breaking news
Prakasam District News
-
అయ్యవార్లొచ్చేది రెండ్రోజులే!
యర్రగొండపాలెం: డీటీడబ్ల్యూ ఆధ్వర్యంలో నడిచే పాలుట్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు స్థానికంగా ఉండే ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యా వలంటీర్లే చదువులు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజన విద్యార్థులు విద్యకు దూరంగా ఉండటంతోపాటు ప్రభుత్వ మెనూ ప్రకారం భోజన సదుపాయం కూడా లేకపోవడంతో వారు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో ఇలా... గత ప్రభుత్వ కాలంలో ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన క్వార్టర్స్లో ఉపాధ్యాయులు ఉండి సక్రమంగా ఆశ్రమ పాఠశాలను నడిపించేవారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యావ్యవస్థపై ముఖ్యంగా గిరిజన పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించేవారు. ఎప్పుడు తమ పాఠశాలలను విజిట్ చేస్తారన్న భయంతో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వర్తించేవారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజన వసతి కల్పించేవారు. గిరిజన విద్యార్థులు కూడా బడికి క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. నాడు–నేడు పథకం కింద పాలుట్ల గిరిజన ఆశ్రమ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. చంద్రబాబు ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా ఆశ్రమ పాఠశాలల నిర్వహణ: చంద్రబాబు ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేకుండా పోవడంతో హెచ్ఎంలతోపాటు ఉపాధ్యాయులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. యర్రగొండపాలెం మండలంలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలుట్ల గిరిజనగూడెంలో ఉన్న ఆ పాఠశాలలో డీటీడబ్ల్యూ పర్యవేక్షణలో 7వ తరగతి వరకు గిరిజన విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంది. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించేందుకు హెచ్ఎంతోపాటు ఏడుగురు ఉపాధ్యాయులను నియమించింది. వారిలో ఇటీవల నియమితులైన ముగ్గురు డీఎస్సీ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వీరితోపాటు ఒకరు విద్యావలంటీర్ గిరిజన పిల్లలకు విద్యాబోధన చేయాలి. ఆ పాఠశాల హెచ్ఎం బైస్వామి టీడీపీ నాయకుడి అడుగులకు మడుగులు వత్తుతుండటంతో ఆయన చెప్పిందే ఆ పాఠశాలలో వేదంగా మారింది. ఉపాధ్యాయులు వారానికి రెండు రోజులు (సోమ, మంగళవారాలు) విజిట్ చేసే ఆఫీసర్లుగా వచ్చి, రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లిపోతారని ఆ గూడెంవాసులు కె.సురేష్ నాయక్, సురేంద్ర నాయక్ తెలిపారు. మిగిలిన రోజుల్లో స్థానికంగా ఉండే ఉపాధ్యాయుడు కుడుముల పోతురాజు, మరో విద్యా వలంటీర్ వెంకటేశ్ 7 తరగతులు తిరిగి చదువులు చెప్తుంటారని వారు తెలిపారు. దీనివలన గిరిజన విద్యార్థులు చదువులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆశ్రమ పాఠశాలకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులు ప్రతి నెలా హెచ్ఎంకు ఎంతోకొంత ముట్టచెప్తుంటారని వారు ఆరోపించారు. భోజనంలో పప్పులపొడి చల్లి సర్దేస్తుంటారు పాలుట్ల ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పిల్లలకు భోజన సదుపాయాలు కల్పించడంలేదు. వారు ఇంటి నుంచి కూరలు తెచ్చుకొని భోజనాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ రోజులు టిఫన్లో పొంగల్, భోజనంలో పప్పుల పొడి చల్లి సర్దేసుకొని పోతుంటారు. నిత్యం స్నాక్స్ కింద ఇచ్చే చిక్కీలు, గుగ్గుళ్లు, అరటిపండ్లు ఆ పాఠశాలలో ఏ మాత్రం కనిపించవని ఆ గూడెం ప్రజలు తెలిపారు. బైస్వామి హెచ్ఎం బాధ్యతతోపాటు వార్డెన్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుండటంతో కనీసం పిల్లలు తినే తిండిలో కూడా కోత విధించడం దారుణమని పలువురు ఆరోపిస్తున్నారు. పాలుట్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న సంఘటనలపై కలెక్టర్, డీటీడబ్ల్యూ, ఎంఈవోలకు విన్నవించుకున్నా వారు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి ఆశ్రమ పాఠశాలలో చదువులు సక్రమంగా కొనసాగేలా చూడాలని, హెచ్ఎంతోపాటు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆ గూడెంవాసులు కోరుతున్నారు. -
లాభాలు తెచ్చే పంటలేవో చంద్రబాబు చెప్పాలి
ఒంగోలు టౌన్: రైతాంగానికి లాభాలు తెచ్చి పెట్టే పంటలేవో, మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న పంటలేవో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సమాధానం చెప్పాలని కోరారు. మంగళవారం మల్లయ్యలింగం భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలేవో, వాటికి ప్రభుత్వం ఏ విధంగా గిట్టుబాటు ధరలు ఇస్తుందో, రైతాంగం నుంచి ఎలా సేకరిస్తున్నారో, వారికి నగదు ఎంత చెల్లిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ఎన్డీఏ పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేక, ఏ పంటలు వేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల గిట్టుబాటు ధరల గురించి, రైతుల సంక్షేమం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కనీసం ఒక్కసారైనా సమీక్ష నిర్వహించకపోవడం దారుణమన్నారు. జిల్లాలో మిర్చి సాగు చేయడానికి ఎకరాకు రూ.2 లక్షలు ఖర్చు చేశారని, ఇటీవల వచ్చిన వరుస తుపాన్లతో పంట దెబ్బతిందని, నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.10 వేలు ప్రకటించడం దుర్మార్గమన్నారు. రూ.లక్షల్లో నష్టపోయిన రైతులకు వేలల్లో పరిహారం ప్రకటించడమేనా రైతుల పట్ల మీ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి మాట్లాడుతూ ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లో కొనేవారు లేక 3 క్వింటాళ్ల శనగ కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్నాయని, రెండేళ్లవుతున్నా కూటమి పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రెండేళ్ల పంటను కాదని రబీ సీజన్లో పంటను మాత్రమే కొనుగోలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం శనగపై 30 శాతం సుంకం తగ్గించడంతో క్వింటా కాక్ 2 రకం శనగ రూ.10,500 నుంచి రూ.8500 కు తగ్గిపోయిందని తెలిపారు. రైతులకు రూ.40 వేల వరకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. గత ఏడాది పొగాకు కిలో రూ.276 పలికితే ఈ ఏడాది రూ.220 దక్కిందన్నారు. కిలో పొగాకుకు రూ.55 నష్టం జరుగుతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు సర్కార్ మాయమాటలతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. సమావేశంలో రైతు నాయకులు బీమవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా క్రాంతికుమార్
ఒంగోలు సిటీ: టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా వైఎస్సార్ సీపీ నాయకుడు దామరాజు క్రాంతికుమార్ నియమితులయ్యారు. తనకు ఈ అవకాశం కల్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డికి, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబుకు క్రాంతికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. మద్దిపాడు: మండలంలోని గుండ్లాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కందుల స్టీఫెన్ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. ఇతను జనవరి నెలలో రాజస్థాన్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాడు. అదేవిధంగా అండర్ 14 బాలికల విభాగంలో కుంచాల దీపిక, తలకాయల హర్ష రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టును ద్వితీయ స్థానంలో నిలబెట్టడానికి కృషి చేశారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మండవ ప్రభాకర్, పీడీలు మాధవి లత విజయ్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అభినందించారు. ● వచ్చే ఏడాది వెలుగొండ పూర్తి చేయాలి ● పదేళ్లపాటు ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించాలి ● పశ్చిమ ప్రకాశం విద్యావంతుల, మేధావుల వేదిక డిమాండ్ మార్కాపురం టౌన్: నూతనంగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గంలోని దొనకొండ మండలాన్ని కలిపి పదేళ్లపాటు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో పాటు వచ్చే ఏడాదిలోపు వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసి నీటిని అందించాలని పశ్చిమ ప్రకాశం విద్యావంతుల మేధావుల వేదిక ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నూతన మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గం లేకపోవడంతో అందరూ నిరాశ చెందుతున్నారని అన్నారు. రాజధాని స్థాయి కలిగిన దొనకొండను మార్కాపురంలో కలపాలని డిమాండ్ చేశారు. తమ అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. 1973లో నాగార్జునసాగర్ కుడికాలువను మార్కాపురం ప్రాంతానికి తీసుకునిరావాలని ఉద్యమాలు చేసినప్పటికీ ఈ ప్రాంతానికి నీరివ్వకుండా దర్శి, కురిచేడు ప్రాంతాలకు తీసుకెళ్లి అన్యాయం చేశారన్నారు. 1971లో కర్నూలు జిల్లాలో భాగమైన మార్కాపురం డివిజన్ను కలుపుతూ ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేసినప్పుడు బడ్జెట్లో 19 శాతం నిధులు కేటాయిస్తామని ఆనాడు చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారని నేటికీ నెరవేరలేదన్నారు. 2014 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాజధాని ఎంపికలో శివరామకృష్ణ కమిటీ దొనకొండ రాజధానికి అనుకూలంగా ఉంటుందని నివేదిక ఇచ్చినప్పటికీ చేయకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను ప్రభుత్వం గుర్తించాలని ప్రతినిధులు ఓఏ మల్లిక్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి, అందె నాసరయ్య, దేవిరెడ్డి నాగేంద్రుడు, ఎం ప్రసాద్, జె మధుసూధనరావు డిమాండ్ చేశారు. -
కొత్త జిల్లాలో ఉచిత వైద్యం కరువు
కంభం: కొత్తగా ఏర్పడనున్న మార్కాపురం జిల్లాలో పేద ప్రజలకు ఉచిత వైద్యం కరువుకానుందని వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలోని చిన్నకంభం గ్రామంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో మార్కాపురంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం కోసం 14 నెలలు కష్టపడి 50 ఎకరాలు సేకరించి సుమారు రూ.350 కోట్లు వెచ్చించి వైద్యశాల భవన నిర్మాణాలను ప్రారంభించారన్నారు. ఈ కళాశాల పూర్తయితే సుమారు వెయ్యికి పైగా బెడ్లు, వందమంది వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని, అప్పుడు పేద ప్రజలు ధైర్యంగా ఉచిత వైద్యం చేయించుకోవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేస్తుండటంతో అట్టడుగు వర్గాలకు, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం పూర్తిగా దూరమవుతుందన్నారు. డబ్బు ఖర్చు పెడితే గానీ అక్కడ చూసే పరిస్థితి ఉండదన్నారు. చిన్నపాటి సమస్యలకు, సర్జరీలకు పేద ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. కోటి సంతకాల కార్యక్రమం ద్వారా సంతకాలు సేకరించి రాష్ట్రంలో కోటి కుటుంబాలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలు సంతకాలు చేసే కార్యక్రమం చేపట్టారు. సమావేశంలో స్టేట్ యూత్వింగ్ సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి, మండల కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి, గ్రామ సర్పంచ్ రసూల్, అడ్డా నాగయ్య, గంటా రాజశేఖర్, ప్రకాశ్ రావు, ఖాసింబాష, జంగం వెంకటేశ్వర్లు, కాకర్ల సుబ్బారావు, పాపారావు, పట్టా రామయ్య, సాల్మన్, పొదిలి ప్రభాకర్, సయ్యద్ ఖాసిం, డిష్ మున్నా, సలీం, పెద్దకోటేశ్వరరావు, మహబూబ్ పీరా, సబ్బసాని సాంబశివారెడ్డి, ఆనంద్, నాగబూషణం, ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో వికృత రాజకీయాలు
యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి రాష్ట్రంలో వికృత రాజకీయ క్రీడ ఆడుతోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. యర్రగొండపాలెంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తీవ్ర కరువు, కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎటువంటి సహాయం చేయలేదని, తాగునీటికి అలమటిస్తున్న ఈ ప్రాంత ప్రజల మొర ఆలకించడం లేదని మండిపడ్డారు. తాగు, సాగునీటి కోసం మహానేత వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారని, ఆయన తనయుడు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కార్యాన్ని చాలావరకు పూర్తి చేశారని వివరించారు. మిగిలి ఉన్న పనులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయకుండా వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యంగా గాలికొదిలేసిందన్నారు. ప్రకాశం జిల్లాపై నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం అంతగా ఉండదని, రాష్ట్రమంతా మిగులు వర్షపాతం నమోదై ప్రధాన నదులు వరదలతో పొంగిన సమయంలో కూడా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో తాగునీటికి ట్యాంకర్లపై ఆధారపడాల్సి ఉంటుందని వివరించారు. మండు వేసవిలోనే కాకుండా ఏడాది పొడువునా తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిందేనన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంతో పాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి వెలిగొండ ప్రాజెక్ట్ ఒక్కటే శరణ్యమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగంగా అమరావతిలో 10,500 ఎకరాలకు వరద ముంపు తగ్గించడానికి రూ.3,790 కోట్లు ఖర్చు పెట్టారని, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు, దాదాపు 25 లక్షల మందికి తాగునీటి కోసం వెలిగొండ ప్రాజెక్టుకు కావాల్సింది కేవలం రూ.1400 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఆ నిధులు కూడా కేటాయించకుండా జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా 2014 నాటికి 5 ప్రధాన కాలువలు 80 శాతం పూర్తి చేశారని, 3 ఆనకట్టలు నిర్మించారని చెప్పారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పలు పర్యాయాలు జిల్లాలో పర్యటించారని, వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తిచేసి పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేస్తానని వాగ్దానాలు చేసి వెళ్లారే తప్ప ఒక్క టన్నెల్ కూడా పూర్తి చేయలేదని తాటిపర్తి చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్కు సంబంధించిన రెండు టన్నెళ్ల పొడవు సుమారు 38 కిలోమీటర్లు ఉంటే.. చంద్రబాబు తన 16 ఏళ్ల పదవీ కాలంలో తవ్వింది కేవలం 4 కిలోమీటర్లేనని గుర్తు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ మొదటి టన్నెల్లో మిగిలిన 5.22 కిలోమీటర్లు తవ్వకాలు జరిపించారని, రెండో టన్నెల్లో 10.04 కిలోమీటర్ల మేర తవ్వకాల పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు. ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న 11 గ్రామాలకు చెందిన 7,270 కుటుంబాలకు పునరావాసం పూర్తి చేస్తే పశ్చిమ ప్రకాశంకు కృష్ణ జలాలు తీసుకురావచ్చని, అందుకు కేవలం రూ.1400 కోట్లు ఖర్చుపెడితే సరిపోతుందని తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజల కష్టాలను గాలికొదిలేసిన చంద్రబాబు.. ఆర్భాటపు ప్రకటనలతో 20 నెలల నుంచి కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. వృథాగా ఖర్చు చేసే నిధుల నుంచి కేవలం పావలా వంతు వెలిగొండకు ఖర్చు చేస్తే సరిపోతుందన్న విషయం గమనించాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హితవు పలికారు. -
వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా...
వరుస అల్పపీడనాలు, తుపానుల ప్రభావంతో రెండు నెలలుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మోంథా తుపాన్తో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. తాజాగా దిత్వా తుఫాన్కు రెండు రోజులుగా చిరుజల్లులు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, నదుల్లో నీటి నిల్వలతో ఇసుక తవ్వకాలకు ఆటంకం ఏర్పడిందంటూ అక్రమార్కులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచేస్తూ రెచ్చిపోతున్నారు. పెరిగిన ఇసుక ధరలు తడిసి మోపెడవుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అధికార టీడీపీ నేతల కనుసన్నల్లో ఈ దందా జరుగుతుండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తుఫాన్ బూచి..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో మొత్తం 12 ఇసుక యార్డులున్నాయి. సగటున 1000 టన్నుల వరకు వినియోగం ఉంటుంది. జిల్లాకు అవసరమైన ఇసుక ప్రధానంగా నెల్లూరు జిల్లా నుంచి వస్తోంది. పశ్చిమ ప్రకాశానికి నెల్లూరు ఇసుకతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఇసుక తీసుకొస్తుంటారు. తూర్పు ప్రకాశంలోని ఒంగోలు పరిసర ప్రాంతాలకు కొండపి నియోజకవర్గం నుంచి ఇసుక తరలిస్తున్నారు. కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి, పొన్నలూరు మండలాల పరిధిలో మన్నేరు, పాలేరు, ముసి నదలున్నాయి. వీటిలో మన్నేరు నది నుంచి సేకరించే ఇసుక నాణ్యమైనదిగా చెబుతారు. ఈ ఇసుకను ఒంగోలు పరిసరాలకు తరలిస్తారు. మోంథా తుఫాన్కు ముందు మన్నేరు ఇసుక టన్ను 250 రూపాయలకు విక్రయించేవాళ్లు. తుఫాన్ ప్రభావంతో రోజుల తరబడి వర్షాలు కురవడంతో నదులు, వాగులు, వంకల్లో నీరు నిలిచిపోయింది. దాంతో ఇసుక తవ్వకాలకు అవకాశం లేకుండా పోయింది. దీన్ని సాకుగా చెబుతూ ఇసుక ధరలు రెట్టింపు చేశారు. తుపాను తర్వాత టన్ను ఇసుక రూ.500కు పెంచారు. ట్రాక్టర్ లోడింగ్ రీచ్లో రూ.500 ఉంటే ఇప్పుడు 1000 రూపాయలకు పెంచారు. టిప్పర్ ఇసుక తుఫాన్కు ముందు 15 నుంచి 20 వేల రూపాయల వరకు ఉంటే.. ఇప్పుడు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నిలబెట్టి విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి... జిల్లాలోని కంభం, గిద్దలూరు మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన ఇసుక డంపింగ్ యార్డులలో ఇసుక ధరలు టన్ను రూ.1350 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. టిప్పర్ ఇసుక తీసుకుంటే 1350 రూపాయలు, అదే ఇసుకను లూజుగా ట్రాక్టర్లో తీసుకుంటే 1500 రూపాయలకు విక్రయిస్తున్నారు. కంభం లోయ ప్రాంతంలో మొదటి నుంచి టన్నుకు 1500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని పామూరు డంపింగ్ యార్డులో 1000 రూపాయలకు విక్రయిస్తున్నారు. పొదిలిలో ట్రాక్టరు ఇసుక 1400 నుంచి 1500 రూపాయలకు విక్రయిస్తున్నారు. మార్కాపురంలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ తుఫాన్కు ముందు 1350 రూపాయలకు విక్రయిస్తుండగా, ఇప్పుడు 1550 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక్కడ డంపింగ్ యార్డు లేకపోతే 800 నుంచి 900 రూపాయలకే లభ్యమయ్యే అవకాశం ఉందని యూనియన్ నాయకులు చెబుతున్నారు. దర్శి నియోజకవర్గంలో ఇసుక దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఇక్కడ టన్నుకు 100 నుంచి 300 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో టన్ను ఇసుక 1450 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాలలో టన్ను ఇసుకకు అదనంగా 200 నుంచి 300 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు సైన్యంతో దందా... జిల్లాలో ఇసుక వ్యాపారమంతా టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో నడుస్తున్న విషయం బహిరంగ రహస్యమే. కొన్ని నియోజకవర్గాలలో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దందాను ఇష్టారాజ్యం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి మండలానికి ముగ్గురు, నలుగురు చొప్పున యువకులను నియమించుకుని వారికి నెలకు 16 వేల రూపాయల జీతంతో పాటు రోజువారీ ఖర్చులకు అదనంగా 200 రూపాయలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏ మండలానికి ఆ మండలంలో వచ్చిపోయే ఇసుక లారీలను గమనించడం, ఎవరైనా నేరుగా పొరుగు జిల్లాల నుంచి ఇసుక కొనితెచ్చుకుంటే ఆ లారీని స్వాధీనం చేసుకుని కాటా వేయించి టన్ను ఇసుకకు రూ.300 టీ–ట్యాక్స్ వేసి బలవంతంగా వసూలు చేస్తుంటారని సమాచారం. ఎవరైనా ట్యాక్స్ కట్టకపోతే భౌతిక దాడులు చేయడం, పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి అక్రమ కేసులు నమోదు చేయించడం వంటి అనధికార బెదిరింపు కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇసుక దోచి.!వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వర్షాకాలానికి ముందే ఇసుక సేకరించి నిల్వలు చేశారు. తుఫాన్ వంటి విపత్తుల సమయంలో కూడా ముందస్తుగా ఇసుక సేకరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి ముందుచూపు లోపించింది. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని స్థానిక టీడీపీ నాయకులు ఇష్టమొచ్చిన ధరలకు ఇసుక అమ్ముకుంటున్నారు. అడిగేవారు లేకపోవడంతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దిత్వా తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఇప్పట్లో ఇసుక ధరలు తగ్గే సూచనలు లేవని భవన నిర్మాణదారులు, కూలీలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఎక్కడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇసుక విక్రయాలు జరగడం లేదు. టీడీపీ కీలక నాయకులు చెప్పిన రేటుకే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. పగలూరాత్రీ తేడా లేకుండా ఇష్టారాజ్యంగా వాహనాల్లో ఇసుక తరలిస్తున్నారు. అయినప్పటికీ మైనింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలవారీ మామూళ్లకు అలవాటుపడిపోయిన అధికారులు ఇసుక అక్రమాలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. -
మార్కాపురం జిల్లాకు చంద్రబాబు వెన్నుపోటు
ఒంగోలు సిటీ: మార్కాపురాన్ని నూతన జిల్లాగా ఏర్పాటు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి ఆరోపించారు. ఒంగోలు నగరంలోని రామ్నగర్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో మార్కాపురం, దర్శి, కనిగిరి, యరగ్రొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మోసం చేశారని విమర్శించారు. దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపి నూతనంగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లాకి తీవ్ర అన్యాయం చేశారన్నారు. పశ్చిమ ప్రకాశానికి దొనకొండ చాలా అవసరమన్నారు. ఆ దొనకొండను మార్కాపురంలోకి కాకుండా ప్రకాశం జిల్లాలో కలిపితే పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుందన్నారు. ఈ విషయాన్ని నాయకులు పక్కన పెట్టి కొత్త జిల్లా పేరుతో సంబరాలు చేసుకోవడం ఆ ప్రాంత ప్రజల్ని వంచించడమేనన్నారు. ఒకపక్క దొనకొండ ప్రాంతంలో 50 వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని చెబుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామంటూనే.. మరోపక్క మార్కాపురం జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న దొనకొండను ప్రకాశం జిల్లాలో కలపడమంటే ఆ జిల్లా ప్రజలను పూర్తిగా మోసం చేయడమేనని అన్నారు. ఆదాయం వచ్చే దొనకొండను ప్రకాశం జిల్లాలో కలిపి వెనుకబడిన ప్రాంతాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తే ఆ జిల్లా ప్రజలకు వచ్చే లాభం ఏమిటని ప్రశ్నించారు. మార్కాపురం జిల్లా ప్రజల పట్ల చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైందన్నారు. ఇప్పటికే మెడికల్ కళాశాల, వెలిగొండ ప్రాజెక్టును విస్మరించి ఎంతో ద్రోహం... మార్కాపురం జిల్లాకి ఇప్పటికే చంద్రబాబు ఎంతో ద్రోహం చేశారని కేవీ రమణారెడ్డి విమర్శించారు. మార్కాపురం జిల్లాలో ఉన్న మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేయడమే కాకుండా మార్కాపురం ప్రాంతానికి సాగు, తాగునీటి సౌకర్యం కల్పించే వెలిగొండ ప్రాజెక్టును విస్మరించారని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా వరకూ పూర్తిచేయగా, చంద్రబాబు చిన్నచిన్న పనులు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. చివరికి మార్కాపురం జిల్లా పేరుతో కొత్త డ్రామా సృష్టించి పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలను మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తూ మరింత ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతో కొంత అభివృద్ధి చెందిన దర్శి ప్రాంతాన్ని కూడా ఆ జిల్లాకు చెందకుండా చేయడమంటే మరోసారి మార్కాపురం జిల్లా ప్రజల్ని మోసం చేయడమే అవుతుందన్నారు. నిజంగా చంద్రబాబుకి మార్కాపురం జిల్లా ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. పక్కనే ఉన్న శ్రీశైలం క్షేత్రాన్ని, అదేవిధంగా పారిశ్రామిక క్షేత్రంగా తయారయ్యేందుకు సిద్ధంగా ఉన్న దొనకొండ ప్రాంతాన్ని తప్పనిసరిగా మార్కాపురం జిల్లాలో చేర్చాలన్నారు. పరిపాలనా సౌలభ్యం పేరుతో రామాయపట్నం ఉండే కందుకూరు నియోజకవర్గం, బల్లికురవ గ్రానైట్ ఉండే అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలిపారని, కానీ, ఎక్కడో సుదూరంగా ఉండే దొనకొండను కూడా ప్రకాశం జిల్లాలో కలపడం అంటే మార్కాపురం జిల్లాకు తీవ్ర అన్యాయం చేయడమే అవుతుందని అన్నారు. రామాయపట్నం పోర్టు లేదని, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ లేదని, చీమకుర్తి గ్రానైట్ లేదని, బల్లికురవ గ్రానైట్ లేదని, 100 ఎకరాల మాగాణి భూమి లేదని, ఒక రూపాయి ఆదాయం వచ్చే ఆర్థిక వనరు లేదని, చివరికి దొనకొండ కూడా లేదని, ఇక మార్కాపురం జిల్లా ఎవరి కోసమని ప్రశ్నించారు. ఈ జిల్లాను కేవలం చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం, పశ్చిమ ప్రకాశం ప్రజలపై ఉన్న కోపం తీర్చుకునేందుకు ఏర్పాటు చేసి శాశ్వతంగా వెనుకబడిన పేదరికంతో కూడిన ప్రాంతంగా తయారు చేయాలనుకోవడం అత్యంత దుర్మార్గమని రమణారెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వరరావు, ఇంటలెక్చువల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి పాల్గొన్నారు. -
స్వచ్ఛంద స్పందన..!
ఒంగోలు టౌన్: భార్య అంత్యక్రియలకు డబ్బుల్లేక.. అనే శీర్షికతో సోమవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్వచ్ఛంద సంస్థలు స్పందించాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ బాధ్యతను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీసుకున్నారు. పామూరు మండలం బోడపాడు గ్రామానికి చెందిన యోహాను కందుకూరులో రిక్షా తొక్కుతూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఆయన భార్య జాను నెల రోజుల క్రితం అనారోగ్యం బారిన పడింది. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత బుధవారం మరణించింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన బోడపాడు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా యోహాను వద్ద చిల్లిగవ్వ లేకపోవడంతో నాలుగు రోజుల పాటు భార్య మృతదేహాన్ని జీజీహెచ్ మార్చూరీలో ఉంచి తన ఇద్దరు పిల్లలతో హాస్పిటల్ బయటే ఉంటూ సాయం చేసే వారి కోసం ఎదురుచూస్తున్నాడు. జీజీహెచ్లో మరణించిన నిరుపేదల మృతదేహాలను తరలించడానికి మహాప్రస్థానం అంబులెన్స్ ఉన్నప్పటికీ ఆయనకు ఉపయోగపడలేదు. జీజీహెచ్ అధికారులెవరూ ఆయనకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈ క్రమంలో యోహాను కన్నీటి వ్యథను సాక్షి దినపత్రిక ప్రచురించింది. దాంతో నగరానికి చెందిన హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బీవీ సాగర్ ముందుకొచ్చారు. జిల్లా బాలల సంరక్షణాధికారి పి.దినేష్ కుమార్తో కలిసి జీజీహెచ్ మార్చూరీ వద్ద ఉన్న యోహానుతో మాట్లాడి ఒంగోలులోనే అంత్యక్రియలు చేసేందుకు ఒప్పించారు. కొత్తపట్నం బస్టాండు సెంటర్లో ఉన్న ముస్లిం శ్మశాన వాటికలో జాను అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు యోహను రెండేళ్ల కూతురిని శిశు గృహలో, ఏడేళ్ల బాలుడిని బొమ్మరిల్లు ఆశ్రమంలో చేర్పించారు. యోహాను దయనీయ పరిస్థితిపై స్పందించిన ఒంగోలు నగరానికి చెందిన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ జాను అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించింది. దాతల సహకారంతో సేకరించిన 38 వేల రూపాయలను ట్రస్ట్ కార్యదర్శి ఎస్కే సర్దార్బాషా చేతుల మీదుగా యోహానుకు అందజేశారు. దీంతో హెల్ప్ స్వచ్ఛంద సంస్థతో పాటు సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్కు పలువురు అభినందనలు తెలిపారు. -
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా జీజీహెచ్
● వైద్యశాఖ సమీక్షలో కలెక్టర్ రాజాబాబు ఒంగోలు టౌన్: నగరంలోని ప్రైవేట్, కార్పొనరేట్ ఆస్పత్రులకు దీటుగా జీజీహెచ్ను తీర్చిదిద్దాలని వైద్యశాఖ అధికారులను కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఆయన చాంబర్లో జీజీహెచ్ అభివృద్ధిపై వైద్యారోగ్య శాఖ, సర్వజన ఆసుపత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 85 శాతం నిరుపేద, సామాన్య ప్రజలు వైద్య చికిత్స కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వస్తుంటారన్నారు. వైద్యులు సానుకూలంగా స్పందిస్తే సగం రోగం నయమవుతుందని, రోగుల పట్ల ఆప్యాయతతో వ్యవహరించాలని సూచించారు. జీజీహెచ్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్కిటెక్ట్ సూచనల మేరకు అవసరమైన మేర నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. రోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమీక్షలో జిల్లా రెవెన్యూ అఽధికారి చిన ఓబులేసు, డీఎంహెచ్ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం: మార్కాపురం జీజీహెచ్లో ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్)లో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సీహెచ్ గౌతమ్రెడ్డి(28) సోమవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పట్టణ, రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, తల్లిదండ్రులు ఉన్నారు. శనివారం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ వైద్యశాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిసింది. -
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమం
ఒంగోలు టౌన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ అలుపెరుగని పోరాటాలు చేస్తోందని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు తెలిపారు. ఈ నెల 31 నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభల పోస్టర్లను సోమవారం స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాలం సుబ్బారావు మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికుల హక్కులను తాకట్టుపెడుతోందని విమర్శించారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారన్నారు. వాటి ద్వారా కార్మికుల జీవితాలను దుర్భరం చేసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపేది కార్మికవర్గమేనని, కార్మికులను దెబ్బ తీస్తే దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినట్టేనని చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణతో పాటు కార్మికులకు సంబంధించిన భవిష్యత్ పోరాట కార్యక్రమాల గురించి మహాసభలలో చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీవీ కొండారెడ్డి, పి.కల్పన, సీహెచ్ చిరంజీవి, పారా శ్రీనివాసరావు, కొర్నెపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గేదైపె పెద్ద పులి దాడి
రాచర్ల: మేత మేసేందుకు పొలానికి వెళ్లిన గేదైపె పెద్ద పులి దాడి చేసిన సంఘటన రాచర్ల మండలంలోని అనుములపల్లె గ్రామ సమీపంలో లింగమయ్యకొండ ప్రాంతంలో సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. అనుములపల్లె గ్రామానికి కొంతమంది పశువులను తీసుకెళ్లి ఆ గ్రామ సమీపంలోని లింగమయ్యకొండలో మేత మేయిస్తున్న సమయంలో పశువులపై పెద్ద పులి దాడి చేసింది. పెద్ద పులి దాడిలో గ్రామంలోని యమా భాస్కర్కు చెందిన తొలి చూడి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ దాదాపు రూ.35 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. అనుములపల్లె గ్రామ సమీపంలోని లింగమయ్యకొండ తిప్పల్లో పెద్ద పులి సంచరిస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాలైన జేపీ చెరువు, అనుములపల్లె, పలుగుంటిపల్లె, చోళ్లవీడు, చినగానిపల్లె గ్రామాల ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. గొర్రెల కాపరులు, పశుపోషకులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. టంగుటూరు: దిత్వా తుఫాన్ కారణంగా మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని జిల్లా పంచాయతీ అధికారి, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు సూచించారు. మండలంలోని తీర ప్రాంత గ్రామాలైన ఆలకూరపాడు, అనంతవరం, తాళ్లపాలెం, పసుకుదురు తదితర గ్రామాల్లో తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో దేవసేనకుమారితో కలిసి సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడారు. సముద్రం, నదుల్లో వేటకు వెళ్లరాదని, పడవలను ఒడ్డుకు తెచ్చుకోవాలని, భద్రంగా ఇళ్లలో ఉండాలని సూచించారు. -
నూతన జిల్లా ఏర్పాటులో దర్శికి అన్యాయం
దర్శి: నూతన జిల్లా ఏర్పాటులో దర్శి నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్.కరుణానిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నూతనంగా ఏర్పాటవుతున్న మార్కాపురం జిల్లాలో దొనకొండ, కురిచేడు మండలాలను కలపాలని డిమాండ్ చేశారు. దర్శిని మార్కాపురం రెవెన్యూ డివిజన్లో చేర్చితే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దొనకొండను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి మార్కాపురం జిల్లాకు ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. కురిచేడు మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని విన్నవించారు. వెలిగొండను త్వరితగతిన పూర్తి చేసి పశ్చిమ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని కోరారు. దర్శిని మార్కాపురం జిల్లాలో కలపాలని, ఇందుకోసం కలిసివచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో పోరాడతామని స్పష్టం చేశారు. ● రూ.1.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం ముండ్లమూరు(దర్శి): మండలంలోని సుంకరవారిపాలెం గ్రామంలో గునుపూడి సురేష్బాబు నివాసంలో వెండి వస్తువులు దొంగిలించిన వ్యక్తిని ముండ్లమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్సై కమలాకర్ వెల్లడించారు. చోరీ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం వేంపాడు గ్రామం మారెళ్ల రోడ్డులో అనుమానస్పదంగా తిరుగుతున్న ఆరవీటి కోటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి రూ.1.10 లక్షల విలువైన 2 వెండి కంచాలు, వెండి ప్లేటు, కలశం చెంబులు, వెండి మొలతాడు, కుంకుమ భరిణె, తాళాలగుత్తి, పొంగళిగిన్నెలు, గ్లాసులు, దీపం ప్రమిదలు, బత్తీల స్టాండ్లు, గంధం, కమలం గిన్నెలు, ఎనిమిది జతల పట్టీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు. త్రిపురాంతకం: జాతీయ రహదారిపై సంభవించిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళా ఉద్యోగిని మృతి చెందింది. మండలంలోని సోమేపల్లి రోడ్డు సమీపంలో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దూపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో మేనేజర్గా పని చేస్తున్న షేక్ హాబీబున్నీసా(30) అసిస్టెంట్ మేనేజర్ సాయికుమార్తో కలిసి త్రిపురాంతకం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్క నుంచి ఓ ముంగిస వేగంగా వచ్చి బైక్ చక్రాల మధ్య పడడంతో అదుపు తప్పింది. హబీబున్నీసా రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. ఆమెను త్రిపురాంతకం వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైపాలెం తరలించగా అక్కడ మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటిని కూల్చి.. స్థలాన్ని ఆక్రమించి..
ఒంగోలు టౌన్: ఇరవై ఏళ్లుగా నివసిస్తున్న ఇంటిని నగర పాలక సంస్థ అధికారులు, తాలుకా పోలీసులతో కలిసి టీడీపీ నాయకుడు అక్రమంగా కూల్చివేశాడని ఆరోపిస్తూ నగరంలోని నెహ్రూ నగర్ కాలనీకి చెందిన ఈద జాస్మిన్, విజయ్ దంపతులు దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ మాట్లాడుతూ.. హోటళ్లలో పనిచేసుకుంటూ పొట్టపోసుకుంటున్న నిరుపేద దళిత కుటుంబానికి చెందిన జాస్మిన్, విజయ్ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో రేకుల షెడ్డు వేసుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. టీడీపీ నాయకుడు పసుపులేటి శ్రీనివాసులు అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటరావుతోపాటు తాలుకా పోలీసులతో కుమ్మకై ్కన పసుపులేటి శ్రీనివాసరావు నవంబర్ 28వ తేదీన కుట్ర పూరితంగా దళితుడి ఇంటిని కూలగొట్టించారని ఆరోపించారు. డాక్యుమెంట్లు చూపించాలని అడిగితే పోలీసులు కేసు పెడతామని బెదిరించడం దుర్మార్గమన్నారు. ఇంటి కూల్చివేతకు పాల్పడిన, అందుకు సహకరించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఽనిరసనలో దళిత నాయకులు ఎం.వెంకట్, గణేష్, ఓ.కృష్ణ, సీహెచ్ స్రవంతి, మల్లికార్జున, సుప్రియ, చప్పిడిరాణి, బాలమ్మ, చెన్నమ్మ, కమలమ్మ, మరియమ్మ, వెంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు, మార్కాపురంలో టీడీపీ నాయకుల బరితెగింపు ఒంగోలు నెహ్రూనగర్లో దళితుడి ఇల్లు కూల్చివేత మార్కాపురం మండలం దరిమడుగులో అంబేడ్కర్ విగ్రహ స్థలానికి కంచె -
బాబు పాలనలో భరోసా శూన్యం
కొనకనమిట్ల: చంద్రబాబు పాలనలో ప్రజలకు భరోసా శూన్యమని, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడానికి కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానంలో నిర్మించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా సోమవారం సాయంత్రం కొనకనమిట్ల మండలంలోని సిద్ధవరం, కాట్రగుంట గ్రామాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 5 పూర్తి చేసి వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలతో ప్రైవేట్ వ్యక్తలకు కాలేజీలను కట్టబెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలకు జరుగుతున్న అన్నాయాన్ని సంతకాల రూపంలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడానికి వైఎస్సార్ సీపీ ఆద్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని పేర్కొన్నారు. కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వం కళ్లు తెరిపించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. సిద్ధవరంలో సర్పంచ్ రావినూతల మరియమ్మ ఇమ్మానియేలు, ఎంపీటీసీ మీరావళి, మాజీ ఎంపీటీసీ బాలఅంకయ్య, సర్పంచ్ యలమందల శ్రీనివాసులు, గ్రామ పార్టీ నాయకులు టి.నాగిరెడ్డి, కె.బాలవెంకటరెడ్డి, కాట్రగుంటలో నాయకులు గంగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కందెర పెద్దన్న, కుమ్మరి రమణయ్య ఏదుబాటి వెంకటరావు, సానికొమ్ము రవీంద్ర, అలవల నాగిరెడ్డి, మోరా చెన్నారెడ్డి, మోరా వెంకటరెడ్డి, కుర్రా యోగయ్య, రాజాల వెంకటేశ్వరరెడ్డి, చల్లా వెంకటేశ్వర్లు, టి.సుబ్బారావు, పెండెం కొండయ్య, కొండలరావు తదితరుల ఆధ్వర్యంలో అన్నాతో పాటు మండల నాయకులకు ఘన స్వాగతం పలికారు. కోటి సంతకాల సేకరణలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్, జడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, వైస్ ఎంపీపీ గొంగటి జెనీఫా, మండల పార్టీ అధ్యక్షులు మోరా శంకర్రెడ్డి, విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్ ఏలూరి సంజీవరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ ఉడుముల కాశిరెడ్డి, పార్టీ అనుబంధ విభాగల సభ్యులు గాడి కోనేటిరెడ్డి, గొంగటి కరుణయ్య పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దారుణం చంద్రబాబు సర్కారు కుట్రలను ప్రజలంతా తిప్పి కొట్టాలి వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ధ్వజం -
పెంచలయ్య హంతకులను కఠినంగా శిక్షించాలి
ఒంగోలు టౌన్: నెల్లూరుకు చెందిన సీపీఎం నాయకుడు, ప్రజా కళాకారుడు పెంచలయ్యను దారుణంగా హత్య చేసిన గంజాయి ముఠాను కఠినంగా శిక్షించాలని డైఫీ ఎస్ఎఫ్ఐ, ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. హంతకులను శిక్షించాలని కోరుతూ ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెంచలయ్య హత్య రాష్ట్రంలో గంజాయి ముఠా ఎంతగా చెలరేగిపోతుందో తెలియజేస్తుందని చెప్పారు. ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పోలీసు అధికారులతో కలిసి గంజాయి వ్యతిరేక సదస్సులను నిర్వహించిన పెంచలయ్యకు రక్షణ కల్పించడంలో పోలీసులు వైఫల్యం చెందారన్నారు. ప్రజా నాట్యమండలి నాయకుడు పేతూరు మాట్లాడుతూ గంజాయి , మత్తు మందులకు బానిసలైన విద్యార్థులు అనేక మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెడు మార్గం పట్టిన యువకులు ఎంతటి దారుణాలకై నా ఒడిగడుతున్నారన్నారు. సంఘవిద్రోహ శక్తులుగా మారుతూ సమాజానికి, తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతున్నారని చెప్పారు. ప్రభుత్వం, పోలీసులు నిబద్ధతగా వ్యవహరించకపోవడం వల్లే గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నారని, పట్టపగలే హత్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైఫీ నగర కార్యదర్శి పి.కిరణ్ మాట్లాడుతూ పెంచలయ్య హత్యపై పోలీసులు కఠినంగా వ్యవహరించకపోతే గంజాయి ముఠాలు మరింతగా రెచ్చిపోవడం ఖాయమన్నారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం గంజాయి పట్ల కట్టడి చేయడానికి ప్రయత్నం చేయాలని కోరారు. కార్యక్రమంలో విజయ్, ఆనంద్, రాజేశ్వరి, ఇంద్రజ్యోతి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో డైఫీ,ఎస్ఎఫ్ఐ, ఐద్వా నేతల ర్యాలీ -
నేటి నుంచి 30 పోలీసు యాక్ట్ అమలు
ఒంగోలు టౌన్: శాంతి భద్రతల్లో భాగంగా ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 30 పోలీసుయాక్ట్ అమలులో ఉంటుందని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సబ్ డివిజన్ పరిధిలోని ప్రజా సంఘాలు, కార్మిక యూనియన్లు, రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించకూడదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా, ఉల్లంఘించినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్నారు.మార్కాపురం రూరల్ (మార్కాపురం): మార్కాపురం నుంచి కంభం వైపునకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న హోంగార్డు చింతగుంట్ల వద్ద ఎద్దును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామానికి చెందిన పి.రాముడు జరుగుమల్లి పోలీసు స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై కంభం వెళ్తూ చింతగుంట్ల వద్ద అరకతో వెళ్తున్న ఎద్దును ఢీకొని కిందపడటంతో గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై అంకమరావు తెలిపారు. పీసీపల్లి: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గుదేవారిపాలెం సమీపంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..రామాపురం గ్రామానికి చెందిన గన్నవరపు మాలకొండయ్య(50) టీ తాగేందుకు రామాపురం నుంచి గుదేవారిపాలెం నడుచుకుంటూ వస్తున్నాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో కనిగిరి నుంచి పీసీపల్లి వెళుతున్న కారు ఢీకొట్టడంతో మాలకొండయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలుఉన్నారు. ఉలవపాడు: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉలవపాడు మండల పరిధిలోని కరేడు పంచాయతీ చిల్లకాల్వ సమీపంలోని రొయ్యల చెరువుల వద్ద ఆదివారం జరిగింది. ఆ వివరాల మేరకు.. వేటపాలెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన రావూరి సాంబశివరావు (52) ఉలవపాడు గ్రామానికి చెందిన ఓగుబోయిన ప్రసాద్కు చెందిన చెరువుల వద్ద పనిచేస్తున్నాడు. గత 17 ఏళ్ల నుంచి తన భార్య కోటేశ్వరమ్మతో విభేదించి వచ్చి రొయ్యల చెరువుల వద్ద ఉన్న రేకుల షెడ్డులోనే ఉంటున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెంది చనిపోవాలనే ఉద్దేశంతో రేకుల షెడ్డుకు ఉన్న ఇనుప కమ్మెకు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని సీఐ అన్వర్ బాషా, ఎస్సై అంకమ్మ పరిశీలించారు. భార్య కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరైనా రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇంతవరకూ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకపోవడం శోచనీయమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు విమర్శించారు. ఇప్పటికి పలు దఫాలుగా వాయిదాలు వేశారని, వచ్చే జనవరి 1వ తేదీలోపు కార్డులు ఇవ్వకుంటే సమాచార శాఖామంత్రి పార్థసారధి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం మార్కాపురం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, ప్రమాద బీమా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఇంతవరకూ పరిష్కరించలేదని అన్నారు. సమాచార శాఖాధికారులతో ఎన్నిసార్లు మాట్లాడినా స్పందించడం లేదని ఆరోపించారు. నవంబరు 30వ తేదీతో అక్రెడిటేషన్ కార్డుల గడువు ముగిసిందని, కొత్త కార్డులు ఇస్తామని చెప్పి మళ్లీ 2 నెలలు పొడిగించారని అన్నారు. జనవరి 1కి గుర్తింపు కార్డులు ఇవ్వకుంటే మంత్రి రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు ఎన్వీ రమణ, రాష్ట్ర నాయకుడు అల్లూరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద పోలీసుల తనిఖీలు
మద్దిపాడు: మండలంలోని మల్లవరం సమీపంలో ఉన్న కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్, ఆ పక్కనే ఉన్న మల్లవరం వెంకటేశ్వరస్వామి దేవాలయం, పరిసరాలను ఆదివారం పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా మద్దిపాడు ఎస్సై వెంకట సూర్య, ఆర్ఎస్ఐ తిరుపతిస్వామి, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం సభ్యులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రవేశ మార్గాలు, డ్యామ్ పైభాగం, ఉద్యానవన ప్రదేశాలను తనిఖీ చేశారు. పేలుడు పదార్థాలను గుర్తించే ప్రత్యేక జాగిలంతో సహా బాంబ్ డిస్పోజల్ టీంతో పరిశీలించారు. ప్రజలు తరచూ సందర్శించే ప్రదేశం కావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలను గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని, లేకుంటే డయల్ 112 కాల్ చేయాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు నేర నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజల భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యమని మద్దిపాడు ఎస్సై తెలిపారు. మార్కాపురం టౌన్: పట్టణంలో ఆదివారం ఎంవీఐ మాధవరావు చేపట్టిన వాహన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మూడు వాహనాలను సీజ్ చేశారు. పన్ను చెల్లించకుండా తిరుగుతున్న ఒక బస్సుకు 98,365 రూపాయల జరిమానా విధించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని రెండు వాహనాలను సీజ్ చేశారు. వాటిపై కేసులు కూడా నమోదు చేసినట్లు ఎంవీఐ తెలిపారు. -
మార్కాపురం జిల్లా ప్రకటనలోనే అన్యాయం
యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా మార్కాపురం జిల్లాగా ప్రకటించడంలోనే అన్యాయం జరిగిందని, ఎటువంటి ఆర్థిక వనరుల సమకూర్చకుండా పశ్చిమ ప్రాంత ప్రజల కన్నీటి తుడుపుగా జిల్లాగా ప్రకటించి చేతులు దులుపుకున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దేవేండ్ల శ్రీనివాస్ ఆరోపించారు. శ్రీశైలం మండలాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గంలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక పూలసుబ్బయ్య శాంతి భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం దేవస్థానాన్ని గతంలో కర్నూలు జిల్లాలో కలిపారని, జిల్లాల పునర్విభజన సమయంలో కూడా ఆ దేవస్థానాన్ని నంద్యాల జిల్లాకు మార్పు చేశారన్నారు. నంద్యాల జిల్లాకు దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలంను కొత్తగా ఏర్పాటు చేస్తున్న మార్కాపురం జిల్లాలో ఎందుకు కలపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు శ్రీశైలం వెళ్లాలంటే మార్కాపురం జిల్లాలో అంతర్భాగమైన పెద్దదోర్నాల నుంచి వెళ్లాల్సిందేనని, శ్రీశైలం మండలాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గంలో కలిపితే పూర్తిగా వెనకబడిన మార్కాపురం జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దర్శి నియోజకవర్గాన్ని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపురం జిల్లాలో కలపకుండా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలులో కలపడం పశ్చిమ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలం మండలం, దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలపకుంటే ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, బాణాల రామయ్య, వై.వెంకటశివయ్య పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దేవేండ్ల శ్రీనివాస్ -
ఎయిడ్స్ భూతం..!
కబళిస్తున్న.. ఎయిడ్స్ భూతం కబళిస్తోంది. అవగాహన లేమి, నిర్లక్ష్యంతో హెచ్ఐవీ బారిన బారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఓ పక్క స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా యువత పెడచెవిన పెట్టి వ్యాధి బారిన పడి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మార్కాపురం: ఎయిడ్స్..ఈ పేరు వింటేనే అందరికీ భయం. అయినా నిర్లక్ష్యంతో ఈ వ్యాధి బారిన పడి జీవితాలను, కుటుంబాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో పశ్చిమ ప్రకాశంలో ఎయిడ్స్ బారిన పడే వారిన సంఖ్య పెరుగుతోంది. పశ్చిమ ప్రకాశం నుంచి విజయవాడ, గుంటూరు, ఒంగోలుకు వెళ్లి చికిత్స చేయించుకునే వారి సంఖ్య దాదాపు 4500లకు పైగా ఉన్నారు. అనైతిక శృంగారం, ఇన్ఫెక్టెడ్ నీడిల్స్, ఇన్ఫెక్టెడ్ రక్తాన్ని మరొకరికి ఎక్కించటం ద్వారా, గర్భిణి బిడ్డకు వ్యాప్తి, హెచ్ఐవీ బారిన పడిన తల్లి పాలు ఇచ్చినప్పుడు తల్లి నుంచి బిడ్డకు వ్యాపిస్తోంది. జిల్లాలో హెచ్ఐవీ నిర్ధారణ కేంద్రాలు మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఒంగోలు, యర్రగొండపాలెం, కంభం, పొదిలి, దర్శి, సింగరాయకొండలో ఉన్నాయి. మార్కాపురం, ఒంగోలులో ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న బాధితులు జిల్లాలో మార్కాపురం, కంభం, బేస్తవారిపేట, రాచర్ల, అర్ధవీడు, త్రిపురాంతకం, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, గిద్దలూరు, కొమరోలు తదితర ప్రాంతాల్లో హెచ్ఐవీ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో శాశ్వతమైన నీటి వనరులు, ఫ్యాక్టరీలు లేవు. దీంతో ఉపాధి నిమిత్తం ఈ ప్రాంత ప్రజలు ఏడాదిలో ఆరు నెలల పాటు కుటుంబాలను వదిలి దేశంలోని ప్రధాన నగరాలకు వలస వెళుతుంటారు. ఇది వారికి శాపంగా మారుతోంది. మార్కాపురం జిల్లా వైద్యశాలలో ఏఆర్టీ (యాంటీ రెట్రో వైరల్ ట్రిట్మెంట్) సెంటర్లో నమోదైన వివరాలను పరిశీలిస్తే హెచ్ఐవీ శరవేగంగా చాప కింద నీరులా పలువురి ప్రాణాలను బలి కోరుతుంది. ఎక్కువగా ఆటో, లారీ డ్రైవర్లు, వలస కూలీలు, పలకల కార్మికులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. హెచ్ఐవీతో జన్మించిన చిన్నారులకు 15 ఏళ్ల వారికి ప్రభుత్వం వాత్సల్య పథకం అమలు చేస్తోంది. ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స.. ఈ వ్యాధి బారిన పడిన వారు పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలలతో పాటు హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, గుంటూరులలో చికిత్స పొందుతున్నారు. ఇలా ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారు సుమారు 4500 మందికి పైగా ఉండొచ్చని అంచనా. మార్కాపురం డివిజన్లో మార్కాపురం, గిద్దలూరు, కంభం, యర్రగొండపాలెం, బేస్తవారిపేట, కొమరోలు, పుల్లలచెరువు, బేస్తవారపేట, పెద్దారవీడు, పెద్దదోర్నాల ప్రాంతాల్లో ఎయిడ్స్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. డివిజన్లో అత్యధికంగా దొనకొండ, త్రిపురాంతకం, పుల్లలచెరువు, కొమరోలు మండలాల్లో హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ ప్రాంతం నుంచి వందలాది మంది కూలీలు కుటుంబాలకు దూరంగా వలసలు పోవటం కారణమవుతోంది. వీరిలో ఎక్కువ మంది 20 నుంచి 40 ఏళ్ల లోపు వారే. గిద్దలూరు, కొమరోలు, కంభం ప్రాంతాల్లో పలువురు సైనికోద్యోగులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఎయిడ్స్ వ్యాదిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులను అందిస్తోంది. ఈ మందులు వారి జీవితకాలాన్ని పొడిగిస్తాయి. కాగా ఇటీవల కాలంలో చికిత్స తీసుకోకుండా పలువురు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. మండలం పేరు మందులు వాడుతున్న వారు మార్కాపురం 1350 అర్ధవీడు 155 కంభం 260 బేస్తవారపేట 290 దోర్నాల 301 గిద్దలూరు 570 దొనకొండ 325 కొమరోలు 260 కొనకనమిట్ల 150 కురిచేడు 247 పెద్దారవీడు 242 పుల్లలచెరువు 345 త్రిపురాంతకం 478 యర్రగొండపాలెం 62 తర్లుపాడు 295 రాచర్ల 223 -
ప్రైవేటీకరణతో ఉచిత వైద్య సేవలు ఎలా..?
మార్కాపురం: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను, వాటి అనుబంధ వైద్యశాలలను ప్రైవేట్పరం చేస్తే పేదలకు ఉచిత వైద్యసేవలు ఎలా అందుతాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు ప్రశ్నించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్కాపురం పట్టణంలోని , 12, 15వ బ్లాకుల్లో ఆదివారం నిర్వహించిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణలో ఆయన మాట్లాడారు. దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ 7 మెడికల్ కళాశాలలు ఉన్నాయని, వైఎస్సార్ హయాంలో 5 మంజూరు చేశారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 17 మెడికల్ కళాశాలలు మంజూరుచేసి చరిత్ర సృష్టించారని అన్నారు. ఇప్పుడున్న మెడికల్ కళాశాలల్లో ఏ ఒక్కటైనా చంద్రబాబు తెచ్చాడా అని ప్రశ్నించారు. 14 ఏళ్లలో మూడుసార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు మెడికల్ కళాశాలలను తేలేకపోయాడని ప్రశ్నించారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందించడం, మెడికల్ విద్యను అందరికీ అందుబాటులోనికి తేవడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి బృహత్తర ఆశయంతో మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీపీపీ విధానానికి వెళ్లడం దుర్మార్గమన్నారు. ఈ ఉద్యమం పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమం కోసం చేపట్టిందని, అందరూ ముందుకు వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సంతకాల సేకరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజల అభిప్రాయాన్ని మన్నించి ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2024లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే మిగిలిన కాలేజీలు కూడా పూర్తయితే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య సీట్లు దక్కేవన్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ పీపీపీ విధానంలో తన బినామీలకు దోచిపెట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎవ్వరూ చేయని అభివృద్ధిని వైవెస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపారన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ ఆలీబేగ్, పీఎల్పీ యాదవ్, డాక్టర్ మగ్బుల్ బాషా, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు సలీమ్, చెంచిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వమే రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను నిర్మించాలని, ప్రైవేట్పరం చేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నారు బాపన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాసులు, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులతో కలిసి పాల్గొని మాట్లాడారు. కౌన్సిలర్లు డాక్టర్ కనకదుర్గ, సిరాజ్, కొత్త కృష్ణ, చాటకొండ చంద్ర, ఉత్తమ్కుమార్, రోజ్లిడియా, గుంటక వనజాక్షి చెన్నారెడ్డి, ముత్తారెడ్డి వెంకటరెడ్డి, పత్తి రవిచంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి గొలమారి సత్యనారాయణరెడ్డి, రైతు విభాగం పట్టణ అద్యక్షులు నూనె శివారెడ్డి, మాజీ ఎంపీపీ గాయం శ్రీనివాసరెడ్డి, గౌస్ మొహిద్దీన్, పత్తి కృష్ణ, పంబి వెంకటరెడ్డి, వార్డుల ఇన్ఛార్జిలు ఉస్మాన్, కోటిరెడ్డి, తనుబుద్ధి నాగార్జునరెడ్డి, బిలాల్, రాచకొండ శ్రీను, సాయి, దస్తగిరి, సర్పంచ్ గురునాధం, చిప్స్ శ్రీనివాస్, గుంటక అంజిరెడ్డి, ఏడుకొండలు, రఫీ, మందటి శివారెడ్డి, చాటకొండ నాగరాజు, పోరుమామిళ్ల విజయలక్ష్మి, రామిరెడ్డి, మహమ్మద్, జాఫర్, ఉస్మాన్, షేక్ కరీముల్లా, మల్లిక, చదలవాడ రమణారెడ్డి, ఖాశీం, సయ్యద్ గఫూర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్డుల్లో అన్నా రాంబాబు, జంకె వెంకటరెడ్డిలను క్రేన్ సహయంతో గజమాలతో సత్కరించారు. పేదలకు మెరుగైన వైద్యం చంద్రబాబుకు ఇష్టం లేదు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్నా రాంబాబు -
భార్య అంత్యక్రియలకు డబ్బుల్లేక..
ఒంగోలు టౌన్: అతడి పేరు యోహాన్. నెల్లూరు జిల్లా కందుకూరులో రిక్షా తొక్కుతూ భార్యా బిడ్డలను పోషిస్తుంటాడు. పామూరు మండలంలోని బోడవాడ స్వగ్రామం. భార్య జాను, ఇద్దరు పిల్లలతో నిన్నా మొన్నటి వరకు సంతోషంగా సాగిన కాపురంలో విషాదం చోటుచేసుకుంది. భార్యా జాను కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలైంది. పగలంతా రిక్షా తొక్కితే వచ్చే డబ్బులతో పొట్ట నింపుకోవడానికే సరిపోతున్నాయి. ఇక వైద్యం చేయించే పరిస్థితి లేకపోవడంతో ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యం చేయించసాగాడు. నెల రోజులుగా జీజీహెచ్లో భార్యకు చికిత్స చేయిస్తున్నాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. బుధవారం జాను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. దాంతో యోహను గుండె పగిలిపోయింది. పాపం పుణ్యం తెలియని ఇద్దరు చిన్నారులను గుండెలకత్తుకొని గుక్కపట్టి ఏడ్చాడు. జాను మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. నాలుగు రోజులవుతోంది. భార్య మృతదేహాన్ని సొంత ఊరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. కనిపించని దేవుడికి మొక్కుకున్నాడు. కనికరించలేదు. కళ్ల ముందు కనిపించిన ప్రతి ఒక్కరినీ ప్రాధేయపడ్డాడు. ఒక్కరూ దయతలచ లేదు. దాంతో ఇద్దరు చిన్నారులను తీసుకొని పగలు రాత్రి మార్చూరీ చుట్టే తిరుగుతున్నాడు. ఎవరైనా ఓ ముద్ద పెడితే పిల్లలకు తినిపిస్తున్నాడు. లేకపోతే పస్తులతో పడుకోబెడుతున్నాడు. అమ్మ కావాలని అడుగుతున్న చిన్నారులకు సర్ది చెప్పలేక సతమతమవుతున్నాడు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సాయం చేస్తే భార్య జాను మృతదేహాన్ని స్వగ్రామం బోడపాడుకు తరలించి అంత్యక్రియలు చేసుకుంటానని ప్రాధేయ పడుతున్నాడు. -
ఆర్థిక వనరులు లేకుండా జిల్లా ఏర్పాటు బాధాకరం
● మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి గిద్దలూరు (బేస్తవారిపేట): మార్కాపురం జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్నామని.. అయితే పూర్తిగా ఆర్థిక వనరులు లేకుండా చేయడం బాధాకరమైన విషయమని వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం గిద్దలూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. లక్ష ఎకరాల ప్రభుత్వ భూములున్న దర్శి నియోజకవర్గాన్ని పాత ప్రకాశం జిల్లాలో కలపడంతో మార్కాపురం జిల్లాకు అన్యాయం చేసినట్లే అన్నారు. దర్శి మార్కాపురం జిల్లాలో ఏదో ఒకనాడు ఇండస్ట్రియల్ కారిడార్ అయ్యేదన్నారు. నూతన జిల్లాలో ఉద్యోగ అవకాశాలు, జిల్లాకు ఆర్థిక వనరుగా ఉండేదని చెప్పారు. కొత్త జిల్లాలో ఉన్న ఏకై క మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తే జిల్లా ప్రజలకు ఉచిత వైద్యం దూరమవుతుందన్నారు. గిద్దలూరును నూతన రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరారు. ఇప్పటికే ఉన్న కనిగిరి, మార్కాపురం డివిజన్తోపాటు గిద్దలూరును చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం నూతన జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాలు అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, జెడ్పీటీసీ సారె వెంకటనాయుడు, మండల కన్వీనర్లు మానం బాలిరెడ్డి, ఆవుల శ్రీధర్రెడ్డి, గొంగటి చెన్నారెడ్డి, ఏరువ రంగారెడ్డి, యేలం మురళి, రవికుమార్, నాయకులు స్వామిరంగారెడ్డి, బీవీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ఎ.ఈశ్వర రెడ్డి ఆదివారం ప్రకటించారు. అధ్యక్షునిగా సంతనూతలపాడు డీఈఈ ఓ.కృష్ణ మోహన్, జనరల్ సెక్రటరీగా మార్కాపురం ఏఈఈ విజయ మోహన్ రాజా, వైస్ ప్రెసిడెంట్గా కందుకూరు డీఈఈ మాలకొండయ్య, ట్రెజరర్గా మార్కాపురం ఏఈఈ వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కనిగిరి ఏఈఈ బి.బ్రహ్మయ్యలను ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికై న నూతన కార్యవర్గాన్ని పంచాయతీరాజ్ ఎస్ఈ అశోక్ అభినందనలు తెలిపారు. -
సాయం మరచి.. అన్నదాతను ముంచి
రైతులకు ఎంతో ఉపయోగకరమైన 616 రైతు భరోసా కేంద్రాలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులతో పాటు రైతులకు సాగులో సలహాలు సైతం అందించింది. కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఇటువంటి రైతుహిత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. బేస్తవారిపేట: అన్నదాతలను ప్రకృతి కరుణించడం లేదు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదు. మార్కెట్ మాయాజాలానికి పతనమైన ధరలతో అడుగడుగునా నష్టపోతున్నా ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ఏమీ చేయకుండానే ప్రచార డబ్బా కొట్టుకునేందుకు చంద్రబాబు సర్కారు మళ్లీ ముందుకొచ్చింది. జనాన్ని నమ్మించి మోసం చేసేందుకు రైతన్నా–మీ కోసం అంటూ కొత్త ఎత్తుగడతో ప్రచారానికి తెరలేపింది. రైతులకు ఎంతో చేశామని కలరింగ్ ఇచ్చేందుకు నాంది పలికింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది రైతుల ఇంటి వద్దకు వెళ్లి ‘రైతన్న మీ కోసం’ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. నీటిభద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతుపై అవగాహన కల్పిస్తారు. ఈనెల 3వ తేదీన రైతు సేవా కేంద్రాల్లో వర్క్షాపులు పెట్టి, రానున్న రబీ, వచ్చే ఏడాది ఖరీఫ్, రబీ పంటలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. చేసిందేమీ లేకున్నా..ఇప్పుడు మా ముందుకు ఎందుకొస్తున్నారంటూ రైతులు గుసగుసలాడుకుంటున్నారు. సుఖీభవ అంటూ దుఃఖపెట్టారు.. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తామని గత ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి కూటమి నేతలు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఈ పథకాన్ని ఎగ్గొట్టి రైతులకు పంగనామాలు పెట్టారు. రెండో ఏడాదిలోనూ జిల్లాలో 15,970 మంది రైతులకు మొండిచేయి చూపారు. వైఎస్సార్ రైతు భరోసా 2,84,113 మందికి వర్తిస్తే నేడు 2,68,163 మంది అర్హులుగా గుర్తించారు. మరోవైపు దాదాపు 45 వేల మంది కౌలు రైతులకు నయాపైసా కూడా ఇవ్వకుండా వారికి వేదననే మిగిల్చారు. ఉచిత బీమాకు మంగళం... ఉచిత బీమా పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రీమియం చెల్లింపు భారాన్ని రైతులపైనే మోపింది. బీమా ప్రీమియం భారం కావడంతో వందల మంది రైతులు బీమాకు దూరమయ్యారు. బీమా చెల్లించిన రైతులకు పంటలు నష్టపోయినా ఇన్సూరెన్స్ రాలేదు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రైతులకు గత ప్రభుత్వం అండగా నిలిచింది. నేడు చంద్రబాబు సర్కారు సున్నా వడ్డీ రాయితీని గాలిలో పెట్టింది. మోంథా సాయం లేదు.. మోంథా తుపానుతో జిల్లాలో పత్తి 35,750 ఎకరాలు, సజ్జ 7,300, వరి 9,500, మొక్కజొన్న 7,100, ఇతర పంటలు 36 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. తుపాను వచ్చి నెల రోజులవుతున్నా ప్రభుత్వం నేటికీ పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి. 2024 డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన ఫెంగల్ తుపాను ధాటికి జిల్లాలోని పది మండలాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. శనగ పంట 5,506 హెక్టార్లు, మినుము 1,902 హెక్టార్లు, పొగాకు 1,333 హెక్టార్లు, మినుములు 1902 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. అప్పట్లో 7650 మంది రైతులు 25540 ఎకరాల్లో హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2024 అక్టోబర్ కురిసిన అధిక వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. అక్టోబర్ 13 నుంచి 21వ తేదీ వరకు ముసురుపట్టి భారీ వర్షాలు పడటంతో దాదాపు 24,700 ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. నేటికీ రైతులకు ఒక్క రూపాయి ప్రభుత్వం విడుదల చేయలేదు. మోంథా తుపానుతో తీవ్రంగా నష్టపోయాను కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో అరటి, మూడు ఎకరాలు వరి, ఒక ఎకరా పసుపు పంట సాగు చేశాను. పది రోజులుగా వర్షం విడవకుండా పడింది. కతువ ఉప్పొంగి పొలాలను వరద నీరు ముంచెత్తింది. నిండు కాపుతో ఉన్న అరటి చెట్లు కిందపడిపోయాయి. పంట మొత్తం నాశనమైంది. ప్రభుత్వం నష్టపరిహారం విడుదల చేయాలి. – చిట్టె మల్లిఖార్జున, సోమవారిపేట కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ ఇవ్వాలి అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపచేయాలి. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్కు అదనంగా రూ.20 వేలు ఇస్తామన్నారు. గతంలో అకాల వర్షాలు, తుపాను రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేటికీ నష్ట పరిహారం విడుదల చేయలేదు. గత నెలలో మోంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయారు. ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి. – ఢాకాల పుల్లయ్య, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి -
లక్ష్మీచెన్నకేశవ మార్కాపురం జిల్లాగా నామకరణం చేయాలి
మార్కాపురం టౌన్: కొత్త జిల్లాకు లక్ష్మీచెన్నకేశవ మార్కాపురం జిల్లాగా నామకరణం చేయాలని, ఆర్థిక వనరులు లేకుండా మార్కాపురం జిల్లాను ప్రకటించిన ఘనత చంద్రబాబు సర్కార్కే దక్కిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూర్వం కడపలో, తర్వాత కర్నూలు, ఆ తర్వాత ప్రకాశంలో ఉండి ఇప్పుడు మార్కాపురం జిల్లాగా నాయకులు ప్రకటించారన్నారు. కేవలం మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలను కలుపుతూ ఏ ప్రాతిపదికన ప్రకటించారో అర్థం కావడం లేదన్నారు. పూర్వం మార్కాపురం పలకల పరిశ్రమతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో వ్యాపారం జరిగిందని, ఇప్పుడు కార్డు బోర్డుతో పాటు వివిధ రూపాల్లో పలకలు తయారు చేసుకోవడంతో మార్కాపురం బొడిపలకగా మారి పరిశ్రమ కుంటుపడిందన్నారు. ఇక గిద్దలూరు, యర్రగొండపాలెం అటవీ ప్రాంతాలుగా, కనిగిరి ఫ్లోరైడ్ ప్రాంతంగా ఉందని, ఈ జిల్లాకు ఆర్థిక పరిపుష్టికి ఎక్కడి నుంచి వస్తుందో టీడీపీ నాయకులు తెలపాలన్నారు. రాజకీయ ఎత్తుగడ కోసం జిల్లాగా ప్రకటించారన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారన్నారు. మార్కాపురం జిల్లాలో దర్శి, కురిచేడును కలపాలని, శిఖరం వరకు సరిహద్దు ఉన్న శ్రీశైలాఇ్న మార్కాపురంలో కలిపే విధంగా మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జిల్లాకు ఒకరూపు తేవాలని జంకె డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు ధర్మానాయక్, నల్లబోతుల కొండయ్య, పంబి వెంకటరెడ్డి, ఎస్.సాంబశివారెడ్డి, గౌస్ మోహిద్దీన్, రమణారెడ్డి ఉన్నారు. వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి -
108లో కవలలు జననం
దర్శి: స్థానిక సీహెచ్సీలో వైద్యులు ఓ గర్భిణికి కాన్పు చేయలేమని చేతులెత్తేశారు. ఒంగోలు తీసుకెళ్లాలని బంధువులకు సలహా ఇచ్చారు. చేసేది లేక 108లో ఒంగోలు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో 108 సిబ్బంది కాన్పు చేశారు. ఆమె కవలలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన శనివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన తిరుపతమ్మకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారమిచ్చారు. దర్శి 108 సిబ్బంది వెంకటరెడ్డి, గౌస్బాషాలు సంఘటన స్థలానికి చేరుకొని ఆమె దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు తిరుపతమ్మకు కడుపులో కవల పిల్లలు ఉన్నారని, కవలలు ఉండటంతో పాటు రక్తహీనత కలిగి ఉందని చెప్పి ఒంగోలు రిమ్స్కు రిఫర్ చేశారు. అక్కడి నుంచి మళ్లీ 108లో ఒంగోలు వెళ్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. వెల్లంపల్లి సమీపంలో వాహనాన్ని పక్కకు ఆపి ఎంటీ, ఫైలెట్లే కాన్పు చేశారు. 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో కవల పిల్లలు 108లోనే జన్మించారు. ఆ వెంటనే తల్లి, పిల్లలను ఒంగోలు రిమ్స్ వద్ద క్షేమంగా వదిలి పెట్టారు. అక్కడి వైద్యులు వారికి వైద్య పరీక్షలు చేశారు. తల్లి, పిల్లలకు ప్రమాదం లేకుండా కాన్పు చేసిన 108 సిబ్బంది గౌస్బాషా, వెంకటరెడ్డిలను ఓఈ మహేష్ అభినందించారు. -
పెళ్లి ఇంట్లో దొంగతనం
● 7 సవర్ల బంగారం, రూ.4.73 లక్షల నగదు చోరీ చీమకుర్తి: జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు ఇంట్లో చోరీ జరిగింది. 6 సవర్ల బంగారు పూలహారం, 7 గ్రాముల ఉంగరం, రూ.4.73 లక్షల నగదును దొంగలు అపహరించినట్లు ఆయన శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 27వ తేదీ రాత్రి వేమా శ్రీనివాసరావు తన కుమారుడి వివాహాన్ని చీమకుర్తిలోని బీవీఎస్ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించారు. అదే రాత్రి 12 గంటల వరకు కల్యాణ మండపం వద్ద ఉన్నారు. అనంతరం పెళ్లి కార్యక్రమాన్ని ముగించుకొని కూనంనేనివారిపాలెంలోని తన నివాసానికి వెళ్లారు. ఇంటి వెనుక తలుపులు తెరిచి బీరువాను ధ్వసం చేసినట్లు గుర్తించారు. బీరువాలో ఉంచిన 6 సవర్ల బంగారు పూలహారం, 7 గ్రాముల ఉంగరంతో పాటు రూ.4.73 లక్షల నగదు కనిపించటం లేదని అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత వేమా శ్రీనివాసరావు వధూవరులతో కలిసి తిరుపతి వెళ్లాల్సి ఉండటంతో వెళ్లి తిరిగి వచ్చి శనివారం పోలీసుస్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశౠరు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ దాసరి ప్రసాద్ తెలిపారు. -
రూ.కోటి స్వాహా అనడం దుర్మార్గం
సంతనూతలపాడు: భవన నిర్మాణమే రూ.98 లక్షలైతే కోటి రూపాయల అవినీతి ఎలా సాధ్యమని సంతనూతలపాడు సిండికేట్ రైతు సొసైటీ మాజీ అధ్యక్షులు దుంపా యల్లమందారెడ్డి, మాదాల వెంకట్రావు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ పాలనల్లో సొసైటీకి స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపట్టామని, టీడీపీ పాలనలో పట్టించుకున్న దాఖలు లేవని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా సొసైటీకి భారీ భవనాన్ని నిర్మిస్తే దాన్ని ఓర్చుకోలేక నేటి చైర్మన్, ఆడిటర్ ప్రోద్బలంతో పత్రికల్లో మాజీ అధ్యక్షుల వ్యక్తిత్వంపై బురద జల్లే కార్యక్రమం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి ప్రతి ఒక్క రూపాయి ఎంబుక్లో రికార్డు చేసి ఉందని స్పష్టం చేశారు. తమ హయాంలో క్రాప్ లోన్లకు వడ్డీ రేట్లు కూడా తగ్గించామని, రుణాలు, డిపాజిట్లు భారీగా పెరిగాయన్నారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలపై నేడు డిపాజిదారులు, బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు ఆరోపణతో సొసైటీ రోడ్డున పడే పరిస్థితి తీసుకొస్తున్నారన్నారు. ఇటీవల ఓ పత్రికకు పార్టీ తరఫున చైర్మన్ ఇచ్చిన ప్రైవేట్ యాడ్కు సొసైటీ నుంచి నిధులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రస్తుత సొసైటీ ఆడిటర్ పక్షపాత వైఖరితో ఇతరుల పోద్బలంతో తప్పుడు నివేదికలను తయారు చేసి ఇచ్చారని, దీనిలో ఇచ్చినవి నిరూపించకపోతే లీగల్గా పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశారు. తమ పాలనలో ఎటువంటి అవినీతి జరగలేదని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి మాట్లాడుతూ ఆడిటర్ ఆడిటింగ్ చేయకుండా రాజకీయాలు చేస్తూన్నారని, వీలైతే ఆడిట్ చేసి ఏదైనా తప్పు జరిగి ఉంటే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలిగానీ ఈ విధంగా లీకులతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశంలో సొసైటీ మాజీ డైరెక్టర్లు తన్నీరు మోహన్రావు, కొనికి కోటేశ్వరరావు, కొడవటి హరిబాబు పాల్గొన్నారు. సంతనూతలపాడు సిండికేట్ రైతు సొసైటీ మాజీ చైర్మన్, డైరెక్టర్లు -
శ్రీశైలం ఘాట్లో ప్రమాదం
ెపద్దదోర్నాల: వేగంగా వస్తున్న ఓ కారు తొలుత కొండను.. ఆ తర్వాత బస్సును ఢీకొని రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వాహనాల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడగా పెను ప్రమాదమే తప్పింది. ఈ సంఘటన శ్రీశైలం రహదారిలోని చింతల సమీపంలో శనివారం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. అందిన వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన కొందరు శ్రీశైలంలో దైవ దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో చింతల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు తొలుత కొండను, అనంతరం ఎదురుగా వస్తున్న మార్కాపురం డిపో లగ్జరీ బస్సును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ క్రమంలో శ్రీశైలం వెళ్తున్న నంద్యాల జిల్లా పోలీసులు రోడ్డుకు అడ్డంగా బోల్తా పడిన కారును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సును ఢీకొని బోల్తా పడిన కారు -
వైన్షాపులో చోరీ
కంభం: స్థానిక బస్టాండ్ సమీపంలోని ఓ మద్యం దుకాణంలో దొంగలు పడి నగదు అపహరించుకెళ్లారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరగగా శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బస్టాండ్ ఎదురుగా ఉన్న విజయదుర్గ వైన్స్ షాపును రోజూలాగే రాత్రి మూసి వెళ్లి శనివారం ఉదయం షాపు తెరిచారు. అనంతరం దొంగతనం జరిగినట్లు గుర్తించారు. షాపు వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించిన దొంగలు కౌంటర్ లోని నగదును అపహరించుకెళ్లినట్లు గుర్తించారు. కౌంటర్లో ఉన్న సుమారు రూ.లక్షన్నర వరకు నగదు పోయిందని, మద్యం బాటిల్స్ ఎన్ని పోయాయో లెక్కవేస్తే తెలుస్తుందని షాపు యజమానులు తెలిపారు. దొంగలు తమ ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు సీసీ కెమెరా డివిఆర్ను, మానిటర్ను కాలువలో పడేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ కె.మల్లికార్జున చోరీ జరిగిన దుకాణాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మార్కాపురం నుంచి వచ్చిన క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. ఇటీవల ఇదే షాపునకు ఎదురుగా రెండు దుకాణాల్లో చోరీ జరిగిన విషయం విధితమే. పది రోజులు తిరగక ముందే మళ్లీ చోరీ జరగడంతో బస్టాండ్ పరిసరాల్లోని దుకాణాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నా వాటిని కూడా దొంగతనానికి వచ్చిన వారు ధ్వంసం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాత్రి పూట పోలీసులు గస్తీ పెంచి దొంగతనాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు. రూ.లక్షన్నర నగదు మాయం -
నకిలీ పాలసేకరణ కేంద్రంపై దాడి
దర్శి: కల్తీపాలు తయారు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి శివతేజ హెచ్చరించారు. మండలంలోని చలివేంద్రంలో కల్తీపాల తయారీ స్థావరంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడులు చేశారు. అక్కడ తయారు చేస్తున్న కల్తీపాలు, అందుకు ఉపయోగించే ఆయిల్ ప్యాకెట్లను భారీగా స్వాధీనం చేసుకున్నారు. పాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపించారు. ఈ సందర్భంగా శివతేజ మాట్లాడుతూ తమకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు చలివేంద్రలో సందు రామాంజనేయులు అనే వ్యక్తి పాల సేకరణ కేద్రం ఏర్పాటు చేసుకుని పలు డెయిరీలకు పాలు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఆ పాలతో పాటు మరికొన్ని కల్తీపాలు తయారు చేసి వాటిలో కలిపి డెయిరీలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. రెండు రోజులుగా గ్రామంలో రెక్కీ నిర్వహించి డాడులు చేసి నకిలీ పాలను పట్టుకున్నట్లు ఆయన వివరించారు. నకిలీ పాలు తయారు చేసేందుకు ఉపయోగించే సామగ్రి, సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పాలలో ఆయిల్ కలపడంతో ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతుందని కొందరు అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేందుకు కల్తీపాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీపాలు తయారు చేసేందుకు ఉపయోగించిన ఆయిల్ ప్యాకెట్లు, పాలు శాంపిల్స్ తీసుకున్నామని చెప్పారు. వాటిని ల్యాబ్కు పంపి రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా కల్తీపాలు తయారు చేస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని శివతేజ చెప్పారు. పలు శాంపిళ్లు స్వాధీనం కల్తీపాలు తయారు చేస్తే చర్యలు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ -
గమ్యం చేరగా..
సంకల్పం తోడుగా.. ఒంగోలు వన్టౌన్: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని దివ్యాంగులకు ఆటలు, క్రీడల పోటీలను శనివారం ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించారు. పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖాధికారి సీహెచ్. సువార్త మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెస్, క్యారమ్స్, రన్నింగ్, షార్ట్ఫుట్, బ్లైండ్ క్రికెట్, స్కిప్పింగ్ టగ్ ఆప్ వార్, డిస్కస్ త్రో, ట్రై సైకిళ్లరేస్, మోటార్ బైక్ రేస్, వాలీబాల్ తదితర పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ ప్రత్యేక పాఠశాలలు, ప్రభుత్వ బాలుర వసతి గృహ విద్యార్థులతో పాటు వివిధ ప్రైవేటు ప్రత్యేక పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ప్రభుత్వ బధిరుల పాఠశాల, ఒంగోలు, దివ్యాంగుల బాలుర వసతి గృహం, ఒంగోలు, బధిరుల ప్రత్యేక పాఠశాల, చీమకుర్తి ప్రత్యేక మానసిక, బధిరుల పాఠశాల, కనిగిరి మనోవికాస్ మానసిక, ఒంగోలులోని ప్రత్యేక అవసరాల పాఠశాల, మార్కాపురంలోని స్ఫూర్తి మానసిక, ప్రత్యేక అవసరాల పాఠశాల, చైతన్య బధిరుల ప్రత్యేక పాఠశాల, సారా కవెనంట్ హోం, గుడ్ డే అంధుల ప్రత్యేక పాఠశాల, దివ్యాంగుల సంఘాల నుంచి దాదాపు 500 మంది దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొని వివిధ క్రీడా విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. గెలుపొందిన వారికి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజు బహుమతులు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు ప్రారంభించారు. -
బడుగుల ఇళ్లు కూలగొట్టి..
ఒంగోలు సబర్బన్: ఆమె నగర ప్రథమ పౌరురాలు...ఆమె ఇంటికి డ్రైనేజీ సౌకర్యం కోసం పేదలపై ప్రతాపం చూపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువుకొమ్ముపాలెంలో డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నారు. అడ్డగోలుగా బడుగుల రేకుల షెడ్లను నిలువునా కూల్చేశారు. రోడ్డుకు అవతల వైపున ఉన్న డ్రైనేజీని కాదని కూలీ నాలీ చేసుకునే పేదల ఇళ్లు నేలమట్టం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లేయమని అడిగిన ఆమె నేడు ఇళ్లు కూలగొట్టంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. చెరువుకొమ్ముపాలెం గ్రామంలో మేయర్కు చెందిన భారీ భవనం ఉంది. ఆ భవనం ఆనుకొని పాత కల్వర్టులు, డ్రైనేజీ ఉంది. అది చెరువుకొమ్ముపాలెం గ్రామంలోకి వెళ్లే రోడ్డుకు మేయర్ భవనం ఉత్తరం వైపు ఉంటుంది. ఆ వైపు డ్రైనేజీ తీస్తే మేయర్ భవనం సగానికి కూలగొట్టాలి. ఆమేరకు గతంలో ఎక్కడి వరకు కూలగొట్టాలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు మార్కింగ్ కూడా చేశారు. దాంతో భవనం కూలగొడితే చాలా నష్టపోవాల్సి వస్తుందని భావించిన ఆమె పేదల ఇళ్లను టార్గెట్ చేశారు. పాత డ్రైనేజీ ఉన్నా ఇటీవల రూ.40 లక్షల అంచనాలతో డ్రైనేజీ నిర్మాణానికి కౌన్సిల్లో ఆమోదం చేయించుకున్నారు. అడ్డగోలుగా డ్రైనేజీ నిర్మాణం చేసుకుంటూ 26 మంది బడుగుల ఇళ్లు కూల్చివేస్తున్నారు. 30 అడుగుల రోడ్డుకు పడమరగా ప్రభుత్వ స్థలం ఉంది. అది కాదని పేదలు ఉంటున్న ఇళ్లను కూల్చివేసి ఆరు అడుగుల లోతులో భారీ డ్రైనేజ్ నిర్మిస్తున్నారు కార్పొరేషన్ అధికారులు. ఇదేం అన్యాయం అంటూ వారు అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోకుండా పనులు చేపట్టారు. ఇదేమని అడిగితే గంజాయి కేసుపెట్టి ఇరికిస్తానని మేయర్ అనుచరుడు బెదిరిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులను అడ్డంపెట్టుకొని పేదలపై ప్రతాపం చూపిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సిల్ తీర్మానం ప్రకారమే డ్రైనేజీ నిర్మాణం.. చెరువుకొమ్ముపాలెం గ్రామంలోని కొత్తపాలెం వద్ద ఒంగోలు కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం ప్రకారమే డ్రైనేజీ నిర్మిస్తున్నామని ఒంగోలు నగర పాలక సంస్థ ఇంజినీర్ ఏసయ్య తెలిపారు. మేయర్ సుజాతకు చెందిన భవనానికి ఆనుకొని ఉన్న పాత డ్రైనేజీని కాదని ఎందుకు కొత్త డ్రైనేజీని తీస్తున్నారని అడిగిన ప్రశ్నకు పాత డ్రైనేజీతో తమకు సంబంధం లేదని, మేయర్ తీర్మానం చేసిన కౌన్సిల్ ఆమోదం ప్రకారం ఇళ్లు తొలగించి పెద్ద డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. గతంలో చేసిన మార్కింగ్ను కాదని మేయర్ భవనం కూలగొట్టాల్సి వస్తుందని రోడ్డుకు అవతల వైపు డ్రైనేజీ తీస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. కాంట్రాక్టర్ కాకుండా స్థానిక నాయకుడు సుధాకర్ వచ్చి మరీ ప్రజలను భయపెట్టి పొక్లెయిన్తో రేకుల షెడ్డులు కూలగొట్టించారట కదా అని అడిగిన ప్రశ్నకు ఆ విషయం తమకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారు. -
రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు
యర్రగొండపాలెం: స్థానిక సీఎస్ గోడౌన్తో పాటు పట్టణంలోని పలు రేషన్ షాపులపై డిప్యూటీ కలెక్టర్ అరవకుమార్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. తొలుత గోడౌన్లో ఉన్న బియ్యం, రికార్డులు, ఆయా రేషన్ షాపుల్లో ఉన్న స్టాక్తోపాటు రికార్డులు తనిఖీ చేశారు. ఈ నెల 1వ తేదీన రేషన్ పంపిణీ చేయాల్సి ఉంది. అందుకు రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార నిల్వ ఉంచారు. రేషన్ పంపిణీ చేయకముందే కొంతమంది గోడౌన్ నుంచి నేరుగా బియ్యం అక్రమంగా తెలుగు తమ్ముళ్ల గోడౌన్లకు చేరుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు రేషన్ షాపులను తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. దాడుల్లో ఎన్ఫోర్స్ మెంట్ డీటీ చంద్రశేఖర్, గోడౌన్ డీటీ భ్రమరాంబ, ఆర్ఐ షేక్ సర్దార్ పాల్గొన్నారు. -
కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్లు
ఒంగోలు టౌన్: కార్మికులను కార్పొరేట్ శక్తుల కట్టుబానిసలుగా మార్చేందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రాధా కృష్ణమూర్తి అన్నారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో ఏఐటీయూసీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి సయ్యద్ యాసిన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాధా కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్లలో కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కార్మిక లోకం ఎన్నో త్యాగాలతో సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న మోదీ సర్కార్ చరిత్రలో చేతులు కట్టుకొని నిలబడక తప్పదని హెచ్చరించారు. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కోట్లాది మంది కార్మికులు రోడ్లమీదకు వచ్చి నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా మోదీ సర్కార్కు చీమకుట్టినట్టయినా లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న మోదీ వారికి ప్రయోజనం కలిగించేందుకే నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారని చెప్పారు. కార్పొరేట్లకు కోరిన వెంటనే ఉచితంగా భూములను పంచిపెడుతున్నారని, చట్టాలను వారికి చుట్టాలుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. 8 గంటల పనివిధానానికి స్వస్తి పలికి 13 గంటల పనివిధానాన్ని తీసుకొచ్చారని చెప్పారు. పనిచేయకుండా కార్మికులకు వేతనాలు ఇస్తారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కార్మికులు ఏడాదికి రూ.400 కోట్లకు పైగా సంపద సృష్టిస్తున్నారని తెలిపారు. అయినా కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు సిద్ధించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్ ఉద్యోగాల స్థానంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసుకొస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఏకై క ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, కొత్తకోట వెంకటేశ్వర్లు, కాటన్ శెట్టి హనుమంతరావు, సుభాన్ నాయుడు, పుల్లమ్మ, దాసరి మల్లికార్జునరావు, దాసరి సునిత, కె.అంజయ్య, వివిధ రంగాలకు చెందిన కార్మికులు, పాల్గొన్నారు. -
మిర్చి తోటలో గంజాయి సాగు!
పెద్దదోర్నాల: సాగులో ఉన్న మిర్చి తోటలో గంజాయి మొక్కలను ఎకై ్సజ్ అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. ఈ సంఘటన పెద్దదోర్నాల మండల పరిధిలోని జమ్మిదోర్నాల పంట పొలాల్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎకై ్సజ్ సీఐ ముక్కు వెంకటరెడ్డి కథనం మేరకు.. జమ్మిదోర్నాలలో రైతు బోయపాటి రాజబాబు మిర్చి తోటలో అక్కడక్కడా పెంచిన గంజాయి మొక్కలను ఎకై ్సజ్ పోలీసులు గుర్తించారు. ఆ మొక్కలను మధ్యవర్తుల సమక్షంలో పీకి ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. గురువారం మండలంలో గంజాయి కలిగిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించడంతోపాటు వారి వద్ద కిలోన్నర గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజే జమ్మిదోర్నాలలో గంజాయి మొక్కలు వెలుగుచూడటం ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాల వినియోగం మితిమీరుతోందని స్పష్టమైంది. దాడిలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బాలయ్య, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణతోపాటు ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. మొక్కలు గుర్తించి ధ్వంసం చేసిన ఎకై ్సజ్ అధికారులు -
మార్కాపూర్.. ట్రాఫికర్
వాహనాలపై నియంత్రణ లేక ప్రధాన రహదారులు, జంక్షన్లు జామ్ మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణాన్ని ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయట పడేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి వరకు రచించిన ప్రతివ్యూహాలు పెద్దగా ఫలితాన్నివ్వలేకపోయాయి. రహదారులపై ఆగిపోయిన భారీ వాహనాల మధ్య ద్విచక్రవాహనదారులు సర్కస్ ఫీట్లు చేస్తుండగా.. పాదచారులు సైతం పాములా మెలికలు తిరుగుతూ ముందుకెళ్తున్న దుస్థితి. వాహనాల రణగొణ ధ్వనుల మధ్య గమ్యస్థానాలకు చేరుకునేసరికి ఉద్యోగులతోపాటు ఇతర వర్గాలవారు డీలా పడిపోతున్నారు. రోడ్లపై ఆక్రమణలు తొలగించడం, అవసరమైన చోట రహదారుల విస్తరణ పనులు చేపట్టడం, అడ్డగోలు పార్కింగ్ను కట్టడి చేయడంతోపాటు ప్రధాన కూడళ్లలో సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే ట్రాఫిక్ సమస్య ఓ కొలిక్కొస్తుందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం నుంచి జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన మార్కాపురంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ● పట్టణ ప్రధాన కూడళ్లలో సిగ్నలింగ్ వ్యవస్థ అవశ్యం ● అడ్డగోలు పార్కింగ్ను కట్టడి చేయాలని జనం అభిలాష ● ట్రాఫిక్ స్టేషన్ ఏర్పాటుపై ఎస్పీ దృష్టి సారించాలని ప్రజల వినతి అడ్డగోలు పార్కింగ్తోనే సమస్య మార్కాపురం రోడ్లపై వాహనాలు నడపడమంటే సర్కస్ ఫీట్లు చేయడం లాంటిదే. నెహ్రూ బజారు, నాయుడు బజారు, మెయిన్ బజారులలో పార్కింగ్ స్ధలం లేకపోవడంతో హోటల్స్కు, కిరాణా షాపులకు, ఫ్యాన్సీ షాపులకు వచ్చేవారు తమ వాహనాలను షాపుల ముందు పార్కింగ్ చేస్తున్నారు. నాయుడు బజారు, కొత్తమార్కెట్, పాత మార్కెట్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో కూడా సమయపాలన పాటించకుండా లోడింగ్, అన్లోడింగ్ కోసం భారీ వాహనాలను రోడ్డుపై నిలిపి ఉంచడంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. పార్కింగ్ ప్రదేశాలు లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం, అలాగే షాపింగ్కు వచ్చిన ప్రజలు తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపి ఉంచుతున్నారు. దీంతో తరచుగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. రద్దీ ప్రదేశాల్లో సెంట్రల్ పార్కింగ్ సిస్టమ్పై పోలీసులు దృష్టి సారిస్తే కొంత మేర సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ట్రాఫిక్ స్టేషన్తోనే పరిష్కారం! ట్రాఫిక్ నియంత్రణకు మార్కాపురం పట్టణంలో వివిధ సెంటర్లలో 8 మంది హోంగార్డులు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక ఎస్సై ఉన్నప్పటికీ ట్రాఫిక్ నియంత్రణ కష్టంగా మారింది. కొందరు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఎక్కడపడితే అక్కడ ఆటోలు ఆపడం, టర్నింగ్ తిప్పడం లాంటివి చేస్తుండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవించడంతోపాటు ట్రాపిక్ సమస్యకు కారణమవుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికుల కోసం కంభం సెంటర్, దోర్నాల సెంటర్, గడియార స్తంభం సెంటర్, ఒంగోలు సెంటర్లో బస్సులు పదే పదే నిలపడం వల్ల కూడా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. మార్కాపురం పట్టణానికి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ మంజూరు చేయడంతోపాటు అదనపు సిబ్బందిని నియమిస్తే వాహనాల రద్దీని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రోజూ గంట వృథా.. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, నియంత్రణ లేని వాహనాలతో మార్కాపురం పట్టణ ప్రజలు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. సుమారు లక్ష జనాభా ఉన్న పట్టణంలో 4 వేలకు పైగా ఆటోలు, సుమారు 150కి పైగా బస్సులు 6 వేల ద్విచక్ర వాహనాలు, 1600కు పైగా కార్లు రాకపోకలు సాగిస్తున్నాయి. పట్టణంలో 4 ఇంజినీరింగ్ కళాశాలలు, 10 ఇంటర్, డిగ్రీ ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు పట్టణంలో వివిధ ప్రైవేట్ పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 40కి పైగా బస్సులు తిరుగుతుంటాయి. విద్యార్థులను తీసుకెళ్లేందుకు, దించేందుకు పాత బస్టాండ్, దోర్నాల సెంటరు, నాయుడు బజారు, కంభం సెంటరు, కోర్టు సెంటరు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో బస్సులు ఆపుతారు. ఈ క్రమంలో వెనుకవచ్చే వాహనాలన్నీ హారన్ల మోత మోగిస్తున్నాయి. కంభం రోడ్డులో ఎల్ఐసీ ఆఫీసు వద్ద ఉదయం, సాయంత్రం రోజూ సుమారు గంట సమయం ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయ్యప్పస్వామి గుడిలైన్లో ట్రాఫిక్ ఇలా 150 -
రేయింబవళ్లుతవ్వుడు.. తోలుడే..!
పాలేరును చెరబట్టిన ‘పచ్చ’ ముఠా రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి రూ.10 కోట్ల పైగా పోగేసిన టీడీపీ ముఠాకొండపి: విచ్చలవిడిగా ఇసుక అక్రమ దందా సాగిస్తున్న టీడీపీ ముఠాను కట్టడి చేయడంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ఇసుక లారీలపై దాడి చేస్తే ఎక్కడ తమపై రెడ్ బుక్ ప్రయోగిస్తారోనన్న భయం కొందరిదైతే, సంపాదన యావలో పడి మరికొందరు అధికారులు పచ్చ ముఠా ఇసుక దోపిడీని గుడ్లప్పగించి చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి, పొన్నలూరు మండలాల పరిధిలో ప్రవహించే పాలేరులో ఇసుకను టీడీపీ నాయకులు కొల్లగొడుతున్నారు. గడిచిన 4 నెలలుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా పాలేరులో ఇసుకను జేసీబీలతో తవ్వి, యథేచ్ఛగా టిప్పర్లతో తరలిస్తున్నారు. నిత్యం 3 నుంచి 4 జేసీబీలు పాలేరులో ధ్వంసరచన చేస్తున్నాయి. రోజూ 40 టిప్పర్లకు పైగా ఇసుక అక్రమంగా కొండపి నియోజకవర్గంతోపాటు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు తరలిపోతోంది. జరుగుమల్లి, పొన్నలూరు పరిధిలో తవ్విన ఇసుకను కొండపి మీదుగా చీమకుర్తి, సంతనూతలపాడు, మర్రిపూడి, పొదిలి వైపు తరలిస్తూ టీడీపీ నేతలు దండిగానే సంపద పోగేసుకుంటున్నారని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గడిచిన 4 నెలల్లో మోంథా తుఫాన్ సమయంలో 2 రోజులు మినహా మిగిలిన అన్ని రోజులూ ఇసుక అక్రమ రవాణా సాగింది. గురు, శుక్రవారాల్లో సైతం యథేచ్ఛగా ఇసుక తరలిపోయింది. మొత్తం మీద ఇప్పటి వరకు 4800 టిప్పర్ల ఇసుకను టీడీపీ నేతలు అక్రమంగా తరలించినట్లు కొండపి, జరుగుమల్లి, పొన్నలూరు మండలాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే టీడీపీ నేతలు పోగేసుకున్న సొమ్ము రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ధ్వంసమవుతున్న రోడ్లు ఇసుకను ఓవర్ లోడ్ చేసిన లారీలు, టిప్పర్లు కామేపల్లి నుంచి కొండపి వైపు రావడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే దెబ్బతిన్న ఇసుక లారీల కారణంగా మరింత గుల్లవుతున్నాయి. కామేపల్లి–నేతివారిపాలెం మధ్య రోడ్డు, కొండపి–అన్నకర్లపూడి మధ్య రోడ్డు ధ్వంసం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో ఇసుకను నేరుగా ప్రభుత్వమే విక్రయించగా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుకను టీడీపీ నేతలకు ఆదాయ వనరుగా మార్చేశారు. టీడీపీ ముఖ్య నేతల ఆదేశాలతో అధికారులు మౌనం దాల్చడంతో ఆ పార్టీ నాయకుల ఇసుక దందాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు భారీగా గండి పడుతోంది. రాష్ట్ర రెవెన్యూ ప్రభుత్వ ఉద్యోగుల జీతానికే సరిపోతోందని ఓ వైపు సన్నాయి నొక్కులు నొక్కుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఆదాయాన్ని పెంచే మార్గాలను గాలికొదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఖేలో ఇండియా పోటీల్లో మెరిసిన ఏకేయూ విద్యార్థి
● అఖిల భారత స్థాయిలో రజత పతకం కై వసం ఒంగోలు సిటీ: రాజస్థాన్ రాష్ట్రంలోని బిఖనూర్లో ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్న ఖోలో ఇండియా పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్లో ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి చెందిన ఎన్.వెంకట మహేష్ ప్రతిభ కనబరిచాడు. సీఎస్ పురంలోని బెల్లంకొండ డిగ్రీ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థి మహేష్ గురువారం నిర్వహించిన 79 కిలోల విభాగం వెయిట్ లిఫ్టింగ్ ఫైనల్స్లో జాతీయ స్థాయిలో రన్నరప్గా నిలిచి రజత పతకం కై వసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా మహేష్కు వైస్ చాన్సలర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవీ వరప్రసాద్ అభినందనలు తెలిపారు. ● 16 మంది జూదరులు అరెస్టు ● రూ.3,18,086 నగదు, 19 ఫోన్లు, 21 బైకులు సీజ్ ముండ్లమూరు(దర్శి): మండలంలోని నూజిల్లపల్లి–శంకరాపురం గ్రామాల మధ్య పొలాల్లో కోతముక్క ఆడుతున్న 16 మందిని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై కె.కమలాకర్ తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ముండ్లమూరు, తాళ్లూరు మండలాల పోలీసు సిబ్బంది కలిసి పొలాల్లో పేకాట శిబిరాన్ని చుట్టుముట్టారు. సంఘటన స్థలంలో పట్టుబడిన నిందితుల నుంచి రూ.3,18,086 నగదు, 19 సెల్ఫోన్లు, 21 మోటారుసైకిళ్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఒంగోలు టౌన్: టంగుటూరు ఎమ్మార్వో కార్యాలయం 27 ఏళ్ల క్రితం తగలబడిన కేసును ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. 1998వ సంవత్సరంలో టంగుటూరు ఎమ్మార్వో కార్యాలయం దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు 25 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మందకృష్ణమాదిగ, కొమ్మూరి కనకారావు, పేరుపోగు వెంకటేశ్వరరావు, చాట్ల రమేష్ దొరకకపోవడంతో కేసు స్పిటప్ చేశారు. గర్నెపూడి సుబ్బారావు తదితరుల మీద కేసును విచారించి 2017లో కొట్టివేశారు. ముద్దాయిలుగా మిగిలిన కొమ్మూరి కనకారావు, పేరుపోగు వెంకటేశ్వరరావు, చాట్ల రమేష్ మీద కేసు విచారణ సుదీర్ఘ కాలం కొనసాగింది. శుక్రవారం తుది విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎస్.హేమలత కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కేసును వాదించి అండగా నిలిచిన న్యాయవాది పిట్టల లక్ష్మయ్య, జూనియర్ న్యాయవాదులు నాగేశ్వరరావు, పార్వతి, యగ్నేశ్వరరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు వన్టౌన్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖఽ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ పరీక్షల ఉచిత శిక్షణకు డిసెంబర్ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎస్.నిర్మలా జ్యోతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులకు డిసెంబర్ 7వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 14వ తేదీ నుంచి విజయవాడ నగరంలోని గొల్లపూడిలో ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను కలెక్టరేట్ ఎదురుగా ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్లో ఏపీ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలని స్పష్టం చేశారు. వివరాలకు 08592–231232, 9989285530, 8985090926ను సంప్రదించాలని సూచించారు. ● మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా కొనకనమిట్ల: పేద మహిళల అవసరాలను ఆసరాగా తీసుకున్న ఓ ముఠా.. ఆ అభాగ్యురాళ్లను పడుపు వృత్తిలోకి దించుతోంది. జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలాలను తమ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేసింది. పట్టపగలే బహిరంగంగా వ్యభిచారం చేయిస్తున్నా హైవే పెట్రోలింగ్ సిబ్బంది, మండల పోలీసులు సైతం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామ శివారు నందనమారెళ్ల కొండ సమీపంలో గత కొంత కాలంగా పట్టపగలే మహిళలతో వ్యభిచారం చేయిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి ప్రాంతానికి చెందిన పలువురు మహిళలను పెదారికట్ల సమీపంలోని కొండ ప్రాంతానికి తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దించుతున్నట్లు సమాచారం. వీరి చర్యలతో కొండ సమీపంలోని పొలాల రైతులు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పోలీసులు స్పందించి హైవే వెంట అసాంఘిక చర్యలను కట్టడి చేయాలని పెదారికట్ల వాసులు కోరుతున్నారు. -
భక్తుల మనోభావాలతో ఆటలా?
పొదిలి రూరల్: మార్కాపురాన్ని జిల్లా చేశారన్న సంతోషం కంటే పొదిలి మండల పరిధిలో ఉండే పృథులగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కొండపి నియోజకవర్గ పరిధిలోకి తీసుకెళ్లడం బాధగా ఉందని, ప్రజలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు సరికాదని వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జీ, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డితో కలిసి పొదిలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నా రాంబాబు మాట్లాడారు. తరతరాల చరిత్ర, బ్రిటీష్ వారి హయాం, వెంకటగిరి రాజా పాలన, ఫారెస్టు రికార్డులు, దేవదాయశాఖ రికార్డులు.. ఇలా ఏది చూసినా పృథులగిరి పొదిలి మండల పరిధిలో ఉందని స్పష్టం చేస్తున్నాయన్నారు. ఆ గుడి బాధ్యతలు పొదిలి గ్రూప్ టెంపుల్స్ ఈఓనే చూస్తున్నారని గుర్తు చేశారు. ఇవేవీ పరిశీలించకుండా అధికారం ఉంది కదా అని పృథులగిరి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి డీబీవీ స్వామి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గంలోకి లాగేసుకోవడం అన్యాయమన్నారు. మంత్రి స్వామి అనైతిక చర్యను మార్కాపురం ఎమ్మెల్యే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఆ ఆలయ కమిటీని మార్కాపురం ఎమ్మెల్యేగా ఎవరుంటే వారే పర్యవేక్షిస్తుంటారన్నారు. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. నరసింహస్వామి ఆలయం పొదిలి పరిధిలో ఉండే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అన్నా రాంబాబు హెచ్చరించారు. సమావేశంలో పార్టీ పట్టణాధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డి, నాయకులు జి.శ్రీనివాసులు, ఉడుముల వరలక్ష్మమ్మ, కొనకనమిట్ల మండల అధ్యక్షుడు మోరా శంకర్రెడ్డి, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయ రికార్డులన్నీ పొదిలి పరిధిలోనివే.. పృథులగిరి ఆలయాన్ని కొండపి నియోజకవర్గంలో ఎలా చేరుస్తారు? మంత్రి డోలా చర్యపై మార్కాపురం ఎమ్మెల్యే ఎందుకు ప్రతిఘటించలేదు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు -
మార్కాపురాన్ని అన్యాయం చేయొద్దు
ఒంగోలు సిటీ: చంద్రబాబు తమ రాజకీయ స్వార్థం కోసం మార్కాపురాన్ని జిల్లాగా చేశారని వైఎస్సార్ పీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరు రవి విమర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ఎలాంటి ఆదాయ వనరులు చూపకుండా, కనీస నీటి సౌకర్యంలేని నాలుగు అసెంబ్లీలతో మార్కాపురాన్ని జిల్లా చేయడం సరికాదని బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో కనీసం రూ.వెయ్యి కోట్లు ఆదాయం తెచ్చే వనరులు లేవన్నారు. ఏదో జిల్లా ఇచ్చామని మాయ చేస్తున్నాన్నారు తప్ప ఆ జిల్లా ప్రజలకు మేలు చేసేందుకు కాదని దుయ్యబట్టారు. ఏ విధంగా ఆదాయం లేని, వ్యవసాయం లేని జిల్లాగా మార్కాపురాన్ని మార్చొద్దన్నారు. రాజకీయ స్వార్థం కోసం ఇలా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. దర్శిని కూడా మార్కాపురం జిల్లాలో కలపాలని ఆయన కోరారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే.. మా ప్రభుత్వ హయాంలో పనులు 90 శాతం పూర్తి చేశామన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి నీళ్లు ఇచ్చేవారమన్నారు. ఒంగోలులో మెడికల్ కళాశాల ఉన్నా..వెనుకబడిన ప్రాంతంగా ఉన్న పశ్చిమ ప్రకాశానికి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు, పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్యను అందుబాటులో తెచ్చేందుకు మార్కాపురంలో మరో మెడికల్ కళాశాల ఏర్పాటుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టారన్నారు. దానిని సైతం ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం మా ప్రభుత్వ హయాంలో పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లా ఏర్పాటు చేశామని వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జి చుండూరి రవిబాబు తెలిపారు. ఒక జిల్లాకు న్యాయం చేసి మరో జిల్లాకు అన్యాయం చేయడం సరికాదన్నారు. ప్రకాశం జిల్లాకు మళ్లీ పోర్టు వచ్చిందన్నారు. మార్కాపురం ఆదాయ వనరులు లేని జిల్లాగా చేయడం పాపమన్నారు. దొనకొండ పారిశ్రామికవాడగా అభివృద్ధి చేస్తామంటున్నారని, మార్కాపురానికి దగ్గరగా ఉన్న దొనకొండ ప్రాంతాన్ని ఆ జిల్లాలో కలపాలన్నారు. మెప్మా అవినీతి వేళ్లు ఎమ్మెల్యే కార్యాలయం వైపు మెప్మా అక్రమాల్లో ఎమ్మెల్యే పీఏల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయని, అన్ని వేళ్లూ ఎమ్మెల్యే కార్యాలయం వైపు చూపిస్తున్నాయని చుండూరు రవిబాబు ఆరోపించారు. 2021 నుంచి 2026 వరకూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదులన్నీ మెప్మా అధికారులపైనా, మీ పీఏలపైనా అని అన్నారు. విచారణ సత్వరం పూర్తి చేసి అమాయకులకు న్యాయం చేయాలని, దోషులను గుర్తించి వారి వద్ద నుంచి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. మా ప్రభుత్వంపై బుదరజల్లడం మాని తప్పుచేసిన వారిని శిక్షించాలని కోరుతున్నామన్నారు. -
జ్యోతిరావు పూలేకు నివాళులు
ఒంగోలు సిటీ: మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు శుక్రవారం ఘన నివాళులర్పించారు. పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు దుంపా చెంచురెడ్డి, ఉప్పలపాటి ఏడుకొండలు (వేణు), రొండా అంజిరెడ్డి, క్రాంతి కుమార్, కూనం గౌతం, పెట్లూరి ప్రసాద్, దాసరి కరుణాకర్, తాత నరసింహ గౌడ్, పాలడుగు రాజీవ్, షేక్ మీరావలి, సయ్యద్ అప్సర్, బత్తుల ప్రమీల, బడుగు ఇందిరా, బడుగు శోభ లత, బడుగు మాధవి, కార్పొరేటర్ ఇమ్రాన్ఖాన్, నాగరాజు, 48 డివిజన్ అధ్యక్షుడు, వీసం బాలకృష్ణ, షేక్ జిలాని బాషా, ఫణిదపు సుధాకర్, కుట్టుబోయిన కోటి యాదవ్, కుట్టు బోయిన సురేష్, సన్నపురెడ్డి రవణమ్మ, ఝాన్సీ, పులుసు సురేష్, దేవా, దేవరపల్లి అంజిరెడ్డి, పేరం ప్రసన్న, పి.కృష్ణవేణి, ఒ.మహాలక్ష్మి, జి.పద్మశ్రీ, ఎస్.లీలాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు తీరుతో ఉచిత వైద్యం కష్టమే
తర్లుపాడు: చంద్రబాబు తీరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన ప్రజలకు ఉచిత వైద్యం అందడం కష్టమని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్చార్జ్ అన్నా రాంబాబు అన్నారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందాలంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాల నిర్మించాలని, అందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి పార్టీలకతీతంగా మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని మీర్జపేట, గొల్లపల్లి గ్రామాల్లో శుక్రవారం రాత్రి కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకబడిన పశ్చిమ ప్రకాశానికి అదనంగా మెడికల్ కళాశాల మంజూరు, వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఈ ప్రాంతంపై ఉన్న అభిమానాన్ని, ప్రేమను చూపారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలలను తన అనుచరులకు కట్టబెట్టేందుకు పీపీపీ విధానం తీసుకొచ్చారని విమర్శించారు. ఈ చర్య దుర్మార్గమని అన్నారు. పార్టీలకు అతీతంగా సంతకాల సేకరణ జరుగుతోందని, ప్రజలు ప్రైవేటీకరణ వలన వచ్చే నష్టాన్ని అర్థం చేసుకుని దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 66 ఏళ్లపాటు మెడికల్ కళాశాలలను ప్రైవేటు వారికి అప్పగిస్తే ఈ ప్రాంత ప్రజలు ఉచిత వైద్యం కోసం గతంలో లాగా ఒంగోలు, గుంటూరు, కర్నూలు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వలన పేదలకు ఉచిత వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తు తరాల కోసమే ఈ ఉద్యమం కొనసాగుతోందని, అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ భూలక్ష్మీ రామసుబ్బారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మురారి వెంకటేశ్వర్లు, కంది ప్రమీలారెడ్డి, గాయం శ్రీనివాసరెడ్డి, మీర్జపేట, గొల్లపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్లు రామిరెడ్డి, మీరయ్య, రమణయ్య, ఎంపీటీసీ రమేష్రెడ్డి, రంగారెడ్డి, మల్లారెడ్డి, వెలుగొండారెడ్డి, కాశయ్య, భాస్కర్రెడ్డి, శేషయ్య, వెంకటరెడ్డి, బాలిరెడ్డి, కృపాకర్, సుబ్బారెడ్డి, మండలంలోని అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అన్నా రాంబాబుకు మేళాతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. -
5న పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
ఒంగోలు సబర్బన్: వచ్చేనెల 5వ తేదీన జరిగే మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని కలెక్టర్ పీ.రాజాబాబు ఆదేశించారు. ఈ విషయంపై శుక్రవారం ప్రకాశం భవనం నుంచి అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను, దాతలను, ప్రోటోకాల్ ప్రకారం అతిథులను ఆహ్వానించడంలో ఎలాంటి లోపం ఉండకూడదన్నారు. పాఠశాల ప్రాంగణం, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించటంతో పాటు వారి సూచనలు, సలహాలను కూడా తీసుకోవాలని అన్నారు. పదో తరగతి విద్యార్థులకు రాబోయే వంద రోజుల్లో అమలు చేయనున్న విద్యా ప్రణాళికను కూడా తల్లిదండ్రులకు వివరించి, ఉత్తమ ఫలితాలు రాబట్టడంలో వారు కూడా సహకరించేలా కోరాలని విద్యాధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. కేవలం చదువుపైనే కాకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, పాఠశాలలో మౌలిక సదుపాయాల నిర్వహణపైనా ప్రధానోపాధ్యాయులు దృష్టి సారించాలని ఆయన చెప్పారు. సురక్షిత తాగునీరు విద్యార్థులకు అందించాలని పునరుద్ఘాటించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ వంటి పత్రాల కోసం వాట్సప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సేవలపైనా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నిర్దేశించారు. సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
4న విద్యా సంస్థల బంద్
ఒంగోలు టౌన్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 4వ తేదీ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు స్థానిక ఎల్బీజీ భవనంలో గురువారం విద్యార్థి సంఘాల నాయకులు సమావేశమయ్యారు. బంద్కు సంబంధించి పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు సీహెచ్ వినోద్, పీడీఎస్యూ రాష్ట్ర నాయకుడు ఎల్.రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రభుత్వం నిర్మించకుండా పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పేదలకు నాణ్యమైన వైద్యం, నిరుపేద బిడ్డలకు వైద్యవిద్య అందని ద్రాక్షగా మారుతుందని చెప్పారు. కార్పొరేట్ శక్తులకు సంపద సృష్టించడానికే మెడికల్ కాలేజీలను వారికి అప్పగిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీని నిర్మించి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ కేవలం బోర్డుకు మాత్రమే పరిమితమైందని, నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడంలేదన్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని చెప్పారు. త్రిపుల్ ఐటీ విద్యార్థుల పరిస్థితి త్రిశంఖు స్వర్గంగా మారిందని, సొంత భవనాలు లేక ఆపసోపాలు పడుతున్నారన్నారు. ఆరేళ్ల చదువు పూర్తి చేయాలంటే మూడు ఊర్లు తిరగాల్సిన వింత పరిస్థితి ఉందన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, సంక్షేమ హాస్టళ్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని, అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని నిలిపివేయాలని, కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ జాక్ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రఘురాం, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కె.విజయ్, దేవ, కార్తీక్, పీడీఎస్యూ నాయకులు శ్యాం తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు కేసులో ఉన్న భూములపై విచారణ
హనుమంతునిపాడు: కోర్టు కేసులో ఉన్న భూముల్లో పంటలు సాగు చేస్తున్నారన్న ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం రజనీకుమారి గురువారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హనుమంతునిపాడు మండలంలోని ఉపేంద్రాపురం రెవెన్యూలో వెలిగండ్ల మండలం నరసమాంబాపురం గ్రామానికి చెందిన సర్వేనంబర్ 505 నుంచి 519 వరకు ఉన్న 25 ఎకరాల పట్టా భూములు కోర్టు కేసులో ఉన్నాయి. అయితే ఆ భూముల్లో నరసమాంబాపురం గ్రామానికి చెందిన రైతులు శాగంరెడ్డి రామిరెడ్డి, రమణమ్మ, కర్నాటి ధనమ్మ, రత్తమ్మలు 2024–25లో కంది పంట సాగు చేశారని, ఈ క్రాపు చేసుకోని రైతు భరోసా తీసుకున్నారు. అయితే కోర్టు కేసులో ఉన్న భూముల్లో పంటలు ఎలా సాగు చేశారని పగిడిమర్రి కృష్ణప్రసాద్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ భూములను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ షేక్ జైన్లబ్దీన్, ఏఓలు రమణారావు, వి. రవికుమార్, ఏఏఏలు పాల్గొన్నారు. -
ఎస్బీ డీఎస్పీగా చిరంజీవి
ఒంగోలు టౌన్: స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా టీ చిరంజీవి బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయం నుంచి సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన ఇక్కడకు వచ్చారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఒంగోలు సబర్బన్: ఓటర్ల జాబితా ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయిందని కలెక్టర్ పీ.రాజా బాబు చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్ ) మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన పురోగతిని సమీక్షించారు. జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్ రాజాబాబు వివరించారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయిందని వాటిని సిస్టంలో ఆన్లైన్ చేయాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసును కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మాధురి, జాన్సన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: వికసిత గ్రామీణ భారత్ దిశగా మహిళలే ముందు ఉండాలని కలెక్టర్ పీ.రాజాబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక ఆయన ఛాంబర్లో గురువారం నయీ చేతన్ జెండర్ కాంపెయిన్ పోస్టర్ను కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 23 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక సహకారులుగా మహిళల పాత్ర, సమానత్వం, సమాన అవకాశాలు, భద్రత, పని పంచుకుందాం తదితర అంశాలపై నాలుగు వారాలు మండలం, గ్రామం, గ్రూప్ స్థాయి వరకు సీ్త్ర, పురుషులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. మహిళలు ఆర్థికంగా స్వాతంత్రంగా వారి కుటుంబం, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టరు టి.నారాయణ మాట్లాడుతూ ‘నయీ చేతన’ జెండర్ ప్రచారంలో భాగంగా మహిళా ఆర్థికాభివృద్ధి స్వేచ్ఛగా సంచరించగలిగే వాతావరణం కల్పించడం మహిళల స్వచ్ఛ, సమానత్వం గృహ పనులు పంచుకొనే సంస్కృతి ఏర్పాటు చేయటం, రుణాలు, మార్కెట్లు, సాంకేతిక మౌలిక సదుపాయలకు మహిళలకు ప్రాధాన్యత పెంచటం తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. -
ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటం
చీమకుర్తి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటం ఆగదని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. చీమకుర్తిలో గురువారం రాత్రి నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మేరుగు నాగార్జున మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారన్నారు. వాటిని చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేందుకు పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ జపం చేస్తున్నాడని మండిపడ్డారు. పీపీపీ విధానం వల్ల పేదలకు ఎంతో అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతున్నా చంద్రబాబు సర్కార్లో ఎలాంటి చలనం లేకపోవడం శోచనీయమన్నారు. అనంతరం కోటిసంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, కౌన్సిలర్లు సోమా శేషాద్రి, బీమన వెంకట్రావు, మేకల సులోచన యల్లయ్య, చల్లా అంకులు, ఎన్.మాణిక్యం, పాటిబండ్ల గంగయ్య, తప్పెట బాబూరావు, ఆముదాలపల్లి ప్రమీల రామబ్రహ్మం, పత్తి కోటేశ్వరరావు, తెల్లమేకల గాంధీ, చిన్నపురెడ్డి మస్తాన్రెడ్డి, గోపురపు చంద్ర, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకే ప్రైవేటీకరణ చీమకుర్తిలో కోటిసంతకాల సేకరణలో పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున -
నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
● సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ అనీల్కుమార్ ఒంగోలు సిటీ: కేజీబీవీ విద్యార్థినులంతా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ అనీల్కుమార్ దాసరి అన్నారు. జిల్లాలోని 28 కేజీబీవీల ప్రిన్సిపాళ్లతో ఒంగోలులోని తన ఛాంబర్లో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనీల్కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని కేజీబీవీల్లో 1077 మంది విద్యార్థినులు పదో తరగతి చదువుతున్నారని తెలిపారు. గత ఏడాది కేజీబీవీల్లో పదో తరగతికి సంబంధించి మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. 100 శాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థినులకు వంద రోజుల ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. నాగులుప్పలపాడు: మండలంలోని బి.నిడమానూరు జూనియర్ కళాశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అధ్యాపకుడి తీరుపై గురువారం డిప్యూటీ డీఈఓ చంద్రమౌళేశ్వరరావు విచారణ చేపట్టారు. కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడు బక్కమంతుల వినయ్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో గ్రామస్తులు కళాశాలకు చేరుకొని అధ్యాపకుడిని ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో గురువారం డిప్యూటీ డీఈఓ కళాశాలలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరు అధ్యాపకుడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. సింగరాయకొండ: విద్యుదాఘాతానికి మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పాకల పంచాయతీ చెల్లెమ్మగారి పట్టపుపాలెం వద్ద గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మత్స్యకారుడు కాలంగారి జాలయ్య(39) ఇంటి సమీపంలో విద్యుత్ కండక్టర్ తెగి పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. జాలయ్య మృతితో పాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. చేస్తున్నట్లు ఎస్సై బి మహేంద్ర వివరించారు. ● ఒకటిన్నర కిలోల గంజాయి స్వాధీనంపెద్దదోర్నాల: గంజాయిని విక్రయించేందుకు శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ( సుండిపెంట)కు వెళుతున్న ముగ్గురు యువకులను యర్రగొండపాలెం సీఐ అజయ్కుమార్, ఎస్సై మహేష్ వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలో శ్రీశైలం రహదారిలోని బోడేనాయక్ వద్ద గురువారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో పి. శ్రీను, లాలాశ్రీను, సురేస్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మండలానికి చెందిన పి.శ్రీను, లాలాశ్రీను, సురేస్లు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. దీంతో డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో గంజాయి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో తెలిసిన ఓ వ్యక్తి సహాయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలీ నుంచి గంజాయిని తెచ్చి మండల పరిసర ప్రాంతంలో విక్రయించేవారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు వీరి కోసం వెతుకుతున్న సమయంలో ఒకటిన్నర కిలోల గంజాయిని శ్రీశైలం వెళ్లే సాధువులకు విక్రయించేందుకు సుండిపెంటకు వెళుతున్నట్లు సమాచారం అందింది. సమాచామందుకున్న ఎస్సై మహేష్ బోడేనాయక్ తాండా వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న నిందితులు పోలీసులను చూసి పరిగెత్తగా అదుపులోనికి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. కంభం: మండలంలోని జంగంగుంట్ల గ్రామానికి చెందిన గొంగటి శ్రీను (45) కుటుంబ కలహాలతో గురువారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించిన హుటాహుటిన కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని చెప్పారు. నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు రావిపాడులో విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
సినిమా ఫక్కీలో బంగారు నగల దొంగ అరెస్టు
ఒంగోలు టౌన్: చార్మినార్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుల కళ్లుగప్పి బంగారు నగల చోరీకి పాల్పడిన తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ కు చెందిన మహమ్మద్ షకీల్ అనే దొంగను రైల్వే పోలీసులు సినిమా ఫక్కీలో అరెస్టు చేశారు. గురువారం జీఆర్పీ పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు సబ్ డివిజన్ డిఎస్ఆర్పీ జి.మురళీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ నెల 13వ తేదీ రాత్రి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఏత్రీ కోచ్లో ఒంగోలు పరిధిలో చోరీ జరిగింది. బెంగళూరుకు చెందిన కేకేఆర్ రెడ్డి హైదరాబాద్ వెళుతుండగా అతడి వద్ద ఉన్న బ్యాగును చోరీ చేశారు. దీంతో బాధితుడు రెడ్డి ఒంగోలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు డీఎస్ఆర్పీ మురళీధర్ మూడు టీంలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒంగోలు జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్ టీం ఒంగోలు నుంచి హైదరాబాద్ వరకు దర్యాప్తు ప్రారంభించింది. నెల్లూరు టీం కావలి నుంచి చెన్నయ్ వరకు దర్యాప్తు మొదలుపెట్టింది. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు చార్మినార్ ఎక్స్ప్రెస్ బీ1 కోచ్లో అనుమానాస్పదంగా తిరగడం షేక్ మౌలా షరీఫ్ బృందం గమనించింది. వెంటనే నిందితుడికి సంబంధించిన వివరాలను నెల్లూరు బృందానికి సమాచారం ఇచ్చారు. నిందితుడు నెల్లూరు రైల్వేస్టేషన్లో దిగి తిరిగి విక్రమ సింహపురి ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. వరంగల్ రైల్వే స్టేషన్లో నిందితుడి ఫొటోలను సీసీ ఫుటేజీ ద్వారా సేకరించారు. ఆ తరువాత హైదరాబాద్ చేరుకున్న నిందితుడు ఒక మోటార్ బైకు మీద వెళ్లడాన్ని గమనించి సీసీ ఫుటేజీ ద్వారా బైక్ నంబర్ను ట్రేస్చేసి నిందితుడి చిరునామాను కనుగొన్నారు. గురువారం విజయవాడలోని ఒక నగల దుకాణంలో ఉన్న నిందితుడు షకీల్ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.4.10 లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ చేశారు. కేసులో అత్యంత చాకచక్యంగా దొంగను పట్టుకొని బంగారు నగలను స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన ఒంగోలు జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్, ఆయన బృందంలోని చీరాల రైల్వే ఎస్సై కొండయ్య, హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, కానిస్టేబుల్ రాము, శ్రీనురాజు, హుసేన్, ప్రదీప్, సమన్వయంతో పనిచేసిన నెల్లూరు టీం సీఐ సుధాకర్ బృందాన్ని డీఎస్ఆర్పీ మురళీధర్ ప్రత్యేకంగా అఽభినందించారు. ఒంగోలు: ఈనెల 30న అండర్ 12 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక మంగమూరు రోడ్డులోని అసోసియేషన్ సబ్ సెంటర్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. 2013 సెప్టెంబర్ 1 – 2015 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులని, ఆసక్తి గల క్రీడాకారులు వైట్ డ్రస్, షూ, సొంత కిట్, జనన ధ్రువీకరణ పత్రం (ఫారం 5), ఆధార్కార్డు, స్టడీ సర్టిఫికెట్తో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు కోచ్ సుధాకర్ సెల్: 9701022333 లేదా బి.చంద్రశేఖర్ సెల్: 9246222999 నంబర్లను సంప్రదించాలని జిల్లా కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ● సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ ఒంగోలు టౌన్: ఎకై ్సజ్ శాఖలో పనిచేస్తున్న ఒక జిల్లా స్థాయి అధికారి తనను మోసం చేసినట్లు చిత్తూరు జిల్లా ఎకై ్సజ్ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఒకరు ‘మోసపోయిన ఓ అభాగ్యురాలు’ పేరుతో లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని ఎకై ్సజ్ శాఖ పోలీస్స్టేషన్లకు ఈ లేఖ అందినట్లు చెబుతున్నారు. ఒంటరి మహిళనైన తనను మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడని, పార్టీలు, విహారయాత్రలకు తిప్పి బదిలీపై వెళ్లి పోయాడని ఆ లేఖలో వివరించింది. ఎక్కడ విధులు నిర్వహిస్తే అక్కడ మహిళలను లోబరుచుకోవడం అతడికి అలవాటుగా మారిందని..ఆరోపించిన సదరు మహిళ గతంలో విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరుల్లో కూడా మహిళలను మోసగించినట్లు ఆరోపించింది. ఒంగోలులో కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నట్లు తెలిపింది. ఇదంతా అవాస్తవం... చిత్తూరు మహిళను మోసగించినట్లు సోషల్ మీడియాలో వచ్చిన లేఖ గురించి సదరు అధికారిని వివరణ కోరగా..అదంతా అవాస్తవమని ఖండించారు. గిట్టని వ్యక్తులెవరో తన మీద ఉద్దేశపూర్వకంగా ఈ లేఖను సృష్టించి ఉంటారని తెలిపారు. -
నిమ్మ రైతు కంట కన్నీరు
జిల్లాలో నిమ్మ రైతుకు కాలం కలిసి రావడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు.. దిగజారిన ధరలు.. గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం వెరసి నిమ్మ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జిల్లాలో సుమారు 7,185 ఎకరాల్లో నిమ్మసాగవుతుంది. కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఎక్కువగా సాగవుతుంది. అందులో ఎక్కువగా భాగం కనిగిరి నియోజకవర్గంలో 2600 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. దిగజారిన ధరలు.. పంటలకు తెగుళ్లు ఆశించి, దిగుబడి సరిగ్గా రాక.. వచ్చిన పంటకు ఆశించిన ధరలు లేక ఓ ఏడాది.. ఈ ఏడాది రైతుకు మంచి దిగుబడులు వచ్చినా.. ఎగుమతుల్లేక పాతాళంలోకి ధరలు దిగజారడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కార్తీక మాసంలో.. ప్రస్తుత కాలంలో నిమ్మ కాయలకు బయట మార్కెట్లో ధరలు ఉన్నా.. రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. పంటల దిగుబడి పెరగడంతో ధరలు లేవని కమీషన్ ఏజెంట్లు కూడా నిమ్మ కాయలను కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తగ్గిన ఎగుమతులు.. పెరిగిన దిగుబడులు జిల్లాలో అత్యధికంగా కనిగిరి, చినారికట్ల జంక్షన్ మార్కెట్ నుంచి.. గుంటూరు జిల్లాలో తెనాలి నుంచి, నెల్లూరు జిల్లా గూడూరు నుంచి నిమ్మ కాయలు బయట మార్కెట్లకు ఎగుమతి అవుతుంటాయి. నిత్యం కనిగిరి నుంచి కనీసం 3 నుంచి 5 లారీల లోడ్ల నిమ్మ కాయల లారీలు ఇతర రాష్ట్రాలకు, ఇతర (ముంబాయి, చైన్నె, అహమ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర) ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతాయి. అయితే ప్రస్తుతం ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయని.. జిల్లాలోని, రాష్ట్రంలోని ఇతర నిమ్మ మార్కెట్ పాయింట్లలో కూడా ఎక్కువగా ఉత్పత్తులు ఉన్నందు వల్ల కనిగిరి మార్కెట్లో కాయలకు డిమాండ్ లేదని కమీషన్ వ్యాపారులు చెప్తున్నారు. దీంతో పండు కాయ రూ.2 నుంచి రూ.3కు, పచ్చికాయ గ్రేడ్ 1 రకం రూ.8 నుంచి రూ.10కి, గ్రేడ్ 2 రకం రూ.7 నుంచి రూ.8కి, గ్రేడ్ 3 రకం రూ.6 నుంచి రూ.7కు కొనుగోలు చేస్తున్నారు. కూలీరాక..చెట్లపై వదిలేస్తూ.. రూ.లక్షలు పెట్టుబడులు పెట్టిన రైతులు కనీస పెట్టుబడులు రాక లబోదిబోమంటున్నారు. గతేడాది సీజన్లో కాస్తో కూస్తో ధరలు దక్కిన రైతులు ఈ ఏడాది నిండా మునిగిపోయారు. రాష్ట్రంలో, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో దిగుబడులు రావడం.. చలి తీవ్రత పెరగడంతో ధరలు లేక రైతులు డీలా పడ్డారు. బస్తా కాయలు కోయడానికి దాదాపు 8 నుంచి 10 మంది కూలీలు పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కో కూలీకి రూ.300 చెల్లించాలి. అంత చెల్లించి తీసుకెళ్లినా.. మార్కెట్లో కనీస కోత కూలీ రాకపోగా.. ఆటో ఖర్చు అదనపు భారంగా పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు చెట్టుమీదే కాయ కోత లేకుండా వదిలేస్తుండగా.. మరి కొందరు కాయ కోత కోయక పోతే రెండో ఏడాది చెట్టుకు పూత రాదనే భయంతో అదనపు ఖర్చుపెట్టి కాయను కోయించి పొలం గట్లపైనా.. రోడ్ల పైనే పారేస్తున్నారు. కొందరు రైతులు కోసిన కాయలను పొలాల్లో, ఇళ్లల్లో ఉంచుకోలేక.. కమీషన్ కొట్లకు కాయలు తెచ్చి వేస్తున్నారు. వచ్చిన కాడికి జమ అన్నట్లు కమీషన్ ఏజెంట్లు ఇచ్చినంత తీసుకుని కన్నీళ్లు తుడుచుకుంటున్నారు.. కమీషన్ ఏజెంట్లు గ్రేడ్ 1 రకం కాయలను మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో తెచ్చిన కాయలను కనిగిరి నుంచి తిరిగి వెనక్కి తీసుకెళ్లలేక రోడ్లపైన పడేస్తున్నారు. -
కాడి కదలక!
మద్దతు లేక..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నిమ్మ, మిర్చి పంటలు పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఎక్కువగా సాగుచేస్తారు. జిల్లా వ్యాప్తంగా 33,291 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. అందులో ఎక్కవ శాతం మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో ఎక్కువగా సాగవుతోంది. 2019 నుంచి 2024 మధ్య వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మిర్చి రైతుల పంట పడింది. మార్కెట్లో క్వింటా ధర గరిష్టంగా రూ.27 వేలకు వెళ్లింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా ధరలు పతనమయ్యాయి. గత సీజన్లో క్వింటా రూ.8 వేలు కూడా రాలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలా మంది రైతులు అప్పులపాలయ్యారు. గత సీజన్లో సుమారు 65 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రస్తుతం సాగు విస్తీర్ణం దాదాపు సగానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం 33,291 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. ఎకరాకు సుమారు రూ.1.25 లక్షల వరకూ ఖర్చుపెట్టారు. ఎకరాకు సుమారు 11 నుంచి 12 వేల మొక్కలు నాటారు. ఒక్కొక్క మొక్క రూపాయిన్నర ప్రకారం కొనుగోలు చేశారు. దీంతో మొక్కలకే సుమారు ఎకరాకు రూ.15 వేలు రాగా, నల్లతామర తెగులు సోకడంతో పురుగుమందులు వాడుతున్నారు. ఎకరాకు సుమారు రూ.20 వేల వరకూ ఖర్చుచేశారు. అధిక దిగుబడుల కోసం ఒక్కొక్క ఎకరాకు వివిధ రకాలకు చెందిన ఎరువులను 20 బస్తాల వరకూ వేశారు. సగటున రూ.30 వేల వరకూ ఎరువుల కోసం ఖర్చు చేశారు. ఇవి కాక సేద్యపు ఖర్చులు కూడా సుమారు రూ.20 వేల వరకూ వచ్చాయి. దీంతో ఎకరాకు 20 నుంచి క్వింటాళ్ల వరకూ దిగుబడులు వస్తేనే తమకు ఉపయోగమని రైతులు భావిస్తున్నారు. మోంథా తుఫాన్ దెబ్బకు పొలాల్లో నీరునిలబడి చాలా వరకూ పైర్లు దెబ్బతిన్నాయని, నల్లతామర తెగులు సోకడంతో ఎకరాకు 10 నుంచి 15 శాతం వరకూ దిగుబడులు తగ్గవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురంలో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు కొంత మేరుకు ప్రయాణపు ఖర్చులు తగ్గుతాయని రైతు సంఘాల నేతలు అంటున్నారు. -
మార్కాపురంలో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
పశ్చిమ ప్రకాశంలో రైతులు మిర్చిని ఎక్కువగా సాగుచేస్తున్నారు. అయితే తాము పండించిన పత్తిని గుంటూరు మార్కెట్యార్డుకు వెళ్లి విక్రయించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దీని వలన రైతులపై అదనపు భారం పడుతోంది. రైతు క్షేమం కోసం మార్కాపురంలోనే మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు ఖర్చులు, కష్టాలు తప్పుతాయి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. – నూనే శివారెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు సంఘం కార్యదర్శి కేజీ పచ్చికాయ రూ.8కి తీసుకుంటున్నారు.. మేము 15 ఎకరాలు కౌలు తీసుకుని నిమ్మ తోట సాగు చేశాం. ఈ ఏడాది నిమ్మ కాయల దిగుబడి బాగా వచ్చింది. కానీ గిట్టుబాటు ధర లేదు. గతంలో ఇదే సీజన్లో కేజీ రూ.30 వరకు అమ్మిన కాయలు.. ఈ ఏడాది కేజీ రూ.8కి కమీషన్ మార్కెట్లో తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా దిగుబడి పెరగడంతో.. ఆ ప్రాంతాల్లో మార్కెట్ లేదని వ్యాపారులు చెప్తున్నారు. దీంతో ఏమీ చేయలేని దిక్కు తోచని స్థితిలో ఉన్నాం. చెట్టు మీద కాయ కోయకపోతే వచ్చే ఏడాది పూత రాదు. దీంతో రైతులు కోత చేస్తున్నారు. ఏడాదికి రూ.6 లక్షలు పెట్టుబడి పెట్టాం. కనీసం వడ్డీలు కూడా రాని పరిస్థితి. దీంతో దిక్కుతోచని దుస్థితిలో ఉన్నాం. ప్రభుత్వం నిమ్మ రైతును ఆదుకోవాలి. – పఠాన్ షారుక్ ఖాన్, తురకపల్లి గ్రామం, హనుమంతునిపాడు మండలం -
రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి
ఒంగోలు టౌన్: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని, దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు, సమాన గౌరవం ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలో పరిపాలనా విధి విధానాలు రూపొందించారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తూ దేశ ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేడ్కర్కు దక్కుతుందన్నారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం లేని రోజుల నుంచి తమ హక్కుల కోసం గొంతెత్తి మాట్లాడే పరిస్థితులను కల్పించింది ఈ రాజ్యాంగమేనని చెప్పారు. దేశంలోని పౌరులందరూ కలిసి మెలసి జీవించే సామరస్య వాతావరణానికి పునాదులు వేసిన రాజ్యాంగాన్ని మనందరం గౌరవించాలని చెప్పారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని 100 శాతం అమలు చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారన్నారు. జగనన్న పాలనలో విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పి బడుగు, బలహీన వర్గాల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయాలను స్థాపించి పరిపాలనను ప్రజల ఇంటి ముందుకు తీసుకెళ్లడం ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు బాబా సాహెబ్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలన్నారు. విలువలతో కూడుకొని పనిచేసే రాజకీయ పార్టీ సభ్యులుగా కాలరెగరేసి చెప్పుకుందామన్నారు. రానున్న రోజుల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేయాలన్నారు. సమాజంలోని అట్టడుగు ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పాటుపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర అధ్యక్షుడు కటారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, మురారి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు దామరాజు క్రాంతి కుమార్, షేక్ మీరావలి, రొండా అంజి రెడ్డి, దాసరి కరుణాకర్, పయనం శ్రీనివాస్, కూనం గౌతమ్, పెట్లూరి ప్రసాద్, దేవరపల్లి అంజిరెడ్డి, ఆనం శ్రీనివాసరెడ్డి, అగ్రహారం అంజిరెడ్డి, పల్నాటి రవీంద్ర, కుట్టుబోయిన సురేష్, తాటిపూగి కరుణాకర్, శ్రీనివాసరెడ్డి, మహిళా నాయకులు సయ్యద్ అఫ్సర్ బేగం, పేరం ప్రసన్న, బత్తుల ప్రమీల, పసుమర్తి గోవిందమ్మ, బండి శోభలత, మాధవిలత, నాటారు జనార్దన్ రెడ్డి, పిగిలి శ్రీనివాస్, దేవా, సన్నీ, బాలినేని శ్రీనివాస రెడ్డి, పీటర్, యోహాను, పులుసు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ విద్యుత్పై అవగాహన పెంచాలి
● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: సోలార్ విద్యుత్ వినియోగం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం జిల్లాలో అమలవుతున్న తీరుపై బుధవారం ఆయన ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఈ పథకం అమలవుతున్న తీరు, పురోగతిని ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు కలెక్టర్కు వివరించారు. నెలవారీ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటున్న గృహాల యజమానులు సోలార్ విధానంలోకి మారేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ 75 నుంచి 225 యూనిట్ల నెలవారీ వినియోగం ఉన్న గృహాల యజమానులు కూడా ఈ విధానంలోకి మారేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ దిశగా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఇంటిపైన సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న రాయితీ, మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాలను వారికి వివరించాలన్నారు. సొంత గృహాలు కలిగిన స్వయం సహాయక సంఘాల మహిళలపై ప్రత్యేక దృష్టి సారించి సోలార్ విధానంలోకి వారు మారేలా చూడాలన్నారు. సోలార్ పరికరాలను సరఫరా చేసే స్థానిక ఏజెన్సీలను గుర్తించాలన్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే తక్షణమే సరిచేసేలా వీరికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఆర్డీఏ పీడీ నారాయణ, ఏపీసీపీడీసీఎల్ ఈఈలు, నెడ్ క్యాప్ పీడీ వంశీ, లీడ్ బ్యాంకు అధికారులు, సోలార్ యూనిట్ల ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నయవంచక పాలకులకు బుద్ధి చెప్పాలి
ఒంగోలు టౌన్: కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్న కేంద్ర రాష్ట్ర పాలకులకు ప్రజలు గుణపాఠం చెప్పాలని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయడంలో రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ చట్టాలు, మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా బుధవారం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో పలువురు రైతు, కార్మిక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చుండూరి రంగారావు మాట్లాడుతూ నల్ల వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ఐదేళ్ల క్రితం కేంద్రం ఇచ్చిన హామీని అమలు చేయకుండా దగా చేసిందని విమర్శించారు. పంటల మద్దతు ధరలకు చట్టపరమైన హామీ ఇవ్వకుండా రద్దయిన నల్ల చట్టాలకంటే ప్రమాదకరమైన చట్టాలను రూపొందించిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేలా సంస్కరణలను తీసుకొచ్చిందని తెలిపారు. సీపీఎం సీనియర్ నాయకుడు పమిడి వెంకటరావు, సీపీఐ సీనియర్ నాయకుడు కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వంపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లలిత కుమారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జజ్జురు జయంతి బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కె మాబు, జీవీ కొండారెడ్డి, పి.కల్పన, జి.శ్రీనివాసరావు, జి.రమేష్, చీకటి శ్రీనివాసరావు, రాజశేఖర్, పద్మ, కోటేశ్వరరావు, సీహెచ్ రాంబాబు, జి.శేషయ్య, బాలకోటయ్య, మహేష్ పాల్గొన్నారు. -
పీపీపీతో వచ్చే తరాలకు అంధకారమే
మార్కాపురం: మెడికల్ కాలేజీలను, అనుబంధ వైద్యశాలలను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నందుకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగి నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు అన్నారు. మండలంలోని మాల్యవంతునిపాడు, బొడిచెర్ల గ్రామాల్లో బుధవారం రాత్రి కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీలను వారి అనుకూలమైన వారికి దోచిపెట్టేందుకు పీపీపీ విధానం తీసుకునిరావడం అన్యాయమని అన్నారు. 66 ఏళ్లపాటు ప్రభుత్వం లీజుకు ఇవ్వటం దారుణమన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రంతో మాట్లాడి 17 మెడికల్ కాలేజిలను ఒకేసారి రాష్ట్రంలో ప్రారంభించారన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుకానున్న మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో కట్టాలని చూస్తోందని, ఇలా అయితే భవిష్యత్తు తరాల విద్యార్థులకు అన్యాయం చేసిన వారమవుతామని, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కాలేజీలు పూర్తయితే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యతో పాటు ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. పాలకులు పార్టీలకతీతంగా పేద, మధ్య తరగతి వారికి విద్య, వైద్యం అందిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కాలేజీలను పూర్తి చేసేందుకు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి సుమారు రూ.550 కోట్లు ఖర్చుపెట్టకపోవడం కూటమి ప్రభుత్వం వైఫల్యమే అన్నారు. పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పోరెడ్డి చెంచిరెడ్డి, పీఎల్పీ యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ జీ.శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, నల్లబోతుల కొండయ్య, మాల్యవంతునిపాడు సర్పంచ్ జీ.వెంకటేశ్వర్లు, పీ.వెంకటేశ్వరరెడ్డి, పెద్దిరెడ్డి, శేషిరెడ్డి, గంజి శివారెడ్డి, వెంకటరెడ్డి, సత్యంరెడ్డి, వై.గాలిరెడ్డి, రామమహేశ్వరరెడ్డి, వై.శ్రీనివాసరెడ్డి, టీ.వెంకటరెడ్డి, ఏ.శ్రీనివాసులు, కె.దొనకొండయ్య, సుబ్బయ్య, రోశయ్య, పెద్దమల్లయ్య, ఉత్తమ్కుమార్, కె.శ్రీనివాసరెడ్డి, బూదల గురవయ్య, నాదబ్రహ్మం పాల్గొన్నారు. బొడిచర్ల సర్పంచ్ ఎం.కోటేశ్వరి, ఉప సర్పంచ్ బి.నాగమల్లేశ్వరి, ఎంపీటీసీ ఎం.లక్ష్మీదేవి, భవనం వెంకటరామిరెడ్డి, షేక్ మహ్మద్రఫీ, చంద్రశేఖరరెడ్డి, జీ.అనంతరెడ్డి, ఎస్.రామిరెడ్డి, దేవదాసు, నవయ్య, భాస్కర్రెడ్డి, కాశింవలి, బాలిరెడ్డి, పొదిలి శేఖర్, రాజ, రామసుబ్బారెడ్డి, వీరాంజనేయులు, తర్లుపాడు మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు, చదలవాడ రమణారెడ్డి, పలువురు పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అన్నా రాంబాబు వేసి నివాళులర్పించారు. -
స్మార్ట్ మిథ్యాహ్నం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా 2,327 ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 1,35,444 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉంది. అయితే రోజూ సుమారు 87 వేల మంది విద్యార్థులు మాత్రమే భోజన పథకానికి హాజరవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి డొక్కాసీతమ్మ పేరు పెట్టారు. దీని ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సింది పోయి తమ అనుయాయలకు మేలు జరిగే రీతిలో ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్మార్ట్కిచెన్ పేరుతో పార్టీ వారి జేబులు నింపేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి నివేదికలు పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆమేరకు జిల్లా అధికారులు ఆగమేఘాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. పైలట్ ప్రాజెక్టు పేరుతో జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం నియోజకవర్గాల్లో రెండేసి చొప్పున, మిగతా సంతనూతలపాడు, కొండపి, దర్శి, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయనున్నారు. 10 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి 18 రూట్ల ద్వారా 187 పాఠశాలలకు చెందిన 22,031 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసి అందించాలని ప్రతిపాదించారు. ఒక చోట భోజనం తయారు చేసి 1 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులకు భోజనం అందించాలన్నది ప్రభుత్వం ఆలోచన. పైలెట్ ప్రాజెక్టుగా.. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసే స్మార్ట్ కిచెన్ ద్వారా 2 కిలోమీటర్ల పరిధిలోని 21 పాఠశాలలకు భోజనం అందించాలని, త్రోవగుంట జెడ్పీ స్కూల్లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి చుట్టు పక్కల ఉన్న మరో 21 పాఠశాలలకు భోజనం అందించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ రెండు కిచెన్లతో 40 మందికి పైగా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. అలాగే మార్కాపురం, పొదిలి కేంద్రాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల ద్వారా 27 మంది కార్మికులు రోడ్డున పడనున్నారు. ఈ పథకాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తే ప్రభుత్వం ఈ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న వేలాది మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడిపోతాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులకు వేడి అన్నం లేనట్లే... ఎక్కడో 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులకు ఒక చోట భోజనం వండి వాహనాల్లో తీసుకెళ్లి ఇవ్వడం అన్నది వ్యయప్రసాలతో కూడుకుంది. దీనివలన విద్యార్థులకు వేడి అన్నం తినే భాగ్యం లేనట్లే అని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తే తెల్లవారు జామున వంట ప్రారంభిస్తే కానీ విద్యార్థులకు సకాలంలో భోజనం అందించలేని పరిస్థితి. ఇప్పటి దాకా పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్న భోజనం వండేవారు. ఈ పథకాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించేవారు. ఏరోజుకారోజు వండిన ఆహారాన్ని ఉపాధ్యాయులు స్వయంగా రుచి చూసిన తరువాతే విద్యార్థులకు వడ్డించేవారు. ఆహారం నాణ్యత, రుచి గురించి టెస్టింగ్ రిజిస్టర్లో నమోదు చేసేవారు. మెనూ ప్రకారం వంటవండేలా చూసేవారు. ఇప్పుడా పరిస్థితి కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోతుంది. వారు వండిందే వడ్డించే పరిస్థితి ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీని వలన విద్యార్థులకు పౌష్టికాహారం అనుమానమేనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని సంతృప్తి పరచడానికి స్మార్ట్ కిచెన్లు తీసుకొస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఆధారంగా ఉన్న ఈ పథకాన్ని బడా వ్యక్తులకు ఆదాయ వనరుగా ఎందుకు మారుస్తున్నారని నిలదీస్తున్నారు. సొంత పార్టీ నాయకుల బొజ్జలు నింపేందుకే స్మార్ట్ కిచెన్ పథకం రూపకల్పన జరిగినట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రోడ్డున పడనున్న మధ్యాహ్న భోజన కార్మికులు... ఈ స్మార్ట్ కిచెన్లతో వేలాది మంది మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలు రోడ్డున పడే దుస్థితి నెలకొందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం కింద జిల్లాలో మొత్తం 4112 మంది కార్మికులు పనిచేస్తున్నారు. స్మార్ట్ కిచెన్లు అమలైతే పాఠశాలలో ఉన్న వంటశాలలు మూతపడి కార్మికులు ఇంటిదారి పట్టాల్సిందే. వీరిలో 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారున్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికుల పొట్టలు కొట్టి పార్టీ నాయకుల బొజ్జలు నింపేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. -
మెక్కేశారు.. కక్కిస్తారా..?
రూ.10 వేలు రుణం కావాలంటేనే బ్యాంకులు కాళ్లరిగేలా తిప్పుకుంటాయి. కానీ పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ(మెప్మా)లో మాత్రం మనుషులు లేకుండానే రుణాల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు. ఒకరిద్దరు చేసింది కాదు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అందరి పాత్ర ఉంది. తిలా పాపం..తలా పిడికెడు..రుణ అక్రమాలు బయటపడినా కమిటీలు వేసి ఉన్నతాధికారులు కాలయాపన చేశారే తప్ప ఒక్కరినీ పట్టుకోలేకపోయారు. ఫలితంగా ప్రజల సొమ్ము కోట్లాది రూపాయలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఒంగోలు సబర్బన్: పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ(మెప్మా)లో దొంగలు పడ్డారు.బోగస్ స్వయం సహాయక మహిళా (డ్వాక్రా) గ్రూపుల మాటున ప్రజల సొమ్మును బొక్కేశారు.రోజుకో కొత్త బాగోతం బయటపడుతుండటంతో డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళన చెందుతున్నారు. కోట్ల రూపాయల స్కాం బాగోతం వెనుక ఉన్నది ఎవరన్నది ఇంకా మిస్టరీగానే మారింది. మెప్మాలో అక్రమాలు సర్వసాధారణమే మెప్మాలో అక్రమాలు అనేవి సర్వసాధారణంగా మారిపోయింది. ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బందే దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో టెక్నికల్ ఎక్స్పర్ట్గా ఉన్న కల్పన తానే సీఎంఎంనని బోగస్ గ్రూపులను ప్రోత్సహించి బ్యాంకుల్లో సంతకాలు పెట్టి రుణాలు ఇప్పించి రూ.1.40 కోట్లలో అక్రమాలకు పాల్పడింది. దీంతో ఆమెను పీడీ శ్రీహరి సస్పెండ్ చేశారు. తరువాత టౌన్ లెవల్ ఫెడరేషన్ ఆర్పీ జి.ఉమామహేశ్వరి సభ్యులకు తెలియకుండా బోగస్ గ్రూపులు ఏర్పాటు చేసి రూ.లక్షల్లో ఆరగించింది. మరో ఆర్పీ డి.పార్వతి రూ.40 లక్షలు కాజేసింది. బ్యాంకు వాళ్లు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమైపె చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కేశవస్వామిపేట ఆర్పీ కొల్లాబత్తిన దివ్య శాంతి 14 గ్రూపుల్లో సభ్యులకు తెలియకుండా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు సభ్యులు స్వయంగా పీడీ శ్రీహరికి ఫిర్యాదు కూడా చేశారు. మెప్మా కార్యాలయములో డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న కుర్రా సునీల్ ప్రభుత్వ ఖాతాకు సంబంధించిన చెక్కులను టాంపరింగ్ చేసి మెప్మా ప్రభుత్వ ఖాతాలో ఉన్న సొమ్మును అక్రమంగా రూ.4,64,500లను డ్రా చేశాడు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా విషయం బయటకు వచ్చింది. అతని వద్ద నుంచి ల్యాప్టాప్తో పాటు డబ్బును రికవరీ చేశారు. అయితే కుర్రా సునీల్ వెనుక నుంచి నడిపిస్తుంది ఎవరనేది అధికారులు కనిపెట్టలేదు. అక్రమంగా నగదు డ్రా చేసినా ఇంత వరకు అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోలేదు. నగరంలోని కేశవస్వామిపేటలో 14 బోగస్ గ్రూపులు ఉన్నట్లు గ్రూపు సభ్యులు అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి అవి 14 కాదు 36 అని అధికారులు గుర్తించారు. స్థానికంగా ఉంటున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన గ్రూపు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించగా తొలుత 14 బోగస్ గ్రూపులు వెలుగుచూశాయి. మరింత లోతుగా విచారణ నిర్వహించగా 36 గ్రూపులు గుర్తించారు. కమిటీల పేరుతో కాలయాపన మెప్మాలో జరుగుతున్న ఆర్థిక అక్రమాలపై నిగ్గు తేల్చాల్సిన అధికారులు విచారణ పేరుతో కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. అక్రమాలపై ఇప్పటికే ఐదారు కమిటీలు వేసినా ఒక్క నివేదిక కూడా బయటకు రాలేదు. నివేదికలు ఇవ్వనప్పుడు కమిటీలు వేయడం ఎందుకని బాధిత మహిళలు ప్రశ్నిస్తున్నారు. గతంలో దినేష్కుమార్ కలెక్టర్గా ఉన్నప్పుడు కమిటీ వేశారు. కమిటీ సభ్యులు నివేదికను కలెక్టర్కు ఇచ్చినా బయటకు రాలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత వచ్చిన కలెక్టర్ తమీమ్ అన్సారియా కూడా మరో కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక ఏమైందో తెలియదు. ఈ ఏడాది ఏప్రిల్లో నూతనంగా బాధ్యతలు తీసుకున్న పీడీ పి.శ్రీహరి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని వేశారు. కేశవస్వామిపేట డ్వాక్రా మహిళలు ఇచ్చిన ఫిర్యాదుపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశారు. కానీ ఈ కమిటీల్లో ఒక్క నివేదిక బయటకు రాలేదు. ఒక్కరిపై చర్యలు తీసుకుంది లేదు. ప్రస్తుతం కలెక్టర్ పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా మరో కమిటీని వేశారు. మెప్మాలో బోగస్ గ్రూపుల పేరుతో బ్యాంకుల్లో రూ.కోట్లలో రుణాలు కమిటీలు వేస్తూ కాలయాపన ప్రజల సొమ్ము కోట్లు నొక్కేసిన ఘరానా దొంగలు నకిలీలతో మెప్మా అధికారులు, సిబ్బంది కుమ్మక్కు కమిటీలు సరే..చర్యలు ఎక్కడ..? ఫిర్యాదులు చేస్తున్నా..చర్యలేవి.. మెప్మాలో రుణాల అక్రమాలపై గ్రూపు సభ్యులు, బాధితులు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కానీ ఆ ఫిర్యాదులకు సంబంధించి కేసులు ఏమయ్యాయో ఎవరికీ అంతుబట్టని పరిస్థితి. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఆ కేసులను అటకెక్కించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ని కోట్ల రూపాయలు స్వాహా చేసినా కనీసం ఒక్కరినీ కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోకపోవడంతో ఆంతర్యం ఏంటని బాధిత మహిళలు ప్రశ్నిస్తున్నారు. -
భారతీయులంతా గర్వపడే రోజు
ఒంగోలు సబర్బన్: భారతీయులంతా భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా గర్వపడే రోజని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నగరంలోని హెచ్సీఎం సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 ఏళ్లు పూర్తయిందన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగంగా కొనియాడుతున్న భారత రాజ్యాంగాన్ని అందరూ స్మరించుకుంటున్నారన్నారు. రాజ్యాంగం గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికీ తెలియాలన్న ఉద్దేశంతో నవంబరు 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, నగర మేయర్ గంగాడ సుజాత, ఒడా చైర్మన్ షేక్ రియాజ్, ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్కుమార్, డీఆర్ఓ చినఓబులేసు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్నాయక్, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజాబాబు ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం -
మార్కాపురం జిల్లా ఏర్పాటులో పక్షపాతం
మార్కాపురం: మార్కాపురం జిల్లా ఏర్పాటులో ప్రభుత్వం పక్షపాతం చూపిందని, దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశంలో కొనసాగించడం ద్వారా వివక్షచూపిందని, అలా కాకుండా మార్కాపురంలోనే కలపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు దగ్గుపాటి సోమయ్య, సీపీఐ కార్యదర్శి సభ్యుడు అందె నాసరయ్య డిమాండ్ చేశారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం, దర్శి నియోజకవర్గాలను కలపాలని, గిద్దలూరు నియోజకవర్గాన్ని ప్రత్యేక రెవెన్యూ డివిజన్గా చేయటమో లేదా మార్కాపురం రెవెన్యూ డివిజన్లో కలపాలని కోరారు. ఆ నియోజకవర్గాన్ని కనిగిరి రెవెన్యూ డివిజన్లో కలపటం వలన ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. దొనకొండ, కురిచేడు మండలాలు మార్కాపురానికి దగ్గరగా ఉన్నాయని, ఆ నియోజకవర్గం దర్శిని ఒంగోలులో కలపడం వలన ఈ మండలాల ప్రజలు పనుల కోసం 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న మార్కాపురానికి కాకుండా 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒంగోలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. శాసీ్త్రయత లేకుండా విభజన చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని, ప్రభుత్వం ఈ విషయం గమనించి దర్శిని మార్కాపురం జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు జిల్లా ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగదన్నారు. అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి 18 నెలలు దాటిందని, అరకొర నిధులతో ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. మార్కాపురం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే నిర్మించి ఉచిత వైద్యాన్ని ఈ ప్రాంత ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజు, రాజశేఖరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే..
మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం స్మార్ట్ కిచెన్లను తీసుకొస్తోంది. దీని వలన విద్యార్థులు వేడి ఆహారానికి దూరమవుతారు. ఎప్పటి నుంచో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. ఇలాంటి పథకాన్ని రూపొందించేటప్పుడు అన్నీ వైపుల నుంచి చర్చించి సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని చేతులు కాల్చుకోవడం తగదు. ఏక్తా శక్తి విషయంలో కూడా ఇలాగే జరిగింది. రేపు స్మార్ట్ కిచెన్ల విషయంలో కూడా ఇలాంటి అనుభవాలే ఎదురైనా ఆశ్చర్యం లేదు. – పి.కల్పన, జిల్లా అధ్యక్షురాలు, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ పర్యవేక్షణ లేకుండా పోతుంది ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. స్మార్ట్ కిచెన్లు అమలులోకి వస్తే ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా పోతుంది. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం అవుతుంది. దాంతో మధ్యాహ్న భోజనం పథకం ప్రధానాశయం దెబ్బతింటుంది. ఈ ఆలోనచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ఉత్తమం. – షేక్ అబ్దుల్ హై, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
కొన్నది తక్కువ..తిరస్కరించింది ఎక్కువ..!
టంగుటూరు: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో ఒక్కరోజే 684 పొగాకు బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. వేలం కేంద్రానికి గొర్లమిట్ట, మట్టిపాడు, శివపురం, మల్లవరప్పాడు, ఆలకూరపాడు, జమ్ములపాలెం, పొందూరు, కె. ఉప్పలపాడు గ్రామానికి చెందిన రైతులు 1339 బేళ్లను వేలానికి తీసుకురాగా 655 బేళ్లను కొనుగోలు చేసి 684 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.310, కనిష్ట ధర రూ.50, సరాసరి ధర రూ.110.31గా నమోదైంది. వేలంలో 46 మంది వ్యాపారులు పాల్గొన్నారు. కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో 510 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని రామాయపాలెం, పోలిరెడ్డిపాలెం, జగ్గరాజుపాలెం గ్రామాల రైతులు 1584 బేళ్లను తీసుకురాగా 1074 బేళ్లను కొనుగోలు చేశారు. వేలంలో 13 కంపెనీలు పాల్గొన్నాయి. -
అడ్డగోలు నిర్ణయాలు సరికాదు
కనిగిరిరూరల్: అధికారంలో ఉన్నారని అడ్డగోలుగా, ఇష్టానుసారంగా జిల్లాల విభజన ఏర్పాటు చేయడం సరైంది కాదని వైఎస్సార్సీపీ విశాఖపట్నం పార్లమెంట్ పరిశీలకుడు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అన్నారు. బుధవారం ఆయన కనిగిరిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మార్కాపురం కొత్త జిల్లా ఏర్పాటులో కనిగిరి, మార్కాపురంలోని రెండు రెవెన్యూ డివిజనల్లోని నాలుగు నియోజకవర్గాలు (కనిగిరి, మార్కాపురం, వై పాలెం, గిద్దలూరు) వెనుకబడిన ప్రాంతాలేనన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండి సాగుకు, వ్యాపారాలకు తగు అవకాశాలు లేని మండలాలన్నింటినీ కలిపి జిల్లా చేయడం ఎంతవరకు సమజసమని ప్రశ్నించారు. మార్కాపురం జిల్లాలో కందుకూరు లేదా దర్శి నియోజకవర్గాలను కలిపితేనే కొంతమేర జిల్లా ఏర్పాటులో న్యాయం జరుగుతుందన్నారు. కేవలం రాజకీయ స్వార్ధ ప్రయోజనాలకు అనుగుణంగా అధికార పార్టీ నేతలు కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతున్నాయని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్ష వైఖరిగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పశ్చిమ ప్రాంతంపై చంద్రబాబుకు చిన్నచూపే.. వెనుకబడిన పశ్చిమ ప్రాంతాలపై చంద్రబాబుకు ఎప్పుడూ చిన్న చూపేనన్నారు. పశ్చిమప్రాంత వాసులను మరింత వెనుకబాటుకు గురిచేసేలా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కనిగిరి నియోజకవర్గంలో ఎటువంటి పరిశ్రమలు లేవని, తాగు, సాగు జలాలు, శాశ్వత నీటి పథకాలు లేవని, వెలిగొండ జలాలు మాటల్లోనే ఉందని, నిమ్జ్ నత్తతో పోటీ పడుతుందన్నారు. చంద్రబాబు సర్కార్ తెరపైకి తెచ్చిన పీపీపీ విధానంతో మార్కాపురంలోని వైద్య కళాశాల, జీజీహెచ్ హాస్పిటల్స్లో పేద వర్గాలకు వైద్య విద్య, వైద్యం రెండు అందని ద్రాక్షలా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఘాటుగా విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఉధృత పోరాటం సాగిస్తోందన్నారు. పీడీసీసీబీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎం ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ కొత్త జిల్లా ఏర్పాటులో చంద్రబాబు సర్కార్ పాదర్శకత పాటించాలన్నారు. దర్శి నియోజకవర్గాన్ని కొత్త జిల్లా మార్కాపురంలో ఉంచాలన్నారు. మార్కాపురం కొత్త జిల్లాను నల్లమల జిల్లాగా నామకరణం చేయాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. వెనుకబడిన నియోజకవర్గాలతో జిల్లా చేయడం సమంజసం కాదు పశ్చిమ ప్రాంతంపై చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ధ్వజం -
పంచాయతీరాజ్ శాఖ తప్పిదాలపై చర్యలేవి..?
యర్రగొండపాలెం: పంచాయతీల సర్పంచుల తీర్మానాలు, సంతకాలు లేకుండా టీడీపీ నాయకులు నిధులు డ్రా చేస్తున్నారని, దీనిపై నేను స్వయంగా వచ్చి ఫిర్యాదు చేసినా పట్టించుకోరా అని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవీలో ఉన్న పవన్కల్యాణ్ ఆ శాఖలో జరుగుతున్న తప్పిదాలను సరిచేసుకోవడం చేతకాక నేను సీఎం కాదని తప్పించుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలం ముటుకుల పంచాయతీలో సర్పంచ్ సంతకం లేకుండానే నాయకులు డబ్బులు డ్రా చేశారన్నారు. ప్రభుత్వ నిధులు డ్రా చేయడం అత్యంత నేరపూరిత చర్య అయినా తూతూమంత్రంగా విచారణ చేశారన్నారు. ఫోర్జరీ సంతకాలతో నిధులు డ్రా చేసినట్లు కనిపిస్తున్నా చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ చర్య ఎవరిని రక్షించడానికని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తున్నా మూడు డీఆర్సీలలో రిక్వెస్ట్ పెట్టినా, జిల్లా పరిషత్ సమావేశాల్లో గొంతు చించుకొని అడిగినా చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. పంచాయతీరాజ్ శాఖ పనితీరు అట్టడుగు స్థాయికి పడిపోయిందన్నారు. పూర్తిగా వెనకబడిన యర్రగొండపాలెం నియోజకవర్గంలో రోడ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఇకనైనా మొద్దు నిద్ర వీడి హైదరాబాద్లో విశ్రాంతి తీసుకోవడం మాని గ్రామాల్లో తిరిగి రోడ్లను పూర్తి చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, జిల్లా కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, రైతు విభాగం జిల్లా కార్యదర్శి వై.వెంకటేశ్వరరెడ్డి, బిజ్జం రమణారెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు సయ్యద్ జబీవుల్లా, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు పి.రాములు నాయక్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పబ్బిశెట్టి శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. సర్పంచుల సంతకాలు లేకుండా నిధులు ఎలా డ్రా చేస్తారు..? పవన్కల్యాణ్ను ప్రశ్నించిన ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ -
వందేభారత్ రైలు తీసుకొస్తే దేశ భక్తులు కాలేరు
● రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఒంగోలు టౌన్: వందేభారత్ రైలు, నాలుగు ఆకర్షణీయమైన పథకాలు తీసుకొచ్చినంత మాత్రానే దేశ భక్తులు కాలేరని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఎద్దేవా చేశారు. దేశం కోసం ఎలాంటి పోరాటాలు, త్యాగాలు చేయకుండా దేశభక్తులమని చెప్పుకుంటే సరిపోదని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆచార్య రంగా భవన్లో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం, భారత రాజ్యాంగంపై ఏమాత్రం అవగాహన లేని వారు నేడు పాలకులుగా కొనసాగడం దౌర్భాగ్యమని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ఆరోపించారు. 2024లో ఎన్నికలు పూర్తయిన వారం రోజుల తరువాత ఓటింగ్ శాతం చెప్పడం వెనక అసలు రహస్యమేంటని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ పేరుతో 65 లక్షల ఓట్లను తొలగించినా ఎవరు ప్రశ్నించకూడదని కేంద్ర ప్రభుత్వం చెబుతుందని, చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో తొలగించిన వారి జాబితా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని గుర్తు చేశారు. మోదీ నాయకత్వంలోని బిజేపీ తాము 99 శాతం ఓట్లతో గెలిచామని ప్రకటించే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. దేశానికి రైతే వెన్నముక అని చెబుతూ రైతన్నల నడ్డి విరిచే మూడు నల్ల చట్టాలను ఎటువంటి చర్చలు లేకుండా ఆమెదించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణ ద్వారానే దేశం మనుగడ సాధ్యమని, బలి ఇచ్చే ముందు జంతువును పూజించిన విధంగా మోదీ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తుందని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం యువతరం రోడ్ల మీదకు రావాలని పిలుపునిచ్చారు. విశ్రాంత జిల్లా జడ్జి వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ. చరిత్రను వక్రమార్గం పట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను బలంగా తిప్పికొట్టాలని కోరారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక జిల్లా అధ్యక్షుడు చుండూరి రంగారావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి నలదల బసవయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, రెడ్స్టార్ జిల్లా కార్యదర్శి బీమవరపు సుబ్బారావు పాల్గొన్నారు. -
నిరంకుశ పాలనకు మూల్యం చెల్లించక తప్పదు
కొనకనమిట్ల: ఎన్నికల హామీలను విస్మరించి, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా నిరంకుశ పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు హెచ్చరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానంలో నిర్మించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మంగళవారం సాయంత్రం కొనకనమిట్ల మండలంలోని సలనూతల గాజులపల్లి, నాగంపల్లి గ్రామాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 5 మెడికల్ కళాశాలలు పూర్తి చేసి వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలతో 10 కాలేజీలను ప్రైవేట్ వ్యక్తలకు కట్టబెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. బాబు పాలనలో ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి పెరిగిపోయి దోచుకో.. దాచుకో అనే విధానంతో ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. వేల కోట్ల రూపాయల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేందుకే ప్రైవేటీకరణ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. కోటి సంతకాల సేకరణతో చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిపించి, మెడికల్ కాలేజీల ప్రైటీకరణను అడ్డుకుంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వ కుటిల నీతిపై గవర్నర్కు ఫిర్యాదు చేయాలన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నా విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ విజయవంతంగా నిర్వహిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ స్థానిక ప్రజలతో సంతకాలు చేయించారు. ‘అన్నా’కు ఘనస్వాగతం సలనూతల గాజులపల్లిలో సర్పంచ్ విడగొట్టు అంజనీకుమారి అంజయ్య, పార్టీ నాయకులు మువ్వా వెంకటస్వామిరెడ్డి, కందుల ఏబేలు, సుమలత, నాగంపల్లిలో సర్పంచ్ తాతిరెడ్డి చినవెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ తాతిరెడ్డి పెదవెంకటరెడ్డి, ఎంపీటీసీ కోండ్రు వెంకటేశ్వర్లు, మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు తంగిరాల బ్రహ్మారెడ్డి, మాజీ యూత్ కన్వీనర్ సైకం రమణారెడ్డి, మాజీ సర్పంచ్ కొక్కెర వెంకటేశ్వర్లు, కసిబిసి గురవయ్య తదితరుల ఆధ్వర్యంలో అన్నాతో పాటు మండల నాయకులకు ఘన స్వాగతం పలికారు. కోటి సంతకాల సేకరణలో ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షుడు మోరా శంకర్రెడ్డి, తర్లుపాడు మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు, విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్ ఏలూరి సంజీవరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ ఉడుముల కాశిరెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు గోనుగుంట్ల శ్రీనివాసులు, మోరబోయిన మాలకొండయ్య, పసల చెన్నకేశవులు, సానికొమ్ము వెంకటస్వామిరెడ్డి, షేక్ మౌలాలి, పాతకోట వెంకటరెడ్డి, పాలూరి వెంకటేశ్వర్లు, పార్లపల్లి సిద్దానభి, చిరుగూరి కోటేశ్వరరావు, తాతిరెడ్డి పెదవెంకటరెడ్డి, బైరెడ్డి కొండారెడ్డి, దేవిరెడ్డి గోపాలరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలను విస్మరించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దారుణం చంద్రబాబు ప్రభుత్వ పాలనపై మాజీ ఎమ్మెల్యే అన్నా ధ్వజం -
సివిల్స్లో ఎస్టీలకు ఉచిత శిక్షణ
ఒంగోలు వన్టౌన్: సివిల్స్లో ఎస్టీలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు రెగ్యులర్ డిగ్రీలో ఉత్తీర్ణులై, జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న వారు తమ పూర్తి బయోడేటాకు రెండు ఫొటోలు, విద్య, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్కార్డు జిరాక్స్ కాపీలను జత చేసి, ఈ నెల 26వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గిరిజన విద్యార్థులకు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల కుటుంబ సంవత్సర ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలని స్పష్టం చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 30న స్క్రీనింగ్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డిసెంబర్ 10 నుంచి శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. వివరాలకు 9493343866ను సంప్రదించాలని సూచించారు. అర్ధవీడు: మండల కేంద్రమైన అర్ధవీడులో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మంగళవారం గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు కుక్కల దాడిలో గాయాలపాలయ్యారు. జి.దానయ్య, రాజయ్యతో పాటు మరో ఐదుగురు కుక్క కాటుకు గురై కంభంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో సుమారు 50కి పైగా వీధి కుక్కలు ఉన్నాయని, రాత్రి పూట అత్యవసర పని మీద బయటకు వస్తే వెంటాడి కరుస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు సిటీ: నగర శివారులోని నెక్ట్స్జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ను మంగళవారం జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ సందర్శించారు. ఈ ప్రాంగణంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. నిబంధనల మేరకు సౌకర్యాలు ఉన్నవో లేవో పరిశీలించి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జేసీ స్కూలును సందర్శించారు. ఆయన వెంట కలికిరి సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సీఎస్ పరదేశి, నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ శివరాం, డీఈవో కిరణ్కుమార్, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఇతర అధికారులు ఉన్నారు. -
వేలం ముగుస్తున్నా.. ఆగని అగచాట్లు!
పొదిలి/కొండపి/టంగుటూరు: పొగాకు వేలం చివరి దశకు చేరినా రైతులకు అగచాట్లు తప్పడం లేదు. పొదిలి వేలం కేంద్రం పరిధిలో వందల సంఖ్యలో లోగ్రేడ్ పొగాకు బేళ్లు విక్రయించుకునేందుకు రైతులకు అనుమతి ఇచ్చిన అధికారులు ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. మంగళవారం రాత్రి పొదిలి వేలం కేంద్రం నిండిపోయి, ట్రాక్టర్లు మొత్తం రోడ్డుపైనే ఉన్నాయి. రైతులు బేళ్లపైనే రాత్రి నిద్రకు ఉపక్రమించారు. వందల సంఖ్యలో బేళ్లు తెస్తే.. పదుల సంఖ్యలో కూడా కొనుగోలు చేయడం లేదని రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. బేళ్లు మొత్తం కొనుగోలు చేసి రైతులకు కనీస మద్దతు ధరను వచ్చేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. బేళ్ల తిరస్కరణలో రికార్డులు బ్రేక్ కొండపి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం 463 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. ధర్మవరం, కొండపి, చవటపాలెం, దాదానాయుడుపాలెం గ్రామాల రైతులు 1442 బేళ్లను వేలానికి తీసుకురాగా 979 బేళ్లను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. పొగాకు గరిష్ట ధర కేజీ రూ.310, కనిష్ట ధర రూ.50, సరాసరి ధర రూ.115.52గా నమోదైంది. టంగుటూరు వేలం కేంద్రంలోనూ బేళ్ల తిరస్కరణ పరంపర కొనసాగింది. మంగళవారం నిర్వహించిన వేలంలో 487 పొగాకు బేళ్లు తిరస్కరణకు గురికావడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కమ్మవారిపాలెం, కట్టుబడిపాలెం, పొందూరు, పంగులూరివారిపాలెం, చింతలపాలెం, దావగూడూరు గ్రామాల రైతులు 1194 బేళ్లు వేలానికి ఉంచగా 707 బేళ్లనే వ్యాపారులు కొనుగోలు చేశారు. గరిష్ట ధర కేజీ రూ.310, కనిష్ట ధర రూ.50, సరాసరి రూ.110.95 పలికింది. వేలంలో 46 మంది వ్యాపారులు పాల్గొన్న ప్పటికీ కొందరు సిండికేట్గా మారి ధరలు తెగ్గోశారని రైతులు ఆరోపించారు. ఇప్పటి వరకు రోజూ సుమారు 100 బేళ్ల చొప్పున తిరస్కరణకు గురికాగా ప్రస్తుతం ఆ సంఖ్య 400కు మించడంతో రైతులు అయోమయంలో పడిపోయారు. ఓ వైపు బేళ్ల తిరస్కరణ, మరో వైపు లోగ్రేడ్ పొగాకు ధర దారుణ పతనాన్ని చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొదిలి వేలం కేంద్రంలో మందకొడిగా పొగాకు బేళ్ల కొనుగోలు మంగళవారం ఒక్కరోజే కొండపిలో 463, టంగుటూరులో 487 బేళ్ల తిరస్కరణ అధికారుల తీరు, వ్యాపారుల సిండికేట్పై రగిలిపోతున్న రైతులు -
యువకుడి హత్య కేసులో నిందితుడి అరెస్టు
● హత్య కేసు వివరాలు వెల్లడించిన యర్రగొండపాలెం సీఐ పెద్దదోర్నాల: పెద్దమంతనాల గిరిజన గూడెంలో గిరిజన యువకుడు అర్తి అంకన్న(23) హత్య కేసులో నిందితుడిని పోలీసులు వలపన్ని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను సీఐ అజయ్కుమార్, ఎస్సై మహేష్ వెల్లడించారు. బాలింత అయిన తన భార్యకు ఎందుకు మద్యం తాపించావని ప్రశ్నించినందుకే గిరిజన యువకుడు ఆర్తి అంకన్నను ఆదే గూడేనికి చెందిన ఆర్తి నాగన్న కత్తితో హతమార్చినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే..పెద్దమంతనాల గూడేనికి చెందిన ఆర్తి అంకన్న, దేవమ్మలు భార్యా భర్తలు, ఆర్తి అంకన్న అడవి కర్రలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న అర్తి అంకన్న పెద్దారవీడు మండలం కుంట వద్ద కర్రలు అమ్ముకుని ఇంటికి వచ్చే సరికి బాలింత అయిన భార్య దేవమ్మ మద్యం తాగి ఉంది. దీంతో భార్యను ఎందుకు మద్యం తాగావని ప్రశ్నించగా, గూడేనికి చెందిన ఆర్తి నాగన్న తనకు మద్యం తాపించినట్లు తెలిపింది. దీంతో ఆర్తి అంకన్న, అతని కుటుంబసభ్యులు నాగన్న దగ్గరకు వెళ్లి బాలింత అయిన తన భార్యకు ఎందుకు తాపించావని ప్రశ్నించాడు. దీంతో అంకన్న, నాగన్నల మధ్య కొద్దిపాటి ఘర్షణ జరిగింది. ఘర్షణలో నాగన్న తన నడుముకున్న చిన్నపాటి చాకుతో గుండైపె పొడవటంతో అంకన్న సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిఽర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆర్తి నాగన్న బోడేనాయక్తాండా వద్ద ఉన్నట్లు సమాచారం అందటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అజయ్కుమార్ తెలిపారు. నిందితుడు నాగన్నను మార్కాపురం కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. -
రాష్ట్ర స్థాయి యోగా పోటీలు
ముగిసిన 69వజె.పంగులూరు: మండల పరిధిలోని చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల నుంచి అండర్ 14,17,19 విభాగాల్లో బాలబాలికలకు నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు మంగళవారంతో ముగిశాయి. 13 ఉమ్మడి జిల్లాల నుంచి 400 మంది పైగా క్రీడాకారులు వచ్చారు. చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలురు వసతి పొందారు. బాలికలకు గ్రామంలో గ్రామస్తులు వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని ప్రోత్సహించారు. చివరి రోజు అండర్ 19 విభాగంలో యోగా పోటీలు జరిగాయి. ఈ పోటీలకు గెలిచిన క్రీడాకారులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిరిజ అధ్యక్షతన బహుమతులు అందజేశారు. విజేతలు వివరాలు: – అండర్ 19 ఆర్టిస్టిక్ యోగా ఫైర్ బాలికల విభాగంలో విశాఖపట్నానికి చెందిన పి.రమసాహితి, పి.లక్ష్మీసాహిత్య మొదటి స్థానం సాధించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వై.ముకుందశరణ్య, వై.తమీరున్ రెండో స్థానం, ఈస్ట్ గోదావరికి చెందిన యన్. శరణ్య, ఎస్.హిమశ్రీ మూడో బహుమతి సాధించారు. -
దూషించాడని టీడీపీ ఎంపీటీసీ నిరసన
పొన్నలూరు: తనన గృహ నిర్మాణశాఖ వర్క్ ఇన్స్పెక్టర్ దూషించాడని టీడీపీ ఎంపీటీసీ..గృహ నిర్మాణశాఖ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. పొన్నలూరు మండల గృహ నిర్మాణశాఖ వర్క్ ఇన్స్పెక్టర్ సుధీర్ విధుల్లో భాగంగా కె.అగ్రహరం గ్రామానికి మంగళవారం వెళ్లాడు. అయితే స్థానిక ఎంపీటీసీ వంగపాటి రామాంజనేయులు తనకు సమాచారం ఇవ్వకుండా గ్రామంలోని లబ్ధిదారులతో ఎలా మాట్లాడతావని ప్రశ్నించాడు. దీంతో సుధీర్ నీకు చెప్పాల్సిన అవసరం లేదురా..అంటూ అగౌరవంగా మాట్లాడాడని రామాంజనేయులు వాపోయాడు. అలాగే నీ దిక్కున చోట చెప్పుకో, నీకు చేతనైంది చేసుకో అంటూ దుర్భాషలాడాడని తెలిపాడు. బీసీ కులానికి చెందిన ఎంపీటీసీని కాబట్టే గ్రామంలో చేపట్టే కార్యక్రమాల్లో హౌసింగ్ అధికారులు తనకు సమాచారం ఇవ్వకుండా చులకనగా చూస్తున్నారని రామాంజనేయులు బాధపడ్డాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, సుధీర్పై చర్యలు తీసుకోవాలని కార్యాలయం ముందు బైఠాయించాడు. రామాంజనేయులుకు సంఘీభావంగా సర్పంచ్ చిన్న మస్తాన్, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖాదర్వలీ నిరసన తెలిపారు. -
లైంగిక దాడులపై విస్తృత చర్చ జరగాలి
● సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం ఒంగోలు సిటీ: మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి సమాజంలో విస్తృతంగా చర్చ జరగాలని, తద్వారా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి హింసను అరికట్టాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం అన్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మహిళ అభ్యుదయ సమితి సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న హింస అనేది రోజుకో రూపం మార్చుకొని మానసికంగానే హింసకు గురిచేస్తున్నారన్నారు. వీటిని ప్రాథమిక దశలోనే గుర్తించి నిర్మూలించాలన్నారు. కార్యక్రమంలో స్వధార్ హోమ్ నిర్వాహకులు తేళ్ల అరుణ, శక్తి మిషన్ డీఎంసీ అవాంజెలిన్, వడ్డెర కార్పొరేషన్ సభ్యులు టి.రమాదేవి, సఖి వన్ స్టాప్ సెంటర్ కో ఆర్డినేటర్ ఎన్ జ్యోతి సుప్రియ, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి
టంగుటూరు: పొగాకు కంపెనీలో వెల్డింగ్ పనిచేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన టంగుటూరు టోల్ ప్లాజా జాతీయ రహదారి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఆరిమణిపేట గ్రామానికి జి.మేఘనాథ్(27) చింతపర్తి రాజ్కుమార్ ఆధ్వర్యంలో బీవీఎల్ పొగాకు కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తూ ఉంటాడు. మంగళవారం వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు 20 అడుగులపై నుంచి జారిపడ్డాడు, దీంతో స్పృహ కోల్పోవడంతో కారులో చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మేఘనాథ్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సంఘటనపై ఫిర్యాదు రాలేదని ఎస్సై నాగమల్లీశ్వరరావు తెలిపారు. మర్రిపూడి: పంటల సాగులో చేసిన అప్పులు తీర్చేందుకు జార్ఖండ్లోని బొగ్గు కంపెనీలో పనిచేస్తూ భార్య, బిడ్డలను చూసేందుకు స్వగ్రామానికి వస్తున్న వ్యక్తి గుండెపోటుతో రైల్వేస్టేషన్లోనే కుప్పకూలాడు. వివరాల్లోకి వెళితే.. జరుగుమల్లి మండలం తూమాడు గ్రామానికి చెందిన వాసా సుందరరామిరెడ్డి, ఆదిలక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు బీటెక్ వరకు చదువుకున్నారు. శేషారెడ్డి(35)కి మర్రిపూడికి చెందిన స్వాతితో 6 ఏళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్లుగా వ్యవసాయం కలిసి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో కుటుంబాన్ని ఆర్థికభారం నుంచి బయటపడేసేందుకు భార్య బిడ్డలకు నచ్చజెప్పి జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ బొగ్గుకంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కొంత కాలం నుంచి అక్కడే ఉంటూ తన సంపాదనతో కొంత మొత్తాన్ని కుటుంబ అప్పులు, ఆకలి తీర్చాడు. ఈ క్రమంలో భార్య, పిల్లలను చూసేందుకు సోమవారం సాయంత్రం జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి బయలుదేరాడు. రైలు ఎక్కే సమయంలో భార్యతో మాట్లాడాడు. అయితే రైలు ఎక్కే క్రమంలో రైల్వస్టేషన్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం ఫోన్లో ఆఖరి సారి మాట్లాడిన నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అప్పటి వరకు తమతో మాట్లాడిన భర్త మృతి చెందాడని తెలుసుకున్న ఆ ఇల్లాని వేదనకు అంతే లేకుండా పోయింది. నాన్న వస్తాడనే ఎదురుచూసే ఆ చిన్నారుల కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి. తన కన్నబిడ్డ కానరాని లోకానికి వెళ్లిపోయాడని ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు చూపులను కంట తడిపెట్టించింది. మృతదేహాన్ని బుధవారం సాయంత్రం నెల్లూరు రైల్వేస్టేషన్లో స్వాధీనం చేసుకోవాలని జార్ఖండ్ రైల్వేపోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. -
మాజీ సర్పంచ్ కుమారునిపై టీడీపీ వర్గీయుల దాడి
కనిగిరిరూరల్: మాజీ సర్పంచ్ మల్లెల యాకోబు కుమారుడు ప్రవీణ్పై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం మండలంలోని తక్కెళ్లపాడులో వైఎస్సార్ సీపీ మద్దతు మాజీ సర్పంచ్ మల్లెల యాకోబు, అతని కుమారుడు ప్రవీణ్కు 1.28 ఎకరాల భూమి ఉంది. చాలా ఏళ్ల నుంచి ఆభూమిని ప్రవీణ్ కుటుంబీకులు సాగు చేసుకుంటూ పాస్ పుస్తకాలు, అన్లైన్ నమోదు ఉన్నట్లు తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, అతని అనుచరులు ఆభూమిలో ఇటీవల మట్టి తొలారు. తమ కుటుంబానికి చెంది, చాలకాలంగా తాము సాగు చేసుకుంటున్న పొలంలో మీరెందుకు మట్టిని తొలించారని ప్రవీణ్ ప్రశ్నించాడు. దీంతో పిచ్చాల శ్రీనివాసులరెడ్డి అతని మనుషులు గొడవకు దిగి దాడి చేశారు. గొడవలో మాజీ సర్పంచ్ మల్లెల యాకోబుకు, ప్రవీణ్కు గాయాలైనట్లు చెప్పారు. బాధితులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి 100కు కాల్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా భూ వివాదానికి సంబంధించి తక్కెళ్లపాడులో రెండు వర్గాలకు చెందిన వారు ఇచ్చిన పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు...
క్వారీలు ప్రమాదంలో ఉన్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని డైరక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ సేఫ్టీ (డీఎంఎస్) అధికారులకు దృష్టికి తీసుకువెళుతున్నా వారు పట్టించుకున్న దాఖలాల్లేవు. వారు సకాలంలో స్పందించకపోవడంతో బల్లికురవ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బల్లికురవ క్వారీలు ప్రమాదంలో ఉన్నాయని ఈ ఏడాది జనవరి 6వ తేదీన నేరుగా హైదరాబాద్లోని డీఎంఎస్ కార్యాలయంలోనే ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. -
రాష్ట్ర హ్యాండ్ బాల్ పోటీల విజేతలుగా కడప, శ్రీకాకుళం
సింగరాయకొండ: స్థానిక ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అండర్–19 బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీల ఫైనల్స్లో బాలుర విభాగంలో కడప జిల్లా, బాలికల విభాగంలో శ్రీకాకుళం జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ పోటీల్లో ప్రకాశం జిల్లా బాలబాలికల జట్లు రెండూ క్వార్టర్ ఫైనల్స్లోనే పేలవమైన ప్రదర్శనతో వెనుదిరిగాయి. మూడు రోజుల పాటు పోటీలు ఆద్యంతం హోరాహోరీగా జరిగాయి. చివరిరోజు సెమీ ఫైనల్స్లో బాలుర విభాగంలో కడప, చిత్తూరు, వైజాగ్, కర్నూలు జట్లు, బాలికల విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జట్లు పోటీ పడ్డాయి. ఫైనల్స్కు బాలుర విభాగంలో కడప, చిత్తూరు జట్లు, బాలికల విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు జట్లు చేరుకున్నాయి. ఫైనల్ పోటీలో బాలుర విభాగంలో కడప, చిత్తూరు జట్ల మధ్య జరిగిన పోటీలో చిత్తూరు జట్టు గట్టి పోటీ ఇచ్చినా చివరికి కడప జట్టు విజేతగా నిలిచింది. కడప 8 పాయింట్లు, చిత్తూరు 5 పాయింట్లు సాధించాయి. మూడో స్థానానికి వైజాగ్, కర్నూలు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా జరగగా చివరికి వైజాగ్ 11 పాయింట్లతో మూడో స్థానంలో, కర్నూలు 9 పాయింట్లతో నాల్గవ స్థానంతో సరిపెట్టుకుంది. బాలికల విభాగంలో జరిగిన ఫైనల్ పోటీలో శ్రీకాకుళం, గుంటూరు జట్లు తలపడగా రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. 6 పాయింట్లతో శ్రీకాకుళం జట్టు విజేతగా నిలిచి మొదటి స్థానాన్ని కై వసం చేసుకోగా గుంటూరు జట్టు 4 పాయింట్లతో రన్నర్ గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కృష్ణా జట్టు 7 పాయింట్లతో మూడవ స్థానంలో, వైజాగ్ జట్టు 5 పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచాయి. చివరి రోజు బాలబాలికల జట్ల విజేతలకు మెడల్స్, కప్పు అందజేశారు. పోటీలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని అన్ని జట్లు మంచి ప్రతిభ కనబరిచాయని కాలేజి ప్రిన్సిపాల్ సౌజన్య ప్రశంసించారు. పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ కే శంకర్రావును ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అండర్–19 సెక్రటరీ చింపారెడ్డి, జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ పీ విజయకుమార్, మలినేని పెరుమాళ్లు, దేవీ సీఫుడ్స్ కంపెనీ మేనేజర్ మూర్తి, లారీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ శేషగిరి, సెక్రటరీ షేక్ పటేల్, పీఈటీలు ఎస్డీ జంషీర్, ఎన్టీ ప్రసాద్, షేక్ నౌషాద్, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతులకు పనుల కాలం అధికారులపై సర్వే భారం!
మార్కాపురం: ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా వ్యవసాయాధికారుల పరిస్థితి తయారైంది. చంద్రబాబు ప్రభుత్వం రెండు రోజుల క్రితం రైతన్న మీకోసం అంటూ ఓ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. గ్రామాలకు వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం రైతుల కోసం అమలు చేసిన పథకాలు వివరించడంతోపాటు రోజూ 90 మంది రైతుల డేటాను ఏపీఏఐఎమ్ఎస్ యాప్లో నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో వ్యవసాయాధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 36 మండలాలు ఉండగా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కొండపి, ఒంగోలు తదితర ప్రాంతాల్లో వ్యవసాయ సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలోని అధికారులు, సిబ్బంది 2 రోజుల నుంచి గ్రామాల్లో తిరుగుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులను కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పమంటే ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తుండటంతో వ్యవసాయాధికారులు తలపట్టుకుంటున్న పరిస్థితి. ఖరీఫ్ సీజన్ దాటి, రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆర్ఎస్కేల ద్వారా ఆధునిక వ్యవసాయ పనిముట్లుగానీ, ఎరువులుగానీ సరఫరా చేయలేదు. వ్యవసాయాధికారులు రైతు వద్దకు వెళ్లి పేరు, కుటుంబ సభ్యులు, ఆధార్కార్డుతో పాటు ఎన్ని ఎకరాల పొలం, ఏమేమి సాగు చేశారు, మీకేమైనా ఎరువులు కావాలా, వ్యవసాయ పనిముట్లు కావాలా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతుండటం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ తాము కోరిన విత్తనాలు సబ్సిడీపై ఇవ్వకుండా మీకేమి కావాలని కోరడంలో ఆంతర్యం ఏమిటని వ్యవసాయాధికారులను రైతులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏఓలు, వీఏఏలకు రైతుల నుంచి వివరాల సేకరణ సవాల్గా మారింది. సాధ్యమయ్యే పనేనా? పత్తి, మిర్చి కోతలు ప్రారంభం కావడంతో గ్రామాల్లో రైతులందరూ పొలాల్లో ఉంటున్నారు. రైతన్న మీకోసం కార్యక్రమానికి 10 నుంచి 20 మంది మాత్రమే హాజరవుతున్నారు. దీంతో ఏపీఏఐఎంఎస్ యాప్లో రోజుకు 90 మంది రైతుల వివరాలు ఎలా నమోదు చేయాలో వ్యవసాయ సిబ్బందికి అంతుపట్టడం లేదు. -
బండ్లమూడి నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
ఒంగోలు టౌన్: చీమకుర్తి మండలంలోని బండ్లమూడి గ్రామంలో దళితులపై మారణాయుధాలతో దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావును కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. బండ్లమూడి దళితులపై నమోదు చేసిన కౌంటర్ కేసును ఎత్తివేయాలని, చీమకుర్తి సీఐని సస్పెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ఇంటి స్థలం, 2 ఎకరాల వ్యవసాయ భూమి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విన్నవించారు. అగ్రకులాలతో సంబంధం లేకుండా ఎస్సీ కాలనీలో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. డీఎస్పీని కలిసిన వారిలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మున్నంగి నాగరాజు, జాతీయ నాయకులు కె.విశ్వనాథ్, సొట్ట నరేంద్రబాబు, రుద్రపోగు సురేష్, జిల్లా అధ్యక్షులు తోరటి ఆనంద్, నగర అధ్యక్షుడు గుంటూరు ప్రభుదాస్ తదితరులు ఉన్నారు. -
జిల్లా స్థాయి బేస్బాల్ జట్ల ఎంపికలు
సంతనూతలపాడు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్–14, 17 బాలబాలికల బేస్బాల్ జట్ల ఎంపిక పోటీలు మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు డీ శ్రీనివాసరావు, తిరుమలశెట్టి రవికుమార్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో వివిధ జిల్లాల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారన్నారు. డైట్ ప్రిన్సిపాల్ సామ సుబ్బారావు, సంతనూతలపాడు ఎంఈవో వెంకారెడ్డి, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య, స్కూలు ఉపాధ్యాయులు వెంకటేశ్వరరెడ్డి, డైట్ కళాశాల అధ్యాపకులు మెర్సిన్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల కోసం ఆటల పోటీలు రేపు
ఒంగోలు: దివ్యాంగులను ప్రోత్సహించేందుకు ఈనెల 27న స్థానిక మినీ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి గుంటి రాజరాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 17–20 ఏళ్లలోపు సీనియర్ కేటగిరీ వారికి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలిగిన క్రీడాకారులు తమ ఆధార్కార్డు నకలుతోపాటు ప్రభుత్వం జారీ చేసిన వైకల్య నిర్ధారణ పత్రాలు తీసుకుని ఈనెల 27న ఉదయం 9 గంటలకు మినీ స్టేడియంలో హాజరై రిపోర్టు చేయాలన్నారు. పూర్తి సమాచారం కోసం సెల్ నంబర్ 9121106840 ను సంప్రదించాలన్నారు. ఒంగోలు: జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ సీనియర్ సీ్త్ర, పురుష క్రీడాకారుల ఎంపిక దర్శిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాల ఆవరణలో ఈనెల 27న నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి బొడ్డు సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఎంపికలో పాల్గొనేవారు 2005 సంవత్సరం కంటే ముందు జన్మించి ఉండాలి. ఆసక్తిగల వారు ఆధార్కార్డు, నాలుగు పాస్పోర్టు సైజు ఫొటోలతో ఎంపిక ప్రదేశంలో రిపోర్టు చేయాలన్నారు. ఎంపికై న జిల్లా క్రీడాకారులు డిసెంబర్ 1, 2 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరిగే రాష్ట్ర సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని కార్యదర్శి బొడ్డు సుబ్బారావు తెలిపారు. ఒంగోలు సబర్బన్: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ ఆదేశించారు. ప్రకాశం భవనం నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పురోగతిపై ఆయన సమీక్షించారు. ఇందులో సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నందున ఇతర కార్యక్రమాల పేరుతో ఎస్ఐఆర్ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని హెచ్చరించారు. ఎస్ఐఆర్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. 2002 నాటి జాబితాతో సరిపోల్చుతూ మ్యాపింగ్ చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ దిశగా పర్యవేక్షించాలని జెడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ ముప్పూరి వెంకటేశ్వరరావులకు ఆయన చెప్పారు. యర్రగొండపాలెం: స్పోర్ట్స్ స్కూల్స్లో చేరే గిరిజన విద్యార్థులకు ఈ నెల 27, 28వ తేదీల్లో బాలురకు యర్రగొండపాలెం గిరిజన గురుకుల పాఠశాలలో, బాలికలకు నెరవాడ పాణ్యంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఎంపిక చేయనున్నట్లు శ్రీశైలం ఐటీడీఏ పీవో కె.వెంకటశివప్రసాద్ మంగళవారం తెలిపారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని గిరిజన గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, మినీ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు అర్హులని, ఆసక్తి ఉన్న వారు తాము ప్రస్తుతం చదువుతున్న హెచ్ఎం నుంచి ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని ఆయన తెలిపారు. 2025–26 సంవత్సరంలో 6వ తరగతిలో నూతన ప్రవేశాలు, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎస్టీ విద్యార్థులకు స్పోర్ట్స్ సెలక్షన్స్ బాలురకు యర్రగొండపాలెంలోని ఏపీ గిరిజన గురుకుల బాలుర పాఠశాల పీటీజీలో, బాలికలకు నంద్యాల జిల్లా మహానంది మండలం నెరవాడ పాణ్యంలోని బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 6, 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థినులు, ఇతర ఆశ్రమ, ప్రభుత్వ, మినీ గురుకులాల్లో చదువుతున్న ఎస్టీ బాలికలు అర్హులని ఆయన తెలిపారు. వివరాల కోసం యర్రగొండపాలెం బాలురకు సెల్ నంబర్: 95738 79433, 99081 69358, 81796 83770, నెరవాడ బాలికలకు సెల్ నంబర్: 81069 79149, 73372 78997, 99896 47238. 80087 11980లకు సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. -
నిబండనలు మీరి!
కాసుల కొండల్లో..ఇటీవల రాళ్లు పడిపోయి ఆరుగురు కూలీలు మృతిచెందిన బల్లికురవ సత్యకృష్ణ గ్రానైట్ క్వారీ (ఫైల్)సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 180 వరకు క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీలన్నీ కేవలం 45 గ్రానైట్ వ్యాపార కంపెనీల చేతుల్లో ఉండడం గమనార్హం. ఒక్కో కంపెనీ 5 నుంచి 10 క్వారీలను చేతిలో పెట్టుకొని కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బల్లికుర ప్రాంతంలో దాదాపు 60 వరకు క్వారీలు ఉన్నాయి. చీమకుర్తి మండలం ఆర్ఎల్పురం పరిసరాల్లో దాదాపుగా 3 వేల హెక్టార్లలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్రానైట్ గనులున్నాయి. ఈ క్వారీల్లో ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన కూలీలు సుమారు 15 వేల మందికి పైగా పనులు చేస్తున్నారు. వీరికి తోడు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మరో 5 వేల మందికి పైగా కూలీలు, కార్మికులు పనిచేస్తున్నారు. పొట్టచేత పట్టుకొని వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన కార్మికులు దినదినగండంగా గడుపుతున్నారు. ప్రమాదపు అంచులో 8 క్వారీలు... చీమకుర్తి, బల్లికురవ పరిసరాల్లో పలు క్వారీలు ప్రమాదంలో ఉన్నట్టు తెలుస్తోంది. చీమకుర్తి మండలంలోని ఆర్ఎల్ పురంలో ఉన్న ఒక గ్రానైట్ క్వారీలో మూడు ప్రదేశాల్లో ఒకటి ఇప్పటికే పడిపోయినట్లు తెలుస్తోంది. మరో రెండు ప్రదేశాల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక్కడే ఉన్న మరొక గ్రానైట్లో కూడా ఒక ప్రదేశం ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం. నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ క్వారీలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది మరింత ప్రమాదమని కార్మిక నాయకులు హెచ్చరిస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడే ఉన్న ఇంకొక క్వారీలో ఒక ప్రదేశం పడిపోయినట్లు సమాచారం. ఇక బల్లికురవ సత్యకృష్ణ గ్రానైట్లో ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీన గ్రానైట్కు చెందిన పెద్ద పెద్ద రాళ్లు పడిపోవడంతో 6 మంది కూలీలు మరణించారు. అలాగే 20 రోజుల కిందట ఆర్ఎల్ పురంలోని ఒక క్వారీలో డంపర్ తిరగబడడంతో ఒకరు మరణించినట్లు సమాచారం. మొత్తం మీద ఏడాదిలో ఇప్పటి వరకు 12 మంది కార్మికులు, కూలీలు మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే అనధికారిక లేక్కల ప్రకారం క్వారీలలో ప్రతి రోజూ ఏదోక ప్రమాదం జరుగుతూనే ఉందని, ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందినట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు ఎక్కడ చీమకుర్తి...ఎక్కడ హైదరాబాద్..?. యజమానులకు కామధేనువుగా మారిన గ్రానైట్ క్వారీలు కార్మికులు, కూలీల పాలిట యమకూపాలుగా మారి ప్రాణాలు తోడేస్తున్నాయి. తవ్వకాల కోసం క్వారీలలోకి దిగిన కూలీలు ప్రాణాలతో సురక్షితంగా తిరిగి వస్తారని చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా గనులలో భద్రతకు సంబంధించిన కార్యాలయం హైదరబాద్లో ఉంది. అక్కడ ఉన్న రీజియన్–3 పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. అంటే ఇక్కడ చీమకుర్తి, బల్లికురవ మండలాలోని గ్రానైట్లలో పనిచేస్తున్న కూలీలు, కార్మికుల భద్రతను ఎక్కడో తెలంగాణాలోని హైదరాబాద్లో ఉన్న సేఫ్టీ అధికారులు పర్యవేక్షించాల్సి రావడమే పెద్ద విషాదమని చెప్పాలి. హైదరాబాద్ రీజియన్ పరిధిలో 19 జిల్లాలు ఉంటాయి. అందులో ప్రకాశం జిల్లా ఒకటి. దీంతో క్వారీల్లో భద్రతను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ రీజియన్కు చెందిన ఒక్కో అధికారి వారి స్థాయిని బట్టి ఏడాదిలో కనీసం 10 సార్లు క్వారీలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం శ్రమ్ సువిధ పోర్టల్లో అధికారులు గమనించిన భద్రతా లోపాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా అధికారులు నామ మాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్వారీ యజమానుల కనుసన్నల్లో పర్యటనలు జరిపి వారికి అనుకూలంగా నివేదికలు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రతా చర్యలు తీసుకుంటూనే ఉన్నాం చీమకుర్తి, బల్లికురవ గ్రానైట్ క్వారీల్లో భద్రతా చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. క్రమం తప్పకుండా క్వారీలను పర్యటించి తనిఖీలు నిర్వహిస్తున్నాం. క్వారీ యజమానులకు భద్రతా చర్యలపై అవగాహన కల్పిస్తున్నాం. ఏడేనిమిదేళ్లతో పోలిస్తే క్వారీల్లో ప్రమాదాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. – జ్ఞానేశ్వరరావు, డీడీఎంఎస్, హైదరాబాద్ -
అదిగో పులి..!
చీమకుర్తి: రామతీర్థం పరిసరాల్లోని గ్రానైట్ క్వారీల్లో చిరుతపులి తిరుగుతుందంటూ ఫేక్ వీడియోను గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. సోమవారం చీమకుర్తి సమీపంలోని రామతీర్థం, నల్లకొండ, ఎర్రకొండ, గ్రానైట్ క్వారీల పరిసరాల్లో పులి సంచరిస్తుందన్న వీడియో హల్చల్ కావడంతో ఫారెస్ట్ ఉన్నతాధికారులు అనుమానిత ప్రాంతాలను జల్లెడ పట్టారు. తీరా గిద్దలూరు ఫారెస్ట్ ఆఫీసర్ వినోద్కుమార్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన చిరుతపులి వీడియో ఫేక్ అని, అది మధ్యప్రదేశ్ ప్రాంతంలో జరిగిన గతంలోని వీడియో అని నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా గ్రానైట్ క్వారీల్లోని స్థానికులు, చీమకుర్తి వాసులు ఊపిరిపీల్చుకున్నారు. పులి ఉందని చెప్పడంతో డీఎఫ్ఓ వినోద్కుమార్, సబ్డివిజన్ డీఎఫ్ఓ శ్రీనివాసులు, ఫారెస్ట్ రేంజర్ నరసింహారావు తమ సిబ్బందితో కలిసి గ్రానైట్ క్వారీల ప్రాంతాలను పరిశీలించి ఎలాంటి పులి ఆనవాళ్లు లేవని, సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఫేక్ అని నిర్ధారించారు. ● గ్రానైట్ క్వారీ పరిసరాల్లో పులి తిరుగుతుందని తప్పుడు ప్రచారం ● జల్లెడ పట్టిన ఫారెస్ట్ అధికారులు ● చివరకు పాత వీడియో అని తెలియడంతో ఊపిరిపీల్చుకున్న స్థానికులు -
లారీకింద పడి యువకుడు దుర్మరణం
కంభం: లారీ కిందపడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన స్థానిక కందులాపురం కూడలి సమీపంలో హైవే రోడ్డుపై సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..కందులాపురం పంచాయతీలో నివాసం ఉంటున్న సయ్యద్ మదార్ కుమారుడు సయ్యద్ అలి(26) సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సమీపంలో ఉన్న డివైడర్ వద్ద లారీని దాటబోయి లారీ కిందపడటంతో తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చొని ఉన్న మరో యువకుడు కుడి వైపుకు కిందపడి పోవడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. లారీ డ్రైవర్ లారీని సంఘటనా స్థలంలో వదిలేసి పరారైనట్లు తెలిసింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలి పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. -
13 నెలలు.. 8 అర్జీలు..!
ఒంగోలు సబర్బన్: 13 నెలలుగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ప్రకాశం భవన్లో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి వస్తున్నాం.. అర్జీల మీద అర్జీలు ఇచ్చుకుంటూ పోతున్నాం.. ఇప్పటి వరకు 8 సార్లు కలెక్టర్ గ్రీవెన్స్కు వచ్చి అర్జీలిచ్చాం.. కానీ సమస్య పరిష్కారం కాలేదు. పొదిలి తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, ఆర్అండ్బీ డీఈ, ఏఈ, పొదిలి ఎస్సైల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వస్తున్నాం. కానీ, మా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. సమస్య పరిష్కరించకుండానే పరిష్కరించామని అధికారులు మెసేజ్ పెట్టారు. ఇదెక్కడి న్యాయం అంటూ పొదిలికి చెందిన దాసరి రవిచంద్రకుమార్ కలెక్టర్ పీ రాజాబాబుకు సోమవారం తన గోడు వెల్లబోసుకున్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో కలెక్టర్ పీ రాజాబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు పోటెత్తారు. పొదిలికి చెందిన దాసరి రవిచంద్రకుమార్, దాసరి ఝాన్సీరాణి మరోసారి అర్జీ అందజేశారు. పొదిలి నగర పంచాయతీ పరిధిలోని పొదిలి నుంచి దర్శి వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు సర్వే నంబర్ 479లో గల ప్రభుత్వ రహదారిని (తోళ్లమడుగు వాగు వద్ద) దర్శి మండలం దర్శి గ్రామానికి చెందిన యోగయ్య ఆక్రమించి అక్రమంగా రేకుల షెడ్డు నిర్మించాడని తెలిపారు. దానివలన సర్వే నంబర్ 396/7లో వర్షం నీరు నిలిచి తమ పొలం, రోడ్డు కోతకు గురవుతున్నాయని తెలిపారు. అలా జరగకుండా కాపాడాలని గ్రీవెన్స్లో అర్జీలు ఇచ్చుకుంటూ వస్తున్నామని, కానీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి అర్జీ 2024 సెప్టెంబర్ 23న ఇచ్చామన్నారు. ప్రస్తుతం 9వ సారి వచ్చి అర్జీ ఇస్తున్నామని కలెక్టర్కు వివరించారు. అర్జీ ఇచ్చినప్పుడల్లా అధికారులు ఒకటీరెండు రోజులు హడావిడి చేస్తారని, ఆ తర్వాత పక్కన పెట్టేస్తారని తెలిపారు. సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కరించినట్లు సెల్ఫోన్కు మెసేజ్ వచ్చినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పూర్తిగా ఆలకించిన కలెక్టర్ రాజాబాబు.. అధికారులపై సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు, పొదిలి కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. సంబంధిత అధికారులు సంయుక్తంగా కూర్చుని వారం రోజుల్లో సమస్య పరిష్కరించి తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. చెంచుపాలెం గ్రామానికి శ్మశానం కావాలంటూ విద్యార్థినుల వినతి... పొన్నలూరు మండలం చెంచుపాలెం గ్రామంలో శ్మశాన వాటిక లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ గ్రామానికి చెందిన గుదె ప్రణీతరెడ్డి, మరికొందరు విద్యార్థినులు కలెక్టర్ రాజాబాబుకు తెలిపారు. 10 సంవత్సరాల నుంచి ఈ సమస్య గురించి అనేక మంది కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారం కాలేదన్నారు. మృతదేహాలను వాగులో పారేయడం ఇష్టంలేక అధికారులకు చెప్పడం జరిగిందన్నారు. కానీ వారు స్పందించలేదన్నారు. శ్మశానానికి స్థలం కేటాయించాలని వేడుకున్నారు. దీనిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. వారం రోజుల్లో శ్మశాన సమస్య పరిష్కారం కావాలని ఆదేశించారు. పొదిలికి సంబంధించిన శ్మశాన సమస్యపై స్పందన కార్యక్రమం చుట్టూ ప్రదక్షిణలు సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కారం అయినట్లు చూపించిన వైనం కలెక్టర్ స్పందన కార్యక్రమానికి పోటెత్తిన అర్జీదారులు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : కలెక్టర్ రాజాబాబు స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాజాబాబు హెచ్చరించారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీలను సకాలంలో గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పలువురు అర్జీదారులతో మాట్లాడి అర్జీల పరిష్కారం విధానం గురించి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి కార్యాలయంలో ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగిందని, సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించడమే కాకుండా వారి సమస్యను సావధానంగా విని నిబంధనల మేరకు సానుకూల విధానంలో పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. -
హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్ అమలు చేయాలి
● ఏపీ సమగ్రశిక్షా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు హరిబాబు ఒంగోలు సిటీ: సమగ్రశిక్షా ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్ను వెంటనే అమలు చేయాలని ఏపీ సమగ్రశిక్షా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు హరిబాబు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమగ్రశిక్షా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో సమగ్రశిక్షా ఉద్యోగుల పోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా, తక్కువ జీతాలతో సరైన హెచ్ఆర్ విధానం లేకుండా అనేక మంది ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారన్నారు. హెచ్ఆర్ పాలసీ అమలు, మినిమం టైం స్కేల్ అమలు చేసి జీతాల పెంపు, సమయానికి చెల్లింపులు, ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచడం, ఈపీఎఫ్, గ్రాడ్యుటీ–పెన్షన్ ప్రయోజనాలు అమలు, ఆరోగ్య బీమా, మెడికల్ సదుపాయాలు కల్పించడం, ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలను వెంటనే అమలు చేయాలని కోరారు. సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు సంవత్సరం పొడవునా ఫిజియోథెరపీ అందించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 10వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జేఏసీ రాష్ట్ర నాయకులు ప్రకటించారు. అన్ని జిల్లాల సమగ్రశిక్షా ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు ఎం.రమేష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు పి.వి.మహేష్, ట్రెజరర్ యు.కళ్యాణి, ఎస్కే జాన్సైదా, తదితరులు పాల్గొన్నారు. -
దొడ్డంపల్లెలో చోరీ
● 20 తులాల బంగారు ఆభరణాలు, వెండి అపహరణ గిద్దలూరు రూరల్: మండలంలోని దొడ్డంపల్లెలో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పల్లా నవీన్కుమార్రెడ్డి చైన్నెలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడి తండ్రి రమణారెడ్డి ముంబైలో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో ఉన్న ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారు. ఈ క్రమంలో దుండగులు ఆదివారం రాత్రి వారి ఇంటి ముందు కారులో రెక్కి నిర్వహించినట్లు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుసుకొని అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి 20 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించారు. గ్రామస్తుల సమాచారంతో స్వగ్రామానికి చేరుకున్న నవీన్కుమార్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కె.సురేష్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ● తగలబడిన కిరాణా, దుస్తుల దుకాణాలు ● రూ.10 లక్షల మేర ఆస్తినష్టం పీసీపల్లి: మండల పరిధిలోని గుంటుపల్లిలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన గాదంశెట్టి సాయికృష్ణ ఒక పక్క కిరాణా దుకాణం, మరో పక్క దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు కేకలు వేశారు. దీంతో ఇంట్లో నుంచి అందరూ బయటకు రావడంతో ఎటువంటి ప్రాణహానీ జరగలేదు. మంటలు ఒక్కసారిగా వ్యాపించి రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో కనిగిరి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ.10 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లింది. మార్కాపురం: గూడ్స్ రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మార్కాపురం, తర్లుపాడు మధ్యలోని 144వ స్టోన్వద్ద సోమవారం ఉదయం జరిగింది. రైల్వే ఎస్సై కె. వెంగళరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు వైపు నుంచి నంద్యాలకు వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలిపారు. మృతుడు త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామానికి చెందిన కొదమల కృపాల్ (50)గా గుర్తించారు. వ్యక్తిగత కారణాలతో మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. -
పోలీసు స్పందనకు 63 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు పోలీసు అధికారులను కలిసి వారి సమస్యలు విన్నవించారు. రాత పూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసు అధికారులు సమస్య పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ జరిపి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పోలీసు గ్రీవెన్స్లో ఎక్కువగా భూ వివాదాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, కుటుంబ కలహాలపై ఫిర్యాదులు అందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ వీవీ రమణ కుమార్, కనిగిరి సీఐ ఖాజావలి, యర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్రావు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు రాజకీయ రంగులు పూసుకోవద్దు
దర్శి: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రాజకీయ పార్టీలపై అభిమానం ఉన్నప్పటికీ బహిరంగంగా పార్టీ రంగులు పూసుకోవద్దని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా దర్శి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులతో ఇష్టాగోష్టి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రిజర్వేషన్లలో మెరిట్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు జనరల్ కేటగిరీలో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రాజకీయ పార్టీల ముద్రలు పడితే ప్రభుత్వాలు మారినప్పుడు క్షేత్రస్థాయిలో కక్షసాధింపులు, వేధింపులకు గురవుతున్న పలు సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలే తప్ప నేతల మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శించవద్దని హితవు పలికారు. అలా చేస్తే పలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లలో స్పష్టమైన విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లలో మెరిట్ ఆధారంగా జనరల్ కేటగిరీలో అవకాశం ఇవ్వకుండా రిజర్వేషన్ల కోటాకు మాత్రమే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ అధికారులకు వాళ్ల ప్రతిభ, పనితీరును ఆధారంగా చేసుకుని ప్రాధాన్యత గల పోస్టుల్లో నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులు ఐక్యతతో దళిత ఉద్యోగ సంఘాల బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు తానం చెన్న కేశవులు, గనిపె రవి కుమార్, గుమ్మడి శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హోరా హోరీగా రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
సింగరాయకొండ: మండల కేంద్రంలోని ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. లీగ్ దశలో జరిగిన 30 మ్యాచ్ల్లో బాలబాలికలు పోటా పోటీగా పాల్గొన్నారు. లీగ్ మ్యాచ్లలో బాలుర విభాగంలో పూల్ సిలో విన్నర్స్గా విశాఖపట్నం, రన్నర్స్గా కర్నూలు, పూల్ డిలో విన్నర్గా కడప, రన్నర్గా చిత్తూరు, బాలికల విభాగంలో పూల్ బిలో విన్నర్ గా కడప, రన్నర్గా ప్రకాశం, పూల్ సిలో విన్నర్గా వెస్ట్ గోదావరి, రన్నర్గా విజయనగరం, పూల్ డిలో విన్నర్గా కృష్ణా, రన్నర్గా గుంటూరు జట్లు నిలిచాయి. మిగిలిన పూల్ విభాగాల్లో జరగాల్సిన పోటీలను మంగళవారం ఉదయం నిర్వహించి క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ను మధ్యాహ్నానికి పూర్తి చేసి సాయంత్రానికి ఫైనల్స్ నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కే శంకర్రావు, అండర్–19 కార్యదర్శి ఈ చింపారెడ్డి తెలిపారు. ఈ టోర్నమెంటులో ఎస్సై బీ మహేంద్ర, డీఐఈఓ కే ఆంజనేయులు, జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ పీ విజయ్కుమార్, పీఈటీలు ఎస్డీ జంషీర్, ఎన్టీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
26న రాజ్యాంగ దినోత్సవం
ఒంగోలు సిటీ: ఏపీ పాఠశాల విద్య గౌరవ సంచాలకుల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉదయం పాఠశాల అసెంబ్లీలో ప్రార్థనా సమావేశంలో విద్యార్థులందరితో రాజ్యాంగ పీఠిక చదివించాలని డీఈఓ కిరణ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసంగాలు/సెమినార్లు, క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, రాజ్యాంగం చరిత్ర, రాజ్యాంగ నిర్మాతల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వెబ్సైట్లో శ్రీరాజ్యాంగ ప్రజాస్వామ్యంశ్రీపై జరుగుతున్న ఆన్లైన్ క్విజ్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. ● ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ను వెంటనే ప్రకటించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ఒంగోలు పట్టణ, తాలూకా కార్య నిర్వహక కమిటీ సమావేశం సోమవారం సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. కార్యదర్శి వరకుమార్, ట్రెజరర్ రంగారెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, తాలూకా అధ్యక్షుడు సురేష్ బాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు రజిత మానస, చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఏసురత్నం, చెంచారావు, ప్రసన్న, సుమతి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిహారం, కారుణ్య కోటా కింద ఉద్యోగాలు పొందిన ఇద్దరికి సోమవారం గ్రీవెన్స్ హాలులో ఆయన నియామకపత్రాలను అందించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులో బాధితుడు మాగులూరి రవికుమార్ చనిపోవడంతో అతని భార్య సలోమికి, రోడ్లు భవనాల శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గురవయ్య చనిపోవడంతో ఆయన కుమారుడు భార్గవ్కు ఉద్యోగాలు లభించాయి. విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకొని ఉన్నత స్థానాలకు ఎదిగేలా పనిచేయాలని వీరికి కలెక్టర్ సూచించారు. కొత్తపట్నం: మండలంలోని పాదర్తి తీర ప్రాంతానికి సోమవారం ఉదయం మృతదేహం కొట్టుకువచ్చింది. మృతునికి 45 ఏళ్ల వయసుంటుందని, బులుగు చొక్కా, నల్లని డ్రాయర్ ధరించి ఉన్నాడు. మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వేముల సుధాకర్బాబు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
కలిసి నడుద్దాం.. విజయమే లక్ష్యంగా పనిచేద్దాం
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలంతా కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ముందుకు సాగాలని, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు అవిశ్రాంతంగా పనిచేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం మండల పార్టీ, పట్టణ పార్టీ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కార్యకర్తలకు మీ మండలంలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. పార్టీ కార్యకర్తలకు అన్నీ విధాలుగా అండగా ఉంటామని, నియోజకవర్గ ఇన్చార్జి, జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో అన్నీ వర్గాల ప్రజలను కలుపుకొని పార్టీ నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీలు, కులం, మతం చూడకుండా జగనన్న పథకాలు అందరికీ అందజేశారని గుర్తు చేశారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదన్నారు. ప్రతిఒక్క పథకాన్ని ఇంటి వద్దకే తెచ్చి అందించిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా నమ్మించి దగా చేసిందో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిలో కోతలు పెడుతున్నారని, చివరికి ఉపాధి హామీ జాబ్ కార్డులను కూడా తొలగించడం దారుణమన్నారు. పేదల పొట్ట కొడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి, పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలతో ఆదుకున్న జగనన్న ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా వివరించి చెప్పాలన్నారు. జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసం పార్టీ కార్యకర్తలు, నాయకులంతా ప్రజలను కలుపుకొని ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, తదితరులు పాల్గొన్నారు. -
గ్రూపుగా దోపిడీ!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)లో నకిలీ స్వయం సహాయక మహిళా (డ్వాక్రా) గ్రూపుల దందా రచ్చకెక్కింది. బడా బాబులు, అధికార పార్టీల నాయకుల అండదండలతో నకిలీ గ్రూపులు విచ్చలవిడిగా ఏర్పాటై బ్యాంకుల నుంచి రూ.కోట్లలో రుణాలు తీసుకున్న దందా వెలుగులోకి రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మహిళల పొదుపు సొమ్మును అధికార పార్టీకి చెందిన నేతలు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు చీమకుర్తి, దర్శి, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురంలలో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద 9,545 సంఘాలు ఉన్నాయి. వాటిలో ఒంగోలు కార్పొరేషన్లో 4,217 సంఘాలున్నాయి. 200కు పైగా బోగస్ గ్రూపులు: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లోనే దాదాపు 200లకు పైగా బోగస్ గ్రూపులు ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఈ బోగస్ గ్రూపులు ఏర్పాటు చేసి దాదాపు ఒక్కో గ్రూపునకు రూ.10 లక్షల చొప్పున దాదాపు రూ.20 కోట్లకు పైగా బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తెలుస్తోంది. 2025 ఆగస్టుకు ముందు వరకు గ్రూపులు మాన్యువల్గా ఉండేవి. ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను ఆన్లైన్ చేశారు. ఆగస్టుకు ముందే బోగస్ గ్రూపుల ద్వారా బ్యాంకుల నుంచి అక్రమంగా రుణాలు తీసేసుకున్నారని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు తమ అనుచరులు, బంధువులు, స్నేహితులకు సంబంధించిన మహిళల పేరుతో బోగస్ గ్రూపులు ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని తెలుస్తోంది. టీడీపీ ప్రజా ప్రతినిధికి చెందిన పీఏ హస్తం.. ఒంగోలు నగరంలో మెప్మా అవినీతి తారస్థాయికి చేరుకుంది. ఈ సంస్థలో ఒకొక్కటిగా వెలుగు చూస్తున్న అక్రమాలు విస్తుగొల్పుతున్నాయి. బోగస్ గ్రూపుల ఏర్పాటులో జిల్లాలోని టీడీపీ ప్రజా ప్రతినిధికి చెందిన ప్రైవేటు పీఏ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు పీఏ పదికి పైగా గ్రూపులు ఏర్పాటు చేసి దాదాపు రూ.కోటికి పైగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బోగస్ గ్రూపుల విషయం బయటకు పొక్కడంతో పాటు, బ్యాంకుల నుంచి మహిళలకు నోటీసులు రావడంతో సదరు పీఏ మెప్మా అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది. అలాగే నోటీసులు అందుకున్న మహిళల వద్దకు వెళ్లి రుణాలు తామే చెల్లిస్తామని బతిమిలాడుకుంటున్నట్టు సమాచారం. కేశవస్వామి పేటలో 14 బోగస్ గ్రూపులు: ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో 14 బోగస్ గ్రూపులు ఉన్నట్లు గుర్తించారు. స్థానికంగా ఉంటున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటున్నారు. అయితే నగరానికి చెందిన కొల్లాబత్తిన దివ్య శాంతి అనే రిసోర్స్ పర్సన్ (ఆర్పీ) ద్వారా కేశవస్వామి పేటలో 14 డ్వాక్రా గ్రూపులు తయారు చేసింది. సదరు గ్రూపుల్లో కొల్లాబత్తిన దివ్య శాంతి ఒక్కొక్క గ్రూపులో 5–6 పేర్ల చొప్పున రుణాలు తీసుకుంది. సభ్యులకు తెలియకుండానే రుణాలు తీసుకొని వాడేసుకుంది. ఆ రుణాలను తిరిగి బ్యాంకుకు చెల్లించకపోవటంతో బ్యాంకుల నుంచి నోటీసులు రుణాల సొమ్ము తీసుకోని సభ్యులకు వచ్చాయి. దాంతో కంగుతిన్న డ్వాక్రా గ్రూపు సభ్యులైన మహిళలు కొల్లాబత్తిన దివ్య శాంతిపై పీడీ శ్రీహరికి ఫిర్యాదు చేశారు. దివ్యశాంతిని పిలిపించిన పీడీ శ్రీహరి సభ్యులకు తెలియకుండా తీసుకున్న రుణాలను బ్యాంకుల్లో కట్టాలని దివ్యశాంతిని ఆదేశించారు. చెల్లిస్తానని పీడీ సమక్షంలో లెటర్ కూడా రాసిచ్చింది. కానీ బ్యాంకులకు చెల్లించలేదు. ఇది జరిగి ఎనిమిది నెలలైనా దివ్య శాంతి డబ్బులు కట్టకపోగా మెప్మా పీడీ కూడా దివ్యశాంతిని వెనకేసుకుంటూ వస్తున్నారని ఎస్టీ మహిళలు ఆరోపిస్తున్నారు. కూలి పనులు చేసుకునే తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారని పీడీపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి నోటీసులతో పాటు లీగల్ నోటీసులు కూడా వస్తున్నాయన్నారు. నకిలీల్లో మెప్మా అధికారులు, సిబ్బంది.. ఈ నకిలీల వ్యవహారంలో మెప్మా అధికారులు, సిబ్బంది పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం రిసోర్స్ పర్సన్స్ (గ్రూపు నిర్వాహకురాలు) వల్ల మాత్రమే కాదు. ఎందుకంటే ఆర్పీలతో పాటు మెప్మాలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పాత్ర లేకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వరు. రుణాలు తీసుకోవాలంటే ఆర్పీలతో పాటు మెప్మాలో పనిచేస్తున్న అధికారుల సంతకాలు తప్పనిసరి. మామూలుగా బ్యాంక్ లింకేజికి అర్హత కలిగిన సంఘ సభ్యుల రుణాలను రిసోర్స్ పర్సన్లు శ్రీమహిళాకాశం ఆన్లైన్ యాప్శ్రీ లో వారి లాగిన్ల ద్వారా లోన్ రిక్వెస్ట్ చేయాలి. రూ.10 లక్షల వరకు సంబంధిత అధికారుల అప్రూవల్తో రుణాలు మంజూరవుతాయి. రూ.10 లక్షల పైబడిన రుణాలు మాత్రమే కింది స్థాయి అధికారుల అప్రూవల్ అయిన తరువాత ప్రాజెక్ట్ డైరెక్టర్ లాగిన్కు వస్తాయి. అక్కడ రిక్వెస్ట్ వచ్చిన సంఘాల సంఘ తీర్మాన పత్రం, బ్యాంకు లోన్ అప్లికేషను, లోన్ ఫారంను నిశితంగా పరిశీలించి జిల్లాలోని అన్ని రుణాలను బ్యాంకులకు సిఫారసు చేస్తూ అప్రూవల్ చేస్తారు. మహిళల స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ) అధికార పార్టీ నాయకుల అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని నకిలీ గ్రూపులను సృష్టించారు. లేని పొదుపు సంఘాలను ఉన్నట్లుగా చిత్రీకరించి మాయచేశారు. బ్యాంకులను బురిడీ కొట్టించి రూ.కోట్ల రుణాల సొమ్ము మెక్కేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో లబ్ధిదారులు అవాక్కవుతున్నారు. ఇదేం దారుణం అంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ బాగోతం మెప్మా అధికారులకు తెలిసినప్పటికీ చర్యలకు వెనుకడుగు వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అవినీతి వ్యవహారంలో వారికీ వాటా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దందాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే పీఏది కీలక పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అధికారులు, సిబ్బంది హస్తం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. -
సమగ్ర శిక్ష ఏపీసీగా అనీల్ కుమార్
ఒంగోలు సబర్బన్: జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీగా డి.అనీల్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు తీసుకున్న అనంతరం కలెక్టర్ పీ.రాజాబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ చాంబర్లో కలిసిన ఆయన కలెక్టర్కు మొక్కను బహూకరించారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఏపీసీతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ఉన్నారు. ఒంగోలు వన్టౌన్: రాష్ట్రంలో ఎక్కడైనా ఎస్సీలపై దాడి జరిగితే వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. చీమకుర్తి మండలం బండ్లమూడిలో అగ్రవర్ణాల దాడిలో గాయపడిన దళితులను పరామర్శించడానికి సోమవారం జిల్లాకు వచ్చిన ఆయన ఒంగోలులోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. బండ్లమూడిలో ఎస్సీలపై జరిగిన దాడిలో బాధితులకు పూర్తి స్ధాయిలో న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాధితులు అవమానించబడిన చోటే గౌరవంగా బతికేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు చెప్పారు. బండ్లమూడిలో రెండు బల్లల విధానం ఇప్పటికీ అమలవుతోందన్నారు. పెద్ద బల్ల, చిన్న బల్ల అనే విధానాన్ని తీసివేయాలని ఆధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అవసరమైతే విచారణ అధికారిని కూడా మారుస్తామన్నారు. రాష్ట్రంలో అట్రాసిటీ జరిగితే అక్కడ అధికార యంత్రాంగంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, బాధితులకు అండగా ఉంటామన్నారు. బండ్లమూడిలో బాధితులపై నమోదు చేసిన కేసులను తీసివేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఒంగోలులో జిల్లాకు చెందిన దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు చైర్మన్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఒంగోలు టౌన్: ముగ్గురు ఏఎస్ఐలకు పదోన్నతులు కల్పిస్తూ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 1992 బ్యాచ్ ఏఎస్సైలు సీహెచ్.రాము (టంగుటూరు), కోటేశ్వరరావు (డీసీఆర్బీ, ఒంగోలు), మాల్యాద్రి రెడ్డి (కందుకూరు టౌన్)లకు ఎస్సైలుగా పదోన్నతులు కల్పించారు. దీంతో సోమవారం ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఒంగోలు సబర్బన్: పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒంగోలు పట్టణ, తాలూకా కార్యనిర్వాహక కమిటీ సమావేశం సోమవారం ఒంగోలులోని సంఘ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ను నియమించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయటం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు కూడా తీర్చకుండా ప్రభుత్వం ఉండటం సరికాదన్నారు. సంఘం సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, డైరీ కం హ్యాండ్ బుక్ 2026 కు సంబంధించి ప్రకటనలను వెంటనే రాష్ట్ర సంఘానికి అందజేయాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి వరకుమార్, ట్రెజరర్ రంగారెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, తాలూకా అధ్యక్షుడు సురేష్ బాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు రజిత, నాయకులు మానస, చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఏసురత్నం, చెంచారావు, ప్రసన్న, సుమతి, సందీప్ పాల్గొన్నారు. -
ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలి
మార్కాపురం టౌన్ (దరిమడుగు): ప్రైవేటీకరణ వైపు చంద్రబాబు ప్రభుత్వం మొగ్గుచూపుతోందని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ నిర్వహిస్తే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సోమవారం రాత్రి కోటి సంతకాల సేకరణలో భాగంగా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం ఎంతో అవసరమని భావించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు–నేడు తో పాటు రాష్ట్రంలో ఒక్కసారిగా 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం చారిత్రక నిర్ణయమని అన్నారు. ఈ ప్రాంత పేద, మధ్య తరగతి ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఇప్పటి వరకూ దూరప్రాంతాలైన కర్నూలు, గుంటూరు, ఒంగోలు, విజయవాడ, నంద్యాల తదితర ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు పూనుకుందని, దాన్ని పార్టీలకతీతంగా ప్రజలందరూ వ్యతిరేకించాలని కోరారు. ప్రైవేటీకరణతో పేదలకు ఉచిత వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. మార్కాపురం మెడికల్ కాలేజీ పశ్చిమ ప్రకాశానికి వరమని, ప్రైవేటీకరణ చేయకుండా కోటి సంతకాలు చేసి గవర్నర్కు పంపి ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామన్నారు. రూ.లక్షల కోట్లు అప్పు తెస్తున్నారని, అయితే మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాత్రం నిధులు మంజూరు చేయటం లేదని విమర్శించారు. ముందుగా దరిమడుగు గ్రామంలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నా రాంబాబుకు నాయకులు, అభిమానులు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎస్ఈసీ సభ్యులు వెన్నా హనుమారెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పీ చెంచిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సలీం, జెడ్పీటీసీ నారు బాపన్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ జీ.శ్రీనివాసరెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, నల్లబొతుల కొండయ్య, కంది ప్రమీలారెడ్డి, డాక్టర్ మగ్బుల్బాష, జవ్వాజి వెంకట రంగారెడ్డి, ఎంపీటీసీ పెతూరు, కౌన్సిలర్ సిరాజ్, జె.వెంకటరెడ్డి, లోక్నాథ్రెడ్డి, డి.నాసర్, జీ.సుబ్బారెడ్డి, బి.వెంకటకృష్ణా, గోనా వెంకటేశ్వరరెడ్డి, దేవానంద్, వెల్పుల చెన్నారెడ్డి, నజీర్, ఏడుకొండలు, కె.శ్యామ్దయాకర్, ఎం.శ్రీనివాసరెడ్డి, బి.బాలకృష్ణారెడ్డి, పీఎల్సీ యాదవ్, తర్లుపాడు మండల పార్టీ అధ్యక్షుడు మురారి వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. -
ప్రకాశం
సోమవారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 20259సాగర్ కాలువలో పడిసచివాలయ ఉద్యోగి మృతి త్రిపురాంతకం: దొనకొండ మండలం పోలేపల్లి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పని చేస్తున్న దూపాడు గ్రామానికి చెందిన ఎం అనిల్బాబు సాగర్ కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి ఆదివారం మృతి చెందాడు. కారు–ద్విచక్ర వాహనం ఢీముండ్లమూరు (దర్శి): కారు–ద్విచక్ర వాహనం ఢీకొని మారెళ్ల గ్రామానికి చెందిన గొర్రె చరణ్, గొర్రె రాంబాబుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మారెళ్ల చెరువు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు. -
నల్లమలలో విదేశీ విహంగ సోయగం
గొప్ప చిన్నచందుల్ (గ్రేటర్ షార్ట్ టోడ్ లార్క్): ఎర్రటోపీ జాలె డేగ (రెడ్ నెకెడ్ ఫాల్కన్):ఇది చాలా అందంగా కనిపించే వలస పక్షి. గడ్డి మైదానాల్లో ఉండే ఈ పక్షి చిన్నచిన్న పక్షులను వేటాడి తింటుంది. ఇది ఆఫ్రికా ఖండం నుంచి వస్తుంది. ఐరోపా ఖండం నుంచి వేలసంఖ్యలో ఇక్కడకు వస్తుంటాయి. విదేశాల నుంచి వచ్చే పక్షులన్నీ గొప్ప చిన్నచందుల్ పక్షులను అనుసరించి ఇక్కడకు వస్తూ ఉంటాయి. వలస వచ్చే క్రమంలో గొప్ప చిన్నచందుల్ పక్షులను వేటాడి తింటుంటాయి. తిరిగి వెళ్లే సమయంలోను వాటిని తినేస్తుంటాయి. పక్షి ప్రేమికుల పరవశం వేలకిలోమీటర్లు పయనించి వచ్చి ఇక్కడ కనువిందు చేస్తున్న వైనం ఏటా నవంబర్ నుంచి మార్చి వరకు విదేశీపక్షుల సందడి పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యాలు జీవవైవిద్యానికి కేరాఫ్ అడ్రస్. ఈ అటవీ ప్రాంతాల్లో కృష్ణా పరివాహకంతో పాటు ఎన్నో నదులు, సెలయేళ్లు, గుట్టలు, జంతుజాలాలతో పాటు అరుదైన పక్షులు సందడి చేస్తుంటాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని నల్లమల అభయారణ్యంతో పాటు రోళ్లపాడు అడవులకు ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వేలసంఖ్యలో విదేశీ పక్షులు వస్తుంటాయి. ఐరోపా, యూరప్, మధ్య అసియా, ఆఫ్రికా ఖండాల్లోని పలు దేశాలతో పాటు, మంచుకొండల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు చేరుకుని సందడి చేస్తుంటాయి. వివిధ రకాల పక్షులు విభిన్న రంగులతో, వింత శబ్దాలతో పక్షి ప్రేమికులను, ప్రకృతి అభిమానులను రంజింపజేస్తుంటాయి. చలికాలమంతా ఇక్కడే ఉండి ఎండాకాలం రాగానే తిరిగి వెళ్లిపోతాయి. శ్రీశైలం అభయారణ్యంలో పనిచేసిన వన్యప్రాణి ఫొటోగ్రాఫర్, రిటైర్డు ఫారెస్టు రేంజి అధికారి మహమ్మద్ హయాత్, వణ్యప్రాణి ఫొటోగ్రాఫర్ హనుమంతరావు అరుదైన విదేశీ పక్షులను తమ కెమెరాల్లో బంధించి డాక్యుమెంటరీ రూపొందించారు. అరుదైన పక్షిజాతుల విశేషాలను వారు వెల్లడించారు. ఇది ఐరోపా ఖండం నుంచి వస్తుంది. గడ్డి మైదానాల్లో ఉండే పక్షులను, పెద్దచెట్లలో దాగి ఉండే పక్షులను వేటాడి చంపుతుంది. ఇది ఎక్కువగా ఒంటరిగానే ఉంటుంది. వర్ణపడేగ (యూరేసియస్ స్పారోహాక్):మౌంటేగు పిల్లిగద్ద (మౌంటేగస్ హ్యారియర్): ఇది కూడా యూరప్, మధ్య ఆసియాల్లోని మంచు ప్రదేశాల నుంచి వస్తుంది. చలికాలంలో వచ్చి గడ్డి మైదానాల్లో ఉండే చిన్న పక్షలును, వాటి గుడ్లను తింటుంది. -
ఉపాధి పాయే..
ఒంగోలు టౌన్: వైఎస్సార్ సీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో పార్టీలు, కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తే నేడు చంద్రబాబు పాలనలో కులమతాలు, రాజకీయాల పార్టీలను బట్టి పథకాలను అందిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకంపైనా టీడీపీ నాయకుల పెత్తనంతో పేదల పొట్టకొడుతున్నారు. ఈకేవైసీ సాకుతో ఉపాధి హామీ పథకం జాబ్కార్డులను ఏకపక్షంగా తొలగిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో గ్రామీణ పేదలకు ఉపాధి పనులు దొరికే అవకాశమే లేకుండా పోయే పరిస్థితి తలెత్తుతుందని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. కేవలం అధికార పార్టీ సానుభూతిపరులకు మాత్రమే పనులు దొరుకుతున్నాయని, రాజకీయాల పేరుతో పేదల పొట్టకొట్టడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని విమర్శిస్తున్నారు. 50,868 జాబ్కార్డుల తొలగింపు: జిల్లాలో నిన్నటి వరకు 4,52,868 ఉపాధి హామీ జాబ్ కార్డులున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏరివేతలో 50,868 కార్డులను తీసేశారు. దీంతో ప్రస్తుతం 4.02 లక్షల కార్డులు మాత్రమే మిగిలాయి. జిల్లాలోని కొనకనమిట్ల మండలంలో ఏడాదిన్నర వ్యవధిలో 1350 జాబ్ కార్డులు తొలగించారు. ఒక్క పెదారికట్ల పంచాయతీలో 350 కుటుంబాల జాబ్ కార్డులను తీసేశారు. కంభం మండలంలో 511 జాబ్ కార్డులు, సింగరాయకొండ మండలంలో 1411, జరుగుమల్లి మండలంలో 600 కార్డులను తొలగించారు. ఈ కార్డుల్లో ఎక్కువగా దళితులు, వెనకబడిన వర్గాలు, గిరిజనులు, మైనారిటీల కార్డులే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏ ఒక్క జాబ్ కార్డును సాధారణ పద్ధతిలో రద్దు చేయడానికి వీలులేదు. జాబ్ కార్డులున్న కుటుంబం ఇతర ప్రాంతాలకు శాశ్వితంగా వలస వెళ్లినట్లు తగిన రుజువులుండాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఈ నిబంధనలను పాటించలేదు. జాబ్ కార్డుదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కార్డులు తొలగించినట్లు తెలుస్తోంది. గ్రామ సభలు ఏర్పాటు చేసి కార్డులను రద్దు చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించలేదు. దాంతో కార్డుదారులకు తమ కార్డును తొలగించిన సంగతి నేటికీ తెలియని దుస్థితి నెలకొంది. గ్రామస్థాయి టీడీపీ నాయకులు చెప్పిన వారి పేర్లను మాత్రమే తొలగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ... రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకానికి కష్టాలు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చిందే తడవుగా జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల మీద టీడీపీ నాయకులు కన్నేశారు. అప్పటి వరకు పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ తొలగించాలని పట్టుబట్టారు. జిల్లాలోని 729 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి తమ కనుసన్నల్లో మెలిగే టీడీపీ కార్యకర్తలను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించుకున్నారు. ఈ తంతు రెండు మూడు నెలల పాటు కొనసాగింది. దీని కోసం ఉపాధి పనులను పూర్తిగా పక్కన పెట్టేశారు. దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఉపాధి కూలీలకు పనులు లేకుండా పోయాయి. ఇక రెండో ఏడాది వచ్చే సరికి వర్షాల కారణంగా అరకొర పనులు మాత్రమే చేశారు. పల్లెపండుగ, మొక్కలు నాటడం వంటి నామ మాత్రపు పనులతో మమ అనిపించారు. దాంతో రెండో ఏడాది కూడా ఉపాధి పనులు కొండెక్కాయి. తాజాగా మూడో ఏడాదిలోనైనా పనులు దొరుకుతాయిలే అనుకుంటున్న ఉపాధి కూలీల నెత్తిమీద జాబ్ కార్డుల ఏరివేత పిడుగు పడింది. సుమారు 15 నుంచి 20 శాతం వరకు జాబ్ కార్డులను తొలగించడంతో ఈ సారి కూడా పనులు లేవన్న సంకేతాలు ఇచ్చినట్లయింది.తూతూ మంత్రంగా గ్రామ సభలు శనివారం జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించినట్లు డ్వామా అధికారులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ గ్రామ సభల్లో జాబ్ కార్డులో ఉన్న ఈకేవైసీ లోటుపాట్లను సవరించినట్లు అధికారులు చెబుతున్నారు. నిజానికి జిల్లాలోని 729 గ్రామ పంచాయతీల్లో సగానికిపైగా గ్రామ సభలు నిర్వహించలేదని తెలుస్తోంది. ఒక వేళ ఎక్కడైనా గ్రామసభ నిర్వహించినా స్థానిక ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా సభ నిర్వహించినట్లు నాటకం నడిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం గ్రామ సర్పంచ్కు కూడా సమాచారం ఇవ్వకుండా, వార్డు మెంబర్లకు తెలియజేయకుండా ఒకరిద్దరు అధికార టీడీపీ నాయకుల సమక్షంలో గ్రామ సభలు ఎలా నిర్వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదో మతలబు లేకుంటే ఇలా రహస్యంగా సమావేశం నిర్వహించాల్సిన అవసరమేమొచ్చిందని గ్రామస్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాళ్లూరు మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు గాను కేవలం నాలుగైదు పంచాయతీల్లో మాత్రమే గ్రామ సభలను నిర్వహించినట్లు తెలుస్తోంది. కనిగిరి, మార్కాపురం, దర్శి, కొండపి, ఒంగోలు, యర్రగొండపాలెం, గిద్దలూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని అనేక పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించలేదు. మరికొన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించినట్లు తమకు తెలియదని సర్పంచ్లే చెబుతుండడం గమనార్హం.రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ఉపాధి హామీ పథకానికి గండిపడింది. గ్రామంలో చేసేందుకు పనులు లేకపోవడంతో గ్రామీణులు ఊరొదిలి వలసబాట పడుతున్నారు. మూలుగుతున్న నక్కమీద తాటికాయ పడిన చందంగా రాష్ట్ర ప్రభుత్వం వేలాది జాబ్ కార్డులను తొలగిస్తోంది. ఈకేవైసీ సాకుతో గ్రామాల్లో టీడీపీ నాయకులు చెప్పిన వారి జాబ్ కార్డులను ఏకపక్షంగా తొలగిస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదలపై రాజకీయ ముద్రలు వేసి వారి జాబ్ కార్డులు తొలగిస్తుండటంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. -
25న జిల్లా హ్యాండ్ బాల్ సెలక్షన్స్
కొనకనమిట్ల: మండలంలోని వెలుగొండలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఆవరణలో ఈనెల 25వ తేదీ జిల్లా హ్యాండ్బాల్ జట్ల సెలక్షన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల పీడీ పెద్దన్న తెలిపారు. ప్రకాశం జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–19 విభాగంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాల, కళాశాల తరఫు క్రీడాకారులు పాల్గొనేవారు 99127 45545 నంబరును సంప్రదించాలని పీడీ పెద్దన్న కోరారు. ఒంగోలు సిటీ: మండల విద్యాశాఖాధికారులు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ వివరాలను జిల్లా పరిషత్ కార్యాలయానికి పంపించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ లక్ష్మీనారాయణ, ఐఫియా కౌన్సిలర్ పి.వి.సుబ్బారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ బదిలీల తరువాత అన్ని మండలాల్లో అన్ని ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు చాలామంది మారారు కనుక వారి వివరాలు జిల్లా పరిషత్ కార్యాలయానికి పీఎఫ్ షెడ్యూల్స్ లో రిమార్కుల కాలంలో పంపాలన్నారు. ఈ ఏడాది మార్చి నెల నుంచి ఇప్పటి వరకు పీఎఫ్ షెడ్యూల్స్ పంపని వారు కూడా పంపించాలని విజ్ఞప్తి చేశారు. చీమకుర్తి: కరాటే, కుంఫు పోటీల్లో చీమకుర్తి విద్యార్థులు బంగారు పతకాలతో మెరిశారు. ఒంగోలులోని అంబేడ్కర్ భవన్లో ఆదివారం నిర్వహించిన 12వ జాతీయ స్థాయి కరాటే, కుంఫు పోటీల్లో చీమకుర్తి నుంచి 19 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో 15 మందికి బంగారు పతకాలు, ముగ్గురికి సిల్వర్, ఒక్కరికి బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు కోచ్గా వ్యవహరించిన డీఎన్వీ సుధాకర్ తెలిపారు. ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్ సంస్థ ఫౌండర్ దేవరకొండ వెంకటేశ్వర్లు అభినందించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 800 మంది పాల్గొనగా వారిలో చీమకుర్తి నుంచి 19 మంది తమ నైపుణ్యాలను ప్రదర్శించటంతో స్థానికులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కొండపి: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. అందుకు అనుగుణంగా బస్సులను పెంచాల్సింది పోయి ఉన్న బస్సుల్లోనే కోతలు విధించడంతో ఆర్టీసీ సిబ్బందితోపాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులో దాదాపు 100 మంది ఎక్కి సర్దుకోకపోవడంతో బస్సును కండక్టర్ నిలిపేసిన సంఘటన మండల కేంద్రమైన కొండపిలోని దాసిరెడ్డిపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కామేపల్లి నుంచి కొండపి మీద ఒంగోలు వెళుతున్న ఆర్టీసీ బస్సులో దాదాపు 100 మంది ప్రయాణికులు ఎక్కారు. బస్సు సామర్థ్యం 60 మంది మాత్రమే ఉండగా 100 మంది ఎక్కడంతో కండక్టర్ సర్దుకోమని చెప్తుండగా ఎవరూ ఆమె మాట లెక్క చేయకపోగా ఆమె తో ప్రయాణికురాలు వాగ్వాదానికి దిగారు. దీంతో విధిలేక కండక్టర్ దాసిరెడ్డిపాలెం సమీపంలో బస్సును నిలిపివేశారు. దాంతో గంట పాటు ఆ ప్రాంతమంతా ఎక్కువ మంది జన సమీకరణ ఉండడంతో ఏం జరిగిందోనని స్థానికులు ఆందోళన చెందారు. తీరా పోలీసులు జోక్యం చేసుకొని బస్సును పంపించడంతో వివాదం సద్దుమణిగింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు. -
గ్రామీణ పేదల జీవనాన్ని దెబ్బతీయొద్దు
ఏ వ్యవస్థలోనైనా లోపాలు సహజంగా ఉంటాయి. అంతమాత్రాన వాటిని రద్దు చేయడం సహేతుకమనిపించదు. ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటిని తగలబెట్టినట్లుంది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. ఉపాధి హామీలో అదనంగా జాబ్ కార్డులుంటే తొలగించడంలో తప్పులేదు. కానీ ఆ సాకుతో ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులను, దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతులు, మైనార్టీల జాబ్ కార్డులను తొలగించడం అమానుషం. కనీసం వారికి తెలియజేయాల్సిన బాధ్యతను మరిచి ఎలాంటి సమాచారం ఇవ్వకండానే జాబ్ కార్డులు తొలగించడం మంచిపద్ధతి కాదు. రాజకీయ కారణాలతో గ్రామీణ ప్రజల జీవనాన్ని దెబ్బతీసే చర్యలను ఖండిస్తున్నాను. – కంకణాల ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మా కుటుంబంలో నలుగురివి తీసేశారు మా కుటుంబంలోని నలుగురువి జాబ్ కార్డు నుంచి తొలగించారు. ఈ–కేవైసీ పేరుతో నిరుపేద కుటుంబాలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఇలా నిర్దాక్షిణంగా పేర్లు తొలగించటం దుర్మార్గం. మా కుటుంబంలోనే ఎస్సీ కాలనీలో చాలా మంది పేదలవి జాబ్ కార్డులు రద్దు చేశారు. ప్రభుత్వం స్పందించి మళ్లీ తొలగించిన వారికి జాబ్ కార్డులు ఇవ్వాలి. – బొజ్జా బాబు, పెదారికట్ల మొన్నటి వరకు పనికి వెళ్లాను.. మొన్నటి వరకు ఉపాధి పనికి వెళ్లాను. ఇటీవల ఈ–కేవైసీ కూడా చేశారు. అయినా నా పేరు తొలగించారు. మా లాంటి పేదలకు ఉపాధి పథకం కొంతమేర ఉపయోగపడుతుంది. పనులు లేని సమయంలో మాకు ఉపాధి పనులే దిక్కు. జాబ్ కార్డు లేకపోతే మా పరిస్థితి ఏంటో అర్థ కావడంలేదు. అధికారులు మాలాంటి వారికి జాబ్ కార్డులు ఇచ్చి పనులకు వెళ్లేలా చూడాలి. – బొజ్జా ఒక్కెమ్మ, ఎస్సీ కాలనీ, పెదారికట్ల -
ఉత్సాహంగా ‘సాక్షి’ స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలు
ఒంగోలు సిటీ: విద్యార్థులను ఆంగ్లభాషలో ప్రావీణ్యులుగా, గణితంలో ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు ‘సాక్షి మీడియా గ్రూప్’ ఆదివారం నిర్వహించిన స్పెల్ బీ క్వార్టర్ ఫైనల్స్, మ్యాథ్ బీ సెమీ ఫైనల్స్ పరీక్షలకు విశేష స్పందన లభించింది. ప్రజెంటింగ్ స్పాన్సర్గా డ్యూక్స్వేఫీస్, అసోసియేట్ స్పాన్సర్గా రాజమహేంద్రవరం ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి. ఈ పోటీలను ఒంగోలులోని అపెక్స్ స్కూల్లో కరస్పాండెంట్ శివకోటిరెడ్డి, ఆంధ్రా స్కూల్లో కరస్పాండెంట్ బొమ్మల శ్రీనివాసరావు, సాక్షి అడ్వర్టయిజ్మెంట్ అసిస్టెంట్ మేనేజరు జ్ఞానేశ్వరశర్మ పర్యవేక్షించారు. సాక్షి స్పెల్ బీలో కేటగిరి–2, కేటగిరి–3, కేటగిరి–4 కింద, మ్యాథ్ బీలో కేట గిరి–3, కేటగిరి–4 కింద విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. సాక్షి స్పెల్ బీ, మ్యాథ్ బీ వంటి పరీక్షలు విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని, వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి కాంపిటేటివ్ పరీక్షలకు ఎంతగానో దోహదపడతాయని తల్లిదండ్రులు తెలిపారు. స్పెల్బీ, మ్యాథ్బీ నిర్వహించిన సాక్షి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
ఆర్పీలపై టీడీపీ నాయకుడి అసభ్య పోస్టులు
● పోలీసు కేసు నమోదు చేయాలని డీఎస్పీకి మహిళా ఉద్యోగులు, సీఐటీయూ నాయకుల వినతి ఒంగోలు టౌన్: నగరానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు మెప్మాలో పనిచేసే మహిళా ఆర్పీలను ఉద్దేశించి అసభ్యంగా కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేయడం వివాదాస్పదమైంది. మెప్మా ఉద్యోగితో కారులో తిరిగే ఆర్పీల వీడియోలు నా దగ్గర ఉన్నాయంటూ నగరంలోని 48వ డివిజన్కు చెందిన టీడీపీ నాయకుడు రామ్ చౌదరి వాట్సాప్ గ్రూపులో మెసెజ్ పెట్టాడు. ఇది సోషల్ మీడియోలో బాగా వైరల్ అయింది. దీంతో మెప్మా మహిళా ఉద్యోగులు, సీఐటీయూ నాయకులు శనివారం డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. మహిళా ఉద్యోగుల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో మెసెజ్ పెట్టిన టీడీపీ నాయకుడిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. మెప్మా ఉద్యోగినులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. డీఎస్పీతో పాటు మెప్మా పీడీకి కూడా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా సోమవారంలోపు రామ్చౌదరి మీద కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోకపోతే ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు. డీఎస్పీని కలిసిన వారిలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పి.కల్పన, జిల్లా కార్యదర్శి జి.రమేష్, నాయకులు ఎస్డీ హుసేన్, ఆర్పీల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, రాహేలమ్మ, దేవయాని, నయోమి, సంధ్య తదితరులు ఉన్నారు. -
‘బి’ సర్టిఫికెట్...
ఇంటర్ మొదటి సంవత్సరంలో బీ సర్టిఫికెట్ కోసం ఎన్సీసీలో చేరవచ్చు. రెండేళ్ల శిక్షణ తరగతుల అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణులైతే సర్టిఫికెట్ ఇస్తారు. మొదటి సంవత్సరంలో 31 రోజులు, రెండో సంవత్సరంలో 34 రోజులు శిక్షణలో పాల్గొనాలి. ఇంటర్ రెండో ఏడాదిలో నిర్వహించే శిబిరంలో సైతం పాల్గొనాలి. బీ లేకుండా సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేరు. బీ సర్టిఫికెట్లో కవాతు, ఆయుధ పరీక్ష, రాత పరీక్ష ఉంటాయి. ఆయుధ పరీక్షలో 0.22 రైఫిల్లోని పార్టులు మొత్తం విప్పి తిరిగి బిగించడం నేర్పిస్తారు. రాత పరీక్ష హిందీ, ఇంగ్లిష్లో ఉంటుంది. ‘సి’ సర్టిఫికెట్... డిగ్రీ మొదటి సంవత్సరంలో సీ సర్టిఫికెట్ కోసం ఎన్సీసీలో చేరవచ్చు. చివరి సంవత్సరంలో ‘సి’ సర్టిఫికెట్ పరీక్ష ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ శిక్షణ తీసుకోవాలి. జాతీయ సమగ్రత శిబిరంలో పాల్గొనడానికి ఈ శిక్షణ చక్కని అవకాశం. ఇందులో పాల్గొంటే అదనంగా 25 మార్కులు కలుపుతారు. ‘సి’ సర్టిఫికెట్ వస్తే విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. కేంద్ర బలగాల్లో చేరేందుకు రిజర్వేషన్ ఉంటుంది. కేంద్ర పోలీస్ సంస్థలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీలో అధికారిగాగానీ, కానిస్టేబుల్గాగానీ చేరేందుకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. -
పార్టీ, ప్రజా సంఘాలను బలోపేతం చేయాలి
మార్కాపురం: అట్టడుగు వర్గాల సమస్యల పరిష్కారం కోసం శతాబ్ద కాలంగా రాజీలేని పోరాటాలు కొనసాగిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)ని, అలాగే పార్టీకి పట్టుకొమ్మలైన ప్రజా సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మార్కాపురం ప్రాంతీయ సీపీఐ వర్క్షాప్ శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో పార్టీ సీనియర్ నాయకుడు అందె నాసరయ్య అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలో ఒకప్పుడు సీపీఐ ఒక వెలుగు వెలిగిందని, మళ్లీ ఆ దిశగా ప్రజా పోరాటాలను కొనసాగించడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు. వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రజల ఆశాజ్యోతి వెలుగొండ ప్రాజెక్టు కోసం పార్టీ నాయకులు దివంగత పూల సుబ్బయ్య, గుజ్జుల యలమందారెడ్డి, రావుల చెంచయ్యలు అనేక దశాబ్దాలుగా చేసిన పోరాటాల ఫలితంగానే నేడు ఆచరణలోకి వచ్చిందన్నారు. సీపీఐకి ప్రజా సంఘాలైన ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏపీ రైతు సంఘం, ఏఐటీయూసీ, మహిళా సంఘం, కౌలు రైతు తదితర సంఘాల సభ్యత్వాలను పెంపొందించుకోవాలని ఆయన కోరారు. సీపీఐ శతాబ్ది వేడుకల సభ వచ్చే డిసెంబర్ 28న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలి రావాలని ఈశ్వరయ్య పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 26వ తేదీన అన్నీ గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేవీ కృష్ణగౌడ్, ఎస్కె.యాసిన్, నియోజకవర్గ పార్టీ కార్యదర్శి ఎస్కె.కాశీం తదితరులు పాల్గొన్నారు. -
టిప్పర్ ఢీకొని వృద్ధుడు మృతి
సింగరాయకొండ: టిప్పర్ ఢీకొని వృద్ధుడు మృతిచెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై సింగరాయకొండలోని లారీ యూనియన్ ఆఫీసు సమీపంలో ఐస్ ఫ్యాక్టరీ వద్ద జరిగింది. సైకిల్పై వెళ్తున్న ఆయుర్వేద వైద్యుడు సానికొమ్ము మాణిక్యాలరావు (70)ను కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొని శరీరంపై నుంచి వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందాడు. టంగుటూరు మండలం పోతుల చెంచయ్య కాలనీకి చెందిన మాణిక్యాలరావు ఆయుర్వేద వైద్యుడిగా పనిచేస్తూ వైద్యం చేసేందుకు ఎంత దూరమైనా సైకిల్పై వెళ్లి వస్తుంటాడు. ఉలవపాడు వెళ్లేందుకు సైకిల్పై బయలుదేరగా టిప్పర్ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. మాణిక్యాలరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇతనికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బీ మహేంద్ర తెలిపారు. టిప్పర్ను పోలీస్స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. సానికొమ్ము మాణిక్యాలరావు (ఫైల్) -
క్రమశిక్షణ.. ఎన్సీసీ..!
జూనియర్ డివిజన్ బాలురు (జేడీ), జూనియర్ డివిజన్ బాలికలు (జేడబ్ల్యూ) 28 మందికి రూ.8 వేలు, ఎస్డీ, ఎస్డబ్ల్యూలు 15 మందికి రూ.5 వేలు ఇస్తారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరడానికి ఒక శాతం, మెడికల్ సీట్లలో 0.25 శాతం రిజర్వేషన్ ఉంటుంది. కంభం: విద్యార్థుల్లో చదువుతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించి సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) కీలకపాత్ర పోషిస్తోంది. ఎన్సీసీలో చేరి శిక్షణ పొందడం ద్వారా ఆర్మీ, పోలీస్, తదితర ఉద్యోగాలతో పాటు ఉన్నత చదువుల్లో కూడా రిజర్వేషన్ల సౌకర్యం ఉండటంతో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పారామిలటరీ రిక్రూట్మెంట్లో ఎన్సీసీ విద్యార్థులకు ‘ఎ’ సర్టిఫికెట్కు–2, ‘బి’ సర్టిఫికెట్కు–6, ‘సి’ సర్టిఫికెట్కు 10 మార్కులు కలుస్తాయి. ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరడానికి ఒకశాతం, మెడికల్ సీట్లలో 0.25 శాతం రిజర్వేషన్ ఉంటుంది. జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో అధికంగా సైనిక కుటుంబాలు ఉండటంతో వారి పిల్లలు ఎన్సీసీలో ఎక్కువగా చేరుతున్నారు. ఆడపిల్లలు సైతం పోటీపడి మరీ ఎన్సీసీలో చేరి సర్టిఫికెట్లు పొందుతున్నారు. జిల్లాలో 34 ఆంధ్రా బెటాలియన్లో 3 వేల మంది ఎన్సీసీ విద్యార్థులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా బీ, సీ సర్టిఫికెట్లు పొందేందుకు కాలేజీ స్థాయి విద్యార్థులకు ఒంగోలు, చీరాల, మార్కాపురం, కందుకూరు, నెల్లూరులో క్యాడర్ క్యాంప్ జరుగుతోంది. ఎన్సీసీ విద్యార్థులకు పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడే ‘ఎ’ సర్టిఫికెట్ వస్తే, ఇంటర్ మొదటి సంవత్సరంలో ‘బి’ సర్టిఫికెట్ తెచ్చుకునేందుకు ఎన్సీసీలో చేరవచ్చు. ఒకవేళ ‘ఎ’ సర్టిఫికెట్ లేకపోతే నేరుగా ‘బి’ సర్టిఫికెటు కోసం చేరవచ్చు. ‘ఎ’ సర్టిఫికెటు పరీక్షకు హాజరుకావాలంటే కచ్చితంగా 40 రోజుల శిక్షణ తీసుకోవాలి. ప్రతి ఏటా నవంబర్ నెలలో నాలుగో ఆదివారం ఎన్సీసీ దినోత్సవం జరుపుకుంటారు. ఎన్సీసీ శిక్షణతో ఎన్నో ప్రయోజనాలు క్రమశిక్షణ, దేశభక్తితో పాటు విద్య, ఉద్యోగాలలో అదనపు రిజర్వేషన్లు 34 ఆంధ్రా బెటాలియన్ కింద జిల్లాలో 3 వేలమందికిపైగా ఎన్సీసీ విద్యార్థులు 5 ఇంజినీరింగ్ కళాశాలలు, 7 కళాశాలలు, 35 హైస్కూళ్లలో ఎన్సీసీ శిక్షణ బంగారు భవిష్యత్ ఉండటంతో ఆసక్తి చూపుతున్న విద్యార్థులు నేడు ఎన్సీసీ దినోత్సవం -
డీఎడ్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని బీఎడ్ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వైస్ ఛాన్సలర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎడ్ రెండో సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి మొత్తం 11,340 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 93.88 ఉత్తీర్ణత శాతంతో 10,646 మంది పాసైనట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ సోమశేఖర, డీసీ అకడమిక్స్ ప్రొఫెసర్ జి.రాజమోహన్రావు, పరీక్షల కో ఆర్డినేటర్ డాక్టరు ఆర్.శ్రీనివాసులు, పరీక్షల విభాగం పర్యవేక్షకుడు సూడా శివరాం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు ఏకేవీకే డిగ్రీ కళాశాలలో శనివారం ఉద్యోగమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రెసిడెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ యువత తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాల గురించి ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ రమాదేవి వివరించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ మాట్లాడుతూ పట్టణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించడమే తమ లక్ష్యమన్నారు. జాబ్మేళలో మొత్తం 34 కంపెనీలు పాల్గొన్నట్లు తెలిపారు. వీటికి 515 మంది హాజరుకాగా, 329 మంది ఎంపికయ్యారన్నారు. -
దొంగతనం కేసులో ఏడాది జైలు
దొనకొండ: మోటార్ సైకిల్ చోరీ చేసిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ దర్శి జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ శనివారం తీర్పు చెప్పినట్లు దొనకొండ ఎస్సై టి.త్యాగరాజు తెలిపారు. దొనకొండ మండలంలోని పడమటి లక్ష్మీపురం గ్రామానికి చెందిన వల్లపునేని శివరామకృష్ణ విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసేందుకు దొనకొండలోని మన గ్రోమోర్ సెంటర్కు 21–11–2024 తేదీన ఏపీపీక్యూ 7685 నంబర్ గల మోటార్ సైకిల్పై వచ్చాడు. తన వాహనాన్ని మన గ్రోమోర్ సెంటర్ ఎదురుగా పెట్టి లోపలికి వెళ్లి పని చూసుకుని తిరిగి బయటికి వచ్చేసరికి ద్విచక్ర వాహనం కనిపించలేదు. దీంతో 23–11–2024 తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్సై కె.విజయకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నూజెండ్ల మండలం కనపర్తి గ్రామానికి చెందిన ఉప్పుచర్ల బాలయేసు మోటార్సైకిల్ దొంగలించినట్లు పోలీసులు గుర్తించి దర్శి సబ్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.చంద్రకుమారి వాదించగా జడ్జి కె.లిఖిత ఏడాది జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు. మహిళల హక్కులు కాలరాస్తున్న బీజేపీ ఒంగోలు టౌన్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల హక్కులు కాలరాస్తోందని, ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న మహిళల హక్కులను నిర్వీర్యం చేస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక ఎల్బీజీ భవనంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ముఖ్య కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కొండారెడ్డి పాల్గొని మాట్లాడుతూ సమాజాన్ని అనాగరిక స్థితిలోకి తీసుకెళ్లే మనువాదాన్ని మహిళలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పారు. మనువాద పాలకులు మహిళలను వంటగదికే పరిమితం చేసేందుకు, సనాతన సంప్రదాయాలతో మూఢ విశ్వాసాలను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెంది మహిళలు అన్నీ రంగాలలో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో మహిళలను, సమాజాన్ని వెనక్కు నెట్టే మనువాద భావజాలం చాపకింద నీరులా విస్తరించడం ప్రమాదకరమన్నారు. ఈ భావజాలాన్ని బలంగా తిప్పికొట్టాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, జిల్లా అధ్యక్షురాలు సయ్యద్ షర్మిల, ఆదిలక్ష్మి, కె.లక్ష్మీప్రసన్న, ఎస్కే నాగుర్ బి, ధనలక్ష్మి, పద్మ, కె.రాజేశ్వరి, పి.రత్నం తదితరులు పాల్గొన్నారు. ● స్థానికులు, పోలీసుల సాయంతో తిరిగి పాఠశాలలో అప్పగింత సీఎస్ పురం (పామూరు): కేజీబీవీల్లో భద్రత డొల్లగా మారుతోంది. సీఎస్ పురం కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని శనివారం మధ్యాహ్న సమయంలో సిబ్బందికి తెలియకుండా బయటికి వెళ్లిపోయింది. స్థానికులు, పోలీసుల సాయంతో తిరిగి పాఠశాలకు చేరడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఆ వివరాల్లోకెళ్తే.. ఒంగోలుకు చెందిన ఓ బాలిక సీఎస్ పురం కేజీబీవీలో 9వ తరగతి చదువుతోంది. మధ్యాహ్న సమయంలో పాఠశాల నుంచి బయటకు వచ్చి సమీపంలోని వారి ఫోన్ తీసుకుని తమ వారికి ఫోన్చేసింది. గమనించిన స్థానికుడు సదరు బాలికను పాఠశాలకు పంపేందుకు యత్నించగా, పరుగులు తీసి కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు విషయం తెలిపి బాలికను వెతుక్కుంటూ వెళ్లి పామూరు రోడ్డులో గుర్తించి పోలీసులకు అప్పజెప్పారు. బాలిక తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చి కేజీబీవీ ఉపాధ్యాయులను పిలిపించి వారికి బాలికను అప్పగించారు. విద్యార్థినుల భద్రత పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. ఇటీవల పాఠశాలలో విద్యార్థినులను ఉపాధ్యాయులు తమదైనశైలిలో తీవ్రంగా మందలించడంవల్లే సదరు బాలిక పాఠశాల నుంచి పరారై బయటకు వచ్చినట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికీ విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు పోతుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని, సిబ్బందిని నమ్మి పేదలు తమ పిల్లలను పాఠశాలకు పంపితే ఇలాగేనా చూసేది అని చర్చించుకుంటున్నారు. -
లేబర్ కోడ్లతో కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు తాకట్టు
ఒంగోలు టౌన్: కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు తాకట్టుపెట్టేందుకు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు. స్థానిక అద్దంకి బస్టాండ్ సెంటర్లో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టిన కార్మిక సంఘాల నాయకులు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లేబర్ కోడ్లను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను కార్మిక సంఘాల నాయకులు దహనం చేశారు. నిరసనలో కాలం సుబ్బారావు మాట్లాడుతూ లేబర్ కోడ్ల వలన కార్మికుల ప్రాథమిక హక్కులు కోల్పోతారని చెప్పారు. సమ్మె హక్కును నిర్వీర్యం చేయడం, యూనియన్లు లేకుండా చేయడం కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. జీవితావసరాలను వేతనాల నుంచి మినహాయించడం, వేతనాల నిర్వచనాన్ని మార్చివేయడం దుర్మార్గమన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం చెల్లించాల్సిన బాధ్యతను యజమాని నుంచి తొలగించడం కుట్రపూరితంగా తీసుకున్న చర్యగా అభివర్ణించారు. నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల పాలిట ఉరితాడుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాటాలను, త్యాగాలను నీరుగారుస్తూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని మండిపడ్డారు. కార్మికులను నయా బానిసలుగా మార్చే ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్టీ జిల్లా కార్యదర్శి ఎంఎస్ సాయి, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు మోహన్, రమేష్, ఎస్డీ సర్దార్ తదితరులు ప్రసంగించగా కార్మిక సంఘాల నాయకులు బీవీ రావు, మహేష్, జీ.రమేష్, తంబి శ్రీనివాసులు, విజయమ్మ, షేక్ హుసేన్, రాములు, శేషయ్య, రాంబాబు, శ్రీరాం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ధరలు పతనమై కష్టాల్లో అన్నదాతలు
ఒంగోలు సిటీ: ధరలు పతనమై కష్టాల్లో అన్నదాతలు ఉంటే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తూ పరిపాలనను, రైతులను పక్కన పెట్టారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ఎం.ప్రసాద్రెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని విమర్శించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఈ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారన్నారు. రెండో ఏడాది అమలు చేసినా, లబ్ధిదారుల్లో కోత పెట్టి 7 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టారని చెప్పారు. ఇప్పుడు రెండో విడత కింద రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద ఇస్తామన్నది ఎంత..? వాస్తవంగా ఇస్తోంది ఎంత అని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి సాయానికి సంబంధించి గత ప్రభుత్వంలో అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్లు సాయంగా అందించిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు పెట్టుబడి సాయంలో కౌలు రైతులకు మొండిచెయ్యి చూపించి వారికి అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేయడం లేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్లు 53,58,366 మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లలో ప్రతి రైతుకు రూ.40 వేల పెట్టుబడి సాయం చేయాల్సి ఉందన్నారు. దీని ప్రకారం ఇప్పటి వరకు 21,433 కోట్ల 46 లక్షల 40 వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సి ఉందన్నారు. వాస్తవంగా రెండు విడతల్లో 46,85,838 మంది రైతులకు తొలి విడత కింద రూ.5 వేలు, ఇప్పుడు మరో రూ.5 వేలు.. అంటే రూ.10 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చిన మొత్తం కేవలం 4,685 కోట్ల 53 లక్షల 80 వేల రూపాయలు మాత్రమేనన్నారు. రైతులకు ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం రూ.16,746 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. రైతు సంక్షేమ పథకాలకు మంగళం: చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అందాల్సిన సాయం చేస్తున్నామని చెబుతూ మోసం చేస్తోందన్నారు. ఇప్పటికే ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, కనీస మద్దతు ధర కల్పన కోసం ధరల స్థిరీకరణ నిధి, ఈ–క్రాప్ విధానం, ఇ్న్పుట్ సబ్సిడీ వంటి అన్ని సంక్షేమ పథకాలకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడి రైతుల పాలిట శాపంలా మారిందని విమర్శించారు. అన్ని వర్గాల వారిని మోసం చేసినట్లుగానే, రైతులను కూడా చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా దగా చేసిందన్నారు. మిర్చి, పొగాకు, మొక్కజొన్న, అరటి, పత్తి వంటి ఏ పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో విత్తనాలు, ఎరువులు, యూరియా కోసం రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడే దుస్థితి తీసుకొచ్చారన్నారు. శనగలకు మార్కెట్ ధర రూ.5400 ఉంటే, రైతులకు ఇచ్చే సబ్సిడీ శనగలకు 25 శాతం సబ్సిడీతో కలిపి ధర రూ.7800 అమ్మడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని తెలిపారు. ఎన్నికల సమయంలో కేంద్ర నిధులతో సంబంధం లేకుండా ఏటా రూ.20 వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పిన చంద్రబాబు మాటతప్పి మోసం చేశారని విమర్శించారు. తొలిఏడాదిలో రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదని, అనర్హుల పేరుతో 7 లక్షల మందిని పక్కన పెట్టారని చెప్పారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెళ్ల బంగారు బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలోని శనగల రైతులకు రూ.40 వేల వరకు సాయం ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు. పొగాకు రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను పాటిస్తోందని, సీఎంకు రైతులంటే ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. ఏనాడూ రైతులు, రైతు కూలీల పట్ల చిత్తశుద్ధి చూపించలేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ను వెన్నుపోటు సర్కార్గా అభివర్ణించారు. రైతు రుణ మాఫీ విషయంలో కూడా నాడు చంద్రబాబు రైతులను నమ్మించి మోసం చేశారని గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో రైతు సహాయం అందించకపోవడంతో అప్పులపాలవుతున్నారని చెప్పారు. -
బైక్ అదుపుతప్పి ఒకరు మృతి
దర్శి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో వ్యక్తి మరణించిన సంఘటన దర్శి మండలంలోని మార్కెట్ యార్డు సమీపంలో శనివారం జరిగింది. మండలంలోని అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన రత్నారెడ్డి, చిన్న బంగారయ్య, వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై దర్శి బయలుదేరారు. శివరాజనగర్ దాటి మార్కెట్ యార్డు వద్దకు వెళ్లేసరికి ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రత్నారెడ్డి అపస్మారక స్థితికి చేరాడు. మిగతా వారికి స్వల్పగాయాలయ్యాయి. 108కి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది బాలజ్యోతి, కే నరేష్లు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రత్నారెడ్డి (40) మృతి చెందాడు. ఒంగోలు వన్టౌన్: పీఎంఏవై–ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా పక్కా గృహాల కోసం ఈ నెల 30వ తేదీలోపు నమోదు చేసుకోవాలని హౌసింగ్ పీడీ పెరుగు శ్రీనివాస ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. గ్రామాల్లో పక్కా గృహాల మంజూరుకు లబ్ధిదారులు సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్, మండలంలోని అసిస్టెంట్ ఇంజినీర్ను సంప్రదించాలన్నారు. లబ్ధిదారుల వద్దకే సిబ్బంది వెళ్లి ఫేస్ అథెంటికేషన్ పద్ధతి ద్వారా వారి వివరాలను యాప్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. జాబ్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్బుక్ ఉండాలన్నారు. స్థలం ఉన్నవారు – స్థలం లేనివారు అందరూ ఈ యాప్లో తప్పనిసరిగా నమోదు చేసుకుంటే భవిష్యత్తులో స్థలం మంజూరైన తర్వాత పక్కా గృహాల నిర్మాణాలు చేయడం జరుగుతుందన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో పక్కా గృహాలు పొందాలనుకునే అర్హులైన ప్రతి కుటుంబం తప్పనిసరిగా యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. -
నీళ్లివ్వండి మహాప్రభో..!
మార్కాపురం: మండలంలోని బిరుదులనరవ గ్రామంలో తాగునీటి సమస్య తీర్చాలని శుక్రవారం గ్రామ మహిళలు, ప్రజలు బిందెలు, డ్రమ్ములతో ఆందోళన చేపట్టారు. ఎస్సీకాలనీలో వారంరోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని, అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న బోర్లలో సైతం నీరు రాకపోవడంతో పొలాల్లోకి వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. అధికారులు ఇప్పటికై నా స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామస్థుల ధర్నాతో తాత్కాలికంగా శుక్రవారం సాయంత్రం ట్యాంకరు ద్వారా నీటి సరఫరా చేశారు. -
జీజీహెచ్లో పారిశుధ్య పరిస్థితుల పరిశీలన
ఒంగోలు టౌన్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్య లోపం కారణంగా రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు రావడంతో ఎట్టకేలకు స్పందించారు. కలెక్టర్ పి.రాజబాబు ఆదేశాలతో డీఆర్ఓ ఓ.చిన ఓబులేసు, డీఎంహెచ్ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు, ఏపీ హెచ్ఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిర్మల్ కుమార్, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ కె.అద్దయ్యలతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శుక్రవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్య స్థితిగతులను పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలు, మురుగు నీటి సరఫరా, డంపింగ్ ప్రదేశాలలను పరిశీలించారు. 8, 9 బ్లాకుల మధ్య దుర్వాసన వేయడాన్ని గమనించారు. అక్కడ డ్రైనేజీ కాలువల్లో వ్యర్థ పదార్థాలు పేరుకొని పోయాయని, నీరు పారకపోవడంతో దుర్గంధం వేస్తుందని అధికారులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం వెంటనే నగర పాలక సంస్థ కమిషనర్తో మాట్లాడారు. దీంతోపాటుగా మెడికల్ కాలేజీ, వైద్యశాల పరిధిలో 180 బిట్స్ పైప్లైన్స్ జాయింట్ల దగ్గర మరమ్మతులు చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. నగర పాలక సంస్థ సిబ్బందితో సహకారం తీసుకొని డ్రైనేజీని శుభ్రం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆస్పత్రి ముఖద్వారం, లోపల ఓపీ వద్ద వెయిటింగ్ ప్రదేశాలు ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో సానుకూల వాతావరణం కనిపించేలా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఇందుకోసం త్వరలోనే ఆర్కిటెక్చర్ సలహాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ బృందం వెంట ఆర్ఎంఓ డా.మాధవిలత, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.ప్రభాకర్ ఉన్నారు. -
జాతీయస్థాయి క్యారమ్స్ పోటీలకు మస్తాన్వలి
దర్శి: జాతీయ స్థాయి ఆటల పోటీలకు బసిరెడ్డిపల్లె ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న షేక్ మస్తాన్వలి ఎంపికయ్యారు. సివిల్ సర్వీసెస్ ఆటలు పోటీల్లో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడలో గురువారం నిర్వహించిన క్యారమ్స్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన మస్తాన్వలి గుజరాత్లో జరగబోవు జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓలు కే మాలకొండయ్య, బీ రమాదేవి, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాకా జనార్దన్ రెడ్డి, షేక్ ఖాదర్ మస్తాన్, యూటీఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి దనిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు ప్రసాద రెడ్డి, రామిరెడ్డి, ముక్కాలరెడ్డి, మారుతీ కిరణ్ రెడ్డి, నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. జాతీయస్థాయిలో యోగా పోటీలకు రమణయ్య పీసీపల్లి: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ యోగా పోటీల్లో భాగంగా శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులకు విజయవాడలో గాంధీజీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పీసీపల్లి మండలం వెంగళాయపల్లి పాఠశాలకు చెందిన స్వర్ణ వెంకట రమణయ్య ఉత్తమ ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రమణయ్యను జిల్లా స్పోర్ట్స్ అధికారి రాజేశ్వరి, మండల విద్యాశాఖ అధికారులు ఆర్ శ్రీనివాసులు, సంజీవ్ అభినందించారు. -
నాలుగు మండలాల్లో తగ్గిన సీ్త్రల నిష్పత్తి
ఒంగోలు టౌన్: జిల్లాలోని టంగుటూరు, మర్రిపూడి, రాచర్ల, సీఎస్పురం మండలాల్లో సీ్త్రల నిష్పత్తి తక్కువగా ఉందని, వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఆయా మండలాలపై ఎక్కువగా దృష్టిసారించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం గర్భస్థ లింగనిర్ధారణ చట్టంపై అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 186 స్కానింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. జిల్లాలోని మూడు డివిజన్లలోని స్కానింగ్ సెంటర్లను పరిశీలించి అక్కడ పనిచేసే వైద్యుల విద్యార్హత, సెంటర్ డాక్యుమెంట్ల వివరాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. తల్లి గర్భంలోని శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మాత్రమే స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి స్కానింగులు చేయరాదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా లింగనిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే మూడేళ్ల జైలుశిక్షతో పాటుగా లక్ష రూపాయల జరిమానా విధిస్తారని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారు, చేయించుకున్న వారు శిక్షకు గురవుతారని తెలిపారు. స్కానింగ్ సెంటర్కు వచ్చే గర్భిణుల వివరాలను ఎఫ్ ఫారంలో ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. సమావేశంలో అడ్వైజరీ కమిటీ సభ్యులు డా.సంధ్యారాణి, డా.తిరుపతిరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, డీపీఆర్ఓ మోహన్ రాజు, ఐద్వా సెక్రటరీ కె.రమాదేవి, జిల్లా ఆరోగ్య విస్తరణ అధికారి బెల్లం నరసింహారావు, డిప్యూటీ డెమో సరోజిని పాల్గొన్నారు. -
మండలాలు పంచుకొని..
అధికారంలోకి వచ్చిన మరుక్షణం పచ్చ మాఫియా బరితెగించింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు సహజ వనరుల్ని ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. కొండల్ని పిండిచేస్తూ..చెరువుల్ని గుల్ల చేస్తూ కాసుల వేట సాగిస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఈ గ్రావెల్ మాఫియాకు అడ్డేలేకపోవడంతో మట్టిని యథేచ్ఛగా తరలించేస్తున్నారు. ఈ అక్రమాలకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అక్రమాలకు చెక్ పెట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం అవినీతిలో కూరుకుపోయి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.దరగ సమీపంలో మట్టి తోలడంతో చదునుగా మారిన కొండబేస్తవారిపేట: గిద్దలూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో, చెరువుల్లో భారీ వాహనాలతో తవ్వకాలు చేస్తూ సహజ వనరుల్ని చెరబడుతున్నారు. వ్యవసాయ భూముల చదును, లేఅవుట్లు, గృహ నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం నిత్యం విచ్చలవిడిగా గ్రావెల్ను తరలిస్తున్నారు. అనుమతులు లేని తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. రేయింబవళ్లు తరలింపు.. గిద్దలూరు మండలంలోని కేఎస్ పల్లి సమీపం రైల్వేట్రాక్ వద్ద, యడవల్లి సమీపంలోని కొండలు, తిప్పల నుంచి అక్రమంగా మట్టి రవాణా జరుగుతోంది. కంభం, అర్ధవీడు మండలాలకు అర్ధవీడు మండలంలోని నాగులవరం కొండ నుంచి, కంభం మండలంలోని చిన్నకంభం, ఎల్కోటలలోని కొండలను జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లతో యథేచ్ఛగా మట్టి రవాణా చేస్తున్నారు. బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం సమీపంలోని జగనన్న లేఅవుట్ పై ఎత్తున, చెట్టిచర్ల సమీపంలో, దరగ కొండపై నిత్యం గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పెంచికలపాడు చెరువు మట్టి ఇటుకల బట్టీలకు బేస్తవారిపేట, కొమరోలు మండలాలకు అక్రమంగా తరలిస్తున్నారు. అసరమైనప్పుడు జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నారు. భారీగా ట్రాక్టర్లు పెట్టి వందల ట్రిప్పులు ఇటుకల బట్టీలకు తీసుకెళ్తున్నారు. కొమరోలు మండలంలోని పామూరుపల్లె గ్రామ సమీపంలో రాష్ట్రీయ రహదారికి సమీపంలో అక్రమ మట్టి తోలకాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రుల వేళ అక్రమంగా మట్టితోలకాలను యథేచ్ఛగా చేపడుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీ సహాయంతో ట్రాక్టర్ల ద్వారా మట్టి మాఫియా వివరాలను స్థానికులు సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకో..ముడుపులకో తలొగ్గిన అధికారులు ఫిర్యాదులొచ్చినా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే పలు కొండల రూపురేఖలు మారిపోయాయి. మట్టిని అడ్డగోలుగా తరలించేస్తుండడంతో చాలా కొండలు చదునుగా మారిపోయాయి. తిప్పలు అయితే మాయమైపోయాయి. ఈ అక్రమాలను అడ్డుకట్టవేయాల్సిన ప్రభుత్వ శాఖలు అవినీతిలో కూరుకుపోయాయి. మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, పోలీస్ వ్యవస్థలు అన్నీ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయి. ఎక్కడ ఏ తవ్వకాలు జరుగుతున్నా అధికార పార్టీ నేతల అనుచరులతో పాటు ఆయా శాఖల అధికారుల సహకారం ఉంటోంది. వందలాది వాహనాల్లో తరలింపు.. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రోజూ వందలాది ట్రాక్టర్లలో మట్టిని తరలించేస్తున్నారు. రోజూ 300 నుంచి 350 ట్రాక్టర్లలో సహజ సంపదను తరలిస్తున్నారని తెలుస్తోంది. గతంలో రూ.400 లకు దొరికే ట్రాక్టర్ మట్టి నేడు రూ.700లకు పైగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ట్రాక్టర్పై దాదాపు రూ.300 వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. అక్రమార్కులు తమ జేబులు నింపుకుంటూ ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే సహజ సంపదను దోచేస్తూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. గతంలో రియల్ ఎస్టేట్, గృహాలు నిర్మించుకునే సమయంలో, ప్లాట్లను చదును చేసుకోవడానికి, గ్రావెల్ రోడ్లకు అందుబాటులో ఉన్న చోటు నుంచి గ్రావెల్ను ట్రాక్టర్ యజమానులు తెచ్చేవారు. నేడు ప్రతి మండలంలో ఒకరు–ఇద్దరు టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే అప్పగించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి కనుసన్నల్లోనే మట్టి సరఫరా జరగాలి. అధికారులు సైతం వీరు చెప్పినట్టే నడవాలి అన్న రీతిలో దోపిడీ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా వ్యక్తిగత అవసరాలకు తెచ్చుకున్నా వీరికి కప్పం కట్టాల్సిందే. లేదంటే అధికారులను ఉసిగొల్పి వారిపై కేసులు నమోదు చేయిస్తున్నారు. -
ఇన్చార్జి ఎస్పీగా ఉమామహేశ్వర్
ఒంగోలు టౌన్: జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు వ్యక్తిగత పనులపై సెలవు మీద వెళ్లారు. నేటి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో ఇన్చార్జి ఎస్పీగా బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ను నియమిస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి బాపట్ల ఎస్పీ ఇన్చార్జిగా విధులు నిర్వహించనున్నారు. దొనకొండ: 69వ స్కూల్ గేమ్స్ అండర్ 17 జిల్లా సెలక్షన్స్ ఒంగోలు నవోదయ పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్కు కేజీబీవీ విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్ 17 జిల్లా సెలక్షన్లో కె.నాగమణి 9వ తరగతి 100 మీ పరుగు పందెంలో మొదటి స్థానం, అలాగే లాంగ్ జంప్లో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో 10వ తరగతి జోత్స్న నిలిచింది. 800 మీ.తో రెండో స్థానంలో 9వ తరగతి సిరి చందన నిలిచారు. 4 x 100 రిలే పరుగు పందెంలో నాగమణి, జోత్స్న, సిరిచందన, లక్ష్మీ ప్రణతి విజయం సాధించారు. ఈ నలుగురు 24, 25 తేదీల్లో పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయురాలు గీతాకళ్యాణి తెలిపారు. వారిని ప్రత్యేకాధికారి జి.మమత, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. ఒంగోలు సబర్బన్: స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి, నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి ‘ధార్తీ మాతా బచావో అభియాన్’ కార్యక్రమం కింద ‘ధార్తీ మాతా బచావో నిగ్రాణి సమితి’ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పీ.రాజాబాబు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో శుక్రవారం అధికారులతో సమావేశమయ్యారు. ‘ధార్తీ మాతా బచావో అభియాన్’ విధివిధానాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి, నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. నిర్దేశించిన విధంగా గ్రామ, సబ్ డివిజన్, జిల్లా స్థాయిలో ధార్తీ మాతా బచావో నిగ్రాణి సమితులను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి సుభాషిణి, మార్క్ఫెడ్ అధికారి హరికృష్ణ, జిల్లా సహకార శాఖాధికారి శ్రీలక్ష్మి, ఫెర్టిలైజర్స్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ అన్నారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్ మంజూరు కోసం శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ల మంజూరులో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గ్రీవెన్స్లో పలువురు దివ్యాంగులు తెలిపారని, దీనిపై స్పందించి ప్రత్యేకంగా ఈ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. 59 మంది తమ వివరాలు నమోదు చేసుకున్నట్లు చెప్పారరు. ఇందులో రవాణా శాఖ సిబ్బంది ఆన్లైన్ ద్వారా ఎల్ఎల్ఆర్, లైసెన్స్ స్లాట్లను బుక్ చేస్తారన్నారు. ఈ సౌకర్యాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువార్త, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాన్ని ఆపాలి
చీమకుర్తి: ప్రభుత్వ స్థలంలో టీడీపీ నాయకుడు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని ఆపాలని వైఎస్సార్సీపీ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి శుక్రవారం చీమకుర్తిలోని నెహ్రూ నగర్లో అక్రమ నిర్మాణాన్ని పరిశీలించారు. చీమకుర్తిలో టీడీపీకి చెందిన ఒక నాయకుడు మెప్మా క్యాంటీన్ పేరుతో ప్రభుత్వ స్థలాన్ని స్వాహా చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. భూ కబ్జా బాగోతాన్ని ఏకంగా అధికారుల అండతోనే నడిపిస్తున్నాడని ఆరోపించారు. తక్షణమే అక్రమ నిర్మాణాన్ని ఆపకపోతే వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున దృష్టికి తీసుకెళ్లి, ప్రజాసంఘాలతో కలిసి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భూ కబ్జాపై కమిషనర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గోపురపు చంద్ర, దుడ్డు మార్కు, తెల్లమేకల యల్లయ్య, బత్తుల మల్లికార్జున, స్థానికులు పాల్గొన్నారు. -
స్కార్పియో బోల్తా పడి వృద్ధురాలి మృతి
బద్వేలు అర్బన్ : పట్టణానికి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్హెచ్–67 బైపాస్ రోడ్డులో శుక్రవారం రాత్రి అదుపు తప్పి స్కార్పియో వాహనం బోల్తా పడిన ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సిరిగిరి పెద్దలక్షుమ్మ (85) తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరులో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే గ్రామంలో శనివారం రాత్రి తమ సమీప బంధువుల శుభకార్యం ఉండటంతో.. కుటుంబ సభ్యులంతా కారులో స్వగ్రామానికి బయలుదేరారు. గూడెం, గుంతపల్లె మార్గంమధ్యలోని ఎన్హెచ్–67 బైపాస్ రోడ్డులోకి వచ్చేసరికి ఎదురుగా.. కుక్క అడ్డురావడంతో సడన్గా బ్రేక్ వేశారు. దీంతో వాహనం ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో పెద్దలక్షుమ్మ తీవ్ర గాయాల పాలైంది. వెంటనే స్థానికుల సహకారంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వాహనంలోని మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అర్బన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
బాలికలతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన వాస్తవమే
కురిచేడు: బాలికలతో ఉపాధ్యాయుడు పి.సురేష్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విచారణలో నిర్ధారణ అయిందని ఎంఈఓ ఆర్.వస్త్రాంనాయక్ వెల్లడించారు. శుక్రవారం ఆయన ఎంఈఓ–2 సీహెచ్ సుబ్బారావుతో కలిసి కురిచేడు మండలంలోని కల్లూరు గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పాఠశాలలో విచారణ చేపట్టారు. బాధిత బాలికలతోపాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. రెండో తరగతి విద్యార్థినులతో సైతం అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఆయన తిన్న కంచాలు కడిగించేవాడని, పాఠశాలలో జరిగిన విషయాలు ఇంటి వద్ద చెబితే కొడతానని తమ పిల్లలను బెదిరించాడని తల్లిదండ్రులు వివరించారు. ఇదిలా ఉండగా తమ కుమారుడిని తీవ్రంగా కొట్టడం వల్ల శరీరంపై వాతలు పడ్డాయని, తలకు కూడా దెబ్బ తగిలిందని తల్లిదండ్రులు ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించిన ఎంఈఓ జిల్లా విద్యాశాఖ ఉన్నతాదికారులకు నివేదిక పంపనున్నట్లు తెలిపారు. కాగా సదరు ఉపాధ్యాయుడు గతంలో కూడా అసభ్య ప్రవర్తనతో ఒకసారి, విద్యార్థిని కొట్టి మరోసారి సస్పెండ్ అయినట్లు సమాచారం. వరుస ఘటనలతో తల్లిదండ్రుల బెంబేలు మండలంలోని పాఠశాలల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు విద్యా వ్యవస్థ తీరుకు అద్దం పడుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో పడమరనాయుడుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినితో అక్రమ సంబంధం నెరిపి సస్పెండయ్యాడు. మరో ఉపాధ్యాయుడు వీవై కాలనీలో వంట మనిషితో గొడవపడి విధులకు దూరమయ్యాడు. తాజాగా కల్లూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించి విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో పాఠశాలలకు తమ పిల్లలను పంపాలంటేనే తల్లిదండ్రులు పది సార్లు ఆలోచించుకుంటున్నారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ నుంచి జిల్లాకు వచ్చిన లేఖ ఎంఈఓ వస్త్రాంనాయక్ వెల్లడి కురిచేడు మండలంలోని కల్లూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినులతో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించడంపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ స్పందించింది. బాధితులకు న్యాయం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒంగోలు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా జడ్జి బీఎస్వీ హిమబిందును కల్లూరు పాఠశాలలో విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం చేయాలని సూచించింది. -
కాళ్లు మొక్కి.. కనికరించాలని వేడుకుని..!
ఒంగోలు సిటీ: పదోన్నతి కోసం దొడ్డి దారిని ఎంచుకున్న ఇద్దరు ఆర్అండ్బీ(రోడ్లు, భవనాల శాఖ) ఉద్యోగుల వ్యవహారం విజిలెన్స్ విచారణలో బట్టబయలు కావడంతో క్షమాపణ కోరుతూ ఉన్నతాధికారుల కాళ్లు మొక్కడం చర్చనీయాంశమైంది. విద్యార్హతకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించడమే కాకుండా ఏడాది నుంచి అదనపు జీతంతోపాటు ఇంక్రిమెంట్ పొందినట్లు అధికారుల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళ్తే.. కనిగిరి ఆర్అండ్బీ డివిజన్లో వల్లం పోలయ్య ప్రింటింగ్ టెక్నీషియన్గా, కొడవటి జోసెఫ్ అటెండర్గా పనిచేస్తున్నారు. పదోన్నతి పొందితే వేతనం పెరుగుతుందన్న ఆశతో ఇద్దరూ అడ్డదారి తొక్కారు. అనుకున్నదే తడవుగా పథక రచన చేశారు. సివిల్ ఐటీఐ కోర్సు చదవడం కోసం ఆర్అండ్బీ ఈఎన్సీ నుంచి రెండేళ్ల స్టడీ లీవ్ పొందారు. చీరాలలోని నరేంద్ర ఐటీఐ కాలేజీలో 2020–2022 బ్యాచ్ కింద రెగ్యులర్ స్టూడెంట్స్గా జాయిన్ అయ్యారు. సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత తమ పథకాన్ని అమలు చేశారు. తమ చదువు పూర్తయిందంటూ తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఆర్అండ్బీ అధికారులకు సమర్పించారు. గుడ్డిగా నమ్మేసిన అధికారులు తదుపరి తంతు ముగించారు. తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయి ఆ తర్వాత 13 నెలలకు వేతనం డ్రా చేశారు. అదే సమయంలో చదివినట్లుగా సర్టిఫికెట్, రికార్డ్స్ సృష్టించి, వాటితోనే పదోన్నతి కోసం దరఖాస్తు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు తమ డైరెక్టర్ జనరల్కు నివేదిక ఇచ్చారు. జిల్లా ఆర్అండ్బీ ఎస్ఈ నుంచి ఆ ఇద్దరు ఉద్యోగుల పూర్తి రికార్డులు, ఐటీఐ రెగ్యులర్ కోర్సు చదివిన సమయంలో జీతాలు డ్రా చేసిన బిల్లులు తెప్పించుకున్న ఒంగోలు విజిలెన్స్ అధికారులు.. సర్టిఫికెట్లు నకిలీవని తేల్చారు. దీంతో ఆ ఇద్దరు ఉద్యోగులు జిల్లా విజిలెన్స్ కార్యాలయానికి చేరుకుని అధికారుల కాళ్లు మొక్కి మన్నించాలని వేడుకోగా ససేమిరా అన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వల్లం పోలయ్య గతంలోనూ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్తో అటెండర్ నుంచి ప్రింటింగ్ టెక్నీషియన్(బీపీఓ)గా పదోన్నతి పొందినట్లు డీఎస్పీ విచారణలో తేలడంతో సస్పెండ్ చేశారు. అయితే కోర్టు స్టే ఆర్డర్తో ప్రస్తుతం అదే ఉద్యోగంలో కొనసాగుతున్న పోలయ్య పదోన్నతి కోసం అడ్డదారులు తొక్కి అధికారులకు దొరికిపోయారు. దీనిపై ఆర్అండ్బీ ఎస్ఈ రవినాయక్ను వివరణ కోరగా.. ‘ఇద్దరు ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లతో అక్రమంగా పదోన్నతి పొందిన మాట వాస్తవం. దీనికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు విచారిస్తున్నారు’ అని తెలిపారు. -
పచ్చ తమ్ముళ్లకే ప్రజా దర్బార్!
యర్రగొండపాలెం: ప్రజా దర్బార్ అనే మాటకు అర్థాన్నే మార్చేశారు యర్రొగొండపాలెం టీడీపీ నాయకులు. కేవలం టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరుల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో సామన్యులెవరికీ చోటివ్వలేదు. టీడీపీ నాయకులతో కలిసి వెళ్లిన తెలుగుతమ్ముళ్లు తమ సమస్యలను పరిష్కరించుకున్న తీరు చూసి నియోజకవర్గ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు గొప్పలు చెప్పిన టీడీపీ ముఖ్య నాయకులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పంచాయతీ, మండల రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాలు, ఆయా ప్రాంతాల్లో ఉన్న సచివాలయాల్లో అధికారుల సమక్షంలో నిర్వహించాల్సిన ప్రజాదర్బార్ను టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేయడంతో అర్జీదారులు ఆ ఛాయలకు వెళ్లే సాహసం చేయలేదు. వైపాలెం ఎంపీడీఓ బి.శ్రీనివాసులు టీడీపీ కార్యాలయంలో ఎటువంటి అర్హత లేని ఆ పార్టీ నేతలతో కలిసి కూర్చుని అర్జీలు స్వీకరించడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా.. ప్రజా సమస్యలకు టీడీపీ కార్యాలయంలో ఎలా న్యాయం జరుగుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజా దర్బార్లో ఏ సమస్యలపై ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు, టీడీపీ కార్యాలయంలో కార్యక్రమం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనే విషయమై ఎంపీడీఓను వివరణ అడిగేందుకు ప్రయత్నించగా శుక్రవారం ఆయన ఫోన్ స్విచాఫ్లో ఉంది. -
రోడ్డంతా విస్తరిస్తే సరే.. అంబేడ్కర్ బొమ్మ దగ్గరైతే కుదరదు
టంగుటూరు: రోడ్డు విస్తరణ పేరుతో ఎస్సీ కాలనీలో ఒకలా.. మిగిలిన చోట్ల మరోలా వ్యవహరించడం సరికాదని టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెం ఎస్సీ కాలనీ వాసులు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న ఎదుట అభిప్రాయం వెలిబుచ్చారు. గ్రామంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసే క్రమంలో పంచాయతీ కార్యదర్శి జాన్ బాషా తీరుతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జెడ్పీ సీఈఓ చిరంజీవి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, పంచాయతీరాజ్ ఈఈ విజయ్ కుమార్, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుతో కూడిన బృందం శుక్రవారం అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణాన్ని పరిశీలించారు. రోడ్డు విస్తరణ పేరుతో అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణాన్ని ఆక్రమించాలని చూశారని, పెత్తందారులు తమపై వివక్ష చూపుతున్నారని అధికారులకు కాలనీ వాసులు వివరించారు. రోడ్డు మొత్తం 30 అడుగుల మేర విస్తరించుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదని, అలా కాకుండా అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం వద్ద మాత్రమే విస్తరిస్తామనడం న్యాయబద్ధం కాదని తేల్చిచెప్పారు. విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఆర్డీఓ స్పందిస్తూ.. విచారణ నివేదికను కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. సీఐ హజరత్తయ్య, ఎస్సై నాగమల్లేశ్వరరావు, ఎంపీడీఓ దేవసేన కుమారి తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓకు స్పష్టం చేసిన కాకుటూరివారిపాలెం ఎస్సీ కాలనీ వాసులు -
నేడు మార్కాపురంలో కోర్టు భవనాలు ప్రారంభం
మార్కాపురం: మార్కాపురంలోని కోర్టు సముదాయంలో నూతనంగా నిర్మించిన ఆరో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాలను శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్సింగ్ ఠాగూర్ వర్చువల్ విధానంలో ప్రారంభించనుండగా కార్యక్రమానికి హైకోర్టు జడ్జిలు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, గన్నమనేని రామకృష్ణప్రసాద్, వై.లక్ష్మణరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.భారతి, మార్కాపురం 6వ అదనపు న్యాయమూర్తి ఎం.శుభవాణి హాజరుకానున్నారు. వీరితోపాటు జిల్లాలోని వివిధ కోర్టుల్లో పనిచేసే న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొంటారని మార్కాపురం బార్ అసోసియేషన్ కమిటీ ప్రతినిధులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సింగరాయకొండ: మండల కేంద్రంలోని ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆదివారం నుంచి 25వ తేదీ వరకు బాలబాలికలకు రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు కాలేజి ప్రిన్సిపాల్ ఎం.సౌజన్య తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లా జిల్లాల నుంచి బాలబాలికలు సుమారు 250 మంది రానున్నారని, వీరికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. క్రీడల నిర్వహణకు 4 కోర్టులు సిద్ధం చేశామని పీడీ శంకరరావు తెలిపారు. కనిగిరిరూరల్: పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పొదిలి మండలం అక్కచెరువు గ్రామానికి చెందిన బోగాని సురేష్(25) అయ్యప్ప మాల ధరించి ఉన్నాడు. అతని స్నేహితుడితో కలిసి ఈ నెల 19న సీఎస్పురం మండలంలోని భైరవకోన, నారాయణ స్వామి ఆలయాలను సందర్శించారు. అదేరోజు రాత్రి తిరిగి కనిగిరి మండలం నందనమారెళ్ల సమీపంలో గుడి వద్ద నిద్రిస్తుండగా.. సురేష్ పాము కాటుకు గురయ్యాడు. హుటాహుటిన పొదిలి ఆస్పత్రికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకుని, మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఓ వైద్యశాలలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై టి.శ్రీరామ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. గిద్దలూరు రూరల్: లారీ ఢీకొనడంతో వెనుక చక్రాల కింద పడిపోయిన ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ సంఘటన గిద్దలూరు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. గిద్దలూరు మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన కాశయ్య(59) రోడ్డుపై నడిచి వెళ్తున్నాడు. అదే సమయంలో నంద్యాల నుంచి ఒంగోలు వైపు ప్రయాణిస్తున్న లారీ ఆయన పక్క నుంచి దూసుకెళ్లింది. వెనుక టైర్ల కిందపడిపోయిన కాశయ్య తీవ్రగాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒంగోలు టౌన్: ఔషధ నియంత్రణ శాఖ ఇన్స్పెక్టర్గా ఉషారాణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె మార్కాపురం డ్రగ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న రామమూర్తి పదోన్నతిపై బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఉషారాణి బాధ్యతలు చేపట్టారు. నూతన డీఐని ది ఒంగోలు రిటైల్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకారెడ్డి, ప్రధాన కార్యదర్శి కూరపాటి సత్యనారయణ, కోశాధికారి ఏడుకొండలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. -
యాంటిబయాటిక్స్ విచ్చలవిడి వాడకం ప్రమాదం
ఒంగోలు టౌన్: విచ్చలవిడిగా యాంటిబయాటిక్స్ వాడకం వలన శరీరంలో డ్రగ్ రెసిస్టెంట్గా మారి వ్యాధులు త్వరగా నయం కాకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్ చెప్పారు. ప్రపంచ మైక్రోబియల్ అవగాహనా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మెడికల్ కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యుల సలహా, సూచనలేకుండా యాంటిబయాటిక్స్ వాడరాదని చెప్పారు. ఒంగోలు మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 24 వరకు వారోత్సవాలు నిర్వహించన్నుట్లు తెలిపారు. ఇందులో భాగంగా బాధ్యతాయుత యాంటిబయాటిక్స్ వినియోగం, పెరుగుతున్న ఏఎంఆర్ ప్రమాదాలు, ఓన్ హెల్త్ దృక్పథంతో దాన్ని ఎదుర్కొనే విధాలనాల గురించి వివరించారు. ఈ అంశాల గురించి విద్యా సదస్సులు, ఇంటరాక్టివ్ కార్యక్రమాలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు మాట్లాడుతూ వైద్యులు, వైద్య విద్యార్థులు, సాధారణ ప్రజల్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సమస్యలపై అవగాహన కల్పించడం భవిష్యత్తు తరాల ఆరోగ్య రక్షణలో భాగమని చెప్పారు. యాంటీబయాటిక్స్ వాడకం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, హెచ్ఓడీ దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. పొదిలి: ఇంటికి తాళం వేస్తున్న సమయంలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు లాక్కెళ్లిన సంఘటన శుక్రవారం రాత్రి పొదిలిలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక సబ్ స్టేషన్ రోడ్డులో ఈశ్వరమ్మ అనే మహిళ నివాసం ఉంటోంది. సమీపంలోనే నివాసం ఉంటున్న తన కూతురు వద్దకు వెళ్లేందుకు ఇంటికి తాళం వేస్తుండగా ఓ యువకుడు మెరుపు వేగంతో వచ్చి ఈశ్వరమ్మ మెడలోని గొలుసు లాక్కుని పరుగు తీశాడు. చుట్టుపక్కల వారు స్పందించేలోగా దొంగ ఉడాయించాడు. నాలుగు సవర్ల బంగారు గొలుసు లాక్కెల్లాడని ఈశ్వరమ్మ కన్నీటి పర్యంతమైంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. జనం రద్దీగా ఉన్న ప్రాంతంలో చైన్ స్నాచింగ్ జరగడంతో స్థానిక మహిళలు ఆందోళన చెందుతున్నారు. -
సిగరెట్ కోసం.. హోంగార్డుల డిష్యుం డిష్యుం!
ఒంగోలు టౌన్: పూటుగా మద్యం తాగిన ఇద్దరు హోంగార్డులు సిగరెట్ తాగే విషయంలో చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ క్రమంలో ఒక హోంగార్డు తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సాగర్ కవచ్ బందోబస్తు విధుల్లో భాగంగా పెద్దారవీడు పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న షేక్ యాసిన్, దోర్నాల పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న తంగిరాల ప్రశాంత్ కుమార్, వెలిగండ్ల పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న చెరుకూరి బాల సుబ్రహ్మణ్యం గురువారం ఒంగోలు వచ్చారు. డ్యూటీ అనంతరం రాత్రి బస చేసేందుకు నగరంలోని ఒక లాడ్జిలో గది తీసుకున్నారు. ముగ్గురూ కలిసి పూటుగా మద్యం తాగారు. ఈ క్రమంలో సిగరెట్ విషయమై ప్రశాంత్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో సుబ్రహ్మణ్యం కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎస్పీ హర్షవర్థన్ రాజు సీరియస్గా తీసుకున్నారు. పోలీసు ప్రతిష్టకు భంగం కలిగించిన హోంగార్డులపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ముగ్గురు హోంగార్డులను హెడ్ క్వార్టర్స్కు పిలిపించి విచారణ చేస్తున్నారు. ప్రశాంత్ కుమార్, బాల సుబ్రమణ్యంను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. ● బైకులు ఢీకొని రోడ్డుపై పడిపోయిన యువకులు ● గ్రానైట్ కంటైనర్ తొక్కడంతో ఒకరు మృతి ● చీమకుర్తి మండలం రెడ్డినగర్ సమీపంలో ప్రమాదం చీమకుర్తి రూరల్: రెండు బైకులు ఢీకొని రోడ్డుపై పడిపోయిన వ్యక్తుల మీదుగా గ్రానైట్ కంటైనర్ దూసుకెళ్లింది. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన చీమకుర్తి మండలం చీమలమర్రి సమీపంలోని రెడ్డినగర్ ఎన్ఎస్పీ కాలువ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. చీమకుర్తికి చెందిన సీహెచ్ ఏడుకొండలు(38), సంతనూతలపాడు మండలం ఎండ్లూరు గ్రామానికి చెందిన సతీష్ బైకులపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్ఎస్పీ కాలువ వద్ద బైకులు ఢీకొని పడిపోగా అదే సమయంలో వేగంగా వస్తున్న కంటైనర్ ఏడుకొండలును తొక్కుకుంటూ వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సతీష్ను సీఐ ప్రసాద్ నేతృత్వంలో చీమకుర్తి సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. మృతుడు ఏడుకొండలుకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆతని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. కంటైనర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఎల్కోటలో చోరీ
కంభం మండలంలోని ఎల్కోట గ్రామంలో ఓ గృహంలో 3 తులాల బంగారు సరుడును ఓ యువకుడు అపహరించాడు. అప్రమత్తమైన స్థానికులు ఆ యువకుడిని చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలు.. శివకుమారి అనే మహిళ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన సుబానీ అనే యువకుడు ఇంట్లోకి ప్రవేశించి బంగారు సరుడు, రూ.300 నగదును అపహరించి పారిపోయేందుకు యత్నించాడు. శివకుమారి కేకలు వేయడంతో స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని బంగారు సరుడును స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన గృహాన్ని గురువారం ఉదయం బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి పరిశీలించారు. దొంగతనానికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. కాగా ఆ యువకుడు గతంలో కూడా పలుమార్లు చోరీలకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. -
దుకాణాలు లూటీ
కంభం: కంభం పట్టణంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు చేతివాటం చూపారు. బస్టాండ్ పక్కనే ఉన్న రెండు ఎలక్ట్రికల్ షాపుల షట్టర్లు పగలగొట్టి లోపలికి ప్రవేశించి నగదు అపహరించారు. మరో దుకాణం షట్టర్ పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. బస్టాండ్ సమీపంలో మల్లికార్జున అనే వ్యక్తి నిర్వహిస్తున్న సాయిబాలాజీ ట్రేడర్స్ ఎలక్ట్రికల్ షాపు షట్టర్ పగలగొట్టిన దొంగ కౌంటర్లో ఉంచిన సుమారు రూ.4 వేల నగదు చోరీ చేశాడు. పక్కనే ఉన్న నారాయణ ఏజెన్సీస్ దుకాణం షట్టర్ పగలగొట్టి నగదు కోసం కౌంటర్ మొత్తం వెతికాడు. ఓ వ్యక్తి దుప్పటి చుట్టుకొని లోపలికి వెళ్లి వస్తున్న దృశ్యాలు దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ రెండు దుకాణాల మధ్యలో ఉన్న మరో షాపు షట్టర్ పగలగొట్టేందుకు విఫలయత్నం చేశాడు. చోరీ జరిగిన దుకాణాలను బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి పరిశీలించి యజమానులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మార్కాపురం నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. కంభం బస్టాండ్ వద్ద 2 షాపుల షట్టర్లు పగలగొట్టి చోరీ మరో దుకాణంలో చోరీకి విఫలయత్నం ఎల్కోట గ్రామంలో 3 తులాల బంగారు సరుడు దొంగిలించిన యువకుడు పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు దర్శిలో బుధవారం అర్ధరాత్రి 4 దుకాణాల్లో చోరీ బెంబేలెత్తుతున్న చిరు వ్యాపారులు దర్శి: దర్శి పట్టణంలో బుధవారం అర్ధరాత్రి వరుస దొంగతనాలు చోటుచేసుకున్నాయి. చిల్లర దుకాణాలను, నివాసాల ముందు పార్క్ చేసిన బైకులను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. స్థానిక అద్దంకి రోడ్డులో పేరమ్మ అనే మహిళ నిర్వహిస్తున్న దుకాణం తాళాన్ని పగలగొట్టి సరుకులు, రూ.6 వేలకు పైగా నగదు అపహరించారు. అలాగే వసంత్ అనే వ్యక్తికి చెందిన దుకాణంలో నగదు, ఇతర సామగ్రి, హైమవతికి చెందిన దుకాణంలో కొంత నగదు చోరీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురు మూలె కొండారెడ్డి అనే వ్యక్తి పార్క్ చేసి ఉంచిన హోండా షైన్ బైక్ను దొంగలు అపహరించారు. మొత్తం రూ.లక్షకు పైగా విలువ చేసే సామగ్రి పోయినట్లు సమాచారం. -
బిర్యానీ లేదంటావా.. నీ అంతు చూస్తాం
తాళ్లూరు: పూటుగా మద్యం మత్తులో రెస్టారెంట్కు వచ్చిన ఇద్దరు యువకులు బిర్యానీ అడగగా యజమాని అయిపోయిందని చెప్పడంతో మొదలైన వివాదం చినికిచినికి గాలివానలా మారింది. ఈ వివాదంలో బాధితుడైన రెస్టారెంట్ యజమాని వెంకటరెడ్డిపైనే తాళ్లూరు పోలీసులు కేసు బనాయించడం తాజాగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో పుట్లూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి వీఆర్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి 11.30 గంటలకు రెస్టారెంట్ ఫుడ్ కౌంటర్ మూతవేసిన సమయంలో అదే గ్రామానికి చెందిన ఎదురూరి నాగార్జునరెడ్డి, చింతంరెడ్డి శివారెడ్డి మద్యం మత్తులో అక్కడికి వచ్చారు. రెస్టారెంట్ ముందు భాగంలో మైకం ఎక్కువై బైక్ మీద నుంచి పడిపోయారు. స్థానికుల సాయంతో లోపలికి వెళ్లిన ఇద్దరు యువకులు బిర్యానీ అడిగారు. తినేందుకు ఏమీ లేవని యజమాని చెప్పడంతో అసభ్య పదజాలంతో దూషించారు. ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించడంతో దాడికి యత్నించారు. నీ అంతు తేలుస్తాం. శ్రీమాకే బిర్యానీ లేదంటారా మేమేందో చూపిస్తాంశ్రీ అని దూషిస్తూ వెళ్లిపోయారు. మద్యం మత్తులో ఉన్నారు కదా అని యజమాని ఎటువంటి ఫిర్యాదు చేయకుండా తేలికగా తీసుకున్నారు. అయితే మంగళవారం రాత్రి 10.30 గంటలకు నాగార్జునరెడ్డితోపాటు మరో 11 మంది మారణాయుధాలతో రెస్టారెంట్లోకి ప్రవేశించి ముందుగా సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వెంకటరెడ్డిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అడ్డు వచ్చిన వంటమాస్టర్ భీము, సప్లయర్ మనోజ్పై కూడా దాడి చేసి గాయపరిచారు. తీవ్ర గాయాలైన వెంకటరెడ్డిని ఒంగోలు జీజీహెచ్కు తరలించగా, వర్కర్లకు స్ధానిక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందించారు. నిందితులంతా టీడీపీకి చెందిన వారు కావడంతో కేసు నమోదు చేయకుండా ఎస్సై తాత్సారం చేసినట్లు బాధితుడు వెంకటరెడ్డి ఆరోపించారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీ ఇచ్చినా తనపైనే తప్పుడు ఫిర్యాదులు చేయించి కేసు నమోదు చేశారని వాపోయాడు. దాడి ఘటనపై ఎస్పీ హర్షవర్థన్రాజుకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా, తాళ్లూరు ఎస్సై వ్యవహరిస్తున్న తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. సామాన్యులు పోలీస్ స్టేషన్కు రావాలంటేనే బెంబేలెత్తుతున్న పరిస్థితి. ఎస్సైకి ఇటీవల ఎస్పీ షోకాజ్ నోటీసులిచ్చి విచారణకు ఆదేశించినా ఆయన తీరు మారలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో రెస్టారెంట్ యాజమానిపై 11 మంది దాడి ఆర్థికంగా ఎదగడాన్ని జీర్ణించుకోలేక దాడి చేశారన్న బాధితుడు వెంకటరెడ్డి నిందితుల ఫిర్యాదుతో తప్పుడు కేసు నమోదు చేశారని ఎస్సైపై ఆరోపణ -
న్యాయవాది ఇంటిపై టీడీపీ నేతల దౌర్జన్యం
దర్శి: అధికారమే అండగా టీడీపీ నేతలు రోజురోజుకూ బరితెగిస్తున్నారు. దర్శిలో న్యాయవాది మారం రాజశేఖరరెడ్డి ఇంటిపై గురువారం టీడీపీ మూకలు దౌర్జన్యానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితుడి కథనం మేరకు.. రాజశేఖరరెడ్డి తన కుమార్తె వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ నాయకులు డీఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్న రాజశేఖరరెడ్డి స్థలాన్ని ఆక్రమించేందుకు స్కెచ్ వేశారు. ఇంటి వద్దకు చేరుకున్న టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తిస్తుండగా.. సామరస్యంగా మాట్లాడాలని, కుమార్తె వివాహ పనుల్లో ఉన్నానని న్యాయవాది సూచించారు. వివాహమైన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని చెబుతున్నా టీడీపీ నేతలు అదేమీ పట్టించుకోకుండా ఇప్పుడే చర్చించాలంటూ పట్టుబట్టారు. అందుకు న్యాయవాది ససేమిరీ అనడంతో గొడవకు దిగిన టీడీపీ నేతలు.. శ్రీనీ కుమార్తె వివాహం ఎలా చేస్తావో చూస్తాంశ్రీ అంటూ బెదిరించారు. ఆ తరువాత పోలీస్స్టేషన్కు చేరుకుని న్యాయవాదిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేలా పోలీసు అధికారులతో టీడీపీ నేతలు మంతనాలు సాగించారన్న చర్చ స్థానికంగా జోరుగా నడుస్తోంది. టీడీపీ ముఖ్యనేత ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు నడుచుకుంటున్నారని, తనపై కేసులు బనాయించేందుకు కుట్ర చేస్తున్నారని న్యాయవాది రాజశేఖరరెడ్డి ఆరోపించారు. ● సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి ● ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజుకు వీఏఏల విజ్ఞప్తి మార్కాపురం: గ్రామ రైతు సేవా కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వ్యవసాయ సహాయకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుకు వీఏఏల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జక్కి గణేష్ సాగర్ విజ్ఞప్తి చేశారు. గురువారం బొప్పరాజు తన స్వగ్రామమైన మీర్జపేటకు రాగా పలువురు వీఏఏలు కలిసి సమస్యలు వివరించారు. బదిలీల పేరుతో కొందరు ఉద్యోగులను జిల్లాలు దాటించారని, సుమారు 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్ఎస్కేలకు బదిలీ చేయడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, ఇతర సమస్యలపై జేఏసీ సమావేశంలో చర్చిస్తామని బొప్పరాజు హామీ ఇచ్చారని సాగర్ తెలిపారు. కుమార్తె వివాహం ఎలా చేస్తావో చూస్తామంటూ బెదిరింపులు అట్రాసిటీ కేసు బనాయించేందుకు పోలీసులపై తీవ్ర ఒత్తిడి స్థలాన్ని కబ్జా చేసేందుకు స్కెచ్ వేశారని న్యాయవాది ఆరోపణ -
మెడికల్ కాలేజీలు కట్టలేవా చంద్రబాబూ?
ఒంగోలు టౌన్: ప్రపంచ స్థాయిలో అమరావతి రాజధాని నిర్మిస్తామంటూ గొప్పలు చెబుతున్న సీఎం చంద్రబాబుకు మెడికల్ కాలేజీలు నిర్మించడం చేతకాదా అని ప్రగతిశీల విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ ప్రశ్నించారు. వైద్య, విద్యారంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవాలని రాజ్యాంగంలో రాసుకున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఏర్పాటుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు వచ్చాయని, వాటిలో 5 కాలేజీల నిర్మాణం పూర్తి చేసి తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మిగిలిన కాలేజీలను పూర్తిచేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. నారా లోకేష్ యువగళంలో ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించి నిర్వాహించాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 107, 108, 590ను రద్దు చేసి అర్హులైన విద్యార్థులు వైద్య విద్య చదివే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం దిగిరాకుంటే విద్యార్థి సంఘాలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అమరావతి, విశాఖపట్నంలో ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైద్య విద్యను అంబానీ, అదానీలకు అప్పగించేందుకే చంద్రబాబు ప్రభుత్వం తహతహలాడుతోందని ఆరోపించారు. ప్రైవేటీకరణపై మక్కువ పెంచుకున్న కూటమి పాలకులకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సీహెచ్ సిసింద్రి బాబు, వి.కోటి, శాంసన్, చంద్రశేఖర్, సచిన్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు రూరల్: పట్టణంలో మద్యం మత్తులో వాహనం నడిపిన ఓ వ్యక్తికి గిద్దలూరు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి భరత్చంద్ర 100 రోజుల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధించినట్లు సీఐ కె.సురేష్ గురువారం తెలిపారు. పట్టణంలో గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి మద్యం మత్తులో పట్టుబడ్డాడని, నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి శిక్ష విధించారని వివరించారు. మరి అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఎలా? వైద్య, విద్య రంగాలు ప్రభుత్వమే నిర్వహించాలని రాజ్యాంగంలో ఉంది కదా? కలెక్టరేట్ ఎదుట ధర్నాలో నిప్పులు చెరిగిన పీడీఎస్యూ నాయకులు పీపీపీ జీఓలు రద్దు చేయకుంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిక -
పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అజయ్బాబు
ఒంగోలు: జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మొలకలపల్లి అజయ్బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలేనికి చెందిన అజయ్బాబు గతంలో సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. మూడేళ్ల పాటు పీపీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయన్ను పలువురు న్యాయవాదులు అభినందించారు. ● కలెక్టర్ పి.రాజాబాబు ఒంగోలు సబర్బన్: పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి నూతన అక్రేడిటేషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా మీడియా అక్రేడిటేషన్ కమిటీ చైర్మన్ పి. రాజాబాబు తెలిపారు. గతంలో జారీ చేసిన అక్రేడిటేషన్ కార్డుల గడువు ఈ ఏడాది నవంబర్ 30 నాటికి ముగుస్తున్నందున నూతన అక్రిడిటేషన్స్ జారీ ప్రక్రియ చేపట్టామని చెప్పారు. అక్రేడిటేషన్లకు నిబంధనల మేర అర్హత కలిగిన పాత్రికేయుల దరఖాస్తులను ఆన్లైన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాన్నారు. మీడియా రిలేషన్స్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాత్రికేయులు సంబంధిత పత్రాల డాక్యుమెంట్లను పెన్డ్రైవ్లో పొందుపరిచి, జిరాక్స్ కాపీలను కూడా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. నవంబర్ 21వ తేదీ నుంచి ఆన్లైన్ వెబ్సైట్లో సూచించిన విధంగా సంబంధిత పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. దినపత్రికలు, వార, మాస పత్రికలకు పీఆర్జీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఏబీసీ, ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (మునుపటి రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్పేపర్స్ ఫర్ ఇండియా) ఎంప్యానెల్డ్ సీఏ సర్టిఫికెట్ కూడా జత చేయాలన్నారు. సంస్థ పాన్కార్డ్, రెండేళ్ల ఐటీ రిటర్నులు, పీఆర్జీఐకి సమర్పించిన వార్షిక రిటర్న్ల తాజా కాపీ సమర్పించాలన్నారు. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రెగ్యులేషన్ చట్టం 1995 కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (కేబుల్ ఛానెల్ల కోసం) ఏపీ ఫైబర్నెట్ నుంచి అధికార లేఖ కూడా ఇవ్వాలన్నారు. ఒంగోలు టౌన్: సముద్ర తీర భద్రతే ప్రధాన లక్ష్యమని ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. సముద్ర తీర భద్రతను పరిరక్షించడంతో పాటు ఉగ్ర దాడుల సమయంలో భద్రతా వ్యవస్థల ప్రతిస్పందన సామర్థ్యాన్ని అంచనా వేయడమే లక్ష్యంగా గురువారం జిల్లా వ్యాప్తంగా సముద్ర తీరంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్డ్రిల్లో భాగంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా మొత్తం 112 మంది పోలీసు సిబ్బంది, అధికారులు, మైరెన్ పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావును నోడల్ ఆఫీసర్గా నియమించినట్లు తెలిపారు. -
క్యాంటీన్ పేరుతో ఖాళీ స్థలంపై కన్ను
చీమకుర్తి: ఖాళీ స్థలం కనిపిస్తే దాన్ని ఏదోక విధంగా కొట్టేయాలని అధికార టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ పట్టణంలోని కర్నూలురోడ్డు ఫేసింగ్లో సర్వే నం.18/1బీలోని 36 సెంట్ల వాగుపోరంబోకు భూమే. ఈ వాగుపోరంబోకు భూమిలో 26 సెంట్లకు పైగా ఖాళీ స్థలం, 10 సెంట్ల విస్తీర్ణంలో గోడౌన్ నిర్మించి ఉంది. ఈ స్థలంపై కన్నేసిన టీడీపీ నాయకుడు మెప్మా క్యాంటీన్ పేరుతో స్వయం సహాయక సంఘాల గ్రూపులను అడ్డంపెట్టుకొని మెప్మా ద్వారా మంజూరు చేయించుకున్న తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నాడు. తొలుత మెయిన్ రోడ్డులో ఉన్న ఖాళీస్థలంలో మురుగు నీరు ప్రవహించే కాలువనూ పూడ్చి ప్లాట్ఫాం నిర్మించారు. ఆ స్థలంలో పెద్ద కంటైనర్ను క్యాంటీన్ పేరుతో పెట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలను చీమకుర్తి మున్సిపల్ పాలకవర్గం వ్యతిరేకించింది. మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి చంద్ర, కౌన్సిలర్లు చల్లా అంకులు, సోమా శేషాద్రి, బీమన వెంకట్రావు, తప్పెట బాబూరావు, బడే అయ్యపరెడ్డి, ఆముదాలపల్లి ప్రమీల రామబ్రహ్మం, గంగిరెడ్డి ఇందిరా సుందరరామిరెడ్డి, పొదిలి వెంకాయమ్మ కాశి, కె.ప్రతాప్రెడ్డి, పత్తి కోటేశ్వరరావు, ఎస్కే ఖాజాతో పాటు వైఎస్సార్ సీపీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, బూత్ కన్వీనర్ మంచా హరికృష్ణలు కమిషనర్ వై రామకృష్ణయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. మురుగు కాలువల ఆక్రమణలను తొలగించాలని, మెప్మా క్యాంటీన్ను వేరే ప్రదేశానికి తరలించాలని, విలువైన ప్రభుత్వ స్థలాన్ని, ఆస్తులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి మహిళా సమాఖ్య లీడర్ ఈర్ల తులసి, భవానీ మహిళా సమాఖ్య లీడర్ మారం సాయమ్మ పేర్లుతో రూ.14 లక్షలను మంజూరు చేయడంతో తృప్తి క్యాంటీన్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తొలివిడతగా మంజూరైన క్యాంటీన్ను చీమకుర్తి నెహ్రూనగర్లోని మెయిన్రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినిచ్చామని చెప్పారు. అయితే ఈ ఖాళీ స్థలం, గోడౌన్లో గతంలో సెరికల్చర్ డిపార్టుమెంట్ కార్యాలయం నిర్వహించారు. అనంతరం బీసీ హాస్టల్ విద్యార్థుల వసతి కోసం వినియోగించారు. బీసీ హాస్టల్ను వేరే ప్రదేశానికి తరలించడంతో ఖాళీగా ఉన్న స్థలం, గోడౌన్ను తమకు కేటాయించాలని రిటైర్డ్ ఉద్యోగులు అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దళిత సంఘాలు..సామాజిక భవనానికి కేటాయించాలని కోరుతున్నారు. ఈ స్థలానికి ఎదురుగా మెయిన్రోడ్డుపై పలువురు మహిళలు టిఫిన్ కొట్లు పెట్టుకొని జీవనం సాగిస్తూ మున్సిపాలిటీకి పన్నులు కూడా చెల్లిస్తున్నారు. వారిని కాదని అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునే ఉద్దేశంతో మెప్మా క్యాంటీన్ను అడ్డం పెట్టుకున్నారని వైఎస్సార్సీపీ మున్సిపల్ పాలవకర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. తక్షణమే మెప్మా క్యాంటీన్ను వేరే ప్రదేశానికి తరలించాలని, ప్రభుత్వానికి చెందిన ఆస్తులను రక్షించాలని కోరుతున్నారు. -
అడుగడుగునా ఉచ్చులు.. ఉసురు తీసే ప్రమాదాలు!
పెద్దదోర్నాల: నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వుడు నల్లమల ప్రాజెక్టులో మొత్తం 87 పెద్ద పులులున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. చిరుత పులులు మరో 200 నుంచి 205 వరకు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నల్లమల పరిధిలోని మార్కాపురం, నెక్కంటి, గంజివారిపల్లి, కొర్రపోలు, దోర్నాల, విజయపురిసౌత్, యర్రగొండపాలెం అటవీ రేంజీ పరిధిలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. అయితే వేటగాళ్ల ఉచ్చులు, రోడ్డు ప్రమాదాలతో పాటు అనారోగ్య సమస్యలతో నల్లమలలోని కొన్ని వన్యప్రాణుల మునుగడ ప్రమాదంలో పడుతోంది. ఇప్పటికే కొన్ని రకాల చిరుతలు అంతరించి పోగా, నమీబియా లాంటి దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నల్లమలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జీవుల్లో రెండో స్థానం చిరుత పులులది. వీటి జీవిత కాలం 12 నుంచి 15 ఏళ్లు మాత్రమే. పెద్దపులులు, చిరుతపులులు ఆహారం, నీళ్ల కోసం రోడ్లపైకి వచ్చి ప్రమాదాల బారినపడి మృత్యువాత పడుతున్నాయి. అటవీశాఖాధికారులు వన్యప్రాణుల సంరక్షణకు అన్నీరకాల చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.పెద్దపులులు, చిరుతలకు అడవిలోనే నీటి సమస్య లేకుండా సోలార్ సాసర్పిట్లు ఏర్పాటు చేసి నీటి సమస్య తీర్చారు. ఆహారం కోసం అవి సమీప గిరిజన ప్రాంతాల వైపు వస్తూనే ఉన్నాయి. బేస్ క్యాంపుల ఏర్పాటు.. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు బేస్ క్యాంప్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటి కదలికల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గంజివారిపల్లె సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంప్, ఇష్టకామేశ్వరి ఆలయం, దొరబైలు, నారుతడికల, పాలుట్ల, కొలుకుల, తుమ్మలబైలు, వెదురుపడియ, కొర్రపోలు, చినమంతనాల, రోళ్లపెంట తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంప్లు ఉన్నాయి. ఇందులో ఐదుగురు అటవీ అధికారులు ఉంటారు. అడవిలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు కొర్రపోలు, శిరిగిరిపాడు, దోర్నాల గణపతి గుడి వద్ద ఫారెస్ట్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 120 మంది ప్రొటెక్షన్ వాచర్లు పులుల సంరక్షణలో ఉన్నారు. శ్రీశైలం వెళ్లే భక్తులు, నల్లమల అటవీ అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటక ప్రేమికులు సౌకర్యవంతమైన ప్రయాణాలతో పాటు, నల్లమల అభయారణ్యంలో వణ్యప్రాణులు సురక్షితంగా సంచరించేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. వేగంగా ప్రయాణించే వాహనాలతో అవి ప్రమాదాలకు గురి కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. రోడ్డుకు ఓ వైపు నుంచి మరో వైపుకు వెళ్లే విధంగా అండర్ పాస్లు, ఓవర్ పాస్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారికి పై భాగంలో ఏర్పాటు చేసే వంతెన( ఓవర్ పాస్)లు, మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డుకు కింది భాగాన ఏర్పాటు చేసే బ్రిడ్జి (అండర్పాస్)ల ద్వారా వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే వీలుంటుందని వారు సూచిస్తున్నారు. వీటి ఏర్పాటుపై అటవీశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని మృత్యువాత -
పత్తి కొనుగోళ్లలో నిబంధనాలు
మార్కాపురం: సీసీఐ ఆధ్వర్యంలో మార్కాపురం మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం గురువారం అటు బయ్యర్లు.. ఇటు రైతులు లేక బోసిపోయింది. ప్రధానంగా పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం విధించిన నిబంధనలు రైతులకు అడ్డంకిగా మారాయి. దీంతో రైతులు తాము పండించిన పత్తిని యార్డుకు తీసుకురాలకే గ్రామాల్లో నే వ్యాపారులు చెప్పిన ధరకే విక్రయిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..ఈ నెల 17న మార్కాపురం మార్కెట్యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జేసీ, ఎమ్మెల్యే రఅట్టహాసంగా పారంభించారు. రెండు రోజుల పాటు పత్తి కొనుగోళ్లు సాగాయి. కనీస మద్దతు ధర క్వింటా రూ.8110 ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆశపడ్డారు. అయితే సీసీఐ విధించిన నిబంధనలు రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తేమశాతం 12 వరకు మాత్రమే ఉండాలని, 8 శాతం నుంచి పెరిగిన ప్రతి ఒక్క శాతం చొపున మద్దతు ధర తగ్గిస్తామని తెలిపారు. బన్నీ లేదా బ్రహ్మ రకం పత్తికి పింజ పొడవు 29.50 నుంచి 30.50 ఎంఎం వరకూ, మైక్రోనైర్ 3.50 నుంచి 4.30 మద్య ఉండి 8 శాతం తేమ ఉంటే క్వింటా రూ.8,110 ప్రకారం కొనుగోలు చేస్తామని, 9 శాతం తేమ ఉంటే రూ.8028.90, 10శాతం తేమ వుంటే రూ.7,947.80, 11 శాతం తేమ ఉంటే రూ.7,866.70, 12శాతం తేమ ఉంటే రూ.7,785.60 చొప్పున క్వింటా పత్తిని కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇదే విధంగా బ్రహ్మ స్పెషల్, ఎంఈసీహెచ్ రకాలకు కూడా ధరను నిర్ణయించారు. దుమ్ము, ధూళి, చెత్తా చెదారం, గుడ్డిపత్తి కాయలు, రంగుమారిన, పురుగుపట్టిన, కౌడిపత్తి, ముడుచుకుపోయిన పత్తి కాయలను వేరుచేసి తెస్తేనే కొనుగోలు చేస్తామనే నిబంధన విధించారు. ఈ పంటలో నమోదు చేసుకున్న రైతులు, కౌలు రైతులు మాత్రమే పత్తి కొనుగోలు కేంద్రానికి రావాలని నిబంధన పెట్టారు. అలా కాని వారు కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకువస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇలా అనేక నిబంధనలు విధించడంతో రైతులు యార్డులోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి రావడం మానేశారు. వాస్తవ పరిస్థితి ఇదీ... మోంథా తుఫానుతో పశ్చిమ ప్రకాశంలో సాగుచేసిన పత్తి పూర్తిగా రంగుమారి నల్లగా అయింది. పలుచోట్ల పత్తికాయల్లో దుమ్ముధూళి ఏర్పడింది. రంగుమారి నాణ్యత తగ్గింది. సీసీఐ నిబంధనల ప్రకారం అమ్ముకోలేమని తెలిసి రైతులు గ్రామాల్లోనికి వచ్చిన వ్యాపారులకు క్వింటా రూ.5 వేల నుంచి రూ.5500 మధ్య విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 31,500 ఎకరాల్లో పత్తి సాగుకాగా, ఒక్కపశ్చిమ ప్రకాశంలోనే 15,600 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. ఎకరా పత్తి సాగుచేసేందుకు సుమారు రూ.25 నుంచి రూ.30 వేల వరకూ ఖర్చు వచ్చింది. తుఫాను రాకపోయివుంటే ఎకరాకు సుమారు 6 నుంచి 8 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చేది. తుయోలను తాకిడికి దిగుబడి 3 నుంచి 4 క్వింటాళ్లకు పడిపోయింది. ఇలా పత్తి రైతులు అన్ని విధాలా ఈ ఏడాది నష్టపోయారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. సీసీఐ నిబంధనలను సడలించాలని కోరుతూ మా శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపారు. నిబంధనలు సడలిస్తే ఆ ప్రకారం మళ్లీ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం రైతులు పత్తి తెస్తే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. – కోటేశ్వరరావు, సెక్రటరీ, మార్కెట్కమిటీ, మార్కాపురం -
మూగబోయి..!
సేవలుగడ్డి కోసం పొలాల వెంట తిరుగుతున్న గేదెలుమార్కాపురం: జిల్లాలో మొత్తం 84 పశువైద్యశాలలు, 55 గ్రామీణ పశువైద్యశాలలు ఉన్నాయి. ఇందులో త్రిపురాంతకం, యర్రగొండపాలెం, మార్కాపురం, కంభం, బేస్తవారిపేట, గిద్దలూరు, హనుమంతునిపాడు, కనిగిరి, సీఎస్పురం, పొదిలి, కొండపి, టంగుటూరు, త్రోవగుంట, నాగులుప్పలపాడు, చీమకుర్తి, దర్శి, కురిచేడు, మద్దిపాడులలో అసిస్టెంటు డైరెక్టర్ స్థాయి కలిగిన ఏరియా వైద్యశాలలు ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయంతోపాటు పాడిపశువులే రైతుల జీవనాధారం. వర్షాకాలంలో తరచుగా అవి వివిధ రకాల వ్యాధులకు గురవుతాయి. చూడిగేదెలు, గేదెలు, దూడల సంరక్షణ, పశుపోషకులకు భారంగా మారుతోంది. వివిధ ప్రాంతాల్లో రకరకాల నీరు తాగి చర్మరోగాలతో పాటు కడుపు ఉబ్బరం, జ్వరం, నొప్పులతో బాధపడుతుంటాయి. వాటిని కాపాడుకునేందుకు పశుపోషకులు వైద్యశాలకు వెళితే మందులు లేవనే సమాధానం వస్తోంది. అరకొర మందులతో నెట్టుకొస్తున్నారు. మందుల కొరతతో అవస్థలు నాలుగైదు నెలల నుంచి జిల్లాలోని పలు వైద్యశాలల్లో మందుల కొరత ఏర్పడింది. దీంతో డాక్టర్లు తమ వద్ద లేని మందులను బయట తెచ్చుకోవాలని చీటీపై రాసిస్తున్నారు. మందులు తెచ్చుకుంటే వైద్యం చేస్తామని డాక్టర్లు చెబుతుండడంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. ఆర్ఎస్కేలలో సైతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది. జ్వరానికి సంబంధించి పారాసిటమాల్, మెలనెక్స్, హార్టిజోన్, అరుగుదలకు సంబంధించి బీ కాంప్లెక్స్, నొప్పులకు సంబంధించి పెయిన్కిల్లర్స్, పొట్ట ఉబ్బరం వస్తే ఉపయోగించే టిమ్ఫోనిన్, యాంటిబయాటిక్స్, బ్లోబెండ్, వాతం వస్తే ఉపయోగించే పొడి మందు జెన్సీన్, చిర్రెట్, జింజర్, పొదుగువాపు వ్యాధి వస్తే ఉపయోగించే మూడు రకాల మందులతోపాటు యాంటిబయాటిక్స్ జీవాలకు దగ్గు వస్తే వాడే టైల్సిన్, చర్మవ్యాధులొస్తే ఉపయోగించే సల్ఫర్ బేస్డ్ పౌడర్ ఇలా అన్ని ప్రధాన మందులకు కొరత ఏర్పడింది. వీటితోపాటు లైఫ్ సేవింగ్ మందులైన డెక్సామెథాజోన్, బీటా మెథాజోన్, ఐసోఫ్లెడ్ తదితర మందులు లభించడంలేదు. డాక్టర్లు చీటీరాసి ఇస్తే ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి జీవాలను కాపాడుకుంటున్నారు. దీంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పశుపోషణపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మందుల కొరత లేకుండా చూశారు. వైద్యశాలలకు రైతుసేవా కేంద్రాలకు మందులను సరఫరా చేశారు. మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. జిల్లాలో 16 సంచార అంబులెన్స్ను కేటాయించి 1962 ఫోన్ నంబరుకు ఫోన్ చేస్తే ఇంటి ముంగిటే వైద్యం అందేది. మందులు అందించాలి రాష్ట్ర ప్రభుత్వం పశువైద్యశాలలకు వెంటనే మందులు సరఫరా చేయాలి. మందుల కొరత మూలంగా జీవాలకు అనారోగ్యమై వైద్యశాలకు తీసుకెళ్తే మందులు లేవంటున్నారు. దీంతో బయట కొని వాటికి వైద్యం చేయించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెటర్నరీ మందులను త్వరగా వైద్యశాలలకు అందించాలి. – జి.బాలనాగయ్య, గొర్రెలు, మేకల పెంపకందారుల జిల్లా నాయకులు, మార్కాపురం పశువులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం జిల్లాలో పశువులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను ఉన్నంత వరకూ ఆయా వైద్యశాలలకు పంపుతున్నాం. మా సిబ్బంది కూడా అందుబాటులో ఉండి పశువులకు చికిత్స చేస్తూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. – వెంకటేశ్వరరావు, జాయింట్ డైరెక్టరు, ఒంగోలు -
పక్షవాత రోగులకు గోల్డెన్ అవర్లోనే వైద్యం అందించాలి
ఒంగోలు టౌన్: బ్రెయిన్ స్ట్రోక్కు గురై ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన రోగులకు గోల్డెన్ అవర్లో చికిత్స చేసి కాపాడగలిగే నైపుణ్యం, వనరులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్ సూచించారు. సంబంధిత విభాగాలకు చెందిన వైద్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి రోగిని సాధారణ పరిస్థితిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పక్షవాతం వ్యాధిపై జరిగిన ఒక రోజు సెమినార్ను బుధవారం ఆయన ప్రారంభించారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు, అందుకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఆహారాన్ని అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు తొలి గంటలోపే చికిత్స ప్రారంభించాలని, అన్నీ రకాల వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ పరీక్షలను చేసుకొని అత్యవసరంగా చికిత్స చేయాలని చెప్పారు. తొలి గంటలో చికిత్స చేసినప్పుడే రోగి సత్వరం కోలుకుంటాడన్నారు. న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.హరి మాట్లాడుతూ దేశంలో స్ట్రోక్ పీడితుల సంఖ్య నానాటికీ పెరుగుతోందన్నారు. జీవన శైలిలో మార్పులు, చేర్పులు చేసుకోవడం ద్వారా స్ట్రోక్ను ముందస్తుగా గుర్తించి తగిన వైద్య సలహాలు, అవసరమైన చికిత్స తీసుకోవాలని చెప్పారు. పక్షవాతంపై అవగాహన పెంపొందించడం ద్వారా మరణాలను తగ్గించవచ్చన్నారు. మరో న్యూరాలజిస్టు డా.నటరాజ్ పోలి బ్రెయిన్ స్ట్రోక్ గురించి, అత్యవసర చికిత్స గురించి వివరించారు. రక్తపోటు నియంత్రణ, థ్రాంబోలిసిస్, నరాలలో రక్తం చిక్కబడడం వంటి సమస్యలను నివారించుకునే విధానాలను తెలిపారు. రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీ నరసింహం మాట్లాడుతూ స్ట్రోక్ను గుర్తించడంలో సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ, ఇతర ఆధునాతన ఇమేజింగ్ విధానాల ద్వారా ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్లను స్పష్టంగా గుర్తించవచ్చని తెలిపారు. న్యూరో సర్జరీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ శరత్ మాట్లాడుతూ పక్షవాతం చికిత్సలో భాగంగా శస్త్ర చికిత్స అవసరమయ్యే పరిస్థితులను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు ప్రభాకర్, తిరుపతి రెడ్డి, రేడియాలజీ ప్రొఫెసర్ నరసింహాచారి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ పద్మలత తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని సాధించాలి
ఒంగోలు వన్టౌన్: విద్యార్థులు జీవితంలో నిర్ధిష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ లక్ష్యాలను సాధించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ టీ నారాయణ సూచించారు. ఒంగోలు టీటీడీసీలోని స్కిల్ కాలేజి ట్రైనింగ్ సెంటర్, స్పైస్ కాలేజీ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పీడీ మాట్లాడుతూ జిల్లాలో 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ యువతీ, యువకులకు వారి అర్హత, ఆసక్తికి అనుకూలమైన కోర్సులతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పై అవగాహన, లైఫ్ స్కిల్స్ గురించి 3 నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. శిక్షణ తీసుకుంటున్న వారికి ప్రభుత్వం ఉచిత వసతి, భోజనం, శిక్షణ మెటీరియల్, శిక్షణ అనంతరం కోర్సు కంప్లీషన్ సర్టిఫికెట్, యూనిఫాం ఇస్తుందని పీడీ తెలిపారు. జిల్లా పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో 60 మంది డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 49 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ఎలక్ట్రికల్ అసెంబ్లీ ఆపరేటర్, కంట్రోల్ ప్యానెల్ కోర్సులో 168 మంది శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 155 మందికి, బ్రాడ్ బ్యాండ్ టెక్నీషియన్ కోర్సులో 140 మంది శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 128 మందికి, టెక్నికల్ ఇంజినీర్ కోర్సులో 610 మంది శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 199 మందికి, జూనియర్ సాఫ్ట్వేర్ కోర్సులో 60 మంది శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 58 మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో జేడీఎం డి.శ్రీనివాసులు, ట్రైనర్స్ కె.శ్రీనివాస రావు, కేవీ.ప్రభాకర రావు, బి.అజయ్ కుమార్, జాబ్స్ కో ఆర్డినేటర్ ఓ.హిమాంబి, వార్డెన్ టి. వి.ప్రసన్న, సీడాప్ సిబ్బంది, శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా మహిళా దినోత్సవం
ఒంగోలు మెట్రో: 58 వ గ్రంథాలయ వారోత్సవాలు, జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం ఎన్నారై గ్లోబల్ ఫోరం, ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి సంయుక్త ఆధ్వర్యంలో సాహితీ, సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలందిస్తున్న ఇద్దరు మహిళామూర్తులను ఘనంగా సన్మానించారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు తేళ్ళ అరుణ మాట్లాడుతూ ఉక్కుమహిళగా పేరుపొందిన ఇందిరాగాంధీ దేశ మహిళందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావు, సుజాత, మాజీ ఎంపీపీ నాళం నరసమ్మ, నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, డాక్టర్ సుధాకర్, ఇన్చార్జి డిప్యూటీ లైబ్రేరియన్ కాళహస్తి సంపూర్ణ తదితరులు మాట్లాడారు. సన్మాన గ్రహీతలైన లలితా శ్రీనివాస్, మారేపల్లి సూర్యకుమారి తెలుగు భాషకు చేస్తున్న సేవలను ప్రశంసించారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. సత్య సాయి జయంతి మహోత్సవాల సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలు బుధవారం మంగమూరుడొంక గాంధీనగర్ సత్యసాయి బాబా మందిరంలో మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కనిగిరిరూరల్: రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా కబడ్డీ టీం ఎంపిక పోటీలు బుధవారం మండలంలోని కంచర్లవారిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అండర్ 14, అండర్ 17 కబడ్డీ కాంపిటీషన్స్, సెలక్షన్స్ పీఎం శ్రీ ఎంపిక క్రీడలకు 250 మంది క్రీడాకారులు, సుమారు 70 మంది వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. హెచ్ఎం విజయభాస్కర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు హజరత్రెడ్డి, పీ బసవయ్య పర్యవేక్షణలో ఎంతో ఉత్సాహంగా ఎంపిక పోటీలు జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ పోతు కొండారెడ్డి, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ చెక్క వెంకటేశ్వర్లు, శిరీషా, డివిజనల్ కోఆర్డినేటర్లు చిరంజీవిరెడ్డి, భవనం కాశీ విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపికై న అండర్ 14, 17 క్రీడా జట్లు కర్నూల్లో 22న జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని జిల్లా తరఫున ఆడతారని పీఈటీలు తెలిపారు. కొత్తపట్నం: ఉపాధ్యాయుల బోధన నాణ్యతను మెరుగుపరిచేందుకు టచ్ టూల్ ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖాదికారి కిరణ్కుమార్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల టచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్థికి టచ్ టూల్ ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ప్రతి పాఠశాలలో టచ్ టూల్ అబ్జర్వేషన్ ప్రారంభమవుతున్నట్లు చెప్పారు. అనంతరం అల్లూరు ఉన్నత పాఠశాల, కేజీబీవీని పరిశీలించారు. ఎంఈవో 1, 2 తులసీకుమారి, పద్మావతి, హెచ్ఎం బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఒంగోలు వన్టౌన్: జిల్లాకు వచ్చిన ఏపీజేఏసీ స్టేట్ చైర్మన్, ఏపీఆర్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కలెక్టర్ రాజాబాబును కలెక్టర్ చాంబర్లో బుధవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావు, కలెక్టరేట్ విభాగం అధ్యక్షుడు సత్యసాయి శ్రీనివాస్, జిల్లా ఈసీ మెంబర్ ప్రశాంత్, ఒంగోలు డివిజన్ సంయుక్త కార్యదర్శి రమణయ్య తదితరులు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. -
హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
ఒంగోలు సిటీ: సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆడబిడ్డలకు ఇస్తానన్న రూ.1500 ఇవ్వలేక, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్లు ఇస్తామని చెప్పి 60 ఏళ్లు దాటినవారికే ఇంత వరకు కొత్త పెన్షన్లు ఇవ్వలేదని విమర్శించారు. ఇవన్నీ చేయలేక, ప్రభుత్వం నడపటం చేతకాక, పేర్లు మార్చుకోవడం, డైవర్ట్ చేయడం వంటి విధానాలను అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఎకరం 99 పైసలకు, మెడికల్ కాలేజీలు ఎకరం రూ.100 లకు అంటూ లీజులకు అని చెప్పి ప్రైవేటుపరం చేస్తుండటంపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, ఇది తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా కల్తీ నెయ్యి అంటూ ఒక కొత్త వివాదాన్ని బయటకు తీసుకొస్తున్నారని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ప్రతిష్టను దిగజార్చడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేటట్లు చేయడం తప్పా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో టెండర్లలో కొద్దిమంది మాత్రమే పాల్గొనేటట్లు చేసి అనుయాయులకు వచ్చేటట్లు ఫైనల్ చేయడం అలవాటన్నారు. పారదర్శకంగా టెండర్లను విస్తృతపరచాలనీ ఎక్కువమందికి ఎలిజిబిలిటీ తీసుకొస్తే పోటీలో స్వామివారికి ఎక్కువ ఆదాయం వస్తుందన్నది అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ఒక్కరి నిర్ణయం కాదని, పాలకవర్గం నిర్ణయమని తెలిపారు. మా ప్రభుత్వంలో నాణ్యమైన నెయ్యి కాదని 18 వాహనాలను వెనక్కు పంపించారని, మీ ప్రభుత్వంలో కూడా 14 వాహనాలు వెనక్కు పంపించారన్నారు. కల్తీ జరిగిందన్నా, నాణ్యత తగ్గిందన్నా, వాటర్ కంటెంట్ ఉన్నా ఏది ఉన్నా టెస్ట్ చేసి వెనక్కు పంపిస్తారన్నారు. క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ ఉంటుందని, అధికార యంత్రాంగం చేయాల్సిన బాధ్యతలన్నీ పాలకవర్గానికి ఎట్లా అంటగడతారన్నారు. వై.వి సుబ్బారెడ్డి రెండు దశాబ్దాల క్రితమే స్వర్ణ తిరుమల పెద్ద గెస్ట్ హౌస్ను స్వామివారికి కట్టించారన్నారు. అలాగే అయ్యప్పస్వామికి, శ్రీశైలంలో కూడా కట్టించారన్నారు. వై.వి.సుబ్బారెడ్డికి ఉన్న భక్తిని మీరెట్లా శంకిస్తారని ప్రశ్నించారు. వైవీ.సుబ్బారెడ్డి లాంటి భక్తిపరుడిని మీరెందుకు అప్రతిష్టపాలు చేయాలని అనుకుంటున్నారన్నారు. తిరుపతిలో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఫ్లైఓవర్ కట్టించారని, రూ.300 కోట్ల పిల్లలకు సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించారని, చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు ఫ్రీగా చేయడానికి ఆస్పత్రి కట్టించారన్నారు. టీటీడీ సౌజన్యంతో టాటా వారితో కలిసి క్యాన్సర్ ఆస్పత్రి పెట్టించారన్నారు. శ్రీ వాణి ట్రస్టు పెడితే మీరందరూ విమర్శించారన్నారు. అసలు మీరెందుకు ట్రస్ట్ను రద్దు చేయడం లేదు..ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. శ్రీవాణి ట్రస్ట్ ఉండబట్టే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుడులు కట్టగలిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కళ్యాణోత్సవాలు జరిపించారన్నారు. వై.వి.సుబ్బారెడ్డి పాలనలో తిరపతికి స్వర్ణయుగమన్నారు. జిల్లాకు రెండు కేంద్రీయ విద్యాలయాలు, రైల్వే అండర్పాస్లు తీసుకొచ్చిన ఘనత వైవీ.సుబ్బారెడ్డిదన్నారు. ఆయన చిత్తశుద్ధి ఏమిటో జిల్లా వాసులందరికీ తెలుసన్నారు. చంద్రబాబుకు అసలు భక్తి అనేది ఉండదని, రాజకీయాల కోసం దేనినైనా అడ్డంపెట్టుకుంటారని ధ్వజమెత్తారు. సమావేశంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, ఒంగోలు పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్సీపీ నాయకులు తాత నరసింహా గౌడ్, కూనం అశోక్ గౌతమ్, మధు, దేవా, పిగిలి శ్రీనివాసరావు, తాతా నాంచర్లు, వెంకు, తదితరులు పాల్గొన్నారు. -
వెంకటేశ్వరరెడ్డి మృతి పార్టీకి తీరని లోటు
యర్రగొండపాలెం: మొగుళ్లపల్లి సర్పంచ్, పార్టీ నాయకుడు కర్నాటి వెంకటేశ్వరరెడ్డి మృతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టమని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం అనుమానాస్పద స్థితిలో వెంకటేశ్వరరెడ్డి మృతి చెందాడన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన హైదరాబాద్ నుంచి హుటాహుటిన వచ్చి ఆయన మృతదేహానికి పూలమాలవేసి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంకటేశ్వరరెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా పార్టీ అండదండలు ఉంటాయన్నారు. సంతాపం తెలిపిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, వివిధ విభాగాల నాయకులు కె.ఓబుల్రెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, ఎం.బాలగురవయ్య, సయ్యద్ జబీవుల్లా, పి.రాములు నాయక్, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సూరె శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్ కుమార్, మహమ్మద్ కాశిం, షేక్.కాశింపీర, షేక్.వలి ఉన్నారు. -
నగర జనుల జల ఘోష.. పురపాలకులకు తమాషా
ఒంగోలు కార్పొరేషన్లో పర్సెంటేజీల కోసం అడ్డగోలుగా డ్రెయినేజీ పనులు ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థలో పర్సెంటేజీల కోసం చేపడుతున్న పనులు ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అధికార పార్టీ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా కార్పొరేషన్ అధికారులు తలాడిస్తుండటంతో ప్రజా సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారు. నగర పాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక రకంగా ప్లాన్ చేస్తే, ఇంజినీరింగ్ అధికారులు మరో విధంగా పనులు చేపడుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయా విభాగాలను పర్యవేక్షించాల్సిన కమిషనర్, మేయర్ సైతం అడ్డగోలు పనులపై నోరు మెదపడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. నగర పరిధిలోని కొప్పోలు రోడ్డులో రైల్వే ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి దగ్గర నుంచి ఇందిరమ్మ కాలనీ వరకు రూ.2 కోట్లతో డ్రెయినేజీ నిర్మించాలని పురపాలకులు నిర్ణయించారు. అయితే స్టాండింగ్ కమిటీ లేకపోవడంతో రూ.40 లక్షల చొప్పున పనులకు మేయర్ ముందస్తు అనుమతి ఇచ్చి కౌన్సిల్లో ఆమోదించుకునే విధంగా చక్రం తిప్పారు. కౌన్సిల్ పదవీ కాలం రానున్న మార్చిలో ముగియనుండటంతో కనీస ప్రణాళిక లేకుండా హడావుడిగా చేస్తున్న పనుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. కొప్పోలు రోడ్డులోని రైల్వే ఫ్లయ్ ఓవర్ తూర్పు వైపున ఎఫ్సీఐ ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ కాలనీ, ఇందిరా కాలనీ, పులి వెంకట రెడ్డి కాలనీల వద్ద రోడ్డుకు ఉత్తరం వైపున డ్రెయినేజీ పనులు చేపట్టారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం మంచినీటి పైపులైన్ను పగలగొట్టారు. దీంతో వైఎస్సార్ కాలనీ, ఇంరిరా కాలనీ, పులివెంకట రెడ్డి కాలనీ, బైపాస్కు తూర్పు వైపునున్న రాజీవ్ గృహకల్ప, జర్నలిస్టు కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, కొప్పోలు రోడ్డుకు దక్షిణం వైపున ఉన్న నివాస ప్రాంతాలు, కొప్పోలు గ్రామం, అంబేడ్కర్ నగర్తో పాటు పలు కాలనీలకు వారం రోజుల నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి ప్రజలే అధికంగా నివసిస్తున్నారు. డబ్బున్న వారు వెయ్యి లీటర్ల మినరల్ వాటర్ను రూ.1000 పెట్టి కొనుగోలు చేస్తుండగా, సామాన్యులు నీరు కొనలేక నానా తిప్పలు పడుతున్నారు. ఒక్కో డ్రమ్ము నీరు రూ.50 ఇచ్చి కొనుగోలు చేయడం కష్టంగా ఉందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాము మెలికల్లా డ్రెయినేజీ కొప్పోలు రోడ్డులో డ్రెయినేజీ పనులు అడ్డగోలుగా సాగుతున్నాయి. సామాన్యుల ఇళ్ల వద్ద ఒక రకంగా, అధికార పార్టీ నాయకుల ఇళ్ల వద్ద మరో రకంగా పనులు చేస్తుండటమే అందుకు నిదర్శనం. టీడీపీ సానుభూతిపరుల ఇళ్ల జోలికి వెళ్లేందుకు ధైర్యం చేయని అధికారులు, సామాన్యుల ఇళ్లను గుల్లగుల్లగా పగలగొట్టారు. పులివెంకటరెడ్డి కాలనీలో అధికార పార్టీకి చెందిన ఏఎంసీ మాజీ చైర్మన్ బంధువుల ఇళ్లు డ్రెయినేజీ మీదకు వచ్చినా వదిలేశారు. ఆ ఇంటి పక్కనే ఉన్న సామాన్యుల ఇళ్లను మాత్రం కూలదోశారు. అధికార పార్టీ నాయకుల తీరును ప్రశ్నిస్తే ఎక్కడ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తారోనని పేదలు లోలోన మదన పడుతున్నారు. గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు నాలుగు వరసల రోడ్డును సర్వే చేసి 20 అడుగుల మేర ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించి మార్కింగ్ వేశారు. ఈ రోడ్డులో పది అడుగులు మాత్రమే ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ నిర్మాణం కోసం అంగీకారం కుదిరింది. దానిని కూడా అతిక్రమించి సామాన్యులను అష్టకష్టాలపాలు చేస్తుండటంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.కొప్పోలు రోడ్డులో ఎఫ్సీఐ ఎదుట టీడీపీ నాయకుడి భవనాన్ని వదిలేసి డ్రెయినేజీని వంక తిప్పిన దృశ్యం కొప్పోలు రోడ్డులో మసీదు పక్కన టీడీపీ నాయకుడి ఇంటిని వదిలేసి పక్కన దుకాణాన్ని కూల్చిన అధికారులు పైప్లైన్ ధ్వంసం చేయడంతో 8 రోజులుగా వేలాది మంది దాహపు కేకలు డ్రెయినేజీ పేరుతో సామాన్యుల ఇళ్లు కూలగొడుతున్న వైనం అధికార పార్టీ సానుభూతిపరుల ఇళ్లను వదిలేసి పాము మెలికల్లా డ్రెయినేజీ నిర్మాణం అధికారులు, అధికార పార్టీ నాయకుల తీరుపై ప్రజల ఆగ్రహం నీటి కోసం కొప్పోలు అంబేడ్కర్ కాలనీ వాసులు రోడ్డెక్కినా స్పందన శూన్యం -
మహిళ అనుమానాస్పద మృతి
● పరారీలో భర్త డోన్: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని త్రివర్ణ కాలనీకి చెందిన వివాహిత తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లి మృతి చెంది, తండ్రి పరారీలో ఉండగా వారి కుమార్తె అనాథగా మిగిలింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని త్రివర్ణకాలనీకి చెందిన పెయింటర్ కుమ్మలపాటి విజయ్కుమార్ పెద్దకుమార్తె మణి (25)కి ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని బసవనపల్లె గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ధనరాజ్తో మూడేళ్ల క్రితం వివాహమైంది. రూ.6లక్షల కట్నంతో పాటు 8 తులాల బంగారం, గృహోపకరణాలు పెళ్లి కానుకగా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లా పర్వతాపురంలో నివాసం ఉంటున్న వీరికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. ధనరాజ్ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. భార్య మణిపై అనుమానం పెంచుకున్న ధనరాజ్ నిత్యం వేధిస్తూ రెండు రోజుల క్రితం ఆమె పేరుపై ఉన్న ఇంటి స్థలాన్ని రిజిస్టర్ చేసివ్వాలని విజయ్కుమార్పై ఒత్తిడి చేశాడు. మరుసటిరోజే మణి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. మేడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు ధనరాజ్ ఆమె కుటుంబీకులకు విషయం తెలిపాడు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10.30 గంటలకు కోలుకోలేక మృతి చెందింది. బుధవారం మృతదేహానికి డోన్ పట్టణంలోని క్రిస్టియన్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిని కోల్పోయి, తండ్రి దూరమై రోదిస్తున్న మూడేళ్ల చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. తన కుమార్తెను అల్లుడే హత్య చేశాడని విజయ్కుమార్ ఫిర్యాదుతో పోలీసులు ధన్రాజ్పై హత్య కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
మనవడికి కౌన్సెలింగ్... బామ్మకు రక్షణ
ఒంగోలు టౌన్: మనవడు కొడుతున్నాడంటూ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొనకనమిట్ల మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన బూదాల మాణిక్యం అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఎస్పీ హర్షవర్థన్ రాజుకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన ఎస్పీ వెంటనే బాధిత వృద్ధురాలికి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, బామ్మ మీద చేయిచేసుకుంటున్న మనవడికి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పొదిలి సీఐ ఎం.రాజేష్ రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరించారు. నాగంపల్లి గ్రామానికి వెళ్లి బాధిత వృద్ధురాలి మనవడు బూదాల మెస్సీకి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రవర్తన మార్చుకోవాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మాణిక్యం పేరున ఉన్న 4 ఎకరాల భూమిని బతుకు తెరువు కోసం ఆమెకిష్టమైన వారికి కౌలుకు ఇచ్చుకునే అధికారం ఉందని, ఈ విషయంలో వృద్ధురాలి కుమారుడు శాంసన్ కానీ, మనవడు మెస్సీ కానీ జోక్యం చేసుకోకూడదని సీఐ సూచించారు. మాణిక్యమ్మ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తరఫున పక్కా ఇంటిని మంజూరు చేయాలని కొనకనమిట్ల తహశీల్దార్తో కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ జిల్లాలో వృద్ధులు, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటి వాటిని తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలతో పాటుగా ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. -
కెనరా బ్యాంక్ వ్యవస్థాపకుడికి ఘన నివాళి
ఒంగోలు వన్టౌన్: కెనరా బ్యాంక్ వ్యవస్థాపకుడు అమ్మెంబాళ్ సుబ్బరావు పాయ్ 173వ జయంత్యుత్సవం, బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవాన్ని ఒంగోలు కెనరా బ్యాంక్ రీజినల్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రీజినల్ హెడ్ భీమా రాఘవేందర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఒంగోలులోని ‘బొమ్మరిల్లు’ అనాథాశ్రమం చిన్నారులకు పండ్లు, స్వీట్లు, నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం పిల్లలతో ముచ్చటించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బ్యాంకు సిబ్బంది శ్రద్ధ, సేవ, నిబద్ధతతో ప్రజలకు మరింత చేరువ కావాలని రీజినల్ హెడ్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దదోర్నాల: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరో యువకుడు స్వామి (25) బుధవారం మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఈ ప్రమాదంలో కనిగిరికి చెందిన షేక్.ఖాజావలి సంఘటనా స్థలిలోనే మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. గాయపడిన స్వామిని తొలుత శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించిన అనంతరం జిల్లా కేంద్రంలోని ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతున్న స్వామి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. వేటపాలెం: అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఉప్పగుండూరులోని చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన బెల్లం హరిబాబుకు వేటపాలెం వడ్డె సామాజిక వర్గానికి చెందిన వెంకటేశ్వరమ్మకి మూడేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి రెండేళ్ల పాప ఉంది. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. నెల రోజుల క్రితం బెల్ల హరిబాబు (36), భార్య వెంకటేశ్వరమ్మ రైల్వే స్టేషన్ రోడ్డులో అద్దె ఇంట్లోకి కాపురానికి వచ్చారు. కాగా బుధవారం మధ్యాహ్నం భర్త బెల్లం హరిబాబు ఇంట్లో మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యులు రిక్షాపై మృతదేహాన్ని వేసుకొని భార్య తరఫు బంధువులు ఉంటున్న సమైఖ్యనగర్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మృతుడి స్వగ్రామైన ఉప్పగుండూరు మృతదేహాన్ని తరలించడాని మినీ లారీలో ఎక్కించారు. విషయం తెలుసుకున్న ఎస్సై జనార్దన్ సమైఖ్యనగర్ వెళ్లి హరిబాబు మృతికి కారణాలను కుటుంబ సభ్యులను అడిగి అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే హరిబాబు భార్య తరఫు బాబాయికి.. మృతుడికి మధ్య జరిగిన ఘర్షణలో తగల రాని చోటు దెబ్బలు తగలడంతో హరి బాబు మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
దొనకొండలో ఆర్అండ్బీ స్థలం కబ్జా
దొనకొండ: పేదల స్థలాలే కాదు ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు వెనుకాడటం లేదు. దొనకొండలో అంబేడ్కర్ సర్కిల్ పక్కన ఖాళీగా ఉన్న ఆర్అండ్బీ స్థలానికి ఎసరు పెట్టేందుకు అధికార పార్టీ నేతలు పక్కాగా స్కెచ్ వేశారు. సర్వే నంబర్ 245లో 1.40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని తమ స్వాధీనం చేసుకునే క్రమంలో భాగంగా మంగళవారం రాత్రి బరితెగించారు. అర్ధరాత్రి వేళ జన సంచారం లేని సమయంలో రాళ్లు పాతించి దిట్టంగా ఫెన్సింగ్ వేశారు. బుధవారం ఉదయాన్నే ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు నివ్వెరపోయారు. ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందంటూ కొందరు వ్యక్తులు తహసీల్దార్ బి.రమాదేవికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె డిప్యూటీ తహసీల్దార్ నాగార్జునరెడ్డితో కలిసి ఆర్అండ్బీ స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల బడ్డీకొట్లు పెట్టుకున్న వారిని విచారించారు. రెవెన్యూ రికార్డులు పరిశీలించి అది ఆర్అండ్బీ స్థలమేనని నిర్ధారించుకున్నారు. ఆర్అండ్బీ డీఈ గోపీకృష్ణకు భూ కబ్జా గురించి సమాచారం తెలియజేశామని, ఆయన తిరుమలలో ఉన్నారని తహసీల్దార్ చెప్పారు. ఆర్ అండ్బీ డీఈని వివరణ కోరగా.. తాను అందుబాటులో లేనని, వచ్చిన వెంటనే తహసీల్దార్తో మాట్లాడి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. 1.40 ఎకరాల భూమికి అర్ధరాత్రి వేళ ఫెన్సింగ్ టీడీపీ నాయకుల పనేనని స్థానికుల చర్చ స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్ -
గ్యాస్ అక్రమ వ్యాపారంపై కేసు నమోదు
కురిచేడు: మండల కేంద్రమైన కురిచేడులో అనుమతి లేకుండా గ్యాస్ సిలిండర్ల వ్యాపారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై బుధవారం ఎన్న్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఎస్.రాధాకృష్ణ, పొదిలి ఎన్ఫోర్స్మెంట్ డీటీ కె.డేవిడ్రాజు, ఫుడ్ ఇన్స్పెక్టర్ టి.ముకుందహరి ఆకస్మికంగా దాడి చేసి 6 నిండు, 2 ఖాళీ సిలిండర్లు సీజ్ చేశారు. తన దుకాణంపైనే దాడి చేసిన అధికారులు, అదే తరహాలో పక్కనే వ్యాపారం చేస్తున్న వారిని పట్టించుకోలేదని వ్యాపారి సూరా ప్రసాదరావు ఆరోపించారు. అక్రమంగా గ్యాస్ వ్యాపారం నిర్వహిస్తున్న ఇళ్లు, దుకాణాలను ఆయన స్వయంగా చూపుతున్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డీటీ పెడచెవిన పెట్టడం విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా రోజూ ఇదే మార్గంలో రాకపోకలు సాగించే అధికారులు అకస్మాత్తుగా దాడి చేయడంలో మతలబు ఏమిటో స్థానికులకు అంతుబట్టలేదు. మొక్కుబడి తనిఖీలు చేసి 8 సిలిండర్లు స్వాధీనం చేసుకుంటే అక్రమ వ్యాపారం ఆగుతుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా సిలిండర్లు పట్టుబడిన వ్యవహారంపై స్థానిక టీడీపీ కార్యకర్త ఒకరు ఎన్ఫోర్స్మెంట్ డీటీతో మంతనాలు సాగించడాన్ని చూసి స్థానికులు విస్తుపోయారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
టంగుటూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన టంగుటూరు టోల్ప్లాజా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి తెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని పాల్వంచ నుండి నెల్లూరులోని ఆత్మకూరు వైపు జామాయిల్ మొక్కలు లోడుతో వెళ్తున్న ఆటో టంగుటూరు టోల్ ప్లాజాకు సమీపంలో వచ్చేసరికి ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్ సాయి బండిలో ఇరుక్కుపోయాడు. ప్రమాదం గురించి తెలుసుకున్న టంగుటూరు పోలీసులు, హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శ్రమించి డ్రైవర్ సాయిని బయటకు తీశారు. ప్రమాదంలో సాయి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అదే వాహనంలో ఉన్న అబ్దుల్లాకి చిన్న చిన్న గాయాలు కాగా 108 వాహభంలో ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు. -
ఎమ్మెల్యే కందుల ప్రజాదర్బార్లో మహిళా ఆత్మహత్యాయత్నం
మార్కాపురం: తనను ఒక వ్యక్తి నమ్మించి మోసం చేశాడని, న్యాయం చేయాలని కోరుతూ మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులో బ్రహ్మంగారి గుడి సమీపంలో నివాసముండే దేవండ్ల సుజాత మంగళవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నిర్వహించిన ప్రజా దర్బారులో వాస్మాల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. తమ ఇంటి సమీపంలో జె.కోటిరెడ్డి అనే వ్యక్తి పాల కేంద్రం నిర్వహిస్తున్నాడని, తనకు అత్యవసరమని చెప్పడంతో పది తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు ఇచ్చానని ఎమ్మెల్యేకు వివరించింది. నగలు, నగదు తిరిగివ్వాలని కోరితే తప్పించుకు తిరుగుతున్నాడని, తనకు న్యాయం చేయాలని వాపోయింది. ఈ క్రమంలోనే వాస్మాల్ తాగడంతో అక్కడే ఉన్నవారు జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా సుజాత ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం సాయంత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్సై సైదుబాబు తెలిపారు. ● జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్చార్జి కార్యదర్శి జీవీ శివారెడ్డి మార్కాపురం: జిల్లాలోని గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, పాఠకులకు చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్చార్జి కార్యదర్శి జీవీ శివారెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రంథపాలకులు, రికార్డు అసిస్టెంట్లు, ఇతరత్రా సిబ్బంది ఖాళీలు 88 ఉన్నాయని వెల్లడించారు. మంగళవారం మార్కాపురం శాఖా గ్రంథాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నామని, పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 66 శాఖా గ్రంథాలయాల్లో 70,659 మంది సభ్యత్వం పొందారని, 6,06,607 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కాంపిటేటివ్ పరీక్షల పుస్తకాలను నిరుద్యోగ అభ్యర్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లాలో ఒంగోలుతోపాటు మార్కాపురంలో గ్రేడ్–1 గ్రంథాలయం ఉందని, కంభం, కనిగిరి, పర్చూరు, చీరాల గ్రంథాలయాలు గ్రేడ్–2గా నమోదై ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 25 లైబ్రరీలు సొంత భవనాల్లో, మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు. మార్కాపురం డివిజన్లో కొమరోలు, అర్ధవీడు, రాచర్ల, ఆకవీడు, పుల్లలచెరువు గ్రంథాలయాలకు శాశ్వత భవనాలు లేవని చెప్పారు. జిల్లాలో గ్రామ స్థాయిలో 26 లైబ్రరీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమపిల్లలను సెలవు రోజుల్లో గ్రంధాలయాలకు పంపాలని విజ్జప్తి చేశారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. -
కనిపించని పేర్లు.. ఖాతాల్లో కన్నీళ్లు
చంద్రబాబు పాలనలో అన్నదాతకు కష్టకాలం దాపురించింది. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత జిల్లాలో మిర్చి, పొగాకు, పత్తి, వరి, జొన్న..ఇలా అన్ని రకాల రైతులు మద్దతు ధర లభించక..కనీస పెట్టుబడులు రాక ఆర్థికంగా నష్టపోయారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం సాయం అందించకుండా వంచనకు పాల్పడుతోంది. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది అన్నదాత సుఖీభవ ఊసేలేదు. ఈ ఏడాది ఆగస్టులో కేవలం రూ.5 వేలు ఇచ్చి దగా చేశారు. అంతేకాదు లబ్ధిదారుల జాబితాలో భారీగా కోతలు పెట్టారు. బుధవారం రెండో విడత సాయం అందిస్తున్నామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. మొదట విడతలో ఇంకా 45 వేల మందికి సాయం అందలేదు. ఇక రెండో విడత ఇచ్చే రూ.134 కోట్లలో ఎంతమందికి ఎగనామం పెడతారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ● జిల్లాలో తొలివిడతగా 2,68,168 మందిని లబ్ధిదారులుగా గుర్తింపు లబ్ధిదారుల జాబితా కుదింపే లక్ష్యంగా.... ఏడాది పాలన తరువాత చంద్రబాబుకు ఎన్నికల హామీ గుర్తుకు వచ్చింది. ఈ ఏడాదిలో సవాలక్ష ఆంక్షలు పెట్టి అర్హుల జాబితాలో భారీగా కోతలు పెట్టారు. చివరకు 2,68,168 మంది రైతులు అర్హులుగా తేల్చాడు. మొదటి విడతలో చంద్రబాబు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది కేవలం రూ.5 వేలు మాత్రమే. రెండో విడతలో అన్నదాత సుఖీభవ కింద రూ.134 కోట్లు రైతులకు జమ చేస్తానని చెబుతున్నారు. మొదటి విడతకు సంబంధించి ఇంకా 45 వేల మంది రైతులకు డబ్బులు జమ కాలేదు. వాళ్లకు కూడా ఈ విడతలో పడతాయని అధికారులు చెబుతున్నారు. పీఎం కిసాన్ కింద 2,31,383 మందికి రూ.46.28 కోట్లు జమచేయనున్నారు. అదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2022–23 సంవత్సరంలో రైతు భరోసా కింది 2,86,256 మందికి ఏడాదికి రూ.13,500 చొప్పున సాయం అందించి. వైఎస్సార్ సీపీ ఐదేళ్లలో జిల్లాలోని రైతాంగానికి రైతు భరోసా రూపంలో అందించింది అక్షరాలా రూ.1,634.85 కోట్లు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఈ ఏడాది ఆగస్టు రెండో తేదీ దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో ఎర్రటి ఎండలో రైతులను మంచాల మీద కూర్చోబెట్టి సినిమా సెట్టింగ్ వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి మొదటి విడత పీఎం కిసాన్–అన్నదాఖీభవ పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చినట్టుగా రైతులకు ఏడాదికి రూ.20 వేలు కాకుండా పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు జమచేశారు. ఖరీఫ్ సీజన్ పూర్తయింది, రబీ సీజన్ కూడా వచ్చింది. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారు. రెండో దఫా సాయం బుధవారం రైతు బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. అదీ కూడా కేవలం రూ.5 వేలు మాత్రమే అందించనున్నారు. పీఎం కిసాన్లో 2,31,383 మందే రైతులు... పీఎం కిసాన్ పథకంలో జిల్లాలో మొత్తం 2,31,383 మందే రైతులను లబ్ధిదారులుగా తేల్చారు. కానీ అన్నదాత సుఖీభవ పథకం కోసం జిల్లా అధికారులు 2,68,168 మందిని గుర్తించారు. జిల్లాలో మొత్తం 5,31,369 మంది రైతులను వెరిఫై చేసి 4,38,251 రైతుల జాబితాను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఆ జాబితాను ఉన్నతాధికారులకు పంపించారు. ఆర్ఐజీఎస్ పరిధిలో ఆ జాబితాను పరిశీలించి 2,72,824 మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు. వీరికి ఈకేవైసీ పూర్తి చేయాలని గ్రామ వ్యవసాయ సహాయకుల ఆదేశించారు. చివరకు అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు 2,68,168గా తేల్చారు. రకరకాల వంకలు పెడుతూ లబ్ధిదారుల జాబితాకు ఏ రకంగా కోతలు పెడదామా అన్నట్లు ప్రభుత్వం చూస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
శ్రీశైలం ఘాట్లో రోడ్డు ప్రమాదం
పెద్దదోర్నాల: ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీశైలం రహదారిలోని చెన్నంగుల బండ సమీపంలో మంగళవారం జరిగింది. ప్రమాదంలో కనిగిరి పట్టణానికి చెందిన షేక్ ఖాజావలి(27) దుర్మరణం పాలవగా, మరో యువకుడు స్వామి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై కథనం మేరకు..కనిగిరికి చెందిన స్వామి శివమాల వేయడంతో మాలను తీసేందుకు స్నేహితుడు ఖాజావలితో కలిసి మంగళవారం ఉదయం శ్రీశైలం తరలివెళ్లారు. తిరుగు ప్రయాణంలో శ్రీశైలం నుంచి ద్విచక్రవాహనంపై కనిగిరికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న మార్కాపురం డిపో పల్లెవెలుగు వాహనాన్ని చెన్నంగుల బండ వద్ద ఢీకొట్టడంతో ఖాజావలి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన స్వామిని చికిత్స నిమిత్తం శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలోని వైద్యశాలకు తరలించారు. మృతుడు ఖాజావలికి ఇటీవలే వివాహమైనట్లు బంధువులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సు ఢీ యువకుడు మృతి, మరో యువకుడికి తీవ్రగాయాలు


