Anantapur Latest News
-
అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్, స్ప్రింక్లర్లు అందిస్తామని ఘనంగా ప్రకటించిన చంద్రబాబు సర్కారు జిల్లాకు 41,200 హెక్టార్ల టార్గెట్ ఇచ్చి. చివరకు 17 వేల హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది. వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ పరిధిలో పథకాలకు సంబ
● పైసా విదల్చని కూటమి ప్రభుత్వం ● సుఖీభవ లేదు, ఇన్పుట్, ఇన్సూరెన్స్కు గతి లేదు, ఎక్స్గ్రేషియా అసలే లేదు ● పంటలు దెబ్బతిన్నా ఖరీఫ్, రబీలో కంటితుడుపుగా కరువు మండలాల ప్రకటన ● ఆర్బీకేలు, అగ్రి–వెటర్నరీ ల్యాబ్లు నిర్వీర్యం, ఆగిన 1962 అంబులెన్స్ సేవలు అన్నదాత సుఖీభవ కింద ఏటా ప్రతి రైతుకూ రూ.20 వేలు పెట్టుబడిసాయం అందిస్తామన్న హామీని కూటమి పెద్దలు తుంగలో తొక్కేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో రూ.6 వేలు రైతుల ఖాతాల్లోకి వేసింది. చంద్రబాబు చెప్పినట్లు సుఖీభవ పథకం కింద ఈ ఏడాది రూ.20 వేలు ఇచ్చివుంటే 2.90 లక్షల మంది వరకు రైతులకు రూ.580 కోట్లు జమ అయ్యేవి. పోనీ, పీఎం కిసాన్ రూ.6 వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.14 వేలు ఇచ్చివున్నా రూ.400 కోట్ల పైచిలుకు ప్రయోజనం చేకూరేది. అయితే పైసా ఇవ్వకుండా ఈ ఏడాది మొండి చెయ్యి చూపించారు. ● గతంలో 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏటా పీఎం కిసాన్, రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున ఐదేళ్లలో ఒక్కో రైతుకు రూ.67,500 చెల్లించింది. అలా ఐదేళ్లలో జిల్లా రైతులకు రూ.1,937 కోట్ల పెట్టుబడి సాయం అందింది. 2023 ఖరీఫ్, రబీకి సంబంధించి ఉచిత పంటల బీమా పథకం కింద ఇవ్వాల్సిన పరిహారంతో తమకు సంబంధం లేదన్నట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. 2024 ఖరీఫ్లో ఉచిత పంటల బీమా అమలు చేసినా... పరిహారం చెల్లింపు అనుమానంగానే కనిపిస్తోంది. ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసి రబీ నుంచి రైతుల నుంచి ప్రీమియం కట్టించుకోవడం మొదలు పెట్టారు. ఇలా ఇకపై ఏటా రూ.100 కోట్ల వరకు ప్రీమియం రూపంలో రైతులపై అదనపు భారం మోపారు. ● 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులపై ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా కింద ఏకంగా జిల్లా రైతులకు రూ.1,967 కోట్ల భారీ మొత్తంలో పరిహారం చెల్లించింది. తొలిసారిగా ఉద్యాన రైతులకు బీమా ఇచ్చి భరోసా కల్పించింది. ఇక ప్రీమియం రూపంలో ఏటా రూ.100 కోట్ల వరకు జిల్లా రైతులకు ఆదా అయ్యేలా చర్యలు తీసుకుంది. ఖరీఫ్, రబీ పంట ఉత్పత్తులు అరకొరగానే చేతికొచ్చాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో వ్యాపారులు, దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.350 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను మద్ధతు ధరతో కొనుగోలు చేసింది. ఖరీఫ్, రబీ కింద బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీ రాయితీపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఖరీఫ్, రబీ కింద బ్యాంకుల్లో రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు సున్నావడ్డీ కింద రూ.72 కోట్ల వరకు వడ్డీ మాఫీ చేయడంతో 3.40 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. విత్తనంపై రాయితీ తగ్గింపు కరువు పరిస్థితులు నెలకొన్నా ఈ రబీలో కేవలం 25 శాతం సబ్సిడీతో విత్తన పప్పుశనగ అందించడంతో జిల్లా రైతులపై రూ.6 కోట్ల వరకు అదనపు భారం పడింది. ఇక ఖరీఫ్లో విత్తన వేరుశనగ, కందులు నామమాత్రంగా అందించారు. 80 శాతం రాయితీతో ప్రత్యామ్నాయం అంటూ 27 వేల క్వింటాళ్లకు గానూ 10 వేల క్వింటాళ్లతో సరిపెట్టారు. ● గత జగన్ సర్కార్ 40 శాతం రాయితీతో రైతులకు విత్తనం అందించింది. ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని రకాలకు చెందిన 6.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలపై రైతులకు రూ.289 కోట్ల రాయితీ దక్కింది. దిక్కూమొక్కు లేని పంటల బీమా మద్ధతు ధర హుష్కాకి స్పష్టత లేని సున్నా వడ్డీ -
ఆర్డీటీ రక్షణ బాధ్యత సీఎం చంద్రబాబు తీసుకోవాలి
అనంతపురం కార్పొరేషన్: ఐదున్నర దశాబ్దాలుగా సేవలందిస్తున్న రూరల్ డెలవప్మెంట్ ట్రస్టు(ఆర్డీటీ) ఏపీ, తెలంగాణలోని అనేక గ్రామాలకు కల్పతరువని, అటువంటి ట్రస్టు మనుగడ కేంద్రం చర్యలతో ప్రమాదంలో పడిందని, లక్షలాది మంది పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న గొప్ప స్వచ్ఛంద సంస్థ రక్షణ బాధ్యతను సీఎం చంద్రబాబు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్డీటీ సంస్థకు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించి సేవలు సజావుగా సాగేలా చూడాలంటూ 1969 నుంచి ఆర్డీటీ అందిస్తున్న సేవలను గుర్తు చేస్తూ.. సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీకి అనంత లేఖ రాశారు. ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించకపోవడంతో ట్రస్టుపై ఆధారపడిన ఎంతో మంది జీవితాలు అగమ్యగోచరంగా మారే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. బార్సిలోనాలో జన్మించి, స్పానిష్ ఆర్మీలో సైనికుడిగా పని చేసిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మానవత్వానికి హద్దులు లేవన్న రీతిలో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు కృషి చేసి కరుణామయుడిగా పేరొందారని తెలిపారు. 2009లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కన్నుమూశాక..ఆయన సతీమణి అన్నేఫెర్రర్, కుమారుడు మాంఛో ఫెర్రర్ ఆర్డీటీ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారన్నారు. ఈ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 3,500 గ్రామాల ప్రజలు సేవలు పొందుతున్నారని, ఆర్థికంగా వెనుకబడిన 4.5 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు. మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, సమాజ ఆరోగ్య అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. జిల్లా మొదలుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ సంస్థల మన్ననలను ఆర్డీటీ పొందిందని గుర్తు చేశారు. అనంతపురం నగర శివారులో 32 ఎకరాల్లో ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్ను 2002లో ప్రారంభించి.. క్రికెట్, హాకీ, ఫుట్బాల్, అథ్లెటిక్స్, జూడో, టెన్నిస్ తదితర క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తోందన్నారు. 1,433 సప్లిమెంటరీ విద్యాలయాల ద్వారా 2,801 ప్రాజెక్ట్ గ్రామాల్లో విద్యను అందిస్తోందన్నారు. 8,112 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి.. ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోందన్నారు. ఇప్పటి వరకు వెనుకబడిన వర్గాల వారికి 84,971 ఇళ్ల నిర్మాణాలను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆర్డీటీ ఆస్పత్రిలో అన్ని వర్గాల ప్రజలకు ఆయువు పోశారన్నారు. ఆర్డీటీ ఆస్పత్రుల ద్వారా ఏటా 8.5 లక్షల మంది సేవలు పొందుతున్నారని తెలిపారు. విదేశీ నిధులే కీలకం ఆర్డీటీ మనుగడకు విదేశీ నిధులే కీలకమని, ఎఫ్సీఆర్ యాక్ట్ కింద అనుమతుల పునరుద్ధరణను నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో సంస్థ సేవలు ఒక్కొక్కటీ నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించే ఆర్డీటీ సెట్ను రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించిందని గుర్తు చేశారు. ఉపాధికి ఊతమిచ్చే శిక్షణ కార్యక్రమాలు, స్కాలర్షిప్ ప్రోగ్రాంలతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడే సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం లేకపోలేదన్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేంద్రం సైతం పేద ప్రజలకు అండగా నిలుస్తున్న ఆర్డీటీ పట్ల వ్యవహరించిన ధోరణి సరికాదని పేర్కొన్నారు. ఆర్డీటీకి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
ఆర్డీటీని కాపాడుకుందాం
అనంతపరం టవర్క్లాక్: నిరుపేదల జీవనోపాధుల కోసం విశేష కృషి చేస్తున్న ఆర్డీటీకి నిధులు రాకుండా కేంద్రంలోని కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోందని, ఇలాంటి తరుణంలో ఆర్డీటీని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ పిలుపునిచ్చారు. ఆర్డీటీని కాపాడుకుందామనే డిమాండ్పై అనంతపురంలోని పెన్షనర్స్ భవన్లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో రాంభూపాల్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్డీటీకు విదేశీ నిధులు రాకుండా అడ్డుపడిందన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. దీని వల్ల సంస్థ సేవలు నిలిచి పోయే పరిస్థితి వచ్చిందన్నారు. నిత్యం కరువు కాటకాలతో విలవిల్లాడుతున్న జిల్లాకు ఆర్డీటీ వరదాయినిగా నిలిచిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్డీటీకి నిధులు అందకపోతే నష్టపోయేది పేదలేనన్నారు. మతం పేరుతో బీజేపీ ఇలాంటి దురాగతాలకు పాల్పడడం తగదన్నారు. కులాలు, మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న సంస్థపై ఆంక్షలు సరికాదన్నారు. పేదలు ఐక్యతతో ఉద్యమాలు చేపట్టి ఆర్డీటీని కాపాడుకోవల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఈ పోరాటాలకు కుల, ప్రజాసంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంస్థ అందజేస్తున్న ఉచిత విద్యతో ఎందరో ఇంజినీర్లు, డాక్టర్లుగా జీవితంలో స్థిరపడ్డారన్నారు. తక్షణమే కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి ఆర్టీటీకి విదేశీ నిధులు అందేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులు గోవిందరాజులు, ఎస్.ఎం. బాషా, సాకే హరి, నెరమెట్ల ఎల్లన్న, ఓ.నల్లప్ప, కృష్ణమూర్తి, చంద్రశేఖర్ రెడ్డి, ఓబులేసు, రాహుల్, శివారెడ్డి, కేశవరెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాసులు, సాయికుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
బొమ్మనహాళ్: విద్యుత్ షాక్కు గురై ఓ కౌలు రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో నివాసముంటున్న శ్రీరామ్ (33)కు భార్య మహాలక్ష్మి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్న ఆయన.. అదే గ్రామ నివాసి రైతు ఆనందరెడ్డికి చెందిన ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వారం రోజుల క్రితం సజ్జ పంట సాగు చేశాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో వ్వవసాయానికి విద్యుత్ సరఫరా కావడంతో పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లి, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. నిరుపేద కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు కోరారు. -
‘వెటర్నరీ’ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖ అధికారుల సంఘం (వెటర్నరీ ఆఫీసర్స్ అసోసియేషన్) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక పశుశాఖ డీడీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు పార్థసారథిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రెడ్డిపల్లి శిక్షణా కేంద్రం ఏడీ డాక్టర్ వి.రామచంద్రారెడ్డిని ఎన్నుకోగా, కార్యదర్శిగా పి.మల్లేష్గౌడ్ (కొత్తచెరువు వీహెచ్, ఏడీ), కోశాధికారిగా డాక్టర్ జీఎస్ అమర్ (మడకశిర వీహెచ్, ఏడీ), ఉపాధ్యక్షురాలిగా డాక్టర్ ప్రసన్నబాయి (తలుపుల వీహెచ్, ఏడీ), జాయింట్ సెక్రటరీగా డాక్టర్ ఖదీర్బాషా (తాడిపత్రి వీహెచ్, ఏడీ) ఎన్నికయ్యారు. ఎన్నికై న నూతన కార్యవర్గ సభ్యులు రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
ఇరువర్గాల ఘర్షణ – పలువురికి తీవ్ర గాయాలు
గుత్తి: స్థానిక గాంధీ నగర్లో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... గాంధీనగర్లో నివాసముంటున్న సుబహాన్ ఇంట్లో ఆదివారం శారీ ఫంక్షన్ జరిగింది. ఆ సమయంలో సుబహాన్ వర్గానికి చెందిన కొందరు అకారణంగా లక్ష్మీనారాయణ వర్గాన్ని దూషించారనే కారణంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లు రువ్వుకున్నారు. కట్టెలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఘటనలో లక్ష్మీనారాయణ, నారాయణమ్మ, నబి, సుబహాన్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మూడు ఎద్దుల అపహరణ గుంతకల్లు రూరల్: మండలంలోని కసాపురం గ్రామ పంచాయతీ చెన్నప్ప కొట్టాల గ్రామంలో పొలంలో కట్టి ఉంచిన మూడు ఎద్దులను శనివారం రాత్రి దుండగులు అపహరించారు. గ్రామానికి చెందిన రైతులు వెంకటరమణ, అంజికుమార్ కొన్నేళ్లుగా గుంతకల్లులో నివాసం ఉంటున్నారు. చెన్నప్ప కొట్టాలలో ఉన్న తమ పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు రైతులు తమ ఎద్దులను పొలంలోనే కట్టి ఉంచేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి దుండగులు కట్టి ఉంచిన మూడు ఎద్దులను అపహరించుకెళ్లారు. ఆదివారం ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతులు ఎద్దులను ఎత్తుకెళ్లిన విషయాన్ని గుర్తించారు. మూడు ఎద్దుల ధర సుమారు రూ.1.5 లక్షల వరకూ ఉంటుందన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత రైతులు తెలిపారు. ఎద్దులబండి బోల్తా – రైతుకు గాయాలు గుత్తి రూరల్: మండలంలోని అనగానదొడ్డి గ్రామ శివారులో ఎద్దులు అదుపుతప్పడంతో బండి బోల్తా పడి రైతుకు గాయాలయ్యాయి. అనగానదొడ్డికి చెందిన రైతు సుంకన్న ఆదివారం తన పొలంలో వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎద్దులు బెదిరి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో బండి బోల్తా పడింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన సుంకన్నను తోటి రైతులు చికిత్స నిమిత్తం గుత్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కాలువ గట్టునూ వదల్లేదు!
బొమ్మనహాళ్: అక్రమ సంపాదన కోసం టీడీపీ నేతలు ఆయకట్టు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏకంగా తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) గట్టు నుంచే మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. కాలువ గట్టు పటిష్టంగా ఉండాలంటే మట్టే ఆధారం. ఇదే మట్టి అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. హెచ్చెల్సీ అధికారులతో కుమ్మకై ్కన అధికార టీడీపీ నేతలు పట్టపగలే కాలువ గట్టుపై మట్టి తవ్వుతూ రోజుకు సుమారు 200 ట్రాక్టర్ల ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. దీనివల్ల గట్టు బలహీనపడి హెచ్చెల్సీకి గండ్లు పడే ప్రమాదముందని, అదే జరిగితే వేలాది ఎకరాల ఆయకట్టు భూములు బీడు పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కణేకల్లు మండల నేత దందా కణేకల్లు మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు రెండు జేసీబీలు, 12 ట్రాక్టర్లను పెట్టి.. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు గ్రామ శివారులోని హెచ్చెల్సీ కాలువ గట్టు నుంచి ఎర్రమట్టిని దాదాపు పది రోజులుగా తరలిస్తున్నారు. కణేకల్లు మండలంలోని మీండ్లపల్లి–నాగేపల్లి మార్గంలో హెచ్చెల్సీ వద్ద జీప్ట్రాక్ వేసేందుకు ఈ మట్టిని తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే..కాలువ గట్టును 8 నుంచి 10 అడుగుల వరకు తవ్వుతుండడంతో పూర్తిగా బలహీనపడి.. నీరు వచ్చినప్పుడు గండి పడే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మట్టి దందా హెచ్చెల్సీ అధికారులకు తెలిసే జరుగుతున్నట్లు వారు చెబుతున్నారు. వేరే మట్టితో నింపుతాం మట్టి దందా విషయాన్ని హెచ్చెల్సీ డీఈఈ మద్దిలేటి దృష్టికి తీసుకెళ్లగా.. దర్గాహొన్నూరు గ్రామ శివారులోని హెచ్చెల్సీ గట్టుకు ఆనుకుని ఉన్న మట్టిని తరలించి.. అక్కడ వేరే మట్టితో నింపేస్తామని చెప్పారు. ఇకమీదట ఎవరైనా అక్రమంగా కాలువ గట్టు నుంచి మట్టిని తరలిస్తే చర్య లు తీసుకుంటామన్నారు. రెచ్చిపోతున్న టీడీపీ నేతలు హెచ్చెల్సీ గట్టు నుంచి యథేచ్ఛగా మట్టి తరలింపు -
ఫలితం లేని ‘పరీక్ష’
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. రాసిన పరీక్షలకు ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. వర్సిటీ పరీక్షల విభాగం అస్తవ్యస్తంగా మారడమే ఇందుకు నిదర్శనం. ఫలితాలు సకాలంలో విడుదల చేయకపోవడంతో పీజీ కోర్సులకు వెళ్లలేని పరిస్థితి. మరో వైపు ఉద్యోగం వచ్చిన విద్యార్థులు సైతం ఫలితాలు రాకపోవడంతో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 15 వేల మంది నిరీక్షణ.. ఎస్కేయూ పరిధిలో డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్, మెగా సప్లిమెంటరీ పరీక్షలు గతేడాది నవంబర్లో జరిగాయి. వీటితో పాటు ఐదో సెమిస్టర్ పరీక్షలు కూడా నిర్వహించారు. 2014 నుంచి 2024 వరకు డిగ్రీ, బీఈడీ, పీజీ చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఏడాది పరీక్షల విధానంలో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు సైతం మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. 1994 నుంచి ఫెయిల్ అయిన వారికి అవకాశం కల్పించారు. అయితే ఇప్పటి దాకా ఫలితాలు మాత్రం రాలేదు. ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. మొత్తం 18 వేల మంది విద్యార్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. వాస్తవానికి పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లో ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. పరీక్షల విభాగం ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఇక్కడ బాగా పనిచేసే సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేయడంతో సమస్య వచ్చిందంటున్నారు. ఫలితాల విడుదలకు కృషి చేస్తాం ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది వాస్తవమే. బాగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయకుండా ఉండాల్సింది. కనీసం సంబంధిత విభాగాధిపతుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఫలితాల విడుదలకు కృషి చేస్తాం. – జీవీ రమణ, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, ఎస్కేయూ డిగ్రీ పరీక్షలు నిర్వహించి ఐదు నెలలు పూర్తి నేటికీ ఫలితాలు ప్రకటించని వైనం -
మురికి కూపంగా మారుతోంది
ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి..పట్టణం మురికి కూపంగా మారుతోంది. ప్రధాన రహదారుల్లో మాత్రమే చెత్తను తొలగిస్తూ..శివారు కాలనీలను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. డ్రైనేజీల శుభ్రత గాలికొదిలేయడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికితోడు చెత్తా చెదారం పేరుకుపోతుండడంతో వ్యాధులు ముసిరే ప్రమాదముంది. – లక్ష్మి, గృహిణి, రాయదుర్గం -
పీఏబీఆర్లో తగ్గిన నీటిమట్టం
కూడేరు: ఇన్ఫ్లో లేక కూడేరు మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటి మట్టం తగ్గింది. ఆదివారం నాటికి రిజర్వాయర్లో 2.62 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. జలాశయం వద్ద ఏర్పాటైన అనంతపురం, శ్రీసత్యసాయి, ఉరవకొండ తాగునీటి ప్రాజెక్ట్లకు రోజుకు సుమారు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లీకేజీ, ఆవిరి రూపంలో సుమారు 60 క్యూసెక్కుల వరకు నీరు బయటకు వెళుతోంది. సాయి నామమే మధురం ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లా సత్యసాయి భక్తులు సత్యసాయి మహాసమాధి చెంత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆదివారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో బాలవికాస్, సత్యసాయియూత్ బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. -
హ్యాండ్బాల్ చాంపియన్ కర్నూలు
కదిరి అర్బన్: స్థానిక ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన 54వ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో కర్నూలు జట్టు చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఆదివారం టోర్నీ ముగిసింది. ప్రథమ స్థానం కర్నూలు, ద్వితీయ స్థానం పశ్చిమగోదావరి, తృతీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా జట్లు నిలిచాయి. విజేత జట్టుకు సీనియర్ హ్యాండ్బాల్ క్రీడాకారుడు ప్రసాద్ ట్రోఫీని ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మహేష్తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.ప్రశాంతంగా బీసీ గురుకులాల ప్రవేశ పరీక్షఅనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని మహాత్మా జ్యోతిబా బీసీ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఏడు కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 2,016 మంది విద్యార్థులకు గాను 1,757 మంది హాజరయ్యారు. కొనకొండ్ల కేంద్రంలో 600 మందికి 537 మంది, కుందుర్పిలో 300 మందికి 265, నార్పలలో 500 మందికి 460, గోనబావిలో 305 మందికి 251, డి.హీరేహాళ్లో 199 మందికి 156, అనంతపురంలో 77 మందికి 61, కళ్యాణదుర్గంలో 35 మందికి గాను 27 మంది విద్యార్థులు హాజరయ్యారని బీసీ గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ జోనాథన్ తెలిపారు. ఎంపికై న విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేస్తామన్నారు. ఆయా పాఠశాలల నోటీస్ బోర్డుల్లోనూ జాబితాలను ఉంచుతామన్నారు.చిరుతల సంచారం● గుడిబండ వాసుల ఆందోళనగుడిబండ: మండల కేంద్రంలో చిరుతల సంచారం మరోసారి కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం గ్రామానికి సమీపంలోని కొండపై చిరుతలు గుంపులుగా సంచరిస్తున్నట్లు ప్రజలు గుర్తించారు. చాలా కాలంగా కొండపై ఉన్న పొదల్లో చిరుతలు తిష్ట వేసి ఉన్నాయంటున్నారు. రాత్రి పూట నివాసాల వద్దకు వచ్చి పశువులు, మేకలు, గొర్రెలపై దాడి చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులకు చాలా రోజుల నుంచి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. కనీసం ఇప్పటికై నా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.వీడియో వైరల్ కేసులో నిందితుడికి రిమాండ్● మరో నలుగురిపై కేసు నమోదుపరిగి: మతపరమైన అంశంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన పరిగికి చెందిన ఓ యువకుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ రంగడు యాదవ్ తెలిపారు. తెలంగాణకు చెందిన ఓ యువతి కొన్ని రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన వీడియోపై సదరు యువకుడు మతపరమైన దూషణకు పాల్పడడమే కాకుండా యువతిని అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ శనివారం పరిగిలో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై పోలీసులు సకాలంలో స్పందించి ఈ అంశం వివాదం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో వీడియో వైరల్ చేసిన యువకుడిని అదుపులోకి తీసుకుని, ఆదివారం కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. అలాగే రెచ్చగొట్టేలా వీడియోను రూపొందించి వైరల్ చేసిన మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. -
పలు మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు అక్కడక్కడ వడగండ్ల వాన పడింది. రాయదుర్గంలో 35 మి.మీ, ఉరవకొండ 30, బెళుగుప్ప, బుక్కరాయసముద్రం, గుంతకల్లులో 20, కూడేరు, గార్లదిన్నె, గుత్తి, పెద్దపప్పూరు, అనంతపురంలో పది మి.మీ మేర వర్షపాతం నమోదైంది. వజ్రకరూరు, బొమ్మనహాళ్, పామిడి, రాప్తాడు, నార్పల, శింగనమల, కణేకల్లు తదితర మండలాల్లో వర్షం కురిసింది. గుమ్మఘట్ట మండలం రంగచేడు, గార్లదిన్నె మండలం పెనకచెర్ల, రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో టెంకాయ చెట్లపై పిడుగులు పడ్డాయి. పెనకచెర్లలో టెంకాయ చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగిన దృశ్యం -
రాజధాని పేరుతో రియల్ వ్యాపారం
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలవుతున్నా.. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటీ అమలు చేయకపోగా, రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సీఎం చంద్రబాబు తెరలేపారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనే రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఫలితంగా రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని అన్నారు. ఆదివారం ఆయన నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రాజధానికి 58 వేల ఎకరాలు అందుబాటులో ఉండగా.. మళ్లీ 44 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికే సేకరించిన భూమిలో అభివృద్ధి చేయలేదని, రైతులకు ప్లాట్లు కేటాయించలేదని, మళ్లీ ల్యాండ్ పూలింగ్, భూసేకరణ అంటున్నారని మండిపడ్డారు. గతంలో రాజధాని పేరుతో ప్రధాని మోదీ మట్టి, నీరు తెచ్చారని, ఇప్పుడు పునర్నిర్మాణం అంటూ మరో డ్రామాకు తెరలేపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే రూ.1.47 లక్షల కోట్లు అప్పులు చేయడం సంపద సృష్టి అవుతుందా బాబూ అని ప్రశ్నించారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధిని ఏమాత్రమూ పట్టించుకోలేదన్నారు. కేంద్రం కుట్రతో పోలవరం ఎత్తును 45.75 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తే నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పోలవరం ఎత్తు కుదిస్తున్నా మారు మాట్లాడకుండా పోలవరం–బనకచెర్ల అనుసంధానం పేరుతో మరోసారి మోసం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ పర్యటనలో పోలవరం ఎత్తు పెంచేందుకు ఒత్తిడి తీసుకురావాలన్నారు. బాబు పాలనలో రూ.99లకు క్వార్టర్ బాటిల్, 99 పైసలకే ఎకరా భూమి ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రూ.కోట్లు విలువైన భూమిని 99 పైసలకే ఇవ్వొచ్చని నిరూపించిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని విమర్శించారు. నోరా..? తాటిమట్టా? సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూటమి సర్కారు ఒక ప్రణాళికతో ముందుకెళ్లే పరిస్థితి ఏమాత్రమూ కన్పించడం లేదన్నారు. పింఛన్లు ఇస్తున్నామని గొప్పగా చెబుతున్నారని, వాస్తవానికి 11 నెలల కాలంలోనే మూడు లక్షలకు పైగా పింఛన్లలో కోతపెట్టారని తెలిపారు. మెగా డీఎస్సీ పేరుతో తొలి సంతకం చేసిన చంద్రబాబు ఇప్పుడు 16 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను వంచించారన్నారు. ఇవి కూడా వచ్చే విద్యా సంవత్సరానికి భర్తీ చేసే పరిస్థితి కన్పించడం లేదన్నారు. తల్లికి వందనం పేరిట ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని ఇంత కాలం వెల్లదీశారన్నారు. ఇటీవల చంద్రబాబు తల్లికి వందనం ఒక విడతలో ఇవ్వాలా, ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నామని చెప్పడం చూస్తే ఆయనది నోరా లేక తాటిమట్టా అని భావించాల్సి వస్తోందని అనంత మండిపడ్డారు. ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా రైతులకు రూ.20 వేలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. రైతుల ఆత్మహత్యలు, వలసలను ప్రోత్సహించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు ఏనాడైనా రైతాంగాన్ని ఆదుకునేందుకు ఒక్క సమీక్ష అయినా చేశారా అని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస రెడ్డి, అధికార ప్రతినిధి చింతకుంట మధు, నాయకులు కేశవరెడ్డి, కార్పొరేటర్ టీవీ చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ హామీలను విస్మరించారు పోలవరం ఎత్తుపై ప్రధాన మోదీని ఒప్పించాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
ఇంగ్లిష్ టీచర్ల పదోన్నతులు చేపట్టాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కోర్టు కేసులతో ఆగిపోయిన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పదోన్నతుల కేసులో కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వెంటనే పదోన్నతులు చేపట్టాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం డీఈఓ ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో నిలిచిపోయిన పీఎస్ హెచ్ఎం పోస్టులను వెంటనే పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ సర్వీసు రూల్స్, మున్సిపల్ సర్వీసు రూల్స్ వేరుగా ఉన్నందున ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆగిపోయిన మున్సిపల్ ఉపాధ్యాయుల ఇంగ్ల్లిష్ పదోన్నతులను చేపట్టాలన్నారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఉన్న లోపాలను సరి చేయాలన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, నాయకులు సూర్యుడు, చంద్రశేఖర్, ఫణి భూషణ్, సుగుమంచి సురేష్, కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు. -
బాధితులకు వైఎస్సార్సీపీ అండ
శింగనమల: కూటమి నాయకుల అక్రమాలు బయటపెడుతుంటే దాడులకు తెగబడుతున్నారని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని, వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి భరోసా కల్పించారు. వారం రోజుల క్రితం రఘునాథపురం గ్రామంలో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నేత అంజన్రెడ్డిపై దాడి చేసి గాయపరిచారు. శనివారం ఆలూరు సాంబశివారెడ్డి గ్రామానికి వెళ్లి అంజన్రెడ్డిని పరామర్శించారు. అనంతరం చిన్నజలాలపురం గ్రామంలో ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న హరినాథరెడ్డి తండ్రి ఆదిరెడ్డిని పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు బొమ్మన శ్రీరామిరెడ్డి, ఎన్వీ నారాయణ, గురుమూర్తిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, రామకృష్ణారెడ్డి, భాస్కర్, ఎల్ రాజు ఉన్నారు. పోక్సో కేసులో వ్యక్తి అరెస్ట్ తాడిపత్రిటౌన్: పోక్సో కేసులో తాడిపత్రి పోలీసులు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుగొండ గ్రామానికి చెందిన రామాంజనేయులను అరెస్ట్ చేశారు. వివరాలు... రామాంజనేయులు తాడిపత్రిలోని భగత్సింగ్నగర్కు చెందిన 17 ఏళ్ల బాలికతో ఇస్ట్రాగాంలో పరిచయమయ్యాడు. మాయమాటలతో ఆరు నెలల క్రితం బాలికను పెళ్లి చేసుకుని గర్భవతిని చేశాడు. నెల రోజులుగా బాలికను వేధింపులకు గురి చేస్తుండటంతో ఆమె తాడిపత్రిలోని తల్లిదండ్రులకు తెలియజేసింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఈనెల 5న రామాంజనేయులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేవారు. నిందితుడు శనివారం భగత్సింగ్ నగర్లో తిరుగుతుండటంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఊరెళ్తే .. జాగ్రత్తలు తప్పనిసరి ● ఎస్పీ జగదీశ్ అనంతపురం: వేసవి సెలవుల్లో ఊరికెళ్తున్నారా అయితే ముందస్తు జాగ్రత్తలు తప్పక పాటించాలంటున్నారు అనంతపురం ఎస్పీ జగదీశ్. అహర్నిశలు కష్టపడి సంపాదించిన సొమ్ము, విలువైన వస్తువులు దొంగల పాలు కాకుండా ఉండాలంటే తమ సూచనలు, సలహాలు పాటించాలని ఒక ప్రకటనలో కోరారు. ముఖ్యంగా ఇళ్లకు తాళం వేసి పెళ్లిళ్లు, విహార యాత్రలకు వెళ్లే వారు విలువైన వస్తువులను ఇళ్లల్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. ఒకవేళ లాకర్లు వద్దనుకుంటే బంధువులు లేదా తెలిసిన వారి ఇళ్లల్లో భద్రపరచుకోవాలని పేర్కొన్నారు. విలువైన వస్తువుల బ్యాగులు, సూట్ కేసులతో ప్రయాణాలు చేసేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. సెలవులు ముగించుకొని సొంత ఇళ్లకు చేరే వరకు పాలు, పెరుగు వేసే వారితో పాటు పేపర్ బాయ్లకు వద్దని చెప్పాలన్నారు. -
ఉద్యోగం రాదేమోనని యువకుడి బలవన్మరణం
పెద్దవడుగూరు: ఉద్యోగం రాదేమోనని ఆందోళనతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు..కాశేపల్లి గ్రామానికి చెందిన యాపర్ల చెన్నారెడ్డికి ఇద్దరు కుమారులుండగా పెద్దకుమారుడు ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. చిన్నకుమారుడు యాపర్ల సుదర్శన్రెడ్డి(22) కొన్ని నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఆర్మీ సెలక్షన్స్లో రన్నింగ్ పరీక్షలో ఎంపికయ్యాడు. అయినా తనకు ఉద్యోగం వస్తుందో రాదోనని మదనపడేవాడు. ఇదే విషయమై కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం గుత్తిఅనంతపురం వద్దనున్న సుంకులమ్మతల్లి ఆలయ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని భోరున విలపించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ఎస్ఆర్ఐటీకి ఇన్నోవేషన్ అవార్డు బుక్కరాయసముద్రం: ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా యాజమాన్యం పని చేస్తోందని ప్రిన్సిపాల్ డాక్టర్ బాలక్రిష్ణ పేర్కొన్నారు. కళాశాల ఇన్నోవేషన్ సెల్, క్యాంపస్లో వ్యవస్థాపకత, ఆవిష్కరణ, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడంలో చేసిన అత్యుత్తమ కృషికి 2025 ఇన్నోవేషన్ అవార్డును ఎస్ఆర్ఐటీ కళాశాల అందుకుందన్నారు. ఈ అవార్డును రెండు రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్, క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ కట్టా రామోహన్రావు నుంచి అందుకున్నామన్నారు. ఎస్ఆర్ఐటీ ఆవిష్కరణలు, స్టార్టప్లను పెంపొందించడంలో మెకానికల్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఆంజనేయుల కృషి, అంకితభావానికి ఈ అవార్డు నిదర్శనమన్నారు. అదే విధంగా గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్క్షాపులో కళాశాల మెకానికల్ ఇంజినీరింగ్ థర్డియర్ విద్యార్థి మహమ్మద్ ఇలియాస్ తన ఇన్నోవేషన్ ఇ–వాట్తో ఉత్తమ ఇన్నోవేషన్ అవార్డును అందుకున్నారన్నారు. అవార్డు రావడానికి కృషి చేసిన డాక్టర్ ఆంజనేయులను కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రంజిత్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సాయిచైతన్య కిశోర్ అభినందించారు. -
‘కేఎస్ఎన్’ హాస్టల్లో ఎలుకల సంచారం
అనంతపురం ఎడ్యుకేషన్: నగర శివారులోని కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో ఎలుకల సంచారం ఎక్కువైంది. ఈ క్రమంలో మూడురోజుల కిందట నిద్రిస్తున్న పలువురి విద్యార్థినులను కొరికి గాయాలు చేశాయి. అధ్యాపకులు హుటాహుటిన ఆ విద్యార్థినులను సర్వజన ఆస్పత్రికి పిలుచుకెళ్లి ఇంజెక్షన్లు వేయించారు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ప్రిన్సిపాల్ అత్యంత గోప్యంగా ఉంచారు. ఎట్టకేలకు విద్యార్థినుల బంధువుల ద్వారా వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న హాస్టల్ భవనంలో ఎలుకల బెడద అధికంగా ఉంటోందని విద్యార్థినులు వాపోతున్నారు. దీనికితోడు పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో ఎలుకలతో పాటు పందికొక్కులు సంచరిస్తున్నాయని చెబుతున్నారు. హాస్టల్ వార్డెన్తో పాటు హాస్టల్కు ఏమాత్రం సంబంధం లేని తిమ్మారెడ్డి అనే అధ్యాపకుడు విద్యార్థినులపై తిరగబడ్డారని బంధువులు వాపోతున్నారు. భద్రతా చర్యలు కల్పించడంలో విఫలమైన యాజమాన్యం నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలా ఎదురుదాడికి దిగడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినులపై ఎలుకలదాడి దారుణం కేఎస్ఎన్ బాలికల కళాశాల వసతిగృహంలో విద్యార్థినులను ఎలుకలు కొరకడం దారుణమని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మండిపడ్డారు. శనివారం వారు కళాశాలకు వెళ్లి బాధిత విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలోనూ ఈ కళాశాలలో ఆహార నాణ్యత సరిగా లేదని విద్యార్థినులు ఆందోళన చేశారన్నారు. ఈ ఘటన మరవకముందే విద్యార్థినులను ఎలుకలు కొరకడం దారుణమన్నారు. ఘటనపై మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ విద్యార్ధి విభాగం, మహిళా విభాగం నగర అధ్యక్షులు కై లాస్, చంద్రలేఖ, నాయకులు వెంకట్, రాహుల్ రెడ్డి, నవాజ్, బాలు, రాంభూపాల్ రెడ్డి, సూర్య, గంగ శివుడు, రాజు, సుధాకర్ పాల్గొన్నారు. విద్యార్థినులను కొరికిన ఎలుకలు మూడు రోజుల కిందట ఘటన గోప్యంగా ఉంచిన ప్రిన్సిపాల్ కళాశాల యాజమాన్యాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ విద్యార్థి, మహిళా విభాగం నేతలు -
జిల్లాలో విస్తృత తనిఖీలు
అనంతపురం: పెహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో జిల్లా అంతటా శనివారం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప్రత్యేక బృందాలు ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర జన సమ్మర్థం కలిగిన ప్రాంతాలు, హోటళ్లు, లాడ్జీల్లో సోదాలు నిర్వహించాయి. సరిహద్దు ప్రాంతాల్లోనూ ముమ్మర తనిఖీలు చేపట్టారు. పార్శిల్ కార్యాలయాలను సైతం విస్తృతంగా తనిఖీ చేశారు. గుంతకల్లు: స్థానిక రైల్వేస్టేషన్లో శనివారం వన్ టౌన్ సీఐ మనోహర్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎఆర్ హెడ్ క్వార్టర్ నుంచి ప్రత్యేక టీమ్తోపాటు డాగ్ స్కాడ్తో స్టేషన్లోని అన్ని ప్లాట్ఫారమ్లతోపాటు ప్రయాణికుల రెస్ట్రూములు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులకు చెందిన బ్యాగులను తనిఖీ చేశారు. గంజాయి, అక్రమ మద్యం రవాణా జరగకుండా గట్టి చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. తాడిపత్రిటౌన్: పట్టణంలోని ఆర్డీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్లలో శనివారం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ పార్సిల్ సర్వీస్లలో వచ్చిన పార్సిల్ బాక్స్లను జాగిలాలతో సోదాలు చేయించారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు. సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ ఖాజాబాషా, సిబ్బంది పాల్గొన్నారు. -
మే 20న ఎల్ఐసీ ఉద్యోగుల సమ్మె
● అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు సతీష్ అనంతపురం అగ్రికల్చర్: ఎల్ఐసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల మే 20న సమ్మెలోకి వెళుతున్నట్లు ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పి.సతీష్ తెలిపారు. శనివారం స్థానిక బళ్లారిరోడ్డులో ఉన్న ఎల్ఐసీ బ్రాంచి–2 కార్యాలయంలో డివిజన్ ఉపాధ్యక్షుడు సూరిబాబు అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో సతీష్ హాజరై మాట్లాడారు. కోట్లాది మంది ప్రజలకు విశేష సేవలందిస్తున్న ఎల్ఐసీని బలహీన పరిచే కుట్ర జరుగుతోందన్నారు. ఎల్ఐసీలోకి విదేశీ పెట్టుబడులు వద్దని డిమాండ్ చేశారు. అందరికీ పెన్షన్, పెన్షన్ అప్డేషన్, స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలవెన్సుల పట్ల విపక్ష చూపుతున్నారని, నూతన రిక్రూమెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించాలన్నారు. అనేక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మే 20న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. యూనియన్ నాయకులు ఎ.రఘునాథరెడ్డి, అక్బర్బాషా, శ్రీనివాసులు, నాగరాజు, మధుసూదన్రెడ్డి, గాయిత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాప సూచకంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. -
యూటీఎఫ్ నేత నాగేంద్రబాబు మృతి
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా ఉపాధ్యాయ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నేత, రిటైర్డ్ పీఎస్హెచ్ఎం సీకే నాగేంద్రబాబు (64) శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితయ్యాడు. మంచంపై ఉంటూనే ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం స్పందించే వారు. సోషల్ మీడియా వేదిక ద్వారా ఆయన స్పందిస్తున్న తీరును చూసిన చాలామంది ఉపాధ్యాయులు...నాగేంద్రబాబు బాగా ఆరోగ్యంగానే ఉన్నాడని భావించేవారు. ఆయన మృతి సమాచారం తెలియగానే ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. కల్మషం లేని వ్యక్తిత్వం, నిజాయతీ, నిస్వార్థ నాయకుడు, నిరాడంబరమైన జీవనం, సంఘం పట్ల ఆయన నిబద్ధత, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆయన కేటాయించిన సమయం వెలకట్టలేనిదని ఉపాధ్యాయులు గుర్తు చేసుకుంటున్నారు. యూటీఎఫ్ ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షునిగా కొంతకాలం చేసి, కీలకమైన జిల్లా అధ్యక్షునిగా 5 సార్లు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా 6 సార్లు, రాష్ట్ర కార్యదర్శిగా 5 సార్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా 5 సార్లు ఇలా దాదాపు 30 ఏళ్లపాటు యూటీఎఫ్ కోసం పనిచేశారు. శనివారం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి, ఉమ్మడి జిల్లా నాయకులు లింగమయ్య, గోవిందరాజులు, సుధాకర్, కోటేశ్వరప్ప, రమణయ్య, రామప్ప, సుబ్బరాయుడు, శేఖర్, మహమ్మద్ జిలాన్, శ్రీనివాసులు నాయుడు, నాగరాజు, హెండ్రీ, బీకే నారాయణ తదితరులు నాగేంద్రబాబు భౌతికకాయానికి నివాళులర్పించారు. -
భానుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. వడగాల్పులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే భయపడుతున్నారు
శనివారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా కనిపిస్తున్న అనంతపురంలోని టవర్ క్లాక్ ప్రాంతం సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో భానుడు భగ భగ మండిపోతున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. ఏప్రిల్ మొదటి వారంలో 40 డిగ్రీల లోపు ఉన్న ఉష్ణోగ్రతలు తాజాగా 42 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ వేడిమికి తాళలేక జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పట్టణాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పల్లెటూళ్లలో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఎండదెబ్బకు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లి ఇప్పటికే ఓ వ్యక్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వడదెబ్బ కేసులు పెరుగుతున్నట్లు ఆస్పత్రుల రికార్డులు వెల్లడిస్తున్నాయి. 45 డిగ్రీలు దాటే అవకాశం గత ఏడాది ఇదే సమయానికి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఈసారి మాత్రం అప్పుడే 42 డిగ్రీలు నమోదైంది. రానున్న నెలన్నర రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మే రెండో వారం నుంచి ఎండ తీవ్రత మరింతగా ఉంటుందని, వడదెబ్బ ప్రభావం తారస్థాయికి చేరుకుంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు వృద్ధులు, బాలింతలు, చిన్నారులు మధ్యాహ్నం పూట బయటకు రావద్దని, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందని వాళ్లు కూడా ఎండల్లో తిరగకూడదంటున్నారు. భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు ● ఏప్రిల్లోనే 42 డిగ్రీలను దాటుతున్న వైనం ● మేలో 45 డిగ్రీల వరకూ వెళ్లే అవకాశం ఉందంటున్న శాస్త్రవేత్తలు ● వృద్ధులు, బాలింతలు, చిన్నారులు బయటకు రావద్దంటున్న వైద్యులు ఈసారి ఎండలు ఎక్కువే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండ తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది. మేలో 45 డిగ్రీల వరకూ నమోదు కావచ్చు. మిగతా జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉక్కపోత (హ్యుమిడిటీ) తక్కువ. ఈ ఏడాది కాస్త ముందస్తు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. – విజయశేఖర్, సైంటిస్ట్, రేకులకుంట వాతావరణ కేంద్రం వడదెబ్బ లక్షణాలు విపరీతమైన తలనొప్పి, వాంతికి వచ్చినట్లు ఉండటం నాలుక తడి ఆరిపోయినట్లు ఉండటం శరీర ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరగడం శరీరం బాగా అలసిపోయినట్లు ఉండటం మాట తడబడుతున్నట్లు ఉండటం ఒక్కోసారి కండరాలు పట్టేసినట్టు అనిపించడం వెంటనే నీరసం వచ్చేసి ఎక్కడైనా వాలిపోవాలనిపించడం శరీరం తిమ్మిరిగా అనిపించడం -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
అనంతపురం కార్పొరేషన్: ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలని, అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ నగరపాలక సంస్థ సిబ్బందికి సూచించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పారిశుధ్యం మెరుగుకు సంబంధించి నగరపాలక సంస్థ, మునిసిపల్ కమిషనర్లకు కలెక్టర్ పలు సూచనలు, సలహాలిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్యం మెరుగు, తాగునీటి సరఫరా, వీధి లైట్లు తదితర ప్రజా అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వాటిని పక్కాగా అమలు చేయాల్సిందేనన్నారు. ప్రధానంగా నగర పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అందరూ సమష్టిగా పని చేయాలని, పారిశుధ్య కార్మికులను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ల పదోన్నతులకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలన్నారు. డ్రైవర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఇసుక నిల్వ చేయాలి అనంతపురం అర్బన్:వర్షాకాలం నాటికి ఇసుక నిల్వలు 70 వేల టన్నులు ఉంచాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి అధికారులతో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. -
ముంచుకొస్తున్న గడువు
అనంతపురం అర్బన్: సంక్షేమానికి కోతపెట్టేందుకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గాలు పేదల పాలిట శాపంగా మారాయి. తాజాగా బియ్యం పంపిణీలో కోత పెట్టేందుకు ఈ–కేవైసీ పేరుతో మెలిక పెట్టింది. ఈనెల 30 వ తేదీలోగా రేషన్ కార్డులోని సభ్యులు ఈ–కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక వేళ ఎవరైనా ఈ–కేవైసీ చేసుకోకపోతే మే నెలలో రేషన్ అందించబోమని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఈనెల 23న గుంతకల్లు ఆర్డీఓ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే ఈ–కేవైసీ చేసుకోని యూనిట్లను మే నెలలో తొలగిస్తామని అనంతపురం రూరల్ తహసీల్దార్ ఈనెల 17న ప్రకటన విడుదల చేశారు. ఈ–కేవైసీ నమోదు గడువు ఈనెల 30తో ముగుస్తోంది. అయితే నేటికీ జిల్లా వ్యాప్తంగా 1.32 లక్షల మంది కార్డులోని సభ్యులు ఈ–కేవైసీ నమోదు చేసుకోలేదు. దీంతో వీరందరికీ మే నెలలో బియ్యం పంపిణీ నిలిచిపోనుంది. 1.32 లక్షల మందికి బియ్యం కట్ జిల్లావ్యాప్తంగా 6,60,330 బియ్యం కార్డులు ఉండగా వీటిలో 20,11,076 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఈనెల 25 తేదీ వరకూ 1,32,401 మంది ఈ–కేవైసీ చేసుకోలేదు. అధికారులు ప్రకటించిన విధంగా మే నెలలో ఈ–కేవైసీ చేసుకోని వారికి రేషన్ అందదు. యూనిట్ (సభ్యుడు)కు 5 కిలోలుగా 1.32 లక్షల మందికి సంబంధించి 6.62 లక్షల కిలోలు (662 టన్నులు) బియ్యం పంపిణీ కావు. ఒకవేళ ఈ–కేవైసీ నమోదు గడువును ప్రభుత్వం పెంచితే యూనిట్లు రద్దు కాకుండా ఉంటాయి. లేదంటే మే నెలలో యూనిట్లను రద్దు చేస్తారు. రేషన్ లబ్ధిదారులు ఈ–కేవైసీ చేయించుకునేందుకు ఈ నెల 30 ఆఖరు నేటికీ చేయించుకోని 1.32 లక్షల మంది రేషన్ నిలిపివేస్తామంటున్న అధికారులు -
ఉన్నతస్థాయికి చేరుకోవాలి
అనంతపురం అర్బన్: బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ వి.వినోద్కుమార్ సూచించారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అభినందించారు. శనివారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ, కేజీబీవీ, ఎస్సీ సంక్షేమ శాఖల తరఫున 48 మంది విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రం, మెమొంటో ప్రదానం చేసి సన్మానించారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అనంత ఆణిముత్యాలు ద్వారా ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈఓ ప్రసాద్బాబు తదితరులు పాల్గొన్నారు. నెట్టికంటుడి సేవలో హైకోర్టు జడ్జి గుంతకల్లు రూరల్: రాష్ట్ర హైకోర్టు జడ్జి హరిహరనందశర్మ శనివారం రాత్రి కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు స్వామివారి ఫొటో, శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. న్యూస్రీల్ -
జోధ్పూర్ తరహాలో మొక్కల పెంపకం
● ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ షణ్ముఖకుమార్ బొమ్మనహాళ్/కణేకల్లు: ‘రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ ప్రాంతంలో సున్నితమైన ఇసుకలో అత్యంత తక్కువ సామర్థ్యం నీటితో అక్కడి రైతులు పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఆ తరహాలోనే బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లోని ఇసుక దిబ్బల్లో పండ్ల మొక్కలు పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తాం’ అని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ వై.వి.కే షణ్ముఖ కుమార్ అన్నారు. శుక్రవారం బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లోని దర్గాహొన్నూరు, మాల్యం, నాగేపల్లి, తుంబిగనూరు గ్రామాల్లో షణ్ముఖ కుమార్, అడిషనల్ కమిషనర్ కమిషనర్ శివప్రసాద్, చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి గోపీ చంద్, అనంతపురం డ్వామా పీడీ సలీమ్బాషా, ఎంపీడీఓ విజయభాస్కర్, ఈఓపీఆర్డీ దాస్, ఏఓ సాయికుమార్ పర్యటించారు. ఇటీవల జోధ్పూర్ ప్రాంతంలో రాష్ట్ర కమిటీ పర్యటించి అధ్యయనం చేసిందని డైరెక్టర్ షణ్ముఖకుమార్ తెలిపారు. ఇసుక దిబ్బల్లో పర్యటిస్తూ కొందరు రైతులు సాగు చేసిన పండ్ల మొక్కలను పరిశీలించి రైతులతోనూ మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఇసుక దిబ్బల్లో ఏఏ పంటలు సాగుకు అనువైనవి అనే విషయంపై పరిశీలన చేసి ఈ ఏడాది నుంచే రైతులకు పండ్ల మొక్కల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి ఉపాధి పథకం ద్వారా మొక్కలు అందిస్తామని, ఎక్కువ భూములు ఉన్న రైతుల వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. -
పోలీసులను పరుగులు పెట్టించిన సెల్ఫీ వీడియో
తాడిపత్రి టౌన్: స్థానిక పోలీసులను శుక్రవారం ఓ సెల్ఫీ వీడియో పరుగులు పెట్టించింది. తాడిపత్రిలోని జయనగర్ కాలనీకి చెందిన విశ్వనాథ్కు వైఎస్సార్ జిల్లా వీరపునాయనిపల్లి మండలం అలివేలు ఓబాయపల్లెకి చెందిన హరిణితో వివాహమైంది. ఈ నేపథ్యంలో భార్య హరిణి, ఆమె తల్లి గంగమ్మ, అలివేలు ఓబాయపల్లెకి చెందిన గ్రామ పెద్దలు కొంత కాలంగా తనను వేధింపులకు గురి చేస్తున్నారని, దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విశ్వనాథ్ శుక్రవారం ఉదయం ఓ సెల్ఫీ వీడియో తీసి కుటుంబసభ్యులకు, సచివాలయ పోలీసులకు పంపాడు. సెల్ఫీ వీడియో చూడగానే హరిణి,తల్లి గంగమ్మను పిలుచుకుని పట్టణ సీఐ సాయి ప్రసాద్ను సచివాలయ పోలీసు లత కలసి సమస్య వివరించారు. వీడియోను పరిశీలించిన పోలీసులు ఆటో నగర్ సమీపంలో చిత్రీకరించినట్లు నిర్ధారించుకుని బృందాలుగా విడిపోయి విశ్వనాథ్ కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో చివరకు అతని సెల్ఫోన్కు కాల్ చేయడంతో సమాధానమిచ్చాడు. స్టేషన్కు వస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. -
పీఆర్సీ ఏర్పాటు చేయాలి
గుత్తి: పీఆర్సీ ఏర్పాటుతో పాటు ఐఆర్ను వెంటనే మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. గుత్తిలోని పద్మవాణి ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. 30 శాతం ఐఆర్ను తక్షణమే ప్రకటించాలన్నారు. ఆర్థిక బకాయిలు రూ.30 వేల కోట్లకు గాను కేవలం రూ.7,300 కోట్లు మంజూరు చేయడం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చునన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యుడు, కె.చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ... జీఓ 117ను వెంటనే రద్దు చేయాలన్నారు. అలాగే 72, 73, 74 జీఓల అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ఇన్చార్జ్ నాగరాజు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, గుత్తి ఎంఈఓలు రవినాయక్, మనోహర్, ఎస్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆసీఫ్, బసవరాజు, సీనియర్ నాయకులు శివ శంకర్, సత్య, జోగి శీన, పద్మవాణి బాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ గుత్తిలో ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం -
‘ఖరీఫ్’కు సిద్ధంకండి
● వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశం అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు సంబంధించి కీలకమైన ఖరీఫ్ జూన్ నుంచి మొదలు కానుండటంతో క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో అనంతపురం డివిజన్ ఏడీఏ ఎం.రవితో కలిసి ఆరు మండలాల ఏఓలు, ఏఈఓలు, ఆర్ఎస్కే అసిస్టెంట్లతో ఖరీఫ్ పంటల సాగుపై సమీక్షించారు. జూన్ నుంచి ఖరీఫ్ మొదలవుతున్నా... ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రక్రియపై దృష్టి సారించాలన్నారు. ఆర్ఎస్కే వేదికగా పంపిణీ సజావుగా జరగాలన్నారు. విత్తన నాణ్యతపై దృష్టి సారించాలన్నారు. అలాగే ఎరువుల సమస్య లేకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలకు సంబంధించి టార్గెట్లు వచ్చాయని, వేసవిలోనే పొలాలకు వెళ్లి మట్టి నమూనాలు సేకరించి పంపాలని ఆదేశించారు. ఫార్మర్ రిజిష్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి రైతులను ప్రోత్సహించాలన్నారు. విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా నాన్సబ్సిడీ బకాయిలు లేకుండా వెంటనే చెల్లించాలని ఆదేశించారు. సమావేశంలో ఏఓలు జె.శశికళ, పి.సోమశేఖర్, శ్యాంసుందరరెడ్డి, సుచరిత, విజయకుమార్ పాల్గొన్నారు. -
న్యాక్ దక్కేనా! ప్రతిష్ట నిలిచేనా?
●నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ పరీక్షకు సిద్ధమైన ఎస్కేయూన్యాక్ పాయింట్లు పొందేందుకు మౌలిక సదుపాయాల కల్పన ప్రధానం. గత ప్రభుత్వం హయాంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్లోని లా విభాగం నుంచి క్యాంటీన్, పూలే భవనం, కామెన్ మెస్ హాల్ వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇందు కోసం రూ.2.31 కోట్లు వెచ్చించారు. ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండరైజేషన్) గుర్తింపు తీసుకొచ్చారు. క్వాలిటీ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్, గ్రీన్ ఆడిట్ విభాగాల్లో ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది. ఐఎస్ఓ గుర్తింపుతో న్యాక్లో పాయింట్లు పెరగనున్నాయి. అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) పరీక్షకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే న్యాక్ గుర్తింపునకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో మెరుగైన పాయింట్లను సాధించే దిశగా వర్సిటీ ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. న్యాక్లో గణనీయమైన గ్రేడింగ్ వస్తే పీఎంఉషా (ప్రధాన మంత్రి ఉచ్ఛతార్ శిక్షా అభియాన్) పథకం కింద ఇబ్బడి ముబ్బడిగా నిధులు రానున్నాయి. ఏ ప్లస్, ఏ గ్రేడ్ వస్తే రూ.40 కోట్ల నిధులు మంజూరవుతాయి. ఐదు సంవత్సరాల కాలానికి ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు దోహదపడతాయి. సెల్ఫ్ స్టడీ నివేదికే ప్రామాణికం ఎస్ఎస్ఆర్ (సెల్ఫ్ స్టడీ రిపోర్ట్)లో పేర్కొన్న అంశాలను ప్రధానంగా న్యాక్ పీర్ కమిటీ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఆర్లో పేర్కొన్న అంశాల ప్రాధాన్యత వివరాల సేకరణలో అధికారులు తలమునకలయ్యారు. 2017–18, 2018–19, 2019–20, 2020–21, 2021–22 విద్యా సంవత్సరాల్లో ఆయా విభాగాల్లో సాధించిన ప్రగతి, కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల వివరాలు, వారికి దక్కిన ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్ వివరాలు, ఉపకార వేతనాలు, క్యాంపస్లో సౌకర్యాలు, హాస్టల్, ఆస్పత్రి సౌకర్యం, యాంటిర్యాగింగ్ కమిటీ, బొటానికల్ గార్డెన్, హరితవనం తదితర అంశాలను ఎస్ఎస్ఆర్లో పొందుపరుస్తున్నారు. అలాగే రూసా, డీఎస్టీ, డీబీటీ నుంచి పొందిన నిధుల వివరాలు, ప్రాజెక్ట్ వివరాలను నమోదు చేస్తున్నారు. వేధిస్తున్న ప్రతికూల అంశాలు ఎస్కేయూ క్యాంపస్ కళాశాలలో మొత్తం 268 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండాల్సి ఉండగా, కేవలం 45 మంది మాత్రమే పనిచేస్తున్నారు. టీచింగ్ అసిస్టెంట్లు, అకడమిక్ కన్సెల్టెంట్లతోనే ఇప్పటి వరకూ నెట్టుకొస్తున్నారు. హిస్టరీ, హిందీ, అడల్ట్ ఎడ్యుకేషన్, పాలిమర్ సైన్సెస్ విభాగాల్లో రెగ్యులర్ బోధనా సిబ్బంది ఒక్కరూ కూడా లేరు. ఇంగ్లిష్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్సెస్, లా కోర్సులకు సంబంధించి ఒక్కొక్క ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. కెమిస్ట్రీ, కామర్స్, మేథమేటిక్స్, బొటనీ, సెరికల్చర్, బయో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, తదితర విభాగాల్లో అధ్యాపకుల కొరత నెలకొంది. న్యాక్ గుర్తింపులో అధ్యాపకుల అంశానికి సంబంధించి 200 మార్కులు ఉంటాయి. దీంతో ఈ అంశం కాస్త న్యాక్ గ్రేడింగ్లో ప్రతికూలంగా చూపే అవకాశం ఉంది. ఈ మార్కులు సాధించాలంటే కనీసం టీచింగ్ అసిస్టెంట్ల నియామకమయినా పూర్తి స్థాయిలో చేయాల్సి ఉంటుంది. మరో వైపు పీజీ కోర్సుల్లో ఏటా ప్రవేశాలు తగ్గుతూ వస్తున్నాయి. అన్ని కోర్సుల్లో కలిపి 1,100 సీట్లు ఉండగా, ఈ ఏడాది 369 మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. తెలుగు విభాగంలో కేవలం ముగ్గురు మాత్రమే అడ్మిషన్ పొందారు. అనుకూలం కానున్న గత ప్రభుత్వ చర్యలు మెరుగైన గ్రేడింగ్ సాధించేలా కృషి నాణ్యమైన పరిశోధనలను ప్రోత్సహిస్తున్నాం. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో గణనీయమైన ప్రగతి సాధించాం. అనుబంధ కళాశాలల్లోనూ గణనీయమైన పురోగతి ఉంది. న్యాక్లో మెరుగైన గ్రేడింగ్ సాధించేందుకు కృషి చేస్తాం. – ఆచార్య బి.అనిత, ఇన్చార్జి వీసీ, ఎస్కేయూ -
పబ్లిక్ బోరు బావి కబ్జా
బ్రహ్మసముద్రం: ప్రజల దాహార్తీని తీర్చేందుకు వేయించిన బోరుబావిని ఆ గ్రామ టీడీపీ సర్పంచ్ కబ్జా చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే.. ఇది తమ ప్రభుత్వమని... తానే బోరు వేయించానని బుకాయిస్తూ దౌర్జన్యానికి తెరలేపారు. స్థానికులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో తాగునీటి ఇబ్బంది తీవ్రంగా ఉందంటూ గత ఎన్నికల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు దృష్టికి ఆ గ్రామ సర్పంచ్ (టీడీపీ) కె.సందీప్కుమార్ తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన ప్రజలఽ దాహార్తీని తీర్చేందుకు బోరు వేయించి, పంచాయతీకి అప్పగించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్పంచ్ ఆగడాలు పెచ్చుమీరాయి. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ బోరుకు ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేసి అర కిలోమీటరు దూరంలో ఉన్న తన పొలానికి నీటిని మళ్లించుకోసాగారు. ఇందు కోసం పంచాయతీకి సంబంధించిన విద్యుత్ను వినియోగించుకుంటున్నారు. వేసవిలో తాగునీరు అందక ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇటీవల సర్పంచ్ను కలసి సమస్య విన్నవించారు. పబ్లిక్ బోరు నీటిని ప్రజల దాహార్తీని తీర్చేందుకు కేటాయించాలని కోరారు. దీంతో సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ బోరు బావిని తానే వేయించానని బుకాయిస్తూ ‘ఇది మా ప్రభుత్వం... అంతా మా ఇష్టం.. దిక్కున్న చోటుకెళ్లి చెప్పుకోండి’ అంటూ దౌర్జన్యానికి దిగారు. అంతేకాక 24 గంటల పాటు బోరు బావి నీటిని పొలానికి మళ్లించుకుంటూ ప్రజలకు చుక్క నీటిని వదలడం లేదు. జిల్లా అధికారులు స్పందించి తమ తాగునీటి ఇక్కట్లు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. ● టీడీపీ సర్పంచ్ నిర్వాకంతో గ్రామస్తులకు ఇక్కట్లు -
వడడెబ్బతో విద్యార్థిని మృతి
పెద్దపప్పూరు: వడదెబ్బ ప్రభావంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... పెద్దపప్పూరు మండలం చాగల్లు గ్రామానికి చెందిన గంగరాజు, కవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యాన్ని తాళలేక గంగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి కవిత వ్యవసాయ కూలి పనులతో ఇద్దరు కుమార్తెలను పెంచి పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో గురువారం వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం గూడూరు అంకాలమ్మ ఆలయానికి వెళ్లి వచ్చారు. ఎండ వేడిమి కారణంగా ఇంటికి చేరుకోగానే కుమార్తె గౌతమి (10)కి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. జ్వరం వచ్చినట్లు శరీరం మొత్తం కాలిపోతుండడంతో వడదెబ్బకు గురైనట్లుగా నిర్ధారించుకుని బంధువులు వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి వైద్యులు అనంతపురానికి రెఫర్ చేశారు. పరిస్థితి విషమిస్తుండడంతో సర్వజనాస్పత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, చాగల్లులోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న గౌతమి మృతి విషయం తెలియగానే ఉపాధ్యాయులు, ఎంఈఓ ఓబులపతి, తదితరులు విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. -
‘కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలి’
గుంతకల్లు: కార్మిక వ్యతిరేక విధానాలకు రైల్వే యాజమాన్యం స్వస్తి పలకాలని రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. యాజమాన్యం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య పిలుపు మేరకు స్థానిక రైల్వేస్టేషన్లోని క్రూ లాబీ వద్ద ఎల్ఆర్ఎస్, ఓపీటీజీ బ్రాంచ్ల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. లోకో రన్నింగ్ సిబ్బందికి వ్యతిరేకంగా మల్టీడిసిప్లనరీ కమిటీ వ్యవహరిస్తోందన్నారు. హైస్పీడ్ ఎక్స్ప్రెస్ రైళ్లలో పని చేసే రన్నింగ్ సిబ్బందికి స్పెషల్ అలెవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా విభాగాల కార్మిక సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. వడ్డెర విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అనంతపురం రూరల్: పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నారు. ఈ మేరకు వడ్డెర సేవా సంఘం జిల్లా అద్యక్షుడు వడ్డె లక్ష్మీనారాయణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 500కు పైబడి మార్కులు సాధించిన విద్యార్థులు మే 25వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలి. పూర్తి వివరాలకు 94411 09916, 98662 36626, 99087 45966, 99492 29870లో సంప్రదించవచ్చు. -
గిన్నిస్ బుక్లో ‘అనంత’ వాసికి చోటు
అనంతపురం కల్చరల్: నగరానికి చెందిన మేరీ ప్రత్యూష గుజ్జారి... గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. 2024, డిసెంబరు 1 హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి సంగీత కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 18 దేశాలకు చెందిన 1,046 మంది కీబోర్డు ప్లేయర్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇందులో నగరానికి చెందిన ప్రత్యూష గుజ్జారితో పాటూ మరి కొందరి ఖ్యాతిని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించి, హైదరాబాదులోని లైఫ్ చర్చిలో క్రైస్తవ పెద్దల ద్వారా సర్టిఫికెట్ను, జ్ఞాపికను అందజేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక సీఎస్ఐ చర్చిలో ప్రత్యూష గుజ్జారి, ఆమె భర్త డేనియల్ జక్కం, మామ జెడ్.దేవరాజును పలువురు అభినందించారు. పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్ పుట్లూరు: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మూడు రోజుల క్రితం పోక్సో చట్టం కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
సజావుగా సర్టిఫికెట్ల పునః పరిశీలన
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఉపాధ్యాయుల మెడికల్ సర్టిఫికేషన్ రీ వెరిఫికేషన్ ప్రక్రియ శుక్రవారం సజావుగా సాగింది. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వెరిఫికేషన్కు హాజరయ్యారు. ఆస్పత్రిలోని డీఈఐసీ, బర్న్స్ వార్డు, ఆప్తాల్మిక్ వార్డుల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది. ఆర్థో హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ ఆత్మారాం, వైద్యులు డాక్టర్ ఆనంద్ బాబూ నాయక్, డాక్టర్ ప్రశాంతి, తదితరులు సర్టిఫికెట్లను పరిశీలించారు. నలుగురు విద్యార్థుల డీబార్ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ, బీఈడీ పరీక్షల్లో మాస్కాపీయింగ్కు పాల్పడుతున్న నలుగురు విద్యార్థులను డీబార్ చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ జీవీ రమణ తెలిపారు. అనంతపురం, తాడిపత్రిలో ఒక్కొక్కరు చొప్పున డిగ్రీ విద్యార్థి, తాడిపత్రిలో ఇద్దరు బీఈడీ విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మే 5న జాతీయ లోక్ అదాలత్ అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి మే 5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమారావు, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఈ. శివప్రసాద్ యాదవ్ తెలిపారు. అలాగే అనంతపురం జిల్లా కోర్టు పరిధిలోని కేసుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదం కేసులు, సివిల్ కేసులు, చెక్బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాల (విడాకుల కేసులు కాకుండా) , పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగ్గ క్రిమినల్ కేసులు, వినియోగదారుల ఫోరం కేసులు, ప్రిలిటిగేషన్ తదితర కేసులను జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేస్తామన్నారు. కక్షిదారులందరూ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం బుక్కరాయసముద్రం: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా రెండవ బెటాలియన్ ఎస్ఏపీ క్యాంప్లో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ సిబ్బందికి రేంజ్ల వారీగా క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న జిల్లా ఏపీఎస్పీ 14వ బెటాలియన్ జట్టు బాస్కెట్ బాల్, క్రికెట్ పోటీల్లో విజయం సాధించింది. పోటీల ముగింపు సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేత జట్టుకు ట్రోఫీలను ప్రవీణ్కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు క్రీడలు ఎంతో ఉపయోగమన్నారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ కేశవరెడ్డి, మహబూబ్బాషా బెటాలియన్ ఉద్యోగుల సంఘం నాయకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
బెల్టుషాపు నిర్వహణకు వేలంపాట
బ్రహ్మసముద్రం : టీడీపీ నేతలు అక్రమ సంపాదనకు అర్రులు చాస్తున్నారు. ఈ క్రమంలో మద్యం బెల్టుషాపులను ఆదాయ మార్గాలుగా ఎంచుకుంటున్నారు. వాటి కోసం ఆధిపత్య పోరుకు కూడా దిగుతున్నారు. కొన్నిచోట్ల వేలంపాట నిర్వహించి మరీ బెల్టుషాపులను దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో బెల్టుషాపు నిర్వహణకు శుక్రవారం నిర్వహించిన వేలంపాట రసాభాసగా మారింది. మండలంలోని వేపులపర్తి గ్రామంలో లైసెన్స్డ్ మద్యం దుకాణం ఉంది. దీనికి అనుబంధంగా బ్రహ్మసముద్రంలో టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. అయితే..అన్ని బెల్టుషాపులు ఎత్తేసి ఒకే ఒకటి నిర్వహించాలని, దాన్ని కూడా వేలంపాట ద్వారా కేటాయించాలని టీడీపీ నాయకులు భావించారు. ఈ క్రమంలో శుక్రవారం స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద సమావేశమయ్యారు. వేలంపాట విషయంలో వారి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. వేలం పాట నిర్వహించాలని కొందరు..అవసరం లేదని మరికొందరు వాదనకు దిగారు. ఇది కాస్తా పెద్దదయ్యి తోసుకునే స్థాయికి వెళ్లింది. చివరకు కొందరు నాయకులు కలుగజేసుకుని గొడవను సద్దుమణిగించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వద్ద పంచాయితీ చేద్దామంటూ వేలంపాటను రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాలను ఆసక్తిగా గమనించిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ఏదో అభివృద్ధి చేస్తారని గెలిపిస్తే ఇప్పుడిలా మద్యం ఆదాయం కోసం కొట్టుకుంటున్నారని పలువురు వ్యాఖ్యానించారు. తోపులాటకు దిగిన ‘తమ్ముళ్లు’ -
●మత్తు వదలరా నాయనా..
తాడిపత్రిటౌన్: మత్తు వదలరా నాయనా అంటూ మందుబాబుకు తాడిపత్రి పట్టణ పోలీసులు నీటితో ట్రీట్మెంట్ ఇచ్చారు. పట్టణంలోని నందలపాడులో సుంకన్న అనే వ్యక్తి శుక్రవారం మద్యం మత్తులో హల్చల్ చేశాడు. కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ సాయిప్రసాద్ అక్కడికి వెళ్లి మందుబాబును పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. అయితే సుంకన్న పూటుగా మద్యం సేవించి మత్తులో తూగుతుండటంతో స్టేషన్ గేటు ముందు కుళాయి నీటి పైపుతో స్నానం చేయించారు. ఇది చూసిన ప్రజలు మందుబాబుతో పోలీసులకు ఎన్ని అవస్థలు వచ్చాయిరా నాయనా అంటూ చర్చించుకున్నారు. అయితే పోలీసులు స్నానం చేయించాక కాసేపు ఇక్కడే పడుకుంటా సార్ అని సుంకన్న పోలీసులను బతిమాలడం కొసమెరుపు. -
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
అనంతపురం అర్బన్: ‘రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చర్యలు చేపట్టడంతో పాటు రోడ్డు భద్రతపై ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలి. యువత మత్తుబారిన పడకుండా చూడాలి’. అని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ పి.జగదీష్తో కలిసి అధికారులతో రోడ్డు భద్రత, నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్ (ఎన్సీఓఆర్డీ) సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్ పెట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. గుర్తించిన బ్లాక్స్పాట్ల వద్ద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆటోలు, వాహనాలు ఓవర్ లోడింగ్తో ప్రయాణించకుండా చూడాలని ఆదేశించారు. మత్తు, మాదకద్రవ్యాలకు యువత బానిస కాకుండా చూడల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. మత్తు ప్రదార్థాల అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ రాజగోపాల్, డీటీసీ వీర్రాజు, ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి ఆర్టీసీ బస్టాండుల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణిలకులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు. ప్రతి గ్రామం, పట్టణాల్లో ప్రతి వార్డులోనూ చలివేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ వినోద్కుమార్ -
కో ఆర్డినేషన్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయండి
అనంతపురం కల్చరల్: సమాచార హక్కు చట్టానికి సంబంధించి జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులకు సమాచార హక్కు పరిరక్షణ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి మలోలను సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు హొన్నూరప్ప, సమాచార హక్కు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు లాలే నాయక్, రాయల్ కొండయ్య, ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు కేపీ రాజు తదితరులు గురువారం కలసి మాట్లాడారు. ఇద్దరు ఆర్టీఐ కార్యకర్తలతో కలిసిన కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తే పాలన పారదర్శకంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ పుస్తకాలను ఆవిష్కరించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డీఆర్వోను కలిసిన వారిలో సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమామ్, నబీరసూల్, అనంతకుమారి, సెక్రటరీలు మహేష్కుమార్, భానుకిరణ్, గణేష్, రామాంజనేయులు, మల్లేశ్వరి తదితరులున్నారు. డీఆర్వోకు స.హ.చట్ట పరిరక్షణ సంఘం విజ్ఞప్తి -
అదృశ్యమైన వ్యక్తి మృతి
గార్లదిన్నె/బ్రహ్మసముద్రం: కనిపించకుండా పోయిన బ్రహ్మసముద్రం మండలం కోనాపురం గ్రామానికి చెందిన దండు కరేగౌడ (44) గురువారం ఉదయం గార్లదిన్నె వద్ద మృతదేహమై కనిపించాడు. పోలీసులు తెలిపిన మేరకు... కొంత కాలంగా మానసికంగా ఇబ్బంది పడే కరేగౌడ ఈ నెల 19న గార్లదిన్నెలో నివాసముంటున్న చెల్లెలు ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు సాయంత్రం అలా బయటకు వెళ్లి వస్తానంటూ చెల్లెలుకు తెలిపి ఇల్లు విడిచిన వెళ్లిన ఆయన రాత్రయినా రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. చివరకు బంధువులు ఊర్లలోనూ ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం మధ్యాహ్నం గార్లదిన్నెలోని అక్షర ఇంటర్నేషనల్ పాఠశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. వడదెబ్బతో మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోలీసులు వైరల్ చేయడంతో గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అప్రమత్తమై మృతదేహాన్ని పరిశీలించి, మృతుడిని కరేగౌడగా నిర్ధారించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పీఎస్ ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. మెడికో ఆత్మహత్యాయత్నం ● పెంచికలపాడు విశ్వభారతి మెడికల్ కళాశాలలో ఘటన కోడుమూరు రూరల్: గూడూరు మండలం పెంచికలపాడు విశ్వభారతి మెడికల్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని కళాశాలపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన శ్రీనివాసులు, అనిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా, పెద్ద కుమార్తె హన్సిక.. విశ్వభారతి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల నిర్వహించిన పరీక్ష సరిగా రాయలేకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం సాయంత్రం కళాశాల రెండో అంతస్తుపై నుంచి దూకింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను సహ విద్యార్థులు సిబ్బంది వెంటనే కళాశాలలోని హాస్పిటల్కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కె.నాగలాపురం పోలీసులు విచారణ చేపట్టారు. యువకుడి బలవన్మరణం రాప్తాడు రూరల్: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం నరసనాయనికుంటకు చెందిన రామచంద్ర నాయక్ కుమారుడు సిద్ధునాయక్ (19) 5వ తరగతి వరకు చదువుకున్నాడు. కేటరింగ్ కార్మికుడిగా పని చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న సిద్దు నాయక్ గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న అవ్వ.. విగతజీవిగా ఉరికి వేలాడుతున్న సిద్దునాయక్ను చూసి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని యువకుడి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 15 మంది చిన్నారులకు బీఎంటీ చికిత్స అనంతపురం మెడికల్: ఉమ్మడి జిల్లాలోని 15 మంది తలసీమియా బాధిత చిన్నారులకు బెంగళూరులోని సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో బోన్ మ్యారో ట్రాన్స్ఫ్లాంటేషన్ చేయనున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్ఫ్లాంటేషన్పై తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు గురువారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. తలసీమియా బాధిత చిన్నారులకు అందించి సదుపాయాలను సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధి ఆంకాలజిస్టు డాక్టర్ మోహన్ రెడ్డి, అభిజిత్, పుష్ప వివరించారు. డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... తలసీమియాతో బాధపడే చిన్నారులకు ప్రీవెంటివ్, చికిత్సనందించేందుకు సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ సహాయం చేస్తోందన్నారు. సర్వజనాస్పత్రిలో గైనిక్ విభాగంలో తలసీమియా జన్యు లోపాన్ని గుర్తించడానికి ప్రత్యేక ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 20 వారాలున్న 1,500 మంది గర్భిణుల్లో తలసీమియా జన్యులోపాన్ని గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 40 మందిలో జన్యులోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరిలో 8 మంది పుల్ మ్యాచింగ్, మరో ఏడుగురు హాప్ మ్యాచింగ్ అయ్యారన్నారు. అంకాలజిస్టు డాక్టర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ... కేంద్రం సహకారంతో చిన్నారులకు బెంగళూరులోని జైన్ ఆస్పత్రిలో చికిత్సనందిస్తారన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్దీన్కుమార్, డాక్టర్ శంకర్నారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు
తాడిపత్రి టౌన్: రైళ్లలో గంజాయి, అక్రమ మద్యం రవాణాను అరికట్టే దిశగా పోలీసులు గురువారం తెల్లవారుజామున తాడిపత్రి రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. స్థానిక సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ గౌస్బాషా నేతృత్వంలో జిల్లా కేంద్రం నుంచి స్నిప్పర్ డాగ్తో పాటు వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం తనిఖీలు కొనసాగించారు. బాలుడి ఆత్మహత్యాయత్నం గుత్తి రూరల్: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం కొత్తబురుజు గ్రామానికి చెందిన ఓ బాలుడు గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తమ మాట వినకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న కుమారుడిని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన బాలుడు గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషపూరిత ద్రావకం తాగాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు.. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని గమనించి వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తరలించారు. ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
బుక్కరాయసముద్రం: మార్కులు సరిగా రాలేదంటూ తండ్రి మందలింపుతో మనస్తాపం చెంది డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బీకేఎస్ మండలం పొడరాళ్ల గ్రామానికి చెందిన రవి కుమార్తె వాణి (20) అనంతపురంలోని కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆన్లైన్ ద్వారా బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్న ఆమె కోచింగ్కు నిర్వహించిన పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయి. విషయం తెలుసుకున్న తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గుత్తిలో నేడు ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం అనంతపురం ఎడ్యుకేషన్/గుత్తి: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా మొదటి కార్యవర్గ సమావేశం శుక్రవారం గుత్తిలోని పద్మవాణి పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డి, గుత్తి మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆసీఫ్, బసవరాజు, జిల్లా నాయకులు డి.శివశంకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం వారు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాన చర్చ ఉంటుందన్నారు. అలాగే విద్యారంగంలోని పాఠశాలల మనుగడ, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలపై చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్.సాయిశ్రీనివాస్, ప్రధానకార్యదర్శి ఎం.రఘునాథరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శి నారాయణస్వామి ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు. అన్ని మండలాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని రమణారెడ్ది పిలుపునిచ్చారు. -
వేర్వేరు హత్య కేసుల్లో వీడిన మిస్టరీ
తాడిపత్రి టౌన్: వివాహేతర సంబంధాల కారణంగానే తాడిపత్రి ప్రాంతంలో రెండు హత్యలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. వేర్వేరు ఘటనలకు సంబంధించిన హత్య కేసుల్లో నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. తాడిపత్రి పట్టణ పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ సాయిప్రసాద్ వెల్లడించారు. ● పుట్లూరు మండలం చప్పిడి వెంగన్నపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరెడ్డికి 15 సంవత్సరాల క్రితం తాడిపత్రి మండలం బందర్లపల్లికి చెందిన పుష్పావతితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేశ్వరెడ్డి పెళ్లి కాకముందు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లిలో నివాసముంటున్న తన పిన్నమ్మ ఇంటికి తరచూ వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అక్కిలి శ్రీలక్ష్మితో అయిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే శ్రీలక్ష్మికి పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన రాజారెడ్డితో పెళ్లి జరిగింది. భర్త మరణించడంతో ఆమె పుట్టింటికి చేరుకుంది. ఈ క్రమంలో సులువుగా ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. దీంతో తన భార్య పుష్పావతిని, కుమారులను వెంకటేశ్వరరెడ్డి నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. అదే సమయంలో భర్త వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న ఆమె... ఆయనలో మార్పు రావాలని ఆకాంక్షిస్తూ ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆ సమయంలో శ్రీలక్ష్మిని పిలుచుకుని నేరుగా తాడిపత్రిలోని యల్లనూరు రోడ్డులో ఉన్న అద్దె ఇంట్లోకి వెంకటేశ్వరరెడ్డి మకాం మార్చాడు. ఆ తర్వాత కాపురానికి రావాలని పుష్పావతికి తెలపడంతో వెంకటేశ్వరెడ్డి పేరు మీదున్న 9 ఎకరాల పొలాన్ని పిల్లల పేరుపై రాయాలని ఆమె పట్టుబట్టింది. ఈ అంశాన్ని వెంకటేశ్వరరెడ్డి, శ్రీలక్ష్మి వ్యతిరేకించారు. పుష్పావతి ఉంటే ఎప్పటికై నా తమకు ముప్పేనని భావించిన వారు.. పథకం ప్రకారం తాడిపత్రిలోని హేమాద్రి గెస్ట్హౌస్లో పెద్దల సమక్షంలో ఆస్తి పంపకాలపై పంచాయితీకి రావాలని కబురు పెట్టారు. దీంతో ఈ ఏడాది జనవరి 17న హేమాద్రి గెస్ట్హౌస్కు పుష్పావతి చేరుకుంది. పంచాయితీ పెద్దలతో మాట్లాడిన అనంతరం గది బయట వేచి ఉన్న పుష్పావతిపై అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న వేట కొడవలితో వెంకటేశ్వరరెడ్డి దాడి చేసి, హతమార్చి ఉడాయించాడు. అనంతరం శ్రీలక్ష్మిని పిలుచుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం విస్తృత గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి శ్రీలక్ష్మి ఇంట్లో ఉన్న సామగ్రిని తీసుకెళ్లేందుకు యల్లనూరు రోడ్డులో ఉన్న అద్దె గదికి వారు చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో వెంకటేశ్వరెడ్డి, శ్రీలక్ష్మిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ● తాడిపత్రిలోని ఓశాంతి నగర్ నివాసముంటున్న మణికి పామిడి గ్రామానికి చెందిన యక్కలూరి మహేష్తో వివాహమైంది. ఈ క్రమంలో అత్తింటికి తరచూ వచ్చి వెళ్లే మహేష్... ఆ పక్కనే నివాసముంటున్న రమీజాబీతో ఏర్పడిన పరిచయంతో చాలా చనువుగా ఉండేవాడు. ఇది గమనించిన రమీజాబీ కుమారుడు సయ్యద్ ఫైరోజ్ తన పిన్నమ్మ షేక్ ఖాజాభీతో చెప్పుకుని బాధపడ్డాడు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు చోటు చేసుకునేవి. ఈనెల 10న మహేష్ తన భార్య మణితో పాటు తాడిపత్రికి వచ్చాడు. 16వ తేదీ రమీజాబీతో షేక్ ఖాజాబీ, సయ్యద్ ఫైరోజ్ గొడవ పడుతుంటే వారికి సర్దిచెప్పేందుకు మహేష్ వెళ్లాడు. తమ ఇంటి గొడవలో నువ్వెందుకు కలుగ చేసుకుంటున్నాంటూ మహేష్పై ఖాజాబీ ఆగ్రహం చేస్తూ ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి ఫైరోజ్కిచ్చి పొడవమని ప్రోత్సహించింది. దీంతో మహేష్ పొట్టలో బలంగా పొడవంతో తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ కేసులో సయ్యద్ ఫైరోజ్, షేక్ ఖాజాబీను వారి ఇంటి వద్దనే గురువారం పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. వివాహేతర సంబంధాలే కారణమని నిర్ధారించిన పోలీసులు హత్య కేసుల్లో నిందితుల అరెస్ట్ -
కదిలిన సత్యసాయి ప్రచార రథాలు
ప్రశాంతి నిలయం: సత్యసాయి శతజయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్రాజు తెలిపారు. సత్యసాయి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని సత్యసాయి ప్రేమ ప్రవాహిని పేరుతో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాలను గురువారం ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి, నాగానంద, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండ్యతో కలసి ఆయన ప్రారంభించి, మాట్లాడా రు. సత్యసాయి అవతార వైభవం, సేవా మార్గాలు, ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రజలకు వివరిస్తూ దేశంలోని 500 జిల్లాల్లో 2.5 లక్షల కిలోమీటర్ల మేర ప్రేమ ప్రవాహిని రథాలు ప్రచార యాత్ర కొనసాగిస్తాయన్నారు. కార్యక్రమం అనంతరం హిల్వ్యూ స్టేడియంలో మహానారాయణ సేవ నిర్వహించారు. -
బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు సెటిల్మెంట్లే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఏది చెబితే అది ఎఫ్ఐఆర్లో చేరుస్తున్నారు. బాధితులతో పద్ధతిగా మాట్లాడాల్సిన పోలీసులు బూతులు లంఘించుకుంటున్నారు. డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తారో వారికే న్యాయం జరుగుతోంది.
సార్ చెప్పండి... మీరెంత చెప్తే అంత● టీడీపీ నేతల అండతో కొందరు ఖాకీల విచ్చలవిడితనం ● ఎమ్మెల్యేలే బాసులుగా విధులు నిర్వర్తిస్తున్న సీఐలు ● రాత్రి పదిన్నర తర్వాతే కదిరి అర్బన్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ● ఇటుకలపల్లి సీఐ దగ్గరికెళితే కేసులతో పాటు బూతులు బోనస్ ● రాయదుర్గం సీఐ జయ.. ఆయనకు లేనిదే దయ అనే విమర్శలు ● పుట్టపర్తి ఎస్పీ ఆఫీసులో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ ప్రదీప్ హవా సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొంతమంది సీఐల వల్ల ఖాకీ చొక్కాకు అవినీతి మరకలంటుకున్నట్టు విమర్శలున్నాయి. కదిరి అర్బన్ పోలీస్స్టేషన్ సీఐగా ఉన్న నారాయణరెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. ఇటీవల గంజాయి కేసులో పట్టుబడిన వారిని ఉదారంగా వదిలేసి కేవలం బైండోవర్తో సరిపెట్టాడని విమర్శలున్నాయి. రాత్రి పదిన్నర వరకూ ఎఫ్ఐఆర్లు నమోదు కావని, సెటిల్మెంట్ సక్సెస్ అయితే ఎఫ్ఐఆర్ నమోదు కాదని, కుదరకపోతే కేసు నమోదు అవుతుందని బాధితులు చెబుతున్నారు. సీఐ కార్యాలయం ఎప్పుడూ సివిల్ పంచాయితీలతో బిజీబిజీగా ఉంటుంది. జయ.. లేని దయ రాయదుర్గం అర్బన్ సీఐ జయానాయక్కు దయ అనేది ఎక్కడా లేదన్న విమర్శలున్నాయి. ఈ స్టేషన్లో రోజూ సివిల్ పంచాయితీలు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ వివాదంలో బాధితుడి నుంచి భారీగా డబ్బు చేతులు మారినట్టు బాధితుల తరఫు బంధువులు చెప్పారు. స్టేషన్కు వచ్చే వారిపట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధికి మాత్రమే సేవకుడిగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. హేమంత్ నోట బూతులే ఇటుకలపల్లి సీఐగా ఉన్న హేమంత్కుమార్ నోటికొచ్చినట్టు బూతులు తిడుతున్నట్టు బాధితులు వాపోతున్నారు. పరిటాల శ్రీరామ్కు అనుంగు అనుచరుడిగా ఉన్న ఈయన టీడీపీ నేతల అండచూసుకుని రెచ్చిపోతున్నట్టు ఇటీవల ఓ బాధితుడు చెప్పారు. మొన్నటికి మొన్న అక్రమంగా మట్టి తోలుతున్న రెండు టిప్పర్లు పట్టుకుని తెల్లారేసరికి వదిలేశారు. వారితో సెటిల్మెంట్ చేసుకున్నట్టు తేలింది. టీడీపీ నేతలు చెబితే ప్రత్యర్థులను అకారణంగా స్టేషన్కు పిలిపించడం, బెదిరించడం చేస్తున్నట్టు చెబుతున్నారు. స్టేషన్కు వెళ్లిన వారికి కనీస మర్యాద ఇవ్వకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తగా ఎస్ఐ సుధాకర్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఖాకీ డ్రెస్సు వేసుకుని పొలిటికల్ పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసుగా రామగిరి ఎస్ఐ సుధాకర్ గుర్తింపు పొందారు. పరిటాల కుటుంబానికి పనిమనిషిగా ఉన్నట్టు కూడా ఆరోపణలున్నాయి. ఇటీవల రామగిరి వైస్ ఎంపీపీ ఎంపికలో ఎంపీటీసీలను బెదిరించడం, వారిని టీడీపీ వ్యానులో ఎక్కించడం వంటివి బహిరంగంగా చేశారు. బాధితులను భయభ్రాంతులకు గురిచేశారు. పక్కా టీడీపీ కార్యకర్తగా సామాజిక మాధ్యమాల్లో మాట్లాడినా ఇతనిపై శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న వీసమెత్తు చర్యలు తీసుకోలేదు. ఎస్బీ ఎస్ఐ ప్రదీప్ కీలకంగా.. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఆఫీసులో స్పెషల్బ్రాంచ్ ఎస్ఐగా పనిచేస్తున్న ప్రదీప్.. ప్రస్తుతం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. తన పై అధికారులకు పనులు చక్కబెట్టడంలో దిట్ట అని పేరుంది. చాలా మంది సీఐలు, డీఎస్పీలకు జరగని పనులు ప్రదీప్కు జరుగుతాయి. సెటిల్మెంట్ల ద్వారా పై అధికారులకు ఆర్థిక చేయూతనివ్వడం, ఎప్పటికప్పుడు ఏపోలీసు అధికారి ఏం చేస్తున్నారో పెద్దబాస్కు చెప్పడం ఇతని పని. దీంతో పోలీసు అధికారులు చాలామంది ప్రదీప్ అంటే భయపడిపోతున్నారు. జిల్లాలో ప్రదీప్ ఏదిచెబితే అది జరుగుతుందని చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
ఉత్తమ అవార్డు అందుకున్న కలెక్టర్
● ‘స్వచ్ఛ ఆంధ్ర’ సమర్థ నిర్వహణకు... అనంతపుర అర్బన్: స్వచ్ఛ ఆంధ్ర (గ్రామీణ) కార్యక్రమాల అమలులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డును కలెక్టర్ వి.వినోద్కుమార్ అందుకున్నారు. గురువారం మంగళగిరిలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం– 2025 కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా అవార్డును కలెక్టర్ అందుకున్నారు. ఓడీఎఫ్ ప్లస్ కింద స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల పరిధిలో సమర్థవంతంగా నిర్వహించి అన్నింటినీ ఓడీఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దినందుకు అవార్డు లభించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సమష్టి కృషితోనే అవార్డు వచ్చిందన్నారు. కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తు అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రూరల్ మండల పరిధిలోని కురుగుంట కేజీబీవీలో ఖాళీగా ఉన్న మూడు అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ–1 వెంకటస్వామి, ఎంఈఓ–2 సరితారాణి తెలిపారు. గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30లోపు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. 2024 జూలై 1 నాటికి 42 ఏళ్లు పూర్తయి ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఈడబ్ల్యూఎస్ వారు 47 ఏళ్లు, దివ్యాంగులు 52 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మాజీ సర్వీస్ మహిళలకు 45 ఏళ్ల వయసు వరకు అర్హులని తెలిపారు. స్థానిక మహిళలు (గ్రామం/మండలం) మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. అధ్యాపకులకు శిక్షణ ప్రారంభం అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచి అమలవుతున్న సీబీఎస్ఈ, సిలబస్, ప్రశ్నపత్రాల మార్పు తదితర అంశాలపై జూనియర్ కళాశాలల అధ్యాపకులకు శిక్షణ గురువారం ప్రారంభమైంది. స్థానిక కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల కళాశాలలో జరిగిన శిక్షణకు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ రెగ్యులర్, కాంట్రాక్ట్, గెస్ట్ అధ్యాపకులు హాజర య్యారు. ఆన్లైన్ విధానంలో జరిగిన శిక్షణను ఇంటర్ బోర్డ్ డైరెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఆయా సబ్జెక్టుల నిఫుణులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి ఎం.వెంకటరమణనాయక్ మాట్లాడుతూ అధ్యాపకులకు ఈ శిక్షణ చాలా ఉపయోగపడుతుందన్నారు. నూతన సిలబస్, సంస్కరణలపై శిక్షణ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో కేఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగరత్నమ్మ పాల్గొన్నారు. కొత్తగా నాలుగు మద్యం షాపులు అనంతపురం: జిల్లాలో కొత్తగా తాడిపత్రి మున్సిపాలిటీలో మూడు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఒక మద్యం షాపు ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ పి. నాగమద్దయ్య, జిల్లా ఎకై ్సజ్ అధికారి బి. రామమోహన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రూ.2 లక్షలు (నాన్ రీ ఫండబుల్) డీడీ ద్వారా చెల్లించి, దరఖాస్తుకు ఆధార్ కార్డు జత చేసి మ్యానువల్గా జిల్లాలోని అన్ని ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తు చేయవచ్చన్నారు. absbcl.gov.in వెబ్సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. మే 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 30న పాలిసెట్ అనంతపురం: డిప్లొమో కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ నెల 30న ఏపీ పాలిసెట్–2025ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ సి. జయచంద్రా రెడ్డి తెలిపారు. అభ్యర్థులు తమ హాల్టికెట్లను www.polycetap.nic.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. -
సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం
అనంతపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారని ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీ కార్యాలయ ఆవరణలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలపరిచే ఆలోచనతో గ్రామ సచివాలయాలను ప్రవేశపెట్టి ప్రతి శాఖకు చెందిన అధికారులను ప్రజలకు అందుబాటులో ఉంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజమైన గ్రామ స్వరాజ్య స్థాపన చేశారని కొనియాడారు. ఉత్తమ సేవలు అందించిన ఆవులెన్న, వ్యాసాపురం, గన్నేవారిపల్లికి చెందిన ముగ్గురు సర్పంచ్లకు, 29 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముందు గాంధీజీ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. కశ్మీర్లో ఉగ్రదాడిలో మృతి చెందిన 28 మందికి సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీపీఓ కార్యాలయ పాలనాధికారి నాగరాజు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ -
అడ్డగోలు నియామకాలకు అడ్డుకట్ట
అనంతపురం ఎడ్యుకేషన్: పూర్వ జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మీ నిర్వాకం.... సమగ్రశిక్ష కార్యాలయాన్ని నేటికీ వెంటాడుతోంది. కమిషనర్ ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ తీసుకున్న అడ్డగోలు నిర్ణయాన్ని ఉన్నతాధికారులు తప్పుపట్టారు. ఈ క్రమంలో సెక్టోరియల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేశారు. తాజాగా వేసవిసెలవుల్లో నోటిఫికేషన్ జారీ చేసి 15 రోజుల్లోగా భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో నేడో, రేపో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అసలేం జరిగిందంటే... సమగ్ర శిక్షలో సెక్టోరియల్ అధికారులుగా ఎవరినైనా తీసుకోవాలన్నా... ఉన్నవారిని తప్పించాలన్నా విద్యా సంవత్సరం మధ్యలో కాకుండా వేసవి సెలవుల్లో చర్యలు తీసుకోవాలని స్వయంగా విద్యాశాఖ కమిషనర్ గతంలో స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, అప్పటి డీఈఓ, ఏపీసీలు అస్మదీయుల కోసం అడ్డగోలు నిర్ణయం తీసుకుని ఏపీఓను తప్ప తక్కిన సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులందరినీ ఒకేసారి 2024 జూలై 31న రిలీవ్ చేయించారు. రాష్ట్రంలో తక్కిన 25 జిల్లాల్లో ఎక్కడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఆగమేఘాల మీద ఆగస్టు 1న కొత్తవారిని తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎక్కడా తన చేతికి మట్టి అంటకుండా కలెక్టర్నే బురిడీ కొట్టించి ఆయనతోనే సంతకాలు చేయించారు. చివరకు సమగ్ర శిక్షలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ను రిప్యాట్రేషన్ అధికారం ఏపీసీకే ఉంటుంది. ఇదికూడా కలెక్టర్తోనే చేయించారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు చేపట్టారు. కలెక్టర్తో ఆమోద ముద్ర వేయించి కమిషనర్ ఆమోదం కోసం జాబితాను పంపారు. ఐదుగురి పేర్లు పంపితే నలుగురికి గ్రీన్ సిగ్నల్.. రాష్ట్ర అధికారులకు పంపిన ఐదుగురి జాబితాలో నలుగురి నియామకానికి గ్రీన్సిగ్నల్ ఇస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎంఓగా ఆనందభాస్కర్రెడ్డి, జీసీడీఓగా కవిత, అలెస్కోగా గురుమునికృష్ణ, అసిస్టెంట్ ఏఎంఓ (జనరల్)గా ఫణిరాజు నియామకాలకు ఆమోదం తెలిపారు. అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ) పోస్టుకు తీవ్రంగా ప్రయత్నం చేసిన రామగిరి కిష్టప్ప, జీసీడీఓ, మరో అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారి పోస్టుకు తీవ్రంగా ప్రయత్నం చేసిన వారి పేర్లు జాబితాలో లేకపోయేసరికి ముగ్గురు ప్రజాప్రతినిధులు ఎవరికివారు ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు చేయడంతో ఈ ప్రక్రియ అంతటితో ఆగిపోయింది. ఎస్జీటీలూ అర్హులే సమగ్ర శిక్ష పరిధిలోని సెక్టోరియల్ అధికారుల పోస్టులకు గతంలో హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే అర్హులు. ఆ తర్వాత కేవలం స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే అర్హులని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా మరో రకంగా ఆదేశాలిచ్చారు. ఇందులో ఎస్జీటీలు కూడా అర్హులేనని స్పష్టం చేశారు. ‘సమగ్ర’లో ముగ్గురి రీప్యాట్రేషన్ సమగ్రశిక్షలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ అసిస్టెంట్ను విద్యాశాఖకు రీప్యాట్రేషన్ చేశారు. ఈ మేరకు ఏపీసీ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ అసిస్టెంట్లు షబానా, మధుసూదన్రావు, జూనియర్ అసిస్టెంట్ బాల కుళ్లాయప్పను మాతృశాఖకు పంపారు. విధుల్లో అలసత్వం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లను గతంలో డీఈఓగా పని చేసిన వరలక్ష్మి అదేపనిగా ఇక్కడికి పంపారు. ఇక్కడ పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్కు లబ్ధి కల్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం ఉంది. ఇక్కడ ఇద్దరు ఉద్యోగులు ఉన్నా...వారి నుంచి ఎలాంటి పనులూ చేయించుకోలేకపోతున్నామని ఏపీసీ పలుమార్లు డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా వారిని రీప్యాట్రేషన్ చేశారు. సమగ్రశిక్ష సెక్టోరియల్ ఆఫీసర్ల నోటిఫికేషన్ రద్దు కమిషనర్ ఉత్తర్వులు పూర్వపు డీఈఓ నిర్వాకంతో విద్యా సంవత్సరం మధ్యలోనే సెక్టోరియల్ ఆఫీసర్లు రిలీవ్ కొత్తగా తీసుకునేందుకు హడావుడి నోటిఫికేషన్ -
●ఉక్కపోత.. ఉక్కిరిబిక్కిరి
అనంతపురం మెడికల్: ధ్రువీకరణ పత్రాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ టీచర్లు, దివ్యాంగులను ఉక్కిరిబిక్కిరి చేసింది. గురువారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మెడికల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్తో పాటు దివ్యాంగుల సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. డీఈఐసీ, బర్న్స్, ఆప్తాల్మిక్ వార్డుల్లో ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు పరిశీలించారు. మొదటి రోజు జిల్లాకు చెందిన 500 మందికిపైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఇక.. సదరం సర్టిఫికెట్లకు సంబంధించి ఈఎన్టీ, సైకీయాట్రీ వార్డులో పక్రియ చేపట్టారు. తగిన ఏర్పాట్లు లేకపోవడంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దివ్యాంగులు ప్రత్యక్ష నరకం చూశారు. ఉక్కపోతతో అల్లాడిపోయారు. నడవలేని స్థితిలో ఉన్న వారిని మోసుకుంటూ కుటుంబసభ్యులు అష్టకష్టాలు పడ్డారు. పగవానికి కూడా ఇలాంటి ఇబ్బంది రాకూడదని పలువురు వాపోయారు. వేలాది మంది వస్తారని తెలిసినా కేవలం 20 మంది కూర్చొనేందుకు చైర్లు వేశారు. ఈ క్రమంలో చేసేది లేక చాలా మంది చెట్ల కింద కూర్చున్నారు. దీనికితోడు తాగునీటి సౌకర్యం కూడా సరిగా కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎండల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలోనూ ఆస్పత్రి ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. -
ప్రమాదంలో ఫైర్మెన్ మృతి
కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఫైర్ మెన్ సుధాకర్ (40) దుర్మరణం పాలయ్యారు. అనంతపురంలో నివాసముంటున్న ఆయన పుట్టపర్తిలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఫైర్మెన్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం విధులు ముగించుకున్న ఆయన అనంతపురానికి వెళ్లే క్రమంలో మామిళ్లపల్లికి చేరుకున్నారు. అనంతరం బస్సు కోసం జాతీయ రహదారిని దాటుతుండగా బెంగళూరు నుంచి అనంతపురం వైపుగా వేగంగా వెళుతున్న లారీ ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య రమ్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అధికారులపై కక్ష సాధింపు తగదు
● ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఉరవకొండ: కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ను అమలు చేస్తున్నారని శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్పై బుధవారం ఆయన స్పందించి, ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్గా పీఎస్ఆర్ ఆంజనేయులు ఎంతో నిజాయితీతో పనిచేశారన్నారు. అలాంటి వ్యక్తిపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గు చేటన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని చంద్రబాబు గుర్తించాలన్నారు. రాజధాని కాంట్రాక్టు సంస్థల నుంచి భారీగా ముడపుల స్వీకరించి, హమీలను అమలు చేయకపోవడం, రూ. కోట్ల విలువైన భూములను కారుచౌకగా సూట్కేస్ కంపెనీలకు ధారాదత్తం చేయడం వంటి చర్యలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసహనాన్ని డైవర్ట్ చేసేందుకు ఇంతటి దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. నేటి నుంచి ఇంటర్ అధ్యాపకులకు శిక్షణ అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ విద్యా మండలి ఈ విద్యా సంవత్సరం (2025–26) నుంచి ప్రథమ సంవ్వత్సరం కోర్సుల్లో కొత్త సిలబస్ను ప్రవేశ పెట్టడం, ప్రశ్నాపత్రాల విధానంలో చేసిన మార్పులపై అధ్యాపకులకు గురువారం నుంచి జిల్లాస్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల కళాశాలలో జరిగే శిక్షణకు జిల్లాలోని రెగ్యులర్, కాంట్రాక్ట్, గెస్ట్ అధ్యాపకులు హాజరుకావాలని జిల్లా వృత్తి విద్యాధికారి ఎం.వెంకటరమణనాయక్ ఆదేశించారు. మొదటి దశ 24, 25 తేదీల్లో తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, రెండో దశ 28, 29 తేదీల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, మూడో దశ మే 2, 3 తేదీల్లో జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, చివరి నాలుగో దశ 5, 6 తేదీల్లో కామర్స్, సంస్కృతం అధ్యాపకులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఏ ఒక్కరికీ మినహాయింపు ఉండదని అందరూ విధిగా హాజరుకావాలని డీవీఈఓ స్పష్టం చేశారు. ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం రూరల్: జిల్లాలోని గొల్లలదొడ్డిలో ఉన్న గిరిజన గురుకుల కళాశాలలో 2025–26 ఇంటర్ మెదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామాంజనేయులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మే 7వ తేదీ లోపు https:/twreiscet. apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 98853 69079, 89782 39363, 83416 03090లో సంప్రదించవచ్చు. -
‘ఏపీఎఫ్ఆర్’ నమోదు తప్పనిసరి
● ప్రతి రైతు పేర్లూ నమోదు చేయండి ● జేడీఏ ఉమామహేశ్వరమ్మ గుత్తి రూరల్: ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసిన ప్రతి రైతూ తన పేరును ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ (ఏపీఎఫ్ఆర్) పోర్టల్లో నమోదు చేయాలని వ్యవసాయాధికారులను ఆ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. గుత్తిలోని జీవనోపాధుల వనరుల కేంద్రం (సీఎల్ఆర్సీ)లో బుధవారం 2025 ఖరీఫ్ సాగుకు సమాయత్తంపై గుత్తి డివిజన్లోని పామిడి, యాడికి, పెద్దవడుగూరు, గుత్తి, శింగనమల మండలాల వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఏ, ఎంపీఈఓలతో ఆమె సమావేశమై మాట్లాడారు. రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల అందజేతపై అవగాహన పెంచాలన్నారు. ఖరీఫ్ 2025 సీజన్లో కౌలు రైతులకు కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో లభించే ఎరువుల లభ్యతపై రైతులను చైతన్య పరిచి, సకాలంలో వాటిని అందించాలన్నారు. కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించిన యాడికి, పెద్దవడుగూరు మండలాల్లో వ్యవసాయ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో గుత్తి ఏడీఏ వెంకట్రాముడు, జేడీఏ కార్యాలయ సాంకేతిక వ్యవసాయాధికారులు వెంకటకుమార్, బాలానాయక్, వ్యవసాయాధికారులు ముస్తాక్ అహమ్మద్, లీనా వసుంధర పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు సీనియర్ నేషనల్ రగ్బీ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారు. అసోంలోని గౌహతిలో ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇందులో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న డి.శ్రీకాంత్ (పురుషుల జట్టు), వై.అశ్రియభాను (మహిళల జట్టు)కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా వారిని ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.రామచంద్ర, స్పోర్ట్స్ ఇన్చార్జి డాక్టర్ కె.శివానంద అభినందించారు. -
ఎన్సీడీసీ రుణాల రికవరీ పెరగాలి
అనంతపురం అగ్రికల్చర్: నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘాల సభ్యులు తీసుకున్న రాయితీ రుణాల రికవరీ పెరిగితే... కొత్తగా రుణ ప్రతిపాదనలు పంపిస్తామని షీప్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి అన్నారు. స్థానిక పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న షీప్ యూనియన్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఉమ్మడి జిల్లా మహాజన సభలో ఈ అంశంపై చాలా సేపు చర్చ సాగింది. ఈడీ కేఎల్ శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన మహాజనసభలో పర్సన్ ఇన్చార్జి హోదాలో డీడీ డాక్టర్ వై.రమేష్రెడ్డి, అలాగే పశుశాఖ జేడీ డాక్టర్ జీపీ వెంకటస్వామి, సహకార అధికారి మురళి తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్సీడీసీ నుంచి రూ.10 కోట్ల వరకు రుణాలు అందించామని, గడువు మీరినా ఇంకా రూ.2.50 కోట్ల రుణాల వసూళ్లు పెండింగ్లో ఉన్నందున కొత్తగా రుణాల మంజూరుకు అవరోధం ఏర్పడుతోందన్నారు. ఇది ఆర్థికంగా పురోగతి సాధించాలనుకున్న గొర్రెలు, మేకల సహకార సంఘాల సభ్యులకు ఇబ్బందిగా మారుతోందన్నారు. అనంతరం పెండింగ్ రుణాలు సాధ్యమైనంత తొందరగా చెల్లించాలని లేదంటే అవసరమైన చర్యలు తీసుకునేలా సభ ఆమోదం తెలిపింది. జిల్లా సమాఖ్య పాలకవర్గం ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించాలని దీనిపై ఈడీ నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. గొర్రెలు, మేకల పెంపకంపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నందున ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని జేడీ వెంకటస్వామి తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన పాలక వర్గాల అధ్యక్షులు, సభ్యులను పరిచయం చేసుకుంటూ... రిజిస్టర్లు, సమావేశాలు, ఆడిటింగ్ నిర్వహణ అంశంపై అవగాహన కల్పించారు. షీప్ యూనియన్ మహాజన సభలో చర్చ -
ప్రభుత్వ కార్యాలయం.. ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఔట్సోర్సింగ్ అంతకన్నా కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా కాదు. కానీ ప్రభుత్వ కార్యాలయంలో దర్జాగా కంప్యూటర్ ముందు కూర్చొని తన పని తాను చేసుకుంటున్నాడు. ఎవరని అడిగితే ప్రైవేట్ డ్రిప్ కంపెనీలో పనిచేస్తున్నాడట! ఏమి చేస్తున్నావంటే? ఏమీ లేదంటూనే... సీరియస్గా కంప్యూటర్లో వివరాలు నమోదు చేసుకోసాగాడు. బుధవారం ఉదయం సరిగ్గా 10.30 గంటలకు స్థానిక ఏపీ మైక్రో ఇరిగేషన్ ఆఫీసు (ఏపీఎంఐపీ) కార్యాలయంలో ఈ చోద్యం వెలుగు చూసింది. ఉదయం 10.45 గంటల నుంచి 11 గంటల మధ్య పీడీ, ఏపీడీ, సూపరింటెండెంట్, మైక్రో ఇంజనీర్లు, ఎంఐఏఓలు, క్లరికల్ స్టాఫ్ ఒక్కొక్కరూ కార్యాలయానికి వచ్చారు. అప్పటి వరకూ అతను కంప్యూటర్ను వదలకుండా అందులోని మొత్తం సమాచారాన్ని నోట్ చేసుకోవడం గమనార్హం. ఇతనొక్కడే కాదు అప్పుడప్పుడు ప్రైవేట్ వ్యక్తులు కొందరు కార్యాలయానికి చేరుకుని అధికారుల సీట్లలో దర్జాగా కూర్చొని వారి కంప్యూటర్లలోని సమాచారాన్ని తెలివిగా అపహరించుకెళుతున్నట్లుగా తెలిసింది. -
ఈత సరదా ప్రాణాలు బలిగొంది
కొడవలూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్తురాజుపాళెం శ్రీవెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో చదువుతున్న అనంతపురం జిల్లా విద్యార్థి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం గొళ్ల గ్రామానికి చెందిన కురుబన్ అంజన్కుమార్ (20) శ్రీవెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల హాస్టల్లోనే ఉండేవాడు. బుధవారం 3డే ఫెస్ట్ విజయోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అంజన్కుమార్ అనంతరం తన నలుగురు స్నేహితులతో కలసి రేగడిచెలికలోని బావి వద్దకు ఈత కొట్టేందుకని వెళ్లాడు. అంజన్, మరో ఇద్దరు బావిలో ఈతకు దిగారు. ఇద్దరు మాత్రం ఈత రాదంటూ బయటే ఉండిపోయారు. కాసేపటికి ఇద్దరు విద్యార్థులు బయటకు రాగా అంజన్ పైకి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన వారు కళాశాల యాజమాన్యం ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడకు చేరుకుని ఈత తెలిసిన వారితో బావిలో వెతికించారు. సుమారు 40 అడుగుల వరకూ నీళ్లు, అడుగున బురద ఉండటంతో అందులో కూరుకుపోయిన అంజన్ను వెలికి తీసేందుకు వీలు కాలేదు. ఎస్ఐ పి.నరేష్, కళాశాల యాజమాన్యం గజ ఈతగాళ్లను పిలిపించారు. వారు మృతదేహం కాలికి తాడు కట్టి వెలికి తీశారు. తల్లిదండ్రులకు ఇద్దరు ఆడ పిల్లల తర్వాత అంజన్ మూడో సంతానమని ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు. -
‘సాక్షి’ కార్యాలయంపై దాడి హేయం
విలేకరులపై దాడులు సరికాదు ఏలూరులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల దాడిని పత్రికా లోకం తీవ్రంగా ఖండిస్తోంది. ఎమ్మెల్యే దగ్గరుండి ఇలాంటి దాడులు చేయించడం మంచి పద్దతి కాదు. ఇలాంటి వారిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వెంటనే చర్యలు తీసుకోవాలి. మన జిల్లాలోనూ పత్రికా విలేకరులపై దాడులు చేస్తున్నారు. బూతులు తిడుతూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ముఖ్యమైన టీడీపీ నాయకులే ఇలా వ్యవహరిస్తున్నారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కలసి విన్నవించాం. దాడులు ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం. – రాచమల్లు భోగేశ్వరరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షుడు -
బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఏలూరులో సాక్షి కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చింతమనేని, ఆయన అనుచరులు సాక్షి కార్యాలయంపై చేసిన దాడిని యావత్ రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా పరిగణిస్తున్నారు. ఈ రోజు ఈ పత్రికకు జరగొచ్చు. రేపు ఇంకో పత్రికకు జరగొచ్చు. విలేకరులందరూ కలిసికట్టుగా కూటమి ప్రభుత్వ ఆగడాలను ఎండగట్టకపోతే భవిష్యత్తులో ఏ జర్నలిస్టూ పనిచేయలేని పరిస్థితి వస్తుంది. చింతమనేని బహిరంగ క్షమాపణలు చెప్పాలి. పూర్తిగా నేరచరిత్ర కలిగిన చింతమనేనిని చంద్రబాబు ప్రోత్సహించడం మంచిది కాదు. శాంతి స్థాపన అనే పవన్కళ్యాణ్ కూడా ఈ విషయంపై స్పందించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. శాంతియుతంగానే ఆయన ఇంటిని ముట్టడిస్తాం. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం బాధితుడి వాంగ్మూలం మేరకే రాశారనే విషయం చింతమనేని గుర్తుంచుకోవాలి. – గుండం రామచంద్రారెడ్డి (ఆర్సీఆర్), బ్యూరో ఇన్చార్జ్, అనంతపురం -
కక్ష పూరిత దాడులు చేస్తున్నారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలకులు సూపర్ సిక్స్ పథకాల అమలు పక్కన పెట్టి.. ‘సాక్షి’పై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారు. ఏలూరులో సాక్షి కార్యాలయంపై చింతమనేని, ఆయన అనుచరులు దాడి సిగ్గుచేటు. ఈ అంశాన్ని మేధావులు, ప్రజాప్రతినిధులు అందరూ ఖండించాలి. తక్షణమే చింతమనేని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేదంటే ఆయన కార్యాలయం ముట్టడికి మా విలేకరులు వెనుకాడరు. వ్యతిరేక వార్తలు రాస్తే ఖండన రాయమని కోరవచ్చు. స్వేచ్ఛ గురించి మాట్లాడిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వారి నాయకులను అదుపులో పెట్టుకోవాలి. లేదంటే వారి ఇళ్లను ముట్టడిస్తాం. ఈ ఉద్యమం ఇంతటో ఆగదు. – కె.అనిల్కుమార్ రెడ్డి, జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ఉగ్రదాడి పిరికిపంద చర్య
అనంతపురం కార్పొరేషన్: జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి పిరికిపంద చర్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అమాయకుల మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. ఈ దాడి యావత్ దేశాన్ని కలచి వేసిందని, బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఇటువంటి సమయంలో అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుద్దామన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగ కుండా కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.డిటోనేటర్ పేలి మహిళకు తీవ్ర గాయాలుపెద్దవడుగూరు: మండలంలోని అప్పేచెర్ల గ్రామంలో డిటోనేటర్ పేలి వ్యవసాయ మహిళా కూలీ సుంకమ్మ తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన మేరకు.. అప్పేచెర్లకు చెందిన రైతు చౌడప్ప పొలంలోని పత్తి కట్టెను తొలగించేందుకు బుధవారం మహిళా కూలీలు వెళ్లారు. అప్పటికే అడవి పందుల కోసమని గుర్తు తెలియని వ్యక్తులు కాయలాంటి పదార్థంలో డిటోనేటర్లు పెట్టి ఉంచారు. ఈ విషయం తెలియని మహిళా కూలీ సుంకమ్మ ఆసక్తిగా దానిని తీసుకుని పరిశీలించి, కాయను పగులగొట్టి తినే ప్రయత్నంలో భాగంగా రాయిపై పెట్టి మరో రాతితో బలంగా కొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి ఆమె ఎడమ చెయ్యి పూర్తిగా ఛిద్రమైంది. క్షతగాత్రురాలిని వెంటనే గుత్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
అమానుషం.. అనాగరికం
● కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శనఅనంతపురం కార్పొరేషన్: అమాయకుల ప్రాణాలు బలిగొనడం అమానుషం, అనాగరికమని వైఎస్సార్ సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ బుధవారం అనంతపురంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. జెడ్పీ కార్యాలయం సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ వరకూ ర్యాలీ కొనసాగింది. అక్కడ అమరుల స్థూపం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించిన అనంతరం జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి జరిగిందన్నారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేసి ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదన్నారు. విహార యాత్రకు వెళ్లిన అమాయకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం మేలుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు,అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్, మల్లెమీద నరసింహులు, అమర్నాథరెడ్డి, చంద్రశేఖరయాదవ్, చింతా సోమశేఖరరెడ్డి, గాజుల ఉమాపతి, ఓబిరెడ్డి, నాయకులు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, వెన్నం శివరామిరెడ్డి, కేశవరెడ్డి, పెన్నోబులేసు, వేముల నదీం, మారుతీనాయుడు, గౌని నాగన్న, మల్లెల వేణు, సతీష్,కృష్ణవేణి, దేవి, కాకర్ల శ్రీనివాసరెడ్డి, అనిల్కుమార్ గౌడ్, కార్పొరేటర్లు చంద్రమోహన్ రెడ్డి, సాకే చంద్రలేఖ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
నేడు సత్యసాయి ఆరాధనోత్సవాలు
ప్రశాంతి నిలయం: ప్రపంచ మానవాళికి ఆధ్యాత్మిక, మానవతా విలువలను బోధిస్తూ సన్మార్గం వైపు నడిపిన మహనీయుడు సత్యసాయి ఆరాధనోత్సవాలు గురువారం జరగనున్నాయి. ఇందు కోసం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సర్వం సిద్ధం చేశారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేక ఫల,పుష్ప దళాలతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. తమ ఇష్ట దైవం సత్యసాయికి ఆత్మనివేదన అర్పించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. వేడుకలు ఇలా... సత్యసాయి ఆరాధనోత్సవాలు సాయికుల్వంత్ సభా మందిరంలో గురువారం ఉదయం 8 గంటలకు సత్యసాయి మహాసమాధి చెంత వేదపఠనంతో ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.10 గంటలకు సత్యసాయి విద్యార్థులు సత్యసాయిని కీర్తిస్తూ పంచరత్నకీర్తనలు ఆలపిస్తారు. 9.05 గంటలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానంద ప్రారంభోపన్యాసం చేస్తారు. 9.15 గంటలకు సత్యసాయి శతజయంతి వేడుకల బ్రోచర్ విడుదల చేస్తారు. 9.30కు సత్యసాయి సేవా సంస్థల దేశీయ అధ్యక్షుడు నిమిష్ పాండే వేడుకలనుద్దేశించి ప్రసంగి స్తారు. 9.40కు శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని కార్యక్రమం ప్రారంభోత్సవం నిర్వహిస్తారు. 9.50కి సత్యసాయి పూర్వపు దివ్య ప్రసంగాన్ని డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. 10.10 గంటలకు భజనలు,అనంతరం మంగళహారతితో వేడుకలు ముగుస్తాయి. -
కలెక్టరేట్ ఎదుట ఆయుష్మాన్ సీహెచ్ఓల ధర్నా
అనంతపురం అర్బన్: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆయుష్మాన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ (ఏపీ మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సంఘం) జిల్లా అధ్యక్షుడు గణేష్కుమార్ మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం సీహెచ్ఓలకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఆరేళ్ల సర్వీసు దాటిని వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించి ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్నారు. ప్రతి నెలా వేతనంతో పాటు ఇన్సెంటీవ్, ఏటా 5 శాతం ఇంక్రిమెంట్ చెల్లించాలన్నారు. ఈపీఎఫ్ పునరుద్ధరించాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. నిర్ధిష్టమైన జాబ్ చార్ట్ అందించాలన్నారు. ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలను మినహాయించాలన్నారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలన్నారు. హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, బదిలీలు, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలువులు, తదతర వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకూ బాధ్యతతో కూడిన శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ వి.వినోద్కుమార్ను ఆయన చాంబర్ వద్ద నాయకులు కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి గౌరి, కార్యనిర్వాహక కార్యదర్శి షీబా ప్రియాంక, జిల్లా నాయకులు హరినాథ్రెడ్డి, సుధీర్, నాగరాజు, లక్ష్మీనారాయణ, సుబహాన్, హరి, తదితరులు పాల్గొన్నారు. -
రూ.లక్షలు కట్టమంటున్నారు
నా భర్త బాలకృష్ణతో కలసి నేను వ్యవసాయ కూలి పనులకు వెళుతూ ఇద్దరు కుమార్తెలను పోషించుకుంటున్నాం. ఓ రోజు రాధమ్మ మాటలు నమ్మి నా భర్తకు తెలియకుండా బ్యాంకు బుక్, ఆధార్, ఏటీఎం కార్డు తీసుకెళ్లి ఇచ్చాను. తర్వాత ఫైనాన్స్ కంపెనీ వారు వచ్చారంటూ కబురు పెట్టడంతో వెళ్లి వారిచ్చిన కాగితాలపై సంతకాలు చేసి, ఫొటో దిగి వచ్చాను. అయితే రుణం డబ్బు మాత్రం చేతికి అందలేదు. అడిగితే రిజెక్ట్ అయిందని చెప్పింది. రాధమ్మ ఊరు విడిచి వెళ్లిపోయిన తర్వాత ఫైనాన్స్ కంపెనీ వారు వచ్చి నా పేరుపై రూ.1.25 లక్షల రుణం ఉందని, డబ్బు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆ డబ్బు ఎలా కట్టాలో దిక్కుతోచడం లేదు. – భవాని, జి.కొట్టాల, గుంతకల్లు మండలం -
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
గుమ్మఘట్ట: మండలంలోని పూలకుంటకు చెందిన వెంకటేశులు, గంగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో జె.వెంటకంపల్లి సమీపంలో బీటీపీ ప్రధాన సాగునీటి కాలువలో మంగళవారం ఉదయం దుస్తులు ఉతకేందుకు తల్లి గంగమ్మతో పాటు కుమారుడు అభిరాం (8) వెళ్లాడు. కాలువ నీటిలో సరదాగా ఈత కొడుతున్న అభిరాం కాసేపటి తర్వాత నీటి మునిగాడు. గమనించిన గంగమ్మ గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి సమీపంలో ఉన్నవ ఉన్నవారు వెంటనే కాలువలో దిగి బాలుడిని వెలికి తీశారు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని చికిత్స నిమిత్తం రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి.. బాధిత తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుంతకల్లు రూరల్: మండలంలోని మైనాపురం గ్రామానికి చెందిన ఆదినారాయణ, ప్రభావతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి దగ్గర్లో ఉన్న పొలంలోని ఫారంపాండ్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో మంగళవారం ఈతకెళదామంటూ చిన్న కుమారుడు ప్రణీత్ (8) పట్టుబట్టాడు. దీంతో ప్రణీత్ను పిలుచుకుని నానమ్మ ఈరమ్మ ఫారంపాండ్ వద్దకు బయలుదేరింది. అయితే కాస్త దూరంగా ఉండగానే నానమ్మను వదిలి పరుగున వెళ్లిన ప్రణీత్.. ఫారంపాండ్లో దూకాడు. ఆ సమయంలో ఈరమ్మ గట్టిగా కేకలు వేయడంతో ఆ పక్కనే ఉన్న గొర్రెల కాపరులు అప్రమత్తమై నీటితో దూకి బాలుడిని వెలికి తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న ప్రణీత్ను వెంటనే గుత్తితోని ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. చికిత్స మొదలుపెట్టేలోపు బాలుడు మృతి చెందాడు. వేర్వేరు ప్రాంతాల్లో నీట మునిగి ఇద్దరు బాలుర మృతి -
దళిత కుటుంబంపై టీడీపీ నేత దాడి
ఉరవకొండ: వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో ఓ దళిత కుటుంబంపై ఆ గ్రామ టీడీపీ నేత, మాజీ సర్పంచ్ ఎర్రిస్వామి, ఆయన కుటుంబసభ్యులు దాడికి తెగబడ్డారు. బాధిత కుటుంబ యజమాని సురేష్బాబు తెలిపిన మేరకు... కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న సురేష్బాబు కుమార్తెను కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన యువకుడు తేజ వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. దీనిపై గతంలో వజ్రకరూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. ఇటీవల సురేష్బాబు కుమార్తెను తేజ కలసి మైనారిటీ తిరగానే పెళ్లి చేసుకుంటానని, తనను ఎవరూ అడ్డుకోలేరంటూ అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళితే వారు తేజాను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. అదే సమయంలో యువకుడి ఫోన్లో తనకు అడ్డంగా ఉన్న యువతి తండ్రి సురేష్బాబును హతమార్చేలా రూ.లక్ష సుపారీ ఇచ్చి ఒప్పందం చేసుకున్నట్లు ఉన్న ఆడియో బయటపడింది. ఈ ఆడియోను పోలీసులకు ఇవ్వడంతో యువకుడు మద్యం మత్తులో మాట్లాడి ఉంటాడని కొట్టి పడేశారు. అనంతరం రోజూ స్టేషన్కు వచ్చి సంతకం పెట్టి పోవాలని యువకుడికి పోలీసులు సూచించారు. ఈ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రిస్వామి జోక్యం చేసుకుని యువకుడిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా బయటకు తీసుకొచ్చారు. ఇది అన్యామంటూ సుధాకర్బాబు కుటుంబసభ్యులు ఎర్రిస్వామిని నిలదీస్తే దళితులై ఉండి తన ఇంటి వద్దకు ఎలా వస్తారంటూ దూషణలకు దిగడమే కాక మహిళలని కూడా చూడకుండా ఎర్రిస్వామి, ప్రకాష్, హనుమేష్తో పాటు మరో 10 మంది ఇష్టారాజ్యంగా దాడి చేశారు. అక్కడితో ఆగకుండా చర్చి వద్ద ఉన్న సురేష్బాబుపై ఎర్రిస్వామి ఇనుప రాడ్తో దాడి చేశాడు. ఘటనలో సురేష్బాబుతో పాటు కుమార్తె, ఇతర కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి మాట్లాడుతూ.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్నారు
అనంతపురం అర్బన్: గ్రామీణ పేదల వలసలు, ఆకలిచావులు నివారించేందుకు 100 రోజులు గ్యారెంటీ పనులు కల్పించే లక్ష్యంతో ఏర్పాటైన ‘ఉపాధి’ చట్టాన్ని పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలను సంఘటితంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కృష్ణకళామందిర్లో బహిరంగసభ నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ, వ్యవసాయ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు జెల్లి విల్సన్, ఏఐసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, ఉప ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రావు మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. బడ్జెట్లో రూ.4.60 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటే ఏటా తగ్గిస్తూ ఈ ఏడాది రూ.86 వేల కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కేంద్రానికి అనుకూలంగా రాష్ట్రప్రభుత్వం కూడా ఉపాధి చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మెటీరియల్ కాంపోనెట్ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. పథకంలో నిధులను కూలీలకే కేటాయించాలన్నారు. కుటుంబ జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా ప్రతి వయోజనుడికి విడిగా జాబ్కార్డు ఇవ్వాలన్నారు. రోజు కూలీ రూ.700 ఇవ్వాలన్నారు. ప్రతి గ్రూప్కు పని కల్పించకపోతే ఏడాదికి ప్రతి కూలీకి రూ.12 వేలు చొప్పున ఉపాధి భృతి చెల్లించాలన్నారు. సభలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, కాంగ్రెస్ మైనారిటీ సెల్ రాష్ట్ర చైర్మన్ దాదాగాంధీ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శి నారాయణస్వామి, శ్రీసత్యసాయి జిల్లా సీపీఐ కార్యదర్శి వేమయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున, సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక చర్యలను తిప్పికొట్టాలి బహిరంగసభలో వక్తల పిలుపు -
జిల్లా జడ్జిని కలిసిన ఎస్పీ
అనంతపురం: ఉమ్మడి జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి భీమారావును ఎస్పీ పి.జగదీష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టులోని చాంబర్లో జడ్జికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్ బొమ్మనహాళ్: క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న యువకులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. ఉద్దేహాళ్లో మంగళవారం బెట్టింగ్కు పాల్పడుతున్న యువకులు చికెన్ కబాబ్ సెంటర్ వన్నూరుస్వామి, చిన్నా, ఇమ్రాన్, మహేష్ను రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటిపై పెట్రోల్తో దాడి తాడిపత్రి టౌన్: స్థానిక శ్రీనివాసపురంలో నివాసముంటున్న బేల్దారి మల్లికార్జున ఇంటిపై మంగళవారం అదే కాలనీకి చెందిన చాకలి రాముడు బంధువు భరత్, మరో వ్యక్తి పెట్రోల్తో దాడి చేసారు. రెండు నెలల క్రితం స్థానిక జేసీ పార్కు వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో చాకలి రాముడు మృతి చెందిన విషయం తెలిసిందే. తన బంధువు మరణానికి కారణం మల్లికార్జుననే కక్షతో భరత్ ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. దీంతో ఇంట్లో విలువైన సామగ్రి కాలిపోయింది. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు. బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య బి.అనిత మంగళవారం విడుదల చేశారు. మొత్తం 33 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 29 మంది ఉత్తీర్ణులయ్యారు. -
ఇంకెంత కాలం పస్తులుంచుతారు?
అనంతపురం అర్బన్: వేతనాలివ్వకుండా ఇంకెన్నాళ్లు శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా పథకం కార్మికులను పస్తులుంచుతారంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. తక్షణమే ప్రత్యేక నిధులు విడుదల చేసి కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించాలంటూ శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షుడు జి.ఓబుళు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాజారెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో 600 మంది కార్మికులు వివిధ కాంట్రాక్ట్ ఏజెన్సీల కింద 16 ఏళ్లుగా పనిచేస్తున్నారన్నారు. వీరికి సంబంధించి నెలల తరబడి పీఎఫ్ బకాయిలు, వేతనాలు చెల్లించకుండా ఏజెన్సీల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పీఎఫ్, వేతనాలు చెల్లించని కాంట్రాక్టు ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా కార్మికులకు వేతన, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ వినోద్కుమార్ను కలిసి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, నీటి సరఫరా పథకం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాము, ఇతర నాయకులు పాల్గొన్నారు. తాగునీటి పథకం కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలి ధర్నాలో కార్మిక సంఘాల నేతల డిమాండ్ -
ఖాకీ డ్రెస్సు వేసుకుని డ్యూటీ చేయాల్సిన పోలీసులు... టీడీపీ నేతలకు వంగి వంగి సలాములు చేస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ల పనిమనిషిలా మారారంటూ విమర్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇప్పటివరకూ పని చేసిన ప్రతి చోటా విజయకుమార్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనంతపురం ఎస్పీగా అంజనా సిన్హా ఉన్నప్పుడు ఈయన చెన్నేకొత్తపల్లి ఎస్ఐగా పనిచేశారు. ఆ సమయంలో స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేయగా, పోలీసు ఉన్నతాధికారులు అప్పట్లో కర్నూలుకు బదిలీ చేసి వీఆర్లో పెట్టారు. మైదుకూరులో డీఎస్పీగా పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు రావడంతో శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేసి వీఆర్లో ఉంచారు. గార్లదిన్నెలో పదెకరాల భూమి! విజయకుమార్ పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత అనంతపురం జిల్లాలోని గార్లదిన్నెలో హైదరాబాద్– బెంగళూరు జాతీయ రహదారికి దగ్గరగా పదెకరాల భూమి కొన్నట్టు ఇప్పటికీ పోలీసు వర్గాలు కథలు కథలుగా చెప్పుకుంటున్నాయి. ఇంత పెద్ద ఎత్తున భూమి కొనడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరపత్రాల కలకలం గతంలో అనంతపురంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీఎస్పీగా విజయకుమార్ ఉన్న సమయంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) డీఎస్పీగా గంగయ్య ఉండేవారు. అప్పట్లో గంగయ్యకు, విజయమార్కు మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే గంగయ్యపై కొన్ని కరపత్రాలు బయటకు వచ్చాయి. వీటిని విజయకుమార్ వేయించారనే విమర్శలున్నాయి. ఆ తర్వాత విజయకుమార్ బండారాలన్నీ బయటపెడుతూ బయటకు వచ్చిన కరపత్రాలు కలకలం రేపాయి. ప్రబోదానంద కేసులో సస్పెండ్.. తనకు నచ్చినవారి కోసం పరిధి దాటి ప్రవర్తిస్తారని విజయకుమార్కు పేరుంది. గతంలో జేసీ అనుచరులు ప్రబోదానంద ఆశ్రమంపై దాడి చేసిన సమయంలో విజయకుమార్ ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీగా ఉండేవారు. అయినా సరే తాడిపత్రి ఇన్చార్జ్ డీఎస్పీగా వెళ్లి ఆ కేసును డీల్ చేశారు. ఆ కేసులో తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు విజయకుమార్ను సస్పెండ్ చేశారు. మహిళా సీఐపై పరుషంగా.. ప్రస్తుతం పుట్టపర్తి డీఎస్పీగా ఉన్న విజయకుమార్ ఇప్పటికీ తన వివాదాస్పద తీరు మార్చుకోలేదని తెలిసింది. కొన్ని రోజుల క్రితం ఓ మహిళా సీఐపై ఇష్టారాజ్యంగా నోరుపారేసుకున్నారు. దీంతో మహిళా సీఐ తీవ్ర మనస్తాపం చెంది విజయకుమార్పై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే, మహిళా సీఐకి న్యాయం చేయాల్సిన ఉన్నతాధికారులు.. బాధిత సీఐనే వీఆర్కు పంపించడం శ్రీసత్యసాయి జిల్లా పోలీసుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రామగిరి హెలిప్యాడ్ ఘటనలో ఘోర వైఫల్యం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఇటీవల విజయకుమార్ను రామగిరి మండలం కుంటిమద్ది సమీపంలో హెలిప్యాడ్ వద్ద సెక్యూరిటీ ఇన్చార్జ్గా వేశారు. ఒక మాజీ సీఎం వస్తున్న నేపథ్యంలో నిక్కచ్చిగా బందోబస్తు చేపట్టాల్సిన డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో హెలికాప్టర్ వద్దకు వేలాదిగా జనం వెళ్లడంతో విండ్షీల్డ్ విరిగింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పనిసరి పరిసితుల్లో రోడ్డుమార్గంలో బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఖాకీ డ్రెస్సు వేసు కున్న ఈ పోలీసు అధికారి ‘పచ్చ’చొక్కాల అడుగులకు మడుగులొత్తుతుండటం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.టీడీపీ ఎమ్మెల్యేలు ఆడినట్టే ఆట.. పాడినట్టే పాట పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ వ్యవహార శైలిపై సర్వత్రా తీవ్ర చర్చ పల్లె రఘునాథరెడ్డి గీత గీస్తే దాటిపోకుండా డ్యూటీ గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఇప్పటికీ తీరు మార్చుకోని వైనం -
ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అసంతృప్తి
అనంతపురం అర్బన్: ప్రభుత్వ సేవలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఐవీఆర్ఎస్ సర్వేలో అధికారుల పనితీరుపై ఈ మేరకు అభిప్రాయం వెల్లడించారని కలెక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, విలేజ్ సర్వేయర్లు, ఇతర సిబ్బందితో ఐవీఆర్ఎస్కు సంబంధించి కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే విధంగా పనిచేయాలన్నారు. రెవెన్యూ, సర్వే, పౌర సరఫరాల శాఖల అధికారుల పనితీరుపై నెగెటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకుని ప్రజలు మెచ్చేలా పనిచేయాలని ఆదేశించారు. భూ సమస్యలు, భూ సర్వే నిమిత్తం రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారా.. ఈ–సేవకు సంబంధించి నిర్దేశించిన రుసుం కంటే రైతుల నుంచి ఎక్కువ వసూలు చేశారా.. అని ప్రజలకు ఫోన్ చేసి అడుగుతున్నారన్నారు. కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్లో 37 మంది, అనంతపురం డివిజన్లో 30 మంది, గుంతకల్లు డివిజన్లో 14 మంది విలేజ్ సర్వేయర్లపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందిందన్నారు. కార్డుదారుల నుంచి అదనంగా డబ్బు వసూలు చేసిన ఎండీయూలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాలకు తహసీల్దార్లు, సీఎస్డీటీలు వెళ్లి విచారణ చేయాలని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓ కేశవ నాయుడు, సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్, డీఎస్ఓ జగన్మోహన్రావు, తహసీల్దార్లు, డీటీలు, తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలపై వ్యతిరేక అభిప్రాయం తీరు మార్చుకుని మెరుగైన సేవలందించాలి కలెక్టర్ వినోద్కుమార్ ఢిల్లీ వెళ్లిన కలెక్టర్ కలెక్టర్ వి.వినోద్కుమార్ మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి యూపీఎస్సీ బుధవారం ఢిల్లీలో నిర్వహించనున్న సన్నాహక సమావేశంలో కలెక్టర్ పాల్గొంటారు. తిరిగి ఆయన ఈ నెల 24న విధులకు హాజరవుతారు. దేశవ్యాప్తంగా 77 జిల్లాల నుంచి కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్రం నుంచి అనంతపురం కలెక్టర్తో పాటు మరో మూడు జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు. -
భువనేశ్వర్–యశ్వంత్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భువనేశ్వర్–యశ్వంత్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 24 నుంచి జాన్ 28 వరకు ప్రతి శనివారం భువనేశ్వర్ (02811) జంక్షన్ నుంచి యశ్వంత్పూర్కు రైలు బయలుదేరుతుందన్నారు. అదేవిధంగా మే 26 నుంచి జూన్ 30 తేదీ వరకు ప్రతి సోమవారం యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి బయలుదేరుతుందన్నారు. విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నరసరావుపేట, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం జంక్షన్, శ్రీ సత్యసాయి నిలయం, హిందూపురం రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ–కేవైసీ చేయించుకోండి● రేషన్ లబ్ధిదారులకు జేసీ శివ్ నారాయణ్ శర్మ సూచనఅనంతపురం అర్బన్: రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు ఈనెల 30లోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షించి తగిన ఆదేశాలిచ్చారు. ఈ–కేవైసీతో పారదర్శకత పెరుగుతుందని, నకిలీలను నిరోధించవచ్చన్నారు. జిల్లాలో ఇంకా 1,38,186 మంది ఈ–కేవైసీ చేయించుకోలేదన్నారు. వారి జాబితా రేషన్ షాపు డీలర్, వీఆర్వో, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దారు వద్ద ఉంటుందన్నారు. లబ్ధిదారులు సంబంధిత రేషన్ దుకాణం లేదా వీఆర్ఓ లేదా సచివాలయ సిబ్బంది వద్దకు వెళ్లి ఈ–పాస్ యంత్రంలో లేదా వీఎస్డబ్ల్యూఎస్ మొబైల్ యాప్లో వేలిముద్ర వేసి ఈ–కేవైసీ చేయించుకోవాలని చెప్పారు.నేడు ‘పది’ ఫలితాలుఅనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువుల్లో ఉత్తీర్ణతపై ఆందోళన నెలకొనగా... రాష్ట్రస్థాయిలో జిల్లా స్థానంపై విద్యాశాఖ అధికారులు కలవరపడుతున్నారు. గత నెల 17న ప్రారంభమైన పది పరీక్షలు ఈనెల 1తో ముగిశాయి. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 32,803 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇదే సమయంలో ఓపెన్ (సార్వత్రిక) పరీక్షలు జరిగాయి. రెగ్యులర్తో పాటు ఓపెన్ పది ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు.ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చుపదో తరగతి ఫలితాలు https://bse.ap. gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్సైట్లు, ‘మన మిత్ర’ (వాట్సాప్), ‘లీప్’ మొబైల్ యాప్లలో అందుబాటులో ఉంటాయని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్బాబు తెలిపారు. అలాగే వాట్సాప్లో 95523 00009 నంబర్కు ‘ఏజీ‘ అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, రోల్ నంబర్ను నమోదు చేస్తే ఫలితాల పీడీఎఫ్ పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని, ‘లీప్’ మొబైల్ యాప్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించారన్నారు.విద్యుదాఘాతంతో యువ రైతు మృతిరాయదుర్గం టౌన్/ బ్రహ్మసముద్రం: విద్యుత్ షాక్కు గురై ఓ యువ రైతు మృతి చెందాడు. వివరాలు... బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లికి చెందిన మాలింగ (32) వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం తాను సాగు చేసిన వరి పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లిన ఆయన మోటారు ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. గుర్తించిన పక్క పొలంలోని రైతులు వెంటనే రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, మాలింగకు భార్య అంజినమ్మ, ఓ కుమారుడు ఉన్నారు. -
జిల్లాలో మంగళవారం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వేసవితాపం అధికమైంది. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
ఎస్కేయూలో సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్సు ప్రారంభం అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సంయుక్తంగా ‘సర్టిఫికెట్ కోర్సు ఇన్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ అండ్ టెస్టింగ్’ను ప్రారంభించాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ఉద్యోగార్హత, పరిశ్రమల అనుసంధానం పెంచే లక్ష్యంతో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. కళాశాల–పరిశ్రమల మధ్య ఉండే అంతరం తగ్గేలా నైపుణ్య ఆధారిత కోర్సును అందించేలా చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రవేశపెట్టిన ‘ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ వెంచర్ డెవలప్మెంట్’ కోర్సు ద్వారా 400 మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందిన విషయం తెలిసిందే. తాజాగా రెండో కోర్సు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ అండ్ టెస్టింగ్ కోర్సును మంగళవారం ఎస్కేయూ ఇన్చార్జి వీసీ ఆచార్య బి.అనిత చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, అటల్ ఇంక్యుబేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.నాగభూషణరాజు, ప్రిన్సిపాల్ ఎ.కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. రైళ్లల్లో పోలీసుల విస్తృత తనిఖీలు అనంతపురం సిటీ: స్థానిక రైల్వే స్టేషన్లో రైళ్లను ప్రత్యేక పోలీస్ బృందం సహా మూడో పట్టణ పోలీసులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకూ ఈ తనిఖీలు కొనసాగాయి. గంజాయి దిగుమతిని అడ్డుకునే క్రమంలో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లన్నీ తనిఖీ చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు అనంతపురం మీదుగా వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలుకు సంబంధించిన అన్నీ బోగీలను జల్లెడ పట్టారు. అనుమానాస్పద ప్రయాణికులు, వారి లగేజీని జాగిలంతో తనిఖీ చేయించారు. -
జిల్లాలో గత పది నెలల్లో మహిళలకు సంబంధించి నమోదైన కేసుల వివరాలు..
అనంతపురం: ఆడపిల్లలకు భద్రత కరువైంది. బడిలో, బస్సులో ఇలా ఎక్కడ చూసినా పొంచి ఉన్న మృగాళ్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బిడ్డ ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ఆమె తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పడం లేదు. ఇక.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న ‘పచ్చ’ నేతలు కొందరు తామేమి చేసినా చెల్లుబాటవుతుందనే అహంకారంతో బాలికలు, మహిళలపై కూడా అకృత్యాలకు దిగుతున్నారు. ఇటీవల బొమ్మనహాళ్ మండలంలో ఓ ‘పచ్చ’ నేత బాలికను మానసికంగా, శారీరకంగా హింసించడమే ఇందుకు నిదర్శనం. చట్టమున్నా భయమేదీ..? బాలికలు, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడితే పోక్సో కేసు నమోదు చేస్తారని తెలిసినా మృగాళ్లు వెనక్కి తగ్గడం లేదు. గత పది నెలల కాలంలోనే 12 పోక్సో కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ఇలాంటి కేసుల్లో జీవిత ఖైదు లేదా 7 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే పరిస్థితి ఉన్నా లైంగిక దాడుల ఘటనలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. నేటి ‘స్మార్ట్’ యుగంలో చిన్న పిల్లలకు సైతం స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉండటం చేటు తెస్తోందని సైకాలజిస్టులు, విద్యావేత్తలు చెబుతున్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నారో వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలంటున్నారు. 18 మహిళలపై హింస 45అత్యాచారం 12చిన్నారులపై లైంగిక దాడులు2వరకట్న వేధింపులు 06మిస్సింగ్, కిడ్నాపింగ్ మైనర్లపై పెరుగుతున్న అకృత్యాలు గత పది నెలల్లోనే 12 పోక్సో కేసులు బయటికెళ్లిన ఆడబిడ్డ ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రుల్లో ఆందోళన -
దోచేందుకు చెత్త ఐడియా!
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో సంపాదనే పరమావధిగా అధికార పార్టీ నాయకులు ముందుకెళ్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందాన ప్రజాధనాన్ని ఊడ్చేస్తున్నారు. నగరంలో 50 డివిజన్ల నుంచి రోజూ 140 టన్నుల నుంచి 150 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. నిత్యం ఈ చెత్త తరలించేందుకు 30 అద్దె ట్రాక్టర్లను తీసుకోవాలని ఇటీవల నిర్ణయించారు. ఆరు నెలల పాటు ఒక్కో ట్రాక్టర్కు రోజు అద్దె రూ.2,100 చెల్లించేలా ఈ ఏడాది ఫిబ్రవరి 24న రూ.1.35 కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. మార్చి నుంచి అద్దె ట్రాక్టర్ల ద్వారా చెత్త తరలించే పద్ధతి అమలులోకి వచ్చింది. అంతా మాయే.. చెత్త ట్రాక్టర్ల నిర్వహణకు సంబంధించి పెద్ద గోల్మాల్ నడుస్తోంది. ప్రతి డివిజన్లో రోజూ అద్దె ట్రాక్టర్లు 1,000 నుంచి 1,100కుపైగా ఇళ్లను కవర్ చేయాలి. ఈ విధంగా మూడు ట్రిప్పుల వరకు తిరగాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. డివిజన్లకు రోజు మార్చి రోజు అద్దె ట్రాక్టర్లు వస్తున్నాయి. ఇక.. చెత్త తరలించే ట్రాక్టర్లను చూస్తే ఎవరైనా నివ్వెర పోవాల్సిందే. ఇసుక తరలించే ట్రాక్టర్ల కంటే మరీ చిన్నవిగా ఉంటున్నాయి. అందులో కనీసం వంద ఇళ్ల చెత్త కూడా పట్టదు. దీంతో పాటు తడి, పొడి చెత్తను వేర్వేరుగా తీసుకెళ్లేలా ట్రాక్టర్లో ఏర్పాట్లు ఉండటం లేదు. అద్దె ట్రాక్టర్ల నిర్వాహకులు చెత్తను తరలించేందుకు సొంతంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా.. చాలా మంది నగరపాలక సిబ్బందినే వాడుకుంటున్నారు. ట్రాక్టర్లకు ‘జీపీఎస్’ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా మారింది. అధికారుల కుమ్మక్కు.. నగరపాలక ఇంజినీరింగ్ విభాగంలో ఓ ఈఈ, డీఈ, ప్రజారోగ్యాధికారులు అద్దె ట్రాక్టర్ల కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టౌన్ ప్లానింగ్, రెవెన్యూ తదితర విభాగాల్లో కొందరు అధికారులు, సిబ్బంది టీడీపీ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చివరకు ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న చెత్త తరలింపు విషయంలోనూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అద్దె ట్రాక్టర్ల అడ్డగోలు బాగోతం రోజూ తిరగని వైనం జీపీఎస్ లేకుండా మాయ అధికారుల తీరుపైనా సందేహాలు రోజు మార్చి రోజు వస్తున్నారు చెత్త తరలించేందుకు వాహనాలు రోజూ రావడం లేదు. రోజు మార్చి రోజు వస్తున్నాయి. గతంలో ఇంటింటికీ వాహనాలు వచ్చేవి. చెత్తను ఎప్పటికప్పుడు తీసుకెళ్తే బాగుంటుంది. – కుళ్లాయప్ప, ఎర్రనేలకొట్టాలు, అనంతపురం -
‘అనంత ఆణిముత్యాలు’ పునఃప్రారంభం
● కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాప్తాడు: పేద విద్యార్థుల కోచింగ్లకు, కార్పొరేటు స్కూళ్లు, కళాశాలల్లో విద్యనభ్య సించేలా చేయూతనందించేందుకు ‘అనంత ఆణిముత్యాలు’ కార్యక్రమాన్ని పునఃప్రారంభించినట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయనగర్లో ఆర్జేసీ కల్యాణ మండపంలో ‘అనంత ఆణిముత్యాలు ఎడ్యుకేషన్ సొసైటీ’కి రూ.1,34,116 మెగా చెక్కును కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2009లో సొసైటీ ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికే ఏడుగురు విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. అప్పట్లో అందిన విరాళాలతో సొసైటీ కార్యకలాపాలు బాగా నడిచాయని, తర్వాత కొన్నాళ్లకే ఆగిపోయా యన్నారు. పేద విద్యార్థులకు సాయమందించాలనే ఉద్దేశంతో పునఃప్రారంభించామన్నారు. తన వంతు సహాయంగా రూ.10 వేలు అందించినట్లు తెలిపారు. ఉద్యోగులు, ప్రజలు కూడా చేయూతనందించాలన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్, అకౌంట్ నంబర్–1429 1001 1001 235, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్ 0814296కు విరాళాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతాం
రాప్తాడు: ప్రతి అర్జీకి సత్వర పరిష్కారం చూపే బాధ్యత తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీలోని చిన్మయనగర్ ఆర్జేసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ‘జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం అర్జీదారులతో కిటకిటలాడింది. కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే పరిటాల సునీత, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, మల్లికార్జునుడు, రామ్మోహన్, డీఆర్వో మలోల ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 407 వినతులు అందాయి. ఎక్కువ భాగం భూ సమస్యలపైనే ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అర్జీల్లో 70 నుంచి 80 శాతం పరిష్కారం చూపుతున్నారని, వంద శాతం పరిష్కరించేలా కృషి చేయాలని ఆదేశించారు. వినతుల్లో కొన్ని... ● రాప్తాడు సమీపంలో రైల్వే వంతెన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, పనులు ప్రారంభించి ఏడేళ్లవుతున్నా నేటికీ పూర్తి కాలేదని సర్పంచు సాకే తిరుపాల్ విన్నవించాడు. పండమేరు వంక (జేఎన్టీయూ) రహదారిలో బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని కోరాడు. వంక సమీపంలో ప్రభుత్వ స్థలం 25 ఎకరాల్లో పార్క్ మంజూరు చేయాలని, రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్కు కాంపౌడ్ వాల్ ఏర్పాటు చేయాలన్నాడు. పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించాడు. ● రాప్తాడు మండలంలోని మరూరు రెవెన్యూ గ్రామంలో భూమి రిజిస్ట్రేషన్కు సబ్ రిజిస్ట్రార్ ఎకరాకు రూ.1.50 లక్షలు అడుగుతున్నారని మరూరు గ్రామానికి చెందిన నారాయణస్వామి, కొండారెడ్డి, వీర నారప్ప, ఆదినారాయణ, నరసింహులు తదితరులు ఫిర్యాదు చేశారు. ● అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ బీఎన్ఆర్ కాలనీలో 1996లో 3 సెంట్ల చొప్పున స్థలం పంపిణీ చేశారని, ఈ క్రమంలో తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని పలువురు కాలనీ వాసులు కోరారు. చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు పరదేశి లక్ష్మీదేవి. బుక్కరాయసముద్రం మండలం గాంధీనగర్వాసి. కుమారుడు గురుమూర్తి, కుమార్తె లక్ష్మీదేవిని వృద్ధురాలు ఎంతో గారాబంగా పెంచింది. ఇద్దరికీ వివాహాలు కూడా చేసింది. కుమారుడు గురుమూర్తి మృతి చెందాడు. కుమార్తె లక్ష్మీదేవి కొన్నేళ్ల క్రితం భర్తతో గొడవపడి బనగానపల్లి నుంచి వచ్చేసి తల్లి దగ్గర ఉండేది. తల్లిని నమ్మించి రూ.3 లక్షలు నగదు, 3 తులాల బంగారు నగలు, 2 సెంట్ల స్థలం, 1–25 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకున్న లక్ష్మీదేవి... ఆ తర్వాత ఇంటి నుంచి ఆమెను బయటకు గెంటేసింది. ‘దిక్కున్న చోట చెప్పుకో ఇచ్చేదే లేదు’ అంటూ దాడి చేసింది. దీంతో దిక్కు తెలియని వృద్ధురాలు రాప్తాడులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తనకు న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పించింది. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాప్తాడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక వివిధ సమస్యలపై 407 వినతులు -
అధికార అండతో గత టీడీపీ ప్రభుత్వంలో సహజ వనరులను మామ కొల్లగొట్టాడు. తానేం తక్కువ అన్నట్లు అతని అల్లుడు కూడా ఇష్టారాజ్యంగా దోచేశాడు. జరిమానా విధిస్తే మామా అల్లుళ్లు పైసా కట్టలేదు. అలాంటి వారికి నియోజకవర్గ ప్రజా ప్రతినిధి కూడా సహకరిస్తుండటం విమర్శలకు దారి తీస
నేమకల్లు సమీపంలో ఏర్పాటైన క్రషర్ యూనిట్ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఒకవైపు మామ.. మరోవైపు అల్లుడు కూడబలుక్కుని రాయదుర్గం నియోజకవర్గంలో సహజ వనరులకు నిలయమైన నేమకల్లును లూటీ చేశారు. అత్యంత నాణ్యమైన కంకర ఇక్కడ లభిస్తుంది. దీనికోసం కొండలను మొత్తం పిండిచేశారు. మామ టీవీఎస్ కాంతారావు, అల్లుడు రఘు ప్రతాప్లు నేమకల్లులో ఉన్న సహజ వనరులను పూర్తిగా ఊడ్చేశారు. పదుల సంఖ్యలో కంకర మిషన్లు, జేసీబీలు, రవాణా వాహనాలతో రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లు రణగొణ ధ్వనులతో మారుమోగిపోతోంది. యంత్రాల శబ్దాలు, కాలుష్యంతో చుట్టుపక్కల పల్లెలు అల్లాడిపోతున్నాయి. అనుమతి గోరంత..తవ్వింది కొండంత మామ కాంతారావు..అల్లుడు రఘుప్రతాప్ ఇద్దరూ మైనింగ్ మాఫియా డాన్లే. రఘుప్రతాప్కు సర్వే నంబర్ 253లో 4.6 హెక్టార్లలో మాత్రమే గతంలో మైనింగ్కు అనుమతి ఉండగా రమారమి 30 ఎకరాల్లో తవ్వినట్టు స్థానికులు చెబుతున్నారు. 2019లో అక్రమ మైనింగ్ జరిపారని అప్పటి మైనింగ్ అధికారులు విచారణ చేసి రూ.7.07 కోట్ల జరిమానా విధించారు. కానీ ఇప్పటివరకూ రఘుప్రతాప్ ఒక్కపైసా కట్టలేదు. పైగా ఇప్పుడు జరిమానా మాఫీ చేయించుకునేందుకు నేరుగా సీఎంఓ నుంచి పునః పరిశీలన అనుమతులు తెచ్చుకున్నారు. అప్పుడు జరిమానా విధించిన అధికారులతోనే ఇప్పుడు ఎలాంటి అక్రమాలు లేవని నివేదిక ఇప్పించేందుకు స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి తెస్తున్నారు. దీంతో మామ కాంతారావు కట్టాల్సిన రూ.13 కోట్లు, అల్లుడు రఘుప్రతాప్ కట్టాల్సిన రూ.7 కోట్లలో ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అనుమతులు లేకుండానే మైనింగ్ ఓవైపు జరిమానాలు విధించారు. అవి ఇప్పటివరకూ కట్టనే లేదు. పోనీ కనీసం కొత్తగా అనుమతులైనా ఉన్నాయా అంటే అదీ లేదు. కూటమి సర్కారు వచ్చిన మరుసటి రోజు నుంచే మామా అల్లుళ్లు నేమకల్లు పరిసరాల్లో వాలిపోయారు. ఇక్కడ లభించే కంకరను కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే 40 ఎకరాల గుట్ట కరిగిపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. భారీ వాహనాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. నేమకల్లులో ఇలాగే మైనింగ్ కొనసాగితే భవిష్యత్తులో కొత్తగా ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు టిప్పర్ కంకర కూడా మిగిలేలా లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. పెచ్చుమీరిన ఆగడాలు.. రాయదుర్గం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ గత కొన్ని నెలలుగా అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. మరోవైపు అక్రమ మైనింగ్తో కొండలను పిండి చేస్తున్నారు. వీటన్నింటినీ ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా జరుగుతున్నా ‘కాలవ’ కిమ్మనడం లేదు. మైనింగ్ మాఫియాకు పూర్తి స్థాయిలో రాజకీయ అండదండలున్నట్టు విమర్శలున్నాయి. మైనింగ్ డీడీ ఉన్నా లేనట్టే... ఇటీవల జిల్లా గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్గా వెంకటేశ్వర్లు వచ్చారు. ఈయన ఆధ్వర్యంలో ఎక్కడా తనిఖీలు లేవు. ఎవరికి నచ్చినట్టు వారు దోపిడీ చేసుకోవచ్చు. దోపిడీ జరుగుతోందంటూ ఎవరైనా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ప్రజాప్రతినిధులు ఎవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. ‘నాకు ఇక్కడ పనిచేయాలని లేదు, ఎప్పుడు బదిలీ వచ్చినా వెళ్లిపోతా’ అని చెబుతున్నారు. నేమకల్లు పరిసరాల్లో దోపిడీపై వివరణ కోరేందుకు డీడీకి ఫోన్ చేసినా స్పందించలేదు. నేమకల్లు సహజవనరులను ఊడ్చేసిన రఘుప్రతాప్ మామ కాంతారావుతో కలిసి దోపిడీ ప్రతాప్ చెల్లించాల్సిన రూ.7 కోట్ల జరిమానాకు ఎగనామం అనుమతి లేకుండానే క్రషర్లతో కొండలను పిండిచేస్తున్న వైనం మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూస్తే ఒట్టు అండగా నిలిచిన ‘దుర్గం’ ప్రజాప్రతినిధి -
కత్తి పోటుకు గురైన యువకుడి మృతి
తాడిపత్రి టౌన్: ఈ నెల 16న కత్తి పోటుకు గురైన యువకుడు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పామిడి గ్రామానికి చెందిన మహేష్కుమార్ (29)కు తాడిపత్రిలోని ఓం శాంతి నగర్లో నివాసముంటున్న మణితో వివాహమైంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన భార్యను పిలుచుకెళ్లేందుకు ఈ నెల 16న మహేష్కుమార్ తాడిపత్రికి వచ్చాడు. అదే రోజు తన అత్తింటి పక్కనే ఉన్న ఫైరోజ్ తన కుటుంబసభ్యులు రమీజా, ఖాజీబీతో గొడవపడుతుంటే మహేష్కుమార్ జోక్యం చేసుకుని విడిపించే ప్రయత్నం చేశాడు. అప్పటికే కూరగాయల కత్తితో తన కుటుంబసభ్యురాలిపై ఫైరోజ్ దాడి చేయబోతుండగా అడ్డుగా ఉన్న మహేష్కుమార్ పొట్టను తాకడంతో లోతైన గాటు పడింది. కుటుంబసభ్యులు వెంటనే స్థానిక (తాడిపత్రి) ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన అక్కడి వైద్యులు చిన్నపాటి గాయమేనంటూ మూడు కుట్లు వేసి ఇంటికి పంపారు.అయితే కడుపు నొప్పి అంటూ బాధపడుతుండడంతో మరుసటి రోజు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి పిలుచుకెళ్లారు. అక్కడ రెండు రోజుల పాటు అడ్మిషన్లో ఉంచుకుని సాధారణ చికిత్స అందిస్తుండడంతో పరిస్థితి కాస్త విషమించింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించిన అనంతరం కడుపులో పేగు తెగిందని నిర్ధారించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తీసుకెళ్లాలని చేతులెత్తేశారు. దీంతో కుటుంబసభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మహేష్కుమార్ సోమవారం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గొడవ పడుతున్న వారిని విడిపించేందుకు యత్నించడమే శాపంగా మారిన వైనం -
డ్రిప్ మంజూరులో అనంతపురం జిల్లాకు అగ్రస్థానం
అనంతపురం సెంట్రల్: డ్రిప్, స్పింక్లర్ల మంజూరులో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం, జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందని ఏపీఎంఐపీ రాష్ట్ర ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నగరంలో ప్రాంతీయ ఉద్యాన శిక్షణా సంస్థ కార్యాలయంలో మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్లు, కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసత్య సాయి జిల్లా రాష్ట్రంలో నాలుగు, జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో ఉందని అభినందించారు. రైతుల పొలాల్లో పరికరాలను త్వరితగతిన అమర్చి సకాలంలో పంటలు సాగు చేసుకునేందుకు సహకరించాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వంద శాతం రైతులు డ్రిప్ వాడేలా చూడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ అనంతపురం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రఘునాథరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ఏపీఎంఐపీ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.ఇంటర్ ఫీజు చెల్లింపునకు నేడు ఆఖరుఅనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు మంగళవారంతో ముగుస్తుందని ఇంటర్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం.వెంకటరమణ నాయక్ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇంప్రూవ్మెంట్ రాసే విద్యార్థులు వెంటనే పరీక్ష ఫీజు సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. ఫీజు బకాయి ఉందనే సాకుతో ప్రైవేట్ జూనియర్ కళాశాలల యజమాన్యాలు విద్యార్థుల నుంచి కట్టించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరూ తప్పనిసరిగా పరీక్ష ఫీజు చెల్లించేలా చూడాల్సిన బాధ్యత ఆయా కళాశాలల యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు.నేడు అనంత కోర్టుకు బోరుగడ్డ అనిల్అనంతపురం: నగరంలోని మొబైల్ కోర్టుకు మంగళవారం బోరుగడ్డ అనిల్ హాజరుకానున్నారు. స్థానిక రామచంద్రానగర్ చర్చికి సంబంధించి ఆదాయం లెక్కింపు అంశంలో పోలీసులను దూషించాడనే అభియోగంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్ను పోలీసులు ఎస్కార్టుతో అనంతపురం కోర్టుకు తీసుకురానున్నారు.తగ్గుతున్న చింత పండు ధరలుహిందూపురం అర్బన్: హిందూపురం వ్యవసాయ మార్కెట్లో గత మూడు వారాలుగా చింత పండు ధరలు పడిపోతున్నాయి. సోమవారం 881.70 క్వింటాళ్ల చింత పండు వచ్చింది. మార్కెట్లో ఈ నామ్ పద్ధతిలో వేలం పాటలు సాగాయి. కరిపులి రకం క్వింటా గరిష్ట ధర రూ.19,500, కనిష్టం రూ.8 వేలు, సగటు రూ.15 వేలు పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్ట ధర రూ.12,500, కనిష్టం రూ.4,420, సగటు ధర రూ.8 వేలు పలికింది. గత వారంతో పోలిస్తే కరిపులి కరం క్వింటాపై రూ.1,000 తగ్గుదల కనిపించింది. వాతావరణ మార్పులు, చల్లదనంతో ధరలు తగ్గుముఖం పట్టినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. -
●21 మండలాల్లో అకాల వర్షం
పెద్దవడుగూరు మండలం అప్పేచర్లలో విరిగిపడిన బొప్పాయి చెట్లను చూపుతున్న బాధిత రైతు అనంతపురం అగ్రికల్చర్: ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు 21 మండలాల పరిధిలో 12.7 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఆత్మకూరులో 72.2 మి.మీ, గుంతకల్లు 68.2 మి.మీ భారీ వర్షం కురిసింది. వజ్రకరూరు 46.2 మి.మీ, శెట్టూరు 34.4,కుందుర్పి 29.6, కళ్యాణదుర్గం 29.4, కంబదూరు 18.6, బ్రహ్మసముద్రం 17, బెళుగుప్ప 15.2, గుత్తి 14.4, రాయదుర్గం, గుమ్మఘట్ట 10.2 మి.మీ వర్షం కురిసింది. రాప్తాడు, విడపనకల్లు, కణేకల్లు, పామిడి, ఉరవకొండ, డీ.హీరేహాళ్, పెద్దవడుగూరు, యాడికి, బొమ్మనహాళ్ మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీయడంతో రూ.2 కోట్ల మేర పంటనష్టం వాటిల్లినట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్న, పత్తితో పాటు అరటి, చీనీ, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. -
‘ప్రతి ఎకరాకూ కృష్ణా జలాలు అందించాలి’
గుంతకల్లు రూరల్: హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రతి ఎకరాకు కృష్ణా జలాలు అందించాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతీప్రసాద్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యుడు కసాపురం రమేష్తో కలసి సోమవారం ఆయన జి.కొట్టాల వద్ద చేపట్టిన హంద్రీ–నీవా కాలువ పనులను పరిశీలించి, మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు హంద్రీ–నీవా కాలువను 10వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉండేలా వెడల్పు చేయాలన్నారు. అప్పటి వరకూ కాలవకు లైనింగ్ పనులు చేయరాదన్నారు. రాగులపాడు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా వజ్రకరూరు, గుంతకల్లు, పామిడి మండలాల్లోని గ్రామాలకు తాగు, సాగునీటిని అందించాలన్నారు. -
అధికారులదీ అదే తీరు!
అనంతపురం అగ్రికల్చర్: పాలకుడు సమర్థుడైతే.. అధికారులు సైతం విధులు సక్రమంగా నిర్వరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటారని పెద్దలు అంటుంటారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ పనితీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. యథా రాజా... తథా అధికారులు అనే విధంగా రైతు సంక్షేమాన్ని పట్టించుకోని కూటమి సర్కార్ బాటలోనే జిల్లా వ్యవసాయ శాఖ నడుస్తోంది. వ్యవసాయశాఖ అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు రైతు దరికి చేరడం లేదు. గత ఖరీఫ్, రబీలో పూర్తి స్థాయిలో రాయితీ విత్తన వేరుశనగ, పప్పుశెనగ, కందులు, అలాగే ప్రత్యామ్నాయ విత్తనాలు అందించకుండానే చేతులెత్తేశారు. తాజాగా జిల్లాకు కేటాయించిన రూ.3 కోట్లు యాంత్రీకరణ బడ్జెట్ కూడా ఖర్చు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. యాంత్రీకరణ కింద రోటావీటర్లు, వివిధ రకాల స్ప్రేయర్లు, టిల్లర్లు, ఇతరత్రా పనిముట్లు రైతులకు చాలా వరకు అవసరం ఉన్నా... ప్రచార లోపం, సమన్వయం కొరవడటంతో ఇంకా రూ.1.30 కోట్లు బడ్జెట్ మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. వ్యవసాయ యాంత్రీకరణ కింద 1,661 యూనిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రహసనంలా డ్రోన్ల మంజూరు.. ఆర్కేవీవై కింద జిల్లాకు కమ్యూనిటీ హైయరింగ్ సెంటర్ల (సీహెచ్సీ) గ్రూపులకు 80 శాతం రాయితీతో కిసాన్ డ్రోన్లు మంజూరు చేస్తామంటూ ఆరు నెలలుగా చెబుతున్నా... ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. 35 కిసాన్ డ్రోన్లు మంజూరుకు గాను డ్రాగో కంపెనీ డ్రోన్ ఖరీదు రూ.9.80 లక్షలు, విహంగ కంపెనీ డ్రోన్ ఖరీదు రూ.9.81 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో ప్రస్తుతం రైతు గ్రూపులు తమ వాటా కింద 50 శాతం చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పిస్తామంటున్నారు. డ్రోన్ ఇచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత రైతుకు రాయితీ జమ చేస్తామని మెలికపెట్టడంతో ఇప్పటికిప్పుడు రూ.5 లక్షలు కట్టడానికి రైతు గ్రూపులు మొగ్గు చూపడం లేదు. అక్కడక్కడ కొందరు రైతులు ముందుకు వస్తున్నా... వైఎస్సార్సీపీ ముద్ర వేసి తిరస్కరిస్తున్నారు. దీంతో కిసాన్ డ్రోన్ల మంజూరు కాస్త ఓ ప్రహసనంలా మారింది. నత్తనడకన రైతు విశిష్ట సంఖ్య నమోదు.. ప్రతి రైతుకూ ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రక్రియ కాస్త సాంకేతిక సమస్యల కారణంగా మందకొడిగా సాగుతోంది. 3.40 లక్షల మందికి విశిష్ట సంఖ్య కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నా... 1.98 లక్షల మందికి పూర్తి చేశారు. దీని కోసం రైతులు ముందుకు వస్తున్నా యాప్ సక్రమంగా పనిచేయక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సమస్య పరిష్కారానికి అధికారులు మొగ్గు చూపకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అందుబాటులో లేని అధికారులు.. పీఎం కిసాన్ కింద తమకు రూ.2 వేలు సొమ్ము జమ కావడం లేదని రోజూ రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న రైతులకు అధికారులు అందుబాటులో ఉండటం లేదంటున్నారు. స్వయానా జిల్లా అధికారే కార్యాలయంలో గంట కూడా ఉండటం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. కలెక్టర్, కమిషనర్ సమీక్షలు, జూమ్ కాన్ఫరెన్స్లు, క్యాంప్లంటూ ఉన్న సమయమంతా వారికే కేటాయించేస్తున్నారు. అన్నదాత సుఖీభవ, ఇన్పుట్సబ్సిడీ, ఇన్సూరెన్స్, కరువు మండలాల ప్రకటన అంశంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులను దగా చేస్తుంటే మరో పక్క వ్యవసాయశాఖ కూడా తన వంతు బాధ్యతగా సర్కారు బాటలోనే నడుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ పథకాల అమలులో అడుగడుగునా అలసత్వం -
కాలువ లైనింగ్తో రైతులకు విఘాతం
అనంతపురం: హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులతో అనంత రైతన్న తీవ్రంగా నష్టపోతాడని జలసాధన సమితి నాయకుడు, ప్రముఖ న్యాయవాది రామకుమార్ అన్నారు. ‘రాయలసీమ కరువు– నీటి సవాళ్లు– వాటి పరిష్కార మార్గాలు – సాధ్యాసాధ్యాలు’ అంశంపై శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్ఏ (ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ ) రాష్ట్ర అధ్యక్షుడు వేమన ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాయలసీమలో ప్రతి ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారా నీరు ఇచ్చినప్పుడే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కుతుందన్నారు. ప్రస్తుతం 53 వేల ఎకరాల భూమితో పాటు అదనంగా మరో 44 వేల ఎకరాల భూమిని అమరావతి రాజధాని ప్రాంతానికి సేకరించి మరోసారి నిర్భంధ అభివృద్ధి కేంద్రీకరణ చేస్తున్నారన్నారు. ఫలితంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తున్నారని రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి అన్నారు. సిద్ధేశ్వరం వద్ద కృష్ణా నదిపై కేంద్రం నిర్మిస్తున్న నేషనల్ హైవేలో భాగంగా తీగల వంతెన నిర్మాణం బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం కోరకపోవడం అన్యాయమన్నారు. కర్ణాటకలో చేటప్టిన అప్పర్భద్ర నిర్మాణాన్ని మన పాలకులు ఆపలేకపోవడంతో రాయలసీమ పశ్చిమ ప్రాంతానికి జీవనాధారమైన హెచ్చెల్సీ, ఎల్ఎల్సీ ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ఉద్యమానికి సోషల్ మీడియా ద్వారా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ నాయకుడు సాకే హరి, అశోక్ వర్ధన్, రామాంజినేయులు, రాహుల్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఏ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు వెంకటేశ్, లక్ష్మీవిశ్వనాథ్, హరిత, అరుణోదయ కళాకారులు చంద్రన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు. జల సాధన సమితి నాయకులు -
ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
శ్రీరామిరెడ్డి పథకం తాగునీరే మాకు దిక్కు. ఊర్లో బోర్లలో నీరు ఉప్పుగా ఉంటున్నాయి. వాటిని తాగలేక పోతున్నాం. ఎండకాలంలో ఇంతటి కష్టం వస్తోందని అనుకోలేదు. – మారెక్క, గోనబావి, గుమ్మఘట్ట మండలం రెండు రోజుల్లో పరిష్కారం కార్మికులతో చర్చలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. సమస్యకు ఒకట్రెండు రోజుల్లో పరిష్కారం దక్కుతుంది. రూ.8 కోట్ల వేతన బకాయిలు చెల్లించేలా నివేదికలు సమర్పించారు. త్వరలో కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమ అవుతాయి. లీకేజీలు తాత్కలికంగా అరికట్టేలా చర్యలు తీసుకుంటాం. కొత్త లైన్ ఏర్పాటుకు ప్రణాళికలు చేపట్టాం. – శిరీష, శ్రీరామిరెడ్డి పథకం డీఈ, అనంతపురం -
రేపు షీప్ యూనియన్ మహాజన సభ
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘాల జిల్లా సమాఖ్య మహాజన సభ ఈ నెల 23న నిర్వహించనున్నారు. ఈ మేరకు యూనియన్ పర్సన్ ఇన్చార్జి డాక్టర్ వై.రమేష్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతపురంలోని పశుసంవర్ధకశాఖ జేడీ ప్రాంగణంలో ఉన్న యూనియన్ కార్యాలయంలో బుధవారం జరిగే వార్షిక మహాజన సభకు సహకార సంఘాల అఽధ్యక్షులు, పర్సన్ ఇన్చార్జిలు, డైరెక్టర్లు హాజరుకావాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికై న అధ్యక్షులను అభినందించడం, పరిచయాలు, ఏడాది ప్రగతికి సంబంధించి ఆడిట్ రిపోర్టులు, ఎన్సీడీసీ రుణాల రికవరీలపై చర్చ, యూనియన్లో గౌరవ వేతనంతో పనిచేస్తున్న రామలింగయ్య జీతభత్యాల పెంపుపై చర్చ, జూన్లో ముగియనున్న సంఘాలకు ఎన్నికలు, జిల్లా సమాఖ్య ఎన్నికలు, యూనియన్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చకు అజెండా రూపొందించారు.బస్టాండ్లో ప్రయాణికురాలి మృతితాడిపత్రి టౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం ఓ గుర్తు తెలియని ప్రయాణికురాలు (70) మృతి చెందింది. ఆదివారం రాత్రి బస్టాండ్కు చేరుకున్న వృద్దురాలు కుర్చీలో కూర్చొని అలాగే కన్నుమూసింది. అయితే అర్ధరాత్రి కావస్తున్నా చలనం లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆర్టీసీ సిబ్బంది ఆమెను పలకరించే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఉలుకుపలుకు లేకపోవడంతో మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే తాడిపత్రి పోలీసులను సంప్రదించాలని కోరారు.పొలంలో వ్యక్తి మృతదేహంపుట్లూరు: మండలంలోని జి.వెంగన్నపల్లి సమీప పొలంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తెల్లని దుస్తులు ధరించిన దాదాపు 50 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి రెండు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎండ తీవ్రతకు శరీరం నల్లబారి, బొబ్బలు తేలాయి. గుర్తు పట్టలేని స్థితిలో దుర్వాసన వెదజల్లుతోంది. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. వ్యక్తి మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని పుట్లూరు పోలీసులు కోరారు. -
బిందెడు నీటికి బండెడు కష్టాలు
రాయదుర్గం: ఉమ్మడి జిల్లాల్లోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల పరిధిలో ఉన్న 727 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చే శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కూటమి సర్కార్ ఘోర వైఫల్యాల కారణంగా పల్లెలన్నీ గొంతెండుతున్నాయి. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు పొలాల వెంబడి పరుగు తీస్తున్నారు. 16 రోజులుగా నిలిచిపోయిన తాగునీటి సరఫరా లక్షలాది మంది గొంతు తడిపే అతిపెద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని అధికారం చేపట్టి పట్టుమని పది నెలల కాకనే చంద్రబాబు సర్కార్ అటకెక్కించింది. నిర్వహణ చేతకాక చేతులెత్తేసింది. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో 16 రోజులుగా కార్మికులు సమ్మె బాటపట్టారు. దీంతో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం లబ్ధి పొందుతున్న గ్రామాల్లో ప్రజలు కన్నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ బోర్లే దిక్కు ఉమ్మడి జిల్లాల్లోని చాలా గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. విద్యుత్ సరఫరా ప్రారంభం కాగానే పొలాల్లోకి పరుగులు తీస్తున్నారు. రైతుల నుంచి ఎదురయ్యే ఛీత్కారాలను మౌనంగా భరిస్తూ తమ నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. నీటి కష్టాలు చూసిన ట్యాంకర్ల నిర్వాహకులు ధర అమాంతం పెంచేశారు. పట్టణాల్లో ఒక్కో ట్యాంకర్కు రూ.800 నుంచి రూ. వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. అది కూడా అర్ధరాత్రి సమయంలో ట్యాంకర్లు వస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సమ్మె విరమిస్తేనే ప్రయోజనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో 800 మంది కార్మి కులు పనిచేస్తుండగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వివిధ కారణాలతో ఆ సంఖ్య 630కి కుదించారు. సూపర్వైజర్లు మరో 20 మంది ఉన్నారు. నిత్యం 47 ఎంల్డీ నీటిని ఉరవకొండ నియోజకవర్గం పీఏబీఆర్ పంప్హౌస్ నుంచి పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. దీంతో కార్మికుల వేతన బకాయిలు రూ.8 కోట్లకు చేరుకుంది. పలు దఫాలుగా నిరసనలు వ్యక్తం చేసినా... చర్చల పేరుతో కార్మికులను మభ్య పెట్టారు తప్ప సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. దీంతో గత్యంతరం లేని స్థితిలో కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. నిండు వేసవిలో 16 రోజులుగా తాగునీటి పథకం ద్వారా నీరందక పోవడంతో ప్రజల ఇక్కట్లు నానాటికీ జటిలమవుతున్నాయి. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరితేగాని సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నిర్వీర్యం వేతనాలు అందించలేని దుస్థితిలో ‘బాబు’ సర్కార్ ఈ నెల 6 నుంచి సమ్మెలో కార్మికులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 727 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా -
గోవుల సంరక్షణకు సహకరిస్తాం
● గోశాల నిర్వాహకులకు కలెక్టర్ వినోద్కుమార్ సూచన అనంతపురం అర్బన్: గోవుల సంరక్షణకు అవసరమైతే జిల్లా యంత్రాంగం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఇస్కాన్ గోశాల ఇన్చార్జి దామోదర్ గౌరంగదాస్కు కలెక్టర్ వి.వినోద్కుమార్ సూచించారు. కలెక్టరేట్ సమీపంలోని ఇస్కాన్ గోశాలను ఆదివారం కలెక్టర్ సందర్శించారు. గోవులకు పచ్చగడ్డి, అరటిపండ్లు, బెల్లం తినిపించారు. ఎంత విస్తీర్ణంలో గోశాల ఏర్పాటు చేశారు? ఎన్ని గోవులున్నాయి? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 2.70 ఎకరాల విస్తీర్ణంలో గోశాల ఏర్పాటు చేయగా... ప్రస్తుతం 440 ఆవులు ఉన్నాయని, గడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదని గోశాల ఇన్చార్జి తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నగర రహదారులపై సంచరిస్తున్న పశువులకూ ఆశ్రయం కల్పించాలని సూచించారు. దీంతో గోశాలకు అదనపు భూమి కేటాయిస్తే వాటిని అక్కడ ఉంచి సంరక్షిస్తామని కలెక్టర్కు ఇన్చార్జి తెలిపారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ భూ కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అనంతరం గోశాలలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటస్వామి, ఏడీ రత్నకుమార్, తహసీల్దార్లు పుణ్యవతి, మోహన్కుమార్, తదితరులు పాల్గొన్నారు. క్షతగాత్రుడి ప్రాణాలు కాపాడిన డీఎస్పీ రాప్తాడు: ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అసహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుడిని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు సకాలంలో తన వాహనంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. రాప్తాడుకు చెందిన యువకుడు చెడిపోతుల కుళ్లాయప్ప ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళుతూ జేఎన్టీయూ మార్గంలోని భారత్ గ్యాస్ కార్యాలయం ఎదుట డివైడర్ను ఢీకొని తీవ్ర గాయాలతో పడిపోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి 108కు సమాచారం అందించారు. అయితే ఎంతకూ 108 వాహనం రాలేదు. ఈ లోపు కుళ్లాయప్ప పరిస్థితి విషమిస్తుండడంతో తన సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశులు అప్రమత్తయ్యారు. అప్పటికే ఇంటికి వాహనంలో బయలుదేరిన ఆయన వెంటనే ప్రమాదస్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో పడి ఉన్న కుళ్లాయప్పను స్థానికుల సాయంతో తానే పైకి లేపి తన వాహనంలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో స్థానికంగానే తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అటు నుంచి బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. కాగా, క్షతగాత్రుడిని తన వాహనంలో ఆస్పత్రికి చేర్చిన డీఎస్పీ చొరవను స్థానికులు అభినందిచారు. ‘ఈ సార్ చాలా మంచోడు’ అంటూ కితాబునిచ్చారు. వైభవం.. సల్లాపురమ్మ జ్యోతుల ఉత్సవం పుట్టపర్తి అర్బన్: పెడపల్లిలో ఆదివారం సల్లాపురమ్మ జ్యోతుల ఉత్సవం వైభవంగా సాగింది. వేలాది కుటుంబాలు ఉన్న గ్రామంలో ప్రతి ఇంటి నుంచి జ్యోతులు, బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి వాటిని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి మూలవిరాట్ను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన బోనాలను అమ్మవారికి సమర్పించిన అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. భక్తులు పెద్ద ఎత్తున బియ్యం, బేడలు, ఆకు వక్క తదితరాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్ద పోతురాజు విన్యాసాన్ని ఆసక్తిగా తిలకించారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన తినుబండారాలు, ఆట బొమ్మల అంగళ్ల వద్ద కొనుగోలుదారులతో సందడి నెలకొంది. -
టీడీపీ నేత జకీవుల్లా ఆకస్మిక మృతి
అనంతపురం క్రైం: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎంపీ కేఎం సైపుల్లా కుమారుడు జకీవుల్లా (51) ఆదివారం హైదరాబాదులో గుండెపోటుతో మృతి చెందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరుచుకున్న కుటుంబం కావడంతో రాష్ట్ర వ్యాఫ్తంగా పార్టీ నేతలు బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సోమవారం జకీవుల్లా భౌతిక కాయాన్ని అనంతకు తీసుకురానున్నారు. పార్టీ శ్రేణుల సందర్శనార్థం స్వగృహంలో ఉంచనున్నారు. సైపుల్లాకు ఇద్దరు కుమారులు కాగా, పార్టీలో సౌమ్యుడిగా ఉన్న జకీవుల్లా మృతితో పలువురు పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. మంచి నాయకుడు.. జకీవుల్లా ఉన్నత భావాలు ఉన్న ఓ మంచి నాయకుడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం జకీవుల్లా మృతి చెందిన విషయం తెలియగానే ఆయన సైఫుల్లా ఇంటికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అలాగే పలువురు టీడీపీ నేతలు సైఫుల్లా, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. -
తల్లిదండ్రుల చెంతకు బాలిక
గుంతకల్లు: తప్పిపోయిన ఓ బాలికను గుంతకల్లు రైల్వే పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర తెలిపిన మేరకు... కర్ణాటకలోని గదగ్కు చెందిన ఎనిమిదేళ్ల వయసున్న రోకియ తప్పిపోయింది. దీంతో తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న గుంతకల్లు జీఆర్పీ సిబ్బంది అప్రమత్తమై శనివారం రాత్రి రైల్వే స్టేషన్కు చేరుకున్న హుబ్లీ వైపు నుంచి వచ్చిన హంపి ఎక్స్ప్రెస్ (16591) రైలులోని బోగీలను పరిశీలించారు. ఓ బోగీలో దిగాలుతో కూర్చొని ఉన్న రోకియాను గుర్తించి తమ స్వాధీనంలోకి తీసుకుని సమాచారం ఇవ్వడంతో ఆదివారం ఉదయం గదగ్ పోలీసులు, తల్లిదండ్రులకు గుంతకల్లుకు చేరుకున్నారు. కౌన్సెలింగ్ అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.కండక్టర్పై ఖాకీ దౌర్జన్యంగుత్తి: టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలని సూచించిన ఆర్టీసీ బస్సు కండక్టర్పై ఓ హెడ్ కానిస్టేబుల్ బూతులతో రెచ్చిపోయారు. వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున గుత్తి ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణికులతో బయలుదేరిన బస్సు గార్లదిన్నె మండలం కల్లూరుకు చేరుకోగానే ఓ హెడ్ కానిస్టేబుల్ ఎక్కారు. టికెట్ తీసుకోవాలని కండక్టర్ గంగేశ్వర్ అడగడంతో తాను హెడ్ కానిస్టేబుల్నని, టికెట్ తీసుకునేది లేదని తెలిపారు. ‘అలా కాదు సార్.. వారెంట్ ఏదైనా ఉంటే చెప్పండి ఫ్రీ గా ప్రయాణం చేయవచ్చు. అలా కాదంటే టికెట్ తీసుకోవాల్సిందే’ అంటూ కండక్టర్ చెప్పగానే హెడ్ కానిస్టేబుల్ రెచ్చిపోయి బూతులతో విరుచుకు పడారు. ‘ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో.. అవసరమైతే కోర్డుకు పోతావా? పో’ అంటూ బెదిరింపులకు దిగారు. తాను లేకుండా బస్సు అక్కడి నుంచి ఎలా ముందుకెళుతుందో చూస్తానంటూ భీష్మించారు. దీంతో సహనం కోల్పోయిన కండక్టర్ టికెట్ తీసుకోవాల్సిందేనంటూ గట్టిగా పట్టుపట్టారు. హెడ్ కానిస్టేబుల్ నిర్వాకంతో బస్సు అక్కడే నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు కల్పించుకోవడంతో చివరకు హెడ్ కానిస్టేబుల్ టికెట్ తీసుకున్నారు. ఘటనపై పోలీసులతో పాటు ఆర్టీసీ డీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు కండక్టర్ గంగేశ్వర్ తెలిపారు. కాగా, వివాదస్పదమైన సదరు హెడ్ కానిస్టేబుల్ పేరు లక్ష్మీనారాయణ అని ప్రయాణికులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ పనిచేస్తున్నది తెలియదన్నారు. పోలీసు శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్న ఇలాంటి వారిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనంత వరకూ ఇలాంటి ఘటనలు తరచూ చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ఉరవకొండ: స్థానిక నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు... వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి తండాకు చెందిన వెంకటేష్ నాయక్ (51) ఆదివారం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంలో ఉరవకొండకు బయలుదేరాడు. మార్గమధ్యంలో పీసీ ప్యాపిలి వద్దకు చేరుకోగానే బస్సు కోసం వేచి ఉన్న అదే గ్రామానికి చెందిన శాంతమ్మ(33) అభ్యర్థన మేరకు ఆమెను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని బయలుదేరాడు. ఉరవకొండ సమీపంలోని హంద్రీ–నీవా కాలువ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్పు ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, వెంకటేష్నాయక్ భార్య ఏడాది క్రితమే చెందింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. పీసీ ప్యాపిలికి చెందిన శాంతమ్మ భర్త వన్నూరు స్వామి ఉరవకొండలోని ఓ హోటల్లో సప్లయిర్గా పనిచేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తమ్ముడి నిశ్చితార్థానికి వెళుతూ.. అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో స్టాఫ్నర్సుగా పనిచేస్తున్న ప్రవల్లిక.. ఉరవకొండలో భర్త మల్లికార్జునతో పాటు కలసి నివాసముంటుంది. ఈ క్రమంలో రోజూ బస్సులో విధులకు వెళ్లి వచ్చేవారు. వజ్రకరూరు మండలం చాబాలలో ఉన్న తన తమ్ముడి వివాహ నిశ్చితార్థం ఉండడంతో ఆదివారం భర్తతో కలసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొంది. ఘటనలో ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మల్లి కార్జునకు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. ఈ రెండు ఘటలపై సీఐ మహనంది కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
‘అపూర్వ’ సమ్మేళనం
ఉరవకొండ (వజ్రకరూరు): వజ్రకరూరులోని కాటవెంకటప్ప జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1978–79లో పదో తరగతి చదువుకున్న వారు ఆదివారం అదే పాఠశాల వేదికగా కలుసుకున్నారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాటి చిలిపి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు నాగరాజుశర్మ, దత్తాత్రేయశర్మ, అక్కులప్ప, హనమంతప్ప తదితర ఉపాధ్యాయులకు పాదపూజ చేసి, జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. -
మేధస్సును కదిలించేది ‘శ్రమ కావ్యం’
అనంతపురం: మేధస్సును కదిలించేది ‘శ్రమ కావ్య గానం’ అని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక తేజ అన్నారు. ఆయన రచించిన శ్రమ కావ్యం గానం పుస్తక పరిచయ కార్యక్రమం అనంతపురంలోని జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో సీఐటీయూ, ఐద్వా, యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి నాయకురాలు డాక్టర్ ప్రగతి మాట్లాడుతూ... సుద్దాల అశోక్ తేజ సాహితీ ప్రస్థానాన్ని వివరించారు. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సుద్దాల అశోక్ తేజ రచనలు శ్రమ శక్తిని చాటేలా ఉంటాయన్నారు. అనంతరం సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. శ్రమ కావ్యం గానం గురించి వివరించారు. శ్రమ అన్నది మేథో శ్రమ, శారీరక శ్రమ రెండు రకాలుగా ఉంటుందన్నారు. ఈ రెండు కలగలిసి ప్రయాణం సాగిస్తుంటాయని వివరించారు. శ్రమ ద్వారానే సామాజిక గమనం ఉంటుందనే అంశాన్ని శ్రమ కావ్యం గానం ద్వారా వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, సీఐటీయూ ఆర్వీ నాయుడు, యూటీఎఫ్ లింగన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేష్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప, సీఐటీయూ రాష్ట్ర నాయకులు వి.రాంభూపాల్, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్ఎం బాష, సామాజిక వేత్త బోస్, మానవతా రక్తదాత తరిమెల అమర్నాథ్ రెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకుడు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుద్దాల అశోక తేజ -
ప్రమాదంలో చిన్నారి మృతి
కొలిమిగుండ్ల: నంద్యాల జిల్లాలో కారు, బొలెరో పరస్పరం ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చంద్రమోహన్రెడ్డి తన కుమార్తె జోష్యహర్షిణిరెడ్డి(6)ని నంద్యాలలోని మేనమామ ఇంట్లో ఉంచి చదివిస్తున్నాడు. ఈ క్రమంలో అమ్మవారికి మొక్కుబడి చెల్లించాల్సి ఉండడంతో తాత, విశ్రాంత ఉపాధ్యాయుడు రామసుబ్బారెడ్డి, బంధువులు వెంకటసుబ్బారెడ్డి, ఏటూరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీదేవితో కలసి కారులో నంద్యాల స్వగ్రామానికి జోష్యహర్షిణిరెడ్డి బయలుదేరింది. కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లి శివారులోకి చేరుకోగానే అంకిరెడ్డిపల్లి నుంచి కొలిమిగుండ్లకు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు ఎగిరి రోడ్డు పక్కన బోల్తాపడింది. కారులో ఉన్న వారందరూ అందులో చిక్కుకుపోయారు. బొలెరో వాహనంలో ఉన్న అంకిరెడ్డిపల్లికి చెందిన యువకులు రాజకుళ్లాయి, బాలుకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు కారులో చిక్కుకుపోయిన వారిని అతి కష్టంపై వెలికితీసి, తాడిపత్రిలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న జోష్యహర్షిణిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న సీఐ రమేష్బాబు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రుడు ఏటూరి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
రాప్తాడులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం రాప్తాడు మండలంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసన్నాయపల్లి వద్ద ఉన్న ఆర్జేసీ కల్యాణ మండపంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు తమ వివరాలతో పాటు సమస్యలను అర్జీ రూపంలో అందజేయాలన్నారు. సమస్యపై గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి స్లిప్, పాత రసీదు తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్కు సమాచారం వస్తుందని, కాబట్టి అర్జీదారులు తమ ఫోన్లోని మెసేజ్లను చూసుకోవాలన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్ను వాట్సాప్లో పంపిస్తామన్నారు. అర్జీ సమర్పించేప్పుడు కచ్చితమైన వివరాలను ఇవ్వాలని సూచించారు. రాప్తాడు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.జిందాల్ కార్మికుడి అనుమానాస్పద మృతిబొమ్మనహాళ్: మండలంలోని హరేసముద్రం గ్రామ శివారులో ఉన్న జిందాల్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్ఐ నబీరసూల్ తెలిపిన మేరకు.. జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్రా జిల్లా ఖర్మహీ గ్రామానికి చెందిన అభిషేక్ భూయాన్ (36), తమ్ముడు గణేష్ భూయాన్తో కలిసి కొన్నేళ్ల క్రితం వలస వచ్చాడు. జిందాల్ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. ఇటీవల అభిషేక్ భూయాన్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 14న జీతం తీసుకున్నప్పటి నుంచి ఇంకా ఎక్కువగా మద్యం తాగేవాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం కనపడకుండా పోయిన ఇతను.. ఆదివారం ఫ్యాక్టరీ సమీపంలోనే విగతజీవిగా పడి కనిపించాడు. ఫ్యాక్టరీ కార్మికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గణేష్ భూయాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్కు తరలించారు. మద్యం ఎక్కువగా తాగి నీటి దాహానికి మృతి చెందాడా.. లేక ఎవరైనా హతమార్చారా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.భక్తులపై తేనెటీగల దాడి.. 20 మందికి గాయాలుఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులపై ఆదివారం తేనెటీగలు దాడి చేశాయి. వివరాలు.. మండల పరిధిలోని వెలిగొండ గ్రామానికి చెందిన రాజశేఖర్, భాగ్యమ్మ, శ్రీలేఖ, రామాంజినేయులు, జయలక్ష్మి, రాజేశ్వరి, యుగంధర్, మల్లికార్జున, ప్రతాప్, ప్రభాస్, జనార్దన్ తదితర 20 మంది ఆదివారం పెన్నహోబిలం వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పొట్టేలు బలి ఇచ్చి ఆలయం కింది భాగంలో వంట చేసుకుని విందు భోజనాలకు కూర్చున్నారు. ఈ క్రమంలోనే అక్కడే చెట్టు మీద ఉన్న పెద్ద తేనెతుట్టె నుంచి ఒక్కసారిగా తేనెటీగలు లేచి దాడి చేశాయి. హఠాత్పరిణామంతో ఆందోళనకు గురైన వారు కేకలు వేస్తూ పిల్లాపాపలతో కలిసి పరుగు తీశారు. స్థానికులు 108 సాయంతో గాయపడ్డ వారిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఇక చాలు.. దయ చేయండి!
అనంతపురం: ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం మాట తప్పింది. పైగా ఇప్పటివరకూ ఉన్న ఉద్యోగాలకూ శఠగోపం పెట్టేలా వ్యవహరిస్తోంది. జేఎన్టీయూ (ఏ) పరిధిలో పనిచేస్తున్న 150 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సర్వం సిద్ధం చేయడమే ఇందుకు నిదర్శనం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2008లో జేఎన్టీయూ(ఏ) ఏర్పాటైంది. వర్సిటీలో కార్యకలాపాల నిర్వహణకు అప్పట్లోనే అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగులను నియమించారు. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో మొత్తం 650 మంది ఉన్నారు. కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో 120 మంది, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాల 150, క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల 80, ఓటీఆర్ఐ 26, జేఎన్టీయూ (అనంతపురం నగరంలో)లో 274 మంది పనిచేస్తున్నారు. అంతలోనే ఎంత తేడా.. చిరుద్యోగులకు దన్నుగా నిలిచేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ‘ఆప్కాస్’ను ఏర్పాటు చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం చెల్లించింది. ఉద్యోగాలను ఇష్టానుసారం తొలగించే పరిస్థితి లేకుండా భద్రత కల్పించింది. పీఎఫ్ సౌకర్యం ఉండేది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ‘ఆప్కాస్’ నుంచి జీతాలు చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. దీంతో జేఎన్టీయూ అంతర్గత వనరుల నుంచి జీతాలు ఇవ్వాల్సి రావడంతో ఆ మేరకు ఆర్థిక వనరులు లేక ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చారు. మూడు రోజుల క్రితం జరిగిన పాలకమండలి సమావేశంలో దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించాలని తీర్మానించినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. ఎవరిని ఇంటికి పంపుతారో.. ఎవరిని ఉంచుతారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు.గత ప్రభుత్వ హయాంలో జేఎన్టీయూ(ఏ)లో ఇద్దరు, కలికిరిలో ఐదుగురిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మిగిలిన 643 మంది చాలా ఏళ్ల నుంచి కొనసాగుతున్న వారే. ఈ క్రమంలో వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఉన్న ఉద్యోగులకూ ఉద్వాసన తప్పదని తెలు స్తోంది. కూటమి ప్రభుత్వం వస్తే జీతాలు పెరుగుతాయని ఆశించామని, కానీ ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెడతారని కలలో కూడా ఊహించలేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేఎన్టీయూ (ఏ) పరిధిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు 150 మందిని వెళ్లగొట్టేందుకు చర్యలు వేగవంతం చిరుద్యోగుల జీవితాలను చిదిమేసేలా త్వరలో ఉత్తర్వులు వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఉన్న ఉద్యోగులకూ ఉద్వాసన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి 2008 నుంచి పనిచేస్తున్న వారికి జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం వెన్నుదన్నుగా నిలవాలి. ఉద్యోగులను తొలగించే ప్రక్రియ మానుకోవాలి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థలో దళారుల ప్రమేయం అధికంగా ఉండేది. సక్రమంగా జీతాలు చెల్లించేవారు కాదు. ‘ఆప్కాస్’ ద్వారా సక్రమంగా జీతాలు అందేవి.ఇటీవల ‘ఆప్కాస్’ నుంచి జీతాలు చెల్లించలేమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న ఉద్యోగులను తొలగించేలా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. – కే.విజయ్, ఉమ్మడి జిల్లా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ -
వైభవంగా కొల్హాపురి మహాలక్ష్మి ఉత్సవాలు
రొళ్ల: రత్నగిరి కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.ఆదివారం సాయంత్రం ‘పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవం’లో భాగంగా మహాకాళి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా రాజవంశీకుల ఇంటి నుంచి పోతులరాజులు ప్రత్యేకంగా అలంకరించుకుని పురవీధుల గుండా నృత్యం చేస్తూ మంగళవాయిద్యాల నడుమ ఆలయం వద్దకు చేరుకుని ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలబావి సమీపంలో పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవాన్ని అశేష భక్తజనం మధ్య వైభవంగా నిర్వహించారు. మహిళలు దేవాలయ సమీపంలోని పాలబావిలో గంగపూజ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపట్టారు. ఇలా చేయడం వల్ల సంతాన భాగ్యం లేని వారికి సంతాన ప్రాప్తి,దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతా యని భక్తుల విశ్వాసం. జాతరలో తినుబండారాల అంగళ్లు కిటకిటలాడాయి. భక్తులకు దాతల సహకారంతో అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాజవంశీకుల కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవ వేడుకల్లో జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు పాల్గొన్నారు. ఉత్సవాల్లో సోమవారం పాలబావిలో గంగపూజతో పాటు రాత్రికి పోతులరాజు బండారు మహోత్సవం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పోతులరాజు పుష్పాలంకరణ -
చుక్కలు.. తొలగని తిప్పలు
అనంతపురం అర్బన్: రైతులకు చుక్కల భూముల తిప్పలు తొలగడం లేదు. ఫైళ్ల పరిష్కార ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రతి శుక్రవారం చుక్కల భూముల ఫైళ్లను పరిష్కరిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య నాలుగైదు మించి ఉండడం లేదు. చుక్కల భూములకు సంబంధించి 1,397కు పైగా ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. అత్యధికంగా అనంతపురం రెవెన్యూ డివిజన్లో, అత్యల్పంగా గుంతకల్లు రెవెన్యూ డివిజన్ పరిధిలో చుక్కల భూములు ఉన్నాయి. గుంతకల్లు డివిజన్కు సంబంధించి ఉన్న ఏడు ఫైళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తెలిసింది. డబ్బులిస్తేనే సక్రమంగా.. చుక్కల భూముల ఫైళ్ల పరిష్కారానికి కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితం రావడం లేదు. ఇందుకు మండల, డివిజన్ స్థాయిలోని కొందరు సిబ్బంది అవినీతి అక్రమాలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఫైళ్లు సిద్ధం చేసే క్రమంలో కొందరు సిబ్బంది సంబంధిత రైతుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ముడుపులు ఇవ్వని రైతు ఫైలు సక్రమంగా సిద్ధం చేయకుండా తిరస్కరణకు గురయ్యేలా చేస్తున్నారనే విమర్శలున్నాయి. చుక్కల భూమి అంటే... నిషేధిత భూములు (22ఏ), చుక్కల భూములు (డాటెడ్ ల్యాండ్) రెండూ ఒకేరకం కాదు. వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.1954, జూన్ 18కి ముందు అసైన్డ్ చేసిన ప్రభుత్వ భూములు 22ఏ జాబితా కిందకు వస్తాయి. ఇక చుక్కల భూముల విషయానికి వస్తే.. ప్రభుత్వ భూమిగా చెప్పబడే భూమి వివరం ఆర్ఎస్ఆర్ (రీ సెటిల్మెంట్ రిజిస్టర్)లో చుక్కలుగా చూపించి ఉండాలి. ఆ భూమి ఎవరికీ అసైన్డ్ చేసి ఉండకూడదు. ఇలాంటి భూమిని అనుభవించేవారు దరఖాస్తు చేసుకుంటే.. డీఎల్సీ సమావేశంలో నిర్ణయం తీసుకుని జాబితా నుంచి తొలగిస్తారు. ఆమోద ముద్రకు నిబంధనలిలా... చుక్కల భూముల జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న వారికి నిబంధనల ప్రకారం డీఎల్సీ ఆమోద ముద్ర వేస్తుంది. ● సాగు చేస్తున్నట్లుగా చెప్పబడే ప్రభుత్వ భూమి వివరం ఆర్ఎస్ఆర్లో చుక్కలుగా ఉండాలి. ఆ భూమి ఎవరి పేరునా అసైన్డ్ చేసి ఉండకూడదు. ● డాటెడ్ ల్యాండ్ చట్టం–2017 ప్రకారం... ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తి చట్టం వచ్చే నాటికి 12 ఏళ్ల ముందు ఆ భూమిపై హక్కు, అనుభవం కలిగి ఉండాలి. ● చట్టం నిబంధనల ప్రకారం సాగు చేస్తున్న వారు తహసీల్దారు వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి ఆర్డీఓకు తహసీల్దారు నివేదిస్తారు. దానిని ఆర్డీఓ విచారణ చేసి కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు. ● ఇక్కడ జిల్లాస్థాయి కమిటీ వాటిని విచారణ చేసి నిబంధనల ప్రకారం అన్ని సక్రమంగా ఉన్నవాటిని జాబితా నుంచి తొలగిస్తూ ఆమోద ముద్ర వేస్తుంది. మందకొడిగా ఫైళ్ల పరిష్కార ప్రక్రియ డీఎల్సీలో నాలుగైదు మించి పరిష్కారం కాని వైనం పెండింగ్లో 1,390కు పైగా ఫైళ్లు వేగవంతానికి చర్యలు చుక్కల భూముల ఫైళ్లకు వేగవంతంగా పరిష్కారం చూపుతాం. డీఎల్సీ సమావేశానికి ఉంచే ఫైళ్ల సంఖ్య పెంచాలని తహసీల్దార్లు, ఆర్డీఓలను ఆదేశించాం. మండలాలవారీగా షెడ్యూల్ ఇచ్చి ప్రతి శుక్రవారం డీఎల్సీ సమావేశం నిర్వహిస్తూ ఫైళ్లు పరిష్కరిస్తున్నాం. ఫైళ్లు ఎలా సిద్ధం చేయాలనే దానిపై మండల, డివిజన్ స్థాయి రెవెన్యూ సిబ్బందికి వారం క్రితం శిక్షణ ఇచ్చాం. – వి.వినోద్కుమార్, కలెక్టర్ -
మట్టి దోపిడీని అరికట్టేవారేరీ?
పెద్దవడుగూరు : కూటమి పాలనలో అభివృద్ధి పనుల మాటున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సాధారణంగా అభివృద్ధి పనుల కోసం అయితే ఇసుక, మట్టి తరలించుకునేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాలి. అయితే ఎటువంటి అనుమతులు లేకున్నా మండల కేంద్రం పెద్దవడుగూరు సమీపంలోని దేవదాయ భూముల్లో జేసీబీ సాయంతో నాణ్యమైన ఎర్రమట్టిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. పెద్ద పెద్ద గోతులు ఏర్పడినా అధికారులెవ్వరూ ఇటువైపు తొంగిచూసిన దాఖలాలు లేవు. ఇక పి.వీరన్నపల్లి, కొండూరు, చిత్రచేడు గ్రామాల నుంచి పెన్నానది పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక పెద్ద ఎత్తున తవ్వి తీసుకెళ్తున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. రాత్రి వేళల్లో పోలీస్ స్టేషన్ మీదుగాను ఎర్రమట్టి లోడ్లతో వాహనాలు వెళ్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అనుమతి లేకున్నా దేవదాయ భూమిలో ఎర్రమట్టి తవ్వకం రాత్రికి రాత్రే తరలించి సొమ్ము చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు ఇసుకను కొల్లగొడుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు -
ప్రాణం తీసిన ఈత సరదా
బ్రహ్మసముద్రం : ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లికి చెందిన రంగస్వామి (35) కర్ణాటకలో వివాహం చేసుకున్నాడు. అక్కడే ఉంటూ వ్యవసాయం చేసుకుని జీవించేవాడు. ఇటీవలే స్వగ్రామం చెలిమేపల్లికి వచ్చాడు. శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి గోవిందయ్య దొడ్డి సమీపంలోని ఓ బావిలో ఈతకు వెళ్లాడు. అక్కడ నీటిలోకి దూకిన రంగస్వామి ఎంతకూ పైకి రాలేదు. స్నేహితులు వెదికినా కనిపించకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని కళ్యాణదుర్గం ఫైరింజన్ సిబ్బదికి సమాచారం తెలిపారు. ఫైరింజన్ సిబ్బంది, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి అడుగున ఇరుక్కున్న రంగస్వామి మృతదేహాన్ని బయటకు తీశారు. ఎస్ఐ నరేంద్రకుమార్, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రంగస్వామికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం రాయదుర్గంటౌన్: మండలంలోని 74 ఉడేగోళం గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. గుమ్మఘట్ట మండలం భూపసముద్రం గ్రామానికి చెందిన ఈరక్క (72) 74 ఉడేగోళం గ్రామం వద్ద రోడ్డుపై నడుచుకుని వెళుతుండగా ద్విచక్రవాహనంపై వస్తున్న మారెంపల్లికి చెందిన ఈశ్వర్ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడ్డారు. స్థానికులు గుర్తించి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈరక్క పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యోగం రాలేదని బలవన్మరణం తాడిపత్రిటౌన్: ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఓ యువకుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. పట్టణంలోని జయనగర్ కాలనీకి చెందిన కరుణాకర్, ఇందిర దంపతుల కుమారుడు సపారే నరసింహ (22) బీటెక్ పూర్తి చేశాడు. పలు కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అయితే ఎక్కడా జాబ్ రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన నరసింహ శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యుత్ షాక్తో రజకుడి మృతి పామిడి: దుస్తులు ఇసీ్త్ర చేస్తున్న రజకుడు కరెంట్ షాక్తో మృతి చెందాడు. పామిడిలోని వీకే ఆదినారాయణరెడ్డి కాలనీకి చెందిన చాకలి లక్ష్మన్న (62), రమాదేవి దంపతులు. వీరు రజకవృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవారు. శనివారం రాత్రి లక్ష్మన్న కరెంటు ఐరన్ బాక్స్తో దుస్తులు ఇసీ్త్ర చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐరన్బాక్స్ గుండా విద్యుత్ ప్రసారమవడంతో లక్ష్మన్న షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు కుమారులు సంజీవ, ఈశ్వరయ్య, కుమార్తె సునీత సంతానం. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని కమ్యూనిటీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గుర్తుతెలియని మహిళ శవం లభ్యం ఉరవకొండ (వజ్రకరూరు): వజ్రకరూరు మండలం పందికుంట సమీపంలోని పొలిమేర రిజర్వు ఫారెస్టులో గుర్తు తెలియని మహిళ శవాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. వయసు 40 నుంచి 50 సంవత్సరాలలోపు ఉంటుందని, బ్లూ కలర్ ప్యారగాన్ చెప్పులు, తెలుపు రంగు పంజాబీ డ్రస్, టాప్ ధరించి ఉందని పేర్కొన్నారు. కుడి, ఎడమ చేతికి రబ్బరు గాజులు ఉన్నాయి. ఈమె ఆచూకీ తెలిస్తే వజ్రకరూరు ఎస్ఐ (94409 01867), ఉరవకొండ రూరల్ సీఐ (94407 96856)కు సమాచారం అందించాలని కోరారు. అరటి పిలకల ఏజెంట్ టోకరా గార్లదిన్నె: కల్లూరు చెందిన ఇద్దరు రైతులకు అరటి పిలకల ఏజెంట్ టోకరా వేశాడు. రైతులు గాంధీ, దస్తగిరి 18వేల అరటి పిలకల కోసం నార్పల మండలం గొల్లపల్లికి చెందిన ఏజెంట్ శివయ్యను సంప్రదించారు. ఒక మొక్క రూ.15 చొప్పున మాట్లాడుకున్నారు. అడ్వాన్స్గా రూ.2లక్షల రూపాయలను శివయ్య అసిస్టెంట్కు గత నెలలో ఫోన్ పే చేశారు. ఏప్రిల్ ఎనిమిదో తేదీన బెంగళూరు నుంచి అరటిపిలకలు సరఫరా చేస్తానని ఏజెంట్ చెప్పాడు. అయితే చెప్పిన సమయానికి సరఫరా కాలేదు. దీంతో రైతులు సదరు ఏజెంట్ ఇంటి వద్దకెళ్లి విచారించగా.. తన దగ్గర డబ్బు లేదని, తర్వాత ఇస్తానని చెప్పాడు. తమను నమ్మించి మోసం చేశారని గ్రహించి లబోదిబోమన్నారు. -
ఇంటర్లో హాస్టల్ విద్యార్థుల ప్రతిభ గర్వకారణం
అనంతపురం అర్బన్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి 900కు పైగా మార్కులు సాధించడం గర్వకారణమని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఆప్తాల్మిక్ టెక్నీషియన్లో 905 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించిన బి.హేమలతను ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలోని 18 మంది విద్యార్థులు ఇంటర్మీడియేట్లో 900 పైగా మార్కులు సాధించడంతో రాష్ట్రంలోనే జిల్లా రెండవ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేనివారిని తన దృష్టికి తీసుకొస్తే వారు ఎంతవరకు చదవాలనుకుంటారో అంతవరకు చదివిస్తామని చెప్పారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, గిరిజన సంక్షేమాధికారి రామాంజనేయులు, ఆర్ఐఓ వెంకటరమణ నాయక్, హెచ్డబ్ల్యూఓలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కూటమి కక్ష.. నెరవేరని పేదల కాంక్ష
పేదలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఈ నిర్మాణాలు పూర్తయితే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో పేదలకు సొంతిల్లు దక్కకుండా చేస్తోంది. దీంతో అసంపూర్తిగా నిలిచిన నిర్మాణాల్లో అల్లరిమూక వికృత చేష్టలకు పాల్పడుతూ విలువైన సామగ్రిని అపహరించుకెళుతోంది. అనంతపురం రూరల్ మండలం కొడిమి లే అవుట్ జగనన్న కాలనీలో ఇలాంటి విధ్వంసాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి ఘటనలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం కొడిమి జగనన్న కాలనీలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు దొంగల పాలవుతున్న కంకర -
స్వచ్ఛతకు పాటుపడదాం
అనంతపురం కార్పొరేషన్: స్వచ్ఛతకు పాటుపడి, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మేయర్ వసీం పిలుపునిచ్చారు. శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా స్థానిక జెడ్పీ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి నగరపాలక సంస్థ వరకు ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ–వేస్ట్ కలెక్షన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా మాట్లాడుతూ ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి కంపోస్టు యార్డును మరో ప్రాంతానికి తరలిస్తామని, త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వంకల వద్ద రక్షణ గోడలను నిర్మిస్తామన్నారు. మేయర్ వసీం మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.వెయ్యికోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రధాన నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేసి చూపామన్నారు. కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ ఈ–వేస్ట్ సేకరణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల వాడకం అధికమైందని, వాడిన పరికరాలను మూలకు వేయకుండా ఈ– వేస్ట్ సెంటర్లో ఇస్తే అందులో బాగా ఉన్న పార్ట్స్ను వాడేందుకు వీలుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, కమిషనర్ బాలస్వామి, డీపీఓ నాగరాజు, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠాలో ‘పచ్చ’ నేత!
సాక్షి టాస్క్ఫోర్స్: అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠాలో ఓ ‘పచ్చ’ నేత ఉండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. మంత్రి పయ్యావుల కేశవ్తో సదరు ‘పచ్చ’ నేత దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాలు.. వజ్రకరూరు మండలం వీపీపీ తాండా (వెంకటాంపల్లి పెద్దతండా)కు చెందిన టీడీపీ నాయకుడు ఎస్కే మహేష్నాయక్ బంజారా గిరిజన సమాఖ్య (బీజీఎస్) ఏర్పాటు చేశాడు. సమాఖ్యకు జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. మంత్రి పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు పయ్యావుల శ్రీనివాసులుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు. మహేష్నాయక్ కొన్నాళ్ల క్రితం తెలంగాణకు చెందిన కొందరితో జట్టు కట్టాడు. తెలంగాణతో పాటు మన రాష్ట్రంలో రాత్రి వేళ పెట్రోల్ బంకుల వద్ద, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలను టార్గెట్ చేసేవాడు.కారులో వచ్చి లారీల నుంచి డీజిల్ను దొంగతనం చేసి ఉడాయించేవాడు. దొంగిలించిన డీజిల్ను బయట మార్కెట్లో విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. పలువురి ఫిర్యాదు మేరకు ఈ ముఠాపై నిఘా ఉంచిన కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పక్కా సమాచారంతో కొందరు ముఠా సభ్యుల్ని ఇటీవల పట్టుకున్నారు. ముఠాలో మహేష్నాయక్ ముఖ్య నాయకుడిగా చెలామణి అవుతున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బ్లాక్మెయిలింగ్లు.. సెటిల్మెంట్లు మహేష్నాయక్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జిల్లా గిరిజన శాఖలో అధికారులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునేవాడని తెలిసింది. దీంతో పాటు తన సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని పంచాయితీలు, సెటిల్మెంట్లు చేసేవాడని సమాచారం. ఏది ఏమైనా.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘పచ్చ’ నేతల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ‘తమ్ముళ్లు’ చేస్తున్న అరాచకాలు, అక్రమాలను చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. -
ఏడు నెలలు.. మద్యం ఏరులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు పుణ్యమా అని ఉమ్మడి అనంతపురం జిల్లా మద్యం మత్తులో ఊగిపోతోంది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా మద్యం దుకాణాల వద్ద మందుబాబులతో జాతర వాతావరణం తలపిస్తోంది. రోడ్డుమీదే తాగుతూ చిందులేస్తున్నారు. పట్టణాల్లో పర్మిట్ రూములు, పల్లెటూళ్లలో బెల్టుషాపులు.. ఇదీ దుస్థితి. నాలుగు వందల జనాభా ఉన్న గ్రామంలో కూడా రెండు, మూడు బెల్టుషాపులు పెట్టి రేషన్ బియ్యం తరహాలో ఇంటింటికీ మద్యం అమ్ముతున్నారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలో అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్న మద్యం వ్యాపారంతో వేల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఏడు నెలల్లో 1.16 కోట్ల లీటర్ల మద్యం.. కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఎప్పుడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది సెప్టెంబర్ 15 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 15 వరకూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1.16 కోట్ల లీటర్ల మద్యం తాగించేశారు. దీన్ని ఐదు వేల లీటర్ల నీటి ట్యాంకర్లతో పోలిస్తే 2,337 ట్యాంకర్ల మద్యం తాగినట్టు లెక్క కావడం గమనార్హం. రోజుకు సగటున రెండు జిల్లాల్లో 55,658 లీటర్ల మద్యం వినియోగమవుతోంది. ఇదికాకుండా ఏడు నెలల్లో 39 లక్షల లీటర్ల బీర్లు తాగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రోజు రోజుకూ మద్యానికి అలవాటు పడుతున్న యువకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేతల షాపులపై కన్నెత్తి చూడరు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 230 వరకూ మద్యం షాపులున్నాయి. వీటిలో మెజారిటీ షాపులు టీడీపీ ఎమ్మెల్యేలవే. ఈ దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎవరైనా అటువైపు వెళితే బదిలీ చేస్తామని ‘పచ్చ’ నేతలు బెదిరిస్తున్నారు. సాధారణంగా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం షాపులను ఓపెన్ చేయాలి. కానీ రాప్తాడు, రాయదుర్గం లాంటి నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే తెరుస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములు ఏ సమయంలో చూసినా జనంతో కిక్కిరిసి ఉంటు న్నాయి. యథేచ్ఛగా సాగుతున్న మద్యం అమ్మకాలతో సామాన్య కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. మద్యం కారణంగానే ఇటీవల కుటుంబ తగాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 1.16 కోట్ల లీటర్ల మద్యం తాగేశారు రోజుకు సగటున 55 వేల లీటర్లకు పైగా వినియోగం మరో 39 లక్షల లీటర్ల బీర్లు కూడా.. పల్లెటూళ్లలో బెల్టుషాపులు.. పట్టణాల్లో పర్మిట్ రూములు విచ్చలవిడి మద్యం అమ్మకాలతో వీధిన పడుతున్న పేదల కుటుంబాలు -
వక్ఫ్ సవరణ చట్టం రద్దయ్యే వరకు పోరాటం
గుంతకల్లుటౌన్: తమ హక్కులను కాలరాస్తున్న వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడతామంటూ ముస్లింలు నినదించారు. శనివారం గుంతకల్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, నల్లజెండాలు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వీరికి వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఎమ్మార్పీఎస్, ఇతర ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఈద్గా మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీచౌక్, మెయిన్ రోడ్డు మీదుగా పొట్టిశ్రీరాములు సర్కిల్ వరకు సాగింది. ఈ సందర్భంగా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పోరాటాలు వైఎస్సార్సీపీకి కొత్త కాదన్నారు. అన్యాయానికి గురవుతున్న ప్రజల పక్షాన పోరాడతామన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ముస్లిం మైనార్టీలతో కలిసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ముందుకు నడుస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లింల హక్కులను హరిస్తోందని మండిపడ్డారు. మైనార్టీ వర్గాలను అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. అధికారమెప్పుడూ శాశ్వతం కాదని కూటమి నేతలు గ్రహించాలని హితవు పలికారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీమ్ అహ్మద్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్లు కలిసిరావాలని, లేకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. వక్ఫ్ ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికే మోదీ కుట్ర చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు డి.జగదీష్ విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు వి.రాంభూపాల్ మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం చంద్రబాబు గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు మైమూన్, నైరుతిరెడ్డి,ఖాజీ సయ్యద్ రజాక్పీర్సాబ్, అదనపు ఖాజీ సత్తార్సాబ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రభాకర్, ముస్లిం జేఏసీ కన్వీనర్ సద్దామ్, మైనార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ముస్లింల హక్కులను హరించే అధికారం మీకెవరిచ్చారు? గుంతకల్లులో కదం తొక్కిన ముస్లింలు -
రాజధాని పేరిట మభ్యపెడుతున్న బాబు
అనంతపురం కార్పొరేషన్: అమరావతి పేరిట సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష ఎకరాలు, రూ.లక్ష కోట్లతో అమరావతిని నిర్మిస్తామని, రెండో సారి భూమి పూజకు ప్రధాని మోదీని పిలుస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుండటం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి అంటే కేవలం అమరావతి మాత్రమే కాదని, అన్ని జిల్లాలను పరిగణనలోకి తీసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే 53 వేల ఎకరాలను సేకరించింది కాక తాజాగా మరో 43 వేల ఎకరాలను సేకరించాల్సి ఉందని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ చెప్పడం అన్యాయమన్నారు. మేధావులు సైతం కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారన్నారు. రాజధాని పేరిట అప్పులు చేసి భవిష్యత్తులో ఆ అప్పును తీర్చలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గన్నవరంలో ఇది వరకే ఎయిర్పోర్టు ఉన్నా.. రాజధానిలో 5 వేల ఎకరాలతో ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం ఏంటో అర్థం కావడం లేదన్నారు.గతంలో రాజధాని కోసం భూములిచ్చిన ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. అందులో 10 వేల మంది రాష్ట్రాన్నే విడిచి వెళ్లినట్లు తెలిసిందన్నారు. శాశ్వత భవనాల పేరున చదరపు అడుగుకు ఇస్తున్న ధరలను చూసి అందరూ విస్తుపోతున్నారన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే భయమేస్తోందని ఓ వైపు చెబుతూనే.. మరోవైపు ప్రజలను మభ్యపెడుతుండటం దుర్మార్గమన్నారు. సీఎం చంద్రబాబుకు రాజధాని తప్ప మరేమీ కన్పించడం లేదా అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధరల్లేక రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇరిగేషన్ ప్రాజెక్ట్లను గాలికొదిలేసి నట్టేట ముంచారన్నారు. జనవరి నుంచి ఉపాధి హామీ బకాయిలు రూ.37 కోట్లు ఇంత వరకు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ‘నాడు–నేడు’లో పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణాలు ఆగిపోయాయని, హంద్రీ–నీవా కాలు వను వెడల్పు చేసి లైనింగ్ పనులు చేయమంటే కమీషన్ల కోసం లైనింగ్ పనులు మాత్రమే చేపడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరు మారకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న తదితరులు పాల్గొన్నారు. లక్ష ఎకరాలు, రూ.లక్ష కోట్లతో అభివృద్ధా? మాజీ ఎమ్మెల్యే విశ్వ ధ్వజం -
ఇంగ్లిష్ సార్లు లేరిక్కడ!
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ పాఠ్యాంశాలు బోధించే టీచర్లు లేరు. ఫలితంగా పదో తరగతి విద్యార్థులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. 2023 జూన్లో అన్ని సబ్జెక్టులకు పదోన్నతులు కల్పించినా... హై కోర్టులో వివాదం కారణంగా ఇంగ్లిష్ టీచర్ల పదోన్నతులకు బ్రేక్ పడింది. ఇంగ్లిష్ పదోన్నతులు తమకు మాత్రమే కల్పించాలంటూ డిగ్రీలో ఇంగ్లిష్ ప్రధాన అంశంగా ఉన్న ముగ్గురు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతులు జరగకుండా హైకోర్టు స్టే విధించింది. అప్పట్లో 230 ఎస్జీటీలకు ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు దక్కాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 280కు చేరింది. వాస్తవానికి 2023, జనవరిలో సీనియార్టీ జాబితా తయారు చేసి తాత్కాలిక పదోన్నతులు కల్పించారు. జూన్లో రెగ్యులర్ పదోన్నతులు ఇచ్చే సమయంలో కోర్డు కేసు కారణంగా ఈ ప్రక్రియ కాస్త ఆగిపోయింది. నష్టపోతున్నది విద్యార్థులే ఉమ్మడి జిల్లాలోని టి.వీరాపురం, నేత్రపల్లి, 74–ఉడేగోళం, డి.కొండాపురం, భూపసముద్రం, గుమ్మఘట్ట, గోనబావి, గొల్లపల్లి, కలుగోడు, తాళ్లకెర, రంగచేడు, భూపసముద్రం, పూలకుంట, గొల్లపల్లి, మురడి, మండ్లి, అపిలేపల్లి, బసాపురం, బెస్తరపల్లి, యర్రగుంట, మలయనూరు, తెంగల్లు, లక్ష్మంపల్లి, కనకూరు, వలస, ఆగ్రహారం, కె.శివరం, హేమావతి, బుచ్చయ్యగారిపల్లి, బాచేహల్లి, శెట్టూరు, తిప్పనపల్లి గ్రామాల్లోని జిల్లాపరిషత్ యాజమాన్యంలోని ఉన్నత పాఠశాలలతో పాటు కేపీ దొడ్డి, తూముకుంట, మహనంతపురం, కరిగానపల్లి తదితర గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ సబ్జెక్ట్ టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. కుందుర్పి మండలంలోని ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలుండగా ఏ ఒక్క స్కూల్లోనూ ఇంగ్లిష్ టీచరు లేరు. అక్కడక్కడా కొన్ని పాఠశాలల్లో ఇతర పాఠ్యాంశాల టీచర్లతో ఇంగ్లిష్ బోధించేలా సర్దుబాటు చేసి విద్యాశాఖ అధికారులు మిన్నకుండిపోయారు. ఇంగ్లిష్ టీచర్ల కొరత కాస్త విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా మారింది. వీడని చిక్కుముడి.. ఇంగ్లిష్ టీచర్ల పదోన్నతుల వివాదంపై ఈ ఏడాది ఫిబ్రవరి 5న హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పదోన్నతులపై దాఖలైన కేసులన్నీ డిస్పోజ్ చేస్తూ ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పదోన్నతులు కల్పించాలని తుది తీర్పునిచ్చింది. ఈ తీర్పు వెలువడి ఇప్పటికీ రెండు నెలలు దాటినా చిక్కుముడి వీడలేదు. మరోవైపు అర్హులైన ఎస్జీటీలకు అన్యాయం జరిగింది. మిగిలిన సబ్జెక్టులతో పోల్చుకుంటే ఇంగ్లిష్ పదోన్నతులు పొందే వారు రెండేళ్ల సీనియార్టీని కోల్పోయారు. వీరిలో కొందరు ఉద్యోగ విరమణ పొందారు. అయినా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికీ మేల్కొనలేదు. ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ పాఠ్యాంశాల బోధనకు తీవ్ర ఆటంకం తీవ్రంగా నష్టపోతున్న విద్యార్థులు ఉమ్మడి జిల్లాలో ఆగిన పదోన్నతులు హైకోర్టు ఉత్తర్వులిచ్చినా పదోన్నతుల్లో వీడని చిక్కుముడి రాష్ట్రంలో ఒక్క ఉమ్మడి ‘అనంత’ జిల్లాలోనే ఈ దుస్థితి -
‘ఉపాధి’ డిమాండ్ల సాధనకు 21న పాదయాత్ర
అనంతపురం అర్బన్: ఉపాధి కూలీల సమస్యల పరిష్కారానికి, డిమాండ్ల సాధనకు ఈ నెల 21న ‘కష్టజీవుల పాదయాత్ర’ చేపట్టనున్నట్లు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాసం) రాష్ట్ర కార్యదర్శి బి.కేశవరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాఽధి పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులేస్తున్నాయని మండిపడ్డారు. ఉపాధి భృతిగా ప్రతి కూలీకి ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ కూలీలకు బకాయి పడిన రూ.37 కోట్ల వేతనాన్ని తక్షణమే చెల్లించాలన్నారు. డిమాండ్ల సాధనకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకెళ్లే క్రమంలో కష్టజీవుల పాదయాత్రను నాడు ఉపాధి హామీ పథకం ప్రారంభించిన నార్పల మండలం బండ్లపల్లి గ్రామం నుంచి ఈ నెల 21న ప్రారంభించనున్నామన్నారు. 22 సాయంత్రం 4.39 గంటలకు అనంతపురంలోని కృష్ణకళామందిర్లో బహిరంగసభ ఉంటుందన్నారు. కార్యక్రమానికి వ్యకాసం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు, మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, వ్యకాసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, తదితరులు పాల్గొంటారన్నారు. బహిరంగసభకు పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు నాగరాజు, పెద్దయ్య, రామాంజనేయులు, నరేష్ పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి -
విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి
బత్తలపల్లి: విద్యుత్ షాక్కు గురైన వివాహితను కాపాడే ప్రయత్నంలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ఘటనలో గాయపడిన ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు... బత్తలపల్లి మండలం ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన కేశవనాయుడు రామాపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు పొలాన్ని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగు చేశాడు. ఈ క్రమంలో అడవి పందులు పంటను నాశనం చేస్తున్నాయని గుర్తించిన ఆయన జీఏ వైరుతో పొలం చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం గొర్రెల కాపరులు మేపునకు జీవాలను తోలుకు రావడంతో వారు ప్రమాదం బారిన పడకూడదని భావించిన ఆయన నాలుగు రోజుల క్రితం పొలం చుట్టూ విద్యుత్ కంచెను తొలగించాడు. అయితే విద్యుత్ స్తంభం నుంచి పొలం వరకూ లాగిన వైరును తొలగించడం మరచిపోయాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన వివాహిత లక్ష్మి శుక్రవారం దుస్తులు ఉతికేందుకు అటుగా వెళ్లింది. ఆమె వెంట వెళ్లిన కుమారుడు విద్యుత్ తీగ వైపుగా వెళుతుండడం గమనించి కాపాడే ప్రయత్నంలో అటుగా అడుగు వేసింది. అయితే అక్కడ నేల తేమగా ఉండడంతో షాక్కు గురైంది. ఆ సమయంలో గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి సమీపంలో ఉన్న నాగభూషణ వెళ్లి కట్టెతో తీగను కొట్టాడు. ఆ సమయంలో తీగ ఎగిరి నాగభూషణను తాకడంతో షాక్కు గురై కుప్పకూలాడు. విషయాన్ని గమనించగానే తల్లిదండ్రులు ఓబులేసు (69), లింగమ్మ ఒకరి వెనుక మరొకరు పరుగున వెళ్లి నాగభూషణు పైకి లేపే ప్రయత్నం చేయడంతో వారు కూడా షాక్కు గురయ్యారు. విషయాన్ని అక్కడికి సమీపంలో ఉన్న రవీంద్రారెడ్డి గమనించి వెంటనే ట్రాన్స్ఫార్మర్ వద్దకెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. షాక్కు గురైన నలుగురూ అపస్మారక స్థితిలో ఉండడంతో గ్రామస్తులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందేలోపు ఓబులేసు మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆర్డీటీ ఆస్పత్రికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ట్రాన్స్కో ఏఈ శివయ్య గ్రామానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఘటనపై బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
నాటుసారా కేసుల్లో పట్టుబడితే రూ.లక్ష జరిమానా
అనంతపురం: నాటు సారా కేసుల్లో పట్టుబడితే రూ.లక్ష జరిమానా విధిస్తామని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. నవోదయం 2.0 కార్యక్రమంపై ఎకై ్సజ్ అధికారులతో స్థానిక ఆ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్షించారు. పాత నేరస్తులు, అనుమానితులపై నిఘా ఉంచి, వారిని బైండోవర్ చేయాలన్నారు. తిరిగి నాటు సారా కేసుల్లో పట్టుబడితే రూ.లక్ష జరిమానా చెల్లించేలా కఠినంగా వ్యవహరించాలన్నారు. నాటుసారా తయారు చేసినా, రవాణా చేసినా పీడీ చట్టం కింద కేసు నమోదుకు సిఫారసు చేయాలన్నారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. జిల్లాలో కల్తీ కల్లు పూర్తిగా నిర్మూలించాలన్నారు. మద్యంషాపులు, బార్లలో ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లాప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి. రామమోహన్ రెడ్డి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రేవతి, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీరామ్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, టాస్క్ఫోర్స్ సీఐ జయంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చర్చిపై నుంచి పడి యువకుడి మృతి
తాడిపత్రి టౌన్: గుడ్ ప్రైడే వేళ చర్చిపై నుంచి కిందపడి ఓ యువకుడు మృతిచెందాడు. వివరాలు.. తాడిపత్రిలోని నందలపాడులో నివాసముంటున్న జయమ్మ, మనోహర్ దంపతుల కుమారుడు విక్టర్కుమార్ (25)కు మతిస్థిమితం సరిగా లేదు. గుడ్ ఫ్రైడే ని పురస్కరించుకుని గురువారం రాత్రి చర్చి అలంకరణలో భాగంగా పిల్లలతో చాలా సేపు ఆడుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చర్చిపైకి చేరుకున్న విక్టర్కుమార్.. ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికుల సాయంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ లోపు పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలి ఆత్మహత్య యల్లనూరు: మండలంలోని గడ్డంవారిపల్లికి చెందిన రాగిపిండి చిన్న అంకిరెడ్డి భార్య వెంగమ్మ (80) ఆత్మహత్య చేసుకుంది. గత నెలలో చెయ్యి విరిగిన ఆమెకు కుటుంబసభ్యులు చికిత్స చేయించారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త అంకిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రైల్లో ప్రయాణికుడి మృతి గుత్తి: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఉన్నఫళంగా మృతి చెందాడు. వివరాలు.. తెలంగాణలోని యాదాద్రికి చెందిన భీమన్న (42) బెంగుళూరుకు వలస వెళ్లి బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులు క్రితం సొంతూరుకు వెళ్లిన ఆయన శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి రైలులో బెంగళూరుకు ప్రయాణమయ్యాడు. గుత్తి జీఆర్పీ పరిధిలో ప్రయాణిస్తుండగా బోగీలోనే కుప్పకూలాడు. రైలు స్టేషన్కు చేరుకోగానే వైద్యులు చేరుకుని పరీక్షించారు. అప్పటికే గుండెపోటుతో భీమన్న మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఘటనపై జీఆర్పీ ఎస్ఐ నాగప్ప దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి దుర్మరణం అనంతపురం: నగర శివారులో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన ఎర్రగుంట్ల రంగారెడ్డి (46) శుక్రవారం ఉదయం అనంతపురంలో జరుగుతున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. 44వ జాతీయ రహదారిపై ఆర్కే ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రయాణిస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన చంద్రబాబు కొట్టాలకు చెందిన బైక్ మెకానిక్ షేక్ రహమాన్ ఢీకొన్నాడు. ఘటనలో కిందపడిన రంగారెడ్డి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మామిడి చెట్ల నరికివేత పెద్దవడుగూరు: మండలంలలోని గ్రామానికి చెందిన సూర్యనారాయణ, లక్ష్మన్న, పుల్లన్న, సన్న నారాయణ, పెద్ద నారాయణ, అనిల్కు చెందిన 105 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. మూడేళ్ల క్రితం పెన్నానదీ పరివాహక ప్రాంతంలో మామిడి మొక్కలు నాటుకున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మొక్కలను నరికి వేయడంతో రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, స్నిప్పర్ డాగ్ను రంగంలో దించి నిందితుల ఆధారాలను సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
అనంతపురం: టీడీపీ నేతల్లో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రజాప్రతినిధులు తమను గుర్తించడం లేదని, పోస్టులు, పనుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని రభస చేశారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్ సమక్షంలోనే లుకలుకలు బయటపడ్డాయి. శుక్రవారం అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్ చేపట్టారు. శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీపై పలువురు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మండల ఇన్చార్జ్గా ఉంటూ ఇబ్బందులు పడుతూనే పార్టీ కోసం కష్టపడ్డామని, ఇప్పుడు తమను ఏమాత్రమూ గుర్తించకుండా ఎమ్మెల్యే అన్యాయం చేస్తున్నారని యల్లనూరు మండలానికి చెందిన వాసాపురం బాబు అలియాస్ మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. స్టోర్ డీలర్షిప్పులు, ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాల్లో తమ వర్గానికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే వర్గానికి చెందిన బొప్పేపల్లి రవికుమార్ రెడ్డి కల్పించుకోవడంతో వాగ్వాదం మొదలైంది. వాసాపురం బాబు, రవికుమార్రెడ్డి పరస్పరం దాడి చేసుకునే స్థాయికి వెళ్లారు. ఇన్చార్జ్ మంత్రి కల్పించుకుని ఇద్దరినీ అతిథిగృహం నుంచి బయటకు పంపించారు. బయటకు వచ్చిన వాసాపురం బాబుపై బొప్పేపల్లి రవికుమార్రెడ్డి తన అనుచరులతో కలసి దాడికి యత్నించాడు. దీంతో రవికుమార్రెడ్డి చొక్కాను వాసాపురం బాబు అనుచరులు గట్టిగా పట్టుకోగా.. అది చిరిగిపోయింది. సమీపంలోనే ఎస్పీ కార్యాలయం ఉన్నప్పటికీ అక్కడే రాళ్లు రువ్వుకునే స్థాయికి వెళ్లారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను సద్దుమణిగించారు. అనంతరం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, రవికుమార్రెడ్డి కలసి వెళ్లి ఎస్పీ కార్యాలయంలో వాసాపురం బాబుపై ఫిర్యాదు చేశారు. తన్నుకున్న తమ్ముళ్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి సమక్షంలోనే రభస నాయకుల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు లీలావతి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తోంది శింగనమల: ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీని డమ్మీ చేసి తల్లి బండారు లీలావతి పెత్తనం చెలాయిస్తున్నారని టీడీపీకి చెందిన వెస్ట్ నరసాపురం ఎంపీటీసీ సభ్యురాలు అంజినమ్మ, ప్రసాద్నాయక్ దంపతులు ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం దక్కడం లేదని వారు శుక్రవారం అనంతపురం ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్కు ఎమ్మెల్యే సమక్షంలోనే ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి పది నెలలైనా ప్రజా సమస్యల గురించి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ప్రజా సమస్యలు తీర్చకుండా పదవిలో ఉండి అవమానం పొందడం కన్నా ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి, వ్యక్తిగత గౌరవం కాపాడుకుంటామని స్పష్టం చేశారు. టూమెన్ కమిటీకి ప్రాధాన్యత ఏదీ? శింగనమల నియోజకవర్గంలో ఫీల్డ్ అసిసెంట్ పోస్టులను ఎమ్మెల్యే వర్గానికి చెందినవారితోనే భర్తీ చేశారని, టూమెన్ కమిటీ సిఫార్సు చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఓ టీడీపీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. తన గోడును ఇన్చార్జ్ మంత్రికి తెలియజేసేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సదరు కార్యకర్త తీవ్రస్థాయిలో వాగ్వాదం చేశాడు. పోలీసులు జోక్యం చేసుకుని అతనికి మంత్రిని కలిసే అవకాశం కల్పించారు. -
ఆర్టీసీ ఆదాయానికి ‘ప్రైవేటు’ గండి
ఉరవకొండ: ప్రైవేట్ వాహనాల దెబ్బతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది. అధికార పార్టీ అండదండలతో ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా ప్రయాణికులను చేరవేస్తున్నారు. ఉరవకొండ ఆర్టీసీ డిపోలో సూపర్ లగ్జరీ–4, అల్ట్రా డీలక్స్–4, ఎక్స్ప్రెస్–7 ఆర్డినరీ –44 చొప్పున మొత్తం 59 బస్ సర్వీసులు ఉన్నాయి. రోజూ 21వేల కిలోమీటర్లు తిరుగుతూ 20 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రతి నెలా ఆర్టీసీకి రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తుండేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం అధికార టీడీపీ నాయకులతో ప్రైవేట్ ఆపరేటర్లు ఒప్పందం కుదుర్చుకుని ఏడు సీట్ల సామర్థ్యం కలిగిన 10 ఎర్టిగా కార్లను కొనుగోలు చేశారు. వీటిని ఉరవకొండ – అనంతపురానికి 8 సింగిల్స్ తిప్పుకోవాలని నిర్ణయించారు. సాధారణంగా ఉరవకొండ నుంచి అనంతపురానికి ఆర్టీసీ బస్సులో టిక్కెట్ ధర రూ.85 ఉంది. ఎర్టిగా వాహనంలో ఒక్కొక్కరికి వంద రూపాయల చార్జీ వసూలు చేస్తున్నారు. చిన్న, పెద్ద అందరికీ ఇదే ధర వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులను తరలించాలంటే ఎల్లో బోర్డు ఉండాలి. అయితే వైట్బోర్డు కలిగిన వాహనంలోనే యథేచ్ఛగా తరలించేస్తున్నారు. అంతేకాదు పెట్రోలుతో నడిచే ఈ వాహనాలను ఆపరేటర్లు ఆదాయం కోసం గ్యాస్ సిలిండర్లను అమర్చుకుని తిప్పుతున్నారు. నాన్స్టాప్ కావడం, సమయం కలిసి రావడంతో ధర ఎక్కువైనా కొందరు ప్రయాణికులు వీటిలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రైవేట్ వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా తిప్పడం వల్ల ఆర్టీసీ ఆదాయానికి నెలకు రూ.2.50 లక్షల దాకా కోత పడుతోంది. ఎక్కడైనా అధికారులు పట్టుకుంటే తమ పేరు చెప్పాలని టీడీపీ నాయకులు చెప్పడంతో ప్రైవేట్ ఆపరేటర్లు రెచ్చిపోతున్నారు. ఆదాయం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిపో ఎదుటే ప్రైవేట్ వాహనాల హల్చల్ ఆర్టీసీ ప్రయాణికులను ఎక్కించుకుంటున్న వైనం టీడీపీ నాయకుల అండతో నిబంధనల ఉల్లంఘనప్రైవేట్ వాహనాలను కట్టడి చేస్తాం ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ప్రైవేట్ వాహనాలను కట్టడి చేస్తాం. ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఉరవకొండ డిపో నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేలా కృషి చేస్తాం. – హంపన్న, డిపో మేనేజర్, ఉరవకొండ ఆ వాహనాలను సీజ్ చేస్తాం ఉరవకొండ ఆర్టీసీ డిపో వద్దనే ప్రైవేట్ వాహనాలు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. వైట్ బోర్డులు పెట్టుకుని ఇష్టారాజ్యంగా ఏడు నుంచి ఎనిమిది మందిని ఒకే వాహనంలో తీసుకెళ్తూ ఆర్టీసీకి నష్టం కల్గిస్తున్నారు. త్వరలోనే దాడులు నిర్వహించి ఆ వాహనాలను సీజ్ చేస్తాం. – రాజాబాబు, ఆర్టీఓ, గుంతకల్లు -
తప్పులకు ఎంఈఓలు, హెచ్ఎంలదే బాధ్యత
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలో 117 జీఓకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా జరగాలని, ఏ చిన్న తప్పు జరిగినా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులదే పూర్తి బాధ్యత అని అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎం.ప్రసాద్బాబు, క్రిష్టప్ప హెచ్చరించారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగవంతం చేశారు. తుదిదశకు చేరుకోవడంతో ఎలాంటి తప్పులూ ఉండకూడదనే ఉద్దేశంతో శుక్రవారం అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఉమ్మడి జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల విద్యాశాఖ అధికారులతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు హాజరయ్యారు. 15 రోజుల నుంచి సాగుతున్న ఎక్సర్సైజ్లో భాగంగా చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని, డీఎస్పీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన సమయం దగ్గర పడడంతో స్కూళ్ల వారీగా ఎన్ని పోస్టులున్నాయి... ఎన్ని ఖాళీలున్నాయనేది పక్కాగా తేల్చాల్సి ఉందని డీఈఓలు స్పష్టం చేశారు. హెచ్ఎంలు, ఎంఈఓలు ప్రతిపాదించిన స్కూళ్ల వివరాలు, నిబంధనల ప్రకారం జరిగాయా లేదా? అని పరిశీలించారు. గుర్తించిన తప్పిదాలను సవరించారు. అన్నమూ లేదు.. తాగునీళ్లూ లేవు విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరైన ఎంఈఓలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్లకు కనీసం భోజన వసతి కల్పించలేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమావేశంలో పాల్గొన్నారు. అసలే ఎండవేడిమి దంచేస్తోంది. మధ్యాహ్నం వరకు కనీసం తాగేనీళ్లు కూడా అందుబాటులో ఉంచలేదు. సమావేశానికి హాజరైన వారు తరచూ నీళ్ల కోసమని బయటకు వెళ్లడం కనిపించింది. మధ్యాహ్నం పైన చల్లని తాగునీరు ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల విద్యాశాఖ అధికారులు ఉన్నా...మధ్యాహ్నం భోజనం విషయం గురించి పట్టించుకోలేదు. నిబంధనల మేరకే పునర్వ్యవస్థీకరణ ఉమ్మడి జిల్లా డీఈఓల ఆదేశం -
క్రేజీ గేమ్ క్రికెట్. పొట్టి ఫార్మాట్, వన్డే, టెస్టు ఏదైనా సరే ఆట చూసేందుకు అభిమానులు అమితాసక్తి కనబరుస్తారు. ఆటను ఆటగా ఆస్వాదించినంత వరకు బాగానే ఉంటుంది. అయితే కొంతమంది కుర్రాళ్లు ఆ ఆటపై పందెం కాసి సునాయాసంగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. పాకెట్ మనీ
● రోజూ రూ.150 కోట్ల వ్యాపారం ● తాడిపత్రి కేంద్రంగా భారీగా బెట్టింగ్ ● ఆర్థికంగా చితికి... చైన్స్నాచర్లుగా మారుతున్న యువత ● ఇంటర్మీడియెట్ విద్యార్థులూ బెట్టింగ్ మీద ఆసక్తి ● ఐపీఎల్ మ్యాచ్లతో ఆర్థికంగా పతనావస్థకు సాక్షి ప్రతినిధి, అనంతపురం : క్రికెట్.. ప్రేక్షకులను రంజింపచేయడమేమో కానీ బెట్టింగ్ రూపంలో పలువురి జీవితాలను కబళిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే దుఃఖసాగరంలో మునిగిపోతున్న దుస్థితి. ఎక్కడో జరుగుతున్న ఆటపై ఇక్కడ పందెం కాస్తూ క్రికెట్ను అతిపెద్ద జూద స్థావరంగా మార్చుకున్న యువతకు ఇదొక శాపంగా పరిణమించింది. పండ్ల తోటలు, మెట్ట పైర్లకు వేదికగా, కరువు ప్రాంతంగా ముద్రపడిన ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు అతిపెద్ద బెట్టింగ్ కేంద్రంగా మారి వందలాది కుటుంబాలను చిదిమేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్లు ఒక్కరోజులోనే ఎంతోమంది యువకుల జీవితాలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఒక్కో మ్యాచ్కు రూ.150 కోట్ల బెట్టింగ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్కో ఐపీఎల్ మ్యాచ్కు రూ.150 కోట్లకుపైగా బెట్టింగ్ జరుగుతున్నట్టు అంచనా. బెట్టింగ్లో ఎక్కువగా 30 ఏళ్లలోపు యువత పాల్గొంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్ మొత్తానికి ఒక పందెం, ఓవర్ టు ఓవర్ ఇలా రకరకాలుగా పందెం కాస్తున్నారు. నాలుగు రోజుల కిందట పంజాబ్ కింగ్స్ లెవెన్, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరిగింది. ఇందులో పంజాబ్ కింగ్స్ లెవెన్ 111 పరుగులు మాత్రమే చేసింది. కోల్కతా గెలుస్తుందని వెయ్యికి లక్ష రూపాయలు పందెం జరిగింది. పంజాబ్ ఓడిపోతుందని బెట్టింగ్ కాసిన వాళ్లు బికారులైపోయారు. ఆర్థికంగా చితికి దొంగలుగా మారి.. నాలుగు రోజుల క్రితం ఆరుగురు చైన్స్నాచర్లను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వీరి పూర్వాపరాలు ఆరా తీస్తే.. అందరూ క్రికెట్ బెట్టింగ్ ఆడి ఆర్థికంగా అప్పులపాలైన వారే. అప్పుల నుంచి గట్టెక్కేందుకు చైన్స్నాచర్లుగా మారారు. ఎక్కడ ఒంటరి మహిళలు కనిపించినా బంగారు గొలుసులు లాక్కెళ్లడం, వచ్చిన డబ్బుతో జల్సా చేయడం.. ఇదీ పరిస్థితి. వీళ్లే కాదు ధర్మవరం, కదిరి, హిందూపురం, అనంతపురం, ఉరవకొండ ఇలా పలు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగుల్లో నష్టపోయిన వారు దొంగలుగా మారారు. కొంతమంది అప్పుల వారి నుంచి ఒత్తిడి భరించలేక బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగుల్చుతున్నారు. తాడిపత్రి కేంద్రంగా బుకీలు గంజాయి, మట్కాకే కాదు ఇప్పుడు బుకీలకూ తాడిపత్రి కేంద్ర బిందువైంది. గొలుసు దొంగలు (చైన్స్నాచర్లు) దొరికిన రెండు రోజులకే తాడిపత్రిలో క్రికెట్ బుకీలు పోలీసులకు చిక్కారు. దొరికింది ఏడుగురే అయినా ఇంకా చాలామంది ఉన్నట్టు పోలీసుల అంచనా. అమాయక యువకులకు ఆశ చూపి బెట్టింగ్ ఉచ్చులోకి దించుతున్నారు. సర్వస్వం కోల్పోయాక కానీ కుర్రాళ్లు తెలుసుకోలేరు. ఇంటర్మీడియెట్ కుర్రాళ్లు సైతం బెట్టింగ్ ఉచ్చులో ఇరుక్కుని విలవిలలాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఒక విషవలయంలా మారింది. జీవితాలు ఫణంగా పెట్టొద్దు పంపాచారి, షాకీర్, నాగార్జున, ఫజిల్ అహ్మద్ ఈ నలుగురూ పేకాట, క్రికెట్ బెట్టింగ్లలో నష్టపోయి దొంగలుగా మారారు. ఈజీ మనీకోసం ఇలా బెట్టింగ్.. ఆ తర్వాత దొంగతనాలు చేయడం జరుగుతోంది. యువత కెరీర్ చూడాలి కానీ బెట్టింగ్ వైపు కాదు. క్రికెట్ బెట్టింగ్ ప్రమాదకరం. ఆటను ఆటవరకే ఆస్వాదించాలి కానీ బెట్టింగ్వైపు చూడకూడదు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆర్థిక స్థితిగతులపై ఒక నిఘా వేసి ఉంచాలి. పేకాట, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్వైపు వెళ్లి జీవితాలు ఫణంగా పెట్టకండి. –పి.జగదీష్, ఎస్పీ, అనంతపురం -
వడదెబ్బతో వృద్ధురాలి మృతి
బుక్కరాయసముద్రం: తీవ్రమైన ఎండల తో ఓ వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతి చెందింది. ఓబులాపురం గ్రామానికి చెందిన మహానందరెడ్డి శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తోటకు వెళ్లారు. కాసేపటి తర్వాత ఆయన తల్లి రామక్క (80) కూడా నడుచుకుంటూ తోటకు వెళ్లింది. కాసేపు తోటంతా కలియదిరిగి 11.30 గంటల తర్వాత తిరిగి ఆమె నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది. భగభగమండే ఎండలోనే తిరగడంతో ఆమె వడదెబ్బకు గురైంది. కాస్త అలుపు వచ్చినట్టవడంతో ఇంటి బయటే మంచంపై పడుకుంది. గంట తర్వాత కుమారుడు, కోడలు వచ్చారు. నీళ్లు తాగాలని చెబుతూ లేపడానికి ప్రయత్నించగా ఆమెలో చలనం లేదు. నిశితంగా పరిశీలించగా అప్పటికే ఆమె ఊపిరి ఆగిపోయింది. వడదెబ్బతోనే ప్రాణం విడిచిందని నిర్ధారించుకున్నారు. ఈమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ఓబులాపురం వెళ్లి రామక్క మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న నాన్టీచింగ్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు www.samagrashik shaatp.blogspot.com వెబ్సైట్ ద్వారా శనివారం నుంచి ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 42 ఏళ్ల వరకు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగినులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుందని తెలిపారు. రోస్టర్ వారీగా పోస్టుల వివరాలు, గౌరవ వేతనం, విద్యార్హత వివరాలు వెబ్సైట్లో ఉంచిన నోటిఫికేషన్ ద్వారా పొందాలని ఏపీసీ వివరించారు. ఖాళీల వివరాలు ఇలా... ● టైప్–3లో మొత్తం 43 ఖాళీలు (హెడ్కుక్– 8, అసిస్టెంట్ కుక్–19, డేఅండ్నైట్ వాచ్ ఉమెన్–5, స్వీపర్–6). ● టైప్–4లో మొత్తం 28 ఖాళీలు (హెడ్కుక్–6, అసిస్టెంట్ కుక్–14, చౌకీదార్–8) ‘కూలీల హాజరు పెంచండి’ ఆత్మకూరు: ఉపాధి కూలీల హాజరు శాతాన్ని పెంచాలని సంబంధిత అధికారులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ మల్లెల శివప్రసాద్ ఆదేశించారు. గొరిదిండ్ల పంచాయతీలో చేపట్టిన ఉపాధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. ప్రతి పంచాయతీలో కూలీల సంఖ్య పెంచి పనుల లక్ష్యం త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులు తమ పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటే భూములు సారవంతమవుతాయన్నారు. డ్రైల్యాండ్ హార్టీకల్చర్లో భాగంగా మెట్ట భూముల్లో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సలీంబాషా, ఏపీడీ చెన్నకేశవులు, ఈసీ బబ్లు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు పాల్గొన్నారు. -
కూటమిలో సమస్యలు చిన్నవే
అనంతపురం టవర్క్లాక్: కూటమి పార్టీల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని సర్దుకుంటూ ముందుకెళ్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా అనంతపురం వచ్చిన ఆయన ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. నామినేటెడ్ పదవుల భర్తీ, తదితర విషయాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. ఇలాంటి వాటిని పరిష్కరించేందు కోసమే ప్రతి జిల్లాకూ ఇన్చార్జ్ మంత్రులను నియమించారన్నారు. టీటీడీ గోశాలపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలూ లేవని, గోవుల మృతికి కారణాలు అనుకోకుండా జరిగేవేనని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, గుమ్మనూరు జయరామ్, బండారు శ్రావణిశ్రీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పాల్గొన్నారు. -
వైభవంగా జ్యోతుల ఉత్సవం
రొళ్ల: రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రొళ్ల మండలం హనుమంతనపల్లి, వన్నారనపల్లి, హులీకుంట, దొమ్మరహట్టి, కొత్తపాళ్యం, కొడగార్లగుట్ట, కొత్తపాళ్యంతాండ, రొళ్లకొండ, అలుపనపల్లి, ఏ.వడ్రహట్టి, దాసప్పపాళ్యం, క్యాతప్పపాళ్యం, వన్నప్పపాళ్యం, జీఎన్ పాళ్యం, బాజయ్యపాళ్యం, పి.గొల్లహట్టి, గొట్టుగుర్కి, రంగనపల్లి, వెంకటంపల్లి తదితర గ్రామాల్లో ఉత్సవాన్ని జరుపుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున జ్యోతులతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో అన్నదమ్ముల మృతి
ముదిగుబ్బ: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు. దీంతో దొరిగిల్లు క్వార్టర్స్లో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికుల వివరాల మేరకు.. దొరిగిల్లుకు చెందిన రమణయ్య (46) బుధవారం వ్యవసాయ పనులకు వెళ్లి పనులు ముగిసిన తరువాత స్నానం చేసేందుకు తోట సమీపంలోని గుర్రాల మడుగులోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. రోడ్డు ప్రమాదంలో తమ్ముడు.. నాలుగు రోజుల క్రితం రమణయ్య సోదరుడు మునికృష్ణ (45) మొలకలచెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఒకే రోజు అన్నదమ్ములిద్దరూ చనిపోవడంతో దొరిగిల్లులో విషాదఛాయలు అలముకున్నాయి. రమణయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే మునికృష్ణ భార్య ఇప్పటికే చనిపోగా ఓ కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శివరాముడు తెలిపారు. ● నీటి మడుగులో ఒకరు.. రోడ్డు ప్రమాదంలో మరొకరు ● దొరిగిల్లులో విషాదం -
ఈపీఎఫ్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
అనంతపురం సిటీ: స్తానిక రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న ఈపీఎఫ్ కార్యాలయం వద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. బకాయి వేతనాలు పీఎఫ్ ఖాతాల్లో జమ చేయకుండా కాంట్రాక్టర్లు తప్పుడు ఆరోపణలు చేయడం, వారికి అధికారులు వత్తాసు పలుకడాన్ని నిరసిస్తూ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర నాయకత్వంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. తమకు చెల్లించాల్సిన వేతన బకాయిలతో పాటు పీఎఫ్ డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయాలని నినాదాలు చేశారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా అధికారులు, కాంట్రాక్టర్లు పరస్పరం నిందలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు అధికారులు తొత్తులుగా మారి పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల సంఘం అధ్యక్షుడు ఎర్రిస్వామి, కార్యదర్శి రాము, కోశాధికారి వన్నూరుస్వామి తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంట దగ్దం
రాయదుర్గం టౌన్: మండలంలోని కదరంపల్లి గ్రామంలో రైతు కుమారస్వామి సాగు చేసిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో శరవేగంగా మంటలు వ్యాపించి 9 ఎకరాల్లోని మొక్కజొన్న పంటను చుట్టుముట్టాయి. విషయం తెలుసుకున్న రైతు స్థానికుల సాయంతో మంటలు అదుపు చేశారు. ఈ లోపు 5 ఎకరాల్లోని పంట పూర్తిగా కాలిపోయింది. మరో రెండు రోజుల్లో మొక్కజొన్న కంకులు కోయాల్సి ఉండగా ఈ ఘటన జరగడంతో రూ.8 లక్షల మేర నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్లో ఇద్దరికి చోటు అనంతపురం అర్బన్: అఖిల భాతర కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. తమిళనాడులోని నాగపట్నంలో మూడు రోజులుగా ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. చివరి రోజు గురువారం కౌన్సిల్ జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో సభ్యులుగా రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు అన్నగిరి కాటమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జునకు చోటు దక్కింది. -
కనెక్షన్ కింగ్లు!
● తారస్థాయికి విద్యుత్ అధికారుల అక్రమాలు ● ఇష్టారాజ్యంగా వసూళ్లు ● డబ్బు దండుకుని అక్రమంగా కనెక్షన్లు ● పైసలివ్వకుంటే అంతులేని జాప్యం అనంతపురం టౌన్:విద్యుత్ శాఖ అధికారుల చేతివాటం తారస్థాయికి చేరింది. ముడుపులు ముట్టజెబితే తప్ప ముందుకెళ్లని పరిస్థితి నెలకొంది. స్వయంగా ఉన్నతాధికారులే వసూళ్లు చేస్తుండడంతో వారిని ఆదర్శంగా తీసుకుని కింది స్థాయి సిబ్బంది సైతం జేబులు నింపుకుంటున్నారు. అనంతపురం నగర పరిధి రోజు రోజుకూ విస్తరిస్తోంది. పెద్ద పెద్ద భవనాలు, వెంచర్లు, డూప్లెక్స్ ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఇదే అదునుగా విద్యుత్ శాఖ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ముందు అనుమతుల పేరిట కొర్రీలు విధిస్తూ.. ముడుపులు అందగానే అన్నీ సక్రమంగా ఉన్నాయంటూ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. డీ 2, డీ3 సెక్షన్లలో అపార్ట్మెంట్లను సైతం వదలడం లేదని తెలిసింది. ‘మీరు 4 ఫ్లోర్లకు మాత్రమే అనుమతి తీసుకున్నారు.. ఇక్కడ మాత్రం 5 ఫ్లోర్లు నిర్మించారు.. 5వ ఫ్లోర్కు విద్యుత్ సర్వీసు ఇవ్వం’ అంటూ బెదిరించడం.. డబ్బు అందగానే వాటికి సైతం సర్వీసు మంజూరు చేయడం షరామామూలుగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆరుకు పైగానే సర్వీసులు మంజూరు చేస్తున్నట్లు తెలిసింది. ఇక.. 100 కిలోవాట్ల విద్యుత్ వాడకం ఉన్న అపార్ట్మెంట్లకు 60, 40 కిలోవాట్లకు మాత్రమే ఎస్టిమేషన్లు వేస్తున్నట్లు సమాచారం. సంస్థపై పెనుభారం.. విద్యుత్ అధికారుల బాగోతంతో ఎస్పీడీసీఎల్ సంస్థపై అదనపు భారం పడుతోంది. ఇష్టారాజ్యంగా సర్వీసులు ఇస్తుండడంతో లో ఓల్టేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో సమస్యను అధిగమించేందుకు ఎస్పీడీసీఎల్ రూ.కోట్లు ఖర్చు చేస్తూ అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కళ్యాణదుర్గం రోడ్డు బాలాజీ విల్లాస్ వెనుక భాగంలో నాలుగేళ్ల క్రితం వెలసిన వెంచర్ ఇది. కళ్యాణదుర్గం రోడ్డుకు చెందిన ఓ బిల్డర్ ఇక్కడ కొన్ని ప్లాట్లు కొనుగోలు చేశాడు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు విద్యుత్ సర్వీస్ కోసం డీ–5 సెక్షన్కు వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే విద్యుత్ శాఖ టౌన్ 2లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. వెంచర్కు అనుమతులు లేవు.. విద్యుత్ సర్వీస్ ఇచ్చేందుకు నిబంధనలు అనుమతించవని చెప్పారు. ఈ క్రమంలో ఉన్నతాధికారికి సదరు బిల్డర్ రూ.2 లక్షలకు పైగా ముడుపులివ్వగా.. వెనువెంటనే సర్వీస్ మంజూరు చేశారు. నారాయణపురంలో సైతం ఇలాగే ఓ వెంచర్ నిర్వాహకుడి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు తెలిసింది. అపార్ట్మెంట్లకు సైతం అనుమతుల నెపంతో ఆయన భారీగా వసూళ్లు చేస్తున్నట్లు విద్యుత్ శాఖలో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న షూమార్టును అనంతపురం సుభాష్ రోడ్డులో ఇటీవలే ప్రారంభించారు. భవనానికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో టౌన్–1లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 40 కిలోవాట్ల విద్యుత్ వాడకం ఉంటుందని, 63 కిలోవాట్ల సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలని బిల్డింగ్ నిర్వాహకుడికి చెప్పారు. ఈ క్రమంలో నిర్వాహకుడు రూ.5 లక్షలకు పైగా చెల్లించగా.. వెంటనే సిటీమీటర్ను రిలీజ్ చేసి సర్వీస్ మంజూరు చేశారు. విద్యుత్ శాఖ నిబంధనల మేరకు ట్రాన్స్ఫార్మర్ను చార్జ్ చేసిన తర్వాతనే సర్వీస్ మంజూరు చేయాలి. అయితే ముడుపులు అందడంతో అవన్నీ గాలికి వెళ్లిపోయాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇటీవల సుభాష్రోడ్డు, కమలానగర్ ప్రాంతాల్లో లో ఓల్టేజీ సమస్య తలెత్తుతుండటం గమనార్హం. చర్యలు తీసుకుంటాం విద్యుత్ సర్వీసుల మంజూరు కోసం వెంచర్ల నిర్వాహకుల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్న ఉద్యోగులపై విజిలెన్స్ విచారణ చేపడతాం. వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటాం. ట్రాన్స్ఫార్మర్లు చార్జ్ చేసిన తర్వాతే సిటీ మీటర్లు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. – శేషాద్రిశేఖర్, ఎస్ఈ -
ఏడుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
తాడిపత్రి టౌన్: క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఏడుగురిని గురువారం తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రోహిత్కుమార్ వివరాలు వెల్లడించారు. పట్టణ శివారులోని రజక కల్యాణ మంటపం వద్ద ‘ఏస్ టీకింగ్’ క్రికెట్ బెట్టింగ్ యాప్ ఏజెంట్ మకందర్ సంధానీ తచ్చాడుతుండగా... అనుమానంతో ఎస్ఐ గౌస్బాషా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈజీ మనీ కోసం సెల్ఫోన్లలో మట్కా, యాప్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారణ కావడంతో అతను ఇచ్చిన సమాచారం మేరకు అతని స్నేహితులు బలపనూర్ షబ్బీర్, మకందర్ జిలానీ, మకందర్ మహబూబ్బాషా, డోంగ్రీ హరూన్, పోస నరేష్ బాబు, షేక్ ముజీబ్, పామిడి మహమ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4.20 లక్షలు నగదుతో పాటు 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందరూ జేసీ అనుచరులే అరెస్ట్యిన వారిలో మకందర్ సంధానీ క్రికెట్ బుకీ కాగా, డోంగ్రీ హరూన్ తాడిపత్రిలో హరూన్ మోటార్స్ పేరుతో ఎలక్ట్రికల్ బైక్లు విక్రయిస్తున్నాడు. అతనికి పార్టనర్గా మకందర్ జిలానీ ఉన్నారు. హరూన్ మోటార్స్లో డ్రైవర్గా షేక్ ముజీబ్ పనిచేస్తున్నాడు. హరూన్కు బలపనూర్ షబ్బీర్ స్నేహితుడు. పామిడి మహమ్మద్ మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇతనికి పోస నరేష్బాబు స్నేహితుడు. వీరంతా స్థానిక మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులే కావడం గమనార్హం. 4.20 లక్షలు నగదు, 10 సెల్ఫోన్లు స్వాధీనం -
ఊరించి ఉసూరుమనిపించారు..
●పట్టుమని పది నెలల్లోనే టీడీపీకి దూరమైన ‘అనంతపురం’ నేతలు ●తాజాగా జరిగిన క్లస్టర్ ఇన్చార్జ్ల సమావేశానికి డుమ్మా ●అధిష్టానం సీరియస్గా ఉందని హెచ్చరించినా బేఖాతరు ●ఎన్నికల ముందు ఊరించి ఉసూరుమనిపించారంటూ ఆవేదన ●అన్ని ఆదాయ వనరులూ ఒకరికే చెందుతున్నాయని నిట్టూర్పు సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో అప్పుడే అసమ్మతి సెగలు రేగాయి. కూటమి సర్కారు ఏర్పడి పట్టుమని పది నెలలు కూడా కాకుండానే టీడీపికి చెందిన ముఖ్య నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత రెండు మాసాలుగా కేడర్కూ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కూ ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కేడర్లో ఏ ఒక్కరికీ పనులు కావడం లేదని, అన్నీ ఎమ్మెల్యే మనుషులకే దక్కుతున్నాయని, ఈ మాత్రం దానికి తామెందుకు పార్టీ కోసం కష్టపడాలని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సభ్యత్వ నమోదు కూడా తూతూమంత్రంగా జరిగినట్లు తెలిసింది. సమావేశానికి రాంరాం.. రెండు రోజుల క్రితం అనంతపురం టీడీపీ పరిశీలకుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్చార్జ్ల సమావేశం జరిగింది. ఇందుకు అర్బన్ నియోజకవర్గ ముఖ్య నాయకులెవరూ హాజరు కాలేదు. మాజీ మేయర్ స్వరూప, సుధాకర్ నాయుడు, ఆదెన్న, బుగ్గయ్య, రాయల్మురళి, జేఎల్ మురళి వంటి వారు ఆ వైపు చూడలేదు. వీళ్లందరూ ఇటీవలి వరకూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వారే. అలాంటి నేతలు నేడు ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు. మార్కెట్ యార్డు చైర్మన్గిరీ.. అన్ని చోట్లా వారికే..! అనంతపురం మార్కెట్ యార్డ్ తనకే దక్కుతుందని టీడీపీకి చెందిన ఓ మహిళ ప్రచారం చేసుకుంటోంది. ఇప్పటికే సంబంధిత ప్రజాప్రతినిధికి రూ.65 లక్షలు ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. సదరు మహిళ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. ఇప్పటికే రాప్తాడు మార్కెట్ కమిటీ చైర్మన్గిరీని కమ్మ సామాజిక వర్గ నేతకే కట్టబెట్టారు. ఈ క్రమంలో అనంతపురంలో కూడా అదే సామాజిక వర్గ నేతకు పదవి ఎలా అప్పజెబుతారని కేడర్ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆ మహిళకు ఇవ్వకపోతే తన సమీప బంధువు కోనంకి గంగారాంకు పదవి కట్టబెట్టాలని ఎమ్మెల్యే యోచిస్తున్నట్లు తెలిసింది. గంగారాం కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కాపు, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారు గుర్రుమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకునేది లేదని బహిరంగంగానే స్పష్టం చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇదిలా ఉండగా దగ్గుపాటి ప్రసాద్కు సొంత పార్టీలోనే బద్ధశత్రువుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వచ్చే నెల నుంచి జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ‘ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాం.. ఎన్నికల ముందు మాకు ఎన్నో హామీలిచ్చారు. పదవులు ఇస్తామన్నారు.. ఈ క్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త వ్యక్తి అయినా దగ్గరుండి గెలిపించాం.. కానీ ఇప్పుడు పదవులూ లేవు, ఆదాయమూ లేదు’ అంటూ ఓ టీడీపీ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డామని.. అప్పులు చేసి ఖర్చు పెడితే ఇప్పుడా అప్పులకు వడ్డీలు కడుతున్నామని కమ్మ సామాజిక వర్గానికే చెందిన ఒక నాయకుడు వాపో యారు. ‘ఆదాయమొచ్చే పనులు ఎమ్మెల్యేకు, కష్టం మాకా’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఎమ్మెల్యే పాల్గొంటున్న సమావేశాలకు వెళ్లడం లేదని మరో నాయకుడు తెగేసి చెప్పారు. కేడర్ ఎవరూ ఇష్టంగా పనిచేసేందుకు ముందుకు రావడం లేదని, ఎమ్మెల్యే వ్యవహార శైలే కారణమని కాపు సామాజిక వర్గ నేత చెప్పారు. -
హోరీహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
గుంతకల్లు రూరల్: కాశిరెడ్డి నాయన నూతన ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు గ్రామంలో గురువారం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి 14 జతల దేశం ఎద్దులను పోటీలకు రైతులకు తీసుకువచ్చారు. కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన రైతు హుసేనప్ప ఎద్దులు మొదటి స్థానంలో, డి.హీరేహాల్ మండలం ఉద్యాల గ్రామ రైతు నరసింహులు ఎద్దులు ద్వితీయ స్థానంలో నిలిచాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఎద్దుల యజమాలను గ్రామ సర్పంచ్ మల్లికార్జున, మాజీ సర్పంచ్ రాజన్న, వైఎస్సార్సీపీ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు రంగనాయకులు, పరశురాముడు, వెంకటరాముడు, పందికోన శివ.. నగదు పురస్కారాలతో సత్కరించారు. విద్యుదాఘాతంతో రైతు మృతి రాయదుర్గం: మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన రైతు కావలి ఎర్రిస్వామి (54)విద్యుత్ షాక్తో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గురువారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఎర్రిస్వామి.. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజులు ఎగిరిపోయినట్లుగా గుర్తించి, వాటిని వేస్తున్న క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
రూ.10 లక్షల విలువైన బైక్ల స్వాధీనం
బత్తలపల్లి: ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లే యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బత్తలపల్లి పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్ వెల్లడించారు. అనంతపురం నగరానికి చెందిన ప్రణయ్, ధనూష్, సిద్ది వినయ్ వ్యసనాలకు బానిసలుగా మారి జులాయిగా తిరుగుతూ తమ జల్సాలకు అవసరమైన డబ్బు కోసం ద్విచక్ర వాహనాలను అపహరించడాన్ని పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు మైనర్లను కలుపుకున్నారు. వీరంతా కలసి ఓ ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. అనంతరం ఇతర రాష్ట్రాలకు చేరుకుని జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో బత్తలపల్లిలోని జాతీయ రహదారి కూడలిలో గురువారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఆరుగురు వెళుతుండగా స్థానిక పోలీసులు అడ్డుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో వారు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. బత్తలపల్లి, ధర్మవరం, అనంతపురం నగర పరిధిలో అపహరించిన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలుగా ఉంటుందని నిర్ధారించారు. వీరిపై బత్తలపల్లిలో రెండు, ధర్మవరం టూ టౌన్ పరిధిలో మూడు కేసులు, అనంతపురంలో ఐదు కేసులున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్లను బాలుర పరివర్తన కేంద్రానికి తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన ఎస్ఐ సోమశేఖర్, సిబ్బందిని సీఐ ప్రభాకర్ అభినందిస్తూ రివార్డులను అందజేశారు. ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఆరుగురి అరెస్ట్ -
జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. వేసవితాపం కొనసాగుతోంది. గంటలకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.
అనంతపురం నుంచి బెంగళూరుకు రైలు ● కొత్తగా ఏడు స్టేషన్లలో స్టాపింగ్ అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు వరకు నడిచే మెమూ రైలును అనంతపురం వరకు పొడిగించారు. దీంతో పాటు అనంతపురం నుంచే బెంగళూరుకు బయలుదేరేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడంపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం–బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు నడపాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను ఎప్పటి నుంచో ఈ ప్రాంతవాసులు కోరుతూ వచ్చారు. వారి విజ్ఞప్తిని అధికారులు ఎట్టకేలకు మన్నించారు. త్వరలోనే రైలు అనంతపురం నుంచి బయలుదేరేలా ప్రణాళిక రచించారు. ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు మధ్య ఇప్పటి వరకు ఉన్న స్టాపింగులతో పాటు అదనంగా ప్రసన్నాయపల్లి, జంగాలపల్లి, చిగిచెర్ల, బాసంపల్లె, కొత్తచెరువు, విదురాశ్వర్థం, సోమేశ్వరలో స్టాపింగ్ సదుపాయం కల్పించారు. సామాన్య ప్రయాణికులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు రైలు ఎంతో సౌకర్యంగా ఉండనుంది. అతి త్వరలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి చేతుల మీదుగా అనంతపురం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ మాసినేని అశోక్ కుమార్ వేర్వేరుగా తెలిపారు. అనంతపురంలో మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటలకు బెంగళూరు చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు. -
పండ్ల తోటల్లో డ్రోన్ సర్వే
గార్లదిన్నె: పండ్ల తోటల్లో డ్రోన్ సర్వే నిర్వహించనున్నట్లు ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్ పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా గార్లదిన్నె మండలంలోని ముకుందాపురాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేశారన్నారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో గురువారం ఉద్యాన శాఖ, ఎఫ్పీఓలు, ఏపీఎంఐపీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రైతులకు చేరువ చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. 17 బృందాలు ముకుందాపురంలో చీనీ తోటలను సందర్శించి జీపీఎస్ ట్రాకింగ్ చేస్తాయన్నారు. చీనీ తోటలకు ఆశించే చీడపీడలు, యాజమాన్య పద్ధతులపై ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించి రైతులకు సలహాలు, సూచనలు అందిస్తాయన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని ‘జూమ్’ ద్వారా ఏపీఎంఐపీ డైరెక్టర్ రఘునాథ్ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఫిరోజ్ ఖాన్, ఐటీ (ఇంటెలిజెన్స్) శ్రీహరి పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ మైక్రో ఇరిగేషన్ అధికారులు మధు, గణేష్, నాగార్జున, ఎఫ్పీఓలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పైలట్ గ్రామంగా ముకుందాపురం ఎంపిక -
ఉత్సాహంగా ఉరకలెత్తిన దున్నలు
కణేకల్లు: స్థానిక చిక్కణ్ణేశ్వరస్వామి ఉత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన దున్నపోతుల రాతిదూలం పోటీలు ఆసక్తిగా సాగాయి. స్థానిక జెడ్పీఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదిగా పోటీలు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో రాతి దూలాన్ని లాగుతూ దున్నపోతులు ఉరకలేయడాన్ని చూసి ప్రజలు కేకలు, ఈలలతో హోరెత్తించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోటీలు సాయంత్రం 4 గంటలకు ముగిసాయి. రైతు కె.ముజ్జుకు చెందిన దున్నపోతులు 15 నిమిషాల వ్యవధిలో 2,608.10 అడుగుల మేర దూరాన్ని రాతిదూలాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. మరో రైతు తిప్పేష్కు చెందిన దున్నపోతులు ద్వితీయ స్థానంలో, రైతు జి.రిజ్వంత్కు చెందిన దున్నపోతులు మూడో స్థానంలో నిలిచాయి. విజేత దున్నల యజమానులను అభినందిస్తూ సర్పంచ్ దంపతులు నిర్మల, డాక్టర్ సోమన్నతో నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో కణేకల్లు మేజర్ పంచాయతీ ఈఓ ప్రసాద్, కణేకల్లు చెరువు సంఘం అధ్యక్షుడు బీటీ రమేష్, స్థానికులు లాలెప్ప, అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాతిదూలం లాగుతున్న దున్నపోతులు -
గంజాయి మహమ్మారిని నిర్మూలిద్దాం
అనంతపురం: గంజాయి మహమ్మారి నిర్మూలనకు సమష్టిగా పనిచేద్దామని అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్జీఓలతో అడిషనల్ ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గంజాయి రవాణా నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారి గుర్తింపునకు డోర్ టు డోర్ సర్వే చేయాలన్నారు. పోలీస్, ఎకై ్సజ్, జిల్లా ఈగల్ సెల్, విద్యాశాఖ, గ్రామ, వార్డు సెక్రటరీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సీఐలు హరినాథ్, వెంకటేశ్ నాయక్, జయపాల్ రెడ్డి, జిల్లా ఈగల్ సెల్ ఆర్ఎస్ఐ హనుమంతు తదితరులున్నారు. -
తలపై రాయిపడి యువకుడి మృతి
కళ్యాణదుర్గం రూరల్: నిద్రిస్తున్న యువకుడి తలపై రాయిపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్యాణదుర్గం మండలం మల్లాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వేణు, సునందమ్మ దంపతులు కరూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం ఇంటి ఆవరణలో నిద్రకు ఉపక్రమించారు. అర్థరాత్రి సమయంలో మిద్దైపె నుంచి ప్రమాదవశాత్తు రాయి నిద్రిస్తున్న వేణు తలపై పడడంతో తీవ్ర గాయమైంది. భార్య గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించారు. అధిక రక్తస్రావంతో అప్పటికే వేణు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య గుంతకల్లు: బీటెక్లో ఒక సబ్జెక్ట్ తప్పడంతో మనస్తాపం చెంది ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... కూడేరుకు చెందిన జాఫర్వలి కుమారుడు పి.మహమ్మద్ జావేద్ (18) గుత్తిలోని గేట్స్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గుంతకల్లులోని ద్వారాక నగర్లో నివాసముంటున్న బంధువుల ఇంట్లో ఉంటూ రోజూ కళాశాలకు వెళ్లి వచ్చేవాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినట్లుగా గుర్తించి మానసికంగా కుదేలయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చిన జావేద్ రాత్రి 9 గంటలవుతున్నా ఇంటికి చేరుకోలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసిన జావేద్ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే కుటుంబసభ్యులు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జావేద్ సెల్ఫోన్ లోకేషన్ ఆధారంగా తిమ్మనచెర్ల రైల్వేస్టేషన్ సమీపంలో చేరుకుని పరిశీలించగా పట్టాలపై రెండుగా విడిపోయిన జావేద్ శరీర భాగాలు కనిపించాయి. ఘటనపై జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. యువకుడి దుర్మరణం పామిడి: అతి వేగం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని అశోక్నగర్కు చెందిన శివకుమార్ కుమారుడు సుమంత్ (25) వ్యక్తిగత పనిపై గురువారం ఉదయం గుంతకల్లుకు వెళ్లాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన.. పామిడి గ్రామ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు చేరుకోగానే వేగాన్ని నియంత్రించుకోలేక నేరుగా వెళ్లి కల్వర్టు రక్షణ గోడను ఢీకొన్నాడు. ఘటనలో సుమంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
బాధితులకు ఇదేనా మీరు చేసే న్యాయం?
అనంతపురం అర్బన్: ‘మీకు ఎస్సీ, ఎస్టీలన్నా, వారి సమస్యలన్నా చిన్న చూపు. బాధితుల సమస్యలు పరిష్కరించడంపై శ్రద్ధ చూపరు. ఏళ్లు గడుస్తున్నా సమస్యలను పరిష్కరించడం లేదు’ అంటూ అధికారులను సంఘాల నాయకులు నిలదీశారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్లో కలెక్టర్ వి.వినోద్కుమార్తో పాటు జిల్లా ఎస్పీ పి.జగదీష్, డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, సాంఘిక సంక్షేమశాఖాధికారి రాధిక, అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 238 అర్జీలు అందాయి. ఒక బాధితురాలికి న్యాయం చేసే విషయంలో డీఆర్ఓతో ఎరికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా వీరా వాగ్వాదానికి దిగారు. నగర పరిధిలో నివాసముంటున్న ఎరికల కులానికి చెందిన మహిళ సామూహిక అత్యాచారానికి గురైందన్నారు. అప్పట్లో పోరాటం చేస్తే రూ. లక్ష ఆర్థిక సాయం అందించారన్నారు. జీఓ 95 ప్రకారం బాధితురాలికి ఐదు సెంట్ల స్థలం ఇవ్వాల్సి ఉందని, తొమ్మిదేళ్లుగా అర్జీలిస్తున్నా బాధితురాలికి న్యాయం చేయలేద న్నారు. ఈ విషయంలో ఆర్డీఓ, తహసీల్దారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. డీఆర్ఓ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటానన్నారు. వినతుల్లో కొన్ని... ● తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించారంటూ కళ్యాణదుర్గం మండలం లక్ష్మీపురం ఎస్టీ కాలనీకి చెందిన వాలేనాయక్ ఫిర్యాదు చేశాడు. కంబదూరు మండలం పాలూరు గ్రామ పొలం సర్వే నంబరు 80–1లో 3.50 ఎకరాల భూమి తన తల్లి పేరిట ఉందని, ఈ భూమిని గ్రామంలోని ఒక వ్యక్తి, తహసీల్దారు కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు కలిసి ఆక్రమించారని తెలిపారు. దీనిపై ఆర్డీఓ, తహసీల్దారు, పోలీసులు భూమి హద్దులు వేసినా ఆక్రమణ దారులు తొలగించారని, భూమిలోకి వస్తే చంపుతామంటూ బెదిరిస్తున్నారని వాపోయాడు. ● 20 నెలలుగా తనకు వేతనం అందడం లేదంటూ నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ ఉద్యోగి సూర్యనారాయణ విన్నవించాడు. డ్యూటీపై ఎక్కడా తిరగనివ్వడం లేదని, ఆఫీసులో కూర్చోబెడుతున్నారని వాపోయాడు. ● రుణానికి సంబంధించి సబ్సిడీ మంజూరులో అధికారులు జాప్యం చేస్తున్నారని యల్లనూరు మండలం పాతపల్లికి చెందిన పి.విజయ ఫిర్యాదు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రుణం మంజూరైందని, అయితే సబ్సిడీ మంజూరు క్రమంలో ఫైల్ను బ్యాంకుకు పంపకుండా ఎంపీడీఓ కార్యాలయ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులను నిలదీసిన ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ప్రత్యేక గ్రీవెన్స్లో 238 వినతులు భద్రతా ప్రమాణాలు పాటించాలి పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆరు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. రసాయనాలపై కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత జిల్లా మినరల్ ఫండ్ ద్వారా తాగునీరు, విద్య, వైద్యానికి సంబంధించి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కల్యాణ యోజన (పీఎంకేకేకేవై)పై గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, హిందూపురం ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, జేసీ అస్మిత్రెడ్డి, దగ్గుపాటి ప్రసాద్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 31 నాటికి రూ.52.66 కోట్ల నిధులు నూతన పనులకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో నియోజకవర్గానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల పనులు మంజూరు చేసేందుకు కమిటీ ప్రతిపాదన చేసిందని చెప్పారు. సమావేశంలో గనుల శాఖ డీడీ వెంకటేశ్వర్లు, తాడిపత్రి ఏడీ ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విశ్వాసముంచితేనే నిత్య జీవము
‘ఎదుటి వారి కష్టాలను పంచుకోవడంలోనే శాంతి దాగుంది’ అనే పరమ సత్యాన్ని చాటడానికే క్రీస్తు సిలువనెక్కి రక్షకుడయ్యాడు. ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము చేయనివాడు కనుకనే తనకు తానే సిలువకు అప్పగించుకున్నాడు. మనుష్యుల పట్ల అవ్యాజ్యమైన ప్రేమ, త్యాగము క్రీస్తు జీవితంలో మాత్రమే చూడగలం. విశ్వాసముంచితేనే నిత్య జీవము అనే క్రీస్తు బోధనల సారమే గుడ్ఫ్రైడే పర్వదినం. గుల్జార్పేట్లోని గాస్పెల్ అసెంబ్లీ హాలులో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో అందరూ పాల్గొనండి. – ఫిలిఫ్, దైవజనులు -
క్రీస్తు త్యాగాలకు ప్రతీక గుడ్ ఫ్రైడే
అనంతపురం కల్చరల్: క్రైస్తవ సమాజంలో అత్యంత ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడే గుడ్ ఫ్రైడే రానే వచ్చింది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం సమాజంలో నెలకొన్న చెడును తొలగించడానికి ఈ రోజున తన జీవితాన్ని యేసు క్రీస్తు త్యాగం చేశాడు. ఆ త్యాగాలను మననం చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తుపై విశ్వాసం ప్రకటించేందుకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. క్షమ, కరుణకు ప్రతిరూపంగా నిలిచిన యేసు క్రీస్తు.. లోకంలో పాపులను పరిశుద్ధులను చేసే క్రమంలో సిలువపై రక్తం చిందించిన దైవ కుమారుడిగా మరణించి కూడా పునరుత్థానుడై లేచిన సంఘటన ప్రపంచ చరిత్రలో మరెక్కడా కనిపించదు. ఆ ఘట్టాలను వివరించే గుడ్ ఫ్రైడే నుంచి ఆదివారం వచ్చే ఈస్టర్ పర్వదినం వరకు సాగే వేడుకలకు జిల్లాలోని ప్రతి ప్రార్థనామందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నేనే మార్గం – నేనే జీవం పాపులను పరిశుద్ధులను చేసేందుకు కరుణామయుడైన క్రీస్తు సిలువనెక్కిన రోజున గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నట్లు పలువురు పాస్టర్లు తమ సందేశాలలో చెపుతున్నారు. నేనే మార్గం.. నేనే జీవం అని సమస్త మానవాళిలో స్థైర్యం నింపుతూ యేసయ్య చిరునవ్వుతో తన దేహాన్ని బలిదానంగా అర్పించిన రోజు శుభ శుక్రవారంగా మారిందని, ఉపవాసాలతోనే ఆయనను మెప్పించాలని పేర్కొన్నారు. ముస్తాబైన చర్చిలు సాధారణంగా ఇతర పండుగలకు భిన్నంగా గుడ్ఫ్రైడే ఆనందోత్సాహాలతో కాకుండా క్రీస్తు త్యాగానికి ప్రతీకగా కనపడుతుంది. కాబట్టే ఈ దినాల నాడు ఉపవాసాలుండడం ఆనవాయితీగా వస్తోంది. క్రీస్తు చివరిసారి సిలువపై పలికిన ఏడు వ్యాక్యాలు ప్రార్థనామందిరాలలో ఇప్పటికే ప్రతిధ్వనిస్తున్నాయి. అనంతలోని పురాతన మందిరాలైన సీఎస్ఐ చర్చిలో పెద్ద ఎత్తున క్రైస్తవులతో రెవరెండ్ బెనహర్బాబు నేతృత్వంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మరో ప్రాచీన ప్రార్థనామందిం ఎస్ఐయూ చర్చిలో బెంగళూరు నుంచి విచ్చేసే అంతర్జాతీయ సువార్తీకులు స్టీఫెన్ బాబ్, సంఘ కాపరి పాస్టర్ సంపత్కుమార్తో కలసి వల్యక్యోపదేశం చేయనున్నారు. రామచంద్ర నగర్లోని కార్మియల్ మాత మందిరంలో క్రీస్తు జీవితాన్ని సజీవంగా ఆవిష్కరించే లఘు నాటికను ప్రదర్శించనున్నారు. కోర్టురోడ్డు, గుల్జార్పేట్లోని గాస్పెల్ హాల్, కళాకారుల కాలనీలోని రేమా చర్చి సామూహిక ప్రార్థనలకు సిద్ధమయ్యాయి. క్రీస్తు సిలువపై పలికిన చివరి మాటల ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడానికి ప్రార్థనల్లో విరివిగా పాల్గొనాలని పాస్టర్లు పిలుపునిచ్చారు. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న చర్చిలు ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తుపై విశ్వాసం ప్రకటించనున్న క్రైస్తవులు -
1.20 కోట్ల పనిదినాలు..రూ.368 కోట్ల నిధులు
రాయదుర్గం: ఉపాధి హామీ పథకం కింద పని దినాల లక్ష్యం ఖరారైంది. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.368 కోట్లతో 1.20 కోట్ల పని దినాలు కల్పించేలా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలో జూన్ ఆఖరుకు జిల్లాలోని 31 మండలాల్లో 68 లక్షల పనిదినాలు పూర్తి చేసేలా ఉన్నతాధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఒక్కో కూలీకి సగటు వేతనం రూ.307 చెల్లించేలా కార్యాచరణ చేపట్టారు. ఇంకుడు గుంతలు, పశువుల షెడ్లు, నర్సరీల్లో మొక్కల పెంపకం, చెక్డ్యాంలు, వ్యక్తిగత మరుగు దొడ్లు, పంట పొలాలకు అనుసంధానంగా రోడ్లు, నీటి కుంటల నిర్మాణాలు, మొక్కలు నాటడం లాంటి పనులకు పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. దొంగ మస్టర్ల కలకలం.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధి నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.చాలా చోట్ల గత వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన పనుల వద్దే మళ్లీ తూతూమంత్రంగా పనులు చేస్తున్నారని, మరి కొన్నిచోట్ల వృథా పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలున్నాయి.ఇటీవల కొన్ని మండలాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల దొంగ మస్టర్ల మాయాజాలం కలకలం రేపింది. కూలీలు పనులకు రాకున్నా హాజరు వేస్తూ డబ్బులు మింగేస్తున్న వైనం అందరినీ విస్మయానికి గురి చేసింది. జిల్లా సరిహద్దు మండలాల్లో అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక.. కూటమి ప్రభుత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన శ్రమశక్తి సంఘాల ముసుగులో అర్హులకు అన్యాయం జరిగే అవకాశం లేకపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పనులను అధికారులు నిత్యం తనిఖీ చేయడంతో పాటు ప్రతి మస్టర్ను నిశితంగా పరిశీలించాకే వేతనాలు జమ చేయాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ‘ఉపాధి’ ప్రణాళిక ఖరారు సగటు వేతనం రూ.307కు పెంపు జూన్ ఆఖరుకు 68 లక్షల పనిదినాలు పూర్తి చేసేలా కార్యాచరణ అక్రమాలు లేకుండా చర్యలు తీసుకోవాలంటున్న కూలీలుఅక్రమాలకు తావులేదు ఉపాధి పథకంలో ఈ ఏడాది లక్ష్యం మేరకు పనులు కల్పిస్తాం. అడిగిన ప్రతి కూలీకి పని చూపుతాం. సగటు వేతనం రూ.307 పొందేలా అవగాహన కల్పిస్తున్నాం. గతేడాది 1.10 కోట్ల పని దినాలు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.20 కోట్లకు పెంచాం. మస్టర్లలో అవకతవకలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడతాం. పనులకు రాకుండా వేతనాలు జమ చేసినట్టు తేలితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. – సలీమ్బాష, డ్వామా పీడీ -
వేరుశనగకు పంట రుణం రూ.38 వేలు
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది వేరుశనగ పంటకు సంబంధించి ఎకరాకు రూ.38 వేల ప్రకారం రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశాలు అందాయి. ఖరీఫ్, రబీలో పంటల వారీగా రైతులకు ఎంత మొత్తంలో రుణాలివ్వాలనే అంశంపై గరిష్ట రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ఖరారైనట్లు బ్యాంకర్లు తెలిపారు. గతేడాది కన్నా పంట పెట్టుబడులను బట్టి 10 నుంచి 20 శాతం రుణ పరిమితి పెంచారు. జిల్లాలోని బ్యాంకుల్లో రైతులకు సంబంధించి ఖరీఫ్ పంట రుణాల రెన్యువల్స్, కొత్త రుణాల పంపిణీ ప్రారంభమైనట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్కు అదనంగా 15 శాతం అధికంగా ఇచ్చే వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. పంటల వారీగా ఇలా: వర్షాధారంగా సాగు చేసే వేరుశనగ ఎకరాకు రూ.38 వేలు, నీటి వసతి కింద అయితే రూ.41 వేల ప్రకారం రుణం ఇవ్వనున్నారు. కంది పంట వర్షాధారంగా ఎకరాకు రూ.29 వేలు, నీటి వసతి కింద రూ.30 వేలు, ఆముదం రూ.22 వేలు, పప్పుశనగ రూ.37 వేలు, పత్తి రూ.51 వేలు– 55 వేలు, విత్తనోత్పత్తి పత్తి రూ.1.60 లక్షలు, వరి రూ.52 వేలు, విత్తన వరి రూ.55 వేలు, జొన్న రూ.25 వేలు, రాగి రూ.22 వేలు– 25 వేలు, సజ్జ రూ.21 వేలు– 24 వేలు, కొర్ర రూ.17 వేలు– 21 వేలు, వర్షాధారంగా మొక్కజొన్న రూ.31 వేలు, నీటి వసతి కింద రూ.47 వేలు, విత్తన మొక్కజొన్నకు రూ.50 వేలుగా నిర్ణయించారు. ఉద్యాన, కూరగాయల పంటలకు.. పచ్చిమిరపకు రూ.1.10 లక్షలు, ఎండుమిరప రూ.1.75 లక్షలు, టమాట ట్రెల్లీస్ లేకుండా రూ.41 వేలు, ట్రెల్లీస్ టమాట రూ.65 వేలు, హైబ్రీడ్ టమాట రూ.78 వేలు, ట్రెల్లీస్ హైబ్రీడ్ టమాట రూ.1.25 లక్షలు, వంకాయ రూ.54 వేలు, హైబ్రీడ్ వంకాయ రూ.67 వేలు, బెండ రూ.36 వేలు, హైబ్రీడ్ బెండ రూ.50 వేలు, ఉల్లి రూ.60 వేలు,మునగ రూ.49 వేలు,వర్షాధారంగా బేబీకార్న్కు రూ.28 వేలు, నీటి వసతి కింద రూ.44 వేలు, కరివేపాకు రూ.60 వేలు, ధనియాలు రూ.24 వేలు, సోయాబీన్స్ రూ.17 వేలు, అరటి ఎకరా రూ.1.10 లక్షలు, టిష్యూ కల్చర్ అరటి రూ.1.36 లక్షలు, దానిమ్మ రూ.1.60 లక్షలు, చీనీ రూ.71 వేలు, నిమ్మ రూ.85 వేలు, బొప్పాయి రూ.1.20 లక్షలు, మామిడి రూ.55 వేలు, సపోట రూ.43 వేలు, ద్రాక్ష రూ.1.25 లక్షలు, రేగు రూ.34 వేలు, కళింగర రూ.54 వేలు, దోస రూ.66 వేలు, జామ రూ.55 వేలు, అంజూర రూ.42 వేలు, సీతాఫలం రూ.27 వేలు, డ్రాగన్ఫ్రూట్ రూ.77 వేలు, చింత రూ.27 వేలు, కొబ్బరి రూ.70 వేలు, మల్లెపూల తోటల సాగుకు రూ. లక్ష, రోజాపూలు రూ.43 వేలు – 66 వేలు, బంతిపూలు రూ.55 వేలు, చామంతి రూ.60 వేలు, కనకాంబరాలు రూ.39 వేలు, గడ్డి సాగు రూ.36 వేలు, మల్బరీ సాగుకు రూ.1.20 లక్షల మేర స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేశారు. 10 నుంచి 20 శాతం పెరిగిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ప్రారంభమైన పంట రుణాల రెన్యువల్స్ -
కఠిన చర్యలు తీసుకుంటాం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. సాధారణంగా భూమి రిజిస్ట్రేషన్ జరిగితే.. ఒరిజనల్ డాక్యుమెంటు అందుకునేందుకు వారం నుంచి 10 రోజులు పడుతుంది. కానీ రూ.1,000 కొడితే సాయంత్రానికే సిబ్బంది ఇచ్చేస్తున్నారు. డబ్బులివ్వకుంటే ఆలస్యం చేస్తున్నారు. ఈ నెల 8న భూముల రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇప్పటికీ డాక్యుమెంట్ రాకపోవడమే ఇందుకు ఉదాహరణ. సిబ్బంది అక్రమ వ్యవహారంతో సామాన్యులు విసుగెత్తిపోతున్నారు. అన్ని విషయాలు ఆయా సబ్ రిజిస్ట్రార్లకు తెలిసే జరుగుతున్నట్టు సమాచారం. నకళ్లకు వంద... స్థిరాస్తులకు సంబంధించిన నకళ్లు (సర్టిఫైడ్ కాపీలు) కావాలంటే రూ.500 చలానా చెల్లించి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రూ.150 చెల్లిస్తే డాక్యుమెంటు ఇస్తారు. కానీ కొంతమంది ఔట్సోర్సింగ్ సిబ్బంది రూ. వంద తీసుకుని.. డాక్యుమెంటు నంబర్ ద్వారా వాట్సాప్లో పీడీఎఫ్ కాపీలు పంపిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చలానాల రూపంలో అందే ఆదాయం పడిపోతోంది. ఇక.. పక్కాగా ఉన్న డాక్యుమెంటు రిజిస్ట్రేషన్కు అయినా సబ్ రిజిస్ట్రార్కు ముడుపులు చెల్లించాల్సి వస్తోందనే విమర్శలు ఉన్నాయి. లేదంటే ‘కామా లేదు, ఫుల్స్టాప్ లేదు, దిశలు సరిగా లేవు’ అని కొర్రీలు పెట్టి తిప్పుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అనంతపురం అర్బన్, రూరల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్లు ఏమీ తెలియనట్టే ఉంటూ కిందిస్థాయి సిబ్బంది ద్వారా పిండుకుంటున్నారు. జీపీఏలు చూసి రిజిస్ట్రేషన్.. సామాన్యులకు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాక రిజిస్ట్రేషన్లు చేస్తున్న అనంతపురం రూరల్, అర్బన్ రిజిస్ట్రేషన్ అధికారులు.. ఇటీవల జీపీఏను చూపించినా భారీగా రిజిస్ట్రేషన్లు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. శోత్రియం భూములపై రాప్తాడుకు చెందిన కొంతమంది టీడీపీ నాయకులు జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ)లు సృష్టించారు. వీటిని అడ్డు పెట్టుకుని సబ్ రిజిస్ట్రార్లు కోట్లాది రూపాయల విలువ చేసే భూములను ‘పచ్చ’ నేతల సొంతం చేశారు. ఈ క్రమంలో ఆయా భూములు కొన్న వారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మరో నాలుగు చోట్లా ఇంతే.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తీరు మారడం లేదు. ఎన్ని సంస్కరణలు తెచ్చినా వసూళ్లు మాత్రం ఆగడం లేదు. ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి,రాయదుర్గం కార్యాలయాల్లోనూ పరిస్థితి అధ్వానంగా ఉంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు వెళ్లిన వారికి ఆయా కార్యాలయాల సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ఏసీబీ దాడులు జరిగినా, విజిలెన్స్ సోదాలు నిర్వహించినా మూణ్నాళ్ల ముచ్చటే అవుతోంది. అనంతపురం అర్బన్, రూరల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసూళ్ల పర్వం ఒకేరోజులో డాక్యుమెంటు కావాలంటే ఒకరేటు సర్టిఫైడ్ కాపీ వాట్సాప్లో పంపేందుకు ఇంకో రేటు.. ఇప్పటికే జీపీఏల ద్వారా రూ. కోట్ల విలువైన భూముల రిజిస్ట్రేషన్ అనంతపురం నగరంలోని సిండికేట్నగర్లో వారం రోజుల క్రితం ఓ వ్యక్తి నాలుగు సెంట్ల స్థలం కొన్నారు. అదే రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి స్థలానికి సంబంధించి డాక్యుమెంటు కావాలని అడిగితే మొదట ససేమిరా అన్నారు. సదరు వ్యక్తి రూ. 2 వేలు ఇచ్చేసరికి సాయంత్రానికే మహిళా సిబ్బంది డాక్యుమెంటు అందించారు. రాప్తాడు రూరల్ పరిధిలో రెండెకరాల వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్కు వచ్చింది. ఇటీవల భూమి కొనుగోలుదారుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి డాక్యుమెంటు కావాలని కోరగా మొదట ఎవరూ స్పందించలేదు. తర్వాత కొంతసేపటికే ఆఫీసు సిబ్బంది అతడి దగ్గరికి వెళ్లి రూ.5 వేలు చెల్లిస్తే సాయంత్రానికి ఇస్తామని చెప్పారు. డబ్బు తీసుకుని చెప్పిన టైంకి అందించారు. మచ్చుకు ఇవి రెండు ఉదాహరణలే.. ఇలాంటివి అనంతపురం అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిత్యం పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. గతంలో మాదిరి డాక్యుమెంట్లు ఎక్కువ రోజులు పట్టడం లేదు. అయినా డబ్బు తీసుకుని ఒక్క రోజులో ఇవ్వడం సరి కాదు. సర్టిఫైడ్ కాపీలు వాట్సాప్లో పంపడం నేరం. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. –భార్గవ్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి -
గడువులోపు పరిష్కారం చూపాలి
గుంతకల్లు: రెవెన్యూ పరమైన అంశాల్లో అర్జీదారులు ఇచ్చిన వినతులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ ఆదేశించారు. గుంతకల్లు రెవెన్యూ డివిజన్ పరిధిలో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై స్థానిక శ్రీశంకరానంద గిరి స్వామి డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఆర్ఓ కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. భూతగాదాలు,రస్తా సమస్యలు,ఇంటి స్థలాలు... తదితర సమస్యలు ఎంత మేరకు పరిష్కారం అయ్యాయంటూ అధికారులతో ఆరా తీశారు. రెవెన్యూ పరమైన భూసేకరణ, ఆర్ఓఆర్ సమస్యలు తదితర విషయాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, మల్లికార్జున, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్, సర్వే ఏడీ రూప్లానాయక్ తదితరులు పాల్గొన్నారు. నక్కనదొడ్డి తండాలో పర్యటించిన కలెక్టర్ గుంతకల్లు రూరల్: ఆర్ఓ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం గుంతకల్లుకు వచ్చిన కలెక్టర్ వినోద్కుమార్... అనంతరం ఇదే మండలంలోని నక్కనదొడ్డి తండాలో పర్యటించారు. గ్రామానికి చెందిన రైతు మునే నాయక్ సర్వే నంబర్ 342లో ఉన్న తన భూమిని రీ సర్వే చేయడంతోపాటు, సబ్ డివిజన్ కూడా చేయాలని కోరుతూ ఇటీవల కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చాడు. ఈ క్రమంలో నక్కనదొడ్డి తండాకు చేరుకున్న కలెక్టర్... క్షేత్రస్థాయిలో సర్వే నంబర్ 342లోని భూములను పరిశీలించారు. మునేనాయక్కు చెందిన భూమి వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు ఇచ్చిన అర్జీ మేరకు సదరు భూమిని వెంటనే సబ్ డివిజన్ చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ రమాదేవి, ఇతర సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ నక్కనదొడ్డి తండాలో పర్యటన -
ఉన్నతాధికారుల పేరుతో నకిలీ ఖాతాలు
● అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ వినోద్కుమార్ సూచన అనంతపురం అర్బన్: కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారుల పేర్లపై సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాలు సృష్టించారని కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. ఆ ఖాతాలు, ఫోన్ ద్వారా డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి వాటి పట్ల ఉద్యోగులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెసేజ్లు వస్తే సహ ఉద్యోగులైనా, తెలిసిన వారైనా నిర్ధారించుకోకుండా తొందరపడి డబ్బు పంపరాదన్నారు. వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. నేడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ అనంతపురం అర్బన్: కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక తెలిపారు. కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్జీలను సమర్పించుకోవాలని సూచించారు. తపాలా ఎస్పీగా రాజేష్ అనంతపురం సిటీ: అనంతపురం డివిజన్ తపాలా సూపరింటెండెంట్గా రాజేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కడప డివిజన్ రెగ్యులర్ సూపరింటెండెంట్గా కొనసాగుతున్న ఆయనకు అనంతపురం డివిజన్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు తపాలా ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు బ్రహ్మానందరెడ్డి, కృష్ణయ్య యాదవ్ తదితరులు వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇప్పటి వరకూ ఆ స్థానంలో కొనసాగిన గుంపస్వామి బుధవారం రాత్రి రిలీవ్ అయ్యారు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయనపై ఫిర్యాదులు వెల్లువెతిన నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని ఆదిలాబాద్ డివిజన్కు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు పెద్దవడుగూరు: రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులను గుంటూరు నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఏడీఏ రమణమూర్తి, గుత్తి ఏడీఏ వెంకట్రాముడు హెచ్చరించారు. పెద్దవడుగూరులోని ఉమామహేశ్వర ఫర్టిలైజర్ షాపును బుధవారం వారు ఆకస్మిక తనిఖీ చేశారు. విక్రయిస్తున్న విత్తనాలు, పురుగు మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. విక్రయించే ప్రతి విత్తనమూ నాణ్యతగా ఉండాలని సూచించారు. నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. పత్తి విత్తనాల కొనుగోలు సమయంలో రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని అక్కడి రైతులకు సూచించారు. రసీదు లేకుండా ఎవరైనా విత్తనాలు విక్రయిస్తే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.కార్యక్రమంలో కమిషనరేట్ ఏఓ సుకుమార్, అనంతపురం జేడీఏ కార్యాలయ టీఏఓ రాకేష్నాయక్, ఏఓ మల్లీశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ యంత్ర పరికరాలకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద వ్యక్తిగతంగా పరికరాలు అవసరమైన రైతులు ఆర్ఎస్కేల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేటాయించిన రూ.3 కోట్ల బడ్జెట్లో ఇప్పటికే రూ.1.60 కోట్ల మేర అవసరమైన పరికరాలు కావాలని రైతులు తమ వాటా కింద సొమ్ము చెల్లించి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా బడ్జెట్ ఉన్నందున సాధ్యమైనంత తొందరగా స్ప్రేయర్లు, టిల్లర్లు, తదితర వాటికి 50 శాతం మేర రైతు వాటా చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పరికరాలు అందజేస్తామని పేర్కొన్నారు. -
●చౌడేశ్వరీ.. నమోస్తుతే..
అమడగూరు: చల్లని తల్లి చౌడేశ్వరమ్మ జ్యోతుల వెలుగుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అమడగూరులో వెలసిన చౌడేశ్వరీ దేవి వార్షిక ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ధర్మకర్త, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పొట్టా పురుషోత్తమరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జ్యోతి ఉత్సవంలో అమ్మవారిని దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, అమ్మవారిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించారు. జ్యోతిదర్శనంతో పులకించిన భక్తజనం ఉత్సవంలో భాగంగా తొలుత అమ్మవారి విగ్రహాన్ని పూలపల్లకీపై కొలువుదీర్చి ఆలయం నుంచి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి వరకూ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి పల్లకీ ముందు జ్యోతిని రగిలించారు. జ్యోతి ముందు వెళ్తుండగా... ఆ వెలుగుల్లో చౌడేశ్వరీదేవి భక్తులను దర్శనమిచ్చారు. ఈ క్రమంలో జ్యోతిని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. డప్పు, మంగళవాయిద్యాలు, బాణసంచా పేలుళ్ల మధ్య యువకులు చిందులేస్తూ ఆడి, పాడారు. భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన కోలాటలు, భజనలు, హరికథలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చీకిరేవులపల్లి యూత్ సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గురువారం అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
●తప్పతాగి... హల్చల్ చేసి
కూటమి పాలనలో తాగుబోతుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. బుధవారం రాత్రి అనంతపురంలోని రైల్వే స్టేషన్ కూడలిలో ఓ యువకుడు మద్యం మత్తులో నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు. ఒంటిపై చొక్కా విప్పేసి దర్జాగా రోడ్డుపై పడుకుని వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాడు. రాష్ట్రంలో సంపద సృష్టి అంటే యువకులను మద్యానికి బానిసలను చేయడం కాదని, ఇప్పటికై నా ప్రభుత్వం మత్తు వదిలి మద్యం విక్రయాలను కట్టడి చేయాలని ఈ సందర్భంగా అటుగా వెళుతున్న వారు వ్యాఖ్యానించడం గమనార్హం. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురంమహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ ధర్మవరం రూరల్: మండలంలోని రేగాటిపల్లి పొలాల్లో గత నెల 16న దారుణ హత్యకు గురైన చిట్రా అక్కమ్మ (57) కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. వివరాలను బుధవారం స్థానిక పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మవరం రూరల్ పీఎస్ సీఐ ఎన్.ప్రభాకర్ వెల్లడించారు. రావులచెరువు గ్రామానికి చెందిన చిట్రా అక్కమ్మకు 30 సంవత్సరాల క్రితం మేడాపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. దాదాపు 27 ఏళ్ల క్రితం అక్కమ్మ తన భర్త, పిల్లలను వదిలేసి ధర్మవరంలోని తిక్కస్వామి నగర్లో అద్దె ఇంటికి మకాం మార్చింది. ఈ క్రమంలో బతుకు తెరువు కోసం కళాజ్వోతి సర్కిల్లో వ్యభిచారం సాగిస్తుండేది. గత నెల 16న సాయంత్రం కళాజ్వోతి సర్కిల్లో విటుల కోసం వేచి ఉన్న ఆమెను స్థానిక శాంతినగర్కు చెందిన ఆటో డ్రైవర్ కట్టుబడి షెక్షావలి, టీచర్స్ కాలనీలోని చౌడమ్మ గుడి వద్ద నివాసముంటున్న తలారి లోకేంద్ర ఆటోలో ఎక్కించుకుని రేగాటిపల్లి పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అక్కమ్మతో లోకేంద్ర లైంగిక కోరిక తీర్చుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో షెక్షావలి సాయంతో అక్కమ్మ తలపై లోకేంద్ర రాయితో కొట్టి గాయపరిచాడు. అనంతరం తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతు కోసి హతమార్చాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు కత్తితో ముఖంపై ఉన్న చర్మాన్ని తొలగించి అక్కడ నుంచి ఉడాయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డీఎస్పీ హేమంత్కుమార్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించారు. బుధవారం ఉదయం సీతారంపల్లి వద్ద జాతీయ రహదారిపై తచ్చాడుతున్న షెక్షావలి, లోకేంద్రను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. కాగా, నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సీఐ ఎన్.ప్రభాకర్, ఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు బాబ్జాన్, రాజప్ప, షాకీర్, అనిల్కుమార్, రాఘవేంద్ర, బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ చత్రూనాయక్, రామాంజినేయులను ఎస్పీ రత్న, డీఎస్పీ హేమంత్కుమార్ అభినందించారు. -
అంతర జిల్లా చైన్స్నాచర్ల అరెస్ట్
అనంతపురం: ఒంటరిగా వెళ్లే మహిళల్ని టార్గెట్ చేసి వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయించే అంతర జిల్లా చైన్స్నాచర్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మొత్తం రూ.32.40 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం, నగదు, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అనంతపురం శివారులోని రాజీవ్ కాలనీకి చెందిన కె.పంపాచారి అలియాస్ నరేష్, రాయల్ నగర్కు చెందిన షేక్ షాకీర్, ప్రియాంకనగర్ నివాసి షేక్ ఫజిల్ అహమ్మద్ అలియాస్ షేక్ ఫజిజ్ అహమ్మద్, శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ నివాసి కంబం నాగార్జున అలియాస్ చిన్నా ఉన్నారు. బుధవారం డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్పీ పి.జగదీష్ వెల్లడించారు. అందరూ 24 నుంచి 30 ఏళ్ల లోపు వారే పట్టుబడిన నిందితులందరూ 24 నుంచి 30 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. కె.పంపాచారి కార్పెంట్ వృత్తితో పాటు డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పేకాట, క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి సంపాదన మొత్తం వ్యసనాలకే ఖర్చు పెట్టేవాడు. ఇతనికి నాలుగు నెలల క్రితం కంబం నాగార్జున పరిచయమయ్యాడు. నాగార్జున సొంతూరు శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ కాగా, ఏడాదిన్నర క్రితం కుటుంబంతో సహా అనంతపురానికి వలస వచ్చి సుఖ్దేవ్నగర్లో నివాసముంటున్నాడు. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంపాచారి పరిచయమైన తర్వాత ఇద్దరూ కలసి పేకాట, ఆన్లైన్ జూదం ఆడుతూ సంపాదన మొత్తం పోగొట్టుకుని అప్పుల పాలయ్యారు. రాయల్ నగర్కు చెందిన షేక్ షాకీర్... కార్పెంటర్గా పనిచేసేవాడు. ఈ క్రమంలో సొంతంగా ఓ ఫర్నీచర్ షాప్ ఏర్పాటు చేసుకుని అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కోసం అన్వేషిస్తుండగా పంపాచారి, నాగార్జున పరిచయమయ్యారు. ముగ్గురు కలసి వ్యక్తిగత అవసరాలకు, అప్పులు తీర్చేందుకు చైన్స్నాచింగ్లకు సిద్ధమయ్యారు. అనంతరం వీరందరూ కలసి బృందాలుగా విడిపోయి చైన్స్నాచింగ్కు పాల్పడేవారు. ప్రైవేట్ వాహన డ్రైవర్గా పనిచేస్తున్న షేక్ ఫజిల్ అహమ్మద్ సైతం ఆన్లైన్ బెట్టింగ్, పేకాట తదితర వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో పాటు ఇటీవల పెళ్లి సంబంధం కూడా ఖాయమైంది. పెళ్లి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో చైన్స్నాచర్గా మారాడు. ఒంటిరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా..పంపాచారి ద్విచక్ర వాహనంపై ఒక్కడే వెళుతూ శివారు కాలనీలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోని బంగారు నగలను లాక్కొని అదే టూవీలర్పై ఉడాయించేవాడు. 2023 నుంచి కురుగుంట, మన్నీల, రాప్తాడు, అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డు, గణేష్ నగర్, లలితానగర్, ఒకటో రోడ్డు, తదితర ప్రాంతాల్లో 10 చైన్ స్నాచింగ్లు చేశాడు. అనంతరం షేక్ షాకీర్తో కలసి బైక్పై వెళుతూ కళ్యాణదుర్గం రోడ్డు, ద్వారకా విల్లాస్లో రెండు స్నాచింగ్లు, కంబం నాగార్జునతో కలసి హెచ్చెల్సీ రోడ్డు, స్టాలిన్ నగర్, బుక్కరాయసముద్రం, బి.కొత్తపల్లి గ్రామాల్లో నాలుగు స్నాచింగ్లు చేశాడు. మొత్తం 16 కేసుల్లో పంపాచారి నిందితుడు. ఇందులో రెండు కేసుల్లో షేక్ షాకీర్, నాలుగు కేసుల్లో కంబం నాగార్జున నిందితులుగా ఉన్నారు. షేక్ ఫజిల్ అహమ్మద్ ఎవరూ గుర్తుపట్టకుండా తలకు ఎరుపు రంగు క్యాప్ పెట్టుకుని, ముఖానికి ఖర్చీఫ్ కట్టుకుని చైన్స్నాచింగ్లకు పాల్పడేవాడు. అనంతపురంలోని శ్రీశ్రీ నగర్, హెచ్చెల్సీపై సచివాలయ మహిళా ఉద్యోగిని మెడలో ఉన్న బంగారు చైన్ అపహరణ, ఇతర మూడు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. నిందితులు నలుగురూ వేర్వేరుగా పట్టుబడ్డారు. చైన్స్నాచర్ల అరెస్ట్లో చొరవ చూపిన సీఐలు ఎన్.శేఖర్, కె.సాయినాథ్, ఇస్మాయిల్, జయపాల్రెడ్డి తదితరులను ఎస్పీ అభినందించారు. రూ.32.40 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం, నగదు, మూడు బైక్ల స్వాధీనం వ్యసనాలతో అప్పులపాలై చైన్స్నాచర్లుగా మారిన యువకులు -
మద్యం మత్తులో గొడవ
● ఇటుకతో బాదడంతో వ్యక్తి మృతి హిందూపురం: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఓ వ్యక్తి సహనం కోల్పోయి ఇటుక పెళ్లతో బాదడంతో సుబ్బరాయప్ప(65) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హిందూపురం మండలం గోళాపురం గుడ్డంపల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గోళాపురం గుడ్డంపల్లి కర్ణాటక సరిహద్దున ఉండటంతో పాటు గ్రామంలో బెల్టుషాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే బంధువులైన సుబ్బరాయప్ప, నంజేగౌడ మంగళవారం పూటుగా మద్యం సేవించారు. ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో కుటుంబ విషయాలు ప్రస్తావనకు రావడంతో పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన నంజేగౌడ ఇటుక పెళ్లతో సుబ్బరాయప్ప తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయమైంది. బంధువులు హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారడంతో రాత్రి మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. -
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
అనంతపురం మెడికల్: లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి పేర్కొన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. డొకాయ్ ఆపరేషన్లు చేపట్టి లింగ నిర్ధారణ స్కానింగ్లకు పాల్పడుతున్న సెంటర్లపై చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. అలాగే లింగ నిర్ధారణ చట్టం ఉల్లంఘనకు ఎలాంటి శిక్షలు ఉంటాయనే అంశంపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ యుగంధర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవిశంకర్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రవికుమార్, గైనకాలజిస్టు డాక్టర్ రేణుక, పెథాలజిస్టు డాక్టర్ శ్రావణి పాల్గొన్నారు. 64 గ్రామాల్లో రక్తపూతలు సేకరించాలి ఉమ్మడి అనంతపురం జిల్లాలో దోమకాటు వ్యాధులు అధికంగా నమోదవుతున్న 32 మండలాల్లోని 64 గ్రామాల్లో పైలేరియా వ్యాధిని గుర్తించేందుకు రక్తపూతల సర్వే చేపట్టాలని సంబంధిత అధికారులను డీఐఓ ఓబులు ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో మలేరియా సబ్ యూనిట్ అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఈ నెల 25న ప్రపంచ మలేరియా దినంలో భాగంగా ప్రతి పీహెచ్సీ పరిధిలో ర్యాలీ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో సహాయ మలేరియా సబ్ యూనిట్ అధికారులు మద్దయ్య, మునాఫ్, బత్తుల కోదండరామిరెడ్డి, తిరుపాల్, నాగేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి -
కొత్త పింఛన్లు మంజూరు చేయాలి
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి డిమాండ్ ఉరవకొండ: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సామాజిక భద్రతా పింఛన్ల మంజూరుపై దృష్టి సారించడం లేదని, ఫలితంగా అర్హులైన లక్షలాది మంది నిరాశ నిస్పృహలతో జీవనం సాగిస్తున్నారని శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త పింఛన్ కోసం ఎంతో మంది వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ రోగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. అర్హులైన వీరికి పింఛన్ అందిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజురు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికు లేఖలు రాసినట్లు తెలిపారు. తల్లిదండ్రుల చెంతకు ఇంటర్ విద్యార్థి తాడిపత్రి టౌన్: ఇంటర్ ఫెయిల్ కావడంతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిన విద్యార్థి ఆచూకీని 24 గంటల్లోపే గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. వివరాలు... తాడిపత్రి మండలం బొడాయిపల్లికి చెందిన పుల్లారెడ్డి కుమారుడు నాగవర్దన్రెడ్డి తాడిపత్రి లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 12న ఫలితాలు వెలువడడంతో తన ఉత్తీర్ణతను తెలుసుకునేందుకు తాడిపత్రికి వచ్చిన నాగవర్దన్రెడ్డి ఫెయిల్ అయినట్లుగా నిర్ధారించుకుని ఎటో వెళ్లిపోయాడు. రోజు గడిచినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తెలిసిన వారి వద్ద ఆరా తీశారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఫెయిల్ అయిన కుమారుడు ఏ అఘాయిత్యం చేసుకున్నాడోనని కన్నీరుమున్నీరవుతూ ఈ నెల 14న తండ్రి తాడిపత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తిరుపతిలో ఉన్న నాగవర్దన్రెడ్డిని అక్కడి పోలీసుల సాయంతో గుర్తించి మంగళవారం రాత్రి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. బుధవారం తాడిపత్రి పీఎస్కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ అనంతరం తండ్రి పుల్లారెడ్డికి అప్పగించారు. సకాలంలో స్పందించి తమ కుమారుడిని సురక్షితంగా అప్పగించేలా చొరవ చూపిన ఎస్ఐ గౌస్బాషాకు పుల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
వృద్ధురాలిని ఏమార్చి చైన్ స్నాచింగ్
గార్లదిన్నె: వృద్ధురాలిని ఏమార్చి ఆమె మెడలోని బంగారు గొలుసును దుండగుడు అపహరించుకెళ్లాడు. పోలీసులు తెలిపిన మేరకు గార్లదిన్నె మండలం గుడ్డాలపల్లికి చెందిన వృద్ధురాలు నీలావతి బుధవారం మండల కేంద్రంలో కిరాణా సరుకులు కొనుగోలు చేసి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో 44వ జాతీయ రహదారిపై గుడ్డాలపల్లి క్రాస్ వద్ద ఆటో కోసం వేచి ఉన్న సమయంలో తలకు హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వచ్చిన యువకుడు వృద్ధురాలి పక్కనే వాహనాన్ని ఆపి తాను కూడా గుడ్డాలపల్లికి వెళుతున్నట్లు నమ్మబలికి ఆమెను ఎక్కించుకుని ముందుకు కదిలాడు. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వాహనాన్ని ఆపి తనకు ఫోన్కాల్ రావడంతో వెనక్కి వెళ్లాల్సి ఉందని తెలపడంతో వృద్ధురాలు కిందకు దిగింది. ఆ సమయంలో ఆమె మెడలోని 5 తులాల బంగారు చైన్ను లాక్కొని ద్విచక్ర వాహనంపై వేగంగా జాతీయ రహదారి వైపుగా ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. పాఠశాలలో ఆకతాయిల విధ్వంసం ఉరవకొండ: స్థానిక 8వ వార్డు పాతపేటలోని మండల పరిషత్ ప్రాథమిక సెంట్రల్ పాఠశాలలో ఆకతాయిలు, తాగుబోతులు మంగళవారం రాత్రి విధ్వంసానికి పాల్పడ్డారు. తొలుత పాఠశాల గ్రౌండ్ ప్లోర్లోని వరండా ఇనుప గ్రిల్ తలుపును విరగొట్టి లోపలికి ప్రవేశించారు. తరగతి గదిలోని రెండు సీలింగ్ ఫ్యాన్లు తొలగించి పక్కన పడేశారు. అనంతరం విద్యుత్ స్విచ్ బోర్డుతో పాటు నీటి మోటార్కు చెందిన స్టార్టర్ బోర్డును పగులగొట్టారు. ప్లోరింగ్ టైల్స్ బండరాళ్లతో ధ్వంసం చేశారు. తరగతి గదిలోనే మద్యం తాగి అక్కడే సీసాలు పగులగొట్టి, మూత్ర విసర్జన చేశారు. బుధవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు అక్కడి విధ్వంసాన్ని గుర్తించి ఎంఈఓ ఈశ్వరప్ప దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో ఎంఈఓ పరిశీలించిన అనంతరం హెచ్ఎం నసీరాబేగంతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతలో నైపుణ్యాలు పెంపొందించాలి
అనంతపురం అర్బన్: ఉపాధి కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాబ్మేళాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా నైపుణ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్కు సంబంధించి 8 జాబ్మేళాలు నిర్వహించాల్సి ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధిపై కార్యాచరణ పక్కాగా అమలు చేయాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు పరిశ్రమలను అనుసంధానించాలన్నారు. ‘పీఎం విశ్వకర్మ యోజన’ కింద శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే పథకం ద్వారా 205 బ్యాచ్ల్లో 6 వేల మందికి శిక్షణ ఇచ్చారని, 111 మందికి శిక్షణ కొనసాగుతోందన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కింద కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రతన్టాటా ఇన్నోవేషన్ సెంటర్ ల్యాబ్ ఏర్పాటు పనులు వేగంగా చేపట్టాలన్నారు. అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక జాబ్మేళా క్యాలెండర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతపురం అర్బన్కు సంబంధించి ఏప్రిల్ 25న, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి మే 2న, కళ్యాణదుర్గానికి సంబంధించి మే 16, రాయదుర్గం మే 23, గుంతకల్లు మే 30, తాడిపత్రి జూన్ 6, శింగనమల జూన్ 13, ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి జూన్ 27న జాబ్మేళా నిర్వహిస్తారన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఈశ్వరయ్య, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాపరెడ్డి, జేఎన్టీయూ ప్లేస్మెంట్ సీఈఓ శ్రీనివాసులు, ఎస్కేయూ అధికారి సీహెచ్కృష్ణ, మెప్మా పీడీ విశ్వజ్యోతి, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసయాదవ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి కళ్యాణి, జేడీఎం సూర్య నారాయణ, కార్మిక శాఖ ఏసీ రమాదేవి, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రామమూర్తి, రూడ్సెట్ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. కలెక్టర్ వినోద్కుమార్ ‘ఉల్లాస్’ లక్ష్యం సాధించాలి ‘ఉల్లాస్’ కార్యక్రమం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 16 నుంచి ఆరు రోజుల పాటు సర్వే నిర్వహించి నిరక్షరాస్యులను గుర్తించాల్సి ఉందన్నారు. మే 5 నుంచి సెప్టెంబరు వరకు అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో వయోజన విద్య డీడీ ఆంజనేయులు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఉమ్మడి అనంతలో చాపకింద నీరులా విస్తరిస్తున్న షుగర్ వ్యాధి
● అనంతపురం నగరానికి చెందిన రంగనాథ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వయసు 32 ఏళ్లు. మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఎందుకో అనుమానమొచ్చి ఇటీవల ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా షుగర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా అతను ఖిన్నుడయ్యాడు.సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంత పురం జిల్లాలో మధుమేహ జబ్బు చాపకింద నీరులా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదల రేటుతో పోల్చి చూస్తే డయాబెటిక్ బారిన పడుతున్న వారే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. యువకులు సైతం జీవనన శైలి జబ్బుల బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో 40 ఏళ్లు నిండిన వారిలో ఎక్కువగా ఆయా జబ్బుల బారిన పడేవారు. కానీ, ఇటీవల 30 ఏళ్లు దాటని వారూ వీటి కోరల్లో చిక్కుతున్నారు. ఈ విషయం వైద్యులను కూడా విస్మయానికి గురి చేస్తోంది.గ్రామీణులూ బాధితులే..మధుమేహం, రక్తపోటు తదితర జబ్బులతో బాధపడే వారు ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా ఉండేవారు. పని ఒత్తిడితో సతమతమవడం కారణంగా వీటి బారిన పడేవారు. కానీ, ఇప్పుడు ఆయా రోగాలు పల్లెలకూ విస్తరించడం గమనార్హం. ఈ క్రమంలోనే డయాబెటిక్, బీపీ మందుల ధరలు పెరగడం సామాన్యులకు కొరకరాని కొయ్యగా మారింది.అవగాహన లేకే..అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) బాధితులు 27 శాతం పైగానే ఉన్నట్టు తేలింది. పట్టణాల్లో అయితే ఇది 30 నుంచి 32 శాతం కూడా ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. ఇక.. షుగర్, హైపర్టెన్షన్ జబ్బులు నియంత్రణలో లేనివారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో శరీరంలో ఇతర అవయవాలపై ప్రభావం పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జబ్బుల నియంత్రణపై అవగాహన లేకపోవడం అనర్థాలకు దారి తీస్తోంది.సమస్యలెన్నో..షుగర్ నియంత్రణలో లేకుంటే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.కంటిచూపుపై దుష్ప్రభావం పడుతుంది.శరీరంలో గాయాలైనప్పుడు మానడం చాలా కష్టం.మధుమేహం అదుపులో లేకపోతే గుండె జబ్బులొచ్చే అవకాశాలు ఎక్కువ.అధిక రక్తపోటు వల్ల బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.నరాల వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది.అలవాట్లు మార్చు కోవాలిమధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లేని ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు. పొగ తాగడం చాలా ప్రమాదకరం. – డా.సుధాకర్రెడ్డి, గుండె వైద్య నిపుణులు -
జిల్లాకు వర్షసూచన
బుక్కరాయసముద్రం: ఉమ్మడి జిల్లాలో రానున్న 5 రోజుల్లో చిరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 40.2–41.3, రాత్రి 23.9–24.7 డిగ్రీల సెల్సియస్ నమోదు కావొచ్చన్నారు. రూ.2.91 కోట్ల పంట నష్టం అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా సోమవారం సాయంత్రం రూ.2.91 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, అనంతపురం, యల్లనూరు, ఉరవకొండ, కూడేరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, గుమ్మఘట్ట, గుంతకల్లు, పెద్దవడుగూరు మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో అరటి, మామిడి, బొప్పాయి, కళింగర, మునగ తదితర పంటలు 95 హెక్టార్లలో దెబ్బతినడంతో 115 మంది రైతులకు రూ.1.50 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అలాగే, శింగనమల, నార్పల, గార్లదిన్నె, కంబదూరు, బెళుగుప్ప మండలాల్లో 173 హెక్టార్లలో మొక్కజొన్న, వరి, పత్తి పంటలు దెబ్బతినడంతో 92 మంది రైతులకు రూ.1.41 కోట్ల నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. మెట్ట భూముల సాగుకు తోడ్పాటు : డ్వామా పీడీ అనంతపురం టౌన్: మెట్ట భూముల్లో మామిడి, నిమ్మ, జామ, బత్తాయి, సపోటా తదితరాలు సాగు చేసేవారికి ఉపాధి హామీ పథకం ద్వారా తోడ్పాటునందిస్తామని డ్వామా పీడీ సలీంబాషా తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 8 వేల ఎకరాల మెట్టభూముల్లో ఉద్యాన పంటలు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ఐదు ఎకరాల్లోపు మెట్ట భూములున్న రైతులు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది మామిడి, చీనీ, దానిమ్మ, నిమ్మ, జామ, అల్లనేరుడు, డ్రాగన్ ఫ్రూట్, సపోట, అంజూర సాగుకు అవకాశం కల్పించినట్లు వివరించారు. రైతులే మొక్కలను కొనుగోలు చేసుకుంటే వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తామన్నారు. ఎకరా లోపు పొలం ఉన్న రైతులు సైతం మునగ, పూల మొక్కల సాగుకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు.అక్రమాలకు పాల్పడొద్దు అనంతపురం అర్బన్: పింఛన్ల పంపిణీలో అవినీతి, అక్రమాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ వి.వినోద్కుమార్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పింఛను లబ్ధిదారులతో గౌరవంగా మాట్లాడాలన్నారు. డీఆర్ఈఏ పీడీ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మొదటి సంతకంతోనే మోసం
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకంతోనే డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు మోసం చేశారని డెమోక్రటిక్ యూత్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అభ్యర్థులతో కలిసి మంగళవారం అనంతపురం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, జిల్లా కన్వీనర్ కసాపురం రమేష్, జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ పది నెలలు గడిచినా ముఖ్యమంత్రి మొదటి సంతకాన్ని అమలు చేసే పరిస్థితి లేనప్పుడు వారంలోనే మెగా డీఎస్సీని విడుదల చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అనేక ప్రకటనలతో నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారన్నారు. వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అప్పటికీ దిగిరాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనలను అడ్డుకుంటామన్నారు. అనంతపురం జిల్లాకు డీఎస్సీలో వెయ్యి ఎస్జీటీ పోస్టులు పెంచాలన్నారు. జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్ ఉండేలాగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో కూడా ద్వితీయ ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయాలన్నారు. అనంతరం డీఈఓ ప్రసాద్బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు నూరుల్లా, సురేంద్రబాబు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్దు, పరమేష్, తరిమెల గిరి, భీమేష్, సాయి పాల్గొన్నారు. నిరుద్యోగులను వంచించిన చంద్రబాబు డీఈఓ ఆఫీస్ను ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థులు