●పరమేశ్వరా... పాహిమాం!
మహాశివరాత్రి వేడుకలు అంబరమంటాయి. జిల్లా అంతటా ఆదివారం శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర.. నామస్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. మహా శివరాత్రి పర్వదిన ప్రాముఖ్యతను పండితులు వివరించారు. భక్తులు ఉపవాస దీక్షతో పాటు రాత్రంతా జాగారం చేసి పరమ శివుని సేవలో తరించారు. ఆలయాలతో పాటు ప్రత్యేక శిబిరాల వద్ద మహాశివరాత్రి వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. – అనంతపురం కల్చరల్
●పరమేశ్వరా... పాహిమాం!
●పరమేశ్వరా... పాహిమాం!
●పరమేశ్వరా... పాహిమాం!
●పరమేశ్వరా... పాహిమాం!
●పరమేశ్వరా... పాహిమాం!


