breaking news
Anantapur Latest News
-
మహిళా చట్టాల అమలులో ప్రభుత్వాలు విఫలం
● ఐద్వా అఖిల భారత కోశాధికారి పుణ్యవతి అనంతపురం అర్బన్: మహిళా రక్షణ చట్టాల అమలులో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఐద్వా అఖిల భారత కోశాధికారి పుణ్యవతి మండిపడ్డారు. ఫలితంగా దేశంలోను, రాష్ట్రంలోను మహిళలకు రక్షణ కరువైందన్నారు. బేటీ బచావో... బేటీ పడావో అని మాటల్లో చెబుతున్నా.. ఆచరణలో చూపించడం లేదని ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి, కోశాఽధికారి సావిత్రి, జిల్లా కార్యదర్శి చంద్రిక, నాయకురాలు నాగమణితో కలిసి విలేకరులతో పుణ్యవతి మాట్లాడారు. మహిళల సమస్యలపై సోమవారం నుంచి మూడు రోజుల పాటు అనంతపురం నగరంలో జరగనున్న ఐద్వా రాష్ట్ర మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రమాదేవి మాట్లాడుతూ.. ప్రతి మహిళకు ఆడబిడ్డనిధి కింద ప్రతి నెల రూ.1,500, వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షలు వరకు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హమీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాట వాటిని అమలు చేయలేదన్నారు. వీటిపై మహాసభల్లో చర్చిస్తామన్నారు. మహాసభల్లో భాగంగా సోమవారం నగరంలో ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందన్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ యల్లనూరు: మండలంలోని మల్లాగుండ్ల సమీపంలో చిత్రావతి నది ఒడ్డున పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట ఆడుతున్న నాగశేఖర్, సీతారామిరెడ్డి, శీనుతో పాటు 12 మందిని అరెస్ట్ చేసి, 11 ద్విచక్ర వాహనాలు, రూ.82,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. కర్ణాటక మద్యం పట్టివేత అనంతపురం సెంట్రల్: కర్ణాటక మద్యం తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. వివరాలను అనంతపురం ఎకై ్సజ్ టాస్క్ఫోర్సు సీఐ జయనాథ్రెడ్డి, ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణ ఆదివారం వెల్లడించారు. టాటా జెస్ట్ వాహనం నుంచి తెల్లటి సంచులను దింపుతుండగా అనుమానం వచ్చిన ఎకై ్సజ్ పోలీసులు గమనించి, తనిఖీ చేశారు. అందులో 90 ఎంఎల్ సామర్థ్యం ఉన్న కర్ణాటక టెట్రా ప్యాకెట్ల మద్యం ఉన్నట్లుగా గుర్తించి వాహనంతో సహా స్వాధీనం చేసుకున్నారు. మద్యం దింపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో తన పేరు వెంకటపతి అని, లెనిన్నగర్లో నివాసముంటున్నట్లుగా వెల్లడించాడు. కర్ణాటకలోని బాగేపల్లి నివాసి కిషోర్ నుంచి తక్కువ ధరకే మద్యం కొనుగోలు చేసి అనంతపురంలో తన స్నేహితుడు నాగేంద్ర ద్వారా అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. -
డీఎస్పీ కార్యాలయం ఎదుట.. దంపతుల ఆత్మహత్యాయత్నం
అనంతపురం సెంట్రల్: ఆర్థిక వ్యవహారాలతో విసుగు చెందిన దంపతులు అనంతపురం డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బాధితులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన అశోక్ మూడేళ్ల క్రితం బెళుగుప్ప మండలం జీడిపల్లి గ్రామానికి చెందిన గాలి ఆంజనేయులు కుమార్తె గిరిజను పెళ్లి చేసుకున్నాడు. ఆంజనేయులకు ముగ్గురూ కుమార్తెలు కాగా, తన అవసరాల కోసం అల్లుడు అశోక్ వద్ద దాదాపు రూ. 18 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఏడాది క్రితం చోటు చేసుకున్న ప్రమాదంలో గాయపడి ఆంజనేయులు మృతి చెందాడు. వీరికి దాదాపు 30 ఎకరాల వరకూ స్థిరాస్తి ఉంది. దీంతో అశోక్ తాను రూ.3, రూ.4తో వడ్డీకి తెచ్చి నగదు సమకూర్చానని, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అత్త లక్ష్మీదేవిని కోరాడు. అదే సమయంలో తన వాటా కింద రావాల్సిన స్థిరాస్తిని పంచివ్వాలని గిరిజ కోరింది. అయితే అప్పు చెల్లించకపోగా వాటాగా ఇవాల్సిన స్థిరాస్తిని ఇచ్చేందుకూ లక్ష్మీదేవి అంగీకరించలేదు. ఈ విషయంగా పెద్ద మనుషులు పంచాయితీ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో చేసిన అప్పు తీర్చే మార్గం కానరాక అశోక్ తన భార్య గిరిజతో కలిసి ఆదివారం ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడే ఉన్న డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ను పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. గమనించిన పోలీసులు వెంటనే అడ్డుకుని టూటౌన్ పీఎస్కు తరలించారు. తన వదినలైన వందన (బీసీ వెల్పేర్ జూనియర్ అసిస్టెంట్), కవిత (కూడేరు మండలం కదరంపల్లి అంగన్వాడీ వర్కర్), కంబదూరు చెందిన రామకృష్ణస్వామి అలియాస్ బంబంస్వామి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని బాధితుడు అశోక్ వాపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీకాంత్యాదవ్ తెలిపారు. -
‘చల్ల’గా పాగా వేసేశాడు
అనంతపురం క్రైం: ఆక్రమణలు వద్దు ‘బాబో’ అంటూ ప్రజలు మొత్తుకుంటున్నా ‘చల్ల’గా ఆయన పాగా వేసేశాడు. ప్రజా అవసరాల కోసం వదిలిన స్థలంలో భవనం నిర్మించి వేలాది రూపాయల అద్దెకు ఇచ్చి జేబులు నింపుకుంటున్నాడు. కోర్టు రోడ్డులోని సూరి హోటల్ ఎదురుగా 7 అడుగుల వెడల్పు, 67 అడుగుల పొడవు మేర స్థలాన్ని ఓ టీడీపీ నేత ఆక్రమించాడు. ఇందులో హోటల్ను నడుపుకునేందుకు అద్దెకిచ్చాడు.తాజాగా ఆ స్థలంలో కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నాడు. స్థలం కబ్జా చేయడమే కాకుండా పట్టపగలే యథేచ్ఛగా అక్కడ నిర్మాణాలు చేపడుతుండడంపై ఇటీవల పలువురు నగర పాలక సంస్థ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కమిషనరు బాలస్వామి ఆ స్థలాన్ని పరిశీలించి తక్షణం తొలగించుకోవాలని ఆదేశించారు. అధికారుల ఎదుట సరేనని తల ఊపిన కబ్జారాయుళ్లు వారు అటు వెళ్లగానే ఇటు పనులు తిరిగి ప్రారంభించడం గమనార్హం. దీనిపై మళ్లీ అధికారులకు పలువురు ఫిర్యాదు చేసినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. నగరంలో ఎక్కడైనా నాలుగడుగుల స్థలంలో తోపుడు బండి పెట్టుకుంటే వెంటనే అక్కడ వాలి తరిమేస్తున్న అధికారులు.. నగరం నడిబొడ్డున స్కావెంజర్ లైన్లో స్థలాన్ని ఓ టీడీపీ నేత ఆక్రమించినా పట్టించుకోకపోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం... తేల్చేస్తామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ నేత అక్రమ నిర్మాణానికి అండగా నిలుస్తున్నారని, దీంతోనే అధికారులు అటువైపు వెళ్లేందుకు జంకుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగరం నడిబొడ్డున స్కావెంజర్ లైన్ స్థలం కబ్జా ఓ టీడీపీ నేత బరి తెగింపు -
ఉపాధి బిల్లుల్లో గోల్మాల్!
కళ్యాణదుర్గం: ఉపాధి హామీ పథకం పనులు చేయించిన వారి మెటీరియల్ పేమెంట్ బిల్లుల చెల్లింపులో గోల్మాల్ జరిగింది. గత టీడీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లుల విడుదలకు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన తర్వాత దృష్టి సారించింది. ఈ అవకాశాన్ని కంబదూరు మండలంలోని ‘పచ్చ’ నేతలు తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. పనులు చేసిన వారికి మొండిచేయి చూపి.. తమ అనుచరులైన వారి ఖాతాలకు వేతనాలు మళ్లించి సొమ్ము చేసుకున్నారు. ఇందుకు ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. 2014 – 2019 మధ్య కాలంలో అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మండలంలో వివిధ శాఖల ద్వారా ఉపాధి హామీ పథకం నిధులతో 497 పనులు చేపట్టారు. 2019 నాటికి మెటీరియల్ పేమెంట్ కింద ఇవ్వాల్సిన బిల్లులు ఆగిపోయాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏడాది పాలన తర్వాత ప్రభుత్వం పెండింగ్ ఉపాధి బిల్లుల విడుదలకు చర్యలు తీసుకుంది. ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతలు వేతన బిల్లులపై కన్నేశారు. కొంతమంది ఉపాధి సిబ్బందితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. ఆనాడు పనులు చేసిన వారిని కాకుండా.. తాము చెప్పిన వారి ఖాతాలకు మెటీరియల్ పేమెంట్ డబ్బులు పడేలా ప్రణాళిక రచించారు. ఈ క్రమంలోనే మండలంలో శాఖల వారీగా అప్పట్లో చేసిన 497 పనులకు సంబంధించి రూ.22.34 లక్షల బిల్లులను టీడీపీ నేతల అనుచరుల ఖాతాలకు జమ చేశారు. తూతూ మంత్రంగా విజిలెన్స్ విచారణ.. కంబదూరు మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ నిధుల అక్రమాలపై రెండు రోజుల క్రితం అనంతపురం నుంచి డ్వామా విజిలెన్స్ అధికారి ఒకరు విచారణకు వచ్చారు. అయితే తూతూ మంత్రంగా విచారణ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి విచారణ ‘మమ’ అనిపించడం అనుమానాలకు తావిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉపాధి నిధులు జమ అయిన అకౌంట్లను పరిశీలించి ఉంటే పూర్తిస్థాయిలో అక్రమాలు వెలుగులోకి వచ్చేవని పలువురు తెలిపారు. పనులు చేసిన వారికి మొండిచేయి పచ్చ నేతల అనుచరుల ఖాతాలకు నిధులు జమ 2014– 19 నాటి బిల్లుల మంజూరులో అక్రమాలు -
పురుగు మందు పీల్చి ఉక్కిరిబిక్కిరి
గుంతకల్లుటౌన్: మొక్కజొన్న పంటలో మొవ్వ తొలుచు పురుగులను నియంత్రించడానికి ఆకుసుడుల్లో క్రిమిసంహారక మందులను వేస్తున్న తొమ్మిది మంది మహిళా వ్యవసాయ కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పురుగు మందు వాసన పీల్చడంతో దాని గాఢతకు విపరీతమైన చెమటలు పట్టి, వాంతులతో చేనులోనే కళ్లు తిరిగిపడిపోయారు. ఈ ఘటన ఆదివారం గుంతకల్లు మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వెస్ట్ గుంతకల్లు సమీపంలోని ఐదు మోరీల వద్ద బాపట్ల జిల్లా ద్రోణాదులకు చెందిన కౌలురైతు సుబ్బరాయుడు 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం రైతు పిలవడంతో మొక్కజొన్నలో పట్టిన పురుగు నివారణకు మందు చల్లడానికి ఒక్కొక్కరికీ రూ.280 చొప్పున కూలి మాట్లాడుకుని స్థానిక మహబూబ్నగర్ కాలనీకి చెందిన 19 మంది వ్యవసాయ కూలీలు ఒకే ఆటోలో కలిసి వెళ్లారు. కార్బొఫ్యూరాన్ 3 శాతం సీజీ అనే పురుగుమందు గుళికలను ఇసుకలో కలిపి ఆకుసుడుల్లో వేస్తుండగా.. మందు వాసన పీల్చడంతో వహీదాబేగం,మహాలక్ష్మి, వరలక్ష్మి, సుశీల, చంద్రకళ, శారదమ్మ, అశ్విని, రామాంజినమ్మ, నాగేశ్వరమ్మలకు విపరీతమైన చెమటలు పట్టి, వాంతులయ్యాయి. కళ్లు తిరిగి అక్కడే పడిపోయారు. కౌలురైతు, తోటికూలీలు వెంటనే వారిని ఆటోలో గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు, సిబ్బంది తక్షణ సేవలు అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పురుగు మందు గాఢత నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్లనే అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయవర్ధన్రెడ్డి తెలిపారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరమని, తరువాత పరీక్షలు నిర్వహించి వారిని డిశ్చార్జ్ చేస్తామని ఆయన తెలిపారు. కాగా.. మిగిలిన పది మంది కూలీలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో వారు ఇళ్లకు వెళ్లిపోయారు. కనీస జాగ్రత్తలు పాటించకపోవడమే కారణం మొక్కజొన్నలో కత్తెర పురుగులను నియంత్రించడానికి వినియోగించే కార్బొఫ్యూరాన్ 3 శాతం సీజీ పురుగు మందు చాలా ప్రమాదకరమైనది. పురుగుమందు గుళికలను ఇసుకలో కలిపేటప్పుడు చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించాలి. గాలి ఎదురుగా వచ్చినప్పుడు పురుగు మందు ముఖంపై పడుతుంది. అప్పుడు దానిని పీల్చడం వల్లనే అస్వస్థతకు గురవుతారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు కూడా మందు పిచికారీ చేయొద్దు, చల్లొద్దని ఎన్నిసార్లు అవగాహన కల్పించినా చాలా మంది వినడం లేదు. – లీనా వసుంధర, మండల వ్యవసాయాధికారిణి, గుంతకల్లు 9 మంది మహిళా వ్యవసాయ కూలీలకు అస్వస్థత -
అలా చేస్తే బాబుకు పుట్టగతులుండవ్
బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే చంద్రబాబుకు పుట్టగతులుండవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ హెచ్చరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన బీకేఎస్ మండల పరిధిలోని దయ్యాలకుంటపల్లి, వెంకటాపురం గ్రామాల్లో రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శైలజానాథ్, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ ఎం మోహన్రెడ్డి హాజరయ్యరు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తారంటూ మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను తీసుకువచ్చారన్నారు. ఏనాడూ మెడికల్ కళాశాలల గురించి మాట్లాడని చంద్రబాబు నేడు జగనన్న తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. పరిశీలకుడు ఎల్ఎం మోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉండాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ముసలన్న, ప్రతాప్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప, సర్పంచ్లు పార్వతి, రమేష్, పూల నారాయణస్వామి, కాటమయ్య, చికెన్ నారాయణస్వామి, వరికూటి కాటమయ్య, శివారెడ్డి, కుళ్లాయప్ప, పట్నం ఫనీంద్ర, బాలక్రిష్ణారెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందే మాజీ మంత్రి శైలజానాథ్ -
నేడు పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్! అనంతపురం సెంట్రల్: ‘న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే వారి ఎదుటే నాపై దాడి చేశారు. అయినా దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు’ అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరుల దాడిలో గాయపడిన మరో బాధితుడు ప్రభాకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ అంటూ వేడుకున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము శ్రీనగర్కాలనీ సమీపంలోని ఎలైట్హోమ్లో నివసిస్తున్నామన్నారు. ఈనెల 10న అక్కడ ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళ్లామన్నారు. పక్కింట్లో నివాసముంటున్న ఓ బాలుడు క్రికెట్ బాల్ వేయమని కోరగా వేశానని, ఆ బంతి భువన చక్రవర్తి కారుకు తగలిందని చెబుతూ కొంతమంది తనపై చెప్పుతో దాడి చేశారన్నారు. న్యాయం కోసం పోలీసుస్టేషన్కు వెళ్తే మళ్లీ పోలీసుల సమక్షంలోనే తనపై చేయి చేసుకున్నారని వాపోయారు. ఏఆర్ కానిస్టేబుల్ హరికుమార్ను కూడా కొట్టే ప్రయత్నం చేశారన్నారు. అన్నీ తెలిసిన మాలాంటి వారికే ప్రజాస్వామ్యంలో రక్షణ లేదంటే, ఇక సామాన్యులు ఎలా జీవనం సాగిస్తారని ప్రశ్నించారు. తాము తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకై నా సిద్ధమన్నారు. ఇప్పటికీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అల్లుడు తేజ అనుచరులమని చెప్పుకుంటూ కొందరు తమ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్ర స్థాయి గోల్ షూట్ విజేత ‘అనంత’ కదిరి అర్బన్: చిత్తూరు జిల్లా నేరేబైలు గ్రామంలో ఈ నెల 11, 12వ తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి గోల్ షూట్ పోటీల బాలికల విభాగంలో ఉమ్మడి అనంతపురం జట్టు విజయం సాధించింది. అబ్బాయిల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా గోల్షూట్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసన్నకుమార్ ఆదివారం వెల్లడించారు. గుత్తిలో టీడీపీ కార్యకర్తల గూండాగిరి గుత్తి: పట్టణంలో టీడీపీ కార్యకర్తలు గూండాగిరి ప్రదర్శించారు. దస్తగిరి, కుష్బూ అనే దంపతులపై అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశారు. వివరాలు.. రెండు మాసాల క్రితం దస్తగిరి ఇంటిని టీడీపీ కార్యకర్తలు బలవంతంగా ఖాళీ చేయించారు. అంతే కాకుండా భార్యాభర్తపై దాడి చేశారు. ఈ ఘటనపై దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 21 మందిపై కేసు నమోదు చేశారు. తమపైనే కేసు పెడతారా అంటూ ఆదివారం రాత్రి స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న దస్తగిరి, కుష్బూ దంపతులపై షణ్ముఖ, శివ, పుల్లయ్యతో పాటు మరో ముగ్గురు దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ సురేష్ సిబ్బందితో కలిసి బస్టాండ్కు చేరుకోగా.. అప్పటికే టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి ఉడాయించారు. గాయపడిన దంపతులను పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి పంపారు. అనంతరం వారు పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. పైగా వారినే గద్దించి స్టేషన్ నుంచి బయటకు పంపారు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని బాధితుడు దస్తగిరి చెప్పాడు. -
పేదలకు వైద్య విద్య దూరం
కళ్యాణదుర్గం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో నష్టపోయేది మన పిల్లలేనని, పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందకుండా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కళ్యాణదుర్గంలో ఆదివారం జరిగింది. కార్యక్రమంలో తలారి రంగయ్య మాట్లాడుతూ.. పేదలకు వైద్య విద్యను సులభతరం చేసేందుకు గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 వైద్య కళాశాలలకు అనుమతి తీసుకువచ్చారన్నారు. వీటిలో 5 కళాశాలలను ప్రారంభించి, అడ్మిషన్లు చేపట్టి తరగతులూ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారన్నారు. మిగిలిన 12 కళాశాలల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఓ మెడికల్ కాలేజ్ ఏర్పాటై ఉండేదన్నారు. అయితే వీటి నిర్మాణాలు వద్దని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాసి అడ్డుకోవడమే కాక, తాజాగా వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. దీంతో పేద విద్యార్థులకు వైద్య విద్య అందే పరిస్థితి లేకుండా పోతోందన్నారు. కళాశాలలు ప్రైవేట్ పరమైతే వైద్య విద్య అత్యంత ఖరీదుతో కూడుకుంటుందని, ఫలితంగా వేరే చిన్న దేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లిన మన పిల్లలు అనారోగ్యం బారిన పడటం, ఆక్సిడెంట్ల బారిన పడడం కారణంగా చాలా మంది చనిపోయారని గుర్తుచేశారు. ప్రభుత్వంతో డబ్బులు లేవంటూ సాకులు చెప్పడం సరికాదన్నారు. కూటమి కుట్రలను తిప్పికొట్టి ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు కోటి సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు రాస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పేరు, ఊరు, సెల్ నంబర్తో పాటు సంతకాలు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజ్కుమార్, మున్సిపల్ విభాగం వైఎస్సార్సీపీ కన్వీనర్ సుధీర్, రూరల్ మండలాల కన్వీనర్లు గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, పాలబండ్ల చంద్రశేఖర్రెడ్డి, జి.హనుమంతరాయుడు, కౌన్సిలర్లు తిరుమల వెంకటేశులు, గోపారం శ్రీనివాసులు, పరమేశ్వరప్ప, శెట్టూరు జెడ్పీటీసీ మంజునాథ్, దొడగట్ట నారాయణ, కిష్టప్ప, నియోజకవర్గ వివిధ విభాగాల అధ్యక్షులు నాగలక్ష్మి, తిప్పేస్వామి, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు యర్రంపల్లి కృష్ణమూర్తి, రామాంజనేయులు, నాయకులు మురళి, రామిరెడ్డి, రాజు, మల్లికార్జున, పాతలింగ, చరణ్, షెక్షావలి, బిక్కిహరి, రాజు, చిరు,ప్రతాప్, మాజీ జెడ్పీటీసీ రాజగోపాల్, దొడగట్ట నాయకులు గోవిందప్ప, బసవరాజు, సూరి, తమ్మన్న, బుశప్ప, చిత్తయ్య, ఎర్రిస్వామి, సవారప్ప, రాజు, రవి, పాలన్న, గంగన్నతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే నష్టపోయేది మన పిల్లలే మాజీ ఎంపీ తలారి రంగయ్య -
కూలిన కల్వర్టు రక్షణ గోడ – ఇద్దరికి గాయాలు
● నాసిరకం పనులే కారణమన్న స్థానికులు కళ్యాణదుర్గం: స్థానిక టీ సర్కిల్ మీదుగా 20 అడుగులకు పైగా వెడల్పుతో వెళుతున్న కల్వర్టుకు ఇటీవల నిర్మించిన రక్షణ గోడ ఆదివారం సాయంత్రం ఉన్నఫళంగా కుప్పకూలింది. అవతలి వైపుగా ఉన్న దుకాణాలకు, కల్వర్టుకు మధ్యలో రక్షణ గోడను కట్టారు. గోడ పక్కనే తోపుడు బండ్లను పెట్టుకుని వ్యాపారాలతో కొందరు జీవనం సాగిస్తున్నారు. గోడ కుప్పకూలుతుండగా గమనించిన స్థానికులు సాహసం చేసి కూరగాయల వ్యాపారి గోవిందమ్మ, అరటి పండ్ల వ్యాపారి కావేలమ్మను పక్కకు లాగారు. అప్పటికే గోడ కూలడంతో ఇద్దరూ గాయపడ్గారు. కూరగాయల బండితో పాటు ఓ ద్విచక్ర వాహనం శిథిలాల కింద చిక్కుకుని నుజ్జునుజ్జయ్యాయి. అరటి పండ్లు నేలపాలయ్యాయి. స్థానికులు అప్రమత్తం కాకుంటే ప్రాణాలకే ప్రమాదం ఉండేదని పలువురు వాపోయారు. క్షతగాత్రులను వెంటనే ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నాసిరకం పనులే కారణం.. కల్వర్టు పనులు చేపట్టిన టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ నాసిరకం పనులు సాగించారని, దీంతో గోడ కుప్పకూలిందంటూ పలువురు స్థానికులు ఆరోపించారు. ఆదివారం ఉదయం కూడా కల్వర్టు కింద పనులు చేశారని తెలిపారు. నీరు ఎక్కువగా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అండ చూసుకుని కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశారన్నారు. ప్రాణాలు పోయిఉంటే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి ఎమ్మెల్యేనే పూర్తి బాధ్యత వహించి, బాధితులను ఆదుకోవాలని కోరారు. కాగా, విషయం తెలుసుకున్న సదరు కాంట్రాక్టర్, టీడీపీ నేతలు ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించారు. -
రబీ అంచనా 1,07,503 హెక్టార్లు
అనంతపురం అగ్రికల్చర్: రబీలో 1,07,503 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. అందులో ప్రధానపంట కింద పప్పుశనగ 65,017 హెక్టార్లు కాగా ఆ తర్వాత నీటి వసతి కింద వేరుశనగ 17,982 హెక్టార్లు, మొక్కజొన్న 7,888, వరి 6,069, జొన్న 4,919, ఉలవ 1,377, పొద్దుతిరుగుడు 1,230 హెక్టార్లలో సాగులోకి రావొచ్చని చెబుతున్నారు. అక్కడక్కడా గోధుమ, సజ్జ, రాగి, కొర్ర, పెసర, మినుము, అలసంద, నువ్వులు, కుసుమ, ఆముదం తదితర పంటలు కూడా సాగులోకి వస్తాయని అంచనా వేశారు.గతేడాది రబీ సాధారణ సాగు 1.18 లక్షల హెక్టార్లతో పోల్చితే ఈ ఏడాది 11 వేల హెక్టార్లు తగ్గవచ్చంటున్నారు. 80,950 మెట్రిక్ టన్నుల ఎరువులు.. ఈ రబీలో 80,950 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరమని ప్రణాళిక రూపొందించారు. అందులో యూరియా 25,990 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్లు 37,900 మెట్రిక్ టన్నులు, డీఏపీ 9,500 మెట్రిక్ టన్నులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ) 4,900 మెట్రిక్ టన్నులు, సింగిల్ సూపర్పాస్ఫేట్ (ఎస్ఎస్పీ) 2,660 మెట్రిక్ టన్నుల ఎరువులు వివిధ కంపెనీల ద్వారా సరఫరా చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రబీ కింద 4 వేల మెట్రిక్ టన్నుల వరకు వచ్చాయన్నారు. విత్తనం కోసం ఎదురుచూపు.. రబీ మొదలై 12 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ రాయితీ కింద విత్తన పప్పుశనగ ఎప్పుడిస్తారో అర్థం కాక రైతులు విలవిల్లాడుతున్నారు. ధరలు, రాయితీలు, కేటాయింపులు ప్రకటించి నెల రోజులవుతున్నా విత్తన సేకరణే ప్రారంభించకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. అసలే కేటాయింపులు 28 వేల నుంచి 14 వేల క్వింటాళ్లకు, రాయితీ కూడా 40 శాతం నుంచి 25 శాతానికి పరిమితం చేసి ఇబ్బందులోకి నెట్టిన కూటమి సర్కారు... కేటాయింపుల మేరకై నా ఎప్పుడిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడం గమనార్హం. నాలుగు రోజులుగా అక్కడక్కడా తేలికపాటి వర్షాలకే పప్పుశనగ సాగును రైతులు ప్రారంభించారు. చంద్రబాబు సర్కారుపై ఆశలు సన్నగిల్లిన కొందరు విధిలేని పరిస్థితుల్లో బళ్లారి, కర్నూలు జిల్లాల నుంచి విత్తనం తీసుకువస్తున్నట్లు తెలిసింది. -
నో‘ట మాట’ లేక
టమాట ధరలు ఎప్పుడెలా ఉంటాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక్కోసారి ధరలు ఆకాశాన్నంటి రైతులకు లాభాలు తెచ్చి పెట్టే ఈ పంట.. మరో సారి అథఃపాతాళానికి పడిపోయి కన్నీరు పెట్టి స్తోంది. ఎక్కడ పడితే అక్కడ పారబోసేలా చేస్తోంది. కొన్ని రోజులుగా మార్కెట్లో టమాట ధరలు పూర్తిగా పడి పోయాయి. ఒక్కో బాక్సు రూ.70 నుంచి రూ. 100 లోపే పలుకుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టమాటలను మార్కెట్కు తీసుకువెళ్లే వాహనం ఖర్చులు కూడా మిగలకపోవడంతో దిక్కుతోచక రోడ్ల పక్కన పారబోస్తున్నారు. బ్రహ్మసముద్రం మండల పరిధిలోని పిల్లలపల్లి వద్ద ప్రధాన రహదారిపై కుప్పలు కుప్పలుగా టమాటలను పారబోసిన దృశ్యమిది. – బ్రహ్మసముద్రం: -
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
బొమ్మనహాళ్: ఈత సరదా ఓ బాలుడిని బలిగొంది. బొమ్మనహాళ్ ఎస్హెచ్ఓ కమల్బాషా తెలిపిన మేరకు.. బొల్లనగుడ్డం గ్రామానికి చెందిన రుద్రన్న, బసమ్మ దంపతుల కుమారుడు శివకుమార్ (16).. గోవిందవాడ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్నాడు. రెండవ శనివారం సెలవు కావడంతో తన స్నేహితులు ఆరుగురితో కలసి గ్రామ సమీపంలోని హగరి నదిలో ఉన్న కుంటలో ఈత కోసం వెళ్లాడు. అయితే శివకుమార్కు ఈత రాదు.. రెండు సార్లు మునిగిపోతుంగా స్నేహితులు వెలికి తీశారు. అయినా వినకుండా మూడో సారి కూడా నీటిలో దిగి గల్లంతయ్యాడు. సాయంత్రం వరకూ స్నేహితులు గాలించినా ఫలితం లేకపోయింది. విషయం పెద్దలకు తెలిస్తే తమను దండిస్తారనే భయంతో ఇంటికి చేరుకుని మిన్నకుండిపోయారు. రాత్రి అయిన శివకుమార్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి ఫిర్యాదు చేయడంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు తొలుత స్నేహితులను గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. వెంటనే గజ ఈతగాళ్లను రంగంలో దించి శివకుమార్ మృతదేహాన్ని వెలికి తీయించారు. ఆదివారం ఉదయం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చందనలో చోరీ యాడికి: రెండు రోజుల క్రితం యాడికిలోని ఐదు ఇళ్లలో ఒకే రోజు చోటు చేసుకున్న చోరీలను మరువక ముందే మండలంలోని చందన గ్రామంలో మరో ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. చందన గ్రామంలో నివాసముంటున్న ఆనంద్.. తాడిపత్రి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాడు. వారం క్రితం ఆనంద్ భార్య సరోజ, కుమారుడు, కుమార్తెతో కలిసి కర్ణాటకలోని స్వగ్రామానికి వెళ్లింది. ఆనంద్ తమ్ముడు రమణయ్య కుటుంబ సభ్యులూ ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు రెండు రోజుల క్రితం నంద్యాలకు వెళ్లారు. దీంతో ఇంటి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం... ఆనంద్ ఇంటికి తాళం వేసి ఉండడం గమనించిన దుండగులు శనివారం రాత్రి ప్రహరీ దూకి తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. విధులు ముగించుకుని శనివారం ఉదయం ఇంటికి చేరుకున్న ఆనంద్.. చోరీ విషయాన్ని గుర్తించి భార్యకు తెలపడంతో ఆదివారం ఉదయం ఆమె ఇంటికి చేరుకుంది. ట్రంకు పెట్టెలో ఉన్న 3 తులాల బంగారంతో పాటు 10 తులాల వెండి సామగ్రి, రూ.8 వేల నగదు అపహరించినట్లుగా నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 748 మంది టీచర్లు నేడు విధుల్లోకి అనంతపురం సిటీ: కొత్తగా ఉపాధ్యాయులుగా ఎంపికైన 748 మంది సోమవారం నుంచి విధులకు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నూతన ఉపాధ్యాయులకు విద్యా శాఖ అధికారులు జారీ చేశారు. కొత్తగా విధుల్లో చేరనున్న ఉపాధ్యాయులందరికీ జిల్లా విద్యా శాఖాధికారి ప్రసాద్బాబు శుభాకాంక్షలు తెలిపారు. విధుల్లోకి చేరిన మొదటి రోజు నుంచే ఫేషియల్ యాప్లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని డీఈఓ సూచించారు. పాత వారిని రిలీవ్ చేయండి.. కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారు సోమవారం విధుల్లో చేరనున్న నేపథ్యంలో ఆ స్థానాల్లో ప్రస్తుతమున్న వారిని వెంటనే రిలీవ్ చేయాలని ఎంఈఓలను డీఈఓ ఆదేశించారు. గతంలో బదిలీ అయి, సబ్స్టిట్యూట్ లేని కారణంగా డిప్యుటేషన్పై పాత స్థానాల్లో కొనసాగుతున్న వారు వెంటనే రిలీవ్ అయ్యేలా చూడాలన్నారు.‘పెళ్లి పెటాకులు’ కేసులో నిందితుడికి రిమాండ్ రాప్తాడురూరల్: పెళ్లి పెటాకులు చేసిన కేసులో నిందితుడు కటకటాలపాలయ్యాడు. అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామానికి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చమైంది. శనివారం ముహూర్తం, ఆదివారం తలంబ్రాలు పెట్టుకున్నారు. ఇంతలో అదే గ్రామానికి చెందిన వివాహితుడు బాలచంద్ర అంతకు ముందురోజు వరుడుకి ఫోన్ చేసి వధువుతో తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని, అందుకు సంబంధించిన ఫొటో కూడా పంపుతానని ఇద్దరు ఉన్న ఓ ఫొటోను మొబైల్కు పంపాడు. అలాంటి యువతిని పెళ్లి చేసుకుంటాన్నంటే నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేశాడు. దీంతో ఆందోళనకు గురైన వరుడు, అతని కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. బాలచంద్ర ఫోన్కాల్తోనే పెళ్లి చెడిపోయిందని, తనకు ఆయనకు ఏమాత్రం పరిచయం లేదని, కేవలం కక్ష కట్టి తన పెళ్లి చెడగొట్టాడంటూ బాధితురాలు ఇటుకలపల్లి పీఎస్లో చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రెండు రోజుల గాలింపు అనంతరం ఆదివారం బాలచంద్రను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. 3వ తరగతి విద్యార్థి అదృశ్యం రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కొడిమి దర్గా కొట్టాలుకు చెందిన 3వ తరగతి విద్యార్థి కనిపించడం లేదు. ఈ మేరకు అనంతపురం రూరల్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే...కొడిమి దర్గా కొట్టాలుకు చెందిన వేణు.. పాత సామాన్లు ఏరుకుంటూ వాటిని గుజరీకి వేయడం ద్వారా జీవనం సాగించేవాడు. ఈయనకు ముగ్గురు కుమారులు కాగా, పెద్దకుమారుడు ఈశ్వర్ చదువుకోలేదు. రెండో కుమారుడు నరసింహ 6వ తరగతి, మూడో కుమారుడు రామాంజనేయులు 3వ తరగతి ఉరవకొండలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ నెల 11న తమ్ముళ్లను ఉరవకొండకు వదిలేందుకు ఈశ్వర్ పిలుచుకెళ్తుండగా తాను ఇంటికివెళతానంటూ రామాంజనేయులు ఏడ్వడంతో రాచానపల్లి వద్ద బస్సులో నుంచి దించేసి వెళ్లారు. ఈశ్వర్ సాయంత్రం ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం తెలపడంతో కంగారుపడిన వారు రామాంజనేయులు కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం వేణు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు అనంతపురం రూరల్ పోలీసులు తెలిపారు. -
వైద్య సిబ్బందిపై దాడికి యత్నం
● గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఘటన గుంతకల్లుటౌన్: వైద్య సిబ్బందిపై ఓ రోగి, అతని సహాయకులు దాడికి యత్నించిన ఘటన గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జరి గింది. గుంతకల్లు టూటౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. శనివారం పట్టణంలోని సీఐటీయూ కాలనీ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో గాయపడిన వినోద్ చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీ విభాగానికి వచ్చాడు. అతనికి సహాయకులుగా ఉషాకిరణ్, సుధా, నారాయణ వచ్చారు. ఈ క్రమంలోనే డాక్టర్ సల్మాన్జావెద్ గాయపడిన వినోద్ను తాను చూస్తానని, సహాయకులుగా ఉన్న వారు బయటకు వెళ్లాలని సూచించారు. దీంతో కోపోద్రిక్తులైన ఉషాకిరణ్, సుధాలు వైద్యుడిని అసభ్యకరంగా తిట్టారు. చొక్కా పట్టుకుని లాగారు. అడ్డుగా వెళ్లిన నర్సులు రామాంజినమ్మ, హసీనాలను కూడా అసభ్యపదజాలంతో దూషించారు. దీన్నంతటినీ చిత్రీకరిస్తున్న సెక్యూరిటీ గార్డు ప్రవీణ్ను అంతు తేలుస్తామంటూ బెదిరించారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు, నర్సులు, సిబ్బంది మొత్తం టూటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి సీఐ మస్తాన్కు ఫిర్యాదు చేశారు. డాక్టర్ సల్మాన్ జావెద్ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, గాయపడిన వినోద్కు వైద్యం చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించినందుకే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రోగి సహాయకులు పేర్కొన్నారు. భయంగా విధులు నిర్వర్తిస్తున్నాం ప్రజలకు అనునిత్యం వైద్యసేవలందిస్తున్న తమకే రక్షణ లేకుండా పోతోందని ఆస్పత్రి నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుడిపై దాడిని అడ్డుకున్నందుకు తమను అసభ్యకరంగా దూషించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. రాత్రివేళ ఒక్కోసారి మద్యం సేవించి వచ్చే రోగి సహాయకులు బూతులు తిడుతున్నా గత్యంతరం లేక భరిస్తున్నామన్నారు. ఆస్పత్రి వద్ద మూత పడిన పోలీస్ ఔట్పోస్టును తెరిపించాలని వేడుకుంటున్నా పట్టించుకోవట్లేదని వాపోయారు. -
ఇన్చార్జ్లే దిక్కు!
● వేధిస్తున్న సబ్ రిజిస్ట్రార్ల కొరత అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ల కొరత వేధిస్తోంది. సీనియర్ అసిస్టెంట్లను ఇన్చార్జ్లుగా నియమించి నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటిల్లో ఆరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్ల పక్రియను కొనసాగిస్తున్నారు. అనంతపురంలోని రామ్నగర్ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు ఉండాల్సి ఉండగా ఒక్కరు సైతం లేకపోవడం గమనార్హం. దీంతో ఇటీవల రూరల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఇస్మాయిల్కు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పటించారు. రూరల్ కార్యాలయంలో సైతం రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ రెండు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. అక్కడ సైతం ఇన్ చార్జ్ను నియమించారు. కళ్యాణదుర్గం, గుత్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లకు ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చి రిజిస్ట్రేషన్ పక్రియను కొనసాగిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో సైతం ఇదే తంతు కొనసాగుతోంది. కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇద్దరు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. తనకల్లు, చిలమత్తూరు కార్యాలయాలకు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేకపోవడంతో అనంతపురం కార్యా లయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ప్రసాద్బాబును ఇన్చార్జ్గా చిలమత్తూరుకు పంపారు. తనకల్లులో అక్కడే పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్కు బాధ్యతలు అప్పగించారు. ప్రజలకు చుక్కలు.. రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేకపోవడంతో సీనియర్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సేవలను వినియోగించుకునేందుకు వచ్చే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. చిన్న పనికి సైతం రోజుల తరబడి ప్రదక్షిణ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను నియమించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మీని వివరణ కోరగా.. ఆమె స్పందించారు. ఉమ్మడి జిల్లాలో 9 మంది కొత్త సబ్ రిజిస్ట్రార్ల అవసరం ఉందన్నారు. ఇదే విషయాన్ని రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అక్కడి నుంచి కొత్త ఎస్ఆర్లను కేటాయిస్తారన్నారు. ఆర్డర్ రాగానే ఖాళీగా ఉన్న కార్యాలయాలకు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తామన్నారు. -
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. గంటకు 8 నుంచి 14 కి.మీ వేగంతో ఈశాన్యం నుంచి నైరుతి దిశగా గాలి వీచింది.
కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేయాలి అనంతపురం: మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు బి. నరేష్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు సాకే శైలజానాథ్, డాక్టర్ తలారి రంగయ్య, వై. విశ్వేశ్వర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎల్ఎం మోహన్ రెడ్డి, నార్పల సత్యనారాయణ రెడ్డి, రమేష్ రెడ్డి, బోయ తిప్పేస్వామి, మహేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంపై సమాలోచన చేశారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పాలన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో జరిగే నష్టాల గురించి గ్రామ స్థాయి నుంచే ప్రజలకు వివరించాలన్నారు. డాక్టర్ కావాలనే రిజర్వేషన్ వర్గాల కలను చిదిమేసిన సంగతి ప్రజలకు తెలియజెప్పాలని కోరారు. ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టే ర్యాలీలో అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. నవంబర్ 12న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలన్నారు. కోటి సంతకాల సేకరణలో పార్టీ అనుబంధ సంఘాలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. -
అక్రమంగా కేసు కట్టారు
కడదరకుంట రెవెన్యూ పొలం సర్వే నంబర్లు 122,123,124లో మాకు వ్యవసాయ భూమి ఉంది. భూమిలోకి వెళ్లేందుకు ఉన్న రస్తాని టీడీపీ నాయకులు వడ్డే ఆంజనేయులు ఆక్రమించాడు. దీనిపై మేము రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే రికార్డులు పరిశీలించి రస్తా ఉందని వారు తేల్చారు. 2023లో ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డు పనులు కూడా చేశారు. అయినా, అవతలి పక్షం వారి ఫిర్యాదుతో సీఐ రాజు నాపైనే కేసు కట్టి వేధిస్తున్నారు. – కురుబ రామచంద్ర, కడదరకుంట, కూడేరు మండలం -
రైతులను ఆదుకునే మనసు లేదా?
అనంతపురం:‘చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ముఖ్యంగా జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. రైతుల కష్టాలు దయనీయంగా మారాయి’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. శనివారం ఆయన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతుల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, దీంతో రైతులు పండించిన పంటలను రోడ్లపై పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారన్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో తీవ్ర వర్షాభావం నెలకొని వారి వేదన వర్ణనాతీతంగా మారిందన్నారు. వేరుశనగ, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేదు.. జిల్లాలో ప్రధాన పంట వేరుశనగ 4.50 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉన్నా కేవలం 2.25 లక్షల ఎకరాల్లో సాగు చేశారని గుర్తు చేశారు. ఆగస్టులో ఆలస్యంగా వర్షాలు కురిస్తే భూమి బీడు పెట్టలేక జొన్న, సజ్జ, కొర్రలు వేశారన్నారు. ఖరీఫ్ సీజన్లో కేవలం 28 రెయినీడేస్ నమోదయ్యాయని, గతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ తలెత్తలేదన్నారు. ఖరీఫ్లో సాగు చేసిన వేరుశనగ పంటకు ఇటీవల తెగుళ్లు ఆశించడంతో దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం వేరుశనగ సాగు కోసమే రైతులు రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టారని, దిగుబడి కూడా రాకపోవడంతో వారికి నేడు దిక్కుతోచడం లేదన్నారు. సీజన్ ముగిసినా జిల్లాలో ఈ–క్రాప్ బుకింగ్ 50 శాతం కాకపోవడంతో ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీపై నీలినీడలు కమ్ముకున్నాయని చెప్పారు. ఇప్పటికే 2023–24 ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా అందించలేదని, 2024–25లోనూ ఇన్పుట్, ఇన్సూరెన్స్ చెల్లించలేదని విమర్శించారు. ప్రస్తుత రబీ సీజన్లో పంటలు సాగు చేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నా విత్తన పప్పుశనగ అందించకపోవడం దుర్మార్గమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పప్పుశనగను 40 శాతం సబ్సిడీతో అందిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక 25 శాతానికే పరిమితం చేశారని మండిపడ్డారు. అది కూడా గత ఏడాది 27 వేల క్వింటాళ్లకు పైగా విత్తన పప్పుశనగ కేటాయిస్తే ఈ ఏడాది 14 వేల క్వింటాళ్లకు కుదించి రైతులకు అన్యాయం చేశారన్నారు. సబ్సిడీ విత్తనాల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్న దౌర్భాగ్య పరిస్థితులు తీసుకొచ్చారని మండిపడ్డారు. రైతులు అవస్థలు పడుతున్నా జిల్లాలో ప్రజాప్రతినిధులకు పట్టడంలేదని, లిక్కర్ షాపులు, కాంట్రాక్ట్లు చేసుకోవడానికే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. ఇప్పటిదాకా కనీసం ఐఏబీ సమావేశం నిర్వహించలేదంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో 40 నుంచి 50 శాతం సబ్సిడీతో పప్పుశనగ విత్తనాన్ని రైతుకు ఎంత అవసరం ఉంటే అంత పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయం కూడా అందజేయాలని కోరారు. నెట్వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి వైద్య సేవలు సజావుగా సాగేలా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ అంటే డాక్టర్ వైఎస్ఆర్ పేరు గుర్తుకొస్తుందన్న భయంతో పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, కల్చరల్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కేశవ రెడ్డి, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. కరువు రక్కసితో అన్నదాతల కుదేలు ఇన్పుట్, ఇన్సూరెన్స్ అందించడంలో ప్రభుత్వం విఫలం ఇప్పటిదాకా కనీసం ఐఏబీ సమావేశం నిర్వహించలేదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి ధ్వజం -
మోసం చేయడం చంద్రబాబు నైజం
● మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజంబుక్కరాయసముద్రం: నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన శనివారం బీకేఎస్ మండల పరిధిలోని గాంధీ నగర్, అమ్మవారిపేట, రేకులకుంట గ్రామంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శైలజానాథ్, పార్టీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్కుమార్ రెడ్డి హాజరయ్యరు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ను మోసం చేసి టీడీపీని లాక్కున్నారన్నారు. ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తర్వాత మోసం చేయడాన్ని రివాజుగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రమూ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు 30 ఏళ్ల చరిత్రలో చెప్పుకోదగ్గ ఒక్క పథకమూ లేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వైఎస్సార్ సీపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండాలన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముసలన్న, మహిళా రాష్ట్ర కార్యదర్శి లలితా కల్యాణి, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప, సర్పంచ్లు పార్వతి, నరసమ్మ, పూల నారాయణస్వామి, చికెన్ నారాయణస్వామి, సాకే నారాయణస్వామి, ఆది, ముత్యాలశీన, నందినే మల్లికార్జున, 6 మండలాల అధ్యక్షులు పూల ప్రసాద్, ఎల్లారెడ్డి, మహేశ్వరెడ్డి, ఖాదర్వలి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శిలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతున్న మాజీ మంత్రి శైలజానాథ్ -
మందలించారని యువకుడి ఆత్మహత్య
రాప్తాడు: ఇంట్లో మందలించారని మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం రైల్వే పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.... అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లికి చెందిన రాము, లక్ష్మీదేవి దంపతులు. పదేళ్ల క్రితం రాము మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడు కులవర్దన్ (21) వ్యవసాయ పనులతో పాటు తల్లితో కలిసి పాడి ఆవులు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇదిలా ఉండగా ఏడాది కిత్రం అప్పు చేసి రూ.లక్ష విలువైన బైక్ కొనుగోలు చేశాడు. వీటిని తీర్చలేక, పనులకు వెళ్లకపోవడంతో ఇంట్లో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన కులవర్దన్ శనివారం గంగులకుంట గ్రామ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే కీమెన్ సమాచారంతో ధర్మవరం రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతుని వద్ద దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుతాసుపత్రికి తరలించారు. -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగన్
అనంతపురం : అణగారిన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. అనంతపురంలోని ఆ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు అధ్యక్షతన ఎస్సీ సెల్ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు బోరెడ్డి నరేష్ కమార్రెడ్డి, విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళిత సామాజిక వర్గాలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు అకృత్యాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు రూ.77 వేల కోట్లు ఖర్చు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఎస్సీలకు నయాపైసా ఖర్చు చేయలేదన్నారు. ఈ ప్రభుత్వ మోసాన్ని అందరికీ తెలియచెప్పాలన్నారు. రాష్ట్రమంతటా లక్ష మంది ఎస్సీ యువకులతో ‘జగనన్న దళిత ఫోర్స్’ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో నూతనంగా మంజూరైన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే ఎస్సీ కేటగిరీలో 880 సీట్లు కోల్పోయే ప్రమాదముందన్నారు. డాక్టర్ కావాలనే కలను కూటమి ప్రభుత్వం చిదిమేసిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప, ఉమ్మడి జిల్లా అబ్జర్వర్ నల్లాని బాబు, రాష్ట్ర అధికారి ప్రతినిధి ఎగ్గుల శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నగర మహిళా అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, జిల్లా ప్రధాన కార్యదర్శి శోభ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పసులూరు ఓబులేసు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గోవిందప్ప, రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.రాఘవ, గుంతకల్లు అధ్యక్షుడు వీరేష్ బాబు, కళ్యాణదుర్గం అధ్యక్షడు తిప్పేస్వామి, రాయదుర్గం అధ్యక్షుడు కె.రామాంజినేయులు, ఉరవకొండ అధ్యక్షుడు అక్కులప్ప, కంబదూరు జెడ్పీటీసీ నాగరాజు, శింగనమల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఆంజినేయులు, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేది జగన్మోహన్రెడ్డేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధికారాన్ని అప్పగించడడంతో పాటు సమ సమాజాన్ని స్థాపించడమే ఆయన లక్ష్యమని అన్నారు. ఇందులో భాగంగానే గత మంత్రి వర్గంలో 70 శాతం బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అప్పగించారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు పెత్తందార్లకు దన్నుగా ఉంటూ పేదలను విస్మరించారని అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు బోరెడ్డి నరేష్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలతో పాటు ఆర్థిక, సామాజిక న్యాయం కల్పించారని గుర్తు చేశారు. సమసమాజ స్థాపనే జగన్ లక్ష్యం పేదలను విస్మరించిన బాబు కూటమి ప్రభుత్వంలో దళితులపై పెరిగిన అకృత్యాలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో ఎస్సీ విద్యార్థులకు అన్యాయం ఈ అన్యాయాన్ని ప్రతి పౌరునికీ తెలియజేయాల్సిన బాధ్యత మనదే లక్ష మంది ఎస్సీ యువకులతో జగనన్న ఫోర్స్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు -
గురుకులాల సమస్యలపై అలసత్వం
అనంతపురం సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.రమణారెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో ఎస్టీయూ అనుబంధం సాంఘిక సంక్షేమ గురుకుల విభాగం రాష్ట్ర స్థాయి ప్రతినిధి లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై రమణారెడ్డి మాట్లాడారు. గురుకులాల్లో పాత టైం టేబుల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీజీటీ హిందీ పోస్టును పునరుద్ధరించాలని గురుకుల విభాగం రాష్ట్ర ప్రతినిధి లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. గురుకులాల్లోని క్వార్టర్స్కు ఏడాదిన్నర కాలంగా పూర్తి హెచ్ఆర్ఏ పేరుతో రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని రాష్ట్ర కో కన్వీనర్ రామానాయుడు ధ్వజమెత్తారు. అయితే క్వార్టర్స్ శిథిలావస్థకు చేరినా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. గురుకులాల్లో డీఎస్పీ ద్వారా పోస్టు కోల్పోయిన పార్ట్ టైం టీచర్లకు మిగిలిన ఖాళీల్లో అవకాశం కల్పించాలని మరో ప్రతినిధి ఫకృద్దీన్ కోరారు. అదనపు ప్రధాన కార్యదర్శి సూర్యుడు, అసోసియేట్ అధ్యక్షుడు నారాయణస్వామి, తిరుపతయ్య మాట్లాడారు. జిల్లా కార్యదర్శి మల్లికార్జున, అరుణ్కుమార్, చిన్నన్న, హనమంతు, వన్నూరుస్వామి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి -
యువతులు అన్ని రంగాల్లోనూ రాణించాలి
● ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పిలుపు అనంతపురం కల్చరల్: యువతులు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పిలుపునిచ్చారు. ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) రాష్ట్ర మహాసభల సందర్భంగా మూడురోజుల పాటు సాగిన సాంస్కృతికోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాలు వేదికగా సాగిన వేడుకలకు ఐద్వా రాష్ట్ర నేతలు రమాదేవి, సావిత్రి, డాక్టర్ ప్రసూన, డాక్టర్ జగర్లపూడి శ్యామసుందరశాస్త్రి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు రియాజుద్దీన్, వన్నూర్ మాస్టర్ తదితరులు ఆత్మీయ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం కూడా కలిసి రావడంతో వారు చిన్నారులకు బోధనా పద్ధతుల్లో మహిళల శక్తిని, సాధికారతను వివరించిన తీరు ప్రశంసలందుకుంది. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ముగింపు ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా అశోక్మాస్టర్ , విజయ్మాస్టర్ శిష్య బృందాలతో కలిసి పల్లెటూరు మా పల్లెటూరు, ఘల్లు ఘల్లు జోడెద్దులబండిరా నృత్యాలు, వరకట్నం లఘునాటికను నిషిత , ఆరాధ్యా బృందాల అద్భుతంగా ప్రదర్శించి మెప్పించారు. అలాగే ప్రజానాట్యమండలి కళాకారుల ఉద్దీపన గీతాలతో ఆడిటోరియాన్ని హోరెత్తించారు. అనంతరం మూడురోజులుగా ప్రేక్షకులను అలంరింపజేసిన మాస్టర్లకు, చిన్నారులకు జ్ఞాపికలందించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల, చంద్రిక, అశ్విని, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. -
డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె
అనంతపురం మెడికల్: తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని పీహెచ్సీ వైద్యులు స్పష్టం చేశారు. డిమాండ్ల సాధన కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు ఏడో రోజు శనివారం కొనసాగాయి. పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని మండిపడ్డారు. పీజీ మెడికల్ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా క్లినికల్ విభాగంలో 20 శాతం బ్రాంచ్లో కొనసాగించాలన్నారు. అలాగే చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి సంబంధించి అలవెన్స్లు ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మెను ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు డాక్టర్ శివసాయి, డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, డాక్టర్ శివకృష్ణ పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో కార్మికుడి మృతి కుందుర్పి: విద్యుత్ కార్యాలయం వద్ద మరమ్మతులు చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విద్యుత్ శాఖ, పోలీసు అధికారులు తెలిపిన మేరకు... తాడిపత్రికి చెందిన రమేష్ అనే కాంట్రాక్టర్ కుందుర్పిలో వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన జనార్ధనాచార్యులు (34)తో శనివారం విద్యుత్ కార్యాలయంలో మరమ్మతులు చేయిస్తున్నాడు. ఉన్నట్టుండి విద్యుత్ షాక్కు గురవడంతో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ ఆర్టీటీ ఉద్యోగి మృతి రాప్తాడురూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎకాలజీ సెంటర్ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఎకాలజీ సెంటర్ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నాగరాజు (45) ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 7న పంగల్ రోడ్డు వైపు బైకులో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ నాగరాజును సర్వజనాస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి చేజారిందని తేల్చారు. ఈ క్రమంలో తిరిగి అక్కడి నుంచి అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించగా...చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈయన భార్య సుచరిత బెళుగుప్ప జెడ్పీ హైస్కూలులో గణితం టీచరుగా పని చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నాగరాజు మృతి బాధాకరమని ఎంపీపీ కమలమ్మ, సర్పంచులు అతావుల్లా, బొమ్మయ్య, ఓబన్న పేర్కొన్నారు. -
పాపం జయరంగారెడ్డి..
● రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం అవస్థలు ● ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేయడంతో సకాలంలో అందని వైద్యం పుట్లూరు: నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోవడంతో సకాలంలో వైద్యం అందక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల పదో తేదీన ఉపాధి హామీ పనుల కోసం వెళుతున్న సమయంలో తూఫాన్ వాహనం ఢీకొనడంతో గోపురాజుపల్లికి చెందిన జయరంగారెడ్డి, వసంత గాయపడ్డారు. వీరిలో జయరంగారెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కూలి పనులకు వెళ్లి జీవనం సాగించే జయరంగారెడ్డి కుంటుంబంలో ఇప్పటికే భార్య కంటి ఆపరేషన్ చేయించుకోగా, కుమారుడు రాజారెడ్డి నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో అండగా ఉన్న జయరంగారెడ్డి రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో ఆ కుటుంబంలో అంధకారం నెలకొంది. ఇదే సమయంలో ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పలు నిలిపివేయడంతో సకాలంలో మెరుగైన వైద్యం అందలేదు. గాయపడిన జయరంగారెడ్డిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కాలు విరగడంతో పాటు నరాలు తెగిపడటం వల్ల సర్జరీ చేయడానికి న్యూరో సర్జన్ అందుబాటులో లేరనే కారణంతో చికిత్స ఆలస్యమౌతోంది. రోజులు గడిస్తే కాలు తొలగించాలని వైద్యులు చెబుతుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటుగా వైద్యం చేయించేందుకు ఆపన్నహస్తం కోసం అర్థిస్తున్నారు. ప్రత్యేక సహాయ నిధితో జయరంగారెడ్డిని ఆదుకోవాలని గోపురాజుపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. -
దళితులపై దౌర్జన్యాలను తిప్పికొట్టాలి
దళితులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోఓబులేసు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మిద్దె కుళ్లాయప్ప పిలుపునిచ్చారు.నార్పల మండలంలో ఎస్సీ యువకుడు, వికలాంగుడు అయిన చిన్న కుళ్లాయప్పను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయించి మడకశిరకు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇబ్బందులకు గురి చేయించారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై మండిపడ్డారు. కుప్పంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఎంఎస్ రాజు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి ఏనాడైనా స్పందించారా అని నిలదీశారు. దళిత బిడ్డల మానప్రాణాలు పోతున్నా.. పట్టించుకోకుండా.. చంద్రబాబు తొత్తుగా మారారని విమర్శించారు. సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు -
భర్త, కుమారుడి ఆచూకీ తెలపండి
యాడికి: ‘యాడికి పోలీసులు న్యాయం చేయలేదు. నా భర్త, కుమారుడి ఆచూకీ తెలిపి మీరైనా న్యాయం చేయండి’ అంటూ తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి వద్ద లక్ష్మిదేవి అనే మహిళ శనివారం మొరపెట్టుకుంది. వివరాలు.. ఈ నెల 8వ తేదీన యాడికి మండలం వెంగన్నపల్లికి చెందిన లక్ష్మిదేవి పట్ల అదే గ్రామానికి చెందిన విశ్వనాథ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని లక్ష్మిదేవి తన భర్త నారాయణ స్వామి, పెద్ద కుమారుడు నవీన్కు చెప్పింది. వారు విశ్వనాథ ఇంటికి వెళ్లి నిలదీయడంతో గొడవ జరిగింది. అనంతరం విశ్వనాథ తన నలుగురు సోదరులతో కలిసి లక్ష్మిదేవి ఇంటిపై దాడి చేశారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి లక్ష్మిదేవి, నారాయణ స్వామి, నవీన్ బయలు దేరుతుండగా ఇద్దరు పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. అనంతరం అదేరోజు సుమారు 10 మంది పోలీసులు వచ్చి ముగ్గురినీ పోలీస్టేషన్కు తీసుకెళ్లారు. లక్ష్మిదేవిని అర్ధరాత్రి ఇంటికి పంపారు. గొడవ జరిగిన నేపథ్యంలో ఆమె తన సొంతూరికి వెళ్లకుండా తన బంధువులైన వీరన్నపల్లికి చేరుకుంది. పోలీసులు నారాయణ స్వామి, నవీన్ను మూడు రోజులైనా ఇంటికి పంపలేదు. పైగా నారాయణ స్వామి, లక్ష్మిదేవి, నవీన్తో పాటు మరి కొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మిదేవి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. లక్ష్మిదేవిని కూడా మూడు రోజుల పాటు పోలీస్స్టేషన్ చుట్టూ తిప్పారు. ఈ క్రమంలో శనివారం తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి యాడికి పోలీసుస్టేషన్కు లక్ష్మిదేవిని పిలిపించి జరిగిన సంఘటనపై విచారణ చేశారు. తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని, పోలీసుల తీరును ఏఎస్పీకి లక్ష్మిదేవి వివరించి న్యాయం చేయాలని వేడుకుంది. ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని లక్ష్మిదేవికి ఏఎస్పీ భరోసా ఇచ్చారు. -
ప్రజా శ్రేయస్సే లక్ష్యం
అనంతపురం కార్పొరేషన్: ప్రజా శ్రేయస్సే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదింటి బిడ్డల వైద్య విద్య కలను ముఖ్యమంత్రి చంద్రబాబు చిదిమేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న ‘వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం’ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం వెఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్లను అనంత ఆవిష్కరించారు. ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేందుకు కోటి మందితో సంతకాల సేకరణ చేపడుతున్నట్లు చెప్పారు. నవంబర్ 22 వరకు సంతకాల సేకరణ కొనసాగుతుందన్నారు. ఈ ప్రజా ఉద్యమంలో మేధావులు, ప్రజా సంఘాలు, వామపక్షాలు భాగస్వాములు కావాలన్నారు. ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ర్యాలీలు చేపడతామన్నారు. నాడు ప్రజారోగ్యానికి పెద్దపీట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన విషయాన్ని అనంత గుర్తు చేశారు. ఆస్పత్రుల అధునికీకరణ, విలేజ్ హెల్త్ క్లినిక్లు, అర్బన్ హెల్త్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చారన్నారు. వైద్య కళాశాలలు వస్తే అనుబంధంగా బోధనాస్పత్రులు వస్తాయని, సూపర్ స్పెషాలిటీ వైద్యం ప్రజలకు అందుతుందని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించి రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,300 కోట్లతో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. రెండేళ్లలోనే ఏడు వైద్య కళాశాలలు పూర్తి చేశారని, 2023–24లో ఐదు కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయని వివరించారు. మరో రెండు కళాశాలలు గతేడాది ప్రారంభించాల్సి ఉందన్నారు. అయితే చంద్రబాబు తన బంధువులు, వర్గీయులకు లబ్ధి చేకూర్చడం కోసం కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని కుట్ర పన్నారన్నారు. బాబుకు ప్రైవేటీకరణపైనే మోజు చంద్రబాబుకు ప్రైవేటీకరణపై మోజు ఎక్కువ అని అనంత ధ్వజమెత్తారు. 1998లోనూ అనంతపురం మెడికల్ కళాశాలను ట్రస్ట్కు అప్పగించాలని ప్రయత్నించారని, అప్పుడు ప్రజా ఉద్యమం చేపడితే ఆయన దిగివచ్చారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు నూతన వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జపం చేస్తున్నారని మండిపడ్డారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజా ఉద్యమ కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెన్నం శివరామిరెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వత్థనాయక్, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్, శ్రీదేవి, మల్లెమీద నరసింహులు, అమర్నాథ్రెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, బాకే హబీబుల్లా, ఓబిరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, నాయకులు చింతకుంట మధు, ఆసిఫ్, శ్రీనివాస్ దత్తా, సత్రసాల మంజునాథ్, జావెద్, భారతి, రాధాయాదవ్, ఉషా, హజరాబీ, కై లాష్, సాకే కుళ్లాయస్వామి, మీసాల రంగన్న, తలారి వెంకటేష్, ఉదయ్, కార్పొరేటర్లు కమల్భూషణ్, సాకే చంద్రలేఖ, ఇసాక్, తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నవంబర్ 22 వరకు కోటి సంతకాల సేకరణ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
నంది విగ్రహం అపహరణ
పెద్దవడుగూరు: మండలంలోని పి.వీరన్నపల్లిలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న నంది విగ్రహాన్ని గురువారం రాత్రి దుండగులు అపహరించారు. గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండడంతో గ్రామస్తులు అటుగా వెళ్లలేకపోయారు. శుక్రవారం ఉదయం ఆలయానికి వెళ్లిన భక్తులు.. నంది విగ్రహం కనిపించడకపోవడంతో విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. పూజారి ఆదిశేషయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల వలలో రైతు బొమ్మనహాళ్: మండలంలోని కొలగానహళ్లి గ్రామానికి చెందిన రైతు కావలి రామానాయుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని నగదు కోల్పోయాడు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయన అత్యవసర పరిస్థితుల్లో తన పొలాన్ని అమ్మి రూ.4.50 లక్షలు ఉద్దేహాళ్లోని ఏపీజీబీలో ఉన్న తన ఖాతాలో జమ చేసి ఉంచాడు. ఇటీవల రూ.3.50 లక్షలు డ్రా చేశారు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటల సమయంలో రైతు మొబైల్లో కోటక్ మహేంద్ర అనే యాప్ను ఓపెన్ చేయగా తన ఏపీజీబీ బ్యాంక్ ఖాతా నుంచి 5 సార్లు రూ.19,999లు చొప్పున మొత్తం రూ. 1 లక్ష నగదు మరో ఖాతాకు బదిలీ అయినట్లుగా మెసేజ్లు అందాయి. దీంతో వెంటనే బ్యాంక్ అధికారులను కలసి విషయాన్ని తెలపడంతో వారు ఖాతాను పరిశీలించారు. ఖాతా నుంచి నగదును సైబర్ నేరగాళ్లు అపహరించినట్లుగా నిర్ధారించుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో బాధితుడు స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు 1930 నంబర్కి సమాచారం అందించాడు. -
గార్మెంట్స్ అభివృద్ధికి కృషి
● జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన రాయదుర్గంటౌన్: గార్మెంట్స్ పరిశ్రమ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం ఆయన రాయదుర్గం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత గుమ్మఘట్టలోని భైరవానితిప్ప ప్రాజెక్ట్ను సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా రాయదుర్గంలోని కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్సీ– పుర భవనం) పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి సీఎఫ్సీ ద్వారా యూనిట్లు ప్రారంభించి మహిళా కార్మికులకు కుట్టు శిక్షణతోపాటు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్కడి నుంచి ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసి.. వైద్య సేవలపై రోగులతో ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది కొరతపై ఆస్పత్రి సూపరింటెండెంట్ మెర్సీ జ్ఞానసుధను అడిగి తెలుసుకున్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. అనంతరం పట్టణంలోని బళ్లారి రోడ్డులోని శ్రీఆంజనేయస్వామి కల్యాణమంటపంలో దుకాణదారులు ఏర్పాటు చేసిన జీఎస్టీ సంస్కరణలతో తగ్గిన టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రదర్శనను తిలకించారు. ఎవరైనా జీఎస్టీ అమలును పట్టించుకోకపోతే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 74 ఉడేగోళంలోని టెక్స్టైల్స్ పార్కును తనిఖీ చేసి యూనిట్లు విస్తృతంగా నడిచేందుకకు ఔత్సాహికులకు అన్ని రకాల సహాయసహకారాలు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమాల్లో ఆయనతోపాటు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయనతో కాసేపు చర్చించారు. రూ.10 లక్షలు మంజూరు గుమ్మఘట్ట: గుమ్మఘట్టలోని ఎంజేపీ గురుకుల పాఠశాల అభివృద్ధి పనుల కోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తామని కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. శుక్రవారం గురుకుల పాఠశాలను సందర్శించిన ఆయన.. సమస్యలపై ప్రిన్సిపాల్ శ్రీదేవిని ఆరా తీశారు. అలాగే గోనబావి సమీపంలో అర్ధంతరంగా ఆగిపోయిన పాఠశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. -
స్తంభించిన ఎన్టీఆర్ వైద్య సేవలు
● నెట్వర్క్ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు బంద్ ● సర్వజనాస్పత్రికి పరుగులు పెట్టిన రోగులు అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల ప్రాణం మీదకు తెస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేసిన చేసిన వైద్య చికిత్సలకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని 46 నెట్వర్క్ ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేశాయి. దీంతో కేన్సర్, డయాలసిస్, ఆర్థో రోగులు, గర్భిణులు, బాలింతలు, హృద్రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అధిక సంఖ్యలో రోగులు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి క్యూ కట్టారు. నగరంలోని ప్రముఖ ఆస్పత్రులు శస్త్రచికిత్సలను నిరాకరించడంతో రోగులు, వారి బంధువులు ఆందోళనకు లోనయ్యారు. కొందరు ప్రైవేట్గానే డబ్బులు వెచ్చించి శస్త్రచికిత్సలు చేయించు కోవాల్సి వచ్చింది. కేవలం 10 ఫ్రీ ఆథరైజేషన్లు రెగ్యులర్గా అనంతపురంలోని వివిధ నెట్వర్క్ ఆస్పత్రుల్లో రోజూ 150 నుంచి 200 మంది రోగులకు ఫ్రీ ఆథరైజేషన్లు నమోదు చేస్తారు. దాని ఆధారంగా ఎన్టీఆర్ వైద్య సేవ అనుమతితో శస్త్రచికిత్సలు చేస్తారు. కాగా ఆస్పత్రులు శస్త్రచికిత్సలకు నిరాకరించడంతో శుక్రవారం కేవలం 10 ఫ్రీ ఆథరైజేషన్లు మాత్రమే నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కొన సాగితే రానున్న రోజుల్లో రోగులు మరింత ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. ● ఈ ఆటోలో కూర్చున్న పెద్దాయన ధర్మవరం మండలం పోతులనాగేపల్లికి చెందిన సాకే గంగన్న. నరాలు, గుండె తదితర సమస్యలతో అనంతపురం సాయినగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చాడు. కాగా ఎన్టీఆర్ వైద్య సేవలు లేవని, ప్రైవేట్గా చూపించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. ఎమర్జెన్సీ సేవలందుతున్నాయి జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు అందుతున్నాయి. డయాలసిస్, కేన్సర్, తదితర రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ తదితరులతో మాట్లాడాం. గుండె, నెఫ్రాలజీ, కేన్సర్ కేసులకు సత్వర వైద్యం అందించేలా చూడాలని చెప్పాం. – డాక్టర్ కిరణ్కుమార్రెడ్డి, జిల్లా కో ఆర్డినేటర్, ఎన్టీఆర్ వైద్య సేవ -
ప్రకటనల్లోనే గుత్తి కోట అభివృద్ధి
గతేడాది పర్యాటక దినోత్సవం నాడు అప్పటి కలెక్టర్ వినోద్కుమార్ గుత్తి కోటను సందర్శించారు. గుత్తి కోట పరిరక్షణకు నిధులు కేటాయించి అభివృద్ది చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఈ విషయంగా ప్రజాప్రతినిధులందరినీ అనేకసార్లు కలిసి విన్నవించాం. అయినా గుత్తి కోట అభివృద్ధి మాత్రం ప్రకటనలకే పరిమితమైంది. ఇది ఒక్క గుత్తి కోటదే కాదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. పర్యాటక రంగం అభివృద్ధిపై ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టి సారించాలి. – రాజా రాయలసీమ, గుత్తి కోట పరిరక్షణ సమితి ప్రతినిధి -
బియ్యం పంపిణీలో డీలర్ చేతివాటం
● తక్కువ వేస్తున్నాడంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ నిరసన కళ్యాణదుర్గం: డీలర్ చేతివాటం ప్రదర్శించి తక్కువ తూకంతో బియ్యం వేస్తున్నాడంటూ కళ్యాణదుర్గంలోని వడ్డేకాలనీకి చెందిన లబ్ధిదారురాలు సల్లా లక్ష్మీదేవి వాపోయింది. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటరిగానే నిరసన వ్యక్తం చేసింది. వివరాలు.. సల్లా లక్ష్మీదేవికి ప్రభుత్వం అంత్యోదయ కార్డు (2803192003) జారీ చేసింది.నిబంధన మేరకు ఆమెకు ప్రతి నెలా 35 కిలోల బియ్యం అందాలి. అయితే వడ్డే కాలనీలో ఉన్న రేషన్ షాప్ (12223070) డీలర్ ప్రతి నెలా ఆమెతో వేలిముద్ర వేయించుకుని 22 కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నాడు. పలుమార్లు అడిగినా వచ్చే నెలలో వేస్తానంటూ నమ్మబలికేవాడు. ఈ విషయంగా మనస్తాపం చెందిన బాధితురాలు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేసింది. అనంతరం తహసీల్దార్ భాస్కర్ను కలసి తన గోడు వెల్లబోసుకుంది. స్పందించిన తహసీల్దార్ వెంటనే సదరు రేషన్ షాపును పరిశీలించాలని వీఆర్వో గంగాధర్ను ఆదేశించారు. వీఆర్వో తనతో పాటు బాధితురాలిని పిలుచుకెళ్లి న్యాయపరంగా ఆమెకు దక్కాల్సిన 35 కిలోల బియ్యాన్ని ఇప్పించారు. -
బొమ్మనహాళ్లో కుండపోత వర్షం
అనంతపురం అగ్రికల్చర్/ బొమ్మనహాళ్: జిల్లాలో రెండు రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 17 మండలాల పరిధిలో 7.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బొమ్మనహాళ్ మండలంలో 84.2 మి.మీ కుండపోత వర్షం కురిసింది. మండలంలోని సిద్దరాంపురం, చంద్రగిరి, కురువల్లి గ్రామల్లో వరి, మొక్కజొన్న, మిరప, జొన్న తదితర పంటలు నీటమునిగాయి. చంద్రగిరిలో గ్రామదేవత ఆలయంలోకి వర్షం నీరు చేరింది. రోడ్డుపై వర్షపు నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బండూరు వంక పారడంతో గోవిందవాడ, దర్గాహొన్నూరు తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరా కూడా గ్రామాల్లో నిలిచిపోయింది. ఇక రాప్తాడు మండలంలో 41 మి.మీ, బెళుగుప్ప 24.8, కళ్యాణదుర్గం 21, పామిడి 20.4, బ్రహ్మసముద్రం 12 మి.మీతో పాటు తాడిపత్రి, గుంతకల్లు, విడపనకల్లు, అనంతపురం, గార్లదిన్నె, యల్లనూరు, పుట్లూరు, కంబదూరు, శెట్టూరు, గుమ్మఘట్ట తదితర మండలాల్లో జడితో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 100.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 18.8 మి.మీ నమోదైంది. -
రాష్ట్రంలో ధృతరాష్ట్రుడి పాలన
రాప్తాడు రూరల్: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రెడ్డిగారి రమేష్కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు రాప్తాడు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు తాడిపత్రి రమేష్రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు పరిశీలకులు రమేష్కుమార్రెడ్డి మాట్లాడుతూ... ప్రజల కోసం నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను నేడు చంద్రబాబు ప్రైవేట్పరం చేస్తున్నారని మండిపడ్డారు. 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఎగ్గొట్టారన్నారు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి వంచించారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు విపరీతమైన ధనదాహంతో అక్రమ వసూళ్లు, అరాచకాలకు తెరలేపారన్నారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై తీవ్ర వివక్ష చూపిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ సంతకాలు చేయాలి తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ సంతకాలు చేయాలని పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్తో పాటు 200 హామీలు ఇచ్చిన చంద్రబాబు కేవలం 2–3 పథకాలు పాక్షికంగా అమలు చేశారన్నారు. కళ్లు ఆర్పకుండా అపద్ధాలు చెప్పడంలో చంద్రబాబు తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారన్నారు. జగనన్న ముఖ్యమంత్రి కాకముందు కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలుండేవన్నారు. ఆయన వచ్చిన తర్వాత 17 కొత్త కళాశాలలను తీసుకొచ్చారన్నారు. ఈ క్రమంలో ఏటా 5 వేలమంది పేద విద్యార్థులు ఉచితంగా వైద్యవిద్య చదువుకునే అవకాశాన్ని కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణాలను ఆపేసిందన్నారు. ఇప్పుడు ప్రైవేట్పరం చేసేందుకు పూనుకుందని, ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దోచుకోవడంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్రంలోనే ఆల్టైం రికార్డ్ సాధిస్తోందన్నారు. ఒక్క పాపంపేటలోనే రూ.వేల కోట్ల విలువైన 500 ఎకరాలకు పైగా శోత్రియం భూములను తన బంధువుల పేరుపై అక్రమంగా జీపీఏ చేయించుకున్నారన్నారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ వేయడం వల్ల నియోజకవర్గంలో భూగర్భజలాలు అడుగంటి 2 లక్షల ఎకరాలకు నీరు అందకుండా పోతోందన్నారు. పరిటాల సునీత ఇచ్చిన లేఖ వల్ల 50 వేల పేదల గృహ నిర్మాణాలు ఆగిపోయాయన్నారు.కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గురుప్రసాద్, రాప్తాడు ఎంపీపీ వరలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, పార్టీ మండల కన్వీనర్లు గోవిందరెడ్డి, పవన్, ఎంపీటీసీ సభ్యులు సునీల్దత్తరెడ్డి, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విపరీతమైన ధనదాహంతో టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్కుమార్రెడ్డి ప్రభుత్వ తీరును ఎండగడదాం : మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి -
ఉపాధి అక్రమాలపై విచారణ చేపట్టండి
● డ్వామా పీడీకి మాజీ ఎంపీ రంగయ్య వినతి అనంతపురం టౌన్: కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ డ్వామా పీడీ సలీంబాషాకు మాజీ ఎంపీ రంగయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం సలీంబాషాను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. కంబదూరు మండల వ్యాప్తంగా ఉపాధి పనులు చేయకుండానే టీడీపీ నాయకులతో ములాఖత్ అయిత ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. పనులకు రాని కూలీల పేర్లను సైతం మస్టర్లలో నమోదు చేసి బిల్లులు పెద్ద ఎత్తున డ్రా చేశారన్నారు. మెట్ట భూముల్లో ఉద్యాన పంటల సాగులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. నిధులను కొల్లగొట్టిన వారి నుంచి సొమ్ము రివకరీ చేయాలని, లేకుంటే డ్వామా కార్యాలయం ఎదుట ఆందోళ కార్యక్రమాలు చేపడతామని హెచ్చ రించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు వైఎస్సార్సీపీ నేతలు భీమేష్, గంగాధర్ తదితరులు ఉన్నారు. వాటర్ షెడ్ పనులు వేగవంతం చేయండి వాటర్ షెడ్ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను డ్వామా పీటి సలీంబాషా ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన వాటర్ షెడ్ పనులపై అధికారులతో శుక్రవారం డ్వామా కార్యాలయంలో ఆయన సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 7 ప్రాజెక్టుల్లో చేపట్టనున్న పనులు రానున్న 3 నెలల్లో 100 శాతం పూర్తి కావాలన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 848 పనులు జరుగుతున్నాయని, వీటిలో 70 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులు సైతం సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో వాటర్ షెడ్ ఏపీడీ సుధాకర్రెడ్డి, కృష్ణచైతన్యతో పాటు నియోజకవర్గ ఏపీడీలు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పోరుబాట
అనంతపురం కార్పొరేషన్: ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, తదితర వర్గాల పేద విద్యార్థులు వైద్య విద్యనభ్యసించాలనే తలంపుతో రాష్ట్రంలోనే ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా బడ్జెట్లో రూ.8 వేల కోట్లు కేటాయించి 17 వైద్య కళాశాలలకు గత సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అన్ని జిల్లాల్లో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం దుర్మార్గపు ఆలోచనలతో వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుబాట చేపడతాం’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరుబాటలో భాగంగా సంతకాల సేకరణతో పాటు నిరసన కార్యక్రమాలను దశల వారీగా చేపడతామన్నారు. యువత, మేధావులు, వామపక్షాలు, తదితరులు పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నేడు ఎంబీబీఎస్ చదవాలంటే రూ. కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రజాధనాన్ని పీల్చిపిప్పి చేయడమే చంద్రబాబు విధానమన్నారు. 2024 నాటికే విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాల, మచిలీపట్నంలో ప్రభుత్వ కళాశాలల పనులను పూర్తి చేసి తరగతులు కూడా ప్రారంభించడంతో 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం రాకముందే పాడేరు, పులివెందుల కళాశాలల ప్రారంభానికి కేంద్రం అనుమతిచ్చిందన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరైతే, తమకొద్దంటూ ఎన్ఎంసీకి లేఖ రాసిన ఘనుడు చంద్రబాబు అని, చరిత్రలో ఎవరూ ఈ విధంగా చేసి ఉండరని మండిపడ్డారు. రూ.5 వేల కోట్లతో కళాశాలలకు జీవం.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రూ.2 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ డబ్బంతా ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే నూతన వైద్య కళాశాలలను ఏర్పాటు చేయవచ్చన్నారు. ఖరీదైన భూములను తన అనుయాయులకు తక్కువ ధరకే ఇస్తూ చంద్రబాబు హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారన్నారు. వైద్య విద్యనభ్యసించేందుకు ఏపీ, తెలంగాణ నుంచి ఇతర దేశాలకు ఏటా 4 వేల మంది విద్యార్థులు వెళ్తున్నారంటూ ఆంధ్రజ్యోతిలోనే కథనం ప్రచురించారని, అయితే కేవలం తెలంగాణ ఎడిషన్లో మాత్రమే వచ్చిందని చెప్పారు. 1992లో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేయాలని చూసి ప్రజాగ్రహానికి గురైన అప్పటి సీఎం నేదురమల్లి జనార్దన్ రెడ్డి చివరకు రాజీనామా చేశారని, చంద్రబాబుకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. మద్యంలో బాబు అండ్ కోకు వాటాలు.. నకిలీ మద్యం తయారీ అతి పెద్ద స్కాం అని, దీని ద్వారా వచ్చే మొత్తం డబ్బు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్కు చేరుతోందని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ప్యాకేజీ వెళ్తోందని ‘అనంత’ ఆరోపించారు. ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ ఘటనలో పట్టుబడిన జయ చంద్రారెడ్డి వైఎస్సార్ సీపీ కోవర్టని అంటున్నారని, మరి తమ పార్టీ నుంచి వచ్చిన అతనికి ఏవిధంగా టీడీపీ టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. తంబళ్లపల్లిలో ఓడిపోయాక ఇన్చార్జ్గా ఎందుకు నియమించారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయి మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కూడా కోవర్టులేనా అని ప్రశ్నించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 43 వేల బెల్టుషాపులను ఒక్క సంతకంతో వైఎస్ జగన్ తొలగించేలా చర్యలు తీసుకుంటే.. చంద్రబాబు వచ్చాక మళ్లీ 70 వేల బెల్టుషాపులు పుట్టుకొచ్చాయన్నారు. జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్ర, సైఫుల్లాబేగ్, బాకే హబీబుల్లా, మల్లెమీద నరసింహులు, అమర్నాథ్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు వెన్నం శివరామి రెడ్డి, జానీ, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, నాయకులు లక్ష్మణ్ణ, కార్పొరేటర్ కమల్ భూషణ్, తదితరులు పాల్గొన్నారు. బడుగులకు వైద్య విద్య కోసం 17 కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం రూ.8 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు మంజూరైన వైద్య సీట్లనూ వద్దన్న ఘనుడు చంద్రబాబు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
వైద్యానికి ‘చంద్ర’ గ్రహణం!
45 90● కూటమి ప్రభుత్వంలో రోగుల అవస్థలు ● ఇప్పటికే సమ్మెలో పీహెచ్సీ వైద్యులు ● నేటి నుంచి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్ జిల్లాలో ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ నెట్వర్క్ ఆస్పత్రులు 46 అనంతపురం మెడికల్: కూటమి ప్రభుత్వంలో వైద్య రంగానికి ‘చంద్ర’గ్రహణం పట్టుకుంది. ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండడంతో ఇటు ప్రభుత్వ.. అటు ప్రైవేట్ వైద్యుల ఆగ్రహం తారస్థాయికి చేరింది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు ఇప్పటికే సమ్మెలోకి వెళ్లారు. అలాగే శుక్రవారం నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ)లను పూర్తి స్థాయిలో ఆపేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) నేత డాక్టర్ నిరంజన్రెడ్డి తెలిపారు. ఆగనున్న శస్త్రచికిత్సలు జిల్లాలోని ‘వైద్య సేవ’ నెట్వర్క్ ఆస్పత్రుల్లో రోజూ 100 నుంచి 200 వరకు శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. అంకాలజీ, న్యూరో సర్జరీ, కార్డియాలజీ, గైనిక్, నెఫ్రాలజీ, తదితర కేసుల్లో ప్రాణాంతకమైన వాటికి సత్వరం శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. గోల్డెన్ హవర్లో వైద్యం అందించకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. కానీ కూటమి ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు డబ్బు చెల్లించని కారణంగా నేటి (శుక్రవారం) నుంచి ‘వైద్యసేవ’లను బంద్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రోగులు అత్యవసర వైద్యసేవలకు ఎక్కడికి వెళ్లాలన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సర్వజనాస్పత్రిపై భారం! ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్ చేస్తుండడంతో అనంతపురం సర్వజనాస్పత్రిపై తీవ్ర భారం పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి రోగులు ఎక్కువగా ఇక్కడికి వచ్చే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం సర్వజనాస్పత్రిలో తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రోజూ ఆస్పత్రిలో ఔట్ పేషెంట్లు (ఓపీ) 2,500 నుంచి 3,000, ఇన్ పేషెంట్లు (ఐపీ) 1,100 నుంచి 1,300 మంది వరకు ఉంటారు. ఇప్పటికే ఆస్పత్రి పాలన అస్తవ్యస్తంగా మారింది. కనీస పర్యవేక్షణ కొరవడింది. వైద్యసేవలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈమధ్య కాలంలోనే పలువురు రోగుల ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. ఈ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మొద్దునిద్ర వీడకపోతే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదముంది. గ్రామీణుల అవస్థలు పీహెచ్సీ డాక్టర్లు కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు. జిల్లాలో సుమారు 90 మంది వైద్యాధికారులు విధులకు దూరంగా ఉన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, బాలింతలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్సీల్లో స్టాఫ్నర్సులు, ఫార్మసిస్టులు, అటెండర్లే దిక్కయ్యారు. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే వచ్చి వైద్యం అందించే వారని, ఇప్పుడు ఆస్పత్రులకు వెళ్లినా వైద్యులు అందుబాటులో ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇందులో రోజూ జరిగే శస్త్ర చికిత్సలుపీహెచ్సీలు మొత్తంసమ్మెలో ఉన్న వైద్యాధికారులు -
గుండు జారి.. గుండె అదిరి
జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం నుంచి తుంపర్లు పడ్డాయి. ఈశాన్యం నుంచి నైరుతి దిశగా గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రాయదుర్గంటౌన్: పట్టణంలోని గౌడ జగనన్న హౌసింగ్ లేవుట్లోని ఓ ఇంటిపైకి ఓ భారీ సైజు గుండురాయి దూసుకొచ్చింది. గుండు రాయి ధాటికి ఇంటి వద్ద బాత్ రూముతో పాటు ప్రహరీ దెబ్బతింది. ఇంటికి సమీపంలో కొండ ఉంది. ఇటీవల అక్కడి ఎర్రమట్టిని కొందరు యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. గుండురాయి ఉన్న స్థలంలో కూడా మట్టి తరలించడంతోనే కిందకు దొర్లినట్లు తెలుస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తయినా కాలనీలో వీధిదీపాలు, నీటి వసతి లేక నివాసం ఉండడం లేదని బాధితుడు మన్సూర్ అహ్మద్ తెలిపాడు. ఖతర్లో ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ అనంతపురం రూరల్: ఖతర్లోని దోహాలో హోం కేర్ నర్స్ ఉద్యోగాలకు ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్దులు, పార్సీలు, జైన్ల మతాల్లోని అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనార్టీ కార్పొరేషన్ ఈడీ జగన్మోహన్రావు తెలిపారు. 21 నుంచి 40 సంవత్సరాల్లోపు వయస్సు ఉండాలన్నారు. బీఎస్సీ జీఎన్ఎం, నర్సింగ్ పూర్తి చేసి, కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారానికి 9849901138, 9949910415, 9160775077 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
వైభవంగా చక్రస్నానం
● ముగిసిన చింతలరాయుడి బ్రహ్మోత్సవాలు తాడిపత్రి రూరల్: పట్టణంలోని భూదేవి, శ్రీదేవి సమేత చింతల వెంకటరమణస్వామి ఆలయంలో గురువారం చక్రస్నానం వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముందుగా ఆలయ ఆవరణలోని పుష్కరిణికి అర్చకులు మురళి స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నుంచి భూదేవి, శ్రీదేవి సమేత చింతల వెంకటరమణస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి స్నానం చేయించిన అనంతరం బ్రహ్మోత్సవాలను ధ్వజావరోహణంతో ముగించారు. 20 మండలాల్లో వర్షం అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలోని 20 మండలాల్లో వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 20 మండలాల పరిధిలో 9.1 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గార్లదిన్నె 47.8 మి.మీ, వజ్రకరూరు 47.2, యాడికి 36, రాప్తాడు 26.2, అనంతపురం 17.4, బొమ్మనహాళ్ 13.4, గుంతకల్లు 10.2 మి.మీ వర్షం కురిసింది. బ్రహ్మసముద్రం, కూడేరు, విడపన కల్లు, కంబదూరు, ఉరవకొండ, బుక్కరాయసముద్రం, కుందుర్పి, నార్పల, ఆత్మకూరు, కణేకల్లు, బెళుగుప్ప, పామిడి, కళ్యాణదుర్గం, గుమ్మగట్ట తదితర మండలాల్లోనూ వర్షం పడింది. రాగల మూడు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. నేటి నుంచి బోధనేతర కార్యక్రమాల బహిష్కరణ అనంతపురం ఎడ్యుకేషన్: విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపులో భాగంగా శనివారం నుంచి జిల్లాలో టీచర్లు బోధనేతర కార్యక్రమాలు బహిష్కరిస్తున్నట్లు ఫ్యాప్టో నాయకులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ ఆనంద్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబును కలసి వినతిపత్రం అందజేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కేవలం టీచర్లు, పిల్లల హాజరు, మధ్యాహ్న భోజనం పనులు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, బోధన వంటి పనులు చేస్తారని తక్కిన బోధనేతర పనుల జోలికి వెళ్లరని స్పష్టం చేశారు. కలెక్టర్ను కలసిన వారిలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ శ్రీనివాస్ నాయక్, సెక్రెటరీ జనరల్ పురుషోత్తం, నాయకులు రత్నం, రమణారెడ్డి, సిరాజ్, రామాంజనేయులు, గోపాల్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, ఫణిభూషణ్ తదితరులు ఉన్నారు. కొత్త టీచర్ల ప్లేస్మెంట్స్కు కౌన్సెలింగ్ అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీకి ఎంపికైన కొత్త టీచర్లకు ప్లేస్మెంట్ (స్థానం) కోసం గురువారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎస్జీటీలకు మ్యానువల్గా, స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా స్థానాలు కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం లోపు పూర్తికావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో శిక్షణ కేంద్రాల్లోనే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రాత్రి 9 గంటలకు ఎస్జీటీ కౌన్సెలింగ్ ప్రారంభమై అర్ధరాత్రి దాకా కొనసాగింది. మొత్తం 167 మంది ఎస్జీటీలు వారికి నచ్చిన స్థానాన్ని కోరుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్లలో చాలా మంది తొలిసారి వెబ్ కౌన్సెలింగ్ కావడంతో గందరగోళానికి గురి కాగా.. అధికారులు, సాంకేతిక నిపుణులు వారి అనుమానాలను నివృత్తి చేశారు. శుక్రవారం వారి కౌన్సెలింగ్ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. -
పప్పుశనగ విత్తనం అందేనా?
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో రబీ ప్రధాన పంట పప్పుశనగ సాగు ప్రారంభమైంది. అక్కడక్కడా కురిసిన తేలికపాటి జల్లులకే కొందరు రైతులు ముందస్తు సాగుకు ఉపక్రమించారు. ఈ నెల 15 నుంచి నవంబర్ మొదటి వారం వరకు పప్పుశనగ సాగుకు మంచి అదనుగా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే గతి తప్పిన వర్షాలు, మారిన వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ మాదిరిగానే రబీలో కూడా కొందరు రైతులు ముందుగానే పంట సాగు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఉరవకొండ, బెళుగుప్ప ప్రాంతాల్లో విత్తుకోవడం మొదలు పెట్టారు. మంచి వర్షపాతం నమోదైతే 25 మండలాల పరిధిలో నెలాఖరులోపు 60 నుంచి 70 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పప్పుశనగ సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నోరు మెదపని మంత్రి కేశవ్ రాయితీ విత్తన పప్పుశనగ విషయంలో కూటమి సర్కారు స్పష్టత ఇవ్వకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే జిల్లాకు 28 వేల క్వింటాళ్ల నుంచి 14 వేల క్వింటాళ్లకు కుదించారు. 40 శాతం ఉన్న రాయితీని 25 శాతానికి పరిమితం చేసి రైతుల్లో నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకోవద్దని సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. రబీ మొదలై 10 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ విత్తన పంపిణీ ప్రక్రియ చేపట్టకపోవడం గమనార్హం. గతంలో ఈ పాటికి విత్తన పంపిణీ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత జిల్లా రైతులకు.. మరీ ముఖ్యంగా పప్పుశనగ సాగు ఎక్కువగా చేసే ఉరవకొండ రైతులకు కూడా విత్తనం ఇవ్వలేని దుస్థితిలో ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది, ఈ ఖరీఫ్లో విత్తన వేరుశనగ, పప్పుశనగ పంపిణీ చేసిన సరఫరా చేసిన ఏజెన్సీలకు రూ.74 కోట్ల బిల్లుల విడుదలలో సర్కారు జాప్యం చేయడంతో రైతులకు విత్తనం అందే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడక్కడా సాగు ప్రారంభం రాయితీ విత్తనంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత కరువు -
ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీగా అరుణకుమారి
అనంతపురం సెంట్రల్: మహిళా,శిశు సంక్షేమశాఖ ఇన్చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్గా అరుణకుమారిని నియమిస్తూ కలెక్టర్ ఓ.ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈమె జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇటీవల శిశుగృహలో నవజాత శిశువు ఆకలి చావుకు గురి కావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పర్యవేక్షణ లోపమున్నట్లు తేలడంతో పీడీ నాగమణిని సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో రెగ్యులర్ పీడీ నియామకం జరిగే వరకూ ఇన్చార్జ్ బాధ్యతలను అరుణకుమారికి అప్పగించారు. శుక్రవారం ఈమె బాధ్యతలు తీసుకోనున్నట్లు ఐసీడీఎస్ అధికారవర్గాలు వెల్లడించాయి. -
మాతా శిశు మరణాలపై మండిపాటు
అనంతపురం సిటీ: అనంతపురం శిశుగృహలో పసికందు ఆకలి చావు ఘటనపై దిశ కమిటీ సమావేశంలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఈ ఉదంతంలో ఐసీడీఎస్ పీడీని సస్పెండ్ చేసి అసలైన బాధ్యులను వదిలివేయడాన్ని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ నిలదీశారు. అనంతపురంలోని డీపీఆర్సీ భవన్లో గురువారం జిల్లా సమన్వయ దిశ (జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం వాడీవేడిగా జరిగింది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి బోయ గిరిజమ్మ, కలెక్టర్ ఆనంద్, సభ్యులు హాజరయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. శిశుగృహలో రెండు నెలల పసికందు ఆకలితో మరణించడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రస్తుతం శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు. జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ శిశువు మరణానికి కారణమైన ఉద్యోగులందరిపై చర్యలు ఉంటాయన్నారు. ఉపాధిలో అక్రమాలు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో రూ.కోట్లు మింగుతున్నారని, దీనిపై అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని బోయ గిరిజమ్మ కోరారు. నల్లరేగడి భూములున్న రైతులకు సబ్సిడీపై పప్పుశనగ సరఫరా చేయాలని బెళుగుప్ప ఎంపీపీ పెద్దన్న విజ్ఞప్తి చేశారు. వర్షాలతో దెబ్బతిన్న మొక్క జొన్న దిగుబడులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. పలు మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరాకు ఏటా రూ.70 నుంచి రూ.80 కోట్ల వరకు జెడ్పీ చెల్లిస్తున్నా నీటి పన్ను జెడ్పీకి జమ చేయకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వాడుకుంటున్నారని, దీంతో జెడ్పీ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని సభ దృష్టికి గిరిజమ్మ తెచ్చారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడతారా? ట్రాన్స్కో ఎస్ఈపై కలెక్టర్ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా బాధ్యతరాహిత్యంగా సమాధానాలు ఇస్తే చార్జ్మెమో ఇస్తానంటూ హెచ్చరించారు. ప్రధాన రహదారుల పక్కనే ఫుట్పాత్ వదలకుండా విద్యుత్ స్తంభాలు నాటుతున్నారని కంబదూరు జెడ్పీటీసీ నాగరాజు సభ దృష్టికి తీసుకురాగా.. ట్రాన్స్కో ఎస్ఈ ఆర్అండ్బీ అధికారులపై నిందలు వేస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణించారు. వాడీవేడిగా ‘దిశ’ శిశుగృహలో పసికందు సహా ఆస్పత్రుల్లో తల్లుల మరణాలపై చర్చ బాధ్యులపై కఠిన చర్యలకు సభ్యుల డిమాండ్ -
ఫీజుల కోసం వేధిస్తే చర్యలు
● ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థులను ఫీజుల కోసం వేధింపులకు గురిచేస్తే చర్యలు తప్పవని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలను ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ హెచ్చరించారు. ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నారాయణ కళాశాలతో పాటు వివిధ కళాశాలలను గురువారం ఆయన తనిఖీ చేశారు. దసరా సెలవుల తర్వాత కళాశాలలకు చేరుకున్న విద్యార్థులను ఫీజులు కడితేనే అనుమతిస్తామంటూ తల్లిదండ్రులపై ఒత్తిళ్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇంటర్మీడియట్ విద్యామండలి సూచించిన పరీక్ష ఫీజు కన్నా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు కూడా తెలిసిందన్నారు. పరీక్ష ఫీజు అదనంగా వసూళ్లు చేస్తే కళాశాల గుర్తింపు రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. కళాశాల ఫీజు కట్టకున్నా విద్యార్థులను అనుమతించాలన్నారు. పరీక్ష ఫీజు కట్టించుకోవాలన్నారు. గుత్తి విద్యార్థికి రూ. 51 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం గుత్తి: గుత్తి పట్టణానికి చెందిన షేక్ బాషా, రహమత్ దంపతుల కుమారుడు దాదా ఖలందర్కు రూ. 51 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం ఆఫర్ దక్కింది. హైదరాబాద్లోని బిట్స్ పిలానీ కళాశాలలో బీటెక్ సెకెండియర్ చదువుతున్నాడు. కళాశాలలో ఇటీవల నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో ప్రతిభ కనబరిచి ఏఎండీ కంపెనీలో ఉద్యోగ అవకాశాన్ని దక్కించుకున్నాడు. బీటెక్ పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరనున్నట్లు సమాచారం. యాడికిలో వరుస చోరీలు యాడికి: మండల కేంద్రంలోని ఐదు ఇళ్లలో వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. బుధవారం రాత్రి ఇద్దరు దుండగులు నెత్తికి రుమాలు చుట్టుకుని తాళం వేసిన గృహాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. కమ్మవీధిలోని వద్ది కృష్ణమూర్తి ఇంట్లో 50 తులాల వెండి, తమ్మినేటి రాజగోపాల్ నాయుడు ఇంట్లో రూ.4వేల నగదు, వెండి దీపాలు, కలశం, శాంతి నగర్లోని ఓబయ్య కుమారుడు పోతురాజు రాజయ్య ఇంట్లో రూ.37వేల నగదు, ఒక తులం బంగారు చైను, ఒక జత వెండి కాళ్ల పట్టీలు, సుమయాన్ ఇంట్లో రూ.10వేల నగదు, 2 తులాల బంగారం, కోన రోడ్డులోని కోటేష్ కుమారుడు గంగవరం శివ ఇంట్లో వెండి కాళ్ల పట్టీలు, వెండి మొలతాడును అపహరించారు. గురువారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన 5 ఇళ్లను పరిశీలించి కేసులు నమోదు చేశారు. -
రైలు పట్టాలపై మృత్యుఘోష!
● పెరుగుతున్న ఆత్మహత్యలు, ప్రమాదాలు ● ఉమ్మడి జిల్లాలో ఏడాదికి సగటున 200 కేసుల నమోదు చిలమత్తూరు మండలానికి చెందిన కమలాకర్ (40) గత ఆదివారం రాత్రి కాచిగూడకు వెళ్లేందుకు సిద్ధమై హిందూపురంలో రైలు ఎక్కారు. ధర్మవరం రైల్వేస్టేషన్ రాగానే వాటర్ బాటిల్, టిఫిన్ కొనుగోలు చేసేందుకు దిగాడు. ఈలోపు రైలు కదలడంతో పరుగెత్తుకుంటూ వెళ్లి ఎక్కేందుకు ప్రయత్నించి అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతపురం – తాటిచెర్ల మార్గంలోని నేషనల్ హైవే బ్రిడ్జి కింద గత సోమవారం గూడ్స్ రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యగా కేసు నమోదు చేసినా... ఆ తర్వాత విచారణలో మృతుడిని అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురానికి చెందిన రవికుమార్గా గుర్తించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు తాళలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. రాయదుర్గం: రైలు పట్టాలపై జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అవగాహన లోపం, నిర్లక్ష్యం, క్షణికావేశం కారణంగా ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఉమ్మడి అనంత జిల్లా పరిధిలో గుంతకల్లు రైల్వే జోన్ కింద తొమ్మిది రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సగటున ఏడాదికి 200 కేసులు నమోదుకాగా, ఇందులో 80 శాతానికి పైగా పైగా మరణాలు, 20 శాతం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కోలుకున్నవారు ఉన్నారు. గుంతకల్లు నుంచి బళ్లారి మీదుగా ఓబుళాపురం, సోములాపురం, రాయదుర్గం దాటుకుని కర్ణాటకలోని బెంగళూరుకు ఓ లైను ఉండగా, రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం మీదుగా కదిరిదేవరపల్లి వరకూ మరో లైను, గుంతకల్లు నుంచి గుత్తి మీదుగా అనంతపురం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, హిందూపురం వరకు మరో లైను ఉంది. వీటి పరిధిలో నిత్యం ఏదో ఓ చోట మృతదేహాలు లభ్యమవుతున్నాయి. పట్టాలు దాటుతూ కొందరు, రైలు నుంచి జారి పడి ఇంకొందరు, క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకునే వారు మరికొందరు ఉంటున్నారు. కొన్ని మృతదేహాలు గుర్తించగా, మరిన్ని గుర్తుపట్టడానికి వీలులేకుండా ఉంటున్నాయి. ఇలాంటి అనాథ మృతదేహాలకు రైల్వే పోలీసులే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సూచనలు పాటించాలి రైల్వే ప్రయాణికులు స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ఈ విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్య పరుస్తున్నాం. రైలు కదిలే సమయాన ఎక్కే ప్రయత్నం చేయరాదు. సరైన జాగ్రత్తలు, అప్రమత్తతతో వ్యవహరిస్తే ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చు. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ఒక్క క్షణం వారి కుటుంబం గురించి ఆలోచించాలి. – చంద్ర, రైల్వే ఎస్ఐ, గుంతకల్లు -
సమానత్వం ప్రతి ఇంటి నుంచి రావాలి
అనంతపురం కల్చరల్: మహిళల సమానత్వమనేది ప్రతి ఇంటి నుంచి లింగ వివక్ష లేకుండా తల్లుల ద్వారానే రావాలని సినీ దర్శకుడు ఉమామహేశ్వరరావు అన్నారు. ఐద్వా రాష్ట్ర మహాసభలు అనంత వేదికగా సాగుతున్న నేపథ్యంలో మూడురోజుల పాటూ జరిగే సాంస్కృతిక ఉత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కృష్ణ కళామందిరం వేదికగా జరిగిన సమావేశానికి ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దాడులు, అత్యాచారాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రతి మహిళా సిద్ధమయ్యేటట్లు ఐద్వా చేస్తున్న కృషిని అభినందించారు. ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన డీఆర్వో మలోల, లలితకళాపరిషత్తు కార్యదర్శి గాజుల పద్మజ, డాక్టర్ ప్రసూన, ఐద్వా రాష్ట్ర నాయకురాలు సావిత్రి తదితరులు మాట్లాడారు. అంతకు ముందు మహిళల పోరాట స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆలోచింపజేసింది. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. నిర్వాహకులు డాక్టర్ ప్రగతి, సీపీఎం రాంభూపాల్, రామాంజనమ్మ, నల్లప్ప, వన్నూర్ మాస్టర్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యంతో చెలగాటమా?
● ఎక్సైజ్ పోలీసుస్టేషన్ వద్ద ధర్నాలో వైఎస్సార్సీపీ శ్రేణులు గుంతకల్లు: విచ్ఛలవిడిగా కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజారోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.గాదిలింగేశ్వరబాబు (చిన్నబాబు), మున్సిపల్ మాజీ చైర్మన్ జింకల రామాంజనేయులు ధ్వజమెత్తారు. కల్తీ మద్యంను అరికట్టాలని, కల్తీ మద్యం సేవించి మృతి చెందిన బేల్దారి పెద్దన్న కుటుంబాన్ని ఆదుకోవాలంటూ గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఆదేశాలతో గురువారం గుంతకల్లులోని రాజేంద్రనగర్లో ఉన్న ఎకై ్సజ్ కార్యాలయం వద్ద పట్టణ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి పట్టణ కన్వీనర్ ఎండీఆర్ ఖలీల్ అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ.. 1994 ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధం అమలు చేస్తే.. ఆయనను వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన చంద్రబాబు మద్యపాన నిషేధం ఎత్తివేసి విచ్ఛలవిడిగా విక్రయాలను ప్రోత్సహించారని గుర్తు చేశారు. మద్యంను అంచెలంచెలుగా తగ్గించాలనే ఉద్దేశ్యంతో 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నిర్వహిస్తూ బెల్ట్షాపులను పూర్తిగా కట్టడి చేసిందన్నారు. ప్రస్తుతం డబ్బు సంపదనే ధ్యేయంగా కల్తీ మద్యం వ్యాపారాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. కల్తీ మద్యం సేవించి మృతి చెందిన బేల్దారి పెద్దన్న కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించడంతో పాటు బెల్ట్షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎకై ్సజ్ ఎస్ఐ ఎం.వెంకటేశులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లింగన్న, జేసీబీ చాంద్బాషా, వార్డు ఇన్చార్జులు యల్లప్ప, సాయిపోగు వీరేష్, నాయడు, నాయకులు అబ్దుల్బాసిద్, రంగనాయకులు, మౌలా, బాబురావు, గోవిందునాయక్, జయరామిరెడ్డి, బావన్న, కసాపురం వంశీ, పవన్, నాగాంజనేయులు, యల్లన్న, నూర్నిజామి, ఆర్డీజీ బాషా, డ్యామ్వలి, ఖాసీమ్, సర్పంచులు నారాయణస్వామి, ఈసునాయక్, ఎంపీటీసీ రమేష్నాయక్, జి.శాంతిరాణి, సునీతబాయి పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
అనంతపురం: జిల్లా కేంద్రంలో గంజాయి విక్రేయ ముఠా గుట్టురట్టయింది. నగరంలోని నవోదయ కాలనీ హిందూ శ్మశాన వాటిక వద్ద గురువారం విక్రేతలను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టుబడిన వారిలో రాణినగర్కు చెందిన పి.అన్వర్ ఖాన్ కుమారుడు పఠాన్ జాఫర్ఖాన్ అలియాస్ గోరా, మున్నానగర్కు చెందిన జి.చంద్రశేఖర్ కుమారుడు గొడ్డుమర్రి మహేష్, పాతూరు ప్రభాకర్ స్ట్రీట్కు చెందిన జి.బ్రహయ్య కుమారుడు గుర్రం కార్తీక్ అలియాస్ వేణు, టీవీ టవర్ వద్ద ఉన్న ఎన్టీఆర్కాలనీకి చెందిన ఎస్.మూర్తి కుమారుడు షికారి కరాది అలియాస్ హరీష్ అలియాస్ హరి, బుడ్డప్ప నగర్ ఒకటో క్రాస్కు చెందిన ఎస్.రమేష్ కుమారుడు షికారి అశోక్ అలియాస్ అశోక్, బుడ్డప్ప నగర్ ఒకటో క్రాస్కు చెందిన ఎస్.రమేష్ కుమారుడు అలియాస్ షికారి శివాజీ ఉన్నారు. వీరంతా మూడు పదుల వయస్సు లోపు వారే కావడం గమనార్హం. ఇద్దరు మైనర్లను జువైనల్ జస్టిస్ ముందు హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.కంప చెట్లలో ప్రభుత్వ చక్కెర ఖాళీ ప్యాకెట్లు శింగనమల(నార్పల): కార్డుదారులకు చేరాల్సిన నిత్యావసర సరుకులు పక్కదారి పట్టాయి. నార్పల మండలం గూగూడు సమీపంలో గాలి మరల వద్ద ముళ్ల కంపల్లో పడేసిన ప్రభుత్వ చక్కెర ఖాళీ ప్యాకెట్లే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం రేషన్కార్డుదారులకు అర కేజీ చొప్పున చక్కెర అందిస్తోంది. అయితే చక్కెరను లబ్ధిదారులకు ఇవ్వకుండా డీలర్లు బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు తెలుస్తోంది. గూగూడు సమీపంలో ముళ్ల కంపల్లో దాదాపు 200కు పైగా చక్కెర ఖాళీ ప్యాకెట్లు కనిపించడంతో స్థానికంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
కూడేరు సీఐని సస్పెండ్ చేయాలి
● లేకపోతే ఈ నెల 13న జిల్లా కేంద్రంలో ధర్నా ● మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం కార్పొరేషన్: అసాంఘిక కార్యకలాపాలను అరికట్టకుండా కేవలం వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్న కూడేరు సీఐ రాజాని తక్షణమే సస్పెండ్ చేయాలని ఉరవకొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. సీఐ రాజా పనితీరుపై గతంలోనూ ఎస్పీ జగదీష్ దృష్టికి తీసుకెళ్లామని, అయినా అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పయ్యావుల కేశవ్ సోదరుడు పయ్యావుల శ్రీనివాసులు కనుసన్నల్లోనే సీఐ రాజా పని చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను టీడీపీలోకి చేరాలని, లేకుంటే కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తామంటూ సీఐ బాహాటంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారన్నారు. పోలీసు స్టేషన్ను సివిల్ పంచాయితీలకు కేంద్రీకృతం చేస్తూ.. నిందితులు, భూ కబ్జాదారులు, దౌర్జన్యకారులకు వంత పాడుతున్నారన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితర నాయకులను దుర్భాషలాడడమే కాకుండా రౌడీషీట్ ఓపెన్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇన్ని దౌర్జన్యాలు చేయడం కంటే పోలీసు స్టేషన్లను టీడీపీ కార్యాలయాలుగా మారిస్తే బాగుంటుందంటూ ఎస్పీ జగదీష్కు సూచించారు. చేతనైతే హామీలు అమలు, అభివృద్ధి చర్యలు చేపట్టాలి మంత్రి కేశవ్ పెద్ద ఎత్తున జూదం ఆడిస్తున్నారని, ఇందులో పోలీసులకూ వాటా ఉందని విమర్శించారు. ఒక్క రోజైనా జూద గృహాలపై సీఐ దాడులు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ సారా, తదితర వాటిని విక్రయిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ నేతల కుటుంబాల్లో ఉన్న కలహాలను ఆసరాగా చేసుకుని పోలీసుల సాయంతో టీడీపీలోకి చేర్చుకోవాలని చూడడం సరికాదన్నారు. చేతనైతే సూపర్సిక్స్ హామీల అమలు, ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకుని ప్రజలను ఆకట్టుకోవాలని కేశవ్కు హితవు పలికారు. కురుబ గోవిందుకు చెందిన 24 ఎకరాల భూమిలోకి వెళ్లకుండా టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తుంటే సీఐ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు. ఇప్పటికై నా కూడేరు సీఐను సస్పెండ్ చేయకపోతే ఈ నెల 13న జిల్లా కేంద్రంలో కూడేరు ప్రాంత ప్రజలతో కలసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడుతామని హెచ్చరించారు. అనంతరం పలువురు బాధితులు మాట్లాడుతూ.. సీఐ రాజా దౌర్జన్యాలను వివరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, కూడేరు మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మేరీనిర్మలమ్మ, నాయకులు పాల్గొన్నారు. -
సీజేఐపై దాడి అమానుషం
అనంతపురం అర్బన్: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై దాడి అమానుషమని, ఈ దాడి రాజ్యాంగంపై దాడి చేసినట్లేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ అన్నారు. ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై మతోన్మాదుల దాడికి నిరసనగా బుధవారం స్థానిక గణేనాయక్భవన్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మానికి అవమానం జరిగిందంటూ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై మతోన్మాద అడ్వకేట్ ఒకరు కోర్టులో అందరూ చూస్తుండగా చెప్పు విసరడం దేశంలో నెలకొన్న అస్థిరతకు అద్దం పడుతోందని మండిపడ్డారు. మోదీ పాలనలో మతోన్మాదులు అన్ని వ్యవస్థలను ఇప్పటికే ధ్వంసం చేస్తూ వస్తున్నారని విమర్శించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, నాయకులు బాలరంగయ్య, నాగేంద్రకుమార్, రామిరెడడి, చంద్రశేఖర్రెడ్డి, సావిత్రి, కృష్ణమూర్తి, శ్రీనివాసులు, పరమేష్, ఆర్వీనాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ -
పసివాడి ప్రాణం... లెక్కలేని తనం
అనంతపురం సెంట్రల్: పసివాడి ప్రాణమంటే వారికి లెక్కలేని తనం. తమను అడిగే వారు ఎవరు లేరన్న ధీమాతో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రజానీకం ‘ఎంత ఘోరం’ అని చర్చించుకుంటున్నా.. వారిలో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదు. పర్యవేక్షణ లోపం కారణంగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.నాగమణిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ కార్యదర్శి సూర్యకుమారి... అసలైన బాధ్యులపై ఎలాంటి చర్యలకూ ఆదేశించకపోవడం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. శిశువు మృతికి శిశుగృహ మేనేజర్, మిషన్ వాత్సల్య కో ఆర్డినేటర్, మరికొందరి నిర్లక్ష్యం కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 3న అర్ధరాత్రి శిశుగృహలో ఏం జరిగిందనే అంశంపై ఆరా తీస్తే అత్యంత బాధాకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.శిశుగృహలో అంతర్గత పోరుసిబ్బంది మధ్య అంతర్గత పోరు కారణంగా కొంత కాలంగా శిశుగృహ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా చిన్నారుల సంక్షేమాన్ని అక్కడి సిబ్బంది మరుగున పడేశారు. దీంతో ఆరోగ్యంగా ఉన్న చిన్నారులు కాస్త అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇదే చిన్నారి నిరూప్ విషయంలోనూ జరిగింది. ఈ నెల 3న నిరూప్కు విరేచనాలయ్యాయి. బాధ్యతగా వైద్య చికిత్సలు అందించాల్సిన శిశుగృహ మేనేజర్ దీప్తి పట్టించుకోకపోవడంతో పాటు అదే రోజు రాత్రి శిశువుకు విధుల్లో ఉన్న ఆయా సక్రమంగా పాలు పట్టకపోవడంతో గుక్క పెట్టి ఏడ్చి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆందోళనకు గురైన ఆయా పరిస్థితిని వివరించడానికి పలుమార్లు ఫోన్ చేసినా మేనేజర్ స్పందించలేదు. దీంతో ఒంటరిగానే శిశువును తీసుకుని సర్వజనాస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.మిషన్ వాత్సల్య కో ఆర్డినేటర్కు పట్టదా?మహిళాశిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహ, బాలసదనం, వన్స్టాప్ సెంటర్ తదితర విభాగాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తాజాగా మిషన్ వాత్సల్య జిల్లా కో ఆర్డినేటర్ను నియమించింది. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) సిఫారసు లేకుండానే తన పలుకుబడిని ఉపయోగించి ఉరవకొండ సీడీపీఓ శ్రీదేవి కో ఆర్డినేటర్గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. అయితే శిశుగృహలో ఎంతో ఆరోగ్యంగా ఉన్న శిశువు మృతి చెందితే బాధ్యత గల కో ఆర్డినేటర్ శ్రీదేవి ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. 3వ తేదీ రాత్రి శిశువు మృతి చెందిన విషయం తెలిసినా... తనకేమీ పట్టనట్టు శ్రీదేవి ఈ నెల 4న బుక్కరాయసముద్రంలో ప్రభుత్వం నిర్వహించిన ‘ఆటో డైవర్ సేవలో’’ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మరుసటి రోజు తీరికగా శిశుగృహలోకి అడుగుపెట్టారు. శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న శిశువు మరణిస్తే ఏది ప్రాధాన్యతో తెలుసుకోకుండా ప్రచార ఆర్బాటం కోసం ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమంలో పాల్గొనడం అనుమానాలకు తావిస్తోంది. మరుసటి రోజు కలెక్టర్ ఆనంద్ తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించడంతో తీరిగ్గా అప్పుడు వెళ్లి ఎంతో బాధ్యత ఉన్నట్లుగా నటించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.సిబ్బంది నవ్వులాటశిశువు మృతి విషయంలో మిషన్ వాత్సల్య కో ఆర్డినేటర్, శిశుగృహ సిబ్బంది వ్యవహరించిన తీరు ఎంతో బాధాకరమనిపిస్తోంది. త్రీమెన్ కమిటీ విచారణకు కలెక్టర్ ఆనంద్ ఆదేశించకమునుపు పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్న ఓ అధికారి పత్రికలలో కథనాలను చూసి ‘ఇలాంటివి మామూలే... వాళ్లు రాస్తాంటారు.. ఏమైతాది’ అని వ్యాఖ్యానించినట్లు ఐసీడీఎస్ వర్గాలు తెలిపాయి. ఏకంగా మహిళాశిశు సంక్షేమశాఖ డైరెక్టర్ వేణుగోపాలరెడ్డి అప్పటికప్పుడు విజయవాడ నుంచి బయలుదేరి జిల్లాకు చేరుకుని శిశుగృహలో విచారణ చేపడితే ఓ మహిళా ఉద్యోగి నవ్వినట్లు తెలిసింది. ఎందుకు నవ్వుతున్నావని డైరెక్టర్ ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాక మరుసటి రోజు ట్రైనీ కలెక్టర్ సచిన్ రహెర్ కూడా శిశుగృహలో విచారణ చేపట్టిన సమయంలో సదరు నవ్విన వ్యక్తి ఎవరని ఆరా తీసినట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే శిశుగృహ సిబ్బంది ఏ స్థాయికి దిగజారారో అర్థం చేసుకోవచ్చు. నిజంగా వారి కుటుంబసభ్యుల్లోని చిన్నారికి ఈ పరిస్థితి దాపురించి ఉంటే ఇలాగే వ్యవహరించే వారా అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. శిశువు మృతికి అసలు కారకులైన వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ సర్వత్రా సాగుతోంది. -
హెచ్చెల్సీలో కర్ణాటక వాసి మృతదేహం
బొమ్మనహాళ్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక హెచ్చెల్సీలో దూకిన కర్ణాటక వాసి మృతదేహం బుధవారం బొమ్మనహాళ్ మండలంలో బయటపడింది. వివరాలు.. కర్ణాటకలోని హోస్పేట్కు చెందిన జమీర్వుల్లా షరీఫ్ (43) ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ.. మంగళవారం బళ్లారి సమీపంలోని అల్లీపురం వద్దకు చేరుకుని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి కుటుంబసభ్యులకు పంపాడు. అనంతరం హెచ్చెల్సీలో దూకాడు. బుధవారం ఉదయం బొమ్మనహాళ్ మండలం దేవగిరి క్రాస్ సమీపంలోని హెచ్చెల్సీ డిస్ట్రిబ్యూటరీ కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని జమీర్వుల్లా షరీఫ్గా గుర్తించి సమాచారం ఇవ్వడంతో కర్ణాటక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హోస్పేట్ నుంచి పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బళ్లారిలోని విమ్స్కు తరలించారు. ఘటనపై హోస్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
‘కూటమి’ మాటలు విని మోసపోయాం
ఉరవకొండ: ఎన్నికల సమయంలో కూటమి పెద్ద చంద్రబాబు అండ్ కో మాటలు నమ్మి మోసపోయామని అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక వీరశైవ కల్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వీరశైవ లింగాయత్లను శైవక్షేత్రాల్లోని పాలకమండలి కమిటీల్లో అత్యధిక ప్రాధాన్యత కల్పించి పదవులు కేటాయిమస్తామని ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు స్పష్టమైన హామీనిచ్చారని గుర్తు చేశారు. రెండు రోజుల క్రితం శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలను ప్రభుత్వం నియమించిందని అయితే వీటిలో వీరశైవ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరినీ నియమించకపోవడం బాధాకరమన్నారు. ఇది వీరశైవ లింగాయత్లను మోసం చేయడమేనని అన్నారు. అలాగే 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో బీసీ–డీ లో లింగాయత్లను చేరుస్తూ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ఈ ఫైల్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకుండా తొక్కి పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్న వీరశైవుల ఆర్థిక, సామాజిక, విద్య పరంగా ఎంతో వెనుకబడి ఉన్నారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం వీరశైవలింగాయత్లను ఓబీసీ జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద -
మొదలైన పంట కోత ప్రయోగాలు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ పంట కోత ప్రయోగాలు మొదలయ్యాయి. సాగు చేసిన పంటల్లో దిగుబడులు అంచనా వేయడానికి ప్రణాళిక, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో పంట కోత ప్రయోగాలు చేపట్టారు. కొన్ని పంటలకు దిగుబడుల ఆధారంగా ఫసల్బీమా పరిహారం అందిస్తున్న నేపథ్యంలో ఈ ప్రయోగాలకు ప్రాధాన్యత నెలకొంది. మొత్తంగా 1,122 సీసీఈలు నిర్వహిస్తుండగా ఇందులో గ్రామం యూనిట్గా కందికి ఫసల్బీమా వర్తింపజేస్తూ అత్యధికంగా 846 ప్రయోగాలు చేపట్టనున్నారు. అలాగే వరిలో 96, జొన్నలో 36, మొక్క జొన్నలో 72, ఆముదంలో 36, ఎండుమిరపలో 36 పంట కోత ప్రయోగాలు చేపట్టనున్నారు. ఇవి కాకుండా వాతావరణ బీమా వర్తింపజేసిన వేరుశనగ, పత్తితో పాటు సజ్జ, కొర్ర పంటల్లోనూ కొన్ని ప్రయోగాలు చేపట్టి దిగుబడులను అంచనా వేయనున్నారు. అటు శ్రీసత్యసాయి జిల్లాలోనూ అత్యధికంగా కందిలో 720 పంట కోత ప్రయోగాలు, మొక్కజొన్నలో 84, వరిలో 36, రాగిలో 26, ఆముదంలో 26 పంట కోత ప్రయోగాలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో బుధవారం అనంతపురం రూరల్ మండలం ఇటుకలపల్లి గ్రామంలో రైతు అంకె బాలపెద్దన్న సాగు చేసిన వేరుశనగ పంటలో దిగుబడులు అంచనా వేసేందుకు ప్రయోగం నిర్వహించారు. 5 ఇంటు 5 అడుగుల చుట్టు కొలతల ప్లాట్ నుంచి 2.700 కిలోల దిగుబడి వచ్చినట్లు ఏఓ వెంకటకుమార్, ఏఈఓ మురళీకృష్ణ తెలిపారు. -
జర్నలిస్టు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ విజేత చిత్తూరు
అనంతపురం: జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ లీగ్ పోటీల విజేతగా చిత్తూరు జట్టు నిలిచింది. బుధవారం తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ను జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ టాస్ వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జేశాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జగదీష్, జిల్లా అధ్యక్షుడు కె.రవితేజా, కమిటీ సభ్యులు కుళ్లాయప్ప, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాంఛూను కలిసిన ఎమ్మెల్యేలు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛూ ఫెర్రర్తో పలువురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్కు సంబంధించిన అంశాలపై చర్చించారు. మాంఛూ ఫెర్రర్ను కలిసిన ఎమ్మెల్యేల్లో జేసీ అస్మిత్రెడ్డి, పల్లె సింధూర రెడ్డి, ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, బండారు శ్రావణిశ్రీ, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఉన్నారు. పోలీసుల అదుపులో మాంత్రికుడు పుట్టపర్తి అర్బన్: తమపై, తమ గ్రామస్తులపై చేతబడి చేస్తున్నారంటూ ఓ మాంత్రికుడిని బంధించి పోలీసులకు అప్పగించిన ఘటన కలకలం రేపింది. పుట్టపర్తి మండలం బడేనాయక్ తండాకు చెందిన ఆర్మీ జవాన్ వినోద్నాయక్ తెలిపిన మేరకు... జవాన్ కుటుంబం, ఇతరులపై కక్షగట్టిన అదే గ్రామానికి చెందిన బాలకృష్ణ, లక్ష్మీరాం, చంద్రకళ, జయాబాయి.. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన మాంత్రికుడు విరూపాక్షను సంప్రదించి క్షుద్ర పూజలు చేయించారు. బుధవారం జవాన్ కుటుంబసభ్యుల ఫొటోలు, వంశవృక్షం ఉంచి నిమ్మకాయలు మంత్రిస్తూ క్షుద్రపూజలు చేస్తుండగా వినోద్నాయక్ గుర్తించి అడ్డుకున్నాడు. అనంతరం మాంత్రికుడిని పోలీసులకు అప్పగించాడు. ఈ విషయంపై ఎస్ఐ లింగన్నను వివరణ కోరగా విరూపాక్షపై గతంలో పలు కేసులు ఉన్నాయని తెలిసిందన్నారు. దీంతో విరూపాక్షతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. జ్యోతిష్కుడిపై ఫిర్యాదు అనంతపురం: నగరంలోని కమలానగర్లో జ్యోతిష్య కేంద్రం నిర్వాహకుడు తనను మోసం చేసి రూ.లక్షలు వసూలు చేసుకున్నాడంటూ పోలీసులకు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించింది. అనంతపురంలో నివాసముంటున్న వివాహిత ఫరీదా భర్త తాగుడుకు బానిసయ్యాడు. వ్యసనాన్ని మాన్పించేందుకు ఆమె చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ క్రమంలోనే కమలానగర్లో ఉన్న చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం నిర్వహకుడు దుర్గాప్రసాద్ శాస్త్రిని సంప్రదించింది. తాగుడు మాన్పిస్తానని, నర దృష్టి లేకుండా చేస్తానని నమ్మబలకడంతో జనవరి నెల నుంచి ఫోన్ పే ద్వారా రూ.1.50 లక్షలు, మరో రూ.2 లక్షలను నగదు రూపంలో మొత్తం రూ.3.50 లక్షలను ఫరీదా చెల్లించింది. అనంతరం ఫరీదా భర్తలో మార్పు రాలేదు కానీ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దీంతో డబ్బును వెనక్కు ఇవ్వాలని బాధితురాలు నేరుగా వెళ్లి జ్యోతిష్కుడిని అడిగినా ఫలితం లేకపోయింది. దీంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకున్న ఆమె బుధవారం వన్టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. -
గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు కౌన్సెలింగ్
అనంతపురం రూరల్: ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–4కు పదోన్నతి కల్పిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను జిల్లా పంచాయతీ కార్యాలయంలో బుధవారం చేపట్టి పంచాయతీ కార్యదర్శుల నుంచి ఆప్షన్లను తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 154 మంది గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు ఉండగా, వీరందరికీ గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా పంచాయతీ అదికారి సమత, తదితరులు పాల్గొన్నారు. మిద్దె పైనుంచి జారి పడి వ్యక్తి మృతిఅనంతపురం: మిద్దైపె నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని నీరుగంటివీధికి చెందిన బండి లక్ష్మీనారాయణ (43) బుధవారం ఉదయం తన ఇంటి బాల్కానీ గోడపై కూర్చొని ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అపస్మారకస్థితికి చేరుకున్న ఆయనను కుటుంబసభ్యులు వెంటనే జీజీహెచ్కు తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. లక్ష్మీనారాయణకు భార్య అనిత, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రాజ్యమేలుతున్న నారా వారి కల్తీ మద్యం
అనంతపురం: నారా వారి కల్తీ మద్యం రాజ్యమేలుతోందని, రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్గా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్సీపీ మహిళా, యువజన విభాగం నాయకులు ధ్వజమెత్తారు. యూరియా అందించకుండా రైతులను కష్టపెడుతున్న చంద్రబాబు.. మందుబాబులకు మద్యం మాత్రం ఎక్కడైనా అందిస్తున్నారంటూ మండిపడ్డారు. బుధవారం వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. మద్యం బాటిళ్లను కార్యాలయం ఎదుట పగులగొట్టి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్యకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏ పల్లెలో చూసినా బెల్ట్షాపులు దర్శనమిస్తున్నాయన్నారు. అధికారుల ప్రోత్సాహంతో మద్యం దుకాణదారులు రెచ్చిపోతున్నారన్నారు. ఎమ్మెల్యేలు సిండికేట్ కింగ్లుగా మారిపోయారన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులన్నీ అధికార పార్టీ నేతలకు చెందినవేనని గుర్తు చేశారు. కల్తీ మద్యం తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. కల్తీ మద్యం తయారీ గురించి తెలిసినా కట్టడి చేయకుండా సంబంధిత అధికారులు మొద్దునిద్ర పోతున్నారని, వారిని మేల్కొలిపేందుకే కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తుండడంతో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని వాపోయారు. టీడీపీ నేతల కల్తీ మద్యం కారణంగా పేద, మధ్య తరగతి వర్గాల మహిళల తాళిబొట్లు తెగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఇదేనా అంటూ మండిపడ్డారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానన్న డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శివారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, మహిళా విభాగం జనరల్ సెక్రటరీలు పార్వతి, అంజలి,క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి జానీ, యువజన విభాగం ఉపాధ్యక్షులు వినీత్, ఉదయ్, యువజన విభాగం నగర జనరల్ సెక్రటరీ మసూద్ వలి, నగర కార్యదర్శి మైను, మహిళా నగరాధ్యక్షురాలు చంద్రలేఖ, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శోభ, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి బి. అనిల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతుల కష్టాలు పట్టని సీఎం చంద్రబాబు.. మందుబాబులకు మాత్రం కావాల్సిన మద్యం అందిస్తున్నారు వైఎస్సార్సీపీ మహిళా, యువజన విభాగం నాయకుల ధ్వజం -
తెగులు.. దిగులు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ పంటలను పురుగులు, తెగుళ్లు వ్యాపించి దెబ్బతీస్తున్నాయి. వేరుశనగలో కాండంకుళ్లు తెగులు, తిక్క ఆకుమచ్చ తెగులు ఆశించినట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పత్తిలో రసం పీల్చుపురుగు, తెల్లదోమ, గులాబీ రంగు కాయతొలచు పురుగు ఆశించాయి. వరిలో ఆకుముడుత, ఆముదంలో నామాలపురుగు ఆశించి దెబ్బతీస్తున్నాయి. కందిలో మారుకామచ్చపురుగు, పచ్చపురుగు, పెసర, మినుములో మారుకాగూడు కట్టే పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగు, మిరపలో తామరపురుగు, పచ్చపురుగు తదితర చీడపీడలు, తెగుళ్లు పంటలను దెబ్బతీస్తుండటంతో పిచికారీ ఖర్చులు పెరిగిపోయాయి. దిగుబడులపై కూడా తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితి నెలకొంది. పదును వర్షమే లేదు.. సరైన వర్షం లేక నెల రోజులవుతోంది. సెప్టెంబర్ 11 నుంచి ఉమ్మడి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు నెల రోజులు కావొస్తున్నా సరైన పదును వర్షం కురవలేదు. తేలికపాటి మినహా పెద్దగా వర్షాలు పడకపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటలు ఎండుముఖం పట్టాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఆకాశం మేఘావృతం కావడం ఇలా మారిన వాతావరణ పరిస్థితుల్లో దాదాపు అన్ని పంటల్లో చీడపీడల వ్యాప్తి పెరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీ పంటల సాగుకు ఇబ్బంది వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న లాంటి వర్షాధార పంటలు తేమ లేక వాడిపోతున్నాయి. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 111.6 మి.మీ కాగా 87 మి.మీ వర్షం కురిసింది. ప్రస్తుత అక్టోబర్లో ఇంకా వరుణుడు బోణీ చేయలేదు. అక్టోబర్లో 100.9 మి.మీ సాధారణ వర్షపాతంగా గుర్తించినా ప్రస్తుతానికి కేవలం 2.3 మి.మీ నమోదు కావడం గమనార్హం. దీంతో అటు ఖరీఫ్ పంటలతో పాటు ఇటు రబీ పంటల సాగుకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఖరీఫ్లో దారుణంగాఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలో 3.43 లక్షల హెక్టార్లకు గానూ 88 శాతంతో 3.01 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేశారు. అత్యధికంగా కంది 1.04 లక్షల హెక్టార్లు, వేరుశనగ 91 వేల హెక్టార్లు, పత్తి 26 వేల హెక్టార్లు, మొక్కజొన్న 29 వేల హెక్టార్లు, ఆముదం 16 వేల హెక్టార్లలో వేశారు. అటు శ్రీ సత్యసాయి జిల్లాలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. ఖరీఫ్లో 2.20 లక్షల హెక్టార్లకు గానూ 1.20 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. అందులో 49 వేల హెక్టార్లలో వేరుశనగ, 27 వేల హెక్టార్లలో కంది, మొక్కజొన్న 23 వేల హెక్టార్లు, ఆముదం 5 వేల హెక్టార్లు, పత్తి 4 వేల హెక్టార్లలో సాగు చేశారు. -
కరిగిపోయినా.. కళ్లప్పగించి చూస్తూ!
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం కూడా ఉమ్మడి జిల్లాకు సకాలంలో సరఫరా కావడం లేదు. ఇటు సర్కారుకు... అటు అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఇలాంటి దుస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఏ మాత్రం తేడాలొచ్చినా ప్రజా పంపిణీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతిమంగా లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరో వారం రోజుల్లో ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం రవాణా కావాల్సి ఉన్న తరుణంలో... అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు వద్ద ఉన్న గిడ్డంగుల్లో బియ్యం నిల్వలు 996 టన్నులు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఎంఎల్ఎస్ పాయింట్లకు రవాణా ఉమ్మడి జిల్లాలోని 24 ఎంఎల్ఎస్ పాయింట్లకు కందుకూరు వద్ద ఉన్న గిడ్డంగుల నుంచి 19,500 టన్నుల బియ్యం రవాణా అవుతుంది. శ్రీ సత్యసాయి జిల్లాకు నెలసరి 10 వేల టన్నులు, అనంతపురం జిల్లాలోని 12 ఎంఎల్ఎస్ పాయింట్లలో 6 పాయింట్లకు ఇక్కడి నుంచి 5 వేల టన్నులు, మరో 6 పాయింట్లకు గుంతకల్లులోని గోడౌన్ నుంచి 4,500 టన్నులు రవాణా చేస్తారు. అడుగంటిన నిల్వలు.. వాస్తవంగా ప్రతి నెలా 15లోపు ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం రవాణా చేస్తే అక్కడి నుంచి 30వ తేదీలోపు చౌక దుకాణాలకు చేరవేస్తారు. ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చినా ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆటంకం రాకూడదనే ఉద్దేశంతో గోదాముల్లో కనీసం ఒక నెలకు సరిపడా బియ్యం నిల్వలు అందుబాటులో ఉంచుతారు. అయితే ప్రస్తుతం కందుకూరు వద్ద ఉన్న గిడ్డంగుల్లో 996 టన్నులు మాత్రమే ఉండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లకు 15 వేల టన్నుల బియ్యం రవాణా ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టాల్సి ఉన్నా బియ్యం స్టాక్ లేని కారణంగా ప్రారంభం కాలేదు. వచ్చినా జాప్యం తప్పదు... బియ్యం స్టాక్ మూడు రోజుల్లో గిడ్డంగులకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే, స్టాక్ వచ్చినా సరుకులను సకాలంలో రవాణా చేయడంలో ఇబ్బందులు తప్పేలా లేవు. అధికారులు చెబుతున్నట్లు 11వ తేదీకి సరుకు వస్తే 15వ తేదీలోపు ఎంఎల్ఎస్ పాయింట్లకు రవాణా చేయడం అంత సులభం కాదు. అక్కడి నుంచి 30వ తేదీలోపు చౌక దుకాణాలకు చేరవేయడంలోనూ జాప్యం తప్పదు. ఈ సమస్య నుంచి గట్టేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టకపోతే లబ్ధిదారులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కందుకూరు గిడ్డంగుల్లో అడుగంటిన బియ్యం స్టాక్ 15 వేల టన్నులకు ఉన్నది 966 టన్నులే కనీసం నెల కోటా కూడా నిల్వ చేయని వైనం స్టాక్ రాకపోతే లబ్ధిదారులపై తీవ్ర ప్రభావం -
అశ్వవాహనం అధిష్టించి.. అభయమిచ్చి
తాడిపత్రి రూరల్: భూదేవి, శ్రీదేవి సమేత చింతలవెంకటరమణస్వామి ఆలయంలో బుధవారం స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు మూలవిరాట్కు అర్చకులు మురళిస్వామి అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి అశ్వవాహనంపై ఆశీనులను గావించారు. అనంతరం స్వామి వారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను దీవించారు. నేడు చక్రస్నానం చింతలవెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగియనున్నాయి. చివరి రోజు భూదేవి, శ్రీదేవి సమేత చింతల వెంకటరమణస్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజల అనంతరం చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు ముగింపు పలుకుతారు. -
పెండింగ్ పనులు పూర్తి చేయండి
● జేసీ శివ్ నారాయణ్ శర్మ ఆదేశం అనంతపురం అర్బన్: మూడో విడత రీ–సర్వే పనులతో పాటు ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియలో పెండింగ్ పనులు సత్వరం పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించాలని సూచించారు. జేసీ బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ ప్రజల నుంచి భూ సమస్యలపై అందిన అర్జీల పరిష్కారానికి రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. భూమి రికార్డుల సవరణ, పెండింగ్లో ఉన్న మ్యుటేషన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంలో అధికారులకు రైతులు సహకరించాలన్నారు. రీ–సర్వేలో కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని చెప్పారు. రైల్వే, జాతీయ రహదారి, సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పూర్తి కావాలన్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, నరసాపురం, బెళుగుప్ప, డీ.హీరేహాళ్, ఓబుళాపురం, గుత్తి, బసినేపల్లి, గాంధీనగర్, చట్నేపల్లి, రైల్వే ఆర్ఓఆర్, తాడిపత్రి, గన్నేవారిపల్లిలో రైల్వే పనులు, గార్లదిన్నె, కనుంపల్లి ఏపీఐఐసీ పనులకు సంబంధించి భూమి సేకరించాలన్నారు. జాతీయ రహదారులు 544డీ, 42, 67లో పెండింగ్ పనులు, నష్ట పరిహారం చెల్లింపు పూర్తవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. సమావేశంలో సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్, భూ విభాగం తహసీల్దారు రియాజుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు. -
‘డబ్బు’ల్ రిజిస్ట్రేషన్తో రూ.3 కోట్ల భూమికి ఎసరు!
అనంతపురం టౌన్: అధికార అండతో ‘పచ్చ’ నేతలు బరితెగిస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ‘డబ్బు’ల్ రిజిస్ట్రేషన్లతో భయకంపితులను చేస్తున్నారు. కూటమి ఏడాదిన్నర పాలనలో అనంతపురం నగరం చుట్టూ ఇదే తంతు సాగుతోంది. ఇప్పటికే నగరంలో సాయినగర్లోని ‘అస్రా’ ఆప్టికల్స్ భవనంతో పాటు తపోవనంలోని ఎంకేఎం ఫంక్షన్ హాలు సమీపంలో 5వ రోడ్డులోని ఓ సామాజిక వర్గానికి చెందిన స్థలాల కబ్జా మరువక ముందే తాజాగా ఓ టీడీపీ నేత అనంత పురం రూరల్ మండలం ఏ. నారాయణపురం సమీపంలోని సర్వే నంబర్ 156–2లో రూ.3 కోట్ల విలువ చేసే 1.19 ఎకరాలకు ఎసరు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామానికి చెందిన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ సరిపూటి పద్మాగీత భర్త సరిపూటి ముకుందనాయుడు నడిపిన అడ్డగోలు బాగోతం కలకలం సృష్టిస్తోంది. వివరాలు.. ఏ. నారాయణపురం గ్రామానికి చెందిన పెద్ద నారప్పకు గ్రామ సర్వే నంబర్ 156–2లో 9.59 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని అతని వారసులు దశల వారీగా 1999లో 3 ఎకరాలు, 2002లో 2.40 ఎకరాలు, 2008లో మిగిలిన 5 ఎకరాలను విక్రయించేశారు. ఇదే సర్వే నంబర్లో 1999లో 3 ఎకరాలు కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి ఒక ఎకరా స్థలాన్ని మూడో రోడ్డుకు చెందిన కవ్వలూరు కృష్ణ 2009లో కొనుగోలు చేశాడు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ రూ.3 కోట్లు పలుకుతోంది. అధికార అండతో కబ్జా కూటమి ప్రభుత్వం వచ్చాక కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పద్మాగీత, ఆమె భర్త ముకుందనాయుడు ఆ భూమిపై కన్నేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల అండతో 2025 ఆగస్టు 6న ‘డబ్బు’ల్ రిజిస్ట్రేషన్ చేసుకుని భూమిలో బోర్డు నాటారు. ఇదేమని ప్రశ్నించిన నిజమైన భూ యజమానులను వేధింపులకు గురిచేస్తున్నారు. వారికి ప్రధాన అనుచరుడు.. కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామానికి చెందిన ముకుందనాయుడు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే ముకుందనాయుడు అనంతపురానికి మకాం మార్చి నగర ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తమకు సమీప బంధువు అంటూ హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూడో రోడ్డుకు చెందిన కృష్ణ అనే బ్రాహ్మణుల ఎకరా భూమి కబ్జా చేయడం గమనార్హం. తమ పేర్లు చెప్పి కబ్జా చేస్తున్న విషయం ఆ ఎమ్మెల్యేలకు తెలుసా..? లేదంటే తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరిస్తున్నారా అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కనగానపల్లి మాజీ ఎంపీపీ భర్త ముకుందనాయుడి బరితెగింపు టీడీపీ ఎమ్మెల్యేల అండతో రెచ్చిపోతున్న వైనం -
అంగట్లో అంగన్వాడీ పోస్టులు
కదిరి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జిల్లాలో ప్రధానంగా టీడీపీ నాయకులు కొందరు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇది సక్రమ వ్యాపారమైతే పర్వాలేదు. అంతా అక్రమ వ్యాపారమే. ఇసుక, మట్టి, మద్యం ఇలా దేన్నీ వదలడం లేదు. తాజాగా కొత్త వ్యాపారం మొదలెట్టారు. అదే అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా పోస్టుల బిజినెస్. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. డిమాండ్ను బట్టి ఆ రేటు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. జిల్లాలోని పలు మినీ అంగన్వాడీ కేంద్రాలను ఈ మధ్యే అప్గ్రేడ్ చేశారు. వీటికి ప్రస్తుతం ఒక్కొక్కరు చొప్పున అంగన్వాడీ సహాయకురాలు (ఆయా) అవసరం. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి రోస్టర్ ప్రక్రియ పూర్తి కాగానే కలెక్టర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అయితే ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో అంగన్వాడీ ఆయా పోస్టుల కోసం ఆశావహులు స్థానిక ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీన్ని గ్రహించిన కొందరు ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులు ‘ఆ పోస్టు ఎలాగైనా మీకే వచ్చేలా చేస్తాం. పోటీ ఎక్కువగా ఉంది. అయినా మీకే ఇప్పిస్తాం. కాకపోతే డబ్బులు ముందే ఇవ్వాలి. ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండా ఓటు వేయలేదు కదా.. ఎంతో కొంత రాబట్టుకోవాలి..’ అంటూ రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. సరాసరిన ఒక్కో పోస్టుకు రూ.3 లక్షలు అనుకున్నా రూ.16 కోట్లు పైమాటే. ఈ తంతు కొన్ని నియోజవర్గాల్లో ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతుంటే.. ఇంకొన్నిచోట్ల ఆయా ఎమ్మెల్యే పీఏల కనుసన్నల్లో సాగుతోంది. అప్గ్రేడ్ పేరుతో మరో వ్యాపారం ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. వీటిలో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు 10వ తరగతి ఉత్తీర్ణత లేనందున ఆయా కేంద్రాలను అప్గ్రేడ్ చేయలేదు. దీన్ని కూడా స్థానిక టీడీపీ నాయకులు కొందరు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అప్గ్రేడ్ చేయించి మిమ్మల్నే కొనసాగిస్తాం అంటూ కొందరు, ఆ స్థానంలో వారు కాకుండా మీకు అవకాశం కల్పించే బాధ్యత మాది.. అంటూ మరి కొందరు ఇలా వారిని నమ్మిస్తూ అంగన్వాడీ పోస్టును అంగట్లో అమ్మకానికి పెట్టారు. కొన్ని చోట్ల రూ.6 లక్షలు వరకు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అలాగే ఇవన్నీ అప్గ్రేడ్ అయితే ఆయా(సహాయకురాలు) పోస్టుకు ముందే డబ్బు కట్టి రిజర్వ్ చేసుకోండి.. అంటూ కొన్ని చోట్ల డబ్బు తీసుకున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో ఓ వైపు బీజేపీ, మరో వైపు టీడీపీ నాయకులు అంగన్వాడీ ఆయా పోస్టులు ఇప్పిస్తామంటూ వ్యాపారం మొదలు పెట్టారు. ఈ విషయంలో ముదిగుబ్బ మండలంలోని ఓ గ్రామంలో ఇరుపార్టీ నాయకుల మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగింది. మంత్రి సత్యకుమార్ ఇచ్చిన జాబితానే ఫైనల్ అని బీజేపీ నాయకులంటే.. కాదు కాదు పరిటాల ఫ్యామీలీదే జరుగు తుందని టీడీపీ వారు.. ఇలా ఇరువర్గాల వాదనలు రచ్చకెక్కాయి.... ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ ఆయా పోస్టుల పేరుతో దందా మొదలైంది. ఆశావహులు పోస్టు కోసం డబ్బులివ్వక తప్పడం లేదు. -
‘డైట్’ కళాశాలకు గ్రాంట్ విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: శ్రీసత్యసాయి జిల్లా డైట్ కళాశాలకు 2025–26 సంవత్సరానికి సంబంధించి గ్రాంట్ విడుదల చేసినట్లు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు పద్దుల కింద మొత్తం రూ.9. 90 లక్షలు విడుదల చేశామన్నారు. ఇందులో 50 శాతం వార్షిక గ్రాంట్ రూ. 7.50 లక్షలు, టెక్నాలజీ సపోర్ట్ కింద రూ. 2.40 లక్షలు ఉన్నాయన్నారు. నిబంధనలకు లోబడి ఖర్చు చేసి వివరాలను టీసీఎస్ యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సెలవులో జీజీహెచ్ సూపరింటెండెంట్ అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎల్ సుబ్రహ్మణ్యం సెలవులో వెళ్లారు. ఆయన ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మైసూర్లో వైద్య విద్యార్థులకు నిర్వహించే పరీక్షకు ఎగ్జామినర్గా వెళ్లారు. ఆయన తిరిగి విధుల్లో చేరే వరకూ అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ శౌరీ సూపరింటెండెంట్గా వ్యవహరించనున్నారు. కాగా, చిన్నపిల్లల విభాగం, గైనిక్, అనస్తీషియా, మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, సర్జరీ తదితర విభాగాల్లోని సీనియర్ ప్రొఫెసర్లను కాదని జూనియర్ అయిన డాక్టర్ శ్రీనివాస్ శౌరీకి సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. -
జిల్లాకు 989 మెట్రిక్ టన్నుల యూరియా
అనంతపురం అగ్రికల్చర్:‘స్పిక్’ కంపెనీ నుంచి 988.875 మెట్రిక్ టన్నుల యూరియా మంగళవారం జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్పాయింట్లో వ్యాగన్ల ద్వారా జిల్లాకు సరఫరా అయిన యూరియా బస్తాలను ఆయన పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు 649.98 మెట్రిక్ టన్నులు మార్క్ఫెడ్కు, 338.895 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్లకు కేటాయించి అక్కడి నుంచి ఇండెంట్ల మేరకు ఆర్ఎస్కేలు, సొసైటీలు, రీటైల్ దుకాణాలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కాల్సెంటర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో శిక్షణ అనంతపురం క్రైం: నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాల్సెంటర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులన్నారు. అనంతపురం నగర శివారులోని టీటీడీసీ సెంటర్లో 90 రోజుల పాటు కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్పై శిక్షణ ఉంటుందన్నారు. ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9492018354, 8639448535 నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. ఐసీడీఎస్ పీడీ నాగమణిపై సస్పెన్షన్ వేటు అనంతపురం సెంట్రల్: మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.నాగమణిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న రెండు నెలల బాలుడు నిరూప్ ఈనెల 3న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నిర్లక్ష్యం వహించడంతో పాటు నివేదికను పై అధికారులకు అందించడంలో జాప్యం చేసిన కారణంగా సస్పెండ్ చేస్తున్నట్లు మహిళా,శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శిశుగృహ సిబ్బంది నిర్లక్ష్యం, అంతర్గత పోరు కారణంగా బిడ్డ మరణం సంభవించిందని, బిడ్డకు సరిగా ఆహారం ఇవ్వడంలో విఫలమైనట్లు గుర్తించామని తెలిపారు. బాలుడికి వైద్యపరంగా శిశుగృహ సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయించడంలో పీడీ విఫలమయ్యారని వివరించారు. భూ సమస్యలు పరిష్కరించాలి ● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం అనంతపురం అర్బన్: సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు క్రమంలో ఏవైనా భూ సమస్యలు ఉంటే పరిష్కరించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోలార్ ప్రాజెక్టుకు భూ సేకరణపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, ఏపీఎన్జీఈఎల్ (ఎన్టీపీసీ) డెవలప్మెంట్ అధికారి కిషోర్రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంబదూరు మండలం చెన్నంపల్లి వద్ద సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు 5,862 ఎకరాలు గుర్తించామన్నారు. అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే నెల రోజుల్లో పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ, సోలార్ ప్రాజెక్టు, నెడ్క్యాప్, సర్వే శాఖల అధికారులతో బృందం ఏర్పాటు చేసుకుని రెండు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. సమావేశంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, సర్వే ఏడీ రూప్లానాయక్, ఎల్డీఎం నరేష్రెడ్డి, భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్ధీన్, డీటీ సురేఖరావు, ఎన్టీపీసీ అధికారులు శివకుమార్, వినోద్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిలో మాయాజాలం
● 10 మంది హాజరైతే 50 మంది వచ్చినట్లు చూపిన వైనం పామిడి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో సిబ్బంది మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. జేబులు నింపుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టారాజ్యంగా కూలీలను నమోదు చేస్తూ డబ్బు వెనకేసుకుంటున్నారు. వివరాలు.. పామిడి గ్రామ పంచాయతీలో ఈ నెల 4న కేవలం 10 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. అయితే, కూలీలను నమోదు చేసే ఎన్ఎంఎంఎస్లో మాత్రం 50 మంది పనులకు వచ్చినట్లుగా నమోదు చేశారు. ఫొటోలు ఒకటే అయినా పేర్లు మాత్రం వేర్వేరుగా నమోదు చేసి అప్లోడ్ చేశారు. ఈ తంతు నిత్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా, ఎక్కడో ఒక లోపాన్ని కనుగొని మాయ చేస్తుండడంగమనార్హం. ఒక్క పామిడి పంచాయతీలోనే కాదు.. జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఉపాధి సిబ్బంది ఇలాగే బురిడీ కొట్టిస్తూ, ప్రతి నెలా రూ. లక్షలు మింగేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా మండలాల అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఇలా జరుగుతోందని, జిల్లా స్థాయి అధికారులైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పామిడిలో కూలీల ఫొటోలను కొద్దిగా మార్చి వేర్వేరు పేర్లను నమోదు చేసిన దృశ్యాలు -
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా గాలి వీచింది.
ఎఫ్పీఓలు రైతులకు మరింత చేరువ కావాలి ● జేడీ ఉమామహేశ్వరమ్మ అనంతపురం అగ్రికల్చర్: ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్పీఓ) ఆర్థికంగా బలోపేతమై రైతులకు మరిన్ని సేవలు అందించడానికి ముందుకు రావాలని వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో అనుబంధ శాఖలు, ఎఫ్పీఓ ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. త్వరలో ఎఫ్పీఓల మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని, ఎఫ్పీఓల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, వ్యాపార లావాదేవీలు, సభ్యులు, రైతులకు అందిస్తున్న వివిధ రకాల సేవలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎఫ్పీఓలు ముందుకు వస్తే ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నందున ఆర్థికంగా పరిపుష్టి సాధించేలా ప్రణాళిక రూపకల్పన చేస్తామన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఉద్యాన ఉత్పత్తులు, కూరగాయల అమ్మకాలు, చేపలు తదితర వాటికి సంబంధించి వ్యాపార లావాదేవీలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 118 వరకు ఎఫ్పీఓలు అధికారికంగా రిజిస్ట్రేషన్ అయినా అందులో చాలా వరకు ఎలాంటి కార్యకలాపాలు సాగించడం లేదన్నారు. సమావేశంలో నాబార్డు డీడీఎం అనురాధ, జిల్లా సహకార అధికారి అరుణకుమారి, ఏపీ సీడ్స్ డీఎం వెంకటసుబ్బయ్య, మార్క్ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, పశుశాఖ ఏడీ డాక్టర్ రాధిక, ఉద్యానశాఖ ఏడీ దేవానంద్, మార్కెటింగ్శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్, మత్స్యశాఖ ఎఫ్డీఓ అసిఫ్, టెక్నికల్ ఏఓలు రాకేష్నాయక్, బాలానాయక్, కార్డు ప్రతినిధి నిర్మలారెడ్డి, ఎకాలజీ సెంటర్ ప్రతినిధి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోంది. గత పాలకులకు పేరొస్తుందనే ఉద్దేశంతో కక్ష కట్టి కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. చంద్రబాబు సర్కారు రాజకీయ కక్షతో పేదలకు మాత్రం కష్టాలు తప్పడం లేదు.
నత్తనడకన సాగుతున్న సర్జికల్ బ్లాక్ పనులుఅనంతపురం మెడికల్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లాకు సర్జికల్, ఎంసీహెచ్ బ్లాక్స్, పీజీ హాస్టళ్లు మంజూరు అయ్యాయి. అప్పట్లోనే నాడు–నేడు కింద రూ.300 కోట్లు కేటాయించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సకాలంలో పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో వేగంగా చర్యలు తీసుకున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 8 విభాగాలకు సంబంధించి అత్యవసర సేవల్లో భాగంగా రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కూటమి సర్కారు శాపం.. కూటమి ప్రభుత్వంలో సర్జికల్, ఎంసీహెచ్ బ్లాక్, క్రిటికల్ కేర్, పీజీ హాస్టళ్ల నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. చంద్రబాబు సర్కారు వచ్చీ రాగానే నిధులను భారీగా కుదించింది. రూ.300 కోట్లను కేవలం రూ. 78 కోట్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంసీహెచ్ బ్లాక్ నిర్మించ తలపెట్టిన ఆర్అండ్బీ కార్యాలయ స్థలాన్ని ఇంత వరకు స్వాధీనం చేసుకోలేదంటే పేదల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో అర్థం చేసుకోవచ్చు. ఇక.. మిగిలిన భవన నిర్మాణ పనుల్లోనూ వేగం తగ్గింది.ప్రస్తుతం నత్తకంటే ఘోరంగా సాగుతున్నాయి. సర్కారు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో సర్జికల్, పీజీ హాస్టల్, ఎంసీహెచ్, క్రిటికల్ కేర్ బ్లాక్లకు మోక్షమెప్పుడు లభిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సర్వజనాస్పత్రికి రోగుల తాకిడి అధికమైన నేపథ్యంలో.. నేడు కూటమి సర్కారు శాపంతో బాలింతలు, గర్భిణులతో పాటు ఆస్పత్రిలో రోగులు నరకం చూడాల్సి వస్తోంది. పీజీలకు తప్పని అవస్థలు.. అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ తదితర విభాగాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 117 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 92, మూడో సంవత్సరంలో 60 మంది కలుపుకుని మొత్తం 269 మంది పీజీ విద్యార్థులున్నారు. హాస్టల్ సదుపాయం లేకపోవడంతో వీరిలో చాలా మంది ఆస్పత్రి ఆవరణంలో ఉన్న సీనియర్ రెసిడెంట్ హాస్టల్లోనే అవస్థలు పడుతూ నెట్టుకొస్తుండగా.. చాలా మంది విద్యార్థులు అద్దె గదుల్లో ఉంటూ విద్యనభ్యసిస్తుండడం గమనార్హం. నత్తనడకన సర్జికల్, ఎంసీహెచ్, క్రిటికల్ కేర్ నిర్మాణ పనులు పేదల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంజూరు అప్పట్లోనే రూ.300 కోట్ల కేటాయింపు వచ్చీ రాగానే నిధులను కుదించిన చంద్రబాబు ప్రభుత్వం సర్కారు శాపంతో సా....గుతున్న పనులు రోగులకు తప్పని అవస్థలు -
మసిపూసి.. మారేడు కాయ చేసి!
అనంతపురం సెంట్రల్: మహిళాశిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహ అవినీతికి కేరాఫ్గా మారింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అక్రమాలకు పాల్పడడమే కాకుండా సాక్ష్యాలను సైతం తారుమారు చేయడంలో సిద్ధహస్తులనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తాజాగా నవజాత శిశువు మృతి విషయంలోనూ సాక్ష్యాలు తారుమారు చేస్తున్నట్లు మహిళాశిశు సంక్షేమ శాఖలోని కొందరు అధికారులే బహిరంగంగానే పేర్కొంటున్నారు. శిశువు మృతి చెందిన రోజు ఏం జరిగిందనే విషయంపై సీసీ కెమెరా ఫుటేజీలు నేటీకి బయటపెట్టక పోవడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఒకసారి.. రికార్డు కావడం లేదని మరోసారి పొంతనలేని సమాధానాలతో విచారణాధికారులను సైతం పక్కదోవ పట్టించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 3న శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ శిశువు మృతి చెందినట్లుగా సిబ్బంది బుకాయిస్తున్నారు. వాస్తవానికి శిశుగృహలోనే శిశువు మృతి చెందాడని, ఈ విషయం తెలిస్తే ఇబ్బందులు తప్పవని భావించిన శిశుగృహ సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజీలను బయటపెట్టకుండా విచారణాధికారులను పెడదోవ పట్టిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలోనూ తిమ్మిని బమ్మిని చేసి.. గతంలోనూ దత్తత అంశంలో తలెత్తిన వివాదంలో సాక్ష్యాలను తారుమారు చేసినట్లుగా శిశుగృహ సిబ్బందిపై ఆరోపణలున్నాయి. కెనడా దేశానికి చెందిన ఎన్ఆర్ఐ మహిళ దత్తత కోసం రాగా ఆమె నుంచి తొలుత రూ. 3 లక్షలు... ఆ తర్వాత బంగారాన్ని డిమాండ్ చేయడాన్ని ఆక్షేపిస్తూ కేంద్ర రాయబార కార్యాలయానికి ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అప్పటి జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తక్షణ విచారణ చేపట్టి వాస్తవాలు నిర్ధారించుకున్న అనంతరం శిశుగృహ మేనేజర్ను విధుల నుంచి తొలగించారు. అయితే సదరు ఎన్ఆర్ఐ మహిళ ఫిర్యాదులను, కలెక్టర్ జారీ చేసిన టెర్మినేట్ ఉత్తర్వులకు సంబంధించిన ఫైల్స్లో కొన్ని మాత్రమే ఉంచి కీలకమైన సమాచారాన్ని మాయం చేశారు. ఫలితంగా కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తిరిగి మళ్లీ అదే స్థానానికి మేనేజర్ చేరుకున్నారు. ఎన్ఆర్ఐ ఫిర్యాదుతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం వెంటనే సెంట్రల్ అడాప్షన్ రిసోర్సు అథారిటి(కారా) వెబ్సైట్ ద్వారా దత్తత పొందేలా మొత్తం ప్రక్రియను ఆన్లైన్ చేసింది. అంతకు మునుపు ఆఫ్లైన్ విధానంలో ఇష్టానుసారంగా దత్తతకు ఇచ్చి భారీగానే సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శిశుగృహ మేనేజర్ ఏం చేస్తున్నట్లు? శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సంరక్షణ బాధ్యత మొత్తం సంబంధిత మేనేజర్పైనే ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితుల్లోనైనా 24 గంటలూ సేవలందించాల్సి ఉంటుంది. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల వైద్యులతో చికిత్సను అందించాలి. అవసరమైతే అక్కడే అడ్మిట్ చేయడం.. ప్రత్యేకంగా ఆయాను నియమించి కోలుకునేంత వరకూ చికిత్సనందించేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా ఇటీవల శిశువు మృతి చెందే వరకూ కూడా మేనేజర్ పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. 3న అర్ధరాత్రి విధుల్లో ఉన్న ఒకే ఆయా శిశువు పరిస్థితిని ఫోన్ ద్వారా తెలిపినా మేనేజర్ స్పందించలేదని తెలిసింది. దీంతో ఐదుగురు చిన్నారులను వదిలేసి శిశువును తీసుకుని సర్వజనాస్పత్రికి ఆయా ఒక్కరే వెళ్లింది. అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి వెనక్కు పంపినట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. అక్రమాలకు అధికారి అండ! శిశువు మరణానికి బాధ్యులైన వారిని రక్షించేందుకు ఓ అధికారి విశ్వప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. గతంలో అక్రమాలకు పాల్పడి టెర్మినేట్ అయిన సమయంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి తిరిగి శిశుగృహలో బాధ్యతలు స్వీకరించేలా చేసిన సదరు అధికారి ప్రస్తుతం కూడా అవినీతి అధికారిని రక్షించే బాధ్యతలను భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శిశువు శిశుగృహలోనే మృతి చెందిన అంశాలున్న సీసీ కెమెరా ఫుటేజీలను తొక్కి పెట్టించినట్లు ఆరోపణలున్నాయి. అనారోగ్యంతో శిశువు మృతి చెందినట్లుగా మెడికల్ సర్టిఫికెట్ సృష్టించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రంగంలోకి అసిస్టెంట్ కలెక్టర్ అనంతపురం మెడికల్: శిశుగృహ నుంచి అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన పసికందును ఎందుకు అడ్మిట్ చేయలేదని పీడియాట్రీషియన్ డాక్టర్ బాబ్జాన్ను అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ ఆరా తీశారు. శిశుగృహలో పసికందు మృతిపై విచారణలో భాగంగా శిశువుకు అందించిన వైద్యంపై అసిస్టెంట్ కలెక్టర్ మంగళవారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని సూపరింటెండెంట్ చాంబర్లో పీడియాట్రీషియన్లు డాక్టర్ బాబ్జాన్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ లోక్నాథ్తో విచారణ చేపట్టారు. శిశువుకు ఒకసారి మాత్రమే విరేచనాలయ్యాయని సిబ్బంది చెప్పారని, దీంతో అడ్మిట్ చేయలేదని డాక్టర్ బాబ్జాన్ తెలిపారు. ఒక్కసారి విరేచనమైనంతనే మరణించే అవకాశాలు ఎంత వరకు ఉంటాయనే అంశంపై అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ లోతైన విచారణ చేపట్టినట్లు సమాచారం. శిశు మరణంపై సాక్ష్యాలు తారుమారు? ఇప్పటి వరకూ బయటపెట్టని సీసీ కెమెరా ఫుటేజీలు గతంలోనూ ఇదే తరహాలో కీలక ఫైళ్ల మాయం -
నిండుకుండలా పీఏబీఆర్
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నిండు కుండలా దర్శనమిస్తోంది. మంగళవారం నాటికి 5.157 టీఎంసీలకు నీటిమట్టం చేరినట్లు డ్యాం డీఈ వెంకటరమణ తెలిపారు. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ ద్వారా 185 క్యూసెక్కులు, జీడిపల్లి జలాశయం నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా 510 క్యూసెక్కుల చొప్పున నీరు వచ్చి చేరుతున్నట్లు వివరించారు. డ్యాంలో ఏర్పాటైన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి 585 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీరామరెడ్డి, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు 55 క్యూసెక్కులు, లీకేజీ రూపంలో 35 క్యూసెక్కులు, నీటి ఆవిరి రూపంలో 25 క్కూసెక్కుల అవుట్ ఫ్లో ఉందన్నారు.రసాయనిక ద్రావకం తాగి మేకల మృతిపుట్లూరు: రసాయనిక ద్రావకం తాగి 20 మేకలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన మేరకు... పుట్లూరు మండలం కొండుగారికుంట గ్రామానికి చెందిన రాజశేఖర్, బయన్న.. మేకల పోషణ ద్వారా జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం మేకలను మేపు కోసం సమీప పొలాల వద్దకు తీసుకెళ్లిన సమయంలో దాహం వేసి పండ్ల తోటలకు డ్రిప్పుల ద్వారా సరఫరా చేసేందుకు డ్రమ్ముల్లో ఉంచిన రసాయన ద్రావకాన్ని తాగాయి. అయితే మేకలు నీటిని తాగాయని భావించిన కాపరులు వాటిని సమీపం కొండల వద్దకు తోలుకెళుతుండగా ఒక్కొక్కటిగా 20 మేకలు మృతి చెందాయి. కాపరుల నుంచి సమాచారం అందుకున్న పశువైద్యాధికారుల అక్కడకు చేరుకుని పరిశీలించారు. మేకల కళేబరాలకు ఇన్చార్జ్ పశువైద్యాధికారి నాగసువర్ణ పోస్టుమార్టం నిర్వహించి, నివేదిక సిద్ధం చేశారు. -
అరటిలో యాజమాన్యంపై శిక్షణ
యల్లనూరు: అరటి, చీనీ పంటలను ఆశించే చీడపీడల నివారణకు సరైన చర్యలు తీసుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ఉద్యాన సంయుక్త సంచాలకులు దేవమునిరెడ్డి అన్నారు. ‘ఉద్యాన పంటలకు తెగుళ్లు’ శీర్షికన గత నెల 29న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో యల్లనూరు మండలం వేములపల్లి, కూచివారిపల్లి గ్రామాల్లో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, అరటి పంటలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. అంతకు ముందు మండలంలో చీనీ, అరటి తోగలను పరిశీలించారు. కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి ఉమాదేవి, నార్పల ఉద్యాన అధికారి నెట్టికంటయ్య, హెచ్ఈఓ రామాంజనేయులు, వీహెచ్ఎస్లు మురళి, ప్రవీణ్, మస్తాన్, ఆయేషా, రైతులు పాల్గొన్నారు. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ స్కోరర్గా తాడిపత్రి వాసి తాడిపత్రి టౌన్: ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ – 2025 టోర్నీ స్కోరర్గా తాడిపత్రికి చెందిన వినయ్ ఎంపికయ్యాడు. ఈ నెల 9 నుంచి 26వ తేదీ వరకూ విశాఖపట్నంలో ఐసీసీ ఉమెన్స్ వరల్డ్కప్ క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచ్లలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు వినయ్ స్కోరర్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి భీమలింగారెడ్డి మంగళవారం వెల్లడించారు. వినయ్ ఎంపికపై జిల్లా ఆంఫైర్ అసోసియేషన్ సెక్రటరీ అన్సర్ఖాన్, ఆర్డీటీ కోచ్ యుగంధర్, తాడిపత్రి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సాదిక్వలి, తాడిపత్రి ఆర్డీటీ సబ్సెంటర్ కోచ్ భార్గవ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
వైభవంగా చింతల రాయుడి కల్యాణం
తాడిపత్రి రూరల్: స్థానిక చింతల వేంకటరమణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీవారి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా ఆర్యవైశ్య సంఘం తరఫున మంగళ వాయిద్యాలతో పట్టు వస్త్రాలను ఆలయానికి చేర్చారు. అనంతరం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి చేర్చి ప్రధాన అర్చకుడు మురళీస్వామి ఆధ్వర్యంలో ఆశ్వయుజ పౌర్ణమి ఘడియల్లో శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. అనంతరం రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవం ప్రారంభమైన కొద్దిసేపటికే చిరుజల్లులు పడ్డాయి. దీంతో భక్తులు పరవశించిపోయారు. రథం ముందు వందన డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారుల కోలాటం అకట్టుకుంది. వివిధ వేషధారణలతో కళాకారులు ఆకట్టుకున్నారు. -
‘కరివేపాకు’పై ఉద్యాన కమిషనర్ ఆరా
తాడిపత్రి రూరల్: జిల్లాలో కరివేపాకు పంట సాగుపై రాష్ట్ర ఉద్యాన కమిషనర్ శ్రీనివాసులు ఆరా తీశారు. ‘ఫ్యాక్షన్ గతిని మార్చిన కరివేపాకు’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో వెలువడిన కథనం తెలిసిందే. దీనిపై స్పందించిన కమిషనర్.. మంగళవారం ఉదయం జిల్లా ఉద్యానాధికారి ఉమాదేవికి ఫోన్ చేసి సమగ్ర వివరాలను అందించాలని ఆదేశించారు. దీంతో కరివేపాకు పంట సాగుపై పూర్తి వివరాలు, రైతుల విజయాలపై పూర్తి స్థాయి సమచారం సేకరించి ఇవ్వాలంటూ తాడిపత్రి ఉద్యాన అధికారి ఉమాదేవికి డీహెచ్ఓ సూచనలు జారీ చేశారు. దీంతో వివరాల సేకరణలో తాడిపత్రి ఉద్యాన అధికారి నిమగ్నమయ్యారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాన్ని కరివేపాకు పంట సాగు మార్చిన తీరుపై ఇతర ప్రాంతాల్లోని రైతులకు మార్గదర్శకంగా ఉండేలా ఓ డాక్యుమెంటరీని తీయనున్నట్లు సమాచారం. గ్రామాల్లో జెడ్పీ సీఈఓ పర్యటన బొమ్మనహాళ్: మండలంలోని ఉంతకల్లు, నేమకల్లు గ్రామాల్లో జెడ్పీ సీఈఓ శివశంకర్ మంగళవారం పర్యటించారు. ఉంతకల్లులో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ చేపట్టాల్సిన కార్యాచరణపై పలు సూచనలు చేశారు. గ్రామంలో ఇంటింటా చెత్త సేకరణ విధానాన్ని నేరుగా ప్రజలతో ఆరా తీశారు. నేమకల్లులో చేపట్టిన అభివృద్ది పనులను తనిఖీ చేశారు. రూ.2.10 కోట్ల వ్యయంతో 50 సీసీ రోడ్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకూ 32 పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్, పీఆర్ జేఈఈ జగదీష్, పంచాయతీ కార్యదర్శులు శివన్న, పల్లవి, చిన్న యల్లప్ప, రాధాకృష్ణ పాల్గొన్నారు. కొనసాగుతున్న వైద్యుల సమ్మె అనంతపురం మెడికల్: పీహెచ్సీ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఆవరణలో ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. క్లినికల్ పీజీ సీట్లను 30 నుంచి 15 శాతానికి, నాన్ క్లినికల్ సీట్లను 50 నుంచి 30 శాతానికి తగ్గించడంతో పీహెచ్సీ వైద్యులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో వైద్యుల సంఘం నాయకులు మనోజ్, డాక్టర్ సంధ్య, డాక్టర్ శివసాయి, డాక్టర్ ఆసియా, డాక్టర్ ప్రీతి, డాక్టర్ పరమేష్, తదితరులు పాల్గొన్నారు. -
పొలాల్లో కేబుల్ అపహరణ
యాడికి: మండలంలోని చందన గ్రామంలో వ్యవసాయ బోరుబావుల మోటార్లకు అనుసంధానం చేసిన విద్యుత్ తీగలను దుండగులు అపహరించారు. గ్రామ సమీపంలో తమకున్న పొలాల్లో రైతులు మల్లేసు, మోహన్బాబు గౌడ్, ఆది, పరమేశ్వర, లక్ష్మన్న అరటి పంటను సాగుచేశారు. ఐదుగురు రైతుల బోరుబావులకు ఏర్పాటు చేసిన 70 మీటర్ల కేబుల్ను సోమవారం రాత్రి దుండగులు కత్తిరించి తీసుకెళ్లారు. మంగళ వారం ఉదయం విషయాన్ని గుర్తించిన రైతులు లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేత ‘ప్యాపిలి’ గుత్తి రూరల్: మండలంలోని తొండపాడు గ్రామంలో వాల్మీకి జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో విజేతగా నంద్యాల జిల్లా ప్యాపిలి జట్టు నిలిచింది. మంగళవారం ఉదయం జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుంతకల్లు మండలం కదిరిపల్లి, ప్యాపిలి జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠ పోరులో చివరకు ప్యాపిలి జట్టు గెలుపొందింది. రన్నరప్ను కదిరిపల్లి జట్టు కై వసం చేసుకుంది. మూడో స్థానంలో గుంటూరు, నాల్గో స్థానంలో గుత్తి మండలం వన్నేదొడ్డి జట్లు నిలిచాయి. విజేత జట్లను అభినందిస్తూ టీడీపీ నేత గుమ్మనూరు ఈశ్వర్ నగదు పురస్కారాలతో సత్కరించారు. మృతుడి ఆచూకీ లభ్యం గుత్తి: స్థానిక జీఆర్పీ పరిధిలోని తురకపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. మృతుడిని గుత్తిలోని బండగేరికి చెందిన చాకలి సుబ్రహ్మణ్యం (35)గా గుర్తించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదంలో వ్యక్తికి గాయాలు యాడికి: జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకున్న ప్రమాదంలో యాడికి వాసి శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబపోషణకు ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు సోమవారం సాయంత్రం అనంతపురానికి వెళ్లాడు. ప్రింటింగ్ ప్రెస్కు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసి బస్టాండ్కు నడుచుకుంటూ వెళుతుండగా శరవేగంగా దూసుకొచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో శ్రీనివాసులు కాలికి తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. డీఐఓ డాక్టర్ యుగంధర్కు పదోన్నతి అనంతపురం మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డీఐఓగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ యుగంధర్కు పదోన్నతి దక్కింది. మచిలీపట్నం డీఎంహెచ్ఓగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయనకు డీఎంహెచ్ఓ కార్యాలయ ఉద్యోగులు అభినందించారు. -
రెవెన్యూ క్రీడలను విజయవంతం చేయండి
● ఆయా శాఖలు సహకారం అందించాలి ● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం అనంతపురం అర్బన్: జిల్లాలో నవంబరు 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక–2025 ఉత్సవాలను విజయవంతం చేయాలని, ఇందుకు ఆయా శాఖలు పూర్తి సహకారం అందించాలని జిల్లా అధికారులను అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. రెవెన్యూ క్రీడల నిర్వహణ అంశంపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీఆర్ఓ ఎ.మలోల, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో కలసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలు మూడు రోజుల పాటు స్థానిక ఆర్డీటీ స్టేడియంలో జరగనున్నాయన్నారు. క్రీడలు సజావుగా నిర్వహించేందుకు ఆయా శాఖలు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ఏర్పాట్లలో ఏవైనా సమస్యలు ఉంటే డీఆర్ఓతో చర్చించి పరిష్కారం పొందాలన్నారు. క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చే ఉద్యోగులకు వసతి, రవాణా సదుపాయం కల్పించాన్నారు. మూడు రోజుల పాటు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. రోజూ పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని నగర పాలక సంస్థ కమిషనర్, డీపీఓకు సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఫస్ట్ ఎయిడ్స్ కిట్లు, 108 అంబులెన్స్, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్ఓని ఆదేశించారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడా ఉత్సవాల్లో 27 యూనిట్లు పాల్గొంటాయన్నారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ, ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. సమావేశంలో ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ రాజేష్, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జునరెడ్డి, రమేష్రెడ్డి, డీఎంహెచ్ఓ ఈబీదేవి, డీపీఓ నాగరాజునాయుడు, ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, గనుల శాఖ డీడీ ఆదినారాయణ, , రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దివాకర్రావు, సోమశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శప్రాయం
● జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమెల్సీ మంగమ్మ అనంతపురం రూరల్: వాల్మీకి మహర్షి జీవితం నేటి సమాజానికి ఆదర్శ ప్రాయమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా మంగళవారం అనంతపురం పాతూరులోని పవర్ ఆఫీస్ వద్ద ఉన్న వాల్మీకి విగ్రహానికి వారు పూలమాలలు వేసి, నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్థానిక వాల్మీక కల్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. రామాయణాన్ని మహా అద్భుత కావ్యంగా మలచి మానవ జాతిని సన్మార్గంలో నడిపిన మహోన్నత వ్యక్తి వాల్మీకి మహర్షి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ వసీం, డీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరా, బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూకొఠారి, తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి విగ్రహానికి నివాళులు పాతూరు పవర్ ఆఫీస్ వద్ద ఉన్న వాల్మీకి విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జేసీ శివ్నారాయణ్శర్మ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోయ, వాల్మీకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. -
ఫ్యాక్షన్ గతిని మార్చిన కరివేపాకు
కరివేపాకు వల్ల ఉపయోగం ఏముందని ప్రశ్నిస్తే.. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని, జీర్ణక్రియ దోహదపడుతుందని, మధుమేహాన్ని నియంత్రిస్తుందని, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ఠక్కున సమాధానమిస్తారు. అయితే తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి వాసులు మాత్రం కరివేపాకును చూసి ఫ్యాక్షన్ పారిపోయిందని అంటున్నారు. వ్యక్తుల మధ్య అనుబంధాలను పెంచిందని, ప్రశాంత జీవనానికి దోహదపడిందని అంటున్నారు. ఇంతకూ కరివేపాకు దెబ్బకు ఫ్యాక్షన్ ఎలా తోకముడిచిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే యర్రగుంటపల్లిని సందర్శించి తీరాల్సిందే.తాడిపత్రి రూరల్: మండలంలోని యర్రగుంటపల్లి చుట్టూ పచ్చని పంట పొలాలతో ఆకట్టుకుంటోంది. 3,066 మంది జనాభా ఉన్న ఈ గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఎక్కువగా ఎర్ర నేలలు ఉన్నాయి. కరివేపాకు పంటతోపాటు మొక్కజొన్న, కంది, అరటి, నిమ్మ, దానిమ్మ తదితర పంటలను సాగు చేస్తుంటారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామం ఒక్కప్పుడు ఫ్యాక్షన్ పడగ నీడలో ఎన్నో ఆటుపోట్లకు గురైంది.ఆధిపత్య పోరుతో రాజుకున్న ఫ్యాక్షన్మూడు దశాబ్దాల క్రితం యర్రగుంటపల్లిలోని కాటన్ మిల్లులో కార్మికుల మధ్య చోటు చేసుకున్న విభేదాలు గ్రామంలో చీలికలకు కారణమయ్యాయి. రెండు వర్గాలుగా గ్రామస్తులు విడిపోయారు. ఇదే అదనుగా ఓ వర్గానికి టీడీపీ ఆజ్యం పోస్తూ వచ్చింది. అడ్డుకునేందుకు మరో వర్గానికి కాంగ్రెస్ మద్దతు పలికింది. ఈ రెండు పార్టీలకు చెందిన ప్రధాన నేతలు తమ స్వార్థం కోసం గ్రామాన్ని రెండుగా చీల్చారు. చివరకు గ్రామంలో ఫ్యాక్షన్కు బీజం పడింది. హత్యలు, గృహ.. గడ్డివాముల దహనాలు, ఆస్తుల విధ్వంసం, బాంబుల మోతతో గ్రామం అట్టుడికిపోయింది. వేటకొడవండ్ల స్వైర విహారానికి నెత్తురు ఏరులై పారింది. పచ్చని పంట పొలాలు బీళ్లుగా మారాయి. రిమాండ్ పేరుతో జైళ్లల్లో కుమిలిపోయారు. కేసు వాయిదాలకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసుకుని తిరిగారు. దాడులు, ప్రతిదాడుల నుంచి ఎలా రక్షించుకోవాలలో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. పిల్లల చదువులు అటకెక్కాయి.కరివేపాకు సాగుతో మార్పుఫ్యాక్షన్ ప్రభావంతో అట్టుడికిపోతున్న సమయంలో యర్రగుంటపల్లిలోని భూములను గుంటూరుకు చెందిన కొందరు రైతులు గుత్తకు తీసుకుని కరివేపాకు సాగు చేపట్టారు. అప్పటి వరకూ వర్గ కక్షలతో నలుగుతూ పంటల సాగుపై సరైన దృష్టి సారించలేక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న స్థానికుల చూపు కరివేపాకు సాగుపై పడింది. గుంటూరు ప్రాంత రైతులు లాభాలు గడిస్తుండడంతో ఒక్కసారిగా గ్రామ రైతులందరూ కరివేపాకు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వర్గ కక్షలకు స్వస్తి పలికి కరివేపాకు సాగుపై దృష్టి సారించారు. దీంతో చూస్తుండగానే ఫ్యాక్షన్ మటుమాయమైంది. అప్పటి వరకూ కత్తులు దూసుకున్న వారు బంధుత్వ వరుసలు కలుపుకుని ఆప్యాయంగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు చొప్పున పంటల సాగుపై మనసు పెట్టడంతో 800 ఎకరాల్లో కరివేపాకు సాగు అందుబాటులోకి వచ్చింది. తొలుత యర్రగుంటపల్లికి మాత్రమే పరిమితమైన కరివేపాకు పంట ఆ తర్వాత ఇతర మండలాలకు విస్తరించింది. ప్రస్తుతం పెద్దపప్పూరు మండలంలో 780 ఎకరాలు, యాడికి మండలంలో 100 ఎకరాలు, పుట్లూరు మండలంలో 50 ఎకరాల్లో కరివేపాకు సాగులో ఉంది. యర్రగుంటపల్లికి చెందిన కొందరు రైతులు గుంతకల్లు మండలంలో పొలాలను లీజుకు తీసుకుని అక్కడ కూడా కరివేపాకు సాగు చేపట్టారు. రైలు మార్గంలో ముంబయి, చైన్నె నగరాలకు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నారు. -
నోటి మాటే శాసనం
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–25 ఇంగ్లిష్ సబ్జెక్టులో మెరిట్ అభ్యర్థి జీవితంతో అధికారులు ఆడుకుంటున్నారు. అతని కంటే వెనకున్న 8 మంది అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన అధికారులు.. ప్రస్తుతం స్వీయ రక్షణలో పడ్డారు. తమ నోటిమాటే శాసనమని నమ్మబలికి విజయవాడలో ఆర్డర్ కాపీ ఇప్పిస్తామంటూ పిలుచుకెళ్లి రిక్త హస్తాలతో వెనక్కు పిలుచుకొచ్చారు. చివరకు ఇండక్షన్ శిక్షణకూ హాజరయ్యేలా చేశారు కానీ, పోస్టుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. ఏమి జరిగిందంటే... స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ మెరిట్ జాబితాలో 48వ ర్యాంకులో ఉన్న ఎ.ఆంజనేయులు పేరును వెరిఫికేషన్ రోజు ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని కారణంగా ప్రీజింగ్ జాబితాలో ఉంచారు. గడువులోపు సర్టిఫికెట్లు అందజేయడంతో ఆయన పేరును అర్హుల జాబితాలో చేర్చి రాష్ట్ర అధికారులకు పంపారు. అయితే తుది జాబితాలో మాత్రం ఆంజనేయులు పేరు కనిపించలేదు. బీసీ–ఏ కేటగిరీలో అతని కంటే తక్కువ ర్యాంకులు సాధించిన 8 మందికి పోస్టులు దక్కాయి. ఇదే అంశంపై పత్రికల్లో కథనాలు వెలువడడంతో అధికారులు స్వీయ రక్షణలో పడ్డారు. దీంతో గత నెల 23న సాయంత్రం 7.30 గంటలకు ఏపీఓ మంజునాథ్ ఫోన్ చేసి విజయవాడకు బయలుదేరాలని, అక్కడే ఆర్డర్ కాపీ ఇస్తారని చెప్పడంతో అదే నెల 24న ఉదయం అందరితో పాటు ఆంజనేయులు విజయవాడ వెళ్లారు. అయితే అక్కడికెళ్లిన తర్వాత ఆంజనేయులుకు ఎలాంటి కిట్టు ఇవ్వకుండానే వెనక్కు పిలుచుకు వచ్చారు. శిక్షణలోనూ అటెండెన్స్ లేదు ఈ నెల 3 నుంచి కొత్త టీచర్లకు ఇండక్షన్ శిక్షణ ప్రారంభమైంది. దీంతో 2న డీఈఓ కార్యాలయానికి ఫోన్ చేసి తన పరిస్థితి ఏమిటో చెప్పాలని ఆంజనేయులు అడిగాడు. శిక్షణ కేంద్రానికి హాజరుకావాలని, శిక్షణ ముగిసిన తర్వాత ఉత్తర్వులు అందజేస్తారని తెలిపారు. దీంతో అనంతపురం రూరల్ పంగల్రోడ్డు సమీపంలోని వివేకానంద జూనియర్ కళాశాల కేంద్రానికి వెళితే.. శిక్షణకు అలాట్ చేసిన అభ్యర్థుల జాబితాలో ఆంజనేయులు పేరు లేదు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే... అందరూ ఆన్లైన్ (లీప్యాప్) అటెండెన్స్ వేస్తున్నారని, జాబితాలో పేరు లేదు కాబట్టి ఆన్లైన్ అటెండెన్స్ వేసేందుకు వీలుండదని తేల్చి చెప్పారు. శిక్షణకు హాజరైనా ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని జిల్లా పరిశీలకులు, జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు దృష్టికి ఆంజనేయులు తీసుకెళ్లారు. దీంతో డీఈఓ కల్పించుకుని ఈ విషయాన్ని రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వూ లేకపోయినా శిక్షణకు అనుమతి మెరిట్ అభ్యర్థి వ్యవహారంలో విద్యాశాఖ అధికారుల తీరు ఇబ్బంది ఉండదు ఆంజనేయులు సమస్యను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆయనకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది. సాంకేతిక సమస్య కారణంగా కాస్తా ఆలస్యమై ఉండొచ్చు. వీలైనంత త్వరగా ఆయన సమస్యకు పరిష్కారం చూపుతాం. – ఎం.ప్రసాద్బాబు, డీఈఓ -
బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
ఆత్మకూరు: ట్రాక్టర్ అదుపు తప్పి నేరుగా వెళ్లి బావిలో పడింది. వివరాలు.. ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి సోమవారం ఉదయం ట్రాక్టర్తో తన పొలంలో సేద్యం చేస్తుండగా అదుపు తప్పి నీళ్లు లేని బావిలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ట్రాక్టర్తో పాటు బావిలో పడిన రామచంద్రారెడ్డిని వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో మంచానికి తాళ్లు కట్టి బావిలో దించారు. అనంతరం దానిపై రామచంద్రారెడ్డిని చేర్చి పైకి లాగారు. తీవ్ర గాయాలైన రామచంద్రారెడ్డిని 108 అంబులెన్స్లో అనంతపురంలోని జీజీహెచ్కు తరలించారు. వ్యక్తి మృతదేహం లభ్యం ఆత్మకూరు: అవమాన భారం తాళలేక హంద్రీ–నీవా కాలువలో దూకి గల్లంతైన ఆత్మకూరు మండలం పంపనూరు తండాకు చెందిన లక్ష్మీనారాయణ నాయక్ (45) మూడు రోజుల తర్వాత మృతదేహమై తేలాడు. వివరాలు.. తనను ఇంటి పక్కన ఉన్న మహిళ చెప్పుతో కొట్టడంతో గ్రామంలో పరువు పోయిందంటూ మనో వేదనకు లోనైన లక్ష్మీనారాయణ నాయక్ శనివారం సాయంత్రం హంద్రీ–నీవా కాలువలో దూకిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు, స్థానికులు ముమ్మర గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం ఆత్మకూరు మండలం గొరిదిండ్ల సమీపంలో కాలువలో మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పిటీషన్లు పునరావృతం కాకూడదు : ఎస్పీ అనంతపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఒక్కసారి ఇచ్చిన పిటీషన్లు పునరావృతం కాకూడదని సిబ్బందిని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురి నుంచి ఆయన వినతులు స్వీకరించారు. బాధితులో నేరుగా మాట్లాడి సమస్య తీవ్రత తెలుసుకున్నారు. చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలంటూ సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రంలో అర్భన్ డీఎస్పీ వి.శ్రీనివాస రావు పాల్గొన్నారు. 140 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత కూడేరు: అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న 140 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందడంతో విజిలెన్స్ ఎస్ఐ జమాల్బాషా, సీఎస్డీటీ శాంతకుమారి కూడేరు మండలం జల్లిపల్లి వద్ద సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 140 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. అనంతపురంలోని తపోవనంలో నివాసముంటున్న బాబా ఫకృద్దీన్ తన బొలెరో వాహనంలో వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి నుంచి 140 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అనంతపురం మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. రేషన్ బియ్యం డంప్ స్వాధీనం ఉరవకొండ: స్థానిక స్పైస్ ఇన్ రైస్ రెస్టారెంట్ సమీపంలో అక్రమంగా డంప్ చేసిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం ఉదయం తహసీల్దార్ మహబూబ్బాషా, సిబ్బంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం నిల్వలు ఎవరో చేశారో విచారణ చేస్తున్నట్లు సీఐ మహనంది తెలిపారు. నిప్పంటుకుని వృద్ధుడి మృతి తాడిపత్రి టౌన్: స్థానిక గురు లాడ్జీ సమీపంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పట్టణానికి చెందిన వడ్డే వెంకటేష్ (75) మృతి చెందాడు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో మద్యం మత్తులో తన ఇంటి సమీపంలోని చెత్త వద్ద వడ్డే వెంకటేష్ పడిపోయాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ అంటించుకుని అగ్గిపుల్ల ఆర్పకుండా పడేయడంతో చెత్తకు నిప్పు అంటుకుంది. ఎవరూ గమనించకపోవడంతో మంటలు చెలరేగి వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కూటమి నిర్లక్ష్యంపై నేడు ‘ఫ్యాప్టో’ ధర్నా
● ఉమ్మడి జిల్లా నుంచి విజయవాడలో తరలివెళ్లిన ఉపాధ్యాయులు అనంతపురం ఎడ్యుకేషన్: విద్యారంగ, ఆర్థిక సమస్యలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండకడుతూ ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు మంగళవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తరలివెళ్లారు. బస్సులు, రైళ్లు, నాలుగు చక్రాల వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. విజయవాడలో ధర్నాచౌక్లో నిరసన కార్యక్రమం ఉంటుందని నాయకులు వెల్లడించారు. ఉపాధ్యాయులను కూటమి ప్రభుత్వం నమ్మించి వంచనకు గురి చేసిందని వాపోయారు. ఉన్న సమస్యలు పరిష్కరించకపోగా కొత్త సమస్యలు సృష్టిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి 16 నెలలవుతున్నా విద్యారంగంలో కనీస సమస్యలు పరిష్కరించలేదన్నారు. నాలుగు డీఏలు బకాయిలున్నాయన్నారు. సరెండర్ లీవ్లు ఎన్క్యాష్మెంట్ చేయలేదన్నారు. ఐఆర్ ఇవ్వలేదని, పీఆర్సీ కమిషన్ను నియమించలేదని మండిపడ్డారు. మొద్దునిద్ర పోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు ఉద్యమబాట తప్పనిసరిగా మారిందన్నారు. ఇప్పటికై నా దిగొచ్చి సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రభుత్వ మెడలు వంచేందుకు ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక గణేనాయక్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. వైద్య విద్యను పేద, మధ్య తరగతి వారికి అందకుండా నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తో్ందన్నారు. గత ప్రభుత్వంలో 107, 108 జీఓలకు వ్యతిరేకంగా మాట్లాడిన లోకేష్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చి మొత్తం కాలేజీలనే బేరం పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రైవేట్కు ఉద్దరించేందుకే పీపీపీ విధానం గొప్పదిగా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. చివరకు రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు సైతం నర్సీపట్నం కాలేజీ నిర్మాణానికి అనుమతులే లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అవాస్తవాలు, అబద్ధపు ప్రచారాలు ఆపి తక్షణమే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 6,400 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా కేవలం రూ. 400 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. వెంటనే మొత్తం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తరిమెల గిరి, సహాయ కార్యదర్శులు వెంకీ, భీమేష్, హారుణ్ రషీద్, శాంతిరాజ్, నగర నాయకులు సాయి, మహేష్, పరమేష్ పాల్గొన్నారు. -
చట్టం లేదు.. అంతా తూచ్!
‘‘ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత, నిష్పాక్షికత ఉండేలా ముసాయిదా చట్టాన్ని తయారు చేశాం. బదిలీల్లో అవినీతి, రాజకీయ జోక్యాన్ని అరికడతాం. ఎలాంటి వివాదాలకు తావులేకుండా, ఉపాధ్యాయుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఏటా వేసవి సెలవుల్లో మాత్రమే బదిలీలు జరిగేలా చట్టం రూపొందించాం..’’ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలివీ. అయితే, సరిగ్గా ఏడాదిన్నర కాలానికే సిఫార్సు బదిలీలకు కూటమి ప్రభుత్వం గేట్లు ఎత్తడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అనంతపురం ఎడ్యుకేషన్: మూడు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో టీచర్లను ప్రభుత్వమే నేరుగా బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు టీచర్లు బదిలీలు అయ్యారు. కణేకల్లు మండలం మాల్యం జెడ్పీహెచ్ఎస్లో ఎస్ఏ తెలుగు టీచరుగా పని చేస్తున్న దేవన గోపమ్మను బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం జెడ్పీహెచ్ఎస్కు, మడకశిర మండలంలో ఎస్జీటీగా పనిచేస్తున్న రాధను నల్లచెరువు మండలం గజేఖాన్పల్లి ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేశారు. ఈ బదిలీల వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడంతో పాటు రాజకీయ పలుకుబడి ఉపయోగించారనే విమర్శలు విద్యాశాఖలో గుప్పుమంటున్నాయి. ఇది ఆరంభమేనని, రానున్న రోజుల్లో మరింతమంది బదిలీల ఉత్తర్వులు రానున్నాయని కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు.వారు చేస్తే తప్పు... వీరు చేస్తే రైటా?గత ప్రభుత్వంలో కొందరు టీచర్లు వారి వ్యక్తిగత అవసరాల నేపథ్యంలో ఇలానే నేరుగా బదిలీలు చేయించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 30 మంది దాకా బదిలీ అయ్యారు. వారందరూ తీరా స్కూళ్లల్లో చేరే సమయంలో ప్రభుత్వం మారింది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ ఆ బదిలీలకు ససేమిరా ఒప్పుకోకుండా అడ్డుపుల్ల వేశారు. వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితులు కోర్టును ఆశ్రయించినా లాభం లేకపోయింది. అదే విద్యాశాఖ మంత్రి తాజాగా ప్రభుత్వ బదిలీలను ఎలా అంగీకరిస్తున్నారంటూ సామాన్య టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసింది తప్పయితే ఈ ప్రభుత్వం చేసింది రైటా? అని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేక ముసాయిదా చట్టం తీసుకొచ్చిన వారే చట్టాన్ని తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. ప్రభుత్వ బదిలీలపై కొందరు కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. -
పృథ్వీరాజ్కు ‘మై భారత్’ పురస్కారం
శెట్టూరు: మండలంలోని చిన్నంపల్లికి చెందిన ముమ్ముల్ల పృథ్వీరాజ్ మై భారత్ రాష్ట్రీయ సేవా యోజన పురస్కారం అందుకున్నాడు. న్యూఢిల్లీలో సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రశంసాపత్రం స్వీకరించాడు. ఎన్ఎస్ఎస్ వలంటీర్గా పృథ్వీరాజ్ అందించిన ఉత్తమ సేవలను గుర్తించి పురస్కారం ప్రదానం చేశారు. పృథ్వీరాజ్ నెల్లూరు సింహపురి యూనివర్సిటీలో పీజీ (బయోటెక్నాలజీ) పూర్తి చేశాడు. ఎన్ఎస్ఎస్ వలంటీర్గా డిజిటల్ ఇండియా, బాలికా శిక్షా, స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారం అందుకున్న పృథ్వీరాజ్కు గ్రామస్తులు, స్నేహితులు అభినందనలు తెలియజేశారు.గజవాహనంపై చింతల రాయుడి విహారంతాడిపత్రి రూరల్: పట్టణంలోని శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత చింతల వెంకటరమణస్వామి దేవాలయంలో సోమవారం స్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు స్వామి వారికి అర్చకులు మురళిస్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. గజవాహనంపై స్వామివారిని అధిష్టింపజేసి పురవీధుల్లో ఊరేగించారు.నేడు రథోత్సవంచింతలవెంకటరమణస్వామి కల్యాణ, రథోత్సవాలను మంగళవారం నిర్వహించనున్నట్లు ఈఓ రామాంజనేయులు తెలిపారు. ఆలయంలో ఉదయం 9 గంటలకు కల్యాణోత్సవం అనంతరం విందు ఉంటుంది. ఆ తర్వాత భూదేవి, శ్రీదేవి సమేత చింతలరాయుని ఉత్సవ విగ్రహాలను గాంధీకట్ట వద్ద ఉన్న రథం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు.‘ఉపాధి’లో మేసేశారు!● రూ.13.40 కోట్ల పనుల్లో రూ.1.87 కోట్ల అక్రమాలుశెట్టూరు: ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు వెల్లడైంది. మండలంలో 2024 ఏప్రిల్ 31 నుంచి 2025 మార్చి 1 వరకూ వరకు జరిగిన రూ.13.40 కోట్ల పనుల్లో రూ.1.87 కోట్ల అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి పీడీ సలీం బాష, ఏపీడీ సుధాకర్ రెడ్డి, డీవీఓ శ్రీనివాసులు హాజరయ్యారు. ఒక్క కనుకూరు పంచాయతీలోనే రూ.93 లక్షలకు పైగా అక్రమాలు జరిగినట్లు తేల్చి, రూ.72 వేలు జరిమానా విధించారు. లక్ష్మంపల్లి, చిన్నంపల్లి, ములకలేడులోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు తనిఖీ బృందం తేల్చింది. అక్రమాలకు పాల్పడిన ఉపాధి టీఏ, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు మొత్తం రూ.2,56,500 జరిమానా విధించారు.కనికట్టు చేశారు..మండలంలోని ప్రతి గ్రామంలో ఉపాధి పనుల్లో కనికట్టు చేసినట్లు వెల్లడైంది. రైతులకు క్షేత్ర స్థాయిలో మొక్కలు లేకపోయినా ఉన్నట్లు చూపి, బ్లాక్ ప్లాంటేషన్లో మొక్కలు పదుల సంఖ్యలో ఉంటే వందలాది మొక్కలు ఉన్నట్లు నమోదు చేసి బిల్లులు చేసుకున్నారు. ప్రతి గ్రామంలో అధికార టీడీపీ నాయకులకు అదనపు బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. మండలంలోని చిన్నంపల్లిలో ఆశా, ములకలేడులో అంగన్వాడీ కార్యకర్తలకు భర్తలు ఉన్నా వితంతు పింఛన్ తీసుకుంటున్నట్లు తనిఖీలో బయటపడింది. ఆయా గ్రామాల్లో వితంతు, డప్పు, చర్మకళాకారుల పెన్షన్లను పలువురు అక్రమంగా పొందుతున్నట్లు సిబ్బంది గుర్తించారు. -
విచారణ పూర్తి.. చర్యలే తరువాయి
అనంతపురం సెంట్రల్: శిశుగృహలో చిన్నారి మృతికి కారకులైన వారిపై చర్యలు తప్పవా? అంటే నివేదికలు రావడమే తరువాయి అనే సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై మహిళా,శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి సోమవారం స్థానిక బుడ్డప్పనగర్లోని ఐసీడీఎస్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ శిశుగృహ, ఐసీడీఎస్, చైల్డ్లైన్, సీడబ్ల్యూసీ (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) సభ్యులను వేర్వేరుగా విచారించారు. విచారణ సమయంలో మీడియాను అనుమతించలేదు. శిశువు మృతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైన వారిపై డైరెక్టర్ తీవ్ర స్థాయిలో మండిపడినట్లు తెలిసింది. శిశుగృహలో గొడవలకు దిగుతున్న వారిపైన, పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) మంజునాథ్పైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఐసీడీఎస్ పీడీ నాగమణి, జిల్లా మిషన్ వాత్సల్య కో ఆర్డినేటర్ శ్రీదేవి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫిర్యాదుల వెల్లువ.. శిశుగృహ మేనేజర్, సోషల్వర్కర్, ఆయా మధ్య గొడవల కారణంగానే శిశువు మృత్యువాత పడినట్లు డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డికి ఫిర్యాదులు వెళ్లాయి. గతంలో బాలుడి దత్తత కోసం వచ్చిన ఓ మహిళ నుంచి డబ్బు డిమాండ్ చేసిన ఉదంతాన్ని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆరోగ్యంగా శిశుగృహకు వచ్చిన బాలుడి ప్రాణాలు తీశారని తెలిపారు. దీనిపై డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి స్పందిస్తూ నవజాత శిశువు మరణాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. కలెక్టర్ ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు. శిశుగృహలో పనిచేసే సిబ్బందిపై వస్తున్న ఆరోపణలన్నింటిపైనా త్వరలోనే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. వారిలో గుబులు.. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విచారణ నేపథ్యంలో శిశుగృహ మేనేజర్, ఆయాలతో పాటు, జిల్లా మిషన్ వాత్సల్య కో ఆర్డినేటర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారిలో గుబులు రేగినట్లు తెలుస్తోంది. గండం నుంచి బయట పడేందుకు కొంతమంది రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారని సమాచారం. శిశుగృహకు నవజాత శిశువు అనారోగ్యంతో వచ్చాడని, విరేచనాలతో చనిపోయాడని డాక్టర్ నివేదికలు తెప్పిస్తే సరిపోతుందనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, కలెక్టర్ ఆనంద్ తొలిరోజే అధికారులు తూతూమంత్రంగా ఇచ్చిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో విచారణ నిక్కచ్చిగా జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమోటో కేసు నమోదు అనంతపురం/అనంతపురం సెంట్రల్: మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహలో నవజాత శిశువు మృతిపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎన్. రాజశేఖర్ స్పందించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ఆదేశాలతో సుమోటోగా కేసు నమోదు చేసి సోమవారం శిశుగృహను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారుల సంరక్షణ, పిల్లలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. శిశువు మృతిపై మహిళా,శిశు సంక్షేమశాఖ రాష్ట్ర డైరెక్టర్ విచారణ శిశుగృహ, ఐసీడీఎస్, చైల్డ్లైన్, సీడబ్ల్యూసీ సిబ్బంది నుంచి వివరాల సేకరణ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై మండిపాటు -
పోలీసుస్టేషన్ ‘పచ్చ’గా..
కూడేరు: కూడేరు అప్గ్రేడ్ పోలీసు స్టేషన్ను సీఐ రాజు టీడీపీ కార్యాలయంగా మార్చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుస్టేషన్ను ఆయన ‘పచ్చ’గా మార్చిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వివరాలు.. కూడేరు మండలం ముద్దలాపురంలో వారం క్రితం వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన పూజారి వెంకటేష్, పూజారి ధనుంజయ, పూజారి రమేష్ కుటుంబాలతో టీడీపీ కార్యకర్త జాఫర్ వలీకి ఇంటి ముందు దారి విషయమై గొడవ జరిగింది. దీనిపై జాఫర్ వలి కూడేరు పోలీసుస్టేషన్లో కేసు పెట్టాడు.ఈ క్రమంలోనే పోలీసులు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను స్టేషన్కు పిలిపించి ఇబ్బందులకు గురిచేశారు. టీడీపీ కండువా వేసుకుంటే సమస్యలుండవని సీఐ రాజు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం ఆ మూడు కుటుంబాలకు చెందిన వారికి అనంతపురంలో టీడీపీ నేత పయ్యావుల శీనప్ప సమక్షంలో ‘పచ్చ’ కండువాలు వేయించారు. అనంతరం అక్కడి నుంచి వారిని ముద్దలాపురం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు నేరుగా కూడేరు పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. వారితో సీఐని సన్మానింపజేయడమే కాకుండా స్టేషన్లోనే కేక్ కట్ చేసి సంబరాలు చేయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.మొన్నటి వరకు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై కస్సు బుస్సుమన్న సీఐ రాజు కండువా మారగానే సంతోషంగా వారితో ఫొటోలు దిగడం వివాదాస్పమైంది. హుందాగా వ్యవహరిస్తూ ప్రజలకు మేలు చేయాల్సిన స్థానంలో ఉన్న అధికారి.. ఒక పార్టీకి కొమ్ము కాస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయడమేమిటంటూ సామాన్యులు మండిపడుతున్నారు. -
అవార్డు అందుకున్న కలెక్టర్
అవార్డు అందుకున్న కలెక్టర్అనంతపురం అర్బన్: స్వచ్ఛ జిల్లా అవార్డును సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సోమవారం విజయవాడలో కలెక్టర్ ఓ.ఆనంద్ అందుకున్నారు.జ్యుడీషియల్ స్టాంప్లు కావలెను! అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జ్యుడీషియల్ స్టాంప్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్ని వారాలుగా స్టాంపులు లభించక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. రూ. 50, రూ. 100 స్టాంపులు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని స్టాంపుల విక్రయ కేంద్రంలో ‘నో స్టాక్’ బోర్డు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఏ ఒక్క కార్యాలయంలోనూ స్టాంపులు దొరకడం లేదు. దీంతో స్టాంప్ వెండార్లు, కామన్ సర్వీస్ కేంద్రాలను వినియోగదారులు ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రతి స్టాంపుపై రూ.20–30 వరకూ అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా రిజిస్ట్రార్ భార్గవను వివరణ కోరగా జ్యుడీషియల్ స్టాంపుల కొరత ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారులకు నివేదికలు పంపామని, రెండు మూడు రోజుల్లో అన్ని రకాల స్టాంపులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. -
గౌరమ్మ పండుగ.. భక్తిభావం నిండుగా
రాప్తాడు: తెలంగాణలో బతుకమ్మ పండుగను ఎంత ఘనంగా జరుపుకుంటారో.. జిల్లాలో అదే రీతిలో గౌరమ్మ ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు. అందులో భాగంగా రాప్తాడు మండలంలోని పాలచెర్ల, భోగినేపల్లి, ఎం. బండమీదపల్లి, బుక్కచెర్ల, గొందిరెడ్డిపల్లి, యర్ర గుంట, పుల్లలరేవు, హంపాపురం, గాండ్లపర్తి తదితర గ్రామాల్లో గౌరమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామస్తులు.. సోమవారం నిమజ్జనోత్సవాన్ని కనులపండువగా చేపట్టారు. ఈ సందర్భంగా యువతులు, చిన్నారులు, మహిళలు సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టారు. జ్యోతులను తలపై ఎత్తుకొని ఆలయాలకు వెళ్లి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ‘అమ్మమ్మ గౌరమ్మా... మాయమ్మ గౌరమ్మ మా ఇంటి మహాలక్ష్మి నీవమ్మా’ అంటూ ఊరేగింపు నిర్వహించి గ్రామ చెరువుల్లో నిమజ్జనం చేశారు. -
వ్యక్తి ఆత్మహత్య
అనంతపురం సిటీ: స్థానిక తాటిచెర్ల మార్గంలోని నేషనల్ హైవే బ్రిడ్జి కింద సోమవారం గూడ్స్ రైలు కింద పడి మల్లెల రవికుమార్(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించినా ఆ తరువాత మృతుడు అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురానికి చెందిన రవికుమార్గా గుర్తించినట్లు వివరించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారన్నారు. కుటుంబ కలహాలు, ఆర్థికపర సమస్యలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.సుప్రీంకోర్టు సీజేపై దాడి యత్నం గర్హనీయంఅనంతపురం: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై ఓ మతోన్మాది దాడికి పాల్పడడం గర్హనీయమని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు అన్నారు. దాడిని ఖండిస్తూ సోమవారం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గాజుల ఉమాపతి, గౌని నాగన్న, నాగరాజు బాబు, రాజశేఖర్ యాదవ్, నారపురెడ్డి తదితరులు ఓ ప్రకటన విడుదల చేశారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం భారత రాజ్యాంగంపై దాడికి యత్నించడమేనన్నారు. దుండగుడు తక్షణమే న్యాయవ్యవస్థకు క్షమాపణ చెప్పాలన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కించపరిచే ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వ్యక్తి బలవన్మరణంగుత్తి: స్థానిక జీఆర్పీ పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం తెల్లవారు జామున ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న జీఆర్పీ ఇన్చార్జ్ ఎస్ఐ మహేంద్ర, కానిస్టేబుల్ నాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మ హత్య చేసుకున్న ప్రాంతంలో ఉన్న టీవీఎస్ బైక్ను స్టేషన్కు తరలించారు. బైక్ నంబర్ ఆధారంగా మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
బంగారం వ్యాపారికి బురిడీ
ఉరవకొండ: స్థానిక సీఎస్ఐ చర్చి సమీపంలోని నిజాముద్దీన్ జ్యువెలరీ నిర్వాహకులు దాదాఖలందర్, తాజుద్దీన్ను సోమవారం ఓ మహిళా బురిడీ కొట్టించి రూ1.40 లక్షల విలువ చేసే బంగారం, నగదు తీసుకెళ్లింది. వివరాలు.. నిజాముద్దీన్ జ్యువెలరీ దుకాణానికి సోమవారం ఉదయం ఓ మహిళ వెళ్లింది. పక్కనున్న వ్యక్తిని తన భర్తగా పరిచయం చేస్తూ తమది నెరిమెట్ల గ్రామం అని, కుమార్తె వివాహం పెట్టుకోవడంతో తన వద్ద ఉన్న ఒకటిన్నర తులం బంగారు గొలుసు తీసుకుని కొంత నగదు, జత కమ్మలు ఇవ్వాలని కోరుతూ గొలుసు తీసిచ్చింది. దానిని పరీక్షించిన అనంతరం మేలిమి బంగారమేనని నిర్ధారించుకున్న వ్యాపారి దాదాఖలందర్... ఆ గొలుసుకు రూ.50 వేల నగదుతో పాటు ఆరు గ్రాముల బరువున్న కమ్మలు వస్తాయని తెలిపాడు. తానిచ్చిన బంగారు గొలుసును సదరు మహిళ చేతికి తీసుకుని అమ్మాయి పెళ్లి కాబట్టి కాస్త చూసి ఇవ్వాలంటూ బేరం ఆడింది. పాత బంగారం కావడంతో ఆ ధర వస్తోందని వ్యాపారి చెప్పడంతో చివరకు సరేనంటూ బ్యాగ్ లో ఉంచిన గొలుసు తీసిచ్చి.. వ్యాపారి ఇచ్చిన రూ.50 వేల నగదు, జత కమ్మలు తీసుకుని వెళ్లిపోయింది. కొద్ది సేపటి తర్వాత ఆ గొలుసును మరోసారి పరీక్షించగా అది నకిలీదని తేలింది. దీంతో మహిళ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. సీసీ టీవీ కెమెరా ఫుటేజీల్లో సదరు మహిళా అసలైన బంగారు గొలుసు స్థానంలో నకిలీ గొలుసు మారుస్తున్న దృశ్యం స్పష్టంగా నిక్షిప్తమైంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వ్యాపారి తెలిపాడు. నకిలీ గొలుసు ఇచ్చి రూ.1.40 లక్షలు చేజిక్కించుకున్న వైనం -
ఫ్యాక్షన్ జోలికి వెళ్లకుండా...
ఆధిపత్య పోరుతో ఫ్యాక్షన్కు బీజం పడి గ్రామం రెండు వర్గాలుగా విడిపోయింది. ఫ్యాక్షన్ కారణంగా సర్వమూ కోల్పోయాను. పేదరికంతో కొట్టుమిట్టాడాను. పిల్లలను చదివించుకోలేక పోయా. ఆ సమయంలో గుంటూరు ప్రాంతంలోని వడ్లపూడికి చెందిన రైతులు మా గ్రామంలోని భూములను గుత్తకు తీసుకుని కరివేపాకు సాగు చేపట్టారు. దీంతో కరివేపాకు సాగు చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో నా భార్యకు వివాహ సమయంలో పుట్టింటి వారు తాడిపత్రిలో ఇచ్చిన స్థలాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో గ్రామంలో ఐదు ఎకరాల పొలం కొనుగోలు చేసి, కరివేపాకు సాగు చేపట్టాను. లాభాలు రావడంతో ఫ్యాక్షన్ జోలికి వెళ్లకుండా పిల్లలను ఉన్నత చదువులు చదివించాను. ప్రస్తుతం నా కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కరివేపాకు పంట నా ఒక్కడి జీవితాన్నే కాదు గ్రామంలో అందరి జీవితాలను మార్చింది. – సూర్యనారాయణ, యర్రగుంటపల్లి -
తిరుగుతూనే ఉన్నామయ్యా
● ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో 375 వినతులు అనంతపురం అర్బన్: ‘‘అయ్యా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. మా సమస్యలు పరిష్కరించి ఆదుకోండి’’ అంటూ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, తిప్పేనాయక్, మల్లికార్జునుడు, మల్లికార్జునరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 375 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. అర్జీల పరిష్కార క్రమంలో ఏస్థాయిలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు. ● తన సోదరుని పేరిట ఉన్న భూమికి 1బీ, అడంగల్ రావడం లేదని బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి చెందిన కృష్ణంరాజు విన్నవించాడు. సర్వే నంబరు 220–2లో తన తమ్ముడు శ్రీకాంత్ పేరున ఉన్న 4.18 ఎకరాల భూమికి 1బి, అడంగల్ రావడం లేదని చెప్పాడు. ఆన్లైన్లో చూసుకుంటే తహసీల్దారు డిజిటల్ సంతకం కాలేదని వస్తోందని, డిజిటల్ సంతకం చేయించి సమస్య పరిష్కరించాలని కోరాడు. -
గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు
వజ్రకరూరు: ఐదు రోజుల క్రితం హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ ఎం.రామాంజనేయులు ఈ నెల 1న ఛాయాపురం వద్ద ఉన్న హంద్రీనీవా ప్రధాన కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే. రెండు రోజులుగా రెవెన్యూ అధికారులు, అగ్పిమాపక సిబ్బంది, పోలీసులు గాలింపు చేపట్టిన ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో ఆదివారం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. ఛాయాపురం నుంచి రాగులపాడు లిప్ట్ వరకూ హంద్రీ–నీవా ప్రధాన కాలువలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలించాయి. చీకటి పడుతున్నా ఆచూకీ లభ్యం కాలేదు. గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, ఐదు రోజులవుతున్నా వ్యక్తి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. -
శేష వాహనంపై శ్రీవారు
తాడిపత్రి రూరల్: వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తాడిపత్రిలోని చింతల వేంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం శేష వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగాయి. ఉదయం చింతల వేంకటరమణస్వామి, లక్ష్మీ అమ్మవారి మూలవిరాట్లకు అర్చకులు మురళీస్వామి బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత చింతల వేంకటరమణస్వామి ఉత్సవ మూర్తులను శేషవాహనంపై అధిష్టింపజేసి పురవీధుల్లో ఊరేగించారు. దేవేరులతో కలసి శ్రీకృష్ణుడి అలంకరణలో శ్రీవారు దర్శనమివ్వడంతో భక్తులు పులకించిపోయారు. -
అవమాన భారంతో ‘హంద్రీ–నీవా’లో దూకాడు!
ఆత్మకూరు: ఓ మహిళ చెప్పుతో కొట్టడంతో గ్రామంలో పరువు పోయిందంటూ మనోవేదనకు లోనై ఓ వ్యక్తి హంద్రీనీవా కాలువలో దూకాడు. ఈత రాకపోవడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... ఆత్మకూరు మండలం పంపనూరు తండాలో శనివారం కుళాయి గేట్వాల్వ్కు సంబంధించి లక్ష్మీనారాయణకు ఆయన పక్కింటి వారి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ సమయంలో లక్ష్మీనారాయణను పక్కింటి మహిళ చెప్పుతో కొట్టింది. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీనారాయణ ఘటనపై ఫిర్యాదు చేయడానికి వెళితే... ‘ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకుని వస్తుంటావు’ అంటూ పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో మనోవేదనకు లోనైన లక్ష్మీనారాయణ అదే రోజు సాయంత్రం ఆత్మకూరు నుంచి పంపనూరు తండా వరకూ నడుచుకుంటూ వెళ్లాడు. తనను చెప్పుతో కొట్టారని.. ఊళ్లో వాళ్లకి ముఖం చూపించలేనంటూ మార్గమధ్యంలో హంద్రీ–నీవా కాలువలో దూకాడు. ఈత రాకపోవడంతో ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు. అతని వెనకాలే ఉన్న కుమారుడు, బామ్మర్ది కేకలు వేసినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు సకాలంలో స్పందించలేదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆదివారం ఉదయం గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బందితో లక్ష్మీనారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా, లక్ష్మీనారాయణకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
సరుకులు స్టాక్ పాయింట్లోనే..
తాడిపత్రి రూరల్: అంగన్వాడీ కేంద్రాలంటే కూటమి ప్రభుత్వానికి అలుసుగా మారింది. ఇప్పటికే రెండు నెలల జీతం, అద్దెలు, ఇతర బిల్లుల మంజూరులో మీనమేషాలు లెక్కిస్తూ అంగన్వాడీ కార్యకర్తల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం తాజాగా మరో వివాదానికి తెరతీసింది. సకాలంలో లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయకుండా తన చేతకానితనాన్ని మరోసారి బయటపెట్టుకుంది. మొదటి వారంలోనే సరుకుల పంపిణీ.. ప్రతి నెలా మొదటి వారంలోనే అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులకు బియ్యం, కందిబేడలు, నూనె, కోడిగుడ్లు, పాలు, బాలసంజీవిని, బాలామృతం కిట్లు పంపిణీ చేస్తారు. ఈ నెల 6వ తేదీ వచ్చినా ఇప్పటి వరకూ ఒక్క సరుకు కూడా అంగన్వాడీ కేంద్రాలకు చేరలేదు. ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు పంపిణీ చేయాలో తెలియక అంగన్వాడీ టీచర్లు సతమతమవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25 అంగన్వాడీ ప్రాజెక్టుల పరిధిలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఒకటో తేదీన చౌకధాన్యపు డీలర్లకు లారీల్లో అందే సరుకులను అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు టీచర్లు ఆటోల ద్వారా తరలిస్తుంటారు. అయోమయంలో 3.20 లక్షల మంది.. ఉమ్మడి జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 5,125 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 3.20లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. 8వేల మందికి పైగా గర్భిణులు, 24వేల మందికి పైగా పాలిచ్చే తల్లులు, 0–6 వయస్సు గల పిల్లలు 2.60 లక్షల మంది ఉన్నారని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి నెలా నాలుగు విడతలుగా అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా అవుతాయి. గర్భిణులు, బాలింతల కోసం ప్రతి నెలా మూడు కిలోల బియ్యం, కిలో కందిబేడలు, అర కిలో నూనె, 25 కోడిగుడ్లు, తల్లులకు 5 లీటర్ల పాలు, చిన్నారులకు 2.5 లీటర్ల పాలు, బాలసంజీవిని కిట్లను పంపిణీ చేస్తారు. అయితే ఈ నెల ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని పౌరసరఫరాల స్టాక్పాయింట్లకు పదిరోజుల క్రితమే చేరుకున్న సరుకులు అక్కడే నిలిచిపోయాయి. రిలీజ్ ఆర్డర్ లేకుండానే డిస్పోజ్ ఆర్డర్! స్టాక్ పాయింట్ల నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సరుకులను రవాణా చేయడానికి ఉన్నతాధికారుల నుంచి ముందుగా రిలీజ్ ఆర్డర్ ఉండాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఈ సారి రిలీజ్ ఆర్డర్ లేకుండానే ఏకంగా డిస్పోజ్ ఆర్డర్ అందడంతో కింది స్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విషయాన్ని కమిషనరేట్ దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నాలు విఫలమైనట్లు సమాచారం. కేంద్రాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు.. ప్రతి నెలా 1వ తేదీ నేరుగా డీలర్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు పంపిణీ చేస్తుంటారు. నెలలో నాలుగు విడతలుగా కోడిగుడ్లను కాంట్రాక్టర్లు సరఫరా చేయాల్సి ఉండగా రవాణా ఖర్చుల భారం కారణంగా రెండు పర్యాయాలు చొప్పున నెలలో 1వ తేదీ, 15వ తేదీల్లో రవాణా చేస్తున్నారు. అయితే ఈ సారి అంగన్వాడీ కేంద్రాలకు బాలసంజీవని, కోడిగుడ్లు, పాలు, బాలామృతం ప్యాకెట్లు సరఫరా కాలేదు. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో సరుకులు నిండుకున్నాయి. సరుకుల కోసం రోజూ బాలింతలు, గర్భిణులు అంగన్వాడీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వారికి సరుకులు రాలేదని చెప్పలేక అంగన్ వాడీ టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. 10 రోజులైనా అంగన్వాడీ కేంద్రాలకు చేరని వైనం ఉమ్మడి జిల్లా వ్యాఫ్తంగా నిలిచిపోయిన రవాణా సరుకుల కోసం ఎదురుచూస్తున్న అంగన్వాడీ లబ్ధిదారులు సాంకేతిక సమస్యతోనే.. సాంకేతిక సమస్య కారణంగా రిలీజ్ ఆర్డర్ (ఆర్ఓ)లు అందలేదు. దీంతో స్టాక్ పాయింట్ల నుంచి సరుకులు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కాలేదు. సమస్య పరిష్కారం కాగానే సరుకులను అంగన్వాడీ కేంద్రాలకు చేరుస్తాం. – రమేష్రెడ్డి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి, అనంతపురం -
పెళ్లింట విషాదం
● మెరవణిలో దూసుకొచ్చిన డీజే వాహనం ● చక్రాల కింద పడి పెళ్లికొడుకు తండ్రి దుర్మరణం ● మరొకరికి తీవ్ర గాయాలు కనగానపల్లి: పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. మెరవణి సమయంలో డీజే వాహనం అదుపుతప్పి మనుషులపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు తండ్రి దుర్మరణం చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు.. కనగానపల్లికి చెందిన చిన్న తిరుమలయ్య (55), సరస్వతి దంపతులు. టీ హోటల్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివానంద వివాహం ఆదివారం పెనుకొండ సమీపంలోని గుట్టూరు వద్ద ఇందు అనే యువతితో జరిగింది. మధ్యాహ్నం బంధువులంతా తిరిగింపుల కోసం పెళ్లి కుమారుని స్వగ్రామం కనగానపల్లికి వెళ్లారు. సాయంత్రం వధూవరులతో కలిసి బంధుమిత్రులు సంతోషంగా మెరవణిలో పాల్గొన్నారు. డీజే కోసం ఏర్పాటు చేసిన వాహనం అదుపుతప్పి మెరవణిలో నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో వాహనం ముందు భాగాన ఉన్న పెళ్లి కుమారుడు తండ్రి చిన్న తిరుమలయ్య, ఆయన సోదరుడు ఆదెప్ప చక్రాల కింద పడ్డారు. వీరిలో చిన్న తిరుమలయ్య తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఆదెప్పను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతవరకూ సంతోషంగా సాగిన వేడుక ఈ ఘటనతో విషాదంగా మారిపోయింది. -
టీడీపీ నేతల కనుసన్నల్లోనే కల్తీ మద్యం తయారీ
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఉరవకొండ: టీడీపీ నేతల కనుసన్నల్లోనే కల్తీ మద్యం తయారీ సాగుతోందని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందిస్తామంటూ ఎన్నికల సమయలో ఇచ్చిన హమీని అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు విస్మరించారన్నారు. రాష్ట్రాన్ని కల్తీ మద్యాంధ్ర ప్రదేశ్గా మార్చారని ధ్వజమెత్తారు. కల్తీ మద్యం తాగి వందలాది మంది మరణిస్తున్నారని, వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టడంతో ప్రభుత్వ ఖజానాకే రూ. వేల కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ఎంతో పారదర్శకంగా నాడు మద్యం పాలసీని అమలు చేశారన్నారు. అనధికారిక బెల్టు షాపులను టీడీపీ నేతలు నిర్వహిస్తూ నిరుపేద కుటుంబాలను దోచుకుంటున్నారన్నారు. ట్రాక్ పటిష్టతపై నిఘా పెట్టండి : డీఆర్ఎం గుంతకల్లు: రైల్వే ట్రాక్ పట్టిషతపై ప్రత్యేక నిఘా పెట్టి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా ఆదేశించారు. గుంతకల్లు–అనంతపురం సెక్షన్లో డీఈఎన్ మణికంఠతో కలిసి ఆదివారం ప్రత్యేక రైలులో ప్రయాణిస్తూ రైలు మార్గం పటిష్టతను ఆయన పరిశీలించారు. టాక్ర్ భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను డీఈఎన్కు వివరించారు. -
ముందుకు సాగని సమీకృత భవన నిర్మాణ పనులు
అనంతపురం అర్బన్: ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా సమీకృత ఆర్థిక భవనం (ఇంటీగ్రేడెట్ ఫైనాన్స్ కాంప్లెక్స్) ఏర్పాటు ప్రక్రియ ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే ఖజానా, స్టేట్ ఆడిట్, పే అండ్ అకౌంట్స్, ఏపీజీఎల్ఐ శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండాలనే ఉద్ధేశంతో సమీకృత ఆర్థిక భవనం ఏర్పాటుకు 2016లోనే ఆర్థికశాఖ రూ.10కోట్ల నిధులు మంజూరు చేసింది. అనంతపురంలోని శారదానగర్లో ఉన్న సేవా సదనం వెనుక 50 సెంట్లు స్థలాన్ని గుర్తించారు. ఇందుకు సంబంధించి నివేదికను అప్పటి ఆర్డీఓ కలెక్టరేట్కు అందజేశారు. ఈ క్రమంలోనే నగర పాలక సంస్థ నుంచి ఖజానా శాఖ క్లియరెన్స్ తీసుకుంది. ఇదే సమయంలో అప్పటి కలెక్టర్ నాగలక్ష్మి బదిలీ కావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో సమీకృత ఆర్థిక భవన నిర్మాణ అంశంలో కలెక్టర్ ఓ.ఆనంద్పై ఖజానాశాఖ అధికారులు, ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. సొంతింటి కల ఛిద్రం అనంతపురం టౌన్: సామాన్యుల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం ఛిద్రం చేసింది. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు సాగకుండా కోర్టులను ఆశ్రయించి కుట్ర చేసింది. దీంతో ఇళ్ల నిర్మాణ పనులు మొదటి దశలోనే ఆగిపోయాయి. అనంతపురం రూరల్ మండలం కొడిమి గ్రామ పంచాయతీలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 3వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేయడంతోపాటు ఇంటి నిర్మాణ పనుల బాధ్యతను సైతం ప్రభుత్వమే తీసుకుంది. కొన్ని నిర్మాణ పనులు పూర్తి చేసింది. అనంతరం ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఇంటి నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. దీంతో పునాదుల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. -
‘గుంటూరు’పై ‘అనంత’ విజయం
అనంతపురం: ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా ఆదివారం ప్రారంభమైన జర్నలిస్టు రాష్ట స్థాయి క్రికెట్ లీగ్ పోటీల్లో గుంటూరు జట్టుపై అనంతపురం జట్టు విజయం సాధించింది. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు సాగే ఈ టోర్నీని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. తొలి మ్యాచ్ను అనంతపురం, గుంటూరు జట్ల మధ్య నిర్వహించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అనంతపురం సుధీర్ జట్టు 15 ఓవర్లకు గాను 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 15 ఓవర్లలో 88 పరుగుల వద్ద చతికిలపడింది. దీంతో అనంతపురం సుధీర్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రితో పాటు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విశిష్ట అతిథులుగా హాజరై మాట్లాడారు. వృత్తి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లతో సతమతమవుతున్న జర్నలిస్టులకు క్రీడలు మనో వికాసానికి దోహదపడతాయన్నారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జేశాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్కుమార్, గౌరవాధ్యక్షుడు రేపటి రామాంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కృష్ణంరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
పరిటాల దోపిడీకి సరిలేరెవ్వరూ
● అక్రమ సొమ్ముతోనే పరిటాల సునీత బెంజి కారులో తిరుగుతోంది ● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఫైర్ అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల వారి దోపిడీకి ఎవరూ సరిలేరని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్కలపల్లి టమాట మండీలో రోజూ రూ. 5 లక్షలు శ్రీరామ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. ధర్మవరం, అనంత పురం, చెన్నేకొత్తపల్లిలోని మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి రోజూ రూ. 25 లక్షలు పరిటాల ఇంటికి వెళ్తోందన్నారు. నియోజకవర్గంలో వెయ్యి బెల్ట్షాపులుండగా, నిత్యం ఒక్కో షాపు నుంచి రూ. 2 వేలు పరిటాల కుటుంబం పేరుతో వసూలు చేస్తున్నారన్నారు. చివరకు నసనకోట ముత్యాలమ్మ గుడినీ వదల్లేదని, అక్కడి బెల్ట్షాపు నుంచి రోజూ రూ. లక్ష వెంకటాపురంలోని వారి ఇంటికి వెళ్తోందన్నారు. ఆదాయం చాలా ఎక్కువ.. పరిటాల కుటుంబీకులకు వెంకటాపురంలో కాకుండా అనంతపురం, హైదరాబాద్, బెంగళూరు, ధర్మవరంలో ఉన్న భవనాల విలువ రూ. 150 కోట్లు అని, ఇక.. కాంప్లెక్స్లు, కియా వద్ద భూములు, గ్రానైట్ క్వారీల గురించి మాట్లాడడం లేదన్నారు. ఆదాయం ఎక్కువైపోయి హైదరాబాద్, బెంగళూర్ లో పబ్లు కూడా ఏర్పాటు చేశారని, ఇవీ చాలవ న్నట్లు అమెరికాలో రెండు, ఆఫ్రికాలో ఒకచోట లిక్కర్ ఫ్యాక్టరీలు తెరిచారన్నారు. ‘మీ చరిత్ర తెలిసే లోకేష్ మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు’ అని విమర్శలు గుప్పించారు. పెద్ద ఎత్తున ఆదాయవనరులు ఏర్పాటు చేసుకుని కూడా పాపంపేటలో 300 ఎకరాల శోత్రియం భూములపై పడ్డారన్నారు. అదికూడా చాలదని 999 ఎకరాలు కావాలని అడుగుతున్నారని ఆరోపించారు. పాపంపేటలో దుర్మార్గంగా 20 ఇళ్లను నేలమట్టం చేశారన్నారు. రూ. 3 కోట్ల విలువైన బెంజి కారులో.. అక్రమ ఆదాయంతోనే నేడు పరిటాల సునీత రూ. 3 కోట్ల విలువైన బెంజి కారులో తిరుగుతోందన్నారు. ‘సునీతమ్మా...తోపుదుర్తిలో మహిళలు నీ మీద రెండు ట్రాక్టర్ల చెప్పులు విసిరారు. 2 వేల మంది పోలీసులతో వచ్చినా ఆరు గంటలపాటు గ్రామంలోకి రాలేకపోయావు. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో 164 మంది ఎమ్మెల్యేలకంటే నీకే బాగా తెలుసు. 50 వేల మంది ఇళ్ల నిర్మాణాలు జరగకుండా ఆపినావు. ఆ 50 వేలమంది చెప్పులు విసిరితే ఆ గుట్టలో నువ్వు కనిపిస్తావా’ అని మండిపడ్డారు. ‘నువ్వేమైనా మైసూరు మహారాణి అనుకుంటున్నావా..? పథకాలు అడిగితే చెప్పులు చూపిస్తావా.. పేదలకు ఇళ్ల నిర్మాణాలు జరగలేదని మాట్లాడితే చెప్పు తెగుతుందంటావా.. నీకు ప్రజలే చెప్పులు చూపించే రోజులు వస్తాయి’ అంటూ మండిపడ్డారు. సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, అనంతపురం, రాప్తాడు వైస్ ఎంపీపీలు కృష్ణారెడ్డి, బోయ రామాంజి, నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, బండి పవన్, లింగారెడ్డి, ఆలమూరు ఓబులేసు,శేఖర్, సత్తిరెడ్డి, మాదన్న, మునిశంకరయ్య, ఈశ్వరయ్య, మీనుగ నాగరాజు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో భారీ స్కాం కూటమి ప్రభుత్వంలో పక్కా ఇళ్ల నిర్మాణాల్లో భారీ స్కాం జరుగుతోందని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇల్లు సొంతంగా నిర్మించుకోలేమనే లబ్ధిదారులకు ప్రభుత్వమే కేవలం రూ.1.80 లక్షలకే ఇల్లు నిర్మించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అయితే.. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయన్నారు. వాటి గురించి కూటమి ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోవడం లేదన్నారు. పైగా కూటమి ఎమ్మెల్యేలు కొత్త స్కాంకు తెర తీశారన్నారు. ప్రతి ఇంటికీ రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్లకు ఛాలెంజ్ చేస్తున్నానని, వారికి చేతనైతే ఇది అబద్ధమని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. -
పంతానికి పోయి ప్రాణమే తీశారు..!
నవమాసాలు మోసి జన్మనిచ్చినా గంటల వ్యవధిలోనే కాదనుకొని ముళ్ల పొదల్లో పడేశావు. ఈ భూమిపై జీవించే ప్రాప్తం లేదని అనుకున్నా.. అధికారులు వచ్చి అక్కున చేర్చుకున్నారు. శిశుగృహకు తీసుకువస్తే బతకనిస్తారు అని భావించా. ఇక్కడ చూస్తే గ్రూపులతో నాకు పాలు కూడా పట్టలేదు. ఎంత ఏడ్చినా వినిపించుకునే నాథుడు లేరు. ఏడ్చి.. ఏడ్చి నా ప్రాణం పోయింది. ఎందుకమ్మా నాకు ఇలాంటి జన్మనిచ్చావు. – శిశుగృహలో ఆకలితో అలమటించి మృత్యువాత పడిన చిన్నారి ఆక్రందన ఇది.అనంతపురం సెంట్రల్: ఊపిరి పోస్తారనుకున్న వారు ఆయువే తీశారు. గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేశారు. మహిళా,శిశు సంక్షేమశాఖ పరిధి లోని శిశుగృహలో నవజాత శిశువు ఆకలితో మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్వయంగా సీఎం చంద్రబాబు స్పందించారు. దీంతో మహిళా,శిశు సంక్షేమశాఖ రాష్ట్ర డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి ఆదివారం రాత్రి జిల్లాకు వచ్చారు. ఎస్పీ జగదీష్కు కూడా విచారణ బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఘటనపై సమగ్ర విచారణకు డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి, ఐసీడీఎస్ పీడీ నాగమణి, సర్వజనాసుపత్రి చిన్నపిల్లల వైద్యులు ప్రవీణ్ సభ్యులుగా కలెక్టర్ ఆనంద్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ప్రకటించారు. ఆదివారం కమిటీ సభ్యులు శిశుగృహలో విచారణ చేపట్టారు. అనుమానాలెన్నో.. అనారోగ్యంతో నవజాత శిశువు మృతి చెందాడని శిశుగృహ సిబ్బంది చెబుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 20 రోజుల క్రితం కళ్యాణదుర్గం వద్ద ముళ్ల పొదల్లో శిశువు దొరికాడు. ఆస్పత్రిలో చికిత్సల అనంతరం ఆరోగ్యం మెరుగవడంతో శిశుగృహకు రెఫర్ చేశారు. ఈ క్రమంలో మళ్లీ అనారోగ్యం పాలైతే ప్రభుత్వాసుపత్రిలో ఎందుకు చేర్పించలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాగా, ఇటీవల శిశుగృహలో పనిచేసే ఇద్దరు ఆయాలు గొడవపడినట్లు తెలి సింది. ఈ క్రమంలో శుక్రవారం ఒకరు విధులకు రాలేదు. దీంతో మరో ఆయా ఆక్రోశంతో పిల్లలను పట్టించుకోలేదు. అప్పుడు ఐదుగురు ఆడ శిశువులు, ఒక మగశిశువు ఉన్నాడు. పాలు పట్టించకపోవడంతో పిల్లాడు ఏడ్చి ఏడ్చి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా మారింది. అర్ధరాత్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే, విషయం బయటకు పొక్కితే మేనేజర్, సోషల్వర్కర్, ఏఎన్ఎం, ఆయాలకు ఇబ్బంది వస్తుందని గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసినట్లు తెలుస్తోంది. తెరవెనుక మంత్రాంగం శిశువు మృతికి కారణమైన వారిని పక్కన పెట్టి సెలవు పెట్టిన ఆయాపై చర్యలు తీసుకొని మమ అనిపించేందుకు కొంతమంది తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. శుక్రవారం విధుల్లో ఉన్న ఆయాపై చాలా ఆరోపణలు ఉండడం గమనార్హం. గతంలో పసికందులను గిచ్చడం, గోర్లతో రక్కి గాయపరచడం వివాదాస్పదమైంది. అవినీతి మరకలు.. శిశుగృహలో పనిచేస్తున్న సిబ్బంది అందరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో దత్తత కోసం వచ్చిన ఓ ఎన్ఆర్ఐ మహిళను ప్రస్తుత మేనేజర్ డబ్బు డిమాండ్ చేయడం.. దీంతో ఎన్ఆర్ఐ ఢిల్లీలోని విదేశీ రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేయడం.. అప్పటి కేంద్ర మహిళ,శిశు సంక్షేమశాఖ మంత్రి ఆదేశాలతో కలెక్టర్ వీరపాండియన్ మేనేజర్ను విధుల నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది. అయితే కోర్టు ఆదేశాలతో తిరిగి ఆమె అదే ఉద్యోగంలో కొలువు దీరడం గమనార్హం. అలాగే సోషల్ వర్కర్ కూడా హిందూపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళను బంగారు గొలుసు కోసం డిమాండ్ చేసి నగరంలో ఓ నగల దుకాణంలోకి తీసుకెళ్లడంతో బాధితురాలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెను వన్స్టాప్ సెంటర్కు బదిలీ చేయగా.. ఓ అధికారిణిని ప్రసన్నం చేసుకొని మళ్లీ శిశుగృహకు వచ్చారనే విమర్శలు ఉన్నాయి. అందరికీ మెమోలు తప్పు చేసిన వారిపై చర్యలు ఉంటాయి. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చిన్నపిల్లలు ఉన్న చోట తరచూ గొడవ పడుతుంటే ఏం చేస్తున్నావని మేనేజర్తో సహా ఆరుగురు సిబ్బందికీ మెమోలు ఇచ్చాను. – నాగమణి, పీడీ, ఐసీడీఎస్ తీవ్ర చర్చనీయాంశమైన శిశుగృహలో బాలుడి మృతి సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు గతంలోనూ వివాదాస్పదం కలెక్టర్ దృష్టి సారిస్తేనే అన్నీ కొలిక్కి -
అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకారావుకు ఇంటర్నేషనల్ అవార్డు
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మొగిలి అంకారావుకు ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషనల్ టీచర్స్ అవార్డు– 2025 దక్కింది. ఈ మేరకు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఐటూఓఆర్ సంస్థ ప్రకటించింది. భారత ప్రభుత్వం సూక్ష్మచిన్నతరహా పరిశ్రమల శాఖ ఆధీనంలో ఐటూఓఆర్ సంస్థ పనిచేస్తోంది. వినూత్న ఆవిష్కరణలకు దోహదపడే పరిశోధనలు చేస్తున్న వారికి అవార్డును ఏటా అందజేస్తున్నారు.మాజీ రెక్టార్ ప్రొఫెసర్ ఎం. విజయ్కుమార్ పర్యవేక్షణలో అంకా రావు విశేష పరిశోధనలు చేశారు. డాక్టరేట్ అందుకున్నారు. జేఎన్టీయూ అనంతపురంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూనే అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషనల్ టీచర్స్ అవార్డు దక్కిన సందర్భంగా అంకారావును వర్సిటీ వీసీ సుదర్శనరావు అభినందించారు. -
అశ్వత్థంలో జేసీ అలజడి
సాక్షి టాస్క్ఫోర్స్: పుణ్యక్షేత్రమైన అశ్వత్థంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి అలజడి సృష్టించారు. ఆలయ ఆవరణలో ఉన్నఫళంగా రాళ్ల కుప్పలు ప్రత్యక్షం కావడం పెద్దపప్పూరు మండలంలో తీవ్ర చర్చకు దారితీసింది. వివరాలు...పెద్దపప్పూరు మండల అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు రామిరెడ్డి బొందలదిన్నె గ్రామంలో ఆదివారం విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఆహ్వానించారు. విందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తున్నారని ప్రచారం జరగడంతో తాడిపత్రి నుంచి బొందలదిన్నె మార్గమధ్యంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అశ్వత్థంలో జేసీ ప్రభాకర్రెడ్డి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఒక్కసారిగా అశ్వత్థం క్షేత్రంలో అలజడి రేగింది. ఇదే క్రమంలో ఆలయ ఆవరణలోని పెన్నానది ఒడ్డున రాళ్లకుప్పలు కనిపించడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. విందు కార్యక్రమానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లలేదని తెలియడంతో జేసీ వెనుదిరగడం గమనార్హం. -
సా...గుతున్న ఈ–క్రాప్
● 42 శాతం వద్దే ప్రక్రియ ● ఈనెల 25 లోపు పూర్తి చేయాలని కమిషనరేట్ నుంచి ఆదేశాలు అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్లో వ్యవసాయ, ఉద్యాన, మల్బరీ పంటల సాగుకు సంబంధించి వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ–క్రాప్ ప్రక్రియ ఈ సారి మందకొడిగా సాగుతోంది. ఓ వైపు సాంకేతిక సమస్యలు, మరోవైపు ఆర్ఎస్కే అసిస్టెంట్లకు ఇతరత్రా పని ఒత్తిళ్లు పెట్టడం, ఇంకోవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పంటల నమోదుకు అంతరాయం ఏర్పడుతోందని చెబుతున్నారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం హయాంలో తీసుకువచ్చిన ఈ–క్రాప్ ప్రక్రియ వల్ల రైతులకు అనేక రకాల ప్రయోజనాలు కల్పించడంతో పంట నమోదు చురుగ్గా, చాలా పారదర్శకంగా కొనసాగించారు. కానీ కూటమి సర్కారు ఈ–క్రాప్కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అదే అదనుగా ఆయా శాఖల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఖరీఫ్ ముగిసిన సెప్టెంబర్ ఆఖరు నాటికే ఈ–క్రాప్ పూర్తి కావాలని ఆదేశాలు ఉన్నా 40 శాతం కూడా పూర్తి కాలేదు. తాజాగా అక్టోబర్ 25 నాటికి వంద శాతం పూర్తీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా గడువులోపు వంద శాతం పూర్తి కావడం కష్టమేనంటున్నారు. ఖరీఫ్లో వ్యవసాయ, ఉద్యాన, మల్బరీ పంటలు ఇప్పటి వరకు 19.02 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ–క్రాప్లో మాత్రం ఇప్పటి వరకు 8 లక్షల ఎకరాలు నమోదు చేశారు. అంటే ఇప్పటి వరకు 42 శాతం పూర్తి చేశారు. గత రెండు నెలలుగా కేవలం 42 శాతం చేయగా... ఈ 20 రోజుల్లో 58 శాతం పూర్తి చేయడం అంత సులభం కాదని చెబుతున్నారు. సాగు చేసిన పంటలనే కాకుండా ఖాళీగా ఉన్న పొలాల వివరాలు కూడా ఈ–క్రాప్ చేయాలని నిబంధన పెట్టడంతో ఆర్ఎస్కే అసిస్టెంట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలిసింది. మొత్తమ్మీద ఈ ఏడాది ఈ–క్రాప్ నమోదు పారదర్శకతపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీ పరిష్కార స్థితి గురించి కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. విజయవాడ వెళ్లిన కలెక్టర్ అనంతపురం అర్బన్: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదివారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు.‘స్వచ్ఛ జిల్లా అవార్డు–2025’కు అనంతపురం ఎంపికైన విషయం విదితమే. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అవార్డును కలెక్టర్ అందుకోనున్నారు. ఆయన తిరిగి ఏడో తేదీన విధులకు హాజరవుతారు. ఒంటెద్దు కళ్లకు గంతలు కట్టి.. పదెకరాల్లో శనగ సాగు ఆత్మకూరు: మండలకేంద్రానికి చెందిన దుబ్బ గోపాల్రెడ్డి అనే రైతు చేసిన సాహసం అందరి చేత శభాష్ అనిపించేలా చేసింది. ఆదివారం ఆత్మకూరు సమీపంలోని పొలంలో పాళ్యం వెంకట నారాయణ రెడ్డి అనే రైతుకు సంబంధించిన ఎద్దుతో దుబ్బ గోపాల్రెడ్డి వినూత్న ప్రయోగం చేశాడు. ఆ ఎద్దు కళ్లకు గంతలు కట్టి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు పదెక రాల్లో శనగ విత్తనం సాగు చేసి అందర్నీ అబ్బురపరిచాడు. చాలా మంది కాడెద్దులతో విత్తన సాగు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో పలువురు ఎద్దులకు బదులు ట్రాక్టర్లతో విత్తనం వేస్తున్నారు. కానీ దుబ్బ గోపాల్రెడ్డి ఒక ఎద్దుతో అది కూడా దాని కళ్లకు గంతలు కట్టి పది ఎకరాల్లో తొమ్మిది గంటలలోపే విత్తన సాగు చేయడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో ఆత్మకూరులో దుబ్బ గోపాల్రెడ్డితోపాటు సదరు వృషభానికి పూల మాలలు వేసి ఊరేగించారు. సత్యసాయి సన్నిధిలో విజయ్ దేవరకొండ ప్రశాంతి నిలయం: సినీ నటుడు విజయ్ దేవరకొండ ఆదివారం సత్యసాయి మహాసమాధి దర్శనార్థం పుట్టపర్తికి వచ్చారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయం చేరుకున్న ఆయనకు శాంతిభవన్ అతిథి గృహం వద్ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. బీకేఎస్లో దొంగల హల్చల్ బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. దక్షిణామూర్తి నగర్లో నివాసం ఉంటున్న అనిల్ కుమార్, అశోక్ తమ ఇళ్లకు తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లారు. దుండగులు శనివారం అర్ధరాత్రి కుక్కకు మత్తు మందు పెట్టి తాళాలు బద్ధలు గొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 5 తులాల బంగారు నగలు అపహరించారు. నలుగురు వ్యక్తులు చొరబడుతున్నట్లుగా సమీపంలోని ఇంటి వద్ద సీసీ కెమెరాలో కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
కళ్యాణదుర్గం (కంబదూరు): కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో విద్యుదాఘాతంతో పశ్చిమ బెంగాల్కు చెందిన తజిబుల్ (34) అనే కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్లోని మధ్యపార గ్రామానికి చెందిన తజిబుల్ పని నిమిత్తం కంబదూరు మండలం నూతిమడుగు గ్రామానికి వచ్చాడు. అయితే శనివారం సాయంత్రంవిద్యుత్ లైన్ ఏర్పాటులో భాగంగా స్తంభంపైకి ఎక్కిన తజిబుల్ షాక్కు గురై కిందపడ్డాడు. వెంటనే స్థానిక సిబ్బంది కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే తజిబుల్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. మరణ వార్తను కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు కంబదూరు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఒక లైన్కు బదులు మరొక లైన్కు ఎల్సీ ఇవ్వడం వల్లే కార్మికుడు షాక్కు గురై చనిపోయినట్లు తెలుస్తోంది. ఆటోడ్రైవర్లకు చేయూత బుక్కరాయసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ సేవలో..’ పథకం కింద ఆటోడ్రైవర్లకు చేయూత అందించిందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. పథకం కింద జిల్లాలో 9,275 మంది డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.13,91,25,000 మంజూరైంది. ఇందుకు సంబంధించిన మెగా చెక్కును శనివారం బుక్కరాయసముద్రంలో కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ జెండా ఊపి ఆటో ర్యాలీతో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవ నాయుడు, తహసీల్దార్ శ్రీధర్మూర్తి, ఎంపీడీఓ సాల్మాన్, డిస్టిక్ మిషన్ వాత్సల్య కో ఆర్డినేటర్ శ్రీదేవి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు ఐక్య పోరాటం
● బీసీ నేతల పిలుపు అనంతపురం అర్బన్: హక్కుల సాధన, జనాభా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కోసం బీసీలు ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. జనగణనలోనే కులగణన చేపట్టాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని రాయల్ ఫంక్షన్ హాలులో కుల, ప్రజాసంఘాలతో సదస్సు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసరి శంకర్రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ వసీం సలీమ్, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీమ్ అహమ్మద్, కురబ సంఘం తరఫున మాజీ మయర్ రాగే పరశురాం, బీసీ సంక్షేమ సంఘం తరఫున వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, కాంగ్రెస్ మైనారిటీ సెల్ రాష్ట్ర చైర్మన్ దాదా గాంధీ, తదితరులు మాట్లాడారు. కులగణన ద్వారానే బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. కర్ణాటక, తెలంగాణ తరహాలో రాష్ట్రంలోనూ కులగణన చేపట్టిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. కులగణన పూర్తి చేసి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు తమది బీసీల ప్రభుత్వమని జపం చేస్తూనే.. మరోవైపు కులగణన చేపట్టడానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు. కులగణన డిమాండ్తో ‘చలో అమరావతి’ చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సదస్సులో సీపీఐ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి, వడ్డెర సంఘం నాయకుడు వడ్డే జయంత్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎస్ఆర్ నాగభూషణం, బహుజన సమాజ్ పార్టీ నాయకులు శ్రీరాములు, మైనారిటీ నాయకులు మైనుద్ధీన్, నాయకులు సంజీవప్ప, శ్రీరాములు, కేశవరెడ్డి, పద్మావతి, లింగమయ్య, రమణయ్య, రాజేష్, సంతోష్ కుమార్, కుళ్లాయిస్వామి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
విడపనకల్లు: రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయారు. విడపనకల్లు శివారులో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వైజాగ్కు చెందిన సుధీర్ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వద్ద ఉన్న కియా కంపెనీలో పని చేస్తున్నారు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అనంతపురంలో నివాసం ఉంటున్నారు. దసరా పండుగ అనంతరం కుటుంబంతో కలిసి సరదాగా హంపికి వెళ్లాలనుకున్నారు. శనివారం మధ్యాహ్నం అనంతపురం నుంచి సుధీర్ తన భార్య లావణ్య (34), కుమారుడు ఉదయ్తో కలిసి శనివారం హంపికి కారులో బయల్దేరాడు. ఇక గోవా నుంచి సంజీవ్రెడ్డి, శ్రీనివాసులు, పుల్లయ్యనాయుడు, నాగిరెడ్డి అనంతపురానికి కారులో వస్తున్నారు. విడపనకల్లు శివారులోని పెట్రోలు బంకు సమీపంలో రెండు కార్లు అదుపుతప్పి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జవడంతో లోపల ఉన్న వారంతా కాళ్లు, చేతులు విరిగి కోమాలోకి వెళ్లిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఉరవకొండ సీఐ మహానంది, విడపనకల్లు ఎస్ఐ ఖాజాహుస్సేన్ తమ సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కార్లలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను స్థానికుల సహాయంతో అతికష్టం మీద బయటకు తీసి ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో లావణ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రథమ చికిత్స అనంతరం సంజీవ్రెడ్డి, పుల్లయ్య నా యుడు, శ్రీనివాసులు, నాగిరెడ్డిలను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులెక్కడ...? రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకువస్తే కంటి వైద్యులు తప్ప మిగిలిన డాక్టర్లు, సూపరింటెండెంట్, సిబ్బంది ఎవ్వరూ అందుబాటులో లేరు. పోలీసులు, స్థానికులు, కొంతమంది చారిటబుల్ ట్రస్టు సభ్యులు వైద్యులకు సహాయ సహకారాలు అందించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండలోని 50 పడకల ఆస్పత్రిలోనే వైద్యులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం దారుణమని స్థానికులు వాపోయారు. స్పీడ్ బ్రేకర్లు వేయండి విడపనకల్లులో పెట్రోలు బంకు వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కెంగూరి ఎర్రిస్వామి, సీపీఎం నాయకులు రంగారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు బోయ వెంకటేశులు తెలిపారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న సంజీవ్రెడ్డి కోమాలోకి వెళ్లిన లావణ్య భర్త సుధీర్, కుమారుడు ఉదయ్ మరో ఆరుగురికి తీవ్ర గాయాలు ఎదురెదురుగా కార్లు ఢీకొనడంతో ఘటన -
అక్రమ రవాణాకు రథసారథులు
అనంతపురం క్రైం: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సుల్లో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి నిషేధిత వస్తువులు, మద్యం రవాణా అవుతోంది. కొన్ని ముఠాలు ఎరగా వేసే డబ్బుకు లొంగిపోయి కొందరు డ్రైవర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. బెంగళూరు నుంచి ఆర్మీ లిక్కర్ బాటిళ్లను అనంతపురానికి తీసుకొస్తున్న ఆర్టీసీ డ్రైవరును ఎకై ్సజ్ అధికారులు కాపుకాచి పట్టుకున్నారు. ఆర్టీసీ అధికారులు బస్సుల్లో తనిఖీలు పూర్తిగా వదిలేయడం వల్లే అక్రమ రవాణా ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. గత సెప్టెంబరు 20న బెంగళూరు రూటుకు వెళ్లే డ్రైవర్ల వ్యవహారంపై ‘గాడి తప్పిన ఆర్టీసీ’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ రూటుకు వెళ్లాల్సిన డ్రైవర్లు కాకుండా అధికారులను ‘బాగా చూసుకునే’ వారిని విధులకు పంపుతున్నారని కథనంలో పేర్కొంది. చాలా కాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు ఎకై ్సజ్ అధికారుల దాడుల అనంతరం గానీ తెలియరాలేదు. తప్పు చేసినా.. చర్యలు శూన్యం ఆర్టీసీలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఆర్ఎం సుమంత్ ఆదోని ఈ వ్యవహారాల్లో తలదూర్చలేదు. ప్రస్తుతమున్న ఆర్ఎం శ్రీలక్ష్మి కూడా అటువైపు కన్నెత్తి చూడటంలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కిందిస్థాయి సిబ్బంది ఆడింది ఆటగా సాగుతోంది. తప్పు చేసిన వారు ఆధారాలతో సహా దొరికినా.. చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులే వారిని రక్షిస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అందుకే కిందిస్థాయి సిబ్బంది ఏమాత్రం భయపడకుండా.. అక్రమాలకు పాల్పడుతున్నారు. నిషేధిత వస్తువులు వస్తున్నాయిలా.. అనంతపురం జిల్లా కేంద్రానికి పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి నిషేధిత వస్తువులను ఎక్కువగా డ్రైవర్లే తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఏపీఎస్ ఆర్టీసీతో పాటు కర్ణాటక బస్సుల డ్రైవర్లు కూడా ఈ తరహా రవాణాకు తెగబడుతున్నట్లు పక్కా సమాచారం ఉంది. కాగా నేరుగా కర్ణాటక బస్సుల డ్రైవర్లతో కొన్ని ముఠాలు పార్సిళ్లు తెప్పించుకుంటున్నట్లు నిఘా సంస్థల అధికారులు గుర్తించారు. ఇకపై సాధారణ వాహనాల తరహాలో ఆర్టీసీ బస్సులను కూడా తనిఖీ చేసి పంపాలన్న యోచనలో అధికారులున్నట్లు తెలుస్తోంది. అధికారుల సేవలో స్క్వాడ్ టీమ్.. ఫలానా అధికారి మనకు వస్తే అనుకూలంగా ఉంటారు.. మనం విధులకు డుమ్మాకొట్టి ఇక్కడే కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉండొచ్చనే వారి సంఖ్య ఈ స్క్వాడ్ టీమ్లో అధికంగా ఉందన్న ఆరోపణలున్నాయి. గత ఆర్ఎం సమయంలో స్క్వాడ్ టీమ్లోని కీలక వ్యక్తులు కార్యాలయం వీడి బయటకు వెళ్లలేదని సహచర ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ఉదయం ఆర్ఎం ఇంటికి కాయగూరలు మొదలు, అధికారి ఆలయ దర్శనం వరకు అన్నీ దగ్గరుండి చూసుకోవడమే స్క్వాడ్ టీమ్ విధులని యూనియన్ల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ రవాణాకు సహకరిస్తున్న డ్రైవర్లపై చర్యలు తీసుకుని, సంస్థ ప్రతిష్టను కాపాడాలని కార్మికులు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మద్యం, నిషేధిత వస్తువుల రవాణా ముఠాలు వేసే ఎరకు చిక్కుకుంటున్న ఆర్టీసీ డ్రైవర్లు బస్సుల తనిఖీలను విస్మరించిన ఉన్నతాధికారులు తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తున్న వైనం -
బుజ్జీ నువ్వులేని జీవితం నాకెందుకు?
రాప్తాడు: ప్రేమించిన అమ్మాయిని దూరం చేసి.. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తట్టుకోలేకపోయిన యువకుడు ‘బుజ్జీ.. నువ్వు లేని జీవితం నాకెందుకు.. నేను చనిపోతున్నా’ అంటూ పురుగుమందు డబ్బా చేతపట్టుకుని సెల్ఫీ తీసుకుని సెల్ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. రాప్తాడు మండలం పాలచెర్ల గ్రామానికి చెందిన కత్తె లింగమయ్య, మాలమ్మ దంపతుల కుమారుడు కత్తె పోతులయ్య, నార్పల మండలంలోని అమ్మాయిని ప్రేమించాడు. ఇరు కుటుంబాల వారికి చెప్పకుండా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం తమకు ఇష్టం లేదని, మైనార్టీ కూడా తీరలేదని అమ్మాయి తల్లిదండ్రులు నార్పల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రేమికులను పట్టుకొచ్చి.. పెద్ద మనుషుల సమక్షంలో ఇద్దరినీ ఎవరిళ్లకు వారిని పంపించేశారు. మైనార్టీ తీరే వరకు దూరంగా ఉండాలని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో బాలికకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో పోతులయ్య తట్టుకోలేకపోయాడు. ‘నువ్వు లేని జీవితం నాకెందుకు.. బుజ్జీ (ప్రేమించిన అమ్మాయి) నేను చనిపోయిన తర్వాతైనా మన కుటుంబాలను కలుపుతావని అనుకుంటున్నా. నేను చనిపోవాలనుకునే వారందరికీ ధన్యవాదాలు. ఒక వేళ మమ్మల్ని కలిపే ఉద్దేశం ఉంటే బతికించాలని, లేనిపక్షంలో నన్ను వదిలేయండి. మామా నీకు ఎంతో ఇష్టమైన స్థలంలోనే చచ్చిపోతున్నా. కడుపులో చాలా నొప్పిగా ఉంది మామా. నీ కోసం అగ్గి పెట్టె ఒకటే తెచ్చాను. బీడీలు తేలేకపోయాను మామా. బుజ్జీ నేను చచ్చిపోతున్నా.. నువ్వన్నా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఊళ్లో చనిపోతే నువ్వు రావని, మీ ఊర్లో వచ్చి చచ్చిపోతున్నాను బుజ్జీ. దయచేసి నా శవాన్ని మీ ఊర్లోనే పూడ్చి పెట్టాలి. బుజ్జి నా శవం నీ ఒక్కదానికే దొరకాలని కోరుకుంటున్నా. ఈ ప్లేస్ మీరు చూపించిన ప్లేసే. మామ వాళ్లు, వీళ్లు చెప్పిన మాటాలు విని పంతానికి పోయావు. ఇదొక్కసారి నా మాట వింటావని కోరుకుంటున్నా. మీ గ్రామంలోనే పురుగులమందు తాగుతున్నా’ అంటూ సెల్ఫీ వీడియో తీసి, వారి కుటుంబ సభ్యులకు పంపించిన తర్వాత పోతులయ్య తన సెల్ స్విచాఫ్ చేసుకున్నాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు అతడి కోసం గాలిస్తున్నారు. పురుగుమందుబాటిల్తో యువకుడి ఆత్మహత్యాయత్నం సెల్పీ వీడియో అనంతరం సెల్ స్విచాఫ్ -
కేశవన్నా.. పప్పుశనగ ఇంకెప్పుడన్నా?
● ఆర్థిక మంత్రి ఇలాకాలోనే విత్తనానికి నిధులు ఇవ్వకుండా దాటవేత ● గత ఖరీఫ్, రబీకి సంబంధించి ఏజెన్సీలకు రూ.74 కోట్ల బకాయిలు అనంతపురం అగ్రికల్చర్: ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లో కీలక మంత్రి పయ్యావుల కేశవ్ సొంత జిల్లాలోనే రైతులు విత్తనాలు, ఎరువుల కోసం నానా పాట్లు పడుతున్నారు. ఖరీఫ్లో ఆలస్యంగా విత్తన వేరుశనగ పంపిణీ చేయడంతో రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు. కనీసం పంపిణీ చేసిన విత్తనానికి సంబంధించి రాయితీ సొమ్మును ఏజెన్సీలకు కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. గత ఖరీఫ్, రబీతో పాటు ఈ ఖరీఫ్లో విత్తన వేరుశనగ, పప్పుశనగకు సంబంధించి ఏజెన్సీలకు రూ.74 కోట్ల బకాయిలు పెట్టడంతో ఏజెన్సీల నిర్వాహకులు విత్తన సరఫరాకు ముందుకు రావడం లేదు. దీంతో రబీలో పప్పుశనగ రాక ఆలస్యమవుతోంది. సీజన్ ప్రారంభమై నాలుగైదు రోజులైనా ఇప్పటికీ పంపిణీ ప్రక్రియ ప్రారంభించకపోవడం చూస్తే అసలు రైతులకు రాయితీ విత్తనం ఇస్తారా లేదా అనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వర్షం వస్తే నల్లరేగడి భూములు కలిగిన 25 మండలాల్లో పప్పుశనగ సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యామ్నాయమూ లేదు.. ఖరీఫ్లో అననుకూల వర్షాలతో పంటల సాగు మందకొడిగా సాగింది. సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చినా... ఇంకా లక్ష ఎకరాల వరకు పొలాలు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. ఇందులో విత్తుకునేందుకు ప్రత్యామ్నాయం కింద ఇవ్వాల్సిన ఉలవ, జొన్న, కొర్ర లాంటి విత్తనాలు కూడా ఇవ్వకుండా మరిపించేశారు. ఆగస్టు 25న నిర్వహించిన జిల్లాస్థాయి అభివృద్ధి కమిటీ (డీఆర్సీ)లో మంత్రి పయ్యావుల కేశవ్ ఖరీఫ్ సాగుపై సమీక్షించారు. ‘ప్రత్యామ్నాయం’ కింద విత్తనాలు అందిస్తామని ఘనంగా ప్రకటించిన ఆయన చివరకు దాని ఊసే ఎత్తలేదు. కనీసం రబీలోనైనా ముందస్తు సాగుకు వీలుగా విత్తన పప్పుశనగ అందించాల్సి ఉండగా ఇప్పటికీ మొదలు పెట్టలేదంటే రైతులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోంది. పట్టించుకునే తీరికేదీ..? రైతుల కష్టనష్టాల్లో పాలుపంచుకోవాల్సిన చంద్రబాబు సర్కారు వారి గురించి అసలు పట్టించుకోవడమే లేదు. గతంతో పోలిస్తే సగానికి సగం కోత పెట్టి ఈ రబీలో జిల్లాకు 14 వేల క్వింటాళ్లు, శ్రీ సత్యసాయి జిల్లాకు కేవలం 500 క్వింటాళ్ల రాయితీ పప్పుశనగ కేటాయించడం దీనికి అద్దం పడుతోంది. సబ్సిడీ కూడా 40 శాతం నుంచి 25 శాతానికి తగ్గించి అదనపు భారం మోపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ‘సూపర్సిక్స్– సూపర్హిట్’ అంటూ ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేసి సభ నిర్వహించింది. ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి కూడా నిధులు నీళ్లలా ఖర్చు పెట్టారు. డీఎస్సీలో ఎంపికై న వారికి పోస్టింగ్లు ఇవ్వడానికి భారీ మొత్తం వెచ్చించి అమరావతికి పిలిపించుకున్నారు. ఇలా ఆర్భాటాలకు పోయి మంచినీళ్ల ప్రాయంగా ఖజానాను కరిగించేస్తున్న ప్రభుత్వం రైతులకు సకాలంలో విత్తనాలు, యూరియా ఇవ్వకుండా రిక్తహస్తం చూపిస్తుండడం గమనార్హం. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
● ఎస్పీ జగదీష్ రాప్తాడు: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. అనంతపురం రూరల్ డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం సాయంత్రం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు, పెండింగ్ కేసులు, చోరీలు, రికవరీలు, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై ఆరా తీశారు. చోరీ కేసుల్లో రికవరీలు పెరగాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో కీలక పాత్ర పోషించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ పెంచాలని ఆదేశించారు. సబ్ డివిజన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ నేరాలు, మత్తు పదార్థాల అనర్థాలపై చైతన్య సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వెళ్లి చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిరంతర నిఘా ఉంచి, గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశులు, ఎస్పీ సీసీ ఆంజనేయ ప్రసాద్ తదితరులు ఉన్నారు. సమర్థవంతమైన సేవలందించాలి శింగనమల (నార్పల): పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించాలని ఎస్పీ జగదీష్ సిబ్బందికి సూచించారు. శనివారం నార్పల పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. మండలంలో పరిస్థితులు, కేసుల వివరాలను సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్ను అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్ల కదిలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్కు వచ్చే వారి పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు ఉన్నారు. -
మహనీయుల జీవితం ఆదర్శప్రాయం
అనంతపురం అర్బన్: మహనీయుల జీవితాలు ఆదర్శప్రాయమని, వారు చూపిన శాంతి మార్గంలో నడవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. ఈ నెల 2న కలెక్టరేట్ ప్రాంగణంలో మహాత్మాగాంధీ, లాల్బహదూర్ శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ, లాల్బహదూర్ శాస్త్రి వంటి ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా ఈరోజు మనమంతా స్వేచ్ఛాయుత జీవితం గడుపుతున్నామన్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేంగా మహాత్మాగాంధీ అహింసను ఆయుధంగా చేసుకుని ఉద్యమించారన్నారు. గాంధీ మహాత్ముడు అందించిన స్పూర్తితో ప్రతి గ్రామాన్నీ స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్ధేందుకు పౌరులు కృషి చేయాలని పిలపునిచ్చారు. లాల్బహదూర్ శాస్త్రి స్వాతంత్య్రోద్యమంలో సైనికులు, రైతులు పాత్రను గుర్తు చేస్తూ జై జవాన్– జై కిసాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతుల్ని చేశారన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, పరిపాలనాధికారి అలెగ్జాండర్, తహసీల్దార్లు హరికుమార్, రియాజుద్ధీన్, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆగమేఘాల మీద ‘సెక్టోరియల్స్’ చేరిక ● ఆసక్తి చూపని ఏఎస్ఓ.. ఆ పోస్టు భర్తీకి మళ్లీ బ్రేక్? అనంతపురం ఎడ్యుకేషన్: ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న సమగ్రశిక్షలోని సెక్టోరియల్ అధికారుల పోస్టులను ఎట్టకేలకు భర్తీ చేశారు. జిల్లా అధికారులు పంపిన జాబితాకు రాష్ట్ర అధికారులు ఆమోదముద్ర వేశారు. అక్కడి నుంచి జాబితా రాగానే ఎంపికై న టీచర్లు స్కూళ్లల్లో రిలీవ్ అయి ఆగమేఘాల మీద సమగ్రశిక్ష కార్యాలయంలో చేరారు. అసిస్టెంట్ సీఎంఓ కె.చంద్రశేఖర్, ఏఎంఓ పి.వేణుగోపాల్, అలెస్కో కె.రామచంద్ర, అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ) బి.నారాయణస్వామి విధుల్లో చేరగా.. ఏఎస్ఓగా ఎంపికై న ఎన్.నరసింహారెడ్డి మాత్రం చేరలేదు. వాస్తవానికి ఈయన అందరికంటే మెరిట్ ఉన్నట్లు తెలిసింది. ఏఎంఓ పోస్టు పట్ల ఆసక్తి ఉన్నా.. ఆయనను ఏఎస్ఓ పోస్టుకు ఎంపిక చేయడంతో అనారోగ్య సమస్యల కారణంగా ఆసక్తి చూపలేదు. దీంతో ఏఎస్ఓ పోస్టు భర్తీకి మళ్లీ బ్రేక్ పడినట్లేనని ఉద్యోగులు పేర్కొంటున్నారు. అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ) పోస్టుపై కోర్టుకు.. అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ) పోస్టుపై తపోవనం జిల్లా పరిషత్ పాఠశాల ఇంగ్లిష్ టీచరు కిష్టప్ప హైకోర్టును ఆశ్రయించారు. ముందు నోటిఫికేషన్లో ఆయన దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా అధికారులు ఎంపిక చేశారు. ఆమోదం కోసం రాష్ట్ర అధికారులకు నివేదించగా.. ఎలాంటి కారణం లేకుండా ఆయన్ను తప్పించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న తనను నిబంధనలకు విరుద్ధంగా తప్పించారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ కన్నడలో చదివి ఉండాలని పేర్కొన్నారు. తాజాగా తీసుకున్న నారాయణస్వామి ప్రాథమిక స్థాయిలో అది కూడా ఒక తరగతి మాత్రమే కన్నడలో చదివినట్లు తెలిసింది. ఈయనను ఎంపిక చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పండుగ పూట రోడ్డు ప్రమాదం
ఉరవకొండ/ వజ్రకరూరు: ఆ దంపతులు వారసుడి కోసం ఎన్నో నోములు నోచారు. ఎన్నో గుళ్లు తిరిగారు. ముగ్గురు కుమార్తెల తర్వాత కుమారుడు పుట్టడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. అలా సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో రోడ్డు ప్రమాదం ఒక కుదుపు కుదిపేసింది. దసరా పండుగకు ఇంటిల్లిపాది కొత్త దుస్తులు ధరించి సంబరంగా ఉన్నారు. తండ్రీ పిల్లలు అమ్మవారి దర్శనం కోసం బయల్దేరారు. ‘అమ్మా గుడి నుంచి రాగానే నాకు ఓళిగ చేసి పెట్టాలి’ అంటూ కొడుకు చెప్పాడు. అవే కొడుకు చివరి మాటలు అవుతాయని ఆ తల్లి ఊహించలేదు. అరగంటకే రోడ్డు ప్రమాదంలో భర్త, కుమారుడు దుర్మరణం చెందారన్న వార్త ఆమెను కుదిపేసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉరవకొండ పట్టణంలో అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన మీనుగ సుంకన్న (43), నాగలక్ష్మి దంపతులు. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు సులోచన, కల్పన, భవానితో పాటు కుమారుడు సుదర్శన్ (10) సంతానం. గురువారం ఉదయం దసరా పండుగను పురస్కరించుకుని అమ్మవారి దర్శనం కోసం వజ్రకరూరు మండలం కడమలకుంటకు ద్విచక్రవాహనంపై ఉరవకొండ నుంచి తన కుమారుడు సుదర్శన్, కుమార్తెలు కల్పన, భవానితో కలిసి సుంకన్న బయల్దేరాడు. భార్య నాగలక్ష్మి, పెద్ద కుమార్తె సులోచన ఇంటివద్దే ఉన్నారు. పిల్లలతో కలిసి వెళ్తుండగా ద్విచక్రవాహనాన్ని మార్గ మధ్యంలో పీసీ ప్యాపిలి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుంకన్న, కుమారుడు సుదర్శన్ అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. అటువైపు వెళుతున్న వాహనదారులు గమనించి వెంటనే వజ్రకరూరు పోలీసులకు సమాచారం అందించారు. విషయం కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ సుంకన్న భార్య గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలచివేసింది. గాయపడిన కుమార్తెలను ఉరవకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మార్చురీకి తరలించారు. సుంకన్న భార్య ఫిర్యాదు మేరకు వజ్రకరూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
వామ్మో చిరుత...!
కళ్యాణదుర్గం: పట్టణంలోని అక్కమాంబ కొండకు ఆనుకుని ఉన్న పార్వతినగర్లోని జనావాసాల్లోకి బుధవారం అర్ధరాత్రి చిరుత ప్రవేశించింది. సమీపంలోని ఓ ఇంటి ఆవరణలోని మెట్లపై కుక్క పడుకుంది. ఒక్క ఉదుటున చిరుత దాడి చేసి కుక్కను కిందకు లాక్కొచ్చింది. గట్టిగా అరుస్తూ చిరుత నుంచి తప్పించుకున్న కుక్క మరో వైపున పరుగెత్తింది. అదే సమయంలో అక్కడే ఆరుబయట పడుకున్న ఓ వ్యక్తి లేవడంతో చిరుత అటునుంచి కొండప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. చిరుత సంచారంపై పలుమార్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జనావాసాల్లోకి రాకుండా చిరుతను బంధించి అటవీ ప్రాంతంలోకి వదలేలా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సత్యసాయి జయంతిఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు నడపనున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. అందులో భాగంగా యశ్వంతపూర్–హిందూపురం (06518/19) ప్యాసింజరును ఈ నెల 20 నుంచి 26 వరకు గుంతకల్లు జంక్షన్ వరకు పొడిగించినట్లు తెలిపారు. అలాగే బెంగళూరు–ధర్మవరం మధ్య మరో ప్యాసింజర్ రైలు (06595/96) ఈ నెల 20 నుంచి 26 వరకు నడపనున్నట్లు వెల్లడించారు. సీఈసీ, ఎస్ఈసీలో పలువురికి చోటు అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ), స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఎస్ఈసీ)ల్లో జిల్లాకు చెందిన కొందరికి చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఈసీ సభ్యులుగా ఉమామహేశ్వర్ నాయుడు(కళ్యాణదుర్గం), రంగన్న, నదీం అహ్మద్ (అనంతపురం అర్బన్), ఎస్ఈసీ సభ్యులుగా బోగాతి నారాయణరెడ్డి (శింగనమల), గౌని ఉపేంద్రరెడ్డి (రాయదుర్గం), లింగాల శివశంకర్రెడ్డి (అనంతపురం అర్బన్), బొంబాయి రమేష్నాయుడు (తాడిపత్రి) నియమితులయ్యారు. -
మహాత్ముని కల సాకారం చేసిన జగన్
అనంతపురం కార్పొరేషన్: జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్బహుదూర్ శాస్త్రిల జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ శాంతి, అహింస అనే ఆయుధాలతో గాంధీజీ నాయకత్వంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. గాంధీజీ ఆశయ సాధన కోసం అందరూ కలసికట్టుగా ముందుకెళ్దామన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒకేసారి 1,25,000 మందికిపైగా యువతకు ఉపాధి కల్పించడంతో పాటు సచివాలయల ద్వారా ఇంటి వద్దకే సుపరిపాలన అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 వైద్య కళాశాలలను తీసుకువచ్చారన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచి దేశానికి ఎన్నో సేవలందించారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వత్థ నాయక్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, రాష్ట్ర నాయకులు వెన్నం శివరామిరెడ్డి, మదిరెడ్డి నరేంద్రరెడ్డి, వేమల నదీం, కృష్ణవేణి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, సైఫుల్లాబేగ్, నాయకులు మీసాల రంగన్న, అనిల్కుమార్గౌడ్, రహంతుల్లా, జావేద్, కై లాస్, రాధాకృష్ణ, ఎంఎస్ఎస్ సాదిక్, వెన్నపూస రామచంద్రారెడ్డి, కాకర్ల శ్రీనివాస్రెడ్డి, పసలూరు ఓబులేసు, ఉష, తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి వేడుకల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
విదేశాలకు చీనీ ఎగుమతులపై దృష్టి
అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం మార్కెట్ నుంచి విదేశాలకు చీనీ ఎగుమతులు చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో ఉన్న చీనీ మార్కెట్ను కలెక్టర్ సందర్శించారు. ఈ–నామ్ పద్ధతిలో చీనీ క్రయ విక్రయాల గురించి ఆరా తీశారు. అలాగే ఏటా మార్కెట్కు వస్తున్న చీనీకాయలు, పలుకుతున్న ధరలు, రైతులకు కల్పిస్తున్న వసతులు తదితర అంశాల గురించి మార్కెటింగ్ శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్, గ్రేడ్–2 సెక్రటరీ రూప్కుమార్, అలాగే ట్రేడర్లను అడిగి తెలుసుకున్నారు. వచ్చే సీజన్ నుంచి కనీసం 200 టన్నులు చీనీకాయలు విదేశాలకు ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకుంటే రైతులకు మరింత గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉంటుందన్నారు. ‘అమృత్’ పనులు పూర్తి చేయాలి అనంతపురం అర్బన్: ‘అమృత్’ పథకం కింద నగరపాలక సంస్థతో పాటు పురపాలక సంఘాల్లో చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అమృత్ పథకం పనులు, టిడ్కో ఇళ్ల నిర్మాణం, తదితర అంశాలపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రజారోగ్య, నగర పాలక, టిడ్కో అధికారులు, మునిసిపల్ కమిషనర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ 1.0 కింద రూ.15.35 కోట్లతో చేపట్టిన అనంతపురం వాటర్ సప్లయ్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ పనులు, ట్రయల్ రన్ చేపట్టాలని ఆదేశించారు. పథకం కింద గుంతకల్లు పట్టణంలో రూ.10.98 కోట్లతో చేపట్టిన పనులు పూర్తిచేసి ఈ నెలాఖరుకు ట్రయల్ రన్ చేపట్టాలన్నారు. తాడిపత్రిలో పనులు వారంలోగా పూర్తి చేయాలన్నారు. అనంతపురం, గుంతకల్లులో సీపేజ్ అండ్ సెప్టేజ్ నిర్వహణ పనులను, ఇతర మునిసిపాలిటీల్లో చేపట్టిన ఇతర ప్రధాన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఏపీ టిడ్కో కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తయిన వాటికి సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 301 చెరువులను నింపాలి జిల్లాలో భూగర్భజలాలు పెరగాలంటే 301 చెరువులను నీటితో నింపాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నీటి వనరులు, భూగర్భజలాల పెంపు, తదితర అంశాలపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో హెచ్చెల్సీ, హెచ్ఎన్ఎస్ఎస్, మైనర్ ఇరిగేషన్ శాఖల అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో సమీక్షించారు. -
ఇసుక డంప్ సీజ్
బొమ్మనహాళ్: అక్రమంగా డంప్ చేసిన ఇసుకను రెవెన్యూ అధికారులు, పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. వివరాలు... బొమ్మనహాళ్ మండలంలోని కురువల్లి, బొల్లనగుడ్డం గ్రామాలకు చెందిన కొందరు అధికార పార్టీ అండతో ఇసుక దందా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 25 ట్రాక్టర్ల ఇసుకను కురువల్లి గ్రామ శివారులో డంప్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నబీరసూల్, తహసీల్దార్ మునివేలు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించి, ఇసుక డంప్ను సీజ్ చేశారు. ఇసుకను అక్రమంగా నిల్వలు చేసిన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మునివేలు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు గుత్తి: స్థానిక చెంబుల బావి వీధిలో రెండు రోజుల క్రితం రూ.300 కోసం గొడవపడి వెంకట్రామిరెడ్డిపై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయన్నారు. వాటి ఆధారంగా, బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన అప్జల్, ఆదిల్, ఆరీఫ్పై కేసు నమోదు చేసినట్లు సీఐ రామారావు వెల్లడించారు. గాంధీ జయంతి రోజున యథేచ్ఛగా మద్యం అమ్మకాలుబ్రహ్మసముద్రం : మహాత్మా గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం అమ్మకాలు నిషేధం. అయితే ఇందుకు బ్రహ్మసముద్రం గ్రామానికి అధికారులు మినహాయింపునిచ్చినట్లుగా ఉంది. గాంధీ జయంతి, దసరా రెండూ ఒకే రోజు రావడంతో బ్రహసముద్రంలో బెల్ట్షాపు నిర్వాహకులు హంగామా చేశారు. ఎలాంటి అనుమతులు లేకున్నా.. బెల్ట్ షాప్ను పూలతో ముస్తాబు చేసి, 2వ తేదీ ఉదయం 6 గంటలకే మద్యం అమ్మకాలు మొదలు పెట్టారు. విషయం తెలిసినా అటుగా రెవెన్యూ అధికారులు, పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. స్థానికులు కొందరు కళ్యాణదుర్గం ఎకై ్సజ్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన మరుక్షణమే బెల్ట్షాపు నిర్వాహకుడికి ఫోన్ చేసిన వారి సమాచారం అందించి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఎకై ్సజ్ అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా సాగుతోందంటూ స్థానికులు మండిపడ్డారు. -
పెట్రోల్ బంకుల్లో దోపిడీ
జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో దోపిడీ పర్వం కొనసాగుతూనే ఉంది. అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంతో వినియోగదారుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. తాజాగా అనంతపురంతో పాటు గుంతకల్లులో పెట్రోల్ బంకుల్లో మోసాలపై స్థానికులు తిరగబడ్డారు. అనంతపురం: నగరంలోని గుత్తిరోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ బంకులో తక్కువ పెట్రోల్ పోస్తూ మోసం చేస్తున్నారంటూ యువకులు ధ్వజమెత్తారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో కాశీవిశ్వనాథ్ అనే యువకుడు రూ.100 ఇచ్చి పెట్రోల్ పట్టాలని కోరాడు. అందులో కేవలం 50 రూపాయల విలువ గల పెట్రోల్ మాత్రమే పట్టారు. బైక్ నుంచి పెట్రోల్ను బాటిల్కు తీసుకుని పరిశీలిస్తే కొలతల్లో తేడా రావడంతో పెట్రోల్ బంకు పంప్ ఆపరేటర్ను నిలదీశాడు. మీరు ఇచ్చింది రూ.50. పెట్రోల్ కూడా అంతే వేశానంటూ బుకాయించాడు. దీంతో వినియోగదారుడిలో అసహనం రేకెత్తింది. ఈ పెట్రోల్ బంకులో ఏళ్ల తరబడి మోసం జరుగుతోందని, ఈ రోజు పరిశీలిస్తే గుట్టు రట్టయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో పోగయ్యారు. బాధిత వినియోగదారుడికి మద్దతుగా పెట్రోల్ బంకు వద్ద నిరసన తెలిపారు. ప్రజల్ని మోసగిస్తూ.. తక్కువ పెట్రోల్ను పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు చెట్ల కుండీలను పగులగొట్టారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వన్టౌన్ సీఐ జి.వెంకటేశ్వర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. శనివారం వరకూ పెట్రోల్ బంకు తెరవకూడదని, తూనికలు కొలతల శాఖ అధికారులతో తనిఖీ చేయించిన అనంతరం వారు ఆమోదిస్తేనే పెట్రోల్ బంకు తెరవాలని సీఐ ఆదేశించారు. కొలతల్లో భారీ వ్యత్యాసాలు నిలదీసిన వినియోగదారులపై దౌర్జన్యం వాహనదారుల్లో పెల్లుబుకిన ఆగ్రహం -
బెళుగుప్ప ఎంపీపీపై ‘అవిశ్వాసం’ పెట్టండి
● ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కళ్యాణదుర్గం: బెళుగుప్ప ఎంపీపీ సి.పెద్దన్నపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు తొమ్మిది మంది పార్టీ నాయకులతో కలిసి కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచి ఎంపీపీగా పదవి అలంకరించిన పెద్దన్న అనంతర కాలంలో టీడీపీలోకి చేరిపోవడంతో పాటు అభివృద్ధి పనులకు సహకరించకుండా ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఎంపీటీసీ సభ్యులకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకుండా చులకనగా చూస్తున్నారని వాపోయారు. ఇలా పలు కారణాలతో మెజార్టీ సభ్యులైన తాము ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1991లోని 245 సెక్షన్ 1 మేరకు సి.పెద్దన్నపై అవిశ్వాసం పెట్టేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. తమ విన్నపం మేరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, మండల కన్వీనర్ మచ్చన్న, జెడ్పీటీసీ త్రిలోక్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శివలింగప్ప, రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులు, రమణేపల్లి సర్పంచ్ రమేష్, కాలువపల్లి మాజీ సర్పంచ్ తిమ్మన్న, గుండ్లపల్లి వెంకటరెడ్డి, మోహన్, ఎంపీటీసీలు సురేష్బాబు, ప్రసాద్, ఈర బొమ్మన్న, పుష్పావతి, వరలక్ష్మి, అంజినమ్మ, నాగరత్నమ్మ, ప్రభావతి, రేఖమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
తాడిపత్రి రూరల్: స్థానిక చింతల వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సూర్యప్రభ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాత్రి చంద్రప్రభ వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. కేశేపల్లి టీచర్కు అంతర్జాతీయ కార్టూనిస్ట్ అవార్డుశింగనమల(నార్పల): అబ్లా ఆర్ట్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన కార్టున్ – ఎల్నాస్ఎల్ హల్వా 2025 పోటీల్లో నార్పల మండలంలోని కేశేపల్లి జెడ్పీహెచ్ఎస్ ఆర్ట్ టీచర్ చిన్న కుళ్లాయప్పకు అవార్డు దక్కింది. క్యారికేరేచర్ విభాగంలో వివిధ దేశాలకు చెందిన పలువురు కార్టూనిస్ట్లు పోటీ పడగా, భారత దేశం నుంచి తలపడిన చిన్న కుళ్లాయప్ప ద్వితీయ స్థానంలో నిలిచారు. దీంతో ఆయనను నార్పల మండల వాసులు, తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి ● ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ డిమాండ్ అనంతపురం మెడికల్: పీహెచ్సీ వైద్యుల పట్ల నిర్లక్ష్య ధోరణి వీడాలని కూటమి సర్కార్కు ఏపీ పీహెచ్సీ వైద్యుల సంఘం నాయకులు హితవు పలికారు. సమ్మెలో భాగంగా శుక్రవారం అనంతపురంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీహెచ్సీ వైద్యులుగా మూడేళ్ల పాటు విధులు కొనసాగించిన తర్వాత పీజీ వైద్య విద్యను అభ్యసించడానికి గతంలో ఉన్న 30 శాతాన్ని 15 శాతానికి కుదించడం సబబు కాదన్నారు. టైం బౌండ్ పదోన్నతులను కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. గత నెలలో సెకండరీ హెల్త్ సర్వీసులో కేవలం రెండు సంవత్సరాలు పూర్తయిన సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు డిప్యూటీ సివిల్ సర్జన్లుగా హోదా ఇచ్చి ఇంత వరకూ ప్రొబేషనరీ పీరియడ్ డిక్లరేషన్ ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ నాయకులు డాక్టర్ లోకేష్, డాక్టర్ శివసాయి, డాక్టర్ మనోజ్, డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ సుధాకర్, డాక్టర్ శివశంకర్ నాయక్, డాక్టర్ జయకుమార్ నాయక్, డాక్టర్ స్వాతి, డాక్టర్ సుష్మిత డాక్టర్ చందన, డాక్టర్ హనీషా తదితరులు పాల్గొన్నారు. ‘దుర్గం’లో పట్టపగలే భారీ చోరీ ● రూ.10 లక్షల నగదు, 20 తులాల బంగారం అపహరణ కళ్యాణదుర్గం: స్థానిక పార్వతీ నగర్లో పట్టపగటే భారీ చోరీ జరిగింది. దసరా పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు ఉదయం బంధువుల ఇంటికెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేలోపు చోరీ జరగడం గమనార్హం. పోలీసులు తెలిపిన మేరకు... పార్వతీనగర్లో నివాసముంటున్న మహేంద్ర నాయుడు.. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆటోమొబైల్స్ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి శుక్రవారం ఉదయం బంధువుల ఆహ్వానం మేరకు బెళుగుప్ప మండలం విరుపాపల్లిలో జరిగే ఓ విందు కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చిలోపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి గమనించారు.రూ.10 లక్షల నగదు, 20 తులాల బంగారు నగలు అపహరణకు గురైనట్లు నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో పట్టణ సీఐ హరినాథ్, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల ఆధారాలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, స్వాధీనం చేసుకున్న సీసీ ఫుటేజీల్లో ఓ దొంగ కదలికలను పోలీసులు స్పష్టంగా గుర్తించారు. బదిలీపై 22 మంది టీచర్ల రాక అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీల్లో భాగంగా జిల్లాకు 22 మంది వచ్చారు. శుక్రవారం సాయంత్రం డీఈఓ కార్యాలయంలో డీఈఓ ఎం.ప్రసాద్బాబు సమక్షంలో కౌన్పెలింగ్ నిర్వహించి స్కూళ్లు కేటాయించారు. బదిలీల్లో జిల్లాకు వచ్చిన వారిలో హెచ్ఎంలు ఇద్దరు, పీఎస్హెచ్ఎంలు ఇద్దరు, స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకరు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒకరు, గణితం ముగ్గురు, పీఎస్ ముగ్గురు, బీఎస్ ఒకరు, ఇంగ్లీష్ ఒకరు, పీఈటీ ఒకరు, ఎస్జీటీలు ఏడుగురు ఉన్నారు. కాగా 3, 4 కేటగిరీలకు సంబంధించి కొన్ని స్కూళ్లు మాత్రమే ఖాళీలు చూపడంపై యూటీఎఫ్ నాయకులు మండిపడ్డారు. ఆయా కేటగిరీల్లో అన్ని ఖాళీలను చూపించాలని డిమాండ్ చేశారు. -
● కంటి తుడుపు ప్రదర్శన.. కనిపించని రైతులు
అనంతపురం అగ్రికల్చర్: అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు స్థానిక ఆగ్రోస్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాల ప్రదర్శనకు రైతులు కరువయ్యారు. ఏదో చేయాలంటే చేయాలన్నట్లుగా కార్యక్రమాన్ని నిర్వహించడంతో పట్టుమని 20 మంది కూడా రైతుల హాజరు కాలేదు. వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, ఆగ్రోస్ మేనేజర్ ఓబుళపతి, డ్వామా పీడీ సలీంబాషా, జెడీబీఎన్ఎఫ్ డీపీఎం లక్ష్మానాయక్, ఏఆర్ఎస్, కేవీకే ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.విజయశంకరబాబు, డాక్టర్ ఎస్.మల్లీశ్వరి, ఏడీఏ అల్తాఫ్తో పాటు ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ అధికారులు, ఆయా శాఖల సిబ్బంది, ఆర్ఎస్కే అసిస్టెంట్లు, ఓ ఎన్జీఓ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. డ్రోన్లు, రోటోవీటర్లు, టిల్లర్లు, ఇతర కొన్ని పరికరాలు ప్రదర్శించారు. ట్రాక్టర్లు, డ్రోన్లు, ఇతర వ్యవసాయ పరికరాలపై 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించినట్లు జేడీఏ తెలిపారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి అనంతపురం: జూనియర్ న్యాయవాదులకు తక్షణమే స్టైఫండ్ చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వాన్ని అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.మాధవరావు డిమాండ్ చేశారు. అనంతపురం బార్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయమిత్ర పథకం కింద ప్రతి నెలా జూనియర్ న్యాయవాదులకు ఇచ్చే శిక్షణ భృతిని పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. న్యాయవాదుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీని విస్మరించారని విమర్శించారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించకపోతే అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐలు అధ్యక్ష, కార్యదర్శులు వీరమాసప్ప, సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు ఈ.ప్రసాద్, నాగరాజు, కమిటీ సభ్యులు నాగభూషణ్, శ్రీనివాస్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
గొంతు కోసుకుని.. ఆస్పత్రి నుంచి పరుగు తీసి!
ఉరవకొండ/అనంతపురం కార్పొరేషన్: క్షణికావేశంలో పొలాల్లో గొంతు కోసుకున్న ఓ యువకుడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా తప్పించుకుని పారిపోయాడు. అతికష్టంపై పోలీసులు వెంటాడి పట్టుకుని మళ్లీ ఆస్పత్రికి చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం జీజీహెచ్లో చేర్పిస్తే అక్కడా తనదైన శైలిలో రెచ్చిపోయి సిబ్బందిపై దాడికి తెగబడ్డాడు. వివరాల్లోకి వెళితే... ఉరవకొండలోని హమాలీ కాలనీకి చెందిన శేఖర్కు వివాహమైంది. పిల్లలు లేరు. కుటుంబ కలహాలతో విసుగు చెందిన శేఖర్ క్షణికావేశానికి లోనై గురువారం బూదగవి గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి కత్తితో గొంతు కోసుకున్నాడు. అటుగా వెళుతున్న రైతుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని స్థానిక సీహెచ్సీకి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగా ఒక్కసారిగా అందరినీ తోసేసి రోడ్డుపైకి పరుగు తీశాడు. సీఐ మహనందితో పాటు సిబ్బంది వెంటపడి పరుగు తీసినా చేతికి చిక్కకుండా తప్పించుకోని పారిపోతుండగా స్థానికులు అతి కష్టంపై అడ్డుకుని నిలువరించారు. వెంటనే శేఖర్ను పట్టుకుని పోలీసులు ఆస్పత్రికి చేర్చి, దగ్గరుండి చికిత్స చేయించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని జీజీహెచ్కి తరలించారు. జీజీమెచ్లో హల్చల్.. గురువారం రాత్రి 8 గంటల సమయంలో శేఖర్ను జీజీహెచ్కు పోలీసులు, కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. అయితే చికిత్స చేయించుకునేందుకు నిరాకరిస్తూ క్యాజువాలిటీలోని టేబుళ్లపైకి ఎక్కి కేకలు వేస్తూ హల్చల్ చేశాడు. చివరకు ఈఎన్టీ వైద్యురాలు డాక్టర్ మధులిక, తదితరులు శేఖర్కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి, మెయిన్ ఆపరేషన్ థియేటర్కు తరలించి శస్త్రచికిత్స చేసి, ఈఎన్టీ వార్డుకు తరలించారు. కాసేపటికి తేరుకున్న శేఖర్ అక్కడున్న సెక్యూరిటీ, అటెండర్పై కర్రతో దాడి చేశాడు. శుక్రవారం ఉదయం శేఖర్ను మెరుగైన వైద్యం కోసం కడప ఆస్పత్రికి తరలించారు. యువకుడి ఆత్మహత్యాయత్నం జీజీహెచ్లో సర్జరీ తర్వాత సెక్యూరిటీ, తదితరులపై దాడి -
‘ఉపాధి’ అక్రమాలకు చెక్!
అనంతపురం టౌన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా నూతన మార్గదర్శకాలను ప్రవేశపెడుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతన సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పనుల్లో పాలు పంచుకుంటేనే ఉపాధి వేతనం అందుతుంది. లేకపోతే లేదు. గతంలో నకిలీ ఫొటోలతో దోపిడీ.. గతంలో ఉపాధి హామీ పథకం నిధులను అడ్డగోలుగా దోచేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు చేతి వాటం ప్రదర్శించి జాబ్కార్డు ఉంటే చాలు ఉపాధి పనులకు రాకున్న వచ్చినట్లు ఎన్ఎంఎంఎస్ యాప్లో నకిలీ ఫొటోలను అప్లోడ్ చేసి వేతనాల రూపంలో రూ.కోట్లు కొల్లగొట్టేశారు. బుక్కరాయసముద్రం మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో 2వేలమంది ఉపాధి కూలీలు ఉంటే రోజు వారీగా 1,900 మందికి పైగా పనులకు హాజరైనట్లు ఎన్ఎంఎంఎస్ యాప్లో నమోదు చేశారంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గ్రామం మొత్తం ఉపాధి పనులకు హాజరవడంపై జిల్లా అధికార యంత్రాంగమే విస్తుపోయింది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే కేవలం 200మంది మాత్రమే కనిపించారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు 20 రోజుల వేతనాలను నిలుపుదల చేశారు. జిల్లాలోని 32 మండలాల్లో ఇదే తంతు కొనసాగినట్లుగా అప్పట్లో అధికారులు గుర్తించారు. ప్రతి సోమవారం వేతనాలు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6.86 లక్షల జాబ్కార్డులు, 11.58 లక్షల మంది శ్రామికులు ఉన్నారు. అనంత జిల్లాలో 3.16లక్షల జాబ్కార్డులు, 5.38 లక్షల మంది శ్రామికులు, శ్రీసత్యసాయి జిల్లాలో 3.70 లక్షల జాబ్ కార్డులు, 6.20 మంది శ్రామికులున్నారు. వీరి జాబ్కార్డులను ఆధార్తో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 80 శాతానికి పైగా అనుసంధాన ప్రక్రియను పూర్తయింది. పనులకు హాజరయ్యే శ్రామికులకు ఈ–కేవైసీని తప్పనిసరి చేయడంతో కష్టించిన వారికి మాత్రమే వేతనాలు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. వారంలో ఎన్ని రోజులు పని చేసినా.. పని చేసిన రోజులకు సంబంధించి ప్రతి సోమవారం వేతనాలు వారి ఖాతాల్లోనే నేరుగా జమ చేయనున్నారు. ప్రతి రోజూ రెండు పర్యాయాలు పనులకు హాజరైన ఫొటో, పనులు ముగించిన అనంతరం మరో ఫొటో ఆధారిత హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జాబ్కార్డులకు ఆధార్ అనుసంధానం 15 నుంచి జిల్లాలో అమలు -
వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
అనంతపురం సిటీ: వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ ముందుకు సాగుతోందని ఆ సంస్థ ఉమ్మడి జిల్లా జనరల్ మేనేజర్ (జీఎం) షేక్ ముజీబ్పాషా పేర్కొన్నారు. అనంతపురంలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మారిన కాలానుగునంగా ప్రైవేటు సంస్థలకు దీటుగా బీఎస్ఎన్ఎల్ లోనూ అనేక సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులకు మెరుగైన, వేగవంతమైన సేవలందించడమే లక్ష్యంగా దూసుకుపోతోందని వివరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లు 13,208 ఉండగా, ఓఎల్టీఎస్ 189 కనెక్షన్లు ఉన్నాయన్నారు. 2జీ/4జీ టవర్లు 343 ఉండగా, 2,79,591 మంది ప్రీపెయిడ్ వినియోగదారులు ఉన్నారన్నారు. 2,679 మంది పోస్ట్పెయిడ్ కస్టమర్లు, 790 ఐఎల్ఎల్ కనెక్షన్లను కలిగి ఉన్నామన్నారు. సమష్టి కృషితోనే తమ సంస్థ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని, వచ్చే ఏడాదిలో 5జీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలు, స్కీముల అమలు కారణంగా ఇతర నెట్వర్క్ల నుంచి బీఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. అనంతరం నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీజీఎం బాలగంగాధర్రెడ్డి, ఏజీఎం బాలాజీ, ఎస్డీఈలు రేవతి, హేమంత్కుమార్, శ్రీనివాసరెడ్డి, జేటీఓలు మాళవిక, వెంకటరెడ్డి, ఐఎఫ్ఏ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఉమ్మడి జిల్లా జనరల్ మేనేజర్ షేక్ ముజీబ్పాషా అనంత వేదికగా అట్టహాసంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -
కొనసాగుతున్న వైద్యుల సమ్మె
● గ్రామీణులకు తప్పని అవస్థలు ● డీఎంహెచ్ఓ ముందుచూపులేని నిర్ణయంతో చిక్కులు అనంతపురం మెడికల్: జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తించే వైద్యులు సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మెలో భాగంగా బుధవారం ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయం ఆవరణలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయ కులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను సాధించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. క్లినికల్ పీజీ సీట్లను 30 శాతం నుంచి 15 శాతం, నాన్ క్లినికల్ సీట్లను 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించడంతో వైద్యులు నష్టపోతారన్నారు. 2020 బ్యాచ్కు సంబంధించి నోషనల్ ఇంక్రిమెంట్లు, గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారికి అలవెన్స్లు అందివ్వాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ సంధ్య, డాక్టర్ శివసాయి, డాక్టర్ నాన్సి, డాక్టర్ సాహితి, డాక్టర్ లోకేష్, డాక్టర్ శివసాయి, ఆసియా, ప్రీతి, సుమన్ కుమార్, పరమేష్, వినోద్కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. స్తంభించిన సేవలు.. పీహెచ్సీ వైద్యుల సమ్మెతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు స్తంభించాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు తదితర సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అవస్థలు పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు కష్టాలు చెప్పనలవిగా మారాయి. డీఎంహెచ్ఓ ఇష్టారాజ్యం.. ముందుచూపు లేకుండా డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టింది. వైద్యుల సమ్మె నేపథ్యంలో జిల్లాలోని పలు పీహెచ్సీలకు ఏరియా ఆస్పత్రుల నుంచి 28 మంది, బోధనాస్పత్రి నుంచి 26 మంది వైద్యులను కేటాయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి నియమించిన 26 మందిలో పీజీలే ఉన్నారు. ఇందులోనూ 20 మంది వేరే రాష్ట్రాలకు చెందిన వారు. ఈ క్రమంలో భాషా సమస్య తలెత్తడం,ఎటువంటి రవాణా చార్జీలను అందించకపోవడం, పైపెచ్చు సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులను కేటాయించడంతో చాలా మంది ఆస్పత్రులకు వెళ్లలేదు. దీనిపై బుధవారం పీజీలందరూ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ నాయక్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. భద్రతా సమస్యల నేపథ్యంలో అంతదూరం వెళ్లలేమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ డీఎంహెచ్ఓ భ్రమరాంబ దేవితో మాట్లాడారు. పీజీ వైద్యులను అర్బన్ హెల్త్ సెంటర్లకు కేటాయించి, అక్కడ పని చేసే వారిని పీహెచ్సీలకు పంపితే ఇబ్బందులు ఉండవని చెప్పగా, డీఎంహెచ్ మాత్రం తానేమీ చేయలేనని చేతులెత్తేయడం గమనార్హం. ఇక.. పీజీలు బయోమెట్రిక్ వేస్తేనే స్టైఫండ్ వస్తుంది. బయోమెట్రిక్ సౌకర్యం అనంతపురంలోని వైద్య కళాశాలతో పాటు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోనే ఉంటుంది. ఆస్పత్రులకు వెళ్తే బయోమెట్రిక్ వేయలేక స్టైఫండ్ కూడా రాదు. ఈ విషయాలన్నీ తెలిసినా డీఎంహెచ్ఓ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
విద్యుదాఘాతంతో గోశాల కార్మికుడి మృతి
ఆత్మకూరు: విద్యుత్ షాక్కు గురై గోశాల కార్మికుడు మృతిచెందాడు. ఘటనపై గోశాల నిర్వాహకుడు నిర్లక్ష్యంగా వ్యవహ రించడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. చివరకు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు జోక్యంతో బాధితులకు న్యాయం చేకూరింది. వివరాలు... ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని గోశాలలో కుర్లపల్లికి చెందిన సంజీవులు (40) పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం విద్యుత్ మోటారు సాయంతో నీటిని పడుతూ గోశాలను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై మృతిచెందాడు. మృతదేహం ఐదు గంటల పాటు అక్కడే ఉన్నా... నిర్వాహకులు పట్టించుకోలేదు. కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిశీలించారు. సంజీవులు మృతదేహంపై పడి భార్య రమాదేవి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. న్యాయం చేయాలంటూ ఆందోళన సంజీవులు మృతిపై న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో అనంతపురానికి చెందిన ఆదినారాయణ నాయుడు గోశాల నిర్వహిస్తున్నాడని, ఎండోమెంట్ అనుమతులు లేకపోయినా అనధికారంగా నడిపిస్తూ అక్కడ పనిచేస్తున్న దళితుల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ మహిళా మండల మాజీ కన్వీనర్ సుభద్రమ్మ అక్కడకు చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. సంజీవులు మృతి చెందిన ఐదు గంటల సేపైనా ఆదినారాయణ నాయుడు అక్కడకు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు అధికార పార్టీ నాయకుల అండతో పోలీసులను పక్కన పెట్టుకుని ఆదినారాయణనాయుడు అక్కడు చేరుకున్నారు. పెన్నోబులేసు తదితరులతో చర్చించి బాధిత కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం చెల్లిస్తానంటూ అంగీకరించారు. తక్షణ సాయం కింద రూ.50 వేలు చెల్లించారు. అనంతరం సంజీవులు భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు ఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ ప్రాంగణంలో ఘటన మృతిపై స్పందించని గోశాల నిర్వాహకులు బాధితుల ఆందోళన -
అనంతలో మహాత్ముని అడుగుజాడలు
● అక్షరబద్ధం చేసిన డాక్టర్ రమేష్ నారాయణ ● నేడు ఉచితంగా పంపిణీ అనంతపురం కల్చరల్: దేశ స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపిన మహాత్ముని అడుగుజాడలు జిల్లా అంతటా మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. నాటి దేశకాల పరిస్థితులను, మొక్కవోని దేశభక్తిని ఘనంగా చాటే స్మృతులు తరాలు సాగిపోతున్నా సజీవ రూపాలుగా దర్శనమిస్తూనే ఉన్నాయి. మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్న అనంత వాసులు ఎందరో తాము సైతం అంటూ స్వాతంత్య్రోద్యమంలో పాలు పంచుకున్నారు. ఈ విశేషాలన్నింటినీ ఎంతో హృద్యంగా చాటి చెప్పేలా ‘అనంత’ జిల్లాలో గాంధీజీ’ పేరుతో అక్షర బద్ధం చేశారు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ పతికి రమేష్నారాయణ. గురువారం జరుగనున్న గాంధీజీ జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. -
‘సాధారణం’తో సరి
అనంతపురం అగ్రికల్చర్: ‘ఖరీఫ్’ సాధారణ వర్షపాతంతో ముగిసింది. సెప్టెంబర్ నెలాఖరుతో సీజన్ ముగిసింది. ఈ ఏడాది ఖరీఫ్ మొదలు కాక ముందే తొలకర్లు పలకరించడంతో రైతుల్లో ఆశలు పెరిగాయి. దానికి తోడు నైరుతి రుతుపవనాలు ఈ సారి మే 26న చాలా ముందుగానే ప్రవేశించడంతో అన్నదాత హర్షాతిరేకం వ్యక్తం చేశాడు. కానీ రుతుపవనాల ప్రవేశం తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. జూన్, జూలై రెండు నెలల పాటు వాన పడటం గగనంగా మారిపోయింది. జూలై ఆఖరుకే జిల్లాలో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. జూన్లో 61.2 మి.మీ గానూ 21.7 శాతం తక్కువగా 47.9 మి.మీ నమోదైంది. అది కూడా జూన్ మొదటి వారంలో మంచి వర్షాలు కురిశాయి. జూన్ రెండో వారం తర్వాత పరిస్థితి మారిపోయింది. అలాగే, ఖరీఫ్ పంటలు విత్తుకునేందుకు అత్యంత కీలకమైన జూలైలో వర్షాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జూలైలో 64.3 మి.మీ గానూ 46 శాతం తక్కువగా 34.7 మి.మీ వర్షం కురిసింది. జూన్, జూలైలో కేవలం ఐదు వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావడం గమనార్హం. 28 రెయినీ డేస్.. నాలుగు నెలల ఖరీఫ్లో 28 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. అందులో ఆగస్టులోనే 14 రికార్డు కాగా మిగతా మూడు నెలల్లో మరో 14 రోజులు నమోదు కావడం గమనార్హం. ‘సాధారణం’ నమోదైనా శింగనమల, పుట్లూరు, అనంతపురం, రాప్తాడు మండలాల్లో తక్కువగానే వర్షం కురిసింది. 10 మండలాల్లో ఎక్కువగానూ, 17 మండలాల్లో సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇలా ఖరీఫ్లో వర్షాలకు సంబంధించి భిన్నమైన పరిస్థితులు నెలకొనడంతో పంటల సాగు పడుతూ..లేస్తూ సాగింది. ఎట్టకేలకు 3.43 లక్షల హెక్టార్లకు గానూ 88 శాతంతో 2.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సారి 1.04 లక్షల హెక్టార్లతో కంది పంట మొదటి స్థానంలో ఉండగా, 90 వేల హెక్టార్లతో వేరుశనగ రెండో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వకపోవడంతో ఉలవ, పెసర, అలసంద, కొర్ర, జొన్న తదితర పంటలు నామమాత్రంగా మిగిలిపోయాయి. అననుకూల వర్షాలతో ఈ ఏడాది అన్నదాత పరిస్థితి అయోమయంగా తయారైంది. మురిపించి.. కంగారెత్తించి ఖరీఫ్ నాలుగు నెలల్లో 335.5 మి.మీ వర్షపాతం నమోదు జూన్, జూలైలో వర్షాభావం, ఆగస్టులో అధికంగా వర్షం 28 వర్షపు రోజులు... 77 డ్రైస్పెల్స్ నమోదు 88 శాతంతో 2.98 లక్షల హెక్టార్లలో పంటల సాగు -
ఆర్మీ మద్యాన్ని తరలిస్తూ పట్టుబడిన ఆర్టీసీ డ్రైవర్
అనంతపురం: కర్ణాటక నుంచి ఆర్మీ మద్యాన్ని తరలిస్తూ ఎకై ్సజ్ అధికారులకు ఓ ఆర్టీసీ డ్రైవర్ పట్టుబడ్డాడు. వివరాలను అనంతపురం ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణ మంగళవారం వెల్లడించారు. అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం బెంగళూరు నుంచి వస్తున్న ఆర్టీసీ అనంతపురంలోని ధర్మవరం రోడ్డులో ఉన్న శివకోటి ఆలయం వద్ద ఆపి తనిఖీ చేశారు. సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణిస్తున్న శివకోటి ఆలయం వద్ద నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్ పి.ఓబులనారాయణరెడ్డి వద్ద నుంచి 60 ఆర్మీ ఫుల్ బాటిళ్ల మద్యం పట్టుబడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అదే బస్సులో ముందు వైపు కూర్చొన్న పాత నిందితులు సాకే పవన్కుమార్, వడే శ్రీనివాసులు వెంటనే బస్సు దిగి పారిపోయారు. బెంగళూరులోని ఆర్టీ క్యాంటీన్ నుంచి మద్యం కొనుగోలు చేసి జిల్లాకు అక్రమంగా చేరవేస్తున్నట్లుగా విచారణలో వెలుగు చూసింది. -
ఉద్యోగులకు మొండిచేయి చూపిన ‘కూటమి’
● వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అనంతపురం ఎడ్యుకేషన్: దసరా కానుకగా రెండు డీఏలు, ఐఆర్ 30 శాతం ప్రకటిస్తారని ఎదురు చూసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపిందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి, ప్రధానకార్యదర్శి జి.శ్రీధర్గౌడ్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలపై చర్చించకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తర్వాత పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఇప్పటికై నా స్పందించి డీఏలు, 30 శాతం మధ్యంతర భృతి, సంపాదిత సెలవుల ఎన్క్యాష్మెంట్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. తాగుడుకు డబ్బివ్వలేదని కొడవలితో దాడి అనంతపురం: మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదంటూ సొంత మేనమామ కొడుకుపైనే కొడవలితో దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. వన్టౌన్ సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు... బుక్కరాయసముద్రం గ్రామ సింగిల్ విండో ప్రెసిడెంట్ చాకలి కేశన్న మంగళవారం సాయంత్రం అనంతపురంలోని పాతూరు జంగాలపల్లి మసీదు వద్ద ఉన్న సమయంలో మేనత్త కుమారుడు సుబ్బారావు కలసి మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రోజూ తాగుడుకు డబ్బు కావాలంటూ దౌర్జన్యం చేయడం సరికాదని కేశన్న సర్దిచెప్పబోతుండగా కొడవలితో దాడికి తెగబడ్డాడు. స్థానికులు కేకలు వేయడంతో సుబ్బారావు అక్కడి నుంచి పారిపోయాడు. క్షతగాత్రుడు స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందాడు. బాధితుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇద్దరూ టీడీపీకి చెందిన వారే కావడం, పైగా సమీప బంధువులు కావడంతో దాడిని రాజీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అరటి చెట్టుకు రెండు గెలలు పుట్లూరు: సాధారణంగా అరటి చెట్టుకు ఒక గెల మాత్రమే వస్తుంది. అయితే ఇందుకు భిన్నంగా పుట్లూరు మండలం రంగరాజుకుంట గ్రామానికి చెందిన రైతు పొన్నపాటి హనుమంతురెడ్డి తోటలో ఒక చెట్టుకు రెండు గెలలు వచ్చాయి. నాలుగు ఎకరాల్లో అరటి పంటను సాగు చేయగా రెండవ పంటలో ఇలా ఒక చెట్టుకు మాత్రమే రెండు గెలలు వచ్చిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇలా రెండు గెలలు రావడం ఎన్నడూ చూడలేదని స్థానిక రైతులు చెబుతున్నారు. కాగా, అరటి మొక్క కాండంలో రెండవ శిరోజం ఏర్పడినప్పుడు ఇలా రెండు గెలలు వస్తాయని ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
‘స్పీడ్’ పెంచిన ‘తపాలా’
● నేటి నుంచి స్పీడ్ పోస్టులోకి రిజిస్టర్ పోస్టు విలీనం ● తడిసి మోపెడవుతున్న చార్జీలు అనంతపురం సిటీ: రిజిస్టర్ పోస్టును రద్దు చేసి, స్పీడ్ పోస్టులో కలిపేస్తున్నట్లు ప్రకటించిన తపాలా శాఖ.. స్పీడ్ పోస్టు చార్జీలను భారీగా పెంచింది. పెరిగిన కొత్త ధరలు అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండేందుకు ఈ–కామర్స్ తరహాలో ఓటీపీ ఆధారిత డెలివరీ వంటి సేవలు, దేశ వ్యాప్తంగా ఒకే టారిఫ్, విద్యార్థులకు 10 శాతం రాయితీ అంటూ నమ్మబలికే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. నేటి నుంచే స్పీడ్ పోస్టు అమలు : అతి తక్కువ ఖర్చుతో అనువైన తపాలా సేవగా కొనసాగుతూ వచ్చిన రిజిస్టర్ పోస్టును తపాలా శాఖ పూర్తిగా రద్దు చేస్తూ స్పీడ్ పోస్టులోకి విలీనం చేసింది. తపాలా శాఖ తాజా నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల వారిపై అదనపు భారం పడుతోంది. అంతేకాక పోస్టు డెలివరీ సమయంలో చిరునామాదారు ఫోన్కు ఓటీపీ వస్తుంది. ధ్రువీకరణ తరువాతే పోస్టుమాన్ ఆ పోస్టును అందజేస్తారు. ఈ సేవ కోసం నిర్దేశిత టారిఫ్ మీద జీఎస్టీ కాకుండా అదనంగా ఒక్కో ఆర్టికల్కు రూ.5 చొప్పున వసూలు చేస్తారు. బల్క్ సేవలు వినియోగించుకునే సంస్థలకు 5 శాతం తగ్గింపు ప్రకటించింది. అయితే తపాలా శాఖ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే.. కేంద్ర తపాలా శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు కార్పొరేట్ కొరియర్ సంస్థలకు మేలు చేకూర్చేలా ఉన్నాయి. దశాబ్దాలుగా అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన రిజిస్టర్ పోస్టును స్పీడ్ పోస్టులోకి విలీనం చేయడం వినియోగదారుల నడ్డి విరిచే నిర్ణయం తీసుకుంది. – ఇనగలూరు ఇమ్రోజా, నిరుద్యోగి, అనంతపురం ధరలు పెంచి రాయితీనా? అందరికీ అనువైన ధరలతో ఉన్న రిజిస్టర్ పోస్టును రద్దు చేసిన స్పీడ్ పోస్టులో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే స్పీడ్ పోస్టు ధరలు విపరీతంగా ఉన్నాయి. పైగా విద్యార్థులకు మాత్రం పది శాతం రాయితీ ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు. ధరలు ఇష్టానుసారంగా పెంచి తగ్గిస్తున్నట్లు బుకాయించడం దేనికో? – బోయ ఎస్.పల్లవి, ఉద్యోగిని, అనంతపురం -
ఇళ్ల నిలుపుదల పాపం ప్రభుత్వానిదే
రాప్తాడురూరల్: ‘పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు గత ప్రభుత్వం కేవలం రూ. 1.80 లక్షలకే ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఈ పనులను నిలిపివేసింది. పేదల ఇళ్ల నిర్మాణాలను నిలుపుదల చేసిన పాపం ఈ ప్రభుత్వానిదే’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం అనంతపురం నగర శివారులోని తన క్యాంపు కార్యాలయంలో ‘డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన డిజిటల్ బుక్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వ బాధితులకు జగన్ ఇచ్చిన అభయం డిజిటల్ బుక్ అన్నారు. మిథున్రెడ్డిది అక్రమ అరెస్ట్.. ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. 2014–19 మధ్య లిక్కర్ అమ్మకాల ద్వారా రూ. 70 వేల కోట్ల ఆదాయం పొందితే, జగన్ హయాంలో 2019–24 మధ్య రూ.1.5 లక్షల కోట్లకు ఆదాయం పెరిగిందని, ఆదాయం పెరిగిన ప్రభుత్వంలో స్కాం జరిగిందా? లేకుంటే ఆదాయం తగ్గిన చంద్రబాబు హయాంలో స్కాం జరిగిందా ఆలోచించాలన్నారు. ఓటుకునోటు కేసులో చంద్రబాబు ఎలా అడ్డంగా దొరికాడో దేశానికే తెలుసని,స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అనారోగ్య సమస్యలపై బెయిల్ వచ్చిందనేది అందరికీ తెలుసన్నారు. విజిలెన్స్తో ఏం తేల్చారు? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల లోనే జగనన్న కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారని, అయితే ఇప్పటిదాకా ఏమి తేల్చారని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. అనంతపురం రూరల్ మండలంలో ఇళ్ల నిర్మాణాలు జరగకుండా ఎమ్మెల్యే పరిటాల సునీత ఆపారన్నారు. నేడు ఒక్కో ఇంటిపై అనంతపురం ఎమ్మెల్యే రూ. 10 వేలు, రాప్తాడు ఎమ్మెల్యే రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ‘అదేమైనా మీ నాయన గంటా.. లేకుంటే మీ జేజినాయన ముడుపులు ఏమైనా ఇచ్చారా..’ అని ప్రశ్నించారు. అమరావతిలో నాలుగు కంపెనీలకే రూ. వేల కోట్ల పనులు అప్పగించి కమీషన్లు దండుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మట్టి, ఇసుక, చివరకు ఇళ్ల నిర్మాణాల నుంచి కూడా డబ్బులు కావాలా అని ప్రశ్నించారు. ఇంత దోచుకుంటున్నా మెడికల్ కళాశాలల నిర్మాణాలకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసేందుకు మనసు రాలేదా అని నిలదీశారు. పేదలకు ఉచిత వైద్యంతో పాటు పిల్లలకు వైద్యవిద్య అందించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేస్తారా అని మండిపడ్డారు. దివంగత నేత వైఎస్సార్ చనిపోయిన తర్వాత దేవుడయ్యాడని, కానీ చనిపోయిన తర్వాత పీడ పోయిందబ్బ అనుకునేలా చేసుకోవద్దని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు గంగుల భానుమతి, అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజి, లాయర్ నాగిరెడ్డి, గంగుల సుధీర్రెడ్డి, గోవిందరెడ్డి, బండి పవన్, నీరుగంటి నారాయణరెడ్డి, లింగారెడ్డి, సునీల్దత్తరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణవి బాధ్యత లేని మాటలు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్టవి బాధ్యత లేని మాటలు అని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు.అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలతో టీడీపీ నేతలకు మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియడం లేదన్నారు. ‘అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టాలి...కడుపైనా చెయ్యాలి’ అని గతంలో మాట్లాడారన్నారు.‘నువ్వు కూడా ఇద్దరు ఆడపిల్లల తండ్రివే.. అయినా అలా ఎలా మాట్లాడావు. గ్లాస్ అలా తిప్పి మ్యాన్సన్హౌస్ మందు తాగితే అమ్మ పెళ్లామవుతుందా...పెళ్లాం అమ్మవుతుందా’ అని నిలదీశారు. సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ‘ఎవడు’ అని మాట్లాడతావా? అంటూ మండిపడ్డారు. తల్లిని అవమానించిన వారి పంచన చేరి పవన్కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవి తెచ్చుకున్నారని, నేడు అన్నను అవమానిస్తే మాత్రం నోరు ఎత్తడం లేదన్నారు. వైఎస్ జగన్పై చేస్తున్న దుష్ప్రచారమంతా చిరంజీవి రాసిన లేఖ, మహేష్బాబు, నారాయణమూర్తి మాటలతో పటాపంచలయ్యాయన్నారు. నిరుపేదల నుంచి ఒక్కో ఇంటికి రూ. 10 వేలు వసూలు చేస్తారా? కూటమి బాధితులకు జగనన్న అభయం ‘డిజిటల్ బుక్’ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
పేద విద్యార్థులు వైద్య విద్య చదవొద్దా?
అనంతపురం ఎడ్యుకేషన్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు మాట్లాడుతూ సీఎంగా ఉన్న సమయంలో దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంద న్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కావాలని, తమ విద్యార్థులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని కోరిన ప్రభుత్వాలను చూశాం కానీ, మెడికల్ కళాశాలలు తాము నిర్వహించలేమంటూ కేంద్రా నికి లేఖ రాసిన ఏకై క ప్రభుత్వం ప్రస్తుత కూటమి సర్కారే అని దుయ్యబట్టారు. ఒక్కో కళాశాలలో 15 శాతం సీట్లు కేంద్రం భర్తీచేస్తే తక్కిన 85 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉచితంగా వైద్యవిద్య చదివే వీలుండేదన్నారు. అలాంటిది ఉన్న కళాశాలలన్నీ ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుందన్నారు. నగర మేయర్ వసీం మాట్లాడుతూ మంజూరైన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్కు అప్పగించడం దుర్మార్గమన్నారు. నిర్వహణ సాధ్యం కాదని కేంద్రానికి లేఖ రాసిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను కచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఎస్సీ సెల్ రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు పెన్నోబులేసు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి చామలూరు రాజగోపాల్, రాష్ట్ర కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప మాట్లాడుతూ పీపీపీ విధానం మాటున ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్కు అప్పగిస్తున్నారన్నారు.రాష్ట్రంలో పేద విద్యార్థులు వైద్యవిద్య చదువుకోకూడదా? అని ప్రశ్నించారు. ప్రైవేట్గా మెడికల్ సీటు పొందాలంటే రూ.80 లక్షల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుందని, పేద వర్గాలకు ఇది సాధ్యమేనా అని వాపోయారు. పేదలను వంచిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, నగర అధ్య క్షుడు సోమశేఖర్రెడ్డి, మైనార్టీ, ఎస్టీ, మహిళ, విద్యార్థి విభాగాల అధ్యక్షులు సైఫుల్లాబేగ్, శ్రీనివాసనాయక్, శ్రీదేవి, చంద్రశేఖర్యాదవ్, పార్టీ నాయకులు పసలూరు ఓబులేసు, రాఘవ, రాఘవేంద్రప్రసాద్, సాకే శంకర్, ఎగ్గుల శ్రీనివాసులు, గౌస్బేగ్, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మారుతీనాయుడు, నరేంద్రరెడ్డి, ఆంజనేయులు, కాట మయ్య, సాకే కుళ్లాయిస్వామి,అశోక్, ప్రియాంక, వెన్నం శివరామిరెడ్డి, మారుతీప్రసాద్, రామాంజనేయులు, శోభారాణి, శోభాబాయి, కమల్ భూషణ్, కై లాస్, నితిన్రెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ హయాంలో 17 వైద్య కళాశాలలు బాబు నిర్ణయంతో నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షగా వైద్య విద్య కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందే భవిష్యత్తులో చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకుల హెచ్చరిక -
ఉమ్మడి జిల్లాకు వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులు ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ నెల 1న 0.4 మి.మీ, 2న 0.2 మి.మీ, 3న 2.4 మి.మీ, 4న 5.5 మి.మీ, 5న 6.2 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 32.2 డిగ్రీల నుంచి 32.7 డిగ్రీలు, రాత్రిళ్లు 22.8 డిగ్రీల నుంచి 23.2 డిగ్రీల మధ్య ఉండొచ్చన్నారు. గొర్రె పిల్లలను మింగిన కొండచిలువ పుట్టపర్తి అర్బన్: మందలో ఉన్న రెండు చిన్న గొర్రె పిల్లలను కొండ చిలువ మింగింది. ఈ ఘటన పుట్టపర్తి మండలం పైపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి పొద్దుపోయాక సమీపంలోని కొండ నుంచి వచ్చిన భారీ కొండ చిలువ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి విజయ్ మందలోకి చొరబడింది. ఒక పిల్లను మింగేసింది. రెండవ పిల్లను నోట కరుచుకోవడంతో అరుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన విజయ్ తోటి కాపరుల సహకారంతో రెండవ పిల్లను కొండ చిలువ నోటి నుంచి లాగేశారు. అప్పటికే అది మృతి చెందింది. కొండచిలువ ఎటూ వెళ్లలేక మందలోనే ఉండడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పుట్టపర్తికి చెందిన కరుణ సొసైటీ సిబ్బందికి తెలపడంతో వారు వచ్చి కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని బుక్కపట్నం సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వదిలేశారు. పీహెచ్సీలకు 54 మంది వైద్యుల కేటాయింపు అనంతపురం మెడికల్: జిల్లాలోని పలు పీహెచ్సీలకు 54 మంది వైద్యులను కేటాయించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పీహెచ్సీల డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు ఆయా పీహెచ్సీలకు వైద్యులను సర్దుబాటు చేశారు. ఏరియా ఆస్పత్రుల నుంచి 28 మంది, ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి 26 మంది వైద్యులను పంపినట్లు డీఎంహెచ్ఓ పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. 104,108 సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు. చింతలరాయుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం తాడిపత్రి రూరల్: పట్టణంలో భూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకట రమణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు విశ్వక్సేన సేవ జరిగింది. ఆలయం చుట్టూ విశ్వక్సేనుల ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేవాలయం విద్యుద్దీపాలంకరణల నడుమ కొత్త శోభ సంతరించుకుంది. రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలి : జేసీ అనంతపురం అర్బన్: కార్డుదారులకు నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లను జేసీ శివ్నారాయణ్ శర్మ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చౌక ధరల దుకాణాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలన్నారు. కార్డుదారులు పోర్టబిలిటీ ద్వారా తమకు దగ్గరలోని ఏ చౌక దుకాణం వద్దనైనా సరుకులు తీసుకోవచ్చన్నారు. సరుకుల పంపిణీలో ఎలాంటి సమస్యలున్నా కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ 85002 92992కు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
‘రబీ’ వచ్చేసింది
అనంతపురం అగ్రికల్చర్: జూన్ నుంచి మొదలైన ఖరీఫ్ సీజన్ ముగిసింది. బుధవారం నుంచి రబీ సీజన్ మొదలు కానుంది. డిసెంబర్ నెలాఖరు వరకు ‘రబీ’గా పరిగణిస్తారు. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి చలికాలం, మార్చి నుంచి వేసవి మొదలవుతుంది. ఖరీఫ్లో 2.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ, కంది, పత్తి, మొక్కజొన్న, ఆముదం తదితర ప్రధాన పంటలు సాగులోకి వచ్చాయి. రబీలో జిల్లాలో ప్రధాన పంటగా పప్పుశనగ 70 వేల హెక్టార్లకు పైబడి సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రబీలో 1.20 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావొచ్చని అంచనా వేశారు. అందులో ప్రధానంగా పప్పుశనగతో పాటు వేరుశనగ 20 వేల హెక్టార్లు, మిగతా అన్ని పంటలు కలిపి మరో 30 వేల హెక్టార్ల వరకు సాగులోకి రావొచ్చని చెబుతున్నారు. రబీ సీజన్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో సాధారణ వర్షపాతం 139.3 మి.మీ నమోదు కావాల్సి ఉంటుంది. అందులో అక్టోబర్లోనే అత్యధికంగా 100.9 మి.మీ, నవంబర్లో 28.6 మి.మీ, డిసెంబర్లో 9.8 మి.మీ నమోదు కావాలి. ముందస్తు సాగుకు సిద్ధం.. ఖరీఫ్కు సంబంధించి జూన్, జూలైలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు విస్తీర్ణం తగ్గడంతో రబీలో ముందస్తు సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. నల్లరేగడి భూముల్లో పప్పుశనగతో పాటు మొక్కజొన్న, జొన్న తదితర పంటలు విత్తుకునేందుకు విత్తనం కోసం ఎదురుచూస్తున్నారు. అనంతపురం, ఆత్మకూరు, కూడేరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, బెళుగుప్ప, బొమ్మనహాళ్, కణేకల్లు, డీ.హిరేహాళ్, గుత్తి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, పామిడి, శింగనమల, యాడికి, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విపడనకల్లు, గుంత కల్లు మండలాల్లో విత్తన పంపిణీ చేపట్టాల్సి ఉంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు నెల రోజుల పాటు పప్పశనగ సాగుకు మంచి అదనుగా చెబుతున్నా... వర్షాలు వస్తే ముందుగానే సాగుకు రైతులు రెడీగా ఉన్నారు. కానీ కూటమి సర్కారు, వ్యవసాయశాఖ ఇప్పటికీ విత్తన పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టలేదు. గతేడాది 27,129 క్వింటాళ్ల విత్తన పప్పుశనగ కేటాయించగా... ఈ సారి 14 వేల క్వింటాళ్లకు కుదించారు. సబ్సిడీ కూడా 40 శాతం నుంచి 25 శాతానికి పరిమితం చేయడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. గత ఖరీఫ్, రబీ, ఈ ఖరీఫ్లో పంపిణీ చేసిన వేరుశనగ, పప్పుశనగ, కందులు, విత్తన వరి తదితర వాటికి సంబంధించి కూటమి సర్కారు ఏపీ సీడ్స్ ద్వారా ఏజెన్సీలకు బకాయిలు చెల్లించలేదు. దీంతో విత్తన సేకరణ, సరఫరా, పంపిణీ ఈ సారి జాప్యమయ్యే పరిస్థితి నెలకొంది. అలాగే ఏఓలు, ఆర్ఎస్కే అసిస్టెంట్లు నాన్సబ్సిడీ కింద రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ము పూర్తి స్థాయిలో ఏపీ సీడ్స్కు చెల్లించకపోవడం కూడా సమస్యగా మారిందని చెబుతున్నారు. ఇక.. అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు రబీ కింద నీటి వసతి సదుపాయం కలిగిన ప్రాంతాల్లో వేరుశనగ సాగుకు వీలుగా రాయితీ విత్తన పంపిణీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీజన్లో 1.20 లక్షల హెక్టార్లలో పంటల సాగు అంచనా ప్రధాన పంటగా 70 వేల హెక్టార్లలో పప్పుశనగ ఈశాన్యంతో 139.3 మి.మీ సాధారణ వర్షపాతం! -
పేదలపై భారం
రేషన్ కోసం చౌక దుకాణం వద్ద క్యూలో నిల్చున్న కార్డుదారులు (ఫైల్) అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో పేదలకు సంక్షేమం కనుమరుగవుతోంది. రేషన్లో ‘కోత’ కొనసాగుతోంది. కార్డుదారులకు సరుకులను ఒక్కొక్కటిగా దూరం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కందిపప్పు పంపిణీ నిలివేశారు. కాదు కాదు.. ఎగనామం పెట్టారు! పేదలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన జొన్నలు, రాగుల పంపిణీకి తాజాగా కూటమి సర్కారు మంగళం పాడింది. గత నెల వరకు జొన్నలను అరకొరగా స్టోర్లకు సరఫరా చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. అక్టోబరుకు సంబంధించి చౌక దుకాణాలకు జొన్నలు, రాగుల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. జిల్లావ్యాప్తంగా కార్డుదారులకు కిలో కందిపప్పు చొప్పున నెలసరి కోటా 615 టన్నులు, అదే విధంగా జొన్నలు 1,100 టన్నులు, రాగులు 1,100 టన్నులు కేటాయించాల్సి ఉన్నా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కందిపప్పు పంపిణీ చేయడం లేదు. మూడు నెలలుగా అరకొరగా జొన్నలు పంపిణీ చేస్తూ వచ్చిన ప్రభుత్వం నేడు పూర్తిగా ఎగనామం పెట్టేసింది. అదే బాటలో రాగుల పంపిణీని కూడా నిలిపివేసింది. ఇచ్చిందీ గతంలో కొనుగోలు చేసినవే..! కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా కందిపప్పు కిలో రూ.67తో అందించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అసలు కొత్తగా కందిపప్పు కొనుగోలు చేసేందే లేదు. గత ప్రభుత్వం కొనుగోలు చేసి నిల్వ చేసిన స్టాక్ ఉన్నంత వరకే కందిపప్పును పంపిణీ చేయడం గమనార్హం. ఏడు నెలలుగా అదే మాట.. రేషన్ కోతపై అధికారులు చెప్పే కారణాలు వింటే విస్తుపోవాల్సిందే. కందిపప్పు సరఫరాకు సంబంధించిన ప్రక్రియ ఇంకా టెండర్ దశలో ఉందని ఏడు నెలలుగా చెబుతుండడం చూస్తే సార్లూ ‘ఏమి సెప్తిరి’ అని ఎవరికైనా అనిపించకపోదు. జొన్నలు, రాగుల విషయానికి వస్తే స్టాక్ అయితే ఉందట.. కాకపోతే ఆన్లైన్లో సమస్య కారణంగా స్టోర్లకు సరఫరా చేయలేకున్నామని చెప్పడం గమనార్హం. కోతలు... వాతలు కనిపించవా? గత ప్రభుత్వ హయాంలో ప్రతినెలా నాణ్యమైన కందిపప్పు, జొన్నలు, రాగులు పంపిణీ చేశారు. అయినా కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేశారు. ఆ ‘పచ్చ’ కళ్లకు నేడు కోతలు.. వాతలు కనిపించడం లేదనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. కొనసాగుతున్న కూటమి కోతలు మొదట కందిపప్పు దూరం తాజాగా జొన్నలు, రాగుల పంపిణీకి మంగళం బియ్యం, చక్కెరతోనే సరి పేదలపై మోయలేని భారం కందిపప్పు, జొన్నలు, రాగులను ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో పేదలు బయటి మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతి కుటుంబం నెలకు ఒక కిలో కందిపప్పు, మూడు కిలోల జొన్నలు, ఒక కిలో రాగులు వినియోగిస్తారు. ప్రభుత్వం కిలో కందిపప్పు రూ.67, జొన్నలు, రాగులు మూడు కిలోలు ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కిలో రూ.130, జొన్నలు రకాన్ని బట్టి కిలో రూ.40 నుంచి రూ.60 వరకు, రాగులు కిలో రూ.50 వరకు పలుకుతున్నాయి. సర్కారు పంపిణీ చేయకపోవడంతో కార్డుదారులు మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. కిలో కంది పప్పుపై రూ.73 అదనంగా, మూడు కిలోల జొన్నలకు రూ.120 నుంచి రూ.180, రాగులకు కిలో రూ.50 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. -
2 నుంచి ప్రత్యేక రైళ్లు
● షోలాపూర్–ధర్మవరం, బీదర్–బెంగళూరు మార్గంలో.. గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. షోలాపూర్–ధర్మవరం, బీదర్–బెంగళూరు మార్గంలో రైళ్లు నడుస్తాయన్నారు. అక్టోబర్ 2 గురువారం రాత్రి 11.20 గంటలకు షోలాపూర్ జంక్షన్లో రైలు బయలుదేరి ధర్మవరం జంక్షన్కు శనివారం తెల్లవారుజూమున 3.30 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ధర్మవరం జంక్షన్ నుంచి (01438) అక్టోబర్ 4 శనివారం ఉదయం 6.30 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 10.30 గంటలకు షోలాపూర్కు చేరుకుంటుందన్నారు. బీదర్, వికారాబాద్, యాదగిరి, కృష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లి రోడ్డు, ములకలచెరువు, కదిరి రైల్వే స్టేషన్ల మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. బీదర్–బెంగళూరు మధ్య.. బీదర్–బెంగళూరు మధ్య అక్టోబర్ 4,5 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. బీదర్ జంక్షన్ (07063)లో అక్టోబర్ 4 శనివారం మధాహ్నం 2.40 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు రైలు బెంగళూరు చేరుతుందన్నారు. తిరిగి అక్కడి నుంచి అక్టోబర్ 5 ఆదివారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బీదర్ చేరుకుంటుందన్నారు. హమ్నాబాద్, కమలాపూర్, కలబురిగి, షాహబాద్, వాడీ, యాదగిరి, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, యలహంక సేష్టన్ల మీదుగా రైలు నడుస్తుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
ధర్మవరం వరకు ‘సూపర్ ఫాస్ట్’ పొడిగింపు
● సత్యసాయి జయంత్యుత్సవాల నేపథ్యంలో రైల్వే శాఖ నిర్ణయం కదిరి: గుంటూరు – తిరుపతి మధ్య నడుస్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు (17261)ను ధర్మవరం వరకూ పొడిగించారు. భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి (నవంబర్ 23)ని పురస్కరించుకొని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు అంటే రెండు నెలల పాటు ఈ రైలు ధర్మవరం వరకు నడుపుతారు. ఆ తర్వాత ఎప్పటి లాగానే తిరుపతి వరకూ వచ్చి ఆగిపోతుంది. రోజూ సాయంత్రం 4.30 గంటలకు రైలు గుంటూరులో బయలుదేరుతుంది. నరసరావుపేట, వినుకొండ, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లి, కోవెలకుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కమలాపురం, రాజంపేట మీదుగా ప్రయా ణించి తెల్లవారుజామున 3.55 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అక్కడి నుంచి 4.05 గంటలకు బయలుదేరి పాకాల, పీలేరు, కలికిరి, మదనపల్లి రోడ్, మొలకలచెరువు, కదిరి మీదుగా ఉదయం 9 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది. ధర్మవరంలో మధ్యాహ్నం 1.20కి బయలు దేరి తిరుగు ప్రయాణంలో సాయంత్రం 7.15కు తిరుపతి చేరుకుంటుంది. అక్కడ 10 నిమిషాలు మాత్రమే ఆగి.. తర్వాత బయలుదేరి మరుసటి దినం ఉదయం 7.20 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. ఈ రెండు నెలల పాటు రోజూ ఒక రైలు (17261) గుంటూరు లో సాయంత్రం 4.30కు బయలుదేరితే, ఇంకో రైలు (17262) ధర్మవరంలో మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరేలా రైల్వేశాఖ నిర్ణయించింది. -
పండుగ పూట పస్తులేనా?
‘మా ప్రభుత్వంలో మాకే ఎదురు తిరుగుతారా? అయితే వారికి జీతాలు ఆపేయండి’ అనే ధోరణితో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై కూటమి ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఫలితంగా తెలుగు పండుగల్లో అతిపెద్దదైన దసరా సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేక అంగన్వాడీ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండునెలలుగా జీతాలు లేకపోవడంతో మా ఇళ్లలో పండుగ కళ తప్పిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం సెంట్రల్/తాడిపత్రి రూరల్: అంగన్వాడీ టీచర్లకు పండుగ పూట కూడా పస్తులు తప్పడం లేదు. అగస్టు నెల గౌరవ వేతనం సెప్టెంబరు మొదటి వారంలో వారి బ్యాంకు ఖాతాల్లో పడాల్సి ఉండగా సెప్టెంబర్ నెల దాటినా అధికారులు వేయలేదు. జిల్లాలోని 13 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,302 అంగన్వాడీ కేంద్రాలు, 223 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దసరా పండగకు ఇక కేవలం ఒక రోజు మాత్రమే ఉంది. దసర సెలవుల పేరుతో ఇతర ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలు, బంధువుల రాకతో ఇళ్లు కళకళలాడుతున్నాయి. కొత్త దుస్తులు, పిండి వంటలు తదితరాలకు రూ.వేలల్లోనే ఖర్చు ఉంటోంది. అయితే రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో అంగన్వాడీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సెల్ఫోన్లు వెనక్కి ఇచ్చినందుకేనా? అగస్టు నెల జీతం రాకపోవడానికి అంగన్వాడీ టీచర్లు తమ వద్ద సెల్ఫోన్లను అధికారులకు వెనక్కు ఇవ్వడమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ఎప్పటికప్పుడు సెల్ఫోన్ ద్వారా యాప్లో నమోదు చేయాల్సి ఉంది. అయితే చాలా ఏళ్ల క్రితం మంజూరు చేసిన సెల్ఫోన్లు కావడంతో యాప్లో నమోదు ప్రక్రియ సకాలంలో జరగక అంగన్వాడీ సిబ్బంది ఇబ్బందులు పడుతూ వచ్చారు. పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లను గత ఆగస్టులో వెనక్కు ఇచ్చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం.. గత నెల 25న చర్చలకు ఆహ్వానించింది. ఓ యూనియన్ (ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న) సెల్ఫోన్ వినియోగించడానికి సమ్మతించిండంతో అందరూ కూడా సెల్పోన్లను తీసుకుని పనిచేయాలని హుకుం జారీ చేసింది. దీంతో ప్రభుత్వ వైఖరిని ప్రధాన సంఘాలు వ్యతిరేకించాయి. ఆన్లైన్లో మాత్రం నమోదు చేయబోమని మాన్యువల్గా చేస్తామని స్పష్టం చేశాయి. దీనిని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. జీతాలు నిలుపుదలతో అంగన్వాడీల మెడలు వంచే కుట్రకు తెరలేపింది. దీంతో ఆగస్టుతో పాటు సెప్టెంబర్ గడిచినా జీతాలు అందలేదు. 2,302జిల్లాలో అంగన్వాడీ సెంటర్లు 2,079అంగన్వాడీ వర్కర్లు222మినీ అంగన్వాడీ వర్కర్లు2,079అంగన్వాడీ హెల్పర్లువెంటనే జీతాలు మంజూరు చేయాలి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు గత రెండునెలలుగా జీతాలు పడలేదు. ప్రస్తుతం దసరా పండుగ వచ్చింది. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి ప్రస్తుతం తీవ్ర ఇబ్బందిగా మారింది. పండుగ సరుకులు, నూతన దుస్తులు కొనుగోలు చేయలేక చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు మంజూరు చేయాలి. – రమాదేవి, జిల్లా కార్యదర్శి ఏపీ అంగన్ వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీలకు అందని ఆగస్టు వేతనం ముగిసిన సెప్టెంబరు నెల సెల్ఫోన్లు తిరిగిచ్చేశారని ప్రభుత్వం కక్ష! దసరా పండుగ సమయంలో డబ్బు లేక అవస్థలు -
సమగ్ర శిక్షలోనూ అందని రెన్నెళ్ల జీతాలు
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వ నిర్వాకంతో సమగ్రశిక్ష పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అతి పెద్ద పండుగ చేసుకోలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 వేలమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, మెసెంజర్లు, మండల్ లెవెల్ అకౌంటెంట్లు, సీఆర్పీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, ఐఈఆర్పీలు, ఫిజియోథెరపిస్టులు, సైట్ ఇంజనీర్లు, ఆయాలు, డీపీఓ సిబ్బంది, కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులున్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం పేర్లతో వీరంతా తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు ప్రతి నెలా జీతం డబ్బులు అందితే గాని కుటుంబ పోషణ జరగదు. అలాంటిది రెండు నెలలుగా వీరికి జీతాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో హిందువుల అతిపెద్ద పండుగ కూడా వచ్చింది. పెద్దల సంగతి పక్కన పెట్టి కనీసం పిల్లలకు కొత్త దుస్తులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. పండుగ ముందు జీతాలు వస్తాయని ఎదురుచూసినా 30వ తేదీతో అది నిరాశగానే మిగిలింది. ఈ నేపథ్యంలో కొందరు వడ్డీకి అప్పులు చేయగా, మరికొందరు ఎంఈఓలు, హెచ్ఎంలు, టీచర్ల వద్ద నగదు బదిలీ తీసుకున్నారు. ఎన్నికల ముందేమో ఉద్యోగులందరికీ 1వ తేదీనే జీతాలు ఇస్తామన్న కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్టైం ఉద్యోగుల పట్ల పక్షపాతవైఖరిని అవలంభిస్తుండడం గమనార్హం. పస్తులు పెడుతున్నారు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల కోసం రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర ఫైనాన్స్ కంట్రోలర్ను కలిసి విన్నవించాం. పండుగలోపు రెన్నెళ్ల జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ వేయలేదు. పండుగ పూట ఉద్యోగులను పస్తులు పెడుతున్నారు. – కె .విజయ్, సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ -
తండ్రి స్ఫూర్తితో...
తాడిపత్రిలోని రెడ్డివారిపాలెంలో నివాసముంటున్న మనోహర్రెడ్డి భారత సైన్యంలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్ఫూర్తితో భారత సైన్యంలో చేరాలని కుమార్తె సాయిహరితరెడ్డి పరితపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. అయినా రాజీ పడకుండా ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ తొలిసారిగా అమ్మాయిలకు పైలెట్ శిక్షణ కోసం చేపట్టిన ఇంటర్వ్యూలకు హాజరైంది. ఇంటర్వ్యూలో ప్రతిభ చాటి పైలెట్ శిక్షణకు అర్హత సాధించిన సాయిహరిత రెడ్డిని అభినందిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని వ్యోమగామి కల్పనాచావ్లా తల్లి అందజేశారు. ప్రస్తుతం సాయి హరితారెడ్డి దక్షిణాఫ్రికాలో పైలెట్ శిక్షణ తీసుకుంటోంది. తన తండ్రిలా సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనేదే లక్ష్యమని ఆమె చెబుతోంది. -
లాభసాటి వ్యవసాయమే లక్ష్యం..
తాడిపత్రిలోని అంబాభవానీ వీధిలో నివాసముంటున్న వద్దిమోహన్ కుమార్తె భానురేఖ.. వ్యవసాయంపై మక్కువతో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా చదువులో ప్రతిభ కనబరుస్తూ ఇక్రిషాట్లో ఆరు నెలల ఇంటర్న్షిప్కు అర్హత సాధించింది. అనంతరం ఎమ్మెస్సీ చదివేందుకు జపాన్లోని మెక్స్ సంస్థ నిర్వహించిన పోటీ పరీక్షల్లో నెగ్గి ఆ దేశంలోని హోక్కాయిడో యూనివర్సిటీలో రూ.70 లక్షల ఉపకార వేతనంతో ఉచితంగా సీటు దక్కించుకుంది. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదిగి ఆధునిక వ్యవసాయంపై పరిశోధనలు చేసి, వాటి ఫలాలను రైతులకు చేరువ చేస్తానని భానురేఖ సగర్వంగా అంటున్నారు. -
ప్రతి రోగికి మెరుగైన సేవలందించాలి
● మంత్రి సత్యకుమార్ అనంతపురం మెడికల్: చికిత్స కోసం వచ్చే ప్రతి రోగికీ మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యాధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. సోమవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిర్వహించిన వరల్డ్ హార్ట్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, ప్రసంగించారు. గుండె జబ్బుల నివారణపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఎయిమ్స్లో కూడా లేని అత్యాధునిక పరికరాలు సూపర్ స్పెషాలిటీలో ఉన్నాయన్నారు. అనంతరం సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ చంద్రబోస్.. గుండె శస్త్రచికిత్సల్లో అందించిన సేవలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ద్వారా వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జీజీహెచ్ సూపరిండెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి కనువిప్పు కల్గిద్దాం
● వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు అనంతపురం కార్పొరేషన్: పేదింటి బిడ్డలకు వైద్య విద్యను వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేద్దామంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు పిలుపునిచ్చారు. జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలలను తీసుకువస్తే... కూటమి ప్రభుత్వం పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టనర్షిప్ కింద 66 ఏళ్ల పాటు నిర్వహించుకునేలా ప్రైవేట్ పరం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్వహించాలనే డిమాండ్తో మంగళవారం ఉదయం 11 గంటలకు అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీఓ సంఘం బలోపేతానికి చర్యలు అనంతపురం టవర్క్లాక్: ఏపీ ఎన్జీఓ సంఘాన్ని బలోపేతం చేసేలా చర్యలు చేపట్టినట్లు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎన్జీఓ హోంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. సంఘం బలంగా ఉన్నప్పుడే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం పది మందిని సభ్యులుగా చేయించాలన్నారు. సచ్చివాలయ ఉద్యోగులను కూడా సంఘంలోకి అహ్వానించాలన్నారు. కార్యక్రమంలో ఎన్జీఓ సంఘం ప్రతినిధులు మనోహర్రెడ్డి, శ్రీధర్, చంద్రశేఖర్, వెంకటేష్ బాబు, రమాదేవి, జమీలాబేగం, సుదర్శన్ శర్మ పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నం గార్లదిన్నె: రైలు కిందపడబోయిన యువకుడిని లోకో పైలెట్ సకాలంలో గుర్తించి, ప్రమాదం నుంచి కాపాడాడు. వివరాలు.. కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేష్కు గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. ఇటీవల భార్య గొడవపడి పుట్టింటికి చేరుకుంది. దీంతో వెంకటేష్ సోమవారం యర్రగుంట్లకు చేరుకుని భార్యను కాపురానికి రావాలని అభ్యర్థించాడు. ఆమె నిరాకరించడంతో జీవితంపై విరక్తి చెంది గార్లదిన్నెలోని డ్యాం రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ప్యాసింజర్ రైలు కిందపడబోయాడు. గమనించిన లోకో పైలెట్ రైలు వేగాన్ని నియంత్రించడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే వెంకటేష్ను పట్టాల పైనుంచి పక్కకు లాగేశారు. -
గందరగోళం మధ్య చిన్నారి మృతిపై విచారణ
ఉరవకొండ: ఈ నెల 25న ఉరవకొండ సీహెచ్సీలో వైద్యం అందక ఐదేళ్ల బాలుడు అహరోన్కుమార్ మృతిచెందిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ సోమవారం చేపట్టిన తీవ్ర గందరగోళం మధ్య సాగింది. కమిటీ సభ్యులు డీసీహెచ్ఎస్ డేవిడ్ సెల్వరాజ్, డీఎంహెచ్ఓ భ్రమరాంబిక దేవి, సర్వజనాస్పత్రి చిన్నపిల్లల విభాగం వైద్య నిపుణుడు డాక్టర్ లోక్నాథ్ల వేర్వేరుగా బాధ్యులైన వైద్యాధికారి డాక్టర్ ఇస్మాయిల్, స్టాఫ్నర్సు ప్రియాంకతో పాటు మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులను విచారణ చేశారు. నివేదికను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్కూ విన్నవించనున్నట్లు సభ్యులు తెలిపారు. డాక్టర్ చౌదరియే కారణం చిన్నారి మృతి అంశంపై విచారణ సాగుతుండగానే ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ చౌదరితో జైభీమ్పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామప్పనాయక్ తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. తొలుత బాలుడిని డాక్టర్ చౌదర తన ప్రైవేట్ క్లినిక్లో చేర్పించుకుని చికిత్స అందిస్తూ వచ్చారని, ఆరోగ్యం విషమించడంతో ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారంటూ మండిపడ్డారు. డాక్టర్ చౌదరి నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడంటూ ఆరోపించారు. దీంతో బాధ్యుడైన మరో డాక్టర్ డాక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. బాలుడి మృతికి తన పొరపాటు లేదని, పరిస్థితి విషమించిన తర్వాతనే ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారంటూ చెప్పబోగా, ఆయనపై బాధిత కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు. -
వైస్ ఎంపీపీ బైక్కు నిప్పు
కళ్యాణదుర్గం: బ్రహ్మసముద్రం మండల వైఎస్సార్సీపీ నేత, వైస్ ఎంపీపీ వెంకటేష్నాయక్కు చెందిన ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వివరాలు.. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లికి చెందిన వెంకటేష్నాయక్ ఆదివారం కళ్యాణదుర్గం మండలం కాపర్లపల్లి తండాకు వేరుశనగ కాయలు కొనుగోలు చేసేందుకు వచ్చాడు. సాయంత్రం వేరుశనగ బస్తాలను బొమ్మగానిపల్లి తండాకు తరలించేందుకు ఆటోలు అందుబాటులో లేకపోవడంతో అదే గ్రామంలో ఉంటున్న తన సోదరి ఇంట్లోనే ఉండిపోయాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కళ్యాణదుర్గం రూరల్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమస్యాత్మక రైలు మార్గాల్లో అప్రమత్తంగా ఉండాలి గుంతకల్లు: ప్రస్తుత కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక రైలు మార్గాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ రైల్వే అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాత్సవ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జోనల్ పరిధిలోని డీఆర్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. గుంతకల్లు నుంచి డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా, అడిషనల్ జనరల్ మేనేజర్ సత్యప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. వర్షాల సమయంలో రైలు కార్యకలాపాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వంతెనలు, సోరంగాలు, రోడ్డు అండ్ బ్రిడ్జిల వంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అప్రమత్త చర్యల్లో భాగంగా కంకర, సిమెంట్, బండరాళ్లు, ఇసుక, తదితరాలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ప్రయాణికుల భద్రత, రైలు కార్యకలాపాలకు ఎలాంటి అంటకాలు కలగకుండా గట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతపురం సబ్ రిజిస్ట్రార్గా ఇస్మాయిల్ అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అనంతపురం అర్బన్ (రామ్నగర్) ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా ఇస్మాయిల్ను నియమిస్తూ డీఐజీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. రామ్నగర్ జాయింట్ –2 సబ్ రిజిస్ట్రార్గా పని చేస్తున్న యూనస్ను తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్గా బదిలీ చేయడంతో ఆయన సోమవారం రిలీవ్ అయ్యారు. దీంతో అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఇస్మాయిల్ను ప్రధాన కారాలయం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు రోజుల్లో ఆయన సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలను సీకరించనున్నారు. తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్గా యూనస్ తాడిపత్రి టౌన్: స్థానిక సబ్ రిజస్ట్రార్గా యూనస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి డిప్యుటేషన్పై ఆయనను తాడిపత్రికి బదిలీ చేశారు. -
ఎట్టకేలకు ‘సమగ్ర’ సెక్టోరియల్స్ నియామకం
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్రశిక్ష కార్యాలయానికి సెక్టోరియల్ అధికారుల నియామకం పూర్తయింది. రాజకీయ గ్రహణం, అధికారుల అలసత్వం కారణంగా ఏడాదికిపైగా ఈ పోస్టులు ఖాళీగానే ఉంటూ వచ్చాయి. పర్యవేక్షణ లేక కుంటుపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాల దుస్థితిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ క్రమంలో నోటిఫికేషన్ ఇచ్చి, అందిన దరఖాస్తులను పరిశీలించి సీనియార్టీ జాబితా మేరకు ఇంటర్వ్యూలు చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేసి ఆమోదం కోసం రాష్ట్ర కార్యాలయానికి పంపారు. ఎక్కడా సమాచారం బయటపడకుండా ఈ ప్రక్రియ అంతా గోప్యంగా ఉంచారు. నెలన్నర దాటినా నియామక ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈనెల 23న ‘అటకెక్కిన విద్యాభివృద్ధి’ శీర్షికన ‘సాక్షి’లో మరో కథనం వెలువడింది. దీంతో రాష్ట్ర అధికారుల్లో చలనం వచ్చింది. జిల్లా అధికారులు పంపిన జాబితాకు ఆమోదం తెలుపుతూ ఐదుగురిని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నేడో, రేపో వీరు విధుల్లో చేరనున్నట్లు సమాచారం. -
పాలకుల్లో చలనం రావాలంటే ఉద్యమాలే శరణ్యం
● 7న తలపెట్టిన ‘చలో విజయవాడ – పోరుబాట’ విజయవంతం చేయండి ● ఫ్యాప్టో రాష్ట్ర కోచైర్మన్ హృదయరాజు అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్సనర్ల సమస్యల పరిష్కారంపై పాలకుల్లో కదలిక రావాలంటే ఉద్యమాలే శరణ్యమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కోచైర్మన్ హృదయరాజు అన్నారు. సోమవారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జరిగింది. పరిశీలకులుగా హాజరైన హృదయరాజు మాట్లాడుతూ.. ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి విద్యాశాఖలో 72, 73, 74 జీఓలు అమలు చేయాలన్నారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలన్నారు. కేంద్ర మెమో 57ను అమలుపరుస్తూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుండి విముక్తి కలిగించాలన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించి వెంటనే 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏలు, సంపాదిత సెలవు బిల్లులు విడుదల చేయాలన్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలన్నారు. డిమాండ్ల సాధనకు ఫ్యాప్టో ఆధ్వర్యంలో అక్టోబర్ 7న విజయవాడలో తలపెట్టిన ‘చలో విజయవాడ–పోరుబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఉండాలన్నారు. సమావేశంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఆర్. శ్రీనివాసనాయక్, సెక్రటరీ జనరల్ పురుషోత్తం, ఫ్యాప్టో జిల్లా సభ్య సంఘాల నాయకులు వెంకటేష్, రమణారెడ్డి, లింగమూర్తి, ఓబులేసు, లింగమయ్య, వెంకట రత్నం, రామాంజనేయులు, జయరామిరెడ్డి, అక్కులప్ప, రెహ్మాన్, సిరాజుద్దీన్, గోపాల్ రెడ్డి, జార్జ్, కులశేఖర రెడ్డి, వెంకటసుబ్బయ్య, మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. -
ఆర్డీటీని సమైక్యంగా కాపాడుకోవాలి
● కలెక్టర్ ఆనంద్కు ప్రజా సంఘాల నాయకుల వినతి అనంతపురం అర్బన్: పేదల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్న ఆర్డీటీ సంస్థను సమైక్యంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాసంఘాల అఖిలపక్ష కమిటీ నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన పరిష్కార వేదికలో కలెక్టర్ ఓ.ఆనంద్ను కలిసి వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెవెన్యూవల్ చేయని కారణంగా సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలు, పేదలకు అందిస్తున్న కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. ముఖ్యంగా వైద్య సేవలు అందక వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు చొరవ చూపి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలన్నారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ సాకేహరి, ఎమ్మార్పీఎస్ ఓబులేసు, ఐఎంఎం బాషా, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, బేడబుడగ జంగాల సంఘం అంజి, పుసల సంఘం మధు, ఆర్డీటీ మాజీ ఉద్యోగులు గోవిందు, చండ్రాయుడు, హెల్పింగ్ హ్యాండ్స్ షబ్బీర్, నజీర్, ఎరికల సంక్షేమ సంఘం ముసలన్న పాల్గొన్నారు. -
రూ.26 కోట్ల వ్యాపార లక్ష్యం సాధించాలి
● డీసీఎంఎస్ మహాజనసభలో చైర్మన్ నెట్టెం వెంకటేశులు అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పురోభివృద్ధితో పాటు రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని సొసైటీ చైర్మన్ నెట్టెం వెంకటేశులు అన్నారు. సోమవారం స్థానిక డీసీఎంఎస్ కార్యాలయ ఆవరణలో మహాజన సభ జరిగింది. డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ విజయభాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చైర్మన్తో పాటు డీసీసీబీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.24.71 కోట్లు వ్యాపార ప్రగతి సాధించామన్నారు. ఇందులో ప్రధానంగా ఎరువుల పంపిణీ ద్వారానే రూ.22.41 కోట్లకు పైగా సమకూరిందన్నారు. ఈ ఏడాది రూ.26 కోట్లు వ్యాపార ప్రగతిని సాధించడానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. మహాజనసభలో అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్ సత్యనారాయణరెడ్డి, అకౌంట్స్ అధికారి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. సాంకేతికతను రైతులకు చేరువ చేయండి ● ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ శారద కళ్యాణదుర్గం: నూతన సాంకేతికతను రైతులకు చేరువ చేసి, వ్యవసాయాన్ని సుసంపన్నం చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ ఆర్.శారద సూచించారు. కళ్యాణదుర్గం కేవీకేను సోమవారం ఆమె సందర్శించారు. కేవీకేలో ప్రయోగాత్మకంగా సాగు చేసిన వివిధ పంటలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు నూతన వంగడాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ జాన్సన్, కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ ఈ.చండ్రాయుడు, కేవీకే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
‘ఈ–క్రాప్’ నమోదు చేయాలంటూ వినూత్న నిరసన
విడపనకల్లు: తాము సాగు చేసిన పంటలకు ఈ క్రాప్ నమోదు చేయాలంటూ విడపనకల్లు మండలం హవళిగి గ్రామ సచివాలయం ఎదుట జాతీయ పతాకంతో రైతులు నిరసన తెలిపారు. పంటల నమోదు చేయాలంటూ పలుమార్లు వ్యవసాయాధికారి పెన్నయ్యను కోరినా ఆయన స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నమోదు ప్రక్రియ మంగళవారంతో ముగియనుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల నమోదు చేయాలంటూ అర్జీ ఇచ్చేందుకు వస్తే ‘ఈ–క్రాప్ చేయకపోతే ఏమవుతుంది.. ఈ ప్రభుత్వం మరికొన్ని రోజులు గడువు పెంచుతుందిలే’ అంటూ వ్యవసాయాధికారి విడ్డూరంగా మాట్లాడుతున్నారని వాపోయారు. అనంతరం సమస్యకు పరిష్కారం కోరుతూ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణకు అర్జీ అందజేశారు. రోజుల తరబడి అభ్యర్థించినా మండల వ్యవసాయాధికారి స్పందించ లేదంటూ ఆవేదన ఈ–క్రాప్ చేయకపోతే ఏమవుతుందంటూ ఏఓ విడ్డూరపు వ్యాఖ్యలు