2026 జనవరి 1నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు చెప్పిన చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ.. ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ SUV ధర సవరణను ప్రకటించింది. ఈ నెల ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చిన ధరల ప్రకారం.. సీలియన్ 7 ప్రీమియం వేరియంట్ రేటు రూ. 50,000 పెరిగింది. అయితే పెర్ఫార్మెంట్ వేరియంట్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని ప్రకటించింది.
జనవరి 1న జరిగిన ధరల సర్దుబాటు తర్వాత.. 82.56 kWh బ్యాటరీని కలిగిన BYD సీలియన్ 7 ప్రీమియం మోడల్ ధర రూ. 48,90,000 నుంచి రూ. 49,40,000లకు పెరిగింది. సీలియన్ 7 పెర్ఫార్మెన్స్ మోడల్ ధర రూ. 54,90,000వద్ద కొనసాగుతుంది. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి కంపెనీ 2,300 యూనిట్ల సీలియన్ కార్లను విక్రయించింది.
ఇదీ చదవండి: హ్యుందాయ్ వెన్యూ కొత్త వేరియంట్ లాంచ్: ధర ఎంతంటే?
కంపెనీ ఈ కారులో సెల్-టు-బాడీ డిజైన్ & బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ వంటి వాటిని అందించింది. ఇది సేఫ్టీలో కూడా 5 స్టార్ రేటింగ్ సాధించింది. ప్రీమియం వెర్షన్ 308 hp & 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 567 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ కారు.. 15.6 ఇంచెస్ టచ్స్క్రీన్, నప్పా లెదర్ సీటింగ్, ఎలక్ట్రిక్ సన్షేడ్తో కూడిన పనోరమిక్ గ్లాస్ రూఫ్ & 12-స్పీకర్ డైనాడియో ఆడియో సిస్టమ్ పొందుతుంది. వీటితోపాటు.. ఇందులో 11 ఎయిర్బ్యాగ్లు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ సేఫ్టీ లభిస్తుంది.


