అక్రమార్కుల్లో అలజడి | - | Sakshi
Sakshi News home page

అక్రమార్కుల్లో అలజడి

Jan 20 2026 8:01 AM | Updated on Jan 20 2026 8:01 AM

అక్రమార్కుల్లో అలజడి

అక్రమార్కుల్లో అలజడి

కళ్యాణదుర్గం: ఉపాధి హామీ పనుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 2024–25 ఏడాదికి సంబంఽధించి పూర్తయిన ఉపాధి పనులపై ప్రస్తుతం సామాజిక తనిఖీ జరుగుతోంది. అయితే తనిఖీల్లో లోపించిన పారదర్శకతపై ‘ఉత్తుత్తి తనిఖీలు’ శీర్షికన ఈ నెల 19న ‘సాక్షి’లో కథనం వెలువడడంతో జిల్లా స్థాయి ఉపాధి అధికారులు కళ్యాణదుర్గం నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఎక్కడా లేని విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అవినీతి జరిగిందంటూ సిబ్బందిపై డ్వామా పీడీ విరుచుకుపడినట్లు సమాచారం. ఈ అంశంపై రెండు రోజుల్లో విచారణ చేపట్టి వాస్తవాలు నిగ్గు తేల్చనున్నట్లు ఉద్యోగులను ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. అయితే జరిగిన అవినీతిని కప్పి పుచ్చుతారా? లేక బహిర్గతం చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement