ఎలక్ట్రిక్ స్కూటర్ @ రూ. 1.67 లక్షలు
చెన్నై: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం యమహా మోటర్స్ దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ప్రవే శించింది. తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈసీ–06ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 1,67,600గా (ఢిల్లీ ఎక్స్షోరూం రేటు) ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఒక్కసారి చార్జి చేస్తే ఇది 169 కి.మీ. వరకు రేంజినిస్తుంది.
ముందుగా ఎంపిక చేసిన నగరా ల్లో కంపెనీ కి చెందిన బ్లూ స్క్వేర్ షోరూంల ద్వారా ఈ స్కూటర్లను విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. పర్యావరణహితమైన అర్బన్ మొబిలిటీ దిశగా తమ సంస్థ ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయని యమహా మోటర్ ఇండియా గ్రూప్ చైర్మన్ హజిమె యోటా తెలిపారు.


