breaking news
Prakasam District News
-
ప్రకాశం
32 /289గరిష్టం/కనిష్టంవిధిఆటకు బాలుడు బలి చెట్టుకొమ్మ విరిగిపడి ప్రమాదవశాత్తు ఒక బాలుడు మృతిచెందగా, మరో బాలుడికి గాయాలైన ఘటన కురిచేడు మండలం పడమరనాయుడుపాలెంలో జరిగింది. నిమ్మకు నల్లి..ధర సన్నగిల్లి నిమ్మ ధరలు పాతాళంలోకి పడిపోయాయి. రైతుల దగ్గర కేజీ కాయలు రూ.2 నుంచి రూ.3 మాత్రమే పలుకుతోంది. నిమ్మ తోటలను నల్లి తెగులు దారుణంగా దెబ్బతీసింది.వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు పడవచ్చు. బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025– 10లో.. -
అధికార జలగలు !
దోపిడీకి నోటీసులు.. ఒంగోలు నగరపాలక సంస్థ వడ్డీ వ్యాపారుల కంటే దారుణంగా తయారైంది. చిరు వ్యాపారం చేసుకునే కూరగాయల నిర్వాహకులపై బకాయిలను వడ్డీల రూపంలో మోయలేని భారాన్ని మోపుతున్నారు. నగర పాలక సంస్థ ఇచ్చిన నోటీసులు చూసి వ్యాపారుల కళ్లు బైర్లు కమ్మాయి. చెల్లించాల్సింది రూ.5.78 కోట్లు అయితే వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీ కలిపి రూ.7.08 కోట్లు వేశారు. మొత్తంగా రూ.12.86 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అధికారులిచ్చిన నోటీసులు చూసి వారు బెంబేలెత్తిపోతున్నారు. ఇదేంటి అని అడిగిన వారి దుకాణాలను సీజ్ చేస్తున్నారు. అధికారులు చిరు వ్యాపారులను జలగల్లా పీక్కుతింటున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షిప్రతినిధి, ఒంగోలు: నగరంలో కొత్త కూరగాయల మార్కెట్ వ్యాపారులు అధికారులు, పాలకుల మధ్య నలిగిపోయి..చిక్కి శల్యమవుతున్నారు. ఒక పక్క బాడుగల పేరుతో వేధింపులు...మరోపక్క దుకాణాలు పెట్టుకోనీయకుండా బెదిరింపులు అక్కడి వ్యాపారులకు నిత్యకృత్యమయ్యాయి. కొత్త కూరగాయల మార్కెట్ ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు దోచుకునేందుకు సొంత ఆదాయ వనరుగా మారిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ (ఏఎంసీ) కోసం కాంప్లెక్స్ నిర్మించారు. ఒంగోలు నడిబొడ్డులో కాంప్లెక్స్ నిర్మాణం కావటంతో అప్పటి పాలకులు ఏఎంసీకి కాకుండా కూరగాయల మార్కెట్ అయితే నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందని భావించి ఏఎంసీని పాత గుంటూరు రోడ్డుకు తరలించి ఆ కాంప్లెక్స్ను ఒంగోలు మున్సిపాలిటీకి అప్పగించారు. దాంతో 2008లో పాత కూరగాయల మార్కెట్ నుంచి వ్యాపారులను ఇక్కడకు మార్చారు. అప్పట్లో మున్సిపాలిటీ అధికారులు అద్దెలు ఖరారు చేసి వసూలు చేయటం ప్రారంభించారు. 2008 నుంచి 2019 నవంబర్ వరకు వ్యాపారులు అందరూ పూర్తిగా బకాయిలు లేకుండా అద్దెలు చెల్లించారు. కరోనా నుంచి కష్టాలు ప్రారంభం: కరోనా సమయం నుంచి కొత్త కూరగాయల మార్కెట్ వ్యాపారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. 2019 డిసెంబర్ నుంచి షాపులను నగరపాలక సంస్థ అధికారులు అప్పటి వరకు ఉన్న అద్దెకు 33.33 శాతం పెంచి షాపులను వ్యాపారులకు రెన్యువల్ చేయాల్సి ఉంది. ఇంతలో కరోనా వచ్చింది. 2020 మార్చి నుంచి కరోనాతో లాక్డౌన్ ప్రకటించారు. దాంతో మార్కెట్ మూత పడింది. అయితే మార్కెట్లో కాకుండా రంగారాయుడు చెరువు పక్కనే ఉన్న పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా షెడ్లు వేసి ఆ వ్యాపారుల చేతనే ఇక్కడ కూరగాయలను ప్రజల అవసరాలు తీర్చేందుకు అమ్మకాలు జరిపించారు. ఈ విధంగా రెండేళ్ల పాటు చేయించారు. అయితే కరోనా సమయంలో ఉన్న అద్దె బకాయిలను మాఫీ చేయమని వ్యాపారులు పాలకులను, అధికారులను అడుగుతూ వచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి మాఫీ చేయిస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. అద్దె మాత్రం మాఫీ చేయలేదు. కానీ కరోనా సమయం నుంచి నగర పాలక సంస్థ అధికారులు 193 షాపులకు అద్దెల లెక్కలు వేసుకుంటూ వస్తూనే ఉన్నారు. రూ.5.78 కోట్లు అసలు.. వడ్డీ రూ.7.08 కోట్లు..! ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో మొత్తం షాపులు 193 ఉన్నాయి. వాటిలో రిటైల్ షాపులు 123, హోల్ సేల్ షాపులు 70 ఉన్నాయి. 2019 డిసెంబరు నుంచి 2022 నవంబర్ వరకు మాత్రమే. 2022 డిసెంబర్ నుంచి రెన్యూవల్ చేయాల్సి ఉంది. అప్పటి వరకూ కట్టాల్సిన అద్దె బకాయిలు రూ.5.78 కోట్లు. వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీ, ఐజీఎస్టీలు వేసి రూ.7.08 కోట్లు ఉందంటూ నోటీసులు జారీ చేశారు. దీని ప్రకారం మొత్తం రూ.12.86 కోట్లు చెల్లిచాల్సి వస్తుంది. ఈ బకాయిలు రిటైల్, హోల్సేల్ వ్యాపారుల పాలిట శాపాలుగా మారాయి. చివరకు మోయలేనంతగా తయారై కట్టలేని స్థితికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే 2025 నవంబర్తో మూడేళ్లకు గడువు ముగుస్తుంది కూడా. ఇప్పటి వరకు కట్టాల్సిన రూ.12.86 కోట్లతో పాటు అదనంగా మళ్లీ 33.33 శాతం అద్దె పెంచాలి. పెరిగిన అద్దెతో పాటు వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీలు కలుపుకొని మరో రూ.15 కోట్ల వరకు కట్టాల్సిన పరిస్థితి. అంటే మొత్తం కలుపుకుంటే రూ.27.86 కోట్లు బకాయిలు చెల్లించాలని అధికార వర్గాలు చెబుతున్నాయి. కార్పొరేషన్ అధికారులు ఇస్తున్న నోటీసులు చూసిన చిరువ్యాపారులు కళ్లు తేలేస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారులే నయం అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2.50 శాతం మాత్రమే వడ్డీ... కానీ 50 శాతంపైగా వసూలు... వాస్తవానికి కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం అద్దె బకాయిలపై కేవలం 2.50 శాతం మాత్రమే వడ్డీ, అపరాధ రుసుం కట్టాలి. ఆ నిబంధనలు గాలికి వదిలేసిన నగర పాలక సంస్థ అధికారులు ఇష్టం వచ్చినట్లు వడ్డీ, అపరాధ రుసుం విధిస్తూ నోటీసులు పంపారు. ఇచ్చిన ఆ నోటీసులు కూడా మున్సిపల్ కార్యాలయంలో రికార్డు ఏమీ ఉండదు. కంప్యూటర్లో ఒక ప్రింట్ తీసుకొని ఇచ్చి మరీ డబ్బులు వసూలు చేసుకుపోయారు. గతంలో వాటికి లెక్కా..పక్కా లేదు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ, అపరాధ రుసుం కలుపుకొని కట్టాల్సింది 193 షాపులకు కలిపి రూ.5.78 కోట్లు అయితే (2022 నవంబర్ వరకు) దానికి అదనంగా వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీలు కలుపుకొని రూ.7.08 కోట్లు కట్టాలని నోటీసులు షాపులకు అతికించారు. వ్యాపారులకు చేతికి కూడా ఇవ్వటం లేదు. ఇదొక అడ్డగోలు వ్యవహారంలా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై కొందరు వ్యాపారులు కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. సొంత ఖర్చులకు డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొత్త కూరగాయల మార్కెట్ కార్పొరేషన్ అధికారులకు గుర్తుకు వస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. బకాయిల పేరుతో పలు మార్లు కార్పొరేషన్ అధికారులు డబ్బులు వసూలు /చేశారు. అలా ఇప్పటి వరకు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు కట్టించుకున్నట్టు తెలుస్తోంది. ఏ ఒక్కరికీ రసీదులు ఇచ్చిన పాపాన పోలేదు. వసూలు చేసిన అధికారులు ఒకరిద్దరు చనిపోగా, కొందరు బదిలీపై వెళ్లారు. కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. కానీ కూరగాయల మార్కెట్ వ్యాపారులు కట్టిన అద్దె డబ్బులకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. కొంత మంది అధికారులు సంవత్సరాల తరబడి కార్పొరేషన్లోనే పనిచేస్తూ వ్యాపారులపై పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతు 2019వ సంవత్సరం నుంచి నేటికీ అదే జరుగుతుందంటే వ్యాపారుల బాధలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందినకాడికి దోచుకుంటూ..? కూరగాయల మార్కెట్ను వేధిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు గుదిబండలా మారిన బకాయిలు అద్దె బకాయిలు మొత్తం రూ.5.78 కోట్లు వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీతో రూ.7.08 కోట్లు మొత్తం రూ.12.86 కోట్లు చెల్లించాలంటూ కార్పొరేషన్ అధికారుల ఒత్తిడి నిబంధనల ప్రకారం 2.50 శాతం వడ్డీ మాత్రమే అడ్డగోలుగా 50 శాతానికి పైగా వడ్డించి వసూలు కరోనా సమయంలో మార్కెట్ లేకపోయినా అద్దె కట్టాల్సిందే అంటూ వేధింపులు ముఖం చాటేస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు -
ఎండీఎం మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా మద్దిపాడు: పాఠశాలలో మెనూ ప్రకారం చిన్నారులకు భోజనం అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మంగళవారం ఆమె మండలంలోని గార్లపాడు ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ప్రతి రోజు రుచికరంగా ఉంటుందా, సన్న బియ్యం వండుతున్నారా, భోజనం ఎలా ఉందంటూ ప్రలు ప్రశ్నలు వేసి వారి వద్ద సమాధానాలు రాబట్టారు. అనంతరం కలెక్టర్ చిన్నారులతో సహపంక్తి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతివారం ఎంపీడీఓ, తహశీల్దార్లు మధ్యాహ్న భోజనం తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈమని శ్రీనివాసరావుతో మాట్లాడుతూ విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గార్లపాడు రేషన్ షాపును సందర్శించి సరఫరా చేసిన స్టాకు, మిగిలిన స్టాకును పరిశీలించారు. రేషన్ పంపిణీ కచ్చితంగా జరగాలని, ఎక్కడా అవకతవకలకు పాల్పడకుండా చూడాలని తహశీల్దార్ ఆదిలక్ష్మిని ఆదేశించారు. కార్యక్రమంలో వారి వెంట ఇన్చార్జి ఎంపీడీఓ డీఎస్వీ ప్రసాద్, ఎంఈఓలు ఎంవీఆర్ ఆంజనేయులు, ఎం.శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ దేవరపల్లి గంగిరెడ్డి, పలువురు ఆధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మత్తులో మందుబాబు
మార్కాపురం: మద్యం మత్తు ఎక్కువై రోడ్డుపై డివైడర్ల మధ్య ఓ వ్యక్తి పడిపోయిన ఘటన మార్కాపురంలో మంగళవారం జరిగింది. పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన ప్రముఖ రచయిత్రి మొల్ల విగ్రహం వద్ద మద్యం ఎక్కువై ఓ వ్యక్తి అడ్డంగా పడిపోయాడు. సుమారు గంటన్నర సేపు మద్యం మత్తులో ఉండి అలాగే పడుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మార్కాపురం పట్టణంలో మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. రచయిత్రి మొల్ల విగ్రహం వద్ద మందుబాబులు ఇలా తరచుగా పడుకోవడం విమర్శలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం షాపులు ఏర్పాటు చేయడం, బెల్టుషాపులతో తమ సంసారాలు నాశనమైపోతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వండి..
● సబ్కలెక్టర్కు రైతుల వినతి మర్రిపూడి: ఎన్హెచ్544జీ (గ్రీన్ఫీల్డ్ హైవే)కు అవసరమైన 6.51 ఎకరాల భూములు కోల్పోయిన ఏడుగురు రైతులకు సుమారు రూ.65 లక్షలు పరిహారం చెల్లించాలని మండలంలోని దుగ్గిరెడ్డిపాలెం గ్రామస్తులు రోడ్ పనులను పరిశీలించేందుకు మర్రిపూడి వచ్చిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వరకుమార్కు మంగళవారం విన్నవించారు. దాదాపు ఏడాది గడుస్తున్నా పరిహారం ఇవ్వకుండా అధికారులు రేపు, మాపు అని కాలయాపన చేస్తున్నారని దుగ్గిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బూదాల ఆశీర్వాదం, దుద్దుకుంట కోటయ్య, ఆకుల పెదగంగిరెడ్డి, ఆకుల సుగుణమ్మ, ఆకుల గంగిరెడ్డి, గురుగూరి ఆదెమ్మ, బీ ఆదిలక్ష్మిలు డిప్యూటీ కలెక్టర్ ముందు వాపోయారు. ఈ భూమి ద్వారా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, అసైన్మెంట్ భూమిని గతంలో అధికారులు ఎలాంటి విచారణ జరపకుండా ఏడబ్ల్యూ ల్యాండ్ అని రాసి పంపారని, విచారించి మాకు తగు న్యాయం చేయండి సార్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు సమస్యను విన్నవిస్తున్న దుగ్గిరెడ్డిపాలెం గ్రామస్తులు అంటూ డిప్యూటీ కలెక్టర్కు గ్రామస్తులు విన్నవించారు. గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు ఆటంకం పెట్టరాదని, రైతుల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, మీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట తహశీల్దార్ జనార్దన్ డీటీ రాజు, వీఆర్వోలు ఉన్నారు. -
క్షయ పరీక్షలు చేయించుకోవాలి
ఒంగోలు టౌన్: 60 ఏళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా క్షయ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు సూచించారు. టీబీ ముక్తి భారత్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక 49వ డివిజన్లో టీబీ ముక్త్ భారత్ అవగాహన ర్యాలీలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 1,12,817 మందిని పరీక్షలు చేయగా వారిలో 5,432 మంది అనుమానితులుగా గుర్తించారని తెలిపారు. వారిలో 137 మందికి క్షయవ్యాధి పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి అవసరమైన మందులను అందించారన్నారు. ప్రజలందరూ టీబీ వ్యాధి పట్ల అవగాహన కల్పించుకోవాలని, కుటుంబంలో ఎవరికై నా రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉన్నట్లయితే వెంటనే క్షయ నివారణ మందులను మింగించి క్షయ వ్యాధి నుంచి విముక్తం కావాలన్నారు. తూర్పునాయడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా క్షయ అధికారి డాక్టర్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. తడిసిన పొగాకునూ కొనుగోలు చేయండి ●● కలెక్టర్ తమీమ్ అన్సారియాకు బర్లీ పొగాకు రైతుల వినతి మద్దిపాడు: మూడు రకాల పొగాకు గ్రేడులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, వర్షానికి తడిసి నల్లబడిన పొగాకును కూడా కొనుగోలు చేస్తేనే తాము తక్కువ నష్టాలతో బయట పడతామని బర్లీ పొగాకు రైతులు కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. మండలంలోని గార్లపాడు పునరావాస కాలనీ సమీపంలోని బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. పొగాకు కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆమె రైతులతో పొగాకు పంట ఎన్ని ఎకరాల్లో వేశారు? పంట దిగుబడి ఎంత వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న విషయాలు అడిగారు. ఈక్రమంలో నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన రైతులు పలువురు నాల్గవ గ్రేడు ఏర్పాటు చేయించాలని కలెక్టర్ను కోరగా విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. కార్యక్రమంలో ఆమె వెంట మార్క్ఫెడ్ డీఎం హరికృష్ణ, తహశీల్దార్ ఆదిలక్ష్మి, ఎంపీడీఓ డీఎస్వీ ప్రసాద్, ఏఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు వన్టౌన్: కౌలు రైతులకు నిర్దేశించిన లక్ష్యం మేరకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో వీడియో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ్యుటేషన్ కరెక్షన్, ట్రాన్సాక్షన్స్, హౌసింగ్ ఫర్ ఆల్లో భాగంగా ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్, నూతన ఇంటి పట్టాల కోసం దరఖాస్తుల పరిశీలన, జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారం రెగ్యులరైజేషన్, రీ సర్వే ప్రక్రియ, రేషన్ షాపుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో 46,015 మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు మంజూరు లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 11,579 మంది కౌలు రైతులకు కార్డులు జారీ చేసినట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి అవసరమైన స్థల సేకరణ చేపట్టాలన్నారు. కోర్టు కేసులను ఆన్లైన్లో చూసుకునేలా రెవెన్యూ కేసులు కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జీఓ ఎంఎస్ 30 ప్రకారం రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 22ఏ డాటెడ్ ల్యాండ్, భూమి అప్పగింత, అసైన్మెంట్ ల్యాండ్లకు సంబంధించి వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఎస్డీసీలు వరకుమార్, శ్రీధర్, జాన్సన్, జిల్లా వ్యవసాయ అధికారులు శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ పెరుగు శ్రీనివాస ప్రసాద్, డీఎస్ఓ పద్మశ్రీ,, సివిల్ సప్లైస్ డీఎం వరలక్ష్మి, జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా, రెవెన్యూ డివిజినల్ అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు. -
మద్యం, గంజాయి
పొందూరులో విచ్చలవిడిగా మద్యం సమస్యపై మంత్రి స్వామికి ఫిర్యాదు చేస్తున్న పొందూరు మహిళలుటంగుటూరు: ‘సార్.. మా ఊరిలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కొందరు వీధుల్లోనే మద్యం తాగి అసభ్యకరంగా ప్రవరిస్తున్నారు. గడప దాటి బయటకు రావాలంటే భయమేస్తోంద’ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డీబీవీ స్వామి ఎదుట పొందూరు గ్రామ మహిళలు వాపోయారు. మంగళవారం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొందూరు వెళ్లిన మంత్రికి మహిళలతోపాటు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వివరాలు.. పొందూరులో నలుగురు వ్యక్తులు అక్రమ మద్యం, గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్నారు. వీరి నుంచి గ్రామ టీడీపీ నాయకుడైన ఎంపీటీసీ సోదరుడు నెలకు రూ.30 వేలు తీసుకుని పోలీసులు దాడి చేయకుండా కాపాడుకుంటూ వస్తున్నాడని టీడీపీ నాయకుడు తగరం కోటేశ్వరరావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లైసెన్స్డ్ దుకాణాల నుంచి మద్యం తీసుకొచ్చి బెల్ట్ షాప్లో విక్రయిస్తూ ఒక్కో క్వార్టర్పై రూ.50 అధికంగా వసూలు చేస్తున్నారని, గంజాయి ప్యాకెట్లు బహిరంగంగానే అమ్ముతున్నారని వివరించారు. తాగుబోతులు రచ్చ రచ్చ చేస్తుండటంతో బయటకు రావాలంటేనే భయంగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పొందూరు మద్యం, గంజాయి విక్రయాల గురించి ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, వారికి నెల నెలా క్రమం తప్పకుండా ముడుపులు అందుతుండటం వల్లే గ్రామంవైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు. ఆగమేఘాలపై ముగ్గురు అరెస్టు నలుగురు వ్యక్తులు మద్యం విక్రయిస్తున్నారని మంత్రికి మహిళలు ఫిర్యాదు చేయగా టంగుటూరు పోలీసులు రంగంలోకి దిగారు. సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్సై నాగమళ్లీశ్వరరావు తమ సిబ్బందితో కలిసి గ్రామానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను బైండోవర్ చేశామని, పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు. మంత్రి స్వామికి గ్రామస్తులు, మహిళల ఫిర్యాదు ఎకై ్సజ్ శాఖ అధికారుల తీరుపై ఆరోపణలు -
ముగ్గురు నిందితులు అరెస్ట్
బాలికపై లైంగిక దాడి కేసు..● వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ గిద్దలూరు రూరల్: సభ్య సమాజం తలదించుకునేలా 12 ఏళ్ల బాలికతో మద్యం తాగించి, ఆపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. మంగళవారం గిద్దలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ప్రధాన నిందితుడు చంద్రశేఖర్నాయుడు స్వగ్రామం కడప జిల్లా కలశపాడు మండలం చెన్నుపల్లె కాగా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద భోజనం హోటల్ నిర్వహిస్తున్నాడు. కలశపాడు మండలం మహానందిపల్లెకు చెందిన కేతుకుమారి భర్తతో మనస్పర్థలు వచ్చి దూరంగా ఉంటూ గిద్దలూరులోని ఓ హోటల్లో పనిచేసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేతుకుమారికి చంద్రశేఖర్నాయుడితో పరిచయం ఏర్పడి అప్పడప్పుడూ అతడి హోటల్ వద్దకు వెళ్తుండేది. జూన్ 26వ తేదీన తనకు ఒక బాలిక కావాలని చంద్రశేఖర్నాయుడు కోరగా కుమారి గిద్దలూరులో నివాసం ఉంటున్న దూరపు బంధువు అయిన మహిళ వద్దకు బైక్పై వెళ్లారు. ఆమె కుమార్తెను తనతో బజారుకు పంపాలని చెప్పి, బైక్పై తాటిచర్ల మోటు వద్ద గల హోటల్కు తీసుకెళ్లారు. హోటల్లో పనిచేసే బాలుడు బీరు తీసుకొచ్చి కూల్డ్రింక్లో కలిపి బాలికతో తాగించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికపై చంద్రశేఖర్నాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన కుమార్తె ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో వెదుకులాడింది. మరుసటి రోజు తెల్లవారుజామున తాటిచెర్ల మోటు వద్దకు వెళ్లిన ఆమె తన కుమార్తె పరిస్థితిని చూసి చంద్రశేఖర్నాయుడు చొక్కా పట్టుకుని ఘర్షణ పడింది. తనకు రాజకీయపలుకుబడి ఉందని, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని ప్రధాన నిందితుడు బెదిరించాడు. దీంతో బాలిక తల్లి జూన్ 27వ తేదిన కొమరోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన చంద్రశేఖర్నాయుడు, అతడికి సహకరించిన కుమారి, బాలుడుపై పోక్సో కేసు నమోదు చేశారు. కొమరోలులోని డ్రీమ్స్ రెస్టారెంట్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, కొమరోలు ఎస్సై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
విధి ‘ఆట’కు బాలుడు బలి
కురిచేడు: చెట్టుకొమ్మ విరిగిపడి ప్రమాదవశాత్తు ఒక బాలుడు మృతి చెంది, మరో విద్యార్థికి గాయాలైన సంఘటన మంగళవారం కురిచేడు మండలంలోని పడమర నాయుడుపాలె గ్రామ పంచాయతీ పరిధిలోని వీవై కాలనీలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు కాలనీకి చెందిన బాలురు బొజ్జారిత్విక్, బొజ్జా మల్లికార్జున, బొజ్జా మహీందర్, మేకల లక్ష్మి నారాయణ మంగళవారం మధ్యాహ్నం ఆడుకునేందుకు వేపచెట్టు ఎక్కారు. చెట్టుకొమ్మ విరిగి కింద అసంపూర్తిగా నిర్మించిన ఇంటి గోడ పోర్టికోపై పడి అదికూడా కలిసి కిందపడ్డాయి. ఆ చెట్టుకొమ్మపై ఉన్న నలుగురు కిందపడిపోయారు. వారిలో బొజ్జా మహీందర్(13) పోర్టికో కాంక్రీట్ బీమ్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురిలో బొజ్జా రిత్విక్కు తలకు, కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయి. రిత్విక్ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. మిగతా వారు ఐదో తరగతి తరువాత విద్యాభ్యాసం మానేశారు. మిగిలిన ఇద్దరు పిల్లలకు గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రుడిని ద్విచక్ర వాహనంపై కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో వినుకొండ తరలించారు. మహిళా పోలీస్ కె.రజిత ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై ఎం.శివ తన సిబ్బందితో కలిసి బాలుడి మృతదేహాన్ని, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి తల్లిదండ్రులు, ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. ఆడుకునేందుకు చెట్టు ఎక్కిన నలుగురు బాలురు కొమ్మ విరగడంతో ఒకరు మృతి, మరో విద్యార్థికి గాయాలు -
8 కేజీల గంజాయి పట్టివేత
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో 8 కేజీల గంజాయిని సీజ్ చేసి, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు. వివరాలు.. ఒంగోలులో ఎకై ్సజ్ పోలీసులతోపాటు ఈఎస్టీఎఫ్ సిబ్బంది మంగళవారం విస్తృతంగా తినిఖీలు నిర్వహించారు. ఏబీఎం కాలేజీ గ్రౌండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేయగా 8 కేజీల గంజాయి లభ్యమైంది. నిందితుడిని చిత్తూరు జిల్లా నగరి గ్రామానికి చెందిన ఎస్.మణిగా గుర్తించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సీఐ ఎ.లీనా, సబ్ ఇన్స్పెక్టర్ సీహెచ్ గీత, ఈఎస్టీఎఫ్ ఎస్సై రవి ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. బెల్టుషాపులను కట్టడి చేయాలి ● తహసీల్దార్కు టీడీపీ నాయకుడి ఫిర్యాదు కంభం: మార్కాపురం డివిజన్లోని అన్ని గ్రామాల్లో యథేచ్ఛగా నిర్వహిస్తున్న మద్యం బెల్టు షాపులను కట్టడి చేయాలని కందులాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నరాల చెన్నారెడ్డి మంగళవారం తహసీల్దార్ వి.కిరణ్కు ఫిర్యాదు చేశారు. ఎకై ్సజ్ అధికారులు అవినీతికి పాల్పడుతూ బెల్టు షాపుల గురించి పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కంభం ఎకై ్సజ్ పరిధిలోని కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల్లో ఊరూరా బెల్టుషాపులు నిర్వహిస్తూ అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని వివరించారు. ఎకై ్సజ్ ఉన్నతాధికారులు స్పందించి బెల్టు షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించాలి ఒంగోలు వన్టౌన్: జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా విభిన్న ప్రతిభావంతల ఏడీ సీహెచ్ సువార్తకు మంగళవారం విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో దివ్యాంగ సంఘాల నాయకులు ఎస్కే కాలేషా, ఎం. సులోచనారాణి, ఎస్డీ అమీర్ హంజా, పసుమర్తి రాజేష్, ముల్లా మదర్వలి పాల్గొన్నారు. -
ధర సన్నగిల్లి!
నిమ్మకు నల్లి..ఐదెకరాల తోటను వదిలేశా నేను ఐదు ఎకరాల్లో నిమ్మ తోట సాగు చేశా. ధర పడిపోవడంతో కాయలు కోయలేదు. కేజీ రెండు రూపాయలకు కూడా వ్యాపారులు తీసుకోవడం లేదు. కోత కూలి ఖర్చు కూడా రాదనే ఉద్దేశంతో చెట్ల మీదే కాయలు వదిలేశా. ఈ ఏడాది నిమ్మ రైతులు భారీగా నష్టపోయారు. నిమ్మ రైతుల గురించి పట్టించుకునే నాథుడు లేడు. – మీనుగు కాశయ్యఅవులవారిపల్లి కాయలు ఏరి రోడ్డున పోయిస్తున్నా ఈ ఏడాది ఆది నుంచే నిమ్మకు ధర లేదు. తొలి కోత సమయంలో కేజీ రూ.50 పలికింది. కొన్నాళ్లకే పండు కాయలు కేజీ రూ.2, పచ్చి కాయలు కేజీ రూ.6కు మించి వ్యాపారులు కొనడం లేదు. కమీషన్ వ్యాపారులు తేవద్దని చెబుతుండటంతో తోటలో వదిలేసిన కాయలు రాలిపోతున్నాయి. అవి కుళ్లడంతో నల్లి తెగులు సోకి తోట మొత్తం దెబ్బతింటోంది. రాలిన కాయలు ఏరి రోడ్ల పక్కన పడేస్తున్నాం. నాణ్యమైన కాయలను కూడా వ్యాపారులు చెప్పిన ధరకు ఇవ్వక తప్పడం లేదు. – గాయం రమణారెడ్డి, హాజీపురం హనుమంతునిపాడు: లాభాలు ఆశించి సాగు చేసిన నిమ్మ తోటలు రైతన్నలకు నష్టాలను రుచి చూపుతున్నాయి. నిమ్మ ధరలు భారీగా పతనం కావడం, మరోవైపు తెగుళ్లు చుట్టుముట్టడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గతేడాది కాస్తోకూస్తో లాభాలు గడించిన రైతులు ప్రస్తుత పరిస్థితులు తలుచుకుని కుమిలిపోతున్నారు. అధిక మొత్తంలో కౌలు చెల్లించి సాగు చేపట్టిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మద్దతు ధర లేక, కూలి ఖర్చులు భరించి కాయలను మార్కెట్కు తరలించలేక చెట్ల మీదనే వదిలేస్తున్న దుస్థితి. వ్యయప్రయాసలకోర్చి కాయలను మార్కెట్కు తరలించిన రైతులు.. గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రోడ్ల పక్కన పడేస్తున్న దృశ్యాలు కనిగిరి, హనుమంతునిపాడు మండలాల్లో తరచూ కనిపిస్తున్నాయి. జిల్లాలో అధికారిక గణాంకాల ప్రకారం 2,874 హెక్టార్లకు పైగా నిమ్మ తోటలు సాగులో ఉన్నాయి. ఒక్క హనుమంతునిపాడు మండలంలోనే ముదురు, లేత తోటలు సుమారు 2 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. హనుమంతునిపాడు ప్రాంతంలో పండించిన నిమ్మకాయలు హైదరాబాద్, ముంబై, కలకత్తా, చైన్నె తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. కర్ణాటక, మహారాష్ట్రలో నిమ్మ దిగుబడి అధికంగా రావడంతో ఇక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. అదే సమయంలో వ్యాపారులు, దళారులు కుమ్మక్కవడంతో కేజీ నిమ్మకాయల ధర రూ.2 నుంచి రూ.3 కూడా పలకడం లేదు. కనీసం పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని నిమ్మ రైతులు కోరుతున్నారు. కిలో ధర రూ.2 ప్రస్తుతం పండు నిమ్మ కాయలు కేజీ రూ.2 నుంచి రూ.3కు మించి పలకడం లేదు. కాయలు మార్కెట్కు తేవద్దని చెబుతున్న కమీషన్ వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ససేమిరా అంటున్నారు. పచ్చి కాయలు కేజీ రూ.6 నుంచి రూ.7కు మించి కొనుగోలు చేయడం లేదు. దీంతో కోత కూలి, ఆటోల బాడుగ కూడా రావడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల పంటలకు నష్ట పరిహారం చెల్లిస్తున్న ప్రభుత్వం పండ్ల తోటల రైతులనూ పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆశలు నల్లిపేస్తోంది! నిమ్మ ధరలు పతనం కావడంతో చెట్లమీద వదిలేసిన కాయలు పండి రాలిపోతున్నాయి. చెట్లపై, పాదుల్లోనే కుళ్లిపోతుండటంతో నల్లి తెగులు ప్రబలి తోటలు దారుణంగా దెబ్బతింటున్నాయి. వేరు కుళ్లు, పేనుబంక, మంగు, ఎండు తెగులు, వైరస్ సోకిన తోటలను కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడుతున్నారు. తెగుళ్ల కారణంగా కాయల నాణ్యత దెబ్బతినడంతో ధర పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేడింగ్ అనంతరం భారీ పరిమాణంలో నాణ్యత లేని కాయలను రోడ్డు పక్కన పడుస్తున్నారు. ఇదిలా ఉండగా తెగుళ్ల నివారణ చర్యల గురించి రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. ఉద్యానశాఖ అధికారులు నిమ్మ తోటలవైపు కన్నెత్తి చూడటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పాతాళంలోకి పడిపోయిన నిమ్మ ధరలు కేజీ కాయలు రూ.2 నుంచి రూ.3 కాయలు వద్దని రైతులకు చెబుతున్న వ్యాపారులు నిమ్మ తోటలను దారుణంగా దెబ్బతీస్తున్న నల్లి తెగులు ఆకు, కాయ రాలిపోతుండటంతో రైతుల్లో ఆందోళన పత్తా లేని ఉద్యానశాఖ అధికారులు -
పోయిన నగలు పట్టించిన ఫోన్ పే!
యర్రగొండపాలెం: ఓ వ్యక్తి పోగొట్టుకున్న నగలను ఫోన్ పే సాయంతో పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నగలనుఎస్సై పి.చౌడయ్య మంగళవారం బాధితుడికి అందజేశారు. వివరాలు.. మండలంలోని అయ్యంబొట్లపల్లికి చెందిన పెద్దపోగు కోటయ్య మే 31వ తేదీన బ్యాంకులో రుణం తీసుకునేందుకు తన బంగారు ఆభరణాలు తీసుకుని యర్రగొండపాలెం వచ్చాడు. స్థానిక ఆర్అండ్బీ బంగ్లా వద్ద షోడా తాగి బ్యాంకు వద్దకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక నగలు కనిపించలేదు. వెంటనే కోటయ్య షోడా బండి వద్దకు వెళ్లి విచారించగా.. మరి కొంత మంది వచ్చి షోడా తాగి వెళ్లారని, వారు ఫోన్పే చేశారని చెప్పాడు. షోడా బండి వ్యాపారి ఇచ్చిన సమాచారం ఆధారంగా కోటయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ రోజు షోడా తాగి ఫోన్ పే చేసిన ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నగలను గుర్తించి అప్పగించిన ఎస్సైకి బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. -
ఒక్క సమస్య.. ఏడు అర్జీలు..!
● మీ కోసం కార్యక్రమాలలో కలెక్టర్కు ఏడు సార్లు అర్జీలిచ్చినా పరిష్కారం కాని సమస్య ఒంగోలు సబర్బన్: ఒకే ఒక్క సమస్యపై జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలలో ఇప్పటి వరకూ ఏడు సార్లు అర్జీలిచ్చినా పట్టించుకోలేదని పొదిలికి చెందిన బాధితుడు వాపోయాడు. సోమవారం ఒంగోలులోని కలెక్టరేట్లో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆధ్వర్యంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఏడోసారి అర్జీ అందజేశాడు. ఆ వివరాల్లోకెళ్తే.. పొదిలి మున్సిపాలిటీ పరిధిలోని దర్శి రహదారిలో రోడ్డు మార్జిన్లో ఉన్న ప్రభుత్వ స్థలంలో తన పొలానికి అడ్డంగా యోగయ్య అనే వ్యక్తి తాత్కాలికంగా షెడ్డు నిర్మించాడని పొదిలికి చెందిన దాసరి రవిచంద్ర అనే బాధితుడు ఏడాదికిపైగా క్షేత్రస్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. తన పొలంలోని వర్షం నీరు బయటకు పోవడానికి వీల్లేకుండా అక్రమంగా నిర్మాణం చేపట్టాడని స్థానిక అధికారులకు అనేక సార్లు అర్జీలు అందించారు. వారెవరూ పట్టించుకోకపోవడంతో ఒంగోలులో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించే మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలలో ఇప్పటికే ఆరు సార్లు దాసరి రవిచంద్ర అర్జీలు అందజేశాడు. షెడ్డు అడ్డంగా ఉండటంతో పొలంలోని నీరు బయటకు పోయే వీల్లేక పొలం కోతకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై 2024 ఫిబ్రవరి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపాడు. సోమవారం మరోసారి ఒంగోలులో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి వచ్చాడు. అడ్డగోలుగా యోగయ్య నిర్మించిన షెడ్డును తొలగించాలని ఏడోసారి కలెక్టర్కు అర్జీ అందజేశాడు. ప్రభుత్వ స్థలంలో తడికలు, రేకులతో యోగయ్య నిర్మించిన పెడ్డులో పగటి పూట కుటుంబంతో నివాసం ఉంటూ రాత్రి అయ్యేసరికి తోళ్లమడుగులోని తన సొంతింటికి వెళుతున్నాడని అర్జీలో తెలిపాడు. గతంలో మండల సర్వేయర్ కూడా పరిశీలించి ప్రభుత్వానికి చెందిన రోడ్డు స్థలంలోనే యోగయ్య షెడ్డు నిర్మించాడని తహసీల్దార్కు నివేదిక కూడా ఇచ్చారని, కానీ, ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపాడు. జేసీని కలిసినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పొదిలి తహసీల్దార్, నగర పంచాయతీ కమిషనర్, పోలీసులు వచ్చి చూసి వెళ్తున్నారుగానీ, తాత్కాలిక షెడ్డును తొలగించే ప్రయత్నం మాత్రం చేయడం లేదని వాపోయాడు. తన సమస్య పరిష్కారం కాకుండా ఉండటానికి అదికారులే ప్రధాన కారణమంటూ ఆరోపించాడు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అదే పనిగా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాకుండా ఉంటే ఇంకెవరికి మొరపెట్టుకోవాలో చెప్పాలంటూ రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అర్జీదారులు సంతృప్తి చెందాలి : కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు బాధితులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీ కోసం సమావేశపు హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలపై సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, ఎస్డీసీలు కుమార్, శ్రీధర్, జాన్సన్, పార్థసారధి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
9న సమ్మెను జయప్రదం చేయండి
● అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ ఒంగోలు సిటీ: ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలో ఉన్న అంగన్వాడీలు పాల్గొని జయప్రదం చేయాలని అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ సోమవారం కోరారు. ఆమేరకు ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలోని యూడీసీకి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ కార్మికులకు నష్టం చేసే కార్మిక చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఐసీడీఎస్ను బలోపేతం చేయాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కేవీ సుబ్బమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు కస్తూరి, పద్మావతి పాల్గొన్నారు. -
నాణ్యత..!
ఎగిరిపోయినప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు యుద్ధ విమానాలు, సహాయక విమానాలు ఆగేందుకు వీలుగా కలికవాయ–కనుమళ్ల మధ్య జాతీయ రహదారిపై నిర్మించిన రన్వే నాణ్యతా లోపాలతో ప్రారంభం కాకుండానే ధ్వంసమైంది. మలుపులతో ఉన్న రన్వే ప్రారంభానికి ఎయిర్ఫోర్స్ అభ్యంతరం పెట్టింది. లోపాలు సరిచేసి దాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు మళ్లీ రూ.43 కోట్లు మంజూరు చేసి అదనంగా స్థల సేకరణకు చర్యలు చేపట్టారు. రన్వేకు అదనంగా రూ.43 కోట్లు మంజూరు రన్వేను వినియోగంలోకి తేవటానికి గత సంవత్సరం రూ.38 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ఈ సంవత్సరం పెరిగిన ధరలతో రూ.43 కోట్ల అంచనా వ్యయంతో మళ్లీ ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం నిధులు మంజూరయ్యాయని త్వరలో రన్వే నిర్మాణానికి సంబంధించి అదనపు స్థల సేకరణతో పాటు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. రన్వే పూర్తి చేయటానికి రోడ్డుకు ఇరువైపులా 6 మీటర్ల చొప్పున స్థల సేకరణ చేయాల్సి ఉందని వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ కే శ్రీధర్రెడ్డి తెలిపారు.రన్వేల నిర్మాణం ఇలా.. జాతీయ రహదారిపై రోడ్డు మధ్య నుంచి రెండు వైపులా 33 మీటర్ల చొప్పున అంటే మొత్తం 66 మీటర్ల వెడల్పున సిమెంటు రోడ్డు నిర్మించారు. రోడ్డుకు ఇరువైపులా మూడు మీటర్ల చొప్పున స్థలాన్ని వదిలిపెట్టి ఆ స్థలాన్ని డ్రైనేజితో పాటు ఇతర అవసరాలకు ఉపయోగిస్తారు. సిమెంటు రోడ్డు నిర్మించే 3.60 కిలోమీటర్ల వరకు రోడ్డు మధ్యలో శాశ్వత డివైడర్ను నిర్మించకుండా తాత్కాలిక డివైడర్ను ఏర్పాటు చేశారు. ఈ రన్వే పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 2022లో వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జే పంగులూరు మండలం కొరిశపాడు–రేణంగివరం వద్ద రన్వే నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభమైంది. సింగరాయకొండ: ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా జాతీయ రహదారిపై అత్యవసర పరిస్థితుల్లో విమానాలు ఆగేందుకు వీలుగా ఎయిర్పాడ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రన్వేల నిర్మాణం చేపట్టింది. ఈ పథకం కింద దేశంలో 13 రన్వేలు నిర్మిస్తుండగా రాష్ట్రానికి కేటాయించిన రెండు రన్వేలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిర్మించారు. ఒక్కొక్కటి రూ.85 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ రన్వేల వలన ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు, దేశ, రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులు జిల్లా పర్యటన సమయంలో విమానాలు, హెలికాప్టర్లు ల్యాండ్ అవడానికి అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రానికి రెండు రన్వేలు కేటాయించగా ఒకటి కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండల పరిధిలో జాతీయ రహదారిపై కలికవాయ నుంచి కనుమళ్ల మధ్య సుమారు 3.60 కిలోమీటర్ల దూరం, మరొకటి అద్దంకి నియోజకవర్గం జే పంగులూరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై సుమారు 4 కిలోమీటర్ల దూరం కొరిశపాడు నుంచి రేణంగివరం మధ్య నిర్మించారు. ఈ రెండింటినీ ప్రముఖ నిర్మాణ సంస్థ కేఎంసీ చేపట్టింది. పటిష్టంగా రన్వే నిర్మాణం: రన్వే నిర్మాణానికి నిధులు మంజూరు కావటంతో త్వరలో పనులు ప్రారంభిస్తామని, వేగవంతం చేస్తామని హైవే అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోడ్డులో దెబ్బతిన్న ప్రాంతాన్ని తొలగించి మళ్లీ నిర్మిస్తారు. అలాగే ప్రధాన రహదారికి ఇరువైపులా ఐరన్తో ఫెన్సింగ్ వేస్తారు. రోడ్డుకు ఇరువైపులా మూడు మీటర్ల వెడల్పుతో సర్వీసు రోడ్డు నిర్మిస్తారు. మండల కేంద్రం నుంచి వాహనాలు రన్వేపైకి రావాలంటే కందుకూరు ఫ్లైఓవర్, కలికవాయ ఫ్లైఓవర్ వద్ద మాత్రమే మారేందుకు అవకాశం ఉంటుంది. కలికవాయ, కందుకూరు ఫ్లైఓవర్ల మధ్య ఎక్కడా వాహనాలకు దారి ఇచ్చే అవకాశం ఉండదు. సర్వీసు రోడ్డు నిర్మాణం తరువాత ఇరువైపులా డ్రైనేజీ నిర్మిస్తారు. ఈ క్రమంలో రోడ్డు మలుపులను సరిచేస్తారు. అంతేకాక రన్వే మధ్యలో వాహనాలకు ఇబ్బంది లేకుండా రోడ్డు మధ్యలో పూర్తి స్థాయిలో సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. నిధుల మంజూరుతో రన్వే వినియోగంలోకి వచ్చేటట్లు సిద్ధం చేస్తామని త్వరలో స్థల సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని హైవే అధికారులు వివరించారు. రూ.85 కోట్లతో జాతీయ రహదారిపై అత్యవసర విమానాల ల్యాండింగ్కు రన్వే నిర్మాణం నాసిరకంగా రన్వే పనులు నాణ్యతా లోపాలతో ప్రారంభం కాకుండానే ధ్వంసం రన్వేలో మలుపులతో ఎయిర్ఫోర్స్ అభ్యంతరం లోపాలు సరిచేసేందుకు మళ్లీ రూ.43 కోట్లు మంజూరు అదనంగా స్థల సేకరణకు చర్యలు -
తల్లికి వందనం ఈ–కేవైసీ పూర్తి చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియాఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో భాగంగా పెండింగ్ ఈ–కేవైసీ మంగళవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం ప్రకాశం భవనం నుంచి ఎంపీడీవోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సత్వరమే పెండింగ్ ఈ–కేవైసీ పూర్తి చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది బదిలీ అయ్యే జూలై 5వ తేదీ లోపు సిటిజన్ ఈ–కేవైసీ కూడా పూర్తి చేయాలని చెప్పారు. గ్రామాల్లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జూలై 8న 10 వేల ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ... ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యవసాయ అనుబంధ పనులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి చేపట్టాలని కలెక్టర్ చెప్పారు. ఫారం పాండ్స్, ఫిషింగ్ పాండ్స్, కంపోస్టు పిట్స్ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డ్వామా ఆధ్వర్యంలో 8వ తేదీ జిల్లాలో 750 ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉందన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో చిరంజీవి, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, పాల్గొన్నారు. కార్మికుల రోజువారీ వేతనాల సవరణ ఒంగోలు వన్టౌన్: కార్మికుల రోజువారీ వేతనాలను కలెక్టర్ సవరణ చేసినట్లు ఒంగోలు ఉపకార్మిక కమిషనర్ ఎ.గాయత్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్యం లేని కార్మికులకు రూ.694, కొంత వరకూ నైపుణ్యం ఉన్న కార్మికులకు రూ.791, నైపుణ్యం ఉన్న కార్మికులకు రూ.899, పూర్తి స్థాయిలో నైపుణ్యం ఉన్న కార్మికులకు రూ.1042గా వేతనాలు సవరించినట్లు వెల్లడించారు. సవరించిన వేతనాలు ఏప్రిల్ 1, 2025 నుంచి వర్తిస్తాయన్నారు. -
బాబు మోసకారి..
ఒంగోలు సిటీ: ఎన్నికల ముందు ఎన్నో ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని చంద్రబాబు మోసం చేసి వెన్నుపోటు పొడిచాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డితో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్ని వంచించిన ఘనత చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు. ఏడాది కాలంగా సాగిన వంచన పాలనపై ‘‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’’ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు. సూపర్ సిక్స్ కార్యక్రమాలు అమలు చేయకుండానే అన్నీ ఇచ్చేశామని చెప్పడం దుర్మార్గమన్నారు. సంవత్సరానికి మూడు సిలిండర్లు, పింఛన్లు 40 శాతం మందికి కూడా అందలేదన్నారు. నీకు రూ.15 వేలు..రూ.15 వేలు, రూ.18 వేలు, రూ.18 వేలు అంటూ మహిళల్ని దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని, అంతవరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు సిల్క్ డెవలప్మెంట్లో పెట్టేశామని చెబుతున్నారని విమర్శించారు. బాబు మోసాలను ప్రజలకు తెలియజేసేందుకు ‘‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’’ పేరుతో వైఎస్సార్ సీపీ ప్రజల వద్దకు వెళుతోందన్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో చేపట్టే కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో చంద్రబాబు మోసాలను ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. కష్టాల్లో ఉన్న పొగాకు రైతుకు అండగా నిలిచేందుకు జగన్ పొదిలికి వచ్చారన్నారు. ఇందుకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నామన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది అక్రమంగా జొరబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లపై రాళ్లతో దాడి చేశారన్నారు. అమరావతి పేరుతో ఆందోళన చేసిన వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్పీని కలసి వినతి పత్రాన్ని ఇస్తామని, అవసరమైతే హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తామని హెచ్చరించారు. పార్టీ కేడర్పై అన్యాయంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పార్టీ లాయర్లతో అన్ని సిద్ధం చేశామన్నారు. లిక్కర్ కేసును సృష్టించి ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై అన్యాయంగా కేసుపెట్టారన్నారు. ఆయన్ను అరెస్టు చేయడం హేయమన్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా రూ.లక్షన్నర కోట్లు అప్పు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. 2027లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. మాటతప్పిన కూటమి నేతలను నిలదీయండి : బూచేపల్లి ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్తో పాటు ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆరోపించారు. సూపర్ సిక్స్ ఇచ్చేశామని, అదేమని అడిగితే నాలుక మందం అంటూ బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ‘‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారంటీ’’ అంటూ ఎన్నికల్లో పోటీ చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలన చూసి ‘‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’’ అంటూ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. హామీలు తుంగలోకి తొక్కి, ఏ హామీలు నెరవేర్చారని గడపగడపకూ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నారని టీడీపీ ప్రజాప్రతినిధులను నిలదీశారు. తల్లికి వందనం పథకం చాలా మంది లబ్ధిదారులకు అందలేదన్నారు. చంద్రబాబు మోసాలను గుర్తుంచుకుని మీ గడప ముందుకు వచ్చిన వారిని నిలదీయండని ఆయన కోరారు. పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై లేని లిక్కర్ కేసు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, మాజీ మంత్రి కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, మాజీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్ని వంచించిన ఘనత చంద్రబాబుది హామీలు అమలు చేయాలని అడుగుతున్న వారిపై తప్పుడు కేసులు ‘‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’’ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి మాట తప్పిన పాలకులను నిలదీయండి: బూచేపల్లి -
చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఒంగోలు సిటీ: ఎన్నికల ముందు చంద్రబాబు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి, జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు జిల్లా కార్యాలయంలో సోమవారం జిల్లా విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు అధికారం కోసం అలవికాని హామీలిచ్చి ‘‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారంటీ’’ అని ప్రజలను నమ్మించాడన్నారు. అధికారంలోకి వచ్చాక మ్యానిఫెస్టోను గాలికొదిలేశాడన్నారు. కుల, మత, వర్గ, విభేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు పదవులన్నీ అనుభవించి, అధికారం దూరమైన వెంటనే వారు అవకాశవాద రాజకీయాలు చేసి పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారన్నారు. మళ్లీ ఇప్పుడు పార్టీలోకి వస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, అలాంటివాళ్లు పార్టీకి అవసరం లేదని, పార్టీ తీసుకోదని, వారిని పార్టీలో ఎవరూ సమర్ధించరన్నారు. ● జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ఎలాంటి సంఘటనలు జరగకపోయినా అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏమీ జరగకపోయినా ఇంత మందిపై కేసులు బనాయించడం అన్యాయమని, అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. ● యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోను తూచ తప్పకుండా అమలు చేశారన్నారు. ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి చంద్రబాబు అలవికాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. నీ కార్యకర్తలను ఇంటింటికీ పంపి ఒక సంవత్సరంలో ఇంత అమౌంట్ వస్తుందని చెప్పావు. చంద్రబాబు మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు ప్రజలకు ఇవ్వలేదు కనుక నీమీద ఎందుకు కేసు పెట్టకూడదు అని ప్రశ్నించారు. ● ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ అడ్డగోలుగా హామీలిచ్చి మీరు ఎలా ప్రశ్నిస్తారో ప్రశ్నించండి చూద్దాం అని చంద్రబాబు అంటాడన్నారు. ఇది ప్రజాస్వామ్యం అనీ, ఇక్కడ ఎవరైనా ప్రశ్నించవచ్చన్నారు. చంద్రబాబు మీ నియంతృత్వ పోకడలు చెల్లవని, ప్రజల పక్షాన ప్రశ్నిస్తామన్నారు. గడప గడపకు వెళ్లి చంద్రబాబును ప్రశ్నించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ● మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోని తీసుకొని వెళ్లి గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తాము, చంద్రబాబు మీ మ్యానిఫెస్టోని తీసుకొని వెళ్లి ప్రజలకు వివరించగలరా అని ప్రశ్నించారు. ● మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని విమర్శించారు. ఎవరైతే హామీలను అమలు చేయాలని అడుగుతారో వారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. రైతులకు అండగా ఉండేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి పర్యటనకు ప్రజలు బాగా వచ్చారని, దాంతో మా పై రాళ్లు వేసి, మామీద కేసులు పెట్టారన్నారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన అణగదొక్కలేవనీ, ప్రజల గొంతు నొక్కలేవన్నారు. ● మాజీ ఎమ్మెల్యే మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ● ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న పిచ్చిచేష్టల వల్ల టీడీపీ నాయకుల్లోనే వ్యతిరేకత మొదలైందన్నారు. వారి నాయకుల్లోనే ఈ సారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వస్తే తమ పరిస్థితి ఏంటని అంతర్మథనం చెందుతున్నారన్నారు. ● కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టి.జే.ఆర్ సుధాకరబాబు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు మాదిగ, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశంమాట్లాడుతున్న కారుమూరి నాగేశ్వరరావు, పక్కన పార్టీ నాయకులు -
రైతు కంట కన్నీటి ఝరి..
తిరస్కరణలతో సరి..కనిగిరిరూరల్: కూటమి పాలనలో పొగాకు రైతులు కుదేలయ్యారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో కంపెనీల ప్రతినిధులు, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కనిగిరి టుబాకో బోర్డు పరిధిలో పొగాకు సాగు విస్తీర్ణం 4,952 హెక్టార్లు ఉండగా.. 5 క్లస్టర్ల పరిధిలో 74 గ్రామాల్లో 1,245 బ్యార్నీలు ఉన్నాయి. ఈ ఏడాది పొగాకు ఉత్పత్తి 8.5 మిలియన్ కేజీలు వచ్చింది. కనిగిరి టుబాకో బోర్డులో మార్చి 19 నుంచి పొగాకు వేలం కేంద్రం ప్రారంభమైంది. ఇప్పటికి పది రౌండ్లు వేలం అయినా కేవలం 3.18 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేశారు. ప్రతి బ్యార్నీ నుంచి 12 బేళ్ల వరకు అనుమతి ఉన్నా ఇప్పటి వరకు నాలుగు, ఐదుసార్లు వేలానికి వెళ్లిన పొగాకు రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది. కేవలం గ్రేడ్1 (ఎఫ్1,ఎఫ్2,ఎఫ్3) రకాల పొగాకును మాత్రమే కొనుగోలు చేసి.. మిగతా రకం బేళ్లను తిరస్కరిస్తున్నారు. దీంతో ప్రతిసారి వేలం కేంద్రానికి వెళ్లడం ఒకటి రెండు బేళ్లు మాత్రమే కొనుగోలు జరగడంతో.. మిగతా వాటిని తీసుకుని ఉసూరుమంటూ తిరిగి ఇంటికి వెళ్లే దుస్థితి ఏర్పడింది. గత ఏడాది కనిగిరి టుబాకో బోర్డు పరిధిలో 7.58 మిలియన్ కేజీల ఉత్పత్తి వచ్చింది. దాదాపు రైతు దగ్గర ఉన్న పొగాకు మొత్తాన్ని బోర్డు అధికారులు, ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత ప్రభుత్వంలో గరిష్ట ధర కేజీ రూ.350 నుంచి రూ.360 వరకు, కనిష్ట ధర రూ.280 నుంచి రూ.270 వరకు కొనుగోలు చేశారు. కనిష్ట ధర దిగజారినా.. కనిగిరి బోర్డులో ఈఏడాది ప్రారంభ వేలంలో కేజీ పొగాకు కనిష్ట ధర రూ.180 వరకు పలికినా..వారం రోజులుగా కనిష్ట ధర కేజీ రూ.150కి పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు గరిష్ట ధర రూ.280 మాత్రమే ఉంది. అంతేగాక మీడియం, లోగ్రేడ్ పొగాకు బేళ్లను కొనుగోలు చేయకపోతుండటంతో ఇళ్లల్లో పేరుకుపోయిన పొగాకు బేళ్లను చూసుకుంటూ తెచ్చిన పెట్టుబడి అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో పొగాకు రైతు లోలోన కుములుతున్నాడు. బయ్యర్లతో అధికారుల కుమ్మక్కు? కనిగిరి టుబాకో బోర్డు అధికారులు, బయ్యర్ల తీరును నిరసిస్తూ ఇప్పటికి అనేక దఫాలు రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. బయ్యర్లతో ఆక్షన్ సూపరింటెండెంట్ కుమ్మక్కయి రైతులను అన్యాయం చేస్తున్నాడని, వారికి నచ్చిన రైతులకు న్యాయం చేసి.. మిగతా వారికి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు చేశారు. రెండు రోజుల క్రితం పామూరు మండలం వెంకట్రావుపాలెంకు చెందిన పెద్ద రైతు .. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు అన్యాయం చేయవద్దని అడిగినందుకు తాగి వచ్చావా..? అంటూ ఆక్షన్ సూపరింటెండెంట్ దురుసు వ్యాఖ్యలు చేశారు. దీనిపై రైతులు నిరసన తెలిపారు. ఆర్ఎంకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం, కంపెనీలు, అధికారులు అందరూ కలిసి పొగాకు రైతును పూర్తిగా అన్యాయం చేస్తున్నారని రైతు సంఘ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. భారీ ఎత్తున బేళ్లు తిరస్కరిస్తుండటం, కనిష్ట ధరలు నానాటికీ దిగజారడాన్ని నిరశిస్తూ సోమవారం కూడా మరోమారు ధర్నా చేపట్టనున్నట్లు రైతు సంఘ నాయకులు తెలిపారు. కనిగిరి బోర్డు పరిధిలో 8.5 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి పది రౌండ్లు పూర్తవుతున్నా 3.18 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు దిగజారిన కనిష్ట ధరలు ఇళ్లలో నుంచి కదలని బేళ్లు స్పందించని అధికారులు, బయ్యర్లు నేడు వేలం కేంద్రం వద్ద ధర్నాకు సిద్ధమవుతున్న రైతులుపొగాకు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం పొగాకు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈ ఏడాది రైతులకు మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం పొగాకు రైతులను విస్మరించడంతో బయ్యర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. పొగాకు రైతుకు గిట్టుబాటు ధర లేక.. బేళ్లన్నీ అమ్ముడుపోక ఇబ్బంది పడుతున్నారు. నామ్కే వాస్తే ఒకటి రెండు బేళ్లను మీడియంను కొనుగోలు చేసి.. సరాసరి ధర రూ.240 అంటూ బోర్డు అధికారులు ప్రకటిస్తున్నారు. దీని వల్ల పొగాకు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. – సూరసాని మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి పొగాకు రైతును ప్రభుత్వం ఆదుకోవాలి పొగాకు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రైతు పండించిన పంటను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. రైతు తెచ్చిన పొగాకు బేళ్లన్నీ కొనుగోలు చేయాలి. లోగ్రేడ్ పొగాకును నోబిడ్ పేరుతో తిరస్కరించడం సరైంది కాదు. అధికారులు బయ్యర్లతో కుమ్మకై ్క రైతులకు అన్యాయం చేస్తున్నారు. పొగాకు రైతుకు కనీస మద్దతు ధర కల్పించాలి. – గుజ్జుల బాలిరెడ్డి, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు -
అడ్డగోలు కోతలపై జనాగ్రహం
సింగరాయకొండ: మండల కేంద్రంలో పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ కోతలు విధించడంతో ఆగ్రహించిన బాలయోగినగర్, అంబేద్కర్ నగర్ కాలనీవాసులు ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. కొద్ది రోజులుగా విద్యుత్కు తీవ్ర అంతరాయం కలుగుతోందని, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అర్థం కావటం లేదన్నారు. చిన్న గాలివాన వచ్చినా విద్యుత్ నిలిపేస్తున్నారని ఆరోపించారు. అసలే వాతావరణ ప్రభావంతో ఎండతీవ్రత బాగా ఉందని, రాత్రి అయినా వేడి తగ్గటం లేదని, మరో పక్క విద్యుత్ సక్రమంగా ఉండకపోవటంతో ఎలా బతకాలని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి తరచూ విద్యుత్కు అంతరాయం కలుగుతోందని, ఇప్పుడు రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సబ్స్టేషన్కు అధికారులను నిలదీద్దామని వచ్చామని, ఇక్కడ సిబ్బంది ఎవరూ లేరని విద్యుత్ శాఖ ఏఈ సాంబశివరావుకు ఫోన్ చేస్తే జాతీయ రహదారిపై లారీ యూనియన్ ఆఫీసు సమీపంలో విద్యుత్ తీగలు తెగాయని మరమ్మతు చేస్తున్నామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సమస్య ఉంటే ఇప్పుడు తీరిగ్గా రాత్రి పూట మరమ్మతులు చేయటం ఏమిటని, దీనిని బట్టి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం అర్థమవుతోందని ఆరోపించారు. విద్యుత్ అధికారుల వైఖరికి నిరసనగా సబ్స్టేషన్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద కొవ్వొత్తులతో గ్రామస్తుల నిరసన -
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచాలి
● యూటీఎఫ్ గౌరవ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు ఒంగోలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచాలని యూటీఎఫ్ శ్రేణులకు యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం ఆదివారం ఒంగోలులో జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హై అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూటీఎఫ్ గౌరవ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ సమాజంలో నాణ్యమైన, సమానమైన విద్య అందాలంటే ప్రభుత్వ విద్యావిధానం బలపడాలన్నారు. బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో 40 మంది విద్యార్థులు దాటితే 3వ పోస్టు ఇవ్వాలని, 2 సంవత్సరాలు ఒక ఉపాధ్యాయుడు ఒకేచోట పనిచేసేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హై మాట్లాడుతూ యూటీఎఫ్ కార్యకర్తలు అదనంగా పనిచేసి పాఠశాలలను సమాజానికి దగ్గరకు చేర్చాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరినీ బోధనేతర పనులు తగ్గించి ఎన్రోల్మెంట్ పెంచే వాతావరణాన్ని కల్పించాలన్నారు. జిల్లాలో రిలీవర్ లేక చాలా మంది ఉపాధ్యాయులు బదిలీ అయినా పాత స్థానాల్లోనే పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని బదిలీ, ప్రమోషన్ తీసుకున్న ఉపాధ్యాయులందరినీ కొత్త స్థానాల్లో పనిచేసేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ గౌరవ అధ్యక్షుడు రవి, సహాధ్యక్షురాలు ఉమామహేశ్వరి, కోశాధికారి చిన్నస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజసులోచన, తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ కుటుంబ సభ్యులకు బూచేపల్లి, తాటిపర్తి పరామర్శ
పెద్దదోర్నాల: అక్రమ కేసులతో అరెస్టయిన చిన్న గుడిపాడు సర్పంచ్ వల్లభనేని మల్లికార్జున (పవన్) కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు. ఆదివారం మండలంలో పర్యటించిన వారు చిన్నగుడిపాడులోని పవన్ స్వగృహంలో అతని బంధువులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. టీడీపీ ప్రభుత్వ అధికారం ఉందన్న గర్వంతో తప్పుడు కేసులు బనాయిస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన నిరంతరం పోరాడుతోందని తెలిపారు. ప్రజాదరణ కలిగిన వల్లభనేని మల్లికార్జునను ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలనే ఇటువంటి కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. దీంతో పాటు ఇటీవల శరస్త్ర చికిత్సలు చేయించుకున్న గాదె బ్రహ్మారెడ్డిని తన నివాస గృహంలో పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట పార్టీ మండల కన్వీనర్ గంటా రమణారెడ్డితో పాటు మండల నాయకులు, స్థానిక నాయకులు ఉన్నారు. -
కష్టాలు!
ట్రాన్స్ఫార్మర్పశ్చిమ ప్రాంతంలో పొలంలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ (ఫైల్)సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వాతావరణ పరిస్థితుల వల్ల కానీ, ఓల్టేజి హెచ్చుతగ్గుల వల్ల కానీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందా... ఇక వినియోగదారులకు అవస్థలు ప్రారంభమైనట్లే. చిన్న ఈదురుగాలులు కొడితేనే కాలిపోవడం సర్వసాధారణమైంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు అర్బన్ ప్రాంతాల్లో అయితే 12 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల్లోగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు అమర్చాలి. అప్పుడే రైతులు వంటలు దెబ్బతినకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ రవాణా ఖర్చు కూడా విద్యుత్ శాఖ భరించాల్సి ఉంది. అయితే నిర్ణీత సమయం ప్రకారం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్న దాఖలాల్లేవు. పైగా రవాణా ఖర్చులను కూడా రైతులపైనే వేస్తున్నారు. డిపార్టుమెంట్ వాహనంలోనే తరలిస్తూ వేలాది రూపాయలను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే కొత్తది మార్చేందుకు ఐదారు రోజులు పడుతోంది. పట్టణాల్లో అయితే మూడు రోజులకు తక్కువ పట్టడం లేదు. వ్యవసాయ విద్యుత్ అస్తవ్యస్తం... వ్యవసాయ విద్యుత్ అస్తవ్యస్తంగా ఉంది. త్రీఫేజ్ విద్యుత్ ఇచ్చినట్లే ఇచ్చి తరచూ నిలిపేస్తున్నారు. ఇలా నిలిపేస్తుండటంతో 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండటం లేదు. తొమ్మిది గంటలు ఇస్తున్నామని చెబుతున్నా రెండు, మూడుసార్లు నిలిపేస్తుండటంతో రైతులు అవస్థ పడుతున్నారు. గృహాలకు ఇచ్చే విద్యుత్కు కూడా ప్రతిరోజూ గంటల తరబడి అనధికార కోతలు విధిస్తున్నారు. గాలులు వీచినా, వర్షాలు కురుస్తాయనుకున్న సమయంలో విద్యుత్ కోతలు మరింత అధికం. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఆఫీసులకు ఫోన్ చేసి విసిగిపోవాల్సిందే. ఒక వైపు అడపాదడపా వానజల్లులు కురుస్తున్నా.. వాతావరణం మాత్రం అగ్ని గుండాన్ని తలపిస్తోంది. ఈ సమయంలో అనధికార విద్యుత్ కోతలు పగలూ రాత్రీ తేడా లేకుండా ఉండటంతో జనం ఇళ్లలో ఉండలేకపోతున్న పరిస్థితి. ఇదే సందర్భంలో విద్యుత్ బిల్లులు మాత్రం గతంతో పోల్చుకుంటే రెండింతలు, మూడింతలు పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. సమయపాలన లేకుండా నిర్వహణ, ఇతర కారణాలు చెబుతూ కోత విధిస్తున్నారు. కొన్నిచోట్ల రోజులో నాలుగైదు గంటల చొప్పున సరఫరా ఉండటం లేదని విద్యుత్ వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ వినియోగం ఇలా... జిల్లాలో రోజువారీ విద్యుత్ వినియోగ లక్ష్యం 8.150 మిలియన్ యూనిట్లు.. అయితే ఇచ్చిన లక్ష్యం కంటే తక్కువగానే కాలుతోంది. జూన్ నెల 22వ తేదీ 7.700 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించారు. జూన్ నెల 23వ తేదీ 7.791 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగించారు. కోటా కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం ఉన్నప్పుడు కోతలు విధిస్తున్నారంటే అర్థం ఉంది. అలాంటిది కోటా కంటే తక్కువగానే విద్యుత్ వినియోగం ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం ఐదారు గంటల పాటు అనధికార కోతలు విధిస్తున్నారు. జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలోనే ప్రతి రోజూ రెండు, మూడు గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారంటే విద్యుత్ శాఖ గాడి తప్పిందనే చెప్పాలి. అధికారుల చేతిలో ఏమీ లేదు. పైనుంచి ఏవిధమైన ఆదేశాలు వస్తే ఆ విధంగా చేయాల్సిందే తప్ప సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయిలో జిల్లా విద్యుత్ శాఖ అధికారులు లేరు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే గగనమే మార్పిడి భారం వినియోగదారులపైనే గ్రామీణ ప్రాంతాల్లో ఐదారు రోజులకు పైగానే పడుతున్న వైనం పట్టణ ప్రాంతాల్లో కూడా మూడు రోజులు దాటాల్సిందే అడ్డగోలుగా అనధికారిక కోతలు వ్యవసాయానికి తొమ్మిది గంటలు సరఫరా కాక అవస్థలు స్మార్ట్ షాక్...వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్లను చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులకొట్టాలని పిలువునిచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అవే స్మార్ట్ మీటర్లు బిగించటం ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు, పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్లు బిగించటం పూర్తి కావస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు జిల్లాలో 16,109 స్మార్ట్ మీటర్లు బిగించాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 13,961 మీటర్లు బిగించారు. కమర్షియల్ స్మార్ట్ మీటర్లు జిల్లా వ్యాప్తంగా 84,751 బిగించాలని లక్ష్యంకాగా ఇప్పటి వరకు 70,208 బిగించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒంగోలు నగర పాలక సంస్థతో పాటు ‘‘అమృత్’’ మంచినీటి పథకాలు ఎక్కడైతే మంజూరు చేశారో ఆయా నగరాలు, పట్టణాల్లో కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఒంగోలు నగరంలో కూడా స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలుపెట్టారు. సమస్యలుంటే మా దృష్టికి తెండి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఒకటి, రెండు రోజుల్లో మారుస్తున్నాం. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. రెండు, మూడు నెలల గ్యాప్ తరువాత రైతులు వ్యవసాయ మోటార్లు స్టార్ట్ చేస్తున్నారు. కొంత గ్యాప్ తరువాత మోటార్లు వేసినప్పుడు సహజంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. అందుకే దాదాపు 500 ట్రాన్స్ఫార్మర్లు రిపేర్లు చేసి సిద్ధంగా ఉంచాం. రైతులకు కానీ, పట్టణాల్లో కానీ వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఇవ్వటానికి ఎలాంటి సమస్యలు లేవు. అలాంటి సమస్యలు ఉన్నా, విద్యుత్ సిబ్బంది ఇబ్బందులు పెట్టినా నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు. – కట్టా వెంకటేశ్వర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఏపీసీపీడీసీఎల్ -
మోదీ పాలనలో తీవ్ర నిర్బంధం
● సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ ఒంగోలు టౌన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశంలో తీవ్ర నిర్బంధం కొనసాగుతోందని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ విమర్శించారు. ఎమర్జన్సీ విధించి 50 ఏళ్లయిన సందర్భంగా ఎమర్జన్సీ నాడు–నేడు అనే అంశంపై స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు అధ్యక్షత వహించగా, రాంభూపాల్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే వారిని, మోదీని విమర్శించే వారిని ఉపా చట్టం కింద అరెస్టు చేసి ఆరు నెలలకుపైగా బెయిల్ రాకుండా నిర్బందిస్తున్నారని ఆరోపించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడితే దేశ ద్రోహం ముద్రలు వేసి దాడులు చేస్తున్నారని విమర్శించారు. న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రభిర్, స్టాన్ స్వామి ఉదంతాలను ఉదాహరించారు. రాజ్యాంగ హక్కులను కాలరాయడంతో పాటుగా రాజ్యాంగాన్నే మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో భిన్నమతాల సామరస్యానికి భిన్నంగా మత నియంతృత్వం కొనసాగాలని మోదీ కోరుకుంటున్నారని చెప్పారు. దేశ ప్రజలు స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సదస్సులో సీపీఎం నాయకులు కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, వై.సిద్దయ్య, ఏవీ పుల్లారావు పాల్గొన్నారు. -
ఆరుగురు జూదరుల అరెస్టు
మద్దిపాడు: మండలంలోని ఏడుగుండ్లపాడు, ఇనమనమెళ్లూరు గ్రామాల మధ్య కోడిపందేలు నిర్వహిస్తున్న వారిని ఆదివారం మద్దిపాడు పోలీసులు, యాంటీ గూండా స్క్వాడ్ సిబ్బంది పట్టుకున్నారు. పక్కాగా అందిన సమాచారంతో కోడిపందేల శిబిరంపై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.11,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. శిబిరం వద్ద ఉన్న 11 మోటార్ సైకిళ్లు, 11 సెల్ఫోన్లు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకుని మద్దిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన వారిని సోమవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్ఐ శివరామయ్య తెలిపారు. కోడి పందేల శిబిరంపై దాడి పామూరు: మండలంలోని వేర్వేరు గ్రామాల్లో కోడిపందేలు ఆడుతున్న, పేకాట ఆడుతున్న మొత్తం 22 మందిని ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.30,380 నగదు, 8 కోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై టి.కిషోర్బాబు తెలిపారు. మండలంలోని బుక్కాపురం సమీపంలోని పొలాల్లో కోడిపందాలు ఆడుతున్న 14 మందిని అరెస్ట్చేసి వారి వద్ద నుంచి 8 కోళ్లు, రూ.20,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రావిగుంటపల్లె సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్చేసి వారి వద్ద నుంచి రూ.10,680 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వారిపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిషోర్బాబు తెలిపారు. 22 మంది జూదరుల అరెస్టు 8 కోళ్లు, రూ.30,830 నగదు స్వాఽధీనం -
ఆవుల మందపై పెద్ద పులి దాడి
యర్రగొండపాలెం: మండలంలోని పాలుట్లలో పెద్ద పులి మరో సారి పశువులపై దాడి చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పెద్దపులి గిరిజన గూడెంలోకి జొరబడింది. పశువుల కొష్టంలోకి వెళ్లిన పెద్ద పులి అక్కడ ఉన్న రెండు ఆవులను తీవ్రంగా గాయపరచడంతో ఆ రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. జీవనాధారమైన ఆవులు మృతి చెందడంతో ఆ ఆవుల యజమాని కొడావత్ నానికే నాయక్ బోరున విలపించాడు. ఈ నెల 12న పెద్ద పులి పాలుట్లలోని పశువుల కొష్టంలోకి వెళ్లి దాదాపు రూ.70వేల విలువ చేసే రెండు ఎద్దులను హతమార్చింది. ఒకే నెలలో రెండు పర్యాయాలు పెద్దపులి పాలుట్లలో సంచరించి 4 పశువులను పొట్టన పెట్టుకోవడంతో ఆ గిరిజన గూడెం వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని పెద్దపులి బారి నుంచి కాపాడాలని గిరిజనులు కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్–1100ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలి పారు. ఈ మేరకు ఆమె ఆదివారం విడుదల చేసి న ప్రకటనలో కాల్ సెంటర్–1100 ద్వారా ప్రజ లు సమస్యలను ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోనవచ్చన్నారు. అర్జీదారులు ఆ నంబర్కు డయల్ చేసి, తమ సమస్యను విన్నవిస్తే ఆన్లైన్లోనే ఫిర్యాదు రిజిస్టర్ చేిసుకుంటుందని వివరించారు. ఆ సమస్యను సంబంధిత అధికారికి పంపి తద్వారా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు. జిల్లాలోని ప్రజలంతా కాల్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెండు ఆవులు మృతి భయాందోళనలో గిరిజనులు -
నిరుద్యోగులకు శాపం
కూటమి పాపం.. ఒంగోలు వన్టౌన్: నిరుద్యోగులను సీఎం చంద్రబాబు నిలువునా మోసం చేశారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు, మోసపూరిత మాటలతో మభ్యపెట్టారు. తమకు ఓట్లేసి గెలిపిస్తే భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అప్పటి వరకూ నిరుద్యోగ భృతిగా నెలకు రూ.3 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. నమ్మి ఓట్లేసిన వారిని అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారు. కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా, నిరుద్యోగ భృతి చెల్లించకపోగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందిన వారందరినీ తొలగించారు. రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులతో వేల మందిని నిరుద్యోగులుగా మార్చారు. వారి కుటుంబాలను రోడ్డున పడేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మొత్తం ఇలాంటి కుట్రలు, కుతంత్రాలతోనే సాగడం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. సూపర్ 6.. నిరుద్యోగ భృతికి మంగళం... ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాల గురించి కూటమి పార్టీల నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాటిలో ఒకటైన నిరుద్యోగ భృతి పథకం కింద ఉద్యోగాలు కల్పించేంత వరకూ నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.3 వేలు చెల్లిస్తామని చెప్పారు. అధికారం చేపట్టగానే అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. ఏడాది దాటినా నిరుద్యోగ భృతి గురించి సీఎం చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నాయకులెవరూ మాట్లాడటం లేదు. ఏడాది నుంచి ఎదురుచూసిన నిరుద్యోగులు ఇక నిరుద్యోగ భృతి లేనట్టేనంటూ పాలకుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తమను మరోసారి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వీరంతా నిరుద్యోగ భృతి కోసం ఏడాది నుంచి ఎదురుచూశారు. ప్రభుత్వం మాత్రం ఆ ఊసే ఎత్తకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు... కొత్త ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి లేకపోగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊడబీకింది. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని చెప్పి వారందరినీ పూర్తిగా తొలగించి ఉపాధి లేకుండా చేసింది. నూతన మద్యం పాలసీతో ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న ఉద్యోగులను రోడ్డున పడేసింది. రేషన్ షాపుల్లోనే బియ్యం, సరుకులు విధానం ద్వారా ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్ల పొట్టకొట్టింది. చివరకు పారిశుధ్య కార్మికులు, ఫ్యామిలీ ఫిజీషయన్లు, రేషన్ డీలర్లపై సైతం కక్ష సాధింపులు, వేధింపులకు పాల్పడుతూ ఉన్న ఉద్యోగాలు తొలగించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నియమించిన వారిని తొలగించాలనే కుట్రలతో పాటు కూటమి పార్టీల శ్రేణులకు దోచిపెట్టాలనే దురుద్దేశంతో అన్ని వ్యవస్థలనూ అతలాకుతలం చేస్తోంది. రాజకీయ కారణాలతో అవకాశం ఉన్న ప్రతి శాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను తీసివేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ నిరుద్యోగులతో చంద్రబాబు చెలగాటం ఈసారీ అదే తీరు ఏడాది పాలనలో కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా కల్పించని ప్రభుత్వం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు కూడా తొలగింపు నిరుద్యోగ భృతి పేరుతో నిలువునా మోసం జిల్లాలో 5 లక్షల మందికిపైగా బాధితులు 2014–19లోనూ జాబు రావాలంటే బాబు రావాలంటూ మోసం...సీఎం చంద్రబాబునాయుడు 2014–19లోనూ నిరుద్యోగులు, ఉద్యోగుల పట్ల ఇదేవిధంగా వ్యవహరించారు. ఆనాడు కూడా ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున హామీలిచ్చారు. 600కుపైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత నిరుద్యోగులను, ప్రజలను దారుణంగా మోసం చేశారు. జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చేంత వరకూ రూ.2 వేల నిరుద్యోగ భృతి అని అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా కల్లబొల్లి మాటలతో కాలం వెల్లదీశారు. మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు 2019 ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పారు. అయినప్పటికీ 2024లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో నిరుద్యోగులతో చంద్రబాబు మరోసారి చలగాటమాడారు. నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకుండా మోసం చేస్తున్నారు. నిరుద్యోగులంతా ఆందోళనలో ఉన్నారు సీఎం చంద్రబాబు గతంలో కూడా నిరుద్యోగులను మోసం చేశారు. 2014–19 పాలనలో నిరుద్యోగ భృతిగా రూ.2 వేలు చెల్లిస్తామని చెప్పారు. నాలుగున్నరేళ్లు పట్టించుకోలేదు. 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అతి కొద్దిమందికి మాత్రమే చెల్లించారు. ప్రస్తుతం రూ.3 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మళ్లీ పట్టించుకోవడం లేదు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఏడాది పాలనలో జిల్లాలో ఒక్క కొత్త ఉద్యోగం కూడా కల్పించలేదు. నిరుద్యోగ భృతి కూడా లేదు. ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అమలు చేయలేని అబద్ధపు హామీలు, మోసపూరిత మాటలతో చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారు. – ఎండీ ఇమ్రాన్ఖాన్, కార్పొరేటర్, ఒంగోలు -
జగనన్న పాలనలో మహిళలకే అగ్రపీఠం
యర్రగొండపాలెం: వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మహిళలకు అగ్రపీఠం వేశారని, వారికి ప్రాధాన్యత ఇచ్చి ఎంతో గౌరవించారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎంపికై న ఉడుముల అరుణ శ్రీనివాసరెడ్డిని ఆయన శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాల్లో మహిళల పాత్ర ముఖ్యమైందన్నారు. వారు ప్రతి విషయంలో చొరవచూపి ముందుకు కొనసాగుతుంటారని, అటువంటి మహిళలకు జగనన్న తన కేబినేట్లో ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. మంత్రివర్గంతో పాటు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులను సైతం ఎక్కువ భాగం మహిళలకే కేటాయించి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు పూర్తిగా మహిళల పేరుతోనే మంజూరు చేసి వారి గౌరవాన్ని ఇతోధికంగా పెంచారన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఎక్కడా గౌరవం లేకుండా పోయిందని, కీచక పర్వం పెచ్చరిల్లి పోతుందని విమర్శించారు. మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, దాడులు ఎక్కువ అయ్యాయని, బాలికలను సైతం వదలకుండా అన్ని విధాలుగా వారిపై దాడులు జరుగుతున్నా సీఎం చంద్రబాబు, పవన్కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ రెడ్బుక్ అమలు అంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడన్నారు. ప్రస్తుత పాలనలో మహిళలు తమ గళాన్ని వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై మహిళలు ఉద్యమించి పరిష్కరించుకోవాలని, అందుకు పార్టీతో పాటు తన అండదండలు ఉంటాయన్నారు. మహిళా విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎంపికై న అరుణమ్మ పదవులతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలు అందిస్తూ వచ్చారని కొనియాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పరుచుకునేందుకు, ప్రజల సమస్యలను పరిష్కరించుకోవటానికి మహిళలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి వర్గంలో, పార్టీ పదవుల్లో ప్రాధాన్యం కూటమి ప్రభుత్వంలో కీచక పర్వం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
మహిళలకు రాత్రివేళ డ్యూటీలు దుర్మార్గం
ఒంగోలు టౌన్: మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని, ఇది కార్మిక హక్కులపై దాడి చేయడమేనని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు అన్నారు. జూలై 9వ తేదీ దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో ఆదివారం స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటిని సాధించేందుకు సమ్మెలు చేసే అవకాశాన్ని కోల్పోతారని చెప్పారు. యూనియన్లు పెట్టుకునే హక్కుతో పాటు సమ్మె హక్కులను కూడా కోల్పోతారన్నారు. ఒకరోజు సమ్మె చేస్తే 8 రోజుల వేతనాన్ని కట్ చేయడం లాంటి క్రూర నిబంధనలను తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 8 గంటల పనిదినానికి తూట్లు పొడుస్తూ 10 గంటల పనిదినాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఓటీని 140 గంటలకు పెంచడం కార్మికుల మీద పాలకులు చేస్తున్న దాడిగా భావించాల్సి ఉంటుందన్నారు. ఒకవైపు కార్మికుల హక్కులను తుంగలో తొక్కుతూ.. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ మాట్లాడుతూ దేశంలోని అన్ని కార్మిక సంఘాలు విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు గత నాలుగేళ్లుగా పోరాటాలు చేస్తున్నాయని తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం దుర్మార్గమన్నారు. స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా పనిభారాన్ని పెంచుతున్నారని విమర్శించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత కల్పించకుండా స్కీం వర్కర్లచే పనులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం ఉల్లంఘిస్తున్నారని వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళా సంఘాలు, విద్యార్థి, యువజనులు లేబర్ కోడ్కు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఎంఎస్ సాయి, వెంకటరావు, శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసులు, పారా శ్రీనివాసులు, జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జూలై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు -
గురుకుల ఘోష
దర్శి(కురిచేడు): విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుకుల పాఠశాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా విద్యార్థులు భోజనం సక్రమంగా అందక గోడలు దూకి బయటకు వెళ్లి తినాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది దర్శి అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పరిస్థితి. ఈ పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో పర్యవేక్షణ లేకపోవడంతో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. . అమలు కాని మెనూ.. గురుకుల పాఠశాలలో మెనూ ఎప్పుడో మరిచిపోయారు. ఇష్టం వచ్చినట్లు విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు పాఠశాల గోడలు దూకి బయటకు వెళ్లి తిని వచ్చే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మొత్తం 600 మంది విద్యార్థులకు కేవలం 12 లీటర్ల పాలనే వినియోగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వారంలో రెండు రోజులు చికెన్ ఇవ్వాల్సి ఉండగా..నెలలో ఒకటి రెండు రోజు మాత్రమే తూతూమంత్రంగా పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. 70 కిలోల వరకు చికెన్ తీసుకురావాల్సి ఉండగా 35 కిలోలు తీసుకువచ్చి సరిపెడుతున్నారు. రోజూ ఇవ్వాల్సిన గుడ్లను వారంలో రెండు మూడు రోజులు మాత్రమే ఇస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం వండిన వంటలను రాత్రికి పెడుతున్నారని పలువురు విద్యార్థులు వాపోయారు. పట్టించుకునేదెవరు..? గురుకుల పాఠశాల పర్యవేక్షణ కోసం పాఠశాల ఆవరణలోనే ప్రిన్సిపాల్ కోసం ఒక భవనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రిన్సిపాల్ అందులోనే నివాసం ఉండి విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సి ఉంది. కానీ ఇక్కడ ఇన్చార్జి ప్రిన్సిపాల్గా ఉన్న వ్యక్తి సింగరాయకొండలో నివాసముంటూ ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటలకు వెళ్లిపోతుండటంతో పాఠశాలలో ఏం జరుగుతుందో పర్యవేక్షించే వారే కరువయ్యారు. దీంతో విద్యార్థులు పాఠశాలను వీడి బయటకు వెళ్లిపోతున్నారు. పాఠశాల గేటు పక్కన ఖాళీ మద్యం సీసాలు, తినుబండారాల ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. ఆటస్థలంలో విష సర్పాలు సంచరిస్తున్నా, పాఠశాల ఆవరణలోని కంపచెట్లను తొలగించి శుభ్రం చేయించకపోవడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాల ప్రహరీ కూలినా మరమ్మతులు చేయకపోవడంతో రాత్రిళ్లు పాఠశాల ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల కనీస పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గురుకుల పాఠశాలపై దృష్టి సారించి విద్యార్థుల ఇక్కట్లు తీర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దర్శి గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఇక్కట్లు మెనూ అమలు చేయకుండా పిల్లలను పస్తులు పెడుతున్న వైనం 600 మంది పిల్లలకు 12 లీటర్ల పాలు ఆకలి తట్టుకోలేక గోడ దూకి బయటకు వెళుతున్న విద్యార్థులు ప్రిన్సిపాల్ వైఖరిపై సర్వత్రా విమర్శలు -
ఎన్ఫోర్స్మెంట్ దాడులు
● జిల్లా వ్యాప్తంగా జేసీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ నేతృత్వంలో వివిధ విభాగాల అధికారులు శనివారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలోని అన్నీ ప్రభుత్వ శాఖలు కలిసికట్టుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, పౌరసరఫరాలు, ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రోలజీ, ఫైర్ డిపార్ట్మెంట్, రూరల్ వాటర్ సప్లయ్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్స్, రైస్ మిల్లులు, బాణసంచా గోడౌన్లు, వాటర్ ఆర్ఓ ప్లాంట్లు, హోటల్స్, బఫర్ గోడౌన్స్, సినిమా హాల్స్ తనిఖీ చేశారు. ఇప్పటి వరకు పెట్రోలు బంకులు 47, గ్యాస్ ఏజెన్సీలు–31, రేషన్ షాపులు–88, ఎంఎల్ఎస్ పాయింట్స్–10, రైస్ మిల్లులు–7, బాణసంచా గోడౌన్లు–5, వాటర్ ఆర్ఓ ప్లాంట్లు–26, ఆర్టీసీ బస్ స్టాండ్స్–5, సినిమా హాల్స్–9, హోటల్స్–2, బఫర్ గోడౌన్–1 తనిఖీ చేపట్టారు. మొత్తం 231 చోట్ల అధికారులు స్పెషల్ డ్రైవ్లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్తో పాటు మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, ఒంగోలు, కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారులు కె.లక్ష్మీప్రసన్న, జి.కేశవర్ధన్రెడ్డి, సహాయ సరఫరా అధికారి ఐ.పుల్లయ్య, జిలాలోని అందరు తహసీల్దార్లు, సివిల్ సప్లయీస్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ప్రత్యేక తనిఖీల్లో పాల్గొన్నారు. -
ఇంగ్లిష్ బోధించేందుకు దరఖాస్తు చేసుకోవాలి
నాగులుప్పలపాడు: మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో ఏపీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ బోధించేందుకు బీఈడీ, పీజీ అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కె.మాధవి తెలిపారు. పూర్తి వివరాలకు 87126 25043 నంబర్ను సంప్రదించాలని సూచించారు. విమానాల ల్యాండింగ్కు భూసేకరణ సింగరాయకొండ: విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని, ఇందుకోసం అవసరమైన భూసేకరణ చేపట్టాల్సి ఉందని, త్వరలో ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ జారీ అవుతుందని వెలుగొండ ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ కలెక్టర్ ఎం.శ్రీధర్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఆయన డిప్యూటీ తహసీల్దార్ టి.ప్రసాద్, సర్వేయర్ బ్రహ్మంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భూసేకరణకు సంబంధించి వారం రోజుల్లో విధివిధానాలు వస్తాయని, మార్కింగ్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ఇరువైపులా స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. అధికారులు మాట్లాడుతూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అభివృద్ధి పనులు త్వరలో చేపడతామని, ఇందుకోసం నిధులు కూడా మంజూరయ్యాయన్నారు. గతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ను ఎక్కడా వంకర లేకుండా నిర్మించాల్సి ఉండగా కొంతమేర వంకరగా నిర్మించడంతో రన్వేకు పనికిరాదని ఎయిర్ఫోర్స్ అధికారులు నిర్ణయించారని, ఇప్పుడు రన్వే వంకర సరి చేసేందుకు రోడ్డుకు ఇరువైపులా 6 మీటర్ల చొప్పున స్థల సేకరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అప్పుడు రన్వేను నిబంధనల ప్రకారం నిర్మిస్తామని వివరించారు. మార్కాపురం మీదుగా ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు మార్కాపురం: నాందేడ్ నుంచి తిరుపతి వరకూ మార్కాపురం మీదుగా ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును జూలై 4, 11, 18, 25 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మార్కాపురం పట్టణానికి చెందిన గుంటూరు డీఆర్ఈసీసీ మెంబర్ ఆర్కేజే నరసింహం తెలిపారు. ఈ రైలు నాందేడ్లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, నడికుడి, పిడుగురాళ్ల మీదుగా వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుతుందని వివరించారు. ఈ రైలు మార్కాపురం రోడ్ స్టేషన్కు వచ్చేసరికి తెల్లవారుజామున 3 గంటలు అవుతుందని, అదేరోజు మధ్యాహ్నం తిరుపతి చేరుతుందని తెలిపారు. మళ్లీ తిరిగి అదే రైలు మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి రాత్రి 9.30 గంటలకు మార్కాపురం చేరుతుందని చెప్పారు. ప్రస్తుతానికి ప్రతి శుక్రవారం తిరుపతి వెళ్లేందుకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని తిరుపతివెళ్లే వారు వినియోగించుకోవాలని కోరారు. ఇందులో ఏసీ టూటైర్, త్రీటైర్, స్లీపర్, జనరల్ బోగీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
కారు, ఆటో ఢీ
కొనకనమిట్ల: దైవ దర్శనానికి వెళ్తున్న కారు, ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం చెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఒంగోలు–గిద్దలూరు రహదారి మండలంలోని చినారికట్ల జంక్షన్ సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని ఓబులరెడ్డిపల్లికి చెందిన చెన్నయ్య తన ఆటోలో కాట్రగుంట, వెంగలపల్లి, గొట్లగట్టుకు చెందిన ప్రయాణిలను ఎక్కించుకుని పొదిలి వెళ్తున్నాడు. ఆటో చినారికట్ల జంక్షన్ సమీపంలోకి వచ్చే సరికి చీమకుర్తికి చెందిన శివ తన కారులో కుటుంబ సభ్యులతో కలిసి గిద్దలూరు దగ్గర ఉన్న నెమలిగుండ్ల రంగనాయకస్వామి గుడికి దైవదర్శనం కోసం వెళ్తున్నారు. ఆ క్రమంలో అదుపు తప్పిన కారు, ఆటో ఢీకొన్నాయి. ఆటో రోడ్డు మార్జిన్ పక్కన ఉన్న రాళ్ల గుట్టపై పడటంతో ఆటోలో ఉన్న కాట్రగుంట గ్రామానికి చెందిన మూడమంచు బాలయ్య (55) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాట్రగుంట పంచాయతీ వెంగళపల్లి గ్రామానికి చెందిన మోరా నారాయణమ్మ (55) తీవ్రంగా గాయపడగా మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అదే ఆటోలో ఉన్న నారాయణమ్మ భర్త ఆదినారాయణ కూడా గాయపడి పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఆటో తోలుతున్న చెన్నయ్య తీవ్రంగా గాయపడి పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. మృతి చెందిన బాలయ్యకు భార్య కొండమ్మ, నలుగురు పిల్లలు ఉన్నారు. మృతురాలు నారాయణమ్మకు భర్త ఆదినారాయణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన మిగిలిన ప్రయాణికులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కారులో ఉన్న వారు కూడా గాయపడగా వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రభాకర్రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం బాలయ్య, నారాయణమ్మ మృతదేహాలను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాట్రగుంట పంచాయతీలో కాట్రగుంట, వెంగళపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందటంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు దుర్మరణం ఎనిమిది మందికి గాయాలు -
వేధింపుల బదిలీలు..!
నాగులుప్పలపాడు: కూటమి ప్రభుత్వం, పాలకుల తీరుకు తాము ఏమాత్రం తీసిపోము అన్నట్లుగా జిల్లా పంచాయతీ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అవినీతి, అక్రమాలపై ప్రశ్నించిన వారిని లక్ష్యంగా చేసుకుని వేధించే విషయంలో కూటమి పాలకులు తానా అంటుంటే.. జిల్లా పంచాయతీ అధికారులు తందానా అంటున్నారు. బదిలీల పేరుతో పంచాయతీ కార్యదర్శులపై అధికారులు కక్ష సాధింపులకు పాల్పడటమే అందుకు నిదర్శనంగా ఉంది. పంచాయతీ కార్యదర్శుల సంఘ నాయకులుగా ఉండి జిల్లా పంచాయతీ కార్యాలయంలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించిన కార్యదర్శులను అధికారులు టార్గెట్ చేశారు. నిబంధనల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని సుదూర ప్రాంతాలకు వారిని బదిలీ చేసి వేధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మరీ... ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న బదిలీలకు సంబంధించిన నియమాలను పరిశీలిస్తే.. ఐదేళ్ల పాటు ఒకేచోట పనిచేసిన వారిని తప్పనిసరిగా వేరేచోటకు బదిలీ చేయాలి. లేకుంటే ఉద్యోగి పనిచేస్తున్న మండలం, అతని సొంత మండలం ఒకటే అయితే బదిలీ చేయాలి. కానీ, పంచాయతీ కార్యదర్శుల బదిలీల విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు ఈ నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. ప్రస్తుతం జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్న తరహాలో పంచాయతీ అధికారులు కూడా తమ మాట వినని పంచాయతీ కార్యదర్శులపై బదిలీల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. బదిలీలను తమకు అనుకూలంగా మార్చుకుని అడ్డగోలుగా కార్యదర్శులను బదిలీ చేస్తున్నారు. సంఘంలో పనిచేసిన వారే లక్ష్యంగా... జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘంలో పనిచేసిన వారిపై మరింతగా అధికారులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అక్రమాలపై గొంతెత్తడంతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో జరిగిన బదిలీల్లో జిల్లా పంచాయతీ కార్యాలయంలో తిష్ట వేసుకుని కూర్చుని బదిలీల్లో అవకతవకలకు పాల్పడి లక్షల్లో డబ్బు వసూలు చేసిన ఉద్యోగులపై కోర్టులకు వెళ్లడంతో సంబంధిత కార్యదర్శులను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కురిచేడు, నాగులుప్పలపాడు, అద్దంకి, మార్కాపురం ప్రాంతాల్లో పనిచేస్తున్న సుమారు 20 మంది పంచాయతీ కార్యదర్శులను ఆయా మండలాలు వారి సొంత మండలాలు కానప్పటికీ, ప్రస్తుతం వారు పనిచేస్తున్న మండలాలకు వచ్చి ఐదేళ్లు పూర్తికానప్పటికీ జిల్లా స్థాయి అధికారుల తప్పిదాలను ఎత్తి చూపడంతో పాటు గతంలో జరిగిన అడ్డగోలు బదిలీలు, పదోన్నతులు, అక్రమాలపై ఆధారాలతో కోర్టులకు వెళ్లారనే కారణంతో ప్రస్తుతం సుదూర ప్రాంతాలకు బదిలీ చేసి వేధిస్తున్నారు. కోర్టు కేసులకు సంబంధించి కలెక్టర్తో పాటు జిల్లా పంచాయతీ అధికారి కూడా స్పందించాల్సి ఉండటాన్ని అవమానకరంగా భావించిన జిల్లా అధికారులు.. సంబంధిత పంచాయతీ కార్యదర్శులను ఆయా మండలాల నుంచి దూరంగా బదిలీ చేయాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. పంచాయతీ కార్యదర్శుల లాగిన్లు ఆపివేయడంతో ఖాళీగా కనిపిస్తున్న పంచాయతీ వివరాలు బదిలీల పేరుతో పంచాయతీ కార్యదర్శులపై కక్ష సాధింపులు సంఘ నాయకులుగా పనిచేస్తూ డీపీవోలో అక్రమాలపై ప్రశ్నించిన వారిపై వేధింపులు నిబంధనలకు నీళ్లొదిలి సుదూర ప్రాంతాలకు పంచాయతీ కార్యదర్శుల బదిలీలు అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు కూటమి పాలనలో ప్రశ్నించిన వారిని హింసిస్తున్నారనడానికి మరో నిదర్శనం బదిలీల్లో పారదర్శకత లేదు పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో ఉన్నతాధికారులు నిబంధనలు పాటించడం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న మండలాల్లో పనిచేయడానికి అర్హత ఉన్నప్పటికీ బలవంతంగా బదిలీలు చేపట్టడం చాలా బాధాకరం. ఇప్పటికే ఈ అంశంపై కోర్టులకు కూడా వెళ్లాం. చట్టపరంగా తమకు న్యాయం జరిగేంత వరకు మా హక్కుల కోసం పోరాడతాం. – మెరుగోలు బెన్హర్, పంచాయతీ సెక్రటరీల సంఘ జిల్లా అధ్యక్షుడు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎంపీడీఓలకు పంపించి... టార్గెట్ చేసిన పంచాయతీ కార్యదర్శులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయాలనే ఆదేశాలను సంబంధిత మండలాల ఎంపీడీలకు వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపించినట్లు సమాచారం. తాము చెప్పిన కార్యదర్శులను తక్షణమే ఆయా మండలాల నుంచి బదిలీ చేయాలని నేరుగా జిల్లా పంచాయతీ అధికారే రంగంలోకి దిగి ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జిల్లా పంచాయతీ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను తాము ప్రశ్నించిన పాపానికి తమను బదిలీ చేసినట్లు చూపించి ప్రస్తుతం తాము పనిచేస్తున్న గ్రామ పంచాయతీలలో లాగిన్లు కూడా ఆపివేశారని సంబంధిత కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఇంత అవినీతి జరిగిన విషయం ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా వారిపై విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదుదారులపై జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని పలువురు కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే తమ విధులకు ఆటంకం కలిగిస్తూ లాగిన్లు ఆపడంతో పాటు తమకు ఆయా మండలాల్లో జీతాలు పెట్టొద్దని కూడా డీపీవో ఆదేశాలు జారీ చేశారని ఎంపీడీవోల ద్వారా తెలుసుకున్న బాధిత పంచాయతీ కార్యదర్శులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రకాశం వాసి దుర్మరణం
మదనపల్లె రూరల్: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ప్రకాశం జిల్లా వాసి దుర్మరణం చెందిన ఘటన శనివారం కర్ణాటక సరిహద్దులోని రాయల్పాడు సమీపంలో జరిగింది. ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లె పంచాయతీ ముర్గాని గ్రామానికి చెందిన ఎరుకులయ్య కుమారుడు పెద్దిరెడ్డి గారి పేరారెడ్డి (32) ద్విచక్ర వాహనంపై మదనపల్లె మీదుగా బెంగళూరు వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యంలోని కర్ణాటక సరిహద్దు రాయల్పాడు వద్ద ఎదురుగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పేరారెడ్డిని స్థానికుల సాయంతో రాయల్పాడు పోలీసులు మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. మృతుడి జేబులోని ఆధార్కార్డు, సెల్ఫోన్లోని నంబర్ల ఆధారంగా ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాయల్పాడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
కేంద్ర న్యాయశాఖలో కరవది విద్యార్థినికి ఇంటర్న్షిప్ అవకాశం
ఒంగోలు సిటీ: ఒంగోలు మండలంలోని కరవది గ్రామానికి చెందిన సత్యాల అంజనప్రియకు కేంద్ర న్యాయశాఖలో ఇంటర్న్షిప్కు అవకాశం దక్కింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో 5వ సంవత్సరం న్యాయ విద్య అభ్యసిస్తున్న అంజనప్రియ భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వశాఖకు చెందిన న్యాయ వ్యవహారాల విభాగం నిర్వహించిన జూలై–2025 ఇంటర్న్షిప్ ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. ఈ ఇంటర్న్షిప్ న్యాయమంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయమైన మెయిన్ సెక్రటేరియట్, శాస్త్రి భవన్, న్యూఢిల్లీలో జూలై 1 నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థినికి ఈ ఇంటర్న్షిప్ ద్వారా న్యాయ విధానాలపై ఆచరణాత్మక అవగాహన, అనుభవం పొందే అవకాశం లభించనుంది. దేశం మొత్తం మీద 50 మందినే ఎంపిక చేస్తారు. అసాధారణ రీతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నేరుగా పనిచేసే అరుదైన అవకాశం వస్తుందని, అలాంటి అవకాశం కరవది విద్యార్థినికి రావడం విశేషమని పలువురు అభినందించారు. -
పారిశుధ్యంపై కేంద్ర బృందం తనిఖీలు
చీమకుర్తి రూరల్: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ–2025 కార్యక్రమంలో భాగంగా మండలంలోని గుండువారిలక్ష్మీపురం గ్రామంలో శనివారం కేంద్ర బృంద సభ్యులైన జి.రవివర్మ, పుదీర్, సందీప్ పర్యటించారు. పారిశుధ్యం నిర్వహణ, మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలనడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎంపీడీఓ వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పారిశుధ్యం నిర్వహణపై సర్వే నిర్వహించి ఆయా పంచాయతీలకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టి.శాంతిప్రియ, ఖాజావలి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పురుగుమందు తాగి వృద్ధుడి ఆత్మహత్య గిద్దలూరు రూరల్: పురుగుమందు తాగి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పట్టణంలోని నల్లబండ బజారు శివారు మేకల నరవ ప్రాంతంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచర్ల మండలం పుల్లలచెరువు గ్రామానికి చెందిన నల్లబోతుల రంగయ్య (64) నాలుగు రోజుల క్రితం ఇంటి వద్ద తన పెద్ద కుమారుడితో ఘర్షణ పడి గిద్దలూరు వెళ్లాడు. అక్కడ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విగతజీవిగా పడి ఉన్న రంగయ్యను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రంగయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య గతంలోనే మరణించింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు టంగుటూరు: గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన సంఘటన మండలంలోని వల్లూరు గ్రామ పొలాల్లో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లూరు జాతీయ రహదారి సమీప పొలాల్లో గుర్తుతెలియని పురుషుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి 35 నుంచి 50 ఏళ్లు ఉండొచ్చు. ఒంటిపై బ్రౌన్ రంగు కలిగి ఉన్న ఫుల్ హాండ్స్ షర్ట్, నల్ల కాటన్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. షర్ట్ కాలర్ వద్ద ఒంగోలులోని కమల్ టైలర్స్ లేబుల్ ఉంది. గుర్తుపట్టిన వెంటనే టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు 91211 02137 నంబర్ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. రైలు కిందపడి వృద్ధుడి దుర్మరణం టంగుటూరు: ప్రమాదవశాత్తు రైలు కిందపడి వృద్ధుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన స్థానిక రైల్వేస్టేషన్లో శనివారం ఉదయం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జరుగుమల్లి గ్రామానికి చెందిన పిలిమి సుబ్బారెడ్డి (69) తన భార్య కమలమ్మతో కలిసి కావలిలో వైద్య చికిత్స కోసం బయల్దేరాడు. రైల్వేస్టేషన్లో రైలు ఎక్కేందుకు ప్లాట్ఫాం మారే ప్రయత్నం చేశారు. గూడ్స్ రైలు కింద నుంచి దూరి అవతలి ప్లాట్ఫాంకు వెళ్లే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా రైలు కదలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకు న్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చెరుకొని ప్రమాదానికి కారణాలు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. -
ఓటు లేని వారు ఓటు నమోదు చేసుకోవాలి
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా ఓటు హక్కు లేని వారు తప్పనిసరిగా తమ ఓటు నమోదు చేసుకోవాలని ఒంగోలు ఆర్డీఓ కే.లక్ష్మీ ప్రసన్న చెప్పారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు లేని వారు ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారు వెంటనే ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కోరారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారి ఓట్లు తొలగిస్తామన్నారు. ఒంగోలు నియోజకవర్గ ఓటర్ల జాబితా ఎటువంటి తప్పులు లేకుండా సరిచేస్తామని, చనిపోయిన వారి ఓట్లను తొలిగించాలని అధికారులను కోరారు. పోలింగ్ బూత్లలో సౌకర్యాలు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. సలహాలు సూచనలను పార్టీల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గంలో ఆధార్ అనుసంధానం ఎంత శాతం జరిగిందని, ఆధార్ అనుసంధానం చేసుకోని వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయని అడిగారు. ఒంగోలు నగరంలో డోర్ నంబర్ల సమస్య ఉందని, నగరంలోని అన్ని డివిజన్లలో డోర్ నంబర్లు లేవని, కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి పెద్ద సమస్యగా ఉందని, వెంటనే ఒంగోలు నగరంలో డోర్ నంబర్లు వేయించాలని కోరారు. గత రాజకీయ పార్టీల సమావేశాల్లో ఒంగోలు నగరంలో డోర్ నంబర్లు వేయిస్తామని డీఆర్ఓతో పాటు ఇతర రెవెన్యూ, నగర పాలక సంస్థ అధికారులు హామీ ఇచ్చారని, ఆ పని ఎంతవరకు వచ్చిందో చెప్పాలన్నారు. చనిపోయిన వారి ఓట్లు వెంటనే తొలిగించాలని, నగరంలో కొన్ని పోలింగ్ స్టేషన్ల ప్రైవేటు స్కూల్స్లో ఉన్నాయని, ఆయా స్కూల్ యాజమాన్యాలు వాటిని తొలగించాలని కోరుతున్నాయని, ఎన్నికల కమిషన్ ఆలోచించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్కు రిపోర్ట్ చేయాలని దామరాజు క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అండర్ 16 జిల్లా క్రికెట్ జట్టు ఇదే
ఒంగోలు: అండర్ 16 జిల్లా క్రికెట్ జట్టు జాబితాను జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21న స్థానిక మంగమూరు డొంకలోని ఏసీఏ సబ్ సెంటర్ నెట్స్లో నిర్వహించిన ప్రాథమిక ఎంపికకు 80 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారన్నారు. వారిలో 29 మందితో ప్రాబబుల్స్ను ఎంపిక చేశామని, వారికి బాపట్ల జిల్లా రావినూతల క్రికెట్ స్టేడియంలో ప్రాబబుల్స్ మ్యాచ్లు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారితో తుది జట్టును ఎంపిక చేశామన్నారు. ఎంపికై న క్రీడాజట్టు జూలై 3 నుంచి మంగళగిరి పేరేచర్లలో జరిగే అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఎంపిక ప్రక్రియను అధ్యక్షుడు నవీన్కుమార్, సంయుక్త కార్యదర్శి బచ్చు శ్రీనివాసరావు, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు బలరాం, కోచ్లు చంద్రశేఖర్, బాబూరావు పర్యవేక్షించారు. జట్టు: పి.సుమిత్ సందేశ్ (కెప్టెన్), ఆర్.హేమంత్రాయల్ (ఉపాధ్యక్షుడు), సీహెచ్ భవిష్, ఎస్.అభినవ్, టి.శశాంక్, డి.మార్టిన్, కె.రామ్చరణ్, ఐ.కుషీశ్వర్ శర్మ, ఎం.పృధ్వీరాజ్, ఎం.దిండు గణేష్ రామ్, సీహెచ్ సుప్రీత్, ఎం.సిద్దార్థ, జి.అరవింద్, కె.వైభవ్, జె.దినేష్, డి.కెల్విన్, స్టాండ్ బైలుగా బి.వినయ్, జి.జస్వంత్, బి.నిశాంత్, వి.రిషిక్ చక్రవర్తి. -
ఎయిడెడ్ విద్యార్థులకు వసతులు కల్పించాలి
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 135 ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే వెంకట్రావు, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రతి తరగతికి చెందిన విద్యార్థులు కూర్చునేందుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సమానంగా బెంచీలు, తరగతి గదులకు ఫ్యాన్లు, ఐఎఫ్ఎల్ ప్యానల్ టీవీలు, విద్యార్థులకు మంచినీటి వసతి కల్పించి ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చే ఆట వస్తువులు, పాఠశాల గ్రాంట్ విడుదల చేసి ఎయిడెడ్ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. షూటింగ్ చాంపియన్షిప్లో జిల్లా విద్యార్ధుల ప్రతిభ ఒంగోలు టౌన్: ఈ నెల 21వ తేదీ నుంచి 30 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరుగుతున్న 25వ షూటింగ్ చాంపియన్షిప్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 9 మంది రైఫిల్, ఇద్దరు పిస్టల్ షూటింగ్ విభాగాల్లో విజయం సాధించారు. తదుపరి అహ్మదాబాద్, త్రివేండ్రంలలో ఆగస్టులో జరిగే సౌత్జోన్ ప్రీ నేషనల్స్కు అర్హత సాధించారు. షేక్ సదా ఫాతిమా, గంధం ఉషశ్రీ, రేష్మ, సాయి భ్రమర, కె.హనూష, లక్షణ్య, షేక్ అజ్మల్ హుసేన్, సిద్దా ఆదిత్య, నల్లూరి సాయి మనీష్, చక్కా శ్రీమంలుత్ రైఫిల్ విభాగంలో, సత్యేంద్ర పయ్యావుల, కోడూరి వెంకట సాయి పిస్టల్ విభాగంలో అర్హత సాధించారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్ లక్ష్యంగా షూటింగ్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన స్కూలు యాజమాన్యానికి కోచ్, స్టేట్ రైఫిల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కమ్మ ఖాదర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సర్పంచుల సంఘ కన్వీనర్గా రామారావు యాదవ్ ఒంగోలు సబర్బన్: జిల్లా సర్పంచుల సంఘ కన్వీనర్గా బట్టు రామారావు యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా సర్పంచుల సంఘం కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రాచారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న పది నెలల కాలంలో సర్పంచుల సమస్యలపై స్పందించి, వాటి పరిష్కారం దిశగా పని చేయాలని నూతన కన్వీనర్కు సూచించారు. ఈ సందర్భంగా నూతన కన్వీనర్ బట్టు రామారావు యాదవ్ మాట్లాడుతూ తనపై ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. గ్రీన్ అంబాసిడర్ వేతనాలు ప్రభుత్వమే భరించాలి: గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే గ్రీన్ అంబాసిడర్ వేతనాలు గతంలోలా ప్రభుత్వమే భరించాలని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి, నూతన కమిటీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు నూతన కమిటీ కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను మర్యాద పూర్వకంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిశారు. శానిటేషన్ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల వేతనాల విషయంలో స్పందించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు లాజర్, ఎస్.మోహన్రెడ్డి, ప్రసాద్, పీ.మల్లీశ్వరి, పోశం సుమలత, సీహెచ్.విజయ, వీణ తదితరులు పాల్గొన్నారు. -
వేలం బహిష్కరించిన రైతులు
కనిగిరిరూరల్: అన్ని రకాల పొగాకు బేళ్లను కొనుగోలు చేయాలని, మార్కెఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని, నోబిడ్ లేకుండా తెచ్చిన బేళ్లన్నీ కొనుగోలు చేయాలని కోరుతూ శనివారం అలవలపాడు క్లస్టర్ పరిధిలోని రైతులు వేలం పాటను బహిష్కరించి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే అలవలపాడు క్లస్టర్ పరిధిలోని సుమారు 6 గ్రామాల రైతులు 644 పొగాకు బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. కనిష్ట ధర కేజీ రూ.150 ఇస్తున్నారని, బేళ్లను తిప్పి పంపకుండా అన్ని రకాల బేళ్లను పూర్తిగా సరైన ధర ఇచ్చి కొనుగోలు చేయాలని వేలం ప్రారంభంలో అధికారులను, బయ్యర్లను రైతులు కోరారు. దానికి వారు సమ్మతించలేదు. దీంతో రైతులు వేలాన్ని బహిష్కరించి గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు పిల్లి తిప్పారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయకుండా రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. రైతుల వద్ద గ్రేడ్ వన్ రకం మాత్రమే కొని మిగతా వాటిని ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాల వైఫల్యంపై తీవ్రంగా మండిపడ్డారు. బోర్డు సూపరింటెండెంట్ రైతుల పక్షాన లేకుండా వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బీ శ్రీను, ప్రతాప్, వెంకటేశ్వర్లు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కనిగిరి పొగాకు బోర్డు వద్దబైఠాయించి నిరసన -
న్యాయమైన సమస్యలు పరిష్కరించండి
ఒంగోలు సబర్బన్: గ్రామ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లు, కోర్కెలను తీర్చకపోతే సామూహిక సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లా కేంద్రం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం అసోసియేషన్ నాయకులు, పంచాయతీ కార్యదర్శులు మధ్యాహ్న భోజన విరామ సమయం నుంచి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఒకలా ఉంటే జిల్లాలోని పంచాయతీ అధికారుల తీరు మరీ దారుణంగా ఉందంటూ అసోసియేషన్ నాయకులు ధ్వజమెత్తారు. డీపీఓకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం.బెన్హర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ కమిషనర్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్లో చెత్త సేకరణ, క్లోరినేషన్ చేసేటప్పుడు పంచాయతీ కార్యదర్శులంతా ఉదయం 6 గంటలకే గ్రామ పంచాయతీలో దినపత్రికలు చేత పట్టుకొని ఫొటోలు దిగాలి అని చెప్పటం అత్యంత దారుణమన్నారు. పంచాయతీ కార్యదర్శులకు సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వడం లేదని, అధిక భాగం నివాసానికి దూరంగా 50 నుంచి 100 కిలో మీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీలో అన్నిరకాల సర్వేలు, స్వర్ణ పంచాయతీ పనులు, ఇంటి పన్నుల వసూళ్లు, యాప్, గ్రామ సచివాలయ సర్వేలు, రెవెన్యూ పనులు, గ్రామసభలు, సమావేశాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల విధులు, ప్రొటోకాల్ విధులు, ఇలా చాలా రకాల పనులు పంచాయతీ కార్యదర్శులు మాత్రమే చేస్తున్నారని చెప్పారు. పంచాయతీ కార్యదర్శుల ప్రాథమిక విధులైన పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు సక్రమంగా నిర్వహించేందుకు సరైన సిబ్బంది లేరని, తగిన వనరులు కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులందరూ ఉద్యోగ నిర్వహణలో విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు పారిశుధ్య కార్మికులను నియమించకుండా కేవలం రూ.6 వేల గ్రామ పంచాయతీల గ్రాంట్ నుంచి పారిశుధ్య కార్మికులకు చెల్లించాలనే ఆదేశాలు ఇచ్చారన్నారు. గ్రామాల్లో రూ.6 వేలకు చెత్త సేకరణ చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితిలో పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. దీనివల్ల వారు పని భారం తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చకపోతే సామూహిక సెలవులోకి వెళతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కె.వెంకట్రావు, పి.నాగేశ్వరరావు, బి.మల్లిఖార్జున రావు, కే.జ్యోత్న, పరాశరం, విజయపాల్తో పాటు పలువురు పాల్గొన్నారు. లేకుంటే సామూహిక సెలవుకు వెనకాడం గ్రామాల్లో పనిచేయటానికి తగినంత సిబ్బందిని ఇవ్వాలి కలెక్టరేట్ ముందు పంచాయతీ కార్యదర్శుల ధర్నా -
లో గ్రేడ్ పొగాకును రూ.20 వేలకు కొనుగోలు చేయాలి
ఒంగోలు టౌన్: పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, అన్నీ రకాల లో గ్రేడ్ పొగాకును క్వింటాలుకు రూ.20 వేలకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో శనివారం రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జజ్జూరి జయంతి బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ వర్జీనియా పొగాకు రేటు రోజురోజుకూ పడిపోతుందని చెప్పారు. మేలు రకం పొగాకు మాత్రమే కొంటామని చెబుతున్న కంపెనీలు లో గ్రేడ్ పొగాకును తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లో గ్రేడ్ సాకుతో తక్కువ రేటుకు కొనుగోలు చేయాలన్న కుట్రతోనే పొగాకును తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు. దీని వలన బ్యార్నీకి రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు నష్టపోతున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పొగాకు బోర్డు, ప్రభుత్వరంగ సంస్థలు వేలంలో పాల్గొని లో గ్రేడ్ పొగాకును రూ.20 వేల కు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్కే బాబు, పెంట్యాల హనుమంతరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, తిరుపతి రెడ్డి, ముప్పరాజు బ్రహ్మయ్య, నెల్లూరు నరసింహరావు, పిల్లి తిప్పారెడ్డి, ఊసన వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు
ఒంగోలు సబర్బన్: టిడ్కో ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి పి.నారాయణ తెలిపారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన కార్యకలాపాలపై సమీక్షించేందుకు శుక్రవారం ఆయన ఒంగోలు వచ్చారు. ప్రకాశం భవనంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి సమీక్షించారు. అనంతరం సంబంధిత వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. టిడ్కో ఇళ్లను 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణమైనవిగా మూడు కేటగిరీలుగా చేపట్టినట్లు చెప్పారు. వీటిలో 365, 430 చదరపు అడుగుల ఇళ్లను ముందుగా పూర్తిచేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో మరో 15 రోజుల్లో ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు నిర్మాణ పనులు చేపడతారని ఆయన వెల్లడించారు. ఒంగోలులో రోడ్డు విస్తరణ వలన నష్టపోయే వారికి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని ప్రకటించారు. సమీక్షలో మార్కాపురం ఎమ్మెల్యే కె.నారాయణరెడ్డి, ఒంగోలు నగర మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్కు అభినందనలు ఒంగోలు సబర్బన్: కలెక్టర్గా ఏడాది కాలం పూర్తి చేసుకున్న ఏ.తమీమ్ అన్సారియాను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో కలిసిన రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావు ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఉద్యోగులకు అండగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు. కలెక్టర్ను అభినందించిన వారిలో ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావుతో పాటు జిల్లా కోశాధికారి ఊతకోలు శ్రీనివాసరావు, కలెక్టరేట్ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, ప్రశాంత్, ఏపీ జేఏసీ ఉమెన్ వింగ్ చైర్మన్ జయలక్ష్మి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ నాగలక్ష్మి, కలెక్టరేట్ సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. ఒంగోలులో రోడ్డు విస్తరణలో నష్టపోయే వారికి టీడీఆర్ బాండ్స్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ ఏడాది కాలం పూర్తి చేసుకున్నందుకు అభినందించిన రెవెన్యూ అసోసియేషన్ నాయకులు -
క్రిటికల్ సర్జరీ.. కవలలు సురక్షితం
కంభం: నెలలు నిండక ముందే తీవ్ర రక్తస్రావంతో కంభంలోని సామాజిక ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన ఓ గర్భిణికి గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతిబాయి సర్జరీ చేసి కవల పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. గిద్దలూరు మండలం క్రిష్ణంశెట్టిపల్లి గ్రామానికి చెందిన జ్యోత్స్న అనే గర్భిణికి గురువారం అర్ధరాత్రి తర్వాత రక్తస్రావమవుతుండటంతో కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. ఆమె గర్భం దాల్చి 34 వారాలు నిండాయి. ప్రసవానికి ఇంకా ఆరు వారాల సమయం ఉంది. అయితే గురువారం రాత్రి ఒక్కసారిగా రక్తస్రావం కావడంతో ఆందోళన చెందిన ఆమె.. కుటుంబ సభ్యుల సహకారంతో ఆస్పత్రికి వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అనస్తీషియా వైద్యుడు శివనాయక్తో కలిసి గైనకాలజిస్టు సర్జరీ నిర్వహించారు. కవలలతోపాటు తల్లి క్షేమంగా ఉండటంతో వైద్యులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
పాత సామాను సొమ్ము స్వాహా..!
దర్శి (కురిచేడు): దర్శిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎస్.మాధవరావు వింతపోకడకు తెరలేపారు. ప్రభుత్వం సరఫరా చేసిన వస్తువులు మరమ్మతులకు గురైతే వాటిని ప్రభుత్వ అనుమతితో విక్రయించి వచ్చిన నగదుకు సంబంధించి ప్రభుత్వానికి లెక్కచెప్పాల్సి ఉంది. కానీ, గురుకులంలోని ఒక ఉద్యోగిని అడ్డం పెట్టుకుని గురుకుల పాఠశాలలో ఉన్న పాత ఇనుప సామగ్రి, మోటార్లు, పాత పెట్టెలు, పుస్తకాలు మొత్తం సుమారు 5 ఆటోల వరకు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అనుమతి లేకుండా మాధవరావు విక్రయించారు. వచ్చిన నగదును తన ఖాతాలో జమచేసుకుని స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీటి గురించి పాఠశాల అభివృద్ధి కమిటీకిగానీ, సొసైటీ పెద్దలకుగానీ తెలియజేయలేదని సమాచారం. పనికిరాని పాత సామగ్రినే కాకుండా పనికొచ్చే రెండు ట్రాలీలను కూడా విక్రయించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలకు వంట తయారు చేసేందుకు ఉపయోగించిన గిన్నెలను ట్రాలీపై ఉంచి నెట్టుకుని తీసుకెళ్లి అన్నం వడ్డించాలి. ఇందుకోసం పాఠశాలకు ట్రాలీలు సరఫరా చేశారు. వాటిలో రెండు ట్రాలీలను కూడా ఇన్చార్జి ప్రిన్సిపాల్ విక్రయించినట్లు సమాచారం. విద్యార్థులకు సీట్ల కేటాయింపు, తదితర విషయాల్లోనూ చేతివాటం... విద్యార్థులకు సీట్ల కేటాయింపులోనూ ఇన్చార్జి ప్రిన్సిపాల్ చేతివాటం ప్రదర్శించినట్లు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాడు–నేడు పనుల్లోనూ సరిగ్గా లెక్కలు చూపకుండా, పనిచేసిన వారికి కూలి ఇవ్వకుండా అటెండర్లు, తనకు అనుకూలమైన సిబ్బంది ఖాతాలకు నగదును ఇన్చార్జి ప్రిన్సిపాల్ బదిలీ చేసినట్లు కొందరు సిబ్బంది ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పెట్టాల్సిన చికెన్ కూడా సగం పెట్టి మిగతా సగానికి సంబంధించిన సొమ్ము స్వాహా చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. పాఠశాలలో విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యత లేకపోవడంతో తినలేక పడేస్తున్నారని, చద్దన్నం, రుచిలేని కూరలతో పెట్టడంతో కొంతమంది అనారోగ్యం పాలయ్యారని విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కొంతమంది విద్యార్థులను మచ్చిక చేసుకుని సొసైటీ వారు, జిల్లా ఉన్నతాధికారులు పరిశీలనకు వచ్చినప్పుడు వారితో ఎలా మాట్లాడాలో శిక్షణ ఇచ్చి తద్వారా పై అధికారుల వద్ద మార్కులు కొట్టేస్తున్నాడని సిబ్బంది, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో జరుగుతున్న అక్రమాలను విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న పాత్రికేయులు పాఠశాలను పరిశీలించేందుకు అనుమతి కోరగా, అవకతవకలు బయటపడతాయనే భయంతో నిరాకరించారు. పాఠశాలలో మరుగుదొడ్లను విద్యార్థులతో శుభ్రం చేయిస్తున్నారని తల్లిదండ్రులకు తెలియడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో అపరిశుభ్రత వలన అంటువ్యాధులు ప్రబలుతున్నా వైద్యపరీక్షలు చేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్పై గతంలో కలెక్టర్, డీసీఓకు కొందరు ఫిర్యాదు చేసినా అతని ప్రవర్తనలో మార్పురాలేదని, ఉన్నతాధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని సిబ్బంది తెలిపారు. సొసైటీ కార్యదర్శికి కూడా ఇటీవల ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇన్చార్జి ప్రిన్సిపాల్ అక్రమాలపై ఉన్నతాధికారులు విచారించి తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమ వద్ద ఉన్న ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తామని కొందరు సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవరావును వివరణ కోరేందుకు సాక్షి ఫోన్ చేయగా, ఆయన సమాధానం ఇవ్వలేదు. దర్శి గురుకుల విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపాల్ వింతపోకడ విద్యాలయంలోని పాత సామగ్రి విక్రయించగా వచ్చిన సొమ్ము కాజేసినట్లు ఆరోపణలు ముక్కున వేలేసుకుంటున్న సిబ్బంది -
బ్యాంకర్లు విరివిగా రుణాలివ్వాలి
ఒంగోలు సబర్బన్: రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహరించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని సమావేశం హాలులో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతులకు, అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, పీఎం సూర్యఘర్ యోజన పథకం లబ్ధిదారులకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.25,045.91 కోట్లుగా నిర్ణయించినట్లు చెప్పారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.20,591.18 కోట్లుగా నిర్ణయించగా, 2025 మార్చి 31వ తేదీ నాటికి రూ.25,444.91 కోట్ల రుణాలు అందజేశారన్నారు. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో పంట రుణాలకు సంబంధించి ఖరీఫ్లో రూ.4197.42 కోట్లు, రబీలో రూ.6040 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారన్నారు. జిల్లాలో పశు, మత్స్య సంపదను వృద్ధి చేసేలా రుణాలు అందజేయాలని కోరారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రమేష్, డీఆర్డీఏ, మెప్మా పీడీలు నారాయణ, శ్రీహరి, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాసులు, రవి కుమార్, శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున నాయక్, సీపీడీసీఎల్ ఎస్.ఈ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అన్ని జిల్లా బ్యాంకు కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి బ్యాంకుల రుణ లక్ష్యం రూ.25,045.91 కోట్లు బ్యాంకర్ల కమిటీ సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా -
కష్టజీవులకేది కనీస మర్యాద?
పొదిలి: రైతుల కష్టంపై వచ్చే ఆదాయంతో నిర్వహించే పొగాకు వేలం కేంద్రంలో ఆ కష్ట జీవులు కునుకు తీసేందుకు సరైన సౌకర్యం లేదు. పొదిలి వేలం కేంద్రానికి రోజూ 200 నుంచి 300 మంది రైతులు వస్తుంటారు. వేలానికి ముందు రోజు రాత్రే బేళ్లతో చేరుకునే రైతులు కునుకు తీసేందుకు ఆపసోపాలు పడాల్సిన దుస్థితి. నాపరాళ్ల అరుగులపై నడుం వాల్చేందుకు ఇష్టపడని రైతులు ఆరు బయట ఫ్లోరింగ్పై నిద్రకు ఉపక్రమిస్తున్నారు. కొందరు రైతులు కటిక నేలపై పడుకోలేక లాడ్జిలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది ఆ నాపరాళ్ల అరుగుల గదిని బీహార్ ముఠా కార్మికులకు అప్పగించడంతో స్థానిక రైతులు కునుకు తీసే అవకాశమే లేకుండా పోయింది. బోర్డు ఉన్నతాధికారులు, పాలకవర్గ సభ్యులు బస చేసేందుకు పరిపాలనా భవనంపై సర్వ హంగులతో అతిఽథి గృహం నిర్మించారు కానీ రైతులకు కనీస వసతి లేకుండా చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
రైతు కడుపు మండి..
మద్దిపాడు/కొండపి: గతేడాది వరకూ పొగాకు రైతుకు స్వర్ణయుగం. నాలుగేళ్లుగా లాభాలు చవిచూశారు. బోర్డు నిర్దేశించిన దాని కంటే అదనంగా సాగు చేసినా మంచి ధరలే వచ్చాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి మార్క్ఫెడ్ను రంగంలోకి దించి వ్యాపారుల ఆధిపత్యానికి గండికొట్టింది. ఇక తప్పకపోవడంతో పోటీలు పడి మరీ పొగాకు కొనుగోలు చేశారు. గతేడాది పొగాకు చరిత్రలో రికార్డు ధర కేజీకి రూ.366 పలికింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019 ముందు చరిత్ర పునావృతమైంది. కంపెనీలు రైతులను దగా చేయడం మొదలెట్టేశాయి. సాగు సమయంలో మీరు ఎంతైనా చేయండి అంటూ నమ్మబలికి కొనుగోలు సమయానికి అసలు స్వరూపాన్ని చూపించాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఆర్భాట ప్రకటనలకే పరిమితమవుతోంది. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామంటూ మాయమాటలు చెబుతోంది. గురువారం వెల్లంపల్లి, కొండపి మండలాల్లో రైతుల నిరసనలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. వేలాన్ని బహిష్కరించి రైతులు రోడ్డెక్కారు. వెల్లంపల్లి వేలం కేంద్రం పరిధిలోని రైతులు జాతీయ రహదారిపై మద్దిపాడు వద్ద రాస్తారోకో నిర్వహించగా, కొండపి వేలం కేంద్రం పరిధిలోని రైతులు కొండపి–టంగుటూరు రహదారిపై ఆందోళనకు దిగారు. ఆ వివరాలిలా ఉన్నాయి... మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రానికి ముండ్లమూరు క్లస్టర్ రైతులు గురువారం బేళ్లను తీసుకొచ్చారు. ధర పూర్తిగా తగ్గించి కొనుగోలు చేయడంతో పాటు ఎక్కువ శాతం నోబిడ్ కావడంతో రైతులు తీవ్ర స్థాయిలో అసంతృప్తికి గురయ్యారు. కంపెనీలన్నీ కుమ్మకై ్క ధరలు పూర్తిగా దిగ్గోయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోకి రూ.220 ఇస్తామని చెప్పిన కంపెనీలు.. రూ.180కి తగ్గించడం, ఆ తర్వాత రూ.160కి కొనుగోలు చేస్తామని చెప్పడం, చివరకు రూ.125కి కొనుగోలు చేయడంతో రైతులు వేలాన్ని బహిష్కరించారు. జాతీయ రహదారిపైకి చేరుకుని రాస్తారోకో చేశారు. పొగాకు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై రెండువైపులా ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో మద్దిపాడు పోలీసులు చేరుకుని రైతులను పక్కకు తరలించేందుకు ప్రయత్నించారు. తమకు న్యాయం జరిగేంత వరకూ జాతీయ రహదారిపైనే ఉంటామని రైతులు స్పష్టం చేయడంతో బోర్డు అధికారులతో పోలీసులు మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో ధర్నా విరమించి వేలం కేంద్రానికి చేరుకున్నారు. ఆర్ఎం లక్ష్మణరావుతో పొగాకు రైతు సంఘ నాయకులు అబ్బూరి శేషగిరిరావు, రామసుబ్బారెడ్డి, పల్లకి సత్యన్నారాయణరెడ్డి, పొగాకు రైతులు మాట్లాడారు. కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి తిరిగి వేలాన్ని ప్రారంభించారు. కానీ, కంపెనీల తీరు మారకపోవడం, ఐదు బేళ్లకుగానూ ఒకటి కొనుగోలు చేస్తూ మిగిలినవి నోబిడ్ చేస్తుండడంతో రైతులు మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. వేలాన్ని నిలిపివేయాలని గట్టిగా కేకలు వేయడంతో కంపెనీల బయ్యర్లు పక్కకు వెళ్లిపోయారు. కంపెనీలకు బోర్డు అధికారులు మద్దతుగా నిలుస్తున్నారంటూ రైతులు వాగ్వాదానికి దిగారు. ఈరోజు కొనని కంపెనీలు రేపైనా కొంటాయా అంటూ ఆర్ఎం మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడిన ఆర్ఎం, వేలం సూపరింటెండెంట్ సత్య శ్రీనివాస్లు వేలాన్ని నిలిపివేసి శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయలేదని... కొండపి పొగాకు వేలం కేంద్రానికి క్లస్టర్ పరిధిలోని జువ్విగుంట, అయ్యవారిపాలెం, తంగెళ్ల, జాళ్లపాలెం, పీరాపురం గ్రామాల రైతులు గురువారం వేలానికి పొగాకు బేళ్లు తీసుకొచ్చారు. ఆరు రౌండ్లు వేలానికి బ్రైట్ రకం పొగాకు బేళ్లను తీసుకొచ్చిన రైతులు.. అవి అయిపోవడంతో ఏడో రౌండ్లో లో గ్రేడ్ పొగాకు తీసుకొచ్చారు. లో గ్రేడ్ పొగాకును కనిష్ట ధర కేజీ రూ.160కి కూడా కొనుగోలు చేయకపోగా, బేళ్లను వ్యాపారులు తిరస్కరించడంతో వేలాన్ని బహిష్కరించి రైతులు ఆందోళనకు దిగారు. లో గ్రేడ్ పొగాకు బేళ్లను కూడా కొనుగోలు చేయాలంటూ వేలం కేంద్రం ఎదురుగా కొండపి–టంగుటూరు రహదారిపై బైఠాయించారు. ఇరువైపులా కిలోమీటర్ మేరకు వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు చేరుకున్నారు. ధర్నా విరమించాలని రైతులను కోరగా ససేమేరా అన్నారు. వేలం నిర్వహణ అధికారి జి.సునీల్ కుమార్, సిబ్బంది కలిసి రైతులతో చర్చల జరిపి లో గ్రేడ్ పొగాకు కూడా కొనుగోలు చేసే విధంగా బయ్యర్లతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వ్యాపారులు సిండికేటై ధరలు దిగ్గోస్తున్నారని ఆరోపించారు. సాగుచేసిన పొగాకులో 40 శాతం వరకు బ్రైట్ గ్రేడ్ పొగాకు పండిందని, ఇప్పటివరకు దానినే వేలానికి తీసుకొచ్చామని తెలిపారు. ఏడో రౌండ్ వేలానికి తమ వద్ద ఉన్న లో గ్రేడ్ పొగాకు తీసుకొచ్చామని, కానీ, కేజీ కనిష్ట ధర రూ.160 కూడా ఇవ్వకుండా వ్యాపారులు సిండికేట్గా మారి కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అప్పుల్లో కూరుకుపోయామని ఆవేదన చెందారు. ఏడో రౌండ్లో అయినా గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశిస్తే.. వచ్చిన బేళ్లను వ్యాపారులు తిరస్కరిస్తున్నారని వాపోయారు. గత ప్రభుత్వం ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ను రంగంలోకి దించి రైతులను ఆదుకుందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి రైతుల బాధలు పట్టడం లేదని విమర్శించారు. ధరలు తగ్గించేస్తూ నిలువు దోపిడీ ఈ సీజన్లో కనిష్ట ధర రూ.125 ఇలా అయితే ఆత్మహత్యలే గతి వెల్లంపల్లి, కొండపి కేంద్రాల్లో వేలం బహిష్కరించి రాస్తారోకోలు మద్దిపాడులోని జాతీయ రహదారిపై పొగాకు దహనం కొండపి–టంగుటూరు రహదారిపై ఆందోళన బోర్డు అధికారులు, కంపెనీల తీరుపై నిరసన రెండు చోట్లా భారీగా నిలిచిపోయిన వాహనాలుఆత్మహత్యలు చూడాల్సి వస్తుంది... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి ప్రభుత్వ రంగ సంస్థలతో పొగాకు కొనుగోలు చేయించి రైతులను ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందని పలువురు రైతులు హెచ్చరించారు. పచ్చాకు కూలీలకు, డ్రైవర్లకు నగదు ఇవ్వలేదని, వారు తమ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఏడో రౌండ్ వరకు వేచి చూడాలని వారిని బతిమిలాడుకున్నామన్నారు. ఏడో రౌండ్లో కూడా గిట్టుబాటు ధర లభించకపోవడంతో కూలీలకు, డ్రైవర్లకు ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు. లేబర్ యాక్ట్ కింద కేసులు పెడతామని వారు బెదిరిస్తున్నారన్నారు. పాలకులు ఇలాంటి దారుణ పరిస్థితులు తమకు కలిపిస్తున్నాయని వాపోయారు. ఇప్పటికై నా వారు పొగాకు రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘ జిల్లా నాయకులు గుల్లపల్లి వెంకట్రావు, రమణారెడ్డి, వెంకటరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత జిల్లాగా ప్రకాశం
ఒంగోలు టౌన్: డ్రగ్స్ రహితంగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దుకునేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్ నుంచి అద్దంకి బస్టాండు సెంటర్ వరకు భ్యారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 8 వేలమందికిపైగా విద్యార్థులు, యువకులు, వివిధ శాఖల ఉద్యోగులు హాజరయ్యారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసంగిస్తూ దేశానికి సంపద వంటి యువత డ్రగ్స్కు బానిసలుగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రతిన పూనాలన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని విద్యార్థులు, యువకులకు సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని చెప్పారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రసంగిస్తూ సరదాగా మత్తుపదార్థాలు వాడి ఆ తర్వాత వాటికి అలవాటైపోతున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఒకసారి డ్రగ్స్ వినియోగానికి అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని, చివరికి జైలుకు వెళ్లడం, ఉద్యోగావకాశాలు కోల్పోవడం దాకా పరిస్థితులు తీసుకెళ్తాయని చెప్పారు. పాస్ పోర్ట్లు, వీసాల వంటివి రావని, సమాజంలో గౌరవం కోల్పోతారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వాడకూడదని సూచించారు. రానున్న రోజుల్లో ప్రతి పాఠశాల, కళాశాలల్లో కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే దుష్ఫలితాలు వివరించేలా పెద్ద ఎత్తును అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారిని డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించడం జరుగుతుందన్నారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణ, గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం ఐజీ నేతృత్వంలో ప్రతి జిల్లాలో 30 మందితో ఈగిల్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటి వరకు 41 కేసులు నమోదు చేసి 220 మందిని గుర్తించి జైలుకు పంపించడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారి ప్రవర్తనలో మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్పై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972, స్థానిక పోలీసులు, డయల్ 112, పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఈఎస్ షేక్ ఆయేషా బేగం, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్, డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, నాగరాజు, రమణ కుమార్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగంపై కష్టనష్టాలను వివరిస్తూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం -
అబద్ధాలు చెప్పడం బాబుకు అలవాటు
ఒంగోలు సిటీ: అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటని, ఏడాదిలో ఏం చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది అని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జనాలను ఉద్ధరించానని చెప్పుకోవడానికి ఒక్క పథకం అయినా ఉందా అని ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెబితే బాగుండేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతుల కోసం జిల్లా పర్యటనకు వచ్చి ప్రభుత్వాన్ని నిద్ర లేపారని, దీంతో కేంద్రమంత్రి పీయూష్గోయల్, కేంద్ర మంత్రి కార్యదర్శులు ఒంగోలు పొగాకు బోర్డుకు దిగివచ్చి సమావేశాలు పెట్టి పొగాకు కొనుగోలు చేస్తామని చెప్పారన్నారు. కానీ ఇంత వరకు పొగాకు రైతులకు ఒనగూరిన ప్రయోజనం ఏంలేదన్నారు. లోగ్రేడ్ పొగాకును కేంద్ర ప్రభుత్వం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం వేసుకొని కొనుగోలు చేస్తామని చెప్పారని, కానీ ఇంత వరకు మార్కెట్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చిన్న చిన్న సంఘటనలను పెద్దవి చేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డికి వస్తున్న లక్షలాది ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక ఇటువంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. ఓ పక్క చంద్రబాబు, పవన్కల్యాణ్లు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ మరో పక్క మాపైనే నిందలు వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, పవన్కళ్యాణ్ మాట్లాడే భాషలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. గంజాయి విచ్చలవిడిగా రవాణా అవుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. గంజాయి మత్తులో బ్యాచ్ ఒక సీఐపై దాడి చేశారని, ఇళ్ల మీదకు వెళ్లి ఆడపిల్లలపై దాడి చేస్తున్నారని, ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. గంజాయి అమ్మినవాడిని పట్టుకుంటే ఎవరు సరఫరా చేస్తున్నారో తెలియదా.. పోలీసులు తలుచుకుంటే ఎంత పని అన్నారు. టీడీపీ వారే గంజాయి వ్యాపారం చేస్తున్నారని, అందుకే పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఇమ్రాన్ఖాన్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు -
సచివాలయ ఉద్యోగుల ఆందోళన
మార్కాపురం టౌన్: విధులకు హాజరైనా మున్సిపల్ కమిషనర్ జీతాలు కట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, న్యాయం చేయాలని పట్టణ పరిధిలోని వార్డు సచివాలయ ఉద్యోగులు గురువారం సబ్కలెక్టర్ త్రివినాగ్కు వినతిపత్రం అందచేశారు. విధులకు హాజరైనా జీతాలు కట్ చేయడం శోచనీయమన్నారు. ఇలా అయితే తామెలా ఉద్యోగాలు చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. వేతనాలు ఎందుకు కట్చేశారని కమిషనర్ను అడిగితే నో వర్క్..నో పే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం సమంజసం కాదని వారు సబ్కలెక్టర్కు తెలిపారు. సచివాలయ ఉద్యోగుల అరియర్స్, బిల్లులపై సంతకాలు చేసేందుకు బిల్లును బట్టి తమకు పర్సంటేజీలు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న గుమస్తా డిమాండ్ చేయడాన్ని సబ్కలెక్టర్ ఎదుట ఉద్యోగులు వాపోయారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మార్కాపురం మున్సిపల్ కమిషనర్ సిబ్బందిపై నిరంకుశధోరణితో వ్యవహరిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. మే నెలలో కొన్ని సచివాలయాల్లో పనిచేస్తున్న వీఆర్ఓలకు జీతాలు తగ్గించారన్నారు. విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. -
గంజాయి కట్టడికి చర్యలు
ఒంగోలు టౌన్: గంజాయి కట్టడి విషయంలో నిర్లక్ష్యం వద్దని, గంజాయి అరికట్టేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో గురువారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న హత్య, పోక్సో, లైంగిక దాడులు, ఆర్థిక నేరాలు, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలతో పాటుగా పెండింగ్ కేసులు, ఎన్ఫోర్సుమెంట్ విషయాలపై సమీక్షించారు. పోలీస్స్టేషన్ల వారీగా కేసుల నమోదు, నిందితుల అరెస్టు, విచారణకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల సేవించడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలన్నారు. గంజాయి వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాలు ఎక్కువైపోతున్న క్రమంలో ప్రజలు సైబర్ నేరాల బారిన పడి నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో సైబర్ నేరాలపై అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. చోరీ కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు, సొత్తు రికవరీకి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. దొంగతనాలు, దోపీడీలపై గట్టి నిఘా వేయాలని, నైట్ బీట్స్ బలోపేతం చేయాలని, నిత్యం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా పాత నేరస్తులు, చెడు నలత కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ సైన్ బోర్డులు, బారికేడ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. యాక్సిడెంట్కు సంబందిచిన ఎఫ్ఏఆర్, ఐఏఆర్, డీఏఆర్ రిపోర్టులను నిర్ణీత కాలవ్యవధిలో ఎంఏసీటీ కోర్టుకు పంపించాలని, విస్తృతంగా ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించాలన్నారు. పోక్సో కేసులపై కాలేజీలు, పాఠశాలలో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని, పిల్లలకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ల గురించి అవగాహన కల్పించాలన్నారు. రానున్న లోక్అదాలత్లో వీలైనంత ఎక్కువ కేసులను రాజీ చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు. పోలీసు అధికారులు , సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరించాలని, అంకితభావంతో పనిచేయాలని చెప్పారు. సమర్ధవంతమైన సేవల ద్వారా పోలీసు శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. నేర సమీక్షలో డీఎస్పీలు నాగరాజు, లక్ష్మీ నారాయణ, రమణ కుమార్, డీసీఆర్బి సీఐ దేవ ప్రభాకర్, ఐటీకోర్ సీఐ సూర్యనారాయణ, ఎస్సీ ఎస్టీ సెల్ సీఐ దుర్గా ప్రసాద్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ -
ఆగని పచ్చమూకల ఆగడాలు
మర్రిపూడి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో ఆ పార్టీ నేతల దౌర్జన్యాలు శృతిమించుతున్నాయి. గ్రామ కంఠ భూమిని తెలుగుదేశం సానుభూతిపరులు యథేచ్ఛగా ఆక్రమించి శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వెంకటకృష్ణాపురం సర్వే నంబర్ 15లో 9.92 ఎకరాల గ్రామకంఠం భూమి ఉంది. అందులో 0.51 సెంట్ల భూమిలో అదే గ్రామానికి చెందిన బొట్లగుంట సత్యన్నారాయణ, బొట్లగుంట వెంకట కృష్ణయ్య కుమారులు శ్రీను, తిరుపాలు కొన్ని దశాబ్దాలుగా గడ్డివాములు, పశువులు, గేదెలను మేపుకుంటూ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కొండూరి వెంకటేశ్వర్లు కుమారుడు శ్రీను గ్రామకంఠాన్ని ఆక్రమించి శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్నాడు. ఆ గ్రామ కంఠం భూమిపై టీడీపీ శ్రేణుల కన్ను పడిందని, ఆక్రమించేందుకు గుంటలు తీస్తున్న తురుణంలో ఈ నెల 16న గ్రామకంఠంస్వాహా అనే శీర్షికను సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. అయినా అధికారులు, పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరించారు. ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతగురువారం గ్రామ కంఠం భూమిలో శాశ్వత కట్టడాలు నిర్మించేందుకు పిల్లర్లు తీసి అడ్డబీములు సైతం వేస్తున్నారు. పిల్లర్లు, అడ్డబీములు పోసేందుకు గ్రామంలో కూలీలు ఎవరు రాకపోవడంతో పక్క ప్రాంతాల నుంచి కూలీలను పిలిపించారు. అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారన్న విషయం తెలుసుకున్న హక్కుదారులు అక్రమ కట్టడాలను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టుకోవడంతో మహిళ కింద పడిపోయింది. ఈ పరిస్థితుల్లో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా అధికారులెవ్వరూ ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తరాల నుంచి అనుభవిస్తున్న నా భూమిని కొండూరి వెంకటేశ్వర్లు, కొండూరి శ్రీనులు దౌర్జన్యంగా ఆక్రమించి అక్రమ కట్టడాలు కడుతున్నారని, విచారించి తగు న్యాయం చేయాలంటూ వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన బొట్లగుంట శ్రీను తహసీల్దార్ బి.జనార్ద్కు వినతిపత్రం అందజేశారు. గ్రామ కంఠాన్ని ఆక్రమించి శాశ్వత కట్టడాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని తహసీల్దార్కు బాధితుల ఫిర్యాదు అధికారం అండగా పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. ఆ మూకల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అన్నీ తెలిసినా అధికారులెవ్వరూ వారి దౌర్జన్యాలకు అడ్డుకోలేకపోతున్నారు. మండలంలోని వెంకటకృష్ణాపురంలో గ్రామకంఠం భూములే ఇందుకు ఉదాహరణ. గ్రామకంఠం భూములు ఆక్రమించి శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్నా అధికారులెవ్వరూ ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. -
సాయం చేసేవారిని గుర్తించాలి
ఒంగోలు సబర్బన్: పీ–4 సర్వేలో గుర్తించిన కుటుంబాలకు సాయం చేసేవారిని సంప్రదించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ప్రకాశం భవనం నుంచి మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కనిగిరి ఆర్డీవో కేశవర్దన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా హోదాతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్నవారంతా బంగారు కుటుంబాలను (పీ–4 సర్వేలో తేల్చిన కుటుంబాలు) దత్తత తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సదరు ఉద్యోగి, అధికారి బదిలీ అయినప్పటికీ ఆ హోదాలోకి వచ్చినవారు ఆయా కుటుంబాల యోగక్షేమాలను పర్యవేక్షించాల్సి ఉంటుందని తెలిపారు. వెట్టి చాకీరి నుంచి విముక్తి పొందిన కుటుంబాలను తాను దత్తత తీసుకుని ఈ పథకం కింద వారికి తాను మార్గదర్శిగా ఉండాలని నిర్ణయించుకున్నానని కలెక్టర్ వెల్లడించారు. మార్గదర్శిగా ఉండటంలోనూ, మార్గదర్శకులను గుర్తించడంలోనూ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 74 వేలకుపైగా బంగారు కుటుంబాలను ప్రాథమికంగా గుర్తించామన్నారు. వీరి అవసరాలను గుర్తించడంతోపాటు వాటిని సమకూర్చి ఆయా కుటుంబాలకు అండగా ఉండే మార్గదర్శకులను కూడా త్వరగా గుర్తించాలన్నారు. సహాయం చేసేందుకు ముందుకు వచ్చే ఎన్ఆర్ఐలు, ఇతర ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించాలన్నారు. ఎన్ని కుటుంబాలనైనా దత్తత తీసుకోవచ్చని, బంగారు కుటుంబం, మార్గదర్శకుల వివరాలను వెబ్సైట్లో ఏ విధంగా నమోదు చేయాలో జెడ్పీ సీఈవో చిరంజీవి వివరించారు. వీడియో కాన్ఫరెన్సులో డీఆర్ఓ బి.చినఓబులేసు, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, డీఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ ఎస్.శ్రీనివాస నాయక్, డీఎస్ఓ పద్మశ్రీ, ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, డీఆర్డీఏ పీడీ నారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకర్రావు, జిల్లా బీసీ సక్షేమ అధికారి నిర్మల జ్యోతి, గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పీ–4 పథకానికి ఎన్ఆర్ఐలు, ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించాలి మార్గదర్శకులను గుర్తించడంలో అధికారులు వేగం పెంచాలి అధికారులు కూడా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి కలెక్టర్ తమీమ్ అన్సారియా -
కలల సాకారానికి చదువే మార్గం
పుల్లలచెరువు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. మండలంలోని నరజాములతండాలో గురువారం పర్యటించి పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉన్న మౌలిక వసుతులు, విద్యార్థులకు అందచేసిన కిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల నోట్పుస్తకాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అధునిక పద్ధతిలో బోధన చేయాలని సూచించారు. ప్రస్తుతం విద్యార్థుల భవిష్యత్కు చక్కటి అవకాశాలు ఉన్నాయని, కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు సులభ మార్గాలు ఉన్నాయని సూచించారు. ప్రతి విద్యార్థి కలలు కని, వాటిని నిజం చేసుకోవాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. ప్రతి రోజు విద్యార్థులను పాఠశాలలకు పంపేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. సబ్కలెక్టర్ వెంకట త్రివినాగ్, డీఎఫ్ఓ సందీప్కృపాకర్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, సర్పంచ్ బాలునాయక్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ -
అరకొర వసతులతో కౌన్సెలింగ్
ిసంగరాయకొండ: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకు స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్కు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. అయితే వందల సంఖ్యలో వచ్చిన వారికి సరైన వసతులు కల్పించడంలో గురుకుల పాఠశాల యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యవైఖరి అవలంబించారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. వచ్చిన వారి కోసం చాలీచాలని షామియానా వేశారు. కనీసం కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో చెట్ల కింద పడిగాపులు కాయాల్సి వచ్చింది. పాఠశాలలో తరగతి గదులు ఖాళీగా ఉన్నా ఆ గదుల్లో వసతులు కల్పించకుండా ఎండకు వదిలేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బందులు పడిన విద్యార్థులు, తల్లిదండ్రులు -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక
ఒంగోలు: ఫెన్సింగ్ రాష్ట్రస్థాయి పోటీలకు పలువురు క్రీడాకారులు ఎంపికయ్యారు. స్థానిక మినీ స్టేడియంలో గురువారం అండర్ 10, అండర్ 12 విభాగాల్లో ఎంపిక ప్రక్రియ జరిగింది. బి.వెంకట సౌమ్య, డి.షణ్ముక ప్రియ, ఉజ్జయిని అల్లం, సీహెచ్ జైత్ర, డి.చరణ్ సాయి ఫణీశ్వర్, టి.వెంకట అలితేష్ చౌదరి ఎంపికై నట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు, కోచ్ రాజు, జి.అనీల్లను ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కూనపరెడ్డి శివశంకర్ అభినందించారు. చెక్బౌన్స్ కేసులో జైలుశిక్ష ఒంగోలు: చెక్ బౌన్స్ కేసులో 6 నెలల జైలుశిక్ష విధిస్తూ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి షేక్ రోషన్ గురువారం తీర్పునిచ్చారు. కుటుంబ అవసరాల నిమిత్తం టి.ఎలిజబెత్ రాణి అనే మహిళ 2014లో తన వద్ద రూ.5 లక్షలు తీసుకున్నారని, బాకీ చెల్లింపు నిమిత్తం 2017లో రూ.6.20 లక్షలకు తనకు చెక్కు ఇచ్చినట్లు జె.రమేష్బాబు న్యాయస్థానంలో ఫిర్యాదుచేశారు. కేసు పూర్వాపరాలను విచారించిన న్యాయమూర్తి నిందితురాలు ఎలిజెబెత్ రాణిపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ ఆరు నెలల జైలుశిక్ష, రూ.7.10 లక్షల పరిహారం, జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చారు. 194 మద్యం బాటిళ్లు స్వాధీనం కంభం: మండలంలోని తురిమెళ్ల గ్రామంలోని బెల్టుషాపులపై గురువారం ఎకై ్సజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాడిలో రాజేంద్ర అనే వ్యక్తి వద్ద 194 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ కొండారెడ్డి తెలిపారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి సదరు వ్యక్తిని గిద్దలూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచామన్నారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సిబ్బంది రంగనాయకులు, శివాజీ, బాష, షంషీర్, రాజగోపాల్ పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు
ఒంగోలు టౌన్: కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరక విధానాలపై పోరాటం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ వర్కర్స్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో గురువారం ఫెడరేషన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 9వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానలను అవలంబిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయిందని, కార్మికులకు 10 గంటల పనిదినాలను ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. మహిళల హక్కులకు భంగం కల్పిస్తూ రాత్రి వేళల్లో డ్యూటీలు వేయడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదని, దీన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని కోరారు. బ్రిటీష్ కాలం నుంచి అమలవుతున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ను అమల్లోకి తీసుకురావడం ద్వారా కార్మికుల శ్రమశక్తిని కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా చేస్తుందని విమర్శించారు. టి. విజయమ్మ, కె. పద్మ, అనిత, సుబ్బరాయుడు, ఆర్.శ్రీనివాసరావు, పోకల కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
కలెక్టర్ను అభినందించిన ఎన్జీఓ నాయకులు
ఒంగోలు సబర్బన్: జిల్లా కలెక్టర్గా ఏ.తమిమ్ అన్సారియా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో కలిసిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.శరత్బాబు, కార్యదర్శి ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కె.శరత్బాబు బంగారు బాల్యం కార్యక్రమానికి స్కొచ్ అవార్డ్ సాధించి దేశంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారని, భవిష్యత్లో కూడా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తారన్నారు. కార్యక్రమంలో ఒంగోలు పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి మంజేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు పి.రామాంజనేయులు, సంయుక్త కార్యదర్శి షేక్ మోమిన్, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి.మాధవి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కె.కోటేశ్వరమ్మ, ఒంగోలు పట్టణ ఉపాధ్యక్షులు షేక్ కరీముల్లా, వి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
● ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి ఒంగోలు టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోందని, రాబోయో సంవత్సర కాలంలోనైనా పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి కోరారు. ఒంగోలు దక్షిణ బైపాస్లోని విష్ణుప్రియ కన్వెన్షన్ హాలులో బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) 36వ రాష్ట్ర మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల వేతన సవరణ చట్టం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వేతన సవరణ జరిగి 15 ఏళ్లు అవుతోందని, దీనిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరారు. సభకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. తొలుత ప్రకాశం భవన్ నుంచి విష్టుప్రియ కన్వెన్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఐజేయూ జనరల్ సెక్రటరీ బల్వీందర్ సింగ్ జమ్ము, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్ఎన్ సిన్హా, జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, నాయకులు సుబ్బారావు పాల్గొన్నారు. -
చంద్రబాబు మోసాన్ని ఎండగట్టాలి
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం హామీలు విస్మరించి మోసగిస్తున్న తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఏడాది పరిపాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి ఎంత నష్టం జరిగింది, ఇక మీదట జరగబోయే నష్టం ఎంత? వైఎస్సార్ సీపీ అధికారంలో ఉంటే ఎంత మేర లబ్ధి చేకూరేదో వివరిస్తూ కూటమి మేనిఫెస్టోను రీకాల్ చేయాలని సూచించారు. -
అమ్మనబ్రోలులో పోలీసుల సోదాలు
ఒంగోలు టౌన్/నాగులుప్పలపాడు: రాష్ట్రంలో సంచలనం సష్టించిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మొదటి రోజు మంగళవారం కొప్పోలులో బొర్లగుంట వినోద్కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు బుధవారం రెండో రోజు అమ్మనబ్రోలులోని ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి ఇంట్లో సోదాలు నిర్వహించారు. నాగులప్పలపాడు ఎస్సై షేక్ రజియా సుల్తానా, సంతనూతలపాడు ఎస్సై అజయ్కుమార్తో కలిసి ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అమ్మనబ్రోలులోని ఆళ్ల సాంబశివరావు ఇంటికి వచ్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముప్ప సురేష్ను పోలీసులు ప్రధాన నిందితుడని చెబుతున్నారు. ముప్ప సురేష్కు స్వయాన మేనమామ సాంబశివరావు ఇంట్లో ముద్దాయిలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రామిసరీ నోట్లు, ఇతరా కీలకమైన పత్రాలు, ఖాతాల వివరాలు, బ్యాంకు స్టేట్మెంట్లను పరిశీలించారు. అలాగే ముప్ప సురేష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను విచారించారు. మరో రెండు రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుంది. 27వ తేదీ సాయంత్రంతో నిందితుల పోలీసు కస్టడీ ముగియనుంది. ఇదిలా ఉండగా ముప్ప సురేష్ ఉన్నత న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదా పడినట్లు సమాచారం. మరింత బాధ్యతగా విధులు నిర్వహించాలి ● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: పదోన్నతి పొందిన ఉద్యోగులు మరింత బాధ్యతగా విధులు నిర్వహించి పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా వ్యవహరించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ చాంబర్లో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు విభాగానికి చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా, నలుగురు ఏఎస్లకు ఎస్ఐలుగా పదోన్నతి ఉత్తర్వులు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ ప్రజలు పోలీసులపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలని, ఉన్నతాధికారులు మన్ననలు పొందాలని చెప్పారు. వివిధ ఫిర్యాదులతో పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితులకు అండగా నిలబడాలని, విధి నిర్వాహణలో శాఖాపరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఏవో రామ్మోహన్రావు, ఏఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, డీపీఓ సిబ్బంది రవికిరణ్ పాల్గొన్నారు. రైలు నుంచి జారిపడి వృద్ధుడి మృతి ఒంగోలు టౌన్: ఒంగోలు–కరవది రైల్వేస్టేషన్ల మధ్య రైలు నుంచి జారి పడి వృద్ధుడు దుర్మరణం చెందాడు. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలు రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం నెంబర్–3లో తిన్ సుకియ నుంచి తంబరం వెళ్తున్న రైలు నుంచి గుర్తు తెలియని 65 ఏళ్ల వృద్ధుడు జారి పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. తెలుపు రంగు చొక్కాపై మెరున్ కలర్ డిజైన కలిగిన ఫుల్ హ్యాండ్ షర్ట్, గ్రే కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. సమాచారం తెలిసిన వారు 94406 27647 నంబర్కు ఫోన్ చేయాలని ఎస్సై కె.మధుసూదన్రావు సూచించారు. -
వీఆర్ఏలపై అదనపు భారం తగదు
ఒంగోలు టౌన్: వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అదనపు భారంతో అల్లాడిస్తోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గెంటెనపల్లి శ్రీనివాసులు విమర్శించారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ తరహాలో టైం స్కేలు జీతాలు, డీఏని కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు వీఆర్ఏ సంఘం జిల్లా నాయకురాలు పి.జ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గంటెనపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక వీఆర్ఏలకు టైం స్కేలు జీతాలు, ప్రమోషన్స్, డీఏని జీతంతో కలపడం లాంటివి చేయకుండా అదనపు భారంతో వేధిస్తోందని మండిపడ్డారు. ఇసుక ర్యాంపులు, రైస్ మిల్లుల వద్ద డ్యూటీలు, సర్వే డ్యూటీలు వంటి అదనపు భారం వేయడంతో ఉద్యోగులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు భారం వేసినా టీఏలు, డీఏలు చెల్లించకపోవడం దారుణమన్నారు. లేబర్ కోడ్స్ మొత్తాన్ని రద్దు చేయాలని, వీఆర్ఏలకు నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. అనంతరం కలెక్టర్కు కలిసి వినతి పత్రం అందజేశారు. జులై 9వ తేదీ జరిగే సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. ఈ ధర్నాలో దానం, వి.యేసు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చలో తెనాలిని జయప్రదం చేయండి ఒంగోలు టౌన్: దళిత మైనారిటీ యువకుల మీద పోలీసుల అరాచకాన్ని ఖండిస్తూ ఈ నెల 28వ తేదీ తెనాలిలో నిర్వహించనున్న మానవ హక్కుల పరిరక్షణ సదస్సును జయప్రదం చేయాలని ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మంచి పుస్తకం వద్ద బుధవారం శ్రీచలో తెనాలిశ్రీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ తెనాలిలో నడిరోడ్డు మీద దళిత మైనారిటీ యువకులను పోలీసులు చిత్రహింసలు పెట్టడం ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగ హక్కులు, చట్టాలను తుంగలో తొక్కి దళిత మైనారిటీ యువకులపై బహిరంగ ప్రదేశంలో దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో మానవ హక్కులు కాపాడుకోవాలని కోరారు. పోలీసు చర్యలను మంత్రులు సమర్ధిస్తూ మాట్లాడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పోలీసుల బహిరంగ దాడిని సమర్దించిన హోం మంత్రి వంగలపూడి అనిత, ఎస్పీ సతీష్ కుమార్లపై జాతీయ మానవ హక్కుల వేదిక తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలన్నారు. చలో తెనాలి కార్యక్రమాన్ని హక్కుల సంఘాలు, దళిత మైనారిటీ సంఘాలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు భీమవరపు సుబ్బారావు, పెద్దన్న, తన్నీరు వెంకటస్వామి, పిన్నిక శ్రీనివాస్, ఆనాల వెంకటరావు, ఆంజనేయులు, గాలి సంగీతరావు, దాసి సుందరం, కె.పేరయ్య, టి.వెంకటస్వామి ,లింగ వెంకటేశ్వర్లు , నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. 29న జాబ్మేళా మార్కాపురం టౌన్: ఈనెల 29వ తేదీన ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో 10 బహుళజాతి కంపెనీలతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి రవితేజ యాదవ్ బుధవారం తెలిపారు. మార్కాపురం నియోజకవర్గంతోపాటు జిల్లాలోని 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న పదో తరగతి నుంచి పీజీ వరకూ చదువుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు ఎస్కే ఫిరోజ్గాంధీ 70139 50097 నంబరును సంప్రదించాలన్నారు. జూలై 9న దేశ వ్యాప్త సమ్మె ఒంగోలు సబర్బన్: కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చిన లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జూలై 9వ తేదీన మున్సిపల్ ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల్లో పని చేస్తున్న కార్మికులు సమ్మె చేస్తున్నట్లు సీఐటీయూ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఒంగోలు నగర్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ కె. వెంకటేశ్వరరావుకు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఒంగోలు నగర్ కార్యదర్శి టి.మహేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్ కార్మికులు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలని మున్సిపల్ కార్మికులందరికీ షరతులు లేకుండా తల్లికి వందనం పథకంతో సహా అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్, ఎన్ఎంఆర్, ఎం.ఆర్ బదిలీ కోవిడ్, క్లబ్ డ్రైవర్కు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు. డెత్, సిక్, ఆప్కాస్ ద్వారా రిటైర్మెంట్ చేసిన కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని, వయోపరిమితి 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు జి. నరసింహ, టి.విజయమ్మ, నాయకులు కె.సామ్రాజ్యం, ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: మాదకద్రవ్య రహిత సమాజాన్ని సాధించేందుకు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఈ దిశగా విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీ అంతర్జాతీయ మాదకద్రవ్య రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టే కార్యక్రమ నిర్వహణపై ఎస్పీ ఏఆర్ దామోదర్తో కలిసి బుధవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురువారం గుంటూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నట్లు తెలిపారు. దీనికి అనుబంధంగా అన్ని జిల్లాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినందున జిల్లా కేంద్రం ఒంగోలులో గురువారం మధ్యాహ్నం నుంచి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని, అనంతరం అక్కడి నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు ప్రత్యేక ర్యాలీ ఉంటుందని వివరించారు. విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆశా వర్కర్లు, ఇతర ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బంది, వివిధ వర్గాల ప్రజలను ర్యాలీలో భాగస్వాములను చేయాలని కలెక్టర్ చెప్పారు. ఈ దిశగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ర్యాలీలో పాల్గొనే వారికి అవసరమైన ముందస్తు వైద్య సాయం అందించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందుకోసం చేయాల్సిన ఏర్పాట్లపై పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమం ఉంటుందని, నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే పదార్థాలను వివరించేలా రూపొందించిన పోస్టర్లను, నిషా ముఖ్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ప్రత్యేక క్యూఆర్ కోడ్ను కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు ఆవిష్కరించారు. క్యుఆర్ కోడ్ను స్కాన్ చేసి పేరు, ఇతర వివరాలు నమోదు చేస్తే డ్రగ్స్ వినియోగ వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సర్టిఫికెట్ జనరేట్ అవుతుందన్నారు. సమావేశంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, మెప్మా పీడీ శ్రీహరి, డీఆర్డీఏ పీడీ నారాయణ, ఎకై ్సజ్ ఎస్ఈ ఆయేషా బేగం, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డీటీసీ సుశీల, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కళ్యాణి, డీఈవో కిరణ్కుమార్, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డీసీపీఓ దినేష్కుమార్, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మహిళా పీఎస్ డీఎస్పీ రమణ కుమార్, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, పలువురు సీఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సీతారామలక్ష్మణులను ఎత్తుకెళ్లారు హనుమంతుడిని వదిలేశారు!
కంభం: రామాలయంలో దొంగలు పడి పంచలోహ విగ్రహాలను అపహరించిన ఘటన కంభం మండలంలోని తెల్లదిన్నె గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. తెల్లదిన్నె గ్రామంలోని రామాలయంలో సోమవారం సాయంత్రం దీపారాధన నిర్వహించి గుడి తలుపులు మూశారు. మంగళవారం ఉదయం తాళం పగలగొట్టి ఉండటంతో స్థానికులు లోపలికి వెళ్లి చూడగా సీతా రామ లక్ష్మణుల పంచలోహ విగ్రహాలు కనపడలేదు. కేవలం హనుమంతుడి విగ్రహం మాత్రమే అక్కడ ఉంది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని కంభం సీఐ మల్లికార్జున, ఎస్సై నరసింహారావు పరిశీలించి వివరాలు సేకరించారు. మార్కాపురం క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. హనుమంతుడిని ఎందుకొదిలేసినట్టు? తెల్లదిన్నెలో రామాలయాన్ని 91 ఏళ్ల క్రితం నిర్మించారు. గ్రామానికి చెందిన చీరెళ్ల కోటమ్మ పంచలోహాలతో సీతారామలక్ష్మణుల విగ్రహాలు తయారు చేయించి ప్రతిష్ఠించారని స్థానికులు చెబుతున్నారు. చోరీకి వచ్చిన వారు ఆంజనేయ స్వామి ప్రతిమను వదిలేసి మిగిలిన మూడు విగ్రహాలు తీసుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంపై పూర్తి అవగాహన ఉన్నవారే దోపిడీకి తెగబడి ఉంటారన్న చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా దొంగలు వదిలేసిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మార్కాపురంలోని పురావస్తు ల్యాబ్లో తనిఖీ చేయించగా అది ఇత్తడితో చేసినట్లు తేలిందని ఎస్సై తెలిపారు. అపహరణకు గురైన విగ్రహాలు ఇత్తడివా లేక పంచలోహాలతో చేసినవా అనేది దొంగలు దొరికితేనే తేలనుంది. పురాతన రామాలయంలో మూడు పంచలోహ విగ్రహాలు చోరీ! కంభం మండలం తెల్లదిన్నె గ్రామంలో దుండగుల దుశ్చర్య హనుమంతుడి విగ్రహం ఇత్తడిదని పురావస్తు ల్యాబ్ నివేదిక -
కోలుకోని ధరలు!
మాటల్లో కొనుగోలు..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ధరల కోసం రైతులు ఆందోళన చేశారు. పొగాకు బేళ్లను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలికి వచ్చి పొగాకు రైతులను పరామర్శించారు. జగన్ పొదిలి పర్యటనకు వచ్చిన స్పందనను చూసి పాలక పక్షం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దింపుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయశాఖ మంత్రి మార్క్ఫెడ్ కేంద్రాలను ప్రారంభించేశాం రైతులకు మంచి ధర వస్తుందంటూ ప్రకటనలు చేశారు. నాలుగు రోజులుగా రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో అమ్మకాలు జరుగుతున్న తీరును ఒక్కసారి పరిశీలిస్తే ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. కనిష్ట ధరలు రోజు రోజుకూ పతనమవుతున్నాయి. జిల్లాలోని పలు వేలం కేంద్రాల్లో బుధవారం పొగాకు కొనుగోళ్లు కనిష్ట ధర కేవలం రూ.160 వద్ద పలికింది. గరిష్ట ధర ఏదో మొక్కుబడిగా 10–15 బేళ్లకు మాత్రం రూ.280 చూపిస్తున్నారు. దాదాపు 70 శాతం పొగాకు బేళ్లకు కనిష్ట ధరతోనే రైతులు సర్దుకోవాల్సి వచ్చింది. బుధవారం కొనుగోలు చేసిన బేళ్ల వివరాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. నల్లరేగడి నేలలకు సంబంధించిన వేలం కేంద్రాలు వెల్లంపల్లి–2, ఒంగోలు–1, 2, టంగుటూరు–1, కొండపికి మొత్తం 5,452 బేళ్లు రాగా వాటిలో నోబిడ్ పేరుతో 1558 బేళ్లను తిరస్కరించారు. కొనుగోలు చేసిన బేళ్లకు కనిష్ట ధర రూ.160, గరిష్ట ధర రూ.280 పలికింది. సరాసరి ధర రూ.233.24 పలికింది. అదే విధంగా తేలికరకం నేలలు కలిగిన వేలం కేంద్రాలైన పొదిలి–1, కనిగిరి, కందుకూరు–1,2, కలిగిరి, డీసీపల్లిలో 5,394 బేళ్లు రాగా వాటిలో 1437 బేళ్లను తిరస్కరించారు. మిగిలిన బేళ్లకు కనిష్ట ధర రూ.160, గరిష్ట ధర రూ.280, సరాసరి ధర రూ.232.08 పలికింది. 6 రౌండ్లు పూర్తయినా లభించని గిట్టుబాటు ధర కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం ఆరో రౌండ్ పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. గురువారం నుంచి 7వ రౌండ్ కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు వేలం కేంద్రంలో 6.24 మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగాయి. ఇప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర లభించక కూలీలకు, కౌలు ఇంత వరకు నగదు చెల్లించలేదని రైతులు వాపోతున్నారు. రైతుల దగ్గర ఉన్న లో గ్రేడు పొగాకును రూ.180 నుంచి రూ.160కి తగ్గించిన వ్యాపారులు ఆ ధరకు కూడా నామమాత్రంగా బేళ్లను కొనుగోలు చేసి ఎక్కువ భాగం తిప్పి పంపుతున్నారు. ఒకే రోజు పొగాకు కేజీకి రూ.20 తగ్గింపు టంగుటూరు: పొగాకు వేలం కేంద్రంలో ఒకే రోజు కనిష్ట ధర రూ.20 తగ్గించి కేజీ రూ.160కి వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో రైతులు విస్మయం వ్యక్తం చేశారు. అసలే ఈ ఏడాది నష్టాలు పాలవుతున్నామని, దీనికి తోడు రోజు రోజుకీ ధరలు దిగజారుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో 205 పొగాకు బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ వేలంలో మొత్తం 25 మంది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. పడిపోతున్న పొగాకు కనిష్ట ధరలు మార్క్ఫెడ్ను రంగంలోకి దించామంటూ హడావుడి ధరల పెరుగుదలలో కానరాని మార్పు కేజీ పొగాకు కనిష్ట ధర రూ.160 కి పతనం పెరుగుతున్న తిరస్కరణకు గురవుతున్న బేళ్ల సంఖ్య బుధవారం ఒక్కరోజే 3 వేల బేళ్లు వెనక్కి ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులు నాలుగు నెలలు దాటుతున్నా 52 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోళ్లుపెరుగుతున్న రిటన్ బేళ్ల సంఖ్య..పొదిలి వేలం కేంద్రంలో రోజు రోజుకూ రిటన్ బేళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక వైపు ధరలు లేక రైతులు దిగాలు పడుతుండగా మరో వైపు రిటన్ బేళ్లతో మరింత గుబులు పడుతున్నారు. బుధవారం వేలానికి 1197 బేళ్లు వచ్చాయి. వాటిలో 620 మాత్రమే కంపెనీల వారు కొనుగోలు చేశారు. పలు కారణాలతో 580 తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో 499 బేళ్లు నోబిడ్గా తిరస్కరించారు. 20 కంపెనీల ప్రతినిధులు వేలంలో పాల్గొన్నారు. కనిగిరి బోర్డులో బుధవారం సీతారంపురం (తురకపల్లి) క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులు 705 బేళ్లను యార్డుకు తెచ్చారు. అందులో 365 బేళ్లు కొనుగోలు చేయగా, 340 పొగాకు బేళ్లను తిరస్కరించారు. ఈ కేంద్రం పరిధిలో ఇప్పటి వరకూ 3.1 మిలియన్ కేజీల పొగాకును మాత్రమే కొనుగోలు చేశారు. కొండపి వేలం కేంద్రానికి వెన్నూరు చిన్న వెంకన్నపాలెం గ్రామాలకు చెందిన రైతులు 965 బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. అందులో 687 బేళ్లు కొనుగోలయ్యాయి. 278 బేళ్లను తిరస్కరించారు. వేలంలో 24 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే టంగుటూరు కేంద్రానికి వేలం కేంద్రానికి దావగూడూరు, చింతలపాలెం గ్రామాలకి చెందిన రైతులు వేలానికి 895 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 690 కొనుగోలు చేశారు. 205 పొగాకు బేళ్లు తిరస్కరించారు. -
బాల్య వివాహాల నియంత్రణ ప్రధానం
● పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూడాలి ● సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ సమీక్షలో జిల్లా కలెక్టర్ ఒంగోలు సబర్బన్: పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా శ్రద్ధ తీసుకోవాలని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, 0–6 ఏళ్ల పిల్లల ఆధార్ ఎన్రోల్మెంట్, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్ల మరమ్మతులు, ఇంకుడు గుంతల నిర్మాణాల పురోగతి, పౌష్టికాహారం పంపిణీ తీరుపై సమీక్షించారు. మాతా శిశు మరణాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. బాల్య వివాహాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ సువర్ణ, డీసీపీఓ దినేష్ కుమార్తోపాటు సీడీపీఓలు పాల్గొన్నారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని రక్షించిన పోలీసులు కంభం: రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కంభం ఎస్సై నరసింహారావు తమ సిబ్బందితో కలిసి రక్షించారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం కంభంలో చోటుచేసుకుంది. వివరాలు.. కంభం పంచాయతీలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ రఫీ మద్యం మత్తులో స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎస్సై హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రఫీని అదుపులోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులివ్వాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు కార్డులను మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 46,015 మందికి సీసీఆర్సీ కార్డులు మంజూరు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారని, ఈ మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. ఆర్డీఓలు, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, గృహనిర్మాణ, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల అధికారులతో సమావేశమై రెవెన్యూ అంశాలకు సంబంధించి పీజీఆర్ఎస్ పెండింగ్, రీ వెరిఫికేషన్ అఫ్ హౌస్ సైట్స్, హౌస్ సైట్ అప్లికేషన్స్, వాటర్ టాక్స్ కలెక్షన్, కోర్టు కేసుల పురోగతి, రీ సర్వే ప్రక్రియ, నిత్యావసర సరుకుల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు తదితర అంశాలపై కూడా సమీక్షించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో డివిజనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటి నివేశన స్థలాల అర్జీలు, అర్హులు వివరాలు, ఎంత స్థలం అందుబాటులో ఉంది తదితర వివరాలపై గ్రామాల వారీగా పూర్తి నివేదిక సిద్ధం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. గ్రామ స్థాయిలో వాటర్ ట్యాక్స్ వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భూముల రీసర్వే ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, కేసవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, పౌర సరఫరాల శాఖ డీఎం వరలక్ష్మి, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా, వివిధ సెక్షన్ల సుపరింటెండెంట్లు పాల్గొన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో జేసీ గోపాల కృష్ణ సమన్వయంతో పనిచేసి లక్ష్యం పూర్తి చేయాలని సూచన -
కాపులను బీసీల్లో చేర్చాలి
గిద్దలూరు రూరల్: కాపులు, బలిజలను బీసీల్లో చేర్చాలని కోరుతూ చిత్తూరు జిల్లా నుంచి కాపు సమితి నాయకుడు ప్రసాద్ గత 15 రోజులుగా పాదయాత్ర చేస్తూ మంగళవారం గిద్దలూరు చేరుకున్నారు. పట్టణంలోని బలిజ సంఘం కార్యాలయం వద్ద కాపు నాయకులు ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ.. కాపులు, బలిజలను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చిత్తూరు జిల్లా నుంచి అమరావతి వరకు పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసి కాపులను బీసీల్లో చేర్చాలని వినతి పత్రాన్ని అందజేస్తామని ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు రంగసుబ్బయ్య, పసుపులేటి శ్రీను, దుత్తా బాలఈశ్వరయ్య, గిరి తదితరులు పాల్గొన్నారు. -
అండర్–18 కబడ్డీ పోటీలకు సింగరాయకొండ విద్యార్థిని
సింగరాయకొండ: ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అండర్–18 బాలికల కబడ్డీ పోటీలకు సింగరాయకొండలోని ఏఆర్సీ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని కుర్రు త్రిగుణ ఎంపికై నట్లు పీడీ కె.శంకర్రావు తెలిపారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఈనెల 28 నుంచి జూలై ఒకటో తేదీ వరకు జరిగే జాతీయ కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున త్రిగుణ ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ప్రిన్సిపాల్ ఎం.సౌజన్య, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అభినందించారు. కాగా తనను ప్రోత్సహించిన గొల్లపాలెం ఉన్నత పాఠశాల పీడీ హజరత్తయ్య, కళాశాల పీడీ శంకర్రావుకు త్రిగుణ కృతజ్ఞతలు తెలియజేసింది. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
కందుకూరు: జాతీయ రహదారి 167బీపై మంగళవారం తెల్లవారుజామున ముందు వైపు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుకవైపు నుంచి కారు ఢీకొనడంతో వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మంగళవారం వలేటివారిపాలెం మండలంలోని పోకూరు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన స్వర్ణ చిన్నయ్య(44) అనే రైతు మంగళవారం వేకువజామున పొగాకు బేళ్లు ట్రాక్టర్కు ఎత్తుకుని కందుకూరులోని వేలం కేంద్రానికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో కందుకూరు సమీపంలోని పోకూరు గ్రామం వద్దకు చేరుకునే సరికి కదిరి నుంచి కందుకూరు వైపు వస్తున్న కారు వేగంగా వెనుకవైపు నుంచి ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ఇంజన్ తిరగబడడంతో ట్రాక్టర్ నడుపుతున్న చిన్నయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ సలీంబాషతో పాటు, కారులోని వారికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నాచెల్లెలి కిడ్నాప్పై కేసు నమోదు
నల్లమాడ(అనంతపురం): అన్నాచెల్లెలును కిడ్నాప్ చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు నల్లమాడ పోలీసులు మంగళవారం తెలిపారు. వివరాలు.. ప్రకాశం జిల్లా సీఎస్పురం మండలం నల్లమడుగుల గ్రామానికి చెందిన గాయపు అంకమ్మ, ఏసురత్నం దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కట్టెలు కాల్చి బొగ్గుల చేసే పనిపై ఆధారపడి జీవనం సాగించేవారు. ఈ క్రమంలో అంకమ్మ తన కుటుంబసభ్యులతో కలసి సోదరుడు సమరం నగేష్ వెంట ఇటీవల నల్లమాడ మండలం దొన్నికోట గ్రామానికి వలస వచ్చి బొగ్గులు కాల్చే పనిని చేపట్టారు. ఈ నెల 22న రాత్రి ఒంటి గంట సమయంలో ఏసురత్నం ఇంట్లో లేని సమయంలో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బొగ్గుల వ్యాపారి (సేటు) ఎం.యంగయ్య, మరో నలుగురు వచ్చి అంకమ్మ, ఆమె సోదరుడు నగేష్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని పోయారు. 23న వారి బారి నుంచి తప్పించుకుని ఇద్దరూ దొన్నికోటకు చేరుకున్నారు. అదే రోజు రాత్రి నల్లమాడ పోలీసులకు అంకమ్మ ఫిర్యాదు చేశారు. పాత బాకీ తీర్చాలంటూ తనను, తన సోదరుడిని యంగయ్య, మరో నలుగురు కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ అనంతరం మంగళవారం కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వీరయ్య హత్య కేసు.. పోలీస్ కస్టడీకి నలుగురు నిందితులు ● వినోద్ను కొప్పోలులోని ఇంటికి తీసుకెళ్లి విచారించిన పోలీసులు ఒంగోలు టౌన్: టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న బోర్లగుంట వినోద్ కుమార్, ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి, గోళ్ల రుష్యేంద్ర బాబు, ఓబిలి నాగరాజును మంగళవారం ఉదయం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి నేరుగా ఒంగోలు జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ నుంచి తాలూకా పోలీసు స్టేషన్కు తరలించి డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నేతృత్వంలో విచారణ ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల సమయంలో వీరయ్య హత్యలో ప్రధాన పాత్రధారిగా చెబుతున్న వినోద్ కుమార్ను తీసుకుని కొప్పోలులోని అతని నివాసానికి తీసుకెళ్లి విచారించారు. ఈనెల 27వ తేదీ వరకు నలుగురు నిందితులను పోలీసు తమ కస్టడీలోనే ఉంచి విచారించనున్నారు. మరో వైపు ప్రధాన సూత్రధారిగా పోలీసులు చెబుతున్న ముప్పా సురేష్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బెయిల్ దొరకకపోతే పోలీసులకు లొంగిపోవచ్చని స్థానికంగా ప్రచారం నడుస్తోంది. -
సైకిల్ యాత్రికుడు.. పర్యావరణ ప్రేమికుడు
● పర్చూరుకు చేరుకున్న సైకిల్ యాత్రికుడు సెల్వన్ పర్చూరు(చినగంజాం): ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సైకిల్పై యాత్ర చేస్తూ ప్రపంచ పర్యటన చేస్తున్న ముత్తు సెల్వన్ మంగళవారం పర్చూరు చేరుకున్నారు. పర్చూరులో తహసీల్దార్ బ్రహ్మయ్య ఇతర అధికారులతో కలిసి మొక్కలు నాటారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్కు చెందిన ముత్తు సెల్వన్ 2021 డిసెంబర్ 28న సైకిల్పై ప్రయాణం ప్రారంభించి దేశంలోని అన్ని ప్రాంతాలను పర్యటిస్తున్నారు. ప్రాణవాయువు కొరత కారణంగా ఎవరూ మృతి చెందకూడదన్న లక్ష్యాన్ని ఎంచుకొని సైకిల్పై ప్రపంచ యాత్ర చేస్తూ మార్గమధ్యంలో మొక్కలు నాటుతూ ముందుకు సాగుతన్నానని సెల్వన్ వివరించారు. రోజుకు 50 కిలోమీటర్ల చొప్పున 1111 రోజుల్లో 39,900 కి.మీ ప్రయాణించి, మొత్తం 10 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన ప్రయాణంలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్లోనూ పర్యటించనున్నట్లు చెప్పారు. పర్చూరులో తహసీల్దార్ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటిన అనంతరం సెల్వన్కు ప్రశంస పత్రం అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆగని కనిష్ట ధర పతనం
కొండపి: పొగాకు వేలంలో కనిష్ట ధర పతనం ఆగడం లేదు. వేలం ప్రారంభంలో రూ.240 పలికిన కనిష్ట ధర ప్రస్తుతం రూ.160కి పడిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరలు పెరిగితే కనీసం పెట్టుబడులైనా వస్తాయని ఆశతో ఉన్న రైతులకు కనిష్ట ధరల పతనంతో నష్టాల్లో కూరుకుతున్నారు. క్లస్టర్ పరిధిలోని చోడవరం, ముప్పవరం గ్రామాలకు చెందిన రైతులు వేలానికి 1019 బేళ్లను తీసుకురాగా 721 బేళ్లను కొనుగోలు చేసి 298 బేళ్లను తిరస్కరించారు. సరాసరి ధర రూ.246.70గా నమోదైంది. వేలాన్ని పొగాకు బోర్డు వైస్ చైర్మన్ బొట్టపాటి బ్రహ్మయ్య పరిశీలించారు. టంగుటూరు: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం జరిగిన వేలంలో 292 బేళ్లను వ్యాపారులు తిరస్కరించారు. కమ్మవారిపాలెం, కట్టుబడిపాలెం గ్రామాలకు చెందిన రైతులు 869 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 577 బేళ్లను కొనుగోలు చేశారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.180, సరాసరి రూ.240.26గా నమోదైంది. వేలంలో 25 మంది వ్యాపారులు పాల్గొన్నారు. -
ఏక్ సాల్ కౌలుదారు.. ప్లాట్లేశాడు
పొదిలి: ముస్లింలకు చెందిన పెద్ద, చిన్న మసీదుల నిర్వహణకు వక్ఫ్ భూముల నుంచి వచ్చే కౌలు ఆదాయం ఆధారం. నిర్వహణతో పాటు, చిన్న పాటి మరమ్మతులకు ఆదాయంలో ఖర్చు చేస్తుంటారు. జమా ఖర్చులను కమిటీతో పాటు, ఇన్స్పెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. వక్ఫ్ భూములు రైల్వే లైన్కు అటు ఇటు సుమారు 300 ఎకరాలు ఉన్నాయి. ఏటా కౌలు వేలం నిర్వహిస్తుంటారు. వక్ఫ్ భూముల కమిటీ అధ్యక్షుడు ఇటీవల విదేశాలకు వెళ్లాడు. ఈవిషయమై సీఈఓకు సమాచారం ఇచ్చాడు. తాను మూడు నెలల పాటు అందుబాటులో ఉండటం లేదని, కమిటీ వారితో కలిసి, అధికారులు భూములు వేలం నిర్వహించుకోవాలని సూచించారు. భూముల కౌలు వేలానికి ముందుగా ప్రకటనలు ఇస్తారు. పాంప్లేట్ల ద్వారా ప్రచారం జరుగుతుంది. కమిటీ సభ్యులు, అధికారుల సమక్షంలో ఈనెల 12వ తేదీన భూములు వేశారు. మొత్తం 153 ఎకరాలకు గాను, వేలంలో 23 మంది పాల్గొన్నారు. ఈ వేలంలో రూ.9,50,900 ఆదాయం సమకూరింది. సర్వే నెంబర్ 820లో కిరి కిరి: 12వ తేదీన జరిగిన వేలంలో సర్వే నంబర్ 820లో రెండు ఎకరాల విస్తీర్ణానికి వేలం జరగలేదు. ఎవరూ లేక పోటీ రాలేదా, లేదా అంతకు ముందుగా వేసుకున్న పన్నాగమో కానీ మిగిలిన భూములతో పాటు వేలం జరగలేదు. కమిటీలో పదవులు ఉన్న ఇద్దరు సదరు భూమిని ఏక్సాల్ కౌలుకు ఇచ్చేందుకు నిర్ణయించారు. దీనిని కాటూరివారిపాలెం గ్రామానికి చెందిన పి.పెద్దయ్య అనే వ్యక్తికి రూ.9,200లు కౌలు నిర్ణయించి రసీదు ఇచ్చారు. వ్యవసాయం కోసమే, తాత్కాలిక పంటలను మాత్రమే కౌలుదారులు వేసుకోవాలని నిబంధనల్లో తెలియపరుస్తారు. అయితే సదరు రెండు ఎకరాలు భూమి పొందిన పెద్దయ్య ఆ భూమిలో ప్లాట్లు వేశాడు. రోడ్డు కూడా వేయించి, సెంటు రూ.20 నుంచి రూ.30 వేల ప్రకారం అమ్మకానికి సిద్ధం చేశాడు. ఆక్రమణలకు పాల్పడితే చర్యలు: స్థానిక నగర పంచాయతీ కమిషనర్కు ఆక్రమణల విషయమై స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన కమిషనర్ వెంటనే యంత్రాలతో రోడ్లను తొలగించారు. ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వక్ఫ్ భూములను కాపాడాలని స్థానిక ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాట్లు వేయటం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారులపై పలు ఆరోపణలు చేశారు. దీంతో స్పందించిన వక్ఫ్ ఇన్స్పెక్టర్ అహ్మద్ బాష పొదిలికి వచ్చారు. కౌలుకు ఇచ్చిన కమిటీ వారు తనకు సమాచారం ఇవ్వలేదని, నగదు జమ చేయలేదని అహ్మద్ బాష చెప్పారు. జరిగిన విషయంపై ఆరా తీశారు. కౌలుదారు పెద్దయ్యపై పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈవిషయమై ఎస్సై వేమనను వివరణ కోరగా, ఫిర్యాదు అందిన మాట వాస్తమన్నారు. విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వక్ప్భూముల్లో రోడ్డు, ప్లాట్లు తొలగించిన కమిషనర్ -
బంగారు బాల్యం సర్వే 10 రోజుల్లో పూర్తి చేయాలి
● సమస్యల బారిన పడే చిన్నారుల గుర్తింపును వేగవంతం చేయాలి ● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: బంగారు బాల్యం యాప్ ఆధారిత సర్వేను పది రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి డివిజన్, మండల స్థాయి అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ సమస్యల బారిన పడే (వల్నరబుల్) చిన్నారుల గుర్తింపుతో పాటు ఆధార్ కార్డుల రిజిస్ట్రేషన్, బడి వయసు పిల్లలు అందరూ బడిలో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ప్రతి పాఠశాలలో ఈ తరహా పిల్లలను గుర్తించే బాధ్యతను నోడల్ ఆఫీసర్గా ఒక టీచరుకు అప్పగించాలని ఆమె చెప్పారు. ఆధార్ కార్డు లేని ఆరేళ్లలోపు పిల్లలు కూడా ఆధార్ కార్డులు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జనన ధ్రువీకరణ పత్రాలు లేక ఆధార్ కార్డులు పొందలేకపోతున్న వారిని గుర్తించి, ఈనెల 27వ తేదీన జనన ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు అర్హులతో దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. బడి వయసు కలిగిన పిల్లలు సుమారు 13 వేల మంది ఇప్పటికీ బడి వెలుపల ఉన్నారని, వీరందరినీ తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే నెల 1,2,3 తేదీల్లో ఒకటి, రెండు, మూడవ తేదీల్లో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో గుడ్ టచ్–బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టం, లైంగిక వేధింపులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో చిరంజీవి, డీఈఓ కిరణ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, డీసీపీఓ దినేష్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి , ఒంగోలు ఆర్డీవో లక్ష్మి ప్రసన్న , నోడల్ ఆఫీసర్ గిరిధర్ శర్మ, ఎంపీడీవోలు, సీడీపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, మహిళా సంరక్షణ కార్యదర్శులు హాజరయ్యారు. రేపు ఫెన్సింగ్ జిల్లా క్రీడాకారుల ఎంపిక ఒంగోలు: ఫెన్సింగ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపిక ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి.నవీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక మినీ స్టేడియంలో ఉదయం 8 గంటలకు జరుగుతుంది. అండర్ 10 కేటగిరీలో పాల్గొనేందుకు 2016 జనవరి 1వ తేదీ, అండర్ 12 కేటగిరీలో పాల్గొనేందుకు 2014 జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులు. ఫెన్సింగ్ అసోసియేషన్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, సొంత కిట్టుతో ఎంపికకు హాజరుకావాలి. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 7671991147 లేదా 9182366146లను సంప్రదించాలని కార్యదర్శి జి.నవీన్ తెలిపారు. -
పారదర్శకంగా ఓటరు జాబితాలు
ఒంగోలు సబర్బన్: పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించడంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జేసీ పాల్గొని ఓటరు జాబితాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎల్ఓ యాప్ నిర్వహణ, ఓటర్ జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. తొలుత బీఎల్ఓ యాప్ నిర్వహణ, ఓటర్ జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈఆర్ఓలకు, ఏఈఆర్ఓలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, డీఆర్వో చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మిప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, ఈఆర్ఓలు కుమార్, సత్యనారాయణతో పాటు జిల్లాలోని ఎఈఆర్ఓలు, తదితరులు పాల్గొన్నారు.రమాదేవికి నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేటివ్ శిక్షా రత్న అవార్డుటంగుటూరు: మండలంలోని జమ్ములపాలెం మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయిని కురుమేటి రమాదేవి నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేటివ్ శిక్షా రత్న అవార్డును సాధించారు. ఈ అవార్డును ఛత్తీస్గడ్ కి చెందిన నవాచారి గతి విద్యా సమూహ్ సంస్థ వారు అందజేశారు. ఈ సందర్భంగా టంగుటూరు మండల ఎంఈఓలు చెంచు పున్నయ్య, బాలాజీ జమ్మలపాలెం హైస్కూల్ హెడ్మాస్టర్ రాంబాబు, మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. వినూత్న రీతిలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులని ఎంపిక చేసి నవాచారి గతి విద్యాలయ సంస్థ వారు అవార్డు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిది మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. అందులో రమాదేవి ఒకరు. సర్టిఫికెట్, మెమొంటోలను పోస్టు ద్వారా పంపారు. అవార్డును టంగుటూరు మండల ఎంఈఓలు చెంచు పున్నయ్య, మహతి బాలాజీ చేతుల మీదుగా అందజేశారు. -
సమస్యలు పరిష్కరించాలి
జాప్యం లేకుండా● ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా చూడాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్లో మీ కోసం సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలపై అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారుని సంతృప్తే ధ్యేయంగా అర్జీల పరిష్కారతీరు ఉండాలని స్పష్టం చేశారు. అర్జీలు రీ–ఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకుని పూర్తిస్ధాయిలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్, జాన్సన్కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించాలి... జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహించాలని జిల్లా డెమోక్రటిక్ జర్నలిస్టు ఫోరం నాయకులు కలెక్టర్కు విన్నవించారు. బి.శ్రీనివాసరావు, ఎన్.రవికుమార్, తదితరులు గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ను కలిసి జిల్లాలో మహిళా ఉద్యోగులపై జరిగిన శారీరక, మానసిక వేధింపుల వివరాలను అర్జీ రూపంలో తెలియజేశారు. మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై రోజురోజుకు వేధింపులు అధికమవుతున్నాయని వివరించారు. ఒక మహిళా ఉద్యోగి విషయంలో చాలా దారుణంగా సహచర పురుష ఉద్యోగులు వేఽధించి కేసులు నమోదైనా నేటికీ ఎలాంటి చర్యలు లేకపోగా ఇంకా ఆ ఉద్యోగినిని బాధపెడుతూనే ఉన్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో 20 వేల మందికిపైగా ఉన్న మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. నల్ల బర్లీ పొగాకు కొనుగోళ్ల గురించి వివరించిన అధికారులు... జిల్లాలో నల్ల బర్లీ పొగాకు కొనుగోళ్లు పెరుగుతున్నాయని కలెక్టర్కు మార్క్ఫెడ్, జిల్లా వ్యవసాయ అధికారులు వివరించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్సెల్లో మార్క్ఫెడ్ డీఎం మురళీకృష్ణ, జేడీఏ ఎస్.శ్రీనివాసరావు కలెక్టర్ను కలిసి మద్దిపాడు మండలం గార్లపాడులో నల్ల బర్లీ పొగాకు అమ్మకాల్లో పురోగతిని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రిజెక్టు చేసే బేళ్ల శాతం పూర్తిగా తగ్గిపోవాలని ఆదేశించారు. నల్ల బర్లీ పొగాకు రైతులను ఆదుకోవటమే లక్ష్యంగా ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జిల్లా మొత్తంమ్మీద 10 మండలాల్లో నల్ల బర్లీ పొగాకు పండించారని, పూర్తిగా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. మాజీ ఎంపీపీ ‘పోశం’పై అక్రమ కేసు! సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకుల బరితెగింపు రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, తాళ్లూరు మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్రెడ్డిపై తాళ్లూరు పోలీస్ స్టేషన్లో అక్రమ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. తాళ్లూరు రెవెన్యూ పరిధిలో మధుసూదన్ రెడ్డికి చెందిన పొలంలోకి స్థానిక టీడీపీ నేతలు అక్రమంగా ప్రవేశించి, ఖాళీ చేయాలంటూ దౌర్జన్యానికి దిగారు. తన పూర్వీకుల ద్వారా సంక్రమించిన భూమిని వదిలేయాలని చెప్పేందుకు మీరెవరంటూ టీడీపీ నాయకులను నిలదీయడంతో మాటామాటా పెరిగింది. భూమికి సంబంధించిన పత్రాలను టీడీపీ నాయకులకు చూపినప్పటికీ.. పొలంలో అడుగుపెడితే అంతుచూస్తామని బెదిరించి వెళ్లారు. టీడీపీ నాయకుల దౌర్జన్యంపై తాళ్లూరు పోలీస్ స్టేషన్లో ఈనెల 11న ‘పోశం’ ఫిర్యాదు చేశారు. కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ఎస్సైని ప్రశ్నించగా టీడీపీ నాయకులను పిలిపించి, వారితో తప్పుడు ఫిర్యాదు చేయించి తనపై అక్రమ కేసు నమోదు చేశారని ‘పోశం’ వివరించారు. తప్పుడు కేసులకు బెదిరేది లేదని, ఈ విషయమై న్యాయస్థానంలో పోరాటం చేస్తానని పేర్కొన్నారు. -
సాధువు వేషంలో వచ్చిన దొంగ అరెస్ట్
● నాలుగు సవర్ల బంగారు గొలుసు స్వాధీనం ● నిందితుడు శ్రీకాకుళం వాసిగా గుర్తింపు చీమకుర్తి: సాధువు వేషంలో వచ్చి మహిళపై దాడి చేసి బంగారు గొలుసుతో పరారైన దొంగను చీమకుర్తి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. చీమకుర్తి పోలీస్ స్టేషన్లో మీడియా ముందు నిందితుడిని హాజరుపరిచారు. సీఐ ఎం.సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం పట్టణానికి చెందిన 36 సంవత్సరాల వయసు గల పెడద శివను ఒంగోలు–చీరాల రహదారిలోని త్రోవగుంట క్రాస్రోడ్డులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను సాధువు వేషంలో ఈ నెల 15వ తేదీ చీమకుర్తిలోని ప్రభుత్వాస్పత్రి పక్కనే నివాసం ఉంటున్న లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గోలి పద్మజ ఇంట్లోకి వెళ్లి కత్తితో ఆమె మెడపై దాడి చేసి గాయపరిచాడు. ఆపై రుబ్బురోలు పత్రంతో ఆమె మొహంపై దాడి చేసి మెడలో ఉన్న దాదాపు 4 సవర్ల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. తొలుత సాధువు వేషంలో ఆమె ఇంటి ముందుకు వెళ్లి ఏదైనా సహాయం చేయాలంటూ పద్మజను అడిగాడు. బయటకు వచ్చిన పద్మజ ఏమీ లేవని చెప్పి ఇంట్లోకి వెళ్లింది. నిందితుడు కూడా ఆమెను అనుసరించి కత్తితో, రుబ్బురోలు పత్రంతో దాడి చేశాడు. సాధువు వేషంలో వచ్చిన దుస్తులను అక్కడే వదిలేసి పద్మజ కుమారుడు దుస్తులు ధరించి పరారయ్యాడు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించిన పోలీసులు.. బాధితురాలి బంధువు ఎస్.శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ ఆదేశాలతో నాలుగు టీమ్లుగా ఏర్పడి నిందితుడు పెడద శివను అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ వివరించారు. గ్రీన్ఫీల్డ్ హైవే పనుల అడ్డగింత సీఎస్పురం(పామూరు): ‘గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు కావాలని అడిగితే ఇచ్చాం. ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. తీసుకున్న భూములకు తగిన పరిహారం ఇచ్చాకే పనులు చేసుకోండి’ అంటూ రైతులు నిరసనకు దిగారు. మండల కేంద్రమైన సీఎస్పురం వద్ద నిర్మాణంలో ఉన్న బెంగళూరు–కడప–విజయవాడ(బీకేవీ) గ్రీన్ఫీల్డ్ రహదారి పనుల ను సోమవారం సీఎస్పురం, డీటీపల్లి, ముళ్లపాడు గ్రామాలకు చెందిన రైతులు అడ్డుకున్నారు. నిర్మాణంలో ఉన్న రోడ్డుపై కంపవేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణం వల్ల తాము కోల్పోతున్న పొలానికి సంబంధించి పరిహారం నేటికీ మంజూరు కాలేదన్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. తమకు పరిహారం ఇచ్చాకే రోడ్డు నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించాలని రైతులు తేల్చిచెప్పారు. -
తొలిరోజే తుస్సు..!
కనిగిరి రూరల్/మార్కాపురం: మహిళా ప్రజాప్రతినిధుల్లో మార్పు తీసుకొచ్చేందుకు.. స్థానిక పాలనలో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర పెంచేందుకు, నాయకత్వ లక్షణాలు, విజ్ఞానం, నైపుణ్యం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు తొలి రోజే తుస్సుమన్నాయి. మరో కొద్ది నెలల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగియనున్న తరుణంలో ప్రభుత్వం చేపట్టిన మూడు రోజుల శిక్షణపై మహిళా సర్పంచ్లు తీవ్ర నిరాసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, ఒంగోలు, చీరాల, కందుకూరు ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈనెల 23 నుంచి జూలై 2వ వారం వరకు ఒక్కో బ్యాచ్కు మూడు రోజుల చొప్పున మహిళా సర్పంచ్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. సోమవారం కనిగిరి, మార్కాపురంలో డివిజన్ స్థాయి శిక్షణ తరగతులు తూతూమంత్రంగా సాగాయి. శిక్షణ శిబిరాలు వెలవెల ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లో 542 మంది మహిళా సర్పంచ్లు ఉన్నట్లు నివేదికలున్నాయి. తొలిరోజు కనిగిరి మండల పరిషత్ కార్యాలయంలో కేకేమిట్ల, సీఎస్పురం, దొనకొండ, దర్శి మండలాల సర్పంచ్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. దీనికి 64 మంది మహిళా సర్పంచ్లు హాజరు కావాల్సి ఉండగా.. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పట్టుమని 10 మంది కూడా కనిపించలేదు. శిక్షణ తరగతులను ఎంపీపీ డి.ప్రకాశం, ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ, పొన్నలూరు ఎంపీడీఓ సుజాత, ఆర్పీలు అశోక్, నాగేమల్లేశ్వరరావు ప్రారంభించారు. ఆరుగురే హాజరుకాగా.. ఖాళీ కుర్చీలతో శిక్షణ కార్యక్రమాన్ని మమగా ముగించారు. ● మార్కాపురం ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా సర్పంచ్ల శిక్షణ కార్యక్రమం తొలిరోజే వెలవెలబోయింది. గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు, కంభం, బేస్తవారపేట, గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలాలకు చెందిన సర్పంచ్లు 61 మంది శిక్షణకు హాజరుకావాల్సి ఉండగా 10 మంది కూడా హాజరు కాలేదు. శిక్షణ ఇచ్చేందుకు నలుగురు రిసోర్సు పర్సన్లను నియమించిన ప్రభుత్వం.. సర్పంచ్లను మాత్రం సమావేశానికి రప్పించడంలో విఫలమైంది. మహిళా సర్పంచ్ల నిరసన ప్రభుత్వం లక్ష్యం, ఉద్దేశాలు ఏవైనప్పటికీ కనీస సౌకర్యాలు, వసతులు కల్పించకుండా 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో శిక్షణా తరగతులు నిర్వహించడంపై మహిళా సర్పంచ్లు మండిపడుతున్నారు. కనిగిరిలో తొలిరోజు నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరుకావాలంటే దొనకొండ మండల సర్పంచ్లు 40 కి.మీ, కొనకనమిట్ల, దర్శి, సీఎస్పుం మండలాల సర్పంచ్లు 32 నుంచి 35 కి.మీల దూరం ప్రయాణించాల్సి ఉంది. మార్కాపురంలో శిక్షణకు గిద్దలూరు, రాచర్ల, బేస్తవారిపేట, కొమరోలు మండలాల సర్పంచ్లు 40 కి.మీ నుంచి 60 కి.మీ మేర ప్రయాణించాల్సి ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుండటంతో తిరిగి ఇళ్లకు చేరుకోవడం కష్టమనే భావనతో మహిళా ప్రజా ప్రతినిధులు శిక్షణకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో సర్పంచ్లకు ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వకుండా అధికార పార్టీ నేతలకే పెత్తనమిచ్చారు. అధికారులు సైతం అందుకు సహకరించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం దక్కని పరిస్థితితుల్లో ఉత్తుత్తి శిక్షణలు తమకు అవసరమా అంటూ మహిళా సర్పంచ్లు పెదవి విరుస్తున్నారు. కనిగిరిలో శిక్షణకు మహిళా సర్పంచ్లు హాజరుకాకపోవడంపై ఎంపీడీఓ ప్రభాకర్ శర్మను వివరణ కోరగా.. ‘తొలిరోజు కావడంతో పూర్తిగా హాజరు కాలేదు. శిక్షణకు వచ్చిన వారికి సిట్టింగ్ చార్జీ కింద ప్రభుత్వం రూ.100 చెల్లించే అవకాశం ఉంది. రవాణ చార్జీలు ఎంత అనేదానిపై ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. శిక్షణకు అందరు మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లలో మహిళా సర్పంచ్లకు శిక్షణ ప్రారంభం పదవీ కాలం ముగియనున్న సమయంలో శిక్షణ తరగతులు ఎందుకో? కూటమి ప్రభుత్వ తీరుపై మహిళా సర్పంచ్ల ఆగ్రహం ప్రజాప్రతినిధులకు రవాణా ఖర్చులు కూడా ఇవ్వని వైనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 567 మంది మహిళా సర్పంచ్లు కనిగిరిలో 64 మందికిగాను వచ్చింది ఆరుగురే.. మర్కాపురంలో 61 మందికిగాను పది మంది హాజరు -
పొగాకు రైతు నిలువు దోపిడీ
కొండపి/టంగుటూరు: వేలం కేంద్రాల్లో రైతులను వ్యాపారులు నిలువునా దోచేస్తున్నారు. ఈ ఏడాది పెరిగిన పొగాకు ఖర్చులకు, వేలంలో వస్తున్న ధరలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. వేలం అధికారులు సైతం వ్యాపారులకు మద్దతుగా ఉండటంతో రోజు రోజుకు ధరలు దిగజారుతున్నాయి. ఓ వైపు దిగజారుతున్న ధరలు, మరో వైపు నిత్యం వందల సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్న బేళ్లతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలంలో గరిష్టంగా రూ.280 ధర ఇస్తున్నారు. కానీ వ్యాపారులు సిండికేట్గా మారి కేవలం 20 శాతం బేళ్లను మాత్రమే ఈ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన బేళ్లను కనిష్ట ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరో పక్క లోగ్రేడ్ పొగాకు ధరలు రోజు రోజుకూ దిగజారుతున్నాయి. వేలం ప్రారంభంలో రూ.240 పలికిన లో గ్రేడ్ పొగాకు ప్రస్తుతం రూ.165కు పడిపోయింది. రానున్న రోజుల్లో లో గ్రేడ్పొగాకు ధర మరింత పడిపోతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వందల బేళ్ల తిరస్కరణ వేలం కేంద్రానికి సోమవారం క్లస్టర్ పరిధిలోని గోగినేనివారిపాలెం, అక్కచెరువుపాలెం, పైడిపాడు గ్రామాలకు చెందిన రైతులు 1024 బేళ్లను వేలానికి తీసుకురాగా 732 బేళ్లను కొనుగోలు చేసి 287 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.165 పలకగా సరాసరి రూ.248.23గా నమోదైంది. వేలంలో 24 కంపెనీలు పాల్గొన్నా..నాలుగైదు కంపెనీలు మాత్రమే ఎక్కువ శాతం పొగాకు కొనుగోలు చేశాయి. రైతులు తీసుకువచ్చిన బేళ్లలో ఎక్కువ శాతం బేళ్లను రూ.165 నుంచి రూ.240 వరకు కొనుగోలు చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన వేలంలో కేవలం 160 బేళ్లకు మాత్రమే గరిష్ట ధర రూ.280 రాగా మిగిలిన బేళ్లకు కనిష్ట ధరలు వేశారని రైతులు వాపోయారు. అదనపు భారం రోజుకు వందకు పైగా బేళ్లను వ్యాపారులు తిరస్కరించడంతో మరొకసారి వేలానికి తీసుకురావడానికి ఖర్చులు పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. పొగాకు బోర్డు అధికారులు బయ్యర్లతో సంప్రదింపులు చేసి గిట్టుబాటు ధరకు పొగాకును కొనుగోలు చేయాలని కోరుతున్నారు. అధికారులు మొక్కుబడిగా వేలం కేంద్రాలకు పరిశీలనకు వచ్చి వెళుతున్నారే తప్ప రైతుల గోడు ఆలకించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టంగుటూరు వేలం కేంద్రానికి 958 బేళ్లు రాగా 207 బేళ్లను తిరస్కరించి 751 కొనుగోలు చేశారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.180 పలికి సరాసరి రూ.239.34గా నమోదైంది. వేలంలో 20 శాతం బేళ్లకే గరిష్ట ధర మిగిలిన 80 శాతం బేళ్లకు కనిష్టమే.. రోజు రోజుకూ దిగజారుతున్న లో గ్రేడ్ పొగాకు ధర వ్యాపారుల సిండికేట్తో రైతులకు తీరని నష్టం -
రాష్ట్రంలో దుర్మార్గపు పాలన
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వికృత రాజకీయం, విషపూరిత ప్రచారం చేస్తోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ఒంగోలు నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయిందని, దానిని నిలదీస్తున్న వారి గొంతులు నొక్కేస్తోందని విమర్శించారు. జిల్లాలోని పొదిలి, పల్నాడులో జరిగిన ఘటనలు, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి అక్రమ అరెస్టులే అందుకు నిదర్శనమని అన్నారు. వీటిని అందరూ ఖండించాలన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా యువతకు అన్యాయం చేయడం అలవాటని మండిపడ్డారు. ఆనాడు నిరుద్యోగ భృతి ఇస్తామని కొందరికే ఇచ్చి మంగళం పలికేశారన్నారు. మళ్లీ అధికారంలోకి రావడానికి జాబ్ క్యాలెండర్, ఉద్యోగం వచ్చే వరకూ రూ.3 వేల నిరుద్యోగ భృతి, ఏటా ఐదు లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లు 25 లక్షల మందికి ఉద్యోగాల హామీలు గుప్పించారన్నారు. బీసీలకు పది వేల కోట్ల ప్రత్యేక నిధి, ఐదు వేల కోట్ల ఆదరణ, ఆరోగ్యశ్రీపై ఎన్నో హామీలిచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల్లో కూటమి పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే రూ.81 వేల కోట్లు అవసరం అవుతాయన్నారు. ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం వెచ్చించింది మాత్రం 10 శాతం కూడా లేదని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలన్నీ ఇచ్చేశామని, వీటికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే నాలుక మందం అని చంద్రబాబు అనడం సరికాదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నింటినీ ఎగ్గొట్టారని ఆరోపించారు. ఏడాది పూర్తయిన తర్వాత తొలి అడుగు అంటూ ఉత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పొదిలి జగన్ పర్యటనకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనమే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే.. అది ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నుంచే వస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పటి వరకూ ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఆ స్థాయిలో నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే.. ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని దుయ్యబట్టారు. పశ్చిమ ప్రకాశానికి సంజీవనిగా ఉన్న ఈ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కారన్నారు. రైతుల పరిస్థితి దారుణం... కూటమి ఏడాది పాలనలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఎమ్మెల్యే తాటిపర్తి మండిపడ్డారు. గతంలో రూ.24 వేలు అమ్మిన తేజ రకం మిర్చి నేడు రూ.పది వేలకు కూడా అమ్ముడుపోవడం లేదన్నారు. పత్తి రైతు పరిస్థితి కూడా అంతేనన్నారు. ఇక, పొగాకు రైతు పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. నాణ్యమైన పొగాకును సైతం కొనే వారు కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా రైతులు సాగు విరామాన్ని ప్రకటించారన్నారు. ఇవన్నీ చూస్తే పెద్ద మొత్తంలో ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. కచ్చితంగా ప్రజలు తిరగబడతారన్నారు. కూటమి పార్టీల నాయకులను ప్రజలు ధ్వేషిస్తున్నారని, ఏడాది కాలంలో ఇంత వ్యతిరేకత రావడం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారని విమర్శించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డికి లిక్కర్తో సంబంధాలుంటే ముందే ఎఫ్ఐఆర్లో ఎందుకు ఆయన పేరు లేదని తాటిపర్తి ప్రశ్నించారు. చెవిరెడ్డి గన్మెన్లలో మీకు అనుకూలంగా చెప్పిన వారికి ప్రమోషన్లు ఇచ్చి ఆక్టోపస్లో చేరారని, మీకు సహకరించని వారు ఆస్పత్రి పాలయ్యారని ధ్వజమెత్తారు. ఇందంతా పరిశీలిస్తే ప్రభుత్వ కుట్రకోణం అర్థమవుతోందన్నారు. దీనిని వైఎస్సార్ సీపీ ఖండిస్తోందన్నారు. చెవిరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రెడ్ బుక్ పాలన కొనసాగితే మరింత వ్యతిరేకత... రాష్ట్రంలో ఇదేవిధంగా రెడ్ బుక్ పాలన కొనసాగితే ప్రజల నుంచి మరింత వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందని ఎమ్మెల్యే తాటిపర్తి హెచ్చరించారు. యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, మొదటి సంతకం పెట్టిన డీఎస్సీకి అతీగతీలేదని విమర్శించారు. ఏడాదికి ఐదు లక్షల మందికి ఉద్యోగాల మాట దేవుడెరుగు, అధికారంలోకి వచ్చాక సుమారు నాలుగు లక్షల మంది ఉద్యోగాలు పీకేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా సువర్ణ పరిపాలన అని ఆయన ప్రశ్నించారు. దీనిని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్నారు. స్వర్ణాంధ్ర చేస్తున్నామని చెబుతూ వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ వారిని ఖైదీలుగా మారుస్తున్నారన్నారు. ఏడాది కాలంలో ఒక్క కంపెనీ రాలేదని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఒక పెట్టుబడి లేదని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీని తొలగించి రాష్ట్రాన్ని రోగాంధ్రగా మార్చేస్తున్నారని, ఆరోగ్యశ్రీ లేక రోగాలతో అల్లాడుతున్న ప్రజల్ని పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు. బీసీలకు మైనింగ్లో 20 శాతం రాయితీ ఇస్తామన్నారని, జిల్లాలో ఒక్క బీసీకై నా మైన్ ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. మత్స్యకారులు, అర్చకులు, నాయీ బ్రాహ్మణులందర్నీ మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని గుర్తుచేశారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు జగన్ పర్యటనల్లో ప్రజా స్పందనే నిదర్శనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారు ఫేక్ వీడియోతో జగన్పై అసత్య ప్రచారం ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్యే తాటిపర్తి ధ్వజం -
జగన్పై ప్రభుత్వం కుట్రలు
ఒంగోలు సిటీ: పల్నాడుకు వెళుతున్న జగన్ కారుకింద పడి సింగయ్య చనిపోయారంటూ అబద్ధపు ప్రచారాన్ని సృష్టించారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఒక కల్పితమైన చిన్న వీడియోను ప్రచారంలోకి తీసుకొచ్చారన్నారు. ఆ వీడియోను గమనిస్తే వాహనం కిందపడిన వ్యక్తి గురించి ఆ వాహనం వెళ్లిన తర్వాత తెలిసే అవకాశం ఉండదా అని ఆయన ప్రశ్నించారు. ఒక్కసారి ఆలోచిండండి టైర్ దగ్గర మాత్రమే సింగయ్య ఉన్నట్టు చూపిస్తున్నారన్నారు. మీ దగ్గర ఉన్న పూర్తి వీడియో విడుదల చేయొచ్చుగా అని నిలదీశారు. వేలాదిగా తరలి వచ్చిన జనం నుంచి టైర్ కింద ఆ వ్యక్తినే ఎలా తీయగలిగారని, కేవలం 20 సెకన్ల వీడియో ఎలా వచ్చిందని, ఆ సమయంలో ఉన్న మీ సెక్యూరిటీ సిబ్బంది ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు కాన్వాయ్ ముందు ఉంటుందని, అది దాటుకుని సింగయ్య ఎలా వచ్చి పడ్డారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇన్ని రోజుల తర్వాత ఆ వీడియోను విడుదల చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎస్పీనే అన్ని రకాలుగా విచారణ జరిపి ప్రమాదం జరిగింది జగన్ కాన్వాయ్లోని కారు కాదని చెప్పారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆయన మీద ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చి మాట మార్పించారని ధ్వజమెత్తారు. జెడ్ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి బుల్లెట్ ప్రూఫ్ ఉన్న కారును నడిపేందుకు ప్రభుత్వ డ్రైవర్ ఉంటారన్న విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారు. వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మంచి వాహనాన్ని ఇవ్వకపోతే ప్రభుత్వ అనుమతితో సొంత వాహనాన్ని కొనుగోలు చేసిన విషయం నిజం కాదా అన్నారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వెళుతుంటే రోప్ పార్టీ ఉండాలి కదా అని ప్రశ్నించారు. పొదిలి, పల్నాడులకు జగన్ వెళ్లినపుడు జడ్ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి సరైన భద్రత కల్పించలేదని ఆరోపించారు. సెక్యూరిటీ ఇవ్వలేమని స్పష్టం చేయండని నిలదీశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కనీస భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇది దుర్మార్గపు చర్య అని అన్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆంక్షలు పెట్టామా? రాష్ట్రమంతా అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగినా మేము ఆపామా అని అన్నారు. యువగళం పేరుతో ఎర్రబుక్ పట్టుకుని లోకేష్ తిరిగినా ఆపామా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు మీరు, మీ కుమారుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ కలసి స్వేచ్ఛగా తిరిగారు కదా? మీకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదా అని ప్రశ్నించారు. సింగయ్య మా పార్టీకి చెందిన వ్యక్తి.. ఆయన చనిపోవడం విచారకరం, ఆయన కుటుంబానికి మా పార్టీ అండగా నిలిచిందన్నారు. కందుకూరులో మీ ప్రచారయావకు ఎనిమిది మంది చనిపోతే ఏం ఆదుకున్నారని, మీరు అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబాల్లో ఎవరికై నా ఉద్యోగాలు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. గుంటూరులో చీరలు పంచుతూ ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారే వారికి ఏం న్యాయం చేశారని, గోదావరి పుష్కరాల్లో చనిపోయిన కుటుంబాలను, వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో చనిపోయిన వారి ఆదుకున్నారా అని నిలదీశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కావా అని తాటిపర్తి ప్రశ్నించారు. నిరంకుశ పరిపాలనకు స్వస్తి పలికి ప్రజలకు మేలు చేయాలన్నారు. ఫేక్ వీడియోతో అసత్య ప్రచారం 20 సెకన్ల వీడియో ఎక్కడ నుంచి వచ్చిందో బయటపెట్టాలి అబద్ధాలు చెప్పుకుంటూ మీరు పర్యటించినప్పుడు మా ప్రభుత్వం అడ్డుకోలేదు కదా.. జడ్ప్లస్ కేటగిరీ ఉన్న జగన్కు సరైన భద్రత కల్పించడంలేదు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి ధ్వజం -
పిడికిళ్లు ఎగసి!
ఆంక్షలు చెరిపేసి..సాక్షిప్రతినిధి, ఒంగోలు: లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాం.. అంత వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామంటూ అన్ని రకాలుగా ప్రభుత్వం మోసం చేసిందంటూ యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు నగరంలో నిర్వహించిన ‘యువత పోరు’కు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం నుంచే కలెక్టరేట్ చుట్టుపక్కల భారీగా పోలీసు బలగాలను దించారు. అంబేడ్కర్ భవనానికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా సామాన్య జనాన్ని కూడా రాకపోకలు సాగించకుండా కట్టడి చేశారు. చివరికి అంబేడ్కర్ భవనం సమీపంలో పాత రిమ్స్ లోపల నుంచి కలెక్టరేట్కు వెళ్లే కాలిబాట వద్దకు కూడా పోలీసులను కాపలా పెట్టారు. ఎటుచూసినా పోలీసు బలగాలే. కలెక్టరేట్ పరిసరాల్లో కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారు. ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, పలువురు ఎస్సైలు, సీఆర్పీఎఫ్ బలగాలు, స్పెషల్ బ్రాంచి, ఇంటలిజెన్స్ పోలీసు విభాగాలను రంగంలోకి దించి హడావుడి సృష్టించారు. డ్రోన్ కెమెరాలతో యువత పోరుకు హాజరైన వారిని చిత్రీకరించారు. ఏదో జరిగిపోతుందోన్న భయానక వాతావరణాన్ని కల్పించారు. అంబేడ్కర్ భవనం నుంచి కలెక్టరేట్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం ఇస్తామని చెప్పినా పోలీసు అధికారులు ససేమిరా అన్నారు. అక్కడ నుంచి కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వెళ్లడానికి పోలీసులు కేవలం 50 మంది మాత్రమే అనుమతించారు. వినతిపత్రం అందించడానికి కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతి ఇచ్చారు. స్పందన కార్యక్రమంలో ఉన్న కలెక్టర్ వెళ్లిపోవడంతో డీఆర్వో ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆంక్షలు తమను నిలువరించలేవంటూ జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, యువజనులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంబేడ్కర్ భవన్ నుంచి ప్రధాన రహదారి పైన ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీగా తరలివచ్చారు. తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతృత్వ పాలన తగదు : అన్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శించారు. ప్రజలకు అండగా పోరాటాలు చేస్తోన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రభుత్వం వెనకాడటం లేదని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేశారని, హామీల అమలు కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ వెనకడుగు వేయలేదని చెప్పారు. హామీల అమలు కోసం ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సి వస్తోందని, అయినా దున్నపోతు మీద వర్షం కురిసినట్లు కూటమి పాలకులు మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జైల్ భరోకు కూడా సిద్ధమే : చుండూరి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతూ శాంతియుతంగా ర్యాలీ చేయడానికి వస్తే సవాలక్ష ఆంక్షలతో పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు విమర్శించారు. యువత పోరుకు జిల్లా వ్యాప్తంగా తరలివస్తున్న విద్యార్థి యువజన నాయకులను ఎక్కడికక్కడ నిలిపేసి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని చెబితే కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఉందని అంటున్నారనీ ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజా సమస్యలను మరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. పొదిలిలో పొగాకు రైతులకు మద్దతు తెలపడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తే మహిళలను అడ్డుపెట్టుకొని గొడవలు సృష్టించారని ఆరోపించారు. గొడవలు సృష్టించిన వారిని వదిలేసి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికై నా అరెస్ట్లు ఆపకపోతే జైల్భరో కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి, యువజనులు తమ సమస్యల పరిష్కారం కోసం సామాజిక మాధ్యమాలను బలంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. అయితే భాష విషయంలో ఎక్కడా అదుపు తప్పవద్దని, అభ్యంతర కర పదాలను ఉపయోగించవద్దని సూచించారు. కక్ష సాధింపులతో కాలయాపన : దద్దాల అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మీద అక్రమంగా కేసులు బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలతో కాలయాపన చేస్తోందని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు. నెలకొక అంశాన్ని తీసుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. హామీలు నెరవేర్చండి : శ్రీకాంత్రెడ్డి గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు రాష్ట్రంలోని యువతకు ఎన్నో హామీలు ఇచ్చారని ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రచారం చేశారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా కనీసం ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుద్యోగులను తొలగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి పాలకులు యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే భవిష్యత్లో మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నిరుద్యోగులకు మోసం: పల్నాటి ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను, అన్నీ వర్గాల ప్రజలను నిట్టనిలువునా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి విమర్శించారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్క్యాలెండర్ ఇస్తామని చెప్పారని, నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు వాటిని అమలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం పాలన సంవత్సరం దాటినా ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిట్టనిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, ఒంగోలు రూరల్ మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల యూత్ రీజినల్ ఇన్చార్జ్ వెంకటాద్రి, ప్రకాశం, నెల్లూరు రీజినల్ ఇన్చార్జ్ దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, పార్టీ జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజీవ్, ఒంగోలు, సంతనూతలపాడు, కనిగిరి, కొండపి, యర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల యువజన విభాగం అధ్యక్షులు మల్లిశెట్టి దేవ, అన్వేర్, రాజశేఖరరెడ్డి, గంగాధరరెడ్డి, ఆళ్ల క్రిష్ణారెడ్డి, జంకె క్రిష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు వేముల శ్రీకాంత్, ఒంగోలు టౌన్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఖాదర్, దర్శి, కనిగిరి, కొండపి విద్యార్థి విభాగాల అధ్యక్షులు మహేంద్రరెడ్డి, మహేంద్రరెడ్డి, సునీల్, యువజన విభాగం జనరల్ సెక్రటరీ ముల్లంగి రవీంద్రారెడ్డి, రాష్ట్ర స్టూడెంట్ సెక్రటరీ రవీంద్ర, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గాలిమోటు దేవప్రసాద్, దర్శి ఎస్సీ విభాగం అధ్యక్షుడు జి.ఏసుదాసు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ చుట్టూ మొహరించిన పోలీసు బలగాలు బారికేడ్లు ఏర్పాటు చేసి యువతను నిలువరించిన పోలీసులు ప్రభుత్వ వైఫల్యంపై నినదించిన యువత జిల్లా నలుమూల నుంచి భారీగా తరలి వచ్చిన నిరుద్యోగులు, విద్యార్థులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు వినతి పత్రానికి 50 మందికే అనుమతి.. నిరుద్యోగులను నిట్టనిలువునా మోసం చేసిన చంద్రబాబు హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం యువతపోరు ర్యాలీలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శాంతియుత ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే తాటిపర్తి ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులుపోలీసుల ఆంక్షలతో కర్ఫ్యూను తలపిస్తున్న కలెక్టరేట్ పరిసరాలుయువతకు వెన్నుపోటు: ఎమ్మెల్యే తాటిపర్తి అబద్ధాలు, అసత్యాలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఏడాది పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా విద్యార్థులు, యువకులకు వెన్నుపోటు పొడిచారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. పక్క రాష్ట్రాల్లోని సైబరాబాద్, సైబర్సిటీలను రంగుల్లో చూపించి ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఎగనామం పెట్టారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘యువత పోరు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రసంగించారు. రాష్ట్రంలోని యువకులకు ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు ఇస్తానని, లేకపోతే ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని గత ఎన్నికల సమయంలో చేసిన ప్రచారాన్ని గుర్తు చేశారు. ఏడాది పాలన పూర్తయినా నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వలేదని, ఏడాదికిగాను రూ.36 వేలు బకాయిలు చెల్లించకుండా మోసం చేసిన చంద్రబాబును నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మెప్పు పొందటం కోసం ఒక్కరోజులో రూ.350 కోట్లు ఖర్చు పెట్టి యోగాంధ్ర నిర్వహించారని, దీనికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలని నిలదీశారు. గిన్నిస్బుక్లో ఎక్కాలని కోట్లు ఖర్చు చేస్తే జనాలు మ్యాట్ల కోసం కొట్టుకోవడమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. రూ.4200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, రూ.2200 కోట్ల వసతి దీవెన, మొత్తం కలిపి రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.750 కోట్లు మాత్రమే విడుదల చేశారని విమర్శించారు. అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చారని, రాష్ట్రంలో 84 లక్షల మంది తల్లులు ఉంటే 50 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం ఇచ్చాడని ధ్వజమెత్తారు. ఎక్కడో ఒక చోట ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి తల్లికి వందనం ఇచ్చి పచ్చమీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పొగాకు రైతులను పరామర్శించడానికి వస్తే మహిళలతో నిరసనలు చేయించి గొడవలు సృష్టించారని వైఎస్సార్సీపీ కార్యకర్తల మీదనే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్న ఎమ్మెల్యే తాటిపర్తి, మాజీ ఎమ్మెల్యే రాంబాబు, చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ, పల్నాటి రవీంద్రారెడ్డి, శ్రీకాంత్రెడ్డి తదితరులుకలెక్టరేట్లోకి ఎవరినీ వెళ్లనీయకుండా ప్రధానద్వారం వద్ద మోహరించిన పోలీసులుఅంబేడ్కర్ విగ్రహం సమీపంలో బారికేడ్లను అడ్డుపెట్టి రాకపోకలు అడ్డుకుంటున్న పోలీసులు -
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలివ్వండి
ఒంగోలు టౌన్: అరకొర జీతాలతో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కరించాలని కోరుతూ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు కేవీ సుబ్బమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు అన్న పదాన్ని తొలగించాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెరిగిన కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ ఐక్య పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. సుదీర్ఘ కాలంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న అంగన్వాడీల పోరాటాలకు సీఐటీయూ అండగా నిలబడుతుందని తెలిపారు. సీఐటీయూ ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీల పిల్లలకు తల్లికి వందనం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ యూనియన్ గౌరవాధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ గతంలో 42 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కూటమి పాలకులు నిలబెట్టుకోవాలని కోరారు. అనంతరం వినతి పత్రం తీసుకునేందుకు ఐసీడీఎస్ పీడీ తిరస్కరించారు. దాంతో డీఆర్ఓ చిన ఓబులేసుకు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో అంగన్వాడీ యూనియన్ నాయకులు సుజాత, తిరుపతమ్మ, ఎల్లమ్మ, సీఐటీయూ ఉపాధ్యక్షుడు బంకా సుబ్బారావు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకుడు చిరంజీవి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధిపై దాడి
పొన్నలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. అధికారం ఉందనే అహంతో తెలుగు తమ్ముళ్లు సామాన్యులు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై అకారణంగా దాడులకు తెగబడుతూ గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా ప్రతినిధిపై టీడీపీ వర్గీయులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన పొన్నలూరు మండలం కే అగ్రహారం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితుని కథనం మేరకు... మండలంలోని బోగనంపాడు గ్రామానికి చెందిన ముళ్లమూరి గోపి వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా ప్రతినిధిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఇది చూసి ఓర్వలేని గ్రామంలోని కొందరు తెలుగు తమ్ముళ్లు అప్పుడప్పుడూ గోపిని దుర్భాషలాడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అయినా సరే వారితో గొడవ అనవసరమని గోపి ఎక్కడా సహనం కోల్పోకుండా గ్రామంలో తనపని తాను చేసుకుంటు ఉన్నాడు. అయితే గోపిపై ఎలాగైనా దాడిచేసి వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా భయపెట్టాలని పన్నాగం పన్నారు. ఈ క్రమంలో ఆదివారం బోగనంపాడు గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు మేకల మధు, మీసాల నాగేశ్వరరావు, ముత్తంగి మల్లికార్జున కే అగ్రహారంలోని మద్యం షాపు దుకాణం సమీపంలోకి వెళ్లి మేకల మధు ఫోన్ చేసి పని ఉంది నీతో మాట్లాడాలి రమ్మని గోపిని కే అగ్రహారం పిలిచాడు. ఈ లోపు కే అగ్రహారానికి చెందిన ఎస్కే బాషని పిలిపించి మాట్లాడారు. గోపి వచ్చిన తరువాత అతనిపై దాడి చేస్తే మద్యం ఇప్పిస్తామని రెచ్చగొట్టి బాషతో దాడి చేయడానికి సిద్ధం చేశారు. కొంత సమయం తరువాత గోపి రావడంతో నలుగురు కలిసి అతనితో మాటలు కలిపి గొడవకు దిగారు. ఇంతలో బాష ఒక్కసారిగా పక్కనే ఉన్న రాయి తీసుకొని గోపి తలపై కొట్టి దాడి చేశాడు. నలుగురు కలిసి గోపిపై దాడి చేస్తుండటంతో ఇంతలో చుట్టుపక్కల వారు దాడిని గమనించి అడ్డుపడగా మేకల మధు, మీసాల నాగేశ్వరరావు, ముత్తంగి మల్లికార్జున అక్కడ నుంచి తప్పించుకోవడంతో బాషను పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన గోపిని చికిత్స కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. అలాగే పట్టుబడిన బాషను గ్రామస్తులు పొన్నలూరు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. జులాయిగా తిరుగుతుంటారు... ఇదిఇలా ఉంటే గోపిపై దాడిచేసిన మేకల మధు, మీసాల నాగేశ్వరరావు, ముత్తంగి మల్లికార్జున, ఎస్కే బాష నిత్యం మద్యం తాగుతూ జులాయిగా తిరుగుతుంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు వీరి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయని అంటున్నారు. అలాగే బాష బైక్లు చోరీ చేస్తుంటాడని, అతనిపై శ్రీకాకుళంలో కేసు కూడా ఉన్నట్లు సమాచారం. గోపి వైఎస్సార్సీపీలో యాక్టివ్గా ఉండటం ఓర్చుకోలేని వీరు అతనిపై దాడి చేయించారని, అతన్ని చంపాలనే ఈ దాడికి తెగబడ్డారని గోపి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు ఫిర్యాదు అందిందని, ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై అనూక్ తెలిపారు. ఫోన్ చేసి పిలిపించి రాయితో దాడిచేసిన టీడీపీ వర్గీయులు తలకు తీవ్ర గాయం, ఆస్పత్రికి తరలింపు -
సత్తాచాటిన బల్లికురవ ఎడ్లు
పామూరు: మండలంలోని బొట్లగూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కమ్మవారిపాలెం, రఘునాథపురం సమీపంలోగల అచ్చమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఎడ్ల బండలాగుడు పోటీల్లో బాపట్ల జిల్లా బల్లికురవ ఎడ్ల జత ప్రథమస్థానంలో నిలిచింది. పోటీల్లో మొత్తం 4 జతల ఎడ్లు పాల్గొన్నాయి. బల్లికురవకు చెందిన పావులూరి వీరాస్వామిచౌదరి ఎడ్లు నిర్దేశిత సమయంలో 2 వేల అడుగుల మేర బండ లాగి ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాయి. మార్కాపురం మండలం బొడిచర్ల గ్రామానికి చెందిన తిండి నక్షత్రారెడ్డి, ధ్రువసాయిరామరెడ్డి ఎడ్ల జత ద్వితీయస్థానం, బేస్తవారిపేట మండలానికి చెందిన లక్కు నాగశివశంకర్ ఎడ్లు తృతీయ స్థాఽనం, నంద్యాల జిల్లా గడివేముల మండలం పెసరవాయికి చెందిన సయ్యద్ కలాంబాషా ఎడ్ల జత నాలుగో స్థానంలో నిలిచాయి. ప్రథమ బహుమతి రూ.50 వేలను పి.మల్లికార్జున సంపూర్ణ, ద్వితీయ బహుమతి రూ..30 వేలను మల్లికార్జున, కృష్ణకుమారి, గురజాల వెంకటేశ్వర్లు, పత్తిపాటి రమణయ్య, తృతీయ రు.20 వేలను గుర్రం మాల్యాద్రి, గణపతి, సుజాత, నాలుగో బహుమతి రు.10 వేలను డేరంగుల శ్రీను, ప్రశాంతి సమకూర్చగా ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. ఇద్దరు టీచర్లకు జాతీయ విద్యారత్న అవార్డు కురిచేడు: మండలంలోని ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయినులను జాతీయ విద్యారత్న అవార్డు వరించింది. గొల్లపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు బిజ్జం రమాదేవి, కురిచేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు చెరుకూరి జ్యోతిర్మయికి ఛత్తీస్గడ్ కేంద్రంగా నిర్వహిస్తున్న నవాచారి గతి విధియాన్ గ్రూప్ అవార్డులు అందజేసింది. 2024–205 ఏడాదికిగాను ప్రకటించిన ఈ అవార్డులకు ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది ఎంపిక చేయగా అందులో కురిచేడు మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయినులకు చోటు దక్కడం విశేషం. విద్యార్థులకు వినూత్నమైన, సత్ఫలితాలు ఇచ్చే రీతిలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులకు నవాచారి గతివిధియాన్ సంస్థ ఏటా అవార్డులు అందజేస్తోంది. అవార్డు సర్టిఫికెట్, మెమొంటో, పెన్ను స్పీడ్ పోస్ట్లో అందుకున్న ఇద్దరు టీచర్లను సహోద్యోగులు అభినందించారు. -
మూఢనమ్మకాల నిర్మూలనే జేవీవీ లక్ష్యం
● జేవీవీ జాతీయ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కే.నాగేశ్వరరావు పామూరు: మూఢ నమ్మకాల నిర్మూలనే జనవిజ్ఞాన వేదిక లక్ష్యమని, యువత మూఢనమ్మకాలకు దూరంగా ఉండి శాసీ్త్రయ దృక్పథం వైపు ఆలోచించాలని జేవీవీ జాతీయ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు అన్నారు. జేవీవీ ప్రకాశం జిల్లా 18వ మహాసభలు ఆదివారం పామూరు మమూరి ఫంక్షన్ హాలులో షేక్.నాయబ్రసూల్ అధ్యక్షతన నిర్వహించారు. మహాసభల సందర్భంగా జాతీయ జెండాను ఎస్సై టి.కిషోర్బాబు ఆవిష్కరించారు. మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన జేవీవీ జాతీయ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు మాట్లాడుతూ సైన్స్, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా మూఢనమ్మకాలు మాత్రం తగ్గడంలేద న్నారన్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రజల్లో శాసీ్త్రయ దృక్పథం పెరగాలన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ను పూర్తిచేసి ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలని, పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, యూనివర్సిటీలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీచేయడంతోపాటు నిధులు మంజూరు చేయాలని తీర్మానాలు ప్రవేశపెట్టారు. మహాసభల్లో ప్రదర్శించిన మేజిక్ ఆహూతులను అలరించింది. జేవీవీ జాతీయ సలహాదారుడు మియా పాటలు ఆలోచింపజేశాయి. అనంతరం 15 మందితో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జేవీవీ జాతీయ ఉపాధ్యక్షుడు షేక్.గయాజ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే.శ్రీనివాసులు, జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లా మధు, జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంజూరుబాష, జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల వెంకటేశ్వర్లు, జిల్లా గౌరవాధ్యక్షుడు జేసీహెచ్ వెంకటేశ్వర్లు, సుజాత, స్వయంకృషి స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షుడు డాక్టర్ నాయబ్రసూల్, మానవత సేవాసంస్థ అధ్యక్షుడు వి.వెంకటేశ్వరరెడ్డి, జే.గోవిందయ్య, టి.వెంకటేశ్వర్లు, పోలేపల్లి సిద్దయ్య, కొమ్మరెడ్డి కొండమ్మ, ధనుంజయ, మీనా, మధు, ఫణి, డాక్టర్ కేటీసీ పాపారాయుడు, సభ్యులు పాల్గొన్నారు. -
యువత చిత్తు
వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో జల్లులు పడవచ్చు.సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025గంజాయి మత్తు..పశ్చిమ ప్రకాశంలో గుప్పుమంటున్న గంజాయి నిన్నా మొన్నటి వరకు జిల్లా కేంద్రానికి పరిమితమైన గంజాయి ఈ ఏడాది కాలంలో పశ్చిమ ప్రకాశానికి విస్తరించినట్లు సమాచారం. యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, మార్కాపురం, గిద్దలూరు, కంభం, కనిగిరి, పొదిలి ప్రాంతాలు గంజాయికి అడ్డాగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. పశ్చిమంలోని మార్కాపురం, బేస్తవారిపేట, గిద్దలూరు, కంభం ప్రాంతాల్లో ఎక్కువగా బీఈడీ, ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కొందరు గంజాయి వ్యాపారులు గుట్టుగా దందా సాగిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. శనివారం గిద్దలూరులో ఒడిశా నుంచి గంజాయిని తరలించి విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది కంభంలోని హైవే పై ఉన్న ఒక లాడ్జిలో ముగ్గురు యువకులను అరెస్టు చేసి వారి నుంచి గంజాయితోపాటుగా మత్తుమాత్రలను కూడా స్వాధీనం చేసుకున్నారు. యర్రగొండపాలెంలో కూడా పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఇటీవల పుల్లలచెరువులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి 1.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బేస్తవారిపేట మండలం మోక్షగుండంలో ఒక సాధువు, మరో ఇద్దరు యువకుల నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.జిల్లాను గంజాయి పట్టిపీడిస్తోంది. తూర్పు, పశ్చిమం తేడాల్లేకుండా జిల్లాలోని అన్నీ ప్రాంతాల్లో యథేచ్ఛగా గంజాయి విక్రయిస్తున్నారు. విద్యార్థులు సైతం గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా కేజీలకొద్దీ గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. గంజాయి మత్తులో ఘర్షణలు, నేరాలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు మొక్కుబడి దాడులతో సరిపెడుతున్నారు. ● జిల్లాలో యథేచ్ఛగా గంజాయి విక్రయాలు, వినియోగం ● మారుమూల గ్రామాలకు విస్తరించిన గంజాయి వ్యాపారం ● గంజాయి మత్తులో హత్యలకు పాల్పడుతున్న వైనం ● ఒంగోలు నగరంలో కేవలం రెండు రోజుల వ్యవధిలో 50 కిలోల గంజాయి పట్టివేత ● గంజాయి విక్రేతలుగా పట్టుబడుతున్న విద్యార్థులు ● మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు ● నామమాత్రపు దాడులతో సరి గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన బీటెక్ విద్యార్థి గంజాయి విక్రయిస్తూ ఒక బీటెక్ విద్యార్థి పోలీసులకు పట్టుబడడం సంచలనం సృష్టించింది. టంగుటూరు మండల పరిధిలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థి ఒకరు విశాఖపట్నం నుంచి 5 కిలోల గంజాయి తీసుకొచ్చాడు. వల్లూరులోని ఒక హోటల్ వెనుక ఉన్న హాస్టల్లో దాచి ఉంచాడు. ఈలోపు పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నారు. అంతేకాకుండా జిల్లాలోని అనేక ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు గంజాయికి అలవాటు పడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా కాలేజీ హాస్టల్లోని గదులనే గంజాయి డెన్లుగా మార్చుకున్న ఘటనలు ఉన్నాయి. విద్యార్థుల మధ్య జరుగుతున్న ఘర్షణలకు ప్రధాన కారణం గంజాయి మత్తేనని ఒక పోలీసు అధికారి చెప్పడం గమనార్హం. జిల్లాలోని కళాశాలలు, కాలేజి హాస్టళ్లలోని విద్యార్థులకు గంజాయిపై అవగాహన కల్పించేందుకు పోలీసులు అట్టహాసంగా ప్రారంభించిన కార్యక్రమాలన్నీ ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గతంలో కూలీలు, సాధువులు, బిచ్చగాళ్లు మాత్రమే గంజాయి వినియోగించేవారు. ఇప్పుడు విద్యార్థులు, యువకులు కూడా గంజాయి మత్తుకు అలవాటు పడిపోతున్నారు. పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన గంజాయి పల్లెలకు పాకింది. మేము అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే గంజాయిని కట్టడి చేశామని కూటమి పాలకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకుల అండదండలతో గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు గంజాయి వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటూ నామమాత్రపు దాడులతో సరిపుచ్చుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయి మత్తులో హత్యలు కూడా జరుగుతున్నాయి. తరచుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. అయినా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా గంజాయి: జిల్లా కేంద్రమైన ఒంగోలులో యథేచ్ఛగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. నగరం నలుమూలలా గంజాయి గుప్పుమంటోంది. పగలు రాత్రీ తేడా లేకుండా విద్యార్థులు, యువకులు గంజాయి మత్తులో జోగుతున్నారు. గంజాయి తాగి అర్ధరాత్రిళ్లు గొడవలు సృష్టించడం నిత్యకృత్యమైపోయింది. నగరంలోని గోపాల్ నగర్ ఎక్స్టెన్షన్, వెంకటేశ్వరకాలనీ, ముంగమూరు రోడ్డు చివర, కొత్తకూరగాయల మార్కెట్, గోపికృష్ణ థియేటర్ దగ్గర, బలరాం కాలనీ, అరవకాలనీ, ఇందిరమ్మ కాలనీ, వెంగముక్కలపాలెం రోడ్డు తదితర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. సాయంత్రం 6 గంటలు దాటితే చాలు నగరంలోని మినీ స్టేడియం ప్రాంతంలో గంజాయి బ్యాచ్ చేరుతుంది. అటువైపుగా వెళ్లడానికి మహిళలు భయపడిపోతున్నారు. కొప్పోలు పరిసరాల్లో రాత్రయితే చాలు కొందరు హిజ్రాలు గంజాయి తాగి దారిలో వచ్చిపోయేవారిని వేధిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. రాత్రి 10 గంటలు దాటిన తరువాత నుంచి తెల్లవారుజాము వరకు ఈ ప్రాంతంలో గంజాయి ముఠాలు తిరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గోరంట్ల ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. టీ స్టాల్స్లో కూర్చొని గంజాయి తాగి గొడవలకు దిగుతున్నారు. డాన్బాస్కో ఎదురుగా గోపాల్ నగర్ వెళ్లే చౌరస్తాలో రాత్రిళ్లు గంజాయి ముఠాలు చేరి గొడవలకు దిగుతున్నట్లు సమాచారం. ఆర్టీసీ డిపో పరిసరాల్లో కూడా జోరుగా గంజాయి వ్యాపారం సాగుతోంది. డిపో పరిసరాల్లో 60 అడుగుల రోడ్డు, సుందరయ్య రోడ్డులో ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. డిపోకు ఎక్కడెక్కడ నుంచో ప్రయాణికులు వచ్చిపోతుంటారు. దాంతో ఈ ప్రాంతాన్ని గంజాయి వ్యాపారులు అడ్డాగా చేసుకున్నట్లు సమాచారం. ఏబీఎం కాంపౌండ్లో గంజాయి బ్యాచ్ బెడద ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గంజాయి, మద్యం తాగిన యువకులు మత్తులో ఘర్షణలకు దిగుతున్నారు. రెండు రోజుల క్రితం గంజాయి బ్యాచ్ ఏబీఎం కాంపౌండ్లో విద్యార్థుల మీదకు రాళ్లు విసరగా ఒక చిన్నారికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బాధితులు టూ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాత జిల్లా పరిషత్ కార్యాలయం కూడా గంజాయి అడ్డాగా మారిందని చెప్పుకుంటున్నారు. సత్యనారాయణపురం, కర్నూలు రోడ్డుల్లో గంజాయి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ గుజ్జుల యలమందారెడ్డి కాలనీలో గంజాయి విక్రయిస్తున్న ఒక వృద్ధురాలిని పోలీసులు అరెస్టు చేశారు. టంగుటూరులోని రైల్వే స్టేషన్ వద్ద ఒక దుకాణంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల వ్యవధిలో 50 కిలోల గంజాయి పట్టివేత జిల్లా కేంద్రమైన ఒంగోలులో కేవలం రెండు రోజుల వ్యవధిలో 50 కిలోల గంజాయి పట్టుకోవడం పరిస్థితిని తెలియజేస్తుంది. అదికూడా నగరం నడిబొడ్డులోని అద్దంకి బస్టాండు సెంటర్లో ఒడిశా నుంచి తరలించిన 45 కిలోల గంజాయిని పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అలాగే మరుసటి రోజు మరో 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం గిద్దలూరులో మరో 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం బట్టి చూస్తే జిల్లాలో ఏ స్థాయిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.ఈనెల 14న ఒంగోలులో పట్టుబడిన 44 కేజీల గంజాయి (ఫైల్) -
ఉచిత బస్సు అమలు చేయకపోవడం అన్యాయం
ఒంగోలు టౌన్: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం అన్యాయమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. స్థానిక ఎల్బీజీ భవనంలో ఆదివారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షురాలు జి.ఆదిలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. జిల్లాలో విచ్చలవిడిగా నడుస్తున్న మద్యం దుకాణాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజల మధ్య మత విద్వేషాలను సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో సామరస్య వాతావరణాన్ని దెబ్బతీస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవి కొండారెడ్డి విమర్శించారు. నరేంద్ర మోదీ పాలనలో గత 11 ఏళ్లలో మహిళా రక్షణ, సంక్షేమానికి సంబంధించిన అనేక చట్టాలను నిర్వీర్యం చేశారని చెప్పారు. ఆహార భద్రత, విద్యా వైద్య సౌకర్యాలు, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలను నిరసిస్తూ కార్మిక సంఘాలతో కలిసి పోరాటాలు చేసేందుకు మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తొలుత సీనియర్ నాయకురాలు ఏ.రాజ్యలక్ష్మి ఐద్వా పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్.మాలతి, ఎస్కే నాగుర్, కే.రాజేశ్వరి, బి.రాజ్యలక్ష్మి, అంజనీ దేవి, పి.లక్ష్మి, జి.కళ్యాణి, విజయలక్ష్మి, రత్తమ్మ, ఇంద్రజ్యోతి, ప్రేమలత, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్కు గ్యారెంటీ.. బాబు మార్కు గారడీ
మార్టూరు: ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్కు గ్యారెంటీ’ అంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు అండ్ కో చేసిన గారడీని నమ్మి ఓటేసిన ప్రజలు, యువతను నిలువునా ముంచారని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రిని నేటి ‘యువత పోరు’లో నిలదీద్దామని పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం మార్టూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బత్తుల మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రామ/వార్డు సచివాలయాలు, ఆరోగ్య విభాగం, ఇతర ప్రభుత్వ శాఖల్లో కొత్తగా 2.50 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఉన్నవారిని సైతం ఊడబీకి పొట్టకొడుతున్నారని నిప్పులు చెరిగారు. ఏటా ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు అందిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు, అన్నదాతకు పెట్టుబడి నిధి కింద ఏటా రూ.20 వేలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. 50 ఏళ్లు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇస్తామన్న హామీని సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు మరిచిపోయి ఉండవచ్చు కానీ ఆయా వర్గాల ప్రజలు మరువలేదన్నారు. తల్లికి వందనం లోపభూయిష్టం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని ఏడాది ఆలస్యంగా, అది కూడా లోపభూయిష్టంగా అమలు చేశారని బత్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హుల పేర్లు జాబితాలో ఎగరగొట్టి మోసం చేశారని మండిపడ్డారు. గత ఏడాది కాలంగా రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని, పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇచ్చి ఉంటే రైతులకు కాస్తయినా ఉపశమనం కలిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వంతో సంక్షేమ ఫలాలు అందిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం పాటించడం వెనుక మర్మమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడటమే కాక ఇవ్వని హామీలను సైతం నెరవేర్చారు కాబట్టే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను గుర్తు చేసుకుని ప్రజలు నీరాజనం పడుతున్నారన్నారు. అనంతరం టీడీపీ బూత్ కమిటీ అధ్యక్షుల ద్వారా గత ఎన్నికల వేళ చంద్రబాబు ఇంటింటికీ పంపిణీ చేయించిన ష్యూరిటీ బాండ్లను ప్రదర్శించారు. చంద్రబాబుకు జాబ్ ఇస్తే ఆయన యువతకు చేయిచ్చారు ఏడాదైనా ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి ఊసేలేదు నేటి యువత పోరును విజయవంతం చేద్దాం వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి పిలుపు -
నేరేడుతో ఆరోగ్యం.. ఆదాయం!
● గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి పండ్లు దిగుమతి ● నేడు పశ్చిమ ప్రకాశంలో 250 ఎకరాల్లో నేరేడు పండిస్తున్న రైతులు ● రైతు వద్ద కిలో రూ.100, మార్కెట్లో ధర రూ.200–రూ.250బేస్తవారిపేట: పశ్చిమ ప్రకాశంలో వర్షాభావ పరిస్థితులు ఉండటంతో పాటు ఖర్చు తక్కువ కావడంతో కొందరు రైతులు నేరేడు పంట సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. చీడపీడలు ఆశించే అవకాశం తక్కువగా ఉండటంతో పురుగు మందుల పిచికారీ భారం తప్పుతోందని రైతులు చెబుతున్నారు. డయాబెటిక్(సుగర్) బాధితుల సంఖ్య ఎక్కువ అవుతుండటంతో మార్కెట్లో నేరేడు పండ్లకు మంచి డిమాండ్ ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతోపాటు మన రాష్ట్రంలోని రాయచోటి, అనంతపురం జిల్లాల నుంచి నేరుడు పండ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే పశ్చిమ ప్రాంతంలో కొందరు రైతులు నేరుడు పంటపై అవగాహన పెంపొందించుకుని దాదాపు 250 ఎకరాల్లో పంట సాగు మొదలు పెట్టారు. గిద్దలూరు నియోజకవర్గంలో 45 ఎకరాల్లో నేరేడు తోటలు సాగు చేశారు. రైతుల వద్ద నేరేడు పండ్లు కిలో రూ.100 పలుకుతుండగా, మార్కెట్లో మాత్రం రూ.200–రూ.250 ధరకు విక్రయిస్తున్నారు. ఆరోగ్యానికి దివ్యౌషధం నేరేడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మధుమేహంతో పాటు అనేక శారీరక రుగ్మతలను నేరేడు పండు దూరం చేస్తుంది. ప్రతి 100 గ్రాముల నేరేడు పండ్లలో ప్రొటీన్స్ 0.07 శాతం, కొవ్వులు 0.3, ఖనిజాలు 0.04, పీచు 0.9 శాతం, అలాగే పిండి పదార్థాలు 15 మిల్లీగ్రాములు, ఫాస్పరస్ 15 మి.గ్రా, ఐరన్ 1.2 మి.గ్రా, విటమిన్ సీ 18 మి.గ్రా, పొటాషియం 55 మి.గ్రా ఉంటాయి. నేరేడులో ఉండే ఆమ్లగుణం వల్ల దీన్ని జామ్లు, వెనిగర్, సాండీస్, ఆల్కహాల్ తక్కువ శాతం ఉండే వైన్ తయారీలోనూ వినియోగిస్తారు. 5 ఎకరాలకు సబ్సిడీ నేరేడు పంట సాగు చేయాలనుకునే రైతులకు హెక్టార్కు దాదాపు రూ.30 వేల చొప్పున రాయితీ వస్తుంది. ఒక్కో రైతు రెండు హెక్టార్ల వరకు సబ్సిడీ పొందవచ్చు. బహదోలి, బోడ, చింతామణి రకాలు అధిక దిగుబడులను ఇస్తాయి. రైతులు షోలాపూర్ నుంచి మొక్కలు తెచ్చుకుంటున్నారు. మార్కెట్లో నేరేడు పండ్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడిప్పుడే రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. –డి.శ్వేత, ఉద్యానవన శాఖ అధికారి -
కాంప్లెక్స్ కట్టేసి!
మరుగుదొడ్లు మింగేసి.. తర్లుపాడు: ప్రభుత్వ భూములకు కస్టోడియన్లుగా వ్యవహరించాల్సిన అధికారులు.. ఓ వైపు భూములు కబ్జా అవుతున్నా చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణకు గురైన భూమిని డీఎల్పీఓ సైతం పరిశీలించినప్పటికీ చర్యలకు వెనుకాడుతున్న తీరు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రమైన తర్లుపాడులో వేణుగోపాలస్వామి దేవస్థానం సమీపంలోని గ్రామ కంఠం భూమిలో సుమారు 40 ఏళ్ల క్రితం పంచాయతీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మించారు. కాలక్రమేనా అవి నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి చుట్టూ వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో భూమి ధర లక్షల రూపాయలు పలుకుతోంది. దీంతో ఆ స్థలం తమ బంధువులదే అంటూ మార్కాపురంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి రంగంలోకి దిగాడు. సుమారు రూ.50 లక్షలకు పైగా విలువ చేసే స్థలాన్ని దక్కించుకునేందుకు పావులు కదిపాడు. ఇటీవలే రాత్రికి రాత్రి కమ్యూనిటీ బాత్రూములు కూల్చివేసి వెంటనే నిర్మాణాలు ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అభ్యంతరం తెలపడంతో పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను ఏమాత్రం పట్టించుకోని సదరు విద్యుత్ శాఖ అధికారి.. కూటమి పార్టీ నియోజకవర్గ ముఖ్యనేత పేరు చెప్పి స్థానిక అధికారుల నోర్లు మూయించాడు. దీనికి తోడు కొందరు అధికారులకు భారీ ఎత్తున లంచాలు ముట్టజెప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని సాక్షాత్తూ మార్కాపురం డీఎల్పీఓ పరిశీలించి కూడా మిన్నకుండిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనరల్ బాడీ సమావేశంలో.. గత నెలలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ పలువురు ప్రజా ప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. మండల కేంద్రం కావడంతో బ్యాంకులు వెలుగు, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో అనేక పనుల నిమిత్తం నిత్యం పదుల సంఖ్యలో మహిళలు తర్లుపాడుకు వస్తుంటారని, వారు వినియో గించుకనేందుకు కూడా టాయిలెట్లు లేవని సమావేశంలో అధికారులకు వివరించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ నేతల సహకారం విలువైన ప్రభుత్వ స్థలం విద్యుత్ శాఖ అధికారికి కట్టబెట్టేందుకు స్థానిక అధికార పార్టీ నేతలు కొందరు పూర్తి సహకారం అందించినట్లు గ్రామంలో జోరుగా చర్చ నడుస్తోంది. గ్రామంలో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ స్థలం కూటమి ప్రభుత్వంలో పరులపాలు కావడంపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో అత్యంత అవినీతిపరుడుగా పేరున్న ఆ అధికారికి గ్రామ స్థాయి అధికార పార్టీ నాయకులు సహకరించడంతో ఆ పార్టీలోని కొందరు బీసీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఉన్నతాధికారులు, కలెక్టర్ జోక్యం చేసుకుని విలువైన ప్రభుత్వస్ధలం అక్రమార్కుడి నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. తర్లుపాడులో ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన విద్యుత్ శాఖ అధికారి ఆక్రమిత భూమి విలువ రూ.50 లక్షలకు పైమాటే.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణం చేపడుతున్నా స్పందించని అధికారులు రెవెన్యూ, పంచాయతీ అధికారుల తీరుపై విమర్శల వెల్లువ -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మద్దిపాడు: మండలంలోని గుండ్లాపల్లి వద్ద మల్లవరం రిజర్వాయర్ ఎడమ కాలువ పక్కన గుర్తు తెలియని పురుషుని మృతదేహం లభించింది. జాతీయ రహదారికి 200 మీటర్ల దూరంలో ఎడమ కాలువ గట్టున మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 40 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న వ్యక్తిదిగా గుర్తించారు. చనిపోయి వారం రోజులు అయి ఉండవచ్చని, ముఖమంతా చీమలు కుట్టడంతో ముఖం వాచిపోయిందని తెలిపారు. శవంపై ఎటువంటి దుస్తులు లేవని అన్నారు. ఎవరైనా ఇటీవల 40 నుంచి 50 సంవత్సరాల్లోపు వ్యక్తి తప్పిపోయి ఉంటే వారు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ ఒక ప్రకటనలో తెలిపారు. తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు ● చిన్నగుడిపాడు సర్పంచ్ మల్లికార్జున పెద్దదోర్నాల: కూటమి నాయకులు తనపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని మండల పరిధిలోని చిన్నగుడిపాడు సర్పంచ్ వల్లభనేని మల్లికార్జున ఆదివారం వాపోయారు. గ్రామంలో నీటి సమస్య తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. దానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూటమి నాయకులు తన వారిపైనే దాడికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా కూటమి నాయకులు తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆయన పేర్కొన్నారు. కేసులో భాగంగా వల్లభనేని మల్లికార్జునను ఆదివారం అరెస్ట్ చేసి మార్కాపురం కోర్టుకు తరలించారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీకి పాకల విద్యార్థినులు సింగరాయకొండ: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఇద్దరు పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లి హజరత్తయ్య తెలిపారు. ఇటీవల కాకినాడలో జరిగిన ఎంపికల్లో కే సిపోరా, కే త్రిగుణ ఎంపికయ్యారన్నారు. వీరు ఈనెల 28వ తేదీ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థినులను అభినందించారు. ఒంగోలులో ఉపాధ్యాయుల నిరసన ఒంగోలు టౌన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న 233 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను ఒంగోలు నగరంలోని డీఆర్ఆర్ఎం హైస్కూల్లో ఆదివారం చేపట్టారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ముగిసిన తరువాత ఖాళీగా ఉన్న కేటగిరీ4లోని మారుమూల గ్రామీణ పాఠశాలలను ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కేటాయిస్తుండడంతో అసంతృప్తికి గురయ్యారు. దాంతో వారు నిరసనలకు దిగారు. సుమారు నాలుగు గంటలపాటు నిరసన చేపట్టారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పాఠశాలలోనే కాకుండా కాంప్లెక్స్ పరిధిలో కూడా తమకు పోస్టింగులు ఇవ్వాలని ఎంటీఎస్ ఉపాధ్యాయలు పట్టుబట్టారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించాల్సిన బదిలీ ప్రక్రియ ఉపాధ్యాయుల నిరసనతో నిలిచిపోయింది. దీంతో సుమారు 4.30 గంటల పాటు బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. కాసేపటి తరువాత ఎంపీటీసీ ఉపాధ్యాయులు బుజ్జగించిన అధికారులు రాత్రి 7 గంటల తరువాత బదిలీల ప్రక్రియను మొదలు పెట్టారు. మొత్తం ఉపాధ్యాయలు బదిలీ ప్రక్రియ రాత్రి పూటనే జరగడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు
ఒంగోలు టౌన్: మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండురంగారావు హెచ్చరించారు. శనివారం ఒంగోలు నగరంలో మైనర్ డ్రైవింగ్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనాలు నడుపుతున్న 35 మంది మైనర్లను గుర్తించారు. వారితో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పాండురంగారావు మాట్లాడుతూ పిల్లల మీద ప్రేమ ఉంటే వారికి వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగితే జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. ప్రేమ, గారాబం కంటే ప్రాణాలు ఎక్కువనే విషయం తల్లిదండ్రులు గుర్తించాలని హితవు పలికారు. చిన్నపిల్లలకు ఎలాంటి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని చెప్పారు. మైనర్లు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీటు బెల్టులు తప్పనిసరిగా ధరించాలని, అతివేగంగా వాహనాలను నడపరాదని, మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలను నడపరాదని సూచించారు. మైనర్లు వాహనం నడిపినా, మైనర్లకు వాహనం ఇచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కౌన్సిలింగ్లో ట్రాఫిక్ ఎస్సై కోటయ్య, ఆర్ఎస్సై మాల్యాద్రి, సిబ్బంది పాల్గొన్నారు. -
కబళించిన అతివేగం
బేస్తవారిపేట: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా, ఆమె భర్త, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు–నంద్యాల హైవేపై బేస్తవారిపేట మండలంలోని చెట్టిచర్ల సమీపంలో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కడప వెళ్తున్న క్రాంతి ట్రాన్స్పోర్ట్ లారీని టాయిలెట్ కోసం హైవే పక్కన చెట్టిచర్ల సమీపంలో డ్రైవర్ ఆపాడు. అదే సమయంలో బాపట్ల జిల్లా పొన్నలూరు నుంచి నంద్యాలకు కారులో ఐ.శ్రీనివాసులు, అతని భార్య అరుణ (29), ఇద్దరు పిల్లలు రిషికేష్, హన్విక వెళ్తున్నారు. వేగంగా వెళ్తున్న వీరి కారు హైవే మార్జిన్లో నిలిపి ఉంచిన ట్రాన్స్పోర్ట్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ వెనుక వైపు కూరుకుపోయిన కారు నుజ్జునుజ్జయింది. ముందుసీట్లో కూర్చుని ఉన్న అరుణ అక్కడికక్కడే మృతిచెందింది. డ్రైవింగ్ చేస్తున్న ఆమె భర్త శ్రీనివాసులు, వెనుక కూర్చుని ఉన్న పిల్లలు రిషికేష్, హన్వికలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఎస్వీ రవీంద్రారెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన వారిని హిటాచ్ యంత్రం సాయంతో బయటకు తీయించారు. అప్పటికే అరుణ మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు, రిషికేష్, హన్వికలను హైవే అంబులెన్స్లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గుంటూరు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసులు నంద్యాలలోని ఓ ప్రైవేట్ విత్తన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి భర్త, ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టి నుజ్జునుజ్జయిన కారు బేస్తవారిపేట మండలం చెట్టిచర్ల సమీపంలో ఘటన -
సైబర్ నేరాలపై బ్యాంకర్లకు అవగాహన
ఒంగోలు టౌన్: సైబర్ నేరాలను సకాలంలో పసిగట్టి వెంటనే అప్రమత్తం అయితే నష్టం జరగకుండా చేయవచ్చని ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ చెప్పారు. సైబర్ నేరాల నివారణపై శనివారం నగరంలోని బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజల అత్యాశ, భయాందోళనలను ఆసరా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని చెప్పారు. అపరిచితుల నుంచి వచ్చే ఎస్ఎంఎస్, ఈ మెయిల్స్, వాట్సప్లో వచ్చే లింకులును ఓపెన్ చేయడానికి ముందు అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డిజిటల్ అరెస్టు, ఆన్లైన్ రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బ్యాంక్ రివార్డులు, ఇతర మోసాల గురించి బ్యాంకు సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కస్టమర్లను అప్రమత్తం చేయాలని చెప్పారు. సమావేశంలో నగరంలోని అన్నీ బ్యాంకులకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కూటమి నాయకుల మధ్య మాటల యుద్ధంపెద్దారవీడు: అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా పెద్దారవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీడీపీ నాయకులకు బీజేవైఎం నాయకులకు మధ్య శనివారం ఉదయం వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యక్రమానికి టీడీపీ నాయకులు బీజేఎంవై నాయకులు హాజరయ్యారు. బీజేవైఎం ఐటీ రాష్ట్ర కన్వీనర్ జీవీరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉందని, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో ఉండాలని, కార్యక్రమానికి పిలిచి అవమానం చేయడం ఏమిటని ఎంపీడీఓను ప్రశ్నించారు. ఆ విషయంపై ఎంపీడీఓ బీజేవైఎం నాయకులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు జోక్యం చేసుకొని ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో పెట్టాల్సిన అవసరం లేదని, అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు, ఎందుకు వచ్చారని, మీరు ఇక్కడ నుండి వెళ్లిపోవాలని, చేతనైతే మీ నాయకుడు మోదీకి చెప్పుకోవాలని, నీవు ఏం చేసుకుంటాయో చేసుకో అని కొంత సేపు దుర్భాషలాడుతూ ఆవేశంగా మాట్లాడారు. బీజేవైఎం నాయకుడు మాట్లాడుతూ ‘‘అధికారులు పిలిస్తే కార్యక్రమానికి వచ్చామని, నీవు ఎవరు మమ్మల్ని వెళ్లిపొమ్మనడానికి, నీవు బెదిరిస్తే బెదిరి పోవడానికి లేము, మాటలు జాగ్రత్తగా మాట్లాడు’’ అని ఘాటుగా ఎదురు మాట్లాడారు. ఈ విషయంపై పార్టీ నాయకులకు ఫిర్యాదు చేయనున్నట్లు బీజేవైఎం నాయకులు జీవీరెడ్డితో పాటు బీజేవైఎం జిల్లా కార్యదర్శి వాయిరి రామకృష్ణ, బీజేవైఎం మండల అధ్యక్షుడు పాలంకయ్య తెలిపారు. ఎంపీడీఓ జాన్సుందరం వివరణ కోరగా బీజేవైఎం నాయకులకు యోగా కార్యక్రమానికి హాజరు కావాలని సమాచారం ఇచ్చామని, వారు కార్యక్రమానికి హాజరయ్యారన్నారు. రెండు పార్టీల నాయకులకు సర్దిచెప్పామన్నారు. -
గంజాయి కేసులో ఆరుగురు అరెస్టు
గిద్దలూరు రూరల్: గంజాయి కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు శనివారం స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మండలంలోని వెంగళ్రెడ్డిపల్లెకు చెందిన బిజ్జం వెంకట శ్రీరాంరెడ్డి అలియాస్ ఇంద్రసేనారెడ్డి, కె.ఎస్.పల్లెకు చెందిన మొలక మోహన్కృష్ణ, పొదలకుంటపల్లె గ్రామానికి చెందిన కాకాని నరేంద్ర, బేస్తవారిపేట మండలం చెన్నుపల్లెకు చెందిన లక్కంనేని వెంకట సుబ్బయ్య, తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్తమూరు గ్రామానికి చెందిన కొవ్వురి ఉదయ్భాస్కర్, ఒడిశా రాష్ట్రం కోరావూట్ జిల్లా పొండేయే గ్రామానికి చెందిన అడ్కటీయ రంజీత్లను గంజాయి కేసులో గిద్దలూరు ఒంగోలు హైవే రోడ్డులోని పాత ఎస్ఆర్ పెట్రోల్ బంకు వద్ద అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వారి నుంచి 6 కిలోల గంజాయితో పాటు రూ.60 వేల నగదు, తూకం పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గిద్దలూరు మండలం వెంగళ్రెడ్డిపల్లెకు చెందిన బిజ్జం వెంకటశ్రీరాంరెడ్డి అలియాస్ ఇంద్రసేనారెడ్డి, కె.ఎస్.పల్లెకు చెందిన మొలక మోహన్కృష్ణ, పొదలకుంటపల్లె గ్రామానికి చెందిన కాకాని నరేంద్ర, బేస్తవారిపేట మండలం చెన్నుపల్లెకు చెందిన లక్కంనేని వెంకట సుబ్బయ్యలు చెడు అలవాట్లకు బానిసలై డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని విక్రయించేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో వీరు నలుగురు గంజాయిని తూర్పుగోదావరి జిల్లా ఉదయ్భాస్కర్ ద్వారా ఒడిశాకు చెందిన రంజీత్ల వద్ద నుంచి కిలో గంజాయిని రూ.10 వేల ప్రకారం కొనుగోలు చేసి గిద్దలూరు పరిసర ప్రాంతాలల్లో 10 గ్రాముల గంజాయిని రూ.500 ప్రకారం విక్రయిస్తుంటారని తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ నాగరాజు వివరించారు. సీఐ కె.సురేష్, ఎస్సై శివనాంచారయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రైలు నుంచి జారిపడి మహిళ మృతి కంభం: ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మహిళ మృతిచెందిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి కంభం రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. మేకల నవమ్మ (45) అనే మహిళ బెంగళూరు నుంచి అర్థవీడు మండలం దొనకొండ వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో వచ్చింది. కంభం రైల్వేస్టేషన్లో రైలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ జారి కింద పడి మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. -
జీజీహెచ్ సూపరింటెండెంట్గా మాణిక్యరావు
ఒంగోలు టౌన్: స్థానిక జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ మాణిక్యరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా విధులు నిర్వర్తిస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన వచ్చారు. ఇన్చార్జి సూపరింటెండెంట్ డా.తిరుపతిరెడ్డి, అడ్మినిస్ట్రేటర్ కె.అద్దెయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.కిరణ్ కుమార్, ఆర్ఎంఓ డా.మాధవీలత, ఏఆర్ఎంఓ డా.చెంచయ్య, తదితరులు మాణిక్యరావును కలిసి అభినందనలు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి కొత్తపట్నం: రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి శనివారం మృతిచెందాడు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన మిట్నసల భరత్ కుమార్ (54) అల్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 19వ తేదీ పాఠశాలలో పని పూర్తి చేసుకుని టీవీఎస్ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్లే సమయంలో కొత్తపట్నం నుంచి ఒంగోలు వైపు ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు వెళ్తూ వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో భరత్ కుమార్కు తీవ్రగాయాలు కావడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. 108లో ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి మరో ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం భరత్కుమార్ మృతి చెందాడు. మృతుడి సోదరుడు మిట్నసల శరత్బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపట్నం ఎస్సై సుధాకర్బాబు తెలిపారు. -
ఉత్సాహంగా అండర్ 16 జిల్లా క్రికెట్ జట్టు
ఒంగోలు: అండర్ 16 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. స్థానిక మంగమూరు డొంకలోని ఏసీఏ సబ్ సెంటర్లో శనివారం నిర్వహించిన ఎంపిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి దాదాపు 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రాథమికంగా హాజరైన వారి నుంచి 26 మందిని ఎంపిక చేశామన్నారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల ఆర్సీఏ గ్రౌండ్లో ఈనెల 26 నుంచి ప్రాబబుల్స్ మ్యాచ్లు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారితో తుది జట్టును ప్రకటిస్తారన్నారు. జూలై 3 నుంచి 13వ తేదీ వరకు మంగళగిరి/ పేరేచర్లలో జరిగే ఏసీఏ సెంట్రల్ జోన్ అంతర్ జిల్లాల పోటీలో ప్రకాశం జిల్లా తరఫున ఎంపికై న జట్టు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ ఎంపిక కార్యక్రమాన్ని కోశాధికారి హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి బచ్చు శ్రీనివాసరావు, బలరాం, రామకృష్ణారెడ్డి, కత్తిశివ, నల్లూరి రవి, ఉండవల్లి రాము, కోచ్లు సుధాకర్, చంద్ర, సెలెక్టర్లు శ్రీకృష్ణ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. -
డబుల్ ఇంజన్ సర్కార్తో ఒరిగిందేంటి ?
దర్శి(కురిచేడు): కూటమి ప్రభుత్వం అప్పులు తీసుకురావటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను శోధిస్తోందని అమరావతి రాజధాని పేరుతో రూ.31 వేల కోట్లు అప్పులు తెచ్చారని, మరో రూ.31 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. సీపీఐ జిల్లా 17వ మహాసభలు దర్శిలోని సానికొమ్ము కాశిరెడ్డి సభా ప్రాంగణంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సీపీఐ సీనియర్ నాయకులు అందె నాసరయ్య జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశంలో ఏ సమస్య పరిష్కారం అయిందో ప్రధాని మోదీ చెప్పాలని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గలేదని, నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతోందని, రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటంలేదన్నారు. నేటికీ దేశంలో 14 కోట్ల మందికి రోజువారీ ఆదాయం రూ.50 – రూ.100లోపే ఉంటుందని పేర్కొన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వడ్డీ సంస్థలు దేశంలో పేదరికం తగ్గిందని చెప్పటం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ ఆస్తులు గణనీయంగా పెరిగాయన్నారు. వ్యవసాయ ఆధారిత దేశమైన భారతదేశంలో 55 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు తమ పాలన సుస్థిరం చేసుకునేందుకు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. జగన్ పాలనలో అదాని స్మార్ట్ మీటర్ వద్దన్న టీడీపీ నాయకులు నేడు అవే ముద్దంటూ ఎందుకు పేర్కొంటున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. వెలుగొండ ప్రాజెక్టు వంటి చిన్న ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టకుండా పోలవరం, బనకచర్ల వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం వైపే చంద్రబాబు మొగ్గుచూపటం ఎవరిప్రయోజనాల కోసం అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలు నిర్వీర్యం చేసి దాని స్థానంలో మిట్టల్ ప్రైవేటు ఉక్కు పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మోదీకి ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారన్నారు. యోగాను దేశమంతా జరుపుకుంటుండగా కేవలం విశాఖపట్నంలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి నెలరోజులుగా ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిదులు నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారన్నారు. యోగాంధ్ర వలన ప్రజా సమస్యలు తీరవని విమర్శించారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. అధికారంలో లేకుండా ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేస్తూ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకై క పార్టీ సీపీఐ మాత్రమేనని రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో అధికారపార్టీకి చెందిన అనేక మంది ప్రజా ప్రతినిధులున్నారని, ఒక్కరు కూడా జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు గురించి కానీ, కనిగిరి నిమ్జ్ గురించి గానీ, దొనకొండ పారిశ్రామికవాడ గురించి గానీ చట్టసభల్లో ప్రశ్నించిన నాయకుడు లేడన్నారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు అందె నాసరయ్య, నెల్లూరు జిల్లా కార్యదర్శి వెంకయ్య, జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, కార్యవర్గసభ్యులు ఆర్ వెంకట్రావు, వడ్డె హనుమారెడ్డి, కే వీరారెడ్డి, ఆర్ రామకృష్ణ, యాసిన్, రమేష్, లక్ష్మి, ఎం విజయ శ్రీనివాస్ పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘనంగా ప్రారంభమైన సీపీఐ జిల్లా మహాసభలు -
తల్లికి వందనం నగదు పడలేదు
ఒంగోలు సిటీ: తల్లికి వందనం రాని వారి సంఖ్య జిల్లాలో రోజు రోజూకూ పెరుగుతోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం కింద రూ.15 వేలు అందిస్తామంటూ ఎన్నికల్లో కూటమి నేతలు హామీలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లతో పాటు జిల్లా స్థాయి నేతలు హామీ ఇచ్చారు. ఎప్పటిలాగే అధికారంలోకి వచ్చాక నాలుక మడతెట్టేశారు. రూ.15 వేల నుంచి రూ.13 వేలకు కుదించగా చాలా మంది లబ్ధిదారులకు రూ.10,900 బ్యాంకు ఖాతాల్లో పడుతుండడంతో విస్తుపోతున్నారు. ఇదేమని అడిగితే సరైన సమాధానం చెప్పేవారే కరువయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిళ్లల్లో కూడా ఒక్కరికే తల్లివందనం నగదు జమైన సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ సుమారు సుమారు 3,74,939 మంది విద్యార్థులు ఉన్నారు. 2,65,559 మంది విద్యార్థులను మాత్రమే అర్హులుగా చేర్చింది. రకరకాల నిబంధనల పేరుతో సుమారు 1,09,380 మందికి ఎసరుపెట్టింది. కేంద్రియ విద్యార్థులకు దూరం.. జిల్లాలో ఒంగోలు, పెద్దారవీడు మండలం రాజంపల్లిలో కేంద్రియ విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో 2500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో దాదాపు 40 శాతం మంది విద్యార్థుల పేర్లను ఈ పథకం నుంచి గల్లంతయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వీరికి అమ్మఒడి ద్వారా ఆర్థిక సాయం అందింది. కూటమి ప్రభుత్వం మాకు ఎందుకు ఇవ్వడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు కేంద్రం ఎదుట సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన కూడా చేశారు. కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయినా ఏం జరుగుతుందో చెప్పేవారు కరువయ్యారు. ఇంటర్, పది విద్యార్థులకు కోత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రకటించిన హామీలు అమలు చేసి ఉంటే గత ఏడాది ఇంటర్మీడియెట్ విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తించేది. నేడు ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ ఈ పథకం దూరమైంది. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ రెండో సంవత్సరం చదివిన వారు 20,815 మంది ఉన్నారు. వీరిలో ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులకు పొరుగు ప్రాంతాలకు వెళ్లిన, ఫెయిలైన విద్యార్థులు ఈ పథకానికి పూర్తిగా దూరమైనట్లే. అలాగే జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 29,602 మంది ఉన్నారు. వీరికి సైతం డబ్బులు పడలేదు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక ఇలా మోసం చేయడం తగదని వారు మండిపడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకోని ప్రభుత్వం.. ఉదయం లేవగానే ఇంటి ముందు చెత్తను తీసేసి వీటిని శుభ్రంగా ఉంచే కార్మికులను కూడా ప్రభుత్వం వదల్లేదు. అంత గొప్ప పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు కూడా తల్లికి వందనం ఎగ్గొట్టింది. జిల్లాలో సుమారు 3,500 మంది పారిశుద్ధ్య కార్మికులు పగలనకా రేయనక చాలీచాలని జీతంతో పస్తులుండి పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల మీద కూడా కూటమి ప్రభుత్వానికి దయ లేదంటే ఏం చేయాలో తెలియడం లేదని కార్మికులు వాపోతున్నారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఒక బాబు, ఒక పాప. కుమారుడు ఈ ఏడాది పదో తరగతి చదవాల్సి ఉంది. కుమార్తె 8వ తరగతిలో ప్రవేశించింది. కుమార్తె వాకా భవ్యశ్రీకి తల్లికి వందనం నగదు నా ఖాతాలో జమైంది. కానీ కుమారుడు వాకా వెంకట లీలా వర్థన్రెడ్డికి మాత్రం తల్లికి వందనం నగదు జమ కాలేదు. నా కుమారుడు పేరు అర్హుల జాబితాలో లేదు. అనర్హుల లిస్టులో కూడా లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లా, అర్జీ పెట్టుకోమన్నారు. మర్రిపూడి సచివాలయంలో అర్జీ పెట్టుకున్నా, నా కుమారుని పేరుతో తల్లివందనం నగదు జమ అవుతాయో, కావో తెలియడం లేదు. జవహర్ నవోదయ విద్యార్థుల పేర్లూ గల్లంతు.. జవహర్ నవోదయలో చదువుతున్న విద్యార్థుల పేర్లు సైతం గల్లంతయ్యాయి. జిల్లాలో ఒంగోలు నగరం, తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో జవహర్ నవోదయ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 544 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి పేర్లు సైతం తల్లికి వందనం పథకంలో లేవు.– వాకా యశోద, మర్రిపూడి -
ఆరోగ్య యోగం
ఒంగోలు: అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒంగోలులోని మినీ స్టేడియంలో శనివారం ఉదయం ఉత్సాహంగా నిర్వహించారు. ఒంగోలు మినీ స్టేడియంలో శనివారం ఉదయం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాచార్యుడు ఏడుకొండలు ఆధ్వర్యంలో యోగ ఔత్సాహికులతో కలసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ యోగా గొప్పతనాన్ని, ప్రయోజనాలను ప్రజలకు అందించాలన్న ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఆత్మను, మనసును, శరీరాన్ని ఏకం చేసే ఏకై క సాధనం యోగా అని, ప్రతి ఒక్కరూ తమజీవితంలో యోగాని భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మే 21 నుంచి నెల రోజుల పాటు జిల్లాలో యోగాంధ్ర మాసోత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు అన్నీ శాఖల అధికారులు, సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు, యోగ సాధకులకు కలెక్టర్ తమీమ్ అన్సారియా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర స్థాయి యోగ పోటీల్లో జిల్లాకు చెందిన ఏడుగురు గెలుపొందడం సంతోషదాయకమన్నారు. యోగ సాంగ్కు రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మొదటి బహుమతి వచ్చిందని చెప్పారు. యోగాంధ్ర మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషిచేసిన జిల్లా అధికారులకు, యోగ సాధకులకు మెమొంటోలు ప్రదానం చేశారు. స్వచ్ఛఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేశారు. మినీ స్టేడియం ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్వో చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జెడ్పీ సీఈఓ చిరంజీవి, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, సెట్నల్ సీఈఓ శ్రీమన్నారాయణ, డీఆర్డీఏ, మెప్మా పీడీలు నారాయణ, శ్రీహరి, డీఈఓ కిరణ్ కుమార్, పశు సంవర్థక శాఖ జేడీ రవి కుమార్, డీఎస్ఓ పద్మశ్రీ, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఎస్డీఓ రాజరాజేశ్వరి, ఆయుష్ ఆర్డీడీ పద్మజాతి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒంగోలులో ఉత్సాహంగా అంతర్జాతీయ యోగ దినోత్సవంయోగాసనం వేస్తున్న ఎస్పీ ఏఆర్ దామోదర్, జిల్లా అధికారులు -
నిరుద్యోగులకు కూటమి కుచ్చుటోపీ
మార్కాపురం టౌన్: నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించే వరకు ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం విస్మరించి నిలువునా మోసం చేసిందని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేసేలా కూటమి సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 23న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించనున్న యువత పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మార్కాపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద యువత పోరుబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గంలోని నిరుద్యోగులైన యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరుకవాలని కోరారు. కూటమి ప్రభుత్వం హామీని అమలు చేయకుండా గత ఏడాది కాలంగా యువతీ యువకులకు రూ.36 వేల చొప్పున ఎగనామం పెట్టిందని ధ్వజమెత్తారు. సమావేశంలో నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జంకె కృష్ణారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు బి.వెంకట రామిరెడ్డి, తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల యూత్ అధ్యక్షుడు బి.రమేష్రెడ్డి, బ్రహ్మారెడ్డి, నాయకులు మురారి వెంకటేశ్వర్లు, రామసుబ్బారెడ్డి, సర్పంచ్ డి.పెద్దమస్తాన్ తదితరులు పాల్గొన్నారు. 23న యువత పోరుబాటను విజయవంతం చేయాలి నిరుద్యోగ భృతి హామీని కూటమి సర్కారు విస్మరించింది మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా నెలకు రూ.3 వేలు ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు -
ఈవీఎం గోడౌన్లో పటిష్ట భద్రత
● మామిడిపాలెంలోని గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్ ఒంగోలు సబర్బన్: జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు ఉంచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎ.తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో ఈవీఎం గోడౌన్ను శుక్రవారం స్టేట్ ఎలక్షన్ డిప్యూటీ సీఈఓ విశ్వేశ్వరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం యంత్రాలు బీయూలు, సీయూ, వీవీప్యాట్లను, అక్కడి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస రావు, వైఎస్సార్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, వివిధ పార్టీల నేతలు వెంకటరావు, గుర్రం సత్యం, మాకినేని అమర్ సింహ, ఎస్కే రసూల్, రాజశేఖరరెడ్డి, ఉపేంద్ర, నవీన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రేపు ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ఒంగోలు సిటీ: డీఎస్సీ 1998, డీఎస్సీ 2008 లకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎంటీఎస్) ఈ నెల 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఓ కిరణ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు ఉపాధ్యాయులందరూ కౌన్సెలింగ్ కు తప్పకుండా హాజరు కావాలని కోరారు. అమ్మ మందలించిందని.. ఉరేసుకుని బాలిక మృతి యర్రగొండపాలెం: మండలంలోని పాత గోళ్లవిడిపి గ్రామంలోని ఎస్సీ పాలెంలో బాలిక ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై పి.చౌడయ్య కథనం ప్రకారం.. 8వ తరగతి వరకు చదువుకున్న బరిగెల శైలమ్మ(16) రెండేళ్ల క్రితం స్కూల్కు వెళ్లడం మానేసింది. పాఠశాలకు వెళ్లినట్లయితే తన అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు జమ అయ్యేవని, ఇప్పుడైనా బడికి వెళ్లి చదువుకోమని ఆ బాలికను తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శైలమ్మ ఇంట్లో ఎవరూలేని సమయంలో గురువారం మధ్యాహ్నం ఫ్యాన్కు తన చున్నీతోనే ఉరివేసుకుంది. తన సోదరి మరణానికి గల కారణాలు తెలుసుకున్న అన్న ఎలిషాబాబు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐ సీహెచ్ ప్రభాకరరావు పరిశీలించారు. -
సోనాబోట్ల విధ్వంసం
● తీరానికి సమీపంలో వేట సాగిస్తున్న మర బోట్లు ● తెగిపోతున్న వలలు ● భారీగా నష్టపోతున్న మత్స్యకారులు సింగరాయకొండ: తమిళనాడు రాష్ట్రం కడలూరు ప్రాంతానికి చెందిన సోనాబోట్లు విచ్చలవిడిగా వేట సాగిస్తున్నాయి. సింగరాయకొండ మండలంలోని పాకల, ఊళ్లపాలెంలో సముద్ర తీరానికి సమీపంలో యథేచ్ఛగా వేట సాగిస్తుండటంతో స్థానిక మత్స్యకారులు లక్షలాది రూపాయల విలువైన వలలు నష్టపోతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇటీవల కాలంలో రాత్రీ పగలు తేడాలేకుండా సోనాబోట్లు తీరానికి సమీపంలో వేటాడుతున్నాయి. మత్స్యకారులు చేపల కోసం సముద్రంలో వేసి ఉంచిన వలలను సోనా బోట్లు తెంచేశాయి. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎవరికి మొరపెట్టుకోవాలో అంతుపట్టడం లేదని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. గత రెండు రోజుల్లో సుమారు లక్ష రూపాయలకు పైగా విలువైన వలలు నష్టపోయామని, చేపలు కూడా చిక్కడం లేదని మత్స్యకారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సోనాబోట్లు తీరానికి దూరంగా వేట సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రూ.50 వేలు నష్టపోయా మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లా. పులసరకం వల వదిలి తిరిగి రాత్రి ఒంటి గంట సమయంలో వద్దామని నిర్ణయించుకున్నా. ఈలోగా సుమారు రాత్రి 11 గంటల సమయంలో సోనాబోటు తీరానికి దగ్గరగా చేపల వేట చేయటంతో వల తెగిపోయింది. దీంతో సుమారు 50 వేల రూపాయల వల నష్టపోయా. – సంఖ్యా సుబ్బారావు, ఊళ్లపాలెం వల కొట్టుకుపోయింది సముద్రంలో చేపల కోసం మంగళవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో వేటకు వెళ్లా. ఎమ్ఎమ్ రకం వలను వదిలి సుమారు 11 గంటల సమయంలో తిరిగి వద్దామనుకున్నా. కానీ 10 గంటల సమయంలో సోనాబోట్ల కారణంగా నా వల తెగిపోయి సముద్రంలో కొట్టుకుపోయింది. మిగిలిన వలను ఒడ్డుకు చేర్చుకుని బాగు చేసుకుంటున్నా. సుమారు 20 వేల రూపాయల వల నష్టపోయా. – వల్లభుని నాగరాజు, మత్స్యకారుడు, ఊళ్లపాలెం రూ.10 వేల వల తెగిపోయింది సముద్రంలో చేపల కోసం గురువారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో చేపల వేటకు వెళ్లి ఎంఎం రకం వల వదిలి విశ్రమించా. తరువాత సుమారు 4 గంటల సమయంలో సోనాబోటు నా వలను ధ్వంసం చేసింది. దీంతో 10 వేల రూపాయల వల నష్టపోయా. – సైకం మధు, దేవలం పల్లెపాలెం, ఊళ్లపాలెం సముద్రంలో చేపల వేటకు బుధవారం రాత్రి చేపల వేటకు వెళ్లి ఎంఎం రకం వల వదిలాను. తరువాత సోనాబోటు నా వలను ధ్వంసం చేయడంతో సుమారు 30 వేల రూపాయల వల సముద్రంలో కొట్టుకుపోయింది. మిగిలిన వలను తీరానికి తీసుకొచ్చి బాగు చేసుకుంటున్నా. – తంబు స్వాములు, ఊళ్లపాలెం మిగిలిన వలను బాగుచేసుకుంటున్నా -
గిట్టుబాటు ధరలు ఇప్పించడంలో రాష్ట్రం విఫలం
ఒంగోలు టౌన్: పొగాకు రైతులకు గిట్టుబాటు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ విమర్శించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించేందుకు ప్రభుత్వం ముందకు వచ్చి అన్నీ రకాల పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో శుక్రవారం పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేవీవీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పొగాకు రూపంలో వేల కోట్లు పన్నుల రూపంలో విదేశీ మారకద్రవ్యం వస్తుందని, అరలుునా పొగాకు రైతులకు న్యాయం చేయాలన్న ధ్యాస లేదని మండిపడ్డారు. ధాన్యం రైతులను కూడా ప్రభుత్వం బజారున పడేసిందని మండిపడ్డారు. మద్దతు ధర కంటే రూ.200 నుంచి రూ.300 తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఎగుమతి విధానాలు బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయన్నారు. అందుకే రైతులు నష్టపోతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు. విదేశాల్లో పొగాకు సాగు లెక్కలను అంచనా వేసుకొని మన దేశంలోని రైతులకు పొగాకు సాగు చేయాలని సూచనలు చేయకుండా నిర్లక్ష్యం చేసిన బోర్డు అధికారులు ఇప్పుడు విదేశాల్లో పొగాకు పంట ఎక్కువ సాగయ్యిందని చెప్పడం క్షమార్హం కాదన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ ఐటీసీ మోచేతి నీళ్లు తాగే కొందరు తొత్తు రైతు నాయకులు చేస్తున్న మోసాన్ని పొగాకు రైతులు గమనించాలని కోరారు. వారి పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు దక్కించుకుంటున్నారని, మిగిలిన రైతులకు ధరలు రాకుండా చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవని, ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి మాట్లాడుతూ మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు నాయకులు చుంచు శేషయ్య మాట్లాడుతూ పొగాకు కేంద్రాల్లో లో గ్రేడ్ రకాన్ని కొనుగోలు చేసే నాథుడే లేకుండా పోయాడని చెప్పారు. కార్యక్రమంలో రైతు నాయకులు పమిడి వెంకటరావు, పరిటాల కోటేశ్వరరావు, కోడూరు నాంచార్లు, దేవరకొండ సుబ్బారెడ్డి, వడ్డేళ్ల ప్రసాద్, అబ్బూరి శేషగిరి తదితరులు పాల్గొన్నారు. -
రూ.1200 తీసుకో.. రూ.200 ఇవ్వు!
కొనకనమిట్ల: ‘వారానికి రూ.200 ఇవ్వండి మీకు రూ.1200 పడేలా చేస్తాం..’ ఇదీ ప్రస్తుతం ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి గ్రామాలలో నడుస్తున్న తంతు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో అధికారుల సహకారంతో వారు పెట్టిన మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు యథేచ్ఛగా అవకతవకలకు పాల్పడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక జాబ్ కార్డులో నలుగురు ఉంటే వారిలో ఒకరు పనికి వెళ్లి వస్తే చాలు మిగతా వారికి కూడా వారానికి ఒకసారి అకౌంట్లో నగుదు జమ చేస్తున్న తీరు చర్చనీయాంశమైంది. కొనకనమిట్ల మండలం మంగాపురం గ్రామంలో చేసిన పనులకు సంబంధించి ఒక్కో కూలీ నుంచి రూ.200 చొప్పున మేట్ వసూలు చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకరికి రూ.1200 కూలి పడితే అందులో నుంచి మేట్ రూ.200 వసూలు చేస్తున్నాడు. అది కూడా వారానికి ముందే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం. దీనిపై ఎంపీడీఓ ఈశ్వరమ్మను వివరణ కోరగా.. ఫీల్డ్ అసిస్టెంట్, మేట్కు షోకాజ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. పనికి వెళ్లకపోయినా ఫర్వాలేదు, మీ అకౌంట్లో డబ్బు చేతివాటం ప్రదర్శిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు -
అన్ని గ్రేడులు కొనుగోలు చేయాలి
● పొగాకు బోర్డు ఆర్ఎం లక్ష్మణరావు టంగుటూరు: పొగాకు కంపెనీ ప్రతినిధులు వేలం కేంద్రానికి వచ్చిన అన్ని పొగాకు గ్రేడులను కొనుగోలు చేయాలని పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ ఎమ్.లక్ష్మణరావు, వైస్ చైర్మన్ బోడుపాటి బ్రహ్మయ్య అన్నారు. పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ ఎమ్.లక్ష్మణరావు, వైస్ చైర్మన్ బోడుపాటి బ్రహ్మయ్య శుక్రవారం టంగుటూరు వేలం కేంద్రాన్ని సందర్శించి పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ లక్ష్మణరావు రైతులతో మాట్లాడుతూ రైతులంతా మండెలలో మగ్గిన పొగాకునే బేళ్లు కట్టుకుని అమ్మకానికి తీసుకురావాలని తెలిపారు. అలాగే మార్కెట్ కి అనుగుణంగా బేళ్లు తీసుకురావాలని సూచించారు. బేళ్లు అమ్మకానికి తెచ్చేటప్పుడు తేమ, వేడి లాంటివి లేకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మార్కెట్ దృష్ట్యా తెలపరి పొగాకు, నీళ్లు కట్టిన పొగాకును తీసుకురావొద్దని తెలిపారు. కొన్ని కంపెనీ వాళ్లు కొనుగోలు చేసిన బేళ్లలో అన్య పదార్థాలు ఉన్నందున కస్టమర్స్ వాటిని తిరస్కరించారని తెలిపారు. రైతులందరూ తమ బేళ్లలో ఎటువంటి పొగాకేతర అన్యపదార్థాలు లేకుండా చూసుకోవాలన్నారు. కంపెనీ కొనుగోలుదారులకు అన్ని రకాల గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయాలన్నారు. -
లాసెట్లో నల్లగుంట్ల విద్యార్థి ప్రతిభ
కొమరోలు: మండలంలోని నల్లగుంట్ల గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ అలీ లాసెట్లో రాష్ట్రస్థాయిలో 1377వ ర్యాంకు సాధించాడు. ఇస్మాయిల్ అలీ గతంలో పీజీ సెట్లో రాష్ట్ర స్థాయిలో 99వ ర్యాంకు, 2020లో నిర్వహించిన పీజీ సెట్లో 2వ ర్యాంకు, 2022లో ఏపీఆర్సెట్ వృక్షశాస్త్రం విభాగంలో 15వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. తాజాగా లాసెట్లో ప్రతిభ చూపిన అలీని గ్రామస్తులు అభినందించారు. బాధ్యతలు చేపట్టిన డీవైఈఓ మార్కాపురం: మార్కాపురం డీవైఈఓగా నియమితులైన మామిళ్లపల్లి శ్రీనివాసరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన పొదిలి ఎంఈఓగా పనిచేస్తూ బదిలీపై మార్కాపురం డీవైఈఓగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నూతన డీవైఈఓను ఎంఈఓ శర్వాణి, ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి, సుబ్బారెడ్డి, రామాంజనేయరెడ్డి, సుధాకర్, చంద్రశేఖర్రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వీరారెడ్డి, రవిశేఖర్, సైమన్, రవిచంద్ర తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. -
‘పని’కిరాని వాళ్లకు హాజరు
బేస్తవారిపేట: ‘ఉపాధి హామీ పథకాన్ని అవినీతిమయంగా మార్చేశారు. మేము శుక్రవారం పని చేసినా హాజరు వేయలేదు’ అంటూ కూలీలు పని ప్రదేశం నుంచి నేరుగా వచ్చి అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన బేస్తవారిపేట ఏపీఓ కార్యాలయం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని ఒందుట్లకు చెందిన ఉపాధి హామీ కూలీలు ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ గురువరకుమార్, టీఏ పి.పీరారెడ్డి వద్దకు చేరుకుని సీనియర్ మేట్ తీరుపై విరుచుకుపడ్డారు. సీనియర్ మేట్ ప్రతి రోజూ పనిచేసే కూలీలకు అన్యాయం చేస్తూ, పనికి రాని వారికి మాత్రం హాజరు వేస్తున్నాడని ఆరోపించారు. ఈ నెలలో రోజూ పనికి వెళ్లినప్పటికీ వారం రోజులు హాజరు వేయలేదన్నారు. కొందరికి ఆరు రోజులు పనికి వెళ్తే ఐదు రోజులుగా చూపించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం ప్రాంతంలో ఉండే లక్కాకుల శ్రీనివాసులు, సూరం గురువారెడ్డి, ఆకుకూరలు అమ్ముకునే సూరం రాజశేఖరరెడ్డి, 80 ఏళ్ల వృద్ధులు తోట బుడ్డయ్య, గోవిందమ్మ ఇలా అనేక మందికి దొంగ హాజరు వేస్తున్నాడని ఆరోపించారు. రోజూ కష్టపడి పనిచేసే తమకు తక్కువ కూలి పడుతోందన్నారు. ఒక వర్గానికి చెందిన వారు పనిచేయకుండా హాజరు సమయానికి, ఫొటోలు దిగేందుకు వస్తున్నారని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పని ప్రదేశంలో కాకుండా ఇంటి దగ్గర సంతకాలు పెట్టించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. 10 గంటలకు పని అయిపోయినప్పటికీ ఆలస్యంగా వచ్చి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ‘కొందరికి మాత్రమే పని డిమాండ్ పెడతాను, మీ దిక్కున్నవారికి చెప్పుకోండి. నాకు ఎమ్మెల్యే అండ ఉంది, కలెక్టర్, అధికారులు నన్ను ఏమీ చేసుకోలేర’ని దబాయిస్తూ బూతులు తిడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీనియర్ మేట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కూలీలు అర్జీ అందజేశారు. న్యాయం చేయకపోతే సోమవారం నుంచి ఏపీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇంటి వద్ద సంతకాలు తీసుకోవడమేంటి? మేట్ మాయాజాలంపై ఉపాధి హామీ కూలీల ఆగ్రహం బేస్తవారిపేటలో ఏపీఓ, టీఏను నిలదీసిన ఒందుట్ల వాసులు -
వైఎస్సార్ సీపీ హింసా రాజకీయాలను సమర్ధించదు
● మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: వైఎస్సార్ సీపీ హింసా రాజకీయాలను సమర్ధించదు, ప్రోత్సహించదని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తూ, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంటే మరో పక్క టీడీపీ కార్యకర్తలు చేస్తున్న దౌర్జన్యాలు, దమనకాండ, పోలీసుల అండ చూసుకుని ఇంకా రెచ్చిపోతూ ఆ పార్టీ కార్యకర్తల కక్ష్యపూరిత చర్యలకు బాధపడి, కడుపుమండి ఎవరో ఫ్లెక్సీలో పెట్టిన సినిమా డైలాగును వైఎస్సార్ సీపీకి ఆపాదిస్తూ కూటమి నేతలు చిలువలు పలువలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు హింసను ప్రేరేపించేలా మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సినిమా డైలాగులు పెడితేనే ఈ విధంగా రాద్దాంతం చేస్తుంటే సాక్షాత్తు టీడీపీ నాయకులు అవినీతి సొమ్ము పంపిణీ లావాదేవీల్లో చెలరేగిన గొడవల్లో ఇటీవల ఒంగోలు లో జరిగిన ఘటనలో టీడీపీ నాయకుడిని 60కి పైగా కత్తిపోట్లు పొడిచారని ..ఈ రపరప.. ఘటనను ఏమంటారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఏనాడూ హింసను ప్రోత్సహించలేదని, శాంతి భద్రతలను పార్టీ పరిరక్షించిందని గుర్తు చేశారు. హింసకు ఎప్పుడూ పార్టీ దూరంగా ఉంటుందని కూటమి ప్రభుత్వం హింసను విడనాడి శాంతిని పరిరక్షించాలని హితవు పలికారు. -
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే..
ఉపాధి హామీ కూలీల ఫొటోలు ఇష్టారీతిగా అప్లోడ్ చేయడం, పాత పనులనే కొత్తగా చేసినట్టు చూపడం, ఒకే ఫొటోను అప్లోడ్ చేసి అందరికీ మస్టర్ వేయడం.. లాంటివి నిత్యకృత్యమయ్యాయి. కొందరు కూలీలు కూడా ఇదేదో బాగుందిలే పనికి వెళ్లకుండానే రూ.200 పోయిన రూ.1000 వస్తున్నాయి కదా అని మేట్లకు వారు అడిగినంత డబ్బు ఇస్తుండటం గమనార్హం. పలు గ్రామాల్లో అయితే స్థానికగా లేకున్నా మస్టర్లు వేస్తూ వారు పనికి వచ్చినట్లుగా జాబ్కార్డు నంబర్లు పెట్టి వారి స్థానంలో మరొకరు ఫొటోలు దిగుతున్నారు. ఇటీవల మంగాపురంలో మేట్ చేస్తున్న అవినీతిని పలువురు ప్రశ్నించగా ‘కచ్చితంగా డబ్బు ఇస్తేనే మీకు నగదు పడేలా చేస్తాం. లేకుంటే మీకు దిక్కున్నచోట చెప్పుకోండి. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు’అంటూ మేట్ తెగేసి చెప్పాడు. పనికి వచ్చిన వారికి మస్టర్ వేయకుండా, పనికి రాని వారికి హాజరు వేయడం ఏమిటని కూలీలు నిలదీస్తున్నా సమాధానం లేదు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వ్యక్తులపై ఉన్నతాధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కొనకనమిట్లలో అయితే ఎక్కడో ఉంటున్న వారికి మస్టర్ వేసి డబ్బు పంచుకుంటున్నారని ఇటీవల కొందరు కలెక్టర్కు అర్జీ అందజేశారు. దీనిపై ఏపీడీ తూతూ మంత్రం నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఉపాధి పనుల్లో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించి అవకతవకలపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
దైనందిన జీవితంలో యోగ భాగంగా మారాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు: యోగ ప్రతి ఒక్క వ్యక్తి దైనందిన జీవితంలో భాగంగా మారాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. స్థానిక మినీ స్టేడియంలో శుక్రవారం స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన సామూహిక యోగ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎస్పీ ఏఆర్ దామోదర్తో కలిసి జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పతంజలి యోగ రాష్ట్ర అధ్యక్షుడు గంధవళ్ల బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో యోగాసనాలు వేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగ కార్యక్రమం జిల్లాలోని 6,458 ప్రదేశాల్లో సుమారు 11 లక్షల మందితో ఒకే సమయంలో యోగ కార్యక్రమం నిర్వహించనున్నామని, ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ యోగ గొప్పతనాన్ని తెలియ చేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గాయకుడు నూకతోటి శరత్ కుమార్ రూపొందించిన యోగ గేయాన్ని కలెక్టర్ ఆవిష్కరించగా గేయాన్ని శరత్ ఆలపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్రావు, బీఎన్ విజయ్కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, డీఆర్డీఏ, మెప్మా పీడీలు నారాయణ, శ్రీహరి, ఆయుష్ శాఖ ఆర్డీడీ పద్మజాతి, డీఈఓ కిరణ్ కుమార్, పశు సంవర్థక శాఖ జేడీ రవి కుమార్, సెట్నల్ సీఈఓ శ్రీమన్నారాయణ, డీఎస్డీఓ రాజరాజేశ్వరి, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
పెద్దపులి దాడిలో ఆవుకు గాయాలు
అర్ధవీడు: మండల పరిధిలోని దొనకొండ గ్రామ ఇలాకాలోని బూరుగుల చెరువు సమీపంలో పెద్దపులి, ఆవుపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం మేరకు దొనకొండ గ్రామానికి చెందిన నాగులుపీరాకు చెందిన ఆవు మేత కోసం అడవికి వెళ్లింది. మందపై పెద్దపులి దాడి చేయగా ప్రాణాలతో తప్పించుకొని ఆవు ఇంటికి వచ్చింది. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పెద్ద పులుల సంచారం ఉన్నందున పశువులను అడవిలోకి తోలవద్దని డిప్యూటీ రేంజ్ అధికారి ముక్కు ప్రసాదరెడ్డి సూచించారు. మానవత్వాన్ని చాటుదాం ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి ఒంగోలు: ఎంతకాలం జీవిస్తామనేది కాదని, జీవించినంత కాలం మానవత్వాన్ని చాటుతూనే ఉందామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఆవరణలో ఇటీవల మరణించిన ముగ్గురు అడ్వొకేట్లు, ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనలో మరణించిన వారికి, పెహల్గాం ఘటనలో అమరులైన వారికి ఒంగోలు బార్ అసోసియేషన్ సంతాప సభ శుక్రవారం నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి మాట్లాడుతూ జీవితం శాశ్వితం కాదన్నారు. అందుకు ఉదాహరణే పెహల్గాం ఘటనలో యాత్రికులుగా వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారితోపాటు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మెడికల్ విద్యార్థుల జీవితాలు అన్నారు. జీవించినంత కాలం ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని మరువవద్దని, సామాజిక సేవను జీవితంలో భాగంగా భావించాలని పిలుపునిచ్చారు. ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు మాట్లాడుతూ ఇటీవల మరణించిన ముగ్గురు అడ్వొకేట్లు విప్పర్ల ఉషారాణి, అంగలకుదురు తిరుమల నటరాజన్, బొడ్డు ప్రసాదరావులు ఒంగోలు బార్ అసోసియేషన్కు అందించిన సేవలు వివరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు విజయలక్ష్మి, పందిరి లలిత, పూర్ణిమ, దీనా, పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కానుగుల శైలజ, సీనియర్ సివిల్ న్యాయవాదులు హేమలత, రామకృష్ణ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారపరెడ్డి వసుంధర, అడ్వొకేట్లు మొలకలపల్లి అజయ్బాబు, బొజ్జా సురేంద్ర చక్రవర్తితోపాటు జూనియర్ న్యాయవాదులు, ఒంగోలు బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రెవెన్యూలో పనులు పారదర్శకంగా చేపట్టాలి ● రెవెన్యూ దినోత్సవంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: రెవెన్యూ శాఖలో పనులు పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్లోని మీ కోసం సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ దినోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. జిల్లాలో భూ సమస్యలతో పాటు వివిధ సర్టిఫికెట్స్ కోసం వచ్చే అర్జీపై రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరం పరిష్కరించి రెవెన్యూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులతో కలసి కేక్ కట్ చేశారు. వివిధ భూ సమస్యలపై, సర్టిఫికెట్స్ కోసం పేద ప్రజలు రెవెన్యూ కార్యాలయాలకు అర్జీలతో వస్తుంటారని, క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు వారి సమస్యలను సావధానంగా విని సత్వరం పరిష్కరించేలా పనిచేసినప్పుడే ప్రజల్లో రెవెన్యూ శాఖపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూశాఖలో ఉత్తమ సేవలందించిన రెవెన్యూ ఉద్యోగులను, పదవీ విరమణ చెందిన ఉద్యోగులను కలెక్టర్ సత్కరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి బుక్స్, రికార్డ్స్తో ఏర్పాటు చేసిన స్టాల్ను కలెక్టర్ తిలకించారు. రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. తొలుత రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని మినీ స్టేడియం నుంచి ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగింది. రెవెన్యూ దినోత్సవంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్, జాన్సన్, పార్థసారథి, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
మహిళా కార్మికులకు నైట్ డ్యూటీలొద్దు
ఒంగోలు టౌన్: మహిళా కార్మికులకు నైట్ డ్యూటీలు వేయడం దుర్మార్గమని, వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అయినా మహిళలకు నైట్ డ్యూటీలు వేయడమేమిటని ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం సమర్ధనీయం కాదన్నారు. పనిగంటల పెంపు, మహిళా కార్మికులకు నైట్ డ్యూటీల విధింపులకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంటెనపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పని వేళలను 10 గంటలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అలాగే మహిళలకు నైట్డ్యూటీ వేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, కార్మికులు, ప్రజలు కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిగట్టుకొని 29 లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారని చెప్పారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను నిర్వీర్యం చేయడం, యూనియన్ల రిజిస్ట్రేషన్లకు ఆటంకం సృష్టించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను డొంకదారిలో నిర్వీర్యం చేయడం దారుణమన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాలకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ఇటీవల మహిళా వీఆర్వోలకు నైట్ డ్యూటీ వేస్తే పోరాడి రద్దు చేయించుకున్నారని, కార్మికులు, ఉద్యోగులు సంఘటితంగా పోరాడితే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఆర్.మోహన్, ఎం.అయ్యపురెడ్డి, చీకటి శ్రీనివాసరావు, సీహెచ్ చిరంజీవి, జి.రమేష్, పి.కల్పన, టి.రాము, వి మోజెస్, పి.ఆంజనేయులు, సయ్యద్ మున్వర్ బాషా, పేరయ్య, డీకే రావు, హరిబాబు, బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్తర్వులు రద్దుచేయాలని సీఐటీయూ ధర్నా -
నల్లబర్లీ పొగాకును ప్రభుత్వమే కొంటుంది
మద్దిపాడు: జిల్లాలో రైతులు పండించిన నల్ల బర్లీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శుక్రవారం ఆమె ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్తో కలిసి గుండ్లాపల్లి సమీపంలోని గార్లపాడు పునరావాస కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన బర్లీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నల్ల బర్లీ పొగాకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. జిల్లాలోని మద్దిపాడు, చీమకుర్తి, పామూరు, దొనకొండ, కొత్తపట్నం, ముండ్లమూరు, పొదిలి, తాళ్లూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు మండలాల్లో 1088 మంది రైతులు 50,380 క్వింటాళ్ల నల్ల బర్లీ పొగాకును పండించారన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ కల్యాణ్రామ్ మాట్లాడుతూ హెచ్డీఎం రకం పొగాకును కిలో రూ.120 వంతున, హెచ్డీఎక్స్ రకం పొగాకును రూ.60 వంతున కొనుగోలు చేస్తామని తెలిపారు. పొగాకు రైతులు బేళ్లలో తేమ శాతం 20 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని, రెలుపు ఉన్న బేళ్లు అయితే మంచిది అన్నారు. మార్క్ఫెడ్కు అమ్ముకునే రైతులు ముందుగా వివరాలను సీఎం యాప్లో నమోదు చేసుకోవాలని అన్నారు. అలా నమోదు చేసుకున్న రైతులకు ఏరోజు ఏ ప్లాట్ ఫాంకు పొగాకు తీసుకు రావాలో వారి మొబైల్కు ముందస్తుగా సందేశం వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.శ్రీనివాసరావు, జిల్లా మార్క్ఫెడ్ డీఎం హరికృష్ణ, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రమేష్బాబు, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, తహశీల్దార్ ఆదిలక్ష్మి, ఎంపీడీఓ డీఎస్వీ ప్రసాద్, వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రం ఫ్లోర్ లీడర్ శేషగిరిరావు, స్థానిక అధకారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పలువురు పాల్గొన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా -
నాటోదయం!
ప్రత్యామ్నాయం చూపడంలో నిర్లక్ష్యం... జిల్లాలోని పల్లెలు, మారుమూల గిరిజన తండాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో సారా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. అధికార పార్టీ నేతల అండతో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ జోరుగా దందా సాగిస్తున్నారు. దీనిని నిరోధించాల్సిన అధికారులు మొక్కుబడిగా దాడులు చేస్తూ అమ్మకందారులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊరూవాడా బెల్టు షాపులు వెలిశాయి. 24 గంటలూ మద్యం ఫుల్లుగా దొరుకుతోంది. ఒకవైపు అధికారికంగానే పీకల దాకా తాగిస్తూ మరో వైపుసారా రహిత జిల్లా అంటున్న అధికారులు, పాలకుల మాటలపై జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. నాలుగు నెలలైనా ఒక్కరికి కూడా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించిన దాఖలాలు లేవు. సారా సరే.. మద్యం సంగతేంటి... జిల్లాలో ప్రభుత్వం అధికారికంగా మద్యం దుకాణాలు నిర్వహించుకునేందుకు 189 మందికి లైసెన్సులు మంజూరు చేసింది. దాదాపుగా ఈ మద్యం దుకాణాలన్నీ అధికార కూటమి నాయకులు, కార్యకర్తలే దక్కించుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఊరూరా బెల్టు షాపులు పెట్టారు. ప్రస్తుతం జిల్లాలో 2500 బెల్టుషాపులున్నట్లు అంచనా. ఒక మద్యం దుకాణానికి అనుబంధంగా కనీసం 10 నుంచి 15 వరకూ బెల్టు దుకాణాలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో మంచినీరు దొరకని గ్రామాలు అనేకం ఉన్నాయిగానీ.. మద్యం దొరకని గ్రామం కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కూడా 20 శాతం అదనంగా మద్యం విక్రయాలు పెంచాలని అధికారుల మీద ఒత్తిడి చేస్తోందంటే.. మరింత మందితో మద్యం తాగించమని చెబుతున్నట్లే కదా అని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం మద్యం పాలసీతో మందుబాబులు ఎక్కువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి చేత మద్యం తాగించి సంపద సృష్టిస్తున్నారని వాఖ్యానిస్తున్నారు.సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణాలు, గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతుండగా, దానికి పోటీగా పట్టణ శివారు ప్రాంతాలు, పల్లెలు, గిరిజన తండాల్లో జోరుగా నాటుసారా విక్రయాలు జరుగుతున్నాయి. అధికారికంగా ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేసిన దుకాణాల కంటే అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న బెల్ట్ షాపులే ఎక్కువగా ఉన్నాయి. దాంతో గతేడాది కాలంలో మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా మందుబాబులు ఎక్కువైపోయారు. ప్రభుత్వం కూడా మద్యం విక్రయాలను మరింత పెంచాలని అధికారుల మీద ఒత్తిడి తెస్తోంది. ఒకవైపు పీకలదాకా మద్యం తాగిస్తూనే నవోదయం 2.0 పేరుతో మరోవైపు నాటుసారా రహిత జిల్లా గురించి ప్రభుత్వం మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సారా నిషాలో పల్లెలు... పశ్చిమ ప్రకాశం జిల్లాలోని అనేక గ్రామాలు సారా మత్తులో జోగుతున్నాయి. జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాలు, తండాలు, గిరిజన గూడేల్లో విచ్చలవిడిగా సారా కాస్తున్నట్లు తెలుస్తోంది. యర్రగొండపాలెం మండలంలోని పాలుట్లలో సారా రాజ్యమేలుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో అధికారులు కూడా అటువైపు వెళ్లేందుకు సాహసించడంలేదు. దాంతో ఎవరికి ఎంత కావాలంటే అంత సొంతంగా కాసుకుని విక్రయాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా పాలుట్ల సమీపంలో ఉన్న తండాలకు, చెంచు గూడేలకు కూడా తరలించి విక్రయిస్తున్నట్లు సమాచారం. అలాగే యర్రగొండపాలం మండలంలోని పెద్ద పీఆర్సీ తండా, చిన్న పీఆర్సీ తండా, పిల్లికుంట, నరజాముల తండాలలో సారా కాస్తున్నట్లు సమాచారం. పుల్లలచెరువు, దోర్నాల మండలాల్లో, గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు మండలంలోనూ యథేచ్ఛగా సారా కాస్తున్నట్లు సమాచారం. అర్ధవీడు లోయలోని అచ్చంపేట, పాపినేనిపల్లి, బొల్లుపల్లి గ్రామాలతో పాటుగా నల్లమల అటవీ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో సారా తయారీ నిత్యకృత్యంగా మారినట్లు చెబుతున్నారు. కంభం మండలంలోని లింగాపురం ప్రాంతంలో కూడా సారా వాసన వస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అర్ధవీడు లోయలో తయారు చేసిన సారాను కంభం, బేస్తవారిపేట మండలాలకు తరలించి విక్రయిస్తున్నట్లు సమాచారం. దోర్నాల మండలంలోని నల్లగుంట్ల, పనుకుమడుగు, బన్నంబావి, చిలకచర్ల, తుమ్మలబయలు, ధీఎంసీ కాలసీలు నాటు సారా ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. అయితే 8 మండలాలలో 35 గ్రామాలను సారా పీడిత గ్రామాలుగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 165 లీటర్ల నాటుసారా, 6,480 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు, 270 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలు చూస్తుంటే దాడులు ఎంత మొక్కుబడిగా సాగుతున్నాయో అర్థమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నత్తనడకన నవోదయం... నవోదయం 2.0ను ప్రకాశం జిల్లా నుంచే ప్రారంభించారు. మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభమైన నవోదయం జిల్లాలో నత్తనడక నడుస్తోంది. నేటికి నాలుగు నెలలైనప్పటికీ సాధించిన ప్రగతి శూన్యమని ఆరోపణలు ఉన్నాయి. కేవలం 29 కేసులు మాత్రమే నమోదు చేయడం, 19 మందిని అరెస్టు చేయడం చూస్తే నవోదయం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇట్టే తెలిసిపోతోందని చెప్పవచ్చు. నాటు సారా మీద నామమాత్రపు దాడులు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాటుసారా కంటే మద్యం మీదనే ఎకై ్సజ్ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సారా కంటే మద్యం వ్యాపారుల నుంచి వచ్చే మామూళ్లే ఎక్కువగా ఉండటం దీనికి కారణంగా చెప్పుకుంటున్నారు. దీంతోపాటు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. సెప్టెంబర్ చివరినాటికి జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. అరకొర సిబ్బందితో ఇది సాధ్యమయ్యేపని కాదని ఆ శాఖ ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు. పశ్చిమాన పల్లెలు, తండాల్లో సారా దందా మారుమూల ప్రాంతాల్లో జోరుగా తయారీ నామమాత్రంగా అధికారుల దాడులు 29 కేసులు, 19 మంది అరెస్టు ఇప్పటి వరకూ 165 లీటర్ల నాటుసారా, 6,480 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం నవోదయం 2.0లో ఒక్కరికీ దక్కని ప్రత్యామ్నాయ ఉపాధి కూటమి పాలనలో ఊరూరా మద్యం జిల్లాలో ఎటుచూసినా బెల్ట్ షాపులు పీకలదాకా తాగిస్తూ సారా రహిత జిల్లా అంటూ కథలు నాటు సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో ఏ ఒక్కరికీ ప్రత్యామ్నాయం చూపిన దాఖలాలు లేవు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కూడా అరెస్టులు, బైండోవర్ల గురించి ఏకరువు పెట్టారేగానీ ఎంతమంది నాటుసారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపారో చెప్పలేదు. దీంతో గ్రామాల్లో అనేక ఏళ్ల తరబడి నాటుసారా తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వారు ఇప్పుడు కూడా అదేవృత్తి కొనసాగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కొంత మంది మాత్రం బెల్టు షాపులు పెట్టుకుని మద్యం విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే నాటుసారా తయారీ కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
పల్లె రోడ్లు గుల్ల
బేస్తవారిపేట/పెద్దారవీడు: రహదారుల నిర్మాణం, మరమ్మతులను ప్రభుత్వం గాలికొదిలేయడంతో వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. గోతులమయంగా మారిన, కంకర తేలిన రోడ్లపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు నిర్మిస్తామన్న కూటమి ప్రభుత్వ హామీ కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా కొత్త రోడ్లు వేయలేదు సరికదా పాడైన రోడ్లకు సైతం మరమ్మతులు చేయలేదని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో రోడ్లపై గగ్గోలు పెట్టిన కూటమి నాయకులు.. ప్రస్తుతం రహదారుల పరిస్థితిపై మాత్రం నోరు మెదపడం లేదు. పలు గ్రామాల్లో కూటమి నాయకులు తమకు అనుకూలంగా ఉండే వీధుల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిమెంటు రోడ్లు వేసుకోవడంపై చూపిన శ్రద్ధ, రాష్ట్రీయ, జాతీయ రహదారులను అనుసంధానం చేస్తే లింక్ రోడ్ల మరమ్మతులపై పెట్టలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రయాణం.. ప్రాణాపాయం ● బేస్తవారిపేట మండల కేంద్రం నుంచి జేబీకే పురం, చిన్న కంభం, జేబీకే పురం రైల్వేస్టేషన్కు వెళ్లే బీటీ రోడ్డు గోతులమయంగా మారింది. లోతైన గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. నిత్యం ఏదో ఒకపనిపై మండల కేంద్రానికి వచ్చే జేబీకే పురం గ్రామస్తులు, పొలాలకు వెళ్లే రైతులు అవస్థలు పడుతున్నారు. ● చింతలపాలెంలోకి వెళ్లే ప్రధాన సీసీరోడ్డు ఛిద్రమైంది. రోడ్డంతా గుంతలు, పగుళ్లతో దారుణంగా తయారైంది. ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని చింతలపాలెం, హరజరత్గూడెం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● బేస్తవారిపేట మండలంలోని వంగపాడులో మెయిన్ రోడ్డు నుంచి ఎస్సీ కాలనీలోకి వెళ్లే సీసీ రోడ్డు పశువుల దిబ్బగా మారింది. పశువుల వ్యర్థాలను సీసీ రోడ్డుపైనే వేస్తున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి రోడ్డుపై వ్యర్థాలు వేయకుండ చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ● కోనపల్లె లోయకు వెళ్లే తారురోడ్డుకు ఇరువైపులా మార్జిన్లు కొట్టుకుపోయాయి. మార్జిన్లలో భారీ గుంతలు ఏర్పడటంతో వాహనాల రాకపోకల సమయంలో తంటాలు తప్పడం లేదు. రాత్రి వేళల్లో ఈ రోడ్డులో ప్రయాణం ప్రాణాలతో చెలగాటమే. దాదాపు 30 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగేంచే రోడ్డు అభివృద్ధిపై పాలకులు దృష్టిపెట్టాలని లోయ ప్రాంత ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. ● పెద్దారవీడు మండలంలోని చట్లమిట్ల అడ్డరోడ్డు నుంచి రేగుమానిపల్లి, అలాగే ఏనుగుదిన్నెపాడు నుంచి తోకపల్లి, చట్లమిట్ల నుంచి బద్వీడు గ్రామాలకు వెళ్లే తారు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గోతులు పడి, కంకర రాళ్లు పైకి తేలడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ నరకమే.. రోడ్లపై తారు లేచి, పెద్ద పెద్ద గుంతలు పడటంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. రాత్రి పూట రోడ్డుపై గుంతలు కనిపించక బైకులపై వెళ్లేవారు కిందపడి గాయాలపాలవుతున్నారు. మూలమలుపుల వద్ద చిల్లకంప రోడ్డు మీదకు రావడంతో ఎదురుగా వచ్చే ఏ వాహనమూ కనిపించడం లేదు. వర్షం పడితే రోడ్లపై గుంతలు నీటితో నిండిపోయి ఎటు వెళ్లాలో తెలియడం లేదు. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరుతున్నాం. – గజ్జ యోగిగురవారావు, ప్రగళ్లపాడు(పెద్దారవీడు) జంగిల్ క్లియరెన్స్ పనులేవీ? గ్రామాలకు వెళ్లే రహదారులకు ఇరువైపులా చిల్లచెట్లు ఏపుగా పెరగడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. మూలమలుపుల వద్ద చిల్లకంప రోడ్డును కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి నూతన రహదారులు నిర్మించడంతోపాటు అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
ఒంగోలు టౌన్: విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, చట్టంలోని సెక్షన్ 12(1)సి ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాల్లో 25 శాతం విద్యార్థులకు ఉచితంగా విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ జిల్లా కో కన్వీనర్ ఎంఏ సాలార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాలార్ మాట్లాడుతూ...ఇప్పటికీ అనేక మంది నిరుపేద విద్యార్థులు ఫీజులు చెల్లించే స్తోమత లేకపోవడంతో చదువులు మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ జాప్యం కావడంతో కొందరు విద్యార్థులు కాలేజీలకు వెళ్లకుండా పనులకు వెళుతున్నారని తెలిపారు. విద్యా, వైద్యం ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం ద్వారా అందరికీ విద్యా సమానత్వం లభిస్తుందని చెప్పారు. కలెక్టర్ను కలిసిన వారిలో కందుల ఐలయ్య వున్నారు. గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పన యర్రగొండపాలెం: గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఐటీడీఏ ప్రత్యేకాధికారి కె.నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని పాలుట్ల, గుట్టచేను గిరిజన గూడాల్లో దర్తి ఆబజన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు పక్కా గృహాలు, విద్యుత్ సౌకర్యం, ఆరోగ్యం, వ్యవసాయం, రోడ్లు, విద్య, హాస్టల్స్, టెలికాం సర్వీసులు, సాంకేతిక అభివృద్ధి, నైపుణ్య వికాసం లాంటి 17 మంత్రిత్వ శాఖల సమన్వయంతో 25రకాల కార్యచరణాలు చేపడుతున్మాన్నారు. గిరిజన గూడాలలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రాలు లేనివారిని గుర్తించి వారికి అందచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీడబ్ల్యూఓ లక్ష్మి పాలుట్లలోని ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యాఱఉ్తల బోధన వివరాలను హెచ్ఎం తాటి బైస్వామి, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాలుట్ల పీహెచ్సీ వైద్యాధికారి వెంకటేశ్వరనాయక్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గిరిజనులను పరీక్షించారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్లు కరంతోటి హనిమిబాయి, బోడా శ్రీశైలపతి నాయుడు, గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ చెవుల అంజయ్య, వీటీడీఏ అధ్యక్షుడు నిమ్మల ఈదన్న, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వర నాయక్ పాల్గొన్నారు. -
దళితురాలినని వివక్ష చూపుతారా?
నాగులుప్పలపాడు: శ్రీనేను ఎస్టీ మహిళను, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ను అనే కారణంతో పంచాయతీ సెక్రటరీ, అధికార పార్టీ నాయకులు కలిసి వివక్ష చూపుతూ, హింసిస్తున్నారశ్రీని ఉప్పుగుండూరు గ్రామ సర్పంచ్ దేవరకొండ జయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో విలేకరుల ఎదుట తాను వివక్షకు గురవుతున్న తీరును వివరించారు. వారం రోజుల క్రితం వరకు పంచాయతీకి సెక్రటరీగా పనిచేసిన కిరణ్ అధికార పార్టీ నాయకుడు కనగాల శ్రీనుతో కుమ్మకై ్క పన్నుల ఆదాయం, 15వ ఆర్ధిక సంఘం నిధులు సుమారు రూ.30 లక్షలు కొల్లగొట్టారని ఆరోపించారు. ఈ ఏడాది మార్చి వరకు వసూలైన పన్నుల సొమ్ము చూపకపోగా, పంచాయతీ కార్మికులకు 3 నెలలుగా వేతనం నిలిపేశారన్నారు. కార్మికులు అడిగితే సర్పంచ్ సంతకం పెట్టలేదంటూ తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వేతనం గురించి ప్రశ్నిస్తే సర్పంచ్నైన తననే తీవ్ర పదజాలంతో దూషించారని, చెక్ పవర్ సైతం రద్దు చేయించారన్నారు. ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చాక చెక్ పవర్ తిరిగి వచ్చినప్పటికీ, తాను సూచించిన పనులేవీ చేపట్టడం లేదన్నారు. పంచాయతీని భ్రష్టుపట్టించిన కార్యదర్శిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని, పంచాయతీ నిధుల దుర్వినియోగంపై వాస్తవాలు నిగ్గు తేల్చాలని కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో 22 మందికి జరిమానా ఒంగోలు టౌన్: విజిబుల్ పోలీసింగ్లో భాగంగా గురువారం ట్రాఫిక్ పోలీసులు నగరంలో వాహనాలకు తనిఖీ చేశారు. మద్యం తాగి వాహనాలను నడుతున్న 22 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.2.20 లక్షల జరిమానా కోర్టు విధించినట్లు ట్రాఫిక్ సీఐ పాండురంగారావు తెలిపారు. మద్యం తాగి వాహనాలను నడపరాదని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని అతివేగంగా వాహనాలను నడపరాదని సూచించారు. ఉప్పుగుండూరులో రూ.30 లక్షల పంచాయతీ నిధులు కాజేశారు కార్మికులకు మూడు నెలలుగా వేతనం నిలిపేశారు అధికార పార్టీ నాయకులతో సెక్రటరీ కుమ్మకై ్క హింసిస్తున్నాడు విలేకరుల ఎదుట సర్పంచ్ దేవరకొండ జయమ్మ ఆవేదన -
వెన్నుపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడర్
సింగరాయకొండ: వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం జగనంటే నమ్మకం– బాబు అంటే మోసం పుస్తకావిష్కరణలో భాగంగా ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే వ్యతిరేకత వచ్చిందన్నారు. ఏడాదిలో సక్రమంగా ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు సూపర్సిక్స్ పథకాలు అమలు చేశామని, కాదన్న వాడి నాలుక మందం అని అన్నారని, 5 కోట్ల ప్రజల నాలుక మందమా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఉచిత గ్యాస్ నగదు సక్రమంగా జమ కాలేదని, తల్లికి వందనంలో భారీ కోతలు విధించి అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ పథకంలో భారీ కోతలు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవడం రాష్ట్ర ప్రజలకు అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రంలో జరుగుతుంది సంక్షేమ పాలన కాదని అరాచకపాలన అని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారన్నారు. 70 ఏళ్ల వయసున్న సీనియర్ పాత్రికేయుడు కేఎస్ఆర్పై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారని, సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తే గానీ విడిచిపెట్టలేదన్నారు. హోంమంత్రి వంగలపూడి అనితపై చెక్బౌన్స్ కేసు ఉందని ఆరోపించారు. నీతి, నియమాలు లేని వ్యక్తి మంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమని, వీరు శాంతిభధ్రతలు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రులకు జగనన్నను తిడితే మంత్రి పదవి ఉంటుందని చంద్రబాబు కండీషన్ పెట్టినట్లు ఉందని, దీంతో మంత్రులు పోటీపడి పాలనను గాలికి వదేలిస జగనన్నపై విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారన్నారు. జగనన్న రైతుల సమస్యపై ప్రశ్నిస్తే తప్ప కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సంక్షేమ పథకాలను గాలికొదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో షర్మిల పనిచేస్తుందని, చంద్రబాబు స్విచ్ నొక్కగానే విమర్శించడం పరిపాటిగా మారిందని ఇదంతా డైవర్షన్ రాజకీయాల్లో భాగమన్నారు. చంద్రబాబు కేసులు, జైళ్లు అంటూ మా గొంతు ఎంతనొక్కుదామన్నా ఉపేక్షించేది లేదని, ప్రజా సమస్యలపై ఎలుగెత్తి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసులు, బచ్చల కోటేశ్వరరావు, ఇనకొల్లు సుబ్బారెడ్డి, జడ్పిటిసి బెజవాడ వెంకటేశ్వర్లు, పార్టి ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఢాకా పిచ్చిరెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ -
యోగాంధ్రను విజయవంతం చేద్దాం
ఒంగోలు: అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో జిల్లా ప్రజలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం పిలుపునిచ్చారు. స్థానిక మినీ స్టేడియంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో శుక్రవారం నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడుతూ.. సుమారు 5 వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు యోగా కార్యక్రమానికి హాజరవుతున్నందున, వారికి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహిస్తున్న యోగా సాధన, శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో 11 లక్షల మంది యోగాంధ్రలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, యోగా నిర్వహించేందుకు 6,458 ప్రదేశాలను గుర్తించామని వివరించారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మెప్మా, డీఆర్డీఏ పీడీలు శ్రీహరి, నారాయణ, పశు సంవర్థక శాఖ జేడీ రవికుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మినీ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన -
పశువుల బీడు ఆన్లైన్పై సభ్యుల ధ్వజం
మర్రిపూడి: పశువుల బీడు అక్రమంగా ఆన్లైన్ చేసి ఏ విధంగా పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తారని ఎంపీపీ వాకా వెంకటరెడ్డి..డిప్యూటీ తహసీల్దార్ నాగరాజుపై మండిపడ్డారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రెవెన్యూ అధికారుల పనితీరుపై సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఎంపీపీ వాకా వెంకటరెడ్డి మాట్లాడుతూ గుండ్లసముద్రంలో పశువులు మేపుకునే బీడు భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఆన్లైన్ చేసి ఎలా పాసుపుస్తకాలు మంజూరు చేస్తారని మండిపడ్డారు. పేదలకు పంచకుండా భూమి ఉన్న వారికే ఆక్రమంగా ఏ విధంగా కట్టబెట్టారని నిలదీశారు. వారసత్వ భూమిని ఆన్లైన్ చేయాలన్నా ఏదో సాకు చెప్పే అధికారులు పశువుల బీడును ఆన్లైన్ చేయడం ఏంటని ప్రశ్నించారు. మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధికారులు గైర్హాజరు కావడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జైపాల్ మాట్లాడుతుండగా.. కోఆప్షన్ సభ్యుడు కొండ్రు ఇజ్రాయిల్, అంకేపల్లి సర్పంచ్ తిరుపతమ్మ కలుగజేసుకుని వాటర్ ట్యాంక్లు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని, క్లోరినేషన్ చేయకపోవడంతో కలుషిత నీరు సరఫరా అవుతుందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. జెడ్పీటీసీ మానేకి సుధారాణి వెంకట్రావు మాట్లాడుతూ ఉపాధి కూలీలు పనికి వెళ్లాలంటే పచ్చ గుర్తింపు కార్డులు ఉంటేనే రమ్మంటున్నారని, ఇదేంటని ప్రశ్నించారు. ఎంపీడీఓ జగదీష్, ఇంచార్జీ ఎంపీడీఓ నాగూర్వలి, డీప్యూటీ తహశీల్దార్ నాగరాజు, ఏఓ ఖాఖింపీరా, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. -
కూటమి ఏడాది పాలన శూన్యం
● మాజీ మంత్రి మేరుగు నాగార్జున మద్దిపాడు: గ్రామ స్థాయి నుంచి వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. మద్దిపాడు మండలంలోని నాగన్నపాలెం, లింగంగుంటలో గురువారం పార్టీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనలో ఏమీ సాధించలేకపోయిందని విమర్శించారు. కేవలం ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం మినహా వారు సాధించిందేమీ లేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలను గాలికొదిలేసిన ఘనతను మూటగట్టుకుందన్నారు. ప్రజలకు కల్లబొల్లి హామీలిచ్చి అఽధికారంలోకి రావడం, మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 80 లక్షల మంది విద్యార్థులకుపైగా అమ్మ ఒడి డబ్బు జమచేస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 62 లక్షల మందికి మాత్రమే నగదు జమ చేసిందని దుయ్యబట్టారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చని కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మేరుగు నాగార్జున తెలిపారు. రైతుల కోసం జగనన్న పోరుబాటను సహించలేక భగ్నం చేయడానకి ప్రయత్నించిన ఘనులు కూటమి నాయకులు అని ఆయన మండిపడ్డారు. కూటమి సర్కార్ సంవత్సర కాలంగా ప్రజలకు ఏమీ చేయకుండా జగన్ నామస్మరణ మాత్రమే చేస్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పూర్తిస్థాయిలో పట్టు సాధించే దిశగా గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాగన్నపాలెం గ్రామ అధ్యక్షునిగా పైనం ప్రసాద్, ఉపాధ్యక్షులుగా రాతిక్రింది జాన్ ప్రకాష్, పైనం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శులుగా పైనం శ్రీనివాసరావు, పైనం అంకయ్య, పోకూరి హనుమంతరావు, మరికొందరు సభ్యులను ఎంపిక చేశారు. లింగంగుంట గ్రామ అధ్యక్షునిగా మెడబలిమి శ్రీనివాసరావు ఎంపికయ్యారు. వారికి మేరుగు నాగార్జున పార్టీ కండువాలు కప్పి బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, వైస్ ఎంపీపీ పైడిపాటి వెంకట్రావు, నాయకులు పల్లపాటి అన్వేష్, బొమ్మల రామాంజనేయులు, గుడ్డపాతల రవి, నాదెండ్ల మహేష్, రజని, సంధ్య, దుడ్డు వినోద్, గద్దె జాలయ్య, కంకణాల సురేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
వేట నేర్వక.!
అడవి చేరక.. నిరుపయోగంగా ఉన్న ఎన్క్లోజర్ల కోసం తెచ్చిన సామగ్రి పెద్దదోర్నాల: ● రెండేళ్ల కిందట నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు ఆడపులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి దిక్కుతోచని స్థితిలో స్థానికుల కంటపడ్డాయి. ఈ క్రమంలో అవి పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని సహజ సిద్ధంగా ఉండే అటవీ ప్రాంత వాతావరణంలో వదిలి పెట్టేందుకు అటవీశాఖ గతంలో నిర్ణయం తీసుకుంది. ● తిరుపతి జూ పార్కులోనూ తల్లి నుంచి విడిపోయి విడిగా పెరుగుతున్న పిల్లలను ప్రత్యేకంగా సంరక్షించాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. చిన్నప్పుడే తల్లి నుంచి విడిపోయిన పులి కూనలను జూలలో సంరక్షించేవారు. దీంతో అవి సహజ స్వభావాన్ని కోల్పోతున్నాయి. పులి పిల్లలను అటవీ ప్రాంతంలోనే ఉంచి వేట నేర్పేందుకు నల్లమల అభయారణ్యంలో భారీ టైగర్ ఎన్క్లోజర్ ఏర్పాటు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. జిల్లాలోని నెక్కంటి రేంజ్ పెద్దపెంట ప్రాంతం ఇందుకు అనువైనదిగా గుర్తించారు. పెద్దపెంట, ఆరపెంట, గంగారంపెంట, పెద్దదోర్నాల మండలంలోని తెట్టుగూడెం పరిధిలో టైగర్ ఎన్క్లోజర్తో పాటు నర్సరీ, హెర్బివోస్ల ఎన్క్లోజర్లు నిర్మించాలని ప్రతిపాదనలు చేసింది. దీనికి సంబంధించి అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసింది. మందగించిన నిర్మాణ పనులు... 15 హెక్టార్లలో నాలుగు ఎన్క్లోజర్లు ఏర్పాటు చేయాలకున్నారు. తొలుత 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నర్సరీ ఎన్క్లోజర్ ఏర్పాటు చేసి అందులో పులి కూనలను ఉంచి కోడి, మేక మాంసాన్ని ఆహారంగా ఇస్తారు. ఆ తర్వాత మరో ఎన్క్లోజర్లోకి మార్చివేసి చిన్నపాటి మేకలను వదులుతారు. సొంతంగా వేటాడేలా నేర్పిస్తారు. అనంతరం మరో ఎన్క్లోజర్లో ఉంచి జింకలు, దుప్పులు, ఇతర వన్యప్రాణులను వదులుతారు. ఇలా వన్యప్రాణులను వేటాడిన తర్వాత వాటిని అడవిలోకి వదులుతారు. కానీ, అటవీశాఖ నిర్లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా పులుల సంరక్షణ ప్రక్రియకు ప్రయోగాత్మకంగా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరకుండా పోయింది. సొంతంగా వేటాడగలిగేలా.. మొదటిగా నర్సరీ ఎన్క్లోజర్లో ఉంచిన పులి పిల్లలను టైగర్ ఎన్క్లోజర్లోకి మార్చి వ్యక్తిగతంగా ఆహారం కోసం అవి 50 వన్యప్రాణులను సొంతంగా వేటాడగలిగినప్పుడే అభయారణ్యంలోకి వదులుతారు. దీంతో పెద్దపులులు వేటాడటం కోసం నెక్కంటి రేంజి పరిధిలోని ఆరపెంట, గంగారంపెంట, పెద్దదోర్నాల మండల పరిధిలోని తెట్టుగూడెం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెర్బివోస్ (జింకలు, దుప్పుల) నర్సరీలు సైతం నిరుపయోగంగా మారాయి. ఇందుకోసం ఆయా ఎన్క్లోజర్లలో రూ.2.50 లక్షలతో సోలార్ బోరుతో పాటు ఎన్క్లోజర్లోకి పైప్లైన్ సదుపాయం, జింకల అవసరాలు తీర్చేందుకు సాసర్పిట్లు, సహజ సిద్ధంగా ఉండే నీటి గుంతలు సైతం ఏర్పాటు చేశారు. సాధారణంగా కొద్ది రోజుల పాటు వాటిని సంరక్షించిన అనంతరం పులుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలో వదలటం ద్వారా పులులకు వేటాడటాన్ని అలవాటు చేస్తారు. వేటలో వాటి శక్తియుక్తులను గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటారు. అయితే, ఇవేమీ జరగకుండానే టైగర్ ఎన్క్లోజర్ పనులు మందగించాయి. ప్రస్తుతం తిరుపతి జూలో ఉన్న అవి పెరిగి పెద్దవిగా అయిపోయాయి. ఎన్క్లోజర్ పనులకు కొత్తగా టెండర్లు అధికారుల బదిలీలు, గతంలో భారీ వర్షాల కారణంగా పనులు కొంత మేర మందగించాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయితే పనులు చురుగ్గా జరిగే అవకాశం ఉంది. కొత్తపల్లి పులి పిల్లలు పెద్దవి కావటంతో వాటిని తీసుకొచ్చే అంశం పరిశీలనలో ఉంది. – ప్రసన్నజ్యోతి, ఫారెస్ట్ రేంజ్ అధికారి, కొర్రప్రోలు తెలుగు రాష్ట్రాల్లో తొలి పులికూనల సంరక్షణ కేంద్రం ప్రకాశం జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటుకు నిర్ణయం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్లు విడుదల అటవీశాఖ నిర్లక్ష్యంతో నెరవేరని పులి పిల్లల సంరక్షణ ఉన్నతాధికారుల బదిలీలతో పనుల నిలిపివేత ఇప్పటికే పెరిగి పెద్దవిగా మారిన బెబ్బులులు -
లాసెట్ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: పీజీ, బీఎల్, ఎల్ఎల్బీ లాసెట్ ఫలితాలను పద్మావతి మహిశా విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. పీజీ లా కోర్సులో ప్రవేశాలకు ఒంగోలుకు సంబంధించి 78 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 65 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. 63 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒంగోలు నగరం గాంధీనగర్ కొత్తడొంకకు చెందిన కొర్సపాటి సంతానయ్య కుమారుడు ప్రశాంత్ మూడో ర్యాంక్ సాధించాడు. ప్రశాంత్ తన స్కూల్ ఎడ్యుకేషన్ను చీమకుర్తి పబ్లిక్ స్కూల్లో, ఇంటర్ను ఒంగోలు నారాయణ కాలేజీలో, బీటెక్ను గుంటూరు ఆర్వీఆర్ జేసీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్లో, ఆంధ్రా యూనివర్సిటీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలేజీ ఆఫ్ లాలో ఎల్ఎల్బీ విద్య అభ్యసించారు. ఇదే విభాగానికి సంబంధించి మార్కాపురంలో 23 మంది దరఖాస్తు చేసుకోగా, 22 మంది పరీక్షకు హాజరై అందరూ ఉత్తీర్ణులయ్యారు. బీఎల్, ఎల్ఎల్బీ మూడు సంవత్సరాల కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ఒంగోలు కేంద్రంలో 773 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 579 మంది హాజరు కాగా, 194 మంది గైర్హాజరయ్యారు. 576 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే మార్కాపురంలో 231 మంది దరఖాస్తు చేసుకోగా 183 మంది హాజరయ్యారు, 48 మంది గైర్హాజరవగా, 181 మంది అర్హత సాధించారు. బీఎల్, ఎల్ఎల్బీ ఐదు సంవత్సరాల కోర్సుకు సంబంధించి ఒంగోలులో 190 మంది దరఖాస్తు చేసుకున్నారు. 151 మంది పరీక్షకు హాజరవగా, 39 మంది గైర్హాజరయ్యారు. 139 మంది ఉత్తీర్ణత సాధించారు. మార్కాపురంలో 56 మంది దరఖాస్తు చేసుకోగా, 46 మంది పరీక్షకు హాజరయ్యారు. 43 మంది పాసయ్యారు. 23 నుంచి మగ్గం వర్క్లో ఉచిత శిక్షణ ఒంగోలు వన్టౌన్: మగ్గం వర్క్లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఒంగోలు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 31 రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 8309915577 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
చిరువ్యాపారులపై మరోసారి వేధింపులు
ఒంగోలు సబర్బన్: నగరంలో కొత్త కూరగాయల మార్కెట్లోని షాపుల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై నగరపాలక సంస్థ అధికారుల వేధింపులు మరోసారి కొనసాగాయి. మార్కెట్లోని షాపులకు కరోనా సమయంలో అద్దెలు చెల్లించలేదన్న కారణంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరపాలక సంస్థ అధికారులు రెండు నెలల క్రితం దాడులు చేసి మార్కెట్ను చిన్నాభిన్నం చేశారు. వ్యాపారులను భయాందోళనకు గురిచేశారు. ప్రధానంగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన వారి షాపులను టార్గెట్ చేసి వేధించారు. ఆ సమయంలో వ్యాపారులంతా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కరోనా సమయంలో అన్ని వ్యాపారాలను నిలిపివేయడంతో ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ను కూడా మూసివేశారు. 2019–20, 2020–21 సంవత్సరాల్లో స్థానిక పీవీఆర్ హైస్కూల్ గ్రౌండ్లో ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి కూరగాయలు విక్రయించారు. నగర ప్రజలతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడికే వెళ్లి కూరగాయలు కొనుగోలు చేశారు. కానీ, కరోనా సమయంలోనూ కూరగాయల మార్కెట్లోని షాపులకు బాడుగలు కట్టాలంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారులపై వేధింపులు ప్రారంభించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల దృష్టికి వ్యాపారులు తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనేకసార్లు సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్థానికంగా లేని సమయంలో గురువారం ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు మార్కెట్లోని రిటైల్ షాపులకు తాళాలు వేశారు. పోలీసులను తీసుకెళ్లి మరీ... మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు పోలీసులను తీసుకెళ్లి మరీ మార్కెట్లోని రిటైల్ షాపులకు తాళాలు వేయించారు. ఇది ఎమ్మెల్యే దామచర్ల వ్యూహమా.. లేకుంటే మేయర్, కమిషనర్ వేధింపులా అనేదానిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని మార్కెట్లో సమావేశం ఏర్పాటు చేసిమరీ బహిరంగంగా దామచర్ల చెప్పిన తర్వాత కూడా గురువారం ఆయన లేని సమయంలో షాపులకు తాళాలు వేయడం, బుధవారం రాత్రే విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యేకి తెలియకుండా జరిగే అవకాశం లేదని, ఆయన ఆదేశాల మేరకే వ్యాపారులపై వేధింపులు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానంటూ పైకి ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ.. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన వ్యాపారులను వేధించేందుకు, పొమ్మనలేక పొగబెట్టేందుకు, తాను ఇక్కడ లేని సమయంలో షాపులపై దాడులు చేయాలని అధికారులకు ఆయనే చెప్పి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో మొత్తం 193 షాపులున్నాయి. వాటిలో 123 రిటైల్ షాపులు, 70 హోల్ సేల్ షాపులు ఉన్నాయి. వీటిలో కేవలం వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల షాపులను మాత్రమే నగరపాలక సంస్థ అధికారులు టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ సానుభూతిపరుల షాపుల జోలికి వెళ్లడం లేదు. దాదాపు 60 షాపులకు గురువారం తాళాలు వేశారు. తమను ఈ విధంగా ఎంతకాలం వేధిస్తారంటూ షాపుల యజమానులు గగ్గోలుపెడుతున్నారు. ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్పై నగరపాలక సంస్థ అధికారుల దాడులు కరోనా సమయంలో కట్టాల్సిన అద్దెల విషయంలో షాపులకు తాళాలు ముందు రోజే కరెంటు కట్ రెండు నెలల క్రితం మార్కెట్ చిన్నాభిన్నం ప్రభుత్వంతో మాట్లాడతానని అప్పట్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దామచర్ల ప్రస్తుతం ఆయన లేని సమయంలో అధికారుల దాడులపై అనేక అనుమానాలు వైఎస్సార్ సీపీ వర్గీయులే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వేధిస్తున్నారంటూ ఆరోపణలు -
ప్రకాశం
37 /29Iగరిష్టం/కనిష్టంవెన్నుపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. పల్లె రోడ్లు గుల్ల పశ్చిమ ప్రకాశంలోని గ్రామాలకు వెళ్లే పలు ప్రధాన, అంతర్గత రోడ్లు ఛిద్రమయ్యాయి. ప్రయాణికులు నరకం చూస్తున్నారు.వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. – IIలో.. శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025న్యూస్రీల్ -
నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
● పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష ఒంగోలు సబర్బన్: నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. నాటుసారా నిర్మూలన కార్యక్రమమైన నవోదయం 2.0పై స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్తో కలిసి జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటిస్తూ డిక్లరేషన్ చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 19న రాష్ట్ర స్థాయి నవోదయం 2.0 కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించుకుని నాటుసారా రహిత జిల్లాగా మార్చేందుకు సంకల్పం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖల అధికారుల సహకారంతో గత నాలుగు నెలల కాలంలో జిల్లాలో నాటుసారా తయారీదారులు, వినియోగదారులకు అవగాహన కల్పించడం, నాటుసారా యూనిట్లను నిర్మూలించడం వంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీనివలన ప్రకాశం జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించడానికి అవకాశం కలిగిందన్నారు. ఒకసారి నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించిన తర్వాత ఎక్కడా నాటుసారా తయారీ, వినియోగం జరగకుండా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఐడీ లిక్కర్ పీడిత గ్రామాల జాబితాను 8 మండలాల్లో ఎ.బి.సి. కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. ఏ కేటగిరీలో 2 గ్రామాలు, బీ కేటగిరీలో 27 గ్రామాలు, సీ కేటగిరీలో 6 గ్రామాలు కలిపి మొత్తం 35 గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు. ఆయా గ్రామాల్లో నాటుసారాను నిర్మూలించి లక్ష్యం చేరుకునేలా పనిచేయాలన్నారు. ఆ వృత్తి నుంచి వారి కుటుంబాలను దూరం చేసి సమాజంలో గౌరవప్రదమైన ఉపాధి మార్గాలను వారికి కల్పించేలా రాయితీలు, పథకాలు అందించాలని సూచించారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ జిల్లాలో నాటుసారాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో సహకారం అందిస్తుందని తెలిపారు. అనంతరం నవోదయం 2.0పై అవగాహన కల్పించే కరపత్రాలు, వాల్ పోస్టర్లను కలెక్టర్, ఎస్పీ, అధికారులు ఆవిష్కరించారు. సమీక్ష సమావేశంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ దయాసాగర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అయేషాబేగం, డీఆర్డీఏ పీడీ నారాయణ, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పశువుల కాపరిని బలి తీసుకున్న చెరువు
టంగుటూరు: పశువుల కాపరిని చెరువు బలి తీసుకుంది. ఈ సంఘటన మండలంలోని వల్లూరు చెరువులో మంగళవారం జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు వల్లూరు చెరువులో భారీగా మట్టి తరలించారు. ఫలితంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడాయి. ఇటివల అడపాదడపా వర్షాలు పడగా ఆ గుంతల్లో నీరు చేరాయి. బీహార్ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర పశువులు మేపేందుకు ఆ రాష్ట్రానికే చెందిన అరుణ్ (15) అనే యువకుడిని పనికి పెట్టుకున్నాడు. రోజూలాగే అరుణ్ పశువులను మేపుకొని తిరిగి వస్తున్న సమయంలో ఒక పశువు బురదలో ఇరుక్కుని పోయింది. ఆ పశువును తప్పించబోయి గుంతలో అరుణ్ జారిపడ్డాడు. చీకటి పడటంతో ఎవరూ గమనించలేకపోయారు. బుధవారం ఉదయం మృతదేహమై కనిపించాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని యువతి ఆత్మహత్య మార్కాపురం టౌన్: పట్టణంలోని కరెంటు ఆఫీసు వెనుక నివాసం ఉంటున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. పట్టణ ఎస్సై సైదుబాబు కథనం ప్రకారం.. దూదేకుల సిద్ధయ్య కుమార్తె సలీమా (20) పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటి వద్ద ఉంటూ పూల అల్లకం చేస్తుండేది. కొన్నాళ్లుగా కిడ్నీలో రాళ్లతో పాటు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ కోతపై రైతుల కన్నెర్ర తాళ్లూరు: వ్యవసాయ విద్యుత్ను సక్రమంగా ఇవ్వకుండా మరమ్మతుల పేరుతో విద్యుత్ను తరుచూ నిలిపేస్తున్న లైన్మన్ నిర్వాకంపై బుధవారం రాత్రి తాళ్లూరు దక్షణ ప్రాంత పొలాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం మూడు నాలుగు గంటల పాటు విద్యుత్ కోత విధించడంపై మండిపడ్డారు. విద్యుత్ సరఫరాపై సమాచారం అడిగినా లైన్మన్ సక్రమంగా సమాధానం చెప్పడం లేదన్నారు. ఇన్చార్జి విద్యుత్ ఏఈ సైతం సమాచారం సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇదే విధంగా విద్యుత్ సరఫరా చేస్తే పంటలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విధానం కొనసాగిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 5 కేజీల గంజాయి పట్టివేత ఒంగోలు టౌన్: ఒడిశా నుంచి గంజాయి తెప్పించి స్థానికంగా విక్రయించే వ్యక్తులను ఒంగోలులో అరెస్టు చేసి వారి వద్ద 5 కేజీల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వన్టౌన్ సీఐ వై.నాగరాజు తెలిపిన వివరాల మేరకు బాపట్ల జిల్లా చినగంజాం గ్రామానికి చెందిన కుక్కల గోవర్దన్ రెడ్డి, ఒడిశాకు చెందిన రాజేష్ నాయక్, ఒంగోలు నగరంలోని బండ్లమిట్టకు చెందిన షేక్ ముజీర్లు ఒడిశాకు చెందిన మహేశ్వర్ మురుడి ద్వారా 5 కిలోల గంజాయి తెప్పించారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో తీసుకొచ్చిన గంజాయిని పంచుకునేందుకు సీతారాంపురం కొండమీదకు చేరుకున్నారు. కొండమీద రామాలయం గుడి వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు వెంటనే దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రేతలను పట్టుకొన్న సీఐ నాగరాజు, ఎస్సైలు సాంబశివరావు, సుబ్రమణ్యంలను ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. -
కూటమి చేతబడి
ఒంగోలు నగరంలోని పీవీఆర్ గర్ల్ప్ హైస్కూల్లో ఇదీ పరిస్థితి దేశ భవిష్యత్తుకు పునాది కేంద్రాలైన పాఠశాలలు కూటమి పాలనలో కునారిల్లుతున్నాయనేందుకు ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని సర్కారు పాఠశాలలివి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మనబడి నాడు–నేడు కార్యక్రమం చేపట్టక ముందు సర్కారు బడుల తీరు ఎవరూ మరువలేదు. తలుపులూడిన గదులు, రంగు వెలిసిన బోర్డులు, విరిగిన బెంచీలు దర్శనమిచ్చే పాఠశాలలను ఓ సంకల్పంతో మార్చి చూపారు వైఎస్ జగన్. అదే ఒరవడిని కొనసాగించి సర్కారు విద్యను పటిష్టం చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా చోద్యం చూస్తోంది. నాడు–నేడు ఫేజ్–2 కింద జిల్లాలోని 979 పాఠశాలల్లో రూ.471.3 కోట్లతో అభివృద్ధి పనులు, అదనపు గదుల నిర్మాణాలు ప్రారంభించారు. 60 నుంచి 80 శాతం మేర పూర్తయిన ఆ పనులను కూటమి సర్కారు గద్దెనెక్కగానే నిలిపేసింది. – సాక్షి, ఒంగోలు -
చంద్రబాబు అంటేనే మోసం
దర్శి (కురిచేడు): వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాదికే హామీలన్నీ అమలు చేసి అందరి మన్ననలు పొందారని, చంద్రబాబు సీఎం అయ్యాక ఏడాదిలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసనసభ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. బుధవారం దర్శిలోని పార్టీ కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాంతి, సుస్థిరత, మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించి ప్రజలు ప్రశాంతంగా జీవించేలా పటిష్టమైన చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా వలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలందించి వారి మనస్సులో సుస్థిర స్థానం సాధించారన్నారు. నాడు–నేడు ద్వారా పాఠశాలల రూపు రేఖలు మార్చి పేదవాడు సైతం కార్పొరేట్ విద్య అందుకునేలా చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు నగదు పెంచి కరోనా వంటి భయంకర వ్యాధులను సైతం ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందించిన గొప్ప ముఖ్యమంత్రిగా దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శంగా నలిచారని కొనియాడారు. వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు వచ్చేలా చేసిన ఘనత ఆయనదేనన్నారు. అవసరమైన సమయంలో మార్క్ఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేసి రైతులకు మేలు చేసిన రైతు పక్షపాతి అప్పటి ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనన్నారు. ప్రకృతి వైపరీత్యాల్లో పంటనష్టం నుంచి రైతులను ఆదుకునేందుకు పంటల బీమాను ప్రభుత్వమే చెల్లించి వారికి వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో అశాంతి, అరాచకం, ఆటవిక పాలనే సాగిందని దుయ్యబట్టారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి విద్యార్థులకు తీరని అన్యాయం చేశారన్నారు. ఏటా రైతులకు పంటసాగు సాయం కింద రూ.20 వేల ప్రకారం చెల్లిస్తామని హామీ ఇచ్చి రెండో ఏడాది వచ్చినా రైతులకు మొండిచేయి చూపిన మోసగాడు చంద్రబాబు..అని ఎమ్మెల్యే బూచేపల్లి మండిపడ్డారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిపై నోరు మెదపటం లేదని, మహిళలకు ఇచ్చే ఉచిత బస్సు తుస్సుమందని ఎద్దేవా చేశారు. అందరికీ తల్లికి వందనం అందిస్తామని చెప్పి అడ్డంకులు సృష్టించి భారీ కోతలు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు ఏడాది పాలనలో వ్యతిరేకత, జగనన్నపై తరగని అభిమానంతోనే ప్రజలు చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్వచ్ఛందంగా వెల్లువలా పోరుబాటలో పాల్గొంటున్నారని వివరించారు. చంద్రబాబు ఈ ఏడాదిలో ప్రజా సంస్కరణలను విస్మరించి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడంపైనే దృష్టి సారించారని మండిపడ్డారు. ఏడాది కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకండా రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని దుయ్యబట్టారు. అప్పులు చంద్రబాబు, కూటమి నాయకులకు సంపదను సృష్టించేందుకు ఉపయోగపడ్డాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎమ్మెల్యే బూచేపల్లి విమర్శించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, వైవీ సుబ్బయ్య, కాకర్ల కృష్ణారెడ్డి, అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి -
కోత మిల్లులో భారీ అగ్నిప్రమాదం
దర్శి (కురిచేడు): దర్శి నగర పంచాయతీ పరిధి పుచ్చలమెట్టలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర టింబర్ డిపోకు మంగళవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూటై రూ.40 లక్షల ఆస్తి నష్టం జరిగింది. టేకు చెక్కలు, విద్యుత్ పరికరాలు, కాలి బూడిదయ్యాయి. టింబర్ డిపో యజమాని మారం శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్ధాలు రావడంతో ఇంట్లో నిద్రపోతున్న శ్రీనివాసరెడ్డికి స్థానికులు సమాచారం ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి వచ్చి చూసేసరికి భారీగా మంటలు వ్యాపించి టింబర్ డిపోలో మొత్తం పొగ కమ్ముకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వాహనం వచ్చి మంటలు అదుపు చేసింది. టింబర్ డిపోలో ఉన్న టేకు కర్రలు, ఇతర సామగ్రితో పాటు మిషనరీలు, ఇతర విద్యుత్ పరికరాలు, యంత్రాలు కాలిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు. రూ.40 లక్షల ఆస్తి నష్టం కాలిబూడిదైన టేకు చెక్కలు, ఇతర సామగ్రి -
చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అరెస్ట్ అక్రమం
కనిగిరి రూరల్: వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అరెస్ట్ అక్రమమని మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, జడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జీ ఆదినారాయణరెడ్డి, రైతు సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు పోలక సిద్ధారెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక పార్టీ ఆఫీస్లో శ్రీసేవ్ డెమోక్రసీ–సేవ్ ఏపీశ్రీ వాల్ పోస్టర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. హామీల అమలు, సర్కార్ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజా సమస్యలపై పోరాడతామని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సూరసాని మోహన్రెడ్డి, సిరుప వెంకట గోవర్ధన్రెడ్డి, డాక్టర్ నాయబ్ రసూల్, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, ఎస్కే జిలానీ బాషా, ఎం.నాగమణి, ఎస్కే షకీలా, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, సంగటి మహేంద్రారెడ్డి, మితికల వెంకట్, శీలం శివారెడ్డి, చిలంకూరి కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్రమ అరెస్ట్లకు భయపడేది లేదు గిద్దలూరు రూరల్: తప్పుడు కేసులు పెట్టి, అక్రమ అరెస్ట్లు చేస్తే వైఎస్సార్ సీపీ శ్రేణులు భయపడతాయనుకోవడం కూటమి నేతల భ్రమేనని గిద్దలూరు నగర అధ్యక్షుడు మానం బాలిరెడ్డి పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అరెస్ట్ను ఖండిస్తూ స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్చార్జి కేపీ నాగార్జునరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. మానం బాలిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ కుట్రలను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ సంబంధం లేని లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఇరికించడం రెడ్ బుక్ కుట్రలో భాగమేనని మండిపడ్డారు. అనంతరం అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బండారి నోవెల్, వైఎస్సార్ సీపీ నాయకులు పాలుగుళ్ల సుబ్బారెడ్డి, నంద్యాల బాలుయాదవ్, కావేరి, వెంకటరావు, నాసరి శ్రీను, పోలేపల్లె శివ, పాలుగుళ్ల నరసింహారెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కనిగిరి, గిద్దలూరులో వైఎస్సార్ సీపీ శ్రేణుల నిరసన కూటమి కక్ష సాధింపు చర్యలకు బెదిరేది లేదని ప్రతిన -
200 బత్తాయి చెట్లు నరికివేత
పామూరు: వివాదంలో ఉన్న పొలంలో బత్తాయి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు కూకటి వేళ్లతో సహా పెకిలించారు. ఈ సంఘటన పామూరు మండలంలోని గుమ్మనంపాడులో బుధవారం ఉదయం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతు అబ్బూరి శేషయ్య బత్తాయి తోట సాగుచేస్తున్న పొలంపై వివాదం నెలకొంది. బుధవారం ఉదయం బత్తాయి చెట్లకు నీరు పెట్టేందుకు వెళ్లగా సుమారు 200కు పైగా బత్తాయి చెట్లను జేసీబీతో పెకలించి, సోలార్ ప్యానళ్లు, ఫెన్సింగ్ ధ్వంసం చేశారు. దీంతో నిశ్చేష్టుడైన శేషయ్య చీమకుర్తికి చెందిన వ్యక్తిపై అనుమానంగా ఉందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.కిషోర్బాబు తెలిపారు. ‘ఆడుదాం ఆంధ్ర’ బిల్లుల తనిఖీ గిద్దలూరు రూరల్: గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన బిల్లులను విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. గిద్దలూరు ఎంపీడీఓ కార్యాలయంలో సోదాల అనంతరం రాచర్ల, కొమరోలు, గిద్దలూరు మండలాల పంచాయతీ కార్యదర్శులు, గిద్దలూరు మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆడుదాం ఆంధ్ర రికార్డులు, ఖర్చు చేసిన బిల్లులను అధికారుల నుంచి సేకరించారు. సోలార్ ప్యానళ్లు, ఫెన్సింగ్ ధ్వంసం పోలీసులకు బాధిత రైతు ఫిర్యాదు -
చెవిరెడ్డి అరెస్ట్ వెనుక కుట్రకోణం
● ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ అరెస్ట్ వెనక కూటమి ప్రభుత్వ కుట్రకోణం దాగిఉందని వైపాలెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా మద్యం కేసులు బనాయించి ఆయనను అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు. జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైఎస్సార్ సీపీలో క్రియశీలక పాత్ర పోషిస్తున్న చెవిరెడ్డిని అరెస్ట్ చేసి అధికార పార్టీ పైశాచిక ఆనందం పొందాలనుకుంటోందన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 12 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపలేని, చేతకాని కూటమి నేతలు వ్యతిరేకతను పక్కదారి పట్టించడంలో భాగంగా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్గా చేసుకుంటూ పలు అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. ఇటీవల జగన్మోహన్రెడ్డికి అండగా నిలబడుతున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్లాంటి వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా, రాజకీయ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా, ఆర్థిక మూలాలు కొల్లకొట్టేలా కుట్రలకు పాల్పడుతోందన్నారు. వీరు పెట్టే కేసులు అక్రమమైనవని చెప్పేందుకు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ ఉదంతమే నిలువెత్తు సాక్ష్యమన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ, జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజా మద్దతును తట్టుకోలేని కూటమి ప్రభుత్వం ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ ఒక క్రమపద్ధతిలో అరెస్ట్లు చేస్తోందన్నారు. ఒక చిన్నస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన చెవిరెడ్డి అరెస్ట్, ఆయన కుమారుడిపై మోపుతున్న కేసులు ఏ ఒక్కటి కూడా ఆధారాలతో కాకుండా కక్షలతో మాత్రమే కూడుకున్నవని రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. పల్నాడులో చనిపోయిన పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించటానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్తుంటే 30 చెక్ పోస్టులు పెట్టి అనేక ఆంక్షలతో ప్రజలను ఎక్కడికక్కడ కట్టడి చేసే కుటిల ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టారన్నారు. ఎన్ని కేసులు పెడతామంటున్నా, మీ కడుపు మంటతో అరెస్ట్లు చేసినా ఈ ఉడుత ఊపులకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదని, రోడ్లన్నీ బారికేట్లతో మూసేసినా పొలం గట్లపై నుంచి కదం తొక్కిన ప్రజా ఆగ్రహాన్ని కూటమి నాయకులు గమనించాలన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని హితవు పలికారు. -
ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్గా ఈశ్వర్ చంద్
ఒంగోలు సబర్బన్: డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్గా బట్టు ఈశ్వర్ చంద్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఈశ్వర్ చంద్ బదిలీపై ప్రకాశం జిల్లాకు వచ్చారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఈయనే డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్గా విధులు నిర్వర్తించనున్నారు. ఒంగోలు కర్మాగారాల తనిఖీ అధికారి–1, 2 కు కూడా ఈయనే ఇన్చార్జ్గా వ్యవహరించనున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్.శైలేంద్ర కుమార్ రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఓల్డ్ రిమ్స్ ప్రాంగణంలోని పాత మైన్స్ కార్యాలయాన్ని జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయానికి కలెక్టర్ కేటాయించారు. దేవరంపాడులో పర్యాటక కేంద్రానికి భూముల పరిశీలన ఒంగోలు సబర్బన్: ఒంగోలు రూరల్ మండలం గుండాయపాలెం మజారా దేవరంపాడు గ్రామంలోని ప్రభుత్వ భూములను బుధవారం జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాల కృష్ణ పరిశీలించారు. గ్రామంలోని సర్వేనెం.449/ఏ లోని ప్రభుత్వ భూముల్లో పర్యాటక కేంద్రంతో పాటు బకింగ్ హామ్ కెనాల్ పైన బ్రిడ్జి నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. పర్యాటక కేంద్రం ఏర్పాటు, బకింగ్ హామ్ కెనాల్ పైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. దేవరంపాడు నుంచి పడవ ద్వారా బకింగ్ హాం కెనాల్లో ప్రయాణించి సముద్రం ఒడ్డుకు వెళ్లి ఆ వైపు భూములను కూడా పరిశీలించారు. జేసీ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు రూరల్ తహశీల్దార్ ఎస్కే.నాయబ్ రసూల్, రెవెన్యూ, సర్వే శాఖ సిబ్బంది ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీపై చర్యలేవీ ఒంగోలు టౌన్: జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నాయని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ అన్నారు. అధిక ఫీజులు, అధిక ధరలకు పాఠ్య పుస్తకాలను విక్రయిస్తున్న పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని విమర్శించారు. బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి ఏ.కిరణ్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ... విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ల వ్యాపారం మొదలైందన్నారు. పుస్తకాలు, యూనిఫాం, షూల పేరుతో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. దీనిని నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, స్కూలు యాజమాన్యాలు పాటించడం లేదన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు పాఠశాలలు పుట్టుకొస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికై నా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై తగిన నియంత్రణ పెట్టాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు వి.కోటి, వెంకటరావు, సచిన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం
38 /28చంద్రబాబు అంటేనే మోసంచంద్రబాబు ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా మోసగించాడని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి విమర్శించారు.9గరిష్టం/కనిష్టంకూటమి చేత‘బడి’ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు ఫేజ్ 2 కింద చేపట్టిన పనులు కూటమి ప్రభుత్వంలో అటకెక్కాయి. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో జల్లులు పడవచ్చు.– 10లో.. గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025 -
వేట సొలసి!
అలలు ఎగసి..● వాతావరణ ప్రభావంతో అలల ఉధృతి ● ఆశాజనకంగా లేని చేపల వేట ● అరకొరగా లభిస్తున్న మత్స్యసంపద ● ఖర్చులకు కూడా రాలేదంటున్న మత్స్యకారులు ● తీరంలో సోనాబోట్ల హల్చల్ ● బతుకు భారమేనంటున్న మత్స్యకారులు గంగపుత్రుల ఆశలపై కడలి నీళ్లు చల్లుతోంది. రెండు నెలల నిషేధం అనంతరం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వీరికి ఆశాభంగమే ఎదురవుతోంది. సాగరంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం వీరిలో అలజడిని రేపుతోంది. ఏటా 61 రోజుల పాటు మత్స్య సంపద వృద్ధి కోసం చేపల వేటపై నిషేధం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిషేధం ముగిశాక బోట్లలో వేటకెళ్లిన మత్స్యకారులకు ఎగసి పడుతున్న అలలు ప్రతిబంధకంగా మారాయి. ఈ సమయంలో పుష్కలంగా చేపలు లభ్యమవుతాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా అరకొరగా వలకు చిక్కుతున్నాయి. సింగరాయకొండ: చేపల పునరుత్పత్తి కోసం ఏటా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజులు వేట నిషేధం అమలులో ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఇతర పనులు చేసుకుంటూ గడుపుతుండగా ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద ఆర్థిక సాయం అందిస్తోంది. జిల్లాలోని తీరప్రాంతంలో ఉన్న కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, సింగరాయకొండ మండలాల పరిధిలో 1,503 బోట్లు ఉన్నాయి. వీటిలో ఇంజన్ బోట్లు 1,111, తెప్ప పడవలు 392 ఉండగా సుమారు 5,800 మత్స్యకార కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. వేట నిషేధకాలం ముగిసింది చేపల వేటకు వెళ్దాం లాభాలు ఆర్జిస్తామని ఆశపడిన వారికి ఈ సంవత్సరం తీవ్ర నిరాశే మిగిలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వేట సక్రమంగా సాగడం లేదు. అలల ఉధృతి: వాతావరణ ప్రభావంతో సముద్రంలో మూడు రోజులుగా అలల ఉధృతి తీవ్రంగా ఉంది. దీంతో ఆదివారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు సోమవారం చేపల వేటకు వెళ్లలేదు. మంగళవారం అలల ఉధృతి తగ్గిందని భావించిన కొంతమంది మాత్రమే వేటకు వెళ్లారు. ఒకదాని వెంట ఒకటి అలలు ఉధృతంగా వస్తుండటంతో బోట్లు తిరగబడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది సముద్రంలో గాలులు ఎక్కువగా వీస్తాయని, ఇదే గాలులు నెల రోజులు పాటు ఉంటాయని అధికారులు చెబుతుండడంతో వేటసాగేనా అంటూ వాపోతున్నారు.ఇదే జరిగితే పూట గడిచే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా మత్స్య సంపద సముద్రంలో వేట నిషేధకాలం ముగిసిన తర్వాత వేట ఆశాజనకంగా ఉంటుంది. ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు ఆదివారం చేపల వేటకు వెళ్లినవారికి కేవలం రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు మాత్రమే చేపలు పడ్డాయని తెలిపారు. సోమవారం అలల ఉధృతితో చేపల వేటకు వెళ్లలేదు. మంగళ, బుధవారాల్లో నామమాత్రంగా చేపల వేటకు వెళ్లిన వారికి నిరాశే ఎదురైంది. కూలీ, డీజిల్ ఖర్చులకు మాత్రమే వస్తున్నాయని ఇలాగైతే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోనాబోట్లను అడ్డుకొనేవారే లేరా తమిళనాడు రాష్ట్రం కడలూరు ప్రాంతానికి చెందిన సోనాబోట్లు నిరాటంకంగా తీరంలో చేపల వేట సాగిస్తుండటంతో మత్స్య సంపద అంతా తుడిచిపెట్టుకుపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా అలల ఉధృతి కారణంగా చేపల వేటకు వెళ్లలేకపోతుంటే సోనాబోట్లు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తీరంలో వేటాడుతున్నాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో మంత్రి స్వామి కేబినెట్ సమావేశంలో సోనాబోట్ల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారని, దీంతో సమస్య పరిష్కారమవుతుందని మత్యకారులు ఆశించారు. కానీ సోనాబోట్లు మాత్రం తీరంలో ఇష్టారాజ్యంగా వేట సాగిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మత్స్యకారులు, అధికారులు సంయుక్తంగా కొంతవరకు సోనాబోట్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొద్దిరోజులు ప్రభుత్వం సోనాబోట్ల నియంత్రణకు ప్రత్యేక బోటు ఏర్పాటు చేసింది. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం సోనాబోట్లను అడ్డుకోవటానికి ఒక్క ప్రయత్నమూ చేయలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ సంవత్సరం తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, ఏం చేయాలో అర్థం కావటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సోనాబోట్లను అడ్డుకుని మత్స్యసంపద కాపాడాలని వారు కోరుతున్నారు. -
తప్పుడు సాక్ష్యాలతో అక్రమ అరెస్టు ●
● వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఒంగోలు టౌన్: అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ పాలనలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా లిక్కర్ పాలసీని అమలు చేసిందని చెప్పారు. రెడ్బుక్ కుట్రతోనే వైఎస్సార్ సీపీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చెవిరెడ్డితో పాటుగా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, స్నేహితుడు వెంకటేష్ నాయుడును కూడా బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని, కూటమి పాలకులు కక్ష సాధింపులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. -
సంద్రంలో తిరగబడిన బోటు
కొత్తపట్నం: సముద్రంలో అలల ఉధృతికి బోటు తిరగబడింది. ఈ సంఘటన కొత్తపట్నం సముద్రతీర ప్రాంతంలో చోటుచేసుకుంది. మండలంలోని కె.పల్లెపాలెం గ్రామానికి చెందిన సింగోతు బాలకృష్ణ, గొల్లపోతు గోవిందు, సింగోతు వెంకటేశ్వర్లు, కొక్కిలగడ్డ రంగారావు, పనమల సుబ్బారావు, నాయుడు యల్లమంద కలిసి మంగళవారం సాయంత్రం 3 గంటలకు సముద్రంలో వేటకు వెళ్లారు. వేట ముగించుకొని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తీరానికి వస్తుండగా.. తీరానికి 200 మీటర్ల దూరంలో అలల ఉధృతికి బోటు తిరగబడింది. దీంతో బోటులో ఉన్న ఆరుగురు బోటు కింద పడిపోయారు. అందులో నలుగురు అతికష్టం మీద ఈదుకుంటూ తీరానికి చేరుకున్నారు. కొంత సేపటి తరువాత పెద్ద అల రావడంతో బోటు కింద చిక్కుకున్న మరో ఇద్దరు కూడా తీరానికి చేరుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదంలో బోటులో ఉన్న లక్షల విలువైన వలలు గల్లంతయ్యాయి. అలాగే ఇంజన్ పూర్తిగా పనికి రాకుండా పోయింది. లక్షల విలువైన మత్స్య సంపద కూడా కొట్టుకుపోయింది. గొల్లపోతు గోవిందుకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి కష్టం మీద తీరానికి చేరుకున్న మత్స్యకారులు రూ.లక్షల విలువైన వలలు, మత్స్య సంపద సముద్రంపాలు -
నాటక రంగానికి వన్నె తెచ్చిన నాగినేని
ఒంగోలు మెట్రో: నాటక రంగంలో సంగీతం, సాహిత్యం, నాట్యం, నటన, రచన దర్శకత్వం వంటి అన్ని విభాగాల్లో ప్రభావశీలమైన, స్ఫూర్తిదాయకమైన బాధ్యతలు నిర్వహించిన హార్మోనిస్టు నాగినేని నరసింహారావు నాటక రంగానికి వన్నెతెచ్చారని పలువురు నాటక ప్రముఖులు, కవులు, సాహితీవేత్తలు పేర్కొన్నారు. నాగినేని మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్థానిక సీవీఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఆవరణలో నాగినేని నరసింహారావు 17వ వర్ధంతి సభ నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు మిడసల మల్లికార్జునరావు సంచాలకత్వంలో నిర్వహించిన సభా కార్యక్రమానికి అసోసియేషన్ కార్యదర్శి కనమాల రాఘవులు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకృష్ణదేవరాయ సాహిత్య, సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబు మాట్లాడుతూ తన ప్రతిభా పాటవాలతో నాటక రంగ బలోపేతానికి నాగినేని నరసింహారావు తన శాయశక్తులా కృషి చేశారన్నారు. విశ్రాంత జిల్లా అటవీ శాఖ అధికారి గుంటూరు సత్యనారాయణ మాట్లాడుతూ 50 ఏళ్ల పాటు పౌరాణిక నాటక రంగానికి సుదీర్ఘ సేవలను అందించి తనలాంటి ఎందరో కళాకారులను తీర్చిదిద్దిన నరసింహారావు సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఆదాయపు పన్ను అధికారి మేడబలిని సాంబశివరావు, సాహిత్య సంస్థల ప్రతినిధులు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, ఓరుగంటి ప్రసాద్, మిట్నసల శాంతారావు, దేవరశెట్టి సింగయ్య, ఐనంపూడి నరసింహారావు, కొప్పోలు వెంకటేశ్వర్లు, తానికొండ చెన్నయ్య, దామవరపు ముసలయ్య, నలమల్లి పాండురంగనాథం, చోడా రమణయ్య, కొత్తిమీర ప్రేమ్ కుమార్, పాలేటి బాబురావు, తదితరులు పాల్గొన్నారు. -
భాస్కర్రెడ్డి అరెస్టు దుర్మార్గం
● ఎమ్మెల్యే, డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి దర్శి(కురిచేడు): మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ని అక్రమంగా అరెస్టు చేయటం దుర్మార్గమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా పాలనను గాలికి వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమ అరెస్టులు చేయిస్తూ రాజకీయ కక్ష సాధింపునే పరమావధిగా పెట్టుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం పాలసీపై కూటమి ప్రభుత్వ కుట్రతో అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతోందన్నారు. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కుట్రకు తెరతీసిందని చెప్పారు. ఆ కుట్రలో భాగంగా తాజాగా లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని, ఆయన స్నేహితుడిని మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. అంతటితో ఆగకుండా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, మరో నలుగురు పై కేసు నమోదు చేసిందన్నారు. ఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ని సిట్ నిందితులుగా చేర్చనేలేదన్నారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టును సంఘటితంగా ఎదుర్కొంటామని, ఆయనకు ఏ సంబంధం లేని లిక్కర్ స్కాంలో అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో చెవిరెడ్డిని భయపెట్టలేరని, విద్యార్ధి దశ నుంచి ఉద్యమమే ఊపిరిగా పెట్టుకున్న నాయకుడు ఆయన అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏదో రూపంలో జైలుకు పంపాలనే దుర్భుద్ధితో కుట్ర ద్వారా మద్యం అక్రమ కేసులో అక్రమంగా ఇరికించి వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా అరెస్టు చేయటం అన్యాయం, దురదృష్టకరమని అన్నారు. -
టీడీపీ నాయకుడి స్థల దాహం
సాక్షి టాస్క్ఫోర్స్: దర్శి నగరపంచాయతీ ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను తొలగించి ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు కూటమి నాయకులు సిద్ధమయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు సాగిస్తున్న అక్రమ దందాను చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో నియోజకవర్గ టీడీపీ నేతకు ముడుపులందినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. దర్శిలోని నిమ్మల బావి సమీపంలో ఆర్వో ప్లాంట్ను ఓ టీడీపీ నాయకుడు జేసీబీతో కూలగొట్టి చదును చేశాడు. నగర పంచాయతీ అధికారుల సహకారంతోనే ఆ స్థలాన్ని టీడీపీ నాయకుడు ఆక్రమించుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగర పంచాయతీ నడిబొడ్డున ఉన్న ఈ స్థలం విలువ సుమా రూ.25 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ప్రస్తుత దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి తండ్రి మాజీ ఎమ్మెల్యే దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి దర్శి ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వ, నగర పంచాయతీ నిధులు వెచ్చించి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. అప్పటి వైఎస్సార్ సీపీ సర్పంచ్ చంద్రగిరి గురవారెడ్డి వాటర్ప్లాంటు ద్వారా తాగునీరు అందించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్లాంట్ స్థలంపై కన్నేసిన ఆ పార్టీ నాయకులు ప్లాంటును నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏకంగా స్థలాన్నే కబ్జా చేశారు. మరమ్మతులకు గురైన వాటర్ ప్లాంటును పునరుద్ధరించి తాగునీటి సమస్య పరిష్కరించాల్సిన నగర పంచాయతీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా ఆక్రమణలకు సహకరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. దర్శిలోని నిమ్మలబావి సమీపంలో ఆర్వో ప్లాంట్ కూల్చివేత రూ.25 లక్షల విలువైన స్థలాన్ని కొట్టేసిన టీడీపీ నాయకుడు అక్రమార్కుడికి అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం -
ఘనంగా బూచేపల్లి కమలాకర్రెడ్డి జయంతి
చీమకుర్తి: సినీ హీరో, నిర్మాత బూచేపల్లి కమలాకర్రెడ్డి 48వ జయంతి సందర్భంగా తల్లి జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సోదరుడు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, సతీమణి నందిని ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం చీమకుర్తిలోని బూచేపల్లి కమలాకర్రెడ్డి పార్కులో ఆయన స్మారకం వద్ద తొలుత కేక్ కట్ చేశారు. కమలాకర్రెడ్డితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో బూచేపల్లి కుటుంబ సభ్యులతోపాటు ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మండల రూరల్ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పలు గ్రామాల పార్టీ నాయకులు పాల్గొన్నారు. నివాళులర్పించిన బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
జూమ్ విధానంలోనే వైద్యశాఖలో బదిలీలు
ఒంగోలు టౌన్: వైద్యశాఖలో సాధారణ బదిలీలు మొదలయ్యాయి. మంగళవారం తొలిరోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన బదిలీల ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. మాన్యువల్గా బదిలీలు చేపట్టాలని వైద్య ఉద్యోగులు ఎంతగా ప్రాధేయపడిన పెడచెవిన పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తను అనుకున్నట్లే జూమ్ విధానంలో బదిలీలు చేపట్టింది. వీరిలో ల్యాబ్ టెక్నీషియన్లు 12, జూనియర్ అసిస్టెంట్లు 5, టైపిస్టులు 3, ఎల్డీ కంప్యూటర్ 5, డ్రైవర్లు 11, ఆఫీసు సబార్డినేటర్లు 31, ఎంఎన్ఓలు 1, ఎఫ్ఎన్ఓలు 4, స్వీపర్లు నలుగురు ఉన్నారు. తొలిరోజు మొత్తం 80 మందిని బదిలీ చేశారు. బుధవారం జిల్లాలోని 132 మంది ఏఎన్ఎంలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సిబ్బంది ప్రాధాన్యత ప్రకారం వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీలు చేసినట్లు జిల్లా వైద్య అరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో జిల్లా పరిపాలనాధికారి గీతాంజలి, సూపరింటెండెంట్ రాజేష్, డేటా మేనేజర్ ప్రభాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కెరీర్ గైడెన్స్ ఎంతో కీలకం ఒంగోలు సబర్బన్: విద్యార్థి దశలోనే భవిష్యత్తుపై ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, సాధించే దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సూచించారు. మంగళవారం స్థానిక డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో రూట్ టు రైజ్ థ్రైవ్ ఫౌండేషన్, బాలల వనరుల కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన ఉజ్వల భవిష్యత్తు కార్యక్రమనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని, పాఠాలతోపాటు ఇతర అంశాల్లోనూ రాణించాలని చెప్పారు. ప్రపంచ విజేతల జీవితాలను నిత్యం అధ్యయనం చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో ఉద్యోగ అవకాశాల వివరాలను నిర్వాహకులు వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ టి.వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, డీవైఈఓ చంద్రమౌలేశ్వరరావు, డీసీపీఓ దినేష్ కుమార్, బంగారు బాల్యం నోడల్ ఆఫీసర్ గిరిధర్శర్మ, రూట్ టు రైజ్ థ్రైవ్ వ్యవస్థాపకురాలు రషీద, హెచ్ఎం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. మాన్యువల్ విధానంలో చేయాలన్న ఉద్యోగుల వినతిని పట్టించుకోని ప్రభుత్వం తొలిరోజు 80 మంది బదిలీ -
యువకుడి ఆత్మహత్యాయత్నం
కంభం: ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా డయల్–100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్పందించి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటన మంగళవారం కంభంలో చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని రావిపాడు గ్రామానికి చెందిన కంచు రవి కంభం చెరువుకట్ట సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోబోయాడు. సమచారం అందుకున్న ఎస్సై నరసింహారావు ఆ యువకుడిని పోలీసు జీపులో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులపై ఆరోపణలు సెల్ ఫోన్ తాకట్టు విషయంలో ఈనెల 14వ తేదీన రవికుమార్, అతని స్నేహితుడు కంభాల అభిషేక్రెడ్డి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పంచాయతీ పోలీసుల వద్దకు చేరింది. రవికుమార్ తనకు రావాల్సిన రూ.3,200 వెంటనే ఇప్పించాలని కోరగా నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి పంపారు. రవికుమార్ ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలుసుకున్న అతని తండ్రి రంగనాయకులు కంభం ప్రభుత్వ వైద్యశాల వద్దకు వచ్చాడు. ఎస్సై తన కొడుకుని కొట్టాడని, అవతలి వారి వద్ద పోలీసులు డబ్బు తీసుకుని అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ వాగ్వివాదానికి దిగాడు. అక్కడికి చేరుకున్న కొందరు గ్రామస్తులు ఆయనకు నచ్చజెప్పారు. అడ్డుకొని వైద్యశాలకు తరలించిన ఎస్సై పోలీసులు న్యాయం చేయకపోవడంతోనే ఆత్మహత్యకు యత్నించాడని బాధితుడి తండ్రి ఆరోపణ