ఆమిద్యాలలో సాగుతున్న రథోత్సవం
ఉరవకొండ రూరల్: మండలంంలోని పెద్దముష్టూరులో సిద్ధేశ్వర స్వామి రథోత్సవం సోమవారం నేత్రపర్వంగా సాగింది. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పార్వతీపరమేశ్వరుల ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టంజేసి మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ భక్తులు లాగారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. అలాగే ఆమిద్యాల గ్రామంలోనూ రామలింగేశ్వర స్వామి రథోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు.
నేత్రపర్వంగా సిద్ధేశ్వర స్వామి రథోత్సవం


