చుక్కలు చూపుతున్నారు
నాకు 8 ఎకరాల పొలం ఉంది. ఎన్నికల ముందు రైతులను ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు గెలిచిన తర్వాత ఆ మాటపై నిలబడటం లేదు. ఖరీఫ్లో విత్తనాలు మొదలుకుని యూరియా పంపిణీ వరకు చుక్కలు చూపిస్తూనే ఉన్నాడు. నాకు ఒక్కసారి మాత్రమే పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద రూ.7వేలు జమ అయ్యింది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సమస్య ఉన్నా ఆర్బీకేల వద్దకు వెళ్లి పరిష్కరించుకునేవాళ్లం. ఇప్పుడు సమస్య ఉంటే సమాధానం ఇచ్చేవారే లేరు.
– అశోక్రెడ్డి, రైతు, కడదరకుంట, కళ్యాణదుర్గం మండలం


