breaking news
Prakasam District News
-
సీబీఐ రిపోర్టుకు విలువ లేదా
ఒంగోలు సిటీ: పరిపాలన చేతకాక ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ లడ్డూ పేరుతో మహాపాపాలకు ఒడిగడుతున్నాడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. ఒంగోలులోని శ్రీగిరి వెంకటేశ్వరస్వామి గుడిలో శనివారం ప్రత్యేక పూజల్లో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు పాల్గొన్నారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు ప్రభుత్వం అపచారానికి పరిహారంగా వారు కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పథకాలిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు చివరకు దేవుడ్ని కూడా మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దేవుడి మీద ఎలాంటి భక్తి లేదని, అందుకే పవిత్రమైన తిరుపతి లడ్డూ మీద కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి లడ్డూలో పందికొవ్వు కలపలేదని సీబీఐ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కూటమి నాయకులు సిగ్గు ఎగ్గూ లేకుండా కులమతాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ విషయంలో సీబీఐ, ఎన్డీపీఎల్ ఇచ్చిన రిపోర్టులన్నిటినీ సాక్షి పత్రిక ఆధారాలతో సహా ప్రచురించిందని తెలిపారు. ఏ ఆధారాలతో చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మంపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవాన్ని ప్రశ్నించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వంలో తీసిన శాంపిల్స్ని తీసుకొని పరీక్షలకు పంపించడం వెనక అసలు ఉద్దేశం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బోలేబాబాకు అనుమతిచ్చింది నాటి చంద్రబాబు ప్రభుత్వమేనన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. మీ హయాంలో పంపించిన నెయ్యి కల్తీ జరిగితే అది మీ పాపమే కదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ ప్రభుత్వ పాలనలో తిరుపతిలో కొనుగోలు కమిటీలో ఉన్నవారికి పదవులిచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటున్న చంద్రబాబు వారి మీద ఈగవాలకుండా చూసుకుంటున్నారని, వైఎస్సార్ సీపీ నాయకుల మీద మాత్రం కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకపోతే వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే స్వయంగా తీసేస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబు అబద్ధాలకు దేవదేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి.. ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అబద్ధాలను ఎండగడుతూ దేవదేవుడు వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరారు. పచ్చ పత్రికల్లో రోజూ అబద్ధాల ప్రచారం రాస్తూ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టుకు కేంద్ర ప్రభుత్వం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రశంసించడం ఓర్వలేక డైవర్షన్ కోసం ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అండ్కో సహకారంతోనే పట్టణ నడిబొడ్డులో ఫ్లెక్సీలు కట్టిస్తున్నారని విమర్శించారు. పోలీసులకు తెలియజేశామని, వారు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జరిగే పరిణామాలకు కార్పొరేషన్ కమిషనర్, పోలీసు అధికారులదే బాధ్యతన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహా గౌడ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, కార్పొరేటర్లు వెన్నపూస కుమారి, వైఎస్సార్సీపీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు గౌతమ్ అశోక్, వైఎస్సార్సీపీ నాయకులు పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, చందోలు చెంచిరెడ్డి, పిల్లి రాధాకృష్ణారెడ్డి, ఎదురు మాల్యాద్రిరెడ్డి, పాలడుగు శ్రీనివాసరావు, గోపిరెడ్డి అశోక్రెడ్డి, పిగిలి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల లడ్డూపై ఇంత దుర్మార్గమా..!
ఒంగోలు సబర్బన్: కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి మీద ఇంతటి దుష్ప్రచారమా.. తిరుమల లడ్డూ విషయంలో ఇంతటి దుర్మార్గమా.. స్వార్థ రాజకీయాల కోసం భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేయడం ఎంత వరకు సబబని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, న్యాయవాది నగరికంటి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. కూటమి పార్టీల నేతలు చేస్తున్న అసత్య ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలో తిరుమల లడ్డూ విషయంలో విషం చిమ్ముతూ వేసిన ఫ్లెక్సీలపై ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఆయన నిరసన వ్యక్తం చేశారు. పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ఖాన్తో కలిసి కమిషనర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుమల లడ్డూలో ఎలాంటి పశువుల కొవ్వు కలవలేదని సీబీఐ నివేదిక ఇచ్చినా ప్రజల్లో అపోహలు కల్పించటానికి, దేవదేవుని భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు ఫ్లెక్సీలు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తిరుమల లడ్డూ విషయంలో అసత్య ప్రచారం చేస్తూ శ్రీమహా పాపం నిజం.. అసలు అది నెయ్యే కాదు.. పామాయిల్, కెమికల్ వాడిన ద్రవం.. జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన ఘీ (అంటే నెయ్యి), ఆ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూ ప్రసాదాల తయారీశ్రీ... అని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కూటమి పార్టీల నాయకులు దేవదేవుడి ప్రసాదాన్ని వీధిన పడేయటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. లడ్డూ విషయాన్ని వివాదాస్పదం చేయటానికి ఇంతకు తెగిస్తారా అని మండిపడ్డారు. ఈ నాయకులకు దేవుడన్నా భయం లేదని, ఎందుకంటే వాళ్ల అనుకూల మీడియా ఉంటే చాలన్న బరితెగింపుతో దుర్మార్గాలు చేస్తున్నారని మండిపడ్డారు. కమిషనర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన అనంతరం అసిస్టెంట్ కమిషనర్కు వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. తిరుమల లడ్డూపై విషప్రచారం చేస్తూ ఒంగోలులో కూటమి పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆరోపణలు అవాస్తవమని సీబీఐ నివేదిక ఇచ్చినా కూటమి పార్టీల నేతల తీరు మారదు కల్తీ పేరుతో ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్న కూటమి పార్టీల నేతలు దేవుడన్న విచక్షణ కూడా లేకుండా మీడియాను అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలు వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు ధ్వజం టీడీపీ కూటమి నాయకులు వేసిన ఫ్లెక్సీలు తీసేయాలంటూ ఒంగోలు నగర కమిషనర్కు వినతిపత్రం -
నంది విగ్రహాన్ని తొలగించి తవ్వకాలు
● గుప్తనిధుల కోసమేనని అనుమానాలు కంభం: స్థానిక కంభం చెరువుకు వెళ్లే దారిలో ఓ పంట పొలంలో ఉన్న పురాతన నంది విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తొలగించి తవ్వకాలు జరిపిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. నంది విగ్రహం కింద గుప్తనిధులు ఉన్నాయనే ఉద్దేశంతో తవ్వకాలు జరిపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది. ఒంగోలు టౌన్: ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో మరోసారి భారీగా గంజాయి లభ్యమైంది. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఎస్పీ హర్షవర్థన్రాజు తెలిపిన వివరాల మేరకు.. గంజాయి కట్టడిలో భాగంగా శనివారం ఒంగోలు నుంచి కావలి వరకు ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో స్పెషల్ పార్టీ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా అంబాదర్ గ్రామానికి చెందిన పృథ్వీరాజ్బాగ్, తమిళనాడులోని రాణిపేట జిల్లా వన్నియ మొట్టూరు గ్రామానికి చెందిన వి.జగదీష్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఎస్సైలు సుదర్శన్, శ్రీరాం, చెంచయ్య, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా, ఈగిల్ టీం సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. పుల్లలచెరువు: బైకు అదుపుతప్పి వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం రాత్రి స్థానిక హైదరాబాద్ రహదారిపై జరిగింది. పుల్లలచెరువు మండలంలోని మల్లాపాలెం గ్రామానికి చెందిన నాగుల అమరలింగయ్య (39) అనే రైతు పనిపై పల్నాడు జిల్లా దావపల్లి వెళ్లి తిరిగి మల్లాపాలెం వస్తున్నాడు. అతివేగం కారణంగా కల్వర్టును ఢీకొని సుమారు 20 అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో అతని సోదరుడు గాలించగా, బైకును గుర్తించి చుట్టుపక్కల చూడగా, లింగయ్య మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ సంపత్కుమార్ తెలిపారు. -
కక్షపూరిత విషప్రచారాలు మానుకో బాబు
101 టెంకాయలు కొడుతున్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డిదర్శి: చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెప్పి వాటిని నిజాలు చేయాలనే విషప్రచారాలు మానుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి హితవు పలికారు. పొదిలి రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పాపపరిహార పూజలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు భారీగా తరలి వచ్చారు. శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మలు ఆలయంలో పూజలు నిర్వహించి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టారు. బూచేపల్లికి పూర్ణకుంభంతో అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయం బయట వైఎస్సార్ సీపీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ హిందువులు దైవంగా పూజించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన లడ్డులో పంది కొవ్వు, చేపకొవ్వు, జంతువుల కొవ్వు కలసిందని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు అసత్య విషప్రచారం చేసి అభాసుపాలయ్యారన్నారు. రాజకీయ లబ్ధి కోసం తిరుపతి లడ్డును కూడా వదల లేదని మండిపడ్డారు. సనాతన ధర్మం అని చెప్పుకుంటూ మడి కట్టి, రకరకాల వేషాలు వేసే పవన్ కళ్యాణ్ సీబీఐ, ఎన్డీఆర్ఐ స్టేట్మెంట్ వచ్చిన తరువాత అడ్రస్ లేకుండా పారి పోయారన్నారు. వీళ్లు స్వార్థం కోసం సోషల్ మీడియాల ద్వారా, ఫ్లెక్సీలు వేసి విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా తప్పుడు ప్రకటనలు మానుకుని, చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గతంలో అధికారంలోకి వచ్చి విజయవాడలో గుడులన్నీ కూల్చి వేసిన సంగతి గుర్తు చేశారు. ఆయన గుళ్లు కూల్చి వేస్తే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి కూల్చిన గుడుల స్థానంలో కొత్త గుడులు నిర్మాణాలు చేశారని గుర్తు చేశారు. అన్నవరం ప్రసాదంలో ఎలుకలు తిరుగుతుంటే ఆ విషయంపై బాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో విద్యుత్ లేకుండా చేస్తే ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. ఇప్పటికై నా డైవర్షన్ పాలిటిక్స్ మానుకుని నిజాయతీగా పాలన చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, యన్నా బత్తిన సుబ్బయ్య, కాకర్ల కృష్ణారెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శిలు పోశం మధు, సంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, ట్రేడ్ యూనియన్ కార్యదర్శి షేక్ సైదా, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయ్భాస్కర్, పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రెడ్డి, జెడ్పీటీసీలు నుసుం వెంకటనాగిరెడ్డి, తాతపూడి రత్నరాజు, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, కౌన్సిలర్లు మేడం మోహన్రెడ్డి, ఆవుల జ్యోతి శివారెడ్డి, తుళ్ళూరి బాబురావు, జగన్నాథం మోహన్బాబు, వార్డు ఇంచార్జ్లు చెరుకూరి జగన్, అన్నవరపు రవి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, నాయకులు కోరె సుబ్బారావు, పానుగంటి మోహన్రావు, కొరివి కోటయ్య, సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డి, కుంటా అచ్చారావు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
ఏడాది క్రితమే చెప్పిన ‘సాక్షి’
చంద్రబాబు ప్రభుత్వం ఒంగోలు ట్రిపుల్ ఐటీకి మంగళం పాడేస్తోందని ఏడాది కిందటే ‘సాక్షి’ దినపత్రిక వరుస కథనాలను ప్రచురించింది. కాదు..లేదంటూ మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆనాడు బుకాయించారు. ట్రిపుల్ ఐటీని ఒంగోలులోనే కొనసాగించనున్నట్లు ప్రకటనలు గుప్పించారు. ఇప్పుడు తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు. ఒంగోలు త్రిపుల్ ఐటీ కాలేజీని కనిగిరికి తరలించుకొని పోతుంటే చోద్యం చూస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. తెరవెనక మాత్రం క్యాంపస్ ఎత్తివేయడానికి చేయాల్సినదంతా చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
కుమార్తె డీఎస్పీ
తండ్రి హెడ్ కానిస్టేబుల్.. ఒంగోలు టౌన్: ప్రతిష్టాత్మక గ్రూప్–1 పరీక్షల్లో ఒంగోలు యువతి సత్తా చాటింది. తండ్రి హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుంటే కుమార్తె డీఎస్పీగా ఎంపికై ఔరా..అనిపించింది. ఒంగోలు ఏఆర్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న చెరుకూరి హుసేన్, నూర్జహాన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి రిజ్వాన్ బీ టెక్ చదువుతున్నాడు. కుమార్తె రిజ్వానా గ్రూప్–1 పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి డీఎస్పీగా ఎంపికై ంది. రిజ్వానా ఒంగోలులోనే విద్యాభ్యాసం చేసింది. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విజ్ఞాన భారతి కాన్సెప్ట్ స్కూల్లో చదువుకుంది. ఒంగోలు చైతన్యలో ఇంటర్ చదివిన రిజ్వానా హైదరాబాద్లోని నోబుల్ డిగ్రీ కాలేజీలో హెచ్పీజీ డిగ్రీ చదివింది. ప్రస్తుతం విజన్ కోచింగ్ సెంటర్లో సివిల్స్కు శిక్షణ తీసుకుంటోంది. రిజ్వానా తొలి నుంచి చదువుతో పాటు అన్నింటా అగ్రస్థానంలో నిలిచింది. పదో తరగతిలో 10కు 10 జీపీఏ సాధించింది. ఇంటర్లోనూ ఏ గ్రేడ్ సాధించింది. తొలి ప్రయత్నంలోనే గ్రూప్–1లో ఉద్యోగం సాధించి ప్రశంసలు పొందింది. సివిల్స్ సాధించడమే తన ఏకై క లక్ష్యమని రిజ్వానా చెబుతోంది. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ డీఎస్పీ ఉద్యోగం సాధించిన రిజ్వానా జిల్లా పోలీసు శాఖ ప్రతిష్టను పెంచిందని ఎస్పీ హర్షవర్థన్రాజు అభినందనలు తెలిపారు. ఎంపీడీఓ నుంచి ట్రెజరీ ఆఫీసర్గా.. తాళ్లూరు: మండలంలోని తూర్పుగంగవరం గ్రామానికి చెందిన వల్లపనేని జ్యోతి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా సత్తా చాటారు. ప్రస్తుతం ఆమె మద్దిపాడు ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. జ్యోతి మండలంలోని నాగంబొట్లపాలెం సొసైటీ అధ్యక్షుడు వల్లపనేని సుబ్బయ్య కుమార్తె. గ్రామ ప్రజలు, మండల వాసులు ఆమెను అభినందించారు. -
భద్రంగా బండి నడపండి
ఒంగోలు టౌన్: భద్రంగా వాహనాలు నడపడం ద్వారా క్షేమంగా ఇంటికి చేరాలని ఎస్పీ హర్షవర్థన్రాజు సూచించారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయం వద్ద నుంచి నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బిడ్డలపై ప్రేమతో తల్లిదండ్రులు వాహనాలు కొనిస్తున్నారని, ఉత్సాహంతో రోడ్డు మీదకు వచ్చిన యువకులు వేగంగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. కన్నబిడ్డలు రోడ్డు ప్రమాదంలో చనిపోతే కుటుంబ సభ్యులు పడే వేదన అంతాఇంతా కాదన్నారు. వాహనాలు నడుపుతున్న సమయంలో హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్పారు. వాహనాలను వేగంగా నడుపుతున్న సమయంలో ఇంటి వద్ద తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారన్న సంగతి మర్చిపోకూడదని హితవు పలికారు. ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, పెద్దలు, పిల్లలు మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాలని, వాటిని పాటించడం వలన రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ జగదీష్, వన్టౌన్ సీఐ నాగరాజు, టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, ఆర్ఐ రమణారెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయం నుంచి అద్దంకి బస్టాండు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వారిచే ప్రతిజ్ఞ చేయించారు. ఎస్పీ హర్షవర్థన్రాజు -
వాల్మీకి బోయల సమాధులు ధ్వంసం
కనిగిరి రూరల్: రియల్ ఎస్టేట్ ముసుగులో ఉన్న కొందరు అధికార పార్టీ నేతలు రాత్రి రాత్రే వాల్మీకి బోయకులానికి చెందిన వారి సమాధులను తవ్వేసిన ఘటన శనివారం కనిగిరిలో వెలుగు చూసింది. బాధిత వాల్మీకి బోయల కథనం ప్రకారం.. కనిగిరి పుట్టిన నాటి నుంచి పాతూరు పక్కనే వాల్మీకి బోయపాలెం ఉంది. దీనికి సంబంధించి కొత్తూరు అభయాంజనేయ స్వామి గుడి ఎదురుగా (ప్రస్తుతం ఎన్హెచ్ 565) రోడ్డు పక్కన సర్వే నంబర్ 554లో వాల్మీకి బోయల సమాధుల తోట ఉంది. తాతముత్తాతల కాలం నుంచి సుమారు ఎకరా భూమిలో ఆ కులానికి చెందిన వారు చనిపోతే అక్కడ అంత్యక్రియలు చేస్తున్నారు. కొంతకాలంగా దీనిపై కన్నేసిన అధికార పార్టీ రియల్టర్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రస్తుతం సుమారు 50 సెంట్ల స్థలంలో ఉన్న సమాధుల కట్టడాలను పొక్లెయిన్లతో తొలగించి పక్కనే ఉన్న రాగి కుంటలో పడేశారు. రూ.1.50 కోట్ల స్థలం పైకన్ను వాస్తవానికి సర్వే నంబర్ 554లోని సుమారు 50 సెంట్ల స్థలంలో పూర్వీకుల కాలం నుంచి వాల్మీకి బోయల శ్మశానవాటికగా ఉంది. అందులోనే అంత్యక్రియలు పూర్తి చేసుకునే వారు. అందులోని కొద్ది స్థలంపై కోర్టులో వివాదం కూడా నడుస్తున్నట్లు సమాచారం. ఇటీవల అక్కడ హైవే పడటం.. భూములకు విలువ విపరీతంగా పెరగడం.. ప్రస్తుతం ఆ స్థలం విలువ సుమారు రూ.1.50 కోట్లు ఉండటంతో కొందరు రియల్టర్లు అధికార పార్టీ అండతో ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో విషయం తెలుసుకున్న వాల్మీకి బోయలు శనివారం నిరసనకు దిగారు. తమ సమాధులను దున్నేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రూ.1.50 కోట్ల స్థలం కబ్జాకు యత్నం ఆర్థిక, అంగ, రాజకీయ బలంతో దుశ్చర్య వాల్మీకి బోయలు గగ్గోలు -
శంకరరెడ్డి కుటుంబ సభ్యులకు వైవీ పరామర్శ
ఉలవపాడు: అనారోగ్యంతో మరణించిన పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మేదరమెట్ల శంకరరెడ్డి కుటుంబ సభ్యులను మండల పరిధిలోని బద్దిపూడి గ్రామంలోని వారి స్వగృహంలో రాజ్యసభ సభ్యుడు, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్లు మాదాసి వెంకయ్య, వైఎం మారుతీ ప్రసాద్రెడ్డి, రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు రఫీ, గంగిరెడ్డి, అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
దర్శి: దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని, ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో శనివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పలు కీలక డాక్యుమెంట్లు పరిశీలించారు. డాక్యుమెంట్లతో పాటు బంగారం స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం ఆయన ఇంటి నుంచి మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు పలు డాక్యుమెంట్లు పరిశీలించారు. ఆ తరువాత ఆయన్ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు మాట్లాడుతూ 1990లో రెవెన్యూ అధికారిగా ఉన్న ఆయన నెల్లూరు, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండలలో పని చేశారన్నారు. దర్శిలో మూడేళ్లకుపైగా కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారన్న అవినీతి ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు తాము తనిఖీలు చేశామన్నారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. దర్శి, ఒంగోలు, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండలలో కూడా సోదాలు చేస్తున్నామని చెప్పారు. అన్నీ ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో భారీ మొత్తంలో ఆస్తులు గుర్తించినట్లు వెల్లడించారు. ఇంకా సోదాలు పూర్తి కాలేదని, అన్నీ పరిశీలించిన తరువాత ఎంత ఆస్తులు గుర్తించామో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఎవరైనా అధికారులు పనులు చేయాలంటే లంచాలు అడిగినా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా, ఆదాయానికి మించి ఆస్తులు కూడపెట్టినట్లు సమాచారం ఉన్నా 1064 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. సోదాల్లో సీఐ పీ శ్రీనివాసరావు, ఎస్ఐ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
4న ఒంగోలుకు శాసన సభ అంచనాల కమిటీ రాక
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ ఈనెల 4వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆ రోజు ఉదయం 8 గంటలకు నెల్లూరు నుంచి బయలుదేరిన కమిటీ 11 గంటలకు ఒంగోలు చేరుకుంటారన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారన్నారు. 2019–20, 20202–21, 2021–22 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలపై సమీక్షిస్తారన్నారు. అద్దంకి: మాస్టర్ ఆఫ్ ఫ్రేం అకాడమీ ఆధ్వర్యంలో ఐ మార్కు జగన్ సారథ్యంలో మోతుగూడెంలో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ కాంపిటీషన్లో మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన యోగికి బెస్ట్ ఇమేజ్ అవార్డు లభించింది. మూడు రోజుల పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా మోతుగూడెంలో ఫ్యాకల్టీగా బీకే అగర్వార్ వర్క్ షాపు నిర్వహించారు. ఈ పోటీల్లో యోగీ తీసిన భద్రకాళి బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు బెస్ట్ ఇమేజ్ అవార్డు లభించింది. యోగికి ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఎస్కే ఏ షరీఫ్ మెమోరియల్ అవార్డును అందజేశారు. -
వైద్యులు రారు..మందులీయరు
పొదిలి: జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్య సేవలు అధ్వానంగా ఉన్న వాటిల్లో పొదిలి ప్రభుత్వ వైద్యశాల ఒకటని కలెక్టర్ రాజాబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సామాజిక వైద్యశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఫార్మాసిస్ట్, వైద్య సేవలు పొందే గదులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. వైద్యులు సక్రమంగా విధుల్లో ఉండటం లేదని, నర్సింగ్ స్టాఫ్ రౌండ్స్ విధులు సరిగా నిర్వర్తించడం లేదని, బయటికి మందులు రాస్తున్నారని తనకు ఫిర్యాదులు వస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. పరిసరాల అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తరచూ వైద్యశాలలను తనిఖీ చేస్తానని వైద్యశాల నిర్వహణ పట్ల, రోగులకు అందించే సేవల్లో, వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో మార్పు లేకపోతే చర్యలు తప్పవని తుది హెచ్చరికలిచ్చారు. తహసీల్దార్, నగర పంచాయతీ కమిషనర్ తరచుగా వైద్యశాలను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది ఉదయం, సాయంత్రం థంబ్ హాజరు వేయాల్సి ఉంటుందని అన్నారు. సీసీ కెమెరాల ఫీడ్ బ్యాక్ ఆధారంగా సక్రమంగా విధులు నిర్వహించని వైద్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆయనతో పాటు తహసీల్దార్ కృష్ణారెడ్డి, నగర కమిషనర్ మారుతీరావు ఉన్నారు. -
ఏళ్లుగా కన్నీళ్లు..ఇరవైలో అరవైలు!
ఫ్లోరైడ్ మహమ్మారి ప్రజల జీవితాలను చిదిమేస్తోంది. ఫ్లోరిన్తో నిండిన నీరు తాగిన వారు ఫ్లోరైడ్ బారిన పడి జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటికొకరు ఫ్లోరైడ్ బాధితులున్నారు. అటువంటి గ్రామమే పొదిలి మండలంలోని రాజుపాలెం. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడి ఫ్లోరైడ్ సమస్యకు చెక్పెడతానని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి వెళ్లి ఏడు నెలలైనా అమలుకు నోచుకోలేదు. రాజుపాలెం గ్రామంలోని ఫ్లోరైడ్ సమస్యపై ‘సాక్షి’ ఫోకస్.. పొదిలి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 1,009 ఊళ్లలో ఫ్లోరైడ్ మహమ్మారితో పోరాడుతున్నారు. ప్రధానంగా కనిగిరి ప్రాంతంలో 339, దర్శి ప్రాంతంలో 120, మార్కాపురం పరిధిలో 113 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఫ్లోరిన్ మూలంగా గారపళ్లు, గొగ్గిరి కొయ్యలు, దంతాలు విరిగిపోవటం, కాళ్లు వంకర్లు, పాదాలు వేళ్లు వంకర్లు తిరగటం, నడుంనొప్పులు, కీళ్ల నొప్పులతో అల్లాడిపోతున్నారు. జలజీవన్ మిషన్ కింద మంచినీటి పథకాన్ని ప్రారంభించేందుకు గత ఏడాది జూలై నెలలో మార్కాపురానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ సందర్భంగా ఫ్లోరైడ్ సమస్యకు చెక్ పెడతామంటూ హామీ ఇచ్చి వెళ్లారు. అది హామీగానే మిగిలిపోయింది. రాజుపాలెంలో ఇంటికొక్కరు.. పొదిలి శివారులోని రాజుపాలెంలో సుమారు 1000 మంది జనాభా ఉండగా 250 వరకు గృహాలున్నాయి. ఇక్కడ ఇంటికొక్కరు చొప్పున బాధితులు ఉన్నారు. ఏళ్ల తరబడి ఫ్లోరైడ్ భూతం సగటున ఇంటికొకరు చొప్పున బాధితులను చేస్తున్నా..ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది. సర్వే, పరీక్షల పేరుతో గ్రామానికి వచ్చి, వారిలో ఆశలు నింపటం తప్ప, ఫ్లోరైడ్ నుంచి వారికి విముక్తి కలిగించే పనులు ఏమీ చేయటం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో ఢిల్లీ స్థాయిలో రాజుపాలెం ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం గట్టి ప్రయత్నం చేశారు. ఇరవైలో అరవైలా... ఫ్లోరైడ్ సంబంధిత రోగాలతో నెమ్ము, లివర్, కిడ్నీలు పాడైపోవటం మూలంగా పలువురు తక్కువ వయస్సులోనే మృత్యువాత పడ్డారని గ్రామస్తులు వాపోతున్నారు. కీర్తి వెంకటస్వామి, ఎం.వెంకటరావు, తుల్లూరి తిరుపతమ్మ, చాతరాజుపల్లి చినకాశయ్య కుమారుడు, తాతా కిష్టయ్య కుమారుడు ఇలా మృత్యుపాలైన వారిలో ఉన్నారని స్థానికులు చెప్పారు. సాగర్ నీటి కోసమని... గతంలో అప్పటి రాష్ట్ర గవర్నర్ కుముద్బెన్ జోషి గ్రామంలో పర్యటించారు. పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే ఎన్ఏపీ పథకం అమలయ్యేలా ఆగమేఘాలపై ఉత్తర్వులు వచ్చేలా చేశారు. ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం జరిగింది. సాగర్ నీరు గ్రామానికి చేరింది. దీంతో సమస్య తీరిందనుకుని గ్రామస్తులు కుదుట పడే లోపే పథకం అటకెక్కింది. సాగర్ నీరు ఆగిపోయింది. పరిస్థితి మొదటికొచ్చింది. ఏదో మొక్కుబడిగా సాగర్నీరు సరఫరా అవుతోంది. వారానికో, పదిరోజులకొకమారు సాగర్నీరు ఇస్తున్నారు. అది కూడా అందరికీ కాకుండా కొందరికే అందుతుండటంతో సమస్య తీరలేదు. అధికారులు శ్రద్ధ తీసుకుని సాగర్నీరు క్రమం తప్పకుండా సరఫరా చేయడంతో పాటు, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. బోరు నీరే దిక్కు సాగర్నీరు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. పిల్లలు పనులకు పోతారు. ఇంట్లో ఆయన లేవలేడు, నేను కూర్చోలేను ఇక రోడ్డుకు వెళ్లి సాగర్నీరు తెచ్చేది ఎలా. అందుకే ఇంట్లో బోరు నీరే తాగాల్సి వస్తోంది. వీధుల్లో కొళాయిలు ఏర్పాటు చేసి, సాగర్నీరు సక్రమంగా వచ్చేలా చేయాలి. – చల్లా తిరుపతమ్మ పనికి పోయేది లేదు నడుంనొప్పి కూచోనివ్వదు. నిలబడనివ్వదు. ఒకటే నొప్పి తీపుగా వస్తుంటుంది. మంచానికే పరిమితం అయ్యాను. ఏపనీ చేయలేను. మాయదారి నీరు తాగి వళ్లంతా నొప్పులే, కాళ్లు, మోకాళ్లు తీపులు తీస్తుంటాయి. ఏ పనికిపోయేందుకు వీలు లేదు. ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో వాళ్లు చేస్తేనే కుటుంబం గడిచేది. – జూపల్లి వెంకటేశ్వర్లు శ్రద్ధతో సమస్య పరిష్కారం చేయాలి ఫ్లోరైడ్ భూతం నుంచి రాజుపాలెంను కాపాడేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు శ్రద్ధతో పనిచేయాలి. సాగర్నీరు క్రమం తప్పకుండా సరఫరా జరగాలి. శాశ్వత పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలి. బాధితులందరికీ వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – ఏడుకొండలు, మాజీ ఎంపీటీసీ ఈమె పేరు భాగ్యలక్ష్మి.. 30 ఏళ్లు వచ్చినా కదలలేదు.. మెదలలేదు..అడగలేదు..అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. అంతో ఇంతో పెడితే తినటం, మౌనంగా జోగాడుకుంటూ వచ్చి కూర్చోవటం. బిడ్డ పరిస్థితి చూస్తున్న కన్న వారికి కడుపు తరుక్కు పోతోంది. ఫ్లోరైడ్ మహమ్మారితో ఆమె భవిష్యత్ అంధకారంగా మారిపోయింది. కన్నవారు మౌనంగా రోదిస్తూ ఆమె బాగోగులు చూస్తున్నారు. -
ఒంగోలు నుంచే కూటమి పతనానికి నాంది..
ఒంగోలు టౌన్: చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాటతప్పారని, పరిపాలన చేతకాక రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో పాలన చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో బెయిల్ మీద వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. చెవిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజలు చంద్రబాబును నమ్మి మోసపోయామని బాధపడుతున్నారని, రాబోవు రోజుల్లో ప్రభుత్వంపై పోరాటాలకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని ప్రతి పల్లె నుంచి ప్రజలు తిరుగుబాటు చేయడం ఎంతో దూరంలో లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒంగోలు నుంచే కూటమి పతనానికి నాంది మొదలవుతుందని స్పష్టం చేశారు. జిల్లా నాయకులు, కార్యకర్తలందరూ ఒకతాటి మీద నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. తప్పుడు కేసులకు భయపడం.. చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులకు భయపడేది లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ పోరాటాలతో పుట్టిన పార్టీ అని, అనేక అవమానాలను తట్టుకొని పుట్టిన పార్టీ అని చెప్పారు. ఎంత మంది ఏకమై వేధించినా లెక్కచేయకుండా గట్టిగా నిలబడి కలబడిన నాయకుడు జగన్ పెట్టిన పార్టీ అన్నారు. మా పార్టీ లాక్కున్న పార్టీ కాదని, వెన్నుపోటు పొడిచి తీసుకున్న పార్టీ కాదని, నమ్మకద్రోహంతో పుట్టిన పార్టీ అసలే కాదని చెప్పారు. ఒక తండ్రి ఆశయం కోసం ఒక కొడుకు పెట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ అని, ఎన్నో కష్టాలు, మరెన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిలబడిన పార్టీ అని చెప్పారు. ఇలాంటి పార్టీ నాయకులను తప్పుడు కేసులతో బెదిరించాలంటే ఎవరూ భయపడన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను భయాందోళనలకు గురి చేయడానికి కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని విమర్శించారు. క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి, జైలుకు పంపించి పార్టీని నిర్వీర్యం చేసేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వచ్చినప్పుడల్లా కేసులే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా తన మీద కేసులు పెట్టి జైలుకు పంపించడం ఆనవాయితీగా మారిందని చెవిరెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికే తన మీద 72 కేసులు పెట్టారని, ఈసారి తన కుమారుడి మీద కూడా 10 కేసులు బనాయించారన్నారు. పోరాటాలతో పురుడు పోసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పుడు కేసులకు భయపడరని, మరింత రెట్టించిన ఉత్సాహంతో పార్టీకి పనిచేస్తారని చెప్పారు. 36 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో కలిసి నడుస్తున్నానని, వైఎస్ రాజారెడ్డి, ప్రజా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి, జననేత జగన్ మోహన్ రెడ్డిలు తనను ఎంతో ఆదరించారని చెప్పారు. కూటమిలో చాలా మంది అరవ శ్రీధర్లు.. కూటమి ప్రభుత్వంలో చాలా మంది ఎమ్మెల్యే అరవ శ్రీధర్లు ఉన్నారని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు మహిళల వెంటపడుతుంటే, చంద్రబాబు తప్పుడు ఆరోపణలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్ అవార్డు ఇస్తే చంద్రబాబుకే ఇవ్వాల్సి వస్తుందని, అసత్య ఆరోపణలు చేయడంలో చంద్రబాబు దిట్టని చెప్పారు. కల్తీ లడ్డూ అబద్ధమని సీబీఐ, సిట్ చెప్పాయి.. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని కూడా వదిలిపెట్టలేదని చంద్రబాబుపై మండిపడ్డారు. పవిత్రమైన తిరుపతి లడ్డులో కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వం వేసిన సీబీఐ, సిట్లు తేల్చి చెప్పాయన్నారు. కూటమి నాయకుల వద్ద ఏదైనా సాక్ష్యాలుంటే సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మంచి రాజధాని ఉండాలని అందరూ కోరుకుంటున్నామని చెప్పారు. ఊహలతో కూడిన రాజధాని కావాలని ఎవరూ అడగడం లేదన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఏ హాస్పిటల్లో వైద్యం చేస్తున్నారో చూపెట్టాలని, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన కాలేజీ అడ్రస్ చెప్పాలని, 50 ఏళ్లు దాటిన బీసీలకు ఎంత మందికి పింఛన్లు ఇస్తున్నారో చూపెట్టాలని ప్రశ్నించారు. చిలకలూరిపేట నుంచి ఒంగోలు వరకు తనకు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తన వెనక బలమైన జగన్ అనే శక్తి ఉందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కొండపి ఇన్చార్జ్, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, మార్కాపురం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు, గిద్దలూరు ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గాల ఇన్చార్జ్లు చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్లు వైఎం ప్రసాద్ రెడ్డి, మాదాసి వెంకయ్య, పార్టీ నాయకులు కె.రమణారెడ్డి, బొట్ల రామారావు, వై.వెంకటేశ్వరరావు, బొట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
ఒంగోలు సిటీ: జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మాగాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అహింసను ఆయుధంగా చేసుకొని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వై.వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, వైఎస్సార్ సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, గల్లా దుర్గ, దేవరపల్లి అంజిరెడ్డి, సయ్యద్ అప్సర్, పల్నాటి వెంకటేశ్వర రెడ్డి, చందోలు చెంచి రెడ్డి, పాలడుగు శ్రీనివాస రావు, వెంకయ్య నాయుడు, షైక్ మీరావళి, మధు, యెహన్, గుత్తి కొండ నారపు రెడ్డి, పీటర్, తోటపల్లి రవి, మారుతీ, అమర్, ఖాదర్ బాషా, సాయి చందు, నాయకులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులో పొగలు..
పొదిలి రూరల్: పామూరు నుంచి జగిత్యాల వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసు నంబరు 7822 మార్కాపురం జిల్లా పొదిలి సమీపంలో రాగానే బస్సులో మంటలు రావడంతో బస్సు నుంచి ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటన పొదిలి నగర పంచాయతీలోని మాదాలవారిపాలెంలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కోరుట్లకు చెందిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో పొదిలి నుంచి బయలుదేరింది. మాదాలవారిపాలెం గ్రామ సమీపంలో బస్సులో ఆకస్మికంగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవరు సీటు వద్ద సాంకేతిక సమస్య ఏర్పడి పొగలు వచ్చాయని ప్రయాణికులు తెలిపారు. వెంటనే స్పందించిన బస్సు డ్రైవరు సమీపంలోని పొదిలి డిపోకు తరలించి ప్రయాణికులందరినీ దింపి మరమ్మతులు చేయించారు. మొత్తం మీద బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
సంపూర్ణత అభియాన్ 2. ప్రారంభం
● ఫ్లెక్సీలో వైపాలెం టీడీపీ ఇన్చార్జి ఫొటోపై సర్వత్రా విస్మయం మార్కాపురం టౌన్: యాస్పిరేషనల్ బ్లాక్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాన్ని నూరు శాతం సంతృప్త స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. కేంద్రం నిర్దేశించిన 6 ఇండికేటర్లలో ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీలోగా నూరు శాతం సంతృప్తి సాధించడంపై దృష్టి సారించాలని చెప్పారు. సీపీఓ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం బ్లాక్(మండలం)ను పథకం కింద కేంద్రం ఎంపిక చేసిందన్నారు. మొత్తం 39 అంశాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పఽఽథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నోడల్ ఆఫీసర్, ఎంపీడీఓ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ సాక్షిగా ప్రొటోకాల్ ఉల్లంఘన సంపూర్ణత అభియాన్ 2.0 ప్రారంభం సందర్భంగా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశ ఫ్లెక్సీలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫొటో కాకుండా ఏ అర్హతా లేని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు ఫొటో ముద్రించడాన్ని గమనించి పలువురు అధికారులే ఆశ్చర్యపోయారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న ఎమ్మెల్యే ఫొటో స్థానంలో టీడీపీ నాయకుడి ఫొటో ఎలా వేస్తారంటూ ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. కలెక్టర్ సాక్షిగా అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘించడాన్ని ఆక్షేపించారు. -
ఐక్యంగా ముందుకు..
ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేసిందని ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోపించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, నాయకులు, కార్యకర్తలందరి సమన్వయంతో ప్రజల పక్షాన పోరాడతామన్నారు. శుక్రవారం నగరానికి వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి వారితో మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్న దగా పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, వారి పక్షాన నిలబడి ఆందోళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలోని పల్లెల నుంచే ఉద్యమానికి శ్రీకారం చుడదామన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్ మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు అందరం ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. చెవిరెడ్డికి ఘనస్వాగతం.. ఎనిమిది నెలలుగా జైలులో ఉండి బయటకు వచ్చిన ఆయనకు చంద్రబాబు దుష్టరాజకీయాలు తెరపడాలంటూ మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి చెవిరెడ్డి రోడ్డు మార్గంలో నగరానికి చేరుకున్నారు. ఆయన్ను కలిసేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు. నగర శివారు బృందావనం కళ్యాణ మండపం ఎదురుగా ఆయనకు వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఒంగోలు ఏఎంసీ మీదుగా ర్యాలీగా బయలు దేరి బైపాస్ మీదుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద మహిళలు గుమ్మడికాయ లతో దిష్టి తీశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కె.నాగార్జునరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కెవీ.రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహాగౌడ్, లీగల్ సెల్ ఒంగోలు నియోజకవర్గ ప్రెసిడెంట్ ధర్నాసి హరిబాబు, వైఎస్సార్సీపీ నాయకులు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని శాలువాలు, బొకేలు, గజమాలతో ఘనంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సన్మానించారు. చంద్రబాబు ప్రభుత్వం పై నిరంతర పోరాటం హామీలు ఇచ్చి మాట తప్పారు ప్రజల పక్షాన నిలుద్దాం..జగన్ను సీఎం చేసుకుందాం.. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఒంగోలులో చెవిరెడ్డికి ఘనస్వాగతం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు -
మార్చి 15లోగా బిల్లులు అప్లోడ్ చేయాలి
మార్కాపురం టౌన్: ఉపాధి హమీ పథకం కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసి మార్చి 15లోగా బిల్లులను అప్లోడ్ చేయాలని సంబంధిత అధికారులను ఇన్చార్జి కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్, డ్వామా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రలజకు ఉపయోగకరమైన పనులనే ఉపాధి హామీలో చేపట్టాలని స్పష్టం చేశారు. హాస్టళ్ల నిర్వహణపై దృష్టి సారించండి జిల్లాలో హాస్టళ్ల నిర్వహణ తీరుపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లలో ముఖ్యంగా బాలికల హాస్టళ్లలో మార్చి 8వ తేదీ నాటికి టాయిలెట్ల నిర్మాణం, ఇతర మరమ్మతు పనులు పూర్తి చేయాలన్నారు. 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, డ్వామా పీడీ జోసఫ్కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ అశోక్, వివిధ శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్ పనుల పరిశీలన వచ్చేనెల మొదటి వారం నుంచి తన చాంబర్లోనే విధులు నిర్వహిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు కూడా కార్యాలయాలు ఏర్పరుచుకుని వాటి చిరునామాలను తెలియజేస్తున్నారని చెప్పారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజా సమస్యలు, మీ కోసం అర్జీలు సత్వరమే పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు. వివిధ సెక్షన్లకు గదుల కేటాయింపు గురించి కలెక్టర్కు జేసీ వివరించారు. ముందుగా కలెక్టరు క్యాంప్ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. ఉపాధి హామీపై సమీక్షలో కలెక్టర్ రాజాబాబు మార్కాపురంలో నూతన కలెక్టరేట్ పనుల పరిశీలన -
గ్రూప్–1 ఫలితాల్లో జర్నలిస్టుల కుమార్తెల సత్తా
ఒంగోలు టౌన్: శుక్రవారం విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో జిల్లాకు చెందిన జర్నలిస్టుల కుమార్తెలు ఇద్దరు సత్తా చాటి ఉన్నత కొలువులు సంపాదించారు. ఒంగోలులో ఒక దినపత్రిక రిపోర్టర్గా పనిచేస్తున్న కొత్తపట్నం గ్రామానికి చెందిన బేతాళ శ్రీనివాస్ కూతురు శృతి గ్రూప్ 1 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారిగా ఎంపికయ్యారు. బేతాళ శృతి తల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఒంగోలులోని కమ్మపాలేనికి చెందిన, ఓ పత్రికలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న పెండ్యాల రామకోటేశ్వరరావు కుమార్తె వెంకట నవీన డీఎస్పీగా ఎంపికయ్యారు. రామకోటేశ్వరరావు సతీమణి టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. జర్నలిస్ట్ కుటుంబాలకు చెందిన ఇద్దరు గ్రూపు–1 ఉద్యోగాలు సాధించడంతో పలువురు విలేకర్లు అభినందనలు తెలిపారు. బేతాళ శృతిపెండ్యాల వెంకట నవీన -
నేను టీడీపీ.. మా పార్టీ వాళ్లే..కొంప ముంచారు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘సొంత పార్టీ కార్యకర్తనే సర్వనాశనం చేశారు. రాజకీయ నాయకులు, పోలీసులు కుమ్మకై ్క నా ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారు. ఎదురు తిరిగితే భార్యను, కుమార్తెల జీవితం నాశనం చేస్తామని బెదింరించారు. అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారు. వ్యాపారంలో నేను సంపాదించిన ఆస్తులన్నీ సొంత పార్టీ వాళ్లే లాక్కోవడంతో రోడ్డున పడ్డాను’ ఇది ప్రకాశం జిల్లా టంగుటూరు టీడీపీ కార్యకర్త కారుమంచి సురేంద్ర ఆవేదన. శుక్రవారం విజయవాడ ప్రెస్క్లబ్లో తనకు జరిగిన అన్యాయంపై కారుమంచి సురేంద్ర భార్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. శ్ఙ్రీనేను గత 25 ఏళ్లుగా అధికార టీడీపీకి చెందిన కామని విజయ కుమార్, కామని బాల మురళీ మోహన కృష్ణ, కామని రాజా రంగ భూపతిలకు చెందిన శ్రీప్రగతి టొబాకో ట్రేడర్స్శ్రీ కంపెనీలో క్లర్క్గా, ఆ తర్వాత అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. కేవలం ఉద్యోగం మీద వచ్చే జీతం మీదే ఆధారపడకుండా కుటుంబాన్ని 2014లో ‘నవ్య సప్లయర్స్’ పేరుతో టెంట్ హౌస్, ‘నవ్యాస్ డిజే’ శ్రీఎల్ఈడీ స్క్రీన్స్శ్రీ బిజినెస్ స్టార్ట్ చేశాను. నా మేనల్లుడు నలతోటి సుధీర్ ఈ వ్యాపారాలను చూసుకుంటున్నాడు. 2022లో సింగరాయకొండలో ఒక రెస్టారెంట్ ప్రారంభించాను. ఆ తర్వాత రైతుల దగ్గర పొగాకు కొనుగోలు చేసి ఇతర కంపెనీలకు అమ్మడం ప్రారంభించాను. అలా కిలో రూ. 180 చొప్పున 50 టన్నుల పొగాకు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశాను. ఆ సమయంలో నేను పనిచేస్తున్న కంపెనీకి ఎగుమతి ఆర్డర్ వచ్చింది. మార్కెట్లో పొగాకు కిలో రూ. 260కు చేరింది. దీంతో నేను పనిచేస్తున్న కంపెనీ యజమానుల్లో ఒకరైన బాల మురళీ మోహనకృష్ణ నా వద్ద ఉన్న పొగాకుపై కన్నేశారు. తక్కువ ధరకు తమకు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అందుకు నేను అంగీకరించలేదు. కిలో రూ.260 ఉండగా కేవలం రూ.200ల ధరకు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశాడు. మార్కెట్ రేటు ఇస్తే నా పొగాకు ఇచ్చేస్తానని చెప్పాను. తక్కువ కులం వాడివి మా దగ్గర తింటూ మాకే ఎదురు తిరుగుతావా? నీ బతుకు ఎంత? నీవు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాను. అంటూ బెదిరించాడని సురేంద్ర వాపోయాడు. ఆ తర్వాత కిలో రూ. 250లకు కొనుగోలు చేస్తానని, తనను ఒంగోలు రావాలని నమ్మబలికాడు. అందుకు అంగీకరించి గతేడాది ఆగస్టు 28న ఒంగోలు బయలు దేరిన తనను మార్గమధ్యంలో ట్రాఫిక్ సీఐ వై. పాండురంగారావుతో పాటు మరికొంత మంది పోలీసులు నన్ను అక్రమంగా ఎత్తుకెళ్లి నిర్బంధించారు. విపరీతంగా కొట్టి బెదిరించారు. హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న నా పెద్ద కూతురుని నాశనం చేస్తామన్నారు. నా భార్యను, నా ఇద్దరు ఆడపిల్లలను నీచంగా దూషించారు. గన్తో బెదిరించి ఆస్తి పత్రాలపై, ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. ఎస్పీ ఏఆర్. దామోదర్, డీఎస్పీ రాయపాటి సాంబశివరావుల ఆదేశాలతో సీఐలు హజరత్తయ్య, పాండురంగారావు, ఎస్ఐలు నాగమల్లేశ్వరరావు, కమలాకరరావు మా ఇంటిపై దాడి చేసి రూ.40 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం, ఆస్తి పత్రాలను బలవంతంగా లాక్కుని వెళ్లారు. అక్కడ నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆ సొమ్ము మొత్తాన్ని ఎస్పీ దామోదర్, డీఎస్సీ సాంబశివరావులు.. బాల మురళీ మోహన కృష్ణకు అప్పగించారు. నన్ను, నా భార్య కమల, నా మేనల్లుడు సుధీర్ ను మరోసారి అక్రమ కస్టడీలోకి తీసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు. కంపెనీ యజమానులు కామని విజయ కుమార్, బాల మురళీ మోహన కృష్ణ, రాజా రంగ భూపతి ముగ్గురు టంగుటూరు మండల టీడీపీ అధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్, పోలీసుల సహకారంతో నేను కష్టపడి సంపాదించిన ఆస్తినంతా తమ పేర్ల మీద బలవంతంగా రాయించుకుని తనను రోడ్డుపై పడేశారని మొరపెట్టుకున్నాడు. 50 టన్నుల పొగాకు, ఫ్లాట్లు, కార్లు, అన్నీ తమ పేర్లపై మార్చుకుని.. తనపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని, తన కుటుంబాన్ని సర్వ నాశనం చేశారని వాపోయాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబుకు లేఖరాశానని, కానీ ఎటువంటి స్పందన రాలేదన్నారు. 2024లో పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టి పనిచేశా. సొంత పార్టీ నాయకులే నన్ను సర్వనాశనం చేశారు. నాకు జరిగిన అన్యాయంపై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ స్పందించాలి. నన్ను ఇబ్బందులకు గురిచేసిన కంపెనీ యజమానులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కారుమంచి సురేంద్ర వేడుకున్నాడు. -
వైఎస్ జగన్ను కలిసిన దద్దాల
ఒంగోలు టౌన్: భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎం రమేష్ డిమాండ్ చేశారు. నగరంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం కార్మికులతో మాట్లాడుతూ...భవన నిర్మాణ కార్మికుల హక్కులను, సంక్షేమాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హరించివేస్తుందని ఆరోపించారు. మోదీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో 1996లో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిర్వీర్యం అయిందని చెప్పారు. 10 లక్షల వ్యయమయ్యే ప్రతి నిర్మాణంపై 1 శాతం సెస్ వసూలు చేసి వచ్చిన నిధులతో కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా సెస్ వసూలుకు రూ.50 లక్షల వ్యయం వరకు పెంచడం, వ్యయ నిర్ధారణను యాజమానికి వదిలిపెట్టడంతో బోర్డు నామమాత్రంగా మిగిలే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ శ్రమ కార్డులు ప్రారంభించిన తరువాత బిల్డింగ్ బోర్డు గుర్తింపును నిలిపివేసిందన్నారు. బోర్డు ద్వారా అమలవుతున్న వివాహ కానుక, ప్రమాద ఖర్చుల మెమోను నిలిపివేశారని తెలిపారు. సెస్ నిధులను ఇతర ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. సీఐటీయూ నగర నాయకుడు జి.రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డును పునరుద్ధరించి నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా సంక్షేమ బోర్డు గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇసుక మాఫియా పుణ్యమాని ఉచిత ఇసుక పథకం అమలు కావడం లేదని, దీంతో గృహనిర్మాణాలు నిలిచిపోయి భవన కార్మికుల ఉపాధి దెబ్బతిందని చెప్పారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునురుద్ధరించాలని, ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు ఎస్డీ హుసేన్, పి.సుబ్బారావు, దారా వెంకటేశ్వర్లు, లక్ష్మి రెడ్డి పాల్గొన్నారు. -
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
ఒంగోలు వన్టౌన్: పీఎంఈజీపీ దరఖాస్తులను బ్యాంకులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమలకు చెందిన వివిధ రకాల రాయితీలకు సంబంధింఛి 171 క్లెయిమ్లకు గాను రూ.14.34 కోట్లు మంజూరు చేశారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరిగతిన మంజూరు చేయాలని కలెక్టర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. జరుగుమల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న ప్రైవేట్ పార్కుల గురించి చిర్చంచారు. జిల్లాలో ఎక్కువగా ఉన్న గ్రానైట్ పరిశ్రమ గురించి, గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించి, గ్రానైట్ పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో పనిచేసే కార్మికుల కోసం బస్ షెల్టర్ను నిర్మించాలని, గ్రోత్ సెంటర్ లో రోడ్లు, వీధి దీపాలు, సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ను ఆదేశించారు. కలెక్టర్ పి.రాజాబాబు -
సర్పంచ్లను వేధించడం తగదు
ఒంగోలు టౌన్: చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా ఆరు నెలలుగా సర్పంచ్లను వేధింపులకు గురిచేస్తున్నారని, ఇది మంచిపద్ధతి కాదని సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి అన్నారు. ఈమనిపాలెంలోని సంఘ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, రాచర్ల, పెదారవీడు, తర్లుపాడు, మార్కాపురం, యర్రగొండపాలెం మండలాల్లోని పంచాయతీ కార్యదర్శులు, మండల అభివృద్ధి అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్లకు బిల్లులు రాకుండా చేయడంలో ఎమ్మెల్యేల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న కథనాలు సిగ్గుచేటన్నారు. బిల్లులు చెల్లించాలని అడిగిన సర్పంచ్లపై పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్న తీరు దుర్మార్గమన్నారు. కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గిద్దలూరు మండలం ఏఆర్ పల్లి సర్పంచ్ రామచంద్రయ్య పాల్గొన్నారు. -
గిద్దలూరు కొండ లూటీ
గిద్దలూరు రూరల్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఏ మార్గం నుంచి నిధులు వస్తాయోనని టీడీపీ నాయకులు పొంచు వేసి ఉన్నారు. అందులో భాగంగానే కొండలు, గుట్టలను కొల్లగొడుతున్నారు. పట్టణ శివారులోని కొంగలవీడ రోడ్డు దర్గా సమీపంలో ఉన్న కొండను గురువారం కొందరు టీడీపీ మద్దతుదారులు జేసీబీలు పెట్టి గ్రావెల్ మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. పదుల కొద్ది ట్రాక్టర్లను ఉంచి జేసీబీల సాయంతో మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. మట్టి తరలింపులో భాగంగా జేసీబీలు, ట్రాక్టర్ల శబ్ధాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రావెల్ మట్టి తీసుకెళ్తున్న ట్రాక్టర్ల అతివేగం కారణంగా మట్టి రోడ్డు వెంట రాళ్లతో పాటు కింద పడుతోందని స్థానికులు వాపోతున్నారు. గతంలో గుట్టుచప్పుడు కాకుండా రాత్రుల సమయంలో మట్టి తరలించే వారు. ప్రస్తుతం పగటి పూట బహిరంగంగానే కొండలను చదును చేసి మట్టి తరలిస్తున్నారంటే వారికి ఎంతటి పెద్ద వాళ్ల మద్దతు ఉందో ఇట్టే అర్థమతోంది. గత ప్రభుత్వంలో గ్రావెల్ మట్టి ట్రాక్టర్ రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయించే వారు. ప్రస్తుతం చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ట్రాక్టర్ మట్టి ధర రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. అధికారం అండదండలతో టీడీపీ నాయకులు గ్రావెల్ మట్టి దందాను పెద్ద వ్యాపారంగా కొనసాగిస్తున్నారు. మండలంలోని నరవ రోడ్డులో కొండ ప్రాంతం, కేఎస్పల్లె సమీపంలోని దుప్పిల తిప్ప నుంచి రోజుకు వందల ట్రిప్పులు గిద్దలూరు పట్టణానికి వస్తుంటాయి. అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ మట్టిని అధికారులు అడ్డుకుని జరిమానాలు విధించిన దాఖలాలు లేవు. సీనరేజి పేరుతో బహిరంగ దోపిడీ ప్రభుత్వం నుంచి సీనరేజి వసూలు బాధ్యత తీసుకున్న ఓ ప్రైవేటు సంస్థ సిబ్బంది పోరుమామిళ్ల రోడ్డులోని సగిలేరు బ్రిడ్జి వద్ద, అంబవరం రోడ్డు, ఒంగోలు హైవే రోడ్డులో నిఘా స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఇసుక, గ్రావెల్ వంటివి పట్టణంలోకి రావాలంటే వారికి తప్పకుండా రుసుం చెల్లించాలి. గ్రావెల్ మట్టి, ఇసుక తోలుకునే వారు ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.350 చొప్పున చెల్లించాలి. అది కూడా కేవలం నగదు రూపంలో మాత్రమే తీసుకుంటారు. సామాన్య ప్రజలకు ఆర్థిక భారం మోపే విధంగా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రావెల్ అక్రమ తరలిపు విషయమై స్థానిక తహసీల్దార్ ఎం.ఆంజనేయరెడ్డిని వివరణ కోరగా సమాచారం అందితే వెంటనే అడ్డుకుంటామని తెలిపారు. అనుమతులు లేనిచోట అక్రమంగా గ్రావెల్ తరలిపుం చర్యలు నేరమన్నారు. యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు -
పొగాకు బ్యారన్ దగ్ధం
మర్రిపూడి: క్యూరింగ్ జరుగుతుండగా పొగాకు బ్యారన్ దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని గుండ్లసముద్రంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గుండ్లసముద్రం గ్రామానికి చెందిన పరిమి వెంకటేశ్వర్లుకు చెందిన పొగాకు బ్యారన్ క్యూరింగ్ జరుగుతుండగా ఆకు మొద్దుగొట్టంపై పడి ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో బ్యారన్లోని ఉన్న సుమారు 1200 అల్లుడు కర్ర, టైర్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పొన్నలూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన టంగుటూరు రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు కలకత్తా ప్రాంతానికి చెందిన రాజా చైన్నె నుంచి విజయవాడ వైపు వస్తున్న రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. అయితే రైలు టంగుటూరు రైల్వే స్టేషన్కు కొంతదూరం వచ్చిన తరువాత రాజా ప్రమాదవశాత్తు రైలు నుంచి కందపడిపోయాడు. దీంతో రాజా తలకు, శరీరంపై బలమైన గాయాలయ్యాయి. ఇది గమనించిన రైల్వే పోలీసులు 108కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చికిత్స కోసం రాజాను ఒంగోలు రిమ్స్కు తరలించారు. ● ఐదు రూపాయల వడ్డీ చొప్పున చెల్లించాలని వేధింపులు ● చీమకుర్తి మున్సిపాలిటీలో పనిచేస్తున్న స్వీపర్ ఆత్మహత్యాయత్నం చీమకుర్తి: ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ ఒత్తిళ్లు తట్టుకోలేక చీమకుర్తి మున్సిపాలిటీలో స్వీపర్గా పనిచేస్తున్న బ్రహ్మయ్య అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి 5 రూపాయల చొప్పున నెలనెలా వడ్డీ చెల్లించాల్సి రావడం, అంత మొత్తంలో చెల్లించలేకపోవడం, ఏజెంట్ ఒత్తిడి చేయడంతో బ్రహ్మయ్య తట్టుకోలేకపోయాడు. మద్యంలో ఎలుకల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం సోషల్ మీడియాలో సైతం హల్చల్ చేస్తుండగా, సీఐటీయూ నాయకులు పల్లాపల్లి ఆంజనేయులు, పాలేటి ఏడుకొండలు బాధితుడిని పరామర్శించారు. దీనిపై చీమకుర్తి సీఐ దాసరి ప్రసాదరావును వివరాలు అడగ్గా.. విచారిస్తున్నామని, ఇంకా కేసు నమోదు చేయలేదని తెలిపారు. ● గజల్ శ్రీనివాస్ ఒంగోలు మెట్రో: మాతృభాషపై పట్టు సాధిస్తే దేనిమీదైనా పట్టు సాధించవచ్చని గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ ఐదు, ఆరు తేదీల్లో ఒంగోలులో జరగనున్న బాలల ప్రపంచ తెలుగు మహాసభల బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లిష్ మాట్లాడితే గొప్ప అనే భావం నుంచి బయటకు రావాలని కోరారు. ఒంగోలులో బాలల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న గజల్ శ్రీనివాస్, అతని మిత్ర బృందాన్ని నిర్వాహకులు అభినందించారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ తెలుగుభాష మన ఆత్మగౌరవానికి సంబంధించిందని పేర్కొన్నారు. 16 ఏళ్లలోపు పిల్లలతో ఒంగోలులో బాలల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ను అభినందించారు. 2022 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల గురించి వివరించారు. బాలల ప్రపంచ మహాసభలకు 50 దేశాల నుంచి బాలలు హాజరవుతున్నట్లు తెలిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్ సలహాదారులు అడ్డాల వాసుదేవరావు, సునీత లక్కంరాజు, నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్లు మురళీధరరెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు. తొలుత తెలుగు భాష ఔనత్యం గురించి జిల్లా రచయితల సంఘ జిల్లా అధ్యక్షుడు పొన్నూరు శ్రీనివాసులు వివరించారు. -
ట్రాన్స్ఫార్మర్ల దొంగల అరెస్టు
కనిగిరిరూరల్: ట్రాన్స్ఫారాలను పగులగొట్టి అందులోని రాగి వైరును అపహరిస్తున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. పోలీస్ సబ్డివిజన్ పరిధిలోని కనిగిరి, హెచ్ఎంపాడు, సీఎస్పురం మండలాల్లో ట్రాన్స్ఫారాల్లో వీరు చోరీలకు పాల్పడ్డారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పాతూరుకు చెందిన నాగులూరి అంకబాబు, నాగులూరి దుర్గా ప్రసాద్, సీఎస్రానికి చెందిన నల్లగట్ల వెంకట నారాయణలు ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగి వైర్లను అపహరించారు. ఈ క్రమంలో కనిగిరిలో 9, సీఎస్పురంలో 2, హనుమంతునిపాడులో 2 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఫిర్యాదుల మేరకు నిందితులను గురువారం ఉదయం 11.30 గంటలకు హెచ్ఎంపాడు ఎస్సై కె.మాధవరావు, పోలీస్ సిబ్బంది కలిసి కనిగిరి పొదిలి రోడ్డులోని పొగాకు బోర్డు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను విచారించి వారి వద్ద నుంచి 13 ట్రాన్స్ఫార్మర్లకు చెందిన 155 కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి కేసు రికవరీ చేసిన హెచ్ఎం పాడు ఎస్సై కె.మాధవరావును, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ ఉప్పు శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు. 155 కేజీల రాగి వైరు స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కంభం: కంభం చెరువులో ఆదివారం గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని గురువారం లభ్యమైంది. పోలీసులు గురువారం డ్రోన్ సాయంతో మృతదేహాన్ని గుర్తించారు. చెరువు మధ్యలో ఉన్న కొండల అంచు వెంబడి మృతదేహాన్ని గుర్తించి జాలరుల సహాయంతో పడవలో వెళ్లి మృతదేహాన్ని గట్టు పైకి తెచ్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతదేహం పైకి తేలి గాలికి అటువైపుకు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది మృతుడు కందులాపురం కాలనీ వాసి: స్థానిక కందులాపురం కాలనీలో నివాసం ఉంటున్న కాటమాల అశోక్ (38) పూసల పాడు టోల్ప్లాజా వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం రెండుగంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిన అతను ఆటోలో చెరువు కట్టపైకి వెళ్ళినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. చెరువుకట్టపై నాలుగు గంటల సమయంలో ఈత కొడుతూ ప్రమాదవ శాత్తు నీళ్లలో మునిగిపోతున్న వ్యక్తిని గుర్తించిన కొందరు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నుంచి కంభం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగురోజులైనా శవం తేలకపోవడంతో ఆదివారం డ్రోన్ కెమెరాలతో చెరువు మొత్తం ఫొటోలు తీస్తుండగా చెరువు మధ్యలో ఉన్న కొండ పక్కన మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడు కందులాపురం వాసి అశోక్ -
తిరుపతి లడ్డూ కల్తీ అవాస్తవం
మార్కాపురం టౌన్: పవిత్ర తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు, కూటమి పెద్దలు చేసిన తప్పుడు ప్రచారం అబద్ధమని అత్యున్నత న్యాయస్థానం సుప్రింకోర్టుకు సీబీఐ అందించిన చార్జీషీట్లో తేటతెల్లమైందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్నా రాంబాబు అన్నారు. గురువారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంతో పాటు ప్రపంచం మొత్తం ఉన్న దేవదేవుని భక్తుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం రాజకీయం చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకే కూటమి నేతలు విష ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రింకోర్టు ఆదేశాలతో రంగ ప్రవేశం చేసిన సీబీఐ క్షుణ్ణంగా మొత్తం ప్రక్రియను పరిశీలన, పరీక్షలు నిర్వహించి న్యాయస్థానానికి ఫైనల్ చార్జిషీటు సమర్పించినట్లు పేర్కొన్నారు. పరిశీలించిన న్యాయస్థానం తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ కొవ్వు, ఎలాంటి జంతువుల కళేబరాల కల్తీ లేదని కోర్టుకు నివేదించిందని, కేవలం చంద్రబాబునాయుడు, కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రాజకీయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రచారానికి దిగారని మండిపడ్డారు. గౌరవమైన రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తులు ప్రజలు, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సమంజసం కాదన్నారు. విష ప్రచారం చేసిన వారు ప్రజలకు, భక్తులకు క్షమాపణలు చెప్పి వెంకటేశ్వరస్వామికి నమస్కరిస్తే వారు చేసిన పాపం పోతుందన్నారు. దుర్మార్గమైన మాటలు మాట్లాడటం తగదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిని ఆ దేవుడే కఠినంగా శిక్షించాలని కోరుతున్నట్లు అన్నా రాంబాబు పేర్కొన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు కేవీ రమణారెడ్డి ఉన్నారు. చంద్రబాబు, కూటమి పెద్దల తప్పుడు ప్రచారం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ధ్వజం -
పాత నిందితులపై నిఘా పెట్టాలి
ఒంగోలు టౌన్: జిల్లాలోని పాత ముద్దాయిలపై నిరంతరం నిఘా పెట్టాలని ఎస్పీ హర్షవర్థన్రాజు ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో మార్కాపురం, కందుకూరు సబ్ డివిజన్ల పోలీసు అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. హత్య కేసులు, చోరీ కేసులు, పోక్సో కేసులతో పాటు పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు, రోడ్డు ప్రమాదాలు, ప్రార్ధనా మందిరాల వద్ద భద్రతా ఏర్పాట్ల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ పెంచాలని, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. మహిళలపై జరిగే నేరాలు, పోక్సో కేసుల్లో దర్యాప్తులు వేగవంతం చేయాలని చెప్పారు. నిర్ణీత గడువులోగా చార్జిషీట్ వేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో..లేదో నిరంతరం పరిశీలించాలన్నారు. గతంలో కంటే రోడ్డు ప్రమాదాలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇతర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలని చెప్పారు. బ్లాక్ స్పాట్లను పరిశీలించి అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు భద్రతా నిబంధనల గురించి వాహన చోదకులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, కందుకూరు డీఎస్పీ సీహెచ్వీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ డీఎస్పీ చిరంజీవి, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ సీఐ వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
సేవల్లో జీఛీహెచ్..!
మార్కాపురం: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మార్కాపురం జీజీహెచ్ అంటే రోగుల ప్రాణాలకు భరోసా ఉండేది. జీజీహెచ్కి వెళ్తే నమ్మకంగా ఆరోగ్యంగా బయటకు వస్తామన్న ధైర్యం ఉండేది. నిపుణులైన డాక్టర్లు, అత్యాధునిక వైద్య పరికరాలు, మంచి మందులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం నూతన జిల్లాగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉండే సుమారు 8 లక్షల మంది ప్రజలకు వైఎస్సార్ సీపీ హయాంలో జీజీహెచ్ నమ్మకాన్ని కలిగించింది. నల్లమల అటవీ ప్రాంతం ఉండటంతో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. వారు సైతం ఎక్కువగా మార్కాపురం జీజీహెచ్కి వచ్చి వైద్యసేవలు పొందేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరిస్థితి తలకిందులు... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్కాపురం జీజీహెచ్ పరిస్థితి తలకిందులైంది. 75 మంది డాక్టర్లున్న జీజీహెచ్లో ప్రసుత్తం 15 మంది మాత్రమే ఉన్నారు. బయట నుంచి చూస్తే బాగానే ఉన్నా.. లోపలికి వెళితే డాక్టర్ల గదులు చాలావరకూ ఖాళీగా కనిపిస్తున్నాయి. 350 బెడ్లు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో వైద్యులు లేకపోవడంతో రోగులు ప్రైవేటు వైద్యశాలలకు వెళుతున్నారు. జేబులు గుళ్లచేసుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మార్కాపురం వైద్యశాలను జీజీహెచ్గా మార్చి 75 మంది డాక్టర్లను నియమించారు. వీరిలో ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు, స్పెషలిస్టు వైద్యులు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడికి వచ్చి వైద్యసేవలు పొందారు. కరోనా సమయంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అంతేగాకుండా రాయవరం వద్ద రూ.475 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి 70 శాతానికిపైగా పనులు పూర్తిచేసింది. అందుకు అనుగుణంగా జీజీహెచ్లో 350 బెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఐసీయూ, వెంటిలేటర్ అత్యాధునిక వైద్య పరికరాలు, రెండు ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయడంతో ఎంతో మంది ప్రాణాలను మార్కాపురం జీజీహెచ్ కాపాడింది. ఆనాడు రోజుకు 550 నుంచి 600 వరకూ ఓపీ ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కాపురం మెడికల్ కాలేజీ పనులు నిలిపివేయడంతో పాటు పీపీపీలో నిర్మిస్తామని చెప్పారు. స్థానిక జీజీహెచ్లో పనిచేసే వైద్యులందరినీ ఒంగోలు, గుంటూరు, ఏలూరు, కర్నూలు.. ఇలా పలు ప్రాంతాలకు బదిలీ చేశారు. గత ఏడాది ఆగస్టు నాటికి 22 మంది వైద్యులు ఉండగా.. ఇటీవల నలుగురు డాక్టర్లకు కాంట్రాక్టు సమయం ముగియడం, మరికొంత మంది బదిలీపై వెళ్లడంతో ప్రస్తుతం 15 మంది మాత్రమే ఉన్నారు. వైద్యసేవలు సరిగ్గా అందకపోవడంతో ఓపీ కూడా 150 నుంచి 200కు పడిపోయింది. పలు అత్యాధునిక వైద్య పరికరాలను ఇతర మెడికల్ కాలేజీలు, వైద్యశాలలకు తరలించేశారు. దీంతో అత్యవసర వైద్యసేవలకు ఎవరైనా వస్తే 2019కు ముందులాగా ఒంగోలు లేదా గుంటూరుకు రెఫర్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో వైద్యసేవలకు వచ్చే రోగుల సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిపోతోంది. ఇప్పుడున్న డాక్టర్లలో కూడా కొంత మంది మార్చి నెలాఖరుకు బదిలీపై వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అటు మెడికల్ కళాశాల అర్ధంతరంగా ఆగిపోవడం, ఇటు జీజీహెచ్లో వైద్య సిబ్బంది తక్కువ కావడంతో మార్కాపురం జిల్లా ప్రజలు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ల ఖాళీలు భర్తీ చేయాలి మార్కాపురం జీజీహెచ్లో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. లేదంటే వైద్యసేవలు తగ్గిపోతాయి. మార్కాపురం జిల్లాలో దోర్నాల, యర్రగొండపాలెం, పెద్దారవీడు, అర్ధవీడు, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. దీంతో పాటు దోర్నాల – శ్రీశైలం, దోర్నాల – ఆత్మకూరు, అమరావతి – అనంతపురం, దేవరాజుగట్టు – ఒంగోలు జాతీయ రహదారులు ఉన్నాయి. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో బాధితులు ఎవరైనా జీజీహెచ్కి వస్తే పూర్తిస్థాయిలో డాక్టర్లు లేకపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి వైద్యులను నియమించాలి. – సోమయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు -
బాబు, లోకేష్వి దుర్మార్గపు రాజకీయాలు
ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డికి గురువారం బెయిల్ మంజూరు కావడంతో ఒంగోలులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు స్వీట్లు పంపిణీ చేసి క్రాకర్స్ పేల్చి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలోని వైఎస్సార్ విగ్రహానికి పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. తద్వారా వైఎస్సార్ సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఎంతో పవిత్రమైన తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై సైతం రాజకీయా లు చేయడం అన్యాయమన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేసిన ఆయిల్తో వండారని, పంది ఆయిల్ కూడా ఉపయోగించారని ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బహిరంగ ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. అలాంటిదేమీ జరగలేదని ప్రస్తుతం తేలడంతో నాలిక కరుచుకున్నారని అన్నారు. ఆనాటి టీటీడీ పాలకవర్గ బాధ్యతలు చూసిన ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిలను వ్యక్తిగతంగా, రాజకీయంగా దెబ్బతీయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందని అన్నారు. సీబీఐ విచారణ నివేదికతో పాటు న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో టీటీడీ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఆయిల్ ఉపయోగించలేదని తేలిందన్నారు. దీంతో భక్తులందరూ ఎంతో ఆనందోత్సాహాలు వెలిబుచ్చుతున్నారని, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి పాలకవర్గాలలో టీటీడీలో మంచి పరిపాలన, అభివృద్ధి జరిగిందని గుర్తుచేసుకుంటున్నారని బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. దుర్మార్గమైన రాజకీయాలు చంద్రబాబుకే సాధ్యమ ని అన్నారు. ఇప్పటికై నా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని, తిరుమల ఖ్యాతిని బలహీనపరిచే విధంగా వ్యవహరించిన సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లంగి రవీందర్రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, నాయకుడు దుంపా చెంచిరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొగ్గుల శ్రీనివాస్రెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు పేరం ప్రసన్న, సయ్యద్ అప్సర్, జి.నాగమణి, షేక్ సమీర్, మధు, అమర్, ఫణిదపు సుధాకర్, షేక్ జిలాపీబాషా, యరజర్ల రమేష్బాబు, తోటపల్లి రవి, వెంకట్రెడ్డి, పల్నాటి సాయి యాదవ్, బాలినేని శ్రీనివాస్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి
● అధికారులకు కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు ఒంగోలు వన్టౌన్: ఇసుక అక్రమ రవాణా, అనధికార యార్డులపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్లోని కలెక్టర్ చాంబర్లో గురువారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఇసుక స్టాక్ యార్డులలో పరిస్థితి, వినియోగదారులకు ఇసుక రవాణా తీరు గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా ప్రభుత్వం సేకరించిన అభిప్రాయాలలో లబ్ధిదారుల నుంచి అసంతృప్తి వ్యక్తం కావడానికి గల కారణాలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఇసుక అక్రమ రవాణా, బుకింగ్లో అక్రమాలు అరికట్టేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఆ విషయాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వాహనదారులకు భారీ జరిమానాలు విధించాలని సూచించారు. అనధికార యార్డులను ధ్వంసం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ప్రజల్లో అసంతృప్తి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, ఇతర అధికారులు, ఇసుక యార్డుల నిర్వాహకులు పాల్గొన్నారు. -
నేడు ఒంగోలుకు చెవిరెడ్డి రాక
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి శుక్రవారం ఒంగోలు రానున్నట్లు ఆ పార్టీ కార్యాలయ ప్రతినిధి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్ సమీపంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డికి వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలుకుతారని, అందరూ పాల్గొనాలని కోరారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 3 గంటలకు ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో చెవిరెడ్డి అందుబాటులో ఉంటారని, సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. మార్కాపురం టౌన్: స్థానిక ఆరో అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా కరణం విజయలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.విజయకుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో 3 సంవత్సరాల పాటు ఆమె కొనసాగనున్నారు. మార్కాపురం కోర్టులో మహిళా ఏపీపీ నియమితులవడం ఇదే మొదటిసారి కాగా, విజయలక్ష్మి ప్రస్తుతం మార్కాపురం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన న్యాయమూర్తులు, ప్రజా ప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. -
పీడీసీసీబీ మాజీ చైర్మన్ శంకరరెడ్డి మృతి
ఒంగోలు సిటీ: పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మేదరమెట్ల శంకరరెడ్డి (82) గురువారం మృతి చెందారు. ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామానికి చెందిన శంకరరెడ్డి ఒంగోలులో నివాసం ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాంట్రాక్టర్గా తన జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగారు. జెడ్పీలో కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడర్గా వ్యవహరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పీడీసీసీబీ చైర్మన్గా పనిచేసి అందరి మన్ననలు పొందారు. శంకరరెడ్డి మృతికి వైఎస్సార్ సీపీ నాయకులు పలువురు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం.. నీరుగారిన లక్ష్యం..!
● నిర్మించిన తర్వాత నిధులు, విధుల గురించి పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం పొన్నలూరు: పశువులు, మూగజీవాలు మేత కోసం పొలాలకు వెళ్లినప్పుడు తాగునీటికి అవస్థపడకుండా ఉండాలనే లక్ష్యంతో వాటి దాహార్తి తీర్చడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉపాధి హామీ పథకం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నీటి తొట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే, పొలాల్లో నీటి తొట్ల నిర్మాణానికి పశుపోషకులు ముందుకు రాకపోవడంతో చేసేదేమీలేక నిర్మాణ బాధ్యతలను ఆయా గ్రామాల్లోని గుత్తేదారులకు అధికారులు అప్పగించారు. 15 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో నిర్మించే నీటి తొట్టికి సుమారు రూ.30 వేల నిధులు మంజూరు చేస్తామనడంతో గ్రామాల్లో నీటి తొట్ల నిర్మాణానికి గుత్తేదారులు పూనుకున్నారు. కొన్ని పంచాయతీల్లో నీటి తొట్ల నిర్మాణానికి గుత్తేదారులు కూడా ముందుకు రాకపోవడంతో ఉపాధి హామీ ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లే కాంట్రాక్టర్ల అవతారమెత్తి నీటి తొట్లు నిర్మించారు. అయితే, నీటి తొట్లు నిర్మించి ఆరు నెలలకుపైగా అవుతున్నా ప్రభుత్వం బిల్లులు చెలించకపోవడంతో వారంతా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పైగా, నిర్మించిన నీటి తొట్లకు నీరు నింపకపోవడంతో నిరుపయోగంగా మారాయి. కొన్ని నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేయడం, మరికొన్ని నిర్మాణాలు నాణ్యతా లోపం కారణంగా కొద్ది రోజులకే పాడైపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది. బిల్లుల కోసం ఆరు నెలలుగా ఎదురుచూపులు... ఉపాధి హామీ ఉన్నతాధికారుల సమాచారం మేరకు జిల్లాలో సుమారు 1400 పశువుల నీటి తొట్లు మంజూరయ్యాయి. వాటిలో 1200 నీటి తొట్లను పూర్తి స్థాయిలో నిర్మించారు. కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు 134 నీటి తొట్లు మంజూరవగా, వాటిలో 123 నీటి తొట్లను నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పూర్తిగా నిర్మించిన నీటి తొట్లకు సుమారు రూ.3.60 కోట్ల బిల్లులను గుత్తేదారులకు చెల్లించాలి. కొండపి నియోజకవర్గంలో సుమారు రూ.40 లక్షల వరకు బిల్లులు చెల్లించాలి. అయితే, గ్రామాల్లో నీటి తొట్లు నిర్మించి ఆరు నెలలకుపైగా అవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ పశువుల నీటి తొట్లు నిర్మించామని, కానీ, చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన వాటికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అలంకారప్రాయంగా నీటి తొట్లు... పశువుల దాహార్తి తీర్చడానికి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్లు అలంకారప్రాయంగా మారాయి. కొన్ని గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్లకు నీటి వసతి ఉన్నప్పటికీ తగిన సౌకర్యాలు కల్పించకపోవడంతో వినియోగంలో లేక నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అలాగే, మరికొన్ని నీటి తొట్లకు నీటి పైపులైన్ ఏర్పాటు చేయకుండా వదిలేసి నీటిని నింపకపోవడంతో ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు నిర్మించిన నీటి తొట్లకు చంద్రబాబు ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తుండటంతో కాంట్రాక్టర్లు కొన్నింటిని పూర్తిస్థాయిలో నిర్మించకుండా మధ్యలోనే వదిలేశారు. కొన్నిచోట్ల నాసిరకంగా నాణ్యత లేకుండా నిర్మిచడంతో వాడుకలోకి రాకముందే పగుళ్లు ఏర్పడ్డాయి. కొన్ని మండలాల్లో ఉపాధి హామీ మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పూర్తిగా నిర్మించిన నీటి తొట్ల వివరాలతో సకాలంలో ప్రభుత్వానికి ఏం బుక్ అందించకపోవడం వలన కూడా బిల్లుల మంజూరులో జాప్యం జరిగినట్లు సమాచారం. అలాగే కొత్తగా ప్రభుత్వం టెండర్ ప్రక్రియ ద్వారా బిల్లుల చెల్లింపును ప్రవేశపెట్టడంతో ఈ ప్రక్రియ పూర్తికాక బిల్లులు మంజూరు కాలేదు. మొత్తంగా జిల్లాలో పశువుల నీటి తొట్లు నిర్మాణానికి సంబంధించి బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో పాటు నిర్మించిన వాటిని నిరుపయోగంగా వదిలేయడంపై చంద్రబాబు ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలం మంజూరైనవి పూర్తయినవి చెల్లించాల్సిన డబ్బు పొన్నలూరు 45 31 రూ.9.30 లక్షలు జరుగుమలి 05 05 రూ.1.50 లక్షలు కొండపి 21 21 రూ.6.30 లక్షలు మర్రిపూడి 37 37 రూ.11.10 లక్షలు టంగుటూరు 14 14 రూ.4.20 లక్షలు సింగరాయకొండ 12 12 రూ.3.60 లక్షలు నీరు నింపక నిరుపయోగంగా మారిన పశువుల తొట్లు మధ్యలోనే నిలిచిపోయిన కొన్ని నిర్మాణాలు నాణ్యతా లోపంతో అలంకారప్రాయంగా మరికొన్ని.. జిల్లాకు సుమారు 1400 తొట్ల మంజూరు అప్పులు తెచ్చి మరీ 1200 తొట్లు నిర్మించిన గుత్తేదారులు వారికి చెల్లించాల్సిన నిధులు సుమారు రూ.3.60 కోట్లు త్వరలోనే బిల్లులు చెల్లిస్తాం: జిల్లాలో పశువుల నీటి తొట్లు నిర్మించిన వారికి కొంతమేర బిల్లులు చెల్లించాలి. ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు 1200 నీటి తొట్లు పూర్తి స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే నిర్మించిన నీటి తొట్ల వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించాం. ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు కాకపోవడం వలన వెంటనే బిల్లులు చెల్లించలేకపోయాం. సాధ్యమైనంత త్వరగా బిల్లులు అందిస్తాం. అసంపూర్తిగా ఉన్న నీటితొట్లను కూడా పూర్తిస్థాయిలో నిర్మించడంతో పాటు నీటి వసతి కల్పించి వాడుకలోకి తెస్తాం. జోసఫ్ కుమార్, డ్వామా పీడీ, ఒంగోలు కొండపి నియోజకవర్గంలో నీటి తొట్ల నిర్మాణాల వివరాలిలా... -
టీడీపీ కార్యాలయంలో పాదరక్షలతో పతాకావిష్కరణ
యర్రగొండపాలెం: రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న జరిగిన సంబరాల్లో భాగంగా మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు పాదరక్షలతో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సంఘటనపై మంగళవారం రాత్రి నుంచి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ డే సంబరాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు టీం గూడూరి పేరుతో ఆ కార్యాలయం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో విడుదల చేశారు. ఎరిక్షన్బాబు చెప్పులు వదలకుండా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం, జెండా వందనం చేయడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిగా అధికారుల చేతుల మీదుగానే జరుగుతుంది. ఈ వేడుకల్లో ప్రజా ప్రతినిధులను మర్యాదపూర్వకంగా అధికారులు ఆహ్వానిస్తుంటారు. అటువంటి పరిస్థితికి భిన్నంగా కొంత మంది అధికారులు పచ్చనేతలను ఆహ్వానించారు. దీనిని అదునుగా తీసుకున్న టీడీపీ, బీజేపీ నాయకులు కొంతమంది ఆయా కార్యాలయాల్లో పాల్గొని హల్చల్ చేశారు. వారే ముందు వరుసలో నిలబడి ఉద్యోగులను వెనక్కి నెట్టారు. స్థానిక ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా ఆహ్వానించాలన్న ఆలోచన అధికారులకు లేకుండా పోయిందని పలువురు విమర్శిస్తున్నారు. చెప్పులతో పతాకావిష్కరణ, జెండా వందనం చేయడమేమిటని పచ్చనేత తీరుపై వారు ముక్కున వేలేసుకుంటున్నారు. కార్యక్రమం అనంతరం అయినా తాము చేసిన తప్పులు తెలుసుకోకుండా ఆర్భాటంగా వీడియోలు, ఫొటోలు గ్రూపుల్లో పెట్టి ఆనందం పొందడం వారికే సరిపోతుందని అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పచ్చనేత ఎరిక్షన్బాబు జెండావిష్కరణ స్వయంగా పోస్టులు చేసిన టీం గూడూరి ప్రభుత్వ కార్యాలయాల్లో పచ్చనేతల హల్చల్ ఎమ్మెల్యేకు అందని రిపబ్లిక్ డే ఆహ్వాన పత్రిక -
దొరకని ఆచూకీ..
● కంభం చెరువులో గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలుకంభం: కంభం చెరువులో ఆదివారం గల్లంతైన వ్యక్తి కోసం నాలుగు రోజులుగా బోటుతో పోలీసులు గాలిస్తుండగా, బుధవారం కూడా ఆచూకీ లభించలేదు. బుధవారం కంభం సీఐ కె.మల్లికార్జునరావు, ఎస్సై శివకృష్ణారెడ్డి, ఫైర్ సిబ్బంది, జాలరులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటిపడేంత వరకు చెరువులో గాలించినా ఆచూకీ దొరకలేదు. కందులాపురం పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి ఆదివారం నుంచి కనిపించకుండా పోవడం, ఆటోలో చెరువు కట్ట వరకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించిన నేపథ్యంలో.. చెరువులో పడి ఉంటాడని భావించి మూడు రోజులుగా గాలిస్తున్నారు.రాచర్ల: మండలంలోని ఆకవీడులో జీవనమూర్తిస్వామి ప్రథమ శిష్యుడైన చిన్నయ్యస్వామి జెండా మహోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్త పిక్కిలి రంగయ్యనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల ఎడ్ల యజమానులు ఆ రోజు ఉదయం 9 గంటల్లోగా 1000 రూపాయల ప్రవేశ రుసుం చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.1,00,116, రెండో బహుమతిగా రూ.75,116, మూడో బహుమతిగా రూ.50,116, నాలుగో బహుమతిగా రూ.25,116, ఐదో బహుమతిగా రూ.20,116, ఆరో బహుమతిగా రూ.10,116 అందజేయనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు 85559 74029, 96768 28926, 95151 79210, 96765 17010నంబర్లను సంప్రదించాలని సూచించారు.ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితుల గురించి కమిషనర్కు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు వివరించారు. కమిషనర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15 నాటికే గ్రామాల్లో పన్నుల వసూలు పూర్తి చేయాలన్నారు. ఇంటి పన్నులతో పాటు ఇతర పన్నులన్నీ వేగవంతంగా వసూలు చేయాలన్నారు. పన్నుల వసూలుకు ప్రత్యేక డ్రైవ్లు కూడా నిర్వహించాలని ఆదేశించారు. డివిజినల్ డెవలప్మెంట్ ఆపీసర్లు, డివిజినల్ పంచాయతీ అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు స్వయంగా క్యాంప్ చేయాలన్నారు. పన్నుల చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీపీఓతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.గిద్దలూరు రూరల్: గిద్దలూరుకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు కంచర్ల కోటయ్యగౌడ్ జాతీయ స్థాయి టెన్నిస్ పోటీల్లో ప్రతిభ చూపాడు. విశాఖపట్నంలో జరుగుతున్న జాతీయస్థాయి టెన్నిస్ క్రీడల్లో 65 ఏళ్ల వయసు విభాగంలో హైదరాబాద్కు చెందిన చంద్రశేఖర్ టీం, విశాఖపట్నం ఆఫీసర్స్ క్లబ్ క్రీడాకారులు డాక్టర్ సనత్రావు, కృష్ణారావు టీంపై 9.5 పాయింట్లతో విజయం సాధించారు. ఈ పోటీలకు ఒడిశా, కర్ణాటక, తెలంగాణకు చెందిన సీనియర్ సిటిజన్ క్రీడాకారులు పాల్గొన్నారు.పొదిలి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున ఒంగోలు–కర్నూలు రోడ్డుపై పొదిలిలోని చిన్న బస్టాండ్ సమీపంలో పెట్రోల్ బంకు వద్ద జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. పొదిలిలోని బాప్టిస్ట్పాలేనికి చెందిన అనపర్తి పెద యలమంద (60) వేకువజామున టీ తాగేందుకు సెంటర్వైపు వెళుతున్నాడు. కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కనిగిరి వైపునకు వెళ్తూ యలమందను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యలమంద అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
పోలీసులు గ్రామాల్లోకి వెళ్లాలి
ఒంగోలు టౌన్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు తరచూ గ్రామాలను సందర్శించాలని ఎస్పీ హర్షవర్థన్రాజు ఆదేశించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాలు, వార్డులను సందర్శించి అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. గ్రామాల్లో తగాదాలు, మత ఘర్షణలకు సంబంధించిన సమాచారం సేకరించాలని, ఏవైనా సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. గ్రామాల్లో పోలీసు అధికారులు పల్లెనిద్ర చేయాలని ఆదేశించారు. తరచూ నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ విజిబుల్ పోలీసింగ్ పెంచాలని చెప్పారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ప్రతిరోజూ వాహనాల తనిఖీలు, పెట్రోలింగ్, బీట్స్ చేపట్టాలని, బోర్డర్ చెక్ పోస్టులపై నిత్యం నిఘా పెట్టాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, పాత నేరస్తులను తనిఖీ చేసి నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గంజాయి, డ్రగ్స్, గ్యాంబ్లింగ్, మట్కా శిబిరాలపై దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో మరింతగా అవగాహన పెంచాలని, కాలేజీలు, హైస్కూళ్లలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించి అప్రమత్తం చేయాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బ్లాక్ స్పాట్స్పై దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, సబ్ డివిజన్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. కంభం: బుధవారం విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో కంభం పట్టణానికి చెందిన భార్యాభర్తలు ఉద్యోగాలు సాధించారు. ఓరుగంటి హేమ చంద్ర, అతని భార్య ఉమ్మడి వినత సత్తాచాటారు. వినత 238 మార్కులు సాధించి మహిళా విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం పొందారు. ఆమె భర్త హేమచంద్ర 221 మార్కులు సాధించి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. వీరికి మూడు సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ఉద్యోగాలు సాధించడంతో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందనలతో ముంచెత్తారు. వీరితో పాటు కంభం పట్టణానికి చెందిన డి.రంగయశ్వంత్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా, స్పందన డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. ● రూ.10 లక్షల ఆస్తి నష్టం వలేటివారిపాలెం: మండలంలోని చుండి గ్రామంలో బుధవారం ఉదయం రెండు పొగాకు బ్యారన్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన ఇరుపని మాధవరావు అర బ్యారన్, ఇరుపని వరమ్మ అర బ్యారన్, కళ్లగుంట నాగమ్మ అర బ్యారన్, రావినూతల నాగార్జున, మరో నలుగురికి చెందిన రెండు బ్యారన్లు ఉన్నాయి. ఒక బ్యారన్లో పొగాకు క్యూరింగ్ చేసే సమయంలో అల్లుడు కర్ర జారి మొద్దు గొట్టంపై పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి రెండో బ్యారన్కి కూడా అంటుకోవడంతో రెండు బ్యారన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కందుకూరు అగ్నిమాపక అధికారులకు బ్యారన్ యజమానులు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకునేలోపే బ్యారన్లు మొత్తం కాలిపోయాయి. వాటిలో ఉన్న ఆకుతో పాటు మొద్దు గొట్టం, టైర్లు, అల్లుడు కర్రలు, పూర్తిగా కాలిపోవడంతో మొత్తం రూ.10 లక్షల సష్టం వాటిల్లినట్లు బ్యారన్ యజమానులు వాపోయారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీసు అధికారులకు ఎస్పీ హర్షవర్థన్రాజు ఆదేశాలు సబ్రిజిస్ట్రార్, ఎకై ్సజ్ ఎస్సైలుగా ఎంపిక -
మూడు రోజులు మంచినీటి సరఫరా నిలిపివేత
● రంగారాయుడు చెరువు రోడ్డు విస్తరణలో భాగంగా పైప్లైన్ల మరమ్మతులు ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు మంచినీటి సరఫరా నిలిపేస్తున్నట్లు నగర కమిషనర్ కే.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని రంగారాయుడు చెరువు వద్ద రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న సందర్భంగా ఈ అంతరాయం ఏర్పడుతుందన్నారు. అక్కడున్న మంచినీటి పైపులైన్లు మారుస్తున్నందున ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పతుందన్నారు. అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లో గాంధీ రోడ్డు, గానుగపాలెం, దక్షిణం బజారు, పత్తివారి వీధి, ఈమన పాలెం, జక్రయ్య నగర్, ఎన్జీఓ హోం, సీఆర్పీ క్వార్టర్స్ ఏరియా, గొడుగు పాలెం, రాజాపానగల్ రోడ్డు, కేశవస్వామి పేట, దేవుడు చెరువు, భీమరాజు వారి వీధి, కోట వీధి, వంట కాలనీ, బండ్లమిట్ట, లంబాడీ డొంక, బాలాజీరావుపేట, గోపాల్ నగర్, కమ్మపాలెం, తూర్పు క్రిస్టియన్పాలెం, ఇందుర్తి నగర్, నీలాయ పాలెం, ఇస్లాంపేట, క్లౌ పేట, లారీల కుంట, కర్నూల్ రోడ్డు, శ్రీనగర్ కాలనీ 4వ లైన్లు, మారుతీ నగర్ 4 లైన్లు, శ్రీనివాస కాలనీ, ఆంధ్ర కేసరి కాలనీ, శ్రీరామ కాలనీ, సమతా నగర్, సుజాత నగర్, రెవెన్యూ కాలనీ, వెంకటేశ్వర కాలనీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ముందుగా సరఫరా చేస్తున్న మంచినీటి వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రకటించిన తేదీల కన్నా ముందు సరఫరా చేస్తున్న మంచినీటిని సద్వినియోగం చేసుకొని పొదుపుగా వాడుకోవాలన్నారు. అర్ధవీడు: స్థానిక ఎం.మల్లికార్జునరావు ట్రేడర్సు షాపులో ఒంగోలు విజిలెన్సు అధికారులు బుధవారం సాయంత్రం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. లైసెన్సులు, స్టాకు రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలను పరిశీలించారు. స్టాకు రిజిస్టర్లో, ఈ పాస్మెషీన్లో స్టాకు వ్యత్యాసం ఉన్నందున రూ.4,31,108 విలువైన ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. సీఐ సీహెచ్ రవిబాబు మాట్లాడుతూ ఎమ్మార్పీకే యూరియా అమ్మాలని తెలిపారు. ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. విజిలెన్స్ ఏఓ కే శివనాగప్రసాదు, టీసీ ఎం.సురేషుబాబు, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ పాల్గొన్నారు. -
మోటారు సైకిల్ను ఢీకొట్టిన లారీ
సంతమాగులూరు (అద్దంకి): మోటారు సైకిల్ను లారీ ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన సంతమాగులూరు మండలంలోని నామ్ రహదారిలో ఏల్చూరు గ్రామ సమీపంలో బుధవారం జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన గుంటుపల్లి శ్రీనివాసరావు (45) వ్యక్తిగత పనిమీద స్వగ్రామం నుంచి మోటారు సైకిల్పై బల్లికురవ మండలలంలోని అంబడిపూడిలో వరి కోయించుకునేందుకు వెళ్తున్నాడు. సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామ సమీపానికి రాగానే సంతమాగులూరు వైపు నుంచి అద్దంకి వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే శ్రీనివాసరావు మృతిచెందాడు. లారీ చక్రాలు కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో అతని అవయవాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ఏకేయూ లా 2, 4 సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ (ఏకేయూ) పరిధిలోని లా కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సారానికి సంబంధించి రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు బుధవారం ఉదయం విడుదల చేశారు. లా కోర్సు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో సెమిస్టర్కు మొత్తం 458 మంది విద్యార్థులు హాజరవగా, వారిలో 92.57 ఉత్తీర్ణత శాతంతో 424 మంది విద్యార్థులు పాసైనట్లు యూనివర్సిటీ సీఈ ప్రొఫెసర్ జి.సోమశేఖర తెలిపారు. అలాగే లా 2023–24 విద్యా సంవత్సారానికి సంబంధించి నాలుగో సెమిస్టర్కు మొత్తం 369 మంది విద్యార్థులు హాజరవగా, వారిలో 89.90 ఉత్తీర్ణత శాతంతో 332 మంది విద్యార్థులు పాసైనట్లు వెల్లడించారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ స్థాయిలో, ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఏకేయూ వీసీ మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు, సీఈ సోమశేఖర, పీజీ పరీక్షల కో ఆర్డినేటర్ (నాన్ కాన్ఫిడెన్సిల్) డాక్టర్ ఆర్.శ్రీనివాస్, సూదా శివరామ్ తదితరులు అభినందించారు. -
వల్లూరు చెరువులో పచ్చదొంగలు
సాక్షి టాస్క్ఫోర్స్: టంగుటూరు మండలంలోని వల్లూరు గ్రామంలో ఉన్న చెరువులో టీడీపీ నాయకులు గ్రావెల్ ను యథేచ్ఛగా అమ్ముకుంటూ తమ జేబులు నింపుకుంటున్నారు. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లలో గ్రావెల్ తరలించుకుంటున్నారు. ఒక టిప్పర్ ధర రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు 100 టిప్పర్లకు సగటున రూ.9 వేల చొప్పున వసూలు చేస్తున్నా రోజుకు రూ.9 లక్షల వరకు మట్టిని అమ్ముకుంటున్నారు. సూరారెడ్డిపాలెంలో వేస్తున్న భారీ వెంచర్కు ఇక్కడ నుంచే గ్రావెల్ను తరలిస్తున్నారు. పరిమితికి మించి తవ్వకాలు.. వల్లూరులోని గ్రామస్తులు తమ గ్రామంలోని అవసరాలకు గ్రావెల్ ను మూడు అడుగుల లోపు తవ్వుకునేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. ఆ విధంగానే తమ అవసరాల కోసం గ్రావెల్ ను తీసుకొచ్చుకుంటున్నారు. అయితే టీడీపీ గ్రావెల్ దొంగలు అవేవీ పట్టించుకోకుండా చెరువులో పది నుంచి 15 అడుగుల వరకు లోతులో గ్రావెల్ తవ్వుతూ అమ్ముకుంటున్నారు. గతంలో లోతైన గుంతల్లో పడి అనేకమంది మరణించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల మూడు నెలల క్రితం ఒక గొర్రెల కాపరి గుంటలో పడి మరణించాడు. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా.. వల్లూరు చెరువులో సర్వే నంబర్ 91లో వల్లూరుకు చెందిన ఒక ప్రధాన దేవస్థానానికి నామినేటెడ్ పోస్టులో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి తన రాజకీయ పలుకుబడితో అనుచరులను ఏర్పాటు చేసుకొని అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ఇదే భూమిలో గతంలో రెవెన్యూ అధికారులు హైకోర్టు ఉత్తర్వుల హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయినా పట్టించుకోకుండా గ్రావెల్ దందా సాగిస్తున్నారు. పట్టించుకోని అధికారులు: టీడీపీ నాయకులు యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. నాయకులు కూడా మామూళ్ల మత్తులో పడి కనీసం స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ గ్రావెల్ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఉలవపాడు మామిడి పేరుతో మోసం
వీరేపల్లి సమీపంలో అమ్ముతున్న కాయలు ఉలవపాడు: ప్రపంచ వ్యాప్తంగా ఉలవపాడు మామిడి కాయలు అంటే మంచి గుర్తింపు ఉంది. మామిడి సీజన్లో ఉలవపాడు మామిడికాయల కోసం మామిడి ప్రియులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. దీనినే కొందరు వ్యాపారులు ఆసరాగా తీసుకున్నారు. ఉలవపాడు మండల పరిధిలోని జాతీయ రహదారితో పాటు పక్కన మండలాలైన గుడ్లూరు, శింగరాయకొండ పరిధిలోని జాతీయరహదారిపై మామిడి కాయల అమ్మకాలు ప్రారంభించారు. బయట ప్రాంతాలైన అనంతపురం, కడపలలో ప్రస్తుతం మామిడి కాయలు కోతకు వచ్చాయి. వాటిని ఇక్కడకు తీసుకొచ్చి ఉలవపాడు పరిసర మండలాల పరిధిలో జాతీయ రహదారిపై ఆటోల్లో తీసుకొచ్చి ట్రేలలో పెట్టి అమ్ముతున్నారు. ఉలవపాడు ప్రాంతంలో జాతీయ రహదారిపై మామిడి కాయల అమ్మకాలు అంటే ఈ ప్రాంతానికి చెందినవనే ఆలోచనతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతారు. దాన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ అమ్ముకోవచ్చనే మోసపు ఆలోచనతో ఎక్కడో 200 కి.మీ పైన ఉన్న ప్రాంతాల నుంచి కాయలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. కాయలు ఈ సమయంలో తక్కువ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. హైవే పై కార్లు, లారీలలో వెళ్లే వారు ఉలవపాడు ప్రాంతంలో కాయలు ఉండడంతో ఉలవపాడు మామిడి వచ్చేసిందని కొనుగోలు చేసి వెళుతున్నారు. ఉలవపాడు బ్రాండ్ కే దెబ్బ... ఉలవపాడు మామిడి కాయలు అంటే ప్రత్యేక గుర్తింపు ఉంది. మంచిరంగుతోపాటు అద్భుతమైన రుచి సొంతం. కానీ ప్రస్తుతం ఇక్కడ అమ్మే కాయలకు పులుపు తగులుతుంది. ఇదేంటి ఉలవపాడు కాయలు రుచి తగ్గాయి అని తిన్న వారు అంటున్నారు. ఇది ఉలవపాడు ప్రాంతంలో పండే మామిడికే దెబ్బ అని మామిడి తోటల యజమానులు అంటున్నారు. ప్రస్తుతం ఉలవపాడు ప్రాంతంలో మామిడి కేవలం పూత దశలోనే ఉంది. మామిడి సీజన్ ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ మూడు నెలల ముందే బయట కాయలు తీసుకువచ్చి ఉలవపాడు పరిసర ప్రాంతాల్లో పెట్టి అమ్మకాలు చేయడం వలన ఉలవపాడు మామిడికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా సాధారణంగా మామిడి సీజన్ లో కేజీ రూ.75 నుంచి రూ.150 వరకు అత్యధికంగా పలుకుతుంది. కానీ ఇప్పుడు బయటప్రాంతాల కాయలను కేజీ రూ.180 చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. వేసవి లో దొరికే మామిడి ముందుగా శీతాకాలంలో దొరుకుతుంది అంటే గొప్ప అనే ఉద్దేశంతో కొనుగోలు దారులు ఆశగా కొంటున్నారు. కాయల వ్యాపారం ఎలా ఉన్నా ఈ కాయలు ఉలవపాడు మామిడి కాయలు మాత్రం కాదని, ఆ పేరుతో బయట ప్రాంతాల నుంచి వస్తున్న మామిడి మాత్రమే అని రైతులు అంటున్నారు. -
క్షేత్రస్థాయిలో మాయ!
ప్రకటనల్లో యూరియా..త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి వద్ద తెల్లవారుజామున యూరియా కోసం వేచి ఉన్న రైతులు (ఫైల్)సాక్షి ప్రతినిధి, ఒంగోలు/మార్కాపురం: చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంటలకు గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా కుదేలయ్యారు. ఒక వైపు పకృతి వైపరీత్యాలతో నష్టపోయిన వారిని గాలికొదిలేసింది. మరో వైపు రైతులకు అండగా నిలవాల్సిన రైతు సేవా కేంద్రాల వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,31,369 మంది రైతులున్నారు. రబీ సీజన్కు సంబంధించి 86,982 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగుచేశారు. అయితే రైతులు యూరియా అందక పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. సాగర్ ఆయకట్టు భూముల్లో 4.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. సాగర్ ఆయకట్టు కింద త్రిపురాంతకం, యర్రగొండపాలెం, కురిచేడు, దొనకొండ మండలాల్లో వరి, మార్కాపురం, పెద్దారవీడు, కంభం, గిద్దలూరు, బేస్తవారిపేట, కొనకనమిట్ల, కంభం, రాచర్ల తదితర మండలాల్లో మొక్కజొన్నకు యూరియా వాడుతున్నారు. నెల రోజుల నుంచి రైతు సేవా కేంద్రాల ద్వార మాత్రమే అరకొరగా యూరియా లభ్యమవుతోంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల త్రిపురాంతకం మండలం, విశ్వనాథపురం సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలు మరో ప్రాంతానికి వెళ్తుంటే ఆ గ్రామ టీడీపీ రైతులే అడ్డుకుని 250 బస్తాలు ఆ గ్రామానికి వాడుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రబీలో వరి, మొక్కజొన్న, గడ్డిసాగుకు యూరియాను రైతులు ఎక్కువగా వాడుతున్నారు. డిమాండ్కు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 38 వేల మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నా రైతులకు మాత్రం సకాలంలో అందక అవస్థలు పడుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూటమి నాయకులు యూరియాను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నాయకులు చెప్పిన రైతులకే అధికారులు బస్తాలు ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సాగు చేసిన పంటలకు యూరియా బస్తాలు దొరక్క ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు అవసరమైన యూరియా అందించడంలో ఆర్ఎస్కేలు విఫలమయ్యాయన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అవసరమైన యూరియా, ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఆర్బీకేల ద్వారా స్థానికంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లభించాయి. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం సకాలంలో ఎరువులు, యూరియా రైతులకు అందించడంలో విఫలమై రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. యూరియాకు డిమాండ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రబీలో 14,230 హెక్టార్లలో మొక్కజొన్న సాగుచేశారు. ఈ ఏడాది మొక్కజొన్న లక్ష్యం 5626 హెక్టార్లు నిర్ణయించగా అత్యధికంగా 14,230 హెక్టార్లలో సాగుచేశారు. అధిక దిగుబడికి ఎకరాకు 4 బస్తాల యూరియా వేయాలని ప్రచారం జరిగింది. గత ఏడాది ఇదే రబీ సమయానికి 4523 హెక్టార్లలో సాగుచేయగా ఈ ఏడాది అత్యధికంగా 14,230 హెక్టార్లలో సాగుచేశారు. గత ఏడాది ఇదే సమయానికి వరి 9836 హెక్టార్లలో ఉమ్మడి జిల్లాలో సాగుకాగా 11,526 హెక్టార్లలో సాగు చేశారు. గడ్డి సాగుకు కూడా రైతులు యూరియా వాడుతున్నారు. దీంతో యూరియాకు డిమాండు పెరిగింది. దీంతో రైతులు బయట మార్కెట్లో కొనుగోలు చేసేందుకు వెళ్లగా అక్కడ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కేవలం రైతు సేవా కేంద్రాల్లో మాత్రమే లభ్యమవుతున్నాయి. అక్కడ రైతుల అవసరాలకు బస్తాలు లభ్యం కావడంలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో చాలీచాలని యూరియాను రైతులు పొలాల్లో జల్లుతున్నారు. ఇదిలా ఉండగా రైతు సేవా కేంద్రాల్లో బస్తా యూరియా రూ.295 పడుతోంది. ఒంగోలులో బస్తా రూ.245 కాగా ఒక్కొక్క బస్తాకు రూ.50 ట్రాన్స్పోర్టు చార్జీకింద ఖర్చవుతుంది. ఎరువుల వ్యాపారులు కనీసం బస్తాకు రూ.10 లాభం లేనిది అమ్మలేమని చెబుతుండగా రూపాయి ఎక్కువ అమ్మినా కేసులు నమోదు చేస్తామని వ్యవసాయాధికారులు హెచ్చరించడంతో ఎరువుల వ్యాపారులు యూరియాను తెప్పించడం మానేశారు. మార్కాపురానికి గత వారం కేవలం 15 టన్నుల యూరియా మాత్రమే వచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు మార్కాపురం పట్టణంలో 9, రూరల్లో 8, తర్లుపాడులో 6, పెద్దారవీడులో 10, యర్రగొండపాలెం ప్రాంతంలో 20 వరకూ ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఉన్నాయి. వీటిలో కొద్దిమొత్తంలో మాత్రమే యూరియా నిల్వలు ఉన్నాయి. యూరియాకు కొరతలేదు ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతానికి యూరియా కొరత లేదు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది జనవరి 31 వరకూ 27,296 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటికి 38,671 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచాం. ఇప్పటి వరకూ 36,799 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ఇతర ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, జేడిఏ, ఉమ్మడి ప్రకాశంజిల్లా యూరియా దొరక్క అవస్థలు ఆర్ఎస్కేల ద్వారా ఇప్పటి వరకు యూరియా, ఎరువులు అందించలేదు. గతంలో ఆర్బీకేల ద్వారా యూరియా, ఎరువులు రైతులకు అందేవి. ప్రస్తుతం యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. – జీ ముసలయ్య రైతు, విశ్వనాథపురం ఆర్ఎస్కేల ద్వారా అందించాలి.. ఆర్ఎస్కేల ద్వారా యూరియాను అందించాలి. స్థానికంగా అందిస్తే రైతులకు ఉపయోగం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటే రైతులకు ఆర్థికంగా భారమవుతుంది. మాగ్రామానికి రావాల్సిన యూరియా ఇతర ప్రాంతాలకు తరలితే గ్రామ రైతులకు అందే అవకాశం ఉండదు. స్థానికంగానే యూరియా ఆర్ఎస్కేల్లో దించి రైతులకు అందించాలి. – ఎస్ వెంకటరంగయ్య, రైతు, విశ్వనాథపురం -
కూతురిని చూసేందుకు వచ్చి..
● ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి కొండపి: గురుకుల పాఠశాలలో చదువుతున్న కూతురిని చూసేందుకు వచ్చి తిరిగి వెళుతూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొండపి, పెద్దకండ్లగుంట గ్రామాల మధ్య మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..మర్రిపూడి మండలం అయ్యప్పరాజుపాలెం గ్రామానికి చెందిన బుర్రి రామారావు(43) బెంగళూరులో బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సంక్రాంతిని పురస్కరించుకొని స్వగ్రామమైన అయ్యప్పరాజుపాలెం వచ్చాడు. మంగళవారం అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న కుమార్తెను చూసేందుకు కొండపి వచ్చాడు. కుమార్తెను చూసి అనంతరం వ్యక్తిగత పనులు ముగించుకొని రాత్రి ఇంటికి వెళుతుండగా కొండపి, పెద్దకండ్లగుంట గ్రామాల మధ్య మూడవ కిలోమీటర్ రాయి వద్ద రైతులు నీరు కట్టుకునేందుకు వేసిన పైపులైన్లపై మట్టి ఎత్తుగా ఉండటంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగలడంతో అటుగా వెళుతున్న వారు 108కు సమాచారం ఇచ్చి వాహనంలో కొండపి సీహెచ్సీకి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది ప్రమాదంలో మృతి చెందిన బుర్రి రామారావుకు సంబంధించిన విలువైన వస్తువులను 108 సిబ్బంది సేకరించి మృతుడు భార్య అనురాధకు రెండు సెల్ఫోన్లను, ఉంగరం, పాపటి బిళ్లను అందజేశారు. ఒంగోలు: మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలని ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ టి.రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలోని సమావేశ మందిరంలో సోమవారం మీడియేషన్ అనే అంశంపై న్యాయవాదులకు నిర్వహించిన 40 గంటల శిక్షణను న్యాయమూర్తి ప్రారంభించారు. మీడియేషన్ ద్వారా కేసు పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలు గెలిచినట్లేనన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. శాశ్విత లోక్ అదాలత్ చైర్మన్ తిరుమలరావు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.హేమలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, మధ్యవర్తిత్వం శిక్షకులు ఎస్.పద్మ, ఎస్.అరుణాచలం పాల్గొన్నారు. -
రవాణాశాఖ విభజనకు ఏర్పాట్లు
మార్కాపురం: మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఉన్న పలు కార్యాలయాలు మార్కాపురంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా రవాణాశాఖను విభజిస్తున్నారు. మార్కాపురం జిల్లాలో 21 మండలాలను రవాణాశాఖ పరిధిలోకి తీసుకొస్తున్నారు. గతంలో కనిగిరి నియోజకవర్గం, దర్శి ఎంవీఐ పరిధిలో ఉండగా జిల్లా విభజనతో మార్కాపురం ఎంవీఐ పరిధికి తీసుకొస్తున్నారు. ఆర్టీఓ పోస్టును మార్కాపురం జిల్లాకు సంబంధించి డీటీఓ (డిస్ట్రిక్ ట్రాన్స్పోర్టు ఆఫీసరు)గా మార్పు చేశారు. స్థానిక రాయవరం వద్ద డీటీఓ కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. భవన నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనివలన వాహనదారులకు మెరుగైన సేవలు అందనున్నాయి. కనిగిరి నియోజకవర్గ వాహనదారులు ఎల్ఎల్ఆర్, డీఎల్, ఫిట్నెస్ తదితర లైసెన్సుల కోసం ఒక్కొక్కసారి ఒంగోలుకు వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడే డీటీఓ కార్యాలయం ఏర్పాటు చేయనుండటంతో వారి ఇబ్బందులు తీరనున్నాయి. ఇందుకోసం సిబ్బందిని కూడా నియమించాల్సి ఉంది. ప్రస్తుతం మార్కాపురం ఎంవీఐ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలకు చెందిన లైసెన్సుదారులు ఉన్నారు. సుమారు 7 వేలకు పైగా ఆటోలు, 15 వేలకు పైగా ద్విచక్ర వాహనాలు ఇంకా వెయ్యి కార్లు ఉన్నాయి. ఇటీవల ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీని నంద్యాలకు మార్చడంతో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో మార్కాపురంలోనే డీటీఓ కార్యాలయం ఏర్పాటు చేయడంతో సమస్యలు కూడా తొలగనున్నాయి. 21 మండలాలు కావడంతో అతిపెద్ద ఎంవీఐ కార్యాలయంగా మార్కాపురం ఎంవీఐ కార్యాలయం ఏర్పాటు కానుంది. దీంతో మరో సబ్యూనిట్ కార్యాలయ ఏర్పాటుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. కనిగిరి ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్ కావాల్సి ఉంది రవాణాశాఖ పునర్వ్యవస్థీకరణపై అమరావతిలో ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనమిత్ర, సారథి యాప్లను మార్పుచేయాల్సి ఉంది. కొన్ని అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. – శ్రీ చందన, ఆర్టీఓ, మార్కాపురం -
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తరగతుల బహిష్కరణ
ఒంగోలు టౌన్: జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ కాలేజీని కొనసాగించాలని, ఎటువంటి సౌకర్యాలు లేని కనిగిరి ప్రాంతానికి తాము వెళ్లమని ఎస్ఎస్ఎన్ క్యాంపస్కు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తెగేసి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మంగళవారం తరగతులను బహిష్కరించి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం ఒంగోలు ట్రిపుల్ ఐటీని దెబ్బ తీసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అన్నీ సౌకర్యాలు ఉన్నాయని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వేలాది మంది విద్యార్థులు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో చేరారని, తీరా ఇప్పుడు ఇక్కడ సౌకర్యాలు లేవంటూ కొంత మందిని నూజివీడు, మరికొంత మందిని పులివెందులకు తరలించారని, మిగిలిన వారిని కనిగిరి ప్రాంతంలో నిర్మించే కళాశాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. ఒంగోలులో 50 ఎకరాల్లో ట్రిపుల్ ఐటీ నిర్మించడానికి సమస్య ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఒంగోలులో అయితే మంచినీటి సౌకర్యం, రవాణా సౌకర్యం కూడా ఉంటుందని తెలిపారు. దీంతోపాటుగా విద్యార్థులకు ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారని చెప్పారు. ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ కాలేజీని కొనసాగించాలని, లేనిపక్షంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఇంటి వద్దకు పాద యాత్ర చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో భార్గవ్, గౌతం, వెంకీ, భాస్కర్, కొమ్ము రాజీవ్, ఈస్టర్ కృష్ణ, సూర్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026
వ్యవసాయానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఊపిరిపోస్తే చంద్రబాబు ప్రభుత్వం దానిని తీసేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) పేరును రైతు సేవా కేంద్రాలు(ఆర్ఎస్కే)గా మార్పు చేసింది. అంతటితో ఊరుకోక రైతులకు అందించే సేవలపై, అందులో పనిచేస్తున్న సిబ్బందిపై కత్తి దూస్తోంది. ఒక గ్రామ వ్యవసాయ అసిస్టెంట్కు రెండు, మూడు ఆర్ఎస్కేలు కేటాయించడంతో పాటు, రోజుకో సర్వే పేరుతో వేధింపులకు గురిచేస్తోంది. సకాలంలో సేవలు అందక రైతులు ఒక వైపు, పని ఒత్తిడికి గురౌతూ సిబ్బంది మరో వైపు సతమతమవుతున్నారు. సేవలపైమూతపడ్డ మూలగుంటపాడు ఆర్ఎస్కెకలికవాయ ఆర్ఎస్కె లో నిరుపయోగంగా ఉన్న కియోస్క్ మిషన్లుసర్వే కత్తి! -
స్తంభించిన బ్యాంకుల లావాదేవీలు
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా అన్ని జాతీయ బ్యాంకులు బంద్ పాటించటంతో ఆర్ధిక లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం అన్ని బ్యాంకులు కలిసి ఒకతాటిపైకి వచ్చి బంద్ పాటించాయి. అందులో భాగంగా అన్ని బ్యాంకుల యూనియన్లు కలిపి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్గా ఏర్పడ్డాయి. దాంతో ఫోరంగా ఏర్పడిన బ్యాంకు యూనియన్లు మంగళవారం బంద్ పాటించాయి. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో బ్యాంకు ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. భారీ బైక్ ర్యాలీలో అన్ని బ్యాంకుల యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. యూనియన్ నాయకుడు రాజీవ్ రతన్ దేవ్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పనిదినాన్ని తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెన్షన్ అప్డేషన్ డిమాండ్ కూడా అపరిష్కృతంగా మిగిలిపోయిందన్నారు. 12వ ద్వై పాక్షిక ఒప్పందంలో అంగీకరించిన డిమాండ్లతో పాటు పెండింగ్లో ఉన్న వివిధ న్యాయబద్ధమైన డిమాండ్లు వెంటనే అమలు చేయాలన్నారు. మరో యూనియన్ నాయకుడు రాజేష్ ఖన్నా మాట్లాడుతూ అన్ని బ్యాంకుల్లో రిక్రూట్మెంట్లు నిలిపేశారన్నారు. బ్యాంకుల్లో వినియోగదారులు పెరుగుతున్నారు, ఖాతాలు పెరుగుతున్నాయి, సేవలు కూడా పెరుగుతున్నా నూతనంగా ఉద్యోగులను తీసుకోకుండా కాలం గడుపుతున్నారన్నారు. దాంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయి ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయని(ఎన్పిఏ), వాటిని రకవరీ చేసి బ్యాంకులకు రావాల్సిన వాటిని రాబట్టాలన్నారు. నగరంలో భారీ బైక్ ర్యాలీ... బ్యాంకుల దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దక్షిణ బైపాస్లోని మినీ స్టేడియం నుంచి బయలుదేరిన బైకు ర్యాలీ కర్నూలు రోడ్డు ఫ్లై ఓవర్ మీదుగా పాత బైపాస్కు చేరుకుంది. అక్కడ నుంచి ముంగమూరు రోడ్డు జంక్షన్, సీవీఎన్ రీడింగ్ రూమ్ మీదుగా నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని యూనియన్ బ్యాంకుకు చేరుకుని అక్కడ సభ ఏర్పాటు చేశారు. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను వివరించారు. కార్యక్రమంలో ఎస్బీఐ ఆఫీసర్స్ నాయకుడు శ్రీనివాస్, క్లరికల్ యూనియన్ నాయకుడు సుధాకరరావు, ఉమా శంకర్, బ్రహ్మ నాయుడు, ఎస్కే.హసన్, కెనరా బ్యాంకు ఆఫీసర్స్ నాయకుడు కిషోర్ రెడ్డి, శ్రీధర్, రవి ప్రకాశ్, ఏడుకొండలు, ఎల్ఐసీ యూనియన్ నాయకుడు శ్రీనివాస్, సీఐటీయూ నాయకుడు చీకటి శ్రీనివాస రావు, రమేష్, ఏఐటీయూసి వెంకటేశ్వర రావుతో పాటు పలు కమ్యూనిస్టు పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 13 డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ డి.జయ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా డి.జయ మాట్లాడుతూ జిల్లాలో బాలికలకు పెదపవని, చీమకుర్తి, నార్త్ అద్దంకి, కొండపిలలో 4 గురుకులాలు ఉన్నాయని, బాలురకు దర్శి, కురిచేడులలో 2 గురుకులాలు ఉన్నాయని తెలిపారు. ఈ 6 గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యాబోధన అందుతుందన్నారు. కురిచేడులోని పాఠశాలలో 5వ తరగతి నుంచి పదో తరగతి లోపు, మార్కాపురం జిల్లాలో బాలికలకు కంభం, దూపాడు, మార్కాపురం, రాచర్లలో గురుకులాలు ఉన్నాయని తెలిపారు. అలాగే బాలురకు వెలుగొండ, అర్ధవీడు గురుకులాల్లో 5వ తరగతికి 80 సీట్లు, ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరానికి 80 సీట్ల చొప్పున కేటాయిస్తారన్నారు. అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. హెచ్టీటీపీఎస్://ఏపీజీపీసీఈటీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్స్, విద్యా ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, పాస్ఫొటో, ఆధార్ కార్డుకు అనుసంధానమైన ఫోన్ నంబర్ దగ్గర ఉంచుకోవాలన్నారు. 5వ తరగతిలో ప్రవేశాలకు 11 సంవత్సరాల్లోపు, ఇంటర్కు 17 సంవత్సరాల్లోపు వయసున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షలోపు ఉండాలన్నారు. 6 నుంచి పదో తరగతి లోపు ఖాళీలను బట్టి తీసుకుంటారన్నారు. ఒంగోలు టౌన్: నీట్ స్పెషాలిటీస్ ప్రవేశ పరీక్షల్లో నగరానికి చెందిన డాక్టర్ మద్దూరి వంశీకృష్ణ క్రిటికల్ కేర్ విభాగంలో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించారు. గత డిసెంబర్లో దేశ వ్యాప్తంగా జరిగిన ఈ ప్రవేశ పరీక్షల్లో సుమారు 3500 మందికి పైగా పరీక్షలు రాశారు. డాక్టర్ వంశీకృష్ణ విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నిమ్స్ వైద్య కళాశాలలో అనస్తీషియన్ విభాగంలో పీజీ చేశారు. ప్రస్తుతం నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థలో ప్రవేశానికి అర్హత సాధించడం ఎంతో గర్వంగా ఉందని డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయులకు త్వరితగతిన ప్రాన్ నంబరును కేటాయించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోడూరి వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 2004 సెప్టెంబర్ ఒకటి తర్వాత సర్వీసులో చేరిన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ప్రాన్ నంబర్, అంతకు ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు పీఎఫ్ నంబర్ కేటాయించాలన్నారు. ఎయిడెడ్ విద్యార్థులకు అన్ని రకాల మెటీరియల్ సప్లై చేయాలన్నారు. ఎయిడెడ్లో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు డీఏ, అరియర్ గ్రాట్యుటీ విడుదల చేయాలన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల డీఏ అరియర్స్ చెల్లించాలని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు, కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు తెలుగు, సంస్కృతం, హిందీ, పీఈటీలకు పదోన్నతి సౌకర్యం కల్పించాలన్నారు. మార్కాపురం: మార్కాపురం పట్టణంలో జిల్లా స్థాయి ఎమ్మార్పీఎస్ సమావేశాన్ని బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ జయరాజ్ తెలిపారు. నూతన జిల్లా కమిటీ ఎన్నిక, మండలాల కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ హాజరవుతారని అన్నారు. -
నిర్వీర్యమౌతున్న ఆర్ఎస్కేలు
గతంలో ఒక ఆర్బీకేలో ఒక వ్యవసాయ అసిస్టెంటు లేదా ఉద్యానవన శాఖ అసిస్టెంటు ఉండగా ప్రస్తుతం రెండు, మూడు ఆర్ఎస్కేలను వీరికి కేటాయించారు. అంతేకాక పండించిన పంటకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించే కియోస్క్ వంటి ప్రాముఖ్యత కలిగిన మిషన్లు పనిచేయని పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల ఆర్ఎస్కేలలో సిబ్బంది లేక అవి మూతపడటం, ఇతర శాఖలకు వాటిని కేటాయిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం అవసరానికి తగ్గట్లు వ్యవసాయ అసిస్టెంట్లను నియమించి ఆర్ఎస్కేలను బలోపేతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
శతాబ్దాల నాటి చెరువు కావాలి ఆదరువు..
చెరువుకట్ట రోడ్డును అభివృద్ధి చేయాలి మార్కాపురం చెరువుతో పాటు చెరువుకట్ట రోడ్డును కూడా ప్రభుత్వం త్వరగా పూర్తిచేయాలి. చెరువుకట్టను ట్యాంకుబండ్లాగా మార్చాలి. చెరువుకట్టకు రెండు వైపులా లైటింగ్ వేయాలి. ప్రజలు కూర్చునేందుకు బెంచీలను ఏర్పాటు చేయాలి. చెరువులో నీరు వృథా పోకుండా చూడాలి. ఎస్ఎస్ ట్యాంకు నిర్మిస్తే వేసవిలో నీటి సమస్య లేకుండా ఉంటుంది. అధికారులు ఆ దిశగా కృషిచేయాలి. – ఉస్మాన్, వైఎస్సార్ సీపీ 12వ బ్లాక్ ఇన్చార్జి, మార్కాపురం సాగర్నీటికి ఇబ్బంది లేకుండా చూడాలి పట్టణంలో ఎక్కువగా సాగర్ నీరు అవసరం. సాగర్ నీటిలో పైపులైన్లు పగిలిపోయినప్పుడు సుమారు వారం రోజుల పైన నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీప్ బోర్ల ద్వారా కొన్ని ప్రాంతాల వారికి నీరు వస్తున్నా ఎక్కువమంది ప్రజలు సాగర్నీటిపై ఆధారపడి ఉన్నారు. రెండో ఎస్ఎస్ ట్యాంకు ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు సాగర్నీటి కష్టాలు తగ్గుతాయి. – బి.బాలకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ యూత్ పట్టణ అధ్యక్షుడు మార్కాపురం టౌన్: వందల ఏళ్ల చరిత్ర కలిగిన మార్కాపురం చెరువు అభివృద్ధిపై సర్వత్రా చర్చ సాగుతోంది. శ్రీకృష్ణ దేవరాయుల పాలన కంటే ముందుగా సుమారు 600 ఏళ్ల క్రితం ఈ చెరువు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇటీవల జిల్లాగా మారిన మార్కాపురం పట్టణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద చెరువును 15వ శతాబ్ధంలో నిర్మించారు. సుమారు 590 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. దీనికింద ఆయకట్టు 1100 ఎకరాలు కాగా, అనధికారికంగా మరో 2,500 ఎకరాలు ఉంది. మార్కాపురం పట్టణంలో భూగర్భజలాలు ఉండాలి ఉంటే ఈ చెరువులో నీరే ఆధారం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన మార్కాపురం చెరువు అభివృద్ధికి నోచుకోలేదు. గత కొన్నేళ్ల క్రితం వర్షాభావ పరిస్థితుల్లో చెరువు ఎండిపోవడంతో వ్యవసాయం సాగక చెరువు ఆయకట్టు కింద భూములు బీడు భూములుగా మారాయి. కొనే్ున్ళ్ల వర్షాభావ పరిస్థితుల్లో కొంతమంది రైతులు మాత్రమే జొన్న, సజ్జ, చిరుధాన్యాలను సాగుచేసుకుని జీవనం సాగించారు. అయితే ఆ పంటలను సాగుచేసే రైతులు కూడా కరువవడంతో భూములు బీడు భూములుగా మారాయి. నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనులు.. మార్కాపురం చెరువుకట్ట రోడ్డును అభివృద్ధి చేసేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.10 కోట్లను మంజూరుచేశారు. అయితే టెండర్లు పిలిచే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా చెరువుకట్ట అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. చెరువుకట్టను అభివృద్ధి చేస్తే వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా ఉంటుంది. చెరువుకట్టను ట్యాంకుబండ్గా మారిస్తే వాకర్లకు, సేద తీరేందుకు పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. ఎస్ఎస్ట్యాంకుగా మారిస్తే తీరనున్న నీటి సమస్య.. ప్రస్తుతం మార్కాపురం పట్టణంలో సుమారు లక్షకు మించి జనాభా ఉంది. 35 వార్డుల్లో సాగర్ పైప్లైన్లతో నీటిని ఏర్పాటుచేశారు. సాగర్ పైపులైన్లు, పది లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న ఓవర్హెడ్ ట్యాంకులు నాలుగు, 4.50 లక్షల కెపాసిటీ ఉన్న ఓవర్హెడ్ ట్యాంకులు రెండు ఉన్నాయి. పట్టణంలోని సుమారు 13 నుంచి 14 వేల సాగర్వాటర్ కనెక్షన్లు గృహాలు ఉన్నాయి. రోజుకు సాధారణ మనిషికి సుమారు 135 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇప్పటివరకూ గతంలో నాలుగు రోజులకు ఒకసారి సాగర్నీరు అందిస్తున్నారు. ఇటీవల దూపాడు వద్ద మరో మోటార్ ఏర్పాటు చేయడంతో మూడు రోజులకొకసారి సాగర్నీటిని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే సాగర్ పైపులైన్లు పగిలిపోయిన, ఎస్ఎస్ ట్యాంకు వద్ద మోటార్లు మరమ్మతులకు గురైనా వారంరోజుల పాటు నీటికి పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు. ప్రస్తుతం మార్కాపురం పురపాలక సంఘ పరిధిలోని ప్రజలకు దూపాడు వద్ద ఉన్న 2200 మిలియన్ లీటర్ల కెపాసిటీ ఎస్ఎస్ట్యాంకు మాత్రమే ఉంది. అయితే పట్టణ ప్రజలకు అవసరమైన సాగర్నీటిని ప్రతి రోజూ అందించాలంటే మరో ఎస్ఎస్ట్యాంకు ఏర్పాటుచేస్తేనే సాధ్యమవుతుంది. 2.0లో భాగంగా 62 కోట్ల రూపాయలతో మరో ఎస్ఎస్ట్యాంకును ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనను టెండర్ల స్థాయిలో ఉన్నట్లు మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. మార్కాపురం చెరువును దూపాడు సాగర్ నీటితో ఎస్ఎస్ట్యాంకుగా మారిస్తే పట్టణ ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. సాగర్ కాలువ దూపాడు వద్ద ఉన్న ఎస్ఎస్ట్యాంకు వందల ఏళ్ల చరిత్ర కలిగిన మార్కాపురం చెరువు చెరువు ఆయకట్టు పరిధిలో వేల ఎకరాల భూమి ఎస్ఎస్ట్యాంకుగా మారిస్తే తీరనున్న తాగునీటి సమస్య చెరువుకట్ట రోడ్డును ట్యాంకుబండ్గా మార్చాలని విజ్ఞప్తి చెరువు అభివృద్ధిని పట్టించుకోని బాబు సర్కార్ -
టీడీపీ నాయకుల దౌర్జన్యాలు సహించం
లింగసముద్రం: కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆగడాలు, దౌర్జన్యాలు సహించేదే లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి మధుసూదన్యాదవ్ హెచ్చరించారు. మండలంలోని పెదపవనిలో జెడ్పీటీసి డాక్టర్ చెన్ను నళినీపద్మకు చెందిన భూమిలో టీడీపీ నాయకులు గ్రావెల్ కోసం తవ్విన గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా బుర్రా మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రావెల్ ఇసుక అక్రమ రవాణా, కోడిపందెం, జూదం, రేషన్ బియ్యం అక్రమ రవాణా, బెల్టు షాపులు మొదలైన వాటిల్లో పర్సంటేజీలు తీసుకుంటూ కోట్లు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతాయని చెప్పారు. ఆయనకు పర్సంటేజీలు ఇస్తే చట్టానికి విరుద్ధంగా ఏ పనైనా చేస్తారన్నారు. వైఎస్సార్ నాయకులను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇలానే కొనసాగితే ఎమ్మెల్యే ఇంటి ముందు లేదా కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. జెడ్పీటీసీ గతంలోనే ఈ భూమిని కొనుగోలు చేశారని, అయితే జెడ్పీటీసీ కావలిలో ఉండటంతో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు 8 అడుగుల మేర గోతులు తీసి రేయింబవళ్లు గ్రావెల్ తరలించి దోచుకున్నారన్నారు. ప్రభుత్వ భూములు, చెరువుల్లో ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు చేస్తూ అడ్డు వచ్చే వారిపై పోలీస్స్టేషన్లలో ఏదో ఒక కేసు పెట్టించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాచుకో, దోచుకో అంటూ ప్రభుత్వ సొమ్ము దోచుకోవడం అయిపోయి ఇప్పుడు ప్రైవేట్ ఆస్తులను కూడా దోచుకోవడం మొదలుపెట్టారన్నారు. ఇదే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని, తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించబోమన్నారు. అధికారులు కూడా సక్రమంగా పని చేయడంలేదని, అధికారపార్టీ నాయకులు చెప్పిందే చేస్తున్నారని, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఏవరైతే అధికారులు తప్పుచేస్తున్నారో వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు. ఇబ్బందులు పెడుతున్నారు: జెడ్పీటీసీ నళినీపద్మ టీడీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెదపవనిలో చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లో ఇసుక, గ్రావెల్ ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తున్నారని వాపోయారు. ఇప్పుడు మా భూమిలోకి వచ్చి ఇష్టం వచ్చినట్లు తవ్వేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు వచ్చి జేసీబీలు, ట్రాక్టర్లను సీజ్ చేయకుండా పంపించివేశారన్నారు. గ్రావెల్ తోలిన వ్యక్తులపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయంలో ఎంతదూరమైనా వెళతామని ఎవ్వరినీ వదిలిపెట్టబోమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పెన్నా క్రిష్ణయ్య, నాయకులు గణేశం గంగిరెడ్డి తోకల కొండయ్య, షేక్ రసూల్, చీమల శ్రీను, వట్టిగుంట వెంకటేశ్వర్లు, మల్లెబోయిన వెంకటేశ్వర్లు, కన్నె రాజారావు గ్రామస్తులు పాల్గొన్నారు. పెదపవనిలో గ్రావెల్ తవ్విన జెడ్పీటీసీ భూమిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్యే ఇంటూరి దందాలపై పోరాటం అధికారులు పట్టించుకోకుంటే న్యాయపోరాటం చేస్తాం -
సమష్టిగా ముందుకు సాగుదాం
కనిగిరిరూరల్: ‘సమష్టిగా పనిచేద్దాం, కనిగిరిలో వైఎస్సార్ సీపీ జెండాను ఎగురేద్దాం.. 2029లో మళ్లీ జగనన్నను సీఎం చేసుకుందాం’ అని వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణయాదవ్ అన్నారు. వైఎస్సార్ సీపీ సంస్థగత నిర్మాణంలో భాగంగా పార్టీ కమిటీల ఏర్పాటుపై మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ విసృత స్థాయి సమావేశం మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్ అధ్యక్షతన నిర్వహిచంచారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ఐక్యతగా, ప్రణాళికాబద్ధంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అబద్ధల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ 18 నెలల కాలంలోనే పూర్తిగా విఫలమైందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ వైఖరిపై ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ బాబులు క్రెడిట్ చోరీ రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాన్నారు. పార్టీకి కార్యకర్తలే కీలకమని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా పనిచేసి పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. పార్టీ కోసం పనిచేసే వారికి సముచిస్థానం రానున్న రోజులు వైఎస్సార్ సీపీవేనని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో తగిన గుర్తింపు, సముచిత స్థానం దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పరిశీలకుడు కసుకుర్తి ఆదెన్న అన్నారు. రాష్ట్రంలో ప్రజా కంఠక పాలన సాగుతోందన్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 10 లోపు గ్రామ కమిటీలను పూర్తి చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ, అన్ని విభాగాల అనుబంధ కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సాల్మన్ రాజు, మాజీ ఎంపీపీ భువనగిరి వెంకటయ్య, పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పులి శాంతి గోవర్ధన్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు యక్కంటి శ్రీనివాసులరెడ్డి, జి.బొర్రారెడ్డి, రాచపుడి మాణిక్యరావు, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, డాక్టర్ ఎస్కే రసూల్, ఆయిమల్ల నాగమణి, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, ఓమెగా రామిరెడ్డి, గట్లా విజయభాస్కర్రెడ్డి, కటికల వెంకటరత్నం, శ్రీరాం సతీష్, పోలక సిద్ధారెడ్డి, గురు ప్రసాద్, గుంటగాని అభి, శ్యామల సాంబిరెడ్డి, ఎస్కే గయాజ్, ఎస్కే బుజ్జీ, సిరుప వెంకట గోవర్ధన్రెడ్డి, భవనం కృష్ణారెడ్డి, రామనబోయిన శ్రీనివాసుల యాదవ్,మితికల గురవయ్య, ఎస్కే ఖాజా మొహిద్దీన్, ఎస్కే ఖాశింవలి, ఎస్కే జిలాని, మీరావలి, సానికొమ్ము మధు, తాతపుడి నాని, తాతపుడి సురేష్, గోనా శ్యాంసన్, కసిరెడ్డి రామసుబ్బారెడ్డి, గాలి నాగేశ్వరరావు, పులి శ్రీను, ఎస్కే రహీం, కుప్పన బోయిన రమణయ్య, ఎలికా నారాయణ, పరిమి వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకే పార్టీకి సైనికులు పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం పాలనలో బాబు ప్రభుత్వం విఫలం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దద్దాల నారాయణ -
డివైడర్ను ఢీకొని వ్యక్తి మృతి
నాగులుప్పలపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు, పోలీసులు వివరాల మేరకు.. ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన పైనం రమేష్బాబు (43) ఒంగోలులో నైట్ డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో నిద్రమత్తులో చదలవాడ పశుక్షేత్రం సమీపంలో డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పామూరు: గన్నేరు కాయలు తిని మహిళ మృతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పామూరులోని శివాలయం సమీపంలో మంగళవారం జరిగింది. ఏఎస్సై జిలానీబాష తెలిపిన వివరాలు... శివాలయం సమీపంలో కోమటిగుంట్ల రాధ అనే మహిళ పిల్లలతో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. గత రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంది. కాగా మంగళవారం మనస్తాపానికి గురైన రాధ స్థానిక శివాలయంలోని గన్నేరు కాయలు తిని తీవ్ర అస్వస్థతకు గురైంది. బంధువులు ఆమెను స్థానిక సీహెచ్సీకి తరలించి గన్నేరుపప్పు కక్కించారు. మెరుగైన వైద్యంకోసం మరో వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలికి ముగ్గురు సంతానం ఉన్నారు. ఏఎస్సై జిలానీబాష వివరాలు సేకరిస్తున్నారు. కంభం: కంభం చెరువులో గల్లైంతన వ్యక్తి కోసం మూడు రోజులుగా బోటులో గాలిస్తున్నా ఆచూకి లభ్యం కాలేదు. మంగళవారం చీకటి పడే వరకు జాలరులు బోటులో లంగరు సహాయంతో చెరువులో గాలించినా ఆచూకీ దొరకలేదు. చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండటం, చెరువు లోపల పెద్ద పెద్ద చిల్లచెట్లు పెరిగి ఉండటం వల్ల వెతకడం కష్టతరంగా మారుతోంది. ఆదివారం నుంచి కందులాపురం పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి కనిపించకుండా వెళ్లిన నేపథ్యంలో ఆ వ్యక్తే చెరువులో పడ్డాడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టి చెరువు కట్ట సమీపంలో రైల్వే గేటు వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. కనిపించకుండా వెళ్లిన వ్యక్తికి సంబంధించిన వారు సైతం కంభం చెరువు కట్టకు వద్దకు చేరుకొని ఎదురుచూస్తున్నారు. -
స్వాట్ టీం సాహస ప్రదర్శన..
జిల్లా పోలీస్ స్వాట్ టీం శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల ప్రాణాలను కాపాడడంలో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ చేసిన సాహస ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరాల ద్వారా శత్రువులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, అక్కడికి స్వాట్ కమాండోలు చేరుకొని, చాకచక్యంగా శత్రువులను హతమార్చి, ప్రముఖులను ఎలా సురక్షితంగా రక్షిస్తారో డెమో ద్వారా ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. అదేవిధంగా అగ్ని ప్రమాదం, విపత్కర పరిస్థితుల్లో స్పందించే విధానం, ఎలా రక్షించుకోవాలి అన్న విషయాలపై అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్దన్ రాజు సందర్శించారు. రిపబ్లిక్ డే పరేడ్ను అద్భుతంగా ప్రదర్శించిన ప్లాటూన్ కమాండర్లను కలెక్టర్ ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. అలాగే స్వాట్ టీమ్ సిబ్బంది ప్రదర్శించిన సాహసాలను కలెక్టర్, ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించి ప్రశంస పత్రాలను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను అద్భుతంగా ప్రదర్శించిన పలు పాఠశాలల విద్యార్థులకు కలెక్టర్ ప్రశంస పత్రాలను అందజేశారు. -
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
ఆలకూరపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల నృత్య రూపకంమార్మోగిన దేశభక్తి..మురిసిన త్రివర్ణం..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాను సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని, అన్ని వర్గాల వారు పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ పి.రాజాబాబు విజ్ఞప్తి చేశారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఎస్పీ వి.హర్ష వర్ధన్రాజుతో కలిసి పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో పర్యటించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎనలేని త్యాగాలు చేసిన స్వాతంత్య్ర సమర యోధులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా తలసరి అంచనా ఆదాయం రూ.2,15,240 ఉండగా 15 శాతం వృద్ధి రేటుతో 2028–29 కు రూ.4,27,409 కు పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. మన జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని రాబోయే ఐదేళ్లలో 15 శాతం వృద్ధి రేటు సాధించడానికి తయారుచేసిన ‘డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్’ రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం పొందిందన్నారు. అలాగే జిల్లాలోని 6 నియోజకవర్గాలకు ‘విజన్ యాక్షన్ ప్లాన్’ అమలుకు శాసన సభ్యుల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సహజ వనరుల నిర్వహణ (ఎన్ఆర్ఎం) విభాగం కింద ప్రాజెక్ట్ ప్రాంతంలో రూ.2.81 కోట్ల వ్యయంతో 188 పనులు చేపట్టామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించేందుకు నల్లమల సాగర్ వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి 904 గ్రామాలు, రామతీర్ధం రిజర్వాయర్ నుంచి 318 గ్రామాలు, గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి 198 గ్రామాలకు నీటి సరఫరా చేసేందుకు పరిపాలన అనుమతి నిమిత్తం ప్రతిపాదనలకను ఈఎన్సీకి పంపామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ, డీఆర్ఓ బీసీహెచ్.ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు అర్బన్, రూరల్ తహశీల్దార్లు పిన్నిక మధు సూదనరావు, రహంతుల్లా, ఆర్ఐ శ్రీకంఠ శ్రీనివాస రావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఒంగోలు సబర్బన్: పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఒంగోలులోని డ్రీమ్స్ హైస్కూల్, అపెక్స్ హైస్కూల్, అన్నవరప్పాడులోని సూర్య హైస్కూల్, కొత్తపట్నం, తాళ్లూరు, ముండ్లమూరు, పొన్నలూరు, కే బిట్రగుంట కేజీబీవీలు, టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల, క్విస్, పేస్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులచే దేశభక్తి ఉట్టిపడేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కొత్తపట్నం, తాళ్లూరు, ముండ్లమూరు, పొన్నలూరు, కే బిట్రగుంట కేజీబీవీ విద్యార్ధులు ప్రదర్శించిన ‘రెపరెపలాడే జెండా’ ప్రదర్శనకు మొదటి బహుమతి లభించగా, డ్రీమ్స్ హైస్కూల్, టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలకు సంయుక్తంగా ద్వితీయ బహుమతి, సూర్య హైస్కూల్ విద్యార్థుల ప్రదర్శనకు తృతీయ బహుమతి లభించాయి. అపెక్స్ హైస్కూల్ విద్యార్థులు, క్విస్, పేస్ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల ప్రదర్శనలకు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు. ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాలు: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ శాఖల్లో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన శకటాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి. జిల్లా పంచాయతీరాజ్ శాఖ శకటానికి మొదటి బహుమతి, జిల్లా గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటాలకు సంయుక్తంగా రెండో బహుమతి, సాంఘిక సంక్షేమ, బీసీ వెల్ఫేర్, ఐటీడీఏ సంక్షేమ శాఖల శకటానికి తృతీయ బహుమతి, జిల్లా ప్రజా రవాణ, విద్య, ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖల శకటాలకు ప్రోత్సాహక బహుమతి లభించింది. ● వివిధ శాఖలు అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రజలు, విద్యార్థులు స్టాల్స్ను ఆసక్తిగా తిలకించారు. భూగర్భ గనుల శాఖ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్కు సంయుక్తంగా మొదటి బహుమతి లభించగా, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్కు సంయుక్తంగా రెండో బహుమతి, పశు సంవర్ధక శాఖ, స్టెప్ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్కు సంయుక్తంగా తృతీయ బహుమతి లభించాయి. ప్రపంచంలో నంబర్ వన్ మోసగాడు బాబు ప్రజలను మోసగించడంలో ప్రపంచంలో నంబర్ వన్ వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి గోవర్ధన్రెడ్డి అన్నారు. దేశభక్తి జ్వాలలు ఎగసిపడుతూ, సాంస్కృతిక సంప్రదాయాల వైభవం మెరిసిపోతూ గణతంత్ర వేడుకలు ప్రాంగణాన్ని ఉల్లాసంగా మార్చాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన రిపబ్లిక్డే వేడుకలు ఘనంగా సాగాయి. త్రివర్ణ పతాక ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాలాపనతో వాతావరణం దేశభక్తితో మార్మోగింది. విద్యార్థుల ఉత్సాహభరిత సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల్లో అసమాన ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, అధికారులను ప్రశంసా పత్రాలతో సత్కరించి ప్రోత్సహించారు. -
అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం
ఒంగోలు సిటీ: డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆలోచనా విధానాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో 77వ గణతంత్ర దిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, హోదాలు దక్కాలని, ప్రతి ఒక్కరూ సామాజికంగా, ఆర్ధికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ దేశ పౌరుడిగా చట్టాలను కాపాడుకుంటూ, ప్రతి ఒక్కరి హక్కులను గౌరవిస్తామని తెలిపారు. దేశం కోసం తమ ప్రాణాలర్పించిన మహానీయుల అడుగు జాడల్లో నడవాలని, వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, బొట్ల రామారావు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ వైఎం.ప్రసాద్రెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు ధర్నాసి హరిబాబు, కార్పొరేటర్ ఇమ్రాన్ఖాన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు దామరాజు క్రాంతి కుమార్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షురాలు గోనుగుంట రజని, మహిళా నాయకులు బత్తుల ప్రమీల, పేరం ప్రసన్న, షేక్ అప్సర్, మాధవీలత, శోభాలత, విజయ, రాజేశ్వరి, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహాగౌడ్, వైఎస్సార్ సీపీ నాయకులు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, మల్లిశెట్టి దేవా, రొండా అంజిరెడ్డి, షేక్ నాగూర్, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, చందోలు చెంచిరెడ్డి, వెంకటరెడ్డి, ఎదురు మాల్యాద్రిరెడ్డి, ఫణిదపు సుధాకర్, తాతా నాంచారులు, తుళ్లూరి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ కోసం శ్రమించే వారికి ప్రాధాన్యం
యర్రగొండపాలెం: పార్టీ కోసం శ్రమించే ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని, గ్రామస్థాయి కార్యకర్తలకు ఆయన పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన ఫలితం దక్కుతుందన్నారు. అధికారంలో లేనిసమయంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే వారే నిజమైన నాయకులని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని, జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకొని ప్రజా సంక్షేమానికి పాటు పడదామని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఉన్న పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలన్నారు. పార్టీ పదవులు పొందినవారు పార్టీ పరంగా జరిపే ప్రతి కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. టీడీపీ వర్గీయులు తమ స్థాయిని మరచి విమర్శలకు దిగుతున్నారని, వారికి ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులే గట్టి సమాధానం ఇవ్వాలని సూచించారు. టీడీపీకి చెందిన ఎంపీటీసీనే.. ఎంపీడీవో అవినీతిపరుడని ఆరోపించడం వారి పాలనకు అద్దం పడుతోందని, నియోజకవర్గ ఇన్చార్జి అంటూ తిరుగుతున్న ఆ పార్టీ నాయకుడు ఇసుక, మట్టి, బియ్యం అక్రమ రవాణాచేసే వారిని వెంటేసుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటుచేసి ఇటువంటి సంఘటనలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో ప్రజా ప్రతినిధిలు, పార్టీ నాయకులు ఒంగోలు మూర్తిరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, భూమిరెడ్డి సుబ్బారెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, ఉడుముల అరుణ, ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకటరమణారెడ్డి, పి.కృష్ణారెడ్డి, డి.వెంకటేశ్వర్లు, ఐవీ.సుబ్బారావు, ఆర్.అరుణాబాయి, పల్లె సరళ, వాడాల పద్మా, కె.ఓబులరెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, చేదూరి విజయభాస్కర్, యేర్వ చలమారెడ్డి, వాగ్యానాయక్, సయ్యద్ జబీవుల్లా, తోకల ఆవులయ్య, యేర్వ శేషసేనారెడ్డి, అంగిరేకుల ఆదినారాయణ, జానకి రఘు, ఎల్.రాములు, షేక్.కాశింపీరా, పి.రాములు నాయక్, వెన్నా మోహన్రెడ్డి, ఎం.ఆదిశేషు, ఒంటేరు నాగేశ్వరరావు, చిట్టె వెంకటేశ్వరరెడ్డి, పబ్బిశెట్టి మల్లికార్జున్, కందూరి రామయ్య, కందూరి కాశీవిశ్వనాథ్, ఐవీ.సత్యనారాయణ, పి.రాములు నాయక్, సాయపనేని సుబ్బారావు, షేక్.షెక్షావలి, రామయ్య పాల్గొన్నారు. -
న్యాయం చేయాలని రాస్తారోకో
పొదిలి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీరామ్ నాగేంద్రబాబు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కుటుంబ సభ్యులు, బంధువులు రాస్తారోకోకు దిగారు. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలేనికి చెందిన శ్రీరామ్ నాగేంద్రబాబు కొనకనమిట్ల మండలం చినారికట్ల–పెదారికట్ల గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువెళ్లే క్రమంలో మృతుని బంధువులు, కుటుంబసభ్యులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సీఐ రాజేష్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని సీఐ హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు. -
ప్రపంచంలో నంబర్వన్ మోసగాడు బాబు
అవార్డులు అందుకుంటున్న డి.హిమవంశీ (సబ్కలెక్టర్, కందుకూరు), బి.చినఓబులేసు (డీఆర్ఓ), కె.లక్ష్మీప్రసన్న (ఆర్డీఓ, ఒంగోలు), టి.నారాయణ (పీడీ, డీఆర్డీఏ), కె.సుధాకర్రెడ్డి (ప్లానింగ్ డీఈఅండ్ఎస్ఓ), ఎం.వెంకటేశ్వరరావు (డీపీఓ), కె.అర్జున్నాయక్ (సోషల్ వెల్ఫేర్ ఈడీ), జె.పార్ధసారధి (మైనార్టీ వెల్ఫేర్ డీఎండబ్ల్యూఓ), ఎస్.పద్మశ్రీ(డీఎస్ఓ), ఎన్.లక్ష్మనాయక్(సోషల్ వెల్ఫేర్ డీడీ), డాక్టర్ ఎన్.వెంకటేశ్వరరావు (జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి), పి.నిర్మల్కుమార్ (ఈఈ, ఏపీఎంఎస్ఐడీసీ), డి.వరలక్ష్మి(ఇరిగేషన్ ఎస్ఈ), డాక్టర్ టి.వెంకటేశ్వర్లు(డీఎంహెచ్ఓ), కె.వెంకటేశ్వర్లు (ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ), వి.రామ్గోపాల్ నాయుడు (ట్రాన్స్కో ఎస్ఈ), జి.అశోక్ (పంచాయతీరాజ్ ఎస్ఈ), పి.శ్రీమన్నారాయణ (స్టెప్ సీఈఓ,), ఎల్.శంకరనారాయణరెడ్డి(స్టేట్ ఆడిట్ఆఫీసర్), ఎ.జగన్నాథరావు(ట్రెజరీస్ డీడీ), ఎం.పానకాలరావు (దేవాదాయశాఖ ఏసీ), కె.రాజశేఖర్రావు (డీఎఫ్ఓ, సోషల్ఫారెస్ట్), కె.వినోద్కుమార్ (డీఎఫ్ఓ, ప్రాదేశిక), సీహెచ్.శ్రీనివాసరావు (జిల్లా మత్స్య శాఖాధికారి), వైఎంఎన్వీఎస్ గోపిచంద్ (జిల్లా ఉద్యానశాఖ అధికారి), సీహెచ్ శ్రీనివాసులు(పీడీ, ఏపీఎంఐపీ), డి.రమేష్(ఎల్డీఎం, కెనరా బ్యాంక్), ఎం.వరలక్ష్మి (మార్కెటింగ్ అధికారి), కె.హరిక్రిష్ణ (డీఎం, మార్క్ఫెడ్), సీహెచ్ సువార్త (ఏడీ, దివ్యాంగుల శాఖ) , టి.శ్రీనివాస సంజయ్ (ఈఈ, పబ్లిక్హెల్త్), కె.శ్రీనివాసరెడ్డి (జిల్లా అగ్నిమాపకశాఖాధికారి), ఎస్.జాన్సన్ (ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్), జె.రవికుమార్ (నాబార్డ్ డీడీఎం,), కె.ఆంజనేయులు (జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖఅధికారి), కె.బాలంజనేయులు (జిల్లా రిజిష్ట్రార్), డాక్టర్ జి.పద్మజ (ఆర్డీడీ, ఆయూష్), జి.సత్యనారాయణ (ఆర్ఎం, ఏపీఎస్ ఆర్టీసీ, ఎ.కళావతి (డిప్యూటీ కలెక్టర్, బీకేవీ), జీహెచ్.విజయజ్యోతికుమార్ (డిప్యూటీ కలెక్టర్, కేఓఆర్జీపీ) , వి.సుభాషిణి(డీపీఎం), ఎం వెంకటేష్ (డీఆర్ఓ సీసీ), ఆర్ శ్రీనివాసరావు (డీఎస్పీ, ఒంగోలు), బి.లక్ష్మీనారాయణ (ఎస్డీపీఓ, దర్శి), కె.శ్రీనివాసరావు (డీఎస్పీ, ఏఆర్), టి.విజయక్రిష్ణ (సీఐ, ఒంగోలు తాలుకా), జి.సోమశేఖర్ (సీఐ, కొండపి), ఓ.దుర్గాప్రసాద్ (సీఐ, ఎస్సీ, ఎస్టీ సెల్), పి. దేవప్రభాకర్ (సీఐ, డీసీఆర్బీ, ఒంగోలు), ఎస్వీ రమణ (ఆర్ఐ ఏఆర్), యు.సుధాకర్రావు (సీఐ, టాస్క్ఫోర్స్), వై.రామారావు (సీఐ, దర్శి), వై.నాగరాజు (ఎస్సై, బల్లికురవ), వి.వెంకటేశ్వరరావు (ఎస్సై, డీసీఆర్బీ, ఒంగోలు), జి.వెంకటసూర్య (ఎస్సై, మద్దిపాడు), బి.ప్రేమ్కుమార్ (ఎస్సై,కొండపి), ఎస్కే మహ్మద్రఫీ (ఎస్సై, మేదరమెట్ల), బి.ఫణిభూషణ్ (ఎస్సై, ఒంగోలు తాలుకా), పి.జనార్దన్రావు (ఎస్సై, పీజీఆర్ఎస్ సెల్), వై.మాధవరెడ్డి(డీఎస్పీ, పీటీసీ), ఎస్కే . షఫీఅహ్మద్ (సీఐ, పీటీసీ), ఎన్.శ్రీనివాసరావు (జైలర్), పి.రవికుమార్ (ఎంవీఐ) , కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా మెడల్స్ అందుకుంటున్న ఎం.భీమానాయక్ (సీఐ), యు.జనార్దన్రావు(కానిస్టేబుల్), ఎ.సూర్యనారాయణ (ఏఎస్సై), ఐ.మాల్యాద్రి(ఏఎస్సై) జి.మోహన్రావు (ఏఎస్సై), వి.గౌతమి(ఏఎస్సై)జి.సుధాకర్ (హెడ్కానిస్టేబుల్), ఎం.అశోక్కుమార్ (కానిస్టేబుల్), ఏ.వెంకటప్రసాద్( ఏఆర్ కానిస్టేబుల్) ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు టౌన్: ధైర్యంగా ఉండండి, పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భరోసా ఇచ్చారు. ముండ్లమూరు మండలం శంకరాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఒంగోలులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఉల్లగళ్లు ఎస్సీ కాలనీకి చెందిన తప్పేట రాజ్యంను సోమవారం ఆయన పరామర్శించారు. రాజ్యం ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్థికసాయం అందజేశారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను కోరారు. బూచేపల్లితో పాటు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు వున్నారు. అద్దంకి రూరల్: బైకును వ్యాన్ ఢీకొట్టిన ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం అద్దంకిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అద్దంకికి చెందిన వి. చిరంజీవి(43) బంగారపు పని చేస్తుంటాడు. సోమవారం ఉదయం అద్దంకి బస్టాండ్లో తన బంధువులను బస్సు ఎక్కించి తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలోని స్థానిక పాతపెట్రోలు బంకు వద్దకు రాగానే రాజస్థాన్కు చెందిన వ్యాన్ వేగంగా వచ్చి బైకును ఢీకొట్టింది. దీంతో చిరంజీవి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కందుకూరు: ఒక అబాద్ధాన్ని నిజం చేయడంలో, ఉన్నది లేనట్లు చూయించి ప్రజలను మోసం చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని మించిన వ్యక్తి దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరొకరు ఉండరని, నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం చంద్రబాబునాయుడికి మాత్రమే సాధ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ కమిటీల ఏర్పాటుపై సోమవారం స్థానిక వెంగమాంబ ఫంక్షన్హాల్లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో సంక్షేమంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. అయితే వాటిని సక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమడం వల్లే పార్టీ ఓడిపోయిందన్నారు. 17 మెడికల్ కాలేజీలను జగన్మోహన్రెడ్డి నిర్మాణం చేపడితే చంద్రబాబు, లోకేష్ తమ డబ్బు పిచ్చి వల్ల వాటిని ప్రైవేటీకరణ పేరుతో తన సొంత మనుషులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతమైందన్నారు. ఎన్నికల ముందుకు ల్యాండ్ టైట్లింగ్ యాక్టు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి నేడు అదే చంద్రబాబు అప్పట్లో జగన్వాడిన బ్లాక్చైన్ టెక్నాలజీనే వాడి పాస్పుస్తకాలను ముద్రిస్తున్నారని చెప్పారు. నాడు జగన్ రేషన్ బియ్యం, పింఛన్లు డోర్ డెలివరీ చేస్తే కూటమి ప్రభుత్వం మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. చంద్రబాబు చెప్పిన ఇరవైమూడు లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ.18వేలు, ఉచిత సిలిండర్ ఎక్కడ ఉన్నాయో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. రైతులకు సక్రమంగా యూరియా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదని, కౌలు రైతులను ఆదుకునే నాథుడే లేడన్నారు. ఇన్ని తప్పులు చేస్తూ ప్రశ్నిస్తానని చెప్పిన పవన్కళ్యాణ్ ఎటు పోయారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఇబ్బంది పెట్టే ఏ అధికారిని వదలం కూటమి ప్రభుత్వం అండచూసుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఏ పోలీస్ని, ఇతర అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నమోదు చేస్తున్నామని, ఏ పోలీస్ అధికారి ప్రవర్తన ఎలా ఉందో గమనిస్తున్నామన్నారు. ఇటువంటి పోలీసులకు అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ల పాటు ఎక్కడా పోస్టింగ్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ దాడులను ధైర్యం ఎదుర్కొవాలని, భయపడాల్సిన అవసరమే లేదన్నారు. 10వేల మందితో కమిటీలు వైఎస్సార్సీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో 10వేల మంది వివిధ విభాగాల కమిటీలను క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది కార్యకర్తల సైన్యం వైఎస్సార్ సీపీకి ఉంటుందని, ప్రపంచంలో ఏ పార్టీకి ఇటువంటి సంస్థాగత నిర్మాణం ఉండదన్నారు. కమిటీల్లో కార్యకర్తలను పార్టీ ప్రత్యేకంగా గుర్తించి భవిష్యత్లో పదవుల్లోకి వీరికే ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. కందుకూరు నియోజకవర్గంలో వెంటనే కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. వచ్చే ప్రభుత్వంలో కార్యకర్తకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని, కార్యకర్తల అండతో నాయకుడు నడిచే పరిస్థితి రావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి బుర్రా మధుసూదన్యాదవ్ అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని సూచించారు. రాష్ట్రంలో రాక్షస పాలన.. జగన్మోహన్రెడ్డి పాలనకు, చంద్రబాబునాయుడు పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకట్రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, బియ్యం వంటి వాటిని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. జగన్ నిజమైన సంపద సృష్టిస్తే, చంద్రబాబు సూపర్సిక్స్ పథకాలపేరుతో మోసం చేస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కార్యకర్తలంతా శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు కామిరెడ్డి సత్యన్నారాయణరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాధ్యానం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో సామంతరాజుల పాలన నడుస్తుంది కందుకూరు నియోజకవర్గంలో మండలానికో ఇన్చార్జి పెట్టి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు భారీ అవినీతికి పాల్పడుతున్నారని బుర్రా మధుసూదన్యాద్ ఆరోపించారు. ఇసుక, పేకాట, మట్టి, బియ్యం వంటివాటిలో ఎమ్మెల్యేకి వాటాలు ఉన్నాయని చెప్పారు. ఈ పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు సూచించినా మారే పరిస్థితి లేదన్నారు. ఆయన ఎన్నికల్లో చేసిన అప్పులు తీర్చుకునేందుకు ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారని వివరించారు. వైఎస్సార్ సీపీకి అటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కులాలు, మతాలకు అతీతంగా జగన్మోహన్రెడ్డి ప్రతి ఒక్కరికీ మేలు చేశారని, జగన్మోహన్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు, నాయకులు బలంగా పనిచేసి నియోజకవర్గంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శేషయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి, కందుకూరు టౌన్, రూరల్, ఉలవపాడు, వలేటివారిపాలెం, గుడ్లూరు, లింగసముద్రం మండలాల కన్వీనర్లు షేక్ రఫి, ఈదర రమేష్, నన్నంపోతురాజు, అనుమోలు లక్ష్మీనరసింహం, కాపులూరి క్రిష్ణ, నోటి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీలు పులిరమేష్, పెన్నా క్రిష్ణయ్య, వివిధ విభాగాల అధ్యక్షులు రావులకొల్లు బ్రహ్మానందం, తోకల కొండయ్య, వల్లూరి కోటేశ్వరరావు, సాంబశివరాజు తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో జారిపడి వ్యక్తి మృతి
కొండపి: చెరువులో జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొండపి చెరువులో సోమవారం జరిగింది. పోలీసులు వివరాల మేరకు..కొండపి జాళ్లపాలెం రోడ్డులో ఉండే గురునాథం పాల్(52) శుక్రవారం రాత్రి మలవిసర్జన నిమిత్తం చెరువు కట్ట దగ్గరకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం, ఆదివారం డ్రోన్ల సాయంతో గాలించినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మృతదేహం చెరువులో తేలాడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కొండపి ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమ్కుమార్ తెలిపారు. మృతునికి భార్య, 10 మంది పిల్లలు ఉన్నారు. కంభం: కంభం చెరువులో ఆదివారం సాయంత్రం ఈతకు దిగి గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు కొనసాగించారు. రెండో రోజు సోమవారం ఉదయం నుంచి చెరువులో గాలించారు. అయితే చెరువులో నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో గాలింపు ఇబ్బందిగా మారింది. అయితే గల్లంతైన వ్యక్తి ఎవరో ఇంకా స్పష్టత రాలేదు. కందులాపురం పంచాయతీకి చెందిన వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రానున్నట్లు సమాచారం. గిద్దలూరు రూరల్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్యం, మాంసం విక్రయించడం చట్టరిత్యా నేరం. అయితే సోమవారం గిద్దలూరు పట్టణంలో విక్రయాలు యథేచ్ఛగా కొనసాగాయి. పాములపల్లె రోడ్డులో చేపలను బహిరంగంగా విక్రయించారు. మద్యం ప్రియులకు అందుబాటులో కమ్మరాంకట్ట సెంటర్, రాచర్ల గేటు సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లలో బెల్టుషాపు నిర్వాహకులు మద్యం విక్రయించారు. ఇంత జరుగుతున్నా అధికారులెవ్వరూ ఆ వైపు కన్తెత్తి కూడా చూడలేదు. సింగరాయకొండ: విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరచినందుకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ ఎం శివకుమారి రాష్ట్రస్థాయి ప్రశంశా అవార్డు అందుకున్నారు. సర్కిల్ పరిధిలో అత్యధిక కేసులు నమోదు చేయడంతో పాటు ముఖ్యంగా గోవా మద్యం పట్టుకున్న కేసులో అవార్డు లభించింది. జిల్లాలో ఏకై క సర్కిల్ స్థాయి అధికారిగా అవార్డుకు ఎంపికయ్యారు. విజయవాడ ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆ శాఖ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ● ఇద్దరికి తీవ్ర గాయాలు పెద్దదోర్నాల: ఎదురెదురుగా వస్తున్న మోటారు సైకిల్, స్కూల్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండల పరిధిలోని చిన్నగుడిపాడు సమీపంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు..పెద్ద బొమ్మలాపురం నుంచి వస్తున్న ఓ పాఠశాల బస్సును పొలాల నుంచి వస్తున్న మోటారుసైకిల్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మోటార్ సైకిల్పై ఉన్న గిలకా చిన్నకోటయ్య, గిలకా పెద్దిరాజులకు తీవ్ర గాయాలు కావడంతో సీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం నరసరావుపేటకు తరలించారు. -
ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగంగా భారత్
ఒంగోలు సబర్బన్: ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా భారత రాజ్యాంగం అవతరించిందని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలక్రిష్ణతో కలిసి తీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటుచేసిన నాలుగు సింహాల స్థూపాన్ని ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలక్రిష్ణ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, సీపీఓ సుధాకర్రెడ్డి, డీఈఓ రేణుక, జిల్లా పౌర సరఫరా అధికారి పద్మశ్రీ కలెక్టరేట్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ పి.రాజాబాబు -
వెలుగుల రేడు
వెండి రథంపై● సప్త వాహనాలపై దర్శనమిచ్చిన చెన్నకేశవుడు ● వైభవంగా రథసప్తమి వేడుకలు ● వేలాదిగా హాజరై స్వామివారిని దర్శించుకున్న భక్తులుమార్కాపురం టౌన్: రథసప్తమిని పురస్కరించుకుని మార్కాపురంలోని ప్రసిద్ధ శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు వెండి రథంపై ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని నాలుగు మాడవీధుల్లో స్వామి వారు సప్త వాహనాల్లో వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తరహాలో రఽథసప్తమి వేడుకలు జరగటంతో వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనం నుంచి శేష, గరుడ, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనంపై చెన్నకేశవ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం స్వామి వారికి చక్రస్నానాన్ని అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు, నంద్యాల శ్రీనివాసచార్యులు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు వెండితో తయారు చేసిన భారీ రథంపై చెన్నకేశవ స్వామివారికి నగరోత్సవం నిర్వహించారు. అనంతరం చంద్రప్రభ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ జీ.శ్రీనివాసరెడ్డి, ఉత్సవ సేవా సంఘం అధ్యక్షుడు యక్కలి కాశీవిశ్వనాథం, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ అన్నా రాంబాబు, కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సెక్రటరీ అన్నా కృష్ణ చైతన్య, మాజీ ధర్మకర్తలు, ఉత్సవ సేవా సంఘం సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రత ఏర్పాట్లను ఇన్చార్జ్ కలెక్టర్ రాజాబాబు, జేసీ పి.శ్రీనివాసులు, ఎస్పీ హర్షవర్ధన్రాజు, సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో సబ్ డివిజన్లోని ఎస్సైలు, పోలీసులు, సహాయ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కోలాటం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ వేషాలతో నృత్యాలు అలరించాయి. -
గత ప్రభుత్వంలో 80 శాతం పనులు పూర్తయినా..
మార్కాపురంలో చంద్రబాబు ప్రభుత్వం 2018 నవంబరు 29న పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా టిడ్కో ఇళ్లను ప్రారంభించింది. పునాదులు తీసే సమయానికి ఎన్నికలు రావడంతో టిడ్కో ఇళ్ల పనులకు బ్రేక్ పడింది. 2019లో అధికారంలోనికి వచ్చిన వైఎస్సార్ సీపీ మొత్తం 912 మంది లబ్ధిదారులకు గృహాలు నిర్మించేందుకు అవసరమైన నిధులు రూ.62.2 కోట్లు కేటాయించింది. సుమారుగా రూ.45 కోట్లతో పనులు జరగగా 80 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే 2024లో ఎన్నికలు రావడంతో జరగాల్సిన పనులు నిలిచిపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నేటికీ 20 శాతం పనులను పూర్తిచేయక పోగా మౌలిక వసతులకు అవసరమైన నిర్మాణాలను కూడా చేపట్టలేదు. టిడ్కో ఇళ్లలో మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి పనులను పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాల్సి ఉంది. మౌలిక వసతుల కల్పనకు రూ.6.51 కోట్ల పనులు టెండర్ల స్థాయిలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు.డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు నాగులవరం రోడ్డులో టిడ్కో ఇళ్ల వద్ద చేపడతామని తెలుపగా ప్రభుత్వానికి ఆగస్టు 01 2018లో రూ.25 వేల డీడీని మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు ఇచ్చాను. ఇప్పటికి ఏడేళ్లు అవుతోంది. కనీసం రూపాయి వడ్డీతో కలిపినా రూ.22 వేలతోపాటు అసలు రూ.25 వేలు కలిపితే మొత్తం రూ.47 వేలు వచ్చింది. అయితే టిడ్కో ఇళ్లు ఇవ్వకపోగా చెల్లించిన డిపాజిట్లు తిరిగి ఇవ్వకపోవడంతో నాతోపాటు చెల్లించిన డిపాజిట్దారులు ఇబ్బందులు పడుతున్నారు. – వై నరేష్, లబ్ధిదారుడు, మార్కాపురం -
కనిగిరిలో చేసింది 65 శాతం పనులే..
నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాలుకనిగిరి పట్టణ సమీపంలోని చాకిరాల వద్ద నిర్మించిన 912 టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వీటి కోసం రూ.66 కోట్లు కేటాయించి 65 శాతం పనులు పూర్తిచేశారు. టైల్స్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, ఇతర ప్లంబింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నిర్మాణాలు పూర్తి చేయాలంటే సుమారు రూ.28 కోట్లు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. మిగులు పనులు చేపట్టడంలో చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేసింది. దీంతో టిడ్కో గృహాల నిర్మాణాల వద్ద పిచ్చి చెట్లు పెరిగి పాములు, విష సర్పాలకు నిలయంగా మారాయి. రాత్రి పూట అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పది రోజులుగా హడావుడి చేస్తోంది. టిడ్కో, మున్సిపల్ అధికారులు పరిశీలనలు చేసి.. చిన్న చిన్న పనులు ప్రారంభించారు. -
నేటి నుంచి ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్
ఒంగోలు: ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఈనెల 26వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు బ్రేవ్స్ ఫుట్బాల్ క్లబ్ నిర్వాహకుడు రాజేంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు స్థానిక డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో జిల్లాలోని సీనియర్, జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ప్రథమ విజేతకు రూ.15 వేలు, ద్వితీయ విజేతకు రూ.10 వేలు, తృతీయ విజేతకు రూ.5 వేలు నగదు బహుమతులతోపాటు కప్ అందిస్తారన్నారు. క్రీడాకారులు సోమవారం ఉదయం 9 గంటలకు నిర్ణీత ప్రదేశంలో హాజరు కావాలని కోరారు. కలెక్టర్కు రాష్ట్ర స్థాయి అవార్డు ఒంగోలు సబర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్ ప్రక్రియను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసినందుకు కలెక్టర్ పీ రాజాబాబుకు రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డు కలెక్టర్ అందుకున్నారు. ఉత్తమ ఎన్నికల నిర్వహణతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా ప్రకాశం జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో చేసిన కృషి ఫలితంగానే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేస్తామని పేర్కొన్నారు. మార్కాపురం: మార్కాపురం సబ్ కలెక్టర్గా పని చేస్తున్న మాదాల శివ రామిరెడ్డి రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఎలెక్టోరల్ ఆఫీసర్గా ఆదివారం అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద ద్వారా అవార్డును స్వీకరించారు. అవార్డు అందుకున్న సందర్భంగా సబ్ కలెక్టర్ శివరామిరెడ్డిని పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఒంగోలు టౌన్: అన్నీ వర్గాల ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణాధికారి జి.సత్యనారాయణ చెప్పారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం రీజియన్ ఆధ్వర్యంలో ఒంగోలు బస్ డిపోలో కండక్టర్లు, డ్రైవర్లు, సూపర్వైజర్లు, ఇతర సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీపీఎం మాట్లాడుతూ...లింగ, ప్రాంతం వివక్షలకు తావులేకుండా ఓటును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఘట్టమనేని శ్రీనివాసరావు, పీఓ ఓ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పిచ్చిచెట్లతో నిండిన టిడ్కో సముదాయాలు
గిద్దలూరు పట్టణంలో 2018 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం 1248 మందికి టిడ్కో గృహాలను ఇస్తామని చెప్పి వారి వద్ద నుంచి నగదు వసూలు చేసింది. 300 చదరపు అడుగులు ఉన్న గృహాలను ఒక్కొక్కరి వద్ద రూ.500 చొప్పున డిపాజిట్ చేయించారు. దాదాపు 864 మందిని గుర్తించి నగదును వసూలు చేశారు. సింగిల్బెడ్ రూం కింద 336 మందిని ఎంపిక చేసి రూ.15 వేలు వసూలు చేశారు. అలాగే డబుల్ బెడ్ రూం కింద 45 మంది వద్ద రూ.25 వేల చొప్పున అప్పటి అధికారులు తీసుకున్నారు. మొత్తం 4 కంతుల రూపంలో ఈ వసూళ్లు చేశారు. రూ.500 కట్టిన వారి మొత్తం రూ.4.32 లక్షలు, సింగల్బెడ్ రూం కోసం రూ.89.26 లక్షలు, డబుల్ బెడ్రూం కోసం రూ.97 లక్షలు లబ్ధిదారుల నుంచి వసూలు చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన పనులు పూర్తిచేసి తమకు గృహాలు వస్తాయన్న ఆశతో లబ్ధిదారులు ఎదురు చూసినా ఇంతవరకు వాటిని పట్టించుకోలేదు. ఈనేపథ్యంలో టిడ్కో గృహాల వద్ద కంపచెట్లు, వ్యర్థాలు పెరిగిపోయాయి. విష సర్పాలు సంచరిస్తున్నాయి. -
కలగని మోక్షం!
● పట్టణ ప్రాంతాల్లో అతీగతి లేని టిడ్కో గృహాలు ● 17 నెలలుగా ఆగిన ఇళ్ల నిర్మాణాలు ● పేదలను ఊరిస్తున్న సొంత ఇంటి కల ● గృహాల కోసం లబ్ధిదారుల ఎదురు చూపులు ● పిచ్చిచెట్లు, విషసర్పాలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వైనం కలల సౌథం..పట్టణ ప్రాంతాల్లో గృహాలు లేని పేదల ఆశలు నెరవేరుస్తామని హామీలు గుప్పించిన టీడీపీ ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలమైంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియనే ప్రహసనంగా మార్చిన గత టీడీపీ ప్రభుత్వం.. చివరికి ఒక్కరికి కూడా ఇంటిని మంజూరు చేయలేక చేతులెత్తేసింది. లబ్ధిదారుల వాటా సొమ్ము వసూలు చేయడంలో చూపిన శ్రద్ధ.. ఇళ్లను పూర్తి చేసి పేదలకు అప్పగించడంలో చూపకపోవడంతో నేటికీ మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తగినన్ని నిధులు కేటాయించి పనులు పురోగతిలో ఉండగా ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు మరోసారి గద్దెనెక్కి 18 నెలలైనా టిడ్కో ఇళ్లపై ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిద్దలూరులో టిడ్కో గృహాల చుట్టూ ఏపుగా పెరిగిన చిల్లచెట్లు మార్కాపురం టౌన్/కనిగిరి రూరల్/గిద్దలూరు (బేస్తవారిపేట): పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదల గూటికి చంద్రగ్రహణం పట్టింది. గత ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన స్థలాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకోగా వాటిని తమ ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయ పడిన చంద్రబాబు ప్రభుత్వం.. టిడ్కో ఇళ్ల జోలికి మాత్రం పోలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, కనిగిరి, అద్దంకి, గిద్దలూరుల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి 2017–18 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాటిలో ఒక్క కందుకూరు తప్ప మిగిలిన ఏ ఒక్క చోట గృహాల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అందించిన దాఖలాలు లేవు. డబ్బు చెల్లించిన లబ్ధిదారులకు ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు పట్టణంలోని పేదల కోసం రాజీవ్గృహకల్ప కాలనీ సమీపంలో, చింతల వద్ద 4128 లబ్ధిదారుల కోసం టిడ్కో ఇళ్లకు స్థలాలు కేటాయించి నిర్మాణాలు ప్రారంభించారు. అదేవిధంగా అద్దంకిలో శింగరకొండ అభయాంజనేయస్వామి గుడి సమీపంలో 1094 మందికి, కనిగిరి పట్టణ సమీపంలోని చాకిరాల వద్ద 912 మందికి, గిద్దలూరు పట్టణ పేదల కోసం గిద్దలూరు–కేఎస్పల్లి మధ్య ప్రభుత్వ స్థలంలో 1248 మందికి, మార్కాపురం పట్టణ పేదల కోసం నాగులవరం రోడ్డులో 912 మందికి టిడ్కో ఇళ్లు ప్రారంభించారు. పేదల వద్ద వసూళ్లు.. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులను గుర్తించి వారి వాటాగా నగదు వసూలు చేశారు. ఈమేరకు లబ్ధిదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన టీడీపీ ప్రభుత్వం గృహాలను లబ్ధిదారులకు అందజేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. కేవలం ఎన్నికలు, అధికారం కోసం కూటమి నాయకులు గతంలో ధర్నాలు చేయగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తరువాత టిడ్కో గృహాల వైపు వెళ్లిన దాఖలాలు లేవు. వైఎస్సార్ సీపీ హయాంలో.. ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కార్యక్రమంలో భాగంగా ఒక్క రూపాయికే టిడ్కో గృహాలను కేటాయించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్కే దక్కింది. ఒక్క రూపాయితో పేదలకు ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి కొండంత భరోసా ఇచ్చారు. పేదోడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు తగిన మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. తుది దశ పనులు పూర్తయితే పేదలకు గూడు లభిస్తుంది. కానీ చంద్రబాబు సర్కార్ అలసత్వం వహించడంపై లబ్ధిదారులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. -
అదుపుతప్పి కారు బోల్తా
● నలుగురికి తీవ్ర గాయాలు కురిచేడు(దొనకొండ): పందిని తప్పించే క్రమంలో అదుపుతప్పి కారు బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని బోదనంపాడు వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్కు చెందిన వారు వెలిగండ్ల మండలం రాళ్లపల్లి దగ్గర గుంటెయ్య స్వామి ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు కారు, మరో వాహనంలో వెళుతున్నారు. వీరి వాహనం బోదనంపాడు కొండ వద్దకు రాగానే అడవి పంది అడ్డు రావడంతో తప్పించే క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోతిలో బోల్తా పడింది. ప్రమాదంలో తెల్లగండ్ల గురవమ్మ, మగటి పద్మ, ఎగటి లక్ష్మమ్మ, డేగా వెంకటరమణమ్మ, చిన్నబాబు గోపీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో పైలట్ వెంకటప్పయ్య, ఈఎంటీ యోహాను ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం నరసరావుకు తరలించారు. వీరు నకరిల్లు మండలం నరసింగపాడు గ్రామానికి చెందిన వారు కాగా ఉపాధి రిత్యా హైదరాబాద్లో నివాసం ఉంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు
కంభం: కంభం చెరువులో ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే..ఆదివారం సాయంత్రం 4 గంకటల సమయంలో సుమారు 30 ఏళ్ల వయసున్న వ్యక్తి చెరువులో ఈత కొట్టేందుకు దిగి నీళ్లలో మునిగిపోయాడు. గమనించిన కొందరు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చెరువు వద్దకు చేరుకొని గాలించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో పడవుల్లో కంభం చెరువులో గాలించారు. రాత్రి 8 గంటల వరకు వెతికినా జాడ కనిపించలేదు. అయితే చెరువులోకి దిగిన వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు.పొన్నలూరు: ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోవడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పొన్నలూరు, విప్పగుంట మార్గ మధ్యలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు..వలేటివారిపాలెం మండలం చుండి గ్రామానికి చెందిన ఆదాల గోవిందు వ్యక్తిగత పని మీద తన ద్విచక్ర వాహనంపై పొన్నలూరు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కొంత దూరం వెళ్లిన తరువాత ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి కిందపడిపోయాడు. దీంతో కిందపడిన గోవిందుకు తల, శరీరంపై గాయాలయ్యాయి. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చికిత్స కోసం గోవిందుని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.మార్కాపురం: మార్కాపురం పట్టణంలో ఆదివారం సాయంత్రం రథసప్తమి సందర్భంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవంలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవానికి బందోబస్తు కోసం వచ్చిన రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు విధి నిర్వహణలో భాగంగా ఆదివారం సాయంత్రం రథోత్సవంలో తన సిబ్బందితో భక్తులను అదుపు చేసే క్రమంలో పొరపాటున రథచక్రం రాచర్ల ఎస్సై కాలిని తగిలింది. గాయమైన ఆయన్ను చికిత్స నిమిత్తం ఒంగోలుకు తీసుకువెళ్లారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
● దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి దర్శి: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గ్రామ కమిటీల నిర్మాణంపై మండల పార్టీ అధ్యక్షుడు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ మండల పరిశీలకులు, గ్రామ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలను పూర్తి చేసే విధానం గురించి వివరించారు. ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ కమిటీతో పాటు యువత, మహిళా, రైతు, బీసీ, ఎస్సీ, సోషల్ మీడియా, విద్యార్థి కమిటీలు వేయాలని సూచించారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. అందరూ కలిసికట్టుగా పని చేసి 2029లో జగనన్నను మరోమారు సీఎం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించి అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు. కార్యక్రమంలో దర్శి అసెంబ్లీ పరిశీలకుడు బొట్ల రామారావు, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల కృష్ణారెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, చింతా శ్రీనివాసరెడ్డి, తూము వెంకటసుబ్బారెడ్డి, ఎంపీపీ ఉషా మురళి, జెడ్పీటీసీలు నుసుం వెంకట నాగిరెడ్డి, తాతపూడి రత్నరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మా రెడ్డి, దర్శి పట్టణ అధ్యక్షుడు ముత్తి నీడి సాంబయ్య, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గ బూత్ అధ్యక్షుడు కర్ణాటి ఆంజనేయరెడ్డి, రాష్ట్ర క్రిష్టియన్ సెల్ కార్యదర్శి గుంటు పోలయ్య, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సైదా, పంచాయతీరాజ్ నియోజకవర్గ అధ్యక్షుడు మేరువసుబ్బారెడి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగులమూడి లింగారెడ్డి, మాజీ ఎంపీపీలు వీరగంధం కోటయ్య, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు నిమ్మకాయల రాజయ్య యాదవ్, సాంస్కృతిక విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జక్కుల రామకృష్ణ, జిల్లా బూత్ కమిటీ కార్యదర్శి కటకం శెట్టి శ్రీను, జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి పూనూరి దేవదానం, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, ఉపసర్పంచ్ పులి ప్రసాద్రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలి
● జాతీయ ఓటర్ల దినోత్సవంలో జేసీ గోపాలకృష్ణ ఒంగోలు సబర్బన్: ఓటు హక్కు ప్రాధ్యానతను ప్రజలంతా గుర్తించాలని జేసీ ఆర్.గోపాలకృష్ణ కోరారు. ఆదివారం ఒంగోలు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. జేసీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అధికారులు, విద్యార్థులతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓటర్లను భాగస్వాములను చేయడమే జాతీయ ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి బాధ్యతని అన్నారు. ఓటర్ నమోదు, ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ప్రతి ఏటా జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించడం జరుగుతోందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్న లక్ష్యంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.చినఓబులేసు మాట్లాడుతూ ఓటర్లలో చైతన్యం కోసం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేయడంతో పాటు సీనియర్ ఓటర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఓటర్స్ స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రక్రియలో విశేషంగా కృషిచేసిన బీఎల్ఓలు, రెవెన్యూ అధికారులకు ప్రశంసపత్రాలు అందజేశారు. వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందజేశారు. తొలుత ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ, సంతకాల క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డీఆర్డీఎ పీడీ నారాయణ, ఉద్యానవన శాఖాధికారి గోపీచంద్, జిల్లా ఓటర్ వాచ్ అధికారి వినియోగదారుల సంఘ సభ్యులు నాగేశ్వరరావు, వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రక్రియ ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఓటు హక్కు ఎంతో పవిత్రమైంది ● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: ఓటు హక్కు ఎంతో పవిత్రమైందని, ప్రజాస్వామ్యంలో పాలకులను ఓటు హక్కు ద్వారానే ఎన్నుకుంటారని ఎస్పీ హర్షవర్థన్ రాజు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటుహక్కును వినియోగించుకోవాలని, తద్వారా ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీయువకులను నూతన ఓటరుగా నమోదు చేసి ప్రజా స్వామ్యంలో భాగస్వామ్యులను చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, ఒంగోలు సబ్ డివిజన్ సీఐలు విజయకృష్ణ, శ్రీకాంత్బాబు, నాగరాజు, శ్రీనివాసరావు, ఆర్ఐలు సీతారామిరెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు. -
బీమా.. లేదు ధీమా..!
బేస్తవారిపేట: ప్రమాదాలు, సహజ మరణాల్లో కుటుంబ పెద్దను కోల్పోయిన పేదలకు అండగా ఉండే బీమా పథకం అమలుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నప్పటికీ ఈ బీమా పథకం అమలుపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. రేషన్ కార్డు ఉన్న కుటుంబ పెద్ద ఆకస్మిక, సహజ మరణం పొందినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కలిగించడం కోసం గతంలో ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి నాయకులు అనేక హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక పేదలకు మేలు చేసే పథకాలను నిర్వీర్యం చేశారు. కనీసం బీమా పథకమైనా అమలు చేస్తే కాస్త భరోసా ఉంటుందని పేద ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన వైఎస్సార్ బీమా పథకం పేరును చంద్రన్న బీమాగా మార్చిన కూటమి ప్రభుత్వం.. అమలును మాత్రం గాలికొదిలేసింది. దీంతో సహజ మరణంతో పాటు ప్రమాదవశాత్తూ కుటుంబ పెద్ద మరణించిన కుటుంబాలు రెండేళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయి. అసలు ఈ బీమా పథకం అమలు జరుగుతుందా.. లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్కాపురం జిల్లాలో 3,23,111 రేషన్కార్డులు... నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 3,23,111 తెల్ల రేషన్కార్డులు ఉన్నాయి. వీరంతా దారిద్య్రరేఖకు దిగువనున్నవారే. అంత్యోదయ, తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారంతా చంద్రన్న బీమా పథకానికి అర్హులు. ప్రమాదవశాత్తూ ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని మృత్యువు వెంటాడుతూనే ఉంటుంది. ప్రతి ఏడాది 800 నుంచి 1000 సహజ మరణాలతో పాటు దాదాపు 200 మంది ప్రమాదాల్లో ప్రాణాలు విడుస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రమాదాల వల్ల వందల మంది వైకల్యం బారిన పడి మంచాల్లో మగ్గుతున్నారు. బీమా లేకపోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇలాంటి వారికి బీమా అమలు చేస్తే ఎంతో ఉపశమనం కలిగేదని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పక్కాగా అమలు... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ బీమా పథకాన్ని పక్కాగా అమలు చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదోడికి ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేయూతనందించారు. అధికారులు నేరుగా బాధితుల వద్దకే వెళ్లి బీమా నగదు అందించారు. సవ్యంగా సాగుతున్న ఈ పథకానికి సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రహణం పట్టింది. రూ.10 లక్షల హామీ ఎమైంది..? కూటమి సర్కారు బీమా పథకం నగదును గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చినదానికి రెట్టింపు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించింది. సహజ మరణానికై తే రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షలు ఇస్తామంటూ కూటమి నాయకులు ఎన్నికలప్పుడు ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ముద్రించి ఇంటింటికి పంచారు. అధికారం చేపట్టాక ఎప్పటిలాగే చంద్రబాబు మర్చిపోయారు. 2024 మే 13 నుంచి బీమా పథకం వివరాలను వెబ్సైట్ నుంచి తొలగించారు. ఆ తర్వాత నమోదు చేసేందుకు అవకాశం కల్పించలేదు. అప్పటి నుంచి ఎన్నో బాధిత కుటుంబాలు రోడ్డునపడి బీమా నగదు కోసం ఎదురుచూపులు చూస్తున్నాయి. టీడీపీ, జనసేన సభ్యత్వాలు ఉంటేనే బీమా అంటూ ప్రచారం... పేద ప్రజలందరికీ బీమా అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి మనసు రావడంలేదు. టీడీపీ, జనసేన పార్టీల సభ్యత్వాలు తీసుకుంటేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. పార్టీ సభ్యత్వాలు తీసుకున్నవారికే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ పేద ప్రజలను పక్కన పెట్టేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కార్మికుడు అల్లాబకాష్ రేషన్కార్డు లబ్ధిదారులకు వర్తించని చంద్రన్న బీమా కుటుంబ పెద్దను కోల్పోతే పరిహారం శూన్యం చంద్రన్న బీమాపై స్పష్టత ఇవ్వని కూటమి సర్కారు 2024 మార్చి తర్వాత అమల్లో లేని పథకం ఎన్నికల మేనిఫెస్టోకి మాత్రమే పరిమితం -
బీడీ అడిగాడని మద్యం మత్తులో దాడి
ముండ్లమూరు(దర్శి): మద్యం మత్తులో బీడీ అడిగాడని కత్తితో దాడి చేయడంతో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శనివారం రాత్రి మండల పరిధిలోని ఈదర గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఈదర గ్రామానికి చెందిన కురిచేడు శ్రీనివాసరావు కూలీ పనులుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కట్టెల లోడుకు కూలి పనికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 9:30 గంటల సమయంలో గ్రామ శివారులో మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడ మద్యం తాగతున్న బంధువైన ఆవులమంద రాఘవయ్యను బీడీ ఇవ్వమని అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రాఘవయ్య నిన్ను చంపేస్తాను అంటూ ఇంటికి వెళ్లి కత్తి తీసుకువచ్చి బాబాయి కొట్టి దాటిన తరువాత శ్రీనివాసరావుపై కత్తితో దాడి చేశాడు. ఎడమ పొట్టలో, ఎడమ చేతి మోచేతి వద్ద పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముండ్లమూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
మార్కాపురం: వృద్ధురాలి మెడలో గొలుసు చోరీకి గురైంది. పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి రథ సప్తమి వేడుకలను తిలకించేందుకు కురిచేడు నుంచి వచ్చిన జవ్వాజి రంగ సుబ్బులు అమ్మవారిశాల వద్ద ఉన్న అన్నదానం కౌంటర్ వద్ద ప్రసాదం తీసుకుంటున్న సమయంలో దుండగులు నాలుగు సవర్ల బంగారు గొలుసును చోరీ చేసినట్లు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తప్పిపోయిన పాప తల్లిదండ్రులకు అప్పగింత.. రథసప్తమి వేడుకలను చూసేందుకు తల్లిదండ్రులతో వచ్చిన బాలిక తప్పిపోయింది. శివాజీ నగర్ మొదటి లైన్లో నివాసముండే శ్రీనివాసులు కుమార్తె నీలవేణి స్వామిని చూసేందుకు వచ్చి తప్పిపోయింది. వెంటనే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి వారి చెంతకు చేర్చారు. ● మరొకరికి గాయాలు కొనకనమిట్ల: బైక్ను వెనుక నుంచి కారు అదుపుతప్పి ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన 565 జాతీయ రహదారి కొనకనమిట్ల మండలం పెదారికట్ల సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం గ్రామానికి చెందిన శ్రీరామ్ నాగేంద్రబాబు(35) వృత్తి రిత్యా బేల్దారీ మేస్త్రి. కూలీల కోసం తన స్నేహితుడైన పొదిలి మండలం నందిపాలెం గ్రామానికి చెందిన పోతురాజు ప్రసాద్ను తీసుకొని మోటార్ సైకిల్పై పెదారికట్ల వెళ్లారు. అక్కడ పని పూర్తయిన తరువాత పెదారికట్ల నుంచి పొదిలి వైపు ఇద్దరు మోటార్ సైకిల్పై వస్తున్నారు. కొద్ది దూరం వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న కారు అదుపుతప్పి మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు ఎగిరి కిందపడి గాయపడ్డారు. ఇద్దరిని చికిత్స నిమిత్తం పొదిలి వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నాగేంద్రబాబు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన పోతురాజు ప్రసాదు పొదిలి ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు నాగేంద్రబాబుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉభ్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడు నాగేంద్రబాబు (ఫైల్) వైద్యశాలలో చికిత్స పొందుతున్న పోతురాజు ప్రసాద్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కనిగిరిరూరల్: కారు ఢీకొని యువకుడు పి. శ్రీకాంత్(26) మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కనిగిరిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పొదిలి మండలం పొతవరం సమీపంలోని బాలాజీనగర్కు చెందిన పి.శ్రీకాంత్ పనుల నిమిత్తం కనిగిరికి వచ్చాడు. ఈ క్రమంలో కాశిరెడ్డి కాలనీ సమీపంలో బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా.. పొదిలి వైపు నుంచి కనిగిరివైపు వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో బలమైన రక్తగాయాలయ్యాయి. క్షతగాత్రుడు శ్రీకాంత్ను ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పామూరు: దేవస్థాన భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భుజంగేశ్వరస్వామి ఆలయ ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు అన్నారు. ‘ఎమ్మెల్యే బొమ్మెడదాం దేవుడి భూమి దోచేద్దాం’ అన్న శీర్షికన శనివారం సాక్షిలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఆక్రమణను తక్షణం తొలగించి బాద్యులపై చర్యలు తీసుకోవాలని దేవస్థాన ఈఓను ఎమ్మెల్యే ఆదేశించారు. దీనిపై తహసీల్దార్ ఆర్.వాసుదేవరావు, ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు ఆక్రమణ ప్రాంతానికి వేసిన ఫెన్సింగ్, హద్దురాళ్లను, ఎమ్మెల్యే ఫొటో ఉన్న ఫ్రేమ్ను తొలగించి ఫ్లాట్ను చదునుచేశారు. బాద్యుడైన నరసింహులుపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కురిచేడు: మండలంలో కీచక గురువు వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగుచూశాయి. ఆవులమంద కొత్తూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థినుల పట్ల ఆ పాఠశాలకు అప్పుడప్పుడు డిప్యుటేషన్పై వచ్చే ఉపాధ్యాయుడు గొర్రెపాటి అచ్చయ్య అసభ్యంగా ప్రవర్తించిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు అచ్చయ్య తమను తాకరాని చోటతాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ వారి తల్లిదండ్రులకు విద్యార్థినులు చెప్పారు. దీంతో శుక్రవారం ఎంఈఓ వస్త్రాంనాయక్కు ఫోన్ చేసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, శనివారం మరో ఉపాధ్యాయుడిని ఆ పాఠశాలకు ఎంఈఓ పంపారు. అయితే, ఈ విషయాన్ని ఎంఈఓ ధ్రువీకరించకపోగా, పోలీసులకు కూడా ఎటువంటి ఫిర్యాదు అందలేదు. -
అర్ధరాత్రి ఆర్తనాదాలు
వెదురు కర్ర పొట్టలోకి చొచ్చుకుపోయి మృతిచెంది ట్రావెల్స్ బస్సులో ఇరుక్కుపోయిన జనార్దన్రెడ్డి ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సంఘటన స్థలంలో ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం కొనకనమిట్ల: ట్రావెల్స్ బస్సు అతివేగం కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో అర్ధరాత్రి వేళ ప్రయాణికుల ఆర్తనాదాలతో 565వ నంబర్ జాతీయ రహదారి మార్మోగింది. కొనకనమిట్ల మండలం పెదారికట్ల–చినారికట్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యగారిపల్లికి చెందిన అన్నపురెడ్డి జనార్దన్రెడ్డి (54) అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. గిద్దలూరుకు చెందిన బొలేరో వాహనం కనిగిరి నుంచి వెదురు కర్రల లోడుతో గిద్దలూరు వెళ్తూ పెదారికట్ల దాటి చినారికట్ల సమీపంలోకి వచ్చేసరికి మరమ్మతులకు గురైంది. డ్రైవర్ పీరయ్య బొలేరో వాహనాన్ని రోడ్డు మార్జిన్లో ఆపి లోపల నిద్రపోతున్నాడు. ఆ తర్వాత కొద్ది నిముషాల్లోనే వాసవీ ట్రావెల్స్ బస్సు ప్రొద్దుటూరు నుంచి విజయవాడ వెళ్తూ బొలేరో వాహనాన్ని వెనుకవైపు ఢీకొట్టి అదుపుతప్పి విజయవాడ నుంచి కనిగిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. బొలేరో వాహనంలోని వెదురు కర్రలు ట్రావెల్స్ బస్సు ముందు భాగంలోకి చొచ్చుకెళ్లి ముందు కూర్చుని ఉన్న అన్నపురెడ్డి జనార్దన్రెడ్డి పొట్టలోకి దిగడంతో అక్కడికక్కడే ఆయన మృతిచెందాడు. రెండు బస్సులు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో వాటిలోని డ్రైవర్లతో పాటు ప్రయాణికుల్లో 20 మందికిపైగా గాయాలయ్యాయి. వారిలో 14 మందిని కనిగిరి వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులు బలంగా ఢీకొనటంతో వచ్చిన శబ్దానికి నిద్రలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులంతా చీకట్లోనే ఆర్తనాదాలు పెట్టారు. రెండు బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. కాగా, బొలేరో వాహనంలో పడుకుని ఉన్న డ్రైవర్ పీరయ్య అదృష్టవశాత్తూ ఎటువంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు గంటపాటు శ్రమించిన పోలీసులు, స్థానికులు... ట్రావెల్స్ బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయిన జనార్దన్రెడ్డి మృతదేహాన్ని బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు గంటపాటు శ్రమించాల్సి వచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న కొనకనమిట్ల ఎస్ఐ శ్రీకాంత్ తన సిబ్బందితో పాటు స్థానికులను పిలిపించి పొక్లెయిన్ సాయంతో జనార్దన్రెడ్డి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆర్టీసీ బస్సును పక్కకు తీయించి ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జనార్దన్రెడ్డి వృత్తిరీత్యా కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. భార్య ఉమాదేవి, కుమారుడు హేమంత్ కుమార్రెడ్డి, కూతురు లహరి ఉన్నారు. కుమారుడు, కూతురును విజయవాడలో చదివిస్తున్నాడు. కూరగాయల నగదు వసూలుకు శుక్రవారం రాత్రి విజయవాడకు ట్రావెల్స్ బస్సులో బయలుదేరి మార్గం మధ్యలోనే మృతి చెందాడు. అతని సోదరులు వాసుదేవరెడ్డి, పురుషోత్తంరెడ్డి, బంధువులు, స్నేహితులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న జనార్దనరెడ్డిని చూసి భోరున విలపించారు. బ్రహ్మంగారిమఠం ఎంపీపీ నాగేశ్వరరెడ్డి, మైదుకూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్నపురెడ్డి శ్రీమన్నారాయణరెడ్డి, తదితరులు చేరుకుని మృతుడి కుమారుడు, కుమార్తెను ఓదార్చారు. కనిగిరి ఆస్పత్రిలో చేరిన 14 మంది క్షతగాత్రులు... కనిగిరి రూరల్: రెండు బస్సుల్లో గాయపడిన 14 మందిని కనిగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేశారు. వారిలో గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాలకు చెంది ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న గౌతమి, గౌసియా, అయిషా, హుస్సేన్బీ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతుండగా, మిగిలిన వారు చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. కనిగిరి ప్రభుత్వాస్పత్రిలో చేరిన క్షతగాత్రుల్లో గౌతమి (ప్రొద్దుటూరు), బీ పావని (గుంటూరు), ఎస్కే గౌసియా (కర్నూలు), ఎల్.భాస్కర్ (మిట్టపల్లి), ఎస్కే ఆషా (గుంటూరు), ఎస్కే హుస్సేన్బీ (గుంటూరు), ఎస్కే షంషీర్ (కనిగిరి), జీ బాలకొండయ్య (గానుగపెంట, కనిగిరి), కే వెంకటరెడ్డి (కనిగిరి), బండారు రవి (హుస్సేన్పురం), ఎం.జయంతి (ప్రొద్దుటూరు), కే జయరావు (గానుగపెంట, కనిగిరి), రేణుక (చాకిచర్ల), ఎంవీ సుబ్బారెడ్డి (ముద్దపాడు, పీసీ పల్లి) ఉన్నారు. వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు, మరికొందరు ఇళ్లకు వెళ్లారు. ట్రావెల్స్ బస్సు అతివేగంతో ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న బొలేరో వాహనంతో పాటు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన వైనం ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికుడు మృతిచెందగా, రెండు బస్సుల్లోని డ్రైవర్లు, పలువురికి గాయాలు అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో మిన్నంటిన ప్రయాణికుల రోదనలు -
శ్రీశైలం ఘాట్లో రోడ్డు ప్రమాదం
పెద్దదోర్నాల: అదుపు తప్పిన మోటారు సైకిల్ కొండను ఢీకొనడంతో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీశైలం ఘాట్ రోడ్డులోని చింతల గిరిజనగూడెం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చింతల ఆశ్రమ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న వై.ఆంటోని బాబు మృతి చెందారు. సమాచారం అందుకున్న ఏఎస్సై పోలురాజు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. చింతల ఆశ్రమ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఆంటోని బాబు నిత్యం మోటారు సైకిల్పై విధులకు హాజరవుతారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లే క్రమంలో ఘాట్ రోడ్డులోని ఓ మలుపు వద్ద మోటారు సైకిల్ అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. తలకు పెట్టుకున్న హెల్మెట్ తొలగిపోయి తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలో పడి ఉన్న ఆంటోని బాబును సమాచారం అందుకున్న 108 సిబ్బంది చేరుకుని పరీక్షించగా, అప్పటికే మృతి చెందాడు. ఆశ్రమ పాఠశాలకు కొద్ది దూరం ముందే ప్రమాదం చోటుచేసుకోవటంతో సంఘటన స్థలానికి చేరుకున్న సహచర ఉపాధ్యాయులు నిర్జీవంగా ఉన్న ఆంటోని బాబును చూసి కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్సై పోలురాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆంటోని బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య కవిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదుపుతప్పి కొండను ఢీకొన్న మోటారు సైకిల్ చింతల ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు ఆంటోని మృతి -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గంలో నియామకాలు
ఒంగోలు సిటీ/మార్కాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర కార్యవర్గంలో పదవులు కేటాయించారు. ఒంగోలుకు చెందిన దామరాజు క్రాంతికుమార్, మార్కాపురం మండలం వేములకోటకు చెందిన ఏరువ ఆంజనేయరెడ్డి, కనిగిరికి చెందిన గుంటగాని అబ్రహాం (అభి)లను రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమించారు. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఒంగోలు నియోజకవర్గానికి చెందిన దేవరపల్లి అంజిరెడ్డిని నియమించినట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. తమకు పదవులు రావడానికి కారణమైన రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ.సుబ్బారెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, మార్కాపురం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఒంగోలు ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. -
అనుమానాస్పద మృతిపై చెలరేగిన వివాదం
కొమరోలు/మార్కాపురం: మండల కేంద్రమైన కొమరోలులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందడంపై పశ్చిమ బెంగాల్లో ఆందోళనలు చెలరేగాయి. కొమరోలులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వీధిలో ఉన్న మహీ ఫ్యాషన్స్ బొటెక్లో ఈనెల 1వ తేదీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మొంజుల రామ్ లస్కార్ (43) పనికి కుదిరాడు. ఈనెల 1వ తేదీ బొటెక్లో పని నిమిత్తం కంభం నుంచి కొమరోలుకు వచ్చాడు. గత 20 రోజులుగా జాకెట్లకు, చీరలకు డిజైన్ వర్క్ చేస్తూ బొటెక్లోనే ఉండసాగాడు. ఈనెల 19వ తేదీ లస్కార్ రాత్రి మద్యం తాగి దుకాణంలో ఉన్న చీరలను బ్యాగ్లో సర్ది పారిపోయే యత్నం చేస్తూ మెయిన్ రోడ్డుపై కిందపడ్డాడు. స్థానికులు చూసి దుకాణ యజమానికి సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడికి చేరుకుని లస్కార్ను దుకాణానికి తరలించాడు. 20వ తేదీ ఉదయం లస్కార్ దుకాణంలోనే మృతిచెంది ఉండడాన్ని గమనించిన దుకాణ యజమానులు వెంటనే ఆ సమాచారాన్ని అతని బంధువులకు, స్థానిక పోలీసులకు తెలిపారు. ఎస్సై నాగరాజు దుకాణం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ బెంగాల్లో చెలరేగిన వివాదం లస్కార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా పశ్చిమ బెంగాల్ వాసి కావడంతో అతని బంధువులు అక్కడి నుంచి కొమరోలుకు చేరుకుని గిద్దలూరుకు ఈనెల 21వ తేదీ పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులు పశ్చిమ బెంగాల్కు తీసుకెళ్లారు. లస్కార్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండడం, బంధువులకు అతని మృతిపై అనుమానాలు ఉండడంతో అనుమానాస్పద మృతిని ఛేదించాలంటూ అక్కడ ఆందోళన చేపట్టారు. హత్యకేసుపై నిస్పక్షపాత దర్యాప్తు: సబ్కలెక్టర్ శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు వెల్లడి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ఉత్తర బిష్ణుపూర్ జిల్లా 24 పరగణాలలోని మగ్రహత్ 1 ప్రాంతానికి చెందిన మొంజుల రామ్ లస్కార్ అనే వ్యక్తి మార్కాపురం జిల్లా కొమరోలులో ఈనెల 20న అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతోందని మార్కాపురం ఇన్చార్జి సబ్కలెక్టర్ శివరామిరెడ్డి, డీఎస్పీ యూ నాగరాజు వెల్లడించారు. స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మృతుడు మొంజుల రామ్ లస్కార్ తన మిత్రులతో కలిసి నాలుగేళ్ల క్రితం కంభం వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో మగ్గం పనులు చేస్తూ జీవిస్తున్నాడన్నారు. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీ నుంచి లస్కర్ కొమరోలు టౌన్లోని మహీ ఫ్యాషన్ షాప్నకు వచ్చి అక్కడ మహేశ్వరి వద్ద మగ్గం పనులు చేసే పనిలో కుదిరాడని చెప్పారు. అయితే ఈనెల 19న ఉదయం లస్కార్ మద్యం తాగి భోజనం కూడా సరిగా చేయకుండా తిరిగాడని, అదే రోజు రాత్రి తన గదిలో పడుకొని నిద్రపోయాడని, మరుసటిరోజు అనగా ఈనెల 20న ఉదయం నిద్రలేవకపోయేసరికి షాపు ఓనరు మహేశ్వరికి అనుమానం వచ్చి తన భర్తకు విషయం చెప్పిందన్నారు. దీంతో లస్కార్ను లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారన్నారు. ఈ సంఘటనపై మృతుని స్నేహితుడు సద్దాం హుస్సేన్ పోలీసు స్టేషన్లో రామ్ లస్కార్ మరణంపై విచారణ జరపాలని ఫిర్యాదు చేయడంతో 21న మృతదేహానికి మెడికల్ ఆఫీసర్ పోస్టుమార్టం నిర్వహించి శరీరంలోని ఆర్గాన్స్ని నిపుణుల అభిప్రాయాల నిమిత్తం భద్రపరిచినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుడు అతిగా మద్యం తాగడం వలన గొంతు ఎండిపోయిగానీ లేక గుండెపోటుతో గానీ చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని వారు తెలిపారు. -
రిపబ్లిక్ డే, రథ సప్తమి ఘనంగా నిర్వహించండి
● జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మార్కాపురం: ఈనెల 25న మార్కాపురంలో జరిగే రథసప్తమి, ఓటర్ల దినోత్సవం, 26న జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సబ్కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. అదేరోజున మార్కాపురంలో జరిగే రథ సప్తమి వేడుకలను కూడా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి స్వామివారి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. రథోత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, అగ్నిమాపక, పోలీసు అధికారులను ఆదేశించారు. వేల సంఖ్యలో భక్తులు వస్తున్న దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ వైర్ల విషయంలో స్వామివారి రథం తిరిగే సమయంలో విద్యుత్శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లా ఏర్పడిన తరువాత మొదటి సారి జరుగుతున్న రిపబ్లిక్డే వేడుకలను రికార్డు స్థాయిలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావివ్వవద్దని, వేడుకలను చూసేందుకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని జేసీ ఆదేశించారు. సమీక్షలో సబ్కలెక్టర్ శివరామిరెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, తహశీల్దార్ చిరంజీవి, కమిషనర్ నారాయణరావు, ఏఈఎస్ బాలయ్య, ఫైర్ ఆఫీసరు రామకృష్ణ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026
నగరాభివృద్ధికి ఎంతో కీలకమైన సమావేశం..ప్రజలకు చేయాల్సిన సేవలు, రాబడులు, ఖర్చులు వీటన్నింటిపై లోతుగా చర్చించాల్సిన బడ్జెట్ సమావేశాన్ని మొక్కుబడిగా నిర్వహించి మ..మ అనిపించారు. ఒంగోలు నగరపాలక సంస్థ బడ్జెట్ అంతా అంకెల గారడీగా మారిపోయింది. లోటు రూ.31 కోట్లు..అప్పులు రూ.10 కోట్లుగా చూపించారు. గ్రాంట్ల ద్వారా రూ.75 కోట్లుగా లెక్కలు చూపించారు. మొత్తంగా రూ.247 కోట్ల బడ్జెట్కు సంబంధించిన సమావేశం కేవలం కనీస చర్చ జరపకుండా కేవలం 20 నిమిషాల్లో ముగించేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఒంగోలు నగర పాలక సంస్థ 2026–27 బడ్జెట్ అంచనాల్లో అంతా అంకెల గారడీగానే ఉందని స్పష్టమవుతోంది. ఖర్చులు, రాబడి సంగతి పక్కన పెట్టి అప్పులు చూపించి అధికార పార్టీ నేతలు జబ్బులు చరుచుకున్నారు. బడ్జెట్ అంచనాలు మాత్రం రూ.247 కోట్లు చూపించారు. కానీ అందులో లోటు బడ్జెట్ రూ.31 కోట్లు ఉంది. హడ్కో రుణం రూ.5 కోట్లు, యూఐడీఎఫ్ రుణం మరో రూ.5 కోట్లు ఉంది. అంటే మొత్తం కలుపుకుంటే రూ.41 కోట్లు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు దాదాపు రూ.75 కోట్లు ఉన్నాయి. అన్నీ కలుపుకుంటే రూ.116 కోట్లు. ఒంగోలు నగర పాలక సంస్థ సంవత్సర ఆదాయం రూ.78 కోట్లు. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్(ఖర్చులు) మాత్రం రూ.120 కోట్లకు పైమాటే. రాని ఆదాయాన్ని చూపించి వస్తుందని నమ్మించే ప్రయత్నం మాత్రం స్పష్టంగా చేశారు. కొండ కింద ఉన్న ఐడీఎస్ఎంఎల్టీ ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.15 కోట్ల ఆదాయం కార్పొరేషన్కు వస్తుందని చూపించారు. ఈ ప్లాట్ల వ్యవహారం కొన్నేళ్లుగా పెండింగ్లోనే ఉంది. ఈ విధంగా రాని ఆదాయాలను మరికొన్నింటిని కూడా చూపించి అంకెల గారడీకి తెరలేపారు.సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం తూ..తూ మంత్రంగా సాగింది. పేరుకేమో రూ.247 కోట్ల బడ్జెట్...కానీ దాని సాధ్యాసాధ్యాలపై కనీసం అరగంట కూడా చర్చ జరగలేదు. అంటే ప్రజా సమస్యల పరిష్కారంపై టీడీపీ కూటమి పాలకులకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో ఈ సమావేశం జరిగిన తీరు బట్టి తెలుస్తోంది. నగర మేయర్ సుజాత అధ్యక్షతన శుక్రవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాలులో అత్యవసర, 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలతో కూడిన సమావేశం నిర్వహించారు. అయితే బడ్జెట్ విషయం మాత్రం పక్కదారి పట్టి పరనింద...పెదబాబు, చిన బాబు భజనలతోనే సరిపెట్టారు. బడ్జెట్ సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హైజాక్ చేశారు. టీడీపీ కార్పొరేటర్లు సైతం బడ్జెట్ అంశాన్ని పక్కన పెట్టేశారు. బడ్జెట్పై చర్చనే ప్రారంభించలేదు. బడ్జెట్పై సభ్యుల అభిప్రాయాలు చెప్పకముందే మేయర్ సుజాత ఎంపీ, ఎమ్మెల్యేలకు బయట కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాళ్లు ప్రసంగిస్తారు అని ప్రకటించారు. దాంతో అసలు విషయం పక్కకు పోయింది. వారి ప్రసంగాలు పూర్తికాగానే రాష్ట్ర మంత్రి నారా లోకేష్(చిన బాబు) పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేక్ చేయటానికి ఎంపీ, ఎమ్మెల్యే పైకి లేవగానే మేయర్ సుజాత మాత్రం బడ్జెట్ ఆమోదించినట్లు ప్రకటించి వేదిక మీద నుంచి కిందకు దిగేశారు. దీంతో సమావేశ హాలులో ఉన్న కార్పొరేటర్లు అవాక్కయ్యారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు చిన బాబు పుట్టినరోజే ముఖ్యంగా భావించి వేడుకలు జరుపుకున్నారు. కనీస చర్చ జరగకుండా కౌన్సిల్లో బడ్జెట్ ఆమోదం అంటూ ప్రకటించిన మేయర్ పై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. తూ..తూ మంత్రంగా సమావేశం జరగటంపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కార్పొరేటర్, పార్టీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 20 నిమిషాల్లోనే బడ్జెట్ సమావేశం ముగింపు: రూ.247 కోట్ల అంచనాలతో కూడిన ఒంగోలు నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం కేవలం 20 నిమిషాల్లోనే ముగించారు. అసలు బడ్జెట్పై చర్చే నిర్వహించలేదు. సమావేశంలో మాట్లాడుతున్న జనసేన కార్పొరేటర్ ఈదర సురేష్ బాబు (చిన్నారి)ని మధ్యలోనే ప్రసంగం ఆపించిన మేయర్ సుజాత రాష్ట్ర మంత్రి చిన బాబు లోకేష్ పుట్టిన రోజు వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరీ సమావేశాన్ని ముగించారు. చినబాబు మీద ఉన్న ప్రేమ ఒంగోలు నగర ప్రజలపై లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ కూటమిలోని జనసేన కార్పొరేటర్లు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు. రూ.14.21 కోట్ల మిగులు బడ్జెట్తో... ఒంగోలు నగర పాలక సంస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.14.21 కోట్ల మిగులు బడ్జెట్లో కౌన్సిల్ బలవంతంగా ఆమోదం పొందింది. 2025–26 సంవత్సరానికి సవరించిన అంచనాల బడ్జెట్ ప్రకారం రూ.86.06 కాగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల ప్రారంభ నిల్వ రూ.46.44 కోట్లుగా ఉంది. 2025–26 సవరించిన బడ్జెట్ అంచనాల్లో మొత్తం జమలు రూ.138.96 కోట్లు కాగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల మొత్తం జమలు రూ.200.77 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఖర్చులు రూ.178.54 కోట్లు కాగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.223 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేశారు. చివరకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి మిగులు రూ.46.44 కోట్లుకాగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.14.21 కోట్లుగా చూపించారు. అంటే మిగులును కూడా మిగిల్చకుండా తినేశారన్నది స్పష్టమవుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు దాదాపు రూ.45 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. వాటి ప్రస్తావనే లేకుండా బడ్జెట్ను ప్రవేశపెట్టడం అత్యంత దారుణంగా మారింది.వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒంగోలు నగర పాలక సంస్థ ఆదాయం దిశగా అడుగులు ముందుకు వేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మిగులు నగదు రూ.80 కోట్లు ఉంది. అదే టీడీపీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సీఎంగా వచ్చిన తరువాత 2025–26 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి రూ.51 కోట్లకు పడిపోయింది. అది కాస్తా 2026–27 సంవత్సరానికి వచ్చేసరికి మరీ దిగజారిపోయింది. ఈ బడ్జెట్ మాత్రం ఒంగోలు నగర పాలక సంస్థకు ఒక శాపంలా తయారయిందనే చెప్పాలి. భవిష్యత్తులో అప్పులు, బిల్లులు, బకాయీలు పెరిగే మాదిరిగా ఈ బడ్జెట్ ఉందని సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. చివరకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించి ఆర్థిక క్రమశిక్షణ లోపించేలా బడ్జెట్ను రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దేవుడి భూమి దోచేద్దాం
ఎమ్మెల్యే బొమ్మెడదాం పామూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దరిమిలా టీడీపీ నేతల భూకబ్జాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. పోరంబోకు భూములను ఎక్కడికక్కడ చదును చేసి తమ అనుభవంలో ఉంచుకుంటున్న కొందరు టీడీపీ నాయకులు.. ఖాళీగా ఉన్న దేవదాయ శాఖ భూములపైనా కన్నేశారు. పామూరులోని నెల్లూరు రోడ్డులో సర్వే నంబర్ 439/5లోని 1.97 ఎకరాల దేవదాయ శాఖ భూమిని టీడీపీకి చెందిన ఓ నాయకుడు ఆక్రమించి ఫెన్సింగ్ వేశాడు. అంతటితో ఆగకుండా తన జోలికి ఎవరూ రాకూడదని హెచ్చరికగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఫొటోను ట్రంప్ కార్డ్లా వాడటం చర్చనీయాంశమైంది. ఆక్రమిత భూమిని పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్న దేవదాయ శాఖ ఈఓ నరసింహబాబు, వీఆర్ఓ సరస్వతి, ఇతర సిబ్బంది.. ఫెన్సింగ్ రాయిపై ఎమ్మెల్యే ఉగ్ర ఫొటోను చూసి అవాక్కయ్యారు. కాగా దేవదాయశాఖ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలుతీసుకుంటామని ఈఓ హెచ్చరించారు. ఆక్రమణ తొలగింపులో రాజీ పడేది లేదని, రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. ఈ ఆక్రమణ దందాకు ఎమ్మెల్యే ఫోటోను వినియోగించడం పామూరు మండలంలో హాట్ టాపిక్గా మారింది. ఆక్రమిత భూమిలో ఫెన్సింగ్ రాయిపై ఎమ్మెల్యే ‘ఉగ్ర’ ఫొటో ఏర్పాటు పామూరు మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన భూదందా ఎండోమెంట్ భూములను పరిశీలించిన ఆర్డీఓ కేశవర్థన్రెడ్డి -
వివాదాస్పద భూమి పరిశీలన
పామూరు నుంచి కోడిగుడ్లపాడు వెళ్లే రోడ్డులో సర్వే నంబర్ 266/7లోని 3.67 ఎకరాల భూమి తమదని ఓ వ్యక్తి ఇటీవల గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చాడు. ఇది దేవదాయశాఖ భూమి సంబంధిత అధికారులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్డీఓ కేశవర్థన్రెడ్డి స్థానిక తహసీల్దార్ రామచంద్రుని వాసుదేవరావుతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఆలయ ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు ఆలయ భూములకు చెందిన ఎఫ్ఎల్ఆర్, పాస్బుక్, 1–బి, అడంగల్, 43 రిజిస్టర్ లాంటి కీలకమైన అధికారిక రికార్డులు విచారణ సమయంలో ఆర్డీఓకు సమర్పించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కాగా.. ఆలయ భూములు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ కేశవర్ధన్రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. -
58 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
పామూరు: డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరి దుకాణాలపై శుక్రవారం ఒంగోలు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వారి వద్ద నుంచి 58 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 6ఏ కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... పామూరులో డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నట్లు ఒంగోలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కొల్లి శ్రీనివాసరావుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఒంగోలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు రవిబాబు, రాఘవరావు, డీసీటీ రామారావు, ఎస్సై నాగేశ్వరరావు, సివిల్ సప్లయిస్ డీటీ రాఘవేంద్ర భూపతి ఆధ్వర్యంలో రెండు దుకాణాలపై దాడులు నిర్వహించారు. పామూరులోని కనిగిరి రోడ్డులో శ్రీమణికంఠ ప్రొవిజన్స్ అండ్స్ ఫ్యాన్సీషాప్లో అనుమతులు లేకుండా యజమాని గుంటూరు నారాయణ అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లను నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సోదాలు చేశారు. ఆ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 21 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసి స్థానిక ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వారికి అప్పగించారు. సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నందుకు బాధ్యుడైన గుంటూరు నారాయణపై చర్య నిమిత్తం 6ఏ కేసు నమోదు చేశారు. అదేవిధంగా విరువూరురోడ్డుకు చెందిన రామారావు అనే వ్యక్తి కోడిగుడ్ల దుకాణంలో అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లు నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన వివిధ కంపెనీలకు చెందిన 37 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసి వాటిని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ, పామూరు వారికి అప్పగించారు. సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచిన రామారావుపై చర్య నిమిత్తం 6ఏ కేసు నమోదు చేశారు. ఎవరైనా, ఎక్కడైనా అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటిపై తమకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. ● జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మార్కాపురం రూరల్(మార్కాపురం టౌన్): ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని, నిర్భయంగా ఓటు వేయాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం సాయంత్రం సబ్కలెక్టరు కార్యాలయంలో అధికారులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఇన్చార్జి సబ్కలెక్టర్ శివరామిరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి, కమిషనర్ నారాయణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా స్వామ్యంలోని పౌరులందరూ ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని ఎంపీడీఓ బాలచెన్నయ్య అన్నారు. శుక్రవారం ఎంపీడిఓ కార్యాలయంలో 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎల్ఓ, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. మార్కాపురం: మార్కాపురం డివిజన్ మైనింగ్ ఏడీగా ఎస్పీకే మల్లేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ గా పని చేస్తున్న ఎస్పీకే మల్లేశ్వరరావును పదోన్నతిపై మార్కాపురం జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్గా నియమిస్తూ మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఇద్దరిపై 6ఏ కేసు నమోదు -
రోడ్డు ప్రమాదాలు నివారించాలి
ఒంగోలు సబర్బన్: రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా వాటిని నియంత్రించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన స్థానిక ప్రకాశం భవనంలో రహదారి భద్రతపై జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటికి దారి తీసిన పరిస్థితులు, నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ వి.హర్షవర్థన్రాజుతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 22 ప్రాంతాలను గుర్తించినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రహదారి భద్రతకు సంబంధించిన వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నెలరోజులపాటు ప్రత్యేక విజిలెన్స్ ఉండాలన్నారు. స్పీడ్ గన్స్ ద్వారా వాహనాల వేగాన్ని గమనించి పరిమితికి మించిన స్పీడుతో వెళ్తున్న వాహనాలకు జరిమానా విధించాలన్నారు. జిల్లాలో రోడ్డు భద్రతకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు అవసరమైన సత్వర వైద్య సహాయంతో పాటు వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఐరాడ్ యాప్ను సమర్థంగా వినియోగించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారుల్లో బ్లాక్ స్పాట్స్పై దృష్టి సారించాలన్నారు. జాతీయ రహదారుల్లో సర్వీస్ రోడ్లు కలుస్తున్న చోట ప్రమాదాల నివారణకు మిర్రర్లు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ బ్రేకర్లు వంటివి ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ నెల 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు బాధ్యతగా పనిచేస్తామంటూ సమావేశంలో పాల్గొన్న అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో డీటీసీ సుశీల, మార్కాపురం ఆర్టీవో శ్రీచందన, రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ రవినాయక్, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ శ్రీనివాసనాయక్, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సత్యనారాయణ, జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రహదారి భద్రత జిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజాబాబు -
బ్యారన్ దగ్ధం, రూ.5 లక్షల నష్టం
వలేటివారిపాలెం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం బ్యారన్ దగ్ధమైంది. అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ఆవుల నరేష్ పొగాకు బ్యారన్లో క్యూరింగ్ చేస్తుండగా అల్లుడు కర్ర జారి మొద్దు గొట్టంపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బ్యారన్ మొత్తం వ్యాపించాయి. కందుకూరు అగ్నిమాపక అధికారులకు నరేష్ సమాచారం ఇవ్వగా అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పొగాకు బ్యారన్ మొత్తం కాలిపోయింది. బ్యారన్లో ఉన్న ఆకుతో పాటు మొద్దు గొట్టం, టైర్లు, అల్లుడు కర్ర పూర్తిగా కాలిపోవడంతో రూ.5 లక్షల సష్టం వాటిల్లినట్లు నరేష్ వాపోయాడు. కంభం: తనకు దొరికిన బంగారు చెవి బుట్టలను ఉపాధ్యాయుల చేతికిచ్చి రావిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని నిజాయితీ చాటుకుంది. వివరాలు.. రావిపాడు జెడ్పీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న వీరిశెట్టి ప్రణవి మూడు రోజుల క్రితం పాఠశాలలో బంగారు చెవి బుట్టలు పోగొట్టుకుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంత వెతికినా కనిపించలేదు. శుక్రవారం ఉదయం పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని హఫీఫా కు ఆ వస్తువు దొరకగా ఉపాధ్యాయులకు అందజేసింది. విషయం తెలుసుకున్న ప్రణవి తండ్రి హఫీఫాకు పంజాబీ డ్రస్ బహుమతిగా ఇచ్చి అభినందించాడు. విద్యార్థిని నిజాయితీని హెచ్ఎం సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు ప్రశంసించారు. గుడ్లూరు: కులం పేరుతో దూషించారని గుడ్లూరు పోలీస్ స్టేషన్లో గురువారం నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం విచారణ చేపట్టారు. మండలంలోని చినలాటరఫి పంచాయతీ ఆర్సీ అగ్రహారం గిరిజన మహిళ కొమరగిరి గోవిందమ్మకు సర్వే నంబర్ 805లో 3 ఎకరాల 2 సెంట్ల అసైన్ భూమి ఉంది. ఆ భూమి విషయంలో అదే గ్రామానికి చెందిన పొన్నగంటి కొండయ్య, వారి బంధువులు కులం పేరుతో తనను దూషించారని గోవిందమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీనిపై డీఎస్పీ విచారణ నిర్వహించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. డీఎస్పీ వెంట గుడ్లూరు ఎస్సై వెంకట్రావు ఉన్నారు. ● రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం మార్కాపురం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైన సంఘటన మార్కాపురం మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. చెన్నారెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో నివాసముండే మురారి శ్యామల ఇంట్లో విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో గృహోపకరణాలు, ఇతర సామగ్రి మొత్తం కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. కట్టుబట్టలతో మిగిలిన శ్యామల.. కాలిపోయిన ఇంటిని చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేసింది. మార్కాపురం: మార్కాపురం పట్టణ శివారులోని వై.జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం జామాయిల్ తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి మంటలను అదుపుచేశారు. తోటలో కొంతమేర చెట్లు కాలిపోయాయని, సుమారు రూ.10 వేల నష్టం వాటిల్లిందని చెప్పారు. -
బస్సు ఢీకొని భర్త మృతి, భార్యకు గాయాలు
అద్దంకి రూరల్: స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను ఎదురుగా వచ్చిన స్కూల్ బస్సు ఢీకొట్టడంతో భర్త మృతిచెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అద్దంకి మండలంలోని దర్శి రోడ్డులో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల మేరకు.. ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లుకు చెందిన తప్పెట చిన్న (40), అతని భార్య రాజమ్మ ఒంగోలులో నివాసం ఉంటున్నారు. శుక్రవారం స్కూటీపై ఉల్లగల్లు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా మార్గం మధ్యలో అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం సమీపంలో ఇటుక బట్టీల వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న తప్పెట చిన్న అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య రాజమ్మకు తీవ్రగాయాలవడంతో 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. టంగుటూరు: మద్యం మత్తులో వ్యక్తిపై దాడి చేసిన సంఘటన మండలంలోని కొణిజేడు గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొణిజేడు గ్రామానికి చెందిన రామా రవి, బాలినేని బాలిరెడ్డి స్నేహితులు కాగా, ఇద్దరూ గురువారం రాత్రి 10 గంటలకు ఊరి చివర పొగాకు బ్యారన్ల వద్ద మందు తాగారు. రామా రవి మందుకి డబ్బులు అడగ్గా.. బాలిరెడ్డి డబ్బులు లేవన్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. రామా రవి అతని చేతిలో ఉన్న బీరు బాటిల్తో బాలినేని బాలిరెడ్డిపై దాడి చేశాడు. బాలిరెడ్డి చాతి పక్క, కుడి చేయి మణికట్టు వద్ద గాయమైంది. అనంతరం రవి వెళ్లిపోగా, మద్యం మత్తులో ఉన్న బాలిరెడ్డి తెల్లవారేంత వరకూ అక్కడే పడి ఉన్నాడు. దీంతో తీవ్ర రక్త స్రావమైంది. తెల్లవారుజామున రామా వెంకట్రావు అనే వ్యక్తి గమనించి ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. బాలినేని బాలిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు. -
భర్తకు బెయిలిప్పించి మరీ.. యమపురికి!
పెద్దారవీడు: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణం, ఎక్కడ తనను భర్త అంతమొందిస్తాడోనన్న భయంతో కట్టుకున్నవాడినే కాటికి పంపంది ఆ మహిళ. గంజాయి కేసులో జైలుకెళ్లిన భర్తకు బెయిల్ ఇప్పించి మరీ కిరాయి హంతకులతో కలిసి పథకం ప్రకారం హత్యకు పాల్పడింది. ఇందుకు సొంత తమ్ముడితోపాటు సన్నిహితుడి సహకారం తీసుకుంది. పెద్దదోర్నాలకు చెందిన యువకుడు లాలూ శ్రీను మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ విషయాలు వెలుగుచూశాయి. హత్య జరిగిన రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. మొత్తం ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని కటకటాల్లోకి నెట్టారు. శుక్రవారం పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హత్య కేసు పూర్వాపరాలను డీఎస్పీ యు.నాగరాజు వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. పెద్దదోర్నాలకు చెందిన అడపాల లాలూ శ్రీను లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో పేకాటకు అటవాటు పడి డబ్బు నష్టపోయాడు. పోగొట్టుకున్న సొమ్ము రాబట్టుకునేందుకు గంజాయి వ్యాపారం ప్రారంభించాడు. ఇదిలా ఉండగా పెద్దదోర్నాలో మెకానిక్ షాపు నడుపుతున్న మృతుడి బావమరిది అశోక్కుమార్ వద్దకు సూర్యనారాయణ అనే వ్యక్తి తరచూ వచ్చేవాడు. పక్కనే కూల్డ్రింక్ పాపు నిర్వహిస్తున్న అశోక్ సోదరి ఝాన్సీతోనూ పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి చర్యలను గమనించిన లాలూశ్రీను భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో గంజాయితో పట్టుబడిన లాలూశ్రీను జైలుకు వెళ్లాడు. తనపై కోపంగా ఉన్న భర్త జైలు నుంచి బయటకు వస్తే చంపేస్తాడని ఆందోళన చెందిన ఝాన్సీ, సన్నిహితుడు సూర్యనారాయణ, సోదరుడు అశోక్కుమార్తో కలిసి హత్యకు పథకం రచించింది. భర్తను అంతమొందించేందుకు గుంటూరుకు చెందిన కిరాయి హంతకులు పార్థు, శంకర్కు రెండు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చింది. ఒంగోలు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న భర్త లాలూశ్రీనుకు బైయిల్ వచ్చేలా చేయడంతోపాటు అతడిని కారులో దోర్నాలకు తెచ్చేలా ఏర్పాట్లు చేశారు. తొలుత చీమకుర్తి వద్ద శ్రీనును హతమార్చాలని చూసినా అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. మార్గమధ్యంలో పెద్దారవీడు సమీపంలోని అంకాలమ్మ గుడి వద్దకు రాగానే మూత్ర విసర్జన వంకతో కారు ఆపారు. ఆ తర్వాత శ్రీను కళ్లల్లో కారం చల్లి, రాళ్లు, కత్తులతో దారుణంగా హతమార్చారు. నిందితులు ఝాన్సీ, అశోక్కుమార్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. సమావేశంలో త్రిపురాంతకం సీఐ హసన్, ఎస్సై సాంబశివయ్య పాల్గొన్నారు. పెద్దదోర్నాల యువకుడు శ్రీను హత్యలో భార్య, బావమరిది హస్తం మరో వ్యక్తితో భార్య సన్నిహితంగా ఉండటాన్ని ప్రశ్నించిన భర్త భర్తను హతమార్చేందుకు ఇద్దరికి రూ.2 లక్షల సుపారీ గంజాయి కేసులో జైలుకెళ్లిన భర్తకు బెయిల్ ఇప్పించిన భార్య పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు హత్య కేసు వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు -
సరుగుడు తోట ధ్వంసం
కందుకూరు రూరల్: సరుగుడు తోటను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన సంఘటన కందుకూరు మండలంలోని పాలూరు గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం.. పాలూరు గ్రామానికి చెందిన సూరే రాధమ్మకు ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల పక్కనే మూడు ఎకరాల భూమి ఉంది. అందులో రెండేళ్ల క్రితం సరుగుడు మొక్కలు సాగు చేశారు. అయితే గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పొలం కంచెకు ఉన్న గేటును ట్రాక్టర్తో ఢీకొట్టి లోపలికి ప్రవేశించారు. రోటావేటర్తో సరుగుడు మొక్కలను ధ్వంసం చేశారు. శుక్రవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో పొలానికి చేరుకున్న రాధమ్మ ధ్వంసమైన మొక్కలను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పారు. ఆస్తి గొడవలే కారణం? సూరే రాధమ్మ, ఆమె బంధువుల మధ్య కొంత కాలంగా ఆస్తి గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సరుగుడు తోటను ధ్వంసం చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఆమె బంధువు టీడీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. అధికార బలంతో సరుగుడు మొక్కలు ధ్వంసం చేయించి ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. వివాదముంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ తోటలను ధ్వంసం చేయడం సరికాదని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు తమ గ్రామంలో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. రాధమ్మ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకారెడ్డి కౌలుకు తీసుకొని సరుగుడు తోట సాగు చేశాడు. వచ్చే ఆదాయాన్ని ఇద్దరు సమానంగా తీసుకుంటారు. టీడీపీ నేత దుశ్చర్యతో కౌలు రైతు నష్టపోయే పరిస్థితి వచ్చిందని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రాత్రికి రాత్రే రోటావీటర్తో దున్నేసిన గుర్తు తెలియని దుండగులు కందుకూరు మండలం పాలూరులో ఘటన -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం
లింగసముద్రం: ఎదురెదురుగా రెండు మోటార్సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని మొగిలిచర్ల రోడ్డులో ఆర్ఆర్పాలెం వద్ద గురువారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే..మొగిలిచర్ల గ్రామానికి చెందిన మాజీ రేషన్ డీలర్ పల్లాల రామ్మూర్తిరెడ్డి(58) మొగిలిచర్ల నుంచి లింగసముద్రానికి బైక్పు వెళుతున్నాడు. అదే సమయంలో ఆర్ఆర్ఎం పాలెం గ్రామానికి చెందిన చింతగుంపల మాల్యాద్రి(60) కూలీలను వదిలిపెట్టి పెంట్రాల వైపు నుంచి ఆర్ఆర్పాలెం గ్రామానికి వస్తుండగా ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో రామ్మూర్తిరెడ్డి తలకు బలమైన గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కిందపడిన మాల్యా ద్రి కూడా బలమైన గాయాలు కాగా అపస్మారకస్థితికి వెళ్లాడు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై నారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలకు పంచానామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కందుకూరుకు తరలించారు. ఇరువురు కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలంలోనే మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. మొగిలిచర్ల, ఆర్ఆర్ పాలెం గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. వలేటివారిపాలెం: గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బొంతవారిపాలెం ఐటీఐ కాలేజీ దగ్గర 167 బీ వద్ద గురువారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు...తెనాలి మండల పెదరావురు గ్రామానికి చెందిన బొగినేని అరవింద్(24) గత నెలలో శాఖవరంలో పచ్చాకు కూలి పనికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి గ్రామంలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబ పని నిమిత్తం కందుకూరు వెళ్లి తిరిగి వస్తుండగా ఐటీఐ కాలేజీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు ఎస్సై మదిరి నాయుడు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కందుకూరు వైద్యశాలకు తరలించారు. తండ్రి భోగినేని కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. ఎదురెదురుగా బైక్లు ఢీకొనడంతో ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం -
నిందితులను కఠినంగా శిక్షించాలి
● మార్కాపురంలో రజకుల ర్యాలీ మార్కాపురం: పామూరు మండలం బొడ్లగూడూరు గ్రామంలో రజకుడు చీమలదిన్నె మహర్షిపై దాడిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం సాయంత్రం మార్కాపురం పట్టణంలో రజకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసులకు వినతిపత్రం అందించారు. ఆటో డ్రైవర్ మహర్షి నిమ్మకాయల లోడుతో వెళ్తున్న ఆటోలో నుంచి బస్తా మోటారు సైకిల్పై పోతున్న వారికి తగిలిందని, దీంతో సదరు వ్యక్తులు మహర్షిని స్తంభానికి కట్టేసి కొట్టడం దారుణమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ● కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు కంభం: మతిస్థిమితం లేక రైల్లో నుంచి దిగి బయట తిరుగుతున్న ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..గుర్తు తెలియని ఓ వ్యక్తి చేతిలో కర్రపట్టుకొని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్కు ఫిర్యాదు అందింది. సదరు వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ మహిళ తన భర్త తిమ్మసర్థి దుర్గాప్రసాద్ విజయవాడ నుంచి గోవా వెళ్తూ గురువారం రాత్రి కంభం రైల్వేస్టేషన్లో దిగి పారిపోయాడని తెలిపింది. తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో తిరుగుతున్న వ్యక్తి అతనే అని నిర్థారించుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో సిబ్బంది, డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టి గురువారం మధ్యాహ్నం అతని ఆచూకీ గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన భర్తను క్షేమంగా అప్పగించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సదరు వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
నైజీరియా..!
ఆహారం కోసం వెళ్తున్న పక్షులుబల్లికురవ: ఖండాంతరాలు దాటి వేల కిలోమీటర్లు నైజీరియా, కొరియా దేశాల నుంచి వచ్చే వైట్ స్ట్రోక్ పక్షుల రాక ఏటికేడు తగ్గుతోంది. సంక్రాంతి పండగకు కూతుళ్లు, అల్లుళ్లు వచ్చినట్లు శతాబ్ధాలుగా ఆడ,మగ పక్షులు గ్రామానికి వస్తూ సందడి చేస్తున్నాయి. చెట్లు అంతరించడంతో వలస పక్షుల సంఖ్య తగ్గుతోంది. పదేళ్ల క్రితం సుమారు 650 నుంచి 750 వరకు వచ్చిన పక్షులు గతేడాది 300 పడిపోయాయి. ఈ ఏడాది 250కి మించి రాలేదని గ్రామస్తులు ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది ఇక్కడికి వచ్చిన పక్షులకు వసతులు లేనందున పక్కనే ఉన్న అద్దంకి మండలంలోని మైలవరం గ్రామానికి చేరాయి. ప్రకాశం, పల్నాడు జిల్లాల సరిహద్దులో ఉన్న బల్లికురవ మండలం వెలమవారిపాలెం గ్రామానికి పక్షుల రాక వందల ఏళ్ల క్రితమే ఆరంభమైంది. పక్కనే గుళ్లకమ్మ ఉండటంతో నీటికి, ఆహారానికి ఇబ్బందులు లేవు. గ్రామ పంచాయతీ నిధులతో కూకట్లపల్లి వెళ్లే రోడ్డులో పక్షులకు మంచినీటి కోసం చెరువు తవ్వించారు. గుడ్లు పెట్టి పిల్లలను చేసి తిరిగి స్వదేశానికి సుమారు 5 వేల కిలోమీటర్ల నుంచి జనవరి మొదటి రెండో వారంలో మగ, ఆడ పక్షులు ఇక్కడికి వస్తాయి. చెట్లపై గూళ్లు కట్టుకొని నివాసం ఉంటాయి. ఆడ పక్షి గుడ్లు పెట్టి పిల్లలను చేస్తుండగా మగ పక్షి కావలసిన ఆహారాన్ని సమీపంలోని చెరువుల వద్దకు వెళ్లి వేటాడి తెచ్చి పెడుతుంది. జనవరి నుంచి జూన్ వరకు ఆ దేశాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని పిల్లలకు రెక్కలు రాగానే జూలై మొదటి వారంలో స్వదేశానికి వెళ్తాయి. విదేశీ పక్షులను చూసేందుకు ఈ ఆరు మాసాలు జిల్లాతో పాటు సమీప జిల్లాల నుంచి సందర్శకులు గ్రామానికి వస్తుంటారు. తగ్గుతున్న పక్షుల రాక చెట్లు అంతరించటం.. వేటగాళ్లు పక్షులను పట్టుకోవడం వంటి చర్యలతో ఏటికేడు పక్షుల రాక తగ్గుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే అసలు అవి రావేమోనని, ఇది తమ గ్రామానికి ఏదైనా అరిష్టం జరుగుతుందేమోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పక్షి రక్షణ చెట్ల పెంపకంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు, పక్షుల ప్రేమికులు కోరుతున్నారు. చెట్లు అంతరించడంతో తగ్గుతున్న విదేశీ పక్షులు నైజీరియా, కొరియా దేశాల నుంచి వైట్ స్ట్రోక్ పక్షుల రాక ఆతిథ్యమిచ్చిన వెలమవారిపాలెం గ్రామస్తులు ఆరు నెలలపాటు ఆ గ్రామంలోనే మకాం కంటికి రెప్పలా కాపాడుతున్న గ్రామస్తులు చెట్ల్లు పెంచి పర్యాటక కేంద్రంగా మార్చాలని విజ్ఞప్తి -
ఎస్పీ కార్యాలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన
మార్కాపురం: స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎస్పీ కార్యాలయ పునరుద్ధరణ పనులకు గురువారం డీఎస్పీ డాక్టర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. డీఎస్పీ కార్యాలయాన్ని 1911లో బ్రిటీష్ ప్రభుత్వం నిర్మించింది. 115 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కార్యాలయంలో అప్పట్లోనే సిబ్బంది క్వార్టర్స్, సీఐ, ఎస్సై క్వార్టర్స్ పటిష్ట రక్షణ వ్యవస్థ, గార్డు రూమ్ను ఏర్పాటు చేశారు. పదేళ్ల నుంచి భవనాలు శిథిలమైపోవడంతో పలువురు పోలీసు అధికారులు బయట అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడంతో ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీంతో స్థానిక డీఎస్పీ కార్యాలయంలోనే ఎస్పీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకూ డీఎస్పీ ఉపయోగిస్తున్న కార్యాలయాన్ని ఎస్పీకి కేటాయించారు. దీంతో పాటు ఎస్బీ కార్యాలయం, ఇంటలిజెన్స్, డీసీఆర్బీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఏపీఎస్పీ సిబ్బంది, ఎస్పీ సిబ్బంది, అదనపు ఎస్పీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా డీఎస్పీ కార్యాలయంలో ఉన్న చెట్లను తొలగించి ఆ ప్రాంతాన్ని చదును చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సై సైదుబాబు, కాంట్రాక్టర్ బి.వెంకటేశ్వరరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సింగరాయకొండ: బాలికపై దాడి ఘటనలో ఇద్దరు యువకులపై స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం రాత్రి పోక్సో కేసు నమోదయినట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో పాకల గ్రామానికి చెందిన బాలికపై సింగరాయకొండ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వెంకట సాయికృష్ణ, సాథిక్లు దాడికి పాల్పడ్డారు. వీరి దాడిలో గాయపడిన బాలిక ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందింది. ఆస్పత్రి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేంద్ర వివరించారు. -
జనసేన నేతపై కేసు నమోదు
అద్దంకి రూరల్: సివిల్ కేసులో ఇరువర్గాల మధ్య పంచాయితీ చేస్తానని రెండు రోజుల క్రితం అద్దంకి పోలీసుస్టేషన్కు వచ్చిన జనసేన నాయకుడు వల్లభనేని కృష్ణచౌదరిపై సీఐ సుబ్బరాజు కేసు నమోదు చేసినట్లు హైకోర్టు న్యాయవాది రజని తెలిపారు. గురువారం అద్దంకి పోలీస్స్టేషన్కు వచ్చిన ఆమె జనసేన నాయకులపై ధ్వజమెత్తారు. బాధితుల తరఫున న్యాయవాదిగా వచ్చిన తాను తప్పు చేసిన వారు ఎంతటి వారైనా నిలదీస్తానన్నారు. ఆమె వెంట బాధితులు ఉన్నారు. యర్రగొండపాలెం: మండలంలోని గురిజేపల్లిలో గురువారం మిర్చి పొలంలో బోరు మరమ్మతులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై కందుల పిచ్చిరెడ్డి (23) మృతి చెందాడు. ఎస్సై చౌడయ్య తెలిపిన వివరాల ప్రకారం..మిర్చి పొలంలో బోరు చెడిపోవడంతో బోరుపైపులు భూమిలో నుంచి క్రేన్ ద్వారా పైకి లాగుతున్న సమయంలో క్రేన్కు విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. -
గవర్నర్ ఎట్ హోమ్కు అద్దంకి వ్యక్తి
అద్దంకి రూరల్: రిపబ్లిక్డే సందర్భంగా ఈ నెల 26న విజయవాడలోని లోక్ భవన్లో నిర్వహించనున్న గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అహ్వానం అందినట్లు అద్దంకి మండలం మొండితోకపాలేనికి చెందిన వ్యక్తి సుకుమార్ గురువారం తెలిపారు. సుకుమార్ గతేడాది అద్దంకిలోని గుండ్లకమ్మ నదిలో చిక్కుకున్న మున్సిపల్ సిబ్బందిని కాపాడారు. నీటి ఉధృతిలో పడవలో వెళ్లి ఒక్కొక్కరిని ధైర్యంగా ఒడ్డుకు తీసుకొచ్చి కాపాడారు. ధైర్యసాహసానికి మెచ్చి గవర్నర్ నుంచి అహ్వానం అందినట్లు చెప్పారు. మార్కాపురం టౌన్: ఆర్టీసీ కార్మికులు ఉద్యోగ భధ్రతతో పాటు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని మార్కాపురం ఇన్చార్జి ఆర్ఎం సత్యనారాయణ సూచించారు. స్థానిక మార్కాపురం డిపోను, బస్టాండ్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చవచ్చన్నారు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లు భావిస్తే వెంటనే వైద్యశాలకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే డ్రైవింగ్ సమయంలో ఇబ్బందులు గురై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. మార్కాపురం జిల్లా సందర్భంగా కార్యాలయ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. శిబిరంలో 60 మంది ఆర్టీసీ ఉద్యోగులు వైద్య పరీక్షలు చేశారు. డీఎం నరసింహులు, సిబ్బంది, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
పామూరు: గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 36 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మాకినేని శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఎస్సై కట్టా అనూక్తో కలిసి సీఐ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. పామూరులోని నానాసాహెబ్ వీధికి చెందిన ముజ్జా సాయి కేశవ్ చెడు వ్యసనాలకు అలవాటుపడి కొంతకాలంగా హైదరాబాద్లోని గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి రూ.200 చొప్పున విక్రయిస్తున్నాడు. 20వ తేదీన సాయి కేశవ్ హైదరాబాద్వెళ్లి 36 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసి పామూరుకు వచ్చాడు. ఈ క్రమంలో పామూరు నుంచి కందుకూరు వెళ్లే రోడ్డులో కోటిరెడ్డి ఫ్లాట్స్ జంక్షన్లో ఉన్నట్లు సమాచారం రావడంతో సాయి కేశవ్ను అరెస్టు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఎక్కడైనా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నా, తరలిస్తున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎస్సై కట్టా అనూక్, హోంగార్డ్ రమణయ్య, సిబ్బంది ఉన్నారు. -
రెండు పొగాకు బ్యారెన్లు దగ్ధం
నాగులుప్పలపాడు: మండల పరిధిలోని బి.నిడమానూరు గ్రామంలో పొగాకు బ్యారన్ దగ్ధమైంది. ఈ సంఘటన గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..డాకా అంజిరెడ్డికి చెందిన పొగాకు బ్యారెన్లో పొగాకు క్యూరింగ్ జరుగుతున్న సమయంలో మొద్ద గొట్టంపై నుంచి కర్ర జారిపడి మంటలు వ్యాపించాయి. దీంతో బ్యారన్లోని పొగాకు మొత్తం కాలిపోయాయి. మరో జంట బ్యారన్ లో ఉన్న పొగాకు కూడా కొంత మేరకు కాలిపోయినట్లు తెలిపారు. ప్రమాదం వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ.7 లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. టంగుటూరు: మండలంలోని ఎం నిడమానూరులో పొగాకు బ్యార్నీ దగ్ధమైంది. గ్రామానికి కాకుమాని కోటమ్మ బ్యారన్లో క్యూరింగ్ నిమిత్తం 1200 పొగాకు కర్ర పెట్టారు. అయితే కర్ర జారి మొద్దు గొట్టంపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో పొగాకు కర్రతో పాటు, కర్ర, టైర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించలేదని, సకాలంలో వచ్చి ఉంటే కొంత మేర ఆస్తినష్టం తప్పేదంటున్నారు. ప్రమాదంలో రూ.3.50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. -
పక్షులతో సందడి
పక్షులను తామంతా కంటికి రెప్పలా కాపాడుకుంటామని, గ్రామంలోని చిన్న పిల్లలను సైతం అవి ఏమీ చేయవని, పక్షుల జోలికి ఎవరు వెళ్లినా సహించేది లేదని గ్రామస్తులు తెలిపారు. ఆరేళ్ల క్రితం అర్ధరాత్రి చెట్లపై నిద్రిస్తున్న పక్షులను పథకం ప్రకారం వేటగాళ్లు పట్టుకొని గోతాల్లో వేసి తరలిస్తుండగా తోటి పక్షుల అరుపులకు తామంతా ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి వేటగాళ్లను అడ్డుకుని పక్షులను రక్షించినట్లు చెప్పారు. గోతాల్లో వేసి కుక్కడంతో 25 పక్షులు చనిపోయాయని, గాయపడిన పక్షులను స్థానిక పాఠశాలలో ఉంచి సపర్యలు చేసినట్లు వివరించారు. -
లక్ష్మమ్మకు వైవీ సుబ్బారెడ్డి నివాళులు
పీసీ పల్లి: మండలంలోని మూలవారిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు గుర్రంపాటి దశరథ రామిరెడ్డి తల్లి గుర్రంపాటి లక్ష్మమ్మ ఈ నెల 9వ తేదీ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి గురువారం ఆ గ్రామానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దశరథ రామిరెడ్డి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. వైవీ సుబ్బారెడ్డి వెంట వైవీ భద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పీడీసీసీబీ మాజీ చైర్మన్లు వైఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ), మాదాసు వెంకయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వైవీ వెంకటేశ్వరరావు, కేవీ ప్రసాద్, కనిగిరి జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, పీసీ పల్లి సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ పోలు జయరాంరెడ్డి, ఎర్రంరెడ్డి మోహన్రెడ్డి, నరాల కొండారెడ్డి, ఒమేగా రామిరెడ్డి, దుంప వెంగలరెడ్డి, లింగాల దిననరసింహారెడ్డి, మేకల మాల్యాద్రి యాదవ్, శీలం సుదర్శనం, సిద్ధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
లోటుపాట్లు లేకుండా చూడండి
మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఇన్చార్జి కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించే ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణాన్ని జేసీ పులి శ్రీనివాసులు, ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డితో కలిసి గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్టాల్స్పై ఆయా శాఖల అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజుకు సూచించారు. మొత్తం 10 శాఖలకు చెందిన 25 స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఆయా శాఖల శకటాలను కూడా సన్నద్ధం చేయాలని కలెక్టరు ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ పనులు త్వరగా పూర్తి చేయండి... మార్కాపురం కలెక్టరేట్ పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. జేసీతో కలిసి కలెక్టరేట్ ప్రాంగణానికి వెళ్లి పనులను పరిశీలించారు. ఆయా సెక్షన్ల ఆఫీసర్ల గదులు, మినిస్ట్రీరియల్ స్టాఫ్, సిబ్బంది, రికార్డు రూములు, తదితర పనులను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. ఈ నెలాఖరులోపు పనులు పూర్తికావాలని ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి తహసీల్దార్ చిరంజీవి కలెక్టర్కు వివరించారు. వారి వెంట కమిషనర్ నారాయణరావు, సీఐ సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నాలుగు ఎకరాలు మిరప సాగు చేసి దున్నేశాః
నేను నాలుగు ఎకరాల్లో మిరప సాగు చేశా. కాయలు కూడా కాశాయి. పంటను తామర పురుగు ఆశించింది, ఎన్నో రకాల మందులు పిచికారీ చేశా. పైరు తిప్పుకోలేదు. పంట ఎదుగుదల సైతం నిలిచిపోయింది. ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర కల్పిస్తారనే నమ్మకం పోయింది. గత ప్రభుత్వంలో క్వింటా మిరపకాయలు రూ.24 వేల నుంచి రూ.25 వేలకు అమ్ముకున్నా. కూటమి ప్రభుత్వంలో రోజురోజుకు ధర తగ్గుముఖం పడుతుంది. ఈ నేపథ్యంలో పోయిన సంవత్సరం పండించిన కాయలకు రేటు పెరుగుతుందేమోనని గుంటూరులోని ఏసీ గదుల్లో దాదాపు సంవత్సర కాలం పాటు 100 క్వింటాల స్టాక్ పెట్టా. చివరకు క్వింటా రూ.12 వేలకు అమ్ముకున్నా. ఆ పరిస్థితి చూసి ఈ నాలుగు ఎకరాలు చెడగొట్టి పొగాకు సాగుచేస్తున్నా.– సూరే కృష్ణారెడ్డి, రైతు, మర్రిపూడి -
పరిహారానికీ మంగళం!
మార్కాపురం: అన్నదాతలపై ప్రకృతే కాదు.. చంద్రబాబు సర్కారు కూడా పగబట్టింది. మూడు నెలల క్రితం రాష్ట్రంపై విరుచుకుపడిన మోంథా తుఫాన్ ప్రభావంతో వేలాది ఎకరాల పంటలు నీట మునిగి రైతులు భారీగా నష్టపోయారు. వీరిని ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోకుండా అలవిమాలిన జాప్యం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది అక్టోబర్లో మోంథా తుఫాన్ తాకిడికి ప్రస్తుత మార్కాపురం జిల్లాలోని 19 మండలాల్లో అపార నష్టం వాటిల్లింది. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగుచేసిన పత్తి, మిర్చి, వరి, సజ్జ, కంది పంటలన్నీ దాదాపు తుడిచి పెట్టుకుపోయాయి. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో 10,836 మంది రైతులు 18,800 ఎకరాల్లో సాగు చేసిన పంటలు నష్టపోయారు. వాస్తవానికి పంట నష్టం ఇంకా అధిక మొత్తంలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతో నష్టం అంచనాల్లో భారీగా కోత విధించినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. తర్జనభర్జనల అనంతరం పంట నష్టం తుది జాబితా వెల్లడించిన అధికారులు.. జిల్లాలోని రైతులకు రూ.30,73,92,000 పరిహారం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. ఎప్పుడిస్తారు పరిహారం? పంటలు దెబ్బతిని మూడు నెలలు కావస్తున్నా చంద్రబాబు సర్కారు పరిహారం అందించకపోవడంతో నష్టపోయిన రైతుల్లో ఆందోళన నెలకొంది. నవంబర్ మొదటి వారంలో కేంద్ర బృందం ఒంగోలు వచ్చి తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పొలాలను పరిశీలించి వెళ్లింది. ఈ క్రమంలోనే స్ధానిక వ్యవసాయ అధికారులు కూడా పరిహారం కోసం ప్రతిపాదనలు పంపారు. రబీ సీజన్ ముగుస్తున్నా పరిహారం మంజూరు కాకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు వస్తున్న వ్యవసాయాధికారులు, వారి సహాయకులను నష్ట పరిహారం ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నా సరైన సమాధానం లేదని చెబుతున్నారు. -
నూరు శాతం ఉత్తీర్ణతపై దృష్టి పెట్టాలి
● కేజీబీవీని తనిఖీ చేసిన జిల్లా బాలికా విద్యాభివృద్ధి అధికారి హేమలత వెలిగండ్ల (కనిగిరి రూరల్): కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) పదో తరగతి విద్యార్థినులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంపై దృష్టి పెట్టాలని జిల్లా బాలికా విద్యాభివృద్ధి అధికారి హేమలత సంబంధిత అధికారులను ఆదేశించారు. వెలిగండ్లలోని కేజీబీవీని గురువారం ఆమె తనిఖీ చేశారు. విద్యార్థినులకు అమలు చేస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ తీరును పరిశీలించి సలహాలు, సూచనలు చేశారు. విద్యా శక్తి కార్యక్రమంపై 8, 9 తరగతుల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులకు ప్రతి సబ్జెక్టుపై అవగాహన పెంచాలన్నారు. ఉపాధ్యాయులు విధిగా పరీక్షల పట్ల విద్యార్థినులకు భయం తొలగించాలని, వారి ప్రగతికి తోడ్పాటు ఇవ్వాలని సూచించారు. అలాగే ఎండీఎంను పరిశీలించి మెనూ అమలు తీరు గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ దేవిరెడ్డి రామిరెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒంగోలు వన్టౌన్: న్యాయ విజ్ఞానం అనేది ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అందించడం ద్వారా చాలా సమస్యలకు చట్టపరమైన పరిష్కారం దొరుకుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. ఒంగోలు నగరంలోని కబాడీపాలెంలో ఉన్న ప్రభుత్వ ఎస్టీ బాలికల వసతి గృహంలో లీగల్ లిటరసీ క్లబ్ను గురువారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల వసతి గృహాల్లో ఈ విధమైన లీగల్ లిటరసీ క్లబ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్లబ్ల ద్వారా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగించి బాల్య వివాహాల నిరోధం, మత్తు పానీయాలకు నివారణతో పాటు బాలబాలికలపై జరిగే లైంగిక నేరాల వ్యతిరేక చట్టాల గురించి అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని క్లబ్లో చేరిన విద్యార్థులు వినియోగించుకుని ఇతరులకు కూడా అవగాహన కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిలర్ జి.రవిశంకర్, డిప్యూటీ కౌన్సిలర్ పి.వీరరాఘవులు, జిల్లా సహాయ గిరిజన సంక్షేమ అధికారి కట్టా బ్రహ్మయ్య, వార్డెన్ సునీత, సిబ్బంది సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
రథ సప్తమి వేడుకలు
సమన్వయంతో నిర్వహించండిమార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలో ఈనెల 25న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రథసప్తమి వేడుకలను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సబ్కలెక్టర్ కార్యాలయంలో బుధవారం రథసప్తమి వేడుకలపై ఆయన దేవదాయ, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ విద్యుత్, అగ్నిమాపక తదితర విభాగాల అధికారులతో ఇన్చార్జి సబ్కలెక్టర్ శివరామిరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. తిరుమల తరహాలో చెన్నకేశవస్వామి వారు సప్తవాహనాలపై భక్తులకు దర్శనమిస్తారని, అనంతరం వెండి రథంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తామని ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయా శాఖల అధికారులు స్వామివారి వాహనసేవకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని జేసీ ఆదేశించారు. పారిశుధ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ తీగలు వలన ఎవరికీ నష్టం జరగకూడదని, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. వివిధ వర్తక వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు అన్న వితరణ ఉంటుందని మాజీ చైర్మన్ యక్కలి కాశీవిశ్వనాథం తెలిపారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ శివరామిరెడ్డి, ఈఓ శ్రీనివాసరెడ్డి, సీఐ సుబ్బారావు, కమిషనర్ డీవీ నారాయణరావు, తహశీల్దార్ చిరంజీవి, పట్టణ ఎస్సై సైదుబాబు, ఎకై ్సజ్ ఎస్సై గోపాలకృష్ణ, అగ్నిమాపకశాఖాధికారి రామకృష్ణ, పట్టణ విద్యుత్ ఏఈ యశోద తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆశలు సాగులోకి..
ధర పొగబెట్టి..పొగాకు రైతును చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూసింది. వేలం కేంద్రాల్లో అధికారులు బయ్యర్లతో కుమ్మక్కయ్యారు. సాగు సమయంలో రైతులకు కంపెనీలు హామీలు ఇచ్చి కొనుగోలు సమయం నట్టేట ముంచేశాయి. గిట్టుబాటు ధరలు లభించక రైతులు నష్టాల పాలయ్యారు. కనీస ధర కోసం రోడ్డెక్కి ఆందోళన చేశారు. వరుసగా నష్టాలు, కష్టాలు ఎదురవుతున్నా ఈ ఏడాది కూడా సాగులో రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. 2026–27 సీజన్కు సంబంధించి సాగైన పంట విస్తీర్ణమే ఇందుకు నిదర్శనం. సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి చేలు తడిపేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. సాగు రెట్టింపవుతున్నా ఈ ఏడాదైనా నష్టాల నుంచి బయటపడతామంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో ప్రధాన పంటగా సాగవుతున్న పొగాకు నష్టాలు తెచ్చిపెడుతున్నా రైతులు భారీగానే సాగు చేశారు. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో మొత్తం 11 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో 9 కేంద్రాలు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఉండగా, రెండు కేంద్రాలు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. 2026–27 పంట సీజన్కు సంబంధించి 11 వేలం కేంద్రాల పరిధిలో 82,475 హెక్టార్లలో పొగాకు పంట సాగైనట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అయితే గత ఏడాదిలో 87,988 హెక్టార్లలో పంట సాగైందని, దీంతో పోల్చితే కొంతమేర సాగు విస్తీర్ణం తగ్గినట్లు అధికారులు చెప్తున్నారు. గతేడాది మిగిల్చిన నష్టాలతో చిన్నా, చితకా రైతులు ఈ ఏడాది సాగు ధైర్యం చేయకపోవడమే ఇందుకు కారణం. అయితే సాగు కాస్త తగ్గినా అంచనాలు మించే పొగాకు పంటను సాగు చేశారని అధికారులు చెప్తున్నారు. గత ఏడాది ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే ఈ ఏడాది అది 6 క్వింటాళ్లకే పరిమితమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి తగ్గినా క్యూరింగ్లో మంచి నాణ్యత వస్తుండడం రైతులకు ఈ ఏడాది సానుకూలాంశంగా ఉంది. 90.20 మిలియన్ కేజీల ఉత్పత్తికే అనుమతి 2026–27 పంట సీజన్కు సంబంధించి ఒంగోలు రీజియన్ పరిధిలో 90.20 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తులను పండించేందుకే పొగాకు బోర్డు అనుమతి ఉంది. ఈ మేరకు నల్లరేగడి నేలల పరిధిలో బ్యారన్కు 35.65 క్వింటాళ్లు, తేలిక నేలల పరిధిలో 36.85 క్వింటాళ్ల ఉత్పత్తులను మాత్రమే పండించాలని పరిమితి విధించింది. ఇదే గతేడాది 158 మిలియన్ కేజీల వరకు ఉన్న దాన్ని ఈ ఏడాది భారీగా తగ్గించారు. బోర్డు అనుమతి ఎలా ఉన్నా ప్రస్తుతం సాగైన విస్తీర్ణాన్ని బట్టిచూస్తే ఏడాది కూడా అంచనాలను మించి ఉత్పత్తి రావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు నానాపాట్లు సాగు చేసిన పొగాకు పంటను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. రేయింబవళ్లు పొలాల వద్దే మకాం వేసి నీరు పెట్టుకుంటున్నారు. వర్షాధార పంట కావడంతో ప్రస్తుతం వర్షాలు కురిసే పరిస్థితి లేదు. దీంతో కుంటలు, కాల్వలు, నీటి ట్యాంకర్లపై ఆధారపడి పొలాలను తడుపుకుంటున్నారు. దీంతో సాగు ఖర్చు తడిసిమోడవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరా పొలం విస్తీర్ణంలో రెండు తడులు నీరు పెట్టాలంటే 2 వేల నుంచి 3 వేల అడుగుల మేర పైప్లు వేసి ఆయిల్ ఇంజన్లు పెట్టి నీరు మళ్లిస్తున్నారు. ఇలా ఒక ఎకరా పొలం తడపాలంటే రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఖర్చవుతుందని రైతులు అంటున్నారు. ఇక ట్యాంకర్లతో నీటిని తెచ్చి తోలాలంటే ఈ ఖర్చు రెట్టింపవుతుంది. -
రైల్వే జీఎంకు వినతుల వెల్లువ
మార్కాపురం రూరల్ (మార్కాపురం)/గిద్దలూరు రూరల్/కంభం/దొనకొండ: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్ బుధవారం మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని పలు రైల్వే స్టేషన్లను గుంటూరు డీఆర్ఎం సుదేశ్నా సేన్తో కలిసి పరిశీలించారు. నంద్యాల నుంచి గుంటూరుకు ప్రత్యేక రైలులో వెళుతున్న ఆయన మార్గం మధ్యలో గిద్దలూరు, కంభం, మార్కాపురం, దొనకొండ రైల్వే స్టేషన్లలో ఆగి అక్కడి పరిస్థితులను, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్లలో పలువురు నాయకులు రైల్వే పరంగా ఉన్న సమస్యలను ఆయనకు విన్నవించారు. గిద్దలూరులో రాచర్లగేటు వద్ద బ్రిడ్జి నిర్మించాలని కోరారు. కంభం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, పార్శిల్ సేవలను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. మార్కాపురం రైల్వే స్టేషన్లో శ్రీశైలం వెళ్లే యాత్రికుల కోసం డార్మిటరీ నిర్మించాలని కోరారు. దొనకొండ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం కాలినడక వంతెన ఏర్పాటు చేయాలని, దొనకొండలోని రైల్వే వైద్యశాలను 24 గంటలు పని చేసేలా అనుమతులు మంజూరు చేయాలని విన్నవించారు. పలు రైళ్ల సర్వీసుల కోసం వినతి: సైనికులు, మాజీ సైనికులు అధికంగా ఉన్న కంభంలో గరీబ్ రథ్, ధర్మవరం, ఎస్ఎస్పీఎన్, తదితర స్పెషల్ ట్రైన్స్ ఆగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు–ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ను షిరిడీ వరకు పొడిగించాలని, గుంటూరు–తిరుపతి ఎక్స్ప్రెస్ను తిరువన్నామలై మీదుగా తిరుచురాపల్లి వరకు పొడిగించాలని కోరారు. అదేవిధంగా యర్రగుంట్ల, నంద్యాల, శావల్యాపురం, న్యూ పిడుగురాళ్ల మీదుగా తిరుపతి – హైదరాబాదు మధ్య రోజువారి రాత్రిపూట ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టాలని, కాచిగూడ – నడికుడి ప్యాసింజరును న్యూ పిడుగురాళ్ల, శావల్యాపురం మీదుగా మార్కాపురం వరకూ పొడిగించాలని కోరారు. బెంగళూరు, మైసూరుకు కొండవీడు ఎక్స్ప్రెస్ ఫ్రీక్వెన్సీని ట్రైవీక్లీ నుంచి డైలీ నడపాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నుంచి నంద్యాల వరకూ వచ్చే రైళ్లన్నీ మార్కాపురం వరకూ పొడిగించాలని విన్నవించారు. విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్ ట్రైను వేయాలని కోరారు. పగటి పూట గుంటూరు, గుంతకల్ మధ్య మరో రెండు రైళ్లను నడిపించాలని కోరారు. రైల్వే జీఎంను కలిసిన వారిలో మార్కాపురం ప్యాసింజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓఏ మల్లిక్, ప్రధాన కార్యదర్శి ఎన్సీ నరసింహాచార్యులు, మాజీ డీఆర్యూసీసీ మెంబరు షేక్ ఇస్మాయిల్, బీజేపీ ఇన్చార్జి కృష్ణారావు, దొనకొండ రైల్వే పింఛనర్స్ అసోసియేషన్ కార్యదర్శి బుక్కారపు జయరాజు తదితరులు ఉన్నారు. -
ప్రయోజనంలేని పరిశీలనలు ఎందుకు ?
యర్రగొండపాలెం: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్ట్ పనులు పరిశీలించేందుకు పదే పదే పర్యటిస్తున్నారని, మరో సారి వెలుగొండ ప్రాజెక్ట్కు ఆయన రాబోతున్నట్లు తెలిసిందని, ప్రయోజనంలేని ప్రాజెక్ట్ పరిశీలనలు చేయడం ఎందుకని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి ప్రాజెక్ట్ను పరిశీలించడం సంతోషంగా ఉందని, కానీ ఈ పరిశీలన వలన ప్రాజెక్టుకు కానీ, ప్రజలకు కానీ ఉపయోగంలేకపోవడంతోపాటు ప్రజా ధనం వృథా అవుతుందన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ వాస్తవ పరిస్థితులను తెలుసుకొని యర్రగొండపాలెం ప్రాంత ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే తీగలేరు–5 (టీ5) కాలువ పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ పర్యటనలు మాని వెలుగొండ నుంచి యర్రగొండపాలేనికి వెళ్లే కాలువ పనులను సందర్శించాలని సూచించారు. కాలువల్లో తట్టెడు మట్టి తీయకుండా ప్రజలకు తాగు, సాగు నీరు ఏ విధంగా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కాలువ పనులు ప్రారంభించకపోవడం, ఏ పర్యటనలో కూడా కాలువల గురించి ప్రస్తావించకపోవడం ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు విస్మరించడమేనని అన్నారు. ఇంతటి నిర్లక్ష్యం చేస్తూ కూడా ప్రచారం కోసం పర్యటనలు చేయడంమాని పనులకు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తీగలేరు కాలువ తవ్వకుండా పుల్లలచెరువు మండలానికి చుక్కనీరు వినియోగించే అవకాశంలేదని, నేటికీ భూసేకరణ పూర్తి కాలేదని, వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల పరిహారానికి ఇప్పటి వరకు అతీగతీలేకుండా పోయిందని విమర్శించారు. నిర్వాసితులకు రూ.1100 కోట్లకు చెల్లించింది కేవలం 10 శాతంలోపేనన్నారు. అసెంబ్లీ సాక్షిగా రూ.5 వేల కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం నేటికి కేటాయించింది రూ.300 కోట్లేనని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటికి పిలిచిన టెండర్లు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో కలిపి రూ.వెయ్యి కోట్లు మాత్రమే చూపిస్తున్నారని, గత ప్రభుత్వ కాలంలో రూ.5 వేల కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పడం అబద్ధమేనని అర్థమవుతోందన్నారు. ఇటీవల వచ్చిన వరదలకు ఫీడల్ కెనాల్కు గండిపడి పెద్దదోర్నాల మండలంలోని కొత్తూరు, యడవల్లి ప్రాంతాల్లో జరిగిన పంట నష్టాన్ని తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ముస్లిం మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్.బుజ్జి, మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, నాయకులు కె.ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, వై.వెంకటేశ్వరరెడ్డి, తోకల ఆవులయ్య, ఉమామహేశ్వరరెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, పెద్దకాపు వెంకటరెడ్డి, రాములు నాయక్, సురేష్ నాయక్ పాల్గొన్నారు. -
మార్కాపురం విద్యార్థినికి ఆహ్వానం
గవర్నర్ ఎట్ హోంకు మార్కాపురం టౌన్: ఈనెల 26న అమరావతిలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ నిర్వహించే ఎట్హోం కార్యక్రమానికి మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన శాలిని సంహితకు గవర్నర్ కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం ఆహ్వానం అందింది. సంహిత గత ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3వ ర్యాంక్ సాధించింది. టెన్త్లో 600కు 598 మార్కులు సాధించిన విద్యార్థినిగా గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్లు ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి తెలిపారు. సంహిత తండ్రి రమణయ్య ప్రస్తుతం బల్లికురవ మండలం ఉప్పుమాగులూరులో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తన కుమార్తెకు గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. సంహిత ప్రస్తుతం ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం గుంటూరులో చదువుతున్నట్లు తెలిపారు. -
ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి
● డీఈఓ సీవీ రేణుక ఒంగోలు సిటీ: విద్యార్థులు చిన్నతనం నుంచే ఆంగ్ల భాష మీద పట్టు సాధించాలని డీఈఓ సీవీ రేణుక అన్నారు. జిల్లా స్థాయి స్పెల్ బీ పోటీలు బుధవారం ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ సీవీ రేణుక పాల్గొని మాట్లాడుతూ మాతృభాష తెలుగు మీద పట్టు సాధించి తర్వాత ఇతర భాషల మీద కూడా పట్టు సాధించాలని కోరారు. ఇంగ్లిష్ గ్లోబల్ లాంగ్వేజ్ అని, ఇంగ్లిష్ నేర్చుకోవడం ద్వారా మనం చాలా విజయాలు సాధించవచ్చన్నారు. విద్యార్థులు రోజూ కొన్ని పదాలు నేర్చుకుని వాటిని ఉపయోగించడం సాధన చేయాలని కోరారు. లెవెల్ 2 లో విజేతలుగా కొమ్ము లాస్య, బేతంచెట్టి వీరజోత్స్న, వేనం రిషిత నిలిచారు. లెవల్ 3లో చేజర్ల చామున్సాయి, చెందోలు యశస్విని ఉన్నారు. లెవల్ 4లో సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థిని షేక్ షాజపర్వీన్ విజేతగా నిలిచినట్లు తెలిపారు. విజేతలు 22వ తేదీ గుంటూరులోని హిందూ హైస్కూల్లో జరగబోయే జోనల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఇస్మాయిల్, మధు యామిని జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించారు. కార్యక్రమంలో పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజలక్ష్మి, జిల్లా సైన్స్ అధికారి టీ రమేష్ పాల్గొన్నారు. -
రెవెన్యూ రికార్డుల పరిశీలన
ఒంగోలు వన్టౌన్: ఒంగోలు కలెక్టరేట్లోని రికార్డులు రూంను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భ,గా మార్కాపురం జిల్లా రెవెన్యూ రికార్డులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పడినందున, ఆ జిల్లా జిల్లా రెవెన్యూ రికార్డుల విభజన ప్రక్రియను డీఆర్ఓ, సంబంధిత సెక్షన్ అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ టి.రవి, సంబంధిత సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. -
రిపబ్లిక్ డే పరేడ్కు ఏర్పాట్లు
మార్కాపురం: జిల్లా కేంద్రం మార్కాపురంలో ఈ నెల 26న జరిగే మొదటి రిపబ్లిక్ డే వేడుకలకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్వీకేపీ కళాశాల గ్రౌండ్లో వేడుకలు నిర్వహిస్తుండగా కలెక్టర్ బంగళాలో సాయంత్రం ఎట్హోమ్ కార్యక్రమాన్ని, ఎస్పీ కార్యాలయంలో పరేడ్ నిర్వహించేందుకు మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వివిధ శాఖల శకటాలు పరేడ్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణాన్ని కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో సిబ్బంది చదును చేసి సున్నంతో మార్కింగ్ వేసి పరేడ్ను సిద్ధం చేస్తున్నారు. ఒంగోలు నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం రోజూ పరేడ్ రిహార్సల్స్ చేస్తోంది. ఎస్పీ హర్షవర్ధన్రాజు సోమవారం తన కార్యాలయంలో పరేడ్ ఏర్పాట్లపై సమీక్షించారు. మొదటిసారి మార్కాపురంలో జరిగే కార్యక్రమం ఘనంగా ఉండాలని ఆదేశించారు. ఎస్పీ కార్యాలయ ప్రాంగణం మొత్తం చదును చేశారు. కార్యాలయానికి రంగులు కూడా వేశారు. కలెక్టర్ బంగళాను కూడా ఎట్హోమ్ కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు. మొదటిసారిగా జరిగే రిపబ్లిక్ డే వేడుకలను అన్నీశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు. -
ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
రాచర్ల: నివాస గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిన సంఘటన మండలంలోని జేపీ చెరువులో వెలుగు చూసింది. అందిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్టా గురుమూర్తి ఇంట్లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో విలువైన సామగ్రితో పాటు బియ్యం, మొక్కజొన్న విత్తనాలు, దుస్తువులు, మంచాలు పూర్తిగా కాలిపోయాయి. నివాస గృహంలో చెలరేగుతున్న మంటలను స్థానికులు నీళ్లు చల్లి అదుపు చేశారు. మేదరమెట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన షేక్ ఇమామ్ బాషా (32) మంగళవారం అర్ధరాత్రి సమయంలో మూడు అంతస్తుల బిల్డింగ్ నుంచి కిందపడి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. చికెన్ షాప్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇమామ్బాషా నాలుగు రోజుల నుంచి మద్యం తాగుతూ మతిస్థిమితం లేక రోడ్లపై తిరుగుతూ తనని ఎవరో చంపుతున్నారు..వెంబడిస్తున్నారని పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. మంగళవారం రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న కత్తితో గొంతులో పొడుచుకోగా అతని తల్లి కరిమున్ స్థానిక వైద్యశాలకు తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందకుండా అర్ధరాత్రి సమయంలో పోస్టాఫీస్ పక్కన మూడు అంతస్తుల బిల్డింగ్ ఎక్కి పరిగెత్తుతూ కిందపడిపోయాడు. బలమైన గాయాలు కావడంతో బంధువులు హుటాహుటిన ఒంగోలు రిమ్స్కు తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మేదరమెట్ల ఎస్ఐ షేక్ మహ్మద్ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కందుకూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన పట్టణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సాజిద్(39) అంత్యక్రియలు బుధవారం స్థానిక ఖబరిస్తాన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సాజిద్ మృతదేహానికి పలువురు పోలీస్ అధికారులు నివాళులర్పించారు. గుండెపోటుకు గురైన తల్లిని హాస్పిటల్కి తరలించే క్రమంలో ప్రమాదానికి గురై మృతి చెందడం బాధాకరమైన విషయమని, మరో పక్క తల్లి కూడా మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటన్నారు. సాజిద్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, శాఖాపరంగా రావాల్సిన అన్ని లాంఛనాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఖబరిస్తాన్లో పోలీస్లాంఛనాలతో సాజిద్ అంత్యక్రియలు పూర్తి చేశారు. -
చీకట్లో చిన్నారుట్ల
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యంలో చీకట్లో మగ్గుతున్న గిరిజన గూడేలకు విద్యుత్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అప్పటి ప్రభుత్వం సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించింది. సోలార్ యూనిట్లు కొంత కాలం వరకు బాగానే పనిచేశాయి. నిర్వహణ లోపంతో సకాలంలో మరమ్మతులు చేపట్టక పోవడతో చిన్నిరుట్ల గిరిజన గూడెంలోని సోలార్ యూనిట్లు కొన్నాళ్లకే మూలకు చేరాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని చిన్నారుట్ల, పెద్దచేమ గూడేల్లో సుమారు 60 కుటుంబాలకు ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ను కల్పించారు. ఒక్కో కుటుంబానికి సోలార్ ప్యానల్ బ్యాటరీతో పాటు ఇన్వర్టర్లు అందజేశారు. దీంతో పాటు చిన్నారుట్ల గిరిజన గూడెంలో వీధి లైట్ల కోసం గూడెంలో ఓ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు.కొన్నాళ్ల పాటు సేవలందించిన ఆ యూనిట్ నిర్వహణ లేక పోవడంతో మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారింది. సోలార్ విద్యుత్ ప్లాంట్లు మూలన పడటంతో వీధి లైట్లు లేక గూడేనికి చెందిన చెంచు గిరిజనులు రాత్రి వేళలో చిమ్మచీకట్లోనే గడుపుతున్నారు. గూడెం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో ఎప్పుడు ఏ క్రూరమృగం వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో పాటు వర్షాకాల సమయాల్లో విష పురుగులతో ఇబ్బందులు పడుతున్నారు. వెలుతురు లేక పోవడంతో గూడెంలోకి ఏ వన్యప్రాణి వచ్చిందో తెలియక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత నుంచి ప్రాణాలతో బయటపడిన చిన్నారి కుడుముల అంజయ్య, లింగేశ్వరి దంపతుల మూడేళ్ల చిన్నారి గతేడాది ఆగస్టు 13వ తేదీ అర్ధరాత్రి తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తోంది. గూడెంలోకి ప్రవేశించిన చిరుతపులి చిన్నారిని నోట కరుచుకుని పరుగులు తీసింది. ఇది గమనించిన గూడెం వాసులు కేకలు వేయడంతో చిన్నారిని వదిలేసింది. చివరకు ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. దీంతో పాటు గూడెంలోని పలు పశువులు, మేకలపై చిరుతలు, పెద్దపులులు దాడులు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చిన్నారిపై దాడి సంఘటనపై ఆగ్రహించిన గూడెం వాసులు రోడ్డుపై బైఠాయించి గూడేనికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని రాస్తారోకో సైతం అప్పట్లో చేశారు. సోలార్ ప్లాంట్లకు మరమ్మతులు చేపట్టాలి: చిన్నారుట్ల గిరిజన గూడెంలో సోలార్ ప్లాంట్లు పనిచేయక రెండేళ్లు దాటినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్థానికులం తీవ్ర అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం అందజేసిన సోలార్ ప్లాంట్లతో వీధి దీపాలు కొన్నాళ్ల పాటు సక్రమంగానే పని చేశాయి. అ తర్వాత పనిచేయక మూలకు చేరాయి. బ్యాటరీలు, ప్యానల్ బోర్డులు పనిచేయక పోవడంతో గూడెంలో వీధిలైట్లు వెలగటం లేదు. వెలుతురు కోసం రాత్రిళ్లు మంటలు వేసుకుంటున్నాం. గతంలో వ్యన్యప్రాణులు పశువులపై దాడులు చేసి వాటిని పొట్టన పెట్టుకున్నాయి. చిరుతపులి దాడిలో గూడేనికి చెందిన ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. అధికారులు స్పందించి సోలార్ ప్యానల్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. వెంకటేఽశం, గిరిజన యువకుడు, చిన్నారుట్ల -
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
త్రిపురాంతకం: శ్రీబాలాత్రిపురసుంరీదేవి, శ్రీపార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాల్లో మహాశివరాత్రి మహోత్సవాలు భక్తులకు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. త్రిపురాంతకం ఆలయాల వద్ద మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న మహాశివరాత్రి మహోత్సవాలకు భక్తుల రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయాల వద్ద ప్రత్యేక పూజలకు తగిన ఏర్పాట్లు, దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీకి తగిన విధంగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాల వద్ద ట్రాఫిక్ అంతరాయం లేకుండా, తాగునీటి సౌకర్యం, సామాజిక సత్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. సమావేశంలో ఆర్డీఓ శివరామిరెడ్డి, దేవదాయశాఖ అధికారి శ్రీధర్రెడ్డి, ఈఓ అనిల్కుమార్, తహసీల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీఓ రాజ్కుమార్, సీఐ అసాన్, ఎస్ఐ శివబసవరాజు, ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ, సర్పంచ్ పి.వెంకటలక్ష్మి పలు శాఖల అధికారులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు, సమాజిక సత్రాల నిర్వాహకులు, పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. పొదిలి: స్థానిక ఒంగోలు రోడ్డులోని రైల్వే బ్రిడ్జి సమీపంలో వక్ఫ్ భూములు గత కొంత కాలంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ విషయమై పలుమార్లు వక్ఫ్ బోర్డు కమిటీ సభ్యులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో కొంత మేర ఆక్రమణలు తొలగించారు. అయితే పరిస్థితి యధావిధిగా మారి ఆక్రమణలు తగ్గలేదు. దీంతో బుధవారం బోర్డు సభ్యులు, అధికారులు పోలీసుల సహకారం తీసుకున్నారు. పోలీసులు మోహరించడంతో ఆక్రమణలను తొలగిస్తున్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినా అధికారులు ఆక్రమణల తొలగింపు విషయంలో ముందుకు పోతున్నారు. పట్టణంలో పర్యటించిన సీఐ, కమిషనర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీఐ రాజేష్ కుమార్, నగర పంచాయతీ కమిషనర్ మారుతీరావు పర్యటించారు. ఆక్రమణల తొలగింపు సమయంలో ఏదైనా ఇబ్బందులు వస్తే పోలీసుల సహకారం కావాలని మారుతీరావు కోరారు. సైడు కాలువులు, రోడ్లు మార్జిన్లు ఆక్రమణలను ఉపేక్షించేది లేదని, తప్పనిసరిగా తొలగిస్తామని చెప్పారు. తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురానికి చెందిన ఎస్ వెంకటేశ్వరరెడ్డికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారులు ఎన్ రాజేష్, ఎం శ్రీనివాసులు తెలిపిన కేసు వివరాల మేరకు వైఎస్సార్ కడప జిల్లా, పోరుమామిళ్ల రేంజ్ ఫారెస్ట్ సిబ్బంది 2019లో ఇటుకుల పాడు బీట్ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి నిందితుడు వెంకటేశ్వరరెడ్డి వద్ద అక్రమంగా ఉన్న 17.50 కిలోల ఒక ఎర్రచందనం దుంగను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం వెంకటేశ్వరరెడ్డిపై రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఒంగోలు టౌన్: పిల్లల వ్యవహార శైలి, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తుండాలని టాస్క్ఫోర్స్ సీఐ సుధాకర్ అన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మాదకద్రవ్యాల నియంత్రణపై బుధవారం ప్రయాణికులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, సంబంధిత చట్టాలు, విధించే శిక్షల గురించి వివరించారు. సీఐ సుధాకర్ మాట్లాడుతూ పిల్లలు చెడు వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలను తరుచూ గ్రంథాలయాలకు తీసుకెళ్లడం, మంచి పుస్తకాలను చదివేలా అలవాటు చేయడం చాలా అవసరమన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలన్న లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కళాశాలల పరిసరాల్లో పోలీసు నిఘా కొనసాగుతుందని తెలిపారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పొగతాగుతున్న ఐదుగురిపై కేసులు నమోదు చేసి జరిమానా విధిచంచారు. డార్మిటరీలను తనిఖీ చేశారు. ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా , ఈగిల్ టీం సభ్యులు పాల్గొన్నారు. -
దేశీయ రొయ్యల పరిశ్రమను కాపాడండి
ఒంగోలు సబర్బన్: దేశీయ రొయ్యల పరిశ్రమను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జిల్లా రొయ్యల రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాఽథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక జిల్లా సంఘం కార్యాలయంలో మంగళవారం జిల్లా సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గోపీనాఽథ్ మాట్లాడుతూ ఆగ్నేయాసియా దేశాల నుండి తల్లి రొయ్యలను పీపీపీ పద్ధతిలో దిగుమతి చేసుకోవటానికి ఎత్తులు జరుగుతున్నాయన్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఈ నెల 22న ఢిల్లీలో కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశం ఏర్పాటు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆగ్నేయాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ప్రయత్నాలను నిలుపుదల చేసి దేశయ రొయ్యల పరిశ్రమను కాపాడాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యల్లో 70 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. 1990 దశకంలో ఆగ్నేయాశియా దేశాల నుంచి దిగుమతి అయిన తల్లి రొయ్యల నుంచి మన దేశంలోకి తెల్ల మచ్చల వ్యాధి వచ్చిందన్నారు. అదే విధంగా 2010లో ఈహెచ్పీ వ్యాధితో పాటు అనేక రకాల వ్యాధులు వచ్చి రాష్ట్రంలోని రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కంతూరి సుబ్బారెడ్డి, నాయకులు శింగంనేని అంజిబాబు, చేపల రమణయ్య, బత్తుల రమేష్ రెడ్డి, శ్రీనివాస రావు, నరేష్బాబు తదితరులు పాల్గొన్నారు. ఆగ్నేయాసియా దేశాల నుంచి తల్లి రొయ్యల దిగుమతి ఆపాలి జిల్లా రొయ్యల రైతుల సంఘం సమావేశం జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ -
ఇళ్లపై యమపాశాలు తొలగించండి
మార్కాపురం: పట్టణంలోని కరెంటు ఆఫీసు వెనుక వైపు వీధుల్లో మిద్దె ఎక్కితే చేతికందేంత ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని 17, 18 బ్లాక్ వైఎస్సార్ సీపీ ఇన్చార్జిలు షేక్ కరీముల్లా, సయ్యద్ గఫూర్, సీపీఐ నాయకులు అందె నాసరయ్య, ఎస్కు ఖాశీం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తర్లుపాడు రోడ్డులోని సబ్స్టేషన్ ఎదుట ప్రజలతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ తీగల కారణంగా సుమారు ఐదుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని, నాలుగు రోజుల క్రితం ఖాశిం అనే బాలుడికి విద్యుత్ తీగలు తగిలి ఒళ్లంతా కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఎంతమంది బలికావాలని ప్రశ్నించారు. మిద్దె ఎక్కాలంటే భయం వేస్తోందని, ఇలా ఎన్నాళ్లు భయం గుప్పిట్లో జీవించాలని నిలదీశారు. పిల్లలు, పెద్దలు దినదినగండంగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి విద్యుత్వైర్లను మార్చకుంటే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యుత్ షాక్ తగిలి చేతులు కోల్పోయిన పోసాని సుధీర్, శ్రీనును ధర్నాకు తీసుకొచ్చి వారి మానసిక ఆవేదనను వివరించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ధర్నాపై ఏడీఏ షియా నాయక్ స్పందించి ఆందోళనకారులతో మాట్లాడారు. త్వరలో విద్యుత్ వైర్లను మారుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వార్డు అధ్యక్షుడు గుర్రం వెంకటేశ్వర్లు, సయ్యద్ సర్దార్, సీఎం ఖాశిం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ మహబూబ్వలి, కాలనీవాసులు పాల్గొన్నారు. కాగా కాలనీ వాసుల ధర్నాతో తర్లుపాడు రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బంది, పోలీసులు కలిసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ నాయకుల డిమాండ్ మార్కాపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా -
విజ్ఞానయాత్రలతో ఎంతో మేలు
ఒంగోలు సబర్బన్: విజ్ఞాన యాత్రలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన రైతుల విజ్ఞాన యాత్రకు బయలుదేరిన బస్సులకు కలెక్టర్ సోమవారం రాత్రి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి బస్సులు బయలుదేరాయి. దర్శి, కురిచేడు, అద్దంకి, సింగరాయకొండ పరిసర ప్రాంతాల నుంచి 35 మంది రైతులను సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కుప్పం, పలమనేరు, గంగపాలెం, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉద్యాన పంటలు, ఉత్పత్తుల విలువ జోడింపు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణపై అవగాహన కోసం రైతులు బయలుదేరి వెళ్లారు. జిల్లా ఉద్యాన అధికారి వై గోపీచంద్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు విజ్ఞాన యాత్ర జరుగుతుందని తెలిపారు. రైతుల వెంట దర్శి ఉద్యాన అధికారి పి. రవి వెంకన్న బాబు, ఉద్యాన అధికారి దర్శి, కొత్తపట్నం ఉద్యాన విస్తరణ అధికారి వంశీకృష్ణ ఉన్నారు. కృషి చేయాలి కందుకూరు: కీటక జనిత వ్యాధులు, సీజనల్ వ్యాధుల నియంత్రణలో కీలక పాత్ర పోషించి ప్రజారోగ్య పరిరక్షణకు పాటుపడాలని జిల్లా మలేరియా అధికారి ఎన్ మధుసూదనరావు మగ ఆరోగ్య సహాయకులకు సూచించారు. లింగసముద్రం, వలేటివారిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన ఆయన స్థానిక ఎన్జీఓ హోంలో ఆరోగ్య సహాకులతో సమావేశం నిర్వహించారు. కీటక జనిత, సీజనల్ వ్యాధులపై ఆరోగ్య సహాయకులు ఆప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధులు ప్రబలితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రూపు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా పనిచేయాలన్నారు. సీహెచ్ఓ శ్రీనివాసులు, జీవీవీ ప్రసాదరావు, సబ్ యూనిట్ ఆఫీసర్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
నీరు తరలింపుపై రైతుల ఆగ్రహం
గుడ్లూరు: మండలంలోని చేవూరు చెరువు నుంచి ఇండోసోల్ కంపెనీ అనుమతులు లేకుండా నీరు తరలించేందుకు ప్రయత్నించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు నుంచి నీరు తరలించేందుకు కంపెనీ ప్రతినిధులు చెరువు కట్టకు రంధ్రం చేసి తూములు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న రైతులు చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువు నీరు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధులు, రైతులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. రైతులు కంపెనీ ప్రతినిధులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు అక్కడ నుంచి జారుకున్నారు. ఈ క్రమంలో రైతులు మాట్లాడుతూ చెరువు ఆయకట్టు కింద వరి సాగులో ఉందని, కొంత మంది రైతులకు ఇంత వరకు పరిహారం కూడా చెల్లించలేదన్నారు. చెరువులో మత్స్యశాఖ సొసైటీ ఆధ్వర్యంలో చేపలు సైతం ఉన్నాయని తెలిపారు. చెరువులో నీటిని వాడుకునేందుకు తమకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు వాదనకు దిగగా, చెరువు నీటి విషయంలో స్టే ఉందని రైతులు చెప్పారు. దీనిపై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా..చెరువు నీరు వాడుకోవడానికి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. చెరువు నీరు తరలించడంపై మండిపాటు -
రగ్బీ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
తాళ్లూరు: మండలంలోని బొద్దికూరపాడు హైస్కూల్ విద్యార్థి గుజ్జల అభినయ్రెడ్డి రగ్బీలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 21, 22 తేదీల్లో ఒడిశా రాష్ట్రాం కళింగ స్టేడియంలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో మన రాష్ట్రం తరఫున పాల్గొంటున్నట్లు పీడీ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు పి.సుబ్బారావు, గ్రామస్తులు అభినందించారు.కురిచేడు: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని పంటపొలాల్లో చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. పొలం పనులకు వెళ్లిన కూలీలు చెట్టుకు మృతదేహం వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్సై మోహన్రావు, సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడు మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామానికి చెందిన చల్లా సత్యనారాయణ(24)గా గుర్తించారు. మృతుని కుటుంబసభ్యులకు సమాచారం నిర్వహించారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.కొమరోలు: ఓ వ్యక్తి దుకాణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. ఈ సంఘటన స్థానిక గ్రామీణ బ్యాంక్ వీధిలో మంగళవారం జరిగింది. కలకత్తాకు చెందిన జహంగీర్ లస్కర్ (38) ఈ నెల 1వ తేదీన స్థానికంగా ఓ బొటెక్ షాపులో మగ్గం వర్క్ చేయడానికి పనికి కుదిరాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున జహంగీర్ లస్కర్ గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య ఉండగా, బంధువులు వచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.గుడ్లూరు: మండలంలోని చేకూరు అడవి లక్ష్మీపురం గ్రామాల మధ్య గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని ఎస్సై వి.వెంకట్రావు తెలిపారు. మృతునికి 60 నుంచి 65 మధ్య వయసు ఉంటుందని, మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతదేహాన్ని గుర్తుపట్టిన వారు 9121102206, 9440700027 నంబర్లను సంప్రదించాలని కోరారు.వినుకొండ/కురిచేడు: వ్యక్తిగత పనులపై వినుకొండ వచ్చిన ఎస్సై ఒకరు గుండెపోటుతో మృతి చెందిన విషాదఘటన వినుకొండ పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన డి.లక్ష్మీప్రసాద్ (60) గతంలో వినుకొండలో ఎస్సైగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం నరసరావుపేటలోని జిల్లా క్రైం బ్రాంచ్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే స్వగ్రామం కురిచేడులో నిర్మిస్తున్న గృహానికి సామగ్రి కొనుగోలు చేసేందుకు వినుకొండ రైల్వేస్టేషనుకు వచ్చిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే వినుకొండ పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. వినుకొండ పోలీసులు ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
సేవలకు ఉరి
సర్వేలతో సరి.. బేస్తవారిపేట: ప్రజల ముంగిటకే పాలన చేరువ చేయాలనే సంకల్పంతో ఏర్పాటైన సచివాలయాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒకవైపు సిబ్బంది కొరత, దీనికి తోడు ఉన్న ఉద్యోగులను సర్వేలంటూ ప్రభుత్వం రోడ్లపైనే తిప్పుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పింఛన్ల పంపిణీ, కుటుంబ సర్వేలు, రెవెన్యూ సదస్సులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన సర్వే శిక్షణ, పొలం పిలుస్తోంది వంటి ఇతరత్రా సర్వేల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. దీంతో కార్యాలయాలకు వచ్చే ప్రజలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. మండల కేంద్రాలకు పరుగు.. గతంలో ప్రజలు చిన్నపాటి సేవలకు సైతం మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు వ్యయప్రయాసలకోర్చి వెళ్లాల్సిన పరిస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల ముంగిటకే సేవలందించింది. ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 306 సచివాలయాలు, 2086 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విద్యార్థులకు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రం, ఓబీసీ, రైతులకు రిజిస్ట్రేషన్ సేవలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు–చేర్పులు, ఆధార్ సేవలు, పింఛన్ల నమోదు, రేషన్ కార్డుల నమోదు, జారీ..ఇలాంటి సేవలు నిరంతరం అందేలా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. ఇక్కడి ఉద్యోగులను ఇతర పనులకు వినియోగిస్తుండటంతో సేవలు అటకెక్కాయి. సర్వేలతో సరి.. సచివాలయ ఉద్యోగులను వివిధ సర్వేల పేరుతో తిప్పుతున్నారు. మొన్నటి వరకు పీ4 కార్యక్రమం బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు వాట్సప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించేలా డోర్ టు డోర్ పంపిస్తున్నారు. డ్రైడే–ఫ్రైడే అంటూ వీధుల్లో తిప్పుతున్నారు. మరోవైపు కుటుంబ సభ్యుల సర్వేకూ పురమాయించారు. సర్వే వివరాల సేకరణకు ఒక్కో ఇంట అరగంటకు పైగానే పడుతోంది. ఆధార్ అప్డేట్ ఈకేవైసీ, ఆధార్ సీడింగ్–వాహన డేటా, బయోమెట్రిక్ సర్వే, జీఎస్టీ అవగాహన, పింఛన్ల పంపిణీ ఇలా లెక్కకు మించిన బాధ్యతలు అప్పగించి బయటకు పంపిస్తున్నారు. స్పందనకు తిలోదకాలు.. ప్రజల సౌలభ్యం కోసం గ్రామ సచివాలయాల్లో గత ప్రభుత్వం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ సర్కారు నీరుగార్చింది. జిల్లాలో ఎక్కడా అధికారికంగా స్పందన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. దీంతో గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలు విన్నవించేందుకు కూడా ప్రతి సోమవారం మండల కేంద్రం, జిల్లా కేంద్రంలో నిర్వహించే స్పందన కార్యక్రమాలకు ప్రజలు ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అర్జీదారులు మారుమూల ప్రాంతాల నుంచి వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. టీడీపీ సర్కారు తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు ప్రజలకు చేరువైన సచివాలయ వ్యవస్థ నేడు నిర్వీర్యమవుతున్న వైనం సర్వేలకే పరిమితమవుతున్న ఉద్యోగులు ప్రజలకు అందని సేవలు -
బెస్ట్ ఎలక్టోరల్ ఆఫీసరుగా సబ్కలెక్టర్ శివరామిరెడ్డి
మార్కాపురం: మార్కాపురం ఇన్చార్జి సబ్కలెక్టర్ ఎం.శివరామిరెడ్డి ఓటర్ల జాబితా మ్యాపింగ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈనెల 25న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆవార్డు అందుకోనున్నారు. గిద్దలూరు నియోజకవర్గ ఎన్నికల అధికారిగా ఉన్న శివరామిరెడ్డి ఓటర్ల జాబితా, స్పెషల్ ఇంటెన్సివ్ సమ్మరీలో మంచి ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2002 ఎస్ఐఆర్ డేటాతో, 2026 ఎస్ఐఆర్ డేటాను సరిపోల్చడంలో శివరామిరెడ్డి జిల్లాలోనే ప్రతిభ కనబరిచారు. ఈనెల 25న ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ప్రస్తుతం ఆయన పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కంభం యూనిట్ ఎస్డీసీగా, మార్కాపురం ఇన్చార్జి సబ్కలెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శివరామిరెడ్డిని పలువురు అధికారులు అభినందించారు. మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షునిగా పట్టణానికి చెందిన ఎంఆర్కే బాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు షేక్ రఫీ ఆదేశాల మేరకు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ముస్లింల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు. మార్కాపురం: కర్నూలు, గుంటూరు, మార్కాపురం జిల్లాలో ఉన్న మొత్తం 23 ఆశ్రమ పాఠశాలలు ఇకనుంచి ఐటీడీఏ పరిధిలోనికి రానున్నాయి. ఈ మేరకు ఈనెల 19న ప్రభుత్వ కార్యదర్శి ఎంఎం నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ ఈ ఆశ్రమ పాఠశాలలన్నీ ఆయా జిల్లాల్లోని గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ ఆధీనంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఐటీడీఏ పరిధిలోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 3, నూతన మార్కాపురం జిల్లాలోని పుల్లలచెరువు, పెద్దారవీడు, యర్రగొండపాలెం, అర్ధవీడు, పెద్దదోర్నాల మండలాల్లో ఉన్న 14 ఆశ్రమ పాఠశాలలు ఇకనుంచి ఐటీడీఏ పరిధిలోకి రానున్నాయి. ఈ మూడు జిల్లాల్లోని ఆశ్రమ పాఠశాలలను పర్యవేక్షించే ఐటీడీఏ కార్యాలయం శ్రీశైలం ప్రాజెక్టు (సున్నిపెంట)లో ఉంది. పుల్లలచెరువు, పాణ్యం శివపురం, మహానంది, కొత్తచెరువు, అహోబిలం ఆశ్రమ పాఠశాలలు ఐటీడీఏ పరిధిలోకి రానున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన చెంచు విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం అందించే లక్ష్యంతో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. సింగరాయకొండ: పురాణ ప్రసిద్ధి చెందిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామికి పంచామృతాభిషేకం, తిరుప్పావడ సేవ నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఏడు నెలల ఆరు రోజులకు రూ. 5.57,374 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పి.కృష్ణవేణి తెలిపారు. కందుకూరు దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
పాఠశాలల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాలి
ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ భవన్లో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఇంజినీర్లతో ప్రత్యేకంగా మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అత్యవసరమైన అన్నిరకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. అందుకోసం ఎంఈఓలు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగా బాలికల టాయ్లెట్స్ పూర్తి చేసి వచ్చే మార్చి 8 మహిళా దినోత్సవం నాటికి వినియోగంలోకి రావాలన్నారు. ప్రహరీలు, అత్యవసరమైన రిపేర్లు తక్షణమే చేపట్టాలని అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త డి.అనీల్ కుమార్ ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ విద్యాశాఖ అధికారులు చంద్రమౌళీశ్వర్, ఎం.శ్రీనివాసులు, డీసీఈబీ సెక్రటరీ ఎం.శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరత్నంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ బలోపేతానికి సమష్టి కృషి
మార్కాపురం: వైఎస్సార్ సీపీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు అందరం కలసికట్టుగా కృషి చేద్దామని, వచ్చే ఎన్నికల్లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఆ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు పేర్కొన్నారు. పార్టీ గ్రామ కమిటీ నిర్మాణంలో భాగంగా మంగళవారం ఆయన తర్లుపాడు మండలంలోని గానుగపెంట, రాగసముద్రం, కలుజువ్వలపాడు గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాన్ని పక్కనబెట్టి, ప్రస్తుతం పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా తనతోపాటు పార్టీ కూడా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టాలెప్పుడూ కంటిన్యూగా ఉండవని, భవిష్యత్తు వైఎస్సార్ సీపీదే అని చెప్పారు. గ్రామ కమిటీలను పార్టీ శ్రేణుల ఆమోదంతోనే ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పార్టీ పదవులు పొందిన నాయకులంతా కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ముందుగా ఆయా గ్రామాల్లో అన్నా రాంబాబుకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఆయా సమావేశాల్లో ఎంపీపీ భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మురారి వెంకటేశ్వర్లుతోపాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులైన బాలయ్య, చెన్నకేశవులు, రమణారెడ్డి, శిఖామణి, పోటు గురవయ్య, మందా కొండారెడ్డి, తిరుపతిరెడ్డి, భూపాల్రెడ్డి, శివారెడ్డి, మహేష్, చార్లెస్, దేవిరెడ్డి భాస్కర్రెడ్డి, రమేష్రెడ్డి, తిరుపాలయ్య, గుమ్మా రాజేంద్ర ప్రసాద్, గాయం బొర్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ కష్టమొచ్చినా తనతోపాటు పార్టీ అండగా ఉంటుంది కార్యకర్తలు, నాయకులకు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు భరోసా తర్లుపాడు మండలంలో గ్రామ కమిటీల ఏర్పాటుపై సభలు -
సచివాలయ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి
● కడప ఉద్యోగి మృతికి క్యాండిల్ ర్యాలీ మార్కాపురం: సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం పనిభారం తగ్గించాలని ఏపీఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బీవీఎస్ శాస్త్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో పనిఒత్తిడితో చనిపోయిన హెల్త్ సెక్రటరీ విజయకుమారి మృతికి నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. డాక్టర్ శాస్త్రి మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించి నిర్ధిష్టమైన జాబ్చార్టు తయారుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సచివాలయాలకు చెందిన 30 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పనిఒత్తిడితో మృతి చెందిన విజయకుమారికి ఘనంగా నివాళులర్పించారు. -
కలెక్టర్కు ప్రత్యేక అవార్డు
ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ సమ్మరీ (ఎస్.ఐ.ఆర్) –2026లో ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబుకు ప్రత్యేక అవార్డు దక్కింది. ఓటర్ల మ్యాపింగ్లో సాధించిన పురోగతికిగాను బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్స్–2025కు ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. 2002 ఎస్ఐఆర్ డేటాతో 2026 ఎస్ఐఆర్ డేటాను సరిపోల్చటంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 25వ తేదీన విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును కలెక్టర్ అందుకోనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.రాజా బాబును పలువురు జిల్లా అధికారులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కలెక్టర్ను అభినందించిన వారిలో డీఆర్ఓ బీసీహెచ్.ఓబులేసుతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారులు ఉన్నారు. -
ప్రయాణం చేయలేక!
● సరైన ప్రత్యామ్నాయం చేయని ఆర్టీసీ కనిగిరిరూరల్: సంక్రాంతి పండుగ ముగిసింది. పల్లెల నుంచి పట్టణాలకు విద్యార్థులు, ఉద్యోగులు, బంధుగణం తిరుగు ప్రయాణబాట పట్టారు. దూరప్రాంతాల నుంచి పండగ సంబరాలను కుటుంబ సమేతంగా స్వగ్రామాల్లో చేసుకునేందుకు వచ్చిన వారు విజయవాడ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, వైజాగ్ తదితర ప్రాంతాలకు తిరుగు ప్రయాణం కావడంతో పట్టణంలో ట్రాఫిక్ పెరిగింది. ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల రద్దీ పెరిగి. ప్లాట్ ఫారంలో నిలబడేందుకు చోటు కరువైంది. కనిగిరి అనగానే గుర్తుకు వచ్చే వలస జీవులు అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 45 వేల మంది ఓటర్లు కనిగిరి వాసులు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆదివారం అమావాస్య కావడంతో కొందరు శనివారం రాత్రి వెళ్లారు. మిగతా వారంతా పూర్తి స్థాయిలో సోమవారం ప్రయాణమయ్యారు. బస్సులు లేక పోవడంతో ప్రయాణికులు గ్యారేజ్ పాయింట్ వద్దకు కూడా వెళ్లి బస్సులో సీటు కోసం ఎగబడిన దృశ్యాలు సోమవారం కనిగిరి ఆర్టీసీ డిపోలో కన్పించాయి. ప్రధానంగా కనిగిరి టు విజయవాడ, కనిగిరి టు ఒంగోలుకు బస్సుల్లో ప్రయాణికుల తోపులాటలు కనిపించాయి. ఉచిత బస్సుల్లో అయితే ఇక ఖాళీ అనే మాటే కన్పించలేదు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ రేట్లను పెంచి దోచుకున్నారు. సాధారణ సమయంలో ఉండే టిక్కెట్లు రేట్లకు రెండితలు అధిక ధరలు పెంచినట్లు ప్రయాణికులు తెలిపారు. త్వరగా వెళ్లాలి అనుకున్న వారు కొందరు మంది కనిగిరి డిపో నుంచి నేరుగా విజయవాడకు బస్సులు ఖాళీ లేక పోవడంతో పొదిలి, కందుకూరు డిపోలకు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు మాట్లాడుకుని వెళ్లారు. మార్కాపురంలో... మార్కాపురం: సంక్రాంతి పండుగ అనంతరం మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, నంద్యాల, శ్రీశైలం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తగినన్నీ బస్సు సర్వీసులు లేకపోవడంతో బస్టాండ్ ప్రాంగణం మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. బస్సు కనిపిస్తే చాలు పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్కే వారు కొందరైతే, కిటికీల్లో నుంచి దూరి కండువాలు, కర్చీఫ్లు వేసే వారితో ఆ ప్రాంగణం మొత్తం గందరగోళంగా మారింది. ఉదయం 6 గంటల నుంచే పండగకు వచ్చిన బంధుమిత్రులంతా బస్టాండ్కు వచ్చి బస్సులు లేక విసుగుచెందారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ, ఒంగోలుకు 7 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని, సోమవారం రాత్రికి హైదరాబాద్కు 3 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు డీఎం నరసింహులు తెలిపారు. పండుగ అనంతరం ఉద్యోగాలు చేసే ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్కు చేరుకున్న ప్రజలు తగినన్నీ బస్సులు లేకపోవడంతో నిరుత్సాహ పడ్డారు. బెంగళూరు, చైన్నెకి వెళ్లే సాఫ్ట్వేర్ ఉద్యోగులు బస్సులు దొరక్క ప్రైవేట్ బస్సులను ఆశ్రయించారు. మార్కాపురం నుంచి చైన్నెకి నేరుగా ఆర్టీసీ బస్సు లేదు. గిద్దలూరు డిపో నుంచి మాత్రమే చైన్నెకి వెళ్లే బస్సు ఉంది. కొంత మంది బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను బాడుగకు మాట్లాడుకొని వెళ్లారు. -
మోసగాడు అరెస్టు
గుడ్లూరు: పోన్ పే చేస్తా..నగదు ఇవ్వాలని నకిలీ స్క్రీన్ షాట్ చూపించి మోసగించబోయిన వ్యక్తిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే..బెయిన్ బజారులో గుర్తు తెలియని వ్యక్తి సెల్ దుకాణంలోకి వెళ్లి పోన్ పే చేస్తాను.. నగదు ఇవ్వమని అడిగాను. దీనికి దుకాణదారుణ సరే అనడంతో నగదు పోన్పే చేసినట్లు స్క్రీన్ చూయించాడు. అయితే దుకాణదారుడు తన మొబైల్లో చెక్ చేసుకోగా నగదు జమ కాలేదు. దీనిపై సదరు వ్యక్తిని ప్రశ్నించగా నెట్వర్క్ సక్రమంగా లేదని మెల్లగా జారుకున్నాడు. ఇటీవల ఇదే తరహాలో మోసం జరగడంతో స్థానికులు సాయంతో మాచవరంరోడ్డు వైపు వెళుతున్న ఆ వ్యక్తిని పట్టుకొని ప్రశ్నించారు. అయితే వారి నుంచి తప్పించుకోని పారిపోతుండగా వెంబడి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఒంగోలు మెట్రో: ప్రకాశం జిల్లా రచయితల సంఘ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది భీమనాథం హనుమారెడ్డి వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. స్థానిక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పొన్నూరు శ్రీనివాసులు, కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు, సంఘ ప్రధాన కార్యదర్శి యత్తపు కొండారెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొని వ్యక్తి మృతి
టంగుటూరు: డివైడర్ను ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వల్లూరు జాతీయ రహదారి ఫ్లైఓవర్పై సోమవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. గూడూరు గ్రామానికి చెందిన బొమ్మిడి మోహన్(28) హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ పండుగ సెలవులకు స్వగ్రామానికి వచ్చి వచ్చాడు. సెలవుల అనంతరం హైదరాబాద్ వెళుతుండగా వల్లూరు సమీపంలో ఫ్లైఓవర్పై ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.అద్దంకిరూరల్: విద్యుదాఘాతానికి విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని తిమ్మాయపాలెంలో సోమవారం సాయంత్రం జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. అద్దంకిలోని గుర్రాలకాలనీకిచెందిన దాసరి సింగయ్య దంపతులు తిమ్మాయపాలెం లోని ఇటుకబట్టీల వద్ద కూలీ పనిచేస్తూ జీవిస్తున్నారు. సింగయ్య కుమార్తె సుస్మిత (13) 9వ తరగతి చదవుతుంది. బట్టీల వద్ద ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన సుస్మిత ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు హుటాహుటిన అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. సింగయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
ఒంగోలులో పోలీసు స్పందనకు 48 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 48 ఫిర్యాదులు వచ్చాయి. భూ వివాదాలు, ఆర్థిక మోసాలు, అత్తారింటి వేధింపులు, చీటింగ్ వంటి ఫిర్యాదులు అత్యధికంగా వచ్చాయి. సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు బాధితులు తమ సమస్యలను నేరుగా పోలీసు అధికారులకు విన్నవించుకున్నారు. రాత పూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసు అధికారులు వారితో నేరుగా మాట్లాడి ఫిర్యాదుల పూర్వాపరాలడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదుల మీద చట్టపరంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ వీవీ రమణ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, కొండపి సీఐ సోమశేఖర్, సంతమాగులూరు సీఐ టి.వెంకటరావు, పీసీఆర్ సీఐ దుర్గా ప్రసాద్, ప్యానల్ అడ్వకేట్ బి.బాలాజీ సింగ్, మీ కోసం ఎస్సై జనార్దన్రావు పాల్గొన్నారు. -
ప్రతి బిడ్డకు టీకాలు వేయాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు ఒంగోలు టౌన్: ప్రతి ఒక్క శిశువుకు తప్పనిసరిగా టీకాలు వేయాలని, ఏ ఒక్కరినీ మిస్ చేయడానికి వీలులేదని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాలులో వ్యాక్సిన్–ప్రివెంటివ్ డిసీజెస్ అంశంపై సోమవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ విషయాన్ని వైద్యాధికారులందరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. శిశువు వయసును బట్టి క్రమం తప్పకుండా టీకాలు అందించాలని చెప్పారు. ప్రతి బుధవారం, శనివారం జరిగే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం గురించి ముందుగానే ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. టీకాలు వేయించడం వలన వ్యాధులు రావని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తర్వాత నెలలో ఏ తేదీ టీకా వేయడం జరుగుతుందో ముందుగానే తెలియజేయాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో అందించడం ద్వారా శిశు మరణాలు నివారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కమల శ్రీ, నోడల్ అధికారి డాక్టర్ భగీరధి పాల్గొన్నారు. -
ప్రజాదరణ చూసిపచ్చనేతలకు మతి భ్రమించింది
యర్రగొండపాలెం: సంక్రాంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్ల పందేలకు విశేష ఆదరణ, వచ్చిన జనాదరణ చూసి పచ్చ నాయకులకు మతి భ్రమించిందని వైఎస్సార్ సీపీ నాయకులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొని మాట్లాడారు. మతి భ్రమించిన వారికి ఎమ్మెల్యే అనే పదానికి అర్థం తెలియడం లేదని, సర్పంచ్ పదవికి కూడా అనర్హులు కాని వారంతా ఎమ్మెల్యేపై పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికార మదంతో పోలీసుల అండచూసుకొని ప్రజల ఓట్లతో ఎన్నికై న ఎమ్మెల్యే పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇసుక, మట్టి, పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం దోచుకుంటున్నారని, అటువంటి వారే టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్బాబు చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ క్రెడిబుల్టీ ఉన్న వ్యక్తి కావడం వల్లే ప్రజల పక్షాన నిలబడి అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్ల పందేలను గాడిద పందాలని ఎగతాళి చేసిన టీడీపీ నాయకులు ఒంగోలు జాతి సంరక్షణ కమిటీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చిలకలూరిపేట, నరసరావుపేటలలో నిర్వహించిన పందేలు కూడా గాడిద పందాల అని వారు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే అభివృద్ధి.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి జరిగిందన్నారు. యర్రగొండపాలెం, పెద్దదోర్నాలలో ఆర్టీసీ బస్టాండ్, ఏఎంసీ కార్యాలయాలు, రైతు బజార్ ఏర్పాటు, 100 పడకల వైద్యశాల, నాడు–నేడు కింద నియోజకవర్గంలోని పాఠశాలలు ఆధునికీకరణ, రోడ్లు అభివృద్ధి లాంటివి అనేకం జరిగాయని గుర్తు చేశారు. 18 నెలల చంద్రబాబు పాలనలో ఏం చేశారని చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వ కాలంలో మంజూరై ఎన్నికల కోడ్తో నిలిచిపోయిన రోడ్ల పనులు ఇప్పుడు ప్రారంభించి తమ ఖాతాలో వేసుకొని జబ్బలు కొట్టుకుంటున్నారన్నారు. 2029లో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే చంద్రశేఖర్ మరోసారి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని, దమ్ముంటే ఎరిక్షన్బాబు టికెట్ తెచ్చుకొని పోటీ చేయాలని, అప్పుడు ఆయనకు కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదని సవాల్ విసిరారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ గ్రామాన వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడుతుందన్నారు. ప్రస్తుతం 96 పంచాయతీల్లో 80 మంది సర్పంచ్లు మా పార్టీకి చెందినవారేనని గుర్తు చేశారు. స్థాయి లేని నాయకులు మాట్లాడే సమయంలో ఎదుటి వారి స్థాయిని గుర్తించాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల అరుణ, ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్.బుజ్జి, మండల పార్టీ కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, సింగారెడ్డి పోలిరెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, పెద్దారవీడు ఎంపీపీ బెజవాడ పెద్దగురవయ్య, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కె.ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, కందూరి కాశీవిశ్వనాథ్, ఆర్.అరుణాబాయి, తోకల ఆవులయ్య, యేర్వ శేషసేనారెడ్డి, ఎల్.రాములు, పి.రాములు నాయక్, షేక్.ఫజుల్, షేక్.మహమ్మద్ కాశీం, సింగా ప్రసాద్, ఒంగోలు సుబ్బారెడ్డి, పెద్దకాపు వెంకటరెడ్డి, వై.రాంబాబు, టి.రాంబాబు, కొండయ్య, ఆవుల రమణారెడ్డి, పల్లె సరళ పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యేపై పిచ్చిప్రేలాపనలు చేయడం తగదు అధికార మదంతో ప్రోటోకాల్ లాక్కున్నారు విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకుల ధ్వజం -
బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి
● ఎస్పీ హర్షవర్ధన్ రాజు మార్కాపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఎస్పీ హర్షవర్ధన్రాజు ఆదేశించారు. స్థానిక కార్యాలయంలో ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధన్రాజు అధ్యక్షతన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేసి సత్వర పరిష్కారం కల్పిస్తామని, బాధితులకు భరోసా కల్పించారు. ఫిర్యాదులపై ఆయా స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియచేసి త్వరితగతిన విచారించి న్యాయం చేయాలన్నారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 37 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీఎస్పీ యు నాగరాజు, సీఐ సుబ్బారావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
యోగి వేమనకు కలెక్టర్ నివాళులు
ఒంగోలు సబర్బన్: విశ్వకవి యోగి వేమన జయంతిని పురస్కరించుకుని సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో కలెక్టర్ పి.రాజాబాబు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. వేమన శతకాల గురించి మాట్లాడా రు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్రెడ్డి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు.. వేమన : ఎస్పీ ఒంగోలు టౌన్: సమాజంలోని కులమత వ్యత్యాసాలను తీవ్రంగా వ్యతిరేకించిన మహనీయుడు యోగి వేమన అని, ఆయన బోధించిన నీతి పద్యాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎస్పీ హర్షవర్థన్రాజు కొనియాడారు. మహాకవి యోగి వేమన జయంతి సందర్భంగా సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో మూఢాచారాల నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త యోగి వేమన అని అన్నారు. మానవ జీవితానికి సంబంధించిన అనేక నిత్య సత్యాలను సామాన్యుడు సైతం సులువుగా పలికే విధంగా తేటతెనుగు పదాలతో ఆవిష్కరించారని తెలిపారు. వేమన పద్యాల్లోని జీవిత సత్యాలు నేటి కాలానికి ఎంతో అవసరమని, ఆయన బోధించిన నైతిక విలువలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ● ఇన్చార్జి సబ్కలెక్టర్ శివరామిరెడ్డి మార్కాపురం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గ్రామాల్లో కొంతమందికి రూ.80 కోట్లతో ఆర్అండ్ఆర్ పరిహారానికి ప్రతిపాదనలు పంపామని, మార్చి లోగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమవుతుందని ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. లక్ష్మీపురం, సాయి నగర్, అక్కచెరువు తాండ, సుంకేశులలో కొంతమందికి, కృష్ణానగర్, రామ లింగేశ్వరపురం, చింతలముడిపి, కాటంరాజు తండాలో ఉన్న నిర్వాసితులకు నష్టపరిహారం షందజేస్తామన్నారు. ఓసీ, బీసీ కుటుంబాలలో అర్హులైన ఒక్కో కుటుంబానికి రూ.11.76 లక్షలు, ఎస్సీలకు రూ.12.50 లక్షలు, ఎస్టీలకు రూ.13.01 లక్షలు అందజేస్తామన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. మార్కాపురం: పట్టణ శివార్లలోని డ్రైవింగ్ స్కూల్కు చెందిన లారీ సోమవారం సాయంత్రం మంటల్లో కాలిపోయింది. ఈ లారీని డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యం హెవీ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ట్రయల్ కోసం ఉపయోగిస్తుంటారు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా క్యాబిన్ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు గుర్తించి అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు మంటలను చల్లార్చారు. ప్రమాదంలో రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనపై డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాళ్లూరు: అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ సంఘటన సోమవారం స్థానిక గంగమ్మ తల్లి దేవస్థాన సమీపంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..మండలంలోని తూర్పు గంగవరం చీమకుర్తి ప్రధాన రోడ్డు మార్గాన గంగమ్మ తల్లి దేవస్థానం సమీపంలో అధిక వేగంతో వస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
భక్తిభావాన్ని చాటిన ‘షిర్డీ సాయి దివ్య చరితం’
ఒంగోలు మెట్రో: స్థానిక పీవీఆర్ హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ కళాపరిషత్ హాలులో సోమవారం రాత్రి శ్రీ నళినీ ప్రియ కూచిపూడి నృత్యానికేతన్ వారు ప్రదర్శించిన శ్రీ షిర్డీ సాయి దివ్య చరితం అనే కూచిపూడి నృత్య రూపకం ప్రేక్షకులను భక్తిభావ సముద్రంలో ముంచెత్తింది. సాయి బాబా జీవితం, బోధనలు, మహిమలను కళాత్మకంగా ఆవిష్కరించిన ఈ ప్రదర్శన ఆధ్యాత్మికతకు అద్భుతమైన దర్పణంగా నిలిచింది. సాయి బాబా షిర్డీ ప్రవేశం శాంత స్వరూపంగా, దైవత్వాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది. ఆయన చూపిన కరుణ, జీవ కారుణ్యం, దుఃఖితుల పట్ల అపారమైన ప్రేమ, సహానుభూతి నాట్యాభినయంతో హృదయాన్ని తాకి ఆకట్టుకుంది. ఈ నృత్య రూపకంలో మత సామరస్యం ప్రధాన సందేశంగా నిలిచింది. ఈ ప్రదర్శనలో సుమారు 40 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. -
జాళ్లపాలెం విద్యార్థిని పుస్తకానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు
కొండపి: మండలంలోని పెద్ద కండ్లకుంట పంచాయతీ జాళ్లపాలెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ యూపీ పాఠశాలలోని విద్యార్థిని రాసిన పుస్తకానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంచికంటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పెద్ద కండ్లగుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న చింతగుంట్ల గీతిక ఎనిమిదో తరగతిలో రాసిన కథలు, కవితలు ‘వేదన’ సంకలనంగా ‘మరో గ్రంథాలయ ఉద్యమం’ పక్షాన ప్రచురించారన్నారు. విద్యార్థుల రచన విభాగంలో పాఠశాల గ్రంథాలయాలకు ఈమె రాసిన పుస్తకం ఎంపిక చేశారని రాష్ట్ర విద్యాశాఖ తెలియజేసిందని చెప్పారు. ఈ సందర్భంగా జాళ్లపాలెం, పెద్ద కండ్లగుంటకు చెందిన ఉపాధ్యాయులు గీతికకు అభినందనలు తెలిపారు. గీతిక మాట్లాడుతూ మంచికంటి మాస్టారు ఇచ్చిన పుస్తకాలను చదివిన తర్వాత తనకు కథలు రాయాలని కుతూహలం కలిగిందని, చుట్టూ జరిగే విషయాలతో తాను రాసిన కథలు, కవితలను మాస్టారుకు వివరించగా ఆయన మెచ్చుకొని వాటిని సరిదిద్ది వాటికి బొమ్మలు వేయించి పుస్తకంగా ప్రచురించి ఇంత గుర్తింపు రావడానికి కారణమయ్యారని తెలిపారు. మార్కాపురం టౌన్: రిపబ్లిక్ డే వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం సబ్కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్య్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని, అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడం, ప్రోటోకాల్ విషయంలో లోపం లేకుండా చూసుకోవాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాల్స్, శకటాలను ఏర్పాటు చేయాలని, సంబంధిత శాఖాధికారులకు దిశానిర్దేశం చేశారు. 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు సబ్కలెక్టర్ నివాసంలో ఎట్హోమ్ కార్యక్రమం ఉంటుందన్నారు. సమావేశంలో డీఆర్ఓ ఓబులేసు, ఇన్చార్జి సబ్కలెక్టరు శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఒంగోలు వన్టౌన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు. ఈనెల 27వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు, ఫిబ్రవరి 23వ తేదీ నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నందున అధికారులతో కలెక్టర్ సోమవారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలు, జిల్లాలోని పరిస్థితిని ఆర్ఐఓ ఆంజనేయులు ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ స్పందిస్తూ వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ పరీక్షల నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, కస్టోడియన్లు, సిట్టింగ్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలని చెప్పారు. ప్రశ్న పత్రాలు, ఆన్సర్ షీట్స్ తరలింపు సమయంలో బందోబస్తు, పరీక్షల సమయంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యం, పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, వైద్య శిబిరం ఏర్పాటు, పారిశుద్ధ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాక్టికల్స్ పరీక్షల దృష్ట్యా ఆయా కేంద్రాల పరిధిలోని తహసీల్దార్లు, ఎస్సైలు మంగళవారం నుంచే కేంద్రాలను తనిఖీ చేసి మౌలిక సదుపాయాలను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసేందుకు ఆర్ఐఓ కార్యాలయంలో మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసేలా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 08592– 281275, 9502023072 నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూం పనిచేస్తుందని ఆర్ఐఓ తెలిపారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ ఇలా.. ప్రకాశం, మార్కాపురం జిల్లాలను ఉమ్మడిగానే పరిగణలోకి తీసుకొని ఈ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరుగుతాయి. జనరల్ ప్రాక్టికల్స్ కోసం 99 సెంటర్లు, ఒకేషనల్ ప్రాక్టికల్స్ కోసం 34 సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్ పరీక్షలు నాన్–జంబ్లింగ్ విధానంలో జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఒకేషనల్ ప్రాక్టికల్స్ కోసం మొదటి సంవత్సరం 1939 మంది, రెండో సంవత్సరం 1665 మంది హాజరుకానున్నారు. జనరల్ ప్రాక్టికల్స్ విభాగంలో మొదటి ఏడాది ఏమీ ఉండవు. రెండో ఏడాది 9956 మంది విద్యార్థులు హాజరవుతారు. మొత్తంగా ప్రాక్టికల్స్ పరీక్షలకు 13,560 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పబ్లిక్ పరీక్షల కోసం 67 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు జనరల్ కేటగిరీలో 18,712 మంది, ఒకేషనల్ కేటగిరీలో 1770 మంది హాజరవుతారు. రెండో సంవత్సరం పరీక్షలకు జనరల్ కేటగిరీలో 20,735 మంది, ఒకేషనల్ కేటగిరీలో 1539 మంది హాజరవుతారు. మొత్తంగా పబ్లిక్ పరీక్షలను 42,756 మంది విద్యార్థులు రాస్తారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించనని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డీఈవో రేణుక, ఆర్టీసీ సూపరింటెండెంట్ ఫణి కుమార్, ఏపీ సీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, డీఎస్పీ రమణ కుమార్, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. -
గడువులోగా అర్జీలు పరిష్కరించాలి
మార్కాపురం: నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆయా అర్జీలను సంబంధిత రెవెన్యూ అధికారులకు, రెవెన్యూ క్లినిక్కు పంపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. రెవెన్యూ సమస్యలే అధికం: జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారుల్లో ఎక్కువగా రెవెన్యూ సమస్యలే ఉన్నాయి. దీంతో వచ్చిన అర్జీలను కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్కు పంపారు. ఆయా మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఆ అర్జీలను స్వీకరించారు. డీఆర్ఓ చిన్న ఓబులేష్, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు శివరామిరెడ్డి, కేశవర్ధన్రెడ్డి, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ, మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి, కమిషనర్ నారాయణరావు, వ్యవసాయశాఖ ఏడీ బాలాజీ నాయక్, హౌసింగ్ డీఈ పవన్కుమార్, ఎలక్ట్రిక్ ఈఈ నాగేశ్వరరావు, ఆర్టీఓ చందన, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మొత్తం 165 అర్జీలు రాగా అందులో 92 రెవెన్యూ శాఖ అర్జీలు, 76 ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలు వచ్చినట్లు తెలిపారు. నష్టపరిహారం ఇప్పించండి 2024 డిసెంబర్ 30 న పొలానికి వెళ్లిన మా అమ్మ సుబ్బలక్ష్మమ్మ కరెంటు షాక్కు గురై మృతి చెందింది. ఆ కేసుకు సంబంధించి ఇంత వరకూ నిందితులను అరెస్టు చేయడం కానీ, నష్టపరిహారం కానీ ఇప్పించలేను. చాలా సార్లు ఈ సమస్యను పరిష్కరించాలని కోరాం. ఇప్పటికై నా నా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా. – మీనిగ పుల్లయ్య, వెంకటాపురం, బేస్తవారిపేట మండలం -
రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించండి
దర్శి: సీహెచ్సీలో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి రోగులకు మెరుగైన సేవలు అందించాలని దర్శి ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశించారు. స్థానిక సీహెచ్సీని సోమవారం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సందర్శించారు. ముందుగా ఓపీ కౌంటర్ వద్ద ఓపీ చేస్తున్న విధానం పరిశీలించి రోగులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు సకాలంలో మందులు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. వ్యాధిగస్తులకు ఎన్ని రోజులకు మందులు ఇస్తున్నారు, ఆస్పత్రిలో వైద్యుల సిబ్బంది పనితీరు ఎలా ఉంది అని వారిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి వారికి తగు సూచనలిచ్చారు. అనంతరం వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఆస్పత్రిలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణం మొత్తం తిరిగి పరిశీలించి బాత్రూంలు, డ్రైనేజీ వంటి సౌకర్యాల ఏర్పాటుపై చర్చించారు. ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న విధానంపై వైద్య సేవ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శివ ప్రసాద్ రెడ్డితో గర్భిణులు మాట్లాడుతూ తమకు కూర్చోవడానికి కుర్చీలు లేవని, ఓపీ అయ్యే వరకు నిలబడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే కుర్చీలు ఏర్పాటు చేయిస్తానని శివప్రసాద్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. అనంతరం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రిలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని గౌరవించి ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు అందించాలని సూచించారు. మందుల కొరత ఉంటే వెంటనే తెప్పించుకొని పూర్తిస్థాయి వైద్యాన్ని ఆస్పత్రిలోనే అందించాలని చెప్పారు. పేద రోగులు ప్రైవేటు ఆస్పత్రిలోకి వెళ్లకుండా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రతి వైద్యులు వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. పలు ప్రమాదాల్లో ఇతర కారణాలతో రాత్రిపూట వచ్చే రోగులకు కూడా అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆనందబాబు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
బొట్లగూడూరులో దాడిపై నాన్బెయిలబుల్ కేసు పెట్టాలి
ఒంగోలు సబర్బన్: కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని బొట్లగూడూరులో మీమల దిన్నె మహేష్పై జరిగిన దాడిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని జిల్లా రజక సంఘ నాయకులు అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులతో పాటు జిల్లా రజక సంఘ నాయకులు సోమవారం ఒంగోలు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారాన్ని చూపాలని కలెక్టర్ పీ రాజాబాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, జాన్సన్, కళావతిలతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి పలు సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి నాణ్యతతో వాటి పరిష్కారానికి సంబంధించిన అర్జీని వెబ్ సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో మొత్తం 308 వినతులు రాగా అందులో రెవెన్యూ సంబంధిత అంశాలపై 195 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రమాదాల దారి
ఆధ్యాత్మిక తోవ..చింతల వద్ద రోడ్డు కుంగటంతో లోయ వైపునకు ఒరిగిన ఓ వాహనం (ఇక్కడ 500 అడుగుల లోయ ఉంది)పెద్దదోర్నాల: జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీశైలం ప్రధానంగా ఉంది. నల్లమల అటవీ ప్రాంతం పర్యాటకులకు స్వర్గధామం. దీంతో దేశం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం క్షేత్రానికి ఘాట్ రోడ్డు ప్రయాణం ఉంటుంది. 50 కిలో మీటర్లు దూరం ఉండే రహదారి అంతా ఘాట్ రోడ్డే. ఈ మార్గంలో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు ఎన్నో రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది భక్తులు వందలాది వాహనాల్లో ఈ రహదారి మీదుగా శివ క్షేత్రానికి చేరుకుంటారు. సాధారణ రోజుల్లో రోజుకు 500 వరకూ చిన్నా, పెద్దా వాహనాలు వస్తుంటాయి. సెలవు, ప్రత్యేక రోజుల్లో పుణ్యక్షేత్రానికి వచ్చే వాహనాల రద్దీ రెట్టింపు ఉంటుంది. అలాగే శ్రీశైలంతో పాటు, శ్రీశైలం ప్రాజెక్టు కాలనీల్లో చేపడుతున్న నిర్మాణాలకు అవసరమైన నిర్మాణ సామాగ్రిని తరలిస్తూ అధిక లోడుతో వెళ్లే వాహనాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా నిత్యం ప్రయాణిస్తున్న అధిక లోడు వాహనాల వల్లే రహదారులు కుంగుతున్నాయని పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడు దశాబ్దాలకు ముందు ఘాట్కు బీజం... 1955కు ముందు నల్లమల మీదుగా శ్రీశైలం ప్రయాణం కష్టతరంగా ఉండేది. వన్యమృగాల బెడద, కారడవి మార్గంలో భక్తులు కష్టాలు పడేవారు. 1950లో అప్పటి మద్రాసు సీఎం, ఆర్థిక మంత్రులు ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక చేశారు. 1955–57లో రూ.69 లక్షల వ్యయంతో 49 కిలోమీటర్ల ఈ రహదారి పూర్తి చేశారు. ఓ వైపు కొండను తొలిచి రహదారులను నిర్మించారు. అప్పటి నుంచి అప్పుడప్పుడూ రహదారి మరమ్మతు పనులు చేపడుతూ వస్తున్నారు. అయితే నాటి పరిస్థితులకు, నేటికీ ఎంతో వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు దేవస్థానానికి చెందిన వాహనాలు, కొన్ని ప్రైవేట్ వాహనాలు మాత్రమే భక్తులతో ఈ రహదారిలో ప్రయాణించేవి. నేడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం తరలి వచ్చే వాహనాల సంఖ్యకూడా అంతే స్థాయిలో పెరిగింది. అలాగే శ్రీశైల పుణ్యక్షేత్రంతో పాటు, శ్రీశైలం ప్రాజెక్టు కాలనీల్లో ఏ నిర్మాణం జరిగినా సిమెంట్, ఇటుక, ఇసుక, డస్ట్ తదితర నిర్మాణ సామగ్రి మండల కేంద్రమైన దోర్నాల నుంచే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో లారీ, టిప్పర్ యజమానులు ఎక్కువ టన్నేజీతో ఆయా సామాగ్రిని శ్రీశైలం తరలిస్తుండటం వల్లే రోడ్లు ఇలా ప్రమాదకర స్థాయికి చేరాయని తెలుస్తోంది. పలు చోట్ల లోయల వైపు కుంగుతున్న రహదారులు.... ఘాట్ రోడ్డులో లోయల అంచులకు రక్షణగా నిర్మించిన గోడలు దెబ్బతినటంతో పాటు, పలు చోట్ల రహదారులు లోయల వైపు కుంగుతున్నాయి. ముఖ్యంగా చింతల, తుమ్మలబైలు, చిన్నారుట్ల వద్ద ఉన్న జిలేబీ టర్నింగ్ ఘాట్రోడ్లలో పలు చోట్ల రహదారులు లోయల వైపునకు కుంగి ప్రమాదకరంగా మారాయి. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో రహదారులు నిట్టనిలువునా చీలిపోయి భక్తులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దీంతో లోయ వైపు ప్రయాణించాలంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. శ్రీశైలం ఘాట్రోడ్లలో ప్రమాదకర మలుపులతో కూడిన ఘాట్రోడ్లు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో వెయ్యి అడుగులపైనే లోతున్న ప్రమాదకరమైన లోయలున్నాయి. అధికారులు ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రోడ్ల ఆధునుకీకరణ కోసం కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నారు. అయితే కుంగుతున్న రోడ్ల గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో తుమ్మలబైలు ఘాట్లో రోడ్డు ఓ వైపునకు కుంగి పోవటంతో లారీ లోయలోకి జారి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సుమారు వెయ్యికి పైగా అడుగుల లోతున్న ఈ ప్రాంతంలో రోడ్లు కృంగి ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయన్న విషయాన్ని ఇప్పటికై నా అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ప్రధాని మోదీ శ్రీశైలానికి వచ్చారు. ఈ సందర్భంగా మొక్కుబడిగా రహదారులు మరమ్మతులు చేపట్టి మమ అనిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్ విస్తరణ చేపడతామని అధికార యంత్రాంగం చెబుతున్నా అది కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాంతమంతా నాగార్జునసాగర్– శ్రీశైలం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం (టైగర్ రిజర్వ్) కింద ఉంది. ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా అటవీశాఖ అనుమతులు తప్పని సరి. -
చెత్త శిక్షణ.. సర్వత్రా నిరసన
చీమకుర్తి: వారంతా డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు. కానీ, రేడియం జాకెట్లు, చేతులకు గ్లౌజ్లు ధరించి గ్రీన్ అంబాసిడర్లు (పారిశుధ్య కార్మికులు)తో కలిసి వీధివీధికి, ఇంటింటికి తిరిగి చెత్త ఎలా సేకరించాలి, తడి చెత్త, పొడి చెత్తను ఎలా వేరుచేయాలో అనుభవం గడించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిపై ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు రెండు బ్యాచ్లుగా విభజించి ఒక్కో బ్యాచ్కు మూడు రోజుల చొప్పున చెత్త సేకరణ, చెత్తను వేరు చేయడం వంటి అంశాలపై చీమకుర్తి మండలంలోని ఆర్ఎల్ పురం పంచాయతీలో శిక్షణ ఏర్పాటు చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణలో అధ్వానంగా ఉన్న చివరి 50 పంచాయతీలకు సంబంధించిన అధికారులను ఈ శిక్షణకు ఎంపిక చేసింది. ఐవీఆర్ఎస్ వాయిస్ కాల్స్ ద్వారా ఈ పంచాయతీల ఎంపిక జరిగింది. మీ ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా..? అవును అయితే 1 నొక్కండి, కాదు అయితే 2 నొక్కండి అంటూ ప్రభుత్వం నుంచి వాయిస్ కాల్స్ ప్రతి గ్రామ పంచాయతీలో ఆరుగురు నుంచి 15 మంది వరకు వస్తాయి. కాదు అని 2ను ఎక్కువగా నొక్కిన 50 పంచాయతీలకు సంబంధించిన అధికారులను శిక్షణకు ఎంపిక చేశారు. ఆయా పంచాయితీలలో పారిశుధ్యానికి బాధ్యత వహించే విధంగా డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు. పారిశుధ్యం అధ్వానంగా ఉంటే ఎందుకు పర్యవేక్షణ చేయలేదనే ఉద్దేశంతో స్వయంగా చెత్త సంపద కేంద్రం వద్ద మూడు రోజుల పాటు రెసిడెన్షియల్ ట్రైనింగ్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ప్రభుత్వ నిర్ణయంపై గెజిటెడ్ ఆఫీసర్లయిన డిప్యూటీ ఎంపీడీఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. అధికారి హోదాలో ఉన్నవారికి చెత్త సేకరణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం, పారిశుధ్య కార్మికులతో కలిసి స్వయంగా చెత్త సేకరణలో, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంలో పాల్గొనాలని ప్రభుత్వం నిర్ణయించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో ఇలాంటి పనులు చేయించడానికి శిక్షణ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్య సిబ్బంది కొరత, అవసరమైన నిధుల విడుదల, పరికరాలు వంటివేమీ సమకూర్చకుండా పారిశుధ్య కార్మికులతో కలిసి రేడియం జాకెట్లు, గ్లౌజ్లు వేసుకుని చెత్త ఎలా సేకరించాలనే దానిపై అధికారులకు శిక్షణ ఇస్తే ఏం ఉపయోగమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 19 నుంచి 21 వరకు మొదటి బ్యాచ్కి, 22 నుంచి 24 వరకు రెండో బ్యాచ్కి శిక్షణ... ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం ఎంపిక చేసిన 50 పంచాయతీలకు సంబంధించి ఒంగోలు డివిజన్తో పాటు సమీపంలోని మండలాలైన చీమకుర్తి, కొండపి, మద్దిపాడు, మర్రిపూడి, ముండ్లమూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు, సంతనూతలపాడు, టంగుటూరు, జరుగుమల్లి, కొమరోలు, దోర్నాల మండలాలకు చెందిన డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లకు ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండో బ్యాచ్లో మార్కాపురం జిల్లా పరిధిలోని బేస్తవారిపేట, సీఎస్ పురం, దొనకొండ, గిద్దలూరు, హెచ్ఎం పాడు, కనిగిరి, కేకే మిట్ల, పామూరు, పీసీ పల్లి, పెద్దారవీడు, పొదిలి, పుల్లల చెరువు, రాచర్ల, వెలిగండ్ల, యర్రగొండపాలెం మండలాలలోని డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లకు ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. చెత్త సేకరణపై డిప్యూటీ ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలకు నేటి నుంచి శిక్షణ గెజిటెడ్ ఆఫీసర్లయినా సరే.. ముక్కు మూసుకుని చెత్త సేకరణ పనులు చేయాల్సిందేనంటున్న ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి చెత్త ఎలా సేకరిస్తున్నారో శిక్షణ పొందాలని నిర్ణయం తడి, పొడి చెత్తను స్వయంగా వేరు చేసి చెత్త సంపద కేంద్రం వద్దే బస చేయాలని ఆదేశం ఐవీఆర్ఎస్ కాల్స్లో పారిశుధ్యం బాగలేదన్న జిల్లాలోని చివరి 50 పంచాయతీల ఎంపిక ఈ నెల 19 నుంచి 24 వరకు ఒంగోలు, మార్కాపురం డివిజన్ల అధికారులకు శిక్షణ పారిశుధ్య కార్మికులతో కలిసి రేడియం జాకెట్లు, గ్లౌజ్లు వేసుకోనున్న అధికారులు ప్రభుత్వ తీరుపై గెజిటెడ్ ఆఫీసర్లయిన డిప్యూటీ ఎంపీడీఓల ఆగ్రహం జీతం కావాలంటే ప్రభుత్వం చెప్పింది చేయాల్సిందేనంటున్న ఉన్నతాధికారులు డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉదయం 6 గంటలకే రేడియం జాకెట్లు, గ్లౌజులు ధరించి ఆర్ఎల్ పురం గ్రామంలోని వీధుల్లో ఇంటింటికి తిరిగి ఉదయం 8 గంటల వరకు చెత్త సేకరణ చేయాలి. అనంతరం అదే గ్రామంలోని చెత్త సంపద కేంద్రం వద్ద తడి చెత్త, పొడి చెత్తను ఎలా వేరు చేయాలి, దానిని వర్మీ కంపోస్ట్గా ఎలా మారుస్తున్నారు, వానపాములతో ఎరువుగా ఎలా మారుతుందనే దానిపై శిక్షణ పొందిన ఆర్పీలు, సీఆర్పీల వద్ద శిక్షణ పొందాలి. ఈ విధంగా ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అదే గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీపై మూడు రోజుల పాటు శిక్షణ పొందాలి. అక్కడే మూడు పూటలా టిఫిన్, భోజనం చేయాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రూములలో బస చేయాలి. ఇలా మూడు రోజుల పాటు కఠిన శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఎలాంటి సెలవులు మంజూరు చేయబడవని తెలిపారు. శిక్షణకు ఎంపికై న గెజిటెడ్ ఆఫీసర్లు అయిన డిప్యూటీ ఎంపీడీఓలు తాము గెజిటెడ్ ఆఫీసర్లమనే గౌరవం కూడా లేకుండా ప్రభుత్వం నేరుగా చెత్త కేంద్రాల వద్ద బస చేయాలని చెప్పటం, అక్కడే భోజనాలు చేయాలని చెప్పడం, తామే తడి చెత్త, పొడి చెత్తను స్వయంగా వేరు చేయాలని సూచించటం బాగులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సేకరించిన సమాచారం ద్వారా తమ విధుల విషయంలో చెత్త నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని డీఎల్పీఓ ఆర్.పద్మ దృష్టికి కూడా వారు తీసుకెళ్లగా.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పాటించాల్సిందేనని, శిక్షణ సక్రమంగా జరగాలంటే రెసిడెన్షియల్ ట్రైనింగ్ తప్పనిసరని ఆమె తెలిపినట్లు సమాచారం. -
ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఒంగోలులో బాలోత్సవం
ఒంగోలు టౌన్: స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగాణంలో ప్రకాశం బాలోత్సవం తృతీయ పిల్లల పండుగను ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించనున్నట్లు బాలోత్సవం కమిటీ అధ్యక్షుడు బండారు లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం స్థానిక ఎల్బీజీ భవనంలో బాలోత్సవం పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా బాలోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అమరావతి బాలోత్సవం రాష్ట్ర కార్యదర్శి యూవీ రామరాజు మాట్లాడుతూ మితిమీరి సెల్ఫోన్ల వాడకం, ఇతర దురవాట్ల నుంచి చిన్నారులను కాపాడాలన్న సదుద్దేశంతో బాలోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిశీలన, ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించేందుకు ఇది ఒక మంచి అవకాశమన్నారు. ప్రకాశం బాలోత్సం వర్కింగ్ ప్రెసిడెంట్ డి.వీరాంజనేయులు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే పిల్లల్లో దేశభక్తి భావాలు, సామాజిక స్పృహ, మానవ విలువలు, శాసీ్త్రయ దృక్పథం పెంపొదింపజేయడం, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి బాలోత్సవం ఉపయుక్తం అవుతుందన్నారు. బాలోత్సవం కార్యదర్శి కె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్, మట్టితో బొమ్మలు చేయడం, డ్రాయింగ్, ఏకపాత్రాభినయం, శాసీ్త్రయ నృత్యాలు, అభ్యుదయ గేయాలు, ఫ్యాన్సీ డ్రెస్ వంటి 42 అకడమిక్, నాన్ అకడమిక్ అంశాలతో ఈవెంట్లు నిర్వహించనున్నట్లు వివరించారు. ఇందులో జూనియర్, సీనియర్ విభాగాల విద్యార్థులకు వేరువేరుగా ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పారు. ఆయా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఫిబ్రవరి 2వ తేదీలోగా గూగుల్ ఫాంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు కిలారి వెంకటేశ్వర్లు, షేక్ అబ్దుల్ హై, వై.వెంకటరావు, జి.ఉమామహేశ్వరి, ఎన్.నిన్నస్మా, నల్లూరి వెంకటేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, యు.భాస్కర్ నాయుడు, మాల్యాద్రి, పి.సుబ్రహ్మణ్యం, షేక్ ఖాజా హుసేన్, దామా శ్రీనివాసులు, ఎల్.శ్రీనివాసరావు, వి.బాలకోటయ్య, సీహెచ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఒంగోలులో కలెక్టర్ ఆధ్వర్యంలో మీ కోసం
ఒంగోలు సబర్బన్: స్థానిక కలెక్టరేట్లో ఉన్న మీ కోసం భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఆ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మీ కోసం కార్యక్రమంతో పాటు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు. మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్జీదారుల సమస్యలు పరిష్కారం కాకుంటే సంబంధిత సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చని చెప్పారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ సూచించారు. కనిగిరి రూరల్: ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలైన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పొదిలి రోడ్డు వైపు నుంచి కనిగిరికి వేగంగా వస్తున్న బ్యాటరీ ఆటో పట్టణ సమీపంలోని టకారిపాలెం వద్ద కుక్కను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మిశనం కోటేశు (41), మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోటేశు మృతి చెందాడు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగులుప్పలపాడు: నూరేళ్లు బతికిన వృద్ధుడు ఆదివారం సాయంత్రం మరణించాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఒమ్మెవరం గ్రామానికి చెందిన కొమ్ము ఆహరోను (101) 1925 జూలై 7వ తేదీ జన్మించాడు. పాత కాలపు ఆహార అలవాట్లతో పాటు ఎలాంటి దురలవాట్లు లేకపోవడంతో వందేళ్లు జీవించాడు. గతేడాది ఆహరోను వందవ పుట్టినరోజు వేడుకను తన సంతానంతో జరుపుకున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురై పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. పొదిలిరూరల్: మండలంలోని రామపురంలో ఆదివారం పొగాకు బ్యారెన్ దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన పాలడగు వెంకయ్య చెందిన పొగాకు బ్యారన్ క్యూరింగ్ చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఆకులపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బ్యారన్ మొత్తం వ్యాపించాయి. దర్శి అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే అప్పటికే పొగాకు మొత్తం కాలిపోయింది. బ్యారన్లో ఉన్న ఆకుతో పాటు టైర్లు, అల్లుడు కర్ర, గొట్టాలు కాలిపోవడంతో ప్రమాదంలో రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ● మౌని అమావాస్య సందర్భంగా పోటెత్తిన భక్తులు ● పూజలు చేసిన రాజాసాబ్ డైరెక్టర్ మారుతి త్రిపురాంతకం: మౌని అమావాస్య సందర్భంగా స్థానిక శ్రీబాలాత్రిపురసుందరీదేవి, శ్రీపార్వతీ సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ సినీ దర్శకుడు మారుతి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. ఇటీవల రిలీజైన ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమాకు డైరెక్టర్గా పనిచేసిన మారుతి.. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆశీర్వచనం అందుకున్నారు. -
పోరాటానికి సన్నద్ధంకండి
ఒంగోలు సిటీ: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలుస్తూ వారి సమస్యలపై పోరాటానికి సన్నద్ధం కావాలని సూచించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి (టాస్క్ఫోర్స్) సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ, మండల స్థాయిల్లో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకత్వం సీరియస్గా తీసుకుంటోందన్నారు. చిన్నపాటి సమస్యలైనా, పోలీస్ కేసులైనా కార్యకర్తలకు అండగా పార్టీ నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ప్రజలతో నిత్యం మమేకమై ఉండే కార్యకర్తలకు భయంకానీ, ఒంటరితనమన్న భావన ఉండకూడదన్నారు. కమిటీల నియామకాల్లో సమన్వయం తప్పనిసరి... పార్టీ కమిటీల నియామకాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని బూచేపల్లి సూచించారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన కార్యకర్తలను బూచేపల్లి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం పార్టీ క్రమశిక్షణకు, కార్యకర్తల అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహం ప్రజా సమస్యలపై పోరాటంలో కొనసాగాలని కోరారు. పార్టీ విస్తరణ అనేది కొద్ది మందితో సాధ్యమయ్యేది కాదని, ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీగా వైఎస్సార్ సీపీ నిలవాలని ఆయన అన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల ఇన్చార్జ్లు అన్నా రాంబాబు, కె.పి.నాగార్జునరెడ్డి, కనిగిరి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్లు దద్దాల నారాయణ యాదవ్, చుండూరి రవి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ఉద్యాన రైతులకు విజ్ఞాన యాత్ర
దర్శి: జిల్లా ఉద్యానవన శాఖ ద్వారా జిల్లాలోని దర్శి, పొదిలి, అద్దంకి మండలాల్లో ఉద్యాన పంటలను సాగు చేస్తున్న రైతులను చిత్తూరు జిల్లాలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కుప్పం, గ్రీన్ ఆర్బిట్ ఫార్మర్స్ల్లో ఆధునిక పద్ధతిలో ఉద్యాన పంటలను సాగుచేస్తున్న రైతుల తోటల సందర్శనకు ఈ నెల 20 నుంచి 22 వ తేదీ వరకు తీసుకెళ్తారని దర్శి ఉద్యానవన శాఖ అధికారి ఎం.రవి వెంకన్న బాబు తెలిపారు. రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా ఉద్యాన పంటల సాగు విధానంపై క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తామన్నారు. కూరగాయలు, పండ్ల తోటలు, పూల సాగు వంటి ఉద్యాన పంటలకు సంబంధించిన ఆధునిక సాగు పద్ధతులు, నాణ్యమైన నాటు పద్ధతులు, ఎంపిక ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, తెగుళ్లు, రోగాలు నియంత్రణ, కోత అనంతరం నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయి ప్రదర్శన ద్వారా రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, మార్కెట్ అవకాశాల గురించి ఈ రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని ఎంపిక చేసిన ఉద్యాన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాళ్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పశ్చిమ ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రామతీర్థం రిజర్వాయర్ నుంచి రామతీర్థం జలాలను అప్పటి ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలకు తరలించేందుకు రూ.91 కోట్లు కేటాయించారు. ఈ ఆర్డబ్ల్యూఎస్ స్కీం నిర్వహణకు కాంట్రాక్ట్ వర్కర్లను నియమించారు. ప్రతి నెలా సమయానికి వారి అకౌంట్లో డబ్బులు జమ చేసేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కీమ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐదు నెలలగా జీతాలు అందించకుండా వారి నోట్లో మట్టి కొట్టారు. దీంతో అలసిపోయిన ఆర్డబ్ల్యూఎస్ స్కీం కార్మికులు ఒకటై ఆదివారం రామతీర్థం రిజర్వాయర్ వద్ద ధర్నా చేపట్టారు. కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నారు కానీ జీతాలు అందించడం లేదంటున్నారు. అలాగే కాంట్రాక్టర్ల వద్ద జీతాల గురించి అడిగితే ఉన్నతాధికారులపై, ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లపై ఒకరి మీద ఒకటి చెప్పుకుంటూ జీతాలు నిలిపివేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు కలెక్టర్ ను కలిసినా ఉపయోగం లేకుండా పోయిందని చెప్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నిలిపేసిన జీతాలను వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
సత్తా చాటిన ఆంధ్ర, తమిళనాడు జట్లు
సింగరాయకొండ: స్థానిక ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఆదివారం జాతీయ మోడ్రన్ కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగంలో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ టై గా ముగియటంతో ఫైనల్స్లో ఆడిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జట్లు రెండింటినీ విజేతలుగా ప్రకటించారు. మూడో స్థానంలో తమిళనాడు–2, నాల్గవ స్థానంలో తెలంగాణ జట్టు నిలిచాయి. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు విజేత కాగా, రన్నర్గా తెలంగాణ జట్టు నిలిచింది. మూడో స్థానంలో కేరళ, నాల్గవ స్థానంలో మహారాష్ట్ర జట్లు నిలిచాయి. విజేతలకు మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఫౌండర్, జనరల్ సెక్రటరీ రామిరెడ్డి షీల్డ్, మెడల్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ మార్చిలో తెలంగాణ రాష్ట్రం నల్గొండలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మోడ్రన్ కబడ్డీ పోటీలను ఆరు దేశాలు ఒప్పుకున్నాయని, మరో రెండు దేశాలు ప్రతిపాదనలో ఉన్నాయని వివరించారు. ఈ క్రీడకు అధికారిక క్రీడగా త్వరలో గుర్తింపు తీసుకుని రావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పాత కబడ్డీ పోటీలో కష్టంతో విజయం సాధించవచ్చని కానీ ఈ మోడ్రన్ కబడ్డీ పోటీలు తెలివితో ఆడాల్సి ఉంటుందని వివరించారు. క్రీడల నిర్వాహకుడు తేళ్ల వంశీకృష్ణ, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. -
దోచుకో..దాచుకో..పంచుకో
ఒంగోలు సిటీ: దోచుకో..దాచుకో..పంచుకో అన్న రీతిన రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 18 నెలల కాలంలో రూ.3 లక్షల కోట్ల అప్పులు చేశాడని ధ్వజమెత్తారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా తన బినామీలకు అప్పజెప్పేందుకు రాష్ట్రంలో పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. 18 ఏళ్లు నిండిన యువతులకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని లేని పక్షంలో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ దగా చేసిందని, దీనికి ప్రభుత్వ పెద్దలందరూ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీల ఎమ్మెల్యేలు సంపాదనలో పడ్డారని ఆరోపించారు. కోడిపందేల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడ్డారని విమర్శించారు. సంక్రాంతి సందర్భంగా కోడిపందాలే కాకుండా మూడుముక్కలాట, లోనా బయట లాంటి జూద క్రీడలను వాట్సాప్ లో ప్రచారం చేసి పిలిపించి ఆడించారని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, పోలీసు వ్యవస్థ పని చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. కోడిపందేలు, పేకాటలే కాకుండా అశ్లీల నత్యాలు కూడా చేయిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. సంక్రాంతి సంబరాలను అపహాస్యం చేసేలా మంత్రులు కూడా అసభ్య నృత్యాలు చేయటం దారుణమన్నారు. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. కూటమి నేతలు వ్యవహరించిన తీరును చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కూటమి నేతలకు మహిళలంటే గౌరవం ఉందా అని జనం ప్రశ్నిస్తున్నారన్నారు. ఒకప్పుడు పేకాట ఆడాలంటే శ్రీలంక క్యాసినోలకు వెళ్లే వారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్యాసినోకు కేంద్రంగా రాష్ట్రం మారిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రం పేకాట కేంద్రాలకు నిలయంగా ఉందని, జూద ఆంధ్రగా మారిపోయిందని ఆయన మండిపడ్డారు. టీడీపీవే శవ రాజకీయాలు.. పల్నాడు జిల్లాలో వైఎస్సార్ సీపీ నేత సాల్మన్ హత్య జరగడం దారుణమని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని మా పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళనలు చూసి టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారని, శవ రాజకీయాలు చేయటం చంద్రబాబుకు ఆయన పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీని మరింత బలోపేతం చేద్దాం.. జిల్లాలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ బలోపేతమవుతుందని కారుమూరి అన్నారు. ప్రజలకి అండగా నిలుస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరం కలిసికట్టుగా మరింతగా కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్, మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, బొట్ల రామారావు, వై.వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకులు గౌతమ్ అశోక్ పాల్గొన్నారు.


