సమానత్వాన్ని చాటే రీతిలో ర్యాలీ
సాక్షి, చైన్నె: చైన్నెలో సమానత్వాన్ని చాటే విధంగా 3వ ఎడిషన్గా పురుష అల్లీషిప్ సినర్జీ సమ్మిట్ నిర్వహణ ర్యాలీని శనివారం నిర్వహించారు. చైన్నెలోని టైడల్ పార్కు ఆడిటోరియంలో అవతార్ హ్యుమన్ క్యాపిటల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధ్యతాయుతమైన పౌరులు, పాఠశాల విద్యార్థులు,కళాశాల యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఏహెచ్సీటీ అవతార్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సౌందర్య రాజేష్ మాట్లాడుతూ, ఎంఐటీఆర్, ఎంఏఎస్ఎస్ ద్వారా బాలురు, యువకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. వ్యక్తిగత బాధ్యతలు, ఆలోచనలు, న్యాయం, గౌరవం, కుటుంబాలు, కార్యాలయాలు, సమాజాలను బలోపేతం చేయడం , లింగ సమానత్వం, సమాజంలో సమానత్వానికి చురుకుదనం, మిత్రులుగా కలసి మెలిసి ఉండాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం ద్వారా వివరించినట్టు పేర్కొన్నారు. ర్యాలీతోపాటుగా అవగాహన కార్యక్రమం, వివిధ పోటీలనుసైతం నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమంలో పాల్సన్ ఫ్యాషన్ ఎండీ డాక్టర్ శామ్ పాల్, ఏహెచ్సీటీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఈశ్వర్బాల సుబ్రమణియన్, అవతార్ సీఓఓ ఉమాశంకర్ కందస్వామితో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


