివ్వండి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. విచారణ చేస్తాం బిడ్డకు హార్ట్బీట్ తక్కువ కావడంతో లక్ష్మీదేవికి సీ–సెక్షన్ చేశాం. అయితే అప్పటికే బిడ్డ చనిపోయిందని వైద్యులు గుర్తించారు. ఈ అంశంపై విచారణ కోసం కమిటీని నియమించాం. కమిటీ నివేదిక అనంతరం వైద్యుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ మల్లీశ్వరి, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి ప్రాణం పోతున్నా పట్టదా..? ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఎస్ఎన్సీయూ (స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్)లో పసికందులు పిట్టల్లా రాలిపోతున్నారు. తల్లికి పౌష్టికాహార లోపం, వైద్యుల అలసత్వం తదితర కారణాలతో గడిచిన ఏడాదిన్నర వ్యవధిలో దాదాపు 200 మరణాలు సంభవించాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రిలో మృత్యు ఘంటికలు మోగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడంలో తాత్సారం చేస్తోంది. ఇకనైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు మేల్కొని వైద్య సేవలు మెరుగుపరచడానికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎస్ఎన్సీయూలో వైద్యులు పత్తా లేకుండా పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వైద్యులు సొంత ప్రైవైట్ క్లినిక్లపైనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఆరోగ్యవంతమైన శిశువు అంటే 2.5 కేజీలు, ఆపై బరువు ఉండాలి. అంత కంటే తక్కువ ఉంటే శ్వాసకోశ, సెప్సిస్, గుండె సమస్యలతో పాటు పలు అంటురోగాలు తలెత్తుతాయి. ఎస్ఎన్సీయూలో అడ్మిషన్ పొందే పసికందుల్లో 50 నుంచి 60 శాతం తక్కువ బరువు, వివిధ రకాల రోగాలతో బాధపడుతున్నవారు ఉన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప పరిస్థితులు మెరుగుపడేలా కనిపించడం లేదు. ఏడాదిన్నరలో 200 మందికి పైగా చిన్నారులు మృత్యువాత సర్వజనాస్పత్రిలో తాజాగా మరొక మరణం గర్భసంచి తొలగింపు.. ప్రాణాపాయ స్థితిలో తల్లి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనిబాధిత కుటుంబ సభ్యుల ఆందోళన -
ఉపాధాయుల్ని విస్మరిస్తే భారీ మూల్యం
అనంతపురం అర్బన్: ఉపాధ్యాయలను విస్మరిస్తే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీటీఎఫ్–1938 నాయకులు ఽహెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్–1938 ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసనాయక్ మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ఉపాధ్యాయుల సమస్యలను ఒక్కటి కూడా పరిష్కరించలేదన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని తదితర మొత్తం 20 డిమాండ్లు ఉంచామన్నారు. వాటిని పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, కార్యదర్శి మహమ్మద్రఫీ, పూర్వపు కార్యదర్శి కులశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
చెన్నకేశవస్వామి గోవిందా.. గోవింద
● నేత్రపర్వంగా కల్యాణోత్సవం.. రథోత్సవం యాడికి: చెన్నకేశవస్వామి గోవిందా.. గోవింద నామస్మరణతో మండల కేంద్రం యాడికి మార్మోగింది. శివలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం కల్యాణోత్సవం.. రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆలయ ప్రధాన అర్చకులు హరికృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఐదు గంటల సమయంలో ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకొచ్చి ఆలయం ఎదురుగా ఉన్న రథం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం రథంపై భూదేవి, శ్రీదేవి సమేత శివలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. తహసీల్దార్ ప్రతాప్రెడ్డి అశేష భక్త జనసందోహంతో కలిసి గోవిందా.. గోవింద అంటూ మడుగు తేరు లాగారు. కెనరా బ్యాంక్ వరకు సాగింది. ఉదయం 8గంటల సమ యంలో రథం పాత పోలీస్టేషన్, కోమటి బజార్, పెద్దమ్మ తల్లి దేవాలయం మీదుగా 12 గంటల సమయం లోపే యథాస్థానానికి చేరుకుంది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు బొంబాయి రమేష్ నాయుడు, ఎంపీటీసీ సభ్యులు వెంకటనాయుడు, నాగరాజు, రామ్మోహన్, ఉప సర్పంచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకుడు బాలా రమేష్ బాబు, మాజీ సర్పంచ్ రమేష్ బాబు, ఆలయ ఈఓ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరునాళ్ల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాసులు తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు సీఐలు, ఎస్ఐలతో కలిసి దాదాపు 80 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేటి నుంచి పప్పుశనగ కొనుగోళ్లు
కణేకల్లు: రైతులు పండించిన పప్పుశనగను బుధవారం నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు ఏపీ మార్క్ఫెడ్ డీఎం పెన్నేశ్వరి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ఏడు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కణేకల్లు మండలంలో 23,604 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పప్పుశనగ సాగు చేశారని, ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశామని చెప్పారు. రైతుకు ఎన్ని ఎకరాలున్నా గరిష్టంగా 5 ఎకరాలకు సంబంధించిన సరుకు అంటే 40 క్వింటాళ్ల వరకు కొంటామని చెప్పారు. క్వింటా కనీస మద్దతు ధర రూ.5,875తో శనగలు కొనుగోలు చేస్తామన్నారు. దళారులను నమ్మి అమ్ముకోవద్దని ఆమె సూచించారు. మహిళలకు ఆరోగ్య పరీక్షలు అనంతపురం సెంట్రల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పోలీసు హెడ్క్వార్టర్స్ ఆస్పత్రిలో మహిళా పోలీసు సిబ్బంది, జీఎంఎస్కేలు, హోంగార్డులు, మహిళా ఆటో డ్రైవర్లు, డ్వాక్రా మహిళలకు వైద్య శిబిరం నిర్వహించారు. సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీఎకో, కంటి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, డీఎస్పీలు మహబూబ్బాషా, శ్రీనివాసరావు, నీలకంఠేశ్వరరెడ్డి, పోలీసు డాక్టర్ కౌసర్బేగం, సీఐలు వెంకటేశ్వర్లు, వెంకటేష్నాయక్, శ్రీకాంత్యాదవ్, ఆర్ఐలు పాల్గొన్నారు. విజయవాడ వెళ్లిన కలెక్టర్ అనంతపురం అర్బన్: కలెక్టర్ ఆనంద్ మంగళవారం విజయవాడకు వెళ్లారు. సీఎం బుధవారం విజయవాడలో ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీతో నిర్వహించనున్న సమావేశంలో కలెక్టర్ పాల్గొననున్నారు. ఆయన తిరిగి 5వ తేదీ విధులకు హాజరవుతారని కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
టీడీపీ నేతల మధ్య పరస్పర దాడులు
● నాగులగుడ్డం తండాలో ఘటన ● సీసీరోడ్ల నిర్మాణ విషయంలో ఇప్పటికే ఘర్షణ ● తాజాగా కంకర టిప్పరును అడ్డుకోవడంతో బాహాబాహీ శింగనమల: మండలంలోని నాగులగుడ్డం తండాలో టీడీపీ నేతల మధ్య కక్షలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రధాన మంత్రి ధర్తి అభజన జాతీయ ఉత్కర్ష అభియాన్ కింద మూడేళ్ల క్రితం నాగులగుడ్డం తండా పంచాయతీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ పనులు చేపట్టే విషయంలో అప్పటి నుంచి టీడీపీ నేతలు ఘర్షణ పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే నిధులు వెనక్కు మళ్లే అవకాశం ఉండడంతో చివరకు పంచాయతీ రాజ్ అధికారులే గత నెల 28న స్వయంగా రంగంలో దిగి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఆ సమయంలోనూ టీడీపీ నాయకులు గొడవ పడి అడ్డుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 9 గంటలకు సీసీ రోడ్డుకు ఓ వర్గం టీడీపీ నేతలు కంకర తోలుతుండగా ఇంకో వర్గం నేతలు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఘర్షణ చోటు చేసుకుని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో రామాంజినాయక్, రమేష్ నాయక్, వెంకటలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే శింగనమలలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి తరలించారు. మరో వర్గానికి చెందిన వెంకటేష్ నాయక్కు గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు ఆరా తీశారు. -
బాబు సర్కార్పై అంగన్వాడీల కన్నెర్ర
అనంతపురం అర్బన్: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విజయవాడలో శాంతియుతంగా చేపట్టిన ఆందోళనపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపడంపై అంగన్వాడీలు కన్నెర్ర చేశారు. హామీలపై ప్రశ్నించినందుకు చేతులు విరగ్గొడతారా అంటూ ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని నినదించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, ధర్నాలు నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అనంతపురంలో క్లాక్టవర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో సీఐటీయూ, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ విజయవాడలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందన్నారు. ఉదయం ఆరు గంటల సమయంలో పోలీసులను ఉసిగొలిపి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వేతనాలు పెంచాలని, హామీలు అమలు చేయాలని కోరితే బెదరింపులకు దిగుతారా.. ఇదేనా ప్రజాస్వామ్య పాలన అంటూ ఘాటుగా ప్రశ్నించారు. అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ అహంకారానికి పరాకాష్ట అంటూ మండిపడ్డారు. అక్రమ అరెస్టులను అడ్డుకునే క్రమంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి చేయి విరగడం దురదృష్టకరమన్నారు. ఇది కేవలం అరెస్టు కాదని, మహిళల గౌరవాన్ని అవమానపర్చడమేనని, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని దుమ్మెత్తిపోశారు. ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పించాలని, అదనపు యాప్ పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, ప్రతి సెక్టార్కూ సిబ్బంది నియామకం, సురక్షిత వసతి కల్పించాలని కోరారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమం ఆపేది లేదన్నారు. నిర్బంధాలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అంగన్వాడీల గళాన్ని అణచలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, జిల్లా అధ్యక్షుడు ఆర్వీ నాయుడు, నాయకులు గోపాల్, రామిరెడ్డి, నాగభూషణం, రామాంజనేయులు, ముర్తుజా, వెంకటనారాయణ, అంగన్వాడీ వర్కర్ల సంఘం నాయకురాళ్లు కాత్యాయని, అరుణమ్మ, సుశీల, షాహినా, ఐద్వా నాయకురాళ్లు శ్యామల, అశ్విని, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. హామీలపై ప్రశ్నిస్తే చేతులు విరగ్గొడతారా.. అక్రమ అరెస్టులపై జిల్లా అంతటా ఆందోళనలు డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాడుతాం -
●హనుమద్ వాహనంపై శ్రీవారు
కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవరోజైన మంగళవారం ఖాద్రీశుడు హనుమద్ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకొని భక్తిపారవశ్యంతో మునిగితేలారు. చంద్రగ్రహణం కారణంగా రోజంతా ఆలయం తలుపులు మూసివేశారు. గ్రహణం వీడిన అనంతరం ఆలయశుద్ధి, సంప్రోక్షణ తర్వాత భక్తులను సర్వ దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. నరసింహావతారంలో హిరణ్యకశ్యపుని సంహారం అనంతరం మహావిష్ణువును సాక్షాత్తు హనుమంతుడే దిగివచ్చి తన భుజస్కందాలపై మోస్తాడని భక్తుల నమ్మకం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విల్లంబులు ధరించి హనుమంతుడి భుజాలపై కొలువుదీరిన శ్రీవారిని చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుడినే వాహనంగా చేసుకొని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. భక్తుల కాలక్షేపం కోసం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఉత్సవ ఉభయదారులుగా మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేడు బ్రహ్మ గరుడసేవ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు బుధవారం గరుడ వాహనంపై తిరువీధుల్లో తన భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మోత్సవాలను దగ్గరుండి నడిపిస్తారని భక్తుల నమ్మకం. బ్రహ్మ గరుడ సేవలో స్వామివారిని తూర్పు రాజగోపురం వద్ద దర్శించుకుంటే మరింత పుణ్యం సిద్ధిస్తుందంటారు. లక్ష్మీ నరసింహస్వామిని తమ ఇలవేల్పుగా కొలిచే భక్తులంతా బ్రహ్మగరుడు సేవ రోజునే కదిరి పున్నమి పేరుతో పండుగను జరుపుకుంటారు. గ్రహణం వీడిన తర్వాత దర్శనం కోసం బారులు తీరిన భక్తులు హనుమద్ వాహనంపై దర్శనమిస్తున్న శ్రీవారు -
భీముడికి సజీవ రూపం
‘కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో ద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ కరలీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్’ .. అంటూ మహాభారత నాటకంలో ద్రౌపదీ వస్త్రాపహరణ సన్నివేశంలో భీముడి పాత్రధారిగా రామాంజనేయులు రాగయుక్తంగా, ఆవేశంగా ఆలపిస్తుంటే ప్రేక్షకులు మైమరిచిపోతుంటారు. భీమసేనుడి కోపతీవ్రతనూ, అతని ప్రతిజ్ఞలోని భయంకరత్వాన్నీ ప్రేక్షకుల మనస్సుకు హత్తుకుని ‘వన్స్మోర్’ అనే కేకలతో రంగస్థలం ప్రతిధ్వనిస్తుంది. -
జన గణనలో భాగస్వాములు కావాలి
అనంతపురం: జనగణన–2027లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోల, సెన్సెస్ విభాగం జాయింట్ డైరెక్టర్ జగన్నాథ్ మజ్ హి తెలిపారు. మంగళవారం జేఎన్టీయూ అనంతపురం ఆడిటోరియంలో జన గణనపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. సెన్సెస్ విభాగం జాయింట్ డైరెక్టర్ జగన్నాథ్ మజ్హి మాట్లాడుతూ విశ్వసనీయమైన డేటాను అందించి.. జనగణనను విజయవంతం చేయాలని కోరారు. శిక్షణలో ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని కోరారు. డీఆర్ఓ మలోలా మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటి నుంచి జన గణన ప్రారంభమవుతుందన్నారు. ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులు ఇతర వివరాల నమోదులో పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. మండల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు ఆయా స్థాయిలో ప్రణాళికలను సిద్ధం చేసుకుని కచ్చితమైన సమాచార సేకరణకు కృషి చేయాలని కోరారు. పౌరులు సైతం పక్కా సమాచారాన్ని తెలపాలని సూచించారు. కచ్చితమైన గణాంకాలే దేశాభివృద్ధికి పునాది అవుతాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు మధుసూదన, కనకరాజు, ఎస్ఓ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు సహాన ఎంపిక కళ్యాణదుర్గం రూరల్: జాతీయస్థాయి పారా బ్యాడ్మింటన్ విభాగం పోటీలకు కళ్యాణదురం మండలం వర్లి గ్రామానికి చెందిన కురుబ సహాన ఎంపికై ంది. గత నెల 25, 26 తేదీల్లో విజయనగరంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో సహన ప్రతిభ కనబరిచింది. దీంతో ఆమెను ఈ నెల ఏడో తేదీన నిర్వహించే జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక చేశారు. పేద కుటుంబానికి చెందిన ఈమె క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటంతో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ మంగళవారం రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. -
ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలి
● ప్రజాబలం వ్యవస్థాపక అధ్యక్షుడు రామప్ప నాయక్ ● రథయాత్రతో గ్రామాల్లో సంతకాల సేకరణ ప్రారంభం బెళుగుప్ప: ఐదు దశాబ్దాలుగా జిల్లాలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిస్వార్థ సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజాబలం వ్యవస్థాపక అధ్యక్షుడు రామప్ప నాయక్ డిమాండ్ చేశారు. ‘ఆర్డీటీని కాపాడుకుందాం’ అనే నినాదంతో సంతకాల సేకరణకు చేపట్టిన రథయాత్ర మంగళవారం బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తండాలో గ్రామ పెద్దలతో కలసి ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఆర్డీటీ సేవలను కొనియాడారు. జిల్లాలోని పలు గ్రామాల్లో రథయాత్ర కొనసాగిస్తూ ప్రజలను చైతన్య పరిచి ఆర్డీటీ పరిరక్షణకు సంతకాల సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర ఈ నెల 8న కలెక్టరేట్ వద్ద భారీ సభతో ముగుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాబలం రాష్ట్ర కన్వీనర్ రమేష్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ మైమున, ఉరవకొండ కన్వీనర్ హనీఫ్, గ్రామ పెద్దలు వేణుగోపాల్ నాయక్, బలరాం నాయక్, గోపాల్నాయక్, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. -
మూతపడిన ఆలయాలు
కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని ఆలయాలను మూసివేశారు. మంగళవారం ఉదయం పూజాదికాలు ముగించిన అనంతరం ఉదయం 9 గంటలకు గర్భాలయంతో పాటు మహాద్వారం తలుపులకు తాళాం వేశారు. అన్నవితరణ కేంద్రాల్లో ప్రసాదాల తయారీ కూడా నిలిపేశారు. తిరిగి బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. – సాక్షి బృందం, అనంతపురం: గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని మూసివేసిన దృశ్యం మూసేసిన అనంతపురం ఒకటో రోడ్డులోని కాశీవిశ్వేశ్వరాలయం తాడిపత్రి రూరల్: బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని మూసివేస్తున్న దృశ్యం ఉరవకొండ రూరల్: పెన్నహోబిలంలో ఆలయాన్ని మూసి వేస్తున్న అర్చకులు -
రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల జిల్లా సంఘం ఎన్నిక
అనంతపురం టౌన్: ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అనంతపురం జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. మంగళవారం ఆ శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు పాల్గొని జిల్లా అధ్యక్షుడిగా ఎన్.షామీర్బాషా, ఉపాధ్యక్షుడిగా శివనారాయణశర్మ, ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎండీ యూనస్, జాయింట్ సెక్రెటరీగా జయదీప్, ట్రెజరర్గా బసవరాజ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాహనంలో నుంచి కిందపడిన కూలీలు ఉరవకొండ/రూరల్: సామర్థ్యానికి మించి కూలీలతో వెళుతున్న వాహనం వెనుక డోర్ తెరుచుకోవడంతో శ్రామికులు ఒక్కసారిగా రోడ్డుపై పడి గాయపడ్డారు. ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కణేకల్లు మండలం హనుమాపురం గ్రామానికి చెందిన 20 మంది కూలీలు మంగళవారం ఉదయం టాటా ఏస్ వాహనంలో మిరప పంట కోత పనికి నింబగల్లుకు బయలుదేరారు. నింబగల్లు గ్రామ పరిసరాల్లోకి చేరుకోగానే వాహనం వెనుక డోర్ తెరుచుకుంది. దీంతో కూలీలు ఒక్కసారిగా రోడ్డుపై పడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గమనించి క్షతగాత్రులను వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఓ మహిళా కూలీని అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. జిల్లాకు 1470 మెట్రిక్ టన్నుల యూరియా అనంతపురం సెంట్రల్: ఇఫ్కో కంపెనీకి చెందిన 1,470 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చినట్లు వ్యవసాయశాఖ ఏడీ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. మంగళవారం రైలు వ్యాగన్లలో వచ్చిన యూరియా నిల్వలను ఆయన పరిశీలించారు. వచ్చిన యూరిలో 470 మెట్రిక్ టన్నులు మార్క్ఫెడ్కు, 1000 మెట్రిక్ టన్నులు ప్రైవేటు డీలర్లకు పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు. -
పట్టు వీడకపోతే పోరుబాట తప్పదు
● చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆర్టీసీ ఈయూ నేతలు అనంతపురం క్రైం: విద్యుత్ బస్సుల నిర్వహణ పేరుతో దశల వారీగా ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నేతలు హెచ్చరించారు. మంగళవారం అనంతపురంలోని వి.కె.భవన్లో యూనియన్ జిల్లా 2వ నిర్మాణ సభ జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఆర్.వి. భాస్కరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఈ–బస్ పథకం పేరుతో పూణేకు చెందిన పినాకల్ కంపెనీకి ఏపీలోని 11 డిపోల పరిధిలో 12 స్థలాలను కేటాయించేలా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్టీసీ మనుగడకు ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్, సీఎన్జీ, డీజిల్ తదితర బస్సులన్నీ ఆర్టీసీ ద్వారానే, ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని, డిపోలను ప్రైవేట్ కన్సార్టియంకు అప్పగించే నిర్ణయాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ప్రకారం సుమారు 6 వేల మందికి పదోన్నతులు అందాల్సి ఉండగా... ఇప్పటివరకు కేవలం 3,300 మందికే కల్పించారన్నారు. మిగిలిన వారికి వెంటనే పదోన్నతులు కల్పించాలని కోరారు. డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ అరియర్స్ (24 నెలల బకాయిలు) వెంటనే చెల్లించాలని, ఐఆర్ ప్రకటించి 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు గ్రాట్యూటీ, టెర్మినల్ ఎన్క్యాష్మెంట్ చెల్లింపులు చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎంఈ రమేష్, డిపో మేనేజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు ఆర్.ఎన్.దివాకర్ రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. నూతన కమిటీ ఎన్నిక: సభ అనంతరం నేతలు జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఆర్.వి.భాస్కరరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎం.ఎస్.రాజు, చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా పీఎస్ఏ ఖాన్, కార్యదర్శిగా కె. కొండయ్య, ప్రచార కార్యదర్శిగా కె.కల్లప్ప, కోశాధికారిగా పి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. -
పరిష్కార వేదికకు 140 వినతులు
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 140 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. ఆరు నెలలుగా వేతనం ఇవ్వలేదు ● జేసీ విష్ణుచరణ్కు కేజీబీవీ సిబ్బంది ఫిర్యాదు అనంతపురం అర్బన్: సమగ్రశిక్ష పరిధిలోని కస్తురిబా బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న 62 మందికి ఆరు నెలలుగా వేతనం ఇవ్వలేదని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్కు బాధితులు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పరిష్కార వేదికలో జేసీని సమగ్రశిక్ష, కేజీబీవీ ఉద్యోగుల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ విజయ్, సిబ్బంది చిన్నరత్నమ్మ, చంద్రకళ, అశ్విని, ధరణి, వెంకటలక్ష్మి, పద్మావతి, తదితరులు కలిసి వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో తామంతా కొత్తగా విధుల్లోకి చేరామని తెలిపారు. తమకు ఆప్కాస్ ద్వారా వేతనం చెల్లించాల్సి ఉందని, అయితే ఇప్పటికీ ఆప్కాస్లో నమోదు చేయాలేదని వివరించారు. ఆరునెలలుగా వేతనం రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, కుటుంబపోషణ భారంగా మారిందని వాపోయారు. బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు తమ 62 మందిని ఆప్కాస్లో నమోదు చేయాలని కోరారు. -
ముగిసిన ఎకై ్సజ్ క్రీడా పోటీలు
అనంతపురం సెంట్రల్: స్థానిక పరేడ్ మైదానం వేదికగా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ఉద్యోగుల మధ్య రెండు రోజుల పాటు సాగిన క్రీడా పోటీలు సోమవారం ముగిశాయి. క్రికెట్, టగ్ ఆఫ్ వార్లో అనంతపురం జిల్లా, కబడ్డీలో శ్రీసత్యసాయి జిల్లా జట్లు విజేతగా నిలవగా... వాలీబాల్ మ్యాచ్ టై కావడంతో రెండు జిల్లాల జట్లను విజేతగా ప్రకటించారు. ఓవరాల్ చాంపియన్ షిప్ను అనంతపురం జిల్లా జట్లు కై వసం చేసుకుంది. పోటీల ముగింపు సందర్భంగా సోమవారం సాయంత్రం పరేడ్ మైదానంలో బహుమతుల ప్రదానోత్సవం అట్టహాసంగా సాగింది. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ అధికారులు రామ్మోహన్రెడ్డి, గోవింద్నాయక్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు నరసింహులు, రేవతి తదితరులు మాట్లాడారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు అలరించారు. కార్యక్రమంలో డీఎం వేణుగోపాలరెడ్డి, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జయనాథరెడ్డి, కార్యదర్శి జాకీర్హుస్సేన్, నాయకులు జయనరసింహ, నరేష్బాబు, పాల్గొన్నారు. -
బధిర చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు
● జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అనంతపురం అర్బన్: వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా అందిస్తున్న కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సను సద్వినియోగం చేసుకోవాలని బధిర చిన్నారుల తల్లిదండ్రులకు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పిలుపునిచ్చారు. ఈ నెల 3న ప్రపంచ శ్రవణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో కిమ్స్ సవేరా ఆస్పత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కిమ్స్ సవేరాలో కాక్లియర్ ఇంప్టాంట్ శస్త్ర చికిత్స చేయించుకున్న 50 మంది చిన్నారులకు కిట్లను ఆందజేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ గంగాధర్రెడ్డి, సవేరా ఆస్పత్రి సీఈఓ సిద్ధారెడ్డి, ఈఎన్టీ నిపుణులు రాఘవేంద్రరెడ్డి, పీఆర్ గిరి, సిబ్బంది, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
రిమాండ్కు చైన్స్నాచర్
కళ్యాణదుర్గం రూరల్: మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రవిబాబు తెలిపారు. స్థానిక కార్యాలయంలో సోమవారం సీఐ నీలకంఠతో కలసి వివరాలను ఆయన వెల్లడించారు. బ్రహ్మసముద్రం మండలం నంజాపురం గ్రామానికి చెందిన చెందిన తులసి గత నెల 19న కళ్యాణదుర్గం నుంచి తన స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వెంబడించిన వ్యక్తి నిర్జన ప్రదేశంలో తులసి వెళుతున్న స్కూటీని ఢీకొని ఆమెను కిందపడేలా చేశాడు. అనంతరం బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన బ్రహ్మసముద్రం పోలీసులు పక్కా ఆధారాలతో సోమవారం అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి గ్రామానికి చెందిన బండి సుబ్రహ్మణ్యంను కళ్యాణదుర్గం మండలం కొండాపురం గ్రామం వద్ద అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. అతని నుంచి 15 గ్రాముల బరువున్న బంగారు చైన్ను స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. కాగా, నిందితుడు కొంత కాలంగా కంబదూరులోని గుద్దెళ్ల గ్రామంలో నివాసముంటున్నట్లు పోలీసులు తెలిపారు. హాల్ టికెట్లో ఫొటో మిస్ మ్యాచ్● పరీక్ష కేంద్రం నుంచి విద్యార్థిని బయటకు పంపిన అధికారులు తాడిపత్రి టౌన్: హాల్ టికెట్లో ఫొటో మిస్ మ్యాచ్ అంటూ ఓ విద్యార్థిని పరీక్ష కేంద్రం నుంచి అధికారులు బయటకు పంపేశారు. దీంతో ఏడుస్తూ ఆ విద్యార్థి ఇంటి బాట పట్టాడు. వివరాల్లోకి వెళితే... తాడిపత్రి మండలం బందర్లపల్లెకు చెందిన డేరంగుల వెంకటవంశీధర్ దూరవిద్య ద్వారా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం నాడు పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ తీసుకుని తనకు కేటాయించిన తాడిపత్రిలోని ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చేరుకున్నాడు. మరికాసేపట్లో ప్రశ్న పత్రం ఇస్తారనగా... హాల్ టికెట్ను పరిశీలించిన అధికారులు అందులో సదరు విద్యార్థి ఫొటో కాకుండా గుర్తు తెలియని వ్యక్తి ఫొటో ఉండడం గమనించి పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో విద్యార్థి కన్నీటి పర్యంతమయ్యాడు. ఓపెన్ కళాశాల నిర్వాహకుల తప్పిదానికి తాను బలైనట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. -
లో ఓల్టేజీ ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు
● విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ అనంతపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ లో ఓల్టేజీ ఉన్న ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు ఆ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. సోమవారం తన చాంబర్ నుంచి నిర్వహించిన డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమంలో వినియోగదారులతో ఆయన స్వయంగా మాట్లాడారు. ప్రతి మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల ద్వారా జనబాట కార్యక్రమం చేపట్టి విద్యుత్ సరఫరాలో నెలకొన్న సమస్యలపై ఫిర్యాదు చేసిన వెంటనే నాలుగు రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వేసవి ప్రారంభంలోనే జిల్లా వ్యాప్తంగా లో ఓల్టేజీ సరఫరా అయ్యే ప్రాంతాలను గుర్తించి నివేదికలను ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. లో ఓల్టేజీ సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇళ్ల నిర్మాణ లక్ష్యం పూర్తి చేయాలి ● అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం అనంతపురం అర్బన్: ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాన్ని ఉగాదిలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. వివిధ అంశాలపై జేసీ సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.ఓ కింద 2,514 ఇళ్లు మంజూరైతే 1,249 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయన్నారు. మిగిలిన వాటిని గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు సమష్టిగా పని చేసి ఉగాది నాటికి జిల్లాలో 16,702 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఎన్ఆర్జీఎస్ పనుల కింద మెటీరియల్ ఖర్చుకు సంబంధించి బిల్లులు అప్లోడ్ చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, హౌసింగ్ పీడీ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కారు బోల్తా – ఒకరి మృతి
బత్తలపల్లి: కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన రాసినేని తరుణ్చౌదరి, సాయితేజ (కదిరి), వేములేటి వినయ్కుమార్రెడ్డి (పెనుకొండలోని అల్విన్ కాలనీ), పోలా యశ్వంత్రెడ్డి (కడపలోని మారుతీనగర్) నలుగురూ ఎస్వీఐటీ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. మంచి స్నేహితులు. ధర్మవరంలో నివాసముంటున్న తమ బంధువుల ఇంట వివాహ వేడుక ఉండడంతో తరుణ్ చౌదరి తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వచ్చాడు. వివాహ వేడుక అనంతరం ఊరేగింపునకు కావాల్సిన ఆదివారం రాత్రి అనంతపురానికి వెళ్లారు. అక్కడ సామగ్రి కొనుగోలు చేసుకుని కారులో తిరుగు ప్రయాణమైన నలుగురు స్నేహితులు.. బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్దకు చేరుకోగానే డ్రైవింగ్ చేస్తున్న వినయ్కుమార్రెడ్డి నిద్రలో జోగడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో సాయితేజ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురూ గాయాలతో బయటపడ్డారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మాజీ ఎమ్మెల్యే ‘ఉన్నం’ ఆరోగ్యం విషమం
కళ్యాణదుర్గం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆరోగ్యం విషమించింది. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుంటుండగా సోమవారం ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ద్విచక్ర వాహనాలు ఢీ – ఒకరి మృతి లింగాల: లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో యల్లనూరు మండలం గొడ్డుమర్రి గ్రామానికి చెందిన అప్పల గంగాధర్ (35) మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దకుడాల గంగమ్మదేవత తిరునాలకు వెళ్లి అక్కడ నుంచి పులివెందులకు వెళుతుండగా ఇప్పట్ల గ్రామ సమీపంలో పులివెందులకు చెందిన శ్రీహరి, విశ్వరూప్ అనే యువకులు పెద్దకుడాలకు వస్తుండగా ఎదురెదురుగా బైక్లు ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన గంగాధర్ను వెంటనే పులివెందుల సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్డీటీ పరిరక్షణే ధ్యేయం● వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణ విడపనకల్లు: ఆర్డీటీ పరిరక్షణే ధ్యేయంగా ఈ నెల 9న ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల పక్షం సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ రమణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దశాబ్దాలుగా జిల్లాలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆర్డీటీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ధర్నాకు ఉరవకొండ నియోజకవర్గంలోని ఆర్డీటీ లబ్ధిదారులు తరలి రావాలని పిలుపునిచ్చారు. -
●సింహవాహనంపై శ్రీవారు
కదిరి: శౌర్యానికి, గాంభీర్యానికి, పరాక్రమానికి ప్రతీకగా నిలిచే సింహాన్నే వాహనంగా చేసుకుని ఖాద్రీశుడు తిరు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కిరీటధారియై ఠీవిగా కనిపించిన ఖాద్రీశుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తజనం ఖాద్రీశా...గోవిందా అంటూ కీర్తించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గో రోజైన సోమవారం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి సింహ వాహనంపై ఊరేగారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి ప్రీతి పాత్రమైన ఈ సింహ రూపంలోనే నర–సింహ అవతారమెత్తి హిరణ్య కశ్యపుడిని సంహరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టు కుంటున్నాయి. నేడు హనుమంత వాహనం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష్మీ నారసింహుడు హనుమంత వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. చంద్రగ్రహణం కారణంగా పగలంతా ఆలయం మూసివేసి రాత్రి సమయంలో సంప్రోక్షణ అనంతరం తలుపులు తెరుస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. -
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే చౌకబియ్యం పక్కదారి పడుతోంది. ఇదివరకు కార్డుదారుల వద్ద నుంచి చౌకబియ్యాన్ని వ్యాపారులు తక్కువ ధరకు కొని బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవారు. కొందరు డీలర్లు అయితే తూకాలు తక్కువ ఇస్తూ పోగు చేసుకున్న బియ్యా
అనంతపురం అర్బన్ : చంద్రబాబు ప్రభుత్వంలో చౌకధరల దుకాణాల డీలర్లు నయా దందాకు తెరలేపారు. కార్డుదారులకు బియ్యం ఇవ్వకుండా వారితో నేరుగా వ్యాపారం చేస్తున్నారు. ఇళ్లవద్దకే వెళ్లి బియ్యం పంపిణీ చేసినట్లుగా ఈ–పాస్లో వేలిముద్ర వేయించుకుంటున్నారు. కిలోకు రూ.10 చొప్పున కార్డుదారులకు డబ్బులు చెల్లిస్తున్నారు. తమకు బియ్యం వేయండని అడిగిన కార్డుదారులకు కూడా బలవంతంగా డబ్బులు అంటగడుతున్నట్లు సమాచారం. ఇలాంటి ఘటన అనంతపురం నగరంలోని గుల్జార్పేటలో వెలుగుచూసింది. డీలర్ తీరుపై ఫిర్యాదులు వెళ్లడంతో పౌర సరఫరాల అఽధికారులు విచారణ చేపట్టారు. పంపిణీ చేశారిలా.. చౌకడిపో డీలర్ ప్రతి నెలా 26 తేదీ నుంచి నెలాఖరు వరకు వృద్ధులు, నిస్సహాయులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి బియ్యం పంపిణీ చేయాలి. ఒకటవ తేదీ నుంచి ఇతర కార్డుదారులకు చౌక దుకాణం వద్ద బియ్యం, ఇతర సరుకులు అందజేయాలి. అయితే గుల్జార్ పేటలోని 1285033 నంబరు గల చౌక దుకాణం డీలరు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కార్డుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఈ–పాస్ మిషన్లో వేలిముద్ర వేయించుకుని.. బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ డీలరు ఫిబ్రవరి 26న 50 కార్డులకు, 27వ తేదీన 27 కార్డులు, 28న నాలుగు కార్డులు, మార్చి 1న 57 కార్డు దారులకు బియ్యం పంపిణీ చేసినట్లు వేలిముద్ర వేయించుకుని.. బదులుగా డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది. బ్లాక్ మార్కెట్కు చౌకబియ్యం కార్డుదారులకు బియ్యం ఇవ్వకుండా బదులుగా కిలోకు రూ.10 చొప్పున డబ్బులు ఇస్తున్నట్లు డీలర్పై ఫిర్యాదులు ఉన్నాయి. ఒక రకంగా కార్డుదారులతోనే డీలర్లు వ్యాపారం చేస్తున్నారన్నమాట. కొన్ని చోట్ల కిలో బియ్యం రూ.13 నుంచి రూ.15తో కొనుగోలు చేసి.. బ్లాక్ మార్కెట్లో కిలో రూ.18 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో కొందరు ఇలాంటి దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్డుదారులతో నేరుగా వ్యాపారం ఇళ్లవద్దకే వెళ్లి వేలిముద్ర తీసుకుంటున్న డీలర్లు బియ్యానికి బదులు డబ్బులు కావాలన్న కార్డుదారులకు బియ్యం ఇవ్వని వైనం అనంతపురంలో బయటపడ్డ తంతు అనంతపురంలోని గుల్జార్పేటలోని చౌకదుకాణం (1285033) డీలర్ వ్యవహారంపై ఫిర్యాదు అందింది. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సీఎస్డీటీ సుబ్రహ్మణ్యంను ఆదేశించాను. సీఎస్డీటీ అక్కడికి వెళ్లి దుకాణం వద్ద వీఆర్ఓను ఉంచి కార్డుదారులకు బియ్యం వేయించారు. సీఎస్డీటీ నుంచి విచారణ నివేదిక అందిన తరువాత డీలర్పై తదుపరి చర్యలు ఉంటాయి. డీలర్లు తప్పనిసరిగా కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలి. అలా చేయని వారిపై శాఖాపరంగా చర్యలు ఉంటాయి. – వెంకటేశ్వర్లు, జిల్లా సరఫరాల అధికారి -
వెల్లువలా రెవెన్యూ సమస్యలు
అనంతపురం అర్బన్ : భూ సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ వెనకబడుతోంది. ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ప్రతి వారం అందే అర్జీల్లో అధికభాగం భూ సమస్యలే ఉంటుండటమే ఇందుకు నిదర్శనం. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగమైన రెవెన్యూ క్లినిక్కు భూ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తాయి. పరిష్కార వేదికకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై 504 అర్జీలు అందాయి. వాటిలో రెవెన్యూకు సంబంధించి 385 అర్జీలు ఉండగా ఇతర సమస్యలకు సంబంధించి 119 వినతులు ఉన్నాయి. అర్హత కలిగిన వితంతు, దివ్యాంగులు, దీర్ఘకాలికవ్యాధిగ్రస్తులు, వృద్ధులు పింఛన్ల కోసం తరచూ అర్జీలు అందజేస్తున్నా.. మంజూరు మాత్రం కావడం లేదు. పరిష్కార వేదికలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అర్జీల్లో మచ్చుకు కొన్ని.. తనపై ఉన్న రౌడీషీట్ తొలగించాలని గుంతకల్లు మండలం ఇమాంపురం ఎస్టీ కాలనీకి చెందిన మదన్మోహన్ యాదవ్ విన్నవించాడు. తన వయసు 24 ఏళ్లని, ప్రస్తుతం బీఈడీ చేస్తున్నానని చెప్పాడు. గుంతకల్లు డీఎస్పీ తనపై రౌడీషీట్ తెరిచారని పేర్కొన్నాడు. దాన్ని తొలగించాలని కోరుతూ ఎస్పీకి విన్నవించినా న్యాయం జరగలేదన్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని చెప్పాడు. తన భవిష్యత్తు పాడవకుండా రౌడీషీట్ తొలగించేలా చూడాలని వేడుకున్నాడు. ● వితంతు పింఛను మంజూరు చేయాలని కణేకల్లు మండలం బ్రహ్మసముద్రం గ్రామానికి చెందిన చిన్నమారెక్క విన్నవించింది. అనారోగ్యంతో తన భర్త మరణించాడని తెలిపింది. తనకు ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవని పేర్కొంది. కూలి పనులు చేసుకుంటూ జీవనంసాగిస్తున్నాని తెలిపింది. వింతతు పింఛను మంజూరు చేస్తే కాస్త ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని కోరింది. ● కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తనకు పింఛను మంజూరు చేయించాలని అనంతపురంలోని రాజమ్మ కాలనీకి చెందిన కురుగోడు శంకర్ విన్నవించాడు. తనకు ఒక కిడ్నీ తొలగించారని, రెండవది కూడా సరిగ్గా పనిచేయడం లేదని చెప్పాడు. మందులకు చాలా ఖర్చు అవుతోందని తెలిపాడు. పింఛను మంజూరు చేస్తే కొంత ఆసరాగా ఉంటుందని విజ్ఞప్తి చేశాడు. ● ఇతని పేరు తాటిచెర్ల లక్ష్మణమూర్తి. అనంతపురంలోని సోమనాథ్నగర్ నివాసముంటున్నాడు. ఇంటి పక్కనే ఒకవ్యక్తి కోళ్ల ఫారం ఏర్పాటు చేశాడు. కోళ్ల పెంట నుంచి వెలువడుతున్న దుర్వాసన భరించలేకుండా ఉంది. సమస్యపై ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఒకసారి ఫిర్యాదు చేస్తే.. నగర పాలక సంస్థ వారు వచ్చి ఫొటోలు తీసుకుని వెళ్లారు. ఆ తరువాత కోళ్ల ఫారం తొలగించి సమస్య పరిష్కరించామని ఎండార్స్మెంట్ పంపించారు. వాస్తవంగా కోళ్ల ఫారాన్ని తొలగించలేదు. దీంతో మరోసారి ఫిర్యాదు చేయడానికి వచ్చానని లక్ష్మణమూర్తి తెలిపాడు. పరిష్కారం కాక అర్జీదారుల అవస్థలు పింఛన్ల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో మళ్లీమళ్లీ అవే సమస్యలు -
ఉద్యానం.. మద్దతు అధ్వానం
● టమాట, అరటి, చీనీ ధరలు ఢమాల్ ● నిరాశాజనకంగా మార్కెట్ ● రైతులను ఆదుకోని బాబు సర్కార్ అనంతపురం అగ్రికల్చర్: ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా పేరుగాంచిన అనంతపురం జిల్లా ఉద్యాన పంటల పెట్టింది పేరు. అందులో ప్రధానంగా చీనీ తోటలు 90 వేలు, టమాట 40 వేలు, మామిడి 39 వేలు, అరటి 38 వేల ఎకరాల చొప్పున మొత్తం 2 లక్షల ఎకరాల్లో విస్తరించాయి. మిగతా అన్ని పంటలు మరో 1.20 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. అయితే ఈ ఏడాది మార్కెట్ నిరాశాజనకంగా ఉండటంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. మరీ ముఖ్యంగా చీనీ, టమాట పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మద్దతు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టడం లేదు. ● చీనీ సీజన్ ప్రారంభమైన జనవరి నుంచి మద్దతు ధర దక్కడం లేదు. వేసవి ఆరంభమైనా ధర పెరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలన్నర రోజులుగా అనంతపురం వ్యవసాయ మార్కెట్యార్డులో టన్ను రూ.7 వేల నుంచి రూ.15 వేలు, ప్రస్తుతం రూ.22 వేలకు పరిమితమైంది. టన్ను రూ.35 వేల నుంచి రూ.40 వేలు లభిస్తే కానీ గిట్టుబాటు కాదంటున్నారు. ఈసారి గత నవంబర్, డిసెంబర్లో తుపాన్ వల్ల చిరుజల్లులు కురవడం, జనవరి, ఫిబ్రవరిలో విపరీతమైన చలి వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడలు సోకకుండా చీనీ తోటల్లో 10 నుంచి 15 విడతల పాటు పురుగుమందులు పిచికారీ చేయడంతో పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోటన్ను రూ.15 వేలు, రూ.20 వేలు అంటే ఏ మాత్రమూ గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● టమాట.. మరో జాక్పాట్గా పంటగా మారిపోయింది. జిల్లా నలుమూలలా టమాట సాగు చేశారు. జనవరి 15 నుంచి అనంతపురం శివారులోని కక్కలపల్లి మార్కెట్లో టమాట కిలో రూ.4, రూ.6, రూ.7 ఇలా సింగిల్ డిజిట్కే పరిమితమైంది. కిలో రూ.20 పలికితే కానీ రైతులకు గిట్టుబాటు కాదని చెబుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో చీడపీడల వ్యాప్తి బాగా పెరగడంతో పిచికారీకి పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. కానీ మార్కెట్ నిలకడ లేకుపోవడంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. ● అరటి రైతుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది. పది రోజుల కింద టన్ను రూ.25 వేలు ఉండగా ఇప్పుడు రూ.15 వేలకు పతనమైంది. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు తగ్గే పరిస్థితి ఉండటంతో అరటి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నుంచి ఏప్రిల్ వరకు మొదటి పంట కింద అరటి పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగే పరిస్థితి ఉంది. ● రేపో మాపో మార్కెట్కు రానున్న మామిడి రైతులకు కూడా ధరల భయం పట్టుకుంది. వేసవి మండుతున్నా కర్బూజా, కళింగర ధరలు కూడా తగ్గిపోయాయి. గతేడాది రాష్ట్రస్థాయిలో హార్టికల్చర్ కాంక్లేవ్ నిర్వహించి ఉద్యాన రంగానికి చేయూత ఇస్తామని భరోసా కల్పించిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం ఇప్పుడు రిక్తహస్తం చూపిస్తుండటంతో ఉద్యాన రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. రాయలసీమను ఉద్యానహబ్గా మార్చుతామని, ఇటీవల బడ్జెట్లోనూ ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు సర్కారు చెబుతున్న మాటలకు.. చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
అర్హత లేకున్నా అందలం
అనంతపురం: ప్రాధాన్యత లేని పోస్టు నుంచి ఆయన ఏకంగా కీలక అధికారి స్థానం దక్కించుకున్నారు. జాబితాలో లేని పోస్టును యూజీసీ పే స్కేల్ కింద చూపుతూ ఇంక్రిమెంట్ అరియర్స్ పేరిట రూ.43 లక్షలకు ఫైలు సిద్ధం చేశారు. ఆడిటింగ్ విభాగంలో అభ్యంతరం లేకుండా ఫైలు ముందుకు పంపేలా సంబంధిత అధికారులకు ‘ఎర’ వేసినట్లు సమాచారం. ఉన్నతాధికారి ‘అధికార దుర్వినియోగం’ ఇప్పుడు ఎస్కే యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. ఇలా ఎగబాకేశారు! శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆయన మొదట రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ అసిస్టెంట్గా చేరారు. అనంతరం రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా హోదాను మార్పు చేశారు. యూజీసీ పే స్కేల్ కింద జీతం పొందాలంటే తప్పనిసరిగా నిర్దేశించిన పోస్టుల్లోనే పనిచేస్తుండాలి. 2016 యూజీసీ పే స్కేల్ పొందడానికి నిర్దేశించిన జాబితాలో ‘రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్’ పోస్టు లేదు. అయినా యూజీసీ పే స్కేల్ జాబితాలో ఈ పోస్టు ఉన్నట్లు రికార్డుల్లో చూపి.. పెద్ద మొత్తంలో జీతం ‘ఫిక్స్’ చేసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఇంక్రిమెంట్ అరియర్స్ రూ.43 లక్షలు రావాల్సి ఉందని ప్రతిపాదనలు సిద్ధం చేసి, బిల్లును రాష్ట్ర ఆడిటింగ్ విభాగానికి పంపారు. రేపో.. మాపో ఆడిటింగ్ అధికారుల ఆమోదం పొందితే సదరు బిల్లు ఉన్నతాధికారి ఖాతాలో జమవుతుంది. అలా చక్రం తిప్పేస్తున్నారు.. యూజీసీ జాబితాలో లేని రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరి.. యూజీసీ పే స్కేల్ పొందుతున్నారు. తాజాగా యూనివర్సిటీలో కీలక పదవుల్లో ఒక్కటైన రిజిస్ట్రార్ పీఠం ఎక్కారు. ఉద్యోగుల జీతాలు, ఇతర బిల్లులకు ఆమోదం తెలిపే స్థాయికి ఎదిగారు. వాస్తవానికి అసోసియేట్ ప్రొఫెసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ హోదాలో ఉన్నవారే రిజిస్ట్రార్ పదవికి అర్హులు. కానీ ప్రాధాన్యత లేని పోస్టులో ఉండి.. రిజిస్ట్రార్గా కొనసాగుతూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలను సదరు అధికారి ఎదుర్కొంటున్నారు.జాబితా లేకున్నా ఫర్వాలేదు ఇంక్రిమెంట్ అరియర్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. 1996 యూజీసీ పే స్కేల్లో రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టు ఉంది. తాజాగా యూజీసీ పే స్కేల్లో లేకపోయినా..ఫర్వాలేదు. అప్పట్లో ఆ పోస్టు ఉంది కాబట్టి.. యూజీసీ పే స్కేల్కు క్లెయిమ్ చేసుకున్నాను. – రమేష్ బాబు, రిజిస్ట్రార్, ఎస్కేయూ ఆపై అధికార దుర్వినియోగం యూజీసీ పే స్కేలు పొందేందుకు ఎత్తుగడ రూ.43 లక్షల ఇంక్రిమెంట్ అరియర్స్ కోసం క్లెయిమ్ ఎస్కేయూ ఉన్నతాధికారి తీరుపై సర్వత్రా విమర్శలు -
బైక్ కొనివ్వలేదని రైలు కింద పడ్డాడు!
తాడిపత్రి రూరల్: ద్విచక్ర వాహనం కొనివ్వలేదని ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో నివాసముంటున్న నాగేంద్ర, కళావతి దంపతుల కుమారుడు సాయికిరణ్ (21) టైల్స్ పరిచే పనులకు వెళుతూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. తనకు ఓ ద్విచక్ర వాహనం కొనివ్వాలంటూ వారం రోజులుగా తల్లిదండ్రులను కోరుతున్నాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, కాస్త కుదుట పడగానే బైక్ కొందామంటూ తల్లిదండ్రులు నచ్చచెబుతూ వచ్చేవారు. అయితే బైక్ కొనాలన్న తన ఆకాంక్ష ఎన్నటికీ నెరవేరదని భావించిన సాయికిరణ్ క్షణికావేశంలో ఆదివారం రాత్రి తాడిపత్రి – చల్లవారిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య మార్గంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సోమవారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలంలో లభ్యమైన సెల్ఫోన్ నంబర్ల ఆధారంగా మృతుడిని సాయికిరణ్గా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ తెలిపారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభంఅనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలిరోజు జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 2,113 మంది అభ్యర్థులకు గాను 1,850 మంది హాజరయ్యారు. 263 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ ప్రసాద్బాబు వివిధ కేంద్రాలను పరిశీలించారు. టీచర్ల సీనియార్టీ జాబితాలు సిద్ధం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ యాజమాన్యాల్లో పని చేస్తున్న ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబితాను సిద్ధం చేసినట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టిస్) ఆధారంగా జాబితాను తయారు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా అధికారిక వెబ్సైట్ deoanantapur.blogspot. comలో జాబితా ఉంచినట్లు తెలిపారు. ఈ జాబితాపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 9లోగా (పని దినాల్లో) డీఈఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. అభ్యంతరం తెలిపే టీచరు పూర్తిపేరు, హోదా, సంబంధిత వివరాలు, జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పొందుపరచాలని పేర్కొన్నారు. ఆధారాలు, సంబంధిత సాక్ష్యాలు జత చేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కార కమిటీ అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. -
ఆర్ట్స్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సందడి
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థులు సందడి చేశారు. 1976 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. 1976లో సీపీజెడ్ గ్రూప్ నుంచి 21 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఇక్కడ చదువుకుని 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకున్నారు. కళాశాలతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తమ అధ్యాపకులు వాసుదేవరావు, సుబ్బన్న, మాధవరావు, కృపాకర్, శ్రీనివాస్ శెట్టి, లక్ష్మీనారాయణ తదితరులను గుర్తు చేసుకున్నారు. ఈ బ్యాచ్కు చెందిన డి. ప్రవీణ జిల్లా జడ్జిగా పనిచేసి ప్రస్తుతం మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా ఉండటం తమకు గర్వంగా ఉందన్నారు. 2006–2008 బ్యాచ్ విద్యార్థులు.. 2006 నుంచి 2008 వరకు బయో కెమిస్ట్రీ విభాగంలో చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ బ్యాచ్కు చెందిన మోహన్ బాబు బెంగళూరులోని ప్రముఖ సంస్థలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. డాక్టర్ మారుతి హర్యానాలోని సెంట్రల్ యూనివర్సిటీలో హెచ్ఓడీగా, శివాజీ, రవికుమార్, సురేంద్ర, వన్నూరు స్వామి ప్రభుత్వ కొలువుల్లో క్రియాశీలక పదవుల్లో ఉన్నట్లు తెలిపారు. 2007 బ్యాచ్ గణేష్, తిరుమణి సచివాలయాల్లో పని చేస్తున్నారు. 2008 బ్యాచ్కు చెందిన గోపాల్ కంటి వైద్య సహాయ నిపుణుడిగా సేవలందిస్తున్నాడు. మురళీకృష్ణ, శివకృష్ణ, ఫ్యాన్సీ ప్రియాంక, ఉచ్చురప్ప, ఓబుల్ రెడ్డి ప్రభుత్వ సంస్థల్లో క్రియాశీలక పదవుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా గురువులు ధనుంజయ, జీఎల్ఎన్ ప్రసాద్, శివచంద్ర, పద్మశ్రీలను సన్మానించారు. -
హంస వాహనంపై వీణాపాణి
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు ఆదివారం రాత్రి వీణాపాణిగా హంస వాహనంపై చదువుల తల్లి సరస్వతి అవతారంలో తిరు వీధుల్లో దర్శనమిచ్చారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టు పీతాంబరాలు ధరించిన స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మికానందంలో మునిగితేలారు. ఉభయ దారులుగా పట్టణానికి చెందిన తోటంశెట్టి రాజుగోపాల్శెట్టి కుటుంబీకులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రహ్మ వాహనమైన హంసకు ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచి, చెడును గ్రహించ గలిగిన అపురూపమైన శక్తి దీని సొంతం. అందుకే ఉపనిషత్తులు పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. హంస వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో ఊరేగుతున్న నారసింహుడిని దర్శించుకుంటే అహంభావాన్ని తొలగించి శరణాగతిని కల్గిస్తాడని అర్చక పండితులు తెలిపారు. నేడు సింహ వాహనం.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు సింహ వాహనంపై దర్శనమిస్తారు. మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని లోకానికి చాటిచెప్పడానికే శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతారని భక్తుల నమ్మకం. యాగశాల ప్రవేశం, నిత్యహోమాలతో ప్రారంభమై శ్రీవారి తిరువీధుల మంటపోత్సవం నిర్వహిస్తారు. యాగశాలలో ఉదయం పుణ్యాహవచనం జరిపి వాస్తు, అగ్ని ప్రతిష్ట చేస్తారు. రాత్రివేళ స్వామివారు తిరువీధుల్లో విహరిస్తారు. -
దుబాయిలో చిక్కుకున్న దుర్గం వాసులు
కళ్యాణదుర్గం: విధి నిర్వహణలో ప్రతిభ కనబరచి విదేశీ పర్యటనకు వెళ్లిన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ముగ్గురు యువకులు యుద్ధ వాతావరణం నేపథ్యంలో దుబాయిలో చిక్కుకుపోయారు. ప్రస్తుతం వారంతా ఓ లాడ్జిలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి. ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ సంస్థలో బాగా పనిచేసిన ఉద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 మందిని విదేశీ పర్యటనకు ఎంపిక చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన కురబ ఎర్రిస్వామి, ఒంటిమిద్దికి చెందిన తలారి రామాంజినేయులు, కంబదూరు మండలం రాంపురానికి చెందిన చిన్నయ్యకు అవకాశం లభించింది. వీరు విదేశీ పర్యటన ముగించుకుని శనివారం రాత్రి 11 గంటలకు దుబాయి నుంచి స్వదేశానికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఈ సమయంలో విమానశ్రయంపై దాడుల నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇజ్రాయెల్– ఇరాన్– అమెరికా మధ్య యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం అందండంతో వారు బుర్జ్ ఖలిఫా సమీపంలోని ఒక లాడ్జిలో సురక్షితంగా ఉన్నట్లు ఆదివారం కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపారు. అయితే ఎయిర్ పోర్టు నుంచి లాడ్జికి చేరుకున్న వెంటనే దుబాయి విమానశ్రయంపై దాడులు జరగడం గమనార్హం. ‘ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నాం. కానీ నిమిషానికో రకంగా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. త్వరలోనే క్షేమంగా ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాం’ అని బోరంపల్లికి చెందిన కురబ ఎర్రిస్వామి ‘సాక్షి’తో ఫోన్లో తెలిపారు. కంట్రోల్ రూముల ఏర్పాటు.. అనంతపురం అర్బన్: ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో కలెక్టరేట్తో పాటు ఆర్డీఓ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం వెల్లడించారు. ఇరాన్, ఇజ్రాయిల్, తదితర దేశాల్లో చిక్కుకున్న వారి సమాచారం, సహాయం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము నంబర్లకు వారి బంధువులు ఫోన్ ద్వారా సంప్రదించాలని సూచించారు. లాడ్జిలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం -
దూసుకొచ్చిన మృత్యువు
కళ్యాణదుర్గం రూరల్: వివాహ కార్యక్రమంలో పాల్గొని.. బంధుమిత్రులతో సరదాగా గడిపి తిరుగు పయనమైన వారిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. మలుపు సమీపంలో ఆర్టీసీ బస్సు కారును వేగంగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మూడు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో సంఘటన స్థలం.. ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటింది. బతుకుదెరువు కోసం వలస.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు నుంచి పలు కుటుంబాలు బతుకుదెరువు కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వలస వెళ్లాయి. అలా వెళ్లిన వారిలో రక్తసంబంధీకులైన హనుమంతరాయుడు (40), శివకుమార్ (35), చంద్రకళ (32) కుటుంబాలు ఉన్నాయి. వీరు అక్కడ దోబీ (చాకలి) పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను అక్కడే చదివించుకుంటున్నారు. దూసుకొచ్చిన మృత్యువు.. కర్ణాటక రాష్ట్రం మొలకాల్మూరులో బంధువుల వివాహం ఉండటంతో హనుమంతరాయుడు, శివకుమార్, చంద్రకళ శనివారం బెంగళూరు నుంచి కారులో వచ్చారు. అక్కడ రాత్రంతా పెళ్లి వేడుకల్లో మునిగితేలారు. ఆదివారం ఉదయం పెళ్లి ముగిశాక భోజనాలు ముగించుకుని తిరుగుపయనమయ్యారు. కళ్యాణదుర్గం ప్రాంతంలోని బంధువులను కలిసివెళ్లాలనుకున్నారు. ఈ మేరకు కారులో బయల్దేరారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి మలుపు సమీపంలోకి చేరుకోగానే రాయదుర్గం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ02 జెడ్ 0469) వేగంగా దూసుకొచ్చింది. అదీ కుడివైపునకు ఎక్కువగా వచ్చేయడంతో కారు పక్కకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో బస్సు.. కారుమీదకెక్కింది. అంతే డ్రైవింగ్ చేస్తున్న శివకుమార్, వెనక కూర్చున్న హనుమంతరాయుడు, చంద్రకళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. హనుమంతరాయుడుకు భార్య నాగలక్ష్మి, కొడుకు, కూతురు ఉన్నారు. చంద్రకళకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇక శివకుమార్ అవివాహితుడు. చంద్రకళ, శివకుమార్ అన్నాచెల్లెలు. వీరి పెద్దనాన్న కుమారుడు హనుమంతరాయుడు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. దేవుడా ఎంత పనిచేశావయ్యా..! హనుమంతరాయుడు, శివకుమార్, చంద్రకళ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలుసుకున్న బంధువులు ఆస్పత్రికి చేరుకుని రోదించారు. పెళ్లిలో ఎంతో సంతోషంగా గడిపిన వీరు విగతజీవులుగా మారిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దేవుడా ఎంత పని చేశావయ్యా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒకేసారి ముగ్గురు మరణించడంతో స్వస్థలం ముదిగల్లు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గూబనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం కారులోని ముగ్గురు దుర్మరణం మృతులందరూ రక్తసంబంధీకులే -
పశుశాఖ ఔట్సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వరప్రసాద్
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖ హాస్పిటల్ అటెండెన్స్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన సి.వరప్రసాద్ ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ట్రస్థాయి సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడుగా గుంటూరు జిల్లాకు చెందిన అనిల్తో పాటు నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన వరప్రసాద్కు అవకాశం కల్పించడంతో ఆ శాఖ ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సంతోష్ అనంతపురం అర్బన్: ఏఐవైఎఫ్ (అఖిల భారత యువజన సమాఖ్య) రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన జి.సంతోష్కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు అభినందన సభ ఏర్పాటు చేసి సంతోష్కుమార్ను ఘనంగా సన్మానించారు. సభకు సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. యువజనుల సమస్యలపై పోరాటం చేస్తున్న సంతోష్కు గౌరవప్రదమైన గుర్తింపు దక్కిందన్నారు. మరింత శక్తివంతంగా పనిచేసి యువజన హక్కుల సాధనకు పోరాటాలు సాగించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రమణయ్య, కుళాయిస్వామి, కోట్రేశ్, ధనుదేవ, శ్రీనివాస్, వెంకటనాయక్, మంజూనాథ్, చందు, సమీర్, సాయి, తదితరులు పాల్గొన్నారు. మెగా వైద్య శిబిరానికి స్పందన కుందుర్పి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బసాపురం గ్రామానికి చెందిన దివంగత వీఆర్ఓ రామలింగారెడ్డి, ఆయన భార్య దివంగత ప్రమీళ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు, ఆర్ఎస్ఎస్ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ లాయర్ మల్లారెడ్డి, శాంతకుమారి తదితరులు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా 800 మందికి చిత్తూరు, అనంతపురానికి చెందిన వైద్యులు కీళ్లు, ఎముకలు, నరాలకు సంబంధించిన వైద్యపరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రోగులకు భోజనంతో పాటు పండ్లు,మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. -
గుట్టుగా ఆలయ ఆభరణాల అప్పగింత
రాయదుర్గం: ప్రసిద్ధ క్షేత్రమైన నేమకల్లు ఆంజనేయస్వామి ఆభరణాల లెక్కల విషయంలోనూ స్పష్టత కొరవడింది. ‘దేవుడి సొత్తు భద్రమేనా?’ అనే కథనం గత నెల ఫిబ్రవరి 26న ‘సాక్షి’ లో ప్రచురితమైంది. దీనికి రాష్ట్ర, జిల్లా దేవదాయశాఖ అధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు బదిలీపై వెళ్లిన ఈఓ శ్రీనివాసులు మూడేళ్ల తర్వాత మూడు రోజుల క్రితం ఆగమేఘాలపై అంజన్న ఆలయం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుత ఈఓ నరసింహరెడ్డి, మరికొందరితో కార్యాలయంలో చర్చలు జరిపారు. భక్తులు, గ్రామస్తుల సమక్షంలో కాకుండా గుట్టుగా సర్దుబాటు జరపడం విమర్శలకు దారి తీసింది. దేవుడి సొత్తు ఉండేది ఎంత.. అప్పగించింది ఎంత.. పెండింగ్ సొమ్ము ఎంత.. స్వాధీనం చేసుకోవాల్సింది ఎంతో అందరికీ తెలియజేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సొమ్మంతా లాకర్లోనే భద్రపరిచారా? లేక బయటకు వెళ్లిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కలెక్టర్ విచారణ జరిపించాలని కోరుతున్నారు. దీనిపై దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జునను ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘నేమకల్లు ఆభరణాలు సత్వరం స్వాధీనం చేయాలని బదిలీపై వెళ్లిన ఈఓ శ్రీనివాసులకు ఆదేశించాం. ఆయన మూడు రోజుల క్రితం ఆలయం వద్దకు చేరుకుని ఈఓ నరసింహారెడ్డికి కొన్ని ఆభరణాలు అప్పగించారు. ఇంకా ఆభరణాలు ఇవ్వాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని ఆదేశించాం. లెక్కల్లో తేడా వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అన్నారు. గోప్యతపై ప్రజల అనుమానం -
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
కూడేరు: హైకోర్టు ఆదేశాలనే రెవెన్యూ అధికారులు ధిక్కరించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు ఆర్డీఓ తలొగ్గి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. సుమారు 80 ఏళ్లుగా సాగులో ఉంటూ భూహక్కులు కల్గిన వారికే నోటీసులిచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కూడేరు మండలం జల్లిపల్లిలో సర్వే నంబర్ 486లో 24.45 ఎకరాల భూమి ఉంది. అన్నదమ్ములైన బైరెడ్డి వెంకటరామిరెడ్డి, బైరెడ్డి పెద్దిరెడ్డి, బైరెడ్డి లింగారెడ్డి అనుభవంలో ఈ భూమి ఉంది. 1979లోనే వారికి రైతు వారి పట్టా ఇచ్చారు. ఈ భూమిని వారి కుటుంబ సభ్యులు బైరెడ్డి వరలక్ష్మి (వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి భార్య) 4.08 ఎకరాలు, బైరెడ్డి నాగమణి (బైరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు లక్ష్మిరెడ్డి భార్య) 4 ఎకరాలు, గోపాల్ రెడ్డి 1.20 ఎకరాలు, భూపతిరెడ్డి 4.07 ఎకరాలు, రాంకుమార్ రెడ్డి 4.08 ఎకరాలు, మహేశ్వరరెడ్డి 2.04 ఎకరాలు, బొజ్జ నందిని 2.03 ఎకరాలు, సురేంద్రనాథ్రెడ్డి 3 ఎకరాలు పంచుకుని సాగులో ఉన్నారు. 2007లో బైరెడ్డి రామచంద్రారెడ్డి (వైఎస్సార్సీపీ మండల కన్వీనర్) సోదరులు భాగపరిష్కారాలు చేసుకొని భూవివరాలను రెవెన్యూ రికార్డుల్లో కూడా నమోదు చేయించుకున్నారు. 2023లో బైరెడ్డి రామచంద్రారెడ్డి తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. రెవెన్యూ రికార్డు మేరకు ఆన్లైన్లో బైరెడ్డి వరలక్ష్మి పేరిట 4.08 ఎకరాలు, బైరెడ్డి నాగమణి పేరిట 4 ఎకరాలు భూమి ఉంది. సమస్య మొదలైంది ఇలా.. బైరెడ్డి రామచంద్రారెడ్డి మరో సోదరుడు మోహన్రెడ్డి వరలక్ష్మి, నాగమణి పేరిట ఉన్న భూమిలో కూడా భాగం కావాలని రెండేళ్ల క్రితం గొడవకు దిగాడు. దీంతో రామచంద్రారెడ్డి, లక్ష్మిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. భూ పంపకాల మేరకు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వరలక్ష్మి, నాగమణికే భూమి చెందుతుందని పోలీసులు చెప్పారు. అయితే అప్పటికి సమస్య సద్దుమణిగింది. చంద్రబాబు ప్రభుత్వం రాగానే... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మోహన్రెడ్డి టీడీపీ నేతలను ఆశ్రయించడం, వారి సూచన మేరకు రామచంద్రారెడ్డి, లక్ష్మీరెడ్డిలను భూమిలోకి రాకుండా అడ్డుకున్నారు. రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కావడంతో పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఆయన వాదనను పరిగణంలోకి తీసుకోలేదు. ఆధారాలుంటే ఇవ్వండి.. ఈ భూమి మీదే అనడానికి ఆధారాలుంటే తీసుకురావాలని మండల రెవెన్యూ అధికారులు గత ఏడాది నవంబర్లో నోటీసులు జారీ చేశారు. దీంతో రామచంద్రారెడ్డి, లక్ష్మీరెడ్డి పట్టా, సాగులో ఉన్నట్లు, ఆన్లైన్లో భూ వివరాల పత్రాలన్నింటిని రెవెన్యూ అధికారులకు అందజేశారు. రెవెన్యూ ఉన్నతాధికారులకు ఒత్తిళ్లు రావడంతో కింద స్థాయి అధికారులతో తప్పుడు నివేదికలను తయారు చేయించారు. జనవరి 29న అవి ఫేక్ డాక్యుమెంట్లు అని చెబుతూనే 30 రోజుల్లో ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవాలని నోటీసులు జారీ చేశారు. హైకోర్టును ఆశ్రయించిన బాధితులు.. బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఫిబ్రవరి 5న స్టేటస్ కో (యథాస్థితి) ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ ఆర్డీఓ ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ 6న ఆ భూమిని డిస్ప్యూట్లో పెట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఆర్డీఓ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీనిపై మళ్లీ కోర్టుకు వెళతామని బాధితులు బైరెడ్డి రామచంద్రారరెడ్డి, లక్ష్మిరెడ్డి చెబుతున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన ఆర్డీఓ ఫిబ్రవరి 5న స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు 6న డిస్ప్యూట్ ఆర్డర్ ఇచ్చిన ఆర్డీఓ వైఎస్సార్సీపీ కూడేరు మండల కన్వీనర్ రామచంద్రారెడ్డిని ఇబ్బంది పెడుతున్న వైనం -
నేడు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను రెవెన్యూ క్లినిక్లో తహసీల్దార్లకు అందజేయాలన్నారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను meeko sam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు. నేడు డయల్ యువర్ సీఎండీఅనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 89777 16661 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ.. అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 91547 90350లో ఫిర్యాదు చేయాలని కోరారు. మేలుజాతి పశుసంతతి పెంపుపై దృష్టి అనంతపురం అగ్రికల్చర్: మేలుజాతి పశు సంతతి పెంపుపై దృష్టి సారించినట్లు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్డీఏ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) డాక్టర్ జి.వెంకటేష్ తెలిపారు. లింగనిర్ధారిత వీర్యం (సెక్స్ సార్టెడ్ సెమన్–ఎస్ఎస్ఎస్) పథకం పటిష్టంగా అమలు చేస్తుండటంతో వచ్చే ఏడాది నుంచి వాటి ఫలితాలు వెల్లడికానున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కుప్పం ప్రాంతంలోనే పాడి పశువులు, గేదెలకు ఎస్ఎస్ఎస్ పథకం ద్వారా ఉచితంగా ఎద సూదులు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కృత్రిమ గర్భోత్పత్తి కింద ఎదసూదులు వేస్తే 90 శాతం వరకు పెయ్యదూడలు (ఫిమేల్) పుడతాయన్నారు. ఒక సారి వేస్తే ఎద కట్టని పశువులకు రెండోసారి కూడా ఉచితంగా ఇస్తామన్నారు. జిల్లాకు 35 వేల డోసులు ఎస్ఎస్ఎస్ వీర్యం సరఫరా కాగా అందులో 20 వేలకు పైగా డోసులు పశువులు, గేదెలకు వేశామన్నారు. ఇక నుంచి ప్రతి నెలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 వేల పశువులకు ఎదసూదులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రేపు నృసింహాలయం మూత కదిరి: చంద్రగహణం కారణంగా ఈ నెల 3వ తేదీన మంగళవారంఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మూసివేయనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ వి.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం మినహా భక్తులకు ఆ రోజు ఉదయం అల్పాహారంతో పాటు రాత్రి భోజనం అన్నదాన సత్రంలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. -
‘ఎకై ్సజ్ ’క్రీడా పోటీలు ప్రారంభం
అనంతపురం సెంట్రల్: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారుల క్రీడా పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య క్రీడా పోటీలను ప్రారంభించారు. రెండు రోజులు పాటు పోటీలు జరగనున్నాయి. నిత్యం పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులకు క్రీడా పోటీలతో మానసికోల్లాసం కలుగుతుందని నాగమద్దయ్య అన్నారు. మొదటిరోజు నిర్వహించిన వివిధ క్రీడల్లో ఉద్యోగులు ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రామ్మోహన్రెడ్డి, గోవిందనాయక్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు నరసింహులు, రేవితి, డీఎం వేణుగోపాల్రెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు జయనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మిల్క్ ఇన్స్పెక్టర్ల నిర్లక్ష్యం..
అనంతపురం అగ్రికల్చర్: పాల కల్తీ ప్రాణాలు హరిస్తోంది. ఇది వరకు పాలల్లో నీళ్లు మాత్రమే కలిపేవారు. ఇప్పుడు కొందరు అత్యాశకు పోయి నీళ్లతో పాటు రంగు, రుచి, చిక్కదనం కోసం యూరియా, ఫార్మలిన్, హైడ్రోజెన్ పెరాకై ్సడ్, మాల్డోడెక్స్ట్రిన్, డిటర్జెంట్స్ లాంటి రకరకాల ప్రమాదకర రసాయనాలు, హానికరమైన పదార్థాలు కలిపి పాల అమ్మకాలు చేస్తున్నారు. ఇలాంటి పాల కల్తీ దందా గుట్టును ఏడాది కిందటే జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేసిన విషయం తెలిసిందే. పాలలో హానికరమైన ‘మాల్డోడెక్స్ట్రిన్’ కలుపుతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి అప్రమత్తం చేశారు. తాజాగా రాజమండ్రిలో కల్తీపాలు తాగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది. పాలు ఉత్పత్తి, క్రయ విక్రయాలు, కల్తీ, నాసిరకం అనే అంశాలు తమకు సంబంధం లేదన్నట్లుగా పశు సంవర్ధక శాఖ అధికారులు మౌనం పాటిస్తున్నారు. పశువైద్యం, పశుసంతతి పెంపు, పథకాల అమలు వరకే తమ పని అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం జిల్లాలో రోజుకు ఎన్ని లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది, అందులో ప్రైవేట్ డెయిరీలు ఎన్ని సేకరిస్తున్నాయి, బయట వ్యాపారులు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు, ఇతరత్రా రూపాల్లో సాగిస్తున్న అమ్మకాల వివరాలు చెప్పడానికి కూడా నిరాకరిస్తున్నారు. రోజుకు 5 లక్షల లీటర్లు అని ఒక అధికారి, లేదు లేదు 8 నుంచి 10 లక్షల లీటర్లు ఉత్పత్తి అంటూ మరో అధికారి, అదీ కాదు... 13 లక్షల లీటర్లకు పైగా పాల ఉత్పత్తి జరుగుతోందని ఇంకో అధికారి... ఇలా కచ్చితమైన లెక్క చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాసిరకం, కల్తీపాలను అరికట్టాలనే ఆలోచనతో 2023లో అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పాల రక్షిత ప్రమాణాల అమలు చట్టం (మిల్క్యాక్ట్)ను తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ డెయిరీలు, ఇతరత్రా పాల సేకరణ, అమ్మకాలు సాగించే దుకాణాలు, ప్రాంతాల్లో పాల నాణ్యత తెలుసుకునే అధికారం పశు సంవర్ధక శాఖ అధికారులకు అప్పగించారు. జిల్లాలో ఉన్న వెటర్నరీ అసిస్టెంట్స్ సర్జన్స్ (వీఏఎస్) అందరూ ‘మిల్క్ ఇన్స్పెక్టర్లు’గా పనిచేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. మిల్క్యాక్ట్పై శిక్షణ కూడా ఇచ్చారు. మిల్క్ యాక్ట్ ప్రకారం పాల సేకరణ కేంద్రాలు (మిల్క్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు) తప్పనిసరిగా రూ.1,500 చెల్లించి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. ఏటా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. తనిఖీకి వచ్చినప్పుడు లైసెన్సు లేకుంటే మొదటి దఫా కింద రూ.50 వేల జరిమానా, రెండోసారి కూడా పట్టుబడితే రూ. లక్ష జరిమానా, ఆరు నెలల వరకు జైలుశిక్ష కూడా ఉంటుంది. కల్తీ, నాసిరకమని తేలితే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పాలు మంచి పోషక పదార్థం. అందుకే పసిబిడ్డ నుంచి పండు ముదుసలి వరకు ఆరోగ్యపరంగా పాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు కలిగిన పాలు తీసుకోవడం వల్ల అనారోగ్యాన్ని దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతుంటారు. కానీ.. మార్కెట్లో నాణ్యమైన స్వచ్ఛమైన పాలు లభించడం గగనమవుతోంది. వ్యాపారమే పరమావధిగా చేసుకుని పాలను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజార్యోగం ప్రమాదంలో పడిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మిల్క్ ఇన్స్పెక్టర్లు తరచూ పాల సేకరణ కేంద్రాలను తనిఖీ చేయాలి. పాల నాణ్యత పెంచి.. నాసిరకం, కల్తీని నివారించాలని మిల్క్యాక్ట్ చెబుతోంది. కానీ మిల్క్ ఇన్స్పెక్టర్లు తమ బాధ్యతల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ‘కల్తీ’ నిరాటంకంగా కొనసాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరం, పట్టణాలే కాదు.. ఇప్పుడు మారుమూల పల్లె ప్రాంతాల్లో కూడా ‘కల్తీ’ యథేచ్ఛగా సాగిస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటే తప్ప నాణ్యమైన పాలు, వాటి ఉత్పత్తులు ప్రజలకు అందే పరిస్థితి ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలు మాత్రమే కల్తీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పాల ద్వారా తయారయ్యే పెరుగు, మజ్జిగ, పాలపొడి, వెన్న, నెయ్యి, స్వీట్లు, ఐస్క్రీమ్, పన్నీర్, ఇతరత్రా బేకరీ ఉత్పత్తులు కూడా కల్తీ అయినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణసమస్యలు, కిడ్నీ, కాలేయ సమస్యలు, పేగుల వాపు, గ్యాస్ట్రిక్, విరేచనాలు తదితర ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు. రాజమండ్రి ఘటనతో పాల కల్తీపై సర్వత్రా ఆందోళన ఏడాది కిందట జిల్లాలో పాలకల్తీ గుట్టురట్టు చేసిన ‘విజిలెన్స్’ మిల్క్ యాక్ట్ ఉన్నా పట్టించుకోని పశుశాఖ మిల్క్ ఇన్స్పెక్టర్లు పశు శాఖ అధికారుల నిర్లక్ష్యం.. మిల్క్ యాక్ట్ ఏం చెబుతోందంటే.. -
అంగన్వాడీల సమర భేరి
తాడిపత్రి రూరల్: చంద్రబాబు ప్రభుత్వంపై అంగన్వాడీలు సమర భేరి ప్రకటించారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23 నుంచి 26 వరకు ప్రాజెక్టుల పరిధిలో రిలే నిరాహార దీక్షలు చేశారు. అలాగే 27న కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సోమవారం విజయవాడలో నిర్వహించనున్న మహా ధర్నాకు తరలివెళ్లారు. అయితే అంగన్వాడీలు మహాధర్నాలో పాల్గొనకుండా సీడీపీఓలు, సూపర్వైజర్లు బెదిరింపులకు దిగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 వేలకు పైగా... ఉమ్మడి అనంతపుం జిల్లాలో 10 వేల మందికి పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఉన్నారు. మొత్తం 5,125 అంగన్వాడీ సెంటర్లు ఉండగా అందులో అనంతపురం జిల్లాలో 2029 మెయిన్ అంగన్వాడీ సెంటర్లు, 223 మినీ సెంటర్లు ఉన్నాయి. రెండు నాలుకల ధోరణి.. అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారని, అలాగే న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నాలు, ఆందోళనలు చేసినా తాము అడ్డుకోమని చెప్పిన బూటకపు మాటాలను అంగన్వాడీలు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు అండ్ కో బూటకపు హామీలతో నిండా ముంచిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ వచ్చి 20 నెలలు దాటుతున్నా ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని, హామీలను అమలుకు గతంలో పలుమార్లు ధర్నాలు, నిరసనలు తెలియజేసినా ఏం ప్రయోజనం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు విజయవాడలో మహా ధర్నా పేరుతో కదం తొక్కుతున్నారు. ధర్నాను అడ్డుకునేందుకు ఎత్తులు.. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో అంగన్వాడీలు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగానే సోమవారం విజయవాడలో మహా ధర్నా చేపట్టనున్నారు. అయితే అంగన్వాడీలు ధర్నాలో పాల్గొనకుండా సీడీపీఓలు, సూపర్వైజర్ల ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. మహా ధర్నాకు వెళితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వారి హెచ్చరికలతో ఒకవైపు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆందోళన చెందుతున్నారు. మహా ధర్నాకు మాత్రం వెళ్లి తీరుతామని తేల్చి చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాల మేరకు అంగన్వాడీలను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. విజయవాడకు వివిధ మార్గాల ద్వారా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వెళ్లే అవకాశాలు ఉండటంతో బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద నిఘా ఉంచారు. గ్రామ సచివాలయ మహిళా పోలీసులకు కూడా వినియోగించుకుంటున్నారు. అంగన్వాడీ సెంటర్లను మూసివేసి ధర్నాకు వెళ్లే వారి వివరాలను సేకరించాలని వారికి పోలీసుశాఖ నుంచి అనధికార ఉత్తర్వులు వచ్చినట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు అండ్ కో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ నేడు విజయవాడలో మహా ధర్నా బెదిరింపులకు దిగుతున్న అధికారులు, పోలీసులు అంగన్వాడీలకు కనీసం నెలకు రూ.26 వేల వేతనం ఇస్తాం గ్రాట్యూటీ అమలు చేస్తాం అంగన్వాడీలకు పదోన్నతులు కల్పిస్తాం పెండింగ్లో ఉన్న ఇంటి అద్దెలు, టీఏ బిల్లులు మంజూరు చేస్తాం మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇస్తాం తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తాం ఎన్నికలప్పుడు కూటమి నేతలు ఇచ్చిన హామీలు ప్రభుత్వం మెడలు వంచుతాం చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచి వారు ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా పోరాడుతాం. గతంతో టీడీపీ ప్రభుత్వం అంగన్వాడీలు చేస్తున్న ఆందోళలను అణిచివేయడానికి గుర్రాలతో తొక్కించినా భయపడలేదు. ప్రస్తుతం మహా ధర్నాను అడ్డుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తోంది. అనేక రకాలుగా భయపడిస్తోంది. ధర్నాకు వెళ్లకుండా ఒత్తిడులు చేస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. – శకుంతల, అనంతపురం జిల్లా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు బెదిరింపులకు భయపడం చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతున్నా అంగన్వాడీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అందుకే మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఇందులో భాగంగానే విజయవాడలో మహాధర్నాకు పిలుపునిచ్చాము. అయితే చంద్రబాబు ప్రభుత్వం వివిధ రకాలుగా ధర్నాను అడ్డుకునేందుకు, అంగన్వాడీలపై బెదిరింపులకు దిగింది. వాటికి భయపడే ప్రసక్తేలేదు. ధర్నాను అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమైన చర్య. న్యాయమైన హామీలను నేరవేర్చుకునేందుకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. – రమాదేవి, ఉమ్మడి అనంతపురం జిల్లా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేత -
జేవీవీ పోరాట పటిమ మరింత పెరగాలి
అనంతపురం కల్చరల్: సమాజంలో పెరిగిపోతున్న మూఢనమ్మకాలను తొలగించడంతో పాటు శాసీ్త్రయ దృక్పథఽ సమాజ నిర్మాణంలో జేవీవీ మరింత పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానవ హక్కుల వేదిక రాష్ట్ర నేత చంద్రశేఖర్ అన్నారు. జన విజ్ఞాన వేదిక 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం రాత్రి అనంతపురంలోని ఎన్జీఓ హోమ్లో నిర్వహించారు. చంద్రశేఖర్తో పాటు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, డాక్టర్ కొండయ్య, తరిమెల అమరనాథరెడ్డి మానవ హక్కుల సంఘం ఎస్ఎం బాషా తదితరులు మాట్లాడారు. దేశంలో మతోన్మాదం బాగా పెరిగిపోతోందని, ఇలాంటి తరుణంలో సమాజంలో అందరూ మానవులే అనే స్పృహను రగిలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు తరగతి గదిని ఆలంబనగా మార్చుకోవాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జేవీవీ సభ్యులు డాక్టర్ ప్రసూన, డాక్టర్ వీర్రాజు, నాయక్, రాజ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. 3న పెన్నహోబిలం ఆలయం మూసివేత ఉరవకొండ రూరల్: ఈ నెల 3న చంద్ర గ్రహణం కారణంగా పెన్నహోబిలంలోని లక్ష్మీనరిసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ తిరుమలరెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం 9 గంటలకు ద్వారాలు మూసి వేయనున్నారు. బుధవారం ఉదయం ఆలయ శుద్ధి అనంతరం విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. సరస్వతీ కటాక్షం కలగాలి అనంతపురం ఎడ్యుకేషన్: తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న పదో తరగతి విద్యార్థులందరిపై సరస్వతీ కటాక్షం కలగాలని సమగ్రశిక్ష ఏపీసీ శైలజ ఆకాంక్షించారు. శనివారం అనంతపురంలోని కృష్ణదేవరాయ నగరపాలకోన్నత పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట, ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఏపీసీ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ అనంతపురం సెంట్రల్: రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ((ఏపీబీఓసీడబ్ల్యుడబ్ల్యుబీ) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నాలుగు రకాల పథకాలకు అర్హులైన కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ లక్ష్మీనరసయ్య శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మ్యారేజ్ గిఫ్ట్ స్కీమ్, మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్, సాధారణ డెత్ రిలీఫ్ స్కీమ్, ఫెనరల్ ఎక్స్పెన్షస్ స్కీమ్లకు సంబంధించి ఈ నెల 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పూర్తి వివరాలకు అనంతపురంలోని సహాయ కార్మిక అధికారి–1 (94925 55190), సహాయ కార్మిక అధికారి–2 (94925 55191), గుత్తి (94925 55192), గుంతకల్లు (94925 55193), తాడిపత్రి(94925 55192), రాయదుర్గం (94925 55199) నంబర్లలో సంప్రదించి, దరఖాస్తులను ఆయా కార్యాలయాల్లో అందజేయాలి. సెంట్రల్ వర్సిటీలో జాతీయ సదస్సు అనంతపురం: సెంట్రల్ వర్సిటీ ఆఫ్ ఏపీలో మానసిక శాస్త్ర విభాగంలో ‘న్యూరో సైకాలజికల్ అసెస్మెంట్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ అంశంపై శనివారం జాతీయ సదస్సు జరిగింది. వర్సిటీ డీన్ (అకడమిక్స్) ప్రొఫెసర్ సి.షీలారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్బీ కివడే, మానసిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఆకృతి శ్రీవాస్తవ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చెల్లీ కావ్య, క్లినికల్ సైకాలజిస్ట్ ఎస్.సమర్పిత తదితరులు ప్రసంగించారు. భావోద్వేగాలు, ప్రవర్తనల మధ్య ఉన్న సంబంధాన్ని విశదీకరించారు. -
టీడీపీ నేతల జగడం
శింగనమల: టీడీపీ నేతల కుమ్ములాట కారణంగా ఓ గిరిజన గ్రామంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. పోలీసులు, పంచాయతీ రాజ్ అధికారుల సమక్షంలోనే తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు చివరకు సాయంత్రం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఇంటి వద్ద పంచాయితీకి కూర్చొదమంటూ నిర్ణయించుకున్నారు. వివరాల్లోకి వెళితే... మూడేళ్ల క్రితం శింగనమల మండలం నాగులగుడ్డం తండా పంచాయతీని ప్రధాన మంత్రి ధర్తి అభజన జాతీయ ఉత్కర్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో పంచాయతీ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.48 లక్షలు, తాగునీటి పైప్లైన్ ఏర్పాటుకు రూ.25 లక్షలు, పంచాయతీ భవనం నిర్మాణానికి రూ.35 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులు చేపట్టే విషయంలో టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి రెండేళ్లుగా ఘర్షణ పడుతూ వస్తున్నారు. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో రూ.48 లక్షలతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు శనివారం పంచాయతీరాజ్ డీఈ జ్యోతి, మండల ఇన్చార్జ్ ఇంజనీర్ అనిల్కుమార్రెడ్డి నాగులగుడ్డం తండాకు చేరుకున్నారు. స్థానికులతో కలసి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీస్తుండడంతో సమాచారం అందుకున్న సీఐ కౌలుట్లయ్య, ఏఎస్ఐ చితంబరి, సిబ్బంది అక్కడకు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పనులు తమకు కేటాయించారంటే తమకు కేటాయించారని అధికారుల ముందే టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అయినా గొడవ ఆగలేదు. పీఆర్ డీఈ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నిధులు మురిగిపోకుండా ఉండేందుకు సిబ్బందితో పనులు పూర్తి చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సహకరించాలని అభ్యర్థించారు. అయినా టీడీపీ నేతల్లో మార్పు రాలేదు. చివరకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఇంటి వద్ద సాయంత్రం పంచాయితీ ఏర్పాటు చేసి తేల్చుకుంటామని, అప్పటి వరకూ పనులు సాగిస్తే పరిస్థితి మరో రకంగా ఉంటుందంటూ అధికారులను హెచ్చరించి వెళ్లిపోయారు. దీంతో పనులను అధికారులు ఆపేశారు. సీసీ రోడ్డు పనులు చేపట్టకుండా అధికారులను అడ్డుకున్న వైనం పంచాయతీ రాజ్ డీఈ, సీఐతో వాగ్వాదం సాయంత్రం ఎమ్మెల్యే వద్ద పంచాయితీ చేసుకుందామని నిర్ణయం -
నా కూతుళ్లిద్దరినీ శంకరే చంపేశాడు
సాక్షి, టాస్క్ఫోర్స్: ‘‘నాకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. నా ఇద్దరు కూతుళ్లను బొమ్మ శంకర్ చంపేశాడు. నా పెద్దకూతురు గౌతమిని ప్రేమించానంటూ వెంటబడి మోసం చేయగా.. గతంలోనే ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం నా రెండో కుమార్తె గీతను అదే ప్రేమపేరుతో లొంగదీసుకొని వివాహం చేసుకుని రోజూ వేధించాడు. ఫిబ్రవరి 26న కొట్టి చంపి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. నాకు జరిగిన అన్యాయంపై రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు నిందితుడికే వత్తాసు పలుకుతున్నారు’’ అంటూ పేరూరు పంచాయతీ కురుగుండ్లకాలనీకి చెంజిన ఓబుళమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఫిబ్రవరి 26న రామగిరి మండలంలోని పేరూరు పంచాయతీ కురుగుండ్లకాలనీకి చెందిన హరిజన గీత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, తన కూతురిది ఆత్మహత్య కాదంటూ మృతురాలి తల్లి ఓబుళమ్మ మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలంటూ పోలీసులను కోరుతోంది. కానీ పోలీసులు సరిగా స్పందించకపోవడంతో శనివారం ఆమె కన్నీరుమున్నీరవుతూ తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన ఇద్దరు కుమార్తెల మరణాలకు కారకుడైన బొమ్మ శంకర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రామగిరి పోలీసులు కేసును తారుమారుచేసి పక్కదారి పట్టిస్తున్నారని, త్వరలోనే కుటుంబీకులతో కలిసి ఎస్పీని కలిసి తన గోడు వెళ్లబోసుకుంటానని వెల్లడించింది. ప్రేమ పేరుతో ఒకరిని, పెళ్లి చేసుకుని మరొకరిని వేధించి ప్రాణాలు తీశాడు రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేస్తే నేరస్తుడి వైపే నిలిచారు తన ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన ఓబుళమ్మ -
కళ్యాణదుర్గంలో అరుదైన ఘటన
కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని మల్లికార్జునపల్లిలో శనివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. జెడ్పీహెచ్ఎస్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్న భ్రమరాంబ ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం అభినందన, సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా అనూహ్యంగా ఆమెకు విద్యాబుద్ధులు నేర్పిన విశ్రాంత ఉపాధ్యాయుడు బండయ్య మాస్టర్ అక్కడ ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. 103 ఏళ్ల వయసున్న ఆయన తన శిష్యురాలిని సన్మానించి, ఆశీర్వదించారు. దశాబ్దాల క్రితం పాఠాలు చెప్పిన గురువు చేతుల మీదుగా సన్మానం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతమని భ్రమరాంబ పేర్కొన్నారు. అనంతరం బండయ్య మాస్టర్ను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. -
●వైభవంగా నెట్టికంటుడి ప్రతిష్టాపన
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం నూతనంగా నిర్మించిన బాలాలయంలో నెట్టికంటుడి ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. గర్భాలయ నిర్మాణం నేపథ్యంలో మూలవిరాట్ దర్శనాన్ని నిలిపివేసిన అధికారులు.. ఆలయ ధ్వజస్తంభం వద్ద బాలాలయాన్ని నిర్మించి ఆంజనేయస్వామి ప్రతిమను ప్రతిష్టింపజేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమ సలహాదారుల ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు, ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో బాలాలయంలో స్వామివారిని ప్రతిష్టించి ప్రాణప్రతిష్ట చేశారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, దాత పెరవలి పారా విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
సీమ ఎత్తిపోతలపై వైఎస్సార్సీపీ ఉద్యమం
● నేడు కడపలో 10 జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం ● కార్యాచరణ ప్రణాళికతో ఉద్యమానికి బాటలు కడప కార్పొరేషన్: రాయలసీమ ప్రాంతానికి జీవనాడి అయిన సీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది. ఇటీవల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం ఉదయం 10 గంటలకు కడప శివారులోని రామాంజనేయపురంలో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్లో భారీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, గ్రేటర్ రాయలసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్ర కో ఆర్డినేటర్ సాకే శైలజానాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, పార్టీ సీఈసీ, ఎస్ఈసీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శులు హాజరు కానున్నారు. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని వైఎస్సార్ కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులంతా సమావేశంలో పాల్గొననున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి, ‘సీమ’కు ప్రాణప్రదమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రభుత్వ మెడలు వంచి పూర్తి చేయించేందుకు చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలు, సభలు వంటి కార్యక్రమాలను ఇందులో తీర్మానించనున్నారు. -
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఉత్సవం
లక్ష్మీనరసింహస్వామికి పూజలు చేస్తున్న దృశ్యం ఊరేగింపుగా ఉత్సవమూర్తులను తీసుకెళుతున్న భక్తులు బొమ్మనహాళ్ మండలంలోని ఉప్పరహాళ్లో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవం శనివారం వేలాది భక్తుల నడుమ వైభవంగా సాగింది. ఉదయం 10 గంటలకు శ్రీవారి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా ఉద్దేహళ్ సమీపంలోని వేదవతి హగరి నదికి తీసుకెళ్లారు. నది జలాలతో స్నానాదులు చేయించిన అనంతరం విశేష అలంకరణతో సాయంత్రం వరకూ అక్కడే కొలువుదీర్చారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు పూజల్లో పాల్గొని పొర్లుదండాలతో మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలో రాత్రంతా ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. – బొమ్మనహాళ్ -
చేనేత కార్మికుడి బలవన్మరణం
ధర్మవరం అర్బన్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని టీచర్స్కాలనీలో నివాసముంటున్న గుర్రం చంద్రశేఖర్ (40)కు భార్య శశికళ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ముడి సరుకు, కుటుంబ పోషణకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.7 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ క్రమంలో తాను తయారు చేసిన చీరలకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న చంద్రశేఖర్ శుక్రవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం నిద్రలేచిన మృతుని భార్య శశికళ.. ఉరికి విగతజీవిగా వేలాడుతున్న భర్తను చూసి బోరున విలపించింది. రెండో పట్టణ సీఐ రెడ్డప్ప దర్యాప్తు చేపట్టారు. -
మామిడి తోట దగ్ధం
బొమ్మనహళ్: నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లులో రైతు సురేంద్రబాబుకు చెందిన మామిడి తోట దగ్ధమైంది. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన మేరకు... తన పక్క పొలం గట్టుపై ఉన్న ఎండుగడ్డికి ఆ పొలం యజమాని శనివారం నిప్పు పెట్టాడు. దీంతో మంటలు చెలరేగి సురేంద్రబాబు మామిడి తోటను చుట్టుముట్టాయి. రెండేళ్లుగా దిగుబడి వస్తోందని, ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్న376 మామిడి చెట్లు కాలిపోవడంతో రూ.10లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. వివాహిత ఆత్మహత్య కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని గూబనపల్లికి చెందిన శిల్ప (30) ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త రాజు, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంట్లోనే విశాంత్రి తీసుకుంటోంది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పింఛన్ల పంపిణీలో కలెక్టర్ రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లిలో శనివారం లబ్ధిదారుల ఇంటి వద్దకే కలెక్టర్ ఆనంద్ వెళ్లి సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. ప్రతి నెలా పింఛన్ల పంపిణీ ఎలా జరుగుతోందంటూ లబ్దిదారులతో ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు. అనంతరం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను పరిశీలించారు. తహసీల్దార్ మోహన్ కుమార్, ఎంపీడీఓ దివాకర్, గ్రామ సర్పంచ్ సావిత్రి, ఎంపీటీసీ సభ్యురాలు నాగలక్ష్మమ్మ, ఆర్ఐ సందీప్, మండల సర్వేయర్ రఘు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. -
ఇలా అయితే.. ఎలా నేస్తం?
అనంతపురం: ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అత్యధికం అమలుకు నోచుకోవడం లేదు. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ అలవికాని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నది అధికారంలోకి రావడానికి మాత్రమేనని తేలిపోతోంది. లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు నెలకు ఇస్తున్న రూ.5 వేలను రూ.10వేలకు పెంచుతామని ఊరూవాడా విస్తృతంగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలవుతున్నా పథకం అమలు – స్టైఫండ్ పెంపును విస్మరించి జూనియర్ న్యాయవాదులను వంచనకు గురిచేశారు. బృహత్తర పథకం లా కోర్సు పూర్తి చేసి న్యాయవాదిగా నిలదొక్కుకోవాలంటే కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. ఈ కాలంలో ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీనియర్ న్యాయవాదుల వద్ద జూనియర్గా చేరినా వెంటనే జీతం ఇవ్వరు. అందుకే చాలామంది లా కోర్సు పూర్తయిన వెంటనే ప్రాక్టీసుకు వెళ్లరు. ఈ నేపథ్యంలో న్యాయవాద వృత్తి చేపట్టే వారికి ప్రారంభంలో ఆర్థిక అవరోధాలు ఉండకూడదనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం ప్రవేశపెట్టింది. జూనియర్ న్యాయవాదులను ప్రోత్సహించేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన ఈ పథకం సత్ఫలితాలు ఇచ్చింది. 2019 తర్వాత జూనియర్ న్యాయవాదుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ పథకం ద్వారా నెలకు రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.60 వేల ప్రకారం ఆర్థికసాయం అందజేశారు. ఇలాంటి పథకం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అమలవ్వడం విశేషం. చిత్తశుద్ధి ఏదీ బాబూ? వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ‘వైఎస్సార్ నేస్తం’ పథకం కింద జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు చొప్పున స్టైఫండ్ అందజేశారు. ఈ రూ.5 వేలు ఎందుకూ సరిపోదు.. అధికారంలోకి రాగానే నెలకు రూ.10 వేలు ఇస్తామంటూ చంద్రబాబు, లోకేష్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. ప్రభుత్వం వచ్చాక హామీని అటకెక్కించేశారు. ఇకనైనా హామీని అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని న్యాయవాదులు కోరుతున్నారు. స్టైఫండ్ రూ.10వేలు ఇస్తామని ఎన్నికల్లో ప్రచారం గద్దెనెక్కిన తర్వాత ‘లా నేస్తం’ అమలులో రిక్తహస్తం పథకం కోసం జూనియర్ న్యాయవాదుల ఎదురుచూపు -
నేరస్తులెవ్వరూ తప్పించుకోరాదు
అనంతపురం సెంట్రల్: సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపరిచి నేరస్తులెవ్వరూ తప్పించుకోకుండా శిక్ష పడేలా చేయాలని కోర్టు కానిస్టేబుళ్లను ఎస్పీ జగదీష్ ఆదేశించారు. కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ విభాగం సిబ్బందితో శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సమావేశమై మాట్లాడారు. ఈ నెల 14న జరిగే లోక్అదాలత్పై పలు సూచనలు చేశారు. కేసుల విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. నూతనంగా అమల్లోకి వచ్చిన బీఎన్ఎస్ఎస్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు విజయభాస్కర్గౌడ్, వలీబాషా పాల్గొన్నారు. -
ఏపీ గురుకులాల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోండి
గుత్తి: ఏపీ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరీక్షల విభాగం సమన్వయకర్త, గుత్తి ఏపీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ స్వాతి కోరారు. గుత్తిలోని ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఐదవ తరగతితో పాటు మిగిలిపోయిన 7, 8, 9 తరగతుల్లో సీట్లు, అదే విధంగా ఇంటర్, డిగ్రీలలో ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్షలునుంటాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఘనంగా వసంతోత్సవం ఉరవకొండ: గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం వసంతోత్సవం శాస్త్రోక్తంగా శనివారం నిర్వహించారు. ఫిబ్రవరి 21న ప్రారంభమైన ఉత్సవాలు వసంతోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఉదయం స్వామి వారికి అభిషేకం, మంగళహారతి, మహారుద్రాభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కంకణ మండపంలో మట్టికుండల్లో బాగా పండిన నవధ్యానాల మొక్కలను తీసి ఊరేగించారు. అనంతరం ఉత్సవమూర్తిని గవిమఠం పీఠాధిపతి జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, మఠం సహాయ కమిషనర్ గంజి మల్లికార్జునప్రసాద్ అధ్వర్యంలో వైభవంగా ఊరేగించారు. కార్యక్రమంలో గవిమఠం సిబ్బంది నారాయణస్వామి, గోపి, మధు పాల్గొన్నారు. రేషన్ పంపిణీ సక్రమంగా చేపట్టాలి ● జేసీ విష్ణుచరణ్ అనంతపురం అర్బన్: కార్డుదారులకు ఆదివారం నుంచి బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. రేషన్ పంపిణీపై జేసీ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక ధరల దుకాణాల్లో 15వ తేదీ వరకు కచ్చితంగా సరుకులు పంపిణీ చేయాలన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలన్నారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించే డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్డుదారులు బియ్యానికి బదులుగా జొన్నలు, రాగులు 3 కిలోల వరకు చితంగా పొందవచ్చన్నారు. మునిసిపాలిటీలు, అనంతపురం రూరల్ మండలంలోని కార్డుదారులకు మాత్రమే గోధుమ పిండి కిలో రూ.20 చొప్పున పంపిణీ చేస్తారన్నారు. జాతీయ రహదారిపై భారీగా నగదు చోరీ? ● రహస్యంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారి (ఎన్హెచ్44)పై వారం రోజుల క్రితం జరిగిన భారీ చోరీ తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రం సూరత్కు చెందిన వ్యాపారి ప్రతీక్ పాటిల్ తన డ్రైవర్ అర్జిత్ పటేల్తో కలిసి ఫిబ్రవరి 22వ తేదీన ఇన్నోవా కారులో వారణాసి నుంచి బెంగళూరు బయలు దేరాడు. వ్యాపారం నిమిత్తం వెంట రూ.3 కోట్ల నగదు తీసుకు వెళ్తున్నాడు. అయితే వీరి వాహనం 22వ తేదీ తెల్లవారుజామున మామిళ్లపల్లి సమీపానికి రాగానే గుర్తుతెలియని వ్యక్తులు మూడు వాహనాల్లో వారి వాహనాన్ని వెంబడించారు. కొంతదూరం వెళ్లాక రోడ్డుపైనే ప్రతీక్పాటిల్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకుని రూ.3 కోట్ల నగదు చోరీ చేయడంతో పాటు వ్యాపారి ప్రతీక్ పాటిల్ను ఓ చోట ఆయన డ్రైవర్ అర్జిత్ పటేల్ను మరో ప్రాంతంలో వదిలి పెట్టినట్లు తెలిసింది. అనంతరం బాధితులు ఈనెల 24వ తేదీన కనగానపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. సీఐ శ్రీధర్, ఎస్ఐ మహమ్మద్ రిజ్వాన్ బాధితులను వెంట పెట్టుకొని క్లూస్ టీంతో రహస్యంగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. -
క్షణికావేశం అనాథలను చేసింది!
● కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్య ● దిక్కుతోచని స్థితిలో ఇద్దరు చిన్నారులు పుట్టపర్తి అర్బన్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... పుట్టపర్తి మండలం పెడపల్లికి చెందిన నరసన్న కుమారుడు జగదీష్కు గతంలో ఉమాదేవి అనే యువతితో వివాహమైంది. ఫొటోస్టూడియో నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య చోటు చేసుకున్న మనస్పర్థల కారణంగా ఏడేళ్ల క్రితం ఇంట్లో ఉమాదేవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం ఐదేళ్ల క్రితం పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామానికి చెందిన గౌరమ్మ పెద్ద కుమార్తె చంద్రకళ (22)ను జగదీష్ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల వయసున్న కుమార్తె, రెండున్నర సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నారు. వీరి సంసారంలోనూ కలతలు చెలరేగాయి. తరచూ దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకునేవి. శుక్రవారం రాత్రి సైతం ఇద్దరూ గొడవ పడ్డారు. ఆ సమయంలో క్షణికావేశానికి లోనైన చంద్రకళ... ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా గతంలో జగదీష్ మొదటి భార్య ఉరి వేసుకున్న గదిలోనే తాను కూడా ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని దిక్కుతోచని స్థితిలో అమాయకంగా చూస్తుండిపోయిన ఇద్దరు చిన్నారులను చూస్తూ అయ్యో పాపమంటూ కంటి తడిపెట్టారు. ఇదిలా ఉండగా తన కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చంద్రకళ తల్లి గౌరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం వేధించేవాడని, అల్లుడే తన కుమార్తెను కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడంటూ కన్నీటిపర్యంతమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఫ్రీహోల్డ్ భూములకు గ్రహణం
● యాజమాన్య హక్కుల కల్పనపై తేల్చని ప్రభుత్వం ● పరిశీలన పేరుతో 20 నెలలుగా సాగదీత అనంతపురం అర్బన్: అసైన్డ్ భూముల రైతులకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. పరిశీలన పేరుతో 20 నెలలుగా సాగదీస్తూ రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది. 2003కు ముందు అసైన్డ్ అయిన భూములకు యాజమాన్య హక్కు కల్పించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 563 గ్రామాల్లో 2003కు ముందు 96 వేల మంది రైతులకు అసైన్డ్ చేసిన భూములు 3,03,370.55 ఎకరాలు. ఇందులో 1954 జూన్ 18 ముందు వాటిని, 22ఏ జాబితా, చుక్కల భూముల జాబితాలో ఉన్న వాటికి కాకుండా మిగిలిన అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్ చేసి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలి విడతగా 114 గ్రామాల్లో అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్ ప్రక్రియ నిర్వహించారు. ఇందుకు సంబంధించి 36 వేల ఎకరాల భూములను ఫ్రీహోల్డ్కు సిద్ధం చేశారు. అయితే చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూములను ఫ్రీ హోల్డ్ చేసి యాజమాన్య హక్కు కల్పించే కార్యక్రమాన్ని నిలిపివేసి.. పరిశీలనకు ఆదేశించింది. దీంతో తహసీల్దార్ స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయి వరకు మరోమారు పరిశీలన చేసి 36,659 ఎకరాల్లో 26,132 ఎకరాలు చట్టబద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలినవి పునఃపరిశీలన చేయాల్సి ఉందని ప్రభుత్వానికి నివేదించారు. గుర్తించిన 26 వేల ఎకరాల భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో ఎటూ తేల్చకుండా సాగదీస్తూ వస్తోంది. ఇక ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ రిజిస్ట్రేషన్శాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. చివరికి అసైనీదారు చనిపోతే వారసులు మ్యుటేషన్ కూడా చేసుకోలేని దుస్థితి నెలకొంది. -
●వైభవంగా లంకాదహనం
ఉరవకొండ: గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం లంకాదహనం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. గవిమఠం పీఠాధిపతులు చెన్నబసవ రాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, మఠం సహాయ కమిషనర్ గంజి మల్లికార్జునప్రసాద్ లంకాదహనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆకాశంలో రంగురంగుల తారాజువ్వలు అందరినీ ఆకట్టుకున్నాయి. అశ్వవాహనంపై విహరించిన చంద్రమౌళీశ్వరుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారికి అభిషేకం, మహారుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విశేష పుషాల్పలతో అలంకరించిన అశ్వవాహనంపై ఉత్సవమూర్తిని కొలువుదీర్చి ఊరేగించారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. -
సమస్యలు పట్టని సర్కార్
● పని మాది.. అవార్డులు మీకా? ● కనీస వేతనం రూ.24,500 ఇవ్వాలి ● డీసీఎం మాస్క్ ధరించి కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికుల ధర్నా అనంతపురం అర్బన్: ‘మాతో పనిచేయించుకోవడం తప్ప మా సమస్యలు పట్టవా? పని మేము చేస్తే.. అవార్డులు మీరు అందుకున్నారే, అప్పుడైనా మా సమస్యలు మీకు గుర్తుకు రాలేదా’ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని పంచాయతీ పారిశుధ్య కార్మికులు నిలదీశారు. కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారంటూ ఏపీ గ్రామ పంచాయతీ కార్మిక సంఘం నాయకులు ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ గ్రామ పంచాయతీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పంచాయతీ పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ మాస్క్లు ధరించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ మాట్లాడారు. కొన్ని పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులకు కొన్ని నెలలుగా వేతనం ఇవ్వడం లేదన్నారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీనిచ్చిన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్కళ్యాణ్ కనీసంగా కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. పంచాయతీ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో కనీస నిధులు కూడా కేటాయించలేదన్నారు. మునిసిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా పంచాయతీ కార్మికులకూ ప్రతి నెలా 5వ తేదీన రూ.21 వేల నుంచి రూ.24,500 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బకాయి వేతనాలు తక్షణమే మంజూరు చేయాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ, పెన్షన్, సెలవులు అమలు చేయాలన్నారు. కార్మికులు మరణిస్తే దహన సంస్కారాలకు రూ.20 వేలు ఇవాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్వచ్ఛభారత్ కార్మికులకు రూ.10 వేలు వేతనం ఇవాలన్నారు. సాధారణ మృతికి రూ.5 లక్షలు, ప్రమాద మృతికి రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, సంఘం రాష్ట్ర నాయకురాళ్లు కుళ్లాయమ్మ, వెంకటమ్మ, జిల్లా నాయకులు పెద్దన్న, నూర్బాషా, ఆది, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్తోనే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం
● మాజీ మంత్రి సాకే శైలజానాథ్ శింగనమల/బుక్కరాయసముద్రం: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు వైఎస్ జగన్ హయాంలోనే న్యాయం చేకూరిందని, వైఎస్సార్సీపీలోనూ ఆయా వర్గాలకు అధిక ప్రాధాన్యతినిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నారని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ అన్నారు. శుక్రవారం బుక్కరాయసముద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ శ్రేణులతో ఆయన సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, మిద్దె కుళ్లాయప్ప, జిల్లా కార్యదర్శి సాకే రామాంజినేయులు, నియోజకవర్గ అధ్యక్షుడు మంత్రి ఆంజనేయులు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, సర్పంచ్ పార్వతి, ఆరు మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రభుదాస్, మారుతి, నీలకంఠ నారాయణస్వామి, సూర్యనారాయణ, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
‘పచ్చ’ రంగుతో దోపిడీకి కుట్ర
బుక్కరాయసముద్రం: ప్రజాధనం కొల్లగొట్టేందుకు అధికార పార్టీలో పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త దశాబ్దం కిందట జరిగిన పనులకు ఇప్పుడు బిల్లు పెట్టుకునేందుకు చేసిన ప్రయత్నం చర్చనీయాంశంగా మారింది. బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లిలో 2017లో అప్పటి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి రూ.5లక్షల వ్యయంతో నాగలింగేశ్వర దేవాలయం వద్ద బోరు వేయించి, వాటర్ ట్యాంకు కట్టించారు. ఆ తర్వాత వాటిని వినియోగంలోకి తేలేదు. మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరడంతో.. మరోమారు బిల్లు చేసుకునేందుకు టీడీపీలోని పుల్లయ్య వర్గం భావించింది. ఈ మేరకు 2025–2026 ఆర్థిక సంవత్సరానికిగాను ఎంపీ ల్యాడ్స్ కింద రూ.8లక్షల అంచనా వ్యయంతో తాగునీటి పైపులైను పని చేసినట్లుగా హడావుడి చేసింది. మార్చి మూడో తేదీన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ట్యాంకు రూము ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. విషయం తెలుసుకున్న టీడీపీలోని మరోవర్గానికి చెందిన నాగలింగ ఇదేమిటని ప్రశ్నించాడు. దీంతో శుక్రవారం ఉదయం ఇరువర్గాల వారూ ఘర్షణపడ్డారు. అనంతరం పుల్లయ్యవర్గం వారు తమపై దౌర్జన్యం చేస్తూ.. చంపుతామని బెదిరిస్తున్నారని నాగలింగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మద్యం రాసిన మరణగీతం
● అతిగా మద్యం సేవించి సీఆర్పీఎఫ్ జవాన్ మృతి గుత్తి: స్థానిక గాంధీ సర్కిల్ సమీపంలోని బ్రాందీ షాపు వద్ద శుక్రవారం అతిగా మద్యం తాగి సీఆర్పీఎఫ్ జవాన్ వీరాంజి(34) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి మండలం ఇసురాళ్లపల్లికి చెందిన వీరాంజి హైదరాబాద్లో సీఆర్పీఎఫ్ జవాన్గా పని చేస్తున్నాడు. తన సోదరి కుమారుడి వివాహానికి రెండు రోజుల క్రితం గుత్తికి వచ్చాడు. అతిగా మద్యం సేవించి బ్రాందీ షాపు వద్దే పడి పోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వీరాంజి మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త చనిపోయాడనే సమాచారం తెలియడంతో భార్య నాగవేణి, బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. భర్త మృతదేహాన్ని చూసి నాగవేణి కన్నీరు మున్నీరుగా విలపించింది. ‘ఏ మండీ నేను వచ్చాను.. పైకి లేవండీ..నీవు వెళ్లిపోతే నాకు దిక్కెవరం’టూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. ఆమెను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టానుసారం మద్యం విక్రయిస్తుండడమే ఇలాంటి మరణాలకు కారణమని స్థానికులు మండిపడ్డారు. -
వెండి శఠగోపం అపహరణ
బుక్కరాయసముద్రం: భక్తునిగా వచ్చి వెండి శఠగోపం అపహరించుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని చెరువుకట్టపై ప్రముఖ షిర్డీసాయిబాబా దేవాలయానికి గురువారం ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత నల్లప్యాంటు, ఎర్రచొక్కా ధరించి, తలకు టోపీ పెట్టుకుని, భుజానికి బ్యాగు తగిలించుకుని ఓ వ్యక్తి వచ్చాడు. బాబా చుట్టూ ప్రదక్షిణ చేసి.. అక్కడ వెండిశఠగోపానికి పలుమార్లు నమస్కరించాడు. అనంతరం అటు ఇటు చూసి ఎవ్వరూ చూడలేదని నిర్ధారించుకుని తన వెంట తెచ్చుకున్న బ్యాగులోకి శఠగోపాన్ని వేసుకుని, అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్దిసేపటి తర్వాత శఠగోపం లేకపోవడాన్ని గమనించిన అర్చకులు, సిబ్బంది ఆలయంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. భక్తుని వలె వచ్చిన వ్యక్తే శఠగోపం అపహరించుపోయినట్లు నిర్ధారించుకున్నారు. సదరు వ్యక్తి టోపీ ధరించడం వల్ల ముఖం పూర్తిగా కనిపించలేదు. శుక్రవారం ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెండి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దుండగులు ఇలా ఆలయంలోని వస్తువులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రథం మరమ్మతుకు టెండర్ల ఆహ్వానం ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి రథం మరమ్మతులకు ఆసక్తి గల వారి నుంచి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి (ఈఓ) తిరుమల్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రథం లోపలి చక్రాలు, బీమ్ మార్పు, ఇనుప కంచె అమరిక తదితర చిన్నచిన్న మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. టెండర్ల దాఖలుకు మార్చి7 చివరి తేదీ అని పేర్కొన్నారు. టెండర్ల దరఖాస్తు రూ.వెయ్యి చెల్లించి మార్చి ఆరో తేదీ లోపు తీసుకోవచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం ఆలయ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. 265 మంది విద్యార్థుల గైర్హాజరు అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన మొదటి సంవత్సరం బోటనీ, హిస్టరీ పరీక్షలకు జిల్లాలో 265 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 945 మందికి గాను 861 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 2,255 మందికి గాను 2,124 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకట రమణనాయక్ ఐదు కేంద్రాలు, జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి ఎస్వీఎస్ గురవయ్య శెట్టి మూడు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు ఐదు, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు ఎనిమిది, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు ఎనిమిది పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేశారు. సమన్వయంతో పనిచేయాలి అనంతపురం అర్బన్: మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పీహెచ్సీ, అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఐఈసీ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో డీఎంహెచ్ఓ ఈబీ దేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ అరుణకుమారితో కలిసి మహిళా, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖల కార్యకలాపాలపై సమీక్ష, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ, జిల్లాస్థాయి మిషన్ శక్తి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు, సీడీపీఓలు ప్రణాళిక రూపొందించుకుని ఈ ఏడాది ఆగస్టు వరకు ఐఈసీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వయసుకు తగ్గ ఎత్తు, తక్కువ బరువు ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలన్నారు. ఐసీడీఎస్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, డీసీపీయూ సిబ్బంది, ఎస్ఎస్ఏ సిబ్బంది, చిల్డ్రన్స్ హోమ్, చైల్డ్ హెల్ప్లైన్, డొమెస్టిక్ వయొలెన్స్ సెల్, వన్స్టాప్ సెంటర్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తవ్వాలన్నారు. అన్ని చోట్లా తాగునీటి సౌకర్యం కల్పించాలాలన్నారు. బాల్యవిహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీలు జరగకుండా చూడాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రతి నెలా మెడికల్ చెకప్ చేయించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
అంగన్వాడీలను విస్మరిస్తే మూల్యం తప్పదు
● కుప్పం సభలో ఇచ్చిన హామీ గుర్తుందా చంద్రబాబూ? అనంతపురం అర్బన్: అంగన్వాడీల సమస్యలను విస్మరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీలకు కుప్పం సభలో ఇచ్చిన హామీ ఏమైనా గుర్తుందా చంద్రబాబూ అంటూ ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు శకుంతల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడారు. ‘అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. వేతనం పెంపుతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని 2024 జూలైలో చంద్రబాబు ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చింది. రెండేళ్లవుతున్నా అందులో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు’ అని ధ్వజమెత్తారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న మినీ వర్కర్లకు అర్హతలో సడలింపునిచ్చి ప్రధాన కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. హెల్పర్ల పదోన్నతులకు సంబంధించి నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. మే నెల మొత్తం వేసవి సెలువులు ప్రకటించాలన్నారు. మెనూ చార్జీలు పెంచాలని, ఉచితంగా వంటగ్యాస్ ఇవ్వాలని, ప్రీ స్కూల్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కోశాధికారి కాత్యాయిని, నాయకురాళ్లు మేరీ, రాధా, షాహిన, పాతక్క, రమణమ్మ, రామాంజనమ్మ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. -
జనగణనపై 3న శిక్షణ
● పటిష్ట ఏర్పాట్లకు డీఆర్వో ఆదేశం అనంతపురం అర్బన్: జిల్లాలో జనగణన–2027 తొలిదశ (ఇళ్ల జాబితా, గృహ గణన – హెచ్ఎల్ఓ) శిక్షణ కార్యక్రమం మార్చి 3 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు. కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి ఆనంద్ ఉత్తర్వుల మేరకు చార్జ్ ఆఫీసర్లకు జేఎన్టీయూ ఈసీఈ, ఈఈఈ బ్లాక్లు, కంప్యూటర్ ల్యాబ్లలో నిర్వహించే శిక్షణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని డీఆర్ఓ మలోల ఆదేశించారు. జనగణన–2027పై డీఆర్ఓ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 200 మంది అధికారులు శిక్షణలో పాల్గొంటారన్నారు. శిక్షణ విజయవంతం కోసం వేదిక, బ్యాక్డ్రాప్, సాంకేతిక ఏర్పాట్లు, పరిశుభ్రత, భోజన వసతి, ప్రచార ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనగణన విధులు అత్యంత క్రియాశీలకంగా, బాధ్యతాయుతంగా ఉంటాయని పేర్కొన్నారు. చార్జ్ అధికారులందరూ తప్పనిసరిగా శిక్షణకు హాజరవ్వాలన్నారు. అనంతరం డీఆర్ఓ అధికారులతో కలిసి జేఎన్టీయూలో శిక్షణకు ఎంపిక చేసిన బ్లాక్లను సందర్శించారు. కార్యక్రమంలో సీపీఓ అశోక్కుమార్, ఆర్డీఓ కేశవనాయుడు, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ డీఎం రమేష్రెడ్డి, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, తహసీల్దార్ మోహన్కుమార్, కో–ఆర్డినేషన్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, తహసీల్దార్ హరికుమార్, గణాంక అధికారి గిరి, ఎన్నికల విభాగం డీటీ కనకరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పీఆర్సీని తక్షణమే ప్రకటించాలి
● ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్అనంతపురం ఎడ్యుకేషన్: అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచిస్తోందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు నరేష్కుమార్ ధ్వజమెత్తారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం తాలూకా కేంద్రాల వద్ద ధర్నాలు జరిగాయి. ఇందులో భాగంగా అనంతపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేష్కుమార్ మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు సంబంధించి పీఆర్సీని తక్షణమే ప్రకటించాలన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ముఖ్యమంత్రి హోదాలో సీపీఎస్ రద్దుపై చంద్రబాబు మాట్లాడకపోవడం ఉద్యోగులను దగా చేయడమేనన్నారు. 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా 30 నెలలు దాటినా నేటికీ కనీసం పీఆర్సీని ప్రకటించకపోవడం సిగ్గుచేటన్నారు. 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధరల ఇండెక్స్ ప్రకారం ఆర్నెళ్లకోసారి కేంద్ర ప్రభుత్వ దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని విడుదల చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శులు రామకృష్ణ, సూరి, రంగనాయకులు, రాష్ట్ర కౌన్సిలర్లు సోమిరెడ్డి, శివారెడ్డి, మదన్, ఓబులేసు, యల్లప్ప, ఆడిట్ కన్వీనరు లక్ష్మీనారాయణ, జీఓ కమిటీ సభ్యులు గురురాజ, సీనియర్ నాయకులు నాగేంద్రప్రసాద్, నాగరాజు పాల్గొన్నారు. -
ఇద్దరిని బలిగొన్న ఓవర్టేక్
● బైక్ను ఢీకొన్న బొలెరో వాహనం ● ఇద్దరు యువకుల దుర్మరణం గుత్తి రూరల్: అతివేగం రెండు ప్రాణాలను బలి గొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని బొలెరో వాహనం ఢీకొంది. బైక్పై వస్తున్న ఇద్దరు యువకులు సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ఘటనతో గుత్తి మండలం ఇసురాళ్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇసురాళ్లపల్లికి చెందిన బింగి వెంకట్రాముడు, ఫకీరమ్మ దంపతుల కుమారుడు బింగి రంగస్వామి (27) వైరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇదే గ్రామానికి చెందిన సూర్యుడు కుమారుడు బెస్త పవన్ కుమార్ (24) గుత్తిలోని గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. వరుసకు బావాబామ్మర్ది అయిన వీరు గురువారం గుత్తిలోని పాత సీపీఐ కాలనీలో స్నేహితుడి వివాహానికి వెళ్లారు. డీజేలు, డప్పు వాయిద్యాల నడుమ రాత్రంతా స్నేహితులతో కలిసి డ్యాన్సులు చేస్తూ ఎంతో సంతోషంగా గడిపారు. దుస్తులు మాసిపోవడంతో ఇంటికి వెళ్లి మార్చుకుని వస్తామని స్నేహితులకు చెప్పి రంగస్వామి, పవన్కుమార్ శుక్రవారం వేకువజామున ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. మార్గం మధ్యలో ఎంగిలిబండ గ్రామ శివారులో తాడిపత్రి వైపు నుంచి గుత్తి వైపు వెళ్తున్న బొలెరో వాహనం.. ముందున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎగిరి రోడ్డుపై పడ్డ రంగస్వామి, పవన్కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం స్వాధీనం చేసుకుని, ఆలూరుకు చెందిన డ్రైవర్ కేశప్పను స్టేషన్కు తరలించారు. -
బ్రహ్మోత్సవం..శ్రీకారం
కదిరి: భక్తుల కోర్కెలు తీరుస్తూ ఇలవేల్పుగా పూజలందుకుంటున్న ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం అర్చకులు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. మంగళవాయిద్యాల మధ్య నారసింహుడిని రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆలయానికి నైరుతి దిశలో ఉన్న మండపానికి తీసుకువచ్చి పూజలు చేశారు. పుట్ట మన్ను కోసం మేదిని పూజ అర్చక పండితులు నిర్ణీత ప్రదేశంలో ‘భూమిపూజ’తో పుట్ట మన్ను సేకరించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన 9 పాలిక(కుండ)లలో నవ ధాన్యాలతో అంకురార్పణం చేశారు. నవగ్రహాలకు సంకేతంగా నవ ధాన్యాలు వేశారు. ఇందులో గోధుమలు (సూర్యుడు), బియ్యం(చంద్రుడు), కందులు (కుజుడు), పెసలు (బుధుడు), శనగలు (బృహస్పతి), అలసందలు (శుక్రుడు), నువ్వులు (శని), మినుములు (రాహువు), ఉలవలు (కేతువు)లను పాలికల్లో విత్తారు. అంతకుమునుపు అవసరమైన పుట్ట మన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదిని పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తిని పఠించారు. ఈ నవధాన్యాలు దిన దినాభివృద్ధి చెందేలా అర్చకులు బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకూ రోజూ నీరు పోసి మొలకెత్తేలా చూస్తారు. ఏ ధాన్యం బాగా మొలకెత్తుతుందో ఆ పంట ఈ ఏడాది బాగా పండుతుందని భక్తుల నమ్మకం. నారసింహుడు ఈ పక్షం రోజుల పాటు యాగశాలలోనే గడిపి, ఇక్కడి నుంచే భక్తులకు దర్శన భాగ్యం కల్గిస్తారు. యాగశాలలో అగ్ని హోత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అనంతరం యాగశాలలో అగ్నిహోత్రం వెలిగించారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేవరకూ అంటే పక్షం రోజుల పాటు ఈ అగ్నిహోత్రం ఆరకుండా అర్చకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఉత్సవాలను నలుదిక్కులూ చాటేందుకు శనివారం (నేడు)ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రధాన ధ్వజ స్తంభానికి గరుడ దండాన్ని ధ్వజారోహణం చేస్తారు. దీన్ని బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేరోజు అంటే తీర్థవాది నాడు శ్రీవారి చక్రస్నానం అనంతరం అవరోహణం చేసి ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. నేడు ఖాద్రీశుని కల్యాణం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన శ్రీవారి కల్యాణోత్సవం శనివారం(నేడు) వైభవంగా జరగనుంది. ఇందుకోసం ఆలయ అధికారులతో పాటు పోలీసు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాద్రీశుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కమనీయంగా సాగిన అగ్ని హోత్రం నేడు శ్రీవారి కల్యాణోత్సవం -
నెట్టికంటుడి టేకు ప్రతిమ ఊరేగింపు
గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో నూతనంగా ప్రతిష్టించనున్న స్వామి వారి ప్రతిమను శుక్రవారం ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు. రాతితో గర్భాలయాన్ని నిర్మించనున్న నేపథ్యంలో మూలవిరాట్ దర్శనాన్ని పూర్తిగా నిలిపి వేయనున్నారు. దీంతో ధ్వజ స్తంభం వద్ద టేకుతో తయారు చేయించిన స్వామి వారి ప్రతిమను కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. హుండీ కానుకల లెక్కింపు కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. 29 రోజులకుగానూ రూ. 25,56,798 నగదు, అన్నదానం హుండీ ద్వారా రూ.92,260 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ ఎం.విజయరాజు తెలిపారు. అలాగే 18.240 గ్రాముల బంగారు, 910 గ్రాముల వెండితో పాటు 3 అమెరికన్ డాలర్లును భక్తులు సమర్పించారు. లెక్కింపు ప్రక్రియలో కసాపురం వాసులు, గుంతకల్లు హనుమాన్ సేవా సమితి, కర్నూలు బాలాజీ సేవా సమితి, నంద్యాల శ్రీరామ సేవా సమితి, బళ్లారి వీరభద్రసేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఆలయ ఏఈఓ వెంకటేశ్వర్లు, పోలీసులు పర్యవేక్షించారు. -
హిందూ ద్రోహి చంద్రబాబే
● పూజా విధానాలు తెలియని వారు ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరం ● వైఎస్సార్సీపీ నేత జ్వాలాపురం శ్రీకాంత్ ధ్వజంఅనంతపురం: బూట్లు వేసుకుని పూజలు చేయడం, ఆలయాలను కూల్చి వేయడం లాంటి చర్యలతో అసలైన హిందూ ద్రోహిగా సీఎం చంద్రబాబు ఖ్యాతిగాంచారని వైఎస్సార్సీపీ నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం అనంతపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీసం పూజా విధానాలపై అవగాహన లేని బుచ్చి రాంప్రసాద్ ఏ అర్హతతో వైఎస్ జగన్ను విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. పదవుల కోసం క్షుద్ర పూజలు చేసేవారి పక్కన నిలబడే రాంప్రసాద్.. బ్రాహ్మణత్వానికే కళంకం ఆపాదించారని విమర్శించారు. గతంలో టీడీపీ హయాంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో జరిగిన క్షుద్రపూజల ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హోమ ద్రవ్యాలకు, అవిస్సులకు తేడా తెలియకుండా మాట్లాడటం రాంప్రసాద్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పులివెందులలోని నందీశ్వర ఆలయంలో జరిగిన హోమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత నిష్టతో పాల్గొన్నారని, శాస్త్రోక్తంగా హోమ క్రతువులు నిర్వహించారని తెలిపారు. యాగానికి దుష్ట శక్తులు అడ్డు పడకుండా అక్షింతలు వాసన చూసి వెనక్కి వేస్తారనే విషయం కూడా తెలియకుండా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. హోమంలో కార్యవాది అయిన ఆలయ చైర్మన్ లేదా పాలకమండలి సభ్యులు మాత్రమే సతీసమేతంగా కూర్చుంటారనే కనీస జ్ఞానం కూడా విమర్శించే వారికి లేకుండా పోయిందన్నారు. హిందూ ధార్మిక ముసుగులో ఉన్న అసలైన ద్రోహులు టీడీపీ నేతలేనని పేర్కొన్నారు.దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చలువతోనే నేడు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోని ఆలయాల్లోనూ ధూపదీప నైవేద్యాలు నిరంతరాయంగా అందుతున్నాయన్నారు. పూజలు, హోమ విధానాలపై కనీస అవగాహన పెంచుకున్న తర్వాతే మాట్లాడాలని, అనవసర విమర్శలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టీడీపీ నేతలను హెచ్చరించారు. -
అమాంతం ధర తగ్గిస్తే ఎలా..?
నేను 10 ఎకరాల్లో అరటి సాగు చేశాను. మొదటి పంట ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. రెండు వారాల కిందట టన్ను రూ.22 వేల ప్రకారం కొంత అమ్మాను. ఇప్పుడు మరో 50 టన్నుల వరకు కోతకు సిద్ధంగా ఉంది. టన్ను రూ.14 వేలు అయితే కోస్తామని వ్యాపారులు చెప్పారు. ఉన్నఫళంగా ధరలు తగ్గిస్తే రైతులు ఎవరికి చెప్పుకోవాలి? కనీసం మార్చి, ఏప్రిల్లో మంచి ధరలు లభిస్తే కానీ అరటి రైతులు గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం, ఉద్యానశాఖ వెంటనే చర్యలు తీసుకోవాలి. – పొన్నపాటి మహేశ్వరరెడ్డి, జంగంరెడ్డిపేట, పుట్లూరు మండలం -
50 చీనీ చెట్లు దగ్ధం
గుంతకల్లు రూరల్: మండలంలోని నాగసముద్రం గ్రామంలో శుక్రవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి రైతు నాగేంద్ర తోటలోని 50 చీనీ చెట్లు కాలిపోయాయి. తనకున్న రెండు ఎకరాల్లో ఏడేళ్ల క్రితం 250 చీనీ మొక్కలను నాటాడు. మూడేళ్ల క్రితమే పంట దిగుబడి ప్రారంభమైంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్సర్క్యూట్ చోటు చేసుకుని నిప్పు రవ్వలు ఎగిసి పడి మంటల చెలరేగాయి. కంచెకు అనుకుని ఉన్న 50 చీనీ చెట్లు కాలి పోవడంతో రూ.1.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. 4న తిరుపతిలో మెగా జాబ్మేళా అనంతపురం టౌన్: తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయంలో మార్చి 4న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరై ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను ఎంపిక చేయనున్నారు. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. అడవికి నిప్పు కుందుర్పి: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో కుందుర్పి మండలం జంబుగుంపల అటవీ ప్రాంతంలో మంటలు ఎగిసి పడ్డాయి. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలోని పచ్చని చెట్లు కాలి పోయాయి. పెద్దకొండ, మల్లికాసినకొండ, తుమర్లగొంది, కనుమ ప్రాంతాల్లో విలువైన టేకు, దాదారు, శ్రీగంధం, వెదురు, పచ్చారి, నీరద్ది, గాలిబుడుగు, నీలగిరి, తుమ్మ,జాతి వంటి విలువైన వృక్షాలు పూర్తిగా కాలిపోయాయి. వందలాది వన్యప్రాణులు సజీవ దహనమయ్యాయి. గురువారం సాయంత్రం సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ బీట్ అధికారి పరమేశ్వరప్ప, సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేపట్టారు. అయినా అదుపులోకి రాలేదు. కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్పై ఫిర్యాదు కళ్యాణదుర్గం: స్థానిక మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ అవినీతి అక్రమాలపై రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సంపత్ కుమార్కు దళిత జన జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే రాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు.టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతూ తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వంశీకృష్ణ భార్గవ్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. -
మరింత పురోగతి సాధిస్తాం
● ఆర్థిక, ప్రణాళిక సీఎస్కు తెలిపిన కలెక్టర్ ఆనంద్ అనంతపురం అర్బన్: కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లలో మరింత పురోగతి సాధించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్కు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ముఖ్య కార్యదర్శి గురువారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు సీపీఓ అశోక్కుమార్, కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, మల్లికార్జునుడు, పద్మావతి, నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంత్రావు, ఈఈ షాకీర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాల గురించి ముఖ్య కార్యదర్శికి కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. స్వర్ణాంధ్ర, జీరో పావర్టీ పీ–4 ప్రోగ్రామ్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లలో పురోగతి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కీ పర్ఫార్మెన్స్పై ప్రతి నెలా సమీక్షిస్తున్నామన్నారు. ఏ అంశాల్లో వెనుకబడ్డారనే విషయాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తూ పురోగతి సాధించేలా మార్గనిర్దేశనం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో విజన్ ప్లాన్ యూనిట్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 28లోపు జీవన ధ్రువీకరణ పత్రాలు సమర్పించండి ● పెన్షనర్లకు ఖజానా డీడీ సూచన అనంతపురం అర్బన్: జిల్లాలోని పెన్షన్దారులు తమ జీవన ధ్రువీకరణ పత్రాలను (లైఫ్ సర్టిఫికెట్) ఈనెల 28వ తేదీలోపు సమర్పించాలని ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణయ్య తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. 2026 సంవత్సరానికి పెన్షన్దారులు తమ జీవన ధ్రువీకరణను నిర్దేశించిన తేదీలోపు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 15,167 మంది జీవన ధ్రువీకరణ చేయించుకున్నారన్నారు. అనారోగ్యం, నిస్సహాయ స్థితిలో ఉండి ఇప్పటికీ చేయించుకోని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత ఖజానా కార్యాలయ అధికారులను ఈనెల 28వ తేదీలోపు సంప్రదిస్తే జీవన ధ్రువీకరణ పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. గడువులోపు చేసుకోని పక్షంలో భవిష్యత్ పెన్షన్ చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. ‘జీవన్ ప్రమాణ్’ పోర్టల్ ద్వారా కూడా జీవన ధ్రువీకరణ చేయించుకునే సౌకర్యం ఉందని తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్గా శ్రీనివాసులు అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్ట్రార్(డీఆర్)గా శ్రీనివాసులును నియమిస్తూ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అంబేడ్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఐజీ విజయలక్ష్మీ తెలిపారు. 2022 బ్యాచ్కు చెందిన గ్రూప్–1, 2 ఉద్యోగులపై వస్తున్న ఆరోపణలపై ఇటీవలే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు డీఆర్ భార్గవ్ను ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖ ఆడిట్ విభాగంలో డీఆర్గా పని చేస్తున్న శ్రీనివాసులును జిల్లా ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన శుక్రవారం బాధ్యతలు తీసుకోనున్నారు. ఏపీఆర్సెట్లో సత్తా అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రీసర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్సెట్) పరీక్షలో అనంత పురం రూరల్ మండలం పిల్లిగుండ్లకాలనీకి చెందిన సాకే సాయిసుష్మా సత్తా చాటింది. రాష్ట్రంలో మొదటిర్యాంకు సాధించి ప్రశంసలు అందుకుంటోంది. గత నవంబరు 6న జరిగిన ఈ పరీక్ష ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి. సాకే సాయిసుష్మా ఇంగ్లిష్ సబ్జెక్టులో 151.75 మార్కులతో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఈమె స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సాయి సుష్మా అడ్వాన్స్డ్ ఇంగ్లిష్ డిగ్రీ చేసింది. తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్ లిటరేచర్లో పీజీ పట్టా పొందింది.అసిస్టెంట్ ప్రొఫెసర్ షిప్లో నాలుగుసార్లు నెట్, ఏపీసెట్లో ఉత్తీర్ణత సాధించింది. సాయి సుష్మా తండ్రి నారాయణస్వామి న్యాయవాదిగా పని చేస్తున్నారు. తల్లి ఉషాకుమారి అనంతపురం నగరం కొత్తూరు ప్రభుత్వ బాలుర ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్ అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. మొదటిర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని సాయిసుష్మా పేర్కొన్నారు. ఆమెను పలువురు అభినందించారు. -
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
● వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం నాయకులు అనంతపురం ఎడ్యుకేషన్: అక్రమ అరెస్ట్లతో ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు హెచ్చరించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య అరెస్ట్ను నిరసిస్తూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎద్దుల నవీన్రెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకుండా దాటవేత దోరణి అవలంభిస్తోందన్నారు. కక్ష సాధింపు చర్యలతో జైల్లో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. మంత్రి నారా లోకేష్కు దమ్ముంటే విద్యార్థులకు ఇవాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని సవాల్ విసిరారు. అలా కాదని ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై కేసులు పెడతామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రశ్నిస్తానన్న డీసీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికై నా మౌనం వీడి విద్యార్థుల పక్షాన నిలవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు పులి కార్తికేయ, హరీష్, చరణ్, కృష్ణ, లోకేష్, కార్తీక్, బాబా ఇమ్రాన్, కార్తీక్, నంద, విజయ్, సంతోష్ రెడ్డి, బబ్లూ, సాయి, వడ్డే ప్రవీణ్, శివ, సాయి, నాగేంద్ర, రాజా, సుధీర్, అనిల్, బాబా ఇమ్రాన్, సూర్య పాల్గొన్నారు. -
ధర ‘చింత’
● పెరిగిన చింత పండు దిగుబడులు ● మార్కెట్లో నానాటికీ దిగజారుతున్న ధరలు హిందూపురం: ఈ సీజన్లో హిందూపురం మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున చింత పండును విక్రయానికి రైతులు తీసుకు వస్తున్నారు. ప్రతి వారం దాదాపు 3 వేల నుంచి 4వేల క్వింటాళ్ల క్రయవిక్రయాలు సాగుతున్నాయి. ఈ ఏడాది చింత పండు దిగుబడులు బాగా ఉండడమే ఇందుకు కారణం. వరుసగా గత రెండేళ్లుగా సరైన దిగుబడి లేక నష్టాల పాలైన రైతులు.. ఈ సారి అధిక దిగుబడి కారణంగా మార్కెట్లో గిట్టుబాటు ధర లేక నష్టపోవాల్సి వస్తోంది. గత ఏడాది మొదటి రకం కరీపులి రకం చింతపండు అత్యధికంగా రూ.25 వేలకు పైగా ధర పలికింది. ప్రస్తుతం రూ. 8 వేల నుంచి రూ.10 వేలకు మించి అడగడం లేదు. అలాగే ఫ్లవర్ రకం చింతపండు ధర రూ.10 వేల నుంచి రూ.22 వేలలోపే ఉంటోంది. బోటు రకం రూ.3 వేల నుంచి రూ.6 వేలకు మించి అమ్ముడు పోవడం లేదు. దీంతో ధర గిట్టుబాటు కాక రైతులు లబోదిబోమంటున్నారు. ఎటొచ్చి రైతుకే నష్టం మార్కెట్ యార్డులో వ్యాపారులు, అధికారుల మాయాజాలానికి రైతులు బలవుతున్నారు. వేలం సమయంలో వారు చెప్పిన ధరకే చింతపండును విక్రయించుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం చింతపండు దిగుబడి పెరిగి ఎక్కువ లోడ్లు మార్కెట్కు వస్తున్నాయి. దీంతో తక్కువ ధరతో వేలం పాడుతున్నారు. చెట్టు నుంచి చింత కాయలను దులిపేందుకు ఒక్కో కూలీకి రూ.800, వాటిని శుభ్రం చేసేందుకు ఒక్కో కూలీకి రూ.600 చొప్పున చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. మార్కెట్కు తరలించేందుకు వాహన అద్దెలు అదనమంటున్నారు. ఇంత కష్టపడి యార్డుకు సరుకు చేరిస్తే గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ ఆరంభంలో ఉన్న ధర ఆ తర్వాత లేకుండా పోయిందంటున్నారు. ఖర్చులన్నీ పోనూ తమకు మిగిలిదే నష్టమేనని వాపోతున్నారు. -
బసంపల్లిలో ఎలుగుబంటి
శెట్టూరు: మండలంలోని బసంపల్లి గ్రామంలో పట్టపగలే ఎలుగుబంటి కనిపించింది. గురువారం రైతులు పొలానికి వెళుతుండగా పొదల్లో నుంచి ఉన్నఫళంగా ఎలుగుబంటి బయటకు వచ్చింది. గమనించిన రైతులు గట్టిగా కేకలు వేయడంతో అది పొలాల్లోకి పరుగు తీసింది. గ్రామ శివారు ప్రాంతంలో పట్టపగలే ఎలుగుబంటి కనిపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ అధికారులు స్పందించి ఎలుగుబంటిని బంధించాలని కోరారు.గుండెపోటుతో కానిస్టేబుల్ మృతిఅనంతపురం సెంట్రల్: నగరంలోని మూడో పట్టణ పీఎస్ కానిస్టేబుల్ నజీరుద్దీన్ (పీసీ 1804) గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుదీర్ఘకాలం సీఐడీ విభాగంలో పనిచేసిన ఆయన ఇటీవల త్రీటౌన్ పోలీసుస్టేషన్కు బదిలీపై వచ్చారు. గురువారం మధ్యాహ్నం రాజీవ్కాలనీలోని తన నివాసంలో కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మద్యం మత్తులో వ్యక్తి వీరంగంఅనంతపురం సెంట్రల్: మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఏకంగా పోలీసు వాహనంపై దాడి చేయడంతో అద్దం ధ్వంసమైంది. ఈ ఘటన బుధవారం రాత్రి అనంతపురంలోని పాతూరు రాణినగర్లో చోటు చేసుకుంది. వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు... రాణినగర్లో నివాసముంటున్న బళ్లారి బాబామౌలానా బుధవారం రాత్రి మద్యం మత్తులో తన భార్యపై కొడుతున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రక్షక్ వాహనంలో అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో నానా హంగామా చేస్తున్న బాబా ఏకంగా పోలీసులపై తిరగబడ్డాడు. రక్షక్ వాహనం అద్దాన్ని గుద్దడంతో పగిలిపోయింది. అంతకు ముందు అటుగా వెళుతున్న రామప్పపై దాడి చేసి సెల్ఫోన్ లాక్కొన్నాడు. ఓ మహిళను వెంబడించి భయభ్రాంతుల కు గురి చేయడంతో ఆమె కిందపడింది. బుధవారం రాత్రి పారిపోయిన నిందితుడిని గురువారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు అరెస్ట్ చేశారు. -
నెట్టికంటుడి నిజరూప దర్శనం నిలిపివేత
● రేపటి నుంచి బాలాలయంలో స్వామి వారి దర్శనం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం, ధ్వజస్తంభం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బాలాలయం గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 27 నుంచి స్వామివారి నిజరూప దర్శనాన్ని నిలిపివేయనున్నారు. ఆలయం వద్ద దాతల సహకారంతో గర్భాలయం, విమాన గోపురం, ముఖ మండపం నిర్మించాలని నిర్ణయించారు. త్వరలో ప్రారంభం కానున్న పనులు దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు సాగనున్నాయి. ఈ క్రమంలోనే స్వామి మూలవిరాట్ దర్శనాన్ని నిలిపివేయాలని ఆలయ అధికారులు, కమిటీ వారు నిర్ణయం తీసుకున్నారు. గర్భాలయ పనులు పూర్తయిన తరువాత జూన్ 27 నుంచి తిరిగి మూలవిరాట్ దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నట్లు ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు తెలిపారు. బాలాలయంలో స్వామి.. నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ఆలయ ధ్వజస్తంభం వద్ద బాలాలయాన్ని నిర్మించారు. ఆలయంలో కొలువుదీరిన మూలవిరాట్ రూపంలోనే టేకుతో రూపొందించిన 8 అడుగుల స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించనున్నారు. ఈ నెల 28న ఉదయం 9.15 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమ సలహాదారుల ఆధ్వర్యంలో బాలాలయంలో విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. గర్భాలయం, విమాన గోపురం, ముఖ మండపం పనులు పూర్తయ్యేవరకూ స్వామివారు బాలాలయం నుంచే భక్తులకు దర్శనమివ్వనున్నారు. నిత్య అలంకరణ, పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహించనున్నారు. 3న ఆలయం మూసివేత గుంతకల్లు రూరల్: చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 3న కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం మూసివేయనున్నట్లు ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం ఆరు గంటలలోపు స్వామికి ప్రాతఃకాల ఆరాధన, పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేస్తామన్నారు. మార్చి 4న ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసి స్వామి దర్శనాన్ని పునఃప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. -
●పెన్నమ్మకు గర్భశోకం
పామిడి పెన్నానదిలో అక్రమంగా వెలసిన వరిమళ్లు ఒకప్పుడు ఇసుక దిన్నెలతో కళకళలాడిన పామిడి పెన్నానదిలో ‘పచ్చ’ తోడేళ్లు సై’ఖతం’ చేస్తున్నాయి. దీనికి తోడు ఆక్రమణలు పెరిగిపోయాయి. ఎటు చూసినా వరిమళ్లు, తోటలు, ఇటుకబట్టీలు వెలిశాయి. దీంతో పెన్నానది రూపురేఖలు మారిపోయి గర్భశోకంతో అల్లాడిపోతోంది. ఇసుక అక్రమ రవాణాతో నదిలో ఎక్కడికక్కడ భారీ గోతులు ఏర్పడ్డాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటి తరచూ తాగునీటి సమస్యతో పామిడి వాసులు విలవిల్లాడుతున్నారు. దశాబ్దాల క్రితం కేవలం పది అడుగుల లోతులోనే అపారమైన భూగర్భ జలాలు లభ్యమయ్యేవి. నేడు వందల అడుగుల లోతు బోరు బావులు తవ్వినా ఫలితం దక్కడం లేదు. పామిడిలోని సర్వే నంబర్ 1247లో 961.18 ఎకరాల్లో విస్తరించిన పెన్నానదిలో 410 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఆక్రమణల తొలగింపుపై అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు, పాలకులు దృష్టి సారించకపోతే పెన్నానది కనుమరుగయ్యే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – పామిడి: నది మధ్య భాగంలో వెలసిన ఇటుకల బట్టీలు నది మధ్య భాగంలో సాగులో ఉన్న పూల తోటలు టీడీపీ నేతల ఇసుక అక్రమ రవాణాతో ఏర్పడిన గోతులు -
కదిరికి వెళ్దాం.. ఖాద్రీశున్ని చూద్దాం
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. పక్షంరోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాలకు శుక్రవారం(నేడు) ఆలయ ప్రాంగణంలో వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అని పిలుస్తారు. బ్రహ్మోత్సవాలు విజయ వంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందటమే అంకురార్పణ ఘట్టం ముఖ్య ఉద్దేశం. సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే రాత్రి సమయంలో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. అగ్నిహోమం ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే సకల దేవతలను ఆహ్వానిస్తారు. నవధాన్యాల మొలక అంకురార్పణ ఘట్టంలోనే భూమాతను ప్రార్థిస్తూ పాలిక (కొత్తకుండ)లను మట్టితో నింపుతారు. చంద్రున్ని ప్రార్థిస్తూ అర్చక బృందం వాటిలో నీరు పోసి నవ ధాన్యాలు చల్లుతారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం చేస్తారు. సోమరాజ మంత్రం, వరుణ మంత్రంతో పాటు విష్ణు సూక్తం పఠిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అర్చక పండితులు రోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోసి నారు పెరిగేందుకు సహకరిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహిస్తారు. -
గందరగోళాన్ని సవరించాలి : ఏపీటీఎఫ్
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అమలు చేస్తున్న ‘ఇన్విజిలేషన్ ఆటోమేషన్’ విధానంలో నెలకొన్న తీవ్ర గందరగోళాన్ని వెంటనే సవరించాలని ఏపీటీఎఫ్ (1938) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం డీఈఓ కార్యాలయ ఏడీ మునీర్ఖాన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్ 2 హెడ్మాస్టర్లను 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్ష కేంద్రాలకు సీఎస్, డీఓలుగా నియమించారన్నారు. వాటిని రద్దు చేసి సమీపంలోని పరీక్ష కేంద్రాలు కేటాయించాలన్నారు. సీనియర్లకు డీఓలుగా, జూనియర్లకు సీఎస్లుగా విధులు కేటాయించారని, ఇందులో సర్వీసులో ఇప్పటి వరకూ ఇన్విజిలేషన్ విధులు కూడా చేయని స్కూల్ అసిస్టెంట్లకు డీఓలుగా కేటాయించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వారికి ఆ విధుల నుంచి మినహాయింపు ఇచ్చి విల్లింగ్ ఉన్న వారికి కేటాయించాలన్నారు. ఏడీని కలిసిన వారిలో ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసనాయక్, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రఫీ, జిల్లా పూర్వ అధ్యక్షుడు రవీంద్ర, జిల్లా నాయకులు పోతులయ్య, ఆంజనేయులు నాయక్, తిరుపాల్ నాయక్, సురేష్, ఫకృద్దీన్, గోవిందరెడ్డి, ఇలియాజర్ ఉన్నారు. యువకుడి హత్య విడపనకల్లు: కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ యువకుడు విడపనకల్లు మండలం డొన్నేకల్లు గ్రామ శివారులో దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అక్కడి ఆనవాళ్లను బట్టి బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. గురువారం మధ్య రాత్రి ఘటన జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతదేహానికి సమీపంలోనే కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన ఓ స్కూటీ పడి ఉండడంతో దాని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు హతుడిని రాయచూరు జిల్లా సింధనూరు గ్రామానికి చెందిన కిరణ్కుమార్ (38)గా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


