‘బూదిగుమ్మ’కు పోటెత్తిన భక్తులు
బెళుగుప్ప: మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం బూదిగుమ్మ ఆంజనేయస్వామి తిరుణాలలో భాగంగా చివరి రోజు ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో సుందకాండ హోమాన్ని నిర్వహించారు. సమీపంలోని పెన్నానది, జీడిపల్లి రిజర్వాయర్లో భక్తులు గంగ పూజలు చేసి, పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. బళ్లారి వెన్నపూస వంశస్తులు, రాళ్లపల్లి మనోజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిప్లాన్ గ్రూప్ చైర్మన్ కరుట్లపల్లి అనంతయ్య ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.
‘బూదిగుమ్మ’కు పోటెత్తిన భక్తులు


