Prakasam District News
-
ఘనంగా వైవీ జన్మదిన వేడుకలు
ఒంగోలు సిటీ: రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, సన్నపురెడ్డి రమణమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్లోని సుబ్బారెడ్డి నివాసంలో... సింగరాయకొండ: హైదరాబాద్లోని వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్యాదవ్, నాయకులు కుప్పం ప్రసాద్, కాకుమాను రాజశేఖర్, సింగరాయకొండ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, తదితర నాయకులంతా వైవీ సుబ్బారెడ్డిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైవీతో కేక్ కట్ చేయించారు. -
జగనన్న హయాంలోనే కార్మికుల సంక్షేమం
ఒంగోలు సిటీ: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న హయాంలోనే కార్మికుల సంక్షేమం కొనసాగిందని ఆ పార్టీ నాయకులు అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గురవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు హాజరై మే డే జెండా ఆవిష్కరించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మిక సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారన్నారు. వెట్టి చాకిరి కొనసాగుతున్న రోజుల్లో కార్మికులకు కచ్చితంగా నిర్ణీత పనిగంటలు ఉండాలనే డిమాండ్తో 8 గంటలు మాత్రమే పనిదినాలు కావాలని పోరాటం చేసి కొందరు కార్మికులు ప్రాణాలు అర్పించారన్నారు. 1890 మే 1వ తేదీ నుంచి 8 గంటల పనిదినాలు కల్పించి ప్రారంభించారన్నారు. ఆ రోజు నుంచి మే 1వ తేదీ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు. కార్మికులందరూ సంతోషంగా ఉండాలని, జీవితాంతం సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, మహిళా నాయకులు మేరికుమారి, వైఎస్సార్ సీపీ నాయకులు యలమందారెడ్డి, మీరావలి, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, పిగిలి శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026
జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గత నెల 27వ తేదీ కంభంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.7 డిగ్రీలు నమోదు కావడం తెలిసిందే. అదేరోజు మార్కాపురం జిల్లాలోని 15 మండలాల్లోని 9 మండలాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైనట్లు రికార్డులు చెబతున్నాయి. అంతకుముందు రోజు, ఆ తరువాత రోజు కూడా మార్కాపురం జిల్లా తీవ్రమైన ఎండలతో నిప్పుల కొలిమిలా మారింది. శుక్రవారం మార్కాపురం జిల్లాలోని మండలాలన్నింట్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. మార్కాపురంలో 43 డిగ్రీలు నమోదు కాగా కనిగిరి 43, గిద్దలూరు 43, కంభం 43 డిగ్రీలు నమోదయ్యాయి. పామూరు 42, దోర్నాల 42 డిగ్రీలు నమోదైంది. ప్రకాశం జిల్లాలో మాత్రం ఒక్క దర్శిలో మాత్రమే 43 డిగ్రీలు నమోదు కాగా ఒంగోలు 42.1, కందుకూరు 42, అద్దంకి 41, సింగరాయకొండ 41, చీమకుర్తిలో 42, సముద్రతీర ప్రాంతమైన కొత్తపట్నంలో 41 డిగ్రీలు నమోదైంది. ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. పశ్చిమ ప్రాంతంలో హీట్వేవ్స్ భయపెడుతున్నాయి. దాదాపు అన్ని మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే కంభంలో రికార్డు స్థాయిలో 45.7 డిగ్రీలు నమోదైంది. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో 43 నుంచి 42 డిగ్రీలు నమోదయ్యాయి. ఒకవైపు అదిరిపోయే ఉష్ణోగ్రతలు, ఊపిరాడని ఉక్కపోత, వడగాడ్పులు, మరోవైపు గాలివానతో అకాల వర్షాలు, వడగండ్ల వానతో పంట నష్టాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా విచిత్ర వాతావరణం నెలకొంది. ఒంగోలు: విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ పర్వతరెడ్డి ఆనంద్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శుక్రవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి జి.రాజరాజేశ్వరి, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.సురేష్, రాష్ట్ర కరాటే అసోసియేషన్ కార్యదర్శి ఎన్.మోహన్రావు, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: జిల్లా నూతన జడ్జి ఏ.సత్యానంద్ను ఎస్పీ హర్షవర్థన్ రాజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయశాఖ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై ఇరువురు చర్చించారు. న్యాయ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తే దోషులకు త్వరితగతిన శిక్షలు పడి నేరాలు తగ్గుముఖం పడతాయని, పోలీసు శాఖ తరుపున బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎస్పీ తెలిపారు. ఒంగోలు సిటీ: స్థానిక వీఐపీ రోడ్డులోని ప్రధానోపాధ్యాయుల సంఘ భవనంలో శనివారం ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం, ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, లక్ష్మీనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిలర్లు అందరూ సమావేశంలో పాల్గొనాలని కోరారు. విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చలో పాల్గొని తదుపరి జరిగే ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఒంగోలు సిటీ: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 2వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఒంగోలులోని పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు సీఈఓ బి.చిరంజీవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.ఉమ్మడి జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒకవైపు మండిపోయే వర్షాలు, మరోవైపు గాలివానతో వర్షాలు కురుస్తుండటంతో భిన్నవాతారణం కనిపిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చల్లబడింది. ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, దోర్నాల మండలాల్లో వడగండ్ల వాన పడింది. గాలివాన దెబ్బకు పంటలు దెబ్బతిని రైతులకు తీరని నష్టం జరిగింది. చేతికి అందివచ్చిన అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి. తీవ్రంగా వీచిన గాలులకు ఒక్క దోర్నాల మండలంలోని బొమ్మలాపురం గ్రామంలోనే 100 ఎకరాలకుపైగా అరటి, బొప్పాయి పంటలకు నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. పట్టణాల్లో ఈదురు గాలులకు దుకాణాల మీద కప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఒంగోలు టౌన్: రోహిణి కార్తెకు ముందే ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. సాధారణంగా రాష్ట్రంలో ఏటా రెంటచింతలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో ఉక్కపోత, బయట సూర్యప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. గత ఏడాది కంటే 6 డిగ్రీలు అధికంగా ఎండ... జిల్లా కేంద్రమైన ఒంగోలు నాలుగు రోజులుగా నిప్పుల కొలిమిలా మారింది. నింగిలోని సూర్యుడు నేలమీదకు దిగివచ్చి నగర వీధుల్లో సంచరిస్తున్నట్లు చండప్రచండంగా ఎండలు భగభగలాడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య కాసేపు ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చినుకులు పడ్డాయి. ఉదయం 8 గంటల తర్వాత నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలు పెట్టాడు. మధ్యాహ్నం నాటికి 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజున 36.5 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది ఒక్కసారిగా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదు కావడమంటే మామూలు విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే 40 నుంచి 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత తాకింది. దీంతో వీధులన్నీ నిర్యానుష్యంగా మారుతున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రాావడానికి జంకుతున్నారు. కంభంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు... మార్కాపురం జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎప్పుడు చూసినా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కంభంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెల 27వ తేదీ కంభంలో 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత వందేళ్లలో కంభంలో ఎప్పుడూ ఇంతటి ఎండలు లేవని, ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని తెలిసింది. అదేరోజు ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలోని 22, మార్కాపురంలోని 15 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఉక్కరిబిక్కిరి!ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా డీఆర్ఓగా చంద్రశేఖర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారుల బదిలీల్లో భాగంగా చీరాలలో పనిచేస్తున్న చంద్రశేఖర్ను ప్రకాశం జిల్లాకు డీఆర్వోగా బదిలీ చేశారు. ఇక్కడ డీఆర్ఓగా పనిచేస్తున్న బీసీహెచ్ ఓబులేసును కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీఓగా బదిలీ చేశారు. కర్నూలు జిల్లాలో ల్యాండ్ ఎక్విజిషన్లో పనిచేస్తున్న టి.అజయ్కుమార్ను కనిగిరి ఆర్డీఓగా నియమించారు. రామాయపట్నం ఇండస్ట్రియల్ హబ్లో పనిచేస్తున్న జీవీవీ సత్యనారాయణను కొత్తపేట ఆర్డీఓగా బదిలీ చేశారు. ఒంగోలు ఆర్డీఓ కే లక్ష్మీ ప్రసన్నను బదిలీ చేస్తూ.. ఆమె స్థానంలో చీరాల ఆర్డీఓగా పనిచేస్తున్న తూమాటి చంద్రశేఖర నాయుడును నియమించారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
ఒంగోలు సబర్బన్: ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించే రైతులను ప్రోత్సాహిస్తూ ప్రతి రైతు బజారులో స్టాల్స్ కేటాయించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. రైతు బజార్ల బలోపేతంలో భాగంగా ఉద్యానవన, పౌర సరఫరాలు, మున్సిపాలిటీ, తూనికలు, కొలతలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతు బజార్ల ఎస్టేట్ అధికారులతో శుక్రవారం ఆమె చాంబర్లో సమావేశం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ అగ్రి ట్రేడ్ – మార్కెటింగ్ అధికారి వరలక్ష్మి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ.. రైతులు వారి కూరగాయలను రైతు బజార్లలో ప్రత్యక్షంగాగానీ, ఆసక్తి కలిగిన వారు పరోక్ష పద్ధతిలో మంచి ధరకుగానీ అమ్ముకునేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక గ్రూపులకు రైతు బజార్లలో డీఆర్డీఏ ద్వారా స్టాళ్లు ఏర్పాటు చేసి వాటిని బలోపేతం చేయాలని చెప్పారు. రైతు బజార్లలో మంచినీటి సౌకర్యం కల్పించి మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని, వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ సుభాషిణి, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి పద్మశ్రీ, రైతు బజార్ల ఎస్టేట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
చెలరేగిన అగ్గి.. చేలు, ఇల్లు బుగ్గి
బల్లికురవ/అద్దంకి/దొనకొండ: ప్రకాశం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం సంభవించిన అగ్ని ప్రమాదాల్లో పంట పొలాలు, ఓ ఇల్లు దగ్ధమయ్యాయి. కాల్చిన సిగరెట్ పీకను ఆర్పకుండా పొలంలోకి విసరడంతో ఎనిమిది ఎకరాల్లో సుబాబుల్ తోట అగ్నికి ఆహుతైన ఘటన బల్లికురవ మండలంలోని ఉపమాగులూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాంబశివరావు, నాగేశ్వరరావు, వీరయ్య ఎనిమిది ఎకరాల్లో సుబాబుల్ సాగు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ ఆర్పకుండా విసరడంతో ఒకరి తోటలో నుంచి మరొకరి తోటలోకి మంటలు వ్యాపించాయి. సుమారు రూ.8 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. గృహోపకరణాలు దగ్ధం విద్యుత్ షార్ట్సర్క్యూట్తో గృహోపకరణాలు దగ్ధమైన సంఘటన అద్దంకి పట్టణంలోని రామ్నగర్లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న మోటుపల్లి శ్రీనివాసరావు గృహంలో విద్యుత్ మోటారు షార్ట్సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేసేలోగా ఒక వాషింగ్ మెషిన్, విద్యుత్ మోటారు కాలిపోయాయి. రూ.50 వేల నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు. బూడిదైన మొక్కజొన్న పంట అద్దంకి మండలంలోని చిన్నకొత్తపల్లిలో విద్యుత్ లైన్ జంపర్ తెగి నిప్పు రవ్వలు పడటంతో మొక్కజొన్న తోటలో మంటలు చెలరేగాయి. గ్రామానికి చెందిన చెన్నుపాటి స్వాములు రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పొలంలోని విద్యుత్ తీగ జంపర్ తెగి నిప్పు రాజుకోవడంతో పంట పూర్తిగా కాలిపోయింది. రూ.1.20 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు చెప్పారు. రుద్రసముద్రంలో.. దొనకొండ మండలంలోని రుద్రసముద్రం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ వద్ద మంటలు చెలరేగి మొక్కజొన్న పంట కాలిపోయింది. రైతు చెన్నుబోయిన శ్రీను రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా పంట కోతకు వచ్చింది. పొలం గట్టుపైన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి మొక్కజొన్న తోటకు అంటుకున్నాయి. రూ.1.20 లక్షల విలువైన పంట, రూ.35 విలువ గల డ్రిప్ పైపులు మంటల్లో బూదిదయ్యాయని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం చేసిన అప్పు తీరుతుందనుకుంటున్న తరుణంలో కళ్ల ముందే పూర్తిగా దగ్ధమైందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు. -
నల్లమల ఘాట్లో మొరాయించిన లారీ
గిద్దలూరు రూరల్: నల్లమల ఘాట్ రోడ్డులో గ్రానైట్ లారీ ప్రమాదానికి గురై మొరాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. కనిగిరి నుంచి తాడిపత్రికి గ్రానైట్ బ్లాకులు తరలిస్తున్న ట్రాలీ లారీ ప్రమాదవశాత్తు రోడ్డుపై నిలిచిపోవడంతో సుమారు 4 గంటల పాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. నంద్యాల నుంచి గిద్దలూరుకు వచ్చే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుపై ఆగిన లారీ -
మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
యర్రగొండపాలెం: స్నేహితులకంటే మార్కులు తక్కువగా వచ్చాయని మనోవేదనకు గురైన టెన్త్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వైపాలెం మండలంలోని అమానిగుడిపాడులో గురువారం చోటుచేసుకుంది. నరసరావుపేటలోని ఒక పబ్లిక్ స్కూల్లో నంబూరి చంద్రశేఖర్ 10వ తరగతి చదివాడు. పబ్లిక్ పరీక్షలు పూర్తయిన వెంటనే స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులతోపాటు పొలం వద్దకు వెళ్తున్నాడు. టెన్త్లో పాసైనట్లు తల్లిదండ్రులకు చెప్పి పొలం నుంచి ఇంటికి వెళ్లాడు. స్నేహితులతో ఫోన్లో మాట్లాడి వారికి వచ్చిన మార్కులు తెలుసుకున్న చంద్రశేఖర్ తనకు తక్కువ మార్కులు వచ్చాయని మనోవేదనకు గురయ్యాడు. ఇంట్లో తాడుతో ఉరివేసుకోగా.. అదే సమయంలో అక్కడికి చేరుకున్న స్నేహితులు గమనించారు. స్థానికుల సహాయంతో ఉరిని తప్పించి యర్రగొండపాలెంలోని ఓ ప్రవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాలుడిని ఎంఈవో ఆంజనేయులు పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. -
అనధికారం.. అధికార దర్పం!
తాళ్లూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన దరిమిలా టీడీపీ నేతలు అధికార దర్పం ప్రదర్శిస్తుండగా.. అధికారులు కూడా అందుకు వంతపాడుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్శి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి ఆహ్వానం పంపకపోగా శిలాఫలకాలపై సైతం నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేత జి.లక్ష్మి ఫొటోలు పెట్టడం గమనార్హం. తాళ్లూరు మండంలంలోని తురకపాలెంలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ, చిన్నపాటి చప్టా నిర్మించారు. వీటి ప్రారంభోత్సవ శిలాఫలకాలపై ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే బూచేపల్లి ఫొటో ముద్రించాల్సి ఉంది. అధికారులు అత్యుత్సాహంతో టీడీపీ నేత జి.లక్ష్మి ఫొటో పెట్టి స్వామిభక్తిని చాటుకున్నారు. చీమకుర్తి రూరల్: బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన చీమకుర్తి మండలంలోని రామతీర్థం సెంటర్లో ఒంగోలు–కర్నూలు రోడ్డుపై శుక్రవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. కూనంనేనివారిపాలెం గ్రామానికి చెందిన రాతికింది గోపి(33) ఒంగోలు జీజీహెచ్కు వెళ్లి తన బైక్పై చీమకుర్తి వస్తున్నాడు. ఈ క్రమంలో ఒంగోలు నుంచి మార్కాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో గోపి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చీమకుర్తి సీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం అంబులెన్స్లో ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఒంగోలు జీజీహెచ్లో మార్చురీ వద్ద మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. వలేటివారిపాలెం: ఆగి ఉన్న ట్రాక్టర్ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో పాస్టర్ మృతి చెందిన సంఘటన వలేటివారిపాలెం మండలంలోని రోళ్లపాడు అడ్డ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. వలేటివారిపాలేనికి చెందిన సీహెచ్ సేనాపుత్ర పాస్టర్గా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె బిలారాణి హైదరాబాద్లో విద్యాభ్యాసం చేస్తోంది. శుక్రవారం కందుకూరు చేరుకున్న ఆమెను తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో రోళ్లపాడు అడ్డ రోడ్డు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టారు. దీంతో రోడ్డుపై పడిపోయిన సేనాపుత్ర, బిలారాణికి గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వారు గమనించి 108లో కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో సేనాపుత్ర (45) మృతి చెందారు. బిలారాణి స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వేసవి సెలవులకు ఇంటికి వస్తున్న కుమార్తెను తీసుకొస్తూ తండ్రి మృతి చెందంలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కళ్ల ముందే తండ్రి మృతి చెందడాన్ని చూసి బిలారాణి గుండెలవిసేలా రోదిస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కనిగిరి రూరల్: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద మార్చి 26న టూరిస్ట్ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన ఆరుగురు, తీవ్ర గాయాలపాలైన 14 మంది కుటుంబ సభ్యులకు శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ సహాయ చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో క్షతగాత్రుడికి రూ.2 లక్షలు, మృతుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి రూ 5 లక్షల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శివరామిరెడ్డి, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. దర్శి నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించని అధికారులు శిలాఫలకాలపై దర్శి ఎమ్యెల్యేకు బదులు టీడీపీ నేత ఫొటో -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
మార్కాపురం టౌన్: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మార్కాపురం పట్టణంలోని నాగులవరం రోడ్డులోగల నానాజాతుల కాలనీలో చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన షేక్ బాషా(43) తన ఇంటిలో ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి హుటాహుటిన మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన బాషాకు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానంతో మద్యం తాగినప్పుడు ఘర్షణ పడుతుండేవాడని, వేధింపులు భరించలేక పెద్ద కుమార్తెతో కలిసి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని మృతి చెందినట్లు సమాచారం. -
బాలికల ఉన్నతికి కిశోరీ వికాసం
మార్కాపురం టౌన్: విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞానం, నైతిక విలువలు, మంచి అలవాట్లు నేర్చుకోవాలని కలెక్టర్ విజయ సునీత సూచించారు. పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం కిశోరీ వికాసం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 11 వరకు నిర్వహించే కిశోరీ వికాసం కార్యక్రమాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్, విద్య, సోషల్ వెల్ఫేర్, స్కిల్ డెవలప్మెంట్, మెప్మా శాఖల అధికారులు పలు విషయాలపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, పోషకాహారాల ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఇన్చార్జి పద్మావతి, డీఎల్డీఓ బాలూ నాయక్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాహుల్, నైపుణ్యాభివృద్ధి అధికారి కంచిబాబు, సీఐ అల్తాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో పోస్టర్ ఆవిష్కరణ ఒంగోలు సబర్బన్: కిశోరీ వికాసం వేసవి కార్యక్రమం పోస్టర్ను శుక్రవారం కలెక్టర్ పి.రాజాబాబు స్థానిక ప్రకాశం భవన్లోని తన చాంబర్లో ఆవిష్కరించారు. కిశోరీ వికాసం కార్యక్రమంలో భాగంగా 11 నుంచి 18 ఏళ్ల పిల్లలకు విద్య ప్రాముఖ్యత, సంపూర్ణ ఆరోగ్యం, పోషకాహారం, రుతు పరిశుభ్రత, లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం, బాల్య వివాహాల నిషేధ చట్టం, టీనేజ్ ప్రెగ్నెన్సీ చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ నాగమణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, అర్బన్ సీడీపీఓ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్లు విజయ సునీత, రాజాబాబు -
మైనింగ్ అధికారుల విస్తృత తనిఖీలు
మార్కాపురం రూరల్: మార్కాపురం మండలంలోని ఇడుపూరు, తదితర గ్రామాల్లో మైనింగ్, రెవెన్యూ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలపై సాక్షి దినపత్రిక 8వ పేజీలో ఏప్రిల్ 30వ తేదీ ‘కొండలు తొలిచి.. కోట్లు దోచి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. కొంతకాలంగా రాత్రింబవళ్లు మట్టి అక్రమ రవాణా జరుగుతూనే ఉన్నప్పటికీ అఽధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దానిపై సాక్షి దినపత్రికలో కథనాలు ప్రచురించడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించడం చర్చనీయాంశమైంది. అక్రమ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారులు హెచ్చరించారు. ఇకపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు మాత్రం ఈ చర్యలన్నీ తాత్కాలికం కాకుండా శాశ్వతంగా కొనసాగాలని, మట్టి మాఫియాపై పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
కక్ష సాధింపులు పరాకాష్టకు..
కొండపి: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన పూర్తిగా గాడితప్పిందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ విమర్శించారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలు పరిష్కరించకుండా డైవర్షన్ పాలిటిక్స్తో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వాటి గురించి ప్రశ్నిస్తున్న గొంతుకలు నొక్కే ప్రయత్నం మాత్రమే చేస్తోందన్నారు. ముఖ్యంగా ప్రశ్నించే ప్రతిపక్షాలపై కక్ష సాధించే ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. పోలీస్ వ్యవస్థ పనితీరు ఎప్పుడో గాడితప్పిందని విమర్శించారు. చట్టపరంగా వేధింపులు, అంతకుమించి బహిరంగంగా బెదిరింపులతో పోలీసు వ్యవస్థ నవ్వుల పాలయ్యే పరిస్థితికి చేరిందన్నారు. వైఎస్సార్ సీపీ మీడియా ప్రధాన కార్యదర్శి శ్రీహరి ఉదంతమే అందుకు నిదర్శనమని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. 15 రోజుల క్రితం అతన్ని ఎందుకు అరెస్టు చేశారో ఎవరికీ తెలియదని, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారని విమర్శించారు. అరెస్టు చేసిన తర్వాత కుప్పం కోర్టుకు రిమాండ్కు తీసుకెళ్తే.. చివరికి కోర్టే రిమాండ్ను తిరస్కరించిందని, వెంటనే పోలీసులు హైకోర్టును ఆశ్రయించారని వివరించారు. పోలీసులే టీడీపీ కార్యకర్తల్లా ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కుప్పం కోర్టు ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేయగా, మళ్లీ వెంటపడి బెంగళూరులో అతన్ని అరెస్టు చేశారన్నారు. గురువారం కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసినా కక్షపూరితంగా పేరు మార్చి అదే కేసుతో అతన్ని వేధింపులకు గురిచేయడం వంటివి చూస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీహరిని బయటకు రానివ్వకుండా చేయాలన్నది కూటమి ప్రభుత్వం ఉద్దేశమని అర్థమవుతోందన్నారు. విజయవాడలో సోషల్ మీడియా కార్యకర్త కరీముల్లా తన షాప్నకు ఎదురుగా టీడీపీ ఫ్లెక్సీలు కట్టవద్దన్నందుకు అక్రమ కేసులు బనాయించారని, సాక్షి టీవీ రిపోర్టర్పై అన్యాయంగా దాడి చేసి గాయపరిచారని ధ్వజమెత్తారు. దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చట్టాలను చేతిలోకి తీసుకుని వ్యవస్థను మేనేజ్ చేస్తోందన్నారు. రాష్ట్రంలో డీజిల్ సమస్య పెరిగి కూరగాయల ధరలు అమాంతం పెరిగాయన్నారు. రైతాంగం పడుతున్న ఇబ్బందులకు సమాధానం చెప్పలేక అక్రమ కేసులతో ప్రజలను పాలకులు డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని ఆదిమూలపు సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, తప్పక విజయం సాధిస్తామఽఽని ధీమా వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి బెదిరేది లేదని, తమ నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ధైర్యంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ అక్రమ కేసులు విత్ డ్రా చేసుకోవాలని, లేనిపక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
గిరిజన గురుకుల పాఠశాలలో ప్రవేశాలు
మార్కాపురం: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మార్కాపురంలోని గిరిజన గురుకుల పాఠశాలలో 3 నుంచి 8వ తరగతి వరకూ బ్యాక్లాగ్ ఖాళీల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రిన్సిపల్ నాగమల్లీశ్వరి బుధవారం తెలిపారు. మూడో తరగతిలో ఎస్టీలకు 10, ఎస్సీలకు 5, బీసీలకు 2, ఓసి 1, పీహెచ్సి 1 సీట్లు ఉన్నాయన్నారు. 4 నుంచి 8వ తరగతి వరకూ ఖాళీగా ఉన్న సీట్లు కేవలం ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తామన్నారు. అప్లికేషన్లను స్థానిక గిరిజన గురుకుల పాఠశాలలో తీసుకొని భర్తీ చేసి వచ్చేనెల 20వ తేదీలోపు ఇవ్వాలని తెలిపారు. వివరాలకు 83339 25183, 77025 32468 నంబర్లను సంప్రదించాలన్నారు. ఐనముక్కల గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో.. పెద్దదోర్నాల: మండల పరిధిలోని ఐనముక్కలలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నూర్జహాన్ తెలిపారు. వివిధ తరగతులకు సంబంధించి ఖాళీగా ఉన్న సీట్లను రిజర్వేషన్ల దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తారన్నారు. పూర్తి వివరాలకు 75694 30300 నంబర్కు సంప్రదించాలని ఆమె కోరారు. ఒంగోలు: ఒంగోలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వి.పల్లవిని నియమిస్తూ ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె గాజువాక 3వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్గా విధులు నిర్వహిస్తూ ఒంగోలుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఈస్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్.హేమలతను హిందూపూర్కు బదిలీ చేశారు. ఒంగోలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్ ఇబ్రహీం షరీఫ్ను శ్రీకాకుళానికి, శ్రీకాళహస్తిలో విధులు నిర్వహిస్తున్న బి.బేబీరాణిని చీరాలకు, ఏలూరులో బాధ్యతలు నిర్వహిస్తున్న కేకేవి బులికృష్ణను కందుకూరు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలోని గ్రామాల రూపురేఖలను మార్చుతూ పరిశుభ్రంగా పచ్చదనంతో ఉంచాలని కలెక్టర్ విజయసునీత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో స్వచ్ఛపథం కార్యక్రమంలో భాగంగా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ పథం కార్యక్రమం అమలు పోస్టరును పంచాయతీరాజ్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. గ్రామాల్లో రహదారుల వెంట ఉన్న చెత్తకుప్పలను తొలగించి రోడ్లను ఆకర్షణీయంగా ఉంచాలన్నారు. ఇప్పటి నుంచి ప్రతి బుధవారం స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని తెలిపారు. పీఆర్–1 యాప్లో కార్యక్రమ వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. ఎంపీడీఓలు పర్యవేక్షణ చేసి ఉన్నతాధికారులకు పురోగతి నివేదికలు పంపాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు, డీఎల్పీఓ బాలూనాయక్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కప్పం కట్టాల్సిందే..
గ్రావెల్ మాఫియా అరాచకాలను అధికారులు చూసీ చూడనట్టు వదిలేయడం వెనుక తీవ్ర స్థాయిలో రాజకీయ ఒత్తిడి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒప్పందం మేరకు గ్రావెల్ మాఫియా సిండికేట్ మార్కాపురం టీడీపీ ముఖ్యనేతకు టిప్పర్కు రూ.1000, ట్రాక్టర్కు రూ.300 చొప్పున కప్పం కడుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. నాలుగు నెలల క్రితం మార్కాపురం జిల్లాను ప్రకటించిన తర్వాత వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఆయా వెంచర్లకు హంగులు దిద్దేందుకు అవసరమైన మట్టిని మార్కాపురం చుట్టుపక్కల గ్రామాల్లోని కొండ ప్రాంతాలు, చెరువుల నుంచే భారీగా తరలిస్తున్నారు. కప్పం కట్టని టిప్పర్లు, ట్రాక్టర్లను సీజ్ చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మాఫియా నియంత్రణతో మట్టి ధరలు అమాంతం పెరిగాయి. దూరాన్ని బట్టి ఒక టిప్పర్ మట్టికి రూ.5000కు పైగా, ట్రాక్టర్కు రూ.1300కు పైగా వసూలు చేస్తున్నారు. సాఽమాన్య ప్రజలు చిన్నచిన్న అవసరాలుకు కూడా మట్టి తోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. -
అకాల వర్షం..అపార నష్టం
కంభంలో నేలకొరిగిన మామిడి చెట్టు కంభం మండలం పోరుమామిళ్లపల్లి ఇలాకాలో నేలకొరిగిన అరటి తోటలు కంభం: మంగళవారం సాయంత్రం వీచిన పెనుగాలులు, భారీ వర్షానికి కంభం చెరువు ఆయకట్టు కింద సాగులో ఉన్న సుమారు 50 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని పోరుమామిళ్లపల్లి గ్రామ ఇలాకాలో సాగు చేస్తున్న అరటి చెట్లు ప్రస్తుతం పూత, కాపు దశలో ఉన్నాయి. పెనుగాలుల వీచడంతో కొందరి రైతుల తోటలు పూర్తి స్థాయిలో నేలకొరిగి పోగా మరి కొందరు రైతులకు చెందిన తోటల్లో సగానికి పైగా చెట్లు నేలకొరిగిపోయాయి, చెరువుకట్ట సమీపంలో సాగులో ఉన్న పలు తోటల్లో సైతం అరటి చెట్లు నేలకొరిగాయి. ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశామని, మరో మూడు నాలుగు నెలల్లో కోతకు వస్తే పెట్టుబడులు పోనూ లాభాలు వస్తాయన్న గంపెడాశతో ఉన్న రైతులు ఒక్కసారిగా వీచిన పెనుగాలులకు చెట్లన్నీ ఇలా నేలకొరిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. గతంలో మోంథా తుఫాన్ దాటికి పలు తోటలు దెబ్బతినగా మిగిలిన తోటలను కాపాడుకుంటూ వచ్చిన రైతులకు ఇలా మరో నష్టం వాటిల్లింది. మోంథా తుఫాను పరిహారమే నేటికి అందలేదని రైతులు వాపోతున్నారు. నేలరాలిన మామిడి పెనుగాలులకు చెట్లకు ఉన్న మామిడి కాయ లు సగానికి పైగా రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పోరుమామిళ్ల ఇలాకాలోని పంటపొలాల్లో ఓ పెద్ద మామిడి చెట్టు నేలకొరిగిపోయింది. ఇంకా పలు చోట్ల మామిడి, ఇతర చెట్లు నేలకొరిగాయి. గిద్దలూరు రూరల్: బలమైన ఈదురుగాలుల కారణంగా మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు అపారనష్టం మిగిల్చింది. గడికోట గ్రామ పంచాయతీ దేవనగరం గ్రామంలో నెమిలయ్యకు చెందిన కోళ్లఫాం ఈదురు గాలుల కారణంగా పూర్తిగా నేలమట్టమైంది. దీంతో నెమిలయ్యకు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. కోళ్లఫామ్లోని ఫ్యాన్లు, వెంటిలేషన్ మిషన్లు, ఇతర సామాన్లు, కొట్టం షెడ్డు మొత్తం ధ్వంసమయ్యాయి. ఆర్థికంగా నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవిస్తున్నాడు. బురుజుపల్లె గ్రామంలో తంగెళ్ల నారాయణరాజుకు చెందిన నాలుగు ఎకరాల అరటి తోట పూర్తిగా ధ్వంసమైంది. రూ.లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. పెనుగాలులకు కంభంలో నేలకొరిగిన అరటి తోటలు సుమారు 50 ఎకరాల్లో పంటనష్టం -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
రాచర్ల: గుప్తనిధుల కోసం గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు చేశారు. ఈ సంఘటన మండలంలోని యడవల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. పురాతన ఉమామహేశ్వర ఆలయంలో మంగళవారం రాత్రి గాలివాన కారణంగా గ్రామంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆలయంలోని ధ్వజస్తంభంతో పాటు నందీశ్వరుడి విగ్రహం చుట్టు దాదాపు మూడు అడుగుల లోతు వరకు గుప్తనిధుల కోసం గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు చేశారు. రాచర్ల ఎస్సై పి.కోటేశ్వరరావుకు సమాచారం ఇవ్వగా గ్రామంలోని ఉమామహేశ్వర ఆలయంలోని ధ్వజస్తంభంతో పాటు నందీశ్వరుడి విగ్రహం చుట్టు ఉన్న తవ్వకాలను బుధవారం పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని చెన్నకేశవనగర్లో ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు నగలు, నగదు అపహరించిన సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం మేరకు వివరాలు.. చెన్నకేశవనగర్లో నివాసం ఉంటున్న తిప్పిరెడ్డి వెలుగొండారెడ్డి ఈ నెల 22న బెంగళూరులో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన బంధువు ఒకరు వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వెళ్లగా ఇంటి తలుపు పగలగొట్టి ఉంది. దీంతో వెలుగొండారెడ్డికి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. ఇంటి యజమాని సూచన మేరకు లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులో దాచి ఉంచిన బంగారు నగలు, రూ.25 వేల నగదు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ చోరీకి విఫలయత్నం మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులో ఉన్న ఓ వైద్యశాల సమీపంలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన మోటారు సైకిల్ను మంగళవారం రాత్రి చోరీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. తమ పాచిక పారకపోవడంతో వెనుదిరిగారు. కంభం: మండలంలోని చిన్నకంభం గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ట్రావెల్స్ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు. పోరుమామిళ్లపల్లి గ్రామానికి చెందిన మారాబత్తుని శ్రీనివాసరావు(23) నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ● 20 తులాల బంగారు నగలు, రూ.2 లక్షల నగదు అపహరణ పెద్దారవీడు: వైద్య చికిత్స కోసం ఓ కుటుంబం గుంటూరు వెళ్లగా.. దొంగలు చేతివాటం చూపి భారీగా నగలు, నగదు కొల్లగొట్టారు. ఈ సంఘటన పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆనెకాళ్ల వెంకటేశ్వరెడ్డి వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం గుంటూరు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన దొంగలు లోపలికి చొరబడి బీరువాను బద్ధలుకొట్టారు. అందులో ఉన్న 20 తులాల బంగారు నగలు, రూ.2 లక్షలు నగదును అపహరించారు. వెంకటేశ్వరరెడ్డి ఇంటి తలుపులు బుధవారం ఉదయం తెరిచి ఉండటాన్ని పక్కింటి వారు గమనించారు. ఆస్పత్రికని వెళ్లిన వారు అప్పుడే తిరిగొచ్చారా అని పక్కింటి వారు లోపలికి వెళ్లి చూడగా ఎవరూ కనిపించకపోవడంతోపాటు బీరువా తలుపులు తీసి ఉన్నాయి. చోరీ జరిగిందని అనుమానం రావడంతో వెంటనే వెంకటేశ్వరరెడ్డికి సమాచారం అందించారు. వారు ఇంటికి వచ్చి చూడగా బీరువాలో ఉన్న బంగారు నగలు, డబ్బు కనిపించలేదు. బాధితుల సమాచారంతో సంఘటన స్థలాన్ని త్రిపురాంతకం సీఐ హసన్, ఎస్సై సైదుబాబు పరిశీలించారు. ఒంగోలు నుంచి క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇద్దరు కుమార్తెల వివాహం కోసం కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దొంగలు కాజేయడంపై వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
మార్కాపురం మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా ముఖ్య నేత అండతో అడ్డగోలుగా గ్రావెల్ దందా?
అర్ధరాత్రి వేళ.. పదుల సంఖ్యలో టిప్పర్లు రోడ్డుపై రొదపెడుతూ దూసుకెళ్తున్న దృశ్యాలు మార్కాపురం పరిసరాల్లో నిత్యకృత్యంగా మారాయి. చెరువు గర్భాల్లో.. కొండ అంచుల వెంట జేసీబీలు, పొక్లెయిన్లు చేస్తున్న చప్పుడు అంతా ఇంతా కాదు. ఇదంతా అభివృద్ధిలో భాగం అసలే కాదు. సంపద సృష్టి కోసం మట్టి మాఫియా చేస్తున్న ధ్వంస రచన. ఈ సొమ్మంతా జిల్లా ఖాజానాకో, రాష్ట్ర ఖజానాకో చేరుతుందనుకుంటే పొరపాటే. అక్రమ గ్రావెల్ మైనింగ్తో ఆర్జించిన డబ్బంతా టీడీపీ చోటా నేతల గల్లా పెట్టెలు, ముఖ్య నేతల భోషాణాల్లోకి వెళ్తోంది. చెరువులను చెరబట్టి, కొండలను పిండి చేస్తున్నా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీడీపీ ముఖ్యనేత అండతో గడిచిన రెండేళ్లుగా రోజుకు సరాసరిన 150 నుంచి 200 టిప్పర్ల గ్రావెల్, వందలాది ట్రాక్టర్ల మట్టిని ఆ పార్టీ నాయకులు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యంగా మారింది. కొండలు తొలిచి.. రూ.కోట్లు దోచి! మార్కాపురం రూరల్: టీడీపీ నేతల ధన దాహార్తికి మార్కాపురం మండలంలోని చెరువులు, గుట్టలు, కొండలు గుల్లవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన దరిమిలా టీడీపీ చోటా నాయకుల నుంచి బడా నేతల వరకు ధనార్జనే ధ్యేయంగా సాగిస్తున్న గ్రావెల్ దందా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మట్టి దందాను కట్టడి చేయాల్సిన అధికారుల్లో కొందరు మామూళ్లకు లొంగి, మరికొందరు బెదిరింపులకు తలొగ్గి మౌనం దాల్చినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టాలు, పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి పగలు, రాత్రి తేడా లేకుండా టీడీపీ నేతలు గ్రావెల్ తవ్వి తరలిస్తుండటంపై పలు గ్రామాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం మార్కాపురం పట్టణ శివారు ప్రాంతమైన శివరాంపురం సమీపంలో ఓ వెంచర్కు మట్టి తరలిస్తున్న టిప్పర్ 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి దగ్ధమైంది. టిప్పర్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు కానీ, ఈ ఘటనపై ఎలాంటి విచారణ చేపట్టిన దాఖలాల్లేవు. టీడీపీ నేతల మట్టి దందా మాత్రం యథావిధిగా సాగుతోంది. కొండలు మైదానాలుగా..! మార్కాపురం మండలంలోని చింతకుంట్ల, ఇడూపూరు, పెద్దనాగులవరం కొండ ప్రాంతాలే లక్ష్యంగా టీడీపీ గ్రావెల్ మాఫియా దందా సాగిస్తోంది. భారీ యంత్రాలతో కొండ అంచులను క్రమంగా తొలిచేస్తుండటంతో అవి రూపు కోల్పోతున్నాయి. వాలుగా ఉన్న కొండ ప్రాంతాలన్నీ నిరంతర మట్టి తవ్వకాలతో మైదానాలను తలపిస్తున్నాయి. ప్రకృతి సంపదను దోచేస్తూ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నా సంబంధిత శాఖలు నోరు మెదపకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇడుపూరు, నికరంపల్లి, భూపతిపల్లె, పెద్దనాగువరం, చింతకుంట్ల గ్రామాల పరిసరాలు మట్టి మాఫియాకు అడ్డాగా మారాయి. ట్రాక్టర్లు, టిప్పర్లు నిరంతరం రాకపోకలు సాగిస్తున్నా నియంత్రణ చర్యలు మచ్చుకై నా కనిపించడం లేదు. భూపతిపల్లె చెరువులో ఆ గ్రామ టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో ఇటీవల అడ్డగోలుగా మట్టి తవ్వేశారు. రైల్వే ట్రాక్ కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకుని మొత్తం 1000 ట్రాక్టర్ ట్రిప్పుల మట్టిని తరలించారు. ఒక్కో ట్రాక్టర్కు రూ.1500 చొప్పున దండుకున్నారు. ఇందులో ముఖ్యనేతకూ వాటా చెల్లించినట్లు గ్రామంలో జోరుగా ప్రచారం సాగుతోంది. నిజాలు బయటపెడితే బెదిరింపులే.. గ్రావెల్ మాఫియా దందాను ప్రశ్నించినా, వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన వారిపై టీడీపీ నేతలు అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారు. సామాన్యులైతే నేరుగా బెదిరించడం.. అధికారులు అడ్డు తగిలితే బదిలీల పేరుతో వేధించడం పరిపాటిగా మారింది. నిప్పుతో తలగోక్కోవడం ఎందుకుని భావించిన కొందరు అధికారులు.. మట్టి మాఫియా ఆగడాలపై ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని తెలుస్తోంది. జిల్లా ఉన్నతాఽధికారులు స్పందించి మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
అధికార పార్టీకి జీహుజూర్..
టంగుటూరు: డీజిల్, పెట్రోల్ దొరక్క సామాన్యులు అవస్థలు పడుతుంటే అధికార పార్టీ నాయకులకు, అధికార పార్టీకి చెందిన అనుకూల వ్యక్తులకు కావాల్సినంత లభ్యమవుతోంది. ప్రభుత్వం విధించిన నిబంధనలు వీరికి పట్టవు అన్నరీతిలో అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తోంది బుధవారం సూరారెడ్డిపాలెం సమీపంలోని బీపీసీఎస్ పెట్రోల్ బంకు వద్ద జరిగిన సంఘటన. ఒంగోలు మండలం సమీపంలోని భగీరథ కెమికల్స్కు 500 లీటర్ల డ్రమ్ములకు ఆర్డీఓ అనుమతినిచ్చారు. అయితే డీజిల్ కొట్టించుకునేందుకు 150 నుంచి 200 లీటర్లు పట్టే 15 డ్రమ్ములతో ఆ కంపెనీకి చెందిన ట్రాక్టర్ వచ్చింది. అయితే అక్కడే ఉన్న కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఇన్ని డ్రమ్ములకు డీజిల్ ఎలా కొడుతున్నారంటూ బంకు నిర్వాహకులను నిలదీశారు. అయితే ఆర్డీఓ అనుమతినిచ్చారని, అందుకే డీజిల్ కొడుతున్నామని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. 500 లీటర్లకే అనుమతినిస్తే ఇన్ని డ్రమ్ములు వాహనంలో ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 30 వేల లీటర్లకు పైగా కొట్టి ఉంటారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన వారికి ఇలా నిబంధనలకు విరుద్ధంగా డీజిల్ ఎలా కొడతారని స్థానికులు నిలదీస్తున్నారు. పెట్రోల్ బంకుల యజమానులు అధికార పార్టీకి చెందిన వారితో కుమ్మకై ్క సామాన్య ప్రజలకు ఒక విధంగా, వారికి మరో విధంగా డీజిల్ పోస్తు్ాన్నరని ఆరోపిస్తున్నారు. ఇంతకూ ఎన్ని లీటర్ల డీజిల్ కొట్టారో నిగ్గు తేల్చాలని అధికారపార్టీకి చెందిన ఒక నాయకుడు డిమాండ్ చేయడం కొసమెరుపు. ఈ విషయంపై తహశీల్దారును వివరణ కోరగా 500 లీటర్ల డీజిల్ అనుమతి మేరకు మాత్రమే కొట్టారని చెబుతున్నారు. -
తోటి వారిని అభివృద్ధి చేయాలి
ఒంగోలు వన్టౌన్: సమాజంలో ఆర్ధికంగా ఉన్న వారు తోటి వారిని అభివృద్ధి చేయాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో ఆధునికీకరించిన రెడ్డి హాస్టల్ను వైవీ సుబ్బారెడ్డి బుధవారం రాత్రి ప్రారంభించారు. కార్యక్రమానికి రెడ్డి జనాభ్యుదయ సంఘ అధ్యక్షుడు కేవీ రమణా రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా విద్య పూర్తయిన విద్యార్థులకు ఉపాధి కలుగుతుందని చెప్పారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ నిర్వహణకు నిధులు ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విధంగా ఆడిటోరియం, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అనేక సార్లు హాస్టల్ను పరిశీలించానన్నారు. పేద విద్యార్థుల అభివృద్ధికి తాము ఎప్పుడూ ముందుంటామన్నారు. తన సొంత కళాశాల కంటే, రెడ్డి హాస్టల్పై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం హాస్టల్ చాలా అభివృద్ధి చెందిందన్నారు. విద్యార్థులకు అనేక విధాలుగా సహాయ, సహకారాలు అందించినట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతోనే రెడ్డి హాస్టల్ అభివృద్ధి చెందినట్లు తెలిపారు. విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ, అత్యాధునిక కాన్ఫరెన్స్ హాలు, సోలార్ విద్యుత్, స్టీమ్ కుకింగ్ వంటి వసతులు చేసినట్లు చెప్పారు. జిల్లాకు చెందిన ఐఏఎస్ తాటిపర్తి వెంకారెడ్డి కుమారుడు విద్యార్థుల అభివృద్ధికి దోహదపడుతున్నారన్నారు. అతిథి గృహాన్ని కూడా నిర్మించినట్లు తెలిపారు. నీలం సంజీవరెడ్డి ఒక్కరే ఏకగ్రీవంగా ఎన్నికై న రాష్ట్రపతి అని అన్నారు. రామ రాజ్యాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరిపించారన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ సందర్భంగా రూ.2 కోట్లకు పైగా నిధులతో సోలార్ విద్యుత్, ప్రధాన ద్వారం, గదులకు అటాచ్డ్ బాత్రూంలు, వంటగది, డిజిటల్ లైబ్రరీ, మినరల్ వాటర్ ప్లాంట్, కాన్ఫరెన్సు హాలు, ప్రాంగణం మొత్తం గ్రానైట్ రాళ్ల ఏర్పాటు, అతిథి గృహం తదితర నూతనంగా ఏర్పాటు చేసిన, ఆధునికీకరించిన వివిధ విభాగాలను ప్రారంభించారు. వైవీ సుబ్బారెడ్డి జన్మదినోత్సవం మే 1వ తేదీ సందర్భంగా ముందస్తుగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్డి జనాభ్యుదయ సంఘ కార్యదర్శి అన్నపురెడ్డి చిన ఆదిరెడ్డి, వైవీ భద్రారెడ్డి, వైవీ హనుమారెడ్డి, శిరిపురం విజయభాస్కరరెడ్డి, ఢాకా కృష్ణారెడ్డి, వాకా సంజీవరెడ్డి, భవనం నాగిరెడ్డి, నరహరి రామలింగారెడ్డి, పాలవెల్లి వెంకటేశ్వరరెడ్డి, గోపవరపు నారాయణ రెడ్డి, లింగా రెడ్డి, స్వామి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్, నీలంసంజీవరెడ్డి విగ్రహావిష్కరణలో వైవీ సుబ్బారెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్రెడ్డి, బత్తుల -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయుల సమస్యలపై డీఈవో రేణుకను బుధవారం యూటీఎఫ్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయుల స్పెషల్ ఎడ్యుకేషన్ ఎన్ఓసీలు, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, బీఈడీ కోర్సులు చేసిన ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డీఈఓ రేణుక సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ సూరె వేణుగోపాల్, పోతంశెట్టి రమాదేవి ప్రమోషన్ డేటును నోషనల్ సీనియార్టీ కింద లెక్కించేందుకు త్వరలోనే ప్రొసీడింగ్ ఇస్తామని తెలిపారన్నారు. ఉపాధ్యాయుల పాస్పోర్ట్, వీసా ఎన్ఓసీల గురించి అడిగినప్పుడు వెంటనే క్లియర్ చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల జెడ్పీ పీఎఫ్ సమస్యల మీద జెడ్పీ డిప్యూటీ సీఈఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రవి, జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్హై, సహాధ్యక్షుడు వై.వెంకట్రావు, జిల్లా కోశాధికారి చిన్న స్వామి, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు కొప్పోలు హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు. -
డీజిల్ లేదండీ..
కదలని బండి..డీజిల్ కష్టాలు జిల్లా ప్రజలను వెంటాడుతున్నాయి. ఇప్పటికీ కొన్ని పెట్రోలు బంకుల్లో నోస్టాక్ బోర్డులు పెట్టి మూసేశారు. డీజిల్ కొరతతో గ్రానైట్ పరిశ్రమ స్తంభించిపోయింది. క్వారీయింగ్కు ఉపయోగించే భారీ యంత్రాలు, పొక్లెయిన్లు, టిప్పర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో క్వారీల్లో పనులు ఆగిపోయాయి. కంకర క్రషర్ యూనిట్లూ మూతపడ్డాయి. ఇక ఒంగోలు నగరంలో డీజిల్ కొరతతో మంచినీటి సరఫరా ట్యాంకర్లు నిలిచిపోయాయి. దూర ప్రాంతాలకు సరుకులు రవాణా చేసే లారీలు ఆయిల్ లేక ఒంగోలు లారీ యూనియన్ ఆఫీసు వద్దే ఆగిపోయాయి.– సాక్షి, ఒంగోలు -
గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేది ఎక్కువగా పేదలే..ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుంది..తమ ప్రాణాలు నిలబడుతాయి అన్న ఆశగా వచ్చిన రోగులకు నిరాశే ఎదురవుతోంది. పశ్చిమ ప్రకాశానికి పెద్దదిక్కుగా ఉండే మార్కాపురం సర్వజన ఆస్పత్రిలో వైద్యసేవలు అందని ద్రాక్షగా మారిపోయాయి. నిపుణుల కొరత..పనిచేయని పరికరాలతో కునారిల్లుతోంది. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించే ఐసీయూ కేంద్రం కోమాలోకి వెళ్లిపోయింది. ఏడాదిగా ఆక్సిజన్ ప్లాంట్లు మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. అత్యవసర వైద్యం కోసం ఇక్కడకు వచ్చేవారికి ప్రాథమిక వైద్యం అందించి పక్క జిల్లాలకు పంపుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వైద్యారోగ్య రంగం పడకేసిందన్న దానికి ఈ ఆస్పత్రి ఉదాహణగా నిలుస్తోంది.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు జీజీహెచ్ రోగుల జీవితాలకు ధైర్యమిచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇక్కడ వైద్యసేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయి. ఒక్కసారి జీజీహెచ్ వెళ్లి చూస్తే రోగులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గతంలో 75 మంది డాక్టర్లున్న జీజీహెచ్లో ప్రస్తుతం 18 మంది మాత్రమే ఉన్నారు. జీజీహెచ్లో పనిచేసే వైద్యులందరినీ ఒంగోలు, గుంటూరు, ఏలూరు, కర్నూలు ఇలా పలు ప్రాంతాలకు బదిలీ చేసింది. దీంతో డాక్టర్ల గదులు చాలా వరకూ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఓపీ కూడా 150 నుంచి 170కి పడిపోయింది. పలు అత్యాధునిక వైద్య పరికరాలు, ఇతర మెడికల్ కాలేజీలు, వైద్యశాలలకు పంపారు. దీనితో అత్యవసర వైద్యసేవలకు ఎవరైనా ఒంగోలు, గుంటూరులకు రెఫర్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న డాక్టర్లలో కూడా కొంత మంది త్వరలో బదిలీపై వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.ఏడాది నుంచి ఆక్సిజన్ ప్లాంటు మరమ్మతులకు గురైంది. అప్పటి నుంచి ఈ ప్లాంటు నుంచి సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సమయంలో రోగులకు ఆక్సిజన్ అందించాలంటే ఒక ప్లాంటుపైనే ఆధారపడాల్సి వస్తోందని ఆస్పత్రి వర్గాలు వాపోతున్నాయి. మార్కాపురం: ఒకప్పుడు పశ్చిమ ప్రకాశంవాసులకు మెరుగైన వైద్యం గగనంగా ఉండేది. చిన్నపాటి రోగమొచ్చినా పొరుగు జిల్లాలకు పరుగులు తీయాల్సిందే. ఈ ప్రాంత వాసుల కష్టాలు గుర్తించిన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కాపురానికి మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. రాయవరం వద్ద కళాశాల ఏర్పాటు కోసం రూ.450 కోట్లు కేటాయించారు. దాదాపు 75 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశారు. దీనికి అనుబంధంగా మార్కాపురం వైద్యశాలను జీజీహెచ్గా మార్పు చేశారు. 450 బెడ్లను సిద్ధం చేశారు. ఇందులో జనరల్ సర్జరీ కోసం 100, జనరల్ మెడిసిన్ కోసం 100, ఆర్ధోపెడిక్ విభాగానికి 40, ఆప్తమాలజీ 20, డెర్మటాలజీ 10, సైక్రియాట్రిక్ విభాగానికి 10, ఈఎన్టీకి 20, ఐసీయూ 20, పీడియాట్రిక్స్ 50, గైనకాలజీకి 50 బెడ్లు కేటాయించారు. ఇలా మార్కాపురం జీజీహెచ్ రూపురేఖలు మార్చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 72 మంది వైద్యులను నియమించారు. రెండు ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలతో పాటుగా శ్రీశైలం తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 8 లక్షల మంది ప్రజలు జీజీహెచ్కు వచ్చి అవసరమైన అత్యాధునిక వైద్య చికిత్సను ఉచితంగా చేయించుకునేవారు. వైద్య కష్టాలు తీరినట్టేనని ఈ ప్రాంతవాసులు సంబరపడ్డారు. వైద్యులపై ఒత్తిడి.. తక్కువ మంది డాక్టర్లు ఉండడంతో జీజీహెచ్లో పనిచేస్తున్న వైద్యులపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. క్యాజువాలిటీ, ఐసీయూ, జనరల్ మెడిసిన్ చూడాల్సి రావడం, ఉన్న వైద్యుల్లో కొంతమంది నైట్డ్యూటీలకు వెళ్లాల్సిరావడంతో ఉదయం పూట ఉన్న డాక్టర్లపై భారం పడుతోంది. క్యాజువాలిటీ చూసే డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉంది. ఇటీవల ఒకే డాక్టరుకు వరుసగా డ్యూటీలు వేయడంతో తీవ్రమైన ఒత్తిడితో సెలవుపై వెళ్లినట్టు తెలిసింది. కోమాలో ఐసీయూ జీజీహెచ్లోని ఐసీయూ కేంద్రం కోమాలోకి వెళ్లింది. ఈ విభాగంలో 4 డాక్టర్లు ఉండాలి. ఇందులో ఎండీతో పాటు పలువురు వైద్యనిపుణులు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండటంతో ఇక్కడ వైద్యసేవలు అంతంత మాత్రంగా మారిపోయాయి. ప్రస్తుతం క్యాజువాలిటీలో ఒకరు, జనరల్ సర్జన్లు ముగ్గురు, గైనకాలజీ, ఆర్థోపెడిక్, డెర్మటాలజీ, ఈఎన్టీ, పీడియాట్రిక్ విభాగాల్లో మాత్రమే సేవలు అందుతున్నాయి. -
మహాధర్నాకు మద్దతు ఇవ్వండి
● వైఎస్సార్ టీఏ పిలుపు ఒంగోలు సిటీ: ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ మే 6వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ లో తలపెట్టిన మహా ధర్నాకు ఉపాధ్యాయ సంఘా లు సహకరించాలని వైఎస్సార్ టీచర్స్ అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి కోరారు. ఈ సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర బాధ్యులు, ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ ప్రభాకర్రెడ్డిని కలసి మహాధర్నాలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ ఏర్పాటు, 30 శాతం ఐఆర్ ప్రకటన, 4 డీఏ మంజూరు, పెండింగ్ బకాయిలు చెల్లింపు, ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు హెల్త్ కార్డు మంజూరు,మరణించిన ఉపాధ్యా యుల పిల్లలకు కారుణ్య నియామకాలు సమస్యలపై స్పందించే ప్రతి సంఘ కార్యక్రమాలకు మా మద్దతు ఉంటుందని తెలిపారు. మే 6 వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ చేపట్టే మహా ధర్నాలో పాల్గొంటారని తెలిపారు. ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. -
చెట్టును ఢీకొని వ్యక్తి మృతి
బేస్తవారిపేట: మోటార్ సైకిల్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన చిన్న కంభం రోడ్డులో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..కంభం మండలం యర్రబాలెంకు చెందిన పూసలపాటి బాలఅంకయ్య(40) మోటార్సైకిల్పై బేస్తవారిపేటకు వెళుతూ చిన్నకంభం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలఅంకయ్యను 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. బాలఅంకయ్య బతుకుదెరువు నిమిత్తం గుంటూరులో ఉంటున్నాడు. బంధువుల వివాహం ఉండటంతో రెండు రోజుల క్రితం బేస్తవారిపేట వచ్చాడు. యర్రబాలెంలో ఉన్న తల్లి రంగమ్మ వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య రాజేశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై ఎస్వీ రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మర్రిపూడి: ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని అయ్యవారిపాలెం– జువ్విగుంట సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తంగెళ్ల పంచాయతీ అయ్యవారిపాలెం గ్రామానికి చెందిన కర్నాటి కొండపనాయుడు(40) తన భార్యను ఒంగోలు పంపించేందుకు టంగుటూరు– పొదిలి ఆర్అండ్బీ రహదారి వద్ద వదిలి ద్విచక్రవాహనంపై తిరిగి వెళుతున్నాడు. మార్గమధ్యంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బంధువులు క్షతగాత్రున్ని 108 వాహనంలో వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్సై రమేష్బాబు తెలిపారు. మృతునికి కుమారుడు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బల్లికురవ: మండలంలోని ముక్తేశ్వరం గ్రామానికి చెందిన కొనిదెన రజనీ (35) 12 రోజులుగా కనిపించడం లేదు. దీంతో ఆమె సోదరుడు రామకోటేశ్వరరావు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం మండలంలోని రామాంజనేయపురం గ్రామ సమీపంలోని అట్టపెట్టెల ఫ్యాక్టరీ వెనుక మహిళ మృతదేహన్ని గుర్తించి పశువుల కాపరులు వీఆర్ఓ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఎస్సై వై నాగరాజు పరిశీలించి ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహం రజినీదిగా గుర్తించారు. ఈ మేరకు అదృశ్యం కేసును అనుమానాస్పద మృతిగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, సంతమాగులూరు సీఐ శేషగిరిరావు పరిశీలించారు. ● రైలు ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి ఒంగోలు టౌన్: కుమారుడి పుట్టెంట్రుకలు తీయించడానికి వెళుతూ తిరిగిరాని లోకాలకు చేరాడో తండ్రి. జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం...కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన సంజు కుమార్ హైదరాబాద్లోని టీ స్టాల్లో మాస్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతడికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుమారుడి పుట్టెంట్రుకలు తీయించడానికి మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్లో తిరుపతి బయలుదేరాడు. ఎండలు తీవ్రంగా ఉండడంతో మంచినీళ్ల కోసం ఒంగోలులోని మూడో నంబర్ ప్లాట్ఫారంలో రైలు దిగాడు. నీళ్ల బాటిల్ కొనుక్కొని తిరిగి రైలు ఎక్కే సమయానికి పొరపాటున జారి పడిపోయాడు. రైలు పట్టాల మధ్య పడడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో భార్య పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రంలో గాడి తప్పిన కూటమి పాలన
కొండపి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన గాడితప్పిందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసి మీ చావు మీరు చావండి అన్నట్లు ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తూ అన్ని పరిశ్రమలు తానే తీసుకొచ్చానని డబ్బాలు కొట్టుకుంటున్నాడని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఎక్కడుండి ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదని, ప్రజల కష్టాలను గాలికొదిలేశారని విమర్శించారు. వారం రోజులుగా రాష్ట్రంలో గ్యాస్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టి రాష్ట్ర ప్రజల మీద ఉన్న శ్రద్ధ ఏపాటిదో తెలుస్తోందన్నారు. పెట్రోలు, డీజిల్ కొరతతో నిత్యవసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత పూర్తిగా చంద్రబాబు పాలన వైఫల్యం అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని పెట్రోల్, డీజిల్ కొరత కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు ఉందని, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రేషన్ విధానంలో ద్విచక్ర వాహనాలకు రెండు లీటర్లు, కార్లకు 15 లీటర్లు, పెద్ద వాహనాలకు 50 లీటర్లు విధానంలో పంపిణీ చేస్తున్నారని ఇతర ప్రైవేట్ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కూరగాయల ధరలు 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయని, హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు అమాంతం పెంచేశారన్నారు. సామాన్య ప్రజలకు నిత్యవసర వస్తువులు కొనే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం వారం రోజులుగా చోద్యం చూస్తూ ప్రజలను పట్టించుకోకుండా ఉందని విమర్శించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ బీపీసీఎల్ పెట్రోల్ కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఆయిల్ ట్యాంకర్లు వచ్చేలా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పరిస్థితి చేయి దాటిన తర్వాత పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని పెట్టి మేము ఏదో చేసేశామన్న రీతిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. రెండు రోజుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి తీసుకు రాకపోతే అన్ని పెట్రోల్ బంకుల వద్ద ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికై నా ప్రభుత్వం క్రెడిట్ చోరీని వదిలేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారిస్తే మంచిదని అన్నారు. -
అనుమానాస్పద స్థితిలో చెంచు గిరిజనుడు మృతి
పెద్దదోర్నాల: మండల పరిధిలోని సుందరయ్య కాలనీలో ఓ చెంచు గిరిజనుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మర్రిపాలెం గిరిజన గూడేనికి చెందిన పోలయ్య(35) సుందరయ్య కాలనీలోని బంధువుల ఇంటికి సోమవారం వచ్చాడు. ఈ క్రమంలో రాత్రి అక్కడే పడుకున్న పోలయ్య మంగళవారం ఉదయానికి మృతి చెంది ఉన్నాడు. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, నలుగురు సంతానం. ఈ మేరకు కేసు నమాదు చేసి దర్యాప్తు చేపట్టనునన్నట్లు ఏఎస్సై పోల్రాజు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించనున్నారు. ఒంగోలు టౌన్: నీరు, భూమి,చెట్టు సంరక్షణ కోసం రూపొందించిన వాల్టా చట్టం అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జి.వీరభద్రాచారి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో యథేచ్ఛగా చెట్లు నరికివేత, భూగర్భ జలాల దుర్వినియోగం, చెరువులు కుంటల ఆక్రమణలు జరుగుతున్నాయని తెలిపారు. వాల్టా చట్టం అమలు అధికారులుగా వ్యవహరిస్తున్న తహశీల్దార్లు అసలు పట్టించుకోవడంలేదన్నారు. ఒంగోలు నగరంలోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో 10 చెట్లను నరికివేసినా అధికారులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. -
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
అధికార పార్టీ నాయకుల ప్రాపకం కోసం ట్రాన్స్కో అధికారులు హై టెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాట్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కందుకూరు నుంచి కరేడు వరకూ నిర్మించతలపెట్టిన 220 కేవీ హై టెన్షన్ విద్యుత్ లైన్ నిర్మాణంలో అధికార పార్టీ నేతలకు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాముల మెలికల్లా నిర్మిస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు రైతులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తీగల బంధం..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కందుకూరు నుంచి కరేడు వరకు 220 కేవీ హై టెన్షన్ విద్యుత్ లైను నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ లైను వెళ్లే రూటులో అధికార పార్టీకి చెందిన పొలాలు, మామిడి తోటలు, సపోటా తోటలు తగలకుండా పాము మెలికల్లా తిప్పుతూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దాదాపు 10 మందికి పైగా అధికార టీడీపీకి చెందిన వాళ్ల పొలాల్లో కాకుండా ఇతరుల పొలాల్లోకి వంపులు తిప్పుతున్నారు. దాంతో సంబంధం లేని వాళ్ల మామిడి తోటలు, సపోటా తోటలు మాయం కానున్నాయని రైతులు వాపోతున్నారు. ఇష్టారాజ్యంగా మార్పులు.. అధికార పార్టీ నేతల ఒత్తిడో..పచ్చనోట్ల ప్రభావమో తెలియదని, ట్రాన్స్ కో అధికారుల అలైన్మెంట్ తప్పుగా మార్చడంతో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ లైన్ నిర్మాణానికి కొద్ది నెలల కిందట సర్వే జరిగింది. సాధారణంగా ఒక వంతెన, రోడ్డు, కరెంట్ లైన్, టెలిఫోన్ లైన్ గానీ నిర్మించేటప్పుడు వ్యయ, ప్రయాసలను తగ్గించే తక్కువ దూరాన్ని ఎంపిక చేస్తుంటారు. అయితే విద్యుత్ లైను అలైన్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా దిశను మార్చుకుంది. మన్నేటికోట శివాలయం వద్ద మన్నేరు దాటి తూర్పునకు వచ్చింది. ఇక్కడి నుంచి ఈ లైన్ తూర్పుగా వెళ్లి, చిల్లా కాలువ సమీపంలో జాతీయ రహదారిని దాటి కరేడు పంచాయతీలోకి ప్రవేశిస్తోంది. శివాలయం సమీపంలో మన్నేరు నదిని దాటిన విద్యుత్ లైన్ మార్గాన్ని గ్రామానికి దక్షిణ దిశలో ప్రతిపాదించారు. అయితే ఈ విద్యుత్ లైను కోసం సర్వేయర్లు ప్రతిపాదించిన మార్గం 33 వ పోల్ దగ్గరికి వచ్చేసరికి దిశను మార్చుకుంది. ఉలవపాడు జాతీయ రహదారి, రైల్వే లైన్ చిల్లా కాలువ బ్రిడ్జికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో రైతు పొలం నుంచి నేరుగా అంటే తూర్పుగా చిల్లా కాలువ వైపు వెళ్లాల్సిన విద్యుత్ లైన్ను సర్వేయర్లు 90 డిగ్రీల కోణంలో ఉత్తర దిశకు మళ్లిస్తూ అలైన్మెంట్ మార్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ అలైన్మెంట్ మార్చడంతో పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇవన్నీ కూడా బీసీ కులాలకు చెందిన చిన్న, సన్నకారు రైతుల భూములు. అధికారుల అక్రమాలతో భూములు ఈ లైను కింద పోతున్నాయి. పడమర నుంచి వచ్చే లైను నేరుగా తూర్పునకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, 33 వ పోల్ నుంచి ఉత్తర దిశ తీసుకొని మామిడి తోటలతో పాటు మరికొంతమందికి చెందిన మాగాణి మీదుగా కొంచెం దూరం వెళ్లి, అక్కడ ఇంకో వంకర తిరిగి దక్షిణ దిశగా కొంత దూరం వచ్చాక, అక్కడ ఇంకో వంకర తిరిగి తూర్పు వైపునకు వెళ్లేలా ప్రతిపాదించారు. 33 వ పోల్ నుంచి చిల్లా కాలువ వరకూ తక్కువ ఖర్చుతో, రైతులకు తక్కువ నష్టంతో విద్యుత్ లైన్ నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ, సర్వేయర్లు నిబంధనలు పాటించలేదు. 33వ పోల్ నుంచి హై టెన్షన్ విద్యుత్ లైన్ నేరుగా తీసుకెళ్తే లైను మూడు వంకర్లు తిరగాల్సిన పనిలేదని, పండ్ల తోటలకు నష్టం జరిగే అవకాశం ఉండదని రైతులు చెబుతున్నారు. ఈ లైన్ నిర్మాణం విషయంలో ఏపీసీపీడీసీఎల్కు చెందిన ఒక ఏఈ అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతలకు చెందిన పొలాలు పోకుండా చేసేలా కార్యాచరణను భుజానకెత్తుకున్నట్లు తెలిసింది. ట్రాన్స్ కో అధికారుల వ్యవహారంలో సంబంధం లేకపోయినా సదరు ఏఈ అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.చీకటి ఒప్పందం!రైతుల సమస్యలను పరిశీలిస్తున్నాం హై టెన్షన్ విద్యుత్ లైనులో రైతులు కొంతమంది అభ్యంతరాలు చెప్పారు. సర్వే తిరిగి చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ లైను నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. అయినా రైతుల అభ్యర్థన మేరకు లైనును పరిశీలిస్తాం. తమ సిబ్బందిని పంపించి మళ్లీ ఒకసారి పరిశీలన చేయిస్తా. – కృష్ణారెడ్డి, ఈఈ, ట్రాన్స్కో, ఒంగోలు పరిహారం పేరుతో బొక్కుడుఅధికార పార్టీ నాయకులు, డిస్కం అధికారులు కలిసి ట్రాన్స్ కో అధికారులతో కుమ్మకై ్క పంటలు లేకపోయినా ఉన్నట్లు చూపించి దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హై టెన్షన్ విద్యుత్ లైన్ వెళ్లే రూటులో ఉన్న పొలాల్లో ఉన్న రైతులతో చీకటి ఒప్పందం కుదుర్చుకుని లేని పంటలను ఉన్నట్లు చూపించి పరిహారం పేరుతో తిలా పాపం...తలా పిడికెడు అన్న చందంగా దోచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 10.50 కిలో మీటర్లలో కొంతమంది రైతులతో, పంటలు లేని వారిని గుర్తించి వారితో డిస్కం అధికారులు, అధికార పార్టీ నాయకులు వాటాలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
విద్యుత్ బస్సులు ఆర్టీసీనే నిర్వహించాలి
● యాజమాన్య కుయుక్తులను తిప్పి కొట్టాలి ● ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీరావలి మార్కాపురం టౌన్: ఆర్టీసీలో విద్యుత్ బస్సుల నిర్వహణకు పినాకెల్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీరావలి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి జీ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీనే నిర్వహించాలని, ఈ కారణంగా మూత పడుతున్న డిపోల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఇతర డిపోలకు బదిలీ చేయటాన్ని వెంటనే ఆపాలని కోరారు. జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజలకు అందిస్తున్న సేవలు ఈ విధానాల వలన దూరమవుతాయన్నారు. పొదిలి డిపో కార్యదర్శి వేణు మాట్లాడుతూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతిచ్చి 2031 కల్లా బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చాలన్న కుయుక్తులను తిప్పికొట్టాలని కోరారు. జిల్లా సహాయ కార్యదర్శులు జీ విజయలక్ష్మి, చిరంజీవి, మస్తాన్, సాయి కుమార్ పాల్గొన్నారు. -
వ్యక్తిత్వ విలువలు చాటిన నాటికలు
● ఆకట్టుకుంటున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ నాటకోత్సవాలు చీరాల: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ 9వ నాటకోత్సవాలు ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. స్థానిక కస్తూర్బా గాంధీ మున్సిపల్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి శంకరశెట్టి రంగరామానుజయ్య కళావేదికపై గుంటూరు అభియన ఆర్ట్స్ వారి ‘ఇది అతని సంతకం’ నాటికను ప్రదర్శించారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జీవిత చరమాంకం వరకు వ్యక్తిత్వ విలువలను కాపాడుకున్న ఓ ఆదర్శ వ్యక్తి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. నాటికకు రచన స్నిగ్ద, దర్శకత్వం ఎస్.రవీంద్రారెడ్డి వ్యవహరించారు. అనంతరం చైతన్య కళాస్రవంతి, విశాఖపట్నం వారి ‘అ’సత్యం నాటికను ప్రదర్శించారు. కంటికి కనిపించేదంతా సత్యం కాదని, చెడుకు దోహదపడితే అది అసత్యమని, మంచి పనికి ఉపయోగపడితే అసత్యమైనా దానిని సత్యంగా భావించాలనే సందేశంతో నాటిక సాగింది. నాటికకు కథ మోదుగు శ్రీసుధ, దర్శకత్వం బాలాజీ నాయక్ వ్యవహరించారు. నాటికలోని పాత్రధారులు ఆ పాత్రలకు నటనతో జీవం పోశారు. అనంతరం నాటికల్లోని నటీనటులను, రచయిత, దర్శకత్వం వహించిన వారికి వైద్యులు శంకరశెట్టి కొండలరావు, డాక్టర్ పేట శ్రీకాంత్లు ప్రదర్శనా పారితోషకాన్ని అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఉగాది పురస్కార గ్రహీత, చిత్రకారులు, కవి కోన రమణారావును కళాంజలి తరఫున సత్కరించారు. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు వారిచే నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు కళాంజలి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, వలివేటి మురళీకృష్ణ, పూర్ణా సత్యం, లూక, పొట్టి శ్రీనివాసరావు, దరియా సాహెబ్ తదితరులు తెలిపారు. -
వాహనదారులకు నిత్య నరకం
టంగుటూరు: టంగుటూరు టోల్ప్లాజాలో ఓవర్ లోడు ఫీజు వసూలుతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. రేయింబవళ్లు ఇరువైపులా కిలోమీటర్లకు మేర వాహనాలు నిలిచిపోతుండటంతో అత్యవసర పనులపై వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రులకు వెళ్లే వారు వాహనాలు నిలిచిపోయిన సమయంలో పడే ఇక్కట్లు చెప్పేవీ కావు. గతంలో ట్రాఫిక్లో అంబులెన్సు ఇరుక్కొని 30 నిముషాలు పాటు రోగి, బంధువులు అల్లాడిపోయారు. ఆ సమయంలో అంబులెన్సులోని వ్యక్తి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని వాహనదారులు అధికారులను నిలదీశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మారని టోల్ ప్లాజా యాజమాన్యం తీరు.. ఓవర్ లోడ్ పేరుతో వసూలు చేస్తుండడంతో ప్రతిరోజు గంటలకొద్దీ ట్రాఫిక్ స్తంభిస్తోంది. నిత్యం ఇదే తీరు. ఈ ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాహనదారులు కష్టాలు చెప్పేవి కావు. ఇంత జరుగుతున్న టోల్ ప్లాజా యాజమాన్యం తీరు మార్చుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఓవర్ లోడు వసూలు పేరుతో టోల్ప్లాజా వద్ద వాహనాల నిలిపివేత కిలోమీటర్ మేర నిలిచిపోతున్న వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు -
మేడే స్ఫూర్తితో పోరాటాలు చేయాలి
ఒంగోలు టౌన్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కార్మికులు విశ్రమించకుండా పోరాటాలు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తంబి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నగరంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ పరిసరాల్లోని నోయిడాలో లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు నిరంతర పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. కనీస వేతనాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారన్నారు. జిల్లాలోని 28 మండలాల్లో మేడే సందర్భంగా ఎర్రజెండాలు ఎగరేసి కార్మికుల సత్తా చాటాలని చెప్పారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు సయ్యద్ మున్వర్ బాషా, ముహమ్మద్ బేగ్, చిట్టిబాబు పాల్గొన్నారు. ఒంగోలు: ఏపీ కుడో అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎంపిక మే 4న నిర్వహిస్తున్నట్లు ఏపీ కుడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరి శశిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక స్థానిక శ్రీనగర్ 1వ లైనులోని జూపిటర్ హైస్కూలులో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు జిల్లాకు చెందిన అన్ని కుడో క్లబ్లు, కోచ్లు, రిఫరీలు, క్రీడాకారులు, అర్హులైన సభ్యులు సకాలంలో హాజరై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరి శశిధర్ విజ్ఞప్తి చేశారు. -
డీజిల్ సంక్షోభానికి బాబే కారణం
కనిగిరి రూరల్: రాష్ట్రంలో ఇంధన కొరతకు చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ధ్వజమెత్తారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద పెట్రోల్ బంక్ను మంగళవారం పార్టీ నేతలతో కలిసి ఆయన ప్రత్యక్ష పరిశీలన చేసి విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్నారు. ఈ సంక్షోభం ఏర్పడేందుకు కారణం సీఎం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమేనని తీవ్రంగా ఎండగట్టారు. సర్కార్కు కనీస ముందుచూపు లేక పోవడంతోనే ఇలాంటి దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రజలకు క్యూ లైన్ కష్టాలు నెలకొన్నాయన్నారు. విత్తనాలు, ఎరువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇలా అన్నింటికి రోడ్లపై బారులు తీరాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీలకు కట్టబెట్టేందుకే.. ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు సర్కార్ విఫలం చెందిందని, ప్రచార ఆర్భాటం తప్పా.. ఆచరణ అమలు కరువైందని ఎద్దేవా చేశారు. సంపద సృష్టి పేరుతో చంద్రబాబు తన అనుయాయులు, బినామీలకు లబ్ధి చేసేలా పాలన చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సర్కార్ దుర్మార్గపు పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో తప్పక బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో కరోనా కష్టకాలంలో కూడా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ జగన్ మోహన్రెడ్డిదేనన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పీడీసీసీబీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీ, పార్టీ మండల అధ్యక్షుడు మడతల కస్తూరిరెడ్డి, గంగసాని హుస్సేన్రెడ్డి, ఎంపీపీ గాయం సావిత్రి, మాజీ ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, సూరసాని మోహన్రెడ్డి, ఆవుల భాస్కర్రెడ్డి, తమ్మినేని సుజాతరెడ్డి, ఆయిమల్ల నాగమణి, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, కటికల వెంకటరత్నం, మూలే గోపాల్రెడ్డి, ఒకే రెడ్డి, యక్కంటి శ్రీను, జి.బొర్రారెడ్డి, ఆర్.మాణిక్యరావు, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, రామనబోయిన శ్రీను, డాక్టర్ రసూల్, డాక్టర్ కృష్ణారెడ్డి, జి.అబ్రహం లింకన్, వై.దేవరాజ్, పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, సానికొమ్ము మధుసూదన్రెడ్డి, చింతం శ్రీనివాసుల యాదవ్, మూలే రాజశేఖరరెడ్డి, కంటు గురవయ్య, ఎస్కే ఫయాజ్, పోలిచర్ల రహీంబాషా, ఎస్కే ఖాశింవలి, ఎస్కే కరీముల్లా, ఎస్కే నాగూర్ వలి, కోఆప్షన్ నాయబ్ రసూల్, ఎస్కే సన్నీ, గట్లా విజయభాస్కర్రెడ్డి, దరిశి సుబ్రహ్మణ్యం, దరిశి ఫణికుమార్, పైడిమర్రి ఫణి, పలుకూరి భాస్కర్, రుద్రపాటి సాల్మన్, దమ్మువెంకటయ్య, సుస్మిత, దద్దాల రాములు, పెరికల వెంకటేశ్వర్లు, వంకదారి రాజ, రమేష్, ముత్యాల ప్రతాప్, కె.రవి, ఎం.బాలకృష్ణ, అచ్చయ్య, పి.చెన్నకేశవులు, సంగు కృష్ణారెడ్డి, మడతల నాగిరెడ్డి, మిట్టా రమేష్రెడ్డి, బత్తుల మాలీ యాదవ్, డి.రవి యాదవ్, డి.మాల్యాద్రి యాదవ్ పాల్గొన్నారు. సంపద సృష్టి పేరుతో రాష్టం సర్వనాశనం ఎన్నికల హామీలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ ధ్వజం -
కూలీల ఆటోను ఢీకొట్టిన లారీ
సంతమాగులూరు (అద్దంకి): మిరపకాయల కోత కూలీల ఆటోను లారీ ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కొమ్మాలపాడు సమీపం అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిపై మంగళవారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం..కొమ్మాలపాడుకు చెందిన ఎనమిది మంది కూలీలు ఏల్చూరు గ్రామంలోని మిరపకాయల కోత కూలికి ఆటోలో బయల్దేరారు. ఆటోను కొమ్మాలపాడు నుంచి ఏల్చూరు మధ్యలోని ఓ డెయిరీ సమీపంలో వెనుకగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహబూబ్బీ, ఎస్కే ఖాశింబీ, రుక్సేనాకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నామ్ హైవే అంబులెన్సులో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. ఎస్సై పట్టాభిరామరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కూలీల ఆటోను లారీ ఢీకొట్టిన విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. అందులో ఎనిమిది మంది కూలీలు మాత్రమే ఉండటం, వారిలో ముగ్గురు గాయపడగా మిగిలిన వారు క్షేమంగా ఉండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మార్టూరు: మతి స్థిమితం లేని ఓ వ్యక్తి సెల్ టవర్ పైకి ఎక్కి హడావుడి చేసిన సంఘటన మార్టూరులో మంగళవారం రాత్రి కలకల రేకెత్తించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇతర రాష్ట్రానికి చెందిన మతి స్థిమితం లేని ఓ వ్యక్తి వ్యక్తి గత కొంతకాలంగా మార్టూరులో సంచరిస్తున్నాడు. స్థానిక కొణిదెన రోడ్డులోని వైన్స్ షాపుల సమీపంలో ఉన్న సెల్ టవర్ పైకి ఆ వ్యక్తి ఎవరు చూడకుండా టవర్ చివరి భాగం వరకు వెళ్లి అరుస్తున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించి అగ్నిమాపక వాహనాన్ని రప్పించారు. వాహనం వచ్చేలోగా ఎస్ఐ సుబ్బారావు గంటసేపు శ్రమించి సిబ్బందితో కలిసి ఆ వ్యక్తిని టవర్పై నుంచి జాగ్రత్తగా కిందికి దించారు. కిందికి దిగి వచ్చాక ఆ వ్యక్తి అతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు స్థానికులు గుర్తించారు. ముగ్గురికి గాయాలు తప్పిన పెను ప్రమాదం -
నేడు వైఎస్సార్, సంజీవరెడ్డిల విగ్రహావిష్కరణ
ఒంగోలు వన్టౌన్: ఒంగోలులోని మామిడిపాలెం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఉన్న రెడ్డి హాస్టల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి డా.నీలం సంజీవరెడ్డి, దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల ఆవిష్కరణను బుధవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు రెడ్డి హాస్టల్ కమిటీ అధ్యక్షుడు, రెడ్డి జనాభ్యుదయ సంఘ అధ్యక్షుడు వై రమణారెడ్డి తెలిపారు. విగ్రహాలను రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, హాస్టల్ డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని వాకా సంజీవరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని సిరిపురపు విజయభాస్కర్ రెడ్డిలు సహకారం అందించినట్లు తెలిపారు. అదేవిధంగా హాస్టల్లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్, కాన్ఫరెన్స్ హాలు, హాస్టల్ గదులకు అటాచ్డ్ బాత్రూంలు, వంట గది ఆధునికీకరణ, డిజిటల్ లైబ్రరీ, మినరల్ ప్లాంట్లను కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్యదర్శి అన్నపురెడ్డి చిన ఆదిరెడ్డి, ట్రెజరర్ భవనం నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడు నరహరి రామలింగారెడ్డి, మెంబర్ పాలవెల్లి వెంకటేశ్వర రెడ్డి, ఈసీ మెంబర్ గోపవరపు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వణికించిన గాలివాన
కడపరాజుపల్లెలో నేల కూలిన భారీ వేపచెట్టు బొమ్మలాపురంలో నేల కూలిన అరటి చెట్లు బొమ్మలాపురంలో గాలి తీవ్రతకు నేల కూలిన బొప్పాయి చెట్లు మార్కాపురం: మంగళవారం సాయంత్రం వరకు భానుడి ఉగ్రరూపం దాల్చగా..సాయంత్రం తరువాత ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షం, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, పెద్ద దోర్నాల తదితర ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. పెద్ద ఎత్తున వీచిన గాలులకు పట్టణంలోని ఏకలవ్య కాలనీలో చర్చి వద్ద విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో మార్కాపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గాలీవాన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎకలవ్య కాలనీలోనే పెద్ద వేప చెట్టు విరిగిపడింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షంనీరు రోడ్లపైకి చేరింది. విజయా టాకీస్ ఏరియా, 10వ వార్డు, మీనా మసీద్ తదితర ప్రాంతాల్లో సాగర్ పైపు లైన్ల కోసం ఏర్పాటు చేసిన గుంతలలోకి నీరు చేరి రోడ్డుపైన పారాయి. పెద్దదోర్నాల: మండలంలో అకాల వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం సాయంత్రం సుమారు గంటన్నర పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. భారీ గాలీవాన తీవ్రతకు మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లతో పాటు, పలు దుకాణాల పైకప్పు రేకులు నేలకూలాయి. గాలీవాన తీవ్రతకు మండల కేంద్రంలోని శ్రీశైలం రహదారిలో ఉన్న ఒంటేరు రమణయ్య ఇంటి వద్ద ఉన్న వెలగచెట్టు నేలకూలింది. దీంతో పాటు శ్రీశైలం రహదారిలోని పలు దుకాణాల పైకప్పు రేకులు నేలకూలాయి. మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురంలో మంగళవారం వీచిన భారీ గాలుల తీవ్రతకు పలువురు రైతులకు చెందిన అరటి, బొప్పాయి చెట్లు నేలకూలడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో సుమారు వంద ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు సమాచారం. మండల పరిధిలోని కడపరాజుపల్లెలో గాలీవాన బీభత్సానికి రామాలయం వద్ద నున్న భారీ వేప చెట్టు నేలకూలడంతో పాటు విద్యుత్ స్తంభం పడిపోయింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బొమ్మలాపురంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంత మేర నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది. అయితే కొన్ని రోజులుగా ఎండల తీవ్రతకు అల్లాడిన ప్రజలు మంగళవారం భారీగా కురిసిన వర్షంతో కాస్త సేద తీరారు. మండు వేసవిలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు గంటన్నర పాటు ఈదురుగాలుల బీభత్సం నేలకొరిగిన అరటి, బొప్పాయి చెట్లు వంద ఎకరాల్లో పంట నష్టం కూలిన విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం -
పేదింటికి పెద్ద కష్టం
మర్రిపూడి: ప్రాణాంతక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని దాతల సాయం కోసం ఓ పేద బాలిక ఎదురు చూస్తోంది. పదో తరగతి వరకు విద్యా సాఫీగా సాగినా ఇంటర్ కోసం ఇతర ప్రాంతాల్లో చేరడంతో విద్యను అభ్యసించే క్రమంలో రెండు మూత్రపిండాలూ ఒక్కసారిగా పాడయ్యాయి. అనారోగ్యంతో అల్లాడుతున్న కుమార్తెను కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు మొక్కని దేవుడంటూ లేడు. తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచేందుకు దాతలు ముందుకు రావాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కోరుతున్నారు. ఒంగోలు వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న డాక్టర్ ఆదిమూలపు సురేష్ అక్కడికి వెళ్లి బాలికను పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి అమూల్య ఆరోగ్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. తన వంతు సాయం అందిస్తానని ముందుకొచ్చారు. తనలా మరికొందరు ముందుకొచ్చి ఆ చిన్నారి ప్రాణాలు నిలపాలని ఆదిమూలపు సురేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం కోసం వేడుకోలు మర్రిపూడి మండలం గుండ్లసముద్రం పంచాయతీ కోష్టాలపల్లికి చెందిన చిరుపల్లి రామయ్య, సుజాత దంపతులకు ముగ్గురు పిల్లలు. ఆ కుటుంబం కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వ్యవసాయం చేసినా అప్పులే మిగిలాయి.పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు. రెండో కుమార్తె అమూల్య 10వ తరగతి ఉతీర్ణురాలయ్యాక పొదిలికి సమీపంలోని జువ్వలేరు ప్రభుత్వ కళాశాలలో చేర్పించారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో అమూల్య అనారోగ్యం పాలైంది. 5 నెలల క్రితం ఒంగోలు వైద్యశాలలో పరీక్షలు చేశారు. రెండు కిడ్నీలూ చెడిపోయాయని వైద్యులు ధ్రువీకరించారు. వైద్యులు సూచన మేరకు ప్రస్తుతం ఒంగోలు వైద్యశాలలో డయాలసిస్ చేయించుకుంటోంది. పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి, కూలి పనులకు వెళ్తున్న తల్లి.. బిడ్డకు ఇప్పటి వరకు రూ.3 లక్షలు వరకు ఖర్చు చేశారు. భూమి కౌలుకు తీసుకుని చేసిన వ్యవసాయం రూ.7 లక్షల అప్పు మిగిల్చింది. తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు దాతలను కోరుతున్నారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న విద్యార్థిని డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్న బాలిక అమూల్యను పరామర్శించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ -
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
జిల్లాలో పెట్రోల్, డీజిల్ అవస్థలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 195 పెట్రోలు బంకులు ఉండగా దాదాపు 40 శాతం బంకులు మూతపడ్డాయి. మిగిలిన బంకుల్లో వాహనాలు గంటల తరబడి బారులు తీరి కనిపించాయి. హైవేపై ఉన్న బంకుల వద్ద పెద్ద వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల తిరిగే దాదాపు 2 వేల ఆటోలు మూతపడ్డాయి. ఇదే అదునుగా ఆటో చార్జీలు పెంచేశారు. పెట్రోల్, డీజిల్ ప్రభావం గ్రానైట్ పరిశ్రమపై కూడా పడుతోంది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే అధికార యంత్రాంగం మాత్రం ఎలాంటి కొరత లేదంటూ ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. పెట్రోల్ వెక్కిరిస్తూ.. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు పొన్నలూరు: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పొన్నలూరు ఎస్సై సత్యనారాయణ సోమవారం నిందితుడి వివరాలను వెల్లడించారు. కనిగిరి మండలం బోయపాలెం గ్రామానికి చెందిన కామినేని మనోహర్ మద్యానికి బానిసై చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తన ఆటోలో గ్రామాల్లో తిరుగుతూ ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇళ్లల్లో చొరబడి వస్తువులను దొంగలించి విక్రయించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 24న పరుచూరివారిపాలెం గ్రామంలోని జగనన్న కాలనీలో పట్ట పగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి వస్తువులను దొంగలించాడు. దీంతో బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిఘా ఉంచిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుంచి రూ.30 వేల విలువైన మైక్సెట్, పిండి మిషన్, కారు బ్యాటరీలు, హోమ్ థియటర్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితుడిని ఆదివారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. -
‘ఉపాధి’ పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఒంగోలు సబర్బన్: ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పరిధిలోని ఉపాధి కూలీల వేతనాలు చెల్లించాలని వైఎస్సార్ సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు నన్నెబోయిన రవి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల సమస్యలపై ఒంగోలు నగరంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రకాశం భవన్లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బీసీహెచ్.ఓబులేసుకు పార్టీ నాయకులతో కలిసివచ్చి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సన్నెబోయిన రవి కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనుల్లో కూలీలకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్ పి.రాజాబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. 2025 డిసెంబర్ నెల నుంచి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాల విడుదలకు, జిల్లాలో ఉపాధి హామీలో జరిగిన అవినీతిపై విచారించి, పథకం సక్రమంగా జరిగేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, పనుల వద్ద నీరు, నీడ, మందుల సౌకర్యం కల్పించాలన్నారు. అదేవిధంగా కూలీలు అడిగిన వెంటనే పని కల్పించి వలసలు ఆపాలన్నారు. నకిలీ మస్టర్లు అరికట్టి, నిజాయితీగా పనులు జరిగేట్టు చూడాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనుల్లో బయటపడిన అవినీతిపై చర్యలు తీసుకోవాలన్నారు. పనులు లేక అల్లాడుతున్న జిల్లా కూలీలకు సమృద్ధిగా పనులు కల్పించి, వలసలను ఆపి జిల్లాను ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటైనప్పటి నుంచి ఉపాధి పనుల్లో అవినీతి పెరిగిందన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు నన్నెబోయిన రవి కుమార్తో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి ముల్లంగి రవీంద్ర రెడ్డి, ప్రకాశం జిల్లా యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ బండ్లమూడి వెంకట రాజయ్య, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రటరీ దేవరపల్లి అంజిరెడ్డి, ఘట్టమనేని అశోక్, ఒంగోలు పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు కోటేశ్వరరావు, సన్నపు రెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మీరావళి, వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి, తాత నర్సింహా గౌడ్, యరజర్ల రమేష్ బాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి వెంకయ్య నాయుడు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రైవేటు కంటి ఆస్పత్రులు రిజిస్టర్ చేసుకోవాలిఒంగోలు టౌన్: ఈ నెల 30వ తేదీ లోపల జిల్లాలోని అన్నీ కంటి ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలోని చాంబర్లో సోమవారం జిల్లాలోని కంటి ఆస్పత్రుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ శుక్లం ఆపరేషన్ చేయించుకున్న వారి వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని చెప్పారు. అనంతరం ఆస్పత్రి రిజిస్టర్, శుక్లం ఆపరేషన్లను నమోదు చేసే విధానం గురించి ఆన్లైన్లో శిక్షణ ఇచ్చారు. పోర్టల్ వినియోగం, ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంఘ సెక్రటరీ డాక్టర్ నళిని, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ హేమంత్, పీఎంఓఓలు శ్రీనివాసరావు, ఎన్.వెంకటేశ్వర్లు, పెద్దకాకాని శంకర కంటి ఆస్పత్రి ప్రతినిధి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం నాయకులు -
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోరా..!
మార్కాపురం: మహిళలను కించపరుస్తూ తన మీడియాలో వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 9న ఫిర్యాదు చేస్తే ఇంత వరకూ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికై నా కేసు నమోదు చేయాలని కోరుతూ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్చార్జిలు అన్నా రాంబాబు, దద్దాల నారాయణ యాదవ్ సోమవారం మార్కాపురం డీఎస్పీ డాక్టర్ నాగరాజుకు వినతిపత్రం ఇచ్చారు. వైఎస్సార్ సీపీ మహిళలను కించపరుస్తూ టీడీపీ నాయకులు పోస్టులు పెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయకుండా తమ పార్టీ వారిపై ఎదురు కేసులు నమోదు చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద కాపలా కాస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎర్రబుక్కు పాలనతోపాటు ఎర్రిబుక్కు పాలన సాగుతుందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ విమర్శించారు. మద్యం ఫుల్గా దొరుకుతుండగా పెట్రోల్, డీజిల్ నిల్ అని, తప్పుచేసిన వారిపై కేసులు లేకపోగా, తప్పు చేయనివారిపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ మహిళలను కించపరిచేలా వార్త ప్రచురించిన ఏబీఎన్ రాధాకృష్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుల తల్లులు, భార్యలు, చెల్లెళ్లపై దుర్మార్గంగా ఆయన తన ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాస్తే తాము ఫిర్యాదు చేసినా ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదుచేయలేదని అన్నారు. ఇలాంటివాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా తమ ఫిర్యాదుపై కేసులు నమోదు చేయకపోతే పోలీసు స్టేషన్ల వద్ద ధర్నా చేస్తామని చంద్రశేఖర్ హెచ్చరించారు. వారిపై కేసులు నమోదు చేయండి: అన్నా రాంబాబు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతోపాటు వైఎస్సార్ సీపీ మహిళలను కించపరిచిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. ఈనెల 9న తాము పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. దుర్మార్గమైన వార్తలు రాయడం మంచిది కాదన్నారు. సమాజంలో రుగ్మతలను వెలికితీయాల్సిన బాధ్యతను విస్మరించి మహిళలను కించపరిచేలా రాయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి వార్తలు రాస్తే విలువలు పోతాయన్నారు. జర్నలిజానికి విలువలు అవసరమని అన్నారు. దిగజారి వార్తలు రాయవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో అన్నా కృష్ణచైతన్య, మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, తర్లుపాడు మండల కన్వీనరు మురారి వెంకటేశ్వర్లు, కనిగిరి మాజీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫూర్, జెడ్పీటీసీ ఎం కస్తూరిరెడ్డి, అధికార ప్రతినిధి జీ ఆదినారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కె వెంకటరత్నం, జిల్లా వాలంటీర్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కే నాయబ్రసూల్, డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు ఎం శ్రీహరిరెడ్డి, రమేష్రెడ్డి, త్రిపురాంతకం ఎంపీపీ ఆంజనేయరెడ్డి, యర్రగొండపాలెం మండల ప్రెసిడెంట్ వై ముసలారెడ్డి, జిల్లా కార్యదర్శి ఓబుల్రెడ్డి, మైనార్టీ సెల్ ప్రతినిధి నూర్ అహ్మద్, మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
డీజిల్ ఏడిపిస్తూ!
డీజిల్ దొరక్క ఒంగోలు నగరంలో ఆటోవాలాలు, కార్మికుల కష్టాలుఒంగోలు సబర్బన్: జిల్లాలో 40 శాతం పెట్రోలు బంకులు రెండో రోజు సోమవారం కూడా మూతపడ్డాయి. ఆయిల్ కంపెనీల నుంచి డీజిల్, పెట్రోలు సరఫరా లేకపోవటంతో బంకులు మూసేశారు. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో ఉన్న రెండు బంకులు మూసేశారు. ఉన్న పెట్రోలు బంకుల్లో కొన్నింటిలో డీజిల్ లేకపోతే మరికొన్ని పెట్రోలు బంకుల్లో పెట్రోలు లేదు. దీంతో వాహనదారులు ప్రతి పెట్రోలు బంకు వద్ద బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఆయిల్ సప్లై ఉన్న బంకుల్లో కారుకు రూ.1000, ఆటోకు ఒక్కో బంకులో ఉన్న స్టాకును బట్టి ఒక్కో చోట ఒక్కో ఆటోకు రూ.400 నుంచి రూ.500 చొప్పున కొడుతున్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులకు రూ.200లకు మాత్రమే పడుతున్నారు. హైవేపైన అయితే సుదూర ప్రాంతాలకు భారీ లోడులతో వెళుతున్న లారీల పరిస్థితి దారుణంగా మారింది. రూ.1000 కంటే ఎక్కువ కొట్టకపోవటంతో ఎక్కడ ఆగిపోతాయోనని లారీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు నగరంలో దాదాపు 2 వేలకు పైగా ఆటోలు డీజిల్ కొరత ఉండటంతో పాటు క్యూలైన్లలో నిలబడలేక ఇళ్ల వద్దే ఆపుకున్నారు. గతంలో ఒంగోలు నగరంలో ఎక్కడ నుంచి ఎక్కడికై నా సింగిల్ రన్కు రూ.20 ప్రయాణికుల నుంచి వసూలు చేసేవారు. ఇదే అదునుగా చేసుకొని కొందరు ఆటోవాలాలు రూ.30 వసూలు చేస్తున్నారు. దాంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సమస్య రాకముందు ఒకరిని ఎక్కించుకొని ఆటోలు పోతూ ఉండేవి. అలాంటిది ప్రస్తుతం ఒక్కరు ఆగి ఉంటే ఒక్కరికి ఏమి వస్తాం రూ.50 ఇస్తావా, రూ.75 ఇస్తావా, లేకుండా కొంచెం దూరాభారం అయితే రూ.100 ఇస్తావా అని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. దాంతో ప్రయాణికులు కాళ్లకు పని చెప్పాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బల్క్గా ఆయిల్ పోయవద్దని, డబ్బాల్లో కూడా వద్దని కలెక్టర్ రాజాబాబు పలు బంకులను తనిఖీ చేసిన సందర్భంగా నిర్వాహకులను ఆదేశించారు. పోలీస్ పహారా మధ్య మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో పోలీసు పహారా మధ్య పెట్రోల్, డీజిల్ను వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. పట్టణంలో 8 పెట్రోల్ బంకులు ఉండగా రెండు మూడు చోట్ల మాత్రమే పరిమితంగా పెట్రోల్, డీజిల్ పంపిణీ జరుగుతోంది. పోలీసులు పెట్రోల్ బంకుల్లో డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిమితంగా పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇవ్వడంతో డ్రైవర్లు, కార్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం చుట్టుపక్కల సుమారు 20 గ్రామాల్లో వెయ్యికి పైగా ఆటోలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలందరూ ప్రతిరోజూ ఆటోల ద్వారానే మార్కాపురానికి వచ్చి పనులు చూసుకుని వెళ్తుంటారు. డీజిల్ కొరత కారణంగా పలు చోట్ల ఆటోలను డ్రైవర్లు ఇళ్లకే పరిమితం చేసుకున్నారు. దీంతో పట్టణానికి వచ్చేందుకు కూడా అవస్థలు పడుతున్నారు. సోమవారం సాయంత్రం ఏబీఎం స్కూల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకు వద్ద సుమారు అర కిలోమీటరు మేర వాహనాలు డీజిల్ కోసం బారులు తీరాయి. బ్లాక్లో అమ్మకాలు సింగరాయకొండ: మండలంలోని ఊళ్లపాలెం గ్రామంలో బ్లాక్ మార్కెట్లో డీజిల్ అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. డీజిల్ లీటరు రూ.96 ఉండగా ఇక్కడ మాత్రం బ్లాక్ మార్కెట్లో రూ.150 కు అమ్ముతున్నారని, దీంతో అంతరేటు పెట్టి డీజిల్ కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నామని ఆటోడ్రైవర్లు వాపోతున్నారు. అధిక ధరకు డీజిల్ కొనలేక ఇంటివద్దే ఆటోలు ఆపామని అంటున్నారు. గ్రానైట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం డీజిల్ కొరత గ్రానైట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చీమకుర్తి కేంద్రంగా దాదాపు 50కి పైగా గ్రానైట్ క్వారీలు, 60–70కి పైగా ఉన్న కంకర మిల్లులు, 600కు పైగా ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలపై డీజిల్ కొరత పెను భారంగా మారిందని ఆయా క్వారీలు, కంపెనీల యజమానులు వాపోతున్నారు. రోజుకు 1000 లీటర్లు కూడా దొరక్కపోవడంతో క్వారీలో రాయిని తీసే పనిని తగ్గించుకున్నారు. పైగా రిటెయిల్ అవసరాలకు లీటరు రూ.98 ఉంటే ఇండస్ట్రీ అవసరాలకు ఉపయోగించే డీజిల్పై అదనంగా రూ.55 పెంచి రూ.152 లెక్కన లీటరుకు వసూలు చేస్తున్నట్లు యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఒంగోలులో పోలీసు శాఖ నడుపుతున్న పెట్రోలు బంకు వద్ద బారులుతీరిన వాహనాలు -
ట్రావెల్స్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
● మరొకరికి తీవ్రగాయాలు కంభం: ద్విచక్ర వాహనాన్ని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన అనంతపురం– అమరావతి హైవే రోడ్డుపై సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలో జంగంగుంట్ల గ్రామం వద్ద ఓ ట్రావెల్స్ బస్సు ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న సమయంలో పోరుమామిళ్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న బస్సును దాటుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వాహనంపైకి ఎక్కింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న మల్లెల శ్రీనివాసరెడ్డి (45) అక్కడికక్కడే మృతి చెందగా, అలీ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. -
మే 9న జాతీయ లోక్ అదాలత్
ఒంగోలు: జాతీయ లోక్ అదాలత్ మే 9న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారని, అందులో భాగంగా జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్పర్సన్ టి.రాజ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని రకాల సివిల్ కేసులు, రాజీకి అర్హత కలిగిన క్రిమినల్ కేసులు, వివాహ సంబంధ వ్యాజ్యాలు, మోటారు వాహన ప్రమాద సంబంధ కేసులు, చెక్బౌన్స్ కేసులు, ఇరువర్గాల ఆమోదంతో పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రీలిటిగేషన్ స్థాయిలో కూడా కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజీపడిన అన్ని సివిల్ కేసుల్లో కోర్టు ఫీజును తిరిగి కక్షిదారులకు అందిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా కేసుల పరిష్కారం కోసం అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల ఆధ్వర్యంలో బెంచ్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్పర్సన్ టి.రాజ్యలక్ష్మి తెలిపారు. ● కలెక్టరేట్ వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా ఒంగోలు టౌన్: నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మార్చి నెల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, కార్మికులకు వెంటనే జీతాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొర్నెపాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని, కార్మికులను ఆప్కాస్లోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ...గత పదేళ్లుగా కోవిడ్ కార్మికులు పనిచేస్తున్నా కనీస వేతనాలు అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, లేకపోతే కోవిడ్ కార్మికులను ఆప్కాస్లో కలపాలని కోరారు. కార్మికులకు పీఎఫ్, ఈహెచ్ఎస్ కార్డులు ఇవ్వాలని, మహిళా కార్మికులకు సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు సెలవులు అడిగితే ఇష్టముంటే పనిచేయండి లేకపోతే వెళ్లిపోండని బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. కలెక్టర్ జోక్యం చేసుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో టి.మహేష్, బి.దివ్య, వి.భారతి, జేమ్స్, వంశీ, మోహన్ రావు, ఆర్.రాములు ,రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. వచ్చేనెల 3వ తేదీ జరిగే ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంపై సోమవారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఒంగోలులో కేంద్రియ విద్యాలయం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, నవోదయ విద్యాలయం, డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల, పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు 1728 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ఫణికుమార్, మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, పరీక్షల కోఆర్డినేటర్ రాజేష్, పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాళ్లు, ఈ కేంద్రాలకు నోడల్ అధికారులుగా ఉన్న తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులకు భయపడం
దర్శి: ‘ఎవ్వరూ అధైర్యపడొద్దు..మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. మండలంలోని బొట్లపాలెంలో వీరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. రైతులకు తీవ్ర నష్టంవాటిల్లినా రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా బాబు ప్రభుత్వం విదిల్చిన పాపాన పోలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీసం ఎరువులు, యూరియా కూడా అందించకపోవడంతో రైతులు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రైతులంతా కలిసి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ దొరక్క ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వ అసమర్ధతతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆటోవాలాలు, చిన్న చిన్న లారీల యజమానులు, వాహనాలకు డీజల్ లేకపోతే బాడుగలకు ఎలా వెళ్తారని, వాహనాలకు ఫైనాన్స్ కిస్తీలు ఎలా కట్టాలని...తమ కుటుంబాలు ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంత దయనీయ పరిస్థితులు ఉన్నా ప్రభుత్వానికి, అధికారులకు చిమకుట్టినట్లయినా లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం ప్రభుత్వ అసమర్థతతోనే పెట్రోలు, డీజిల్ కొరత దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
‘మీ కోసం’కు 263 వినతులు
● ఒంగోలులో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్–మీ కోసం) కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 263 వినతులు వచ్చాయి. కలెక్టర్ పి.రాజాబాబు ఆధ్వర్యంలో ప్రకాశం భవన్లోని పీజీఆర్ఎస్ భవన్లో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు తమ వంతుగా బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ కల్పనా కుమారి, డీఆర్వో చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్రెడ్డి, మాధురి, డీపీఓ వెంకటేశ్వరరావు, తదితర అధికారులు పాల్గొని ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మార్కాపురం: మార్కాపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్సెల్ (పీజీఆర్ఎస్)కు 27 అర్జీలు అందాయి. డీఎస్పీ నాగరాజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. అర్జీదారులతో పోలీసులు మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కనిగిరి, వై.పాలెం, గిద్దలూరు సీఐలు శ్రీనివాసరావు, అజయ్కుమార్, రామకోటయ్య తదితరులు పాల్గొన్నారు. ● సుమారు రూ.6 లక్షల నష్టం తాళ్లూరు: కంటైనర్ ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని లక్కవరం ఎస్సీకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుడు కూకట్ల వీరబ్రహ్మం తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న సమయంలో కంటైనర్ ఇంట్లో మంటలు వ్యాపించడంతో స్థానికులు గమనించి వెంటనే దర్శి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పేలోపే ఇంట్లోని కంప్యూటర్, ఫోన్లు, ఫ్యాన్ల్, ఇతర వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.6 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు వీరబ్రహ్మం తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొనకనమిట్ల: పాల లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన జాతీయ రహదారిపై పెదారికట్ల–చినారికట్ల మధ్యలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..చినారికట్ల గ్రామానికి చెందిన కాకునూరి కోటిరెడ్డి(35) తన మోటార్ సైకిల్పై పెదారికట్ల వెళ్లి తిరిగి చినారికట్ల వస్తున్నాడు. ఆ క్రమంలో పొదిలి నుంచి కనిగిరి వైపు వెళుతున్న పాల లారీ ఎదురుగా మోటార్ సైకిల్పై వస్తున్న కోటిరెడ్డిని ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిన కోటిరెడ్డి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ సంఘటనా స్థలానికి కొద్దిదూరం వెళ్లి ఆగింది. కాగా మృతుడు కోటిరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కొనకనమిట్ల పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. కోటిరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పుటూరు (చినగంజాం): మద్యానికి బానిసైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని ఉప్పుటూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ పులి గోపి అందించిన సమాచారం ప్రకారం.. ఉప్పుటూరు గ్రామానికి చెందిన షేక్ నాజర్వలి (20) తల్లిదండ్రులు విడిపోయి తల్లి వేరొక వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతను అమ్మమ్మ దగ్గర ఉంటూ వెల్డింగ్ పనులు చేసుకుంటున్నాడు. మూడు నెలల క్రితం అతని తండ్రి మృతిచెందాడు. కొంత కాలంగా మద్యానికి బానిసైన నాజర్వలి సోమవారం ఇంట్లోనే ఉరేసుకుని మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానిక వీఆర్వో, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు అవివాహితుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అడ్డుకున్న రైతులు...
భూముల్లో ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు తెలుసుకున్న బద్ధిపూడి గ్రామానికి చెందిన ఎస్సీలు తవ్వకాలను అడ్డుకొని నిలిపివేశారు. అయితే రెండు రోజుల నుంచి వారు తవ్వకాలను నిలిపివేయడం వారు వెళ్లగానే తవ్వకాలు చేపట్టడం పరిపాటిగా మారింది. దీంతో సోమవారం భూములకు సంబందించిన వారంతా భూముల వద్దకు వచ్చి వారి భూముల్లో వేసి రోడ్డును జేసీబీతో తొలగించారు. మా భూములను ఆక్రమించుకొని శ్రీరంగరాజపురంకు చెందిన ఓ రైతు జామాయిల్ మొక్కలు కూడా వేశారు. ఆ మొక్కలను కూడా తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. తవ్వకాలు చేపడితే ఊరుకునేది లేదని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్ మురళిని వివరణ కోరగా..ఇసుక తవ్వకాలకు సంబంధించి అనుమతులు ఉన్నాయని చెబుతున్నారని, దీనిపై విచారిస్తున్నట్లు తెలిపారు. దీనిపై గ్రామాల సరిహద్దుల వద్ద కూడా సమస్య ఉందని, పూర్విగా సర్వే చేయించి హద్దు వేయిస్తామని చెప్పారు. -
పెట్రోలు బంకుల్లో కలెక్టర్, ఎస్పీ తనిఖీలు
ఒంగోలు సబర్బన్/ఒంగోలు టౌన్: జిల్లాలోని పలు పెట్రోలు బంకులను సోమవారం కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్రాజు అధికారులతో కలిసి విడివిడిగా తనిఖీ చేశారు. పెట్రోలు, డీజిల్ కొరత కారణంగా రెండు రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. బంకుల నిర్వాహకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వాహనాలకు మాత్రమే ఆయిల్ నింపాలని, బాటిళ్లు, క్యాన్లతో వచ్చే వారికి, పెద్ద మొత్తంలో అడిగే వారికి ఆయిల్ పోయవద్దని ఆదేశింశారు. బ్లాక్ మార్కెట్కు తరలించినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాకు రిజిస్టర్లను పరిశీలించి వాహనదారులకు ఆయిల్ పోస్తున్న తీరుపై ఆరా తీశారు. ఒంగోలు – టంగుటూరు మధ్యలో హైవే పక్కనున్న పెట్రోలు బంకులను కలెక్టర్ తనిఖీ చేయగా, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ ఆంజనేయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ హర్షవర్థన్రాజు ఒంగోలు, చీమకుర్తి పెట్రోలు బంకులను తనిఖీ చేయగా, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, చీమకుర్తి ఎస్సై సంపత్ పాల్గొన్నారు. -
పేదల భూములపై డేగల పంజా...!
కందుకూరు రూరల్: ఉలవపాడు మండలం బద్ధిపూడి గ్రామ రెవెన్యూ, పొలిమేర పరిధిలో మన్నేరు ఒడ్డును 1988లో బద్ధిపూడి గ్రామానికి చెందిన ఎస్సీలకు 72 మందికి ఒక్కొక్కరికి అర ఎకరా చొప్పున ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఈ పొలాల్లో తొలుత వారు మామిడి మొక్కలు సాగు చేశారు. అయితే 1996లో రాళ్లపాడు ప్రాజెక్టు తెగినప్పుడు మామిడి తోటలన్నీ కోట్టుకుపోయాయి. దీంతో రైతులు మామిడి సాగు చేయకుండా వేరుశనగ, జామాయిల్ సాగు చేశారు. అయితే ఏ పంట సాగు చేసినా మన్నేరుకు నీరు వచ్చినప్పుడు నష్టం వాటిల్లుతుంది. దీంతో కొందరు జామాయిల్ సాగు చేస్తుండగా..మరికొందరు ఇతర పనులకు వెళుతూ భూములను పట్టించుకోవడం లేదు. గతంలో ఇసుక తవ్వకాలు చేసుకుంటామని ఎస్పీ రైతులు అధికారులను సంప్రదించినా అనుమతి ఇవ్వలేదు. నాణ్యత..డిమాండ్ ఎస్సీలకు ఇచ్చిన 54.31 ఎకరాల్లోని నాణ్యమైన ఇసుక ఉంది. ఈ ఇసుకకు బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకుల కన్ను ఈ భూములపై పడింది. నాణ్యమైన ఇసుకను తవ్వేసి కోట్ల రూపాయలు వెనకేసుకోవాలని పథక రచన చేశారు. ఈ ఎస్సీల పొలాల పక్కనే మాచవరం రెవెన్యూ పరిధిలో శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన రైతుల పాలాలు ఉన్నాయి. 334/1లో 6.76 ఎకరాలు భూమి ఉంది. ఇందులో కె.బుజ్జమ్మకు సుమారు 2.27 ఎకరాలు ఉన్నట్లు చెబుతున్నారు. మన్నేరు కరకట్ట వెలుపలు మాచవరం రెవెన్యూలోనే 6.76 ఎకరాలు ఉంది. కానీ కె.బుజ్జకు మాత్రం మన్నేరు కరకట్ట లోపలకి 2.27 ఎకరాలు మాత్రమే రికార్డులు ఉన్నాయి. అయితే బుజ్జమ్మ పొలంలో ఇసుక తవ్వకాల పేరుతో ఈ 54 ఎకరాల్లో ఇసుకను తవ్వేలా ప్లాన్ వేశారు. బుజ్జమ్మ పొలంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని కొందరు అక్రమార్కులు రంగప్రవేశం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎదురుతిరుగుతున్నారు. ఎస్సీల భూములకు ఎదురుగా మాత్రమే కె.బుజ్జమ్మ, వారి బంధువులకు పొలం ఉందని, కానీ వారు మన్నేరులోకి వచ్చి ఎలా ఇసుక తవ్వకాలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని చెబుతున్నారని, కానీ చూపించమంటే చూపించడం లేదని రైతులు వాదిస్తున్నారు. రూ.3 కోట్లకు వ్యాపారితో డీల్.. అయితే ఎస్సీలకు ఇచ్చిన పొలాల్లో తవ్వకాలకు శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలతో ఒప్పందం కుదుర్చొకున్నారు. ఒంగోలుకు చెందిన ఓ ఇసుక వ్యాపారితో మూడు కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అక్కడ ఉంది 2.27 ఎకరాలే కదా మూడు కోట్లు ఎలా డీల్ కుదిరిందంనుకుంటే పప్పులో కాలేసినట్లే. పేరుకు మాత్రం 2.27 ఎకరాలే, కానీ దాన్ని అనుకొని ఉన్న ఎస్సీల భూములైన 54.31 ఎకరాల్లోని ఇసుకను తవ్వకునేలా ప్లాన్ కుదుర్చుకున్నారట. మొత్తం మా ఆధీనంలోనే ఉందని మూడు కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అసలు బుజ్జమ్మ పొలంలో ఇసుకనే లేదు. ఆ పేరు చెప్పుకొని ఆ పక్కనే ఎస్సీల భూముల్లోని ఇసుకను కాజేసేందుకు స్కేచ్ వేశారు. రెండు రోజుల నుంచి జేసీబీతో సుమారు పది అడుగుల మేరకు ఇసుక తవ్వకాలు చేశారు. ఇసుకను తీసుకొచ్చి గోపాలపురం సమీపంలో డంప్ చేసి టిప్పర్లకు, లారీలతో తరలిస్తున్నారు. జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఈ ఇసుకను తరలించి కోట్లు సంపాదించుకుందనేకు ప్లాన్ చేశారు. ఈ ప్రాంత మన్నేరులోని ఇసుక నాణ్యమైనది కావడంతో మంచి డిమాండ్ ఉంది. శ్రీరంగరాజపురం, గోపాలపురం గ్రామాల కూటమిలోని కొందర నాయకులతో ఒప్పందం కుదుర్చుకొని తవ్వకాలు చేస్తున్నారు. ఆ డబ్బులు పంపకాల్లో కూడా గ్రామంలోని కొందరి మధ్య విబేధాలు కూడా వచ్చినట్లు సమాచారం. పేదల భూములపై పెద్దల కన్ను పడింది. ఏం చేసినా ఎవరు అడ్డుకుంటారని బెరితెగించారు. ఒంగోలుకు చెందిన వ్యాపారితో డీల్ కుదిరింది. కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయి. అధికారం అండగా ఇసుక ఇవ్వకాలకు ఏకంగా కిలోమీటర్ పైనే రోడ్డు సైతం వేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదంటే అధికార పార్టీ నేతల దోపిడీకి అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మన్నేరు 54.31 ఎకరాల్లో ఇసుక తవ్వకాలకు ప్లాన్ ఒంగోలుకు చెందిన వ్యాపారికి రూ.3 కోట్ల డీల్ శ్రీరంగరాజపురానికి చెందిన కొందరితో ఒప్పందం కిలో మీటరు మేర రోడ్డు ఏర్పాటు జేసీబీలతో తవ్వకాలు చేసి టిప్పర్ల ద్వారా ఇసుక తరలింపు నాణ్యమైన ఇసుక కావడంతో మంచి డిమాండ్ తవ్వకాలను అడ్డుకున్న బద్ధిపూడి గ్రామస్తులు -
నాటక రంగానికి జీవం పోయాలి
● ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీల ముగింపు సభలో వక్తలు మార్టూరు: నేటి పోటీ సమాజంలో ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన రోజుల్లో నిజాలను నిర్భయంగా చెప్పగల, చూపించగల నాటికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలవురు వక్తలు పేర్కొన్నారు. మార్టూరులో శ్రీకారం రోటరీ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల 16వ నాటిక పోటీలు చివరి రోజు ఆదివారంతో ముగిశాయి. తండ్రీకూతుళ్ల అలసటలేని పోరాటం.. చివరి రోజు మొదటి ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహన నాటికను ప్రదర్శించారు. నేటి ప్రపంచంలో బతకాలంటే సమస్యలు, ఘటనలతో జతకడుతూ ముందుకు సాగాలని.. న్యాయం కోసం నిజాయితీగా అన్యాయంపై తిరుగుబాటు చేస్తూ ప్రయాణం సాగించాలన్న నాటిక సారాంశం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. తండ్రీకూతుళ్ల పాత్రల్లో నటీనటుల అభినయం ప్రశంసలు అందుకుంది. 20 రకాల శరీర తత్వాల మనుషులతో.. రెండో ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి జ్యోతిరాజ్ భీశెట్టి రచించిన ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటికకు గోవాడ వెంకట్ దర్శకత్వం వహించారు. సృష్టిలో ఉత్తమమైన మానవ జన్మలో సీ్త్ర, పురుషుల గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ పురాణాల కాలం నుంచి నేటి వరకు, ఆదిమానవుని యుగం నుంచి ఇప్పటి వరకు సీ్త్ర పురుషులే కాకుండా మానవ జాతిలో 20 రకాల శరీర తత్వాలు కలిగిన మనుషులు ఉన్నారనే ఇతివృత్తంతో సాగిన ఈ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. సీ్త్ర, పురుషులను మాత్రమే గౌరవించే బూటకపు నాగరికతలో విభిన్న శరీరతత్వం గల వారు ఎలా బతుకుతున్నారు, అలాంటి వారికి ఎలాంటి గౌరవం, గుర్తింపు ఉంది అనే సరికొత్త కోణంలో నాటిక ప్రదర్శన సాగింది. వారి బాధలు, అవమానాలను కళ్లకు కట్టినట్టు చూపారు. వారూ మనుషులే అన్న జ్ఞానాన్ని పొంది గౌరవంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నాటిక ద్వారా సమాజానికి చాటారు. డబ్బు కోసం ఎంత నీచానికై నా! కాకినాడ బీవీ కేక్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘కన్నీటికి విలువెంత’ నాటిక మనిషి డబ్బు కోసం ఎంతటి నీచనికై నా దిగజారుతున్నాడనే ఇతివృత్తంతో సాగింది. ముందుగా ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ముత్తవరపు సురేష్ కుమార్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ముత్తవరపు అరుణ్ కుమారి, ఎఫెక్ట్ సంస్థ డైరెక్టర్ జేవీ మోహన్ రావు, శ్రీకారం కళాపరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కందిమల్ల సాంబశివరావు, జాస్తి అనూరాధ, రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మాదాల సాంబశివరావు, డాక్టర్ చెరుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట రామయ్య మార్కాపురం టౌన్: ఉద్యోగుల నిరవధిక సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ వెంకట రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల ఒప్పందాల అమలు కోసం భవిష్యత్తు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా నూతన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా డీకేఎం రఫీ, జిల్లా అధ్యక్షుడిగా పీఎల్ రంగయ్య, ప్రధాన కార్యదర్శిగా సుధాకర్రెడ్డి, కోశాధికారిగా ఎర్రారెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి, రమణయ్య, సహాయ కార్యదర్శిగా మల్లికార్జునరెడ్డి, కన్వీనరుగా శ్రీకాంత్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు ఏ సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమంతారావు, మనోజ్, రామాంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జనగణనలో అందరూ పాల్గొనండి
● కలెక్టర్ విజయసునీత మార్కాపురం: జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ ఎం విజయసునీత అన్నారు. స్వీయ జనగణనకు మద్దతుగా పట్టణంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి ఆదివారం 5కే రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో రెండు దశల్లో జరుగుతుందన్నారు. ఈ నెల 30 వరకూ ప్రజలు తప్పనిసరిగా స్వీయ జనగణనలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మొబైల్ యాప్ ద్వారా స్వయంగా ఇంటి వద్దే నమోదు చేసుకునే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఈ యాప్ను ఉపయోగించుకోవాలన్నారు. దేశాభవృద్ధి వికసిత భారత్ 2047 సాధనకు ఇది కీలకం కానుందన్నారు. ప్రతి పౌరుడు జనగణనలో పాల్గొని దేశ పురోగతికి పాటుపడాలన్నారు. డీఎస్పీ నాగరాజు, కమిషనర్ నారాయణరావు, తహశీల్దార్ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒంగోలులో 5కే రన్ ఒంగోలు సబర్బన్: జన గణన–2027 స్వీయ గణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకుని సహకరించాలని డీఆర్ఓ బి.చిన ఓబులేసు ప్రజలకు సూచించారు. స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆదివారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ నుంచి నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని డీఆర్ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం దేశ వ్యాప్తంగా 5కే రన్ నిర్వహించారని చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా జనగణనలో స్వీయ గణన విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. 2011 తరువాత 2021లో జనగణన చేపట్టాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా వాయిదా పడిందని చెప్పారు. ఈ ఏడాది జనగణన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకటరావు, జనాభా లెక్కల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా 5కే రన్ కలెక్టరేట్ నుంచి దక్షిణ బైపాస్లోని పాత జిల్లా పరిషత్ కార్యాలయం వరకు సాగింది. -
అదనపు కోర్టులు ప్రారంభం
గిద్దలూరులో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న హైకోర్టు జడ్జి కనిగిరి రూరల్/గిద్దలూరు రూరల్: మార్కాపురం జిల్లా కనిగిరిలో కొటో అదనపు సివిల్ జడ్జి కోర్టు(జూనియర్ డివిజన్), గిద్దలూరులో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ డాక్టర్ లక్ష్మణ్ రావు, ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి, అదనపు జిల్లా జడ్జి టి.రాజా వెంకటాద్రి మాట్లాడారు. కక్షిదారులకు సత్వర న్యాయసేవలు అందించేందుకు అదనపు కోర్టులను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా కనిగిరి, గిద్దలూరులో అదనపు కోర్టులను ప్రారభించినట్లు తెలిపారు. ఉచిత న్యాయ సేవలను అందించేందుకు న్యాయస్థానాలు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి బి.రూపశ్రీ, గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.ఓంకార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.భరత్ చంద్ర, గిద్దలూరు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సి.రమేష్యాదవ్, జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు, కలెక్టర్ ఎం.విజయ సునీత, జిల్లా ఇన్చార్జి వి.హర్షవర్థన్ రాజు, ఆర్డీఓ శివరామిరెడ్డి, డీఎస్పీ, కమిషనర్ పి.శ్రీధర్, కనిగిరి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అచ్చాల ఆదినరసారెడ్డి, ఎస్డీ షాహిద్ మహమ్మద్, ఏజీపీ పాశం పిచ్చయ్య యాదవ్, గిద్దలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.శేషశయనారెడ్డి, స్థానిక నాయవాదులు, వివిధ శాఖల ప్రభుత్వ ఆధికారులు పాల్గొన్నారు. కనిగిరిలో ఒకటో అదనపు, గిద్దలూరులో రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటు ముఖ్య అతిథులుగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, డాక్టర్ లక్ష్మణ్ రావు -
విద్యుదాఘాతానికి వృద్ధుడు మృతి
పెద్దారవీడు: విద్యుత్ తీగలు పక్కకు తొలగించే సమయంలో విద్యుదాఘాతానికి గురై వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో దేవరాజుగట్టు గ్రామ సమీపంలో వెలిగొండ ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల గుండంచర్ల కాలనీలో ఆదివారం జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. ప్రస్తుతం ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతోంది. కాంట్రాక్టర్ నిర్మాణ భవనాలకు నీటిని చల్లేందుకు నంద్యాల జిల్లా మహానంది గ్రామానికి చెందిన పి.ధర్మయ్య(60) పనిలో పెట్టగా..రాత్రిపూట కాపాలాగా ఉంటున్నారు. ఈ క్రమంలో నిర్మాణ భవనాల గోడలకు నీళ్లు చల్లిన అనంతరం కరెంట్ తీగలను చేతితో పట్టుకొని పక్కకు తొలగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ధర్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని మార్కాపురం జిల్లా ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదుబాబు తెలిపారు. అద్దంకి రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని అద్దంకి వైఎస్సార్ సీపీ నాయకులు ఆదివారం రాత్రి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛను అడ్డు పెట్టుకుని ఒక పార్టీ అధినేతను, పార్టీకి చెందిన మహిళలను కించపరిచేలా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అన్నారు. బాధ్యతాయుతమైన పత్రికా రంగంలో ఉండి సమాజానికి తప్పుడు సంకేతాలు పంపేలా రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారన్నారు. తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. తాళ్లూరు: మండంలోని తూర్పుగంగవరం, రామభద్రాపురం గ్రామ పెద్దల సహకారంతో ఈ నెల 29న జీసీసీ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను రాంభద్రాపురం గ్రామ ఎర్రతిప్ప ప్రాంతంలో ఈ నెల 29వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టోర్నమెంట్ విజేతలకు దాతల సహకారంతో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ బహుమతులు వరుసగా రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలు, రూ.25 వేలు అందిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. బెస్ట్ బ్యాట్స్మన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ బహమతులు కూడా అందించనున్నట్లు తెలిపారు. దూర ప్రాంత క్రీడాకారులకు భోజన వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న జట్లు రూ.999 ప్రవేశ రుసుం చెల్లించి 28వ తేదీలోగా వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9848658857, 9392599961, 7995411655ను సంప్రదించాలని సూచించారు. ఒంగోలు సబర్బన్: గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు జలధార– జల హారతి అవగాహన శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు సీపీఆర్అండ్ఆర్డీ అడిషనల్ కమిషనర్ ఎం.శివప్రసాదు పేర్కొన్నారు. ప్రకాశం భవన్లోని పీజీఆర్ఎస్ హాలులో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు చెందిన ఏపీడీలు, ఏపీఓలు, ఎంపీడీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కమిషనర్ ఎం. శివ ప్రసాద్ హాజరై జలధార–జల హారతి 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై సమగ్రంగా అవగాహన కల్పించారు. డ్వామా పీడీ జి. జోసెఫ్ కుమార్ మాట్లాడుతూ అధికారులు గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి, జల సంరక్షణపై సామూహిక బాధ్యత పెంపొందించాలన్నారు. చెరువుల పూడికతీత, చెరువుగట్ల బలోపేతం, చెక్డ్యామ్ల పూడికతీత, మరమ్మతులు, ఫీడర్ ఛానల్ పునరుద్ధరణ పనులు, తూముల మరమ్మతులు వంటివి నిర్వహించాలన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎస్ఈ అబ్బు తమీమ్, పీడీ మార్కాపురం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంధనం కోసం ఆందోళన అక్కర్లేదు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఏజెన్సీలు, సరఫరాదారులు కృత్రిమ కొరత సమస్య సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆదివారం ఉదయం కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సంబంధిత శాఖల అధికారులు, ఆయిల్ కంపెనీల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ వినియోగం, సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని చెప్పారు. ప్రజలు భయాందోళనకు గురై అవసరమైన దాని కంటే ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్ బంకుల్లో బల్క్ ఇంధన విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఇంధన రిటైల్ ఔట్లెట్లను తనిఖీ చేయాలని, అక్రమ నిల్వలు కలిగి ఉంటే కేసులు నమోదు చేయాలని చెప్పారు. పెట్రోల్, డీజిల్ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంధన లభ్యతపై అపోహలు వద్దు : మార్కాపురం కలెక్టర్ విజయ సునీత కనిగిరి రూరల్: పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ విజయ సునీత సూచించారు. ఆదివారం కనిగిరిలో పలు పెట్రోల్ బంకులను ఆమె తనిఖీ చేశారు. స్టాక్, సేల్స్ రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకర్లతో మాట్లాడుతూ.. జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు. ఇంధన సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పెట్రోల్ బంక్ల వద్ద రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరా శాఖ సిబ్బందిని నియమించి పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆందోళనకు గురై డ్రమ్ములు, క్యాన్లలో ఇంధనం నిల్వ చేయవద్దని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ శివరామిరెడ్డి, తహసీల్దార్ నర్రా జయలక్ష్మి, ఆర్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీలు, సరఫరాదారులు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు కలెక్టర్ పి.రాజాబాబు హెచ్చరిక -
క్రికెట్ జట్ల ఎంపికకు విశేష స్పందన
ఒంగోలు టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా పురుషుల అండర్ 16, మహిళల అండర్ 15 క్రికెట్ జట్ల ఎంపిక ఆదివారం మంగమూరు రోడ్డులోని ఏసీఏ క్రికెట్ సబ్ సెంటర్ మైదానంలో నిర్వహించారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎంపికకు విశేష స్పందన వచ్చినట్లు క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కారుసాల నాగేశ్వరరావు తెలిపారు. పురుషుల అండర్ 16 క్రికెట్ సెలక్షన్లకు జిల్లా నలుమూలల నుంచి 90 మంది క్రీడాకారులు హాజరు కాగా ప్రతిభ చాటిన 32 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. మేలో రావినూతలలో జరిగే సెలక్షన్లలో ప్రతిభ కనబరిచిన 16 మందిని జిల్లా నుంచి తుది జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. మహిళల అండర్ 15 ఎంపికలకు జిల్లా నుంచి 22 మంది క్రీడాకారులు హాజరయ్యారని, వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 16 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. అండర్ 16 పురుషుల విభాగం జట్టు జూన్లో గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలతో జరిగే మ్యాచ్లలో తలపడుతుందన్నారు. మహిళల అండర్ 15 జట్టు మంగళగిరి స్టేడియం, కృష్ణ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా జట్లతో తలపడుతుందని తెలిపారు. తొలుత జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్కుమార్ క్రీడాకారుల పరిచయం చేసుకున్నారు. -
పాలుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించండి
● ఎస్టీ కమిషన్ ఎదుట సమస్యలు మొరపెట్టుకున్న గిరిజనులు యర్రగొండపాలెం: నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న మాకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్టీ కమీషన్ టీం ముందు పాలుట్ల గిరిజనులు తమ సమస్యలు వివరించారు. శనివారం రాత్రి ఎస్టీ కమీషన్ చైర్మన్ సొల్లా బొజ్జిరెడ్డి, కమిషన్ టీం సభ్యులు మండలంలోని పాలుట్ల గిరిజనగూడేన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ.. గూడెంలో తాగు నీటి సమస్యను పరిష్కరించాలని, ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. గూడెంలో పక్కా గృహాలు నిర్మించుకునేందుకు, బావులు తవ్వుకోవడానికి అనుమతులు ఇవ్వాలని, తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. హౌసింగ్ మ్యాప్లో తమ గూడెం లేకపోవడం వల్ల తాము ఎటువంటి పథకాలు పొందలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల సమస్యలను మూడు నెలల్లో పరిష్కరించేదుకు చర్యలు తీసుకుంటామని, చైర్మన్ హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎస్టీ కమిషన్ సభ్యులు కె.లక్ష్మి, కె.పరమేశ్వర్లు ఉన్నారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
● జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పామూరు: జిల్లాలో డీజిల్, పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో డీజిల్, పెట్రోల్ రిటైల్ ఔట్లెట్స్ మొత్తం 116 ఉన్నాయని వాటిలో అన్ని చోట్ల పెట్రోల్ ఉందని, పెట్రోల్ ఎలాంటి కొరత లేదన్నారు. ఆదివారం సాయంత్రానికి 27 ఆర్ఓఎల్లలో డీజిల్ స్టాక్ లేక సరఫరా నిలిచిందన్నారు. డీజిల్, పెట్రోల్ సరఫరా, వాడకం, కొరత నివారణ మొదలైన అంశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వ్యవసాయం, ట్రాన్స్పోర్ట్, ఇతర పరిశ్రమలు మొదలైన వాటికి కొరత లేకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని డీజిల్, పెట్రోల్ రిటైల్ ఔట్లెట్స్లలోని స్టాక్స్ను, సరఫరాను, అమ్మకాలను పర్యవేక్షించడంతో పాటు అక్రమాలు చోటుచేసుకోకుండా ప్రతి రిటైల్ ఔట్లెట్కు ఒక అధికారిని నియమిస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెట్ను ఉపేక్షించమని, ఎక్కడైనా డీజిల్ అక్రమ నిల్వలు ఉంచినట్లు గానీ, అక్రమాలు జరిగినట్లు సమాచారం ఉంటే వారికి తెలియజేయాలని లేదా టోల్ ఫ్రీ నంబర్ 7013308642కు ఫిర్యాదు చేయాలన్నారు. డీజిల్ కొరత ఏర్పడితే ధరలు పెరుగుతాయని, ఇబ్బందులు తప్పవనే ప్రచారంతోనే డీజిల్కు కృత్రిమ కొరత ఏర్పడుతోందని, ఎవరు అపోహలు నమ్మవద్దని డీజిల్, పెట్రోల్ ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయన్నారు. సమావేశంలో తహసీల్దార్ రామచంద్రుని వాసుదేవరావు పాల్గొన్నారు. -
నో స్టాక్..
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఒంగోలు రత్నమహల్ థియేటర్ సెంటర్లోని పెట్రోలు బంక్ వద్ద పెట్రోలు కోసం ద్విచక్ర వాహనాల రద్దీ జిల్లాలో డీజిల్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి... డీజిల్ కోసం ట్రాక్టర్లు, వాహనాలు తీసుకొచ్చే పరిస్థితులు లేక డ్రమ్ములు, డబ్బాలు తీసుకొని ప్రజలు, వాహనదారులు పెట్రోలు బంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలు పెట్రోలు బంకులు డీజిల్ లేక మూతపడగా, మరికొన్ని బంకులు మూత వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్నిచోట్ల పెట్రోలు కూడా నిండుకుంది. అరకొరగా తెరచిన చోటా గంటల తరబడి క్యూలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పరిస్థితి చక్కదిద్దాల్సిన సివిల్ సప్లై అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు.ఆయిల్ నిల్సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత నానాటికీ తీవ్రమవుతోంది. ఉన్న స్టాకు అయిపోవడంతో ఒక్కొక్కటిగా పెట్రోలు బంకులు మూతపడుతున్నాయి. చాలా చోట్ల నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జిల్లాలో మూడు రోజులకు ఒక లోడు డీజిల్.. పెట్రోలు బంకులకు సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. తీరా కొరత ఏర్పడి ప్రజలు రోడ్డు మీదకు వచ్చి పెట్రోలు బంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు అధికారులు స్పందించారు. డబ్బులు కట్టిన మూడు రోజులకు ఆయిల్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. గతంలో మాదిరిగా ఆయిల్ కంపెనీలకు కూడా పైనుంచి సరఫరా సక్రమంగా రాకపోవటంతో పెట్రోలు బంకులకు సరఫరా కట్టడి చేశాయి. దాంతో డీజిల్ కొరత ఏర్పడి బంకులు మూత పడే పరిస్థితి నెలకొంది. ఒక పక్క రబీలో వరి కోతలు ఊపందుకున్నాయని, దాంతో ఇంధన కొరతతో వరికోత మిషన్లు జిల్లాలో కనపడటం లేదు. ఎక్కడి వరికోత మిషన్లు అక్కడే ఆగిపోయాయి. డీజిల్ కొరతతో ఆక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ దొరక్క రొయ్యలు, చేపలసాగుపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. నిద్ర మత్తులో సివిల్ సప్లయ్ విభాగం అధికారులు... పూర్తిగా ఆయిల్ కంపెనీలు పెట్రోలు బంకులకు డీజిల్ సరఫరా కట్టడి చేసేవరకూ జిల్లా సివిల్ సప్లయి విభాగం అధికారులు నిద్ర మత్తులో ఉన్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిస్థితులను, కనీసం రెవెన్యూ అధికారులు గమనించకపోవటం వల్లనే జిల్లాలో డీజిల్ కొరత ఏర్పడి పెట్రోలు బంకులు మూసివేసే స్థితికి చేరుకున్నాయి. చివరకు సూరారెడ్డిపాలెంలోని ఐఓసీ, బీపీసీఎల్ అవుట్లెట్లలోనే డీజిల్ ఆపేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే అలాంటిదేమీ లేదని అధికార యంత్రాంగం బుకాయిస్తోంది. ఆయిల్ కంపెనీలు..జిల్లా యంత్రాంగం మధ్య కొరవడిన సఖ్యత: జిల్లాలో ఉన్న ఆయిల్ కంపెనీల అధికారులకు, జిల్లా యంత్రాంగానికి మధ్య సఖ్యత కొరవడింది. ఆయిల్ కంపెనీల అధికారులు పెట్రోలు బంకుల నిర్వాహకులను కట్టడి చేస్తున్నారు. ఇటు అధికారులకు మాత్రం ఆయిల్ నిల్వలు సక్రమంగా ఉన్నాయని అధికారులను పక్కదారి పట్టిస్తున్నారు. మూడు రోజులకు ఇవ్వాల్సిన లోడు ఇవ్వకుండా డీజిల్ సరఫరా పూర్తిగా కొన్ని ప్రాంతాలకు నిలిపేశారు. దాంతో మార్కాపురం జిల్లాలో 58 బంకుల్లో నోసా్ట్క్ బోర్డులు పెట్టగా, ప్రకాశం జిల్లాలో 40కి పైగా పెట్రోలు బంకులు మూతపడ్డాయి. అధికారులు మాత్రం నిల్వలు పూర్తిస్థాయిలో ఉన్నాయి, ప్రజలు అధైర్యపడవద్దని చెబుతున్నారు. -
నేడు వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం ర్యాలీ
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు నన్నెబోయిన రవికుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధిహామీ పథకంలో కూటమి ప్రభుత్వ అవినీతి, పెండింగ్ వేతనాలపై సోమవారం ఉదయం 11 గంటలకు ఒంగోలులోని అంబేడ్కర్ భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తారన్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. యర్రగొండపాలెం: ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ల ఎంపిక స్థానిక మాచర్ల రోడ్డులోని గురుకుల పాఠశాలలో ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రరావు, వెంకట్రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ పోటీల్లో 20 ఏళ్లు దాటిన యువతీ, యువకులు పాల్గొనవచ్చన్నారు. ఎంపికై న క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో జరిగే అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేస్తామని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు బర్త్ సర్టిఫికెట్, 10వ తరగతి మార్క్లిస్ట్, ఆధార్ కార్డు జిరాక్స్లతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో మంగళవారం ఉదయం 8గంటలలోపు హాజరుకావాలని వారు కోరారు. వివరాలకు సెల్: 76750 26220 నంబర్కు సంప్రదించవచ్చని తెలిపారు. ఒంగోలు టౌన్: అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతోపాటుగా నగరవాసులు 11 గంటలలోపే దరఖాస్తులు అందజేయాలని, మార్చిన సమయాన్ని ఫిర్యాదుదారులు గమనించాలని కోరారు. మార్కాపురం టౌన్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కొరత లేదని ఏజెన్సీలు సరఫరాదారులు కృత్రిమ సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం విజయసునీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవసరపడే పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, వీటి కొరతపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అపోహలు నమ్మి వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు భయాందోళనకు గురై అవసరమైన దానికంటే ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్ బంకులపై బల్క్ కొనుగోలు అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలోని ఇంధన రిటైల్ ఔట్లెట్ తనిఖీలు నిర్వహించి ఎవరి వద్దైనా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
టీడీపీలో విగ్రహ చిచ్చు
నాగులుప్పలపాడు: అమ్మనబ్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు మరోమారు రచ్చకెక్కాయి. గ్రామంలో టీడీపీలో చాలా ఏళ్ల నుంచి ఉప్పు, నిప్పుగా ఉన్న అంతర్గత పోరు గత ఏడాది ఏప్రిల్ 22న నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, అదే గ్రామానికి చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యతో తార స్థాయికి చేరింది. ఈ హత్యలో అమ్మనబ్రోలు గ్రామానికే చెందిన టీడీపీ నాయకులే ప్రధాన పాత్రధారులని, గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరుకే హత్యలు జరిగాయని పోలీసులు తేల్చేశారు. అయితే వీరయ్య హత్య జరిగినప్పటి నుంచి గ్రామంలో నిత్యం పోలీసుల పహారా కొనసాగుతున్నా అక్కడక్కడా ఘర్షణలు తెలెత్తుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ పోలీసులు అణగదొక్కుతూ వస్తున్నా వీరయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా 4 రోజుల కిందట గ్రామంలోని కనపర్తి కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పక్కనే వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆయన అనుచరులు పూనుకున్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీలోని మరో వర్గం నాయకులు ఎన్టీఆర్ విగ్రహం పక్కన వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటును అనుమతించేది లేదని అడ్డుకోవడంతో పాటు హైకోర్టుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో ఏప్రిల్ 22వ తేదీ రాత్రి వీరయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా అర్ధరాత్రి సమయంలో విగ్రహం ఏర్పాటు చేయదలిస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘర్షణ వాతావరణంలో వీరయ్య చౌదరి వర్గంలోని ఓ వ్యక్తి ఒంగోలు రూరల్ సీఐ మీద దూకుడుగా ప్రవర్తించడంతో పాటు పోలీసులను తీవ్రంగా దూషించారు. ఈ అంశాన్ని సీరియర్గా తీసుకున్న పోలీసులు అదే రోజు రాత్రి సుమారు 200 మంది వరకు నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలీసుల ఆదేశాలను కూడా లెక్కచేయకుండా అనుమతి లేని ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు శాంతి భద్రతలకు వెళ్లిన తమపై దాడికి యత్నించడంతో ఎలాగైనా ఆ విగ్రహాన్ని కిందకు దించాలని పోలీసులు కూడా అంతే స్థాయిలో సిద్ధమయ్యారు. అయితే అర్ధరాత్రి 2 గంటల వరకు అదే ప్రయత్నంలో ఉన్న పోలీసులకు చివరి నిమిషంలో ఏం ఆదేశాలు వచ్చేయో తెలియదు కానీ ఒంగోలు నుంచి వచ్చిన 4 బెటాలియన్ పోలీసులు 3 గంటల తరువాత వెనుతిరిగి వెళ్లిపోయారు. అయినా విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఎలాంటి పనులు చేపట్టకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో గ్రామంలో మరో మారు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో వీరయ్య వర్ధంతిని అమ్మనబ్రోలు గ్రామంలో నిర్వహించిన ఆయన వర్గీయులు పరుష పదజాలంతో మాట్లాడటంతో పాటు విగ్రహ ఏర్పాటును ప్రతిపక్ష పార్టీలపై నెట్టేలా వీరయ్య అనుచరుడు మాట్లాడటంతో దీనికి వైఎస్సార్ సీపీ నాయకులు దీటుగా జవాబిచ్చింది. వీరయ్య చౌదరి హత్య జరిగినప్పుడు కూడా దాన్ని వైఎస్సార్ సీపీ మీదకు నెట్టేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నారు. తీరా పోలీసుల విచారణలో టీడీపీలోని వారే ఈ హత్య చేశారని తేలడంతో దాన్ని కప్పిపుచుకునేందుకు నానా తంటాలు పడ్డారు. వీరయ్య విగ్రహ ఏర్పాటును మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీలోని మరో వర్గం బహిరంగంగా బయటపడి శనివారం ప్రెస్మీట్ ఏర్పాటు చేసి ఘాటుగానే స్పందించారు. పేదల పెన్నిధి, మద్యపానాన్ని పూర్తిగా వ్యతిరేకించిన మహా నాయకుడు ఎన్టీఆర్ పక్కన ఓ లిక్కర్ డాన్ విగ్రహం ఏర్పాటు చేయడం తాము ఏ మాత్రం అంగీకరించేది లేదని మీడియాకు తెలియజేయడంతో పాటు ఇప్పటికే విగ్రహం ఏర్పాటును అడ్డుకుంటూ హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ ఘటనలతో గ్రామ టీడీపీతో పాటు మండల వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. పార్టీలో, గ్రామంలో ఎప్పుడు ఏమవుతుందో అన్న భయం కేడర్లో నెలకొంది. గ్రామంలో ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే కానీ, జిల్లా టీడీపీ నాయకత్వం కానీ ఈ అంశాన్ని చూసీచూడనట్లు వదిలేసింది. -
ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఆ మేరకు ఏపీ టీచర్స్ గిల్డ్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద శనివారం నిరాఽహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థులతో సమానంగా ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో 165 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు సర్ప్లస్గా ఉన్నారని, వారి సీనియార్టీ జాబితా తయారు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని కోరారు. ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు కలెక్టర్ పూల్ నందు కారుణ్య నియామకాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో 40 ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే సింగిల్ టీచర్ సెలవు పెడితే.. ఆ పాఠశాలకు మండల విద్యాశాఖ అధికారులు సీఆర్ఎంటీలను కేటాయించాలన్నారు. పైన తెలిపిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ నాయకులు కోరారు. అనంతరం డీఆర్వో ఓబులేసును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ టీచర్స్ గిల్డ్ నాయకులు చిరంజీవి, రమేష్, రామకృష్ణారెడ్డి, ఆంజనేయులు, రవికుమార్, శ్రీను, జయకుమారి, సుబ్బాయమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఏపీ టీచర్స్ గిల్డ్ నాయకుల డిమాండ్ కలెక్టరేట్ వద్ద నిరాహారదీక్ష -
అర్హులందరికీ బియ్యం పంపిణీ చేస్తున్నాం
● జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి అంకయ్య మార్కాపురం: జిల్లాలో అర్హులందరికీ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి అంకయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలుతుండటంపై ఈ నెల 24వ తేదీ సాక్షి దినపత్రికలో ‘సేకరించు.. సమీకరించు.. విక్రయించు’.. అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అంకయ్య స్పందించారు. మార్కాపురం జిల్లాలో మొత్తం 3.33.587 మంది కార్డుదారులు ఉండగా, 2.87.517 మంది కార్డుదారులు ఏప్రిల్ నెలలో రేషన్ తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో 19 మండలాల్లో కార్డుదారులు తమకు సంబంధించిన సరుకులను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తీసుకున్నట్లు చెప్పారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి, మంచంలో ఉన్న వారు, విభిన్న ప్రతిభావంతులు 38,843 మంది ఉండగా, అందులో 33,721 కార్డుదారులకు సరుకులు అందజేసినట్లు తెలిపారు. మార్కాపురం ఆర్డీఓ త్రిపురాంతకం మండలంలో 5 చౌకదరల దుకాణాలను తనిఖీ చేసి కార్డుదారులను విచారణ చేసినట్లు చెప్పారు. తమ డీలరు బియ్యం ఇచ్చినట్టు వారు తెలిపారన్నారు. ప్రతినెలా 15వ తేదీలోపు కార్డుదారులు తమకు రావాల్సిన సరుకులను డీలర్ల నుంచి తీసుకుంటున్నారని, బియ్యంకు బదులుగా డబ్బులు తీసుకోవడం లేదని తెలిపారు. ఎవరికై నా రేషన్ సరుకులు ఇవ్వకపోతే 1967 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని లేదా సంబంధిత తహసీల్దార్లకు, జిల్లా పౌరసరఫరాల అధికారి మొబైల్ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని అంకయ్య సూచించారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
బల్లికురవ: ఆర్థిక ఇబ్బందులతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. బల్లికురవ మండలంలోని కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన దర్శి వెంకట నారాయణ (25) బీటెక్ పూర్తిచేసి చైన్నెలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పదిరోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. అప్పులు ఎలా తీర్చాలా అని మదనపడుతూ గత బుధవారం వలపర్ల వెళ్లి పురుగుల మందు (గడ్డి మందు) కొనుగోలు చేసి దారిలోనే తాగి ఇంటికి చేరాడు. అస్వస్తతతో బాధపడుతున్న అతని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వెంకట నారాయణ మృతిచెందాడు. మృతునికి వివాహం కాలేదు. అతని తండ్రి కాంతయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చేతికందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది. ● పల్లెనిద్ర కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు చీమకుర్తి రూరల్: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా చీమకుర్తి మండలంలోని చండ్రపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి ఆయన బస చేశారు. శనివారం ఉదయం గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలడిగి తెలుసుకున్నారు. మంచినీరు, ఇంటి స్థలాలు, శ్మశాన సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరారు. ఆయా సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. స్థానికంగా దొరికే బబుల్ వాటర్ వాడవద్దని, అందులో క్లోరినేషన్ ప్రక్రియ సక్రమంగా ఉండదని గ్రామస్తులకు కలెక్టర్ సూచించారు. గ్రామంలో ప్రభుత్వం సరఫరా చేసే వాటర్ తాగి ఆరోగ్యంగా ఉండారన్నారు. కలెక్టర్ వెంట స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్, అధికారులు పాల్గొన్నారు. ● పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వెలిగండ్ల (కనిగిరి రూరల్): వెలిగండ్ల డిప్యూటీ ఎంపీడీఓ సింగంపల్లి రాంప్రసాద్పై ఓ వ్యక్తి దాడికి యత్నించిన సంఘటన శనివారం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే.. డిప్యూటీ ఎంపీడీఓ రాంప్రసాద్ తన విధుల్లో భాగంగా మండలంలోని రామగోపాలపురం స్వర్ణ గ్రామాన్ని సందర్శించారు. ఆ సమయంలో సచివాలయంలో కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన సర్వేలకు సంబంధించిన రికార్డులు, గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత, తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఆ తరుణంలో ఒక్కసారిగా గ్రామానికి చెందిన ఎం.నాగేంద్ర అసభ్య పదజాలంతో దూషించి రాంప్రసాద్పై భౌతిక దాడికి ప్రయత్నించాడు. తాను అధికార పార్టీకి చెందిన వాడినని బెదిరిస్తూ కర్ర తీసుకుని తనపైకి వచ్చినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో డిప్యూటీ ఎంపీడీఓ ఫిర్యాదు చేశారు. -
ఒంగోలులో పోలీసుల విస్తృత తనిఖీలు
ఒంగోలు టౌన్: నేర నియంత్రణ చర్యల్లో భాగంగా నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ఆర్టీసీ, రైల్వే స్టేషన్లలో పోలీసులు శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్, పేలుడు పదార్థాలను పసిగట్టే జాగిలం చీత, బాంబు స్క్వాడ్, పోలీసు బృందాలు తనిఖీల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండు సెంటర్లోని కార్గో పార్శిల్ సర్వీస్, రైల్వే స్టేషన్లోని పార్శిల్ కార్యాలయాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులు, అపరిచిత లగేజీలను గుర్తించేందుకు బస్టాండు ఆవరణతో పాటు పరిసరాలను తనిఖీ చేశారు. అనుమానం ఉన్న ప్రయాణికుల బ్యాగులు తెరిపించి పరిశీలించారు. అనుమానాస్పద పార్శిళ్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు కోరారు. తనిఖీల్లో ఒంగోలు వన్టౌన్, టూటౌన్ పోలీసులు పాల్గొన్నారు. -
గాయపడిన జింకకు సంరక్షణ
● అటవీశాఖ అఽధికారులకు అప్పగింత బల్లికురవ: చిల్లచెట్లలో చిక్కుకుని గాయపడిన జింకకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంరక్షించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన శనివారం బల్లికురవ నుంచి సంతమాగులూరు వెళ్లే రోడ్డులో మల్లయపాలెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ముళ్ల పొదల్లో జింక ఇరుక్కుని కదిలే పరిస్థితి లేని విషయం ఎస్సై నాగరాజు దృష్టికి రావడంతో సిబ్బందితో బయటకు తీయించి సంరక్షించారు. అనంతరం కూకట్లపల్లి ఫారెస్ట్ బీట్ అధికారి కే రమేశ్కు జింకను అప్పగించారు. -
వాహనాలు జాగ్రత్తగా నడపాలి
● కన్వెక్స్ మిర్రర్ల ఏర్పాటును పరిశీలించిన ఎస్పీ హర్షవర్థన్రాజు ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఎస్పీ హర్షవర్థన్రాజు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కలిసికట్టుగా పనిచేద్దాం.. రాబోయే తరాలకు భద్రమైన భవిష్యత్తుకు పునాదులు వేద్దామని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేసిన కన్వెక్స్ మిర్రర్ల ఏర్పాటును శనివారం ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న 115 ప్రదేశాలను గుర్తించినట్లు తెలిపారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రదేశాలలో కన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తద్వారా వాహనచోదకులకు ముందస్తు హెచ్చరికలు అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ప్రయాణించే వాహనదారులు బ్లాక్స్పాట్ల వద్ద మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని చెప్పారు. సైన్ బోర్డులపై ఉన్న హెచ్చరికలను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాలలో నష్టపోయిన కుటుంబాల ఆవేదన చూస్తే చాలా బాధ కలుగుతోందని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి చేరేలోపు తమ కోసం భార్యా బిడ్డలు, కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారన్న విషయం మరిచిపోకూడదన్నారు. పోలీసు శాఖ చేపడుతున్న రోడ్డు భద్రతా చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. -
గుదిబండ..!
భక్తుల మదిలో బల్లికురవ: గ్రానైట్ క్వారీల నిర్వాహకుల నిర్లక్ష్యం భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. లక్షల రూపాయలు వెచ్చించి పలు గ్రామాల భక్తులు అభివృద్ధి చేసుకున్న ఆలయం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. బల్లికురవ మండలంలో నెలకొన్న ఈ పరిస్థితిపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. బల్లికురవ మండలంలోని కొణిదెన గ్రామాన్ని 12వ శతాబ్దంలో రాజులు పరిపాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఆ గ్రామం నుంచి నక్కబొక్కలపాడు వెళే్ల్ రహదారిలో కొండకు తూర్పు భాగంలో ఉన్న కుండంలో అప్పట్లో సంవత్సరం పొడవునా నీళ్లుండేవి. మునులు ఇక్కడ స్నానాలు చేసి తపస్సు చేసుకునేవారని, గ్రామంలోని ఆలయాల్లో పూజలు చేసేవారని పురాణగాధ. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతాన్ని ఏడు సంవత్సరాలుగా కొణిదెన పంచాయతీలోని గంగపాలెం, పరిసర గ్రామాల భక్తుల సహకారంతో లక్షల రూపాయలతో అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రానైట్ వృధా రాళ్లు దొర్లిస్తుండటంతో ముప్పు... కొండకు పైభాగంలో గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తూ వృధా రాళ్లను ప్రతిరోజూ పొక్లెయిన్తో బ్రహ్మకుండంలోకి దొర్లిస్తున్నారు. రెండేళ్లకుపైగా ఇలాగే దొర్లిస్తుండటంతో బ్రహ్మకుండం నీటి నిల్వ సామర్థ్యం కోల్పోతోంది. ఇదే కొనసాగితే అది కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కుండం కట్టలు పటిష్టం చేయడంతో పాటు లక్ష్మీదేవి సమేత లక్ష్మీనారాయణుడు, బ్రహ్మదేవుడు, సమీపంలోని మర్రిచెట్టు అరుగుపై జంటనాగులు, గణపతి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, నాగలింగేశ్వరుడు, పార్వతీ అమ్మవారు, దక్షిణామూర్తి, ఆంజనేయస్వామి, సంతాన నాగేంద్రుడు, నవగ్రహాలు, ఓంకార ధ్యాన పరమేశ్వరుడు విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో నుంచి ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి కరెంటు సౌకర్యం కల్పించారు. కార్తీకమాసంలో ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఇక్కడ స్నానాలు, పూజలు చేస్తుంటారు. ఈర్లగంగమ్మ ఆలయంపైనా వృధా రాళ్లు... కొణిదెన రెవెన్యూలోని నక్కబొక్కలపాడు గ్రామ సమీపంలో ఈర్లకొండకు దిగువ భాగంలో 12వ శతాబ్దంలో ఈర్ల గంగమ్మ అమ్మవారు స్వయంభూగా వెలిసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ కొండ చుట్టూ 30 పైచిలుకు గ్రానైట్ క్వారీలున్నాయి. ఇక్కడ రాయి తీసే క్రమంలో వచ్చే వృధా రాయిని ఆలయంపైకి దొర్లిస్తున్నారు. దీంతో ఆలయంలోని విగ్రహాలను దుమ్ము కమ్మేస్తోంది. ఆలయంపైకి రాళ్లు నెట్టవద్దని తాము చెబుతున్నా.. గ్రానైట్ క్వారీల నిర్వాహకులు వినిపించుకోవడం లేదని ఆలయ కమిటీ ప్రతినిధులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి ఆలయాలపై, బ్రహ్మకుండంలోకి రాళ్లు దొర్లించకుండా చూడాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. నక్కబొక్కలపాడు సమీపంలోని ఈర్ల గంగమ్మ బ్రహ్మకుండానికి గ్రానైట్ వృధా రాళ్ల గండం కొండపై నుంచి గ్రానైట్ వృధా రాళ్లను బ్రహ్మకుండంలో దొర్లిస్తున్న నిర్వాహకులు భయాందోళనలో భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఆలయంలోని విగ్రహాలను కమ్మేస్తున్న దుమ్ము ఇదే పరిస్థితి కొనసాగితే ఆలయం కనుమరుగయ్యే ప్రమాదం లక్షల రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేసిన భక్తులు పట్టించుకోని పాలకులు, అధికారులు -
ముగ్గురు సీఐల నియామకం
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు శాఖలో బదిలీ పర్వం కొనసాగుతోంది. ఇటీవల ఇద్దరు సీఐలను వీఆర్కు పంపించి ముగ్గురు సీఐలకు పోస్టింగులు ఇవ్వడం తెలిసిందే. శనివారం మరో మూడు సర్కిళ్లకు సీఐలను నియమించారు. సింగరాయకొండ సీఐగా శ్రీహరిని నియమించారు. ఆయన ప్రస్తుతం గుంటూరు ఎస్బీలో విధులు నిర్వహిస్తున్నారు. కావలికి చెందిన ఆయన కొత్తపట్నం ట్రైనీ ఎస్సైగా పోలీసు శాఖలో ప్రవేశించి ఆ తరువాత జిల్లాలో ఒంగోలు, చీరాల, పొదిలి, మర్రిపూడి, కంభం ఎస్సైగా చేశారు. ఇక్కడ సీఐగా పనిచేస్తున్న హజరత్తయ్యను ఒంగోలు ట్రాఫిక్ సీఐగా బదిలీ చేయడం తెలిసిందే. కొండపి సీఐగా వైవీ రమణయ్యను నియమించారు. ప్రస్తుతం ఆయన ఇంకొల్లు సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో సింగరాయకొండ, నాగులుప్పలపాడు, మార్కాపురం ప్రాంతంలో పలు స్టేషన్లలో పనిచేసిన అనుభవం ఉంది. మార్కాపురం సీఐగా అల్తాఫ్ హుస్సేన్కు పోస్టింగు ఇచ్చారు. గతంలో ఆయన జిల్లాలోని పెద్దదోర్నాల, అర్ధవీడు, రాచర్ల, పొదిలి, నాగులుప్పలపాడు, ఒంగోలు తాలుకాలో ఎస్సైగా పనిచేశారు. -
ఆందోళన
ఆయిల్ కోసం దర్శి/మార్కాపురం/అద్దంకి: జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత వాహనదారులను వేధిస్తోంది. డీజిల్, పెట్రోలుకు కొరత లేదని, ఆందోళన చెందొద్దని అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తగినంత ఆయిల్ సరఫరా లేక ఒక్కొక్కటిగా పెట్రోలు బంకులు మూతపడుతున్నాయి. పెట్రోలు, డీజిల్ దొరకడం లేదని వాహనదారులు క్యాన్లలో డీజిల్ కొట్టించుకుని నిల్వ పెట్టుకుంటున్నారు. దీంతో బంకుల్లో ఉన్న స్టాకు అయిపోయి నోస్టాక్ బోర్డులు పెడుతున్నారు. దర్శిలో కొన్ని బంకుల్లో శనివారం సాయంత్రానికి ఆయిల్ ట్యాంకర్లు రావడంతో అక్కడ వాహనదారులు బారులుతీరారు. అయినా అడిగినంత డీజిల్ కొట్టడం లేదు. డీజిల్ కొరతల వార్తలతో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో డీజిల్ అమ్మేవాళ్లు భారీగా నిల్వలు పెట్టుకుంటున్నట్లు సమాచారం. మార్కాపురంలో 8 పెట్రోల్ బంకులున్నాయి. పట్టణంలో సుమారు 2 వేల ఆటోలు, రూరల్లో మరో 500 ఆటోలు, వెయ్యికి పైగా కార్లు, జీపులు, 50 లారీలు ఇంకా పదికి పైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. కొన్ని బంకుల్లో రూ.500కు మించి డీజిల్ ఇవ్వడం లేదని వాహనదారులు వాపోతున్నారు. పొదిలిలోనూ ఒకటి రెండు పెట్రోలు బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు పెట్టారు. యర్రగొండపాలెంలో డీజిల్, పెట్రోలు రెండూ లేవని పెట్రోలు బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. అద్దంకి పట్టణంలోని 12 పెట్రోలు బంకుల్లో శనివారం సాయంత్రం నుంచి డీజిల్ నిండుకుంది. దాంతో ఆటోవాలాలు రాత్రి సమయంలో బంకుల వద్ద క్యూ కట్టారు. అయితే డీజిల్ లేదని నిర్వాహకులు చెప్పడంతో చేసేది లేక ఆటోలను అక్కడే నిలిపి కూర్చుకున్నారు. ఏ బంకులోనూ నో స్టాట్ బోర్డు పెట్టలేదు కానీ వచ్చిన వారికి లేదని చెబుతున్నారు. సంతమాగులూరులో రాత్రి సమయంలో ఒక డీజిల్ ట్యాంకరు రావడంతో ఆటో వాలాలు ఎగబడ్డారు. ఒంగోలు నగరంలోనూ సాయంత్రానికి పలుచోట్ల పెట్రోలు బంకులు మూతపడ్డాయి. తెరచి ఉంచిన బంకుల్లోనూ డీజిల్ లేదని, సాధారణ పెట్రోలుకు బదులు పవర్ పెట్రోలు మాత్రమే ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. చిరువ్యాపారులు, వాహనదారులకు ఇక్కట్లు: డీజిల్ కొరత చిరువ్యాపారులు, వాహనదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆటోలు, చిన్న చిన్న ట్రాలీ ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే వారు, కూరగాయలు, సరుకులు వంటి నిత్యం రవాణాకు సంబంధించిన డీజిల్ వాహనాలు మూలన పడే అవకాశం ఉంది. బస్సులు లేని గ్రామీణ ప్రాంతాల నుంచి ఆటోలు నడిపే పరిస్థితి లేకపోతే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ట్రాక్టర్లతో చేసే వ్యవసాయ పనులు ఆగిపోతాయి. సంబంధిత అధికారులు స్పందించి డీజిల్, పెట్రోలు కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
మాజీ సైనికులకు న్యాయ సహాయం
ఒంగోలు టౌన్: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వీర్ పరిహార్ సహాయ యోజనలో భాగంగా మాజీ సైనికులకు న్యాయ సహాయం అందించేందుకు లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. ఉన్నత న్యాయస్థానం కల్పించిన ఈ అవకాశాన్ని మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాది ఎన్.ధనలక్ష్మి, న్యాయ సహాయకులు పి.శ్రీనివాసరావు, సైనిక కార్యలయం పర్యవేక్షణాధికారి పద్మజ, సిబ్బంది సుధాకర్ పాల్గొన్నారు. -
‘మీ కోసం’ ఉదయం 8 గంటల నుంచే..
ఒంగోలు సబర్బన్: ప్రకాశం భవన్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పీజీఆర్ఎస్) సమయంలో మార్పులు చేస్తున్నట్లు కలెక్టర్ పీ రాజాబాబు వివరించారు. వేసవి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈనెల 27వ తేదీ సోమవారం కలెక్టరేట్లో జరగబోవు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలోని ప్రజలు మార్పును గమనించాలని కోరారు. ప్రజలు నిర్దేశించిన సమయానికి కార్యక్రమానికి చేరుకొని వారి సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేయాలని సూచించారు. ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండల పార్టీ అధ్యక్షుడు దేవినేని కృష్ణబాబు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు బడుగు ఇందిర, ఒంగోలు సిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల ప్రమీల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజును, రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ ఫీజులను ఈ నెల 27వ తేదీ లోపల చెల్లించాలని ఆర్ఐఓ ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గడువు తేదీ తర్వాత ఎటువంటి అభ్యర్థనలు స్వీకరించరన్నారు. ఈ విషయాన్ని సంబంధిత విద్యార్థులు గమనించి గడువు తేదీ లోపు ఫీజులు చెల్లించాలని కోరారు. ఒంగోలు టౌన్: పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవడం ద్వారా దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రతలు తీసుకోవాలని జిల్లా మలేరియా అధికారి ఎన్.మధుసూదన రావు చెప్పారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక వెంకటేశ్వర కాలనీలో అర్బన్ వైద్యశాల సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదనరావు మాట్లాడుతూ మలేరియా రహిత సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాముల కావాలని పిలుపునిచ్చారు. దోమకాటు నుంచి రక్షణ కోసం దోమతెరలను వాడాలని, లేకపోతే విషజ్వరాల బారిన పడే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంఓ విజయ భాస్కర్, సబ్ యూనిట్ ఆఫీసర్లు ఇండ్ల సాగర్, పాతులూరి శ్రీనివాసులు, పద్మావతి, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు నిర్దేశిత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ విజయసునీత సూచించారు. కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర సాధనా విజన్పై వివిధ శాఖల అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ వచ్చే నెలకు సంబంధించి నెలవారీ టార్గెట్లను ఈనెల 27వ తేదీ లోపు నిర్ణయించి అప్రూవల్ తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రతినెలా 5వ తేదీ నాటికి ఆ నెల సాధించిన పురోగతిని ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. డీఐఈపీసీ పై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మార్కాపురం జిల్లాలో రిలయన్స్ పరిశ్రమలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న సీబీజీ ప్రాజెక్టులు ఏపీఎన్జీఈఎల్, హరిత అమృత్ ఏర్పాటు చేసిన సోలార్ పవర్ పురోగతి, ఎంఓయూలు చేసుకునే పరిశ్రమల పురోగతిపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు, కనిగిరి ఆర్డీఓ శివరామిరెడ్డి, సీపీఓ స్వరూపారాణి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజరు మధున్మోహన్, నాబార్డు డీడీఎం రవికుమార్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాల వారీగా ఇప్పటికే సంబంధిత అధికారులు స్మార్ట్ కిచెన్లు నిర్మించేందుకు అనువైన స్థలాల కోసం గాలింపు మొదలు పెట్టారు. మండల కేంద్రాల్లో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని వాహనాల ద్వారా తరలిస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 4500 మంది మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి ఏంటని వారు ఆందోళన చెందుతున్నారు. నాణ్యమైన భోజనం వండుతున్నాం పాఠశాలల్లో పిల్లలకు అప్పటికప్పుడు వేడివేడిగా అన్నం తయారు చేసి పెడుతున్నాం. ఎక్కడో వండిన అన్నం అన్ని పాఠశాలలకు వాహనాల్లో తీసుకొచ్చి వడ్డించే సరికి అది చల్లబడటంతో పాటు రుచి మారిపోతుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కొనసాగించాలి. – జి.కెత్తుర, మధ్యాహ్న భోజన కార్మిక సంఘ కంభం మండల కార్యదర్శి -
స్మార్ట్గా దగా
కంభం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టకొట్టి, కూటమి వర్గీయులకు కట్టబెట్టేందుకే స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యను బట్టి స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తారు. 1500–2000 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ కిచెన్ ఉంటుందని విద్యార్థుల సంఖ్యను బట్టి మండలంలో ఒకటి లేదా రెండు స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. అందుకోసం 1200 గజాల స్థలం గుర్తిస్తే ప్రభుత్వ నిధులతో అక్కడ కిచెన్ నిర్మాణం చేపట్టి సామగ్రిని అందుబాటులోకి తెస్తారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న మండల విద్యాశాఖాధికారులు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రశ్నార్థకంగా మధ్యాహ్న భోజన కార్మికుల భవిష్యత్తు: గత 24 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారికి నెలకు రూ.3 వేల గౌరవ వేతనం హైస్కూల్స్లో విద్యార్థికి రూ.8.55, ప్రాథమిక పాఠశాలల్లో రూ.5.50 చొప్పున చెల్లిస్తున్నారు. ఇచ్చే అరకొర జీతం కూడా మూడు, నాలుగు నెలలకొకసారి వస్తాయి. చాలీ చాలని జీతాలతో ఏళ్ల తరబడి ఆ వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తే 25 మందికి ఒకరు, 25–100 మంది విద్యార్థులకు ఇద్దరు, అంతకన్నా ఎక్కువ విద్యార్థులుంటే ప్రతి వంద మందికి ఒకరిని చొప్పున అదనంగా విధుల్లోకి తీసుకుంటారు. ఈ లెక్కన ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న 4500 మంది మధ్యాహ్న భోజన కార్మికుల్లో సగానికి పైగా ఉపాధి కోల్పోనున్నారు. స్మార్ట్ కిచెన్ నిర్వాహకులు అంతా కూటమి నాయకులే ఉండనుండటంతో ఇప్పుడు పనిచేస్తున్న వారిని సైతం తొలగించి తీసుకునే కొద్ది మందిని కూడా వారి మనుషులనే ఉంచుకుంటారని ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఆందోళన బాటలో మధ్యాహ్న భోజన కార్మికులు: తమకు వ్యతిరేకంగా చేపట్టిన స్మార్ట్కిచెన్లు వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాల వారీగా మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన బాట పట్టారు. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద, మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలను ఇప్పటికే మొదలు పెట్టారు. చాలీచాలని జీతాలతో పని చేస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని, స్మార్ట్కిచెన్ల ప్రక్రియను నిలిపేసి తమకు కనీస గౌరవ వేతనం అమలు చేయాలని, ప్రమాద బీమా, ఈఎస్ఐ అమలు చేయాలని, వంటపాత్రలు, గ్యాస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కంభం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు -
ప్రతి ఇంటికి తాగునీటిని అందించాలి
మార్కాపురం టౌన్: జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ విజయసునీత అన్నారు. కలెక్టరేట్లో జలజీవన్ మిషన్ పథకంపై శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2028 డిసెంబరు నాటికి పథకాన్ని పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 2225 పనులను రూ.1780 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. హనుమంతునిపాడు, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల్లో రూ.1802 కోట్లతో తాగునీటి పథకాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. అలాగే జలజీవన్ మిషన్ కింద 119 గ్రామాల్లో తాగునీటి పైపులైన్లు పునరుద్ధరించేందుకు రూ.30.5 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ అబూద్ఆలీ, జిల్లా గ్రామీణ నీటిసరఫరా ఈఈ సురేష్బాబు, అధికారులు పాల్గొన్నారు. -
భూములు గిరిజనులవి.. పరిహారం కూటమి నేతలకు
గుడ్లూరు: తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను టీడీపీ నేతలు అక్రమంగా ఆన్లైన్ చేయించుకుని రామాయపట్నం పోర్టు కింద పరిహారం పొందేందుకు కుట్ర పన్నుతున్నారని, తమకు న్యాయం చేయాలని మండలంలోని చేవూరు గ్రామానికి చెందిన గిరిజనులు గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరాహార దీక్ష చేసి నిరసన తెలిపారు. గ్రామంలోని సర్వే నంబరు 860లో ఎ1–36 సెంట్లు భూమిని ప్రభుత్వం 1982వ సంవత్సరంలో పోట్లూరు అంకులయ్యకు డీ పట్టా ఇచ్చింది. అదే గ్రామంలో 962 సర్వేనంబరులో ఎ3–61 సెంట్ల భూమికి యాకసిరి లక్ష్మయ్యకు డీపట్టా ఇచ్చారు. 861 సర్వే నంబరులో ఎ1–50 సెంట్ల భూమికి చేవూరు రవికి పట్టా ఇచ్చారు. చేవూరు రైతులు రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం భూములిచ్చారు. ఆ రైతులకు నష్టపరిహారం చెల్లిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే గ్రామంలోని తెలుగుదేశం నాయకులు నక్కల శేషయ్య, మాదాల సుబ్బారావు తమ భూములను ఆక్రమించుకొని, తమ పేర్లు తొలగించి రెవెన్యూ అధికారుల ద్వారా వారి పేర్లును ఆన్లైన్లో నమోదు చేయించుకుని నష్టపరిహారం పొందటానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. అసైన్మెంట్ భూములను వేరే వ్యక్తులకు బదిలీ చేయటానికి లేదు. రెవెన్యూ అధికారులు చేతివాటంతో పేర్లుమార్చి తమ పొలాలను ఇతరుల పేరు మీద ఆన్లైన్ చేశారని, ఈవిషయంపై గతంలో కందుకూరు సబ్కలెక్టర్ శ్రీపూజకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటీవల మళ్లీ మా భూములకు సంబంధించిన పరిహారం మాకు చెందకుండా కూటమి నాయకులు వారి పేర్లమీద బ్యాంకు ఖాతాలో జమచేయమని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని బాధితులు తెలిపారు. ఆమేరకు తహశీల్దార్ బాల కిశోర్కు వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై తహశీల్దార్ను వివరణ కోరగా అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతం చేయటం చట్టారీత్యా నేరం అని, దీనిపై సమగ్ర విచారణ చేసి గిరిజనులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బాధితులు పోట్లూరు ప్రసాదు, యాకసిరి లక్షమ్మ, చేవూరు రవి, సీపీఎం నాయకులు గుడ్లూరు ఏరియా కార్యదర్శి జీ వెంకటేశ్వర్లు, జాలయ్య, అంజయ్య పాల్గొన్నారు. తహశీల్దార్ కార్యాలయం దగ్గర గిరిజనుల ఆందోళన -
శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరులో పచ్చనేత రాజ్యాంగం అమలులో ఉంది. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు పనిచేయవు. చట్టం ఉన్నా సారు చుట్టంలా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తోంది. ‘‘తన రెస్టారెంట్లో బ్రాండెడ్ మద్యం విక్రయించాలి. లైసెన్స్ పొందిన మద్యం దుకాణాల్లో చీప్ లిక్కర్ మాత్రమే అమ్మాలంటూ హుకుం జారీ చేశారని తెలుస్తోంది. అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని సొంత దందా నడుపుకుంటున్నాడని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి టాస్క్ఫోర్స్: గిద్దలూరు పట్టణంలో మొత్తం 5 దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. ఒంగోలు రోడ్, కుమ్మరి వీధి, నంద్యాల–ఒంగోలు రోడ్ వైఎస్సార్ సర్కిల్, నంద్యాల–ఒంగోలు రోడ్లో మరో దుకాణం, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నాయి. వీటికి చాలా మంది మద్యం వ్యాపారులు టెండర్ వేశారు. కొంత మంది లాటరీలో దుకాణాలు దక్కించుకున్నారు. అయితే వారికి ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కీలక నేత సోదరుడు రంగ ప్రవేశం చేసి మద్యం దుకాణాలన్నిటినీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఒక ప్లాన్ ప్రకారమే మద్యం దుకాణాలను హస్తగతం చేసుకున్నారు. ఆ దుకాణాల్లో చీప్ లిక్కర్ మాత్రమే విక్రయించే ఏర్పాట్లు చేశారు. బ్రాండెడ్ మద్యం, బీర్లను మాత్రం ఎక్కడా దొరకకుండా కట్టడి చేశారు. ఫలితంగా లైసెన్స్ పొందిన మద్యం దుకాణాల్లో రూ.99 విలువజేసే చీప్ లిక్కర్ మాత్రమే అమ్ముతున్నారు. ఇక్కడ బీరు కానీ, బ్రాండెడ్ కంపెనీ మద్యం కానీ అందుబాటులో లేవు. దీంతో మందుబాబు కొంచెం ఖరీదైన మద్యం కోసం విధిలేని పరిస్థితుల్లో బార్కు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. అక్కడ అధిక ధరలు వసూలు చేస్తుండడంతో మద్యం బాబులకు తాగకుండానే నిషా తలకెక్కుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన చెప్పిందే టైం... ఒక్క మద్యం ఎమ్మార్పీ విషయంలోనే కాదు సమయ పాలనలో కూడా అంతా ఆయన ఇష్టమే. రాష్ట్రం మొత్తం ఒక సమయం పాటిస్తే గిద్దలూరులో మాత్రమే ఆ నేత చెప్పిన టైంను పాటిస్తున్నారు అధికారులు. సాధారణంగా మద్యం దుకాణాలన్నీ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు దుకాణాలు నిర్వహించాలి. నిబంధనల ప్రకారం కీలక నేత బార్ కూడా ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండాలి. అయితే తెల్లవారుజాము 6 గంటల నుంచి రాత్రంతా బార్ తెరిచే ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి బార్ అండ్ రెస్టారెంట్లో ఏసీ, సౌకర్యవంతమైన సిట్టింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ అలాంటి సౌకర్యాలు మచ్చుకై నా కనిపించవు. ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి.. ఒక్క గిద్దలూరు పట్టణంలోని 5 మద్యం దుకాణాల్లో బీర్లు, బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకుండా చేయడం ద్వారా ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతున్నట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఈ ఐదు షాపుల్లో బ్రాండెడ్ విక్రయాలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ.20 కోట్ల వరకు ఆదాయం కోల్పోతున్నట్లు వివరిస్తున్నారు. అంతేకాకుండా కీలక నేత బార్లో అదనంగా రూ.50 నుంచి రూ.300 వసూలు చేస్తూ కోట్లాది రూపాయలతో ఖజానా నింపుకుంటున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి క్వార్టర్కు ఎమ్మార్పీపై రూ.40 అదనంగా అమ్ముతున్నారు. బీర్లు ఎమ్మార్పీపై రూ.70 నుంచి రూ.100లు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఎవరైనా మద్యం ప్రియులు ఇదేంటని ప్రశ్నిస్తే వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేస్తున్నారని, మాట వినకపోతే అలాంటి వారిపై కేసులు బనాయిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. నిజానికి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయించడానికి వీలులేదు. ఎవరైనా అలా విక్రయిస్తే ఎకై ్సజ్ కేసులు నమోదు చేసి భారీగా జరిమానా విధించడం వంటి చర్యలు తీసుకుంటారు. అయితే అధికార పార్టీకి చెందిన కీలక నేత బార్లో బహిరంగంగానే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నప్పటికీ పట్టించుకునే అధికారి ఒక్కరు కూడా కనిపించడంలేదు. దీంతో యథేచ్ఛగా మద్యం దోపిడీ సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.గిద్దలూరు రూరల్: జీవనోపాధి కోసం తమకు అటవీ హక్కులు కల్పించండని గిరిజనులు శుక్రవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి వద్ద వేడుకున్నారు. మండలంలోని దిగువమెట్ట తండాలో పర్యటించిన సందర్భంగా చెంచులు వారి సమస్యలను ఆయనకు వివరించారు. అటవీశాఖ ఏర్పడక ముందే గిరిజనులు అడవి మీద ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేశారు. అటవీశాఖ అధికారులు తమను అడవిలోకి వెళ్లనివ్వకుండా తమపై అక్రమంగా కేసులు బనాయిస్తూ జీవనోపాధిపై దెబ్బ కొడుతున్నారన్నారు. తమ జీవనవిధానంలో ఎటువంటి మార్పు రావడం లేదని వాపోయారు. అడవి సమీపంలో ఉన్న తమను ఐటీడీఏ పరిధిలోకి చేర్చాలని వేడుకున్నారు. తండా గ్రామంలో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని వివరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం సమస్యల వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కె.లక్ష్మీ, కె.మల్లీశ్వరరావు, పి.వెంకటప్ప, శ్రీశైలం ఐటీడీఏ పీఓ పీవీఎస్.నాయుడు, ఎస్టీ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ కె.సాంబయ్య, మార్కాపురం ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిణి వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం: మార్కాపురం జిల్లాలో నేడు జరిగే పాలిసెట్ పరీక్షకు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కోఆర్డినేటర్ వలియానాయక్ శుక్రవారం తెలిపారు. మొత్తం 2765 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని, జిల్లా మొత్తం మీద 10 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మార్కాపురం 4, పొదిలిలో 3, కనిగిరి 2, గిద్దలూరులో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.గిద్దలూరు పట్టణంలోని మద్యం దుకాణాల్లో ప్రభుత్వ నిబంధనలను పాటించకపోవడం, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండడం వంటివాటిని ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలక నేత సొంత బార్పై చర్యలు తీసుకుంటే ఏమవుతుందోనన్న భయం, నెలవారీ మామూళ్లకు అలవాటు పడిపోవడం వల్లనే అధికారం యంత్రాంగం మొత్తం చేతులు కట్టుకొని చోద్యం చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇదేం విస్తరణ
కందుకూరు: జాతీయ రహదారి 167బి నుంచి కందుకూరు పట్టణంలోకి వచ్చే అంతర్గత రోడ్డు (ఓవి రోడ్డు) విస్తరణ పనులు చర్చనీయాంశంగా మారాయి. పట్టణంలోకి వచ్చే ఓవీ రోడ్డును కేవలం ఇరువైపులా రెండు అడుగుల మేర పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఉపయోగం లేని ఈ విస్తరణ పనుల వల్ల ఎవరికి ప్రయోజనం అనే ప్రశ్న తలెత్తుతోంది. పైగా ఆ పనులు కూడా పది రోజులుగా పూర్తిగా నిలిచిపోయాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, మైనింగ్శాఖ నుంచి ఎదురవుతున్న సమస్యల వల్ల పనులు నిలిచిపోయాయని జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెప్తున్నారు. పనులు ప్రారంభించి ఆపేయడం వల్ల విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. మరో రెండు, మూడు రోజుల్లో తిరిగి పనులు ప్రారంభిస్తామంటూ ఎన్హెచ్ అధికారులు చెప్తున్నారు. రూ.6 కోట్లతో విస్తరణ పనులు సింగరాయకొండ జాతీయ రహదారి నుంచి కడప జిల్లా మైదుకూరు వరకు నూతనంగా నిర్మించిన జాతీయ రహదారి 167బి నిర్మాణం చేసే సమయంలో పలుచోట్ల అంతర్గత రోడ్లు ధ్వంసమయ్యాయి. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కందుకూరు పట్టణానికి దక్షిణంవైపు బైపాస్ రోడ్డు నిర్మించారు. ఈ బైపాస్ వలేటివారిపాలెం నుంచి వచ్చే సమయంలో చెర్లోపాలెం వద్ద ప్రారంభమై, సింగరాయకొండ రోడ్డులో సీఐటీఆర్ఐ వద్ద ముగుస్తుంది. దీంతో చెర్లోపాలెం వద్ద నుంచి పట్టణంలోకి వచ్చే రోడ్డు, ఇటు సీటీఆర్ఐ నుంచి పట్టణంలోకి వచ్చే రోడ్డు ఇరుకు రోడ్లుగా మారిపోయాయి. బైపాస్ నుంచి పట్టణంలోకి వచ్చే ఈ రెండు రోడ్లను విస్తరిస్తున్నారు. వీటితో పాటు బడేవారిపాలెంలోకి సీసీ రోడ్డు, డ్రైనేజీ, వలేటివారిపాలెంలోకి బీటీ రోడ్డు, చుండి వద్ద సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులకు గాను రూ.6 కోట్ల నిధులను జాతీయ రహదారుల సంస్థ ఖర్చు చేస్తోంది. ఈ పనుల బాధ్యతను ఒంగోలుకు చెందిన కాంట్రాక్టు సంస్థకు అప్పచెప్పారు. ఆ సంస్థ నెల రోజుల క్రితం పనులు ప్రారంభించి కొంత మేర చేసి ప్రస్తుతం పనులు నిలిపివేసింది. అరకొరగా విస్తరణ: ఈ పనుల పట్ల ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు వలేటివారిపాలెం నుంచి, ఇటు సీటీఆర్ఐ వద్ద ఉన్న బైపాస్ రోడ్డు నుంచి పట్టణంలోకి వచ్చే రెండు రోడ్లు వెడల్పు తక్కువగా ఉంటాయి. భారీ వాహనాలు రెండు ఎదురెదురుగా వస్తే సైడ్ ఇవ్వడం కూడా కష్టమే. జాతీయ రహదారి నిర్మాణం తరువాత ఈ రెండు రోడ్లు విస్తరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు ఉన్నాయి. ఎట్టకేలకు ఆ పనులు చేపట్టినా రోడ్లను వెడల్పు చేస్తున్న తీరుపట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు అటూ, ఇటూ కేవలం రెండు అడుగుల మేర మాత్రమే పెంచుతున్నారు. దీని వల్ల ఎంత మేరకు రోడ్డు వెడల్పు పెరుగుతుందంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న పనుల వల్ల ఏ ఉపయోగం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం కాంట్రాక్టరుకు ప్రయోజనాలు తప్పా ప్రజలకు ఉపయోగం లేని విస్తరణ అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఎన్హెచ్ అధికారులు మాత్రం డబుల్ రోడ్డు చేస్తున్నామంటే, ప్రస్తుతం ఐదు మీటర్లు ఉంటే దాన్ని ఏడు మీటర్లకు పెంచుతున్నామని చెప్తున్నారు. మరింత వెడల్పు చేయాలంటే విద్యుత్లైన్లు మార్చడంతో పాటు, ఇతర సమస్యలున్నాయంటున్నారు. ప్రస్తుతానికి ఈ పనులు పూర్తి చేసి ఆర్అండ్బీ శాఖకు రోడ్లను అప్పగిస్తామని, ఆ తరువాత వాళ్లు ఎంత వెడల్పు అయినా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆగిన పనులు... వాహదారులకు నరకం: ఈ పనులు కూడా పది రోజులుగా కాంట్రాక్టు సంస్థ నిలిపేసింది. కొంతమేర పనులు చేసి నిలిపేయడం వల్ల ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా సీటీఆర్ఐ నుంచి కందుకూరు పట్టణంలోకి వచ్చే రోడ్డుకు ఓ వైపు రోడ్డు నుంచి రెండు అడుగుల మేర లోతు తవ్వి వదిలేశారు. మరోవైపు కంకర మాత్రమే వేసి వదిలేశారు. గుంట తవ్విన వైపు కనీసం ప్రయాణికులకు తెలిసేలా రేడియం స్టిక్కర్లు వంటివి కూడా సక్రమంగా లేవు. దీని వల్ల రాత్రిపూట వెళ్లే వాహనాలు రోడ్డు మార్జిన్లో ఉన్న గుంటను గమనించలేక అందులో పడుతున్నారు. ఇటీవల రెండు ఆటోలు, ద్విచక్ర వాహనాలు పడిపోవడంతో వాహదారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇటు వలేటివారిపాలెం వైపు వెళ్లే రోడ్డు విస్తరణ కూడా ఇదే పరిస్థితి. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలా రోడ్డును తవ్వి వదిలేయడం ప్రయాణికుల పాలిట ప్రాణ సంకటంగా మారింది. మైనింగ్ శాఖ అనుమతుల్లో సమస్య: పనులు నిలిచిపోవడానికి పలు కారణాలను ఎన్హెచ్ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా మైనింగ్శాఖలో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల రోడ్డు నిర్మాణ మెటీరియల్కు ఇబ్బంది ఏర్పడుతోంది. మైనింగ్శాఖ నుంచి అనుమతి తీసుకుని మెటీరియల్ తెచ్చుకోవాల్సి ఉందని, అలా కాకుండా తీసుకొస్తే ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. మైనింగ్శాఖలో లీజు కోసం దరఖాస్తు చేసే వెబ్సైట్ మార్పు వల్ల ఈ సమస్య ఏర్పడిందన్నారు. అలాగే పనులు చేసే కార్మికులు పశ్చిబెంగాల్ ప్రాంతానికి చెందిన వారు కావడంతో అక్కడ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కార్మికులు వెళ్లారు. అలాగే అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా బిటుమిన్ దొరికే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో బిటుమిన్ టన్ను రూ.45 వేలు ఉంటే ప్రస్తుతం అది రూ.90 వేలకు పెరిగిపోయిందన్నారు. అయినా దిగుమతి లేకపోవడం వల్ల డిమాండ్ ఏర్పడి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం బైసాస్ రోడ్డు నుంచి కందుకూరు పట్టణంలోకి వచ్చే ఓవీ రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయిన మాట వాస్తమే. కార్మికులు అందుబాటులో లేకపోవడం, మెటీరియల్ సమస్య వల్ల పనులు నిలిచిపోయాయి. నిలిచిపోయిన పనులను మరో రెండు, మూడు రోజుల్లో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈలోపు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. – సుమన్, ఎన్హెచ్ జేఈ -
సన్ రైజింగ్..!
వేసవి ముదిరింది. సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. రోడ్లపైకొస్తే నడి నెత్తి పగలగొడుతున్నాడు. మండుటెండలకు తాళలేక ఇంటి నుంచి బయటకొచ్చేందుకు జనం జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వివిధ పనులపై బయట తిరిగే వారు ఎండ నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. కొంతమంది గొడుగులు వాడుతుండగా, మరికొంత మంది క్లాత్ కప్పుకుని కాపాడుకుంటున్నారు. భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూనే తమతమ పనులు చూసుకుంటున్నారు. మధ్యాహ్న సమయంలో జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. – సాక్షి, ఒంగోలు జన సంచారం స్వల్పంగా ఉన్న ఒంగోలు చర్చి సెంటర్ -
పల్లె నిద్రలో కలెక్టర్కు సమస్యల వెల్లువ
చీమకుర్తి రూరల్: పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం రాత్రి చీమకుర్తి మండలంలోని చండ్రపాడు గ్రామంలో బస చేశారు. ముందుగా గ్రామస్తులతో సమస్యలపై చర్చించారు. స్థానికులు అనేక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా వితంతువులకు పింఛన్లు, తల్లికి వందనం, తాగునీటి సరఫరా, హరిజనవాడలో డ్రైనేజీ సమస్య, రోడ్లు, తదితర సమస్యలను ఏకరువు పెట్టారు. చండ్రపాడు గ్రామంలోని చెరువుకు సంబంధించి మూడు తూముల ద్వారా నీళ్లు రావడం లేదని, ఆ సమస్యను పరిష్కరించాలని పలువురు రైతులు కోరారు. చండ్రపాడు నుంచి నేలటూరుకు, లక్ష్మీపురంకు రోడ్లు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్ను కోరారు. శనివారం ఉదయం గ్రామంలో తాను పర్యటించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని, సంబంధిత అధికారుల ద్వారా సమస్యలన్నీ పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జేసీ కల్పనా కుమారి, స్థానిక ఎమ్మెల్యే విజయ్కుమార్, ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి, మండల స్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
మార్కాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శివశంకర్రెడ్డి
మార్కాపురం: మార్కాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎం.శివశంకర్రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం మార్కాపురం పట్టణంలోని అసోసియేషన్ హాల్లో బార్ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికే అసోసియేషన్ కార్యదర్శిగా వి.కాశయ్య, వైస్ ప్రెసిడెంట్గా షేక్ మహబూబ్వలి, జాయింట్ సెక్రటరీగా కె.రామయ్య, ట్రెజరర్గా కమల పద్మజ, మహిళా కార్యదర్శిగా ఆకుల ఉషశ్రీ ఎన్నికయ్యారు. కాగా బార్ అసోసియేషన్ హాల్లో నూతన అధ్యక్షడు శివశంకర్రెడ్డిని న్యాయవాదులు అలీ జహీర్, భూపని కాశయ్య, రామిరెడ్డి, రవీంద్రనాఽథ్, వెంకటేశ్వరరెడ్డి, పరుశురాముని సుబ్బరామయ్య, షేక్ సలాం, నారాయణరెడ్డి తదితరులు అభినందించి ఘనంగా సన్మానించారు. ఉలవపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యూట్యూబర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వివరాలు.. ఉలవపాడు గ్రామానికి చెందిన సాంబశివారెడ్డి(35) ఒంగోలు కుర్రాడు యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. బుధవారం పెదపట్టపుపాలెంలో మత్స్యకారుల సమావేశాన్ని కవర్ చేయడానికి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో చాగల్లు–చాకిచర్ల మధ్య రోడ్డుపై గేదె అడ్డురావడంతో ద్విచక్ర వాహనం నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఒంగోలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. మృతదేహన్ని ఉలవపాడుకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులను పలువురు జర్నలిస్టులు పరామర్శించి, సంతాపం తెలియజేశారు. -
నీటి పన్ను వసూళ్లు ..ప్చ్!
రూ.19.51 కోట్లు రూ.19.35 కోట్లు ఒంగోలు కార్పొరేషన్ రూ.4.29 కోట్లు రూ.4.21 కోట్లు మార్కాపురం రూ.3.62 కోట్లు రూ.3.59 కోట్లు కందుకూరు రూ.80.97 లక్షలు రూ.72.89 లక్షలు అద్దంకి రూ.78.66 లక్షలు రూ.77.95 లక్షలు కనిగిరి నీటి పన్ను డిమాండ్ బకాయి రూ.46.10 లక్షలు రూ.45.66 లక్షలు చీమకుర్తి రూ.1.33 కోట్లు రూ.1.27 కోట్లు గిద్దలూరు -
డర్
డీజిల్ఒంగోలు సబర్బన్: జిల్లాలో పలు చోట్ల డీజిల్ కొరత ఏర్పడుతోంది. ఆయిల్ కంపెనీలు పెట్రోలు బంకులకు సరఫరా తగ్గించటమే అందుకు కారణంగా తెలుస్తోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. దాంతో జిల్లాలో మూడు రోజులకు ఒక లోడు డీజిల్.. పెట్రోలు బంకులకు సరఫరా చేస్తున్నారు. అదికూడా డబ్బులు కట్టిన మూడు రోజులకు ఆయిల్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. దాంతో గతంలో మాదిరిగా వందల, వేల లీటర్ల డీజిల్ కావాలంటే ఇచ్చే పరిస్థితుల్లో పెట్రోలు బంకులు లేవు. గతంలో మాదిరిగా ఆయిల్ కంపెనీలకు కూడా పైనుంచి సరఫరా సక్రమంగా రాకపోవటంతో పెట్రోలు బంకులకు సరఫరా కట్టడి చేశాయి. డీజిల్ తగ్గించి పెట్రోలు కావాలంటే తీసుకోవాలని ఆయిల్ కంపెనీల అధికారులు పెట్రోలు బంకు యజమానులకు చెబుతున్నట్లు సమాచారం. దాంతో డీజిల్ కొరత ఏర్పడి బంకులు మూతపడే పరిస్థితి నెలకొంది. ఒక పక్క రబీలో వరి కోతలు ఊపందుకున్నాయి. దాంతో ఇంధన కొరతతో వరికోత మిషన్లు జిల్లాలో కనపడటం లేదు. ఎక్కడి వరికోత మిషన్లు అక్కడే ఆగిపోయాయి. డీజిల్ కొరతతో ఆక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ దొరక్క రొయ్యలు, చేపలసాగుపై ప్రభావం చూపే పరిస్థితి. దానికి తోడు కరెంటు కోతలు మొదలైతే అన్నిరంగాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పెట్రోలు బంకు యజమానులు జేసీని కలిసి డీజిల్ కొరతపై చర్చించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
జర్నలిజం ముసుగులో ఎల్లో రాతలు
ఒంగోలు టౌన్: జర్నలిజం ముసుగులో మహిళలపై తప్పుడు రాతలు రాస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ మీద ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా ఎందుకు కేసు నమోదు చేయడంలేదని, మహిళా లోకం సిగ్గుతో తలవంచుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ మీద వెంటనే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సంతనూతలపాడు వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పార్టీ నాయకులతో కలిసి ఆయన శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని క్యాంపు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ ఫిర్యాదు చేస్తే ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం బాధాకరమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదు చేసినా కనీసం ఒక్క పోలీసు స్టేషన్లో కూడా కేసు నమోదు చేయకపోవడం విస్మయానికి గురిచేసిందన్నారు. ఒక ప్రధాన పత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి దుర్మార్గంగా మాట్లాడితే దేశం మొత్తం విస్మయం చెందిందని చెప్పారు. రాష్ట్రంలో దళితుల మీద దాడులు ఎక్కువయ్యాయని, కూటమి ప్రభుత్వం దళితులపై దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్కు కూటమి పాలకులు దండలు వేసినా, వేయకపోయినా మా గుండెల్లో ఎప్పుడూ ఉంటారని చెప్పారు. విజయవాడ నడిబొడ్డున బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని జగనన్న ఏర్పాటు చేస్తే దాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి నేలబారు పనులు మానుకోవాలని హితవు చెప్పారు. రోజుకు రూ.500 కోట్లు ఏమౌతున్నాయో.... ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుతుంటే పాలకులు, వారి అనుంగ పత్రికలు సహించలేకపోతున్నాయని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అరాచకాలను ఎండగడుతున్న వారిపై అవాకులు చెవాకులు పేలుతున్న ఎల్లో మీడియా తీరు చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో చేసిన అప్పు రూ.3.30 లక్షల కోట్లు కాగా, రోజుకు రూ.500 కోట్ల చొప్పున నెలకు రూ.1500 కోట్లు అప్పులు చేస్తుందని వివరించారు. అయినా సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేకపోతున్నారని, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల జీతాలకే సరిపోవడంలేదని చెబుతున్న చంద్రబాబు ఈ కోట్ల అప్పులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అమరావతి పేరుతో అవినీతితో దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని రైతాంగాన్ని దోచుకుంటున్నారని, ఆరోగ్యశ్రీ బిల్లులు సక్రమంగా చెల్లించడంలేదని, విద్యా వసతి అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలను అమ్ముకుంటుండడాన్ని ప్రశ్నిస్తుంటే, ప్రజల దృష్టి నుంచి మరల్చడానికి ఏబీఎన్ రాధాకృష్ణను రంగంలోకి దించారని విమర్శించారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీని తిట్టే పనిని రాధాకృష్ణ తన నెత్తిన వేసుకున్నాడని చెప్పారు. సిద్దాంతపరంగా మాట్లాడితే మా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ జవాబు ఇవ్వగలరని, పార్టీ విధానాల పరంగా మాట్లాడితే తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు జగనన్న నేర్పిస్తున్నాడన్న అక్కసుతో రాధాకృష్ణ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను దూషించడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దూషణలతో కుంగిపోయేదిలేదని, మరింత ఆత్మస్థైర్యంతో పనిచేస్తామని, ఈ కూటమి అరాచకాలను, అప్పుల లెక్కలను తేలుస్తామని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, యరజర్ల రమేష్, రవి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున, పక్కన చుండూరి రవిబాబు -
26న బీచ్ కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక
ఒంగోలు: సీ్త్ర, పురుషుల బీచ్ కబడ్డీ జిల్లా జట్లను ఈ నెల 26వ తేదీ ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కుర్రా భాస్కరరావు, వై.పూర్ణచంద్రరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరాయకొండ మండలం పాకల బీచ్ వద్ద సాయంత్రం 3 గంటలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. పురుషులు 85 కేజీల్లోపు, సీ్త్రలు 75 కేజీల్లోపు బరువు కలిగి ఉండాలన్నారు. ఎంపికై న జిల్లా జట్లు మే 7 నుంచి 10వ తేదీ వరకు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో నిర్వహించే 13వ రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు పీడీ కిరణ్కుమార్ (8327667733)ను సంప్రదించాలని భాస్కరరావు, పూర్ణచంద్రరావు సూచించారు. ● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సిటీ: జిల్లాలో పరిశ్రమలకు సంబంధించి 241 క్లెయిమ్లకుగానూ రూ.32.64 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. గురువారం కలెక్టర్ అధ్యక్షతన డీఐఈపీసీ సమావేశం జరిగింది. స్థానిక ప్రకాశం భవనంలో నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మెగా ప్రాజెక్టులైన ఇండోసోల్, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ, బీడీఎల్ పరిశ్రమల పురోగతి, ఎంవోయూ చేసుకున్న పరిశ్రమల పురోగతి గురించి చర్చించారు. త్వరలో మెగా పరిశ్రమలకు అనుసంధానంగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసేలా ఎంఎస్ఎంఈ కాన్క్లేవ్ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వన్ ఫ్యామిలీ వన్ ఇంటర్ప్రెన్యూర్ ద్వారా ప్రతి కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కార్యాచరణ రూపొందించాలని డీఆర్డీఏ పీడీ, మెప్మా పీడీ, ఏపీఎంఐపీ పీడీ, డీపీఓలను ఆదేశించారు. ఒంగోలు: స్థానిక మంగమూరు డొంకలోని జిల్లా క్రికెట్ అసోసియేషన్ సబ్ సెంటర్లలో అండర్ – 15 బాలికలు, అండర్ – 16 బాలుర జిల్లా క్రికెట్ జట్లను ఈ నెల 26వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారు మాత్రమే అర్హులని చెప్పారు. అండర్ – 16 విభాగంలో ఎంపికకు వచ్చే క్రీడాకారులు 2010 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2012 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని సూచించారు. అండర్ – 15 విభాగానికి హాజరయ్యే బాలికలు 2011 సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం (ఫారం 5), ఆధార్కార్డు, స్టడీ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. బాలురు సొంత కిట్, వైట్ డ్రస్, షూతో హాజరుకావాలన్నారు. బాలికలు మాత్రం కలర్ డ్రస్, షూ, సొంత కిట్తో హాజరుకావాలని చెప్పారు. పూర్తి వివరాలకు కోచ్ పి.శ్రీనివాస్ (9573424360)ను సంప్రదించాలని నాగేశ్వరరావు కోరారు. -
నీళ్ల చారు, చెంచాడు పొడి కూర.!
యర్రగొండపాలెం: దోసెడు అన్నంలోకి కాసింత నీళ్ల చారు, చెంచాడు పొడి కూరతో రోగులకు పౌష్టికాహారం ఏ విధంగా అందుతుందని వై.పాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. స్థానిక ఏరియా వైద్యశాలను గురువారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో ఎమ్మెల్యే మాట్లాడారు. అదే సమయంలో రోగులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అందులో కోడి గుడ్డు కనిపించలేదు. చట్నీ, పెరుగు వడ్డించలేదు. దీంతో ఒక రోగికి అందజేసిన ప్లేటును ఆయన తీసుకుని చూశారు. అందులో కొంచం అన్నం, ఆ అన్నంలో నీళ్ల చారు, ఒక టీ స్పూన్ పొడి కూర ఉండటంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఈ విధంగా భోజనాలు పెడితే రోగులకు మంచి పోషకాలు ఏ విధంగా అందుతాయని అన్నారు. హాస్పిటల్లోని రోగులందరికీ భోజనం పెట్టకుండా కేవలం 15 శాతం మందికే పెట్టడంపై ఆయన మండిపడ్డారు. హాస్పిటల్లోని ఒక వార్డులో ఎమ్మెల్యే తనిఖీ చేస్తుండగా.. మరో వార్డులోకి నర్సులు వెళ్లి.. భోజనాలు బాగా పెడుతున్నారని ఎమ్మెల్యేకు చెప్పాలని రోగులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. భోజనాలకు, నర్సులకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ.. అన్నం బాగా పెట్టకపోయినా పెడుతున్నారని రోగులను చెప్పమనడంలో అర్థం ఏమిటంటూ నర్సులను మందలించారు. వైద్యశాలలో పారిశుధ్యం లోపించిందని, కేవలం జీతాల కోసమే పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైద్యశాల సూపరింటెండెంట్ యదిద్యాను పిలిచి హాస్పిటల్లో లోపాలను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. ప్రజలకు వచ్చిన రోగాలు నయం చేయించుకోవటానికి వైద్యశాలకు వస్తుంటే.. ఇక్కడ కొత్త రోగాలతో వెనుదిరిగి వెళ్లే పరిస్థితి ఉందన్నారు. అలాంటి పరిస్థితి ప్రజలకు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. రోగులందరికీ మెనూ ప్రకారం మంచి భోజనం పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్, ఒంగోలు సుబ్బారెడ్డి, సురేష్ నాయక్ ఉన్నారు. -
బదిలీలలేనా.!
ఉపాధ్యాయుల బదిలీలపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో బదిలీలు చేపడతారా.? ఏ ప్రమాణాలు అమలు చేస్తారు.? అనే దానిపై స్పష్టత లేక ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ఏడాది అస్తవ్యస్థ నిర్ణయాల అనుభవం దృష్ట్యా ఈసారి ప్రక్రియ ఎలా ఉంటుందో అన్నదే ప్రధాన చర్చగా మారింది. ఈసారీగత ఏడాది అంతా గందరగోళం... ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీచర్ల బదిలీల ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. తొలుత ప్రధానోపాధ్యాయుల బదిలీలు గత ఏడాది మే 21వ తేదీ ప్రారంభమయ్యాయి. తొలి రెండు రోజులు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. బదిలీలు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని, దానిని నిలబెట్టుకోవాలంటూ టీచర్లు ఆందోళన బాట పట్టారు. ఆ తర్వాత దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. జూన్ 11వ తేదీ నుంచి స్కూళ్లు తెరిచిన తర్వాత కూడా కౌన్సెలింగ్ జరగడం గమనార్హం. ఒంగోలు పాత జిల్లా పరిషత్ భవనం వద్ద బదిలీల కౌన్సెలింగ్ జరిగింది. బదిలీల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీల్లో నిబంధనలు పాటించలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేశాయి. సాధారణంగా కౌన్సెలింగ్లో ఖాళీలు చూపించిన తర్వాత ఆ ఉపాధ్యాయుడు తనకు అనుకూలమైన స్థానాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. అందుకు భిన్నంగా అధికారులు బదిలీలు చేశారని విమర్శలు వచ్చాయి. కౌన్సెలింగ్లో సంబంధిత అధికారే తాను సూచించిన స్థానానికి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారుల తీరుపై ఉపాధ్యాయులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ శాఖలోనైనా ఉద్యోగుల బదిలీలు జరుగుతుంటే.. ఆ శాఖలో ఉన్న ఖాళీలను చూపించి ఆప్షన్లు పెట్టించుకుంటారు. కానీ ఉపాధ్యాయుల బదిలీల్లో మాత్రం ఉపాధ్యాయులు ఆప్షన్లు పెట్టుకున్నా.. అవేమీ చెల్లుబాటు కాలేదన్న విమర్శలు వచ్చాయి. మాన్యువల్ కౌన్సెలింగ్ పోరాడి సాధించుకున్నామన్న తృప్తి లేకుండా పోయిందని ఉపాధ్యాయ సంఘాలు అధికారుల తీరుపై మండిపడ్డాయి. అనేక గందరగోళాలు, ఆరోపణల మధ్య మొత్తం 5458 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. సాంకేతికంగా వీరంతా బదిలీ అయిన కొత్త పాఠశాలల్లో రిపోర్టు చేసినా చాలామంది పాత పోస్టులోనే కొనసాగుతున్నారని సమాచారం. డీఎస్సీ 2025 ప్రక్రియ పూర్తయి కొత్త టీచర్లు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు అయితే కొత్త టీచర్లు వచ్చారుగానీ బదిలీ ఉపాధ్యాయులు కదిలే పరిస్థితి లేకుండాపోయిందని తెలిసింది. గత ఏడాది చేపట్టిన గందరగోళ బదిలీల్లో దాదాపు 356 మంది మిగులుగా తేలారు. హేతుబద్ధీకరణ ఉపాధ్యాయుల సర్దుబాటు అనంతరం వీరిని క్లస్టర్ మొబలైజ్ టీచర్లుగా ప్రకటించారు. ప్రస్తుతం పదోన్నతులు, బదిలీల్లో తమను పరిగణలోకి తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యాశాఖ పరిధిలో (12 నియోజకవర్గాలు) మొత్తం 12,447 మంది ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వేసవి సెలవుల్లో బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. దీంతో బదిలీలపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ ఏడాది బదిలీలు జరుగుతాయా? ఏ ప్రాతిపదికన జరుగుతాయనే అంశాలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఇదిలా ఉండగా గతేడాది ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్థ నిర్ణయాలతో విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత బదిలీలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగాయంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు సైతం చేశాయి. బదిలీలకు సంబంధించి తొలుత జిల్లాల వారీగా విభజన చేసిన తర్వాతే బదిలీలు జరుగుతాయని ప్రచారం జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగినప్పటికీ.. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్, సీనియార్టీని పరిగణనలోకి తీసుకునేటప్పుడు గందరగోళం లేకుండా ఉండటానికి ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికనే ఈ జాబితాలను రూపొందిస్తున్నారని తెలిసింది. యూ డైస్లో రేషనలైజేషన్కు సంబంధించి వివరాల నమోదుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. అలాగే విద్యాశాఖ జిల్లా అధికారుల నుంచి బదిలీలకు సంబంధించి వివరాలు సేకరించినట్టు సమాచారం. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, పోస్టుల రేషనలైజేషన్కు సంబంధించి మార్గదర్శకాలు కూడా రూపొందించారని సమాచారం. ఈ బదిలీల్లో మే 30వ తేదీ వరకు ఉన్న సర్వీసును పరిగణనలోకి తీసుకుంటారని, స్కూల్స్లో ఏప్రిల్ 30 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టుల రేషనలైజేషన్ ఉంటుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. బదిలీల్లో దివ్యాంగులకు సంబంధించి కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో వారికి మినహాయింపు ఇస్తారని తెలుస్తోంది. బదిలీల ప్రక్రియలో సీనియార్టీయే అత్యంత కీలకం. సర్వీస్ పాయింట్లు, స్టేషన్ పాయింట్లు, ఇతర ప్రత్యేక కేటగిరీల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ఈ పాయింట్ల విషయంలో గతంలో కొంత గందరగోళం నెలకొంది. బదిలీలపై భిన్న కథనాలు... ఈ ఏడాది ఉపాధ్యాయ బదిలీలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన సర్వేలో పాల్గొనే విభాగాలకు వచ్చే ఏడాది మార్చి వరకూ ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని ఆదేశాలు ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు ఈ సర్వేలో ఉన్నందున ఈ ఏడాది బదిలీలు జరిగే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా వేసవి సెలవులు ప్రారంభమైనా ఇంతవరకూ ప్రభుత్వం నుంచి బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు రాలేదని ఉపాధ్యాయ సంఘం నేత ఒకరు తెలిపారు. ఈ ఏడాది బదిలీలు అనుమానమేనని అంటున్నారు. ఒక వేళ బదిలీలు చేపడితే గత ఏడాదిలా కాకుండా ఉమ్మడి జిల్లాలో పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు. 1000 మంది వరకూ బదిలీకి అవకాశం... ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు చీరాల, పర్చూరు నియోజవర్గాల పరిధిలో అన్ని కేడర్ల ఉపాధ్యాయులు 12,447 మంది ఉన్నారు. ఇందులో 112 మంది ఎంఈవోలు ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు 820 మంది, స్కూల్ అసిస్టెంట్లు 4645 మంది, ఎస్జీటీలు 6172 మంది, పీడీలు 398 మంది, ఉర్దూ టీచర్లు 300 మంది ఉన్నారు. గత ఏడాది 5458 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు జరిగాయి. ఈ ఏడాది సుమారు 1000 మంది వరకూ ఉండే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. బదిలీలకు ముందే సమస్యల పరిష్కారం కోసం పోరాటం... బదిలీల ప్రక్రియ ప్రారంభించడానికి ముందే తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 25వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పీఆర్టీయూ పిలుపునిచ్చింది. ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదంటూ ఆ సంఘ నేతలు మండిపడుతున్నారు. -
బియ్యం బొక్కుతోంది.. కూటమి కొక్కులే!
సేకరించు.. సమీకరించు.. విక్రయించు.. పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం కూటమి నాయకులకు కాసులు కురిపిస్తున్నాయి. రేషన్ దుకాణాలకు చేరిన బియ్యాన్ని గంటల వ్యవధిలోనే బ్లాక్ మార్కెట్కు తరలించి డీలర్లు, కూటమి నేతలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పేదల బియ్యాన్ని గుట్టుచప్పుడుకాకుండా మిల్లుల్లో పాలిష్ పట్టి ప్రజలకు విక్రయించడంతోపాటు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న ఉదంతాలు గత రెండేళ్లుగా తరచూ బహిర్గతమవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ రేషన్ దందాపై చంద్రబాబు సర్కారు లేశమంతైనా స్పందించడం లేదు. దీంతో డీలర్లు, అధికార టీడీపీ, జనసేన నాయకులు ఆడిందే ఆటగా మారింది. ముఖ్య నేతలకు నెల నెలా ఠంచనుగా ముడుపులు అందిస్తుండటంతో ఎక్కడా దాడులు చేయకుండా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.మార్కాపురం: మార్కాపురం జిల్లా వ్యాప్తంగా రేషన్ పంపిణీ తీరు అస్తవ్యస్తంగా తయారైంది. పౌరసరఫరాల శాఖాధికారులు కూడా డీలర్ల మాటను జవదాటకపోవడంతో రేషన్ సరుకుల పంపిణీ సక్రమంగా సాగడం లేదు. మార్కాపురం, పెద్దారవీడు, దోర్నాల, కనిగిరి యర్రగొండపాలెం, గిద్దలూరు తదితర నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో డీలర్లు బియ్యం పంపిణీకి కొర్రీలు వేస్తున్నారు. కిలోకు 10 రూపాయల చొప్పున డబ్బు ఇస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. జిల్లాలో 21 మండలాల్లో 743 రేషన్ షాపులుండగా 3,32,587 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈనెల 15వ తేదీ వరకు 2,85,900 మంది(సుమారు) బియ్యం తీసుకున్నారు. ఇంకా 47 వేల మందికి పైగా రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం 1 నుంచి 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ షాపుల్లో బియ్యం, చక్కెర ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ప్రతి నెలా 26వ తేదీ నుంచి మరుసటి నెల 1వ తేదీ వరకు వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించగా మూడొంతుల మంది రేషన్ డీలర్లు ఆ నిబంధనకు తమకు వర్తించదన్నట్టు వ్యవహరిస్తున్నారు. పంపిణీ ఐదు రోజులే.. జిల్లా వ్యాప్తంగా దాదాపు 47 వేల మంది రేషన్కార్డుదారులు ఈ నెల బియ్యం తీసుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా కనిగిరి నియోజకవర్గంలో కార్డుదారులు రేషన్ బియ్యాన్ని తీసుకోలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. దీనికి వారు చెప్పే సమాధానాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఎండ తీవ్రత, వలసపోవడం వల్ల బియ్యం తీసుకునేందుకు ముందుకు రాలేదని అధికారులు చెబుతున్నారు. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, త్రిపురాంతకం తదితర మండలాల్లో రేషన్ డీలర్లు బహిరంగంగానే 4 లేదా 5వ తేదీకల్లా బియ్యం అయిపోయాయనని, డబ్బులిస్తామని చెబుతున్నప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు లేవు. త్రిపురాంతకం మండలంలో నాలుగు రోజులపాటు కాళ్లరిగేలా తిరిగినా బియ్యం ఇవ్వడం లేదని కార్డుదారులు ఘోష పెడుతున్నా డీలర్లు కనికరించడం లేదు. గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోనూ రేషన్ సరుకుల పంపిణీ తీరు దారుణంగా తయారైంది. కార్డుదారుల పడిగాపులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా ప్రతి నెలా 1 నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులు అందించేవారు. దీంతో ఐదేళ్లపాటు ప్రజలకు రేషన్పై సందేహాలు లేకుండా పోయాయి. ఇంటి వద్దకే వాహనం వస్తుండటంతో పనులు పోగొట్టుకోకుండా, సంతోషంగా రేషన్ తీసుకునేవారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నెలలో తొలి 15 రోజులు మాత్రమే రేషన్ షాపుల వద్ద సరుకులు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రేషన్ బియ్యం, చెక్కర కోసం పనులు పోగొట్టుకుని కార్డుదారులు షాపుల ముందు క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే, పలువురు డీలర్లు బహిరంగంగానే బియ్యం లేవు, కిలోకు 10 రూపాయలు డబ్బులిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నా వారిపై ఎలాంటి చర్యలు లేవు. మార్కాపురం జిల్లాలో అస్తవ్యస్తంగా రేషన్ బియ్యం పంపిణీ పేదలకు కేజీకి రూ.10 ముట్టజెప్పి బ్లాక్ మార్కెట్కు బియ్యం తరలింపు వృద్ధులకు ఇంటి వద్దే బియ్యం ఇవ్వాలన్న నిబంధనకు పాతర జిల్లాలో ఈ నెల రేషన్ బియ్యం తీసుకోని వారు 47 వేల మంది చంద్రబాబు సర్కారు తీరు, డీలర్ల వ్యవహార శైలే కారణం వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై మాత్రం తప్పుడు కేసులు నమోదు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై కేసులు రేషన్ డీలర్లలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు అక్రమ కేసులు నమోదు చేస్తుండటం టీడీపీ నేతల కుట్రలకు నిదర్శనం. మార్కాపురంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అధికారి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన డీలర్లే లక్ష్యంగా 6ఏ కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిచ్చింది. మార్కాపురం పట్టణం, మండలంలోని రెండు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన డీలర్లపై ఆ అధికారి కేసులు నమోదు చేసి తొలగించారు. దీంతో డీలర్లు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. కాగా, రోజుకు 5 షాపులు తనిఖీ చేస్తాం. ఒక్కో దుకాణం నుంచి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ ఫుడ్ ఇన్స్పెక్టర్ డిమాండ్ చేస్తున్నారని డీలర్లు ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా గోడౌన్లోనే ఒక బస్తా బియ్యాన్ని తగ్గించి సరఫరా ఇస్తున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘ఎమ్మెల్యే పేరు చెప్పి దౌర్జన్యం’
గిద్దలూరు రూరల్: పట్టణంలో కొందరు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే పేరు చెప్పి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని యల్లా వెంకటమణికంఠ వాపోయాడు. బాధితుడు మణికంఠ తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని గర్రెవారి వీధిలో తనకు 3 సెంట్ల స్థలం ఉందని, ఆ స్థలానికి టీడీపీ నాయకుడు దిలీప్కుమార్, మరో కొంత మంది నకిలీ పత్రాలు సృష్టించి జేసీబీ, ట్రాక్టర్తో స్థలంలో పనులు చేసేందుకు వచ్చారన్నారు. విషయం తెలిసి తాను అక్కడకు వెళ్లగా తనపై దిలీప్కుమార్, మరికొందరు దాడి చేశారని వాపోయాడు. దాడిలో గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చేరినట్లు తెలిపాడు. పట్టణం నడిబొడ్డన ఎంతో విలువైన స్థలాన్ని అధికార గర్వంతో కబ్జా చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ స్థలం ఆక్రమించుకోవాలని చూశారని, పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని మణికంఠ వాపోయాడు. ● సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్కు 3 స్వర్ణాలు ● హైజంప్, ట్రిపుల్ జంప్లో పీడీ శ్యామలాదేవికి గోల్డ్ మెడల్ మార్కాపురం: థాయిలాండ్లో ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ చాంపియన్షిప్లో మార్కాపురం జిల్లాకు చెందిన ఇద్దరు ఉద్యోగులు సత్తా చాటారు. కంభం మండలం రావిపాడుకు చెందిన, హరియాణాలోని పానిపట్ ఐఓసీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కేవీ సుబ్బారావు 5 కి.మీ, 1500 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందేల్లో బంగారు పతకాలు సాధించారు. జనవరిలో హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్లోనూ పతకాలు సాధించిన సుబ్బారావును పలువురు అభినందించారు. పీడీ శ్యామలాదేవికి సన్మానం వరల్డ్ మాస్టర్ స్పోర్ట్స్లో మహిళల విభాగంలో హైజంప్, ట్రిపుల్ జంప్లో స్వర్ణ పతకాలు సాధించిన పీడీ శ్యామలాదేవిని గురువారం తహసీల్దార్ చిరంజీవి, డీవైఈఓ ఎం.శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ కె.శర్వాణి తదితరులు ఘనంగా సన్మానించారు. మార్కాపురం జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్యామలాదేవిని హెచ్ఎం చంద్రశేఖర్రెడ్డి, పి.దామోదర్రెడ్డి, కె.ఓబులేసు తదితరులు అభినందించారు. -
పూడికతీత పనులు యజ్ఞంలా చేపట్టాలి
● కలెక్టర్ విజయసునీత యర్రగొండపాలెం: భూగర్భ జలాలు అత్యంత తక్కువగా ఉన్న యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న చెరువుల్లో పూడికతీత పనులు యజ్ఞంలా చేపట్టాలని కలెక్టర్ ఎం.విజయ సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక వైష్ణవి గార్డెన్స్లో గురువారం ఏర్పాటు చేసిన జలధార–జలహారతి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాగునీటి కాలువలు, చెక్డ్యాంలు, చెరువులను సాగుకు అనుకూలంగా మార్చుకోవాల్సిన బాధ్యత తమ అందరిపై ఉందని, అధికారులతో పాటు సాగు నీటి సంఘాల అధ్యక్షులు, దాతలు ప్రభుత్వం చేపసట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ పథకం కింద జిల్లాకు రూ.13కోట్లు నిధులు కేటాయించగా నియోజకవర్గానికి రూ.9కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని, మే చివరి నాటికి ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో జేసీ పి.శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీఓ ప్రభాకర్, ఇరిగేషన్ ఎస్ఈ అబూతలిం పాల్గొన్నారు. -
భగీరఽథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకోవాలి
● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు వన్టౌన్: పట్టుదల దీక్షకు మారుపేరు భగీరఽథ మహర్షి అని కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు. భగీరఽథ మహర్షి జయంతిని పురస్కరించుకొని స్థానిక కేశవస్వామిపేటలోని ఆయన విగ్రహానికి కలెక్టర్, జిల్లా అధికారులు, పలు సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మానవుడు పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏం ఉండదని నిరూపించిన మహనీయులు మహర్షి భగీరథుడని, ఆయన పట్టుదలను త్యాగాన్ని, స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మల జ్యోతి, ప్రకాశం జిల్లా సాగర /ఉప్పర సంఘం అధ్యక్షుడు జె.శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి జె.మురళీకృష్ణ, ఒంగోలు నగర అధ్యక్షుడు రెడ్డి పరమేశ్వరావు, కార్యదర్శి కర్ణాటి వేణు, పలువురు నాయకులు పాపు శ్రీను, తుము రాజేష్, పాలూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: యూరియా పక్కదారి పట్టకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. ప్రకాశం భవనంలో జిల్లాస్థాయి ఎరువుల సరఫరా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లాలో యూరియా లభ్యత, వినియోగం తీరును జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు వివరించారు. జిల్లాలో పెరల్ డిస్టలరీస్, భగీరథ కెమికల్స్ పరిశ్రమలు ఉన్నా వాటి ఉత్పత్తుల ప్రక్రియలో సబ్సిడీ యూరియాను వినియోగించడం లేదని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కేవలం వ్యవసాయ అవసరాలకే యూరియా వినియోగించేలా చూడాలన్నారు. ఈ దిశగా ఎరువుల దుకాణాలపై నిఘా పెట్టాలని, రోజువారీ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ నిల్వలు లేకుండా యూరియా విక్రయాల వివరాలను ఎప్పటికప్పుడు దుకాణదారులు ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేసేలా పర్యవేక్షించాలని చెప్పారు. పోలీసులు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ, అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లా సరిహద్దుల నుంచి అక్రమ రవాణా జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీ దేవి, డీఎస్ఓ పద్మశ్రీ, రెవిన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గుడ్లూరు: ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన 16వ నంబర్ జాతీయ రహదారిపై తెట్టు శాంతీనగర్ మధ్య గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..ెనెల్లూరు జిల్లా జలదంకి మండలం జలదంకి గ్రామానికి చెందిన పులివర్తి సుధాకర్ (60) గుడ్లూరు మండలం చెమిడదపాడులో పొలం పనులు చేసుకొని తిరిగి వస్తుండగా శాంతీనగర్ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
● రాగి తీగ అపహరించిన దుండగులు ● పంటలు ఎండు ముఖం పడుతున్నాయని రైతుల ఆవేదన పెద్దారవీడు/పొదిలి రూరల్: పెద్దారవీడు మండల పరిధిలోని మూడు గ్రామాల్లో రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను బుధవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. వివరాలు.. పెద్దారవీడులో రైతులు గొట్టం వీరారెడ్డి, గొట్టం రఘురామిరెడ్డి, గొట్టం రామనారాయణరెడ్డి, కొత్తపల్లి గ్రామంలో వెన్నా శివకృష్ణారెడ్డి, దేవరాజుగట్టు గ్రామంలో బట్టగిరి ఆదిలక్ష్మమ్మ పొలాల్లో స్తంభాల నుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వరకు ఉన్న తీగలను గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు. ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి తీగను అపహరించారు. మిర్చి తోటలకు నీరు పెట్టేందుకు గురువారం ఉదయాన్నే పొలం వద్దకు చేరుకున్న రైతులు ప్యానల్ బోర్డు స్విచ్ వేయగా డీప్బోర్ పనిచేయలేదు. ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించగా విడిభాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మిర్చి ఎండు ముఖం పట్టకముందే ట్రాన్స్ఫార్మర్లు బిగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చోరీపై విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. పొదిలి మండలంలో వారంలో 6 చోరీ.. పొదిలి మండలంలోని పలు గ్రామాల్లో గత వారం రోజుల్లో 6 విద్యుత్ ట్రాన్స్పార్మర్లు చోరీ కావడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి రాములవీడు గ్రామానికి చెందిన రైతు యేటి సుబ్బయ్య పొలంలో ట్రాన్స్ఫార్మర్ను దుండగులు ధ్వంసం చేసి రాగితీగ అపహరించారు. -
షెడ్యూల్ తెగల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ
ఒంగోలు సిటీ: ెషడ్యూల్ తెగల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి అన్నారు. ప్రకాశం భవనంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో షెడ్యూల్ తెగల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, వారి సమస్యల పరిష్కార పురోగతి గురించి శాఖల వారీగా సమీక్షించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు నిబంధనల మేరకు వారికి రావాల్సిన నష్టపరిహారం సత్వరం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ పి.రాజాబాబు ఎస్టీల పెండింగ్ సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగితే పోలీస్ శాఖ వెంటనే స్పందిస్తూ వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు, అద్దంకి ఆర్డీఓలు లక్ష్మీ ప్రసన్న, జాన్సన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సింగరాయకొండ:మండలంలోని పాతసింగరాయకొండ పంచాయతీ మల్లికార్జుననగర్ ఎస్టీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. ఎస్టీలకు ఆధార్కార్డులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎస్టీలకు ఆధార్కార్డు ఇప్పించటానికి కృషి చేయాలన్నారు. చాలా మందికి సొంత గృహాలు లేవన్నారు. ఎక్కువ మంది వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు వన్టౌన్: నగరంలోని జయప్రకాష్ కాలనీలో ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి సభ్యులతో కలిసి పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు సమస్యను స్థానికులు ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కొత్తపట్నం: మండలంలో రంగాయపాలెం పంచాయతీని సందర్శించి ఇటీవల మరణించిన ఈగ బాలనాగు కుటుంబసభ్యులను ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పరామర్శించారు. అనంతరం మోటుమాల బకింగ్ హామ కెనాల్ సమీపంలో చేపలు పట్టుకొని జీవిస్తున్న యానాదులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యానాదులు నివాసం ఉండే గ్రామాల్లో తహసీల్దార్ జిల్లా అధికారులతో కలిసి నెలకు ఒకసారైనా పర్యటించి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలన్నారు ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్ బొజ్జిరెడ్డి -
మతం పేరుతో హక్కులు కాలరాయొద్దు
ఒంగోలు వన్టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రసాదించిన రాజ్యాంగ హక్కులను కేవలం మతం పేరుతో కాలరాయడం దుర్మార్గమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. ఒంగోలు అంబేడ్కర్ భవన్లో దళిత, రాజకీయ, ప్రజా సంఘాలతో బుధవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి మాదిగ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ దేశంలో అగ్రకులాలకు చెందిన వారు మతం మారినప్పుడు వారి అగ్ర కుల హోదా పోనప్పుడు, వారి సామాజిక గుర్తింపు మారనప్పుడు, కేవలం దళితులు మతం మారినప్పుడు మాత్రమే ఎస్సీ హోదా రద్దు చేయడం ముమ్మాటికీ వివక్షా పూరితమేనన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని విమర్శించారు. కులం అనేది పుట్టుకతో వచ్చే సామాజిక ముద్ర అని, అది మతం మారినంత మాత్రాన పోదని పాలకులు గుర్తించాలన్నారు. చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే గత 75 ఏళ్లుగా ప్రభుత్వం నియమించిన కాకా కలేల్కర్, కుమార పిళ్ళై, జస్టిస్ రంగనాథ్ మిశ్రా, సచార్, దేశ్ముఖ్ వంటి అన్ని కమిషన్లు ఒకే మాటను స్పష్టం చేశాయన్నారు. మతం మారినా దళితుల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో మార్పు రాలేదని, వారిపై అంటరానితనం కొనసాగుతూనే ఉందని పేర్కొన్నాయి. ఈ శాసీ్త్రయ నివేదికలను పక్కన పెట్టి, 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సాకుగా చూపి దళిత క్రైస్తవులకు అన్యాయం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 మరియు 25 కల్పించిన సమానత్వానికి, మత స్వేచ్ఛకు విరుద్ధం అని అన్నారు. ప్రస్తుతం జస్టిస్ కె.జి. బాలకృష్ణ్ణన్ కమిషన్ నిర్వహిస్తున్న అధ్యయనం హక్కుల సాధనకు ఆఖరి అవకాశమని, నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ పరిశీలనలో దళిత క్రైస్తవుల వాస్తవ స్థితిగతులను బలంగా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి దళిత క్రైస్తవులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని, వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రజా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. పోరాటంలో అన్ని ప్రజా సంఘాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య, దళిత ఐక్యవేదిక వ్యవస్థాపకుడు చప్పిడి వెంగళరావు, మాల ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్, మాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు కొండలరావు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఇన్చార్జి చిడితోటి శోభన్ బాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ పానుగంటి శాలెం రాజ్ మాదిగ, ఆలూరి చిరంజీవి మాదిగ, కొమ్మూరి గురటయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
బేస్తవారిపేట: ట్రాక్టర్ అదుపుతప్పి మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని జేబీకేపురం సమీపంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..దొనకొండ మండలం వెంకటాపురానికి చెందిన రాయనీ క్లారెన్స్, బేస్తవారిపేట మండలం కొత్తపేటకు చెందిన వినుకొండ పవన్ మోటార్సైకిల్పై తురిమెళ్ల వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కంభం వైపునకు వెళ్తున్న ట్రాక్టర్ టైర్ పేలడంతో అదుపుతప్పి మోటార్సైకిల్ను ఢీకొట్టింది. సంఘటనలో క్లారెన్స్, పవన్లు రోడ్డుపై పడటంతో గాయపడ్డారు. బేస్తవారిపేట 108 సిబ్బంది క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పుల్లలచెరువు: మానసిక స్థితి సరిలేని ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన పుల్లలచెరువు మండలంలోని మాచర్ల ప్రధాన రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. యర్రగొండపాలెం గ్రామంలోని ఇజ్రాయిల్ పేటకు చెందిన కొర్రపోలు మరియమ్మ(74) మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. రాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చి మాచర్ల రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మరియమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. సంఘటన స్థలాన్ని ఎస్సై సాంబశివరావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పొదిలి: మండలంలోని ఏలూరు ముసి నది వద్ద ఉన్న మద్యం దుకాణంలో మంగళవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. పూటుగా మద్యం సేవించిన బీహారీ యువకులు హోటల్ యజమానితో వాగ్వివాదానికి దిగారు. హోటల్ బిల్లు చెల్లించే విషయంలో మాటామాటా పెరిగి కొట్లాటకు దారి తీసింది. కర్రలు, ఇటుక రాళ్లతో హల్చల్ చేసిన బిహారీలు, హోటల్లో బీభత్సం సృష్టించారు. యజమానిపైనా దాడికి తెగబడ్డారు. హోటల్లో పనిచేస్తున్న పొదిలికి చెందిన హుస్సేన్పాచ్చా అనే యువకుడు అడ్డురాగా అతనిపైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తల, చేతులకు గాయాలైన హుస్సేన్ను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న హుస్సేన్ నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
అందుకే మండేది వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువ. ఏమరపాటు, అజాగ్రత్త, నిర్లక్ష్యంతోనే ఎక్కువ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.పొగాకు రైతులను కొనుగోలు కంపెనీలు ముంచేస్తున్నాయి. రెండేళ్లుగా వేలం కేంద్రాల్లో అమ్మకాలను పరిశీలిస్తే అవుననే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. వ్యాపారులు కొన్నదే నాణ్యమైన పొగాకు..వారు ఇచ్చిందే రేటు అన్నరీతిలో దోపిడీ చేస్తున్నారు. రైతుల వద్ద పొగాకు ఉత్పత్తులు ఉన్న సమయంలో రేట్లు పెంచకుండా వేలం చివరి దశలో అన్నీ అమ్ముకున్న తరువాత రేట్లు పెంచుతూ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది వేలాన్ని పరిశీలించినా, ప్రస్తుతం చివరి దశలో ఉన్న కర్ణాటక పొగాకు వేలాన్ని పరిశీలించినా వేలంలో వ్యాపారులు చేస్తున్న మోసం అర్థమవుతుంది. ప్రస్తుతం ఇక్కడ గ్రేడ్–1 కిలో పొగాకుకు రూ.250 ఇస్తుండగా, అదే చివరి దశలో ఉన్న కర్ణాటక మార్కెట్లో మాత్రం రూ.320ల వరకు ఇస్తున్నారు. వ్యాపారులకు ఒక వైపు పాలకుల అండ, మరో వైపు బోర్డు అధికారులతో కుమ్మక్కు వెరసి రైతులు దగా పడుతున్నాడు. ఆర్థికంగా కుదేలై నష్టాల పాలవుతున్నాడు. -
వేద విద్యార్థులకు పరీక్షలు
ఒంగోలు మెట్రో: ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను పురస్కరించుకుని ఒంగోలులో వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్ష పరిషత్ వారి ఆధ్వర్యంలో వేద విద్యార్థులకు వేద పరీక్షలను బుధవారం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఒంగోలు రంగారాయుడు చెరువు దగ్గర ఉన్న బ్రాహ్మణ సేవా సమితి శుభప్రదం కమ్యూనిటీ భవనంలో ఉదయం వేద విద్యార్థులు, వేద పండితులు పాల్గొని గణపతి, మేధా దక్షిణామూర్తి, సరస్వతీదేవి పూజా క్రతువులు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వంగల కృష్ణమూర్తి అవధాని, పిన్నెల్లి చంద్రశేఖర్ అవధాని పర్యవేక్షణలో వేద విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించారు. వేద పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వేద విద్యార్థులను వేద పండితులు సదాశివయ్య వేద సభ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సన్మానం చేసి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం వేద పండితులు, బ్రాహ్మణ పెద్దల ఆశీర్వచనాలతో వేద పరిషత్ వార్షిక సభా సమావేశాలు ముగిసాయి. కార్యక్రమంలో నగరంలోని బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయాలి
ప్రస్తుతం పొగాకు మార్కెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వ్యాపారులు ధరలు పెంచడం లేదు. ఇటువంటిి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు నేరుగా వేలంలో పాల్గొని కొనుగోలు చేస్తే అప్పుడే వ్యాపారులు ధరలు పెంచుతారు. రూ.250లతో వేలం ప్రారంభిస్తే సరాసరి ధర చివరికి వచ్చే సరికి క్వింటా రూ.20 వేల కంటే దిగువకు వస్తుంది. దీన్ని వల్ల రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ప్రభుత్వాలు మేల్కొని పొగాకు రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి. – మాదాల రమణయ్య, రైతు సంఘం నాయకుడు సరాసరి ధరలు పడిపోకుండా చూడాలి వేలం ప్రారంభంలోనే క్వింటాకు రూ.25 వేలు ఇస్తే వేలం చివరికి వచ్చే సరికి అది రూ.15 వేలకు పడిపోయినా ఆశ్చర్యం లేదు. ఏదో కొన్ని బేళ్లకు చివరిలో ధరలు ఇచ్చి రైతులను మోసం చేయడం సరైన విధానం కాదు. రెండేళ్లుగా వ్యాపారులు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ ఏడాది పొగాకు రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. – కట్టా హనుమంతరావు, పొగాకు రైతు -
అందుకే.. మండేది!
మార్కాపురం: ఏమీ కాదులే అనే ధైర్యం.. ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం తరచూ అగ్ని ప్రమాదాలకు దారి తీస్తోంది. సాధారణ సమయాలతో పోలిస్తే వేసవిలో మార్చి నుంచి జూన్ వరకు అగ్ని ప్రమాదాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. మార్కాపురం జిల్లాలోని యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో 2020 నుంచి ఇప్పటి వరకు 1654 అగ్ని ప్రమాదాలు సంభవించగా సుమారు 18.64 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సంఘటన స్థలాలకు చేరుకుని మంటలను అదుపు చేయడం వల్ల సుమారు 36.45 కోట్ల రూపాయల ఆస్తులను కాపాడగలిగారు. మానవ తప్పిదాతో భారీ మూల్యం! బీఐఎస్ ప్రమాణాలతో తయారు చేసిన విద్యుత్ ఉపకరణాలను వినియోగించకపోవడం, అనుభవజ్ఞులైన ఎలక్ట్రీషియన్లతో విద్యుత్ వైరింగ్ పనులు చేయించకపోవడం, అతుకులు వేసిన విద్యుత్ తీగలను దీర్ఘకాలం అలాగే వదిలేయడం, లూజ్ వైరింగ్ తదితర కారణాలు అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇళ్లలో ఇరుకుగా ఉండే చోట ఫ్రిజ్లు, మైక్రోవేవ్ ఓవెన్లను ఉంచడం వల్ల కూడా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ఎక్కువ ఓల్టేజీ ఉన్న విద్యుత్ ఉపకరణాల కోసం నాణ్యమైన 3 పిన్ సాకెట్లు వినియోగించకుంటే షార్ట్సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీడీలు సిగరెట్లు తాగి గడ్డివాములు, పూరిళ్లపై వేయడం, వంట చేసేటప్పుడు మంటలు చెలరేగితే అజాగ్రత్తగా వ్యవహరించడం అగ్ని ప్రమాదాలకు మరో కారణం. ఇటీవల యర్రగొండపాలెం మెయిన్ సెంటర్లోని ఓ వస్త్ర దుకాణం క్షణాల వ్యవధిలో కాలి బూడిదైంది. రాత్రి వేళ దుకాణం మూసి ఇంటికెళ్లిన కాసేపటికే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసినా అప్పటికే రూ.4 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. జిల్లాలో పొదిలి వేలం కేంద్రం పరిధిలోని పొగాకు బ్యారన్లు తరచూ బుగ్గిపాలై రైతులకు తీవ్ర నష్టం మిగుల్చుతున్నాయి. క్యూరింగ్ సమయంలో రైతులు అప్రమత్తంగా లేకపోవడం, అల్లిక కర్రలు సక్రమంగా ఉంచకపోవడం వల్ల బ్యారన్లు తగలబడిపోతున్నాయి. అగ్ని ప్రమాదాలు కాపాడిన ఆస్తి విలువ (రూ.కోట్లలో)సంవత్సరంఆస్తి నష్టం (రూ.కోట్లలో)2020–21 380 7.39 5.79 2021–22 250 1.61 3.39 2022–23 236 3.09 8.15 2023–24 295 2.39 8.45 2024–25 338 2.49 7.25 2025–26 155 1.67 7.42అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. పాఠశాలలు, ఆస్పత్రులు, అపార్ట్మెంట్లు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు.. ఇలా వివిధ ప్రాంతాల్లో ప్రజలకు ప్రమాదాల నివారణ, ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించడంపై అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ, ‘మనం ఎంత అప్రమత్తంగా ఉన్నాం’ అనేదే ప్రధాన ప్రశ్న. ఇళ్లు, కార్యాలయాలు, వ్యవసాయ క్షేత్రాలు, దుకాణాల్లో సంభవిస్తున్న అగ్నిప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణభూతంగా నిలుస్తున్నాయన్నది కాదనలేని వాస్తవం. అజాగ్రత్త, నిర్లక్ష్యం, ఏమరపాటుగా ఉండటం వల్ల ఊహించని రీతిలో మంటలు చెలరేగి ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి. వేసవిలో మరింత అప్రమత్తత అవసరం జిల్లాలో గత ఆరేళ్లలో 1654 అగ్ని ప్రమాదాలు 18.64 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత -
నిషేధిత భూములపై జేసీ సమీక్ష
ఒంగోలు సబర్బన్: నిషేధిత 22(ఏ) భూములకు సంబంధించిన పత్రాల పరిశీలన, నివేదిక రూపకల్పన ప్రక్రియలో ఏకరూపత ఉండాలని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి అన్నారు. వీటికి సంబంధించిన పత్రాలను బుధవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలను కలెక్టర్ నియమించారు. ఈ భూములకు సంబంధించిన పత్రాలను తొలుత తహసీల్దార్, ఆర్టీఓ పరిశీలించిన అనంతరం, కలెక్టరేట్ పరిపాలన విభాగంలోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్ల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు పరిశీలించాల్సి ఉంటుంది. అనంతరం డీఆర్ఓ, జాయింట్ కలెక్టర్ పరిశీలిస్తారు. ఈ పరిశీలన ప్రక్రియలో ఏకరూపత కోసం బుధవారం ప్రత్యేకంగా పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులకు, సిబ్బందికి వివిధ అంశాలపై జేసీ అవగాహన కల్పించారు. అదే విధంగా మే, జూన్ నెలల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రణాళిక, ఈ – కేవైసీ, రీ సర్వే పైనా జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ డి.హిమవంశీ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
● మరొకరికి గాయాలు పామూరు: బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం మండలంలోని నుచ్చుపొదవద్ద 167బీ జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని బోడవాడ గ్రామానికి చెందిన దొడ్డా వేణుగోపాల్ భార్య, కుమారుడుతో కలిసి సొంత పనిపై పామూరు వస్తున్నారు. వీరు నుచ్చుపొద సమీపంలోకి వచ్చే సరిగా మోటార్బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కన పొలాల్లోకి వేగంగా బోల్తాకొట్టింది. ఘటనలో దొడ్డా వేణుగోపాల్ తలకు తీవ్రగాయాలు, కుమారుడు కౌషిక్ తలకు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని వారు 108 వాహనానికి సమాచారం ఇఇచ్చారు. 108 సిబ్బంది ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వేణుగోపాల్(35) మృతిచెందాడు. అతని కుమారుడు కౌషిక్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. భర్త మృతితో భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వేణుగోపాల్ మృతితో బోడవాడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
కౌలు రైతు సంఘ జిల్లా అధ్యక్షునిగా చావా కోటేశ్వరరావు
ఒంగోలు టౌన్: జిల్లాలో పోలీసు శాఖలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. జిల్లా కేంద్రం ఒంగోలు వన్టౌన్ సీఐగా సైబర్ క్రైం సీఐ వెంకటేశ్వర్లును నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పని చేస్తున్న నాగరాజును వీఆర్కు పంపించారు. ట్రాఫిక్ సీఐ జగదీష్ను వీఆర్కు పంపించి ఆయన స్థానంలో సింగరాయకొండ సీఐ హాజరత్తయ్యను నియమించారు. కొండపి సీఐ సోమశేఖర్ ను చీరాల ఒన్టౌన్కు బదిలీ చేశారు. అయితే ఈ రాత్రికి మరికొన్ని బదిలీలు, మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.ఒంగోలు టౌన్: కౌలు రైతు సంఘ ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా చావా కోటేశ్వరరావు, కార్యదర్శిగా వి.బాలకోటయ్య ఎన్నికయ్యారు. ఎల్బీజీ భవనంలో బుధవారం నిర్వహించిన జిల్లా మహాసభల్లో నూతన కమిటీ ఎంపికై ంది. ఉపాధ్యక్షునిగా బి.రమేష్, సహాయ కార్యదర్శిగా ఏ.సురేష్, కమిటీ సభ్యులుగా రామాంజనేయులు, పేతురు, మీరాసు, కమల్ ప్రేమ్ కుమార్, జాన్, రాంబాబులను ఎన్నుకున్నారు. -
కష్టాలు, నష్టాల్లో రైతులు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో రైతులు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. కష్టాల పాలై ఊపిరి సలపని విధంగా తయారవుతున్నారు. రైతులు పండించిన ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబుతో పాటు వైఎస్సార్సీపీ రైతు విభాగం నాయకులతో కలిసి బుధవారం కలెక్టర్ పి.రాజా బాబును కలిశారు. జిల్లాలో రైతులు పడుతున్న బాధలను కలెక్టర్కు వివరించారు. అనంతరం మీడియాతో బూచేపల్లి మాట్లాడుతూ మొక్కజొన్న పంట ఈ రబీలో పండించిన రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 ఉన్నప్పటికీ, మార్కెట్లో రైతులు పొందుతున్న ధరలు చాలా తక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారిందన్నారు. 2026 మార్చి నెలలో కనిష్ట ధర రూ.1,429లకు, సగటు ధర రూ.1,589 నమోదు అయ్యాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో రూ.1,400 నుంచి రూ.1,500లకు తమ పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ ధరలు ఎంఎస్పీ కంటే క్వింటాలుకు రూ.700 నుంచి రూ.900 లకు తక్కువగా ఉండటం వలన రైతులు నష్టాల్లోకి వెళ్తున్నారని ఆయన ఆవేదన చెందారు. ఉత్పత్తి ఖర్చు క్వింటాలుకు సుమారు రూ.2 వేల నుంచి రూ.2200 వరకు ఉందన్నారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.2,400 ప్రకారం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మధ్యవర్తుల దోపిడీని అరికట్టాలన్నారు. అకాల వర్షాలకు, గాలివానలకు నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలని కోరారు. శనగ రైతులదీ నష్టాల బాటే.. శనగ పంట సాగు చేసిన రైతుల పరిస్థితి కూడా అధ్వానంగా మారిందని బూచేపల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.5,875 లేదన్నారు. వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కంటే ఎక్కువకు రైతులు అమ్ముకొని లాభపడ్డారన్నారు. 2023 మార్కెటింగ్ సీజన్లో క్వింటాలుకు రూ.8 వేలపైన రైతులు అమ్ముకున్నారు. కానీ ప్రస్తుతం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ప్రస్తుతం రూ.4,800 నుంచి రూ.5 వేలకు అమ్ముకుంటున్నారని చెప్పారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే శనగలపై 40 శాతం దిగుమతి సుంకం విధించాలన్నారు. మార్క్ఫెడ్లో అమ్మకం చేయని రైతులకు క్వింటాకు రూ.1,000 రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. గత సంవత్సరం కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉన్న శనగలు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. పొగాకు వేలంలో మార్క్ఫెడ్ను రంగంలోకి దించండి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా పొగాకు ఉందని బూచేపల్లి అన్నారు. తొమ్మిది పొగాకు వేలం కేంద్రాల పరిధిలో దాదాపు 30 వేల మంది పొగాకు రైతులు, దాదాపు లక్షకు పైగా కూలీలు ఈ పొగాకు పంటపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. ఇప్పటికి పొగాకు వేలం కేంద్రాలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా నిత్యం పొగాకు వేలం జరగడం లేదన్నారు. రోజు మార్చి రోజు వేలం కేంద్రాల్లో పొగాకు వేలం సాగుతోందన్నారు. కిలో రూ.250 ధరతో ప్రారంభించినట్లు చెప్పారు. పశ్చిమ ఆసియాలోని యుద్ధ ప్రభావం రైతులపై తీవ్రంగా ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్క్ఫెడ్కు రూ.200 కోట్లు ఇచ్చి దాదాపు 13 మిలియన్ల పొగాకును కొనుగోలు చేశారని గుర్తు చేశారు. మార్కెట్ లో పోటీ వాతావరణం వచ్చి రైతులు లాభాల బాటలో తమ సరుకును అమ్ముకున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం మార్క్ఫెడ్ కు నిధులు మంజూరు చేసి వెంటనే మార్కెట్లోకి పోటీ వాతావరణాన్ని తీసుకొని రావాలని రైతాంగం డిమాండ్ చేస్తోందన్నారు. వరి రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో పండించిన ధాన్యాన్ని సక్రమంగా ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా రైతులు బయట మార్కెట్లో రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తాను కూడా కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తానని, పొగాకు వేలం కేంద్రాల్లో కూడా పర్యవేక్షిస్తానని చెప్పారన్నారు. ప్రభుత్వ చేతకాని తనంవల్లనే రైతులకు నష్టం: చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనం వల్లనే జిల్లాలోని రైతాంగం తీవ్రంగా నష్జపోతున్నారని బూచేపల్లి మండిపడ్డారు. రైతులు పండించిన ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడులు రాక ఆత్మహత్యలకు పూనుకొనే పరిస్థితులను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. పొగాకు పంటను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. శనగకు దిగుమతి సుంకం విధించి ఆదుకోకపోతే శనగ రైతులు పంట పండించటం ఆపేస్తారన్నారు. ఇక పొగాకుకు వేలం కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించటంతో పాటు పొగాకు బోర్డు ప్రమేయం లేకపోవటంతో వ్యాపారులు పోటీ పడకుండా సిండికేట్గా మారి రైతులను నిలువునా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కిలో పొగాకు రూ.210కి పడిపోయేలా తయారు చేస్తున్నారని ఆవేదన చెందారు. కార్యక్రమంలో బూచేపల్లి వెంట వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి వెంకట సుబ్బారెడ్డి, జిల్లా విభాగం అధ్యక్షుడు మారెళ్ళ బంగారు బాబు, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, నాగులుప్పలపాడు పార్టీ కన్వీనర్ శ్రీమన్నారాయణ, ఒంగోలు, దర్శి నియోజకవర్గ పార్టీ నాయకులు, రైతు విభాగాల నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజాబాబుకు వినతిపత్రం ఇస్తున్న బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మ, చుండూరి రవిబాబు, బంగారుబాబు -
కలెక్టరును కలిసిన ఎస్పీ
మార్కాపురం: మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయసునీతను ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధన్రాజు బుధవారం మార్కాపురం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి మార్కాపురం వచ్చిన ఎస్పీ ఆమెను కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. మార్కాపురం టౌన్: విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే ఆయా పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని డీఈఓ రేణుక హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ప్రైవేటు స్కూల్స్లో చదివే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి ప్రైవేటు పాఠశాలలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అంతేకాక గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. -
నేర నియంత్రణపై దృష్టి సారించండి
మార్కాపురం: మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణపై పోలీసు అధికారులు దృష్టి సారించాలని మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎస్పీ వి.హర్షవర్థన్రాజు ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు. మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిని, బహిరంగంగా మద్యం తాగే వారిని, మైనర్ల డ్రైవింగ్ను ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. గంజాయి, ఇతర డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పోలీస్ నిఘా పెంచి, చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించాలని ఆదేశించారు. పెండింగ్ కేసులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, నిర్ధిష్ట సమయంలోగా బాధితులకు న్యాయం అందేలా చూడాలన్నారు. నాన్బెయిలబుల్ వారెంట్ ఉన్న వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని చెప్పారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను అరెస్టు చేయడంతోపాటు సొమ్ము రికవరీ చేయాలన్నారు. దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్, నైట్బీట్లు బలోపేతం చేసి తనిఖీలు చేపట్టాలన్నారు. వేసవి సెలవుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వడం, చెరువులు, వాగులు, కుంటల్లో చిన్నారులు ఈతకు దిగకుండా జాగ్రత్తపడేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. మలుపులు, టి–జంక్షన్, వై–జంక్షన్, యూటర్న్ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రేర్ మిర్రర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని చెప్పారు. సమీక్షలో డీఎస్పీ నాగరాజు, ఎస్బీ సీఐ కె.శ్రీనివాసరావు, యర్రగొండపాలెం, కంభం, గిద్దలూరు రూరల్, అర్బన్, త్రిపురాంతకం సీఐలు కె.అజయ్కుమార్, మల్లికార్జునరావు, రామకోటయ్య, సురేష్, హసన్, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు. ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్రాజు ఆదేశం మార్కాపురం జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష -
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
ఉలవపాడు: ముందు వెళ్తున్న లారీ మలుపు తిరగడంతో దాని వెనుకే వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. అదేవేగంతో మార్జిన్లో నిలిపి ఉన్న కారును కూడా ఢీకొట్టింది. 16వ నంబర్ జాతీయ రహదారిపై ఉలవపాడు మండలంలోని మన్నేటికోటరోడ్డు జంక్షన్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఢీకొట్టిన లారీ డ్రైవర్ మృతిచెందాడు. గుంటూరు నుంచి చైన్నెకు పెసల లోడుతో బయలుదేరిన లారీ.. ముందు వెళ్తున్న లారీని వెనుకవైపు ఢీకొట్టింది. అయినప్పటికీ ఆగకుండా ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్తూ రోడ్డు మార్జిన్లో ఆపి ఉన్న కారును ఢీకొట్టింది. కారుకు హ్యాండ్ బ్రేక్ వేసి ఉండటంతో లారీ పక్కనే కారు నిలబడిపోయింది. ఢీకొట్టిన లారీ నడుపుతున్న తమిళనాడులోని తూతుపూడి మండలం బొమ్మాయపాలేనికి చెందిన డ్రైవర్ నాగరాజు (49)కు తీవ్రగాయాలవగా, క్లీనర్ పచ్చ పెరుమాళ్లుకు స్వల్పగాయాలయ్యాయి. వారిని 108 సిబ్బంది ఉలవపాడు సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగరాజు మృతిచెందాడు. కారులో ఉన్న ఇద్దరికి, మరో లారీలో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. ట్రాఫిక్ నిలిచి వాహనదారులకు అవస్థలు... ప్రమాదం కారణంగా రోడ్డుకు అడ్డంగా లారీ ఉండిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు గంట పాటు వాహనదారులు ఇబ్బందిపడ్డారు. పోలీసులు, హైవే సిబ్బంది ఆలస్యంగా రావడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేవారు లేకుండా పోయారు. స్థానిక పోలీసులు పక్కనే ఉన్న కరేడు ర్యాంపు వద్ద తమ వాహనంలో ఉన్నారు. కానీ సంఘటన స్థలానికి దాదాపు 45 నిమిషాల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరించకుండా ఫోన్లో మాట్లాడుతుండటంతో ట్రాఫిక్లో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ట్రాఫిక్ క్లియర్ కావడానికి సుమారు 90 నిమిషాలకుపైగా సమయం పట్టింది. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి.. ఆ తర్వాత కారును ఢీకొన్న లారీ జాతీయ రహదారిపై మన్నేటికోట జంక్షన్ వద్ద ఘటన -
రాష్ట్రంలో జేబులు నింపుకునే పరిపాలన
త్రిపురాంతకం: చంద్రబాబు ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలోని టీడీపీ నాయకులు జేబులు నింపుకునే విధంగా పరిపాలన సాగిస్తోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. త్రిపురాంతకం మండలం సంఘం తండాలో నీలంపాటి అమ్మవారి తిరునాళ్లలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన వేదికపైనుంచి ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా కొత్త రేషన్కార్డు, కొత్త పెన్షన్ మంజూరు కాలేదని మండిపడ్డారు. ఒక్క ఇల్లు మంజూరు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. గత వైఎసా్స్ర్ సీపీ ప్రభుత్వంలో అనేక పథకాలను ఇంటి ముంగిటకే అందించిన ఘనత ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. నేడు కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగినా పలికేవారు లేరన్నారు. రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టారని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యలను విస్మరించారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే తాటిపర్తి అన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరూ ఒకే జెండా కింద పనిచేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అంకిత భావంతో కృషి చేయాలని కోరారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, పార్టీ కార్యకర్తలు, నాయకులపై పెట్టే అక్రమ కేసులకు భయపడమని, చట్టబద్ధంగా ఎదుర్కొంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిందేనని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ స్థానిక నాయకులు రామావత్ సక్రునాయక్, బాలునాయక్, రాజానాయక్, బాలాజీ నాయక్, పి.లాల్, శాసం రంగబాబు, ఆళ్ల కృష్ణారెడ్డి, మురారి గాలెయ్య, భవనం వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
కాపులకు అన్యాయం
చంద్రబాబు ప్రభుత్వంలో ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతోందని, కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడటం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఒంగోలులో సోమవారం నిర్వహించిన కాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ పెట్టారని, కానీ ఎలాంటి నిధులు ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. కార్పొరేషన్ ద్వారా ఎవరికై నా సహాయం చేస్తున్నారా.? విదేశీ విద్యకు పంపిస్తున్నారా.? అంటే.. అలాంటివేమీ లేవన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ అడగరని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో కాపులకు ఆయన ఏమీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనీసం డీఎస్పీని మార్చుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా కాపు సోదరులందరూ సంఘటితం కావాలన్నారు. తనపై అన్యాయంగా, అక్రమంగా దాడి చేశారని అంబటి రాంబాబు అన్నారు. ఇదేమి న్యాయమని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పేవారు లేరన్నారు. తనపై దాడిచేసిన వారిపై ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. చంద్రబాబును దూషించానని తనను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జెల్లో ఉంచారని, అయినా భయపడలేదని అన్నారు. తన ఇంటిపై దాడిచేసి ధ్వంసం చేసిన వారు, తనను దూషించిన వారు, తన కుటుంబాన్ని హింసించిన వారు ఒక్కరోజు కూడా జైలుకు వెళ్లలేదన్నారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైందేనా అని ఆయన ప్రశ్నించారు. దీనికి తన, కులం, తన వర్గం స్పందించాలా..లేదా..? అనేది అందరూ ఆలోచించాలన్నారు. అంబటి రాంబాబు అంటే చిన్న వ్యక్తి కాదని, రాష్ట్రంలో 40 శాతం ఓట్ షేర్ ఉన్న వైఎస్సార్ సీపీ నాయకుడని, రాష్ట్రంలో 20 శాతానికిపైగా జనాభా ఉన్న వారికి సంబంధించిన వ్యక్తి అని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. తనను అణచివేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మీడియా సంస్థలు అనేక తప్పుడు కథనాలు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని వంటి నాయకులు తనపై చేస్తున్న అరాచకాలను తిప్పికొట్టేందుకు తన సామాజిక వర్గం నిలుస్తుంటే తట్టులోకే మరిన్ని కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. దేనికీ అంబటి రాంబాబు భయపడడని, అనేక సంక్షోభాలు ఎదుర్కొన్న వ్యక్తిని తానని, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన బలం, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సహకారంతో తనను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. ఏ రాజకీయ పార్టీ మనకు మేలు చేస్తుందో కాపు యువత ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కాపులకు ఎంతో మేలు చేసిన విషయాన్ని గుర్తించాలన్నారు. వైఎస్సార్ సీపీలో కాపుల తరఫున తాను, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కన్నబాబు, తోట త్రిమూర్తులు, గుడివాడ అమర్నాథ్ అందరం కాపులకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేరని, ఆయనకు ఆ శక్తి లేదని అన్నారు. న్యాయమైన కోర్కెల సాధనకు ప్రభుత్వంపై పోరాడేందుకు కాపు యువత సిద్ధంగా ఉండాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. నాడు ముద్రగడ పద్మనాభంపై, నేడు అంబటి రాంబాబుపై దాడులు : బూచేపల్లి నాడు ముద్రగడ పద్మనాభంపై, నేడు అంబటి రాంబాబుపై చంద్రబాబు ప్రభుత్వం దాడులు చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆరోపించారు. కాపు సోదరులందరూ ఆలోచించాలని ఆయన కోరారు. అంబటి రాంబాబుకు జరిగిన అన్యాయంపై నాడు ఒంగోలు పార్లమెంట్ తరఫున వెళ్లి సంఘీభావం తెలిపామని వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జి చుండూరి రవిబాబు తెలిపారు. ముందుగా అంబటి రాంబాబును శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి చుండూరి రవిబాబు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కాపు యూత్ నాయకులు బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కె.రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసులు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కాపు నాయకులు హారిగా మల్లికార్జునరావు, త్రిపురం మల్లికార్జునరావు, తోట బాబి, జిల్లా యువజన విభాగం సెక్రటరీ అడుసుమల్లి ప్రసన్నకుమార్, ఒంగోలు అసెంబ్లీ యువజన విభాగం అధ్యక్షుడు మల్లిశెట్టి దేవా, రాయని వెంకటరావు, బండి నాగేశ్వరరావు, అమెజాన్ ప్రశాంత్, 37వ డివిజన్ యూత్ అధ్యక్షుడు ఎనుముల సాయి, వేదవ్యాస్ నాయుడు, 38వ డివిజన్ అధ్యక్షుడు పాలడుగు శ్రీనివాసరావు, 32వ డివిజన్ అధ్యక్షుడు బండారు ప్రభాకర్, 34వ డివిజన్ అధ్యక్షుడు నవీన్, 32వ డివిజన్ యూత్ అధ్యక్షుడు మనోజ్, కాపు నాయకులు పాల్గొన్నారు. నోరువిప్పని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు తనను అణచివేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపణలు -
అట్టహాసంగా ఎడ్ల పోటీలు ప్రారంభం
నాగులుప్పలపాడు: ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను నాగులుప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడు గ్రామంలో సోమవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభించారు. మండవ వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో గుమ్మడి సాయిబాబా ఏర్పాటు చేసిన ఈ పోటీలను సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్కుమార్ ప్రారంభించి మాట్లాడారు. మొదటి రోజు రెండు పళ్ల విభాగంలో మొత్తం 9 జతల ఎడ్లు పాల్గొనగా, వాటికి బండలాగడానికి సరాసరిన 10 నిమిషాల సమయం కేటాయించారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన బెల్లం రోశయ్య, పున్నమ్మ మెమోరియల్ ఎడ్ల జత 3029 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరి లింగంగుంట గ్రామానికి చెందిన ఎంకేఆర్ బుల్స్ 3000 అడుగుల దూరం లాగి 2వ స్థానం కై వసం చేసుకుంది. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం అక్కినేడి గ్రామానికి చెందిన విజయలక్ష్మి నాయుడు ఎడ్ల జత 2715 అడుగుల దూరం లాగి మూడో స్థానంలో నిలవగా, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన నక్కా బలరామకృష్ణమూర్తి ఎడ్ల జత 2706 అడుగుల దూరం లాగి 4వ స్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామానికి చెందిన గొల్లపూడి నాగేశ్వరరావు మెమోరియల్ ఎడ్ల జత 2701 అడుగుల దూరం లాగి 5వ స్థానంలో, మార్కాపురం జిల్లా కొమరోలు మండలం పామూరుపల్లె గ్రామానికి చెందిన కామూరి రమణారెడ్డి, నీలకంఠేశ్వరరెడ్డి ఎడ్ల జత 2700 అడుగుల దూరం లాగి 6వ స్థానంలో, గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన కేఎన్ఆర్ మెమోరియల్ ఎడ్ల జత 2617 అడుగుల దూరం లాగి 7వ స్థానంలో నిలిచాయి. అదేవిధంగా పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన కాకాని హనుమయ్య మెమోరియల్ ఎడ్ల జత 2488 అడుగుల దూరం లాగి 8వ స్థానంలో, ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామా నికి చెందిన మాదాల శ్రీధర్ మెమోరియల్ ఎడ్ల జత 2381 అడుగుల దూరం లాగి 9వ స్థానంలో విజేతలుగా నిలిచాయి. కార్యక్రమంలో పీడీసీసీబీ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, మండవ రవి, పోతినేని శ్రీనివాసరావు, చిన్న, పున్నారావు తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి వరుసగా రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.10 వేలు, రూ.9 వేలు, రూ.8 వేలు, రూ.7 వేలు బహుమతులుగా అందజేశారు. పీసీపల్లి: బైకు అదుపుతప్పి కింద పడటంతో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈఘటన సోమ వారం పీసీపల్లి పీహెచ్సీ ఎదురుగా చోటుచేసుకుంది. మండలంలోని గుదేవారిపాలెం గ్రామానికి చెందిన జొన్నవరపు మధు సొంత పనిమీద చింతగుంపల్లి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. సరిగ్గా పీసీపల్లి ఆసుపత్రి సెంటర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో కనిగిరి వైద్యశాలకు తరలించారు. -
చింతలపాలెం టీడీపీలో పైపులైను చిచ్చు
జరుగుమల్లి (సింగరాయకొండ): జరుగుమల్లి మండలం చింతలపాలెంలో రక్షిత మంచినీటి పథకం పైపులైను వివాదం ఆ గ్రామంలోని టీడీపీ మద్దతుదారులైన మాజీ ఎంపీపీ బెల్లం వర్గం – మాజీ సర్పంచ్ హరిబాబు వర్గం మధ్య చిచ్చు రాజేసింది. రెండు వర్గాల వారూ అధికార పార్టీకి చెందిన వారే కావడంతో ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించాలో తెలియక అధికారులు దిక్కుతోచని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మంత్రి స్వామి మాజీ సర్పంచ్ వర్గానికి మద్దతు తెలపడంపై రెండో వర్గం వారు విమర్శిస్తున్నారు. గ్రామంలోని ఆంజనేయస్వామి విగ్రహానికి సమీపంలో ఉన్న పొగాకు బ్యారన్లకు, ఊరు చివరన మద్యం షాపు ఉన్న బీపీఆర్ కాంప్లెక్స్ వద్దకు రక్షిత మంచినీటి పథకం పైపులైను ఏర్పాటుకు గత సంవత్సరం జూలైలో 15వ ఆర్థిక సంఘం నిధులలో మండల గ్రాంటు కింద రూ.5 లక్షల మంజూరుకు ఎంపీడీఓ రమణమూర్తి అనుమతులు మంజూరు చేశారు. ఆ ప్రకారం జీఓ కాపీ కూడా ఇచ్చారు. అయితే, సర్పంచ్ హరిబాబు పైపులైను ఏర్పాటును వ్యతిరేకించారు. గ్రామంలో ప్రజల కనీస అవసరాలకు ఉపయోగించాల్సిన రక్షిత మంచినీటి పథకం నీటిని వాణిజ్య అవసరాలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పంచాయతీ తీర్మానం ఇవ్వడానికి నిరాకరించారు. అప్పటి నుంచి ఆ గ్రాంటు కింద పనులు జరగలేదు. ఆదివారం అక్రమంగా పైపులైను ఏర్పాటు... ప్రస్తుతం గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం పూర్తయి ప్రత్యేక అధికారుల పాలన రావడంతో బెల్లం వర్గం మళ్లీ పైపులైను వ్యవహారాన్ని తెరమీదకు తీసుకొచ్చి అధికారులపై ఒత్తిడి పెంచింది. దీనిపై పంచాయతీ అభివృద్ధి అధికారి మౌనిక వాణిజ్య అవసరాలకు పైపులైను వేయకూడదని, దీనిపై జిల్లా పంచాయతీ అధికారి నుంచి వివరణ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే, ఆదివారం సెలవు దినం కావటంతో ఎటువంటి అనుమతులు లేకుండా బెల్లం వర్గీయులు ఆంజనేయస్వామి విగ్రహం సమీపం నుంచి పొగాకు బ్యారన్ల వరకు పైపులైను వేయడంతో పాటు రక్షిత మంచినీటి పథకం పైపులైను నుంచి కనెక్షన్ కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లడంతో సోమవారం ఎంపీడీఓ రమణమూర్తి, డిప్యూటీ ఎంపీడీఓ కామేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పౌల్రాజ్, పంచాయతీ అభివృద్ధి అధికారి మౌనికలు బ్యారన్ల వద్దకు వెళ్లి అక్రమంగా పైపులైను వేసిన బ్యారన్ల నిర్వాహకులను ప్రశ్నించి నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో మాజీ సర్పంచ్ హరిబాబు వర్గానికి మంత్రి స్వామి మద్దతిచ్చారని, పైపులైను తొలగించాలని అధికారులను ఆదేశించారని గ్రామంలో జోరుగా ప్రచారం జరుగుతుండగా, దానిపై రెండో వర్గం వారు విమర్శిస్తున్నారు. సోమవారం ఉదయమే ఈ వ్యవహారం తన దృష్టికి వచ్చిందని గ్రామ ప్రత్యేకాధికారి, కామేపల్లి పశువైద్యాధికారి స్వాతి తెలిపారు. అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య పైపులైను వివాదంతో అధికారులు ఏం చేస్తారనే దానిపై గ్రామంలో చర్చ నడుస్తోంది. గ్రామంలో పైపులైను వివాదం టీడీపీలోని రెండు వర్గాల మధ్య అగ్గి రాజేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో పొగాకు బ్యారన్లకు అనధికారికంగా పైపులైను నిర్మాణం గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా పైపులైను వేసిన మాజీ ఎంపీపీ బెల్లం వర్గం మీ ఇష్టం వచ్చినట్లు పైపులైను ఎలా నిర్మిస్తారన్న మాజీ సర్పంచ్ హరిబాబు వర్గం గత సంవత్సరం పైపులైను ఏర్పాటుకు మండల గ్రాంటు రూ.5 లక్షలు విడుదల చేసిన ఎంపీడీఓ సర్పంచ్ల పదవీకాలం పూర్తవడంతో పైపులైను వేసిన బెల్లం వర్గం దిక్కుతోచని స్థితిలో తలలు పట్టుకుంటున్న మండల, గ్రామ స్థాయి అధికారులు -
4న కృష్ణా జలాలపై సదస్సు
మార్కాపురం: మే 4వ తేదీన జిల్లా కేంద్రమైన మార్కాపురంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాలు, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. సోమవారం ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డితో కలిసి సదస్సు నిర్వహణపై ఏర్పాట్లను పరిశీలించారు. నాల్గవ తేదీ ఉదయం 10 గంటలకు పట్టణ శివార్లలోని సౌజన్య కల్యాణ మండపంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సుకు వచ్చే రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ ఏర్పాట్లు చేయాలని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి సూచించారు. ఉమ్మడి జిల్లాలోని 8 నియోజకవర్గాల ఇన్చార్జిలు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ విభాగాల నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు, రైతుల ప్రయోజనాలపై, కృష్ణా జలాల వినియోగ ఆవశ్యకతపై రాయలసీమ ఎత్తిపోతల పథకం, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సదస్సులో చర్చిస్తారని చెప్పారు. మేధావులు, నిపుణులు, రైతు నాయకులు హాజరు కానున్నట్లు తెలిపారు. పూర్తి కరువు పీడిత ప్రాంతాల కోసం నిర్దేశించిన వెలిగొండ ప్రాజెక్టు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తికాకపోతే రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల రైతాంగానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సదస్సును విజయవంతం చేయాలని అన్నా రాంబాబు విజ్ఞప్తి చేశారు. వారి వెంట అన్నా కృష్ణచైతన్యతోపాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి షంషేర్ ఆలీబేగ్, మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు సలీమ్, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ నారు బాపన్రెడ్డితోపాటు మార్కాపురం నియోజకవర్గంలోని పట్టణ, రూరల్, తర్లుపాడుకు చెందిన పలువురు మండలపార్టీ అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
రెండు నెలల బకాయిలు ఉన్నమాట వాస్తవమే
పారిశుధ్య కార్మికులకు జనవరి జీతాలు ఇచ్చారు. ఫిబ్రవరి, మార్చి బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని నెలకోసారి డ్యూటీలు మార్చేలా ఎంఓయూలో ఒప్పందం చేసుకున్నట్లు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. 15 రోజులకోసారి డ్యూటీలు మార్చడం వలన గందరగోళం నెలకొనే అవకాశం ఉన్నట్లు ఏజెన్సీ భావిస్తున్నట్లుంది. పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇస్తాం. – డాక్టర్ మాణిక్యరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ప్రభుత్వ పెద్దల అండదండలతో సర్వజన ఆస్పత్రిలో శానిటేషన్ ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నెలనెలా జీతాలు ఇవ్వకుండా కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నాయి. డ్యూటీల విషయంలో నిబంధనలకు పాతరేస్తున్నాయి. జాయినింగ్ ఆర్డర్ ఇవ్వవు..పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు ఉన్నాయోలేవో తెలియవు..ఇదేమిటని అడిగితే ఇష్టమైతే పనిచేయండి..లేదంటే పీకేస్తాం అంటూ ఏజెన్సీల నిర్వాహకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెన్సీల నిర్వాకంపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా ప్రభుత్వంలో కీలక నేతల అండ ఉండడంతో చర్యలకు వెనుకాడుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. సర్వజనశ్రమ దోపిడీ.. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నరహరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరహరి అంజిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించాలన్నారు. నూతన పీఆర్సీ కమిటీ వేసి 30 శాతం ఐఆర్ మంజూరు చేయాలన్నారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ వారికి వర్తింపజేయాలన్నారు. పెండింగ్ డీఏలు, జీపీఎఫ్/ ఏపీజీఎల్ఐ, ఈఎల్ ఎన్కాష్మెంట్ చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్ అయిన రోజే ఇవ్వాలని, విశ్రాంత ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. 302 జీవో పునరుద్ధరించి జేఎల్ పదోన్నతులు కల్పించాలన్నారు. తెలుగు/హిందీ ప్రమోషన్ల లో ఎస్జీటీలకు 70 శాతం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ వారికి 30 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవీ.రమణారెడ్డి, ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శరత్, కార్యదర్శి కృష్ణారెడ్డి, రిటైర్డు సంఘ నాయకులు అంకిరెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల సమావేశం రేపు
ఉలవపాడు: మండల పరిధిలోని పెదపట్టపుపాలెం గ్రామంలో ఈ నెల 22న సమావేశం నిర్వహించాలని మత్స్యకారులు నిర్ణయించారు. రామాయపట్నం రిసార్ట్స్ సమీపంలో వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకార గ్రామ నాయకులు సోమవారం సమావేశమయ్యారు. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన మత్స్యకారులు ఈ సమావేశంలో పాల్గొనాలని వారు ఆమేరకు నిర్ణయించారు. జువ్వలదిన్నె హార్బర్ వద్ద బోట్ల తరలింపు వ్యవహారానికి సంబంధించి పాకల వద్ద జరిగిన సమావేశంలో తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడానికి మళ్లీ పెదపట్టపుపాలెంలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది మత్స్యకారులు హాజరయ్యారు. పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి ఎలుగుబంటి సంచారం యాత్రికులను భయాందోళలకు గురి చేసింది. శ్రీశైలం రహదారిలోని చిన్నారుట్ల సమీపంలో ప్రసిద్ధిగాంచిన అభయాంజనేయస్వామి ఆలయం ఉంది. ఆదివారం రాత్రి సమయంలో ఎలుగుబంటి ఆలయంలోనికి వెళ్లి రావటాన్ని కొందరు భక్తులు వీడియోలు తీయటంతో అవి షోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో రాత్రి పూట ద్విచక్ర వాహనాలపై పుణ్యక్షేత్రానికి తరలి వెళ్లే భక్తులు ఆందోళన చెందుతున్నారు. వేసవిలో వన్యప్రాణులు అటవీ ప్రాంతంలోని రోడ్లపై సంచరిస్తుంటాయని, యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఒంగోలు వన్టౌన్: ప్రజలు సంతృప్తి చెందేలా మీకోసం అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులకు స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజల్లో విశ్వాసం నింపేలా, వారిలో సంతృప్తి స్థాయి పెరిగేలా అర్జీలను సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా ప్రజలు ఎండ బారిన పడకుండా మీకోసం కార్యక్రమ నిర్వహణ సమయాన్ని కలెక్టర్ మార్చారు. ఇక నుంచి ప్రతి సోమవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. అర్జీదారులకు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బసవన్నకు ఘన నివాళి మహాత్మా బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకొని గ్రీవెన్స్ హాలులో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అభ్యుదయవాది బసవన్న అందరికీ ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్ఓ. బి.చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, విజయజ్యోతి, మాధురి, కళావతి, డీపీఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కార్యకర్తే రథ సారథి..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పార్టీకి మీరే రథసారథులని, మీరే బలం బలగమని, కూటమి పాలకుల కుట్రలకు వెన్నుచూపకుండా ధైర్యంగా ముందడుగు వేస్తున్న సైనికులకు సలాం చెబుతున్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ విభాగం జోన్ 4 సమావేశం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి , ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,అన్నమయ్య, తిరుపతి జిల్లాల నుంచి ప్రచార కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెంట తిరిగిన నాయకులు, కార్యకర్తల కంటే కూడా పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు తోడుగా నిలబడి భరోసా ఇచ్చినవారే నిజమైన పార్టీ కార్యకర్తలని, జగనన్న 2.0 పాలనలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. చంద్రబాబు పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు అక్రమ కేసులతో భయాందోళనకు గురి చేసేందుకు కుట్రలకు తెరదీశారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నా.. బెదరకుండా నిలబడిన జగనన్న సైన్యం చూపిన తెగువ చరిత్రలో నిలబడిపోతుందన్నారు. కూటమి పాలకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా భయపడలేదని, ఎన్ని కేసులు పెట్టినా లెక్కచేయలేదని చెప్పారు. ‘‘నా మీద కేసులు పెట్టారు, అరెస్టు చేశారు, జైలుకు పంపించారు, ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేశారు, నా భార్యా బిడ్డలను ఇష్టమొచ్చినట్లు తిట్టారు. అయినా నేను చంద్రబాబు ఏడ్చినట్లు ఏడవలేదు. ఒక నాయకుడిగా తిరగబడ్డాను. కూటమిని కూల్చేంత వరకు విశ్రమించేది లేదని’’ అన్నారు. పచ్చపార్టీ కార్యకర్తలు పోలీసుల కళ్ల ఎదుటే నా ఇంటి మీద దాడి చేస్తుంటే చేతిలో లాఠీలు, తుపాకులు ఉన్నా చోద్యం చూస్తూ నిల్చున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగంలో పోలీసులను రెచ్చగొట్టి వైఎస్సార్ సీపీ నాయకుల మీద కేసులు పెట్టి ఇళ్ల మీదకు పంపిస్తున్నారని, చట్ట ప్రకారం పనిచేస్తే పోలీసులకు సహకరిస్తామని, లేకపోతే ఎదురు తిరుగుతామని స్పష్టం చేశారు. ఈ దుర్మార్గ పాలనను అంతం పలకడానికి ప్రచార విభాగం కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట: చెవిరెడ్డి బాస్కర్రెడ్డి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు అబద్ధాలు ప్రచారం చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఒంగోలు పార్టమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎద్దేవా చేశారు. గోబెల్స్ ప్రచారాలు చేయడం ద్వారా చంద్రబాబు నాయకుడిగా కొనసాగుతున్నాడన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని, ఈవీఎంలు, కూటమి నాయకుల తప్పుడు ప్రచారాలు ఇందుకు కారణాలని చెప్పారు. జగనన్న ఐదేళ్ల పాలనలో కులమతాలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించారని, జగన్ పాలనలో మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలతో సహా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని తెలిపారు. అభివృద్ధి ప్రదాత జగనన్న: బూచేపల్లి వెంకాయమ్మ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోపే సచివాలయాలను ఏర్పాటు చేసి 1.5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చర్రితలో జగనన్న ఒక్కడికే దక్కుతుందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ చెప్పారు. దివంగత మహానేత పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య శ్రీ,, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను అమలు చేశారని, జననేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తరువాత అమ్మ ఒడి, విద్యా వసతి, మెడికల్ కాలేజీలు, నాడు–నేడు వంటి ఎన్నో మంచిపనులు చేసి తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారని చెప్పారు. అదే చంద్రబాబు దుర్మార్గాలను పుణికి పుచ్చుకున్న లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజల మీద, ప్రశ్నించి వారి మీద, వైఎస్పార్ సీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని విమర్శించారు. దమ్ము, ధైర్యం కలిగిన నాయకుడు జగనన్న పాలనను తిరిగి తీసుకొని రావడం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్న చంద్రబాబు: తాటిపర్తి చంద్రశేఖర్ చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేదని, ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. తప్పుడు ప్రచారాలు చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబును చూసి ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని, గోబెల్స్ కనుక బతికి ఉంటే చంద్రబాబు అబద్ధాలకు ఉరేసుకొని చనిపోయే వాడన్నారు. ఆయనకో పాలసీ లేదు, సిద్దాంతం లేదు, కేవలం గెలుపే లక్ష్యంగా ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటుంటాడన్నారు. మంత్రి నారా లోకేష్ అన్నీ శాఖల్లో జోక్యం చేసుకుంటూ సకల శాఖల విఫల మంత్రిగా పేరుతెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుమారుడు కాకపోతే లోకేష్ స్థాయి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. జగనన్న చేసిన మేలు గురించి ప్రచారం చేయండి: జూపూడి ప్రభాకర్ జగనన్న పాలనలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, వాటి గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రచార కమిటీ మీదనే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్తపైనా ఉందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ అన్నారు. పార్టీ ప్రజల్లో బలంగా ఉందని, వారిని ఏకోన్ముఖులను చేయడానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ ఆలోచనా విధానాలను అర్థం చేసుకున్న వారికి పదవులు ఇవ్వాలని, పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆలోచనలను కాకుండా పార్టీ విధానాలను ప్రచారం చేయాలని చెప్పారు. టీడీపీ నాయకులకు ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం లేదు: అన్నా రాంబాబు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోందని, ఇప్పటి వరకు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదని మార్కాపురం ఇన్చార్జి అన్నా రాంబాబు విమర్శించారు. టీడీపీ నాయకులకు ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం లేదన్నారు. జగనన్న పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల వలన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని, అందుకే పార్టీ అధికారంలో లేకపోయినా జగనన్న పాలన గురించి కార్యకర్తలు గొప్పగా చెప్పుకుంటూ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుతున్నారని చెప్పారు. జగనన్నను గెలిపించేందుకు కృషి చేద్దామన్నారు. పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి – చుండూరి రవిబాబు రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు పిలుపునిచ్చారు. ప్రచార కమిటీ నాలుగు జిల్లాల జోన్4 సమావేశం ఒంగోలులో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్యని, అమరావతిలో ఏమీ లేకపోయినా ఏదో ఉందని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 50 ఏళ్ల తరువాత ఏదో జరుగుతుందని, ఇప్పుడు భూతద్దంలో చూపుతున్నారన్నారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాల గురించి అప్పటికి అడిగేవారుండరని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలనలో కంటే మోసం చేయడంలోనే అనుభవం ఉందన్నారు. నూరు శాతం హామీలు నెరవేర్చాం: కుందురు నాగార్జున రెడ్డి జగనన్న పాలనలో నూరు శాతం హామీలు నెరవేర్చామని, నాడు చేసిన పనులతో పాటుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసం గురించి ప్రచార విభాగం విస్తృతంగా ప్రచారం చేయాలని గిద్దలూరు ఇన్చార్జి కుందురు నాగార్జున రెడ్డి కోరారు. సచివాలయాలు, విలేజి క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలతో జగనన్న సమసమాజం కోసం పనిచేశారని, ఆయన చేసిన పనులను సక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడంతో పార్టీకే కాకుండా ప్రజలకు, రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. పార్టీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు చేర్చాలి: దద్దాల నారాయణ యాదవ్ చంద్రబాబు రెండేళ్ల పాలనలో అన్నీ విధాలుగా వైఫల్యం చెందారని, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు అక్రమంగా పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నాడని చెప్పారు. ప్రచార కమిటీతో పాటుగా పార్టీ కార్యకర్తలందరూ చంద్రబాబు వైఫల్యాల గురించి, ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం గురించి ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా నిలబడితే విజయం సాధిస్తామన్నారు. నమ్మకం పెంచిన ప్రచార కమిటీ సమావేశం: బత్తుల బ్రహ్మానందరెడ్డి పార్టీ ప్రచార కమిటీ సమాశంలో కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమన్న నమ్మకం పెరుగుతుందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. 2019 నుంచి 2024 వరకు జగనన్న ప్రజలకు చేసిన మేలు చెప్పుకోలేకపోవడం వలన పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయారన్నారు. పదవులు ఇచ్చిన వారికి పార్టీపై అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం: కాకుమాను రాజశేఖర్ జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే ఏకై క లక్ష్యంగా ప్రచారం విభాగం కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ అన్నారు. 2019 నుంచి 2024 వరకు ప్రజలకు ఎన్నో పథకాలు అందించినా ప్రజలకు చెప్పుకోలేకపోవడం వల్లనే ఓటమి చెందామన్నారు. 2029 ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదన్నారు. కూటమి పాలన వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేయడమే కాకుండా ప్రజల సమస్యలను గొంతెత్తి మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, మద్యం మాఫియా, అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని చెప్పారు. ఈ విషయాలను ప్రజల వద్దకు చేర్చాలన్నారు. సమావేశం ప్రారంభం వరకు విద్యుత్ బాగానే ఉన్నా సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటి తరువాత మాటిమాటికీ కరెంటు కట్ అయింది. ప్రతి పది నిముషాలకోసారి కరెంటు పోయింది. దీనిపై అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబుకు కేసులు పెట్టించడం గురించే తెలుసనుకున్నాను ఇలా ఫీజులు తీయించడం కూడా తెలుసని ఇప్పుడే తెలిసిందంటూ వ్యాఖ్యానించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.రమణా రెడ్డి, వైవీ వెంకటేశ్వర్లు, బొట్ల రామారావు, నగర అధ్యక్షుడు కటారి శంకర్, ప్రచార కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ దువ్వూరి మునిశేఖర రెడ్డి, ప్రచార కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాకు ఉమావల్లి యాదవ్, చిత్తూరు జిల్లా విభాగం అధ్యక్షుడు రమణా రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు బి.నరసింహా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జిలాని, నియోజకవర్గ అధ్యక్షుడు తమ్మిశెట్టి కిషోర్, నగర కమిటీ అధ్యక్షుడు పిగిలి శ్రీనివాసరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ అర్జీల పరిష్కారంలో జాప్యం సహించం
మార్కాపురం టౌన్: రెవెన్యూ అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించనని కలెక్టర్ యం విజయసునీత చెప్పారు. మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్లో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకే సమస్యపై ప్రజలు పదే పదే వస్తున్నారని, ఈ ధోరణిని అరికట్టాలంటే భూ సమస్యలను త్వరగా పరిష్కరించడం ఒక్కటే మార్గమన్నారు. అధికారులు ఈ దిశగా చొరవ చూపాలని ఆదేశించారు. మొత్తం 204 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 126, ఇతర సమస్యలపై 78 అర్జీలు వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు. చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు ప్రభాకర్, శివరామిరెడ్డి, మైనింగ్ ఏడీ రవివర్మ, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ పద్మావతి, ఇన్చార్జి ఆర్టీఓ రాంబాబు, జిల్లా పంచాయతీ అధికారి బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు. ● మార్కాపురం మండలం బొడిచర్ల గ్రామానికి చెందిన ఎస్సీలు తాము నడుస్తున్న రహదారిని శ్మశాన వాటికకు వెళ్లే దారిని గ్రామానికి చెందిన కొందరు ముళ్లకంపలు వేసి మూసివేశారని కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. ఎస్సీ కాలనీ నుంచి ప్రధాన రహదారికి వెళ్లాలంటే సుద్దబావి వద్ద ఉన్న రహదారిని ఉపయోగించుకుంటున్నామని, అయితే ఈ దారి వెంట మమ్మల్ని నడవద్దంటూ మూసివేశారని గ్రామానికి చెందిన నారయ్య, దానమయ్య, బాల చెన్నయ్యతోపాటు మరికొందరు అర్జీ అందజేశారు. -
వచ్చేది కార్యకర్తల ప్రభుత్వమే: బూచేపల్లి శివప్రసాద్రెడ్డి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద కేసులు పెట్టి వేధించారని, దాడులు చేసి హింసించారని, అయినా సరే లెక్క చేయకుండా జగనన్న వెంట నడిచిన కార్యకర్తలకు సలాం అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. జగనన్న పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటుగా ఈ రెండేళ్లలో చంద్రబాబు పాలనలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిందిగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ సీపీ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. పార్టీలో ప్రచార కమిటీకి ఎంతో ప్రాధాన్యత ఉందని, పార్టీ తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల ఇన్చార్జిలు ప్రచార కమిటీకి సహకరించాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు చేయకుండా కూటమి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాల మీద విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ఎప్పటికీ మరిచిపోమని చెప్పారు. -
మీ సేవ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా వెంగళరెడ్డి
పొదిలి: ఉమ్మడి ప్రకాశం జిల్లా మీసేవ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పొదిలికి చెందిన మీ సేవ నిర్వాహకులు సానికొమ్ము వెంగళరెడ్డి కమిటీ నూతన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. స్థానిక ఫంక్షన్ హాలులో ఉమ్మడి ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా సురేష్, కార్యదర్శిగా మారాబత్తుని వెంకట సురేష్, శేఖర్, జనరల్ సెక్రటరీగా చిరంజీవి, కోశాధికారిగా రామాంజనేయులు, స్టేట్ కమిటీ సభ్యులు అవ్వారి వెంకట రాయలు ఎన్నికయ్యారు. ముందుగా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రాము మాట్లాడుతూ మీసేవ నిర్వాహకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ సురేష్, కోశాధికారి రమణారావు, యాసిన్, మీసేవ మిత్రలు పాల్గొన్నారు. -
పోలేరమ్మ గుడిలో దొంగతనం
● స్వామివారి ఆభరణాలు, హుండీ నగదుఎత్తుకెళ్లిన దుండగులు పొదిలి రూరల్: మండలంలోని ఉప్పలపాడు పంచాయతీ గోగినేనివారిపాలెంలో శనివారం రాత్రి గ్రామ దేవత పోలేరమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగులగొట్టి అమ్మవారి ఆభరణాలు, హుండీ దొంగిలించారు. ఆదివారం ఆలయాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన గ్రామస్తులు చూసి గ్రామ పెద్దలకు తెలియజేయడంతో పోలీసులకు సమాచారం అందించారు. పొదిలి సీఐ రాజేష్కుమార్ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలేరమ్మ ఆలయానికి 100 అడుగుల దూరంలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం దగ్గరకు హుండీ తీసుకెళ్లి అందులో ఉన్న స్వామివారి వెండి కిరీటంతో పాటు ముక్కుపుడక, నగదు ఎత్తుకెళ్లారు. సీఐ రాజేష్ మాట్లాడుతూ దొంగిలించబడిన ఆభరణాల విలువ దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు. లక్షలాది రూపాయలతో ఆలయం నిర్మించి కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోవడం వలన దొంగలను సులభంగా గుర్తించే అవకాశం లేకుండా పోతోందన్నారు. అన్ని ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
21న ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా
మార్కాపురం టౌన్: ఉపాధ్యాయ సమస్యలపై ఈనెల 21న మార్కాపురంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పీ రమణారెడ్డి చెప్పారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి తక్షణమే 30 శాతం ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దశలవారీ పోరాటం చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ధర్నాకు అన్నీ మండలాల నుంచి ఉపాధ్యాయులు హాజరుకావాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్, సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, మున్సిపల్, కేజీబీవీ, ఐటీడీఏ, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలలు, ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఎయిడెడ్ పాఠశాలల సమస్యలు, పెండింగ్ డీఏలు తదితర ఎన్నో సమస్యలతో కూడిన డిమాండ్స్ సాధించుకునేందుకు జరిగే ధర్నాలో ఉపాధ్యాయులు పాల్గొనాలని అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మండ్ల రామాంజనేయులు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండారెడ్డి చెన్నారెడ్డి, యం మహేష్, కృష్ణారెడ్డి, కుందురు కాశిరెడ్డి, మండ్ల వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
పోస్టల్ ఏజెంట్ల నూతన కార్యవర్గం ఎన్నిక
మార్కాపురం టౌన్: పోస్టల్ ఏజెంట్ల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు మార్కాపురం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికై న ఆర్ నర్సింహులు తెలిపారు. పట్టణంలోని గాంధీ బజారులో ఉన్న కల్యాణ రామస్వామి దేవస్థానంలో ఆదివారం నిర్వహించిన జిల్లా పోస్టల్ ఏజెంట్ల సమావేశంలో వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. గౌరవ అధ్యక్షునిగా జీ విశ్వనాథం, ప్రధాన కార్యదర్శిగా డీ రామశేఖర్, కోశాధికారిగా జే సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులుగా మువ్వల వెంకటేశ్వర్లు, ఎస్ రవికుమార్, పీ సుధీర్, జాయింట్ సెక్రటరీగా కే హరనాథ్తోపాటు 9 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కనిగిరిరూరల్: పట్టణానికి చెందిన ఎస్కే జవహర్ జాతీయ స్థాయి యోగా శిక్షణలో ప్రతిభ చాటారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) ఆధ్వర్యంలో పంజాబ్లోని పటియాలలో ప్రతిష్టాత్మక నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఎస్ఎన్ఐఎస్)లో నిర్వహించిన ఆరు వారాల జాతీయ స్థాయి యోగా శిక్షణలో జవహర్ అత్యున్నత ప్రదర్శన కనబరిచారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యోగా క్రీడా శిక్షకులతో పోటీపడి, యోగాసనాల విభాగంలో ఏ గ్రేడ్ సాధించినట్లు తెలిపారు. -
ఏఎంఆర్ దోపిడీపై నిరసన
పొదిలి రూరల్: గ్రానైట్ సీనరేజి వసూలు పేరుతో ఏఎంఆర్ సంస్థ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతుండటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పొదిలి మండలంలోని ఏలూరులో ఆదివారం గ్రామంలోని గ్రానైట్ ఫ్యాక్టరీల వద్ద ఉన్న రాళ్లను తమ సొంత అవసరాలకు వాడుకునేందుకు గ్రామస్తులు తీసుకెళ్తుండగా ఏఎంఆర్ సంస్థ సిబ్బంది ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. తమ వాహనాన్ని ఎందుకు ఆపారని అడగ్గా మీరు గ్రానైట్ రాయి తోలుకుంటున్నందుకు టాక్స్ కట్టాలని చెప్పడంతో గ్రామస్తులు మండిపడ్డారు. తమ సొంత గ్రామంలో రాయిని ఇంటి అవసరాలకు తీసుకెళ్తుంటే మీకెందుకు టాక్స్ కట్టాలని ప్రశ్నించారు. తాము ఎటువంటి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదని వాదించారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఎంతచెప్పినా ఏఎంఆర్ సిబ్బంది వినకపోయే సరికి గ్రామస్తులు ట్రాక్టరులో ఉన్న రాళ్లను రోడ్డుపై పడేసి నిరసన తెలిపారు. గ్రామంలోని చుట్టుపక్కల వారు అధిక సంఖ్యలో గుమికూడటంతో ఏఎంఆర్ సంస్థ సిబ్బంది వెనక్కు తగ్గారు. దీంతో గ్రామస్తులు నిరసన విరమించారు. ఏఎంఆర్ సంస్థ సిబ్బంది తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సిబ్బంది పనితీరు మార్చుకోకుంటే రోడ్డెక్కి రాస్తారోకో చేస్తామని హెచ్చరిస్తున్నారు. -
25న డీఈఓ కార్యాలయం వద్ద నిరాహారదీక్ష
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తేదీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరాహారదీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు లేని 12 ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే 17 మంది ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. జీవో నంబర్–1 ప్రకారం మిగులుగా ఉన్న 165 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులకు సీనియార్టీ జాబితా రూపొందించి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. 40 ఎయిడెడ్ ఏకోపాధ్యాయులు సెలవు పెడితే ఆ పాఠశాలలకు ఎంఈఓలు సీఆర్ఎంటీలను కేటాయించాలన్నారు. కారుణ్య నియామకానికి అర్హులైన ఎయిడెడ్ కుటుంబ సభ్యుల జాబితాను కమిషనర్ కార్యాలయానికి పంపాలన్నారు. ఈ నెల 23వ తేదీ నాటికి సీనియార్టీ జాబితా రూపొందించాలని, లేకుంటే 25వ తేదీ డీఈఓ కార్యాలయం ముందు నిరాహారదీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీ వర్గీయులకు ఆదివారం పోలీసులు నోటీసులు అందజేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేసిన ఐటీడీపీ కార్యకర్తను ప్రశ్నించారని ఆ కార్యకర్త కేసు పెట్టడంతో పోలీసులు వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, సోషల్ మీడియా కార్యకర్త లక్ష్మిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు చిట్టే వెంకటేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆ మేరకు వారు స్థానిక పోలీస్ స్టేషన్లో 35క్లాస్3 నోటీసులు అందుకున్నారు. -
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం
● యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ త్రిపురాంతకం: రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ అనేవి టీడీపీ నాయకుల్లో తప్ప.. ప్రజల్లో కనిపించడం లేదన్నారు. సంక్షేమ పథకాలు అందక పేద ప్రజల్లో ఆనందం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. త్రిపురాంతకం మండలం మేడపిలో శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి తిరునాళ్లలో శనివారం రాత్రి విద్యుత్ ప్రభపై ఎమ్మెల్యే తాటిపర్తి మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్ మంజూరు కాలేదన్నారు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే అందించిన విషయాన్ని గుర్తుచేశారు. నేడు కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రజలకు సమాధానం చెప్పేవారు లేదన్నారు. ఫలితంగా రాష్ట్రంలోని ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఓట్ల కోసం అనేక రకాల హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టారని, గెలిచిన తర్వాత మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరూ ఒకే జెండా కింద పనిచేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ విజయానికి అంకితభావంతో కృషిచేయాలని కోరారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, అక్రమ కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిందేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, నాయకులు శాసం రంగబాబు, ఆళ్ల కృష్ణారెడ్డి, గుమ్మ శ్రీను, గుర్రం బాబూరావు, నల్లూరి నాగేశ్వరరావు, గుమ్మా హనుమయ్య, మురారి గాలెయ్య, సరళకుమారి తదితరులు పాల్గొన్నారు. -
పసుపు రైతు వెలవిల
కంభం: లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఏడాది పాటు కాపాడుకుంటూ వచ్చిన పసుపు పంట ఓ వైపు ఆశించిన స్థాయిలో దిగుబడి రాక మరో వైపు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 900 ఎకరాల్లో పసుపు పంట సాగు చేస్తుండగా పశ్చిమ ప్రకాశంలో చారిత్రాత్మక కంభం చెరువు ఆయకట్టు పరిధిలో రైతులు అధికంగా పసుపు సాగు చేస్తుంటారు. మార్చి నెల మొదటి వారం నుంచి పసుపు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. దిగుబడి చూస్తుంటే సగానికి పైగా తగ్గిపోయిందని ఎకరాకు 10–15 క్వింటాళ్ల దిగుబడి కూడా రావటం లేదని, దీంతో ఈ ఏడాది కూడా అప్పులపాలు కావాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. పెరిగిన పెట్టుబడులు: యూరియా, ఇతర ఎరువుల కొరతతో ధరలు పెంచేయడంతో గతంతో పోలిస్తే ఈ ఏడాది పసుపు పంటకు పెట్టుబడులు పెరిగాయని రైతులు వాపోతున్నారు. విత్తనం పసుపు కొనుగోలు, కలుపు తీయడం, నీటి పారుదలకు కలిపి ఎకరాకు సుమారు రూ.లక్ష వరకు ఖర్చు వస్తుండగా పసుపు పంటను తవ్విన తర్వాత నూర్పిడికి, పాలిషింగ్కు రూ.30 – రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. కౌలు రైతులకు అదనంగా రూ.20 వేల వరకు ఖర్చు పెరుగుతుంది. మొత్తంగా ఎకరా పసుపునకు సుమారు రూ.లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. మోంథా తుఫాన్కు దెబ్బతిన్న పసుపు పంట: ఈ ఏడాది మోంథా తుఫాన్ ప్రభావం పసుపు పంటపై తీవ్రంగా చూపించింది. చెరువులు, వాగుల ఆయకట్టు వెంబడి ఉన్న పసుపు పంటలు మొత్తం సుమారు పది రోజులపైగా నీళ్లలో మునిగిపోయి ఉండటంతో పంట పూర్తిగా చెడిపోయి ఎకరాకు 5 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంట దెబ్బతింది. గతంలో ఎకరాకు దాదాపు 50–60 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా ప్రస్తుతం 20 క్వింటాళ్లకు పడిపోయిందని, దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల్లో పడిపోయిన ధరలు: రెండు మూడు నెలల క్రితం క్వింటా పసుపు రూ.15 వేలు ఉండటంతో దిగుబడి తగ్గినా మంచి ధర ఉందిలే పెట్టిన పెట్టుబడులైనా వస్తాయన్న నమ్మకంతో రైతులు ఉన్నారు. తీరా పంట తవ్వకాలు మొదలు పెట్టే సమయానికి క్వింటా పసుపు రూ.12 వేలకు పడిపోయిందని తెలియడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఒక దశలో రూ.9 వేలకు కూడా తగ్గింది. ఓ వైపు దిగుబడులు రాక, మరోవైపు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోంథా తుఫాన్ దాటికి పంట దెబ్బతిని నేటికీ నష్టపరిహారం అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రస్తుతం పతనమైన ధరలు మరింత నష్టాన్ని చేకూరుస్తున్నాయి. పసుపులో అంతర పంటగా అరటి సాగు: పసుపులో రైతులు అంతర పంటగా అరటి పంట సాగు చేస్తారు. పసుపు కోతలకు మూడు నెలల ముందు రైతులు పసుపు సాళ్లలో అరటి పిలకలు వేస్తారు. పసుపు పంట తవ్వకాలు పూర్తయ్యే సరికి అరటి పంటకు 3 నెలల కాలం కలసి వస్తుంది. తద్వారా అరటి తోటలు త్వరగా కాపునకు వస్తాయి. పసుపు పంటలో పూర్తిగా నష్టపోయిన తమకు అరటైనా గట్టెక్కిస్తుందా అని రైతులు చర్చించుకుంటున్నారు. -
దొడ్డికొండకు నిప్పంటించిన ఆకతాయిలు
బల్లికురవ: చరిత్ర కలిగిన దొడ్డి కొండకు ఆకతాయిలు ఆదివారం సాయంత్రం నిప్పంటించటంతో పచ్చదనాన్నిచ్చే చెట్లు కాలిపోతున్నాయి. బల్లికురవ మండలంలోని ముక్తేశ్వరం, ఎస్ఎల్ గుడిపాడు, వైదన రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 200 ఎకరాల్లో దొడ్డికొండ విస్తరించి ఉంది. ఈ కొండ పైభాగంలో 12వ శతాబ్దం చోళరాజులు శివాలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణమైతే పూర్తయిందిగానీ విగ్రహ ప్రతిష్ఠ జరగలేదు. అయినప్పటికీ ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు వివిధ గ్రామాల ప్రజలు చారిత్రక ప్రదేశంగా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ కొండను అభివృద్ధి చయాలని మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలోని ప్రజలు విన్నవిస్తున్నారు. ఈ కొండకు తూర్పు భాగంలో ముక్తేశ్వరంవైపు నిప్పంటించటంతో మంటలు వ్యాపిస్తున్నాయి. చెట్లతో పాటు అనేక మూగజీవాలు కాలి బూడిదవుతున్నాయని, భవిష్యత్తులో ఆకతాయిలు ఇలా నిప్పంటించకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పచ్చదనమిచ్చే చెట్లతో పాటు కాలిపోతున్న మూగజీవాలు ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని 5 గ్రామాల ప్రజలు విజ్ఞప్తి -
హోం గార్డుల వేతన వెతలు
ఉలవపాడు: ఏప్రిల్ నెల ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా పోలీసు శాఖలో పనిచేస్తున్న హోం గార్డులకు నేటి వరకు జీతాలు అందలేదు. ప్రకాశం జిల్లా పరిధితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నేటికీ హోంగార్డుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ కాలేదు. జీతాలు పడకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందరికీ ఇప్పుడు ప్రతినెలా ఈఎంఐలు ఉంటున్నాయి. సమయానికి ఈఎంఐ కట్టకపోతే ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు బ్యాంకుల్లో సిబిల్ స్కోర్ పడిపోతుంది. తదుపరి లోన్ల మంజూరుకు కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 20వ తేదీ వచ్చినా ఇంత వరకు ప్రభుత్వం హోం గార్డుల జీతభత్యాల గురించి పట్టించుకోలేదు. రెండు రోజుల క్రితం ట్రెజరీకి జాబితాను పంపాలని కూడా కోరారు. అయినా నేటి వరకు వారికి జీతాలు వేయలేదు. జీతాలు లేకుండా కుటుంబాలు ఎలా గడవాలని వారు అంటున్నారు. జీతాల కోసం ఎదురుచూపులు.. ప్రకాశం జిల్లా పరిధిలో 598 మంది హోం గార్డులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.21,300 జీతం అందించాలి. రూ.1,27,37,400 చెల్లించాలి. నేటి వరకు ట్రెజరీ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల మంది హోంగార్డులు ఉన్నారు. వీరెవరికీ ఇంత వరకు జీతాలు రాలేదు. పోలీసు శాఖలో మిగిలిన వారికి కూడా ఈ నెల 11న ప్రభుత్వం జీతాలు చెల్లించింది. గత ప్రభుత్వంలో రెండు రోజుల్లోనే.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో హోం గార్డులు ప్రతినెలా 1, 2 తేదీల్లోనే జీతం అందుకునే వారు. హోంగార్డులు ఇబ్బందులు పడుతున్నారని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జీతాలు పెంచడంతో పాటు ప్రతినెలా 1వ తేదీన అన్ని శాఖలతో పాటు వారికి జీతాలు అందించాలని ప్రభుత్వం సర్క్యులర్ను జారీ చేశారు. ఆమేరకు క్రమం తప్పకుండా జీతాలిచ్చారు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో హోంగార్డులకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఇప్పటికై నా జీతాలు విడుదల చేయాలని హోం గార్డులు కోరుతున్నారు. -
నీరుగారిన తొట్టి పథకం.!
కందుకూరు రూరల్: పొలాల్లోకి మేతకు వెళ్లిన పశువుల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ పథకం నిధులతో పశువులకు నీటి తొట్లు నిర్మించింది. గతేడాది పశువుల దాహార్తి తీర్చడంతో పాటు స్వచ్ఛమైన నీటిని వాటికి అందించేందుకు జిల్లా అధికారులు టార్గెట్లు ఇచ్చి మరీ పశువుల తొట్లు నిర్మించారు. వేల రూపాయలు వెచ్చించి తొట్లు నిర్మించినప్పటికీ వాటిని ఉపయోగించడంలో అధికారులు విఫలమవుతున్నారు. కొన్ని పంచాయతీల్లో ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, మరికొన్ని పంచాయతీల్లో పంచాయతీ అధికారులు బాధ్యత వహించి నిర్మించిన తొట్లలో నీరు నింపాల్సి ఉంది. కానీ పశువుల తొట్లలో ఎవరూ నీరు నింపకపోవడంతో అవి అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. అనువైన ప్రాంతాల్లో నిర్మించినా నిరుపయోగం... కందుకూరు నియోజకవర్గంలో ఐదు మండలాలున్నాయి. మండలాల వారీగా పంచాయతీల్లో నీటి తొట్ల నిర్మాణానికి గతేడాది 151 తొట్లు మంజూరు చేశారు. వాటిలో గుడ్లూరు మండలానికి 35 తొట్లు, కందుకూరు 29, లింగసముద్రం 40, ఉలవపాడు 14, వలేటివారిపాలెం 33 చొప్పున నీటి తొట్లు మంజూరు చేశారు. ఒక్కొక్క తొట్టి నిర్మాణానికి సైజులను బట్టి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నిధులు కేటాయించారు. అయితే, వాటిని మెటీరియల్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఆయా పంచాయతీల్లో కూటమి నాయకులు నిర్మించారు. గ్రామ శివార్లలో పశువులు మేతకు వెళ్లే ప్రాంతాల్లో నీటి తోట్లు నిర్మించారు. ఇలా గుడ్లూరు మండలంలో 11, కందుకూరు 12, లింగసముద్రం 26, ఉలవపాడు 8, వలేటివారిపాలెం మండలంలో 22 పశువుల నీటి తొట్ల నిర్మాణం పూర్తి చేశారు. పైపులైన్లు ఉన్న చోట మాత్రమే తొట్లు నిర్మించారు. నీటిని నింపేందుకు అనువైన ప్రాంతాలనే ఎంచుకుని తొట్లు నిర్మించినప్పటికీ నీరు మాత్రం నింపకుండా నిరుపయోగంగా వదిలేశారు. ఆదేశాలు పెడచెవిన పెట్టడంతో తొట్లు ఖాళీ... నిర్మించిన పశువుల నీటి తోట్లను ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు ఆయా పంచాయతీలకు అప్పగించాలి. ఆ తర్వాత తొట్లకు నీటిని నింపే బాధ్యత పంచాయతీ అధికారులు తీసుకోవాలి. కానీ, కందుకూరు పంచాయతీకి కొన్ని అప్పగించినప్పటికీ మరికొన్ని పంచాయతీల్లో అప్పగించలేదు. ఇలా పంచాయతీలకు అప్పగించిన గ్రామాల్లో పంచాయతీ అధికారులు, అప్పగించని గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది తొట్లకు నీటిని నింపాలని జిల్లా అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ, ఆయా ఆదేశాలు పెడచెవిన పెట్టడంతో తొట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అల్లాడుతున్న మూగజీవాలు... ప్రస్తుతం వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ ఎండలకు పశుపోషకులు తమ పశువులను మేపుకునేందుకు పొలాలకు తోలుకెళ్తున్నారు. అలాంటప్పుడు పశువుల తాగునీటికి ఇబ్బంది లేకుండా తొట్లలో నీరు నింపితే ఎంతో ఉపయోగపడేవి. ఎండలకు పశువులకు దాహం వేస్తే ఎక్కడపడితే అక్కడ నిల్వ ఉండే కలుషిత నీటిని తాగడం వల్ల అనారోగ్యం పాలవుతుంటాయి. అలాంటి రోగాలను నివారించేందుకు కూడా పశువుల నీటి తొట్లు ఉపయోగకరంగా ఉండేవి. కానీ, వాటికి నీరు నింపకపోవడంతో మేతకు వెళ్లిన పశువులు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు దాహంతో అలమటిస్తున్నాయి. వేల రూపాయలు వెచ్చించి పశువుల నీటి తొట్లు నిర్మించినప్పటికీ వాటిలో నీరు నింపకపోవడంతో నిరుపయోగంగా మారడాన్ని పశుపోషకులు విమర్శిస్తున్నారు. అధికారులు విఫలం... పశుగణన ప్రకారం నీటి తొట్లు నిర్మించడంలో అధికారులు విఫలమయ్యారు. మంజూరు చేసిన తొట్లను నిర్మించడానికి కూడా అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. మెటీరియల్ కాంట్రాక్ట్ అయినప్పటికీ కేటాయించిన నిధులు సరిపోవని, నిర్మించినా సకాలంలో బిల్లులు రావని అరకొరగానే నిర్మించారు. కందుకూరు నియోజకవర్గానికి 151 మంజూరైతే.. నిర్మించింది మాత్రం 79 కావడమే అందుకు నిదర్శనంగా ఉంది. పశుగణన ప్రకారం తొట్ల నిర్మాణం జరగలేదని పశుపోషకులు పెదవి విరుస్తున్నారు. మదన గోపాలపురంలో నీరు లేని తొట్టి నీరు లేక చెత్తాచెదారంతో ఉన్న పశువుల నీటి తొట్టి ఎండిపోయిన పశువుల నీటి తొట్లు తొట్లు నిర్మించి నీళ్లు నింపడం మరిచిన అధికారులు, పాలకులు నిరుపయోగంగా పశువుల నీటి తొట్లు బిల్లులు చేసుకోవడం మినహా ప్రయోజనం శూన్యం వేసవి ఎండలకు దాహంతో అల్లాడుతున్న మూగజీవాలు పట్టించుకోని ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీ అధికారులు కందుకూరు నియోజకవర్గంలో 151 తొట్లు మంజూరవగా 79 నిర్మాణం కందుకూరు నియోజకవర్గంలో మండలాల వారీగా పశుగణన వివరాలు... మండలం పేరు ఆవులు గేదెలు గొర్రెలు మేకలు కందుకూరు 586 17,287 23,312 6,902 ఉలవపాడు 544 15,833 38,709 15,419 గుడ్లూరు 1,283 21,000 41,964 9,884 వలేటివారిపాలె 497 14,234 31,197 8,080 లింగసముద్రం 472 15,989 32,493 7,945 మొత్తం 3,382 84,343 1,67,675 48,230 -
కూటమి నేతల గ్రావెల్ దందా
ఉలవపాడు: కూటమి నేతల అక్రమ గ్రావెల్ దందాకు అడ్డే లేకుండా పోతోంది. కందుకూరు, కొండపి నియోజకవర్గాల అక్రమార్కుల సమన్వయంతో మండల పరిధిలో ఈ గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఉలవపాడు మండల పరిధిలో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. మామిడి తోటలను కొట్టి మరీ ప్లాట్లు వేస్తున్నారు. వీటిని చదును చేసి లే అవుట్లా తయారు చేయాలంటే భారీగా గ్రావెల్ కావాలి. ఇదే ఇప్పుడు కూటమి నేతల అక్రమార్జనకు వరంలా మారింది. ఉలవపాడు పోలీస్ స్టేషన్ ఎదురుగా, కొల్లూరుపాడు బైపాస్ వద్ద, ఉలవపాడు ఉత్తర బైపాస్ సమీపంలో వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి గ్రావెల్ను తరలిస్తున్నారు. ప్రస్తుతం ఉలవపాడు పరిధిలో చెరువుల్లో నీరు ఉంది. దీంతో ఇక్కడ గ్రావెల్ను తరలించలేని పరిస్థితి. దీంతో కొండపి నియోజకవర్గం శింగరాయకొండ నుంచి రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా ఈ గ్రావెల్ తరలిస్తున్నారు. ఉలవపాడు మెయిన్రోడ్ నుంచి ఈ గ్రావెల్ వెళుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జరుగుతుందిలా... వెంచర్లను ఏర్పాటుచేసి గ్రావెల్ కావాలనుకున్నవారు నియోజకవర్గ టీడీపీ పెద్దనేతకు దూరపు బంధువు అయిన వలేటివారిపాలెం మండలానికి చెందిన మరో నేతను సంప్రదించాలి. ఆయన వెంటనే రంగంలోకి దిగుతాడు. ఏవెంచర్ అయినా అతని ఆధ్వర్యంలోనే గ్రావెల్ తరలించాలి. వెంచర్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి సుమారు రూ.10 లక్షల వరకు నగదు చెల్లిస్తే అధికారులు, నాయకులతో కలసి వెంచర్లకు సంబంధించిన అనుమతులు లాంటి వాటికి సహకరిస్తున్నట్లు సమాచారం. ఇక గ్రావెల్ తరలింపు సింగరాయకొండకు చెందిన కూటమి నేతలు చూసుకుంటారు. వీరు ఒక టిప్పర్కు రూ.1500 చొప్పున సదరు దూరపు బంధువుకు చెల్లించాలి. అప్పుడు గ్రావెల్ తరలింపు జరుగుతుంది. ఒక్కో టిప్పర్కు రూ.7500 వెంచర్ యజమాని చెల్లించాలి. ఇలా పక్కాగా గ్రావెల్ దందా సాగిస్తున్నారు. ప్రేక్షక పాత్రలో అధికారులు.... కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పలు అక్రమ వ్యాపారాల్లో అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం గ్రావెల్దందాను కూడా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎంపీడీఓ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం మీదుగా పోలీస్స్టేషన్ సమీపంలో ఉన్న వెంచర్లకు గ్రావెల్ తరలిస్తున్నారు. ఈ మూడు కార్యాలయాల మీదుగా అర్ధరాత్రి టిప్పర్లు వెళుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. కూటమి నేతల ప్రమేయం ఉండడంతో అధికారులు కూడా దందాను నియంత్రించలేకపోతున్నారు. ఈ గ్రావెల్ దందా కందుకూరు, కొండపి నియోజకవర్గ కూటమి నేతలకు ఆదాయవనరుగా మారింది. రోజుకు సుమారు 50 నుంచి 100 ట్రిప్పుల వరకు అక్రమ గ్రావెల్ తరలిస్తున్నారు. కూటమి నాయకుల సహకారంతో జరుగుతున్న ఈ అక్రమ దందాను ఆపే పరిస్థితి ఉందా లేదా అనేది వేచి చూడాలి. -
సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పెరిగిన పెట్టుబడులకు తోడు ప్రకృతి వైపరీత్యాలతో తగ్గిన దిగుబడులు, దిగజారిన ధరలతో పసుపు రైతుల జీవితాలు వెలవెలబోతున్నాయి. అష్టకష్టాలు పడి పంట పండించినా తీరా పంట చేతికొచ్చే సరికి ధరలు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మోంథా తుఫాన్ దాటికి పంట దెబ్బతిని నేటికీ నష్టపరిహారం అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రస్తుతం పతనమైన ధరలు మరింత నష్టాన్ని చేకూరుస్తున్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఎకరా పొలంలో పసుపు సాగు చేశాను. రూ.లక్షకుపైగా పెట్టుబడి పెట్టాను. పసుపు తవ్వితే దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. ధరలు కూడా తగ్గిపోవడంతో పసుపు రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. – అబ్దుల్ రహమాన్, పసుపు రైతు, కంభం గిట్టుబాటు ధరలు కల్పించండి ఈ ఏడాది మోంథా తుఫాన్ ధాటికి పసుపు పంటతో పాటు ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం నేటికీ నష్టపరిహారం అందించకపోవడం బాధాకరం. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించడంతో పాటు పసుపునకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలి. – నెమలిదిన్నె చెన్నారెడ్డి, కంభం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మోంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న పంటపెట్టుబడులు కూడా రాలేదు అర ఎకరా పొలంలో పసుపు వేశాను. పంట బాగుందని అనుకున్న సమయంలో మోంథా తుఫాన్ రావడంతో పంట మొత్తం నీళ్లల్లో మునిగిపోయి పూర్తిగా దెబ్బతింది. దీంతో పెట్టుబడి కూడా రాక తీవ్రంగా నష్టపోయాం. – షేక్ మహబూబ్ వలి, పసుపు రైతు, కంభం -
మనువాదానికి వ్యతిరేకంగా కళారూపాలు నిర్మించాలి
ఒంగోలు టౌన్: సామాన్య మనుషులను అనాగరిక సమాజానికి దగ్గర చేస్తున్న మనువాద కార్పొరేట్ సంస్కృతికి వ్యతిరేకంగా కవులు, కళాకారులు ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని నిర్మించాలని ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఖాసిం పిలుపునిచ్చారు. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆదివారం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. చొప్పర జాలన్న అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖాసీం మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, బీజేపీలు అధికారంలోకి రాగానే మరింత వేగంగా ఫాసిజం విస్తరిస్తోందని చెప్పారు. అరుణోదయ సమాఖ్య నూతన కమిటీ ఎంపిక: అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడిగా చొప్పర జాలన్న తిరిగి ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సన్నశెట్టి రాజశేఖర్, సి.నాగరాజు, కాకర్ల అప్పారావు, డి.అంజయ్య, కె.నిర్మల, యస్.సోమేశ్వరరావు, శంబుడు జయలక్ష్మి తోపాటుగా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సమావేశంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి సీఎస్ సాగర్, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. మోహన్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నాంచా ర్లు, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, కళాకారులు మెడసల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
వెటర్నరీ ఆఫీసర్కుగోల్డ్ మెడల్
ఒంగోలు మెట్రో: థాయిలాండ్లో జరుగుతున్న వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ – 2006లో ఒంగోలుకు చెందిన పశుసంవర్థకశాఖ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ కల్లు రాజేశ్వరి తొమ్మిది కిలోమీటర్ల వాక్, లాంగ్ జంప్లో గోల్డ్ మెడల్ సాధించారు. రాజేశ్వరి ప్రస్తుతం విజయవాడ హెడ్ ఆఫీస్లో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆమెను పశుసంవర్థకశాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు, అడిషనల్ డైరెక్టర్ రజనీకుమారి అభినందించారు. కొత్తపట్నం: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతిచెందిన సంఘటన కొత్తపట్నం మండలంలోని గుండమాల సముద్ర తీరంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుండమాల గ్రామానికి చెందిన పెద్దసింగు ఎల్లమ్మ (50) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటుంది. శనివారం ఒంగోలు వెళ్లి హాస్పిటల్లో చూపించుకుని ఒంగోలులో ఉంటున్న తన కుమారుడు దగ్గరకు వెళ్లింది. రాత్రతా అక్కడే ఉంది. ఆదివారం ఉదయం తన బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గుండమాల సముద్ర తీరం దగ్గరలో శవమై పడి ఉంది. అటువైపు వెళ్తున్న మత్స్యకారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై వేముల సుధాకర్బాబు సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సింగరాయకొండ: మద్యం మత్తులో ఓ దివ్యాంగుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ జువ్వలగుంట చెరువు సమీపంలో రైల్వే ట్రాక్పై ఆదివారం ఈ సంఘటన జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. జరుగుమల్లి మండలం నందనవనం గ్రామానికి చెందిన వేమూరి జహంగీర్ (51) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఇతనికి చిన్నతనంలో కరెంటు షాకు కారణంగా ఎడమచేయి పనిచేయదు. అయినప్పటికీ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఎదుటి వారికి తనకు చేతనైన సహాయం చేసేవాడు. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కి తరలించినట్లు ఒంగోలు రైల్వే జీఆర్పీ ఎస్సై శ్రీరామ్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆదివారం
సత్యమేవ జయతే19-4-2026ఈతకు వెళ్లి విద్యార్థి మృతి లింగసముద్రం: స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన విద్యార్థి నీటిలో మునిగి మృతిచెందిన సంఘటన లింగసముద్రం మండలంలోని జంపాలవారిపాలెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..జంపాలవారిపాలెం గ్రామానికి చెందిన గడ్డం వినయ్బాబు (12) కందుకూరులో 7వ తరగతి చదువుతూ పరీక్షలు రాసి ఇంటికొచ్చాడు. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి లింగసముద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకా నర్సయ్య కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. నీటిలో మునుగుతుండగా లోతు ఎక్కువగా ఉండటంతో వినయ్బాబు మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు. గురువారం నుంచి వినయ్బాబు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఎస్సై రాంబాబు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన వినయ్బాబు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందినట్లు నిర్ధారించారు. శనివారం ఉదయం వాకా నర్సయ్య కుంట వద్ద గజ ఈతగాళ్లను పిలిపించి మృతదేహాన్ని వెలికితీశారు. www.sakshi.com -
వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చేందుకు కుట్ర
ఒంగోలు టౌన్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కూల్చేందుకు ఒక టీడీపీ సీనియర్ నాయకుడు కుట్రలకు పాల్పడుతున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలోని బస్టాండు సెంటర్లో 15 ఏళ్ల క్రితం ప్రభుత్వ స్థలంలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా సరే ఆ విగ్రహాన్ని కూల్చేయాలని స్థానిక టీడీపీ సీనియర్ నాయకుడు కుట్రలు చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా విగ్రహం వద్ద ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా అడ్డుకుంటున్నాడు. వైఎస్సార్ జయంతి, వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించకుండా అడ్డుపుల్లలు వేస్తున్నాడు. రెండు నెలల క్రితం విగ్రహం సమీపంలో తన పాత ఇంటిని పునర్నిర్మించడం మొదలుపెట్టాడు. తన ఇంటికి అడ్డుగా ఉందన్న సాకు చూపుతూ వారం క్రితం గుట్టుచప్పుడు కాకుండా విగ్రహం చుట్టూ ఉన్న ఫెన్సింగ్, ప్లాట్ఫాంను ధ్వంసం చేశాడు. ఇదేంటని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
23 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
ఒంగోలు టౌన్: మద్యం సేవించి వాహనాలు నడుతున్న 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా తనిఖీలు నిర్వహించిన ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు.. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 23 మందిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వారిలో 20 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున కోర్టు జరిమానా విధించింది. ముగ్గురికి మూడు రోజుల పాటు జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ జగదీష్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రజలకు సూచించారు. నాగులుప్పలపాడు: మండలంలోని వినోదరాయనిపాలెం గ్రామ సమీపంలో గుండ్లకమ్మ నదిలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. నాగులుప్పలపాడు ఎస్సై మహేంద్రనాయక్ తెలిపిన వివరాల మేరకు.. గుండ్లకమ్మ నదిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెళ్లి పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడు విజయనగరం జిల్లాకు చెందిన బిడ్డిక చినరాయుడు (34)గా గుర్తించారు. వినోదరాయనిపాలెం రొయ్యల చెరువుల వద్ద కాపలాదారుడిగా నాలుగు రోజుల క్రితం చేరాడని, మతిస్థిమితం సరిగా లేనట్లుగా ప్రవర్తిస్తున్నాడని, ఈ నేపథ్యంలో గుండ్లకమ్మ నదిలో పడి మృతిచెందాడని తెలిసింది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కొండపి: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కొండపి మండలంలోని పెరిదేపి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెరిదేపి గ్రామానికి చెందిన కొండలరావు(45) గత ఐదేళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం భార్య కూలీ పనులకు, కుమార్తె పాఠశాలకు వెళ్లింది. మనసులో బాధతో కుంగిపోయిన కొండలరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడు సహాయంతో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన భార్య తలుపు తెరిచి చూడగా భర్త ఉరికి వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై త్యాగరాజు తెలిపారు. ఒంగోలు టౌన్: నగరంలో ప్రసిద్ది చెందిన వరసిద్ది వినాయకస్వామి దేవస్థానంలో దొంగలు పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని సీతారామపురంలో శ్రీగిరి వెళ్లే మార్గంలో జాయింట్ కలెక్టర్ గృహానికి కూతవేటు దూరంలో ఉన్న వరసిద్ది వినాయకస్వామి దేవస్థానంలో శుక్రవారం దొంగలు పడ్డారు. సుమారు ఒకటిన్నర లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దేవాలయంలోకి ప్రవేశించిన దొంగలు ఆలయ హుండీ పగులగొట్టి అందులో ఉన్న నగదు తీసుకెళ్లారు. దేవాలయ సమీపంలో ఉన్న వేప అంకమ్మ తల్లి దేవస్థానంలో కూడా దోపిడీకి ప్రయత్నించినట్లు ఆధారాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం రూరల్: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ విజయ సునీత పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శుక్రవారం మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పంచాయతీ అభివృద్ధి అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో గ్రీన్ అంబాసిడర్లు రోజూ ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తడి, పొడి చెత్తను ఇంటి వద్దే వేరు చేయడంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో పన్నుల రాబడి తక్కువగా రావడంపై ఆరా తీశారు. గ్రామ స్థాయిలో పారిశుధ్య నిర్వహణపై మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు. ఎంపీడీఓ బాల చెన్నయ్య తదితరులు ఉన్నారు. -
విచక్షణతో వ్యవహరించండి
● సబ్జైల్లో ఖైదీలకు మేజిస్ట్రేట్ బాలాజీ సూచన మార్కాపురం: మంచి చెడును గ్రహించే విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలని, అప్పుడే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉంటారని మార్కాపురం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం మార్కాపురం సబ్జైలును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విచారణ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడి వారి కేసుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలకు నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మేజిస్ట్రేట్ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉండాలని, అవి లేనప్పుడే సమాజంలో అశాంతి నెలకొని నేరాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఆవేశంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి, నిగ్రహం నశించి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెంది చెడు అలవాట్లను వీడి పటిష్టమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరుచుకోవాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. ఆయన వెంట సబ్జైలు సూపరింటెండెంట్, న్యాయవాదులు ఉన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
● నిందితుడిని అదుపులోకి తీసుకున్న తాలుకా పోలీసులు ఒంగోలు టౌన్: పగటి పూట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని ఒంగోలు తాలుకా పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం తాలుకా పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ టి.విజయకృష్ణ నిందితుడి వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని లంకెలకూరపాడు గ్రామానికి చెందిన మల్లిరెడ్డి నరేంద్రరెడ్డి గత కొంతకాలంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. ప్రకాశం జిల్లాతోపాటు పల్నాడు, కృష్ణా జిల్లాల్లో పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒంగోలు నగరంలోని వెంకటేశ్వరనగర్లో గల టీచర్స్ కాలనీలో చోరీకి పాల్పడ్డాడు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టగా నరేంద్రరెడ్డి నిందితుడని తేలింది. నగరంలోని మంగమ్మ కాలేజీ సమీపంలో నిందితుడు ఉన్నట్లు సమాచారం అందడంతో ఎస్సై హరిబాబు తమ సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 66 గ్రాముల బంగారు ఆభరణాలు, 60 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. టీచర్స్ కాలనీలో చోరీ చేసిన బంగారు ఆభరణాలను నరసారావుపేటలోని ఒక ప్రైవేటు గోల్డ్ ఫైనాన్స్ బ్యాంకులో తాకట్టు పెట్టిన రసీదులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై తాలుకా పరిధిలో రెండు నేరాలు, గుడివాడ, నరసరావుపేట రూరల్ స్టేషన్ల పరిధిలో ఒక్కో కేసు నమోదయ్యాయని సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. -
చేపల వేటకు వెళ్లి వృద్ధుడి గల్లంతు
ఒంగోలు టౌన్: చేపల వేటకు వెళ్లిన ఒక వృద్ధుడు చెరువులో గల్లంతయ్యాడు. ఒంగోలు తాలూకా పోలీసుల కథనం ప్రకారం... ఒంగోలు మండలంలోని కరవది గ్రామానికి చెందిన విట్టా శ్రీనివాసరావు (68) మరో ఇద్దరు మిత్రులతో కలిసి కరవది చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ చెరువులో పడి శ్రీనివాసరావు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న తాలూకా ఎస్సై ఫణిభూషణ్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి చెరువులో గాలించారు. సాయంత్రం పొద్దుపోయేంత వరకు వెతికినా శ్రీనివాసరావు ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు ఆపివేశారు. తిరిగి శనివారం గాలింపు చేపట్టనున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జనగణనలో ఓటీపీ అడగరు
ఒంగోలు టౌన్: జనగణన ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు, వ్యక్తిగత గోప్య సమాచారం, సర్టిఫికెట్లు అడగరని ఎస్పీ హర్షవర్థన్రాజు తెలిపారు. జనగణన పేరుతో డిజిటల్ ప్లాట్ఫాంల ద్వారా మోసాలకు పాల్పడే వ్యక్తుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, ఇతర మార్గాల ద్వారా ఎవరైనా ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని చెప్పారు. ఈ నెల 16వ తేదీ ప్రారంభమైన జనగణన 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. స్వయంగా ఇళ్ల గణన మొదటి దశ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మే 1 నుంచి 30వ తేదీ వరకు ఇళ్ల గణన ప్రక్రియ నిర్వహించనున్నట్లు చెప్పారు. స్వయం గణన ప్రక్రియలో ప్రతిఒక్కరూ భారత జనగణన పోర్టల్లో లాగిన్ అవ్వాలని, అందులో అడిగిన వివరాలు నమోదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో సెన్సస్ ఇన్చార్జి ఆఫీసర్ టి.రాంభూపాల్రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అఖండ కుమార్, సెన్సస్ టెక్నికల్ అసిస్టెంట్ టి.సుజాత పాల్గొన్నారు. ఎస్పీ హర్షవర్థన్రాజు -
అదే అలవాటు!
పసికందుల ప్రాణాలకు రేటుప్రమాదాల అనంతరం సెటిల్మెంట్లకు దిగుతున్న టీడీపీ నేతలుయర్రగొండపాలెం: పసికందుల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమైన పాలకులు.. నీట మునిగి మృతి చెందిన వారికి నిస్సిగ్గుగా వెల కడుతున్నారు. బడా నాయకులు చెప్పే మాటలు జవదాటితే మనుగడ కష్టమవుతుందన్న భయంతో చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులు తలూపక తప్పడం లేదు.! తమ పిల్లలు బాగా చదువుకోవాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆశలు పెట్టుకొని చిన్నారులను బడికి పంపుతుంటే అక్కడ అఆలు తప్ప జాగ్రత్తల గురించి చెప్పే నాథుడే లేకుండా పోయాడు. ఎక్కడో బోరు గుంతలోపడి చిన్నారి మృత్యువాత పడిందని, ప్రాణాలతో బయటకు తీసుకొని వచ్చారనే విషయాల గురించి ప్రసార మాధ్యమాలు పెద్దగా లేని రోజుల్లోనే జనానికి ఎక్కువగా తెలిసేది. వెను వెంటనే అధికారులు అప్రమత్తమై గ్రామీణ ప్రాంతాలు, పొలాల్లో ఫెయిలైన బోరు గుంతలను పూడ్పించే ఏర్పాట్లు ముమ్మరంగా చేసేవారు. ప్రస్తుతం బోరుగుంతల వద్ద ప్రమాద పరిస్థితులు అంతగా లేవు కానీ, నీటి కుంటల వద్ద తరచూ సంభవిస్తున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. ‘శవాలపై చిల్లర’ రాజకీయాలు! ఏటా నీటి కుంటల్లో పసిమొగ్గలు రాలిపోతూనే ఉన్నాయి. తాజాగా యర్రగొండపాలెం మండలంలోని చిన్నబోయలపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కొమ్ము శశికుమార్, బోయలపల్లి దీపన్ అరటి తోటలో ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లి కాళ్లు శుభ్రం చేసుకుంటున్న సమయంలో జారి పడి మృత్యువాత పడ్డారు. దాదాపు ఏడాది క్రితం స్థానిక మార్కాపురం రోడ్డులోని వై.కొత్తపల్లి సమీపంలో తాగేందుకు నీళ్లు తెచ్చుకోవడానికి కుంట వద్దకు వెళ్లిన ఒక కూలీ అందులో పడి ప్రాణాలు వదిలాడు. గుర్తుతెలియని మరొక వ్యక్తి బహిర్భూమికి వెళ్లి అక్కడ ఉన్న నీటి కుంటలో జారిపడి మృతి చెందాడు. గత ఏడాది మార్చి నెలలో పెద్దదోర్నాల మండలంలోని బలిజేపల్లి క్వారీల్లో తీసిన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు వదిలారు. గత ఏడాది ఆగస్టు 8వ తేదీన చిన్నగుడిపాడు చెరువులో మట్టి కోసం తీసిన గుంతలో పడి ఇంటర్ చదువుతున్న పులుకూరి అద్భుత కుమార్, 4వ తరగతి చదువుతున్న పవన్కుమార్ చనిపోయారు. పెద్దారవీడు మండలంలోని కొత్తపల్లిలో సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం బడి లేకపోవడంతో ముగ్గురు చిన్నారులు ఆరవీటి ఏడుకొండలు, కొత్తపలి మను, కొత్తపల్లి శివలు ఆడుకోవటానికి కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు వదిలారు. ఈ సంఘటనల తర్వాత కొందరు నాయకులు పోలీసుల ఎదుటే పంచాయితీలు పెట్టి పిల్లల ప్రాణాలకు వెలకట్టి చేతులు దులుపుకొంటున్న తీరు చర్చనీయాంశమైంది. నీటి కుంటల వద్ద రక్షణ కల్పించని వారిపై ఎటువంటి చర్యలు లేకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇప్పటికై నా స్పందించి గ్రామాలకు సమీపంలో ఉన్న నీటి కుంటలకు ఫెన్షింగ్ వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో డ్రౌనింగ్(నీట మునిగి చనిపోవడం) కేసులు నమోదు కాకుండా ఉమ్మడి ప్రకాశం ఎస్పీలుగా విధులు నిర్వర్తించిన సిద్ధార్థ్ కౌశల్, మలికాగర్గ్ తదితరులు చర్యలు చేపట్టారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ద్వారా డ్రౌనింగ్ మరణాలను నిలువరించగలిగారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో డ్రౌనింగ్ మరణాలను అడ్డుకునేలా పోలీసులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. అదే సమయంలో ప్రతిపక్ష నాయకులు, టీడీపీ నేతల అవినీతిని ప్రశ్నిస్తున్న సామాన్యులను వేధించడానికి పోలీసులను ఉసిగొల్పుతున్న తీరు చర్చనీయాంశమైంది. ఫారం పాండ్లకు రక్షణ కంచెలేవి? ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలన్న నినాదంతో ఎన్ఆర్ఈజీఎస్(పస్తుతం వీబీ జీ రామ్ జీ), ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పొలాల్లో ఫారం పాండ్లు తవ్వేస్తున్నారు. అయితే వాటి చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఆ దిశగా రైతులకు కనీస అవగాహన కల్పించడం లేదు. గ్రామాలకు దగ్గరగా ఉన్న నీటి కుంటల్లో పిల్లలు మునిగిపోవడం, అడవులు, కొండ ప్రాంతాల్లో వన్యప్రాణులు నీరు తాగేందుకు వెళ్లి ఆ గుంతల్లో పడిపోవడం లాంటి సంఘటనలు తరచూ సంభవిస్తున్నాయి. చిన్నారులకు అవగాహన లేకపోవడం వల్ల సరదా కోసం నీటి కుంటల వద్దకు వెళ్లి మృత్యు కోరల్లో చిక్కుకుంటున్నారు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగుల్చుతున్నారు. -
న్యాయం కోరితే దాడి చేస్తారా?
అద్దంకి రూరల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, నూర్బాషా సంఘం రాష్ట్ర నాయకుడు కొటికలపూడి శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు అద్దంకి–నార్కెట్పల్లి జాతీయ రహదారిపై శశుక్రవారం రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తోరోకో దాదాపు గంటన్నరపాటు కొనసాగింది. వివరాలు.. మండలంలోని చక్రాయపాలెం వద్ద గురువారం బైక్ను కారు ఢీకొట్టడంతో అద్దంకి పట్టణానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు కొటికలపూడి శ్రీను, మరో వ్యక్తి మృతి చెందిన విషయం విధితమే. అయితే పోస్టుమార్టం నిర్వహించడం కోసం సంతకాలు చేయాలని మృతుడి బంధువులను పోలీసులు అడిగారు. తమకు న్యాయం జరగనిదే సంతకాలు చేయమని వారు తేల్చిచెప్పారు. ప్రమాదం సమయంలో కారు నడిపిన వ్యక్తిని కాకుండా వేరొకరిని ఎఫ్ఐఆర్లో చేర్చారని ఆరోపించారు. దీంతో పోలీసులు, మృతుడి బంధువుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మృతుని బంధువుల్లో కొందరిపై సీఐ సుబ్బరాజు చేయి చేసుకోవడంతో వివాదం ముదిరింది. పోలీసులు న్యాయం చేయరని భావించిన మృతుడి బంధువులు సుమారు 200 మంది, మృతుని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దంకి–నార్కెట్పల్లి జాతీయ రహదారిపై అద్దంకి భవానీ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చింతలపూడి అశోక్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. మృతుడి బంధువులను ఆస్పత్రి వద్ద ఎందుకు కొట్టారని దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఎదుట సీఐని నిలదీశారు. డీఎస్పీ హామీతో ఆందోళన విరమణ బాధితులు, ప్రమాదానికి కారణమైన వారితో చర్చించిన అనంతరం నష్టపరిహారం ఇప్పించేందుకు డీఎస్పీ ఒప్పించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మృతదేహాన్ని బంధువులు ఇంటికి తరలించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అశోక్కుమార్ మాట్లాడుతూ.. కొటికలపూడి శ్రీను కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
సత్తాచాటిన వైఎస్సార్ జిల్లా ఎడ్లు
రాచర్ల: మండలంలోని జేపీ చెరువులో పవిత్ర క్షేత్రమైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జేపీ చెరువు గ్రామంలో 16 రోజుల పండుగ సందర్భంగా రాష్ట్రస్థాయి రెండు పండ్ల విభాగ ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఈ బండలాగుడు పోటీల్లో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం ద్వార్షల వెంకటసాయిభవత్ చెందిన ఎడ్లజతలు నిర్ణీత 15 నిమిషాల్లో 3342 అడుగులు లాగి మొదటి బహుమతిని సాధించాయి. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం కమలాపురం గ్రామానికి చెందిన రమణారెడ్డి ఎడ్లజతలు 3282 అడుగులు లాగి రెండవ బహుమతి గెలుచుకున్నాయి. కర్నూలు జిల్లా నల్లగుండ్లకు చెందిన రవి ఎడ్లజతలు 2950 అడుగులు లాగి మూడో బహుమతి, పల్నాడు జిల్లా సత్తెనపల్లెకు చెందిన బాలరామ్ ఎడ్లజతలు 2930 అడుగులు లాగి నాల్గవ బహుమతి, నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం దొర్నిపాడు గ్రామానికి చెందిన రవీంద్రరెడ్డి ఎడ్లజతలు 2896 అడుగులు లాగి ఐదో బహుమతి, మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన రేత్వికారెడ్డి ఎడ్లజతలు 2747 అడుగులు లాగి ఆరో బహుమతి సాధించాయి. విజేతలకు మొదటి నుంచి 6 బహుమతులు వరుసగా రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు అందజేశారు. -
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత ఉండాలి
ఒంగోలు వన్టౌన్: జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పీ రాజాబాబు, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) గోదాములను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గోదాములకు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ వెంట విజయవాడ ఎలెక్షన్ సెల్ డిప్యూటీ సీఈఓ ఎస్.ఆంజనేయులు, ఒంగోలు డీఆర్ఓ చిన ఓబులేసు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సింగరాయకొండ: స్థానిక ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న బి.మహేంద్ర శుక్రవారం నెల్లూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఇతను జిల్లా వాసి కావడంతో స్థానికత కారణంగా పక్క జిల్లాకు బదిలీ అయినట్లు సీఐ సీహెచ్ హజరత్తయ్య తెలిపారు. ఈ స్టేషన్కు నూతన ఎస్సై విధులు చేపట్టే వరకు తానే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. మార్కాపురం: మార్కాపురం సీఐ సుబ్బారావు సెలవుపై వెళ్లారు. అటు నుంచి అటే మార్కాపురం నుంచి బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గురువారం రాత్రి మార్కాపురం పట్టణ ఎస్సై సైదుబాబు రిలీవ్ అయ్యారు. ఇక డీఎస్పీ డాక్టర్ నాగరాజు కూడా వ్యక్తిగత పనిపై తిరుపతి వెళ్లినట్లు తెలిసింది. జిల్లా కేంద్రమైన మార్కాపురంలో డీఎస్పీతో పాటు సీఐ, పట్టణ ఎస్ఐ కూడా లేకపోవడంతో పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. -
పల్లెనిద్రలో కలెక్టర్కు సమస్యల ఏకరువు
మర్రిపూడి: పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ పీ రాజాబాబు మండలంలోని గుండ్లసముద్రంలో శుక్రవారం రాత్రి బసచేశారు. ఈ సందర్భంగా గుండ్లసముద్రం పంచాయతీ పరిధిలోని కొష్టాపల్లి, ఎస్టీరాజుపాలెం గ్రామస్తులతోపాటు మండలంలోని పలుగ్రామాల ప్రజలు హాజరయ్యారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. మర్రిపూడి, గుండ్లసముద్రం గ్రామాల్లోని చెరువులకు పొదిలి చిన్న చెరువు నుంచి సాగు, తాగునీరు అందిస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు సైతం అర్జీ రూపంలో తెలియజేశామని ఎంపీపీ వాకా వెంకటరెడ్డి కలెక్టర్ రాజాబాబు దృష్టికి తీసుకెళ్లారు. మండలంలో రోజుల తరబడి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో మండలవాసులు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని, వేసవిలో తాగునీరు అందించాలని సొసైటీ అధ్యక్షుడు ఎర్రమోతు శ్రీనివాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సర్వే నంబరు 571లో దాదాపు 206 ఎకరాల మేత పోరంబోకు భూమి ఉందని, అయితే ఆ భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా ఆన్లైన్ చేసి ఏకంగా కొందరికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారని, అక్రమ ఆన్లైన్ తొలగించాలని గ్రామానికి చెందిన దేవరపల్లి సుబ్బారెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భూములను పరిశీలించాలని తహశీల్దార్ జనార్దన్ను కలెక్టర్ ఆదేశించారు. గుండ్లసముద్రం పరిధిలోని కొత్తచెరువు తరచుగా తెగిపోయి నీరు వృథాగా పోతోందని, ఎన్నోసార్లు మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకుంటున్నారే తప్పా ఉపయోగంలేదని గ్రామానికి చెందిన చంద్రమౌళి కలెక్టర్కు విన్నవించారు. వర్షం కురిస్తే ఇళ్ల మధ్య మోకాళ్ల లోతు వర్షపునీరు నిలబడుతుందని, అంతర్గత రహదారులు వేయాలని ఎస్టీకాలనీ వాసులు కోరారు. అంతర్గత రహదారులు, సైడ్ డ్రైన్స్ మరమ్మతులు చేయాలని, తాగునీరు, పింఛన్లు, పక్కా ఇళ్లు ఇప్పించాలని కోరారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ వంశీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కళావతి, జెడ్పీ సీసీ చిరంజీవి, డ్వామా పీడీ జోసెఫ్కుమార్, డీఎస్ఓ పద్మాశ్రీ, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రూ.15 కోట్ల స్థలంపై కబ్జా కన్ను
మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రాత్రికి రాత్రే నకిలీ డాక్యుమెంట్లు పుట్టిస్తూ స్థలాలు తమవేనంటూ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత డిసెంబరులో మార్కాపురం జిల్లాగా ఏర్పాటు కావడంతో స్థలాల ధరలకు రెక్కలు రావడంతో భూకబ్జాదారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్రమ మార్గాల్లో రెచ్చిపోతున్నారు. మార్కాపురం కలెక్టరేట్కు అర కిలోమీటరు దూరంలో సుమారు 100 మందికి చెందిన ఇళ్ల స్థలాలను కొంతమంది జేసీబీతో చదునుచేసి హద్దురాళ్లను తొలగించడం సంచలనం రేపుతోంది. రెండు రోజుల నుంచి బాధితులందరూ ఆందోళన చెందుతున్నారు. గురువారం కలెక్టరును కలిసి తాము 2010లో కొనుగోలు చేసిన స్థలాలను గిద్దలూరు ప్రాంతానికి చెందిన కొంతమంది కబ్జా చేశారని వినతిపత్రం ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. మార్కాపురం, తర్లుపాడు రోడ్డులోని అల్లూరి పోలేరమ్మ గుడి వెనుక 12 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 100 మందికి పైగా స్థలాలు కొనుగోలు చేశారు. 2005, 2010 మధ్య ఈ స్థలాలను కొనుగోలు చేసినట్లు స్థలం యజమానులు తెలిపారు. ఇటీవల వారం క్రితం గిద్దలూరు ప్రాంతానికి చెందిన కొంతమంది నాయకులు మార్కాపురం అల్లూరి పోలేరమ్మ గుడి వద్దకు వచ్చి సుమారు 100 మందికి చెందిన స్థలాలపై దృష్టిసారించి జేసీబీలు తెచ్చి భూమిని చదునుచేయించడంతో పాటు హద్దురాళ్లను తొలగించి భూమి తమదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఒక్కసారిగా భూకబ్జాదారుల వ్యవహారం బయటపడింది. స్థలం యజమానులు కబ్జాదారుల పేర్లు బయటపెట్టేందుకు సాహసించడం లేదు. కలెక్టరుకు, పోలీసులకు ఫిర్యాదు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్గా 100 మందికి చెందిన భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. బాధితులతో మాట్లాడిన అన్నా రాంబాబు: సమాచారం తెలుసుకున్న మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు శుక్రవారం తమ స్థలాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్న యజమానుల వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్టబద్ధంగా ఉన్న స్థలాలపై ఆందోళన చెందవద్దని వారికి భరోసా కల్పించారు. న్యాయబద్ధంగా ముందుకు సాగాలని, అవసరమైతే తాను మాట్లాడతానని అన్నా రాంబాబు భరోసా ఇచ్చారు. అన్నా రాంబాబు వెంట పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సలీమ్, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. కాగా జనసేన ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్ కూడా బాధితులతో మాట్లాడారు. -
ప్రేత సంస్కృతితో యువత నిర్వీర్యం
ఒంగోలు టౌన్: దేశంలో ఫాసిస్ట్ శక్తులు అధికారంలోకి వచ్చిన తరువాత సమాజంలో ప్రేత సంస్కృతి విచ్చలవిడిగా విస్తరిస్తోందని, దీంతో యువత నిర్వీర్యమవుతోందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.నాగరాజు విచారం వెలిబుచ్చారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయిన యువత సహజ చైతన్యాన్ని కోల్పోయిందని చెప్పారు. అరుణోదయ రాష్ట్ర శిక్షణ తరగతుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని సీవీఎన్ రీడింగ్ రూం చర్చి సెంటర్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ దేశంలోకి విదేశీ పాశ్చాత్య సంస్కృతి ప్రవేశించడంతో దేశ సంస్కృతిలో భాగమైన సంప్రదాయాలు, సాహిత్యం, జానపద కళారూపాలు, శ్రమజీవుల ఆటపాటలు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ సీరియల్స్, సినిమాలు, రియాల్టీ షోలు విద్యార్థులను, యువతను చెడు మార్గం పట్టిస్తున్నాయని చెప్పారు. వీటికి వ్యతిరేకంగా విష సంస్కృతి వలన కలుగుతున్న కష్ట నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీఎస్ సాగర్, అరుణోదయ కళాకారులు జి.శ్రీనివాస్, ఆర్.సుజాత, జయలక్ష్మి, లక్ష్మి కళ, ఆర్.మోహన్, మోజెస్ పాల్గొన్నారు. -
పెచ్చుమీరుతున్న పోలీసుల దౌర్జన్యాలు
కనిగిరి రూరల్: కూటమి పాలనలో నాయకుల అరాచకాలు, పోలీసుల దౌర్జన్య కాండలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ అన్నారు. కొండపి నియోజకవర్గం మర్రిపూడి మండలం గార్లపేట పంచాయతీ నరసాపురం గ్రామానికి చెందిన భువనం ప్రసాద్ మర్రిపూడి ఎస్సై వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించి కనిగిరి వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా బాధితుడిని ఆదిమూలపు సురేష్ కనిగిరిలోని వైద్యశాలకు వచ్చి పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కూటమి నాయకులకు పోలీసులు ఏకపక్షంగా వత్తాసు పలుకుతూ బడుగు, బలహీనవర్గాలను అణిచివేస్తున్న ఘటనలకు ఇది ఒక ఉదాహరణ అన్నారు. భువనం ప్రసాద్ ఆరేళ్ల క్రితం ఓ టీడీపీ నాయకుడికి రూ.2.50 లక్షల బాకీ ఉన్నాడని, వాటిని తీర్చాలని పోలీసులు ఆరేళ్ల నాటి కేసును తవ్వి తీసి గత 15 రోజుల నుంచి ప్రసాద్ కుటుంబ సభ్యులు, బావమరిదిని పదేపదే స్టేషన్కు పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు హింసించారన్నారు. అయితే ప్రసాద్ కుటుంబ సభ్యులు తాము బాకీ ఎప్పుడో తీర్చివేశామని ఆధారాలు ఉన్నాయని, ఇప్పుడు ఆరేళ్ల తరువాత దీని గురించి విచారణ చేయడం ఏమిటని, అయినా ఇది సివిల్ మ్యాటరని ఏదైనా ఉంటే కోర్టుకు పెట్టాలని మీరు ఈవిధంగా బాధించడం సరికాదని ప్రసాద్ ఎస్సైకి విన్నవించాడన్నారు. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని ప్రతిరోజు స్టేషన్కు పిలిపించి సాయంత్రం వరకు ఉంచి రాత్రికి పంపడం అవమాన కరమని ఇంటివద్ద చిన్నపిల్లలతో భార్య ఉందని కాళ్లావేళ్లా పడ్డా ఎస్సై కనికరం చూపలేదన్నారు. మర్రిపూడి ఎస్సై కొండపి ఎమ్మెల్యే, రాష్ట్ర సాంఘిక సంక్షేమమంత్రి ప్రోద్బలంతోనే ఇది చేస్తున్నారని, మంత్రిని ప్రసన్నంచేసుకునేందుకు, పోస్టును కాపాడుకునేందుకే భువనం ప్రసాదును 15 రోజులపాటు స్టేషన్ చుట్టూ తిప్పించుకుని..ఈనెల 15వ తేదీ రాత్రి బెల్ట్తో విచక్షణా రహితంగా కొట్టాడన్నారు. అవమాన భారంతో భువనం ప్రసాద్ పురుగులమందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడన్నారు. బాధితుని ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పోలీసులు అది మరిచిపోయి మంత్రులు చెబితేనో, తెలుగుదేశం పార్టీ నాయకులు చెబితేనో దౌర్జన్యంగా వ్యవహరిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రాణాలు తీసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తక్షణం దీనిపై ఎస్పీ విచారణ జరిపించి బాధ్యులపై, మర్రిపూడి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేడ్కర్, జగ్జీవన్రామ్ల విగ్రహాలను దళితులను హౌస్ అరెస్ట్ చేసి, తహసీల్దార్ను తీసుకొచ్చి దౌర్జన్యంగా ప్రారంభించడం హేయమన్నారు. కేవలం ఎస్సై, పోలీసుల అండతోనే ఈ పని చేశారన్నారు. తక్షణం ఎస్పీ, ఆర్డీఓ విచారణ జరిపి పోలీసులపై చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులకు న్యాయం చేయాలన్నారు. తీరుమారకపోతే న్యాయపోరాటం:అధికారులు రాజ్యాంగ బద్ధంగా పనిచేయాలన్నారు. తీరుమారకపోతే న్యాయస్థానం తలుపు తడతామని, జ్యుడీషియల్ ఎంకై ్వరీ చేయిస్తామని, బాధితులకు న్యాయం చేసేవరకు పోరాటం చేస్తామన్నారు. ఆయన వెంట పీడీసీసీబీ మాజీ చైర్మన్ వైఎం.ప్రసాదరెడ్డి, మున్సిపాల్ మాజీ చైర్మన్ అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, ఎస్.మోహన్రెడ్డి, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, సిరుప గోవర్ధన్రెడ్డి, పీసీపల్లి మండల కన్వీనర్ గోపవరపు బొర్రారెడ్డి, ఆర్.మాణిక్యరావు, మర్రిపూడి మండల కన్వీనర్ ఇంకొల్లు సుబ్బారెడ్డి, మాజీ మండల కన్వీనర్ బోధా రమణారెడ్డి, ఎంపీటీసీ కొండారెడ్డి, బిందు నరసింహ, గూడూరి అబ్రహంలికన్, వేశపోగు గురుప్రసాద్, డాక్టర్ షేక్.నాయబ్రసూల్, ఆవుల క్రిష్ణారెడ్డి, ముల్లంగి శ్రీహరిరెడ్డి, కంటు గురవయ్య, షేక్.జిలాని, ఖాసీంవలి, దేవరాజ్, భాస్కర్ పలువురు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
వేలం కేంద్రాల్లో పొగాకు ధరలు రైతులను కుంగదీస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఇది రైతుల పాలిట ఆశనిపాతంలా మారింది. వేలం కేంద్రాల్లో ప్రస్తుతమున్న పరిస్థితి కొనసాగితే ఆర్థికంగా కోలుకోలేమనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభ ధర రూ.250 ఉండగా నేడు రూ.232కు పడిపోయింది. బ్రైట్ రకం ధరలే ఇలా ఉంటే లోగ్రేడ్ ధరలు మరింతగా దిగజారుతాయన్న బెంగ రైతులకు పట్టుకుంది. ప్రకృతి కరుణించకపోవడం, తెగుళ్ల కారణంగా దిగుబడి భారీగా పడిపోయింది. దీనికి తోడు పశ్చిమాశియా యుద్ధం రైతుకు గోరుచుట్టపై రోకటి పోటుగా తయారైంది. ఈ ఏడాది ఎకరాకి రూ.20 వేల నుంచి రూ.50 వేలు నష్టం తప్పదని రైతులు దిగాలు చెందుతున్నారు. బేళ్లు వెనక్కు పంపుతున్నారు ఈ ఏడాది పొగాకు వేలం ప్రారంభంలో కేజీ ధర రూ.250 ఉండగా, ప్రస్తుతం రూ.232 పలుకుతుంది. యుద్ధం వంక చూపి వ్యాపారులు బేళ్ల కొనుగోలు పట్ల ఆసక్తి చూపకుండా ఆంక్షలు విధిస్తూ బేళ్లు తిప్పి పంపుతున్నారు. అసలే నష్టాలు వస్తాయి ఎలా అని బాధపడుతుంటే బేళ్లు వెనక్కి పంపటం అదనపు భారంగా మారింది. – తాటికొండ రామచంద్రరావు, రైతు, పచ్చవ ఎకరాకు రూ.40 వేలు నష్టం ఈ ఏడాది 40 ఎకరాల్లో పొగాకు సాగు చేశాను. ప్రస్తుతం కేజీ ధర రూ.232 మాత్రమే ఉంది. కేజీ ధర రూ.260 పైన ఉంటేనే గిట్టుబాటవుతుంది. ప్రస్తుత ధరలతో ఎకరాకు సుమారు రూ.40 వేలు నష్టమొచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం పొగాకు రైతును ఆదుకునేందుకు కృషి చేయాలి. దక్కని ధర..సింగరాయకొండ: పొగాకు రైతుకు కనకవర్షం కురవటం ఇక కలేనా అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో లాభాలు చవిచూశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా నిలవడంతో రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఫలితంగా రైతులకు కాసుల వర్షం కురిసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. వ్యాపారులు కుమ్మకై ్క రైతులను నిండా ముంచేస్తున్నా ప్రభుత్వం పట్టించున్న దాఖలాల్లేవు. ఫలితంగా వేలం కేంద్రాల్లో కనీస మద్దతు ధర లభించక ఎక్కువ మంది రైతులు పొగాకును వచ్చిన ధరకు తెగనమ్ముకున్నారు. మరికొంత మంది శీతల గోదాముల్లో దాచుకున్నారు. గత సంవత్సరం ప్రారంభ ధర కేజీ రూ.320కి పైగా పలికింది. ఈ దఫా కేజీ ప్రారంభ ధర రూ.250 ఉండగా ప్రస్తుతం కేజీ ధర రూ.232 పలకటంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో 11 వేలం కేంద్రాలున్నాయి. 2026–27 పంట సీజన్కు సంబంధించి రీజియన్ పరిధిలో 82,475 హెక్టార్లలో పొగాకు పంట సాగైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2026–27 లో పంట సీజన్కు సంబంధించి ఒంగోలు రీజియన్ పరిధిలో 90.20 మిలియన్ కేజీల పొగాకు పండించేందుకు బోర్డు అనుమతి ఉంది. కానీ ఈ ఏడాది సుమారు 130 మిలియన్ కేజీల పొగాకు పండించినట్లు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం తగ్గినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. ధరతో దిగాలు.. ప్రస్తుతం పొగాకు వేలం కేంద్రాల్లో ప్రారంభం నుంచి బ్రైట్గ్రేడ్ పొగాకు కేజీ ధర రూ.250 పలికింది. తరువాత ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కర్ణాటకలో పొగాకుకు సరాసరి కేజీ ధర రూ.230 వచ్చిందని ఇక్కడ కూడా ఆ స్థాయిలో వచ్చే అవకాశం ఉందని భావించారు. కానీ వేలం ప్రారంభమైన కొద్దిరోజులకే కేజీ ధర రూ.232 లకు పడిపోవడంతో రైతులు ఆందోళనలో పడిపోయారు. గిట్టుబాటు ధర లభించేనా ప్రస్తుతం వేలం కేంద్రాల్లో లభిస్తున్న ధరలను చూస్తే రైతులకు నిద్రపట్టని పరిస్థితి నెలకొంది. కొండపి వేలం కేంద్రంలో కేజీ ధర రూ.232 ఉండగా, టంగుటూరులో కేజీ ధర రూ.235, కందుకూరులో కేజీ ధర రూ.245 ఉంది. ఈ ప్రకారం రైతుకు ఎకరాకు ఒక్కో బ్యారన్కు రూ.1.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నష్టం సంభవిస్తుందని ఈ విధంగా అయితే ఎలా బట్టకట్టాలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశాజనకంగా లేని దిగుబడులు: ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోవటంతో పాటు మంచు కారణంగా తెగుళ్ల బెడద తీవ్రంగా ఉంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు 9 క్వింటాళ్ల దిగుబడి రాగా కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు కేవలం 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు చెబుతున్నారు. జరుగుమల్లి మండలం నందనవనం తదితర ప్రాంతాల్లో అక్టోబర్లో సాగు ప్రారంభించటంతో పాటు వర్షాలు కురవటంతో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, అదే చాలా ప్రాంతాల్లో నవంబర్లో సాగు ప్రారంభించటంతో సకాలంలో వర్షాలు లేక దిగుబడి 5 నుంచి 9 క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ధరలతో ఆత్మహత్యలే శరణ్యం: ఈ ఏడాది పొగాకు ధరలు తగ్గటంతో పాటు యుద్ధం కారణంగా కొనుగోలుదారులు లేక ధరలు బాగా దిగజారే పరిస్థితి నెలకొంది. ఒకవేళ కేంద్రానికి బేళ్లు తీసుకెళ్తే వాటిని నానా పరీక్షలు చేసి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రైతు 45 బేళ్లు తీసుకుని వెళ్తే కేవలం 27 బేళ్లు మాత్రమే కొనుగోలు చేసి 18 బేళ్లు వెనక్కి తిప్పి పంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అయితే ఆత్మహత్యలే శరణ్యమని ఇక కౌలు రైతుల పరిస్థితి చెప్పటానికి వీలు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుకు సెగ!– నాగినేని భాస్కర్, పొగాకు రైతు, పైడిపాడు ప్రభుత్వం ఆదుకోవాలి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుందని రైతులు గుర్తుచేశారు. గతంలో వ్యాపారులు సిండికేట్ అయి పొగాకు ధరలు పడిపోతుంటే గత ప్రభుత్వం మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆదుకుంది. కానీ కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదని, వీరు ఎంతసేపటికీ దోచుకో, దాచుకో అన్న సిద్దాంతం.. లేకపోతే జగన్మోహన్రెడ్డి ని విమర్శించటానికే సమయం కేటాయిస్తున్నారే తప్ప పొగాకు రైతును ఆదుకునే ఒక్క ప్రయత్నం చేపట్టిన దాఖలాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు సాగు తగ్గించండి ప్రత్యామ్నాయ పంటలను పండించండని చెప్పటమే తప్ప ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న ఆలోచన మాత్రం లేదని, ఈ ప్రభుత్వంలో కష్టాలే మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పల్లెలకు పాకిన గంజాయి... ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో పట్టుబడిన గంజాయి కేసులను గమనిస్తే ఎక్కువగా మారుమూల గ్రామాలకు సైతం విక్రయాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశ్చిమం, తూర్పు అని చూడకుండా ఏ ప్రాంతంలో కావాలంటే ఆ ప్రాంతంలో గంజాయి పబ్లిగ్గా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 2వ తేదీ కొండపి, అనమర్లపూడి గ్రామాల మధ్య గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో మర్రిపూడి మండలం వేమవరం గ్రామానికి చెందిన కందమల్ల నారాయణ, చీమకుర్తి మండలం బూసరపల్లి గ్రామానికి చెందిన షేక్ నాగుర్వలి, చీమకుర్తి గ్రామానికి చెందిన షేక్ రఫీ, బత్తుల సిద్దూలు ఒడిశాకు చెందిన రాజేష్ నాయర్తో కలిసి చీమకుర్తిలో విక్రయించడానికి తీసుకెళ్తున్న 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్చి 10వ తేదీ గిద్దలూరు మండలం కేఎస్ పల్లి గ్రామానికి చెందిన అలమూరి చంద్రయ్య, డిగపాటి వెంకటేష్, వెంగళ్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన బిజ్జం శ్రీరాంరెడ్డిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనిని బట్టి చూస్తే జిల్లాలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న విషయం బట్టబయలవుతోంది. ఉమ్మడి జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణం దగ్గర నుంచి పల్లెల వరకూ గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇటీవల నమోదైన కేసులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. విజనరీ పాలనలో పొరుగు ప్రాంతాల నుంచి వలస వస్తున్న గంజాయికి సామాన్యులు, విద్యార్థులు బానిసలుగా మారుతున్నారు. కొన్నిచోట్ల వారు విక్రేతలుగా మారుతున్నారు. అమాయకులైన కళాశాల, హైస్కూలు స్థాయి విద్యార్థులను ఆకట్టుకోవడానికి గంజాయి చాక్లెట్లు, సిగరెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. చీకటి వ్యాపారాన్ని కట్టడి చేయాల్సిన పాలకులు ఆర్భాటపు ప్రకటనలతో సరిపుచ్చుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మత్తు చాక్లెట్లు... చీమకుర్తి అంటేనే గ్రానైట్ వ్యాపారానికి ప్రసిద్ది. ఇక్కడకు ఎక్కడెక్కడి నుంచో కూలీలు వచ్చి పనులు చేస్తూ పొట్టపోసుకుంటుంటారు. వలస కూలీలపై దృష్టి పెట్టిన గంజాయి మాఫియా చీమకుర్తిని అడ్డాగా చేసుకుని జోరుగా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 9వ తేదీ చీమకుర్తి మండలం బూదవాడ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న ఒడిశాకు చెందిన ప్రశాంత్ను ఎకై ్సజ్ అధికారులు అరెస్టు చేశారు. గ్రామంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కిరాణా దుకాణం ముసుగులో గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు కేసు నమోదు చేశారు. ప్రశాంత్ దుకాణంలో 800 గ్రాముల గంజాయితో పాటు గంజాయితో చేసిన 800 చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్లతో పాటుగా సిగరెట్లను కూడా జిల్లా కేంద్రమైన ఒంగోలులో రహస్యంగా విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
మత్తు విస్తరిస్తూ!
గంజాయి పల్లెవిస్తూ..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొరుగు ప్రాంతాల నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఆనుకుని ఉన్న పలు జాతీయ రహదారుల మీదుగా గంజాయి ఓ ప్రవాహంలా వచ్చిపడుతోంది. పోలీసులకు సమాచారం వచ్చినప్పుడో, లేకపోతే రెగ్యులర్ తనిఖీల్లోనో గంజాయి పట్టుకోవడం జరుగుతోంది. దొరికిన వాడు దొంగ.. లేకపోతే దొర అన్నట్లుగా వ్యవహారం సాగుతోందన్న ప్రచారం జరుగుతోంది. మార్చి నెలలో ఒడిశా నుంచి చైన్నెకి కారులో తీసుకెళ్తున్న గంజాయి అనుకోకుండా జరిగిన ప్రమాదంతో పోలీసుల కంట పడింది. చైన్నెకు చెందిన చరణ్ అనే వ్యక్తి దగ్గర కారు డ్రైవర్గా పనిచేసే సాయికుమార్ తన మిత్రులు జగదీష్, సతీష్, మరో ఇద్దరు యువకులతో కలిసి ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి చైన్నెలో విక్రయిస్తున్నారు. ఎప్పటిలాగే సతీష్ మోటారు బైకు మీద ఒడిశా వెళ్లి గంజాయి తీసుకొస్తుండగా పల్నాడు జిల్లా ఎడ్లపాడు వద్ద బైకు చెడిపోయింది. దీంతో చైన్నె నుంచి కారులో వచ్చిన చరణ్, సాయికుమార్, జగదీష్ గంజాయి తీసుకెళ్తుండగా అతివేగం వలన గుడ్లూరు వద్ద ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు కాస్త దూరంలో పొదల్లో 19 కిలోల గంజాయి దొరికింది. ఈ ఘటన సంచలనం సృష్టించింది. అలాగే ఈ నెల 15వ తేదీ టంగుటూరు టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో కారులో తరలిస్తున్న 6.240 కిలోల గంజాయి లభ్యమైంది. జాతీయ రహదారి మీదుగా బస్సులు, కార్లలోనే కాకుండా మోటారు బైకులపై కూడా గంజాయి తరలిస్తున్నట్లు ఈ ఘటనల ద్వారా వెలుగులోకి వచ్చింది. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద నిత్యం పెద్ద ఎత్తున గంజాయి లభ్యమవుతుండటం గమనార్హం. రైళ్ల ద్వారా గంజాయి రవాణా... విశాఖపట్టణం నుంచి ఒంగోలు మీదుగా రాకపోకలు సాగించే రైళ్ల ద్వారా పెద్ద ఎత్తున గంజాయి రవాణా జరుగుతోంది. ఈగల్ టీం, టాస్క్ఫోర్స్, జీఆర్పీ పోలీసుల బృందం తనిఖీలు చేసినప్పుడల్లా గంజాయి దొరుకుతూనే ఉంది. ఎక్కువగా విద్యార్థులు, యువకులు గంజాయి తరలిస్తూ పట్టుబడుతున్నారు. గతేడాది జూలై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ వరకు ప్రత్యేక పోలీసుల బృందం చేసిన తనీఖీలలో భారీగా గంజాయి పట్టుబడినట్లు తెలుస్తోంది. మొత్తం 22 కేసులు నమోదయ్యాయి. గతేడాది జూలై 7వ తేదీ జరిపిన తనిఖీల్లో వివేక్ ఎక్స్ప్రెస్లో 3,720 కిలోల గంజాయి దొరికింది. ఆగస్టు 8వ తేదీ పూరీ ఎక్స్ప్రెస్లో 3 కిలోలు, ఆగస్టు 23వ తేదీన పూరీ ఎక్స్ప్రెస్లో 3.7 కిలోలు, సెప్టెంబర్ 5వ తేదీ పూరీ ఎక్స్ప్రెస్లో 7.600 కిలోలు, సెప్టెంబర్ 15వ తేదీ పూరీ ఎక్స్ప్రెస్లో ఒకరి వద్ద 5.35 కిలోలు, మరొకరి వద్ద 8.15 కిలోల గంజాయి లభ్యమైంది. నాలుగు రోజుల వ్యవధిలో సెప్టెంబర్ 19వ తేదీ బెంగళూరు ఎక్స్ప్రెస్లో 0.855 గ్రాములు, 26వ తేదీ ధన్బాద్ ఎక్స్ప్రెస్లో 9.5 కిలోలు, అక్టోబర్ 27వ తేదీ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో 13.8 కిలోలు, నవంబర్ 13వ తేదీ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో 3.24 కిలోలు, డిసెంబర్ 4వ తేదీ పూరీ ఎక్స్ప్రెస్లో 6,280 కిలోలు, 12వ తేదీ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో 10.520 కిలోలు, 20వ తేదీ అలప్పుజ ఎక్స్ప్రెస్లో 6.774 కిలోలు, 27వ తేదీ అలప్పుజ ఎక్స్ప్రెస్లో 11 కిలోల గంజాయిని రైల్వే పోలీసులతో పాటు ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది జనవరి 5వ తేదీ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో 10.300 కిలోలు, 31వ తేదీ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో 15 కిలోలు, మార్చి 6వ తేదీ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఒక కిలో, 25వ తేదీ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2025లో 89.106 కిలోల గంజాయి, 2026 మార్చి వరకు 38.300 కిలోలు కలిపి మొత్తం 127.406 కిలోల గంజాయి పట్టుబడింది. అధికారికంగా పట్టుబడిందే ఇంత ఉంటే.. అనధికారికంగా పెద్ద మొత్తంలో తరలిపోతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గతేడాది జిల్లా పోలీసు కార్యాలయం విడుదల చేసిన 2025 క్రైం బులెటిన్లో కూడా 85 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందులో రైళ్లలో తనిఖీలు చేసి 49 కిలోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలపడం గమనార్హం.


