అద్దంకి:
మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం రాజ్యసభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణమ్మ, సోదరులు ఏఎంసీ మాజీ చైర్మన్ వైవీ భద్రారెడ్డి, హనుమారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాన్ని బహూకరించి పూలమాలతో సత్కరించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు


