ఇసుకాసురులపై చర్యలు
రామగిరి: పేరూరు సమీపంలోని పెన్నానది నుంచి ఇసుకను తోడేస్తున్న అక్రమార్కులపై పోలీసులు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు. గత కొన్ని నెలలుగా ఇసుకను తవ్వుతూ సొమ్ము చేసుకుంటున్న వైనంపై ‘పెన్నమ్మకు గర్భశోకం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు... రామగిరి ఎస్ఐ ప్రదీప్రాజ్ శుక్రవారం పెన్నానది పరీవాహక ప్రాంతంలో నిఘా వేశారు. అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్న ఏడు ట్రాక్టర్లతో పాటు జేసీబీ వాహనాన్ని స్వాధీనం చేసుకొని, పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం వాహనదారులందరినీ తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేశారు. జేసీబీ వాహనానికి రూ.10 వేలు, ఒక్కో ట్రాక్టర్కు రూ.5వేలు చొప్పున జరిమానా విధించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తరలిస్తే చర్యలు కఠనంగా ఉంటాయని హెచ్చరించారు.


