breaking news
Prakasam District News
-
ఆర్టీసీ బస్సులో మంటలు
టంగుటూరు: షార్ట్ సర్క్యూట్తో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మండలంలోని వల్లూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. 40 మంది ప్రయాణికులతో ఒంగోలు నుంచి కావలి వెళుతున్న ఆర్టీసీ బస్సు వల్లూరు సమీపంలోకి వచ్చే సరికి బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును ఆపి ప్రయాణికులను కిందకు దించి మంటలను అదుపు చేశారు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో తరలించారు. డ్రైవర్ మంటలను ముందే పసిగట్టడంతో పెనుప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఉత్తమ సేవలకు ప్రశంస
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డులకు ఎంపికై న జిల్లాలోని పలువురు అధికారులకు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రశంస పత్రాలు అందజేశారు. శుక్రవారం ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి డీబీవీ స్వామి, కలెక్టర్ తమీమ్అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్ చేతులమీదుగా అవార్డులు అందించి అభినందించారు. – సాక్షి, ఒంగోలు ప్రశంస పత్రాలు అందుకుంటున్న బీసీహెచ్.ఓబులేసు(డీఆర్ఓ), కె.శ్రీధర్రెడ్డి(స్పెషల్ కలెక్టర్, ఎల్ఏ), జి.జోసెఫ్కుమార్(పీడీ, డ్వామా), డాక్టర్ బి.రవి(జేడీ, పశుసంవర్ధక శాఖ), ఎ.కిరణ్కుమార్(డీఈఓ), ఎం.వెంకటేశ్వరరావు(ఈడీ, బీసీ కార్పొరేషన్), ఎస్.పద్మశ్రీ(డీఎస్ఓ), పి.శ్రీమన్నారాయణ(సీఈఓ, స్టెప్), డాక్టర్ టి.వెంకటేశ్వర్లు(డీఎంహెచ్ఓ), కె.వెంకటేశ్వర్లు(ఎస్ఈ, ఏపీసీపీడీసీఎల్), డి.బాలశంకర్రావు(ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్), ఎ.జగన్నాథరావు(డీడీ, జిల్లా ట్రెజరీ), కె.హరికృష్ణ(డీఎం, మార్క్ఫెడ్)ఎం.శివకుమారి, బి.అశోక్ కుమార్ (ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు), ఎ.మాధవరావు(ఎంవీఐ)ఉత్తమ సేవా పతకాలు అందుకుంటున్న బి.లక్ష్మీనారాయణ(ఎస్డీపీఓ, దర్శి), కె.వెంకటమోహన్రావు(హెసీ), ఎంఎస్ఎస్.అశోక్ బాబు(అడిషనల్ ఎస్పీ, ఏఆర్), కె.వెంకటశివ సుబ్బారావు(ఏఆర్ ఎస్సై) ,ఎన్.రామచంద్రరావు(ఏఆర్ ఎస్సై), డి.శివనాయక్(ఏఆర్ హెచ్సీ), ఆర్.వెంకట శంకరబాబు(ఎఆర్ హెచ్సీ), ఎన్.చంద్రలీల(ఏఎస్సై), ఎం.నాగలక్ష్మి(ఏఎస్సై), ఖాదర్మొహిద్దిన్(ఏఎస్సై), ఎస్కే మహబూబ్బాషా(ఏఎస్సై) (కుడి నుండి ఎడమకు) -
కారు, మోటార్ సైకిల్ ఢీ
పెద్దదోర్నాల: ఎదురుగా వస్తున్న కారు, మోటారు సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూల్ గుంటూరు జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో రామచంద్రకోటకు చెందిన బీజెపీ నాయకుడు అంబటి అల్లూరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళఇతే.. మండల కేంద్రం నుంచి ద్విచక్రవాహనంపై రామచంద్రకోటకు వెళ్తున్న అల్లూరెడ్డిని మార్కాపురం నుంచి దోర్నాల వైపుకు వస్తున్న కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయిన అల్లూరెడ్డిని మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం మార్కాపురం ఏరియా వైధ్యశాలకు తరలించారు. -
యూరియా 3 బస్తాలిస్తే ఎలా?
కంభం: పంటల సేద్యానికి అవసరమైన ఎరువులను ప్రభుత్వం సకాలంలో అందించలేకపోవడంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన యూరియాలో పది శాతం కూడా స్టాక్ రాకపోవడం.. వచ్చిన కొద్దిపాటి యూరియా కూడా గంటల వ్యవధిలోనే అయిపోతుండటంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతు సేవా కేంద్రంలో రూ. 266కు లభించే యూరియా బయట మార్కెట్లో రూ.350 నుంచి రూ.450కు విక్రయిస్తుండటంతో రైతులు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. కంభం మండలంలో 8 రైతు సేవా కేంద్రాలుండగా ఎప్పుడు ఎక్కడ యూరియా అందుబాటులో ఉంటుందో తెలియని పరిస్థితి. కంభం రైతు సేవా కేంద్రంలో శుక్రవారం 240 బస్తాల యూరియా రాగా మధ్యాహ్నానికే అది ఖాళీ అయిపోయింది. ఒక్కో రైతుకు కేవలం మూడు బస్తాలు మాత్రమే ఇస్తుండటంతో అది సరిపోదని రైతులు గగ్గోలు పెట్టారు. కూటమి నాయకుల మితిమీరిన జోక్యంతో చాలా మంది రైతులకు ఆ 3 బస్తాల యూరియా కూడా దక్కలేదు. శుక్రవారం కంభం రైతు సేవా కేంద్రంలో యూరియాను టీడీపీ నాయకులు చెప్పిన వారికే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 240 బస్తాల యూరియా మధ్యాహ్నానికే అయిపోవడంతో మిగిలిన రైతులు వెనక్కు వెళ్లిపోయారు. -
మహనీయుల త్యాగఫలమే..
ఒంగోలు సిటీ: దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎందరో మహనీయుల త్యాగాలే కారణమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డితో పాటు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి, జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మన దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. పరిశ్రమలు, శాస్త్రసాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధిస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్లో దేశం కోసం ఎంతో మంది సైనికులు ప్రాణత్యాగం చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, బొట్ల రామారావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, కార్పొరేటర్లు ఇమ్రాన్ఖాన్, ప్రవీణ్కుమార్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, ఇంటలెక్చువల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొగ్గుల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు శ్యాంసాగర్, మహిళా నాయకులు మేరీకుమారి, పేరం ప్రసన్న, వాణి, రజిని, శోభలత, వైఎస్సార్ సీపీ నాయకులు మీరావలి, పులుసు సురేష్, దేవ, శ్రీకాంత్, యోహాను, సన్నీ, డి.అంజిరెడ్డి, దాసరి కరుణాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
త్యాగధనుల జీవితం ఆదర్శనీయం
ఒంగోలు: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన త్యాగధనుల జీవితాలు అందరికీ ఆదర్శమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కోర్టు ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ త్యాగధనుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి.రాజ్యలక్ష్మి, పందిరి లలిత, కానుగుల శైలజ, సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ రామకృష్ణ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోర్టు ఆవరణలోని గ్రంథాలయం వద్ద జాతీయ జెండాను ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు, కార్యదర్శి జగజ్జీవన్రావు ఆవిష్కరించారు. జెండా వందనం చేస్తున్న జిల్లా జడ్జి భారతి -
కూటమి పాలనలో ప్రజాసామ్యం ఖూనీ
ఒంగోలు సిటీ: పులివెందుల, ఒంటిమిట్టలో ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికలను చూస్తే సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే కాకుండా అపహాస్యం చేసినట్లు స్పష్టమవుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలు బ్రిటీష్ విధానాలను తలపిస్తున్నాయన్నారు. పోలింగ్ బూత్లలో వైఎస్సార్ సీపీ ఏజెంట్లు కూర్చోవడానికి కూడా వీల్లేకుండా చేయడం, ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓట్లు కూడా వేయనివ్వకుండా హౌస్ అరెస్ట్లు చేయడం, పక్క నియోజకవర్గాల నుంచి టీడీపీ నాయకులను పిలిపించి ఓట్లు వేయించడం వంటి నియంతృత్వ విధానాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి.. అధికారంలోకి రాగానే అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేసి ఉంటే ప్రజస్వామ్యబద్ధంగా ప్రజలను ఓట్లు అడిగేవారని, అలా కాకుండా ఓడిపోతామనే భయంతో పరువుపోతుందని పోలీస్ వ్యవస్థను, ఐఏఎస్లు, ఐపీఎస్లను ఎన్నికల వద్ద నిలబెట్టి నానా రకాలుగా రిగ్గింగ్ చేసి భయాందోళనకు గురిచేశారని విమర్శించారు. ఇటువంటి ఎన్నికలను బర్తరఫ్ చేయాలన్నారు. మళ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. బీహర్లో గతంలో దౌర్జన్యాలు, అరాచకాలతో ఎలక్షన్ నిర్వహించే పరిస్థితి ఉండేది కాదని, ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని మరో బీహార్లా తయారు చేసి నానా రకాలుగా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలని కోరుకుంటున్నామని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
రెండు గంటల్లోనే బాలికను రక్షించి..
ఒంగోలు టౌన్: కిడ్నాప్ అయిన బాలికను కేవలం రెండే గంటల్లో పోలీసులు రక్షించారు. అందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... చీమకుర్తి మండలం మువ్వవారిపాలెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక చీమకుర్తిలోని ఒక ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. బాలిక తండ్రి గతంలో కొంతకాలం తిరుపతిలో నివసించాడు. అప్పుడు వారింటికి దగ్గరలో నివాసం ఉంటున్న ఈశ్వర్రెడ్డితో పరిచయమైంది. అతని వద్ద బాలిక తండ్రి అప్పుగా కొంత డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బులు సకాలంలో తిరిగివ్వకపోవడంతో అతడి కూతురిని కిడ్నాప్ చేయాలని ఈశ్వర్రెడ్డి పథకం పన్నాడు. అనుకున్నదే తడవుగా శుక్రవారం చీమకుర్తి చేరుకున్నాడు. స్కూల్లో స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న బాలిక వద్దకు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వచ్చాడు. రా ఇంటికి వెళ్దామని బైక్ ఎక్కమన్నాడు. నిజమేననుకుని ఆ బాలిక బైక్ ఎక్కింది. స్వీట్లు తీసుకుని ఇంటికి వెళదామని నమ్మించి దారి మార్చాడు. మార్గం మధ్యలో బాలిక తండ్రికి ఫోన్ చేసి అప్పుగా తీసుకున్న డబ్బులిస్తేనే నీ కూతుర్ని వదిలేస్తా..లేదంటే చంపేస్తా అంటూ బెదిరించాడు. భయపడిన బాలిక తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల వెంట ఉన్న చెక్పోస్టులను అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ ఫోన్ నంబర్ను ట్రాక్ చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో బైకు కదలికలను గుర్తించి కిడ్నాపర్ను అరెస్టు చేశారు. బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కేవలం 2 గంటల వ్యవధిలోనే బాలికను రక్షించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు పిల్లల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడే సమయంలో, వారి వాహనాలను ఎక్కమన్నప్పుడు గుడ్డిగా నమ్మవద్దని పిల్లలకు నేర్పించాలని చెప్పారు. బాలికను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ శ్రీనివాసరావు, చీమకుర్తి సీఐ సుబ్బారావు, చీమకుర్తి ఎస్సై కృష్ణయ్య, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసు అధికారులు, చీమకుర్తి హెచ్సీ రాయుడు, కానిస్టేబుళ్లు నాయుడు, అనిల్, విజయ్లను ఎస్పీ అభినందించారు. -
భువనాన త్రివర్ణ శోభితం
గగనాన.. గర్వ పతాకంనృత్య ప్రదర్శనలో శ్రీ సరస్వతీ కాలేజీ విద్యార్థినులుఒంగోలు పోలీసు పరేడ్ గ్రౌండ్లో దేశభక్తి గీతానికి నృత్యం చేస్తున్న గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులువివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. దేశభక్తి ఉప్పొంగే పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలకు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. అత్యద్భుత ప్రతిభ చూపిన డ్రీమ్స్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ బిట్రగుంట విద్యార్థులకు ప్రథమ బహుమతి, అలకూరపాడు జెడ్పీహెచ్ఎస్, గుంటూరు ఆక్స్ఫర్డ్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ద్వితీయ బహుమతి, సూర్య ఉన్నత పాఠశాల, శ్రీ సరస్వతి పాఠశాల విద్యార్థులకు తృతీయ బహుమతి అందజేశారు. ఒంగోలు టౌన్: జిల్లా అంతటా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో త్రివర్ణపతాకం రెపరెపలాడింది. 79వ స్వాతంత్య్ర దిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో జిల్లా స్థాయి వేడుకలు జరిగాయి. ఉప్పొంగిన దేశభక్తితో విద్యార్థులు, యువకులు, నగర ప్రముఖులు, వివిధ శాఖల ఉద్యోగులు తరలివచ్చారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ హాజరయ్యారు. మంత్రి డోలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందని, స్వాతంత్య్ర ఫలాలు ప్రజలందరికీ సమానంగా దక్కేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దులలో కాపలా కాస్తున్న సైనికుల త్యాగాలను ఎంత కొనియాడినా తక్కువేనని చెప్పారు. ఇటీవల పహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు అంజలి ఘటించిన ఆయన.. ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన సైనికులకు సెల్యూట్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తోందని తెలిపారు. ఇందుకుగానూ మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేస్తోందని, వనరుల సమర్థ నిర్వహణ కోసం పాటుపడుతోందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో 15 శాతం అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెలా ఒకటో తేదీ ఇంటి వద్దనే అందజేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన రోజునే తల్లికి వందనం, ఇటీవలనే దర్శిలో సీఎం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారని, అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, పీఎం కిసాన్ పథకం కింద రూ.2 వేలు మొత్తం కలిపి రూ.7 వేలను రైతుల ఖాతాల్లో జమచేసినట్లు చెప్పారు. పీ–4 పథకం ద్వారా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 459 మంది రైతుల నుంచి 927 మెట్రిక్ టన్నుల నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లా ప్రగతిని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను సుదీర్ఘంగా వివరించారు. డ్రోన్లతో త్రివర్ణ పతకాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆహుతులు ఆశ్చర్యంగా తిలకించారు. ఆకాశంలో రెపరెపలాడుతున్న జాతీయ జెండాలను చూసి చిన్నారులు, విద్యార్థులు కేరింతలు కొట్టారు. త్యాగధనుల కుటుంబాలకు సన్మానం... జిల్లాలో 213 మందికిపైగా స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. వారిలో కొందరు వేడుకలను తిలకించడానికి వచ్చారు. వారితో పాటుగా మాజీ సైనికులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు ప్రకాశం పంతులు మునిమనుమడు సంతోష్ కుమార్, గన్నవరపు వందన కుమారుడు భాస్కర్రావు, కరవాది వెంకటేశ్వర్లు కుమార్తె సుబ్బలక్ష్మి, అల్లుడు శేషగిరిరావు, మాటుమడుగు సుబ్రహ్మణ్యం కూతురు నాగసులోచనతో పాటు మరికొందరు మాజీ సైనికులను మంత్రి ఘనంగా సన్మానించారు. వ్యవసాయ శాఖ శకటానికి ప్రథమ బహుమతి... స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన శకటాలు, స్టాల్స్ ఆకట్టుకున్నాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, నీటి యాజమాన్య శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖ, ఆర్టీసీ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. వీటిలో వ్యవసాయ అనుబంధ శాఖల శకటానికి మొదటి బహుమతి, జిల్లా వైద్యారోగ్య, సంక్షేమ శాఖల శకటాలకు సంయుక్తంగా ద్వితీయ బహుమతి, విద్యా శాఖ శకటానికి తృతీయ బహుమతి ప్రకటించారు. సంబంధిత శాఖల అధికారులకు జ్ఞాపికలు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు... జిల్లా వ్యాప్తంగా మొత్తం 465 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులు, సిబ్బందికి పోలీసు ఉత్తమ సేవా పతకాలు అందజేశారు. 23 మంది జిల్లా అధికారులకు ప్రశంస పత్రాలు అందించారు. డీఆర్వో బీసీహెచ్ చిన ఓబులేసు, స్పెషల్ కలెక్టర్ (ఎల్ఏ) కె.శ్రీధర్ రెడ్డి, డ్వామా డీపీ జి.జోసఫ్ కుమార్, యానిమల్ హస్బెండరీ జేడీ డా.బి.రవి, డీఈఓ ఏ.కిరణ్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి పద్మశ్రీ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు, స్టెప్ సీఈఓ పి.శ్రీమన్నారాయణ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.వెంకటేశ్వర్లు, ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కె.వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ డి.బాలశంకరరావు, జిల్లా ట్రెజరీ డీడీ ఏ.జగన్నాథరావు, ప్రొక్యుర్మెంట్ జిల్లా మేనేజర్ కె.హరికృష్ణ, ఎస్ అండ్ ఎల్ఆర్ ఏడీ గౌస్ బాషా, మెప్మా పీడీ పి.శ్రీహరి, జిల్లా జైలు సూపరింటెండెంట్ పి.వరుణారెడ్డి, డీఆర్డీఏ పీడీ నారాయణ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.శ్రీనివాసరావు, యోగాంధ్ర ట్రైనర్ జిల్లా మాస్టర్ జి.బాలసుబ్రహ్మణ్యం, ఆయుష్ జిల్లా అధికారి డా.టీవీవీ ఎస్ఎంఎస్ భీమ్నాథ్, ఎల్ఏ ఆర్ఆర్ యూనిట్ కంభం ఎస్డీసీ ఎం.వెంకటశివరామిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ బి.చిరంజీవి, లీడ్ జిల్లా చీఫ్ అధికారి డి.రమేష్ తదితరులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంసపత్రాలు అందించారు. అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయిన ఎమ్మెల్యే... స్వాతంత్య్ర దిన వేడుకలకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఉదయం 9 గంటలకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఇతర జిల్లా అధికారులు వేదిక వద్దకు వచ్చారు. 10 గంటలకు వేదిక వద్దకు వచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కార్యక్రమం పూర్తవక ముందే వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డా.పెదపూడి విజయకుమార్, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డా.కామేపల్లి సీతారామయ్య, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, డీఆర్ఓ చిన ఓబులేసు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, మాజీ సైనికులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.బిట్రగుంట కేజీబీవీ విద్యార్థినుల నృత్య ప్రదర్శనభరతమాత వేషధారణలో చిన్నారి -
చిరుత దాడితో ఉలిక్కిపడిన జిల్లా
పెద్దదోర్నాల: మండలంలోని చిన్నారుట్ల గిరిజనగూడెంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన చిరుత దాడి సంఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. నల్లమల అభయారణ్యం చరిత్రలో తొలిసారి ఓ వన్యప్రాణి మనుషులపై దాడి చేసిన సంఘటనను అటవీశాఖ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. గతంలో తిరుపతి, దిగువమెట్ట తదితర ప్రాంతాల్లో చిరుతలు దాడులు చేసి మనుషులను మట్టుబెట్టిన సంఘటనలు జరిగాయి. అయితే, ఆ సంఘటనలకు, చిన్నారుట్ల గిరిజనగూడెంలో జరిగిన సంఘటనకు చాలా వ్యత్యాసం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి, దిగువమెట్ట ప్రాంతాల్లో జరిగిన సంఘటనలను గమనిస్తే చిరుతల దాడిలో చనిపోయిన వారు అటవీ ప్రాంతంలోనే సంచరిస్తున్నారు. ఆ క్రమంలో అవి దాడులకు పాల్పడ్డాయి. అటవీ ప్రాంతంలో కట్టెలు కొట్టడానికి వెళ్లి కట్టెలు సేకరించే క్రమంలో ఒంగి ఉండటాన్ని బట్టి మనుషులను మరో జంతువులుగా భావించి దాడులకు పాల్పడి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. అయితే, బుధవారం చిన్నారుట్లగూడెంలో జరిగిన సంఘటనలో తల్లిదండ్రులతో పాటు ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని నోట కరుచుకున్న సంఘటనతో చిరుతలు ఆహారం కోసం చేసిన దాడిగా భావిస్తున్నారు. నల్లమల పులుల అభయారణ్యం చరిత్రలో తొలిసారి ఓ ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై దాడి చేయడంతో నల్లమలలో నివసించే చెంచు గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. నేరుగా ఇంట్లోకి వెళ్లి నిద్రపోతూ ప్రతిఘటించలేని స్థితిలో ఉన్న మనుషులపై దాడి చేయటాన్ని బట్టి చూస్తే అది మనిషి రక్తానికి అలవాటుపడిన జంతువుగా అనుమానిస్తున్నారు. చిరుతపులి కదలికలపై నిరంతర నిఘా... బాలికపై చిరుతపులి దాడి చేసిన సంఘటనపై అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత కదలికలపై దృష్టి సారించారు. గురువారం రాత్రి చిన్నారుట్లగూడేనికి చేరుకున్న ఫారెస్టు రేంజ్ అధికారి హరి గూడెంలోని అన్ని ప్రాంతాలలో ట్రాప్డ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు 5 మంది ప్రొడక్షన్ వాచర్లను నియమించి చిరుత కదలికలపై నిఘా ఉంచారు. మనిషి రక్తానికి అలవాటుపడిన వన్యప్రాణులు.. తిరిగి అదే ప్రాంతంలో సంచరించే అవకాశం ఉన్నందున వాటి కదలికలను విశ్లేషించుకుని తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు రేంజి అధికారి తెలిపారు. -
రాష్ట్రంలో రౌడీరాజ్యం
యర్రగొండపాలెం: రాష్ట్రాన్ని రౌడీరాజ్యంగా చేశారని, అందుకు పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికలే నిదర్శనమని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. పులివెందుల పేరు చెపితే గుర్తుకు వచ్చే నాయకుడు వైఎస్సార్ అన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలోనే అత్యంత బలమైన నాయకుడిగా, చరిష్మా కలిగిన నాయకుడిగా వైఎస్సార్ గుర్తుకు వస్తారని తెలిపారు. పులివెందుల సిటీని తలపించేలా అభివృద్ధి చేశారన్నారు. అక్కడ ఇంటర్నల్ డ్రైనేజీ ఉంటుందని, ప్రాథమిక పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటీ వరకు పాఠశాలలు, జేఎన్టీయూ, మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, న్యాయస్థానం అక్కడ ఉన్నాయన్నారు. పులివెందుల బస్టాండ్, మార్కెట్ యార్డ్లను రాష్ట్రంలో మరెక్కడా చూడలేమని, అక్కడ ఉన్న రోడ్లు ఉద్యానవనంలా కనిపిస్తాయన్నారు. అటువంటి ప్రాంతంలో ఎన్నికలు చేయాలంటే చంద్రబాబు నాయుడికి శక్తి, దమ్ము సరిపోలేదని, ఎన్నికలు సక్రమంగా చేస్తే చిత్తు చిత్తుగా ఓడిపోతామని భయపడ్డారన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది పోటీచేస్తే ఇద్దరికే ఓట్లు పోలయ్యాయని, మిగిలిన ఎవరికీ ఓట్లు పడలేదన్నారు. దొంగ ఓట్లు వేసే వాడికి 100 టీడీపీకి, ఒక ఓటు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా గుద్దాలని చెప్పారని, మిగిలిన 9మంది మిగిలి పోయారనే అలోచనే వారికి లేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఎన్నికలు ఇంకొకటి లేవన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే పులివెందుల, ఒంటిమిట్టలో రీపోలింగ్ జరపాలని ఆయన సవాల్ విసిరారు. లోకేష్ ఎర్రబుక్ అంటూ ఎర్రిపాలన చేసుకుంటూ పోతున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ మిడిమిడి జ్ఞానంతో ఒక ట్వీట్ చేశాడని, ఆ పాలన ఎలాగుందో ట్వీట్ కూడా అలాగే ఉందని, ఆ పోస్టులో జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పొన్నతోట మల్లికార్జున ఉండటం గమనించలేకపోయాడన్నారు. అదే విధంగా కలెక్టర్ చేసిన ట్వీట్లో దొంగ ఓటర్లు ఉన్నారని ప్రెస్మీట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించగానే ఆ ట్వీట్ను కలెక్టర్ డిలీట్ చేశారని, ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి వందల మంది టీడీపీ వాళ్లతో దొంగ ఓట్లు వేయించారని మండిపడ్డారు. సమావేశంలో జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, గంట వెంకట రమణారెడ్డి, పి.కృష్ణారెడ్డి, డి.వెంకటేశ్వర్లు, కె.ఓబులరెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, ఆర్.అరుణాబాయి, పి.రాములు నాయక్, సూరె రమేష్, వై.వెంకటేశ్వరరెడ్డి, పల్లె సరళ, ఎనిబెర శార, షేక్ ఫజూల్ పాల్గొన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలే నిదర్శనం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం -
అమరవీరుడు కాకుమాని
పీసీపల్లి మండలం పెదయిర్లపాడులో నిరుపేద ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించిన కాకుమాని వెంకటేశ్వరు గదర్ పార్టీ వ్యవస్థాపకులు దరిశి చెంచయ్యతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. భుక్తి కోసం, భూమికోసం, ప్రజల కోసం, మాతృదేశం కోసం అనే నినాదంతో దరిశి చెంచయ్య చేపట్టిన ఉద్యమ ప్రసంగాలకు కాకుమాని ఆకర్షితుడయ్యారు. దరిశి చెంచయ్య పిలుపుతో ఎన్నో ప్రజా ఉద్యమాలు చేశారు. అప్పట్లో కమ్యునిష్టు పార్టీ జాతీయ నాయకుడు, దివంగత మాజీ ఎంపీ గుజ్జుల యల్లమందారెడ్డి, కాకుమాని వెంకటేశ్వర్లు ఇద్దరు కలిసి దరిశి చెంచయ్యను పీసీపల్లి ప్రాంతానికి పిలిపించి సభ పెట్టించారు. అప్పటి బ్రీటిష్ పాలకులు కాకుమానిపై పలు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కమ్యునిష్టు పార్టీ ఉద్యమంలో గుజ్జుల యల్లమందారెడ్డితో కలిసి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన మరణానంతరం కమ్యూనిస్టు పార్టీ నాయకులు నేరేడుపల్లిలో 1989లో స్థూపాన్ని నిర్మించారు. -
మువ్వన్నెల జెండా భుజాన మోస్తూ..
● మహోన్నతుడు సయ్యద్షా మౌలానా మొహిద్దీన్ ఖాద్రీ బియాబాని స్వాతంత్య్ర ఉద్యమంలో సమరయోధులతో కలిసి పోరాటం చేసి ఎన్నో ఏళ్లు సార్లు జైలుకు వెళ్లారు. 500 ఎకరాల భూమిని ప్రభుత్వానికి విరాళం ఇచ్చిన మహోన్నత వ్యక్తి కంభంకు చెందిన సయ్యద్షా మౌలానా మొహిద్దీన్ ఖాద్రీ బియాబాని. అప్పటి కర్నూలు జిల్లా ప్రస్తుత ప్రకాశం జిల్లా అయిన కంభంలో 1894లో హజరత్ గౌస్పీరా ఖాద్రీ బియాబాని, తల్లి రుఖియాబి దంపతులకు ఆయన జన్మించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో డిగ్రీ చదివారు. అనంతరం అలీఘర్ యూనివర్శిటీ నుంచి లో ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు. విద్యార్థి దశ నుంచే జాకీర్హుస్సేన్తో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనేవారు. 1920లో జాతిపిత మహాత్మా గాంధీ విజయవాడ పర్యటన సమయంలో బియాబాని మహాత్మగాంధీని కలిశారు. ఆ తర్వాత 1923లో అఖిల భారత జాతీయ పతాక సత్యాగ్రహ ఉద్యమంలో ఆయన మువ్వన్నెల జెండా భుజాన మోస్తూ పల్లెపల్లెకు తిరిగారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ను రహస్యంగా కలుసుకున్నందుకు బ్రిటీషు ప్రభుత్వం ఆయన్ను జైళ్లో పెట్టింది. కర్నూలులో స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించి దేశవ్యాప్త ఉద్యమాల్లో ఆయన స్వాతంత్ర నినాదమై యువకులను ఉత్తేజపరిచేలా పోరాటం చేశారు. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను అస్సాం రాష్ట్రంలోని గయా జైలులో పెట్టింది. అబుల్ కలాం ఉర్దూ భాషా ప్రావీణ్యం సహాయంతో ఆయన అరబ్బీ బాషలోని ఖురాన్లోని భాగాలను ఉర్దూ భాషలోకి అనువదించారు. ఆయన 11 భాషల్లో దిట్ట. స్వాతంత్య్రం అనంతరం మూడుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. -
మసీదుకు నిప్పు పెట్టిన దుండగులు
– తగులబడిన జానీమాస్లు యర్రగొండపాలెం: గుర్తు తెలియని దుండగులు జామియా మసీదుకు నిప్పు పెట్టిన సంఘటన త్రిపురాంతకం మండలంలోని దూపాడులో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగింది. ఆ మసీదు ఇమాం షేక్.ఇబ్రహీం కథనం ప్రకారం బుధవారం రాత్రి మసీదులో నమాజ్ చేసుకొని 9.30 గంటలకు తాళాలు వేసి ఇంటికి వెళ్లానని, మరుసటి రోజు గురువారం వేకువజామున నమాజ్ చేసుకోవటానికి మసీదు వద్దకు వెళ్లగా ప్రధాన ద్వారం తాళాలు పగులకొట్టి ఉందని, లోపల నమాజ్ చేసుకొనే జానీమాస్లు తగులబడి పోయాయని ఆయన తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న దర్శి డీవైఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో త్రిపురాంతకం సీఐ హసాన్, ఎస్సై శివ బసవరాజు హుటాహుటిన దూపాడులోని మసీదును పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రప్పించి ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు జాగిలం మసీదు పరిసర ప్రాంతాల నుంచి నేరుగా సమీపంలో ఉన్న గుంటూరు–కర్నూలు హైవేరోడ్లో ఉన్న బస్టాండ్ వరకు వెళ్లింది. దుండగులు అక్కడి నుంచి బస్సు, లేకుంటే తమ వెంట తెచ్చుకున్న వాహనంలో వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించారు. ఈ సంఘటనకు కారకులైన వారిని వెంటనే పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీవైఎస్పీ తెలిపారు. మసీదులో జానిమాస్లు తగులబెట్టడం దారుణం మసీదులో నమాజ్ చేసుకునే జానిమాస్లు తగులబెట్టడం దారుణమైన సంఘటన అని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకుడు పఠాన్ హఫీజ్ ఖాన్ ‘సాక్షి’తో అన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న దూపాడు ప్రాంతంలో అశాంతిని నెలకొల్పేందుకు దుండగులు చేసిన దారుణ చర్య సహించరానిదని, ఈ చర్యకు పాల్పడిన నిందితుడిని పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
నాన్న ఆశయాలు కొనసాగిస్తా..
చీమకుర్తి: తన తండ్రి చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాలు కొనసాగిస్తానని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. తన తల్లి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో పాటు వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, బూచేపల్లి కుటుంబ సభ్యులు, నాయకులతో కలిసి దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ తమ గ్రానైట్ క్వారీ అయిన సూర్య గ్రానైట్ క్వారీలో పనిచేసే కార్మికులు, సిబ్బందికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రతి సంవత్సరం తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి జయంతి, వర్ధంతి సందర్భంగా బూచేపల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి జయంతి సందర్భంగా బూచేపల్లి ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తొలుత పాటిమీదపాలెం రోడ్డులోని బూచేపల్లి పార్కులో బూచేపల్లి సుబ్బారెడ్డి స్మారకానికి నివాళులర్పించారు. అనంతరం బూచేపల్లి కళ్యాణ మండపం వద్ద ఉన్న బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహానికి గజమాలలతో నివాళులర్పించారు. కళ్యాణ మండపంలో సూర్య గ్రానైట్ క్వారీలో పనిచేసే 500 మంది కార్మికులు, వర్కర్లు, బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో పనిచేసే సిబ్బందికి నూతన వస్త్రాలు అందించారు. అనంతరం 1500 మందికి అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాలలో బూచేపల్లి కుటుంబ సభ్యులతో పాటు చీమకుర్తి ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్బాబు, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, కౌన్సిలర్లు సోమా శేషాద్రి, పాటిబండ్ల గంగయ్య, కంజుల ప్రతాప్రెడ్డి, గోపురపు చంద్ర, గంగిరెడ్డి సుందరరామిరెడ్డి, మేకల యల్లయ్య, గోపిరెడ్డి ఓబుల్రెడ్డి, గంగిరెడ్డి ఓబుల్రెడ్డి, అవ్వారు ఆదినారాయణ, పులి వెంకటరెడ్డి, పాటిబండ్ల అశ్వద్దామ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉంటా బూచేపల్లి సుబ్బారెడ్డి జయంతి వేడుకల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి కార్మికులు, సిబ్బందికి దుస్తుల పంపిణీ, అన్నదానం పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, నాయకులు -
పోరాటయోధులు
ఉద్యమ కెరటం కందుల ఓబులరెడ్డి గర్జించిన వీరుడు కలంతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి..పోరాటాలకు పుట్టినిల్లు ప్రకాశం జిల్లా. దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులు ఎందరో. బ్రిటీష్ పాలకుల తూటాలకు ఎదురొడ్డి నిలిచి ప్రజలను చైతన్యవంతులను చేస్తూ తెల్లవారి గుండెల్లో వణుకు పుట్టించారు. పౌరుషానికి పెట్టింది పేరైన ప్రకాశం జిల్లాలో సాగిన ఉద్యమాలు స్వాతంత్య్ర పోరాటంలో దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఎందరో పోరాట యోధుల త్యాగాలు ఫలితమే నేడు మనం పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ మహనీయుల త్యాగాలపై సాక్షి కథనం కంభం/కనిగిరి/మార్కాపురం కంభం మండలం లింగాపురం గ్రామానికి చెందిన కందుల ఓబులరెడ్డి 1910లో నాగిరెడ్డి, చెన్నమ్మలకు జన్మించారు. బాలగంగాధర తిలక్, గాంధీ ఉపన్యాసాలకు ఆకర్షితుడైన ఆయన 1930–33 లలో ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. స్వరాజ్య ఉద్యమంలో భాగంగా ఖద్దరు ధరించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు రెండేళ్లూ జైలుశిక్ష అనుభవించారు. ఎన్జీ రంగా అనుచరుడైన ఆయన 1934లో నిడుబ్రోలులో రంగా ప్రారంభించిన రైతాంగ విద్యాలయానికి ప్రిన్సిపాల్గా పనిచేశారు. 1936లో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, 1946–51లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం 1957లో మార్కాపురం శాసనసభకు ఎన్నికయ్యారు. 1963–64లో ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్గా, 1964–71 మధ్యలో అగ్రికల్చర్ యూనివర్శిటీ వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేశారు. 1972లో యర్రగొండపాలెం నుంచి శాసనసభకు, 1978లో కంభం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికై నీటి పారుదల శాఖా మంత్రిగా, 1982–83 లో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్గా పనిచేశారు. ఆయన వ్యవసాయ రంగానికి చేసిన సేవను ప్రభుత్వం గుర్తించి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టును ఓబులరెడ్డికి అంకితం చేసి ఆయన పేరు పెట్టారు. సామాన్య ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించిన దరిశి చెంచయ్య చిన్న నాటి నుంచే బ్రిటీష్ నిరంకుళ పాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. 1905లో జరిగిన వందేమాతర ఉద్యమం, ఆతర్వాత జరిగిన స్వదేశీ ఉద్యమాలు చెంచయ్య ఆకర్షితులను చేశాయి. బాల గంగాధర్ తిలక్ ఇచ్చిన స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా చెంచయ్య ఒంగోలులో విద్యార్థులతో చేనేత మగ్గాలపై దుస్తులు నేయించి ధరింపచేశారు. 1912లో అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో వ్యవసాయ శాస్త్ర విభాగంలో చేరారు. అక్కడ భారత విప్లవకారులు లాలా హరదయాళ్, జితేంద్రనాథ్ లహరీ పరిచయమై వారి ప్రసంగాలకు ఆకర్షితులై వారితో కలిసి అమెరికా, కెనడా దేశాల్లోని పంజాబీ సిక్కులు, వ్యవసాయ కార్మికులను సమీకరించి 1913లో గదర్ పార్టీని స్థాపించారు. అప్పట్లో దేశభక్తి భావజాలంతో గదర్ అనే పత్రికను కూడా ఆయన ప్రచురించారు. భారతదేశానికి ఓడలో ఆయుధాలు తెస్తూ ఓ నమ్మక ద్రోహి సమాచారంతో బ్యాంకాక్లో బ్రిటీష్ పాలకులకు చిక్కారు. దరిశి చెంచయ్యను లాహోర్, మద్రాస్, బెంగాల్, కలకత్తా, రంగూన్ జైళ్లల్లో నాలుగేళ్లు, తమిళనాడు రాష్ట్ర వెళ్తూరు జైళ్లో మరో నాలుగేళ్లు ఉంచారు. సాంఘిక దురాచాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ క్రమంలో తన సామాజిక నుంచి వెలివేశారు. దరిశి చెంచయ్య సుభద్రమ్మ అనే మహిళను కులాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. పరిపూర్ణ అనే గిరిజన బాలికను పెంచుకున్నారు. సీ్త్ర విద్య, హరిజనోద్యమం, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. జన్మస్థలమైన కనిగిరిలో పేదల పక్షాన చెంచయ్య పోరాటాలు చేశారు. కనిగిరికి ఒకటిన్నర కిలోమీటరు దూరంలో టకారిపాలెం సమీపంలో చుట్టుబావి(తాగునీటి బావి) ఉంది. కరువుతో కనీసం గుక్కెడు నీరు దొరక్క పేద మహిళలు తాగునీటి కోసం చుట్టుబావి వద్దకు వెళితే కొంత మంది అగ్రవర్ణాలు తహసీల్దార్తో కలిసి వారిని అడ్డుకున్నారు. అప్పట్లో ఆర్యవైశ్యులైన దరిశి చెంచయ్య కుటుంబీకులు పేదల పక్షాన నిలబడి పోరాటం చేసి నీళ్లు ఇప్పించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.ఉద్యమకారులకు మార్కాపురం పుట్టినిల్లు. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో స్వాతంత్య్ర పోరాటంలో మార్కాపురానికి చెందిన ఓరుగంటి వెంకట రమణయ్య పాల్గొన్నారు. 1917జూలైలో జన్మించిన ఓరుగంట రమణయ్య 1932లో గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్తు బహిష్కరణ, పికెటింగ్, సత్యాగ్రహ కార్యక్రమాల్లో పాల్గొని పశ్చిమ ప్రకాశంలో ముందుండి ఉద్యమాలను నడిపించారు. స్వరాజ్య సముపార్జనలో రాజకీయ పాఠశాలలో పాల్గొని దివంగత అయ్యదేవర కాలేశ్వరరావు, దేశభక్త కొండా వెంకటప్పయ్యల పిలుపు మేరకు ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. అప్పట్లో బ్రిటీష్ పోలీసులు రమణయ్య గృహాన్ని ఎన్నోసార్లు సోదాలు చేశారు. సుమారు 3 దశాబ్దాల పాటు పాత్రికేయునిగా పనిచేశారు. స్వాతంత్య్ర సమరం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజుల్లో ఆయన పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొని సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ పత్రికలకు వ్యాసాలు రాశారు. అప్పటి స్వాతంత్రోద్యమ పోరాటాలను బ్రిటీష్ పాలకుల దమననీతిని అక్రమ అరెస్టులను పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేశారు. పత్రికలపై బ్రిటీష్ ప్రభుత్వం నిషేధం విధిస్తే ఆయన ధైర్యంగా మార్కాపురం, యర్రగొండపాలెం, దోర్నాల, తర్లుపాడు, పెద్దారవీడు, కంభం, గిద్దలూరు తదితర ప్రాంతాలకు పత్రికను పంపి స్వాతంత్య్రోద్యమ విశేషాలను వివరించారు. ఆయన జ్ఞాపకార్థం మార్కాపురం ప్రెస్క్లబ్లో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు -
సిలిండర్ పేలి మామాకోడళ్లకు తీవ్రగాయాలు
ఒంగోలు టౌన్: గ్యాస్ సిలిండర్ పేలి మామాకోడళ్లకు తీవ్రగాయాలైన సంఘటన ఒంగోలు నగరంలోని సత్యనారాయణపురం కృష్ణ మందిరం వద్ద గల ఓ ఇంట్లో గురువారం ఉదయం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న మేకపాటి మాల్యాద్రి కోడలు శీరిష (27) గురువారం ఉదయం నిద్రలేచి ఇంటిముందు ముగ్గు వేసింది. అనంతరం ఇళ్లు తుడిచేందుకు మొదటి అంతస్తులోకి వెళ్లింది. గ్యాస్ వాసన రావడంతో ఏంటో చూద్దామని లైట్ స్విచ్ వేసింది. దాంతో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఆ గదంతా మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న శీరిష.. భయంతో కాపాడండి అని కేకలు వేస్తూ పక్క గదిలో నిద్రిస్తున్న మాల్యాద్రి వద్దకు వెళ్లి పట్టుకుంది. ఆమె నుంచి విడిపించుకున్న మాల్యాద్రి వెంటనే పక్కనున్న నీటిని ఆమైపె పోసి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె పొట్ట, కాళ్లు కాలిపోయాయి. మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. అయితే, ప్రస్తుతం శిరీష పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ ప్రమాదంలో మాల్యాద్రికి రెండు చేతులు పూర్తిగా కాలిపోయాయి. ఆయనను స్థానికంగా ఓ ప్రైవేటు అస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఏడాది క్రితమే శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. సంఘటనపై ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంభం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. గజ్జల పెద్దపుల్లయ్య(50) భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి 7.45 నిమిషాల సమయంలో అనంతపురం– అమరావతి హైవే రోడ్డు పై వెళ్తుండగా స్థానిక మధుప్రియ రెస్టారెంట్ సమీపంలో బేస్తవారిపేట వైపు నుంచి కంభం వస్తున్న మినీ లారీ కొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
కూటమి మోసాలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పుల్లలచెరువు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు నిలదీయాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మండలంలోని మల్లాపాలెం గ్రామంలో గురువారం సర్పంచ్ రవణారెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఇది మంది ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో సూపర్సిక్స్ అంటూ హామీలిచ్చారని వాటిలో ఏదీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. నేడు రాష్ట్రంలో కక్ష పూరిత రాజకీయాలు నడుస్తున్నాయని, లేనిపోని ఆరోపణలు చేసి కార్యకర్తలపై కేసులు పెట్టడమే పనిగా టీడీపీ వారు పెట్టుకున్నారని అన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను, అక్రమాలను ప్రజలు గమనించాలన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం వలన ఒక్కో కుటుంబానికి కలిగిన నష్టాన్ని వివరించారు. ముందుగా ఎమ్మెల్యే చంద్రశేఖర్కు గ్రామంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ కార్యదర్శి వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎల్.రాములు, వైపాలెం మండల కన్వీనర్ ముసలారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుల్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘు, సర్పంచ్లు టి.సత్యనారాయణరెడ్డి, ఎ.కోటిరెడ్డి, జ్యోతి, బాలునాయక్, వెంకటేశ్వర నాయక్, మాజీ సర్పంచ్లు రవణారెడ్డి, డి.కోటిరెడ్డి, నాయకులు ఆవుల చెంచురెడ్డి, బ్రహ్మానందరెడ్డి, లక్ష్మానాయక్, యూత్ అధ్యక్షుడు దినేష్యాదవ్, హరినాయక్, నాసర్రెడ్డి, ఖాసింవలి, శివారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి, మహిళా నాయకులు రవణమ్మ, విజయకుమారి పాల్గొన్నారు. -
అరకొర బస్సులేసి!
ప్రకాశంపోరాట యోధులుదేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన యోధులెందరో ప్రకాశం జిల్లాకు చెందిన వారున్నారు. కాలయాపన చేసి.. శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఒంగోలు సిటీ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా పురస్కారాలు అందించనున్నట్లు డీఈఓ కిరణ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన జిల్లాలోని ఐదు పాఠశాలలను వీటికి ఎంపిక చేస్తామన్నారు. 2025 విద్యా సంవత్సరంలో స్కూల్ గేమ్స్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ధ్రువీకరణ నకళ్లతో ఒంగోలులోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్.జీ.ఎఫ్) కార్యాలయంలో ఈ నెల 18వ తేదీ లోపల సంప్రదించాలని తెలిపారు. నకళ్లపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీడీ సంతకాలు ఉండాలన్నారు. ఒంగోలు సబర్బన్: ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకుగాను 448 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించేందుకు జిల్లా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఈ మేరకు గురువారం ప్రశంస పత్రాలు అందుకోబోతున్న అధికారుల జాబితాను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రకటించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం ఆగస్టు 15న ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరుకానున్నారు. ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు జిల్లా యంత్రాంగం ఆహ్వానం పంపింది. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులు మొదలుకొని కింది స్థాయి సిబ్బంది వరకు సేవలను గుర్తించి వారికి ప్రశంస పత్రాలు అందించనున్నారు. వారిలో 23 మంది జిల్లా అధికారులు ఉన్నారు. వారితో పాటు రెవెన్యూ విభాగంలోని 77 మందికి, పోలీస్ విభాగంలోని 36 మందికి ప్రశంస పత్రాలు ఇచ్చేందుకు జాబితాలు సిద్ధం చేశారు. మిగతా అన్ని ప్రభుత్వ విభాగాల్లోని అధికారులకు, సిబ్బందికి కలిపి మొత్తం 345 మందికి కూడా ప్రశంస పత్రాలు అందించనున్నారు. వారితో పాటు స్వాతంత్య్ర సమర యోధుల వారసులను కూడా ఈ సందర్భంగా సన్మానించనున్నారు. ఒంగోలు మెట్రో: సినీనటుడు, నిర్మాత, దర్శకుడు గిరిబాబుకు ఈ నెల 17వ తేదీ నాగభైరవ ఆత్మీయ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు నాగభైరవ సాహిత్యపీఠం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సభలో ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి, కోనేరు కల్పనకు నాగభైరవ సాహిత్య పురస్కారాన్ని, కె.కె.ఎల్ స్వామికి నాగభైరవ కళా పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీనటుడు రఘుబాబు పాల్గొంటారు. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అధ్యక్షత వహించే ఈ కార్యక్రమాన్ని డాక్టర్ నూనె అంకమ్మరావు నిర్వహిస్తారు. కళా సాహిత్యాభిమానులు అందరూ ఈ సభలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం పెట్టిన ఆంక్షలపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం కొన్ని సర్వీసులకే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేయడం, తగినన్ని బస్సులు కేటాయించకపోవడం, డిపోల్లో అరకొర వసతులతో అమలు చేయకముందే పథకాన్ని నిరుగారుస్తున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు తమ ఉపాధి దెబ్బతింటుందని, ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆటోవాలాలు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు టౌన్: గత సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూటమి నాయకులు ఊరువాడా తిరిగి ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తుంది. కానీ ఉచిత బస్సు ప్రయాణం ఊసెత్తకుండా కాలయాపన చేశారు. ఉచిత బస్సు పథకం అమలు చేయడానికి కమిటీ అధ్యయనం చేస్తుందంటూ సాకులు చెబుతూ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుతుంటే వస్తున్న ఆదరణను చూశాక చెమటలు పట్టిన కూటమి పాలకులకు ఇష్టంలేకపోయినా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయం తీసుకొంది. మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను ఏ విధంగా అయితే అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకున్నారో అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా అమలు చేయడానికి పన్నాగాలు పన్నారు. అందుకే ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు కాకుండా కేవలం 5 రకాల బస్సు సర్వీసుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణం చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లే అవకాశం లేకుండా ఘాట్ రోడ్డులో ప్రయాణించే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించలేదు. దాంతో అమలు చేయకముందే ఈ పథకాన్ని నీరుగారుస్తున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. 11.27 లక్షల మందికి 325 బస్సులు: జిల్లాలో మొత్తం 11,27,398 మంది మహిళలున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం జిల్లాలోని 38 మండలాల ప్రజలకు గాను కేవలం 325 బస్సులను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో బస్సులో 50 నుంచి 60 మందికి మాత్రమే సిటింగ్ ఉంటుంది. నిలబడి ప్రయాణం చేయడానికి అనుమతిస్తే మరో 50 మందికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కో బస్సులో కేవలం 110 నుంచి 120 మంది మాత్రమే ప్రయాణం చేయొచ్చు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 1.50 లక్షల మంది ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఇప్పటి వరకు 40 శాతం మహిళలు ఉంటారని అంచనా. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారమే 70 శాతానికి పైగా మహిళా ప్రయాణికులు పెరగవచ్చని చెబుతున్నారు. ఆ లెక్కన చూసినా రోజుకు 1.05 లక్షల మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇంతమంది మహిళలు ప్రయాణం చేయడానికి కేవలం 325 బస్సులు ఎలా సరిపోతాయో ప్రభుత్వమే చెప్పాలి. ఆధ్యాత్మిక ప్రాంతాలకు ఉచితం లేనట్లే... రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా జిల్లా నుంచి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. విజయవాడ, గుంటూరు ప్రయాణికులు మార్కాపురం వచ్చి వయా దోర్నాల ఘాట్ మీదుగా శ్రీశైలం వెళ్లాలి. అయితే ఘాట్ రోడ్డులో ప్రయాణాలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అనుమతించడంలేదు. దీంతో శ్రీశైలం వెళ్లాలనుకున్న భక్తులకు టికెట్ చెల్లించి వెళ్లాల్సి వస్తుంది. జిల్లాలో బ్రహ్మంగారి మఠం, భైరవకోన, మాలకొండ, శింగరకొండ, సింగరాయకొండలోని దేవాలయాలకు వెళ్లాలంటే ఉచిత బస్సు సౌకర్యం లేకుండా పోతుంది. మాలకొండ, భైరవకోన, శింగరకొండలకు బస్సు సౌకర్యం లేదు. కనుక ఉచిత బస్సు పథకం వర్తించే అవకాశం లేదు. ప్రతి శనివారం మాలకొండకు మహిళా భక్తులు విపరీతంగా వస్తుంటారు. అయినా ఉచిత బస్సు సౌకర్యం ఉండదు కనుక టికెట్ పెట్టుకొని వెళ్లక తప్పదు. కొత్తపట్నం బీచ్కు కూడా బస్సు సౌకర్యం లేదు. కొత్తపట్నం వరకు బస్సులో వెళ్లి అక్కడ నుంచి బీచ్కు ఆటోల్లో వెళ్లాలి. రామాయపట్నం సంగతి కూడా ఇంతే. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ఒంగోలు వచ్చి తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళుతుంటారు. తిరుమల ఘాట్ రోడ్డుకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రాలకు ఉచిత బస్సు సౌకర్యం ఎందుకు కల్పించడంలేదో పాలకులు జవాబు చెప్పాలని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. బస్సు డిపోల్లో సౌకర్యాలు నిల్... జిల్లాలో మొత్తం ఐదు బస్సు డిపోలు ఉన్నాయి. ఒంగోలు, పొదిలి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి బస్సు డిపోల్లో సౌకర్యాలు లేవు. మార్కాపురం ఆర్టీసీ డిపో దాదాపుగా శిథిలావస్థకు చేరుకుంది. గిద్దలూరు డిపో కూడా అధ్వానంగా తయారైంది. రాష్ట్రంలో మొత్తం 129 బస్సు డిపోలు ఉండగా వాటిలో చివరి రెండు స్థానాల్లో మార్కాపురం, గిద్దలూరు ఆర్టీసీ డిపోలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పొదిలి డిపోలో నిలబడడానికే స్థలం ఉండదు. కనిగిరి డిపో పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం మరుగుదొడ్డి సౌకర్యాలు లేవు. మంచినీటి వసతి లేదు. భారీ సంఖ్యలో మహిళలు తరలివస్తే వెయింటింగ్ గదులు లేవు. కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సు డిపోల్లో సౌకర్యాలు మెరుగుపరచకుండా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు అరకొర సౌకర్యాలతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ప్రయాణికుల అవస్థలను గాలికి వదిలేయడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్టీసీ బస్సు డిపోల్లో ఇప్పటికే దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయి. ఉచిత బస్సు సౌకర్యం కోసం ఎక్కువ సంఖ్యలో మహిళలు తరలివస్తే దొంగలకు అడ్డే ఉండదు. ఒంగోలు ఆర్టీసీ డిపోలో ఉన్న ఔట్ పోలీసు స్టేషన్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఒకరిద్దరు హోంగార్డులతో నెట్టుకొస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లోని ఆర్టీసీ డిపోల్లో ప్రయాణికుల రక్షణ ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. -
తిరంగా..ఘనంగా
మార్కాపురం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో దీక్షా యూత్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తిరంగా ర్యాలీలో భాగంగా వెయ్యి మీటర్ల జాతీయ జెండా ప్రదర్శనను సబ్కలెక్టర్ వెంకట సహదిత్ త్రివినాగ్ సబ్కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. యువతలో దేశభక్తి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ కోర్టుసెంటరు, కంభం సెంటరు, పాత బస్టాండు మీదుగా సాగింది. మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, తహశీల్దార్ చిరంజీవి, సీఐ పీ సుబ్బారావు, సొసైటీ ప్రతినిధి సాయి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
మూడు రకాల బస్సు సర్వీసులకే ఉచితం
జిల్లాలో పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులకు మాత్రమే ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుంది. అంటే దాదాపుగా దూర ప్రాంతాలకు ఉచితం లేనట్టేనని చెప్పవచ్చు. జిల్లా నుంచి నెల్లూరు జిల్లా కావలి, కందుకూరు, పల్నాడు జిల్లా వినుకొండ వరకు పల్లెవెలుగు బస్సులు నడుస్తున్నాయి. అయితే ఒంగోలు నుంచి గుంటూరు, విజయవాడకు ప్రయాణాలు చేసే వాళ్లే ఎక్కువగా ఉంటారు. వారికి ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నప్పటికీ అందులో నాన్ స్టాప్ బస్సులకు ఉచిత సౌకర్యం కల్పించడం లేదు కనుక టికెట్ కొనుక్కొని ప్రయాణించాల్సి ఉంటుంది. ఆటోవాల ఉపాధి సంగతేంటి... జిల్లాలో 20 వేల మందికి పైగా ఆటోవాలాలు ఉన్నారు. ఒక్క ఒంగోలు నగరంలోనే 5 వేల మంది ఆటోలపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇప్పడు ఉచిత బస్సు పథకం ప్రారంభం కానుండడంతో తమ ఉపాధి ఎక్కడ దెబ్బతింటుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆటోవాలాలకు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వాహన మిత్ర ద్వారా ఏడాదికి రూ.25 వేల సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. లేకపోతే తమకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే బీఎన్ఎస్ చట్టాన్ని సవరణ చేయాలని, మోటారు వాహన చట్టాన్ని సవరణ చేసి జరిమానాలను తగ్గించాలని కోరుతున్నారు. ఆటోవాల జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకపోతే పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. -
సమస్యా భరితమే!
సముచితం కాదు.. కనిగిరిరూరల్: రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం షరతులు, పరిమితులతో తుస్సుమనిసించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని గొప్పగా చెబుతున్న కూటమి సర్కారు అటు అక్కచెల్లెమ్మలనే కాదు ఇటు అద్దె బస్సుల యజమానులనూ నిరుత్సాహంలోకి నెట్టింది. ఆర్టీసీలో తొమ్మిది రకాల సర్వీసులు ఉన్నప్పటికీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి జిల్లాలో అల్ట్రా పల్లె వెలుగు సర్వీసులు వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలోనూ లేకపోవడం గమనార్హం. బస్సులు గుల్లవుతాయ్.. ఉచిత ప్రయాణానికి నిర్ణయించిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో 35 నుంచి 40 శాతం వరకు అద్దె(హైర్) బస్సులున్నాయి. అయితే వీటి యజమానులు ఉచితం మాటున తమకు జరిగే నష్టాన్ని ఊహించుకుని తీవ్ర ఆలోచనలో పడి ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఒంగోలు డిపోలో సుమారు 50, కనిగిరి డిపోలో 27, మార్కాపురం డిపోలో 22, పొదిలి డిపోలో 20 వరకు హైర్ బస్సులు.. వెరసి 4 డిపోల పరిధిలో 120 వరకు అద్దె బస్సులున్నాయి. వీటిని పూర్తిగా మహిళల ఉచిత ప్రయాణానికి వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కనిగిరి డిపోలో మొత్తం 107 బస్సులు ఉండగా, ఉచిత ప్రయాణానికి కేటాయించిన 47 బస్సుల్లో సగం అద్దెవే కావడం గమనార్హం. హైర్ బస్సుల్లో పల్లె వెలుగు సీటింగ్ సామర్థ్యం 55 నుంచి 60 మంది వరకు, ఎక్స్ ప్రెస్ల్లో 45 నుంచి 50 మంది వరకు ఉంటుంది. లీటర్ డీజిల్కు 5 నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రయాణికుల రద్దీ పెరిగితే బస్సుల మైలేజ్ పడిపో‘వడమే కాకుండా మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుతుంది. మైలేజ్ షార్టేజ్ వస్తే ఆ భారాన్ని యజమానులే భరించాలన్నది నిబంధన. ఈ నేపథ్యంలో అద్దె బస్సుల నిర్వహణ తలకు మించిన భారంగా మారుతుందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీతో కుదుర్చుకున్న అగ్రిమెంట్లో ‘ఉచిత ప్రయాణం’ ప్రస్తావనే లేదని, దీనిపై చర్చించాల్సి ఉందని కొందరు యజమానులు చెబుతున్నారు. ఇన్ని సమస్యల నడుమ ‘మహిళల ఉచిత బస్సు ప్రయాణం’కు అద్దె బస్సుల యజమానులు ఏమాత్రం సహరిస్తారో వేచి చూడాల్సిందే. ప్రణాళికాబద్ధంగా లేని సీ్త్ర శక్తి పథకం ఆరంభశూరత్వమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. మహిళకు ఉచిత ప్రయాణంపై హైర్ బస్సుల యాజమానులు హడల్ రద్దీ పెరిగి బస్సులు దెబ్బతింటాయని ఆందోళన ఫ్రీ బస్సుల్లో 40 శాతం అద్దె ప్రాతిపదికన తిప్పేవే.. జిల్లాలో 4 డిపోల్లో సుమారు 120 హైర్ బస్సులు -
ప్రకాశం
సముచితం కాదు.. సమస్యా భరితమేఉచిత బస్సు ప్రయాణం అమలుపై మహిళలు, అద్దె బస్సుల యజమానులను నిరుత్సాహంలోకి నెట్టింది. 7అనధికార లేఔట్ల క్రమబద్ధీకరణకు అవకాశంఅనధికార లేఔట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్ఆర్ఎస్ మంచి అవకాశమని జేసీ అన్నారు. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో జల్లులు పడవచ్చు.– 8లో.. గురువారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 202528 /24గరిష్టం/కనిష్టం -
హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్టు
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ నాగరాజు మార్కాపురం టౌన్: మార్కాపురం ఆర్టీసీ డిపోలో ఈనెల 11వ తేదీన ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన బండి బాపిరెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన క్రిష్టిపాటి వెంగళరెడ్డిని ఇక్కడి కారు స్టాండు వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ డాక్టర్ నాగరాజు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో సీఐ పి.సుబ్బారావుతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈదర గ్రామానికి చెందిన బండి బాపిరెడ్డి, క్రిష్టిపాటి వెంగళ్రెడ్డి మధ్య పాతకక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో వెంగళరెడ్డి కుమారుడు కొండారెడ్డి హత్యకు గురికాగా బాపిరెడ్డిపై కేసు నమోదైంది. మార్కాపురంలోని జిల్లా ఆరో అదనపు న్యాయస్థానంలో కేసు విచారణలో ఉంది. తన కుమారుడిని కళ్లెదుటే చంపడాన్ని జీర్ణించుకోలేకపోయిన వెంగళరెడ్డి.. ఎక్కడో ఉంటూ కోర్టుకు హాజరవుతున్న బాపిరెడ్డిని హతమార్చేందుకు పథకం రచించాడు. ఈనెల 11న బాపిరెడ్డి కోర్టుకు హాజరై బ్రహ్మంగారిమఠం వెళ్లేందుకు బస్సులో ఎక్కి కూర్చున్నాడు. వెంగళరెడ్డి తనను ఎవరూ గుర్తుపట్టకుండా ప్యాంటు, షర్టు ధరించి, ముఖానికి మాస్కు పెట్టుకుని బస్సులో కూర్చుని ఉన్న బాపిరెడ్డి కళ్లలో కారం కొట్టాడు. అప్రమత్తమైన బాపిరెడ్డి గట్టిగా కేకలు వేస్తూ కిందకు దిగడం, స్థానికులు గుమిగూడటంతో వెంగళరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాపిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పట్టణ, రూరల్ ఎస్సైలు సైదుబాబు, అంకమరావుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 12 వెంగళరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. -
ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించాలి
● ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్కుమార్రెడ్డి డిమాండ్ ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు చిన్నపురెడ్డి కిరణ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ కార్యాలయంలో సంఘ జిల్లా కార్యదర్శి గోపీకృష్ణ ఆధ్వర్యంలో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సంఘ కోశాధికారి రంగారెడ్డి, ఒంగోలు టౌన్ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు రజిత మానస, రోడ్డు భవనాల శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆటో బోల్తా.. మహిళ మృతి ● మరో ఏడుగురికి గాయాలు సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్): వేగంగా వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఒక వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. తాళ్లూరు నుంచి ఒంగోలు వస్తున్న ప్యాసింజర్ ఆటో పేర్నమిట్ట చెరువు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒంగోలు ముంగమూరు రోడ్డులో నివసిస్తున్న ఒడ్డువానికుంట గ్రామానికి చెందిన సండ్ర కోటమ్మ(65) అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో స్వల్పగాయాలైన నలుగురిని జీజీహెచ్కు, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఒంగోలు తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స.హ చట్టంపై అవగాహన ఉండాలి
● జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ వరలక్ష్మి ఒంగోలు సబర్బన్: ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సహాయ మార్కెటింగ్ సంచాలకులు ఎం.వరలక్ష్మి సూచించారు. ఈ మేరకు పాత గుంటూరు రోడ్డులోని జిల్లా కార్యాలయంలో బుధవారం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులకు, ఏడీ కార్యాలయంలోని సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులు పాల్గొన్నారు. బ్లాక్బర్లీ అదనపు కొనుగోలుకు వినతి● సమావేశంలో మాట్లాడుతున్న జేసీ గోపాలకృష్ణఒంగోలు సబర్బన్: జిల్లాలో బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుకు అదనపు కేటాయింపులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఛాంబర్లో జిల్లా స్థాయి పొగాకు కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు అంశాలను ఆమోదించారు. కమిటీలో ఆమోదించిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 930 మెట్రిక్ టన్నుల పొగాకును జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వెంటనే ఆమోదించాలని కమిటీని ఆదేశించారు. అవసరమైన చోట రీ స్టాకింగ్ అండ్ రీ క్లాసిఫికేషన్ చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లాకు పొగాకు కొనుగోలుకు అదనపు కేటాయింపులు కావాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపించేందుకు డీఎల్పీసీ ఆమోదం తెలిపిందన్నారు. సమావేశంలో మార్క్ఫెడ్ డీఎం కాకర్ల హరికృష్ణ పాల్గొన్నారు. జిల్లా వాలీబాల్ జట్టు ఎంపిక ఒంగోలు సిటీ: రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టును బుధవారం త్రోవగుంట జెడ్పీ హైస్కూల్లో ఎంపిక చేసినట్లు వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎండీ హజీరాబేగం తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి వంద మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ఎంపికలో ప్రతిభ కనబరిచిన ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరు ఈనెల 18న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. బాలుర జట్టులో ఏ రాకేష్ (ఏ.పీ.ఎంజీబీ బీసీ వెల్ఫేర్ వేటపాలెం), బీ రాజేష్ (జెడ్పీహెచ్ఎస్ చాకిచెర్ల), బీ సెల్వరాజ్ (జెడ్పీహెచ్ఎస్ త్రోవగుంట), వీ మహేష్ (చాకిచెర్ల), డీ రవివర్మ (జెడ్పీహెచ్ఎస్ పాకల), సీహెచ్ హేమంత్ (పాకల), ఇద్దరిని స్టాండ్ బైగా ఆర్ కార్తికేయ (ఆలకూరపాడు), ఎన్ సాయి వినేష్ (ఆలకూరపాడు) ఎంపిక చేసినట్లు తెలిపారు. బాలికల జట్టులో వీ నందన (జెడ్పీహెచ్ఎస్ ఆలకూరపాడు), పీ సుచరిత (ఆలకూరపాడు), కే జెస్సికా (ఆలకూరపాడు), టీ రిషిత ప్రియ (గవర్నమెంట్ హైస్కూల్ టంగుటూరు), కే గాయత్రి (జెడ్పీహెచ్ఎస్ గరల్స్ వేటపాలెం), ఏ పూజిత (జెడ్పీహెచ్ఎస్ బండ్లమూడి), స్టాండ్ బైగా ఐ వెంకట ప్రణతి (జెడ్పీహెచ్ఎస్ బండ్లమూడి) ఎంపికయ్యారు. ట్యాక్స్ కన్సల్టెంట్స్ జిల్లా కమిటీ ఏకగ్రీవం ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. స్థానిక సంతపేటలోని టీటీడీ కళ్యాణ మండపంలో బుధవారం జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా కమిటీ అధ్యక్షుడుగా దివి రోశయ్య, కార్యదర్శిగా సీహెచ్ఏబీఎస్ నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ కోశాధికారిగా కేవీ.సుబ్రహ్మణ్యం, వైస్ ప్రెసిడెంట్గా వై.వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీలుగా కే.భార్గవ ప్రతాప్, వీఎస్.రాఘవేంద్ర కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.మణికంఠ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఏ.రమేష్ రెడ్డి, ఆర్.తేజ సూర్య కుమార్లు ఎన్నికై న వారిలో ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికై న కమిటీ చేత రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి నెల్లూరు డివిజన్ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ వై.కిరణ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఎం.సత్య ప్రకాష్, డిప్యూటీ డైరెక్టర్ డీఎంజీఓ టి.రాజశేఖర్, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ రావులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పనిచేయండి.. పన్ను పరిధిని విస్తరించండి
● జీఎస్టీ వసూళ్లపై సమీక్షలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: గూడ్స్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) కోసం ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో కమర్షియల్ ట్యాక్స్, ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రూ.40 లక్షల టర్నోవర్(వస్తువుల విషయంలో), రూ.20 లక్షల టర్నోవర్(సేవల విషయంలో) దాటిన వ్యాపార సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. పన్ను బకాయిదారుల ఆస్తుల వివరాలను కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి అందజేయాలని జిల్లా రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పన్ను ఎగవేతదారులపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. రూ.2.5 లక్షల విలువకు మించిన సరఫరా ఒప్పందాలపై టీడీఎస్ మినహాయించి జీఎస్టీఆర్–7 ద్వారా ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. పన్ను లేకుండా గ్రానైట్, ఇతర సరుకుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రవాణా, మైనింగ్ శాఖలు కమర్షియల్ ట్యాక్స్ విభాగంతో కలిసి పనిచేయాలని సూచించారు. రూ.10 లక్షల వార్షిక టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలు, డాక్టర్లు, ఆర్కిటెక్టులు ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ వై.కిరణ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఎం.సత్య ప్రకాష్, ఒంగోలు–1, ఒంగోలు–2, మార్కాపురం సర్కిళ్ల అసిస్టెంట్ కమిషనర్లు, మైన్స్ డీడీ రాజశేఖర్, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర రావు, డీఈఓ కిరణ్ కుమార్, డీటీసీ ఆర్.సుశీల ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కళ్లలో ఆనందం కోసం..
కొత్తపట్నం: రెడ్ బుక్ రాజ్యాంగం జడలు విప్పుతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దరిమిలా వైఎస్సార్ సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. బుధవారం కొత్తపట్నం సమీపంలోని నల్లూరి గార్డెన్లో టీడీపీ నేత కుమారుడి వివాహానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వస్తున్నాడని ఆ పార్టీ నేతలు పంచాయతీ కార్యదర్శితో కలిసి ఓవరాక్షన్ చేయడంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చంద్రబాబు మోసపూరిత హామీలపై కొత్తపట్నం ప్రధాన రహదారిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం ఆ పార్టీ నేతల ఆగ్రహానికి కారణమైంది. సొంత ఇళ్లపై ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను కూడా తొలగించాల్సిందేనని, తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉందని కార్యదర్శి చెప్పడంతో వైఎస్సార్ సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. శ్మశానంలో ఫెన్సింగ్ రాళ్లకు ప్రజల సొమ్ముతో పసుపు రంగు ఎలా వేశారని ప్రశ్నించారు. శ్రీఅన్ని పార్టీల వారు ఫ్లెక్సీలు కట్టుకుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు కొత్త సంస్కృతి తీసుకొస్తున్నారశ్రీని నిలదీశారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టుకు వెళ్తామని హెచ్చరిస్తున్నా కార్యదర్శి మాత్రం బలవంతంగా ఫ్లెక్సీలు తొలగించారు. కొత్తపట్నంలో పెళ్లికి ఎమ్మెల్యే దామచర్ల వస్తున్నాడని వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీల తొలగింపు ఇళ్లపై కట్టిన ఫ్లెక్సీలు సైతం పీకేయడంపై వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం -
బీ అలర్ట్..!
ఒంగోలు సబర్బన్: రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తన కార్యాలయం నుంచి బుధవారం తహశీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు, కూలిపోయే అవకాశం ఉన్న పాత ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. చిన్నారులు, మహిళలు, గర్భిణులు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె చెప్పారు. స్థానికంగా ఉన్న కాలువలు, వాగులు, వంకలు, ఇతర నీటి వనరులు ఉధృతంగా ప్రవహిస్తున్న చోట అటువైపుగా వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వీఆర్ఏ, వీఆర్వోలను ఆయా ప్రాంతాల్లో కాపలాగా ఉంచాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేలా అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా సమస్య ఎదురైనా, సహాయం అవసరమైనా ప్రజలు వెంటనే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చేలా కలెక్టరేట్లో 1077 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 16వ తేదీ వరకు 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమును కూడా ఏర్పాటు చేశారు. రెవెన్యూ, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, వైద్య, పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఈ కంట్రోల్ రూములో షిఫ్టులు వారీగా పని చేసేలా విధులు కేటాయించారు. ఇదేవిధంగా మండల, డివిజన్ల స్థాయిలోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అత్యధికంగా మద్దిపాడులో 198.4 మి.మీ వర్షం జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు ఒక్కరోజులో కురిసిన వర్షం ఆగస్టు నెల మొత్తంలో కురవాల్సిన సరాసరి వర్షపాతంలో 28.6 శాతంగా నమోదైంది. జిల్లాలో అత్యధికంగా మద్దిపాడు మండలంలో 198.4 మిల్లీ మీటర్ల వర్షం (19.8 సెంటీ మీటర్లు) కురిసింది. అత్యల్పంగా కొమరోలు మండలంలో కేవలం 4 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఇక మండలాల వారీగా నాగులుప్పలపాడులో 103.4 మి.మీ, కొత్తపట్నంలో 100.6, ఒంగోలు రూరల్ 62.2, ఒంగోలు అర్బన్ 62.2, దర్శి 61.6, సంతనూతలపాడు 46.8, కురిచేడు 41.4, చీమకుర్తి 41.4, తాళ్లూరు 30, మర్రిపూడి 21.8, హనుమంతునిపాడు 21.8, పుల్లలచెరువు 21, త్రిపురాంతకం 20.6, పొదిలి 16.8, యర్రగొండపాలెం 16.4, కొండపి 14.4, టంగుటూరు 14.2, సింగరాయకొండ 13.8, దొనకొండ 13.4, అర్ధవీడు 13.2, పెద్దారవీడు 12.8, కొనకనమిట్ల 12.6, బేస్తవారిపేట 12.6, సీఎస్పురం 12.6, మార్కాపురం 12.2, కంభం 11.8, జరుగుమల్లి 10.4, తర్లుపాడు 8.6, ముండ్లమూరు 8.4, కనిగిరి 8, పామూరు 6.8, పొన్నలూరు 6.6, వెలిగండ్ల 6, రాచర్ల 5.4, దోర్నాల 4.6, పెదచెర్లోపల్లి 4.56, గిద్దలూరు 4.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోసారి పొంగిన దొంగలవాగు: పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండల పరిధిలోని పలు వాగులు పొంగి ప్రవహించాయి. దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దొంగలవాగు మరో సారి ఉధృతంగా ప్రవహించటంతో కర్నూలు రహదారిలో కొత్తూరు వద్ద ఉన్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ ప్రాంతం వద్ద బుధవారం ఉదయం గంట పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ● రాచర్ల మండలంలో గుండ్లకమ్మ వాగు పరవళ్లు తొక్కుతూ రామన్నకతువ నిండి దిగువకు ప్రవహిస్తోంది. ఆకవీడులోని తురకవాని చెరువు, దొడ్డేని చెరువులు నిండి అలుగుపారుతున్నాయి. భారీ వర్షాల హెచ్చరికలతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ కలెక్టరేట్లో కంట్రోల్ రూంతో పాటు 1077 నంబరుతో టోల్ ఫ్రీ ఏర్పాటు అత్యధికంగా మద్దిపాడులో 198.4 మి.మీ వర్షపాతం నమోదు దొంగలవాగు పొంగి కర్నూలు మార్గంలో గంట పాటు ట్రాఫిక్జాం -
బోగస్ కంపెనీలకు భూములు కట్టబెట్టారు
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్యఒంగోలు టౌన్: రాష్ట్రంలోని ఖరీదైన భూములను ముఖ్యమంత్రి చంద్రబాబు బోగస్ కంపెనీలకు కట్టబెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. స్థానిక మల్లయ్య లింగం భవన్లో సీపీఐ రాష్ట్ర మహాసభల కరపత్రాలను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కంపెనీనైతే బోగస్ కంపెనీ అంటూ ఆరోపణలు చేశారో అధికారంలోకి వచ్చిన తరువాత అదే కంపెనీకి కరేడు భూములను కట్టబెట్టడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. విశాఖపట్నంలో 99 పైసలకే రూ.420 కోట్ల విలువ చేసే ఎకరా భూమిని కట్టబెట్టారని విమర్శించారు. ఏడాదికి మూడు పంటలు పండే వందల ఎకరాల భూములను సూట్కేస్ కంపెనీలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. 53 వేల ఎకరాల్లో అమరావతి నిర్మాణం అని చెప్పిన చంద్రబాబు నేడు లక్ష ఎకరాలను ఎవరి ప్రయోజనాల కోసం సేకరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అమరావతికి కేవలం 40 కిలోమీటర్ల దూరం ఉన్న గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయకుండా 33 కిలో మీటర్ల దూరంలో మరో ఎయిర్ పోర్టు నిర్మించేందుకు 56 ఎకరాలను సేకరించడం వెనక మతలబేమిటో చెప్పాలన్నారు. మదనపల్లి హేచరీలో ఎయిర్ పోర్టు నిర్మించి దొంగబాబా రాందేవ్కు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ, అమిత్ షాలతో కలిసి దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. పీ4 పేరుతో చంద్రబాబు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ఆర్థిక, సామాజిక మూలాల్లో మార్పు తీసుకొని రాకుండా పేదరికం రూపుమాపడం సాధ్యం కాదన్నారు. సీపీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా వెయ్యి మంది కళాకారులు, 100 పాటలతో, 100 డప్పులతో 100 కళారూపాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 23వ తేదీ భారీ ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
అనధికార లేఔట్ల క్రమబద్ధీకరణకు అవకాశం
ఒంగోలు సబర్బన్: అనధికార లేఔట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్ఆర్ఎస్ మంచి అవకాశమని ఒడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్పై సర్వేయర్లతో పాటు క్రెడాయ్, నారెడ్కో, బై, కాన్ఫెడరేషన్ ఆఫ్ లైసెన్స్డ్ ఇంజినీర్స్, సర్వేయర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్, ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్స్, వెల్ఫేర్ అసోసియేషన్స్, ఎన్జీఓస్, ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్స్, ఇతర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30.06.2025కి ముందుగా వేసిన అనధికార లేఔట్లలో ప్లాట్లను చట్టబద్ధం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప అపరాధ రుసుంతో ఎల్ఆర్ఎస్ ద్వారా అవకాశం కల్పించిందని చెప్పారు. జూలై 26వ తేదీ నుంచి 45 రోజుల్లోగా పూర్తి రుసుం చెల్లిస్తే 10 శాతం రాయితీ, 45 రోజుల తర్వాత 90 రోజుల్లోపు చెల్లిస్తే 5 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అక్టోబర్ 24వ తేదీలోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. సమావేశంలో ఒడా ప్లానింగ్ ఆఫీసర్ బాబూరావుతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
వార్డెన్ బదులు బినామీ వార్డెన్ విధులు
● బాలికల హాస్టల్ను తనిఖీ చేసిన డిప్యూటీ కలెక్టర్ చీమకుర్తి: హాస్టల్ విధులు నిర్వహించాల్సిన వార్డెన్ తన ప్లేస్లో బినామీ వార్డెన్ను పెట్టుకొని తన విధులకు తరచూ డుమ్మా కొడుతున్నట్లు డిప్యూటీ కలెక్టర్ పార్ధసారధి విచారణలో తేటతెల్లమైంది. మాదిగ సంక్షేమ పోరాట సమితి అధ్యక్షుడు కొమ్ము సుజన్ కలెక్టర్కు చేసిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో డిప్యూటీ కలెక్టర్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి పార్ధసారధి బుధవారం చీమకుర్తిలోని ఎస్సీ బాలికల హాస్టల్ను ఆకస్మికంగా సందర్శించారు. ఇటీవల హాస్టల్లో 9వ తరగతి చతువుతున్న బాలిక జడను పూర్తిగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించటంతో హాస్టల్లోని దయనీయ పరిస్థితులపై కొమ్ము సుజన్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తనిఖీకి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ హాస్టల్లోని బాలికలను విడివిడిగా విచారించి హాస్టల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ ఎప్పుడో ఒకసారి వస్తుందని, ఆమె బదులు మరొక మహిళను బినామీగా పెట్టి హాస్టల్ బాధ్యతలను పర్యవేక్షించేలా చేసినట్లు గుర్తించారు. హాస్టల్లో మెనూ పాటించటం లేదని, పిల్లల కడుపు కాలుస్తున్నారని, తాగటానికి సురక్షితమైన మంచినీరు లేదని, 180 మంది పిల్లలకు ఒకటి రెండు బాత్రూములు మాత్రమే ఉన్నాయని, హాస్టల్లోని దయనీయ పరిస్థితుల వివరాలను డిప్యూటీ కలెక్టర్ విచారణలో స్పష్టమైంది. విచారణ అనంతరం మాదిగ సంక్షేమ పోరాట సమితి నాయకులు కొమ్ము సుజన్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు హాస్టల్లోని పరిస్దితులపై డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మార్కాపురంలో ఇసుక మాఫియా
ఒంగోలు సబర్బన్: మార్కాపురంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని మార్కాపురం లారీ అసోసియేషన్ అధ్యక్షుడు కాశీరాం సింగ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు మార్కాపురం నుంచి వచ్చిన లారీ అసోసియేషన్ నాయకులు, సభ్యులు ప్రకాశం భవన్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాశీరాం సింగ్ మాట్లాడుతూ మార్కాపురంలో ఇసుక డిపో నుంచి అధిక ధరలకు ఇసుకను అమ్ముతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. మార్కాపురం ప్రజలను ఇసుక మాఫియా నుంచి కాపాడాలంటూ నినాదాలు చేశారు. అత్యధిక ధరలకు ఇసుకను విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ఒక్కో టన్నుకు రూ.400 కమీషన్ రూపంలో తీసుకుంటున్నారని, యార్డ్ నిర్వాహకుడు గొట్టిపాటి సూరి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి వైఖరి కూడా సరిగా లేదంటూ ధ్వజమెత్తారు. మైన్స్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పటంతో ఒంగోలు వచ్చామని అయితే అధికారులు స్పందించలేదన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఉప్పలదిన్నె శ్రీనివాస రావు, బాలాజీ సింగ్, పఠాన్ ఖాన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రకాశం భవన్ ముందు లారీ అసోసియేషన్ ధర్నా మార్కాపురం ఎమ్మెల్యే పక్షపాతం చూపిస్తున్నారని ధ్వజం -
వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ శక్తులు
● వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దాడాల సుబ్బారావుకనిగిరిరూరల్: దేశంలో వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తులు ప్రవేశించి, పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాడాల సుబ్బారావు అన్నారు. స్థానిక వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా 17వ మహాసభల సందర్భంగా రెండో రోజు ప్రతినిధుల సభ బడుగు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దడాల సుబ్బారావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గి పోవడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లేక, అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడి కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో పనులు తగ్గిపోవడం వలన వ్యవసాయ కూలీలు పనులు లేక అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలకు రోజుకు రూ.600 చెల్లించాలని, ఏడాదికి 200ల రోజులు పనిదినాలు పెంచాలని, పనులు లేని రోజుల్లో ఉపాధి కూలీలకు నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలని, నిరుద్యోగ భృతి రూ.3 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు జాలా అంజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు నెరసుల వెంకటేశ్వర్లు, వెల్లంపల్లి ఆంజనేయులు, గుమ్మా బాల నాగయ్య, మల్లెల సంపూర్ణ, ఉబ్బా వెంకటేశ్వర్లు, కంకణాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
బెధరగొట్టి..
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025కూటమి పార్టీల్లో ఇసుక తుఫాన్ చెలరేగుతోంది. అధికారంలోకి రావడంతోనే నాయకులు ఇసుక దందాకు తెరతీశారు. ఇప్పుడదే వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఉచితం మాటున జరుగుతున్న దోపిడీలో వాటాల కోసం మార్కాపురంలో టీడీపీ జనసేన నేతలు రోడ్డెక్కారు. ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. జిల్లాలో ఇది హాట్టాపిక్గా మారింది. అధికార పార్టీ నేతల మధ్య చెలరేగిన ఈ దుమారం ఇష్టారాజ్యంగా జరుగుతున్న ఇసుక అక్రమాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. న్యూస్రీల్ -
సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
● ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డిఒంగోలు సిటీ: పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గం చేపట్టిన ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమం ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి రంగారెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, విద్యాశాఖ సిబ్బంది శివశంకర్, వేణు, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు. -
నిబద్ధతతో విధులు నిర్వర్తించండి
ఒంగోలు టౌన్: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలో పదోన్నతి పొందిన ఉద్యోగులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆ శాఖ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ సూచించారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలో విధులు నిర్వహిస్తూ 99 మంది ఎస్సైలుగా, ఒకరు సీఐగా, ఇద్దరు ఏఈఎస్గా పదోన్నతి పొందారు. వీరికి మే 15 నుంచి మూడు నెలలపాటు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ ముగింపు సందర్భంగా మంగళవారం వీడ్కోలు సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. పదోన్నతి హోదాతోపాటు బాధ్యతలను కూడా పెంచుతుందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని సూచిస్తూ అభినందనలు తెలిపారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్ జీఆర్ రాధిక, జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ దయా సాగర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం, పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ డి.లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ రాహుల్దేవ్శర్మ -
బాలిక కిడ్నాప్ కలకలం
రాచర్ల/పెద్దారవీడు: పాఠశాలకు వెళ్లిన బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. పోలీసుల గాలింపు ఎక్కువ కావడంతో భయపడి పక్క మండలంలోని ఓ డంపింగ్ యార్డ్ వద్ద వదిలేసి వెళ్లిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు రాచర్ల మండలం అనుమలవీడు గ్రామానికి చెందిన మూడుమంచు గురుఅంజలి(8) అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ఉదయం 8 గంటలకు తండ్రి పాపయ్య తన కుమార్తె గురుఅంజలికి పాఠశాలలో వదిలి పెట్టి వచ్చాడు. అప్పటికే గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల సమీపంలోని రోడ్డు పక్కనే కారును నిలుపుకున్నారు. గం.8:25 కు గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల లోపలికి వచ్చి గురుఅంజలి పేరు పెట్టి పిలిచి కారులో మీ నాన్న ఉన్నాడు పిలుస్తున్నాడు రావాలని బయటికి తీసుకెళ్లి బలవంతంగా బాలికను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. పాఠశాలలో బాలిక కనబడకపోవడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పాఠశాలలో వంట చేసే వారు గుర్తుతెలియని వ్యక్తులు కారులో తీసుకుని వెళ్లారని చెప్పడంతో వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్.రఫీ ఉదయం గం.10:30 స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వెంటనే గిద్దలూరు రూరల్ సీఐ జే.రామకోటయ్య, ఎస్సై పి.కోటేశ్వరరావు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. తెలుపు అండ్ సిల్వర్ రంగు కారులో గుర్తుతెలియని వ్యక్తులు గురుఅంజలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తెలియడంతో పోలీసులు అనుమలవీడు టూ సోమిదేవిపల్లె, సంగపేట వయా బేస్తవారిపేట మండలం, జగ్గంబొట్లకృష్ణపురం వరకూ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం పంపించి అప్రమత్తం కావడంతో తాము దొరికిపోతామని భావించిన కిడ్నాపర్లు బాలికను పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామం సమీపంలో డంపింగ్ యార్డు వద్ద వదిలి వెళ్లిపోయారు. అక్కడే రోడ్డు పక్కన ఒంటరిగా నిల్చొని వచ్చిపోయే ద్విచక్ర వాహనదారులను ఆపాలని కేకలు పెడుతూ ఏడుస్తోంది. అదే సమయంలో మార్కాపురం నుంచి ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై దోర్నాలకు వెళ్తుండగా వారిని బండి ఆపాలని బాలిక కోరింది. తనను ఎవరో ఇక్కడ వదిలేసి వెళ్లారని ఏడుస్తూ చెప్పింది. దీంతో వారు పెద్దారవీడు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, బాలికను పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ నుంచి బాలికను పెద్దారవీడు ఎస్సై రాజుమోహన్రావు, ఏఎస్సై సుబ్బయ్య అనుమలవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తీసుకొచ్చి మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు సమక్షంలో బాలిక తల్లిదండ్రులైన పాపయ్య, రాజేశ్వరిలకు అప్పగించారు. కారులో ముగ్గురు యువకులు ఉన్నట్లు బాలిక పోలీసులకు తెలిపింది. పోలీసులు గాలిస్తుండటంతో బాలికను వదిలేసిన కిడ్నాపర్లు -
కేంద్ర బలగాలతో రీపోలింగ్ జరపాలి
దర్శి: భారతదేశ చరిత్రలో ఎప్పుడూ...ఎక్కడా..ఇంత దారుణమైన ఎన్నికల నిర్వహణ జరగలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ బయట నుంచి దొంగ ఓట్లు వేసేందుకు టీడీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ తెగబడ్డారన్నారు. రిగ్గింగ్ చేస్తుంటే పోలీసులే సహకరించడం దారుణంగా ఉందన్నారు. ఓటర్లను బూత్లకు వెళ్లనివ్వకుండా వాళ్లే ఓట్లు వేసుకుంటే ఎన్నికలు నిర్వహించడం ఎందుకు ..? ఎన్నికల కమిషన్ తీరు దారుణంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓటరు స్లిప్పులు లాక్కుని టీడీపీ గూండాలు వారిని తరిమి కొడుతుంటే పోలీసులు గుడ్లప్పగించి చూశారన్నారు. దొంగ ఓట్లేసుకునే వారికి పోలీసులు సహకరించడం నిస్సిగ్గుగా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల కమిషన్ పూర్తిగా ఖూనీ చేసిందని మండిపడ్డారు. ఓట్లేయించుకోనివ్వండని పోలీసుల కాళ్లు పట్టుకోవడం ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దపులి దాడిలో గేదె మృతి గిద్దలూరు రూరల్: మండలంలోని వెళ్లుపల్లె అటవీప్రాంతంలో పెద్దపులి దాడి చేయడంతో గేదె మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. మోడీ రంగస్వామి అనే రైతుకు చెందిన గేదైపె పెద్ద పులి దాడి చేయడంతో అది చనిపోయిందని రైతు వాపోయాడు. రూ.80 వేలు విలువచేసే తన గేదె మృతి చెందిందని తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు. పులి పాదాలను సమీపంలో ప్రాంతంలో అటవీ సిబ్బంది గుర్తించారు. -
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి యువకుడు బలి
దర్శి: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ యువకుడిని బలి తీసుకుంది. ఈ సంఘటన దర్శి పట్టణంలోని సందువారిపాలెం వద్ద సోమవారం చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు దిమ్మె ఏర్పాటు చేసి దానిపై ట్రాన్స్ఫార్మర్ పెట్టే విషయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం పోయింది. ఈ సంఘటనతో దర్శి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆ వివరాల్లోకి వెళితే.. సందువారిపాలెం ప్రాంతంలోని చింతలపాలెం రోడ్డు వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. దాని కోసం దిమ్మె కూడా నిర్మించారు. అయితే, ఆ దిమ్మైపె ట్రాన్స్ఫార్మర్ పెట్టకుండా పక్కనున్న ఇనుప దమ్ము చక్రాలపై ఇనుప అడ్డీలు వేసి ట్రాన్స్ఫార్మర్ పెట్టి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి నిత్యం విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అక్కడే పేడదిబ్బలు వేయడంతో పాటు జన సంచారం కూడా ఉంటోంది. చిల్ల చెట్లు పెరిగి ట్రాన్స్ఫార్మర్ పరిసరాలు భయంకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానికుడైన ఉప్పు నారాయణ (27) అనే యువకుడు గేదెలకు మేత తీసుకొస్తుండగా, అతని చేతిలోని పచ్చి మేత దంట్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లకు తగిలాయి. దీంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపించారు. నారాయణ తండ్రి ఉప్పు శ్రీను బేల్దారి మేస్త్రిగా పనిచేస్తున్నారు. నారాయణ ఏకై క సంతానం కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తూర్పుచౌటపాలెం రోడ్డులోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద పాల కేంద్రం నిర్వహిస్తున్న నారాయణకు ఇంకా వివాహం కాలేదు. ఇదిలా ఉండగా, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా విద్యుత్ అధికారులు అప్పటికప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను దమ్ము చక్రాల పైనుంచి తీసి దిమ్మైపె పెట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి యువకుడి ప్రాణం తీసిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో యువకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. విద్యుదాఘాతంతో మరో యువకుడు మృతి... అద్దంకి రూరల్: డీజే బాక్సులు విప్పుతుండగా విద్యుదాఘాతంతో మరో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి అద్దంకి మండలంలో చోటుచేసుకోగా, సోమవారం వెలుగులోకి వచ్చింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ముండ్లమూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు (25) ఫంక్షన్లకు డీజే బాక్సులు ఏర్పాటు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అద్దంకి మండలంలోని ధర్మవరం గ్రామంలో ఆదివారం రాత్రి డీజే ఏర్పాటు చేశారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత డీజే బాక్సులు విప్పేందుకు పైకెక్కి విప్పదీస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. స్థానికులు వెంటనే కారులో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి వైద్యశాలలోని మార్చురీలో ఉంచారు. -
వాహన మిత్ర నగదు ఇచ్చి ఆదుకోవాలి
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి రూ.25 వేలు ఇచ్చి ఆదుకోవాలని ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాయకులు గంటెనపల్లి శ్రీనివాసులు, తంబి శ్రీనివాసులు సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లకు బాడుగులు తగ్గుతాయని, ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతింటుందన్నారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు. పెట్రోల్, డీజిల్ చార్జీలపై విధించిన వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల ఫీజులు, పెనాల్టీలు తగ్గించాలని, ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని, వాహన కొనుగోలుకి బ్యాంకుల ద్వారా రూ.4 లక్షలు సబ్సిడీతో వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఫోర్జరీ సంతకాలతో డ్వాక్రా గ్రూపులో మార్పులు... టంగుటూరు మండలం కందులూరు గ్రామంలోని కందులూరు–1 లోని గ్రామైక్య సంఘంలో సభ్యులుగా ఉన్న డ్వాక్రా గ్రూప్ సభ్యులకు తెలియకుండా, గ్రూపుల సమావేశం జరపకుండా ఫోర్జరీ, దొంగ సంతకాలతో దారుణాలు చేశారని గ్రామైక్య సంఘం సభ్యులు మీ కోసం కార్యక్రమంలో కలిసి అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు సమర్పించారు. వెలుగు సీసీ చెన్నుపాటి కవిత నిర్వహణ బాధ్యుల పేర్లను మార్చి అక్రమాలకు పాల్పడిందన్నారు. కవితపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మీ కోసం కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం నాయకులు బొట్ల సుబ్బారావుతో పాటు డ్వాక్రా గ్రూపు సభ్యులు ఉన్నారు. అక్రమంగా వేసిన రొయ్యల చెరువులు తొలగించాలి: కొత్తపట్నం మండలం అల్లూరు పంచాయతీ పరిధిలోని చింతల వద్ద (టిడ్కో ఇళ్లకు ఆనుకొని) అక్రమంగా వేసిన రొయ్యల చెరువులను తొలగించాలని చింతలకు చెందిన డీఎల్ఎస్వీ పీఎల్వీ శింగంనేని ఆంజనేయులు మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. చింతలకు చెందిన మంచినీటి చెరువుకు ఆనుకొని వాన్పిక్కు చెందిన భూముల్లో గ్రామానికి చెందిన శింగంనేని చంద్రశేఖర్ రావు అక్రమంగా రొయ్యల చెరువులు సాగు చేస్తున్నాడన్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా విద్యుత్ అధికారులు అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు కూడా ఇచ్చారని చెప్పారు. అధికార పార్టీ అండదండలతో అక్రమంగా రొయ్యల చెరువులు సాగు చేస్తున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. -
No Headline
రాచర్ల: మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానం సమీపంలోని నీటిగుండం వద్ద గుండ్లకమ్మవాగు ఉధృతంగా పరుగులు పెడుతోంది. ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా లక్షమ్మవనం సమీపంలోని సిమెంటు రోడ్డుపై నుంచి గుండ్లకమ్మవాగు సోమవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎత్తయిన కొండల నుంచి వేగంగా నీటి గుండంలోకి జారుతున్న జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దేవస్థానం సమీపంలోని నీటిగుండం వద్దకు పర్యాటకులకు అనుమతించకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు. -
సౌత్ ఇండియా రోల్బాల్ టోర్నమెంట్కు ఇద్దరు ఎంపిక
ఒంగోలు: సౌత్ ఇండియా రోల్బాల్ టోర్నమెంట్కు ఇద్దరు చిన్నారులు ఎంపికై నట్లు ప్రకాశం జిల్లా రోల్బాల్ ఇన్చార్జి ఏ. అనీల్కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7 నుంచి 10 వరకు తణుకులో జరిగిన రాష్ట్ర స్థాయి క్యాంప్నకు ఎంపికై న వీరు అక్కడ అత్యంత ప్రతిభ కనబరిచి అండర్ 11 బాలుర విభాగంలో పిక్కిలి వరుణ్, బాలికల విభాగంలో ప్రత్తిపాటి సిదీక్షలు సౌత్ ఇండియా టోర్నమెంట్కు ఎంపికయ్యారు. వీరు సెప్టెంబర్ 6, 7 తేదీల్లో చైన్నెలో జరగనున్న సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొంటారు. ఎంపికై న ఇద్దరు చిన్నారులు ప్రకాశం జిల్లాకు చెందిన వారు కావడం తమకు మరింత సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొంటూ ఇద్దరు చిన్నారులను, కోచ్ గుర్రం అనీల్కుమార్లను ఆయన అభినందించారు. -
రాష్ట్రాన్ని దోచేస్తున్న చంద్రబాబు
త్రిపురాంతకం (యర్రగొండపాలెం): మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకునే పనిలో పడ్డారని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. త్రిపురాంతకంలోని ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో సోమవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మండల పార్టీ కన్వీనర్ సింగారెడ్డి పోలిరెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల ఆర్తనాదాలు కూటమి ప్రభుత్వానికి వినిపించడంలేదని, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు కూటమి ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పిన పచ్చ పెద్దమనుషులు అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఖరీఫ్ సీజన్లో 1.76 కోట్ల టన్నుల ఎరువులను ఆర్బీకేలలో నిలువ ఉంచి పంపిణీ చేశారని, చంద్రబాబు ఇప్పటి వరకు ఎరువులను అందజేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక, బియ్యం, మట్టి స్కాంలలో తమ నాయకులను కేటాయించి దోచుకోండని ప్రోత్సహిస్తున్నారని, ప్రజలను రక్షించే పోలీసులను భక్షక భటులుగా మార్చి తమకు అనుకూలంగా మలుచుకున్నారని ఆయన విమర్శించారు. పోలీస్ స్టేషన్లను వసూళ్ల స్టేషన్లుగా మార్చి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని, కొంతమంది పోలీసులు కూటమి నాయకులకు వత్తాసు పలకటమే పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. తనకు అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్ స్టేషన్కు వెళ్తే తమ వర్గీయులే చేసిఉంటారని చెప్తున్నారని, పుల్లలచెరువు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గానికి చెందిన రైతు ట్రాక్టర్ను తగుల బెడితే తమ పార్టీకి చెందిన నాయకుడే తగులబెట్టి ఉంటాడంటున్నారని అన్నారు. నియోజకవర్గంలో స్థాయిలేని టీడీపీ నాయకుడు ఒకరు ప్రభుత్వ కార్యాలయాల నుంచి నెలకు రూ.2 కోట్లు వసూలు చేస్తున్నాడని, ఆ నాయకుడు డబ్బులు దండుకుంటూ ఆపై దబాయింపులకు దిగుతున్నాడని ఆయన ఆరోపించారు. అంగన్వాడీ పోస్టులను అమ్ముకుంటున్నాడని, కేజీబీవీ పాఠశాలలో అడ్మిషన్లు సైతం తమ గుప్పెట్లో పెట్టుకొని ఆ ఖాళీలను భర్తీ చేయిస్తున్నారని అన్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే పెద్దదోర్నాలలోని ఆర్టీసీ బస్టాండ్ స్థలంపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు కన్నేశాడని అన్నారు. ఆయన నియోజకవర్గంలో డబ్బులు దండుకోవటానికి అధికారం చెలాయిస్తుంటాడని, ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండడని ఆయన వ్యగ్యంగా అన్నారు. యర్రగొండపాలెంలో సాగర్ పైపులను తవ్వుకొని ఎత్తుకొని వెళ్తుంటే చూస్తూ ఉరుకుంటున్నాడని, ఆయన ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాడని ఎమ్మెల్యే ప్రశ్నించారు. త్రిపురాంతకం, ముటుకుల రక్షిత మంచి నీటి పథకాల నిర్వహణ కాంట్రాక్టర్ల నుంచి రూ.40 లక్షలు వసూలు చేసుకున్నాడని, అటువంటి నాయకుడు నియోజకవర్గంలోని నీటి సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తాడని దుయ్యబట్టారు. పోలీసుల సహకారంతో ఇసుక లారీలను అడ్డుకొని టన్నుకు రూ.300, ఎన్ఆర్ఈజీఎస్లో పనికి వెళ్లే ఒక్కొక్క ఉపాధి కూలి నుంచి రూ.300, పనికి వెళ్లకుండా మస్టర్ వేయించుకునేవారి నుంచి రూ.600 ప్రకారం వసూళ్లు చేసుకుంటున్నాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. నీ చర్యలు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో నిన్ను తరిమి వేసే రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ, జెడ్పీటీసీ మాకం జాన్పాల్, మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, వైస్ ఎంపీపీ పాటిబండ్ల కృష్ణ, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శాసం రంగబాబు, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి రాచగొర్ల పిచ్చయ్య, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు దొందేటి నాగేశ్వరరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకటరమణారెడ్డి, పి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరుతో రూ.5.90 లక్షలకు టోకరా
ఒంగోలు టౌన్: పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒంగోలు ఇందిరాకాలనీకి చెందిన వ్యక్తి తనతో పాటు మరో 15 మంది వద్ద నుంచి 5.90 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడని ఒంగోలు సమతా నగర్కు చెందిన బాధితుడు సోమవారం పోలీస్శాఖ నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో ఎస్పీ ఏఆర్ దామోదర్కు ఫిర్యాదు చేశారు. తమకు ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇచ్చాడని, వాటిని తీసుకుని కార్యాలయాలకు వెళ్లి అధికారులకు సంప్రదించగా, అవి నకిలీ నియామకపత్రాలని తెలిసిందని వాపోయాడు. దాంతో సదరు వ్యక్తిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా జవాబు ఇస్తున్నాడని తెలిపారు. అలాగే మోటారు బైకు పేరుతో మోసపోయినట్లు మరొకరు ఫిర్యాదు చేశారు. మోటారు బైకు కొనుగోలు చేసేందుకుగానూ ఒంగోలుకు చెందిన ఒక డీలర్ను సంప్రదించగా తన వద్ద 90 వేల రూపాయలకు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం ఉందని నమ్మబలికాడన్నారు. అందుకుగానూ తొలుత రూ.20 వేల అడ్వాన్స్ తీసుకున్నాడని తెలిపారు. రెండు రోజుల్లో వాహనాన్ని డెలివరీ చేస్తానని చెప్పాడని, నేటికి 15 రోజులు గడిచినప్పటికీ వాహనం ఇవ్వలేదని తెలిపారు. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించమని అడిగితే బెదిరిస్తున్నాడని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి 52 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులతో నేరుగా ఎస్పీ మాట్లాడి వారి సమస్యలడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ జగదీష్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, గ్రీవెన్స్ ఎస్సై జనార్దన్రావు పాల్గొన్నారు. చీమకుర్తి: బైకు ఢీకొనడంతో చీమకుర్తి మున్సిపాలిటీలో వర్కర్గా పనిచేస్తున్న పిన్నిక విజయమ్మ (50) మృతి చెందింది. సోమవారం తెల్లవారుజామున చీమకుర్తి మెయిన్రోడ్డులోని జవహర్ ఆస్పత్రి సమీపంలో తోటి మున్సిపల్ వర్కర్లతో కలిసి చెత్త ఎత్తి ట్రాక్టర్లో వేస్తున్న సమయంలో బైకుపై వెళ్తున్న ముత్తువేల్ అనే వ్యక్తి విజయమ్మను ఢీకొట్టాడు. ఆమె పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయింది. తోటి వర్కర్లు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందినట్లు మృతురాలు భర్త పిన్నిక శ్రీనివాసరావు తెలిపారు. బైకుతో ఢీకొట్టిన ముత్తువేల్ స్థానిక గ్రానైట్ క్వారీలో పొక్లెయిన్ ఆపరేటర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తువేల్పై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం.సుబ్బారావు వెల్లడించారు. కంభం: ఓ గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదస్థితిలో రైలు కిందపడి మృతిచెందిన సంఘటన సోమవారం కంభం మండలంలోని సూరేపల్లి సమీపంలో రైలు పట్టాలపై వెలుగు చూసింది. మార్కాపురం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 35–40 సంవత్సరాల వయసున్న వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. నైట్ ప్యాంట్, చెక్స్ షర్టు ధరించి ఉన్నాడు. అతని వద్ద ఆదివారం రాత్రి కంభం నుంచి గుంటూరు వెళ్లేందుకు ఇద్దరికి తీసుకున్న టికెట్ ఉంది. అతని చేతికి రాఖీ కట్టి ఉంది. మృతదేహం పడి ఉన్న తీరు చూస్తే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నప్పటికీ.. మృతుడి వద్ద ఇద్దరికి సంబంధించిన టికెట్ ఉన్న నేపథ్యంలో అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి ఎవరు, టికెట్ తీసుకుని కంభం రైల్వేస్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరేపల్లి వరకు ఎందుకు వెళ్లాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ రైల్లోనే ప్రయాణించి దిగాడనుకుంటే.. అక్కడ రైల్వేస్టేషన్ కూడా లేదు. అలాంటప్పుడు ఆ వ్యక్తి అక్కడికి ఎందుకు వెళ్లాడు, ఎలా వెళ్లాడు.? అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి ఎవరో తేలాల్సి ఉంది. మృతదేహం నంద్యాల వైపు వెళ్లే పట్టాలపై పడి ఉండగా, రైలు పట్టాలకు ఇరువైపులా చెప్పులు పడి ఉన్నాయి. దీంతో అతని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
తిరిగొచ్చేనా..!
తియ్యటి రోజులు కంభం: ఎటుచూసినా చెరకు తోటలు.. పంట కోతకొస్తే ఏడాదిలో సుమారు 6 నెలల పాటు బెల్లం తయారీ.. షుగర్ ఫ్యాక్టరీతో పాటు ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా చెరకు రసం తియ్యదనం.. ఇవన్నీ కంభం, ఆ పరిసర ప్రాంతాల్లో ఒకప్పటి రోజులు. ప్రస్తుతం ప్రజలతో పాటు రైతులకు కూడా ఆ తియ్యదనం దూరమైంది. కేవలం అడవి పందుల బెడద కారణంగా కంభం చెరువు ఆయకట్టులో చెరకు సాగును రైతులు పూర్తిగా వదిలేశారు. అరటి సాగువైపు మొగ్గుచూపారు. చారిత్రాత్మక కంభం చెరువు ఆయకట్టు ఒకప్పుడు చెరకు పంటతో కళకళలాడుతుండేది. చెరకు పంట సాగుకు కంభం, ఆ పరిసర ప్రాంతాలు పెట్టింది పేరుగా ఉండేవి. కంభంలో తయారు చేసిన బెల్లం రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతయ్యేది. కంభం చెరువు ఆయకట్టు పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల్లో చెరకు పంట సాగు చేసేవారు. దసరా, సంక్రాంతి, ఇతర ముఖ్య పండుగలకు బెల్లంకు డిమాండ్ ఎక్కువగా ఉంటుండటంతో వ్యాపారులు ఏకంగా రైతుల పొలాల దగ్గరికే వచ్చి బెల్లం కొనుగోలు చేసేవారు. తురిమెళ్ల వెళ్లే రహదారి వెంట, బేస్తవారిపేట రహదారి పక్కన, కంభం చెరువుకు వెళ్లేమార్గంలో రైతులు బెల్లం తయారు చేస్తుంటే.. వాహనదారులు, ప్రయాణికులు అక్కడికి వెళ్లి రైతులను అడిగి చెరకు రసం తాగేవారు. చెరకు పంటకు తెగుళ్లు ఎక్కువగా ఆశించవు. అందువలన లాభాలు రాకపోయినా నష్టాలు మాత్రం వచ్చేవి కావు. దీంతో ఈ ప్రాంతంలో చెరకు సాగు అధికంగా ఉండేది. అప్పట్లో కంభం పట్టణంలో షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉండేదంటే ఈ ప్రాంతంలో చెరకు పంట ఏ స్థాయిలో సాగయ్యేదో అర్థం చేసుకోవచ్చు. 20 ఏళ్లుగా నిలిచిపోయిన చెరకు సాగు... దాదాపు 20 ఏళ్లుగా ఈ ప్రాంతంలో చెరకు పంట సాగు ఆగిపోయింది. చెరకు పంట సాగు కనుమరుగవడానికి ప్రధాన కారణం అడవి పందులే. ఆరుగాలం శ్రమించి సాగుచేసుకున్న చెరకు పంటపై అడవి పందుల దాడి పెరిగిపోయింది. చుట్టూ కొండలు ఉండటంతో పగలూరాత్రీ తేడా లేకుండా అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి చెరకు తోటల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని పంట మొత్తం నాశనం చేసేవి. వాటి నుంచి రక్షణ పొందేందుకు కరెంటు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. అడవి పందులను చంపడం చట్టరీత్యా నేరమైనందుకు వాటిని ఏమీ చేయలేక కాలక్రమంలో రైతన్నలు చెరకు పంటనే తగ్గించుకుంటూ వచ్చారు. ప్రభుత్వాలు, అధికారులు సైతం అడవి పందుల నుంచి చెరకు పంటను రక్షించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం చెరకు సాగు పూర్తిగా కనుమరుగైపోయింది. ప్రత్యామ్నాయంగా అరటి సాగు... చెరకు పంట సాగు చేయలేమని నిర్ణయించుకున్న కంభం చెరువు ఆయకట్టు రైతులు అరటి పంటను ప్రత్యామ్నాయ పంటగా ఎంచుకున్నారు. నంద్యాల, మహానంది, తమిళనాడు, తదితర ప్రాంతాల నుంచి అరటి పిలకలు తెప్పించి సాగుచేయడం మొదలు పెట్టారు. దీంతో ప్రస్తుతం కంభం చెరువు ఆయకట్టు కింద చెరకు స్థానంలో అరటి తోటలు దర్శనమిస్తున్నాయి. గతంలో పసుపు చివరి దశలో అంతర పంటగా చెరకు వేసే వారు. ప్రస్తుతం దాని స్థానంలో కూడా అరటి వేస్తున్నారు. అరటికి పెట్టుబడి ఎక్కువ. ఈదురుగాలులు, తుఫాన్లు వస్తే చెట్లు కూలిపోయి నష్టం వాటిల్లుతోంది. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అరటినే సాగుచేసుకుంటున్నారు. ప్రస్తుతం కంభం పరిసర ప్రాంతాల్లో బోర్ల కింద అరటి సాగులో ఉంది. కేవలం చెరకు రసం వరకే సాగు... కంభం మండలంలో పూర్తిగా చెరకు సాగు కనుమరుగవగా, చుట్టుపక్కల ప్రాంతాల్లో 20–30 ఎకరాల్లో మాత్రమే చెరకు సాగు జరుగుతోంది. ఆ పంటను చెరకు రసం విక్రయించుకునే వారు కొనుగోలు చేసుకుంటున్నారు. బెల్లం తయారు చేయాలంటే ఎకై ్సజ్ అధికారులు కొర్రీలు పెడుతుండటంతో రైతులు బెల్లం తయారీపై కూడా ఆసక్తి చూపడం లేదు. చెరకు రసం విక్రయదారులకు క్వింటాల చొప్పున చెరకు పంట విక్రయిస్తున్నారు. చెరకు సాగుకు చర్యలు తీసుకోవాలి... కంభం చెరువు ఆయకట్టు కింద రైతులు తిరిగి చెరకు పంట సాగుచేసుకునేలా ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకుని ప్రోత్సహించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అడవి పందుల నుంచి రక్షణ కల్పించేందుకు భరోసా ఇవ్వడంతో పాటు ఉద్యానవన పంటల మాదిరిగా చెరకు పంట సాగుకు ప్రోత్సాహం అందిస్తే తిరిగి ఈ ప్రాంతంలో చెరకు సాగులోకి వచ్చే అవకాశం ఉందని ఇక్కడి ప్రజలు ఆశాభావం వ్యకం చేస్తున్నారు. చెరకు పంట (ఫైల్) కంభం చెరువు ఆయకట్టు కింద పూర్తిగా కనుమరుగైన చెరకు పంట గతంలో 1000 ఎకరాలకుపైగా చెరకు సాగు కంభంలో కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిన షుగర్ ఫ్యాక్టరీ ఏడాదిలో ఆరు నెలల పాటు బెల్లం తయారీ ప్రస్తుతం 20–30 ఎకరాల్లోనే చెరకు సాగు అడవి పందుల బెడదే ప్రధాన కారణం చెరకు సాగును పూర్తిగా వదిలేసి అరటివైపు మొగ్గుచూపిన ఆయకట్టు రైతులు ప్రభుత్వం పట్టించుకుని ప్రోత్సహించాలంటున్న ప్రజలు చెరకు సాగుకు బదులు అరటి వేస్తున్నాం గతంలో పది ఎకరాలకుపైగా చెరకు తోటలు సాగుచేశాం. కూలీల ఖర్చులు పెరిగిపోవడం, అడవి పందుల దాడి ఎక్కువై పోవడంతో చెరకు సాగును పూర్తిగా వదిలేసి అరటి వేసుకుంటున్నాం. – అబ్దుల్ వహీద్, రైతు, కంభం పందుల బెడదతోనే అడవి పందుల బెడదతోనే చెరకు పంటను రైతులు సాగుచేయడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగుచేసుకున్న పంటను అడవి పందులు నాశనం చేస్తుండటంతో నష్టాలు రావడం మొదలై పూర్తిగా చెరకు వదిలేసే పరిస్థితులొచ్చాయి. – షేక్ ఖయూం, రైతు, కంభం ప్రత్యామ్నాయంగా అరటి సాగు... చెరకు పంట సాగు చేయలేమని నిర్ణయించుకున్న కంభం చెరువు ఆయకట్టు రైతులు అరటి పంటను ప్రత్యామ్నాయ పంటగా ఎంచుకున్నారు. నంద్యాల, మహానంది, తమిళనాడు, తదితర ప్రాంతాల నుంచి అరటి పిలకలు తెప్పించి సాగుచేయడం మొదలు పెట్టారు. దీంతో ప్రస్తుతం కంభం చెరువు ఆయకట్టు కింద చెరకు స్థానంలో అరటి తోటలు దర్శనమిస్తున్నాయి. గతంలో పసుపు చివరి దశలో అంతర పంటగా చెరకు వేసే వారు. ప్రస్తుతం దాని స్థానంలో కూడా అరటి వేస్తున్నారు. అరటికి పెట్టుబడి ఎక్కువ. ఈదురుగాలులు, తుఫాన్లు వస్తే చెట్లు కూలిపోయి నష్టం వాటిల్లుతోంది. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అరటినే సాగుచేసుకుంటున్నారు. ప్రస్తుతం కంభం పరిసర ప్రాంతాల్లో బోర్ల కింద అరటి సాగులో ఉంది. -
No Headline
మార్కాపురం: ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కోర్టులో వాయిదాకు హాజరై తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్టాండ్లో ఉండగా అతనిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం మార్కాపురంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2018 ఏప్రిల్లో ముండ్లమూరు మండలంలోని ఈదర గ్రామంలో క్రిష్ణపాటి వెంగళరెడ్డి కుమారుడు కొండారెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో అదే గ్రామానికి చెందిన బండి బాపిరెడ్డి ప్రమేయం ఉన్నట్లు వెంగళరెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బాపిరెడ్డిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా బెయిల్పై బయటకు వచ్చాడు. గ్రామంలో మళ్లీ గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అప్ప ట్లో బాపిరెడ్డిని ఈదర నుంచి బయటకు పంపారు. ఆయన బ్రహ్మంగారి మఠంలో ఉంటున్నాడు. సోమవారం మార్కాపురం ఆరో అదనపు న్యాయ స్థానంలో వాయిదాకు హాజరై మఠం వెళ్లేందుకు బస్టాండ్కు వెళ్లి బస్సులో కూర్చుని ఉండగా వెంగళరెడ్డితో పాటు మరికొంత మంది వచ్చి తన కళ్లలో కారం చల్లి హత్య చేసేందుకు ప్రయత్నించారని దీంతో తాను గట్టిగా కేకలు వేస్తూ తప్పించుకున్నట్లు బాపిరెడ్డి తెలిపాడు. తనపై వెంగళరెడ్డి కారంపొడి చల్లి ఇనుపరాడ్డుతో దాడికి ప్రయత్నించాడని పట్టణ పోలీసు స్టేషన్లో బాపిరెడ్డి ఫిర్యాదు చేశాడు. నిందితులు పరారు కాగా పోలీసులు సీసీ టీవీలో పరిశీలించి వెంగళరెడ్డికి చెందిన కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సంఘటన జరిగిన ఆర్టీసీ బస్టాండ్కు సీఐ సుబ్బారావు, ఎస్సై సైదుబాబు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒంటిపై కారంపొడితో బాపిరెడ్డి బస్టాండ్లో విచారణ చేస్తున్న సీఐ సుబ్బారావు -
ఎరువు దిగిరాక!
సాగు కలిసిరాక..మార్కాపురం: ఖరీఫ్ ప్రారంభంలోనే కూటమి ప్రభుత్వం రైతులకు షాక్ ఇస్తోంది. ఎరువుల ధరలు భారీగా పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో శనగ, మిర్చి, పత్తి, పొగాకు సాగు చేసిన రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధరలు లభించడంలేదు. ప్రభుత్వం సైతం పట్టించుకోకపోవడంతో అన్నదాతలు కుదేలయ్యారు. గత సీజన్లలో జరిగిన నష్టాన్ని ఖరీఫ్ సీజన్లోనైనా పూడ్చుకుందామని రైతులు ఆశపడ్డారు. పంటల సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్రం ఎరువుల ధరలు పెంచడంతో వ్యవసాయం చేయడం కష్టమని వాపోతున్నారు. ఇప్పటికే అప్పులు ఎక్కువై పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరో వైపు బ్యాంక్ల నుంచి ఖరీఫ్ సీజన్లోనైనా వ్యవసాయ రుణాలు వస్తాయా, రావా అనే సందిగ్ధంలో రైతులు ఉండగా, ఊహించని విధంగా ఎరువుల ధరలు పెరగటంతో పంటల సాగు చేయాలంటే రైతులు భయపడుతున్నారు. జిల్లాలో పంటల సాగు ఇలా జిల్లా వ్యాప్తంగా 1,29,102 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఈ నెల 3వ తేదీ నాటికి 17,285 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. అంటే కేవలం 13.39 శాతం మాత్రమే పంటలు సాగు చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు దాటినా వర్షాలు లేకపోవడంతో పంటల సాగు ముందుకెళ్లడం లేదు. వరి, మొక్కజొన్న, జొన్న, పత్తి, ఇతర పంటలతో పాటు పాడిపోషణలో భాగంగా పారాగడ్డి పెరు గుదలకు యూరియా బాగా అవసరం అవుతోంది. సహకార సొసైటీలు, రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువుల సరఫరా నత్తనడకన సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ప్రతి రైతు దుక్కిలో హెక్టారుకు రెండున్నర బస్తాల డీఏపీని కచ్చితంగా వేస్తారు. 28–28 రకంలో యూరియా, భాస్వరం ఉంటాయి. వేర్లు ఏపుగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. 14–35–14 (నత్రజని, భాస్వరం, పొటాష్) ఎరువు వరి, మిర్చిలో ఎక్కువగా వినియోగిస్తారు. 20–20–20–0–13 ఈ ఎరువును వరి, మిర్చి పంటలకు ఎక్కువగా వాడుతారు. ఈ ఎరువులను రైతులు ప్రతి పంటకు వేస్తుంటారు. ఇందులో ప్రధానంగా నత్రజని పెరుగుదలకు, భాస్వరం వేర్ల అభివృద్ధికి, పొటాష్ గింజ నాణ్యతకు, బరువు పెరుగుదలకు, పురుగులు, తెగుళ్లు తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. దీంతో కాంప్లెక్స్ ఎరువులను రైతులు కచ్చితంగా వినియోగించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పెరిగిన ఎరువులు ధరలు రైతులకు భారంగా మారనున్నాయి. జిల్లాలో ఎరువుల నిల్వలు ఇలా జిల్లాలో ఖరీఫ్ సీజన్ మొత్తం మీద 54,468 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది ఖరీఫ్, రబీకి సంబంధించి ఏప్రిల్ 1 నాటికి 27,111 మెట్రిక్ టన్నుల ఎరువులు మిగులు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 7 నాటికి 29,274 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు చేరాయి. దీంతో మొత్తం 56,385 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉండగా ఇప్పటి వరకు 26,759 మెట్రిక్ టన్నుల ఎరువులను విక్రయించారు. ప్రస్తుతం 29,626 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయి. ఇందులో కాంప్లెక్స్ ఎరువులు, డీఏపీ, యూరియా, ఎన్పీకే, ఎస్ఎస్పీ, ఎంఓపీ, తదితర రకాల ఎరువులు దుకాణాల్లో ఉన్నాయి. కాంప్లెక్సు ఎరువులకు సంబంధించి 158.45 మెట్రిక్ టన్నులు, డీఏపీ 2933.999 మెట్రిక్ టన్నులు, ఎన్పీకేఎస్ 15,922.44 మెట్రిక్ టన్నులు, యూరియా 6,593.492 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయి. ఇంకా ఎంఓపీ, ఎఫ్ఓఎం, ఎస్ఎస్పీ తదితర రకాలు కూడా రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రైవేటు వ్యాపారస్తులు మాత్రం రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. -
ప్రకాశం
7విద్యుత్ అధికారులనిర్లక్ష్యానికి యువకుడు బలి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్న ఘటన దర్శి పట్టణం సందువారిపాలెం వద్ద సోమవారం జరిగింది.కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న జిల్లా రైతాంగంపై ఎరువుల ధరల పిడుగు పడింది. గిట్టుబాటు ధర లభించక సాగుభారంగా మారిన పరిస్థితుల్లో పెరిగిన ఎరువుల ధరలు గుదిబండగా మారనున్నాయి. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో పంట దిగుబడి సైతం భారీగా పడిపోయింది. ఖరీఫ్లోనైనా గట్టెక్కుదామని ఆశపడిన రైతుల్లో ఎరువుల ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కంపెనీని బట్టి బస్తాకు రూ.100 నుంచి రూ.250 వరకూ ధర పెరిగింది. ఇలా అయితే సాగుకష్టమంటూ రైతులు వాపోతున్నారు. ఎరువుల ధరలు తగ్గించాలి ఇప్పటికే దిగుబడులు రాక ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఎరువుల ధరలు పెంచడంతో వ్యవసాయం చేయాలంటే భారంగా ఉంది. ప్రధానంగా వరి, పత్తి, మిర్చి సాగుకు అవసరమయ్యే ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం. పత్తి సాగు చేసినప్పటికీ వర్షాలు లేకపోవడంతో వాడుముఖం పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ధరలు పెంచడం రైతులకు భారమే. – టీ రామిరెడ్డి, రైతు, కొట్టాలపల్లి, మార్కాపురం మండలం ఎరువుల కొరత లేదు జిల్లాలో ఇప్పటి వరకు ఎరువుల కొరత లేదు. రైతులకు అవసరమైన ఎరువులను పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్నాయి. అవసరమైతే ఇంకా తెప్పిస్తాం. యూరియా 2,811 మెట్రిక్ టన్నులు అవసరమని గుర్తించి 5625 మెట్రిక్ టన్నులకు ప్లాన్ చేశాం. డీఏపీ 1639, ఎన్పీకేఎస్ 5591 టన్నులు అవసరమని గుర్తించి అందుకు తగిన ఏర్పాట్లు చేశాం. జిల్లాలో ఇప్పటికే వివిధ రకాల ఎరువులకు సంబంధించి 29,626 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. – శ్రీనివాసరావు, జేడీఏ, ఒంగోలు -
కూటమి పాలనలో చుండూరు తరహా దాడులు
ఒంగోలు టౌన్: కూటమి పాలనలో చుండూరు తరహా దాడులు పునరావృతం అవుతున్నాయని ప్రకాశం జిల్లా రజక వృత్తిదారుల సంఘ ప్రధాన కార్యదర్శి రాయల మాలకొండయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కారంచేడులో రజక సామాజికవర్గానికి చెందిన మూగ యువతిపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమని అన్నారు. నగరంలోని ఎల్బీజీ భవన్లో రజక వృత్తిదారుల సంఘం, అపార్ట్మెంట్ వాచ్మెన్ కం ఇరస్త్రీదారుల సంఘం సంయుక్తంగా సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు కారంచేడు, చుండూరులో ఎస్సీ, ఎస్టీ మైనారిటీల మీద దాడులు చేసి కొంతమంది అమాయకులను అత్యంత క్రూరంగా హత్యలు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం బీసీలపై ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీలపై దాడులు ఎక్కువైపోయాయని, బీసీలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. కూటమి పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కారంచేడు మూగ యువతిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించకుండా నిందితులను అరెస్టు చేయాలన్నారు. బలహీన వర్గాలకు చెందిన రజకులపై ఎటువంటి విచారణ చేయకుండానే కేసు నమోదు చేయడం దుర్మార్గమని, న్యాయవిరుద్ధమైన ఇలాంటి చర్యలు తగవని హితవు పలికారు. బీసీలకు సామాజిక రక్షణ కల్పించాలని, రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి దాడులు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. సమావేశంలో రజక సంఘ జిల్లా నాయకులు ఆవులమంద రమణమ్మ, డాక్టర్ కృష్ణయ్య, మంచికలపాటి శ్రీనివాసులు, గుర్రపుశాల శ్రీను, శోభన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
No Headline
ఒంగోలు: సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జిగా వి.లీలా శ్యామ్ సుందరిని నియమిస్తూ ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు ఈమె తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే నూతనంగా ఏర్పాటు చేసిన సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జిగా ఒంగోలు మొబైల్ కోర్టు జడ్జి వి.వెంకటేశ్వరరావు మంగళ, శుక్రవారాలలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజా నియామకంతో సింగరాయకొండ జూనియర్ సివిల్ కోర్టులో కేసుల పరిశీలన వేగవంతం కానుంది. మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలో ఇసుక దోపిడీని అరికట్టకపోతే ఈ నెల 16 నుంచి లారీల సమ్మె చేస్తామని, అవసరమైతే తామే వినియోగదారులకు టన్ను ఇసుక రూ.950 లకు అందజేస్తామని మార్కాపురం లారీ అసోసియేషన్ నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కాంట్రాక్టర్ గొట్టిపాటి సురేంద్ర గతంలో తాము తెచ్చే ఇసుకను టన్ను రూ.950లకు కొనుగోలు చేసి వినియోగదారులకు టన్ను రూ.1200 లకు అమ్ముకునే వారని అన్నారు. అయితే ఈ నెల 1న తమను పిలిపించి కేవలం టన్ను ఇసుక రూ.800లకు మాత్రమే విక్రయించాలని సురేంద్ర కోరారని లారీ అసోసియేషన్ నాయకులు తెలిపారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని, ఇప్పటికే ఈ విషయమై కలెక్టర్, ఎస్సీ, స్థానిక అధికారులకు వినతి పత్రాలు అందజేశామన్నారు. వారు స్పందించకపోతే ఈ నెల 16 నుంచి యార్డుకు ఇసుక సరఫరా నిలిపేస్తామని హెచ్చరించారు. అవసరమైతే మేమే వినియోగదారులకు ఇసుక టన్ను రూ.950లకు విక్రయిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉచిత ఇసుక అని గొప్ప చెబుతున్నారని ఆచరణలో మాత్రం ప్రజల నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నారని వినతిపత్రంలో తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కాశీరాంసింగ్, లారీ అసోసియేషన్ నాయకులు ఉన్నారు. ఒంగోలు సిటీ: ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలోని బీఎడ్ కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఏకేయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి సూచనల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 10,955 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 94.37 శాతంతో 10,339 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ స్థాయిలో, ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఏకేయూ ఉప కులపతి ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు అభినందించారు. మూడో సెమిస్టర్ ఫలితాల విడుదల కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ సోమశేఖర, పీజీ కో ఆర్డినేటర్ (నాన్ కాన్ఫిడెన్షియల్ ) డాక్టర్ ఆర్.శ్రీనివాస్, పరీక్షల విభాగం పర్యవేక్షకులు సూడా శివరామ్తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
శంకుస్థాపన సరే..పనులెప్పుడు..?
మార్కాపురం టౌన్: మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశాల నిర్వహణ కోసం భవన నిర్మాణానికి గత ఏడాది నవంబర్లో సబ్ కలెక్టర్ త్రివినాగ్, ఎమ్మెల్యే కందుల శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన చేసి 8 నెలలు దాటినా ఇంత వరకు పనులు అడుగు ముందుకు పడలేదు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.55 లక్షలు కేటాయించింది. అయితే భవన నిర్మాణానికి అక్కడ ఉన్న చెట్లు అడ్డు వస్తాయని కాంట్రాక్టర్ వాటిని తొలగించాడు. అయితే ఆ తర్వాత పనులు పునాదిలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. కలెక్టర్, మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల సమావేశాల కోసం రెవెన్యూ అధికారులు ప్రైవేట్ కల్యాణ మండపాలకు రూ.50 వేల నుంచి రూ.60 వేలు అద్దె చెల్లించి తీసుకుంటున్నారు. దీంతో సమావేశం పెట్టాలంటేనే రెవెన్యూ అధికారులు భయపడుతున్నారు. మరో వైపు నిధులున్నా, అన్ని అనుమతులు ఉన్నా పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలోనే నిర్మాణం చేపట్టాల్సి ఉంది. శంకుస్థాపన చేసిన పునాది గుంతలో పిచ్చి చెట్లు పడ్డాయి. దీంతో ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమానికి వచ్చే ప్రజలు, అర్జీదారులు ఉన్న కాసింత ఖాళీ స్థలంలోనే వేచి ఉండి లోపలికి వెళ్లి అర్జీలు ఇస్తున్నారు. మరో వైపు నిర్మాణం పూర్తయితే తమకు అద్దె భాద తప్పిపోతుందని రెవెన్యూ అధికారులు భావిస్తుండగా నిర్మాణ పనులు అడుగు ముందుకు పడటం లేదు. నూతన భవనం నిర్మించాలంటే ముందు పాత ఎంప్లాయిమెంట్ ఆఫీసు ఉంది. దాన్ని తొలగించాలంటే జిల్లా అధికారుల అనుమతి అవసరం. దీంతో నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని తెలిసింది. నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారో వేచి చూడాల్సిందే. సమావేశ మందిరానికి శంకుస్థాపన చేసి 8 నెలలు అడుగు ముందుకు పడని పనులు ఉన్నతాధికారుల సమావేశాలకు భారంగా అద్దె చెల్లింపు -
జాజితోటకు బొబ్బతెగులు సోకింది
ఏ మందులు వాడాలో తెలియడం లేదు మల్లె తోటలకు ఎర్రమొగ్గ, నళ్లి తెగుళ్ల బెడద అధికంగా ఉంది. అధికారులెవరూ మల్లెతోటలను పరిశీలించేందుకు రావడం లేదు. తెగుళ్లకు ఏ మందులు వాడాలో తెలియక ఎరువుల కొట్లవారు ఏ మందు ఇస్తే అది కొనుగోలు చేసి పిచికారీ చేసుకుంటున్నాం. మా పూలతోటలను అధికారులు పరిశీలించి సూచనలిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. షేక్.ఖాసింవలి, రైతు పెట్టుబడి రావడం లేదుపూలతోటలకు పెట్టిన పెట్టుబడులకు సరిపడా ఆదాయం కూడా రావడం లేదు. కూలీల ఖర్చులు పెరిగిపోయాయి. ఆరుగాలం శ్రమించి సాగుచేసుకున్న పంటకు తెగుళ్లు వ్యాపించి దిగుబడి తగ్గిపోవడంతో నష్టాలే మిగులుతున్నాయి. రానురానూ పూలతోటలు సాగుచేయాలంటే భయమేస్తోంది. భువనగిరి శ్రీనివాసులు, రైతు ఎకరా పొలంలోనే మల్లె సాగు గతంలో నాలుగైదు ఎకరాల్లో పూల తోటలు సాగు చేసేవాడిని. ఖర్చులు పెరిగిపోవడం, తెగుళ్లతో దిగుబడులు తగ్గిపోతుండటంతో ప్రస్తుతం ఎకరా పొలంలోనే సాగు చేస్తున్నా. పి.కరీముల్లా, మల్లె రైతు 0.70 సెంట్లలో జాజితోట సాగు చేస్తున్నా. జాజికి బొబ్బ తెగులు సోకి ఆకులు ముడతలు పడి పూలు కాయడం లేదు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాను. పెరిగిన పెట్టుబడులకు తోడు తెగుళ్ల బెడద అధికమవడంతో పూల తోటలు సాగుచేయాలంటేనే భయమేస్తోంది. మద్దుకూరి తిరుపాలు -
తెగుళ్లు, పెట్టుబడులు పెరిగిపోయి.. పూల రైతు వాడిపోయి..!
సాగులో ఉన్న మల్లె తోట పూలు కోస్తున్న కూలీలు కంభం: మండలంలోని రావిపాడు గ్రామం పేరు వినగానే గుర్తొచ్చేది పూల సువాసనలు. పూల తోటల సాగుకు ఈ గ్రామం పెట్టింది పేరు. ఇక్కడ పండించే మల్లె, జాజి పూలు రాష్ట్ర నలుమూలలకు ఎగుమతి అవుతుంటాయి. వంద సంవత్సరాల క్రితం నుంచే ఈ గ్రామంలో పూలతోటలు సాగుచేస్తూ వస్తున్నారు. పూర్వం బత్తాయి తోటలు సాగుచేస్తూ మధ్యలో అక్కడక్కడా మల్లెపూల చెట్లు వేసేవారు. పూలు బాగా కాస్తూ మంచి రేటుకు అమ్ముడుపోతుండటంతో కాలక్రమంలో పూలతోటలే సాగుచేస్తూ రైతులు ఆదాయం పొందుతున్నారు. గతంలో 300 నుంచి 400 ఎకరాల్లో మల్లె, జాజి పూలతోటలు సాగుచేస్తుండగా, ప్రస్తుతం తెగుళ్లు, చీడపీడలతో పాటు పెరిగిన పెట్టుబడుల కారణంగా సాగు తగ్గుతూ వచ్చి కేవలం 50 నుంచి 60 ఎకరాల్లోనే పూలతోటలు సాగులో ఉన్నాయి. తమిళనాడు నుంచి అంటు తెచ్చి... రామేశ్వరం, మధురై, కుంభకోణం నుంచి మల్లె అంట్లు తెచ్చి రావిపాడు గ్రామంలోని పొలాల్లో రైతులు నాటుతారు. మొక్కలు నాటిన తొలి రెండు సంవత్సరాలు చిన్నపిల్లల్లా వాటిని చూసుకుంటారు. రెండేళ్లకు కోతకు వస్తాయి. అప్పటికే ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. ఇతర ప్రాంతాలకు రవాణా... రావిపాడులో పండిన మల్లె, జాజి పూలకు మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ పండిన పూలు గతంలో మన జిల్లాతో పాటు వినుకొండ, నరసరావుపేట, హైదరాబాద్, తదితర ప్రాంతాలకు సరఫరా అయ్యేవి. ఇటీవల కాలంలో సాగు తగ్గడంతో ప్రస్తుతం మార్కాపురం, గిద్దలూరు, పోరుమామిళ్ల, పొదిలి, కనిగిరి వంటి ప్రాంతాలకు మాత్రమే పంపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ పూలు రూ.150 వరకు ధర పలుకుతున్నాయి. తెగుళ్లతో తగ్గిపోతున్న దిగుబడి, సాగు విస్తీర్ణం... మల్లె, జాజి తోటలకు ఎర్రనళ్లి తెగులు, ఎర్రమొగ్గ తెగులు, ముడత తెగులు, బొబ్బతెగులు బెడద అధికమవడంతో దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఒకసారి నాటిన చెట్లు పదేళ్ల వరకు కాపు కాస్తాయి. నెలకు ఒక కాపు వస్తుండగా, గతంలో కాపునకు సుమారు 100 కేజీల వరకూ దిగుబడి వచ్చేది. ప్రస్తుతం తెగుళ్ల కారణంగా 20 నుంచి 25 కేజీల వరకు దిగుబడి తగ్గిపోయింది. దీంతో క్రమంగా సాగు విస్తీర్ణం కూడా తగ్గింది. పట్టించుకోని ఉద్యానవన శాఖాధికారులు... ప్రస్తుతం రావిపాడు గ్రామంలో 50 ఎకరాలకుపైగా మల్లె, జాజి తోటలు సాగులో ఉన్నాయి. తెగుళ్లు, వైరస్ల బెడద అధికంగా ఉండటంతో దిగుబడి తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చివరకు సాగు విస్తీర్ణం కూడా భారీగా తగ్గిపోయినప్పటికీ ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖల అధికారులు ఆ తోటల వైపు కన్నెత్తి కూడా చూడలేదని రైతులు వాపోతున్నారు. గతంలో చీడపీడల బెడద తక్కువగా ఉండేదని, ఇటీవల అధికమవడంతో దిగుబడి తగ్గిపోయి నష్టాలకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ అధికారి కూడా తమ పూలతోటలవైపు కన్నెత్తి చూడటం లేదని, ఏ తెగులుకు ఏ మందు వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తమకు అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. దుకాణదారులు ఏ మందు చెబితే అది గుడ్డిగా తెచ్చుకొని పొలాలకు వాడుకుంటున్నామని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మల్లె సాగులో రైతులకు మెళకువలు నేర్పించడంతో పాటు జాగ్రత్తలు, సూచనలు అందిస్తేనే పూల సాగుకు రైతులు ముందుకొస్తారని చెబుతున్నారు. -
ముగిసిన శ్రీగిరి పవిత్రోత్సవాలు
ఒంగోలు మెట్రో: ఒంగోలు కొండమీద శ్రీగిరి వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ఆదివారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు శ్రీగిరి వెంకటేశ్వర స్వామికి నిర్వహించిన వివిధ కార్యక్రమాలను భక్తులు ప్రత్యక్షంగా తిలకించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత వేద పండితులు పరాంకుశం సీతారామాచార్యులు బృందం ఆధ్వర్యంలో హోమ క్రతువులతో పాటు శ్రీవారికి విశేష స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నేత్రపర్వంగా వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంతో శ్రీగిరి శ్రీవారి పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్ పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు సుశీలాదేవి, కార్య నిర్వహణ ధర్మకర్త సీవీ రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మికుమారి, శ్రీగిరి దేవస్థానం ఉత్తర అమెరికా ప్రతినిధి డాక్టర్ ఆలూరు శ్రీనివాస చరణ్ రాజీవ్, ఆలూరు జై శంకర్, ఆలూరు కుమార్ ఆత్రేయ, ఆలూరు ఫణికుమార్ తదితరులు పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు శ్రీగిరి దేవస్థానం నిర్వాహకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు, -
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక
ఒంగోలు: రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఆదివారం స్థానిక గద్దలగుంటలోని ఎస్పీకేఆర్ ఓరియంటల్ పాఠశాలలో ఉత్సాహంగా నిర్వహించారు. ఎంపిక ప్రక్రియను యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.శివాజీ, కార్యదర్శి డి.కిరణ్మయి, పాఠశాల కరస్పాండెంట్ ఎం.కోటి సూర్యనారాయణ, హెచ్ఎం పద్మావతి, సీహెచ్ రామకృష్ణారావు, వి.ఆంజనేయులు, పీఈటీ సోమినేని సురేష్ పర్యవేక్షించారు. న్యాయ నిర్ణేతలుగా ప్రతిమ, మస్తాన్బీ, రమణయ్య, శంకర్రావు, వెంకటేశ్వర్లు, సురేష్ వ్యవహరించారు. ఎంపికై న క్రీడాకారులు వీరే 8–10 సంవత్సరాల విభాగం బాలురు: సీహెచ్ జస్వంత్–నేరేడుపల్లి(ప్రథమ), సీహెచ్ నాగేంద్ర–నేరేడుపల్లి(ద్వితీయ) బాలికలు: ఎస్.మోక్షిత–పెదచెర్లోపల్లి(ప్రథమ), సీహెచ్ మానస– పెదచెర్లోపల్లి(ద్వితీయ) 10–12 సంవత్సరాల విభాగం బాలురు: ఎ.తేజచరణ్– చందలూరు(ప్రథమ), ఎన్.నిరీక్షణ్రావు–చందలూరు(ద్వితీయ) బాలికలు: ఎన్.రత్నకుమారి–చందలూరు(ప్రథమ), ఎం.షణ్ముఖ–ఒంగోలు(ద్వితీయ) 12–14 సంవత్సరాల విభాగం బాలురు: ఎం.వెంకటేష్–చందలూరు(ప్రథమ), ఎం.షణ్ముఖ–ఒంగోలు(ద్వితీయ) బాలికలు: ఎన్.శృతి–చందలూరు(ప్రథమ), ఎ.లిఖిత–చందలూరు(ద్వితీయ) 14–16 సంవత్సరాల విభాగం: బాలురు: టి.సందీప్వర్మ–ఒంగోలు(ప్రథమ), వై.కళ్యాణ్రామ్–మద్దిపాడు(ద్వితీయ) బాలికలు: వి.రజని–పామూరు(ప్రథమ), కె.శరణ్య–ఒంగోలు(ద్వితీయ) 18–21 సంవత్సరాల విభాగం: పురుషులు: సీహెచ్.శ్రీధర్–ఒంగోలు(ప్రథమ), కె.ప్రణీత్–ఒంగోలు(ద్వితీయ) మహిళలు: ఎన్.సాయిచందన–ఒంగోలు(ప్రథమ), ఎ.ఉదయ సాయి శ్వేత–ఒంగోలు(ద్వితీయ) 21–25 సంవత్సరాలు: పురుషులు: కె.శివకోటిరెడ్డి–కోరలమడుగు(ప్రథమ) 35–45 సంవత్సరాల విభాగం: మహిళలు: బి.ప్రశాంతి–ఒంగోలు(ప్రథమ) 45 సంవత్సరాల పైన: పురుషులు: కె.శంకరరావు–ఉప్పుగుండూరు(ప్రథమ), ఎస్వీ రమణయ్య–కనిగిరి(ద్వితీయ) -
ప్రభుత్వాన్ని నిలదీయండి
హామీల అమలుపై ● వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున చీమకుర్తి రూరల్: ఓట్ల కోసం మభ్యపెట్టేందుకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి ఏడాదైనా అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును, టీడీపీ నాయకులను నిలదీయాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. మండలంలోని గోనుగుంట మొవ్వవారిపాలెం, కేవీ పాలెం గ్రామాల్లో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీశ్రీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో మేరుగు నాగార్జున మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారని గుర్తు చేశారు. కోవిడ్ వల్ల రాష్ట్ర ఆదాయం పూర్తిగా దిగజారినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న సంకల్పంతో అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును పేదల బ్యాంక్ ఖాతాలకు జమ చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అయితే ఇందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాదైనా పింఛన్ల సంఖ్యలో భారీగా కోత పెట్టి పెంచడంతో పాటు, అరకొరగా తల్లికి వందనం పథకాన్ని మాత్రమే అమలు చేసి చేతులు దులుపుకుందన్నారు. ఇచ్చిన పథకాల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించేలా ప్రభుత్వం తయారైందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు, శ్రీధర్ల శేషు, యూత్ అధ్యక్షుడు వెంగరెడ్డి, జిల్లా కార్యదర్శి ఓబుల్ రెడ్డి, నల్లూరి చంద్ర, తన్నీరు శ్రీనివాసరావు, బొడ్డు కోటేశ్వరరావు, ఉప్పలపాటి వెంకటరావు, ఎర్రగుంట్ల మోహన్, వసంతరావు, ఏలూరు సురేష్, పేరాబత్తిన పేరయ్య, వాకా కోటిరెడ్డి, కందుల డేనియల్, పాటిబండ్ల గంగయ్య, సంతోష్, మగులూరి ఇమ్మనేలు, బొడ్డపాటి హరిబాబు మండలంలోని పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
ప్రజల్లో మూఢ నమ్మకాలు తొలగిస్తాం
మార్కాపురం: ప్రజల్లో మూఢ నమ్మకాలను తొలగించేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తుందని జేవీవీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికై న వెంకట్రావు తెలిపారు. యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జేవీవీ సమావేశంలో ఆయన్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో యూటీఎఫ్ నాయకుడు శ్రీరాములు మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు వెంకటేశ్వర్లు, కాశయ్య, శ్రీనివాసనాయక్, తదితరులు పాల్గొన్నారు. -
దూరం దూరం
రైతుసేవ..గ్రామంలోనే కొనసాగించాలి గ్రామంలో రైతు సేవా కేంద్రానికి సొంతభ భవనం ఉన్నప్పటికీ తొలగించి పాపినేనిపల్లిలో విలీనం చేశారు. పొలాలకు ఎరువులు తీసుకోవాలంటే 5 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. గ్రామంలోనే రైతుసేవా కేంద్రాన్ని కొనసాగించేలా చూడాలి. – సిద్దారెడ్డి ఓబుల్ రెడ్డి, రైతు, బొల్లుపల్లి, అర్థవీడు మండలం విలీనంలో భాగంగా తొలగించిన కంభం–3 రైతు సేవా కేంద్రంజిల్లాలో ఏర్పాటైన రైతు సేవా కేంద్రాలు: 584విలీనం చేసిన కేంద్రాలు: 88కంభం: రైతులు వారి గ్రామాల్లోనే ఎరువులు, విత్తనాలు తీసుకునేందుకు, ఇతర సమస్యలు పరిష్కరించుకోవడం కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయాల పరిధిలో రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందించడం ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చేసింది. ఏడాదిగా రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో రైతు సేవా కేంద్రాలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేసిన కూటమి ప్రభుత్వం వాటి సంఖ్యను తగ్గించేసింది. జిల్లాలో గిద్దలూరు, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, దర్శి, యర్రగొండపాలెం వ్యవసాయ సబ్ సబ్డివిజన్ లు ఉండగా వాటి పరిధిలో 584 రైతు సేవా కేంద్రాలున్నాయి. విలీనం పేరుతో 88 రైతు సేవా కేంద్రాలను మరో రైతు సేవా కేంద్రాల్లోకి కలిపేయడంతో ప్రస్తుతం 496 కు చేరుకున్నాయి. దీంతో రైతు సేవాకేంద్రాలు తొలగించిన గ్రామాల్లోని రైతులు పక్క గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ–క్రాప్ ఆధారంగా విలీనం: విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చేసిన ఈ క్రాప్ బుకింగ్లను ప్రామాణికంగా తీసుకొని రైతు సేవా కేంద్రాలను విలీనం చేసినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ఈ క్రాప్ బుకింగ్ చేసిన విస్తీర్ణానికి, పూర్తి విస్తీర్ణానికి వ్యత్యాసం ఉంటుందని, అలాంటప్పుడు దాన్ని ప్రామాణికంగా ఎలా తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పనిభారం పెరుగుతుందంటున్న వీఏఏలు: వీఆర్వోలు, సర్వేయర్లను మాత్రం సచివాలయాల వారీగా అలాగే ఉంచి కేవలం వీఏఏలను మాత్రమే విలీనం చేయడం అన్యాయమని వారు వాపోతున్నారు. విలీనం చేసిన నేపథ్యంలో మిగిలిన వీఏఏలను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రాప్ ఆధారంగా రైతు సేవా కేంద్రాలను విలీనం చేసి తిరిగి ఇప్పుడు ఏరియా మొత్తాన్ని ఈ క్రాప్ చేయమని చెబుతుండటంతో పని భారం పెరుగుతుందని వీఏఏలు వాపోతున్నారు. రైతుసేవా కేంద్రాలపై విలీనం పిడుగు విలీనం పేరుతో రైతుసేవా కేంద్రాల కుదింపు మిగిలిన సిబ్బంది ఇతర జిల్లాలకు బదిలీ పనిభారం పెరుగుతుందంటున్న వీఏఏలు ఎరువులు, విత్తనాల కోసం రైతులుపక్క గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితిప్రస్తుతం ఉన్న రైతు సేవా కేంద్రాలు: 496రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు అవసరమైన ఎరువులను అందించడంలో విఫలమైన ప్రభుత్వం ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలను విలీనం పేరుతో తగ్గించి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. – నెమలిదిన్నె చెన్నారెడ్డి, వైఎస్సార్ సీపీ స్టేట్ యూత్వింగ్ సెక్రటరీ రైతులకు తప్పని తిప్పలు కొన్ని ప్రాంతాల్లో గ్రామాలకు ఆనుకొని పంటపొలాలు ఉన్నా ఇలాఖా పరంగా అవి ఇతర గ్రామాల్లో ఉన్నాయి. అధికారులు వాటిని ప్రామాణికంగా తీసుకోకుండా విలీనం చేయడంతో రైతులు తమ అవసరాల కోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంభం మండలం జంగంగుంట్ల రైతు సేవా కేంద్రాన్ని 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్కోట రైతుసేవా కేంద్రంలో విలీనం చేయడంతో అక్కడి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే విధంగా జిల్లాలో పలు చోట్ల రైతు భరోసా కేంద్రాలను విలీనం చేయడంతో రైతులు 5 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. -
13న క్విట్ కార్పొరేట్ నినాదంతో ర్యాలీ
ఒంగోలు టౌన్: జాతీయోద్యమంలో బ్రిటిష్ ముష్కరులను దేశం నుంచి తరిమికొట్టేందుకు నిర్వహించిన క్విట్ ఇండియా పోరాటం స్ఫూర్తితో ఈ నెల 13వ తేదీ ఒంగోలు నగరంలో క్విట్ కార్పొరేట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు తెలిపారు. స్థానిక ఎల్బీజీ భవనంలో ఆదివారం రైతు సంఘాలు, కార్మిక సంఘాలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చుండూరి రంగారావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడేసి, రైతులను దివాలా తీయడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించుకునేందుకు అనేక చట్టాలను తీసుకొస్తుందని చెప్పారు. మోదీ కుట్రలకు వ్యతిరేకంగా దేశంలోని రైతు సంఘాలు, రైతులు, కార్మికులు కలిసి పోరాటాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 83 ఏళ్ల క్రితం చేపట్టిన క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నగరంలోని మినీ స్టేడియం వరకు ట్రాక్టర్లు, మోటారు బైకులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రజలు ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జజ్జూరి జయంతి బాబు అధ్యక్షత వహించగా ఎస్ లలిత కుమారి, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కోడూరు హనుమంతరావు, కొండ్రు గుంట సుబ్బారావు, జీవీ కొండారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, ఇరిగినేని వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ విద్యలో సుబ్బారావు సేవలు ఎనలేనివి
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్యలో వివిధ హోదాల్లో సముచిత సేవలందించి వాటికి వన్నె తెచ్చిన వ్యక్తి వంగపల్లి వెంకట సుబ్బారావు అని ఇంటర్ విద్య ఆర్జేడీ జె.పద్మ, ఇంటర్ బోర్డు సీఓఈ ఎ.సైమన్ విక్టర్, ఓఎస్డీ వి.రమేశ్ అన్నారు. ఇంటర్మీడియెట్ విద్యామండలి పరీక్షల నియంత్రణ అధికారిగా పనిచేస్తూ, నెల్లూరు డీఐఈఓ గా జూలై 31న ఉద్యోగ విరమణ చేసిన సుబ్బారావుకు ఆదివారం ఒంగోలు ఏకేవీకే జూనియర్ కళాశాలలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వారు అతిథులుగా మాట్లాడారు. లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా, ప్రకాశం జిల్లా ఆర్ఐఓగా, గుంటూరు ఆర్జేడీగా, పరీక్షల నియంత్రణ అధికారిగా, నెల్లూరు జిల్లా ఇంటర్ విద్య అధికారిగా వివిధ హోదాల్లో ఆయన అందించిన సేవలు నిరుపమానం అన్నారు. ఇంటర్ విద్య సంస్కరణల్లో ఆయన కీలక భూమిక పోషించారని ప్రశంసించారు. ఆయన పనితీరు అందరికీ మార్గదర్శకం అన్నారు. సుబ్బారావు, భారతి దంపతులను ఘనంగా సన్మానించారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి కే ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్రంలోని డీఐఈఓలు, ఆర్ఐఓలు, ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయంలో చదవడం మాకిష్టం ఒంగోలు మెట్రో: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులకు నెలలో రెండో ఆదివారం పుస్తక సమీక్ష మంచికంటి వెంకటేశ్వర రెడ్డి నిర్వహించారు. జాలాది మోహన్బాబు విద్యార్థులచే పుస్తక పఠనం చేయించారు. నలుగురు విద్యార్థులకు జిల్లా గ్రంథాలయంలో సభ్యత్వం నమోదు చేసుకున్నారు. విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ పెట్టి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డిప్యూటీ లైబ్రేరియన్ సంపూర్ణ కాళహస్తి డీసీఎల్ సిబ్బంది, డీ సందీప్, గోవిందమ్మ పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా శ్రీనివాసుని కళ్యాణం
● ఘనంగా ముగిసిన వైఖానస సర్వసభ్య సమావేశం ఒంగోలు మెట్రో: విఖనసాచార్యుల జయంతి మహోత్సవాన్ని ఒంగోలులోని వైఖానస భవనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వైఖానస సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విఖనస జయంతి మహోత్సవంలో భాగంగా ఆదివారం ప్రాంగణంలో టీటీడీ పండితుడు పరాంకుశం కృష్ణసాయి భట్టర్ ఆధ్వర్యంలో విశేష క్రతువులను ద్విసహస్ర కళ్యాణ చక్రవర్తి, త్రినాథ చక్రవర్తి ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. డాక్టర్ పి.హరిబాబు బృందం ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పరాంకుశం కేశవాచార్యులు, గౌరవాధ్యక్షుడు గంజాం శ్రీనివాసమూర్తి, ప్రధాన కార్యదర్శి పి.ఆత్రేయ, కోశాధికారి ఉపాళ్ల రాంబాబు, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ మూర్తి, గౌరవ సలహాదారు యం.ఎ.శేషాచార్యులు, కార్యవర్గ సభ్యులు దివి కళ్యాణ చక్రవర్తి, రమణదీక్షితులు. దివి కస్తూరి రంగాచార్యులతో పాటుగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పలువురు వైఖానస పండితులు పాల్గొన్నారు. -
వానమ్మా.. రావమ్మా!
● సకాలంలో వర్షాలు కురవాలని పోలేరమ్మ, అంకాలమ్మకు బోనాలుపెద్దదోర్నాల: సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ మండల పరిధిలోని ఐనముక్కలలో గ్రామస్తులు పోలేరమ్మ, అంకాలమ్మలకు ఆదివారం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి సకాలంలో వర్షాలు కురవక ఏరువాక సాగని ప్రస్తుత తరుణంలో వర్షాలు బాగా పడాలని, పాడి పంటలు వృద్ధి చెందాలని మొక్కుకుని పోలేరమ్మ తల్లికి 108 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం పోలేరమ్మకు కుంకుమ బండిని అందంగా అలంకరించి గ్రామంలో కొమ్ము బూరాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వీధుల్లో మహిళలు వారు పోసి పోలేరమ్మ కుంకుమబండికి స్వాగతం పలికి తలపై బోనాలతో సమీపంలోని పోలేరమ్మ తల్లి గుడికి చేరుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. -
ప్రైవేటు ఉపాధ్యాయులకు కనీస వేతనాలు ఇవ్వాలి
ఒంగోలు టౌన్: ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సూర్యారావు డిమాండ్ చేశారు. మంగమూరు రోడ్డులోని శ్లోక ట్యూషన్ సెంటర్లో ఆదివారం పీటీఎల్పీడబ్ల్యూఏ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు వై.సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రెండున్నర లక్షల మందికి పైగా ప్రైవేటు ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. అరకొర జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారని చెప్పారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యపోరాటాలు చేయడం మినహా మరే మార్గంలేదన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్.రవి మాట్లాడుతూ ప్రైవేటు ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు మధ్య బోధనలోనూ, ఫలితాల్లోనూ వ్యత్యాసమేమీ ఉండదని చెప్పారు. వేతనాల్లో మాత్రం భారీగా తేడా ఉంటోందన్నారు. ఆ అంతరాన్ని తొలగించి ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా గౌరవ ప్రదమైన వేతనాలతో జీవితాన్ని గడిపేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయుల పోరాటాలకు యూటీఎఫ్ తమ వంతు సహకారం అందజేస్తుందని చెప్పారు. డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు మాట్లాడుతూ... డీఎస్సీ అభ్యర్థుల పోరాటానికి ఎలాంటి సహకారం అందించామో, అదే తరహాలో ప్రైవేటు ఉపాధ్యాయుల పోరాటాలకు మద్దతునిస్తామని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు టి.రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి యూ.కిరణ్ పాల్గొన్నారు. -
రైతులకు న్యాయం
స్వామినాథన్ సిఫార్సులతోనే ఒంగోలు టౌన్: వ్యవసాయ రంగంలో సంక్షోభం నివారించేందుకు స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయడం ఒక్కటే మార్గమని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య చెప్పారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధరలు లభించి వ్యవసాయాన్ని కొనసాగిస్తారన్నారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో శనివారం ప్రొఫెసర్ స్వామినాథన్ శత జయంతి సభ జరిగింది. సభకు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జజ్జూరి జయంతిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు వామపక్షాల డిమాండ్ మేరకు యూపీఏ ప్రభుత్వం 2004లో స్వామినాథన్ కమిషన్ వేసిందని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన స్వామినాథన్ ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు తీసుకొని ఉంటే రైతులు రోడ్డెక్కే దుస్థితి ఉండేది కాదన్నారు. కమిషన్ నివేదిక ప్రకారం పేదల చేతికి భూమి ఇవ్వకుండా సామాజిక సమానత్వాన్ని సాధించడం కష్టమని చెప్పారని తెలిపారు. ప్రభుత్వం మద్దతు ఉంటేనే వ్యవసాయరంగం సుభిక్షంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రాజెక్టును నిర్మించడం ద్వారా సాగుకు అవసరమైన నీరిందివ్వాల్సిన అవసరముందన్నారు. మద్దతు ధరలను నిర్ణయించడంలో సీ2 ప్లస్ 50 ఫార్మూలాను అమలు చేయాలని స్వామినాథన్ సూచించారని చెప్పారు. కమిషన్ సూచనలను పాటించకపోగా వ్యవసాయ రంగంలో 10 శాతానికి మించి ఉండాల్సిన అవసరం లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలతో రైతులు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. వ్యవసాయాన్ని కాపాడుకోవడం దేశ ప్రజలందరి బాధ్యతని, ఇందుకోసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో శ్రీకాంత్ కొల్లూరు, బెజవాడ వెంకటేశ్వర్లు, అబ్బూరి శ్రీనివాసరావు, గాలి వెంకట్రామిరెడ్డి, సంతు వెంకటేశ్వర్లు, రాజశేఖరరెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రసాద్, ఊస వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తొలుత స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులచారు. -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
ఒంగోలు వన్టౌన్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా రెవెన్యూ అధికారి బి.చినఓబులేశు అన్నారు. నగరంలోని గిరిజన భవన్లో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఆర్ఓ మాట్లాడుతూ ఇటీవల పుల్లలచెరువు మండలం నరజాముల తండాలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల విషయంలో ఆటవీశాఖ అధికారులు అభ్యంతరం తెలపడంతో ఆయా భూములపై హక్కులను నిర్ధారించేందుకు కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ప్రత్యేకంగా సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారన్నారు. గిరిజన ఆవాస ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గిరిజనులు స్వశక్తితో జీవనోపాధులు పెంపొందించుకునేందుకు ప్రభుత్వం ఇస్తోన్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు గిరిజన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున డాక్టర్ బాలాజీనాయక్, డాక్టర్ లక్ష్మనాయక్ సహకారంతో అందించారు. కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, గిరిజన నాయకులు పేరం సత్యం తదితరులు పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో అడవిదుప్పి మృతి
సీఎస్పురం(పామూరు): మండలంలోని వి.బైలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుక్కల దాడిలో అడవి దుప్పి మృతి చెందింది. ఈ ఘటన శనివారం వెలుగుచూసింది. ఉదయం గ్రామ సమీపంలోనికి అడవి దుప్పి రాగా గమనించిన కుక్కలు దాన్ని వెంబడించాయి. గ్రామానికి సమీపంలోని జాలు వాగువద్ద కుక్కలు అడవి దుప్పిపై దాడిచేసి గాయపరిచి చంపేశాయి. సమీపంలో పొలాల్లో ఉన్న రైతులు ఈ విషయాన్ని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జగన్నాథ వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కేశవరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మృతి చెందిన అడవిదుప్పిని పరిశీలించారు. పశువైద్యాధికారి మునీర్ పోస్టుమార్టం చేశారు. ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు పొదిలి రూరల్: స్థానిక విశ్వనాథపురం ఆంజనేయస్వామి గుడి దగ్గర ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళితే..ఆంజనేయస్వామి ఆలయం దగ్గర స్పీడ్బ్రేకర్ ఉండటంతో నెమ్మదిగా వెళుతున్న ట్రాక్టర్ను వెనుక నుంచి వచ్చిన బస్సు తగలడంతో ట్రాక్టర్ ట్రక్కు పైభాగం కిందపడింది. బస్సు ముందుభాగం దెబ్బతింది. కత్తులతో దాడి ● ఇద్దరికి తీవ్ర గాయాలు పొదిలి: పట్టణంలోని విశ్వనాథపురంలో ఇద్దరు వ్యక్తులు కత్తులతో పరస్పరం దాడి చేసుకోవటంతో తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానిక ఒంగోలు, నంద్యాల రోడ్డులో రాజేశ్వరరావు పెట్రోల్ బంక్ ఎదురుగా శనివారం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..విశ్వనాథపురానికి చెందిన మాధవరెడ్డి అనే వ్యకి ఓ మహిళను గత కొంత కాలంగా ఫోన్లో వేధిస్తున్నాడు. ఈ విషయమై బాధిత మహిళ, బంధువులైన విష్ణువర్థన్రెడ్డి, మరొక వ్యక్తి మాధవరెడ్డిని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా వారి బంధువులు చికిత్స నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఇద్దరిని ఒంగోలుకు తరలించారు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వైద్యశాల వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. -
ఆదివాసీ చట్టాలు పట్టించుకోని ప్రభుత్వం
ఒంగోలు సిటీ: ఆదివాసీ చట్టాలను తుంగలో తొక్కి అటవీ భూములన్నింటినీ కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శనివారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కొమరం భీమ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకోవడం సంతోషదాయకమన్నారు. ప్రకృతికి దగ్గరగా బతుకుతున్న గిరిజనులు తమ జీవనోపాధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారన్నారు. ఆదివాసీల హక్కులు కాపాడేందుకు ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9వ తేదీని ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, వైఎస్సార్ సీపీ కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్) వై.వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్) బొట్ల రామారావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, ఇంటెలెక్చువల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు దేవరపల్లి అంజిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేళం మదు, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టరు కె.మల్లిఖార్జునరావు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పేరంప్రసన్న, ఆనం శ్రీను, పిగిలి శ్రీను, గాలేటి వెంకటేశ్వర్లు, కత్తి రవి, బాపట్ల లక్ష్మయ్య, జి.హరి, కనపర్తి గోవిందమ్మ, మేరీకుమారి, వాణి, సయ్యద్ అప్సర్, లక్ష్మికాంతం, రమణమ్మ, అమర్, బాషా, పొట్లూరి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, చుండూరి రవిబాబు -
మహిళల పాలిట శాపంలా కూటమి ప్రభుత్వం
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో మహిళల పాలిట కూటమి ప్రభుత్వం శాపంలా మారిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలు మహిళల జీవితాలను నాశనం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. మద్యం విక్రయాలు పెంచుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని, తాజాగా రూ.5 లక్షలు చెల్లించి పర్మిట్ రూంలు పెట్టుకునేలా అనుమతి ఇవ్వడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం షాపుల్లో 33 శాతం తగ్గించి, పర్మిట్ రూంలను రద్దు చేసి, ఊరూరా ఏర్పాటైన 43 వేల బెల్టు షాపులు పూర్తిగా రద్దు చేయడంతో మద్యం వినియోగం తగ్గిందన్నారు. కానీ దీనికి పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వమే మద్యం విక్రయాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజలు ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ ఆదాయం వస్తుందన్నట్లుగా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. మద్యం దుకాణం పక్కనే పర్మిట్ రూంలు ఏర్పాటు చేస్తే మద్యపానానికి అడ్డాగా మారతాయన్నారు. గుడి, బడి అని తేడా లేకుండా కూటమి ప్రభుత్వంలో ఎక్కడపడితే అక్కడ షాపులు ఏర్పాటు చేయడంతో మహిళలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. చాలా గ్రామాల్లో మద్యం బాటిళ్లను బెల్టుషాపుల్లో కాకుండా రోడ్డు పక్కన విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన నిర్ణయాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం అంతా పచ్చిమోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంతా పచ్చి మోసం అని విమర్శించారు. మహిళలకు బస్సుల్లో ఫ్రీ అంటూనే కొర్రీలు పెట్టారన్నారు. కేవలం పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లోనే మహిళలు ఫ్రీ జర్నీ అని ప్రకటించారనీ, ఈ సర్వీసులన్నీ దూర ప్రాంతాలకు వెళ్లవన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు 12 వేలు ఉంటే మహిళలకు సుమారు 6 వేల బస్సుల్లో మాత్రమే ఫ్రీగా ప్రయాణానికి అనుమతిస్తామనడం పచ్చిమోసం కాదా అని ప్రశ్నించారు. ఆర్డినరీ బస్సులు 30 కిలోమీటర్లు దాటి వెళ్లవనీ, ఎక్స్ప్రెస్ సర్వీసులు ఒక రూటులో 150 కిలోమీటర్లు మించి వెళ్లవని, అలాంటప్పుడు మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా బస్సుల్లో ఫ్రీ గా ఎలా తిరుగుతారని ప్రశ్నించారు. ఏడాది పాటు హామీలు ఏం ఇవ్వకుండా ఇప్పుడు అరకొరగా ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలంటే ఈ బస్సుల ద్వారా వెళ్లగలమా అని ప్రశ్నించారు. మాటిచ్చి మోసం చేయడం చంద్రబాబు నైజమన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మహిళా నాయకులు కనపర్తి గోవిందమ్మ, మేరీకుమారి, వి.వాణి, లక్ష్మీకాంతం, పేరం ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు. కుటుంబాల్లో చిచ్చు పెడుతోన్న మద్యం వినియోగం వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ -
గ్రామ స్వరాజ్యానికి తూట్లు
గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్య స్థాపనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఊరూరా సచివాలయాలు వెలిశాయి. మండల కేంద్రాలకు వెళ్లకుండా ఉన్న ఊర్లోనే ప్రజలకు అన్నీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఉన్నత లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. సచివాలయాల సేవలను నిర్వీర్యం చేసేలా పాలకులు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు మళ్లీ మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. నాడు కళకళలాడిన సచివాలయాలు.. ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. –సాక్షి, ఒంగోలు అర్జీదారులతో కిటకిటలాడుతున్న అల్లూరు సచివాలయం(ఫైల్) నాడునేడు -
బాబు మోసాలను వివరించండి
● మాజీ మంత్రి మేరుగు నాగార్జున మద్దిపాడు: సూపర్ సిక్స్ అంటూ అబద్ధాలతో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశాడని, బాబు మోసాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని వెల్లంపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబును రీకాల్ చేసేలా ప్రతి ఒక్కరూ ఆయన మేనిఫెస్టో అమలు చేయకుండా చేసిన మోసాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించాలని కార్యకర్తలకు సూచించారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదని, అటువంటి మోసగాడు రాష్ట్రానికి అవసరం లేదన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్నీ ఇచ్చేశామని బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును నమ్మితే ఆకాశంలో మేఘాలను చూసి కింద నీళ్లు ఒలకబోసుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. ప్రజలు ఆయన వాగ్దానాలు విని మళ్లీ మోసపోయామని తలలు బాదుకుంటున్నారన్నారు. ఇటీవల సింగపూర్ వెళ్లిన బాబు ఏపీకి ఎన్నివేల కోట్ల పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాబును నమ్మితే మోసం గ్యారెంటీ అని అన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ ఉపాధ్యక్షుడు వాక కోటిరెడ్డి, నాగులప్పలపాడు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, కాకర్లపూడి రజిని, పిచ్చిరాజు, నాదెండ్ల మహేష్, కాకర్ల సురేష్, రాయపాటి విల్సన్, కంకణాల సురేష్ అంజమ్మ, సుబ్బారెడ్డి, జయమ్మ, విష్ణు పాల్గొన్నారు. -
రజక వృత్తిదారులకు ఇళ్ల స్థలాలివ్వండి
ఒంగోలు టౌన్: రజక వృత్తిదారులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాయల మాలకొండయ్య డిమాండ్ చేశారు. రజక వృత్తిదారులకు ఇళ్ల స్థలాలు, సామాజిక భద్రత కల్పించాలని కోరుతూ ఈ నెల 25వ తేదీ కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఎల్బీజీ భవనంలో సంఘం నాయకులతో కలిసి ధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ జిల్లాలో రజక వృత్తిదారులపై పెత్తందారితనం, కుల వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమకు తగిన ఫలితం ఇవ్వమని అడగడం నేరంగా మారిందని, అలాంటి వారిని గ్రామ బహిష్కరణ చేస్తున్నారని చెప్పారు. గ్రామాల్లో రజక వృత్తి బలహీనపడడంతో అనేక మంది రజకులు పట్టణాలకు వచ్చి అపార్ట్మెంట్ వాచ్మెన్లుగా, ఇసీ్త్ర చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. కొంతమంది రజకులు ఇంటిపనివారిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని చెప్పారు. అపార్ట్మెంట్ యాజమాన్యాలు కనీస వేతనాలు చెల్లించడానికి సమ్మతించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి బట్టలుతికి వచ్చే మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేస్తున్నారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వృత్తి చెరువులపై భూమి హక్కులు కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని, గ్రామాల్లో శ్రమకు తగిన ఫలితం దక్కేలా చర్యలు తీసుకోవాలని, ఆధునిక ధోబీ ఘాట్లను నిర్మించాలని, ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ధోబీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రజకులకు సామాజిక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, 50 ఏళ్లు నిండిన వారికి సామాజిక పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ధర్నాలో రజకులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు డాక్టర్ కృష్ణయ్య, చీమకుర్తి కోటేశ్వరరావు, ఆవులమంద రమణమ్మ, సర్వేపల్లి యోగమ్మ, మంచికలపాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
తండ్రిని చంపాడని గొంతుకోసి..
● తీవ్ర గాయాలతో వైద్యశాలలో చికిత్స ముండ్లమూరు(దర్శి): తండ్రి చంపాడని కక్ష పెట్టుకున్న తనయుడు గొంతు కోసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి సుంకరవారిపాలెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది మే 20న నల్లబోతుల బ్రహ్మయ్య హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆయన కుమారుడు వీరాంజనేయులు వెంకటేశ్వర్లుపై కక్ష పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గ్రామంలో రామాలయం ప్రతిష్ట సందర్భంగా ఆలయం వద్ద భోజనాలు చేసి ఇంటికి వస్తున్న వెంకటేశ్వర్లును వీరాంజనేయులతో పాటు మరో ఇద్దరు కలిసి గొడవ పడ్డారు. ముగ్గురు కలిసి వెంకటేశ్వర్లును కిందపడేసి కత్తితో గొంతు కోసి పలు చోట్ల గాయాలు చేసి వెళ్లిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆటోలో అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు ఒంగోలుకు తరలించారు. బాలికపై లైంగిక దాడికి యత్నం దొనకొండ: మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన దొండపాటి బ్రహ్మయ్య అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన శనివారం జరిగింది. ఎస్సై త్యాగరాజు తెలిపిన వివరాల మేరకు..గ్రామానికి చెందిన బ్రహ్మయ్య గ్రామంలో పిల్లలతో కలిసి ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేసుకున్నాడు.. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే వెళ్లి తలుపులు కొట్టగా తలుపులు తెరుచుకోకపోవడంతో బలంగా తన్నడంతో తెరుచుకున్నాయి.. ఆ సమయంలో బాలిక ఏడుస్తూ ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇది గమనించిన బ్రహ్మయ్య అక్కడ నుంచి పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆ మృతదేహం నవీన్ది కాదు కొత్తపట్నం: ఒంగోలు అగ్రహారం గేటు వద్ద రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా లభించిన మృతదేహం ధన్యాసి నవీన్ది కాదని పోలీసులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా బోగోలు మండలం చినరాయనిపాలెం గ్రామానికి చెందిన ధన్యాసి నవీన్ బేల్దారీ పని నిమిత్తం కరీంనగర్ వెళ్లి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రజిత అనే యువతితో పరిచయమై ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవల కొత్తపట్నం మండలం మడనూరు గ్రామానికి చెందిన మరో యువతితో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో నవీన్ ఆ యువతి ఇంటికి రాగా బంధువులు మందలించి పంపించివేశారు. అయితే నవీన్ అప్పటి నుంచి కనిపించడం లేదు. దీంతో గత నెల 28వ తేదీన నవీన్ అదృశ్యమైనట్లు తల్లి కొత్తపట్నం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీ ఒంగోలు అగ్రహారం గేటు వద్ద మురుగు గుంతలో మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కొత్తపట్నం, తాలుకా పోలీసులు మృతదేహం వద్దకు చేరుకున్నారు. అయితే తల్లి ఫిర్యాదులో ఇచ్చిన గుర్తులు మృతదేహంపై లేకపోవడంతో కొత్తపట్నం ఎస్సై మృతదేహం మాది కాదని తాలుకా పోలీసులకు అప్పగించారు. అయితే తల్లి, బంధువులు మాత్రం మృతదేహం నా కుమారుడిదేనని వాదించడంతో పోస్టుమార్టం అనంతరం వారికి అప్పగించారు. అయితే మృతదేహం దుర్వాసన వస్తుండటంతో ఒంగోలు కమ్మపాలెం శ్మశాన వాటికలోనే దహన సంస్కారాలు చేశారు. అయితే కొత్తపట్నం ఎస్సై సుధాకర్బాబు నవీన్ ఫోన్కాల్స్ ఆధారంగా కరీంనగర్ వెళ్లి నవీన్ భార్యను విచారించారు. విచారణలో నవీన్ బతికే ఉన్నాడని, సోషల్ మీడియా ద్వారా కాల్స్ కూడా చేస్తున్నట్లు చెప్పింది. దీంతో ఆ మృతదేహం నవీన్ది కాదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
పాఠశాలల్లోకి నో ఎంట్రీ
బేస్తవారిపేట: కూటమి ప్రభుత్వ చర్యలు విద్యార్థులు, ఉపాధ్యాయుల స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను హరించేలా ఉన్నాయి. విద్యార్థి సంఘాలను నియంత్రించి, వారి గొంతును అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కూటమి సర్కారు. రాజ్యాంగం కల్పించిన విద్యార్థుల హక్కుకూ సంకెళ్లు వేస్తూ నిరంకుశ పాలనను కొనసాగిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2955 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, 188 జూనియర్ కాలేజీలున్నాయి. గత నెలలో విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో వసతుల లేమిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రభుత్వం విద్యార్థి సంఘాలపై కక్ష పెంచుకుని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాలకు అనుమతులు ఇవ్వద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల్లోకి రాకూడదంటూ మరో జీఓ విద్యను వ్యాపారంగా మార్చడం, వసతి గృహాల్లో నాసిరకమైన వసతులు, పలు సమస్యలు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు, అధిక ఫీజు వసూలు, అధిక ధరలకు పుస్తకాలు అమ్మడంపై విద్యార్థి సంఘాలు ప్రశ్నించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. విద్యా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కళాశాలలపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. దీంతో ప్రభుత్వం మరోసారి జూనియర్ కళాశాల్లోకి సైతం విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ మరో జీఓ జారీ చేసింది. విద్యార్థి సంఘాలు విద్యారంగంలోని సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల హక్కుల కోసం పోరాడటమే కాకుండా, విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి. నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహనను, హక్కులు, బాధ్యతలను నేర్పిస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ చర్యల వెనుక విద్యార్థి సంఘాలను అణచివేయడం ద్వారా ప్రశ్నించే, పోరాడే శక్తులను నిలువరించాలని, విద్యార్థుల్లో సామాజిక చైతన్యం లేకుండా చేయాలనే ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధమైనవని, నిరంకుశత్వ ధోరణికి నిదర్శనమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాల రాకపై నిషేధం కళాశాలల్లోకి సైతం అనుమతిలేదని జీఓ కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు -
టీడీపీ నేతల కక్ష సాధింపు
పొదిలి రూరల్: అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో సైతం ఏదో రకంగా సమస్యలు సృష్టించి వైఎస్సార్ సీపీ శ్రేణులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయించి వేధించేందుకు పావులు కదుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పొదిలి మండలంలోని కుంచేపల్లి గ్రామంలో పేరం వీరా బ్రహ్మారెడ్డి 50 ఏళ్ల క్రితం పూర్వకుల నుంచి సంక్రమించిన గ్రామ కంఠం భూమిలో ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఆయన కుమారుడు నాగిరెడ్డి గ్రామంలోని మరోచోట ఇల్లు నిర్మించగా ప్రస్తుతం అందులో ఉంటున్నారు. పాత ఇంటి స్థలం ఖాళీగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు నాగిరెడ్డికి చెందిన ఖాళీ స్థలంపై కన్నేశారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం గురువారం జనం లేని సమయంలో అధికారులతో వచ్చి స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన కంచె, రాళ్లు పీకేశారు. ఆ సమయంలో ఎవరైనా వచ్చి గొడవ చేస్తే కేసులు బనాయించాలని పథకం రచించారు. ఎవరూ లేనపుడు వచ్చి హడావుడి చేసి కంచె, రాళ్లు తొలగించారని, ఆ స్థలం తమ పూర్వీకుల నుంచి సంక్రమించినదని నాగిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకుడి స్థలంలో కంచె తొలగింపు పొదిలి మండలం కుంచేపల్లిలో ఘటన -
వసతి.. అధోగతి!
కనిగిరి రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వసతి గృహాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయనేందుకు కనిగిరి నియోజకవర్గంలో సంఘటనలే నిదర్శనం. హాస్టళ్ల తనిఖీకి వచ్చిన ప్రజాప్రతినిధులు, కొందరు అధికారుల ఎదటు విద్యార్థులు గోడు వెళ్లబోసుకున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న కనిగిరి మోడల్ స్కూల్ బాలికలు భోజనం నాణ్యంగా లేదని, మెనూ పాటించడం లేదని డీఈఓ, డీవైఈఓకు ఫిర్యాదు చేశారు. ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ సైతం కలెక్టర్కు, ఆ శాఖ ఉన్న తాధికారులకు ఫిర్యాదు చేశారు. మార్చి 8వ తేదీన కనిగిరి బీసీ గురుకుల బాలికల హాస్టల్ను తనిఖీ చేసిన మంత్రి సవిత ఎదుట విద్యార్థినులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. శ్రీదొడ్డు బియ్యం తినలేక పోతున్నాం. మెనూ సరిగా లేదశ్రీని మంత్రికి ఫిర్యాదు చేయగా సన్నబియ్యంతో భోజనం పెడతామని చెప్పి వెళ్లారు. కానీ ఇప్పటి వరకు ఆయా హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించలేదు. ఈనెల 3వ తేదీన ఆదివారం రాత్రి కనిగిరి సమీకృత బాలికల వసతి గృహాన్ని వెలిగండ్ల ఎస్సై కృష్ణ పావని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల, పాఠశాల విద్యార్థినులు చాలా మంది అన్నం తినకుండా అర్థాకలితో ఉన్నట్లు తెలిసింది. ఈనెల 4న సోమవారం అదే సమీకృత హాస్టల్స్ను ఎమ్మెల్యే ఉగ్ర తనిఖీ చేయగా వసతులు కల్పించాలని, మెనూ సక్రమంగా లేదని ఫిర్యాదు చేయడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియా వేదికగా బహిర్గతమైంది. ఈ నెల 6వ తేదీన మున్సిపల్ చైర్మన్ గఫార్ బీసీ బాలికల హాస్టల్ను తనిఖీ చేయగా అక్కడి విద్యార్థినులు తమకు ఇప్పటి వరకు శానిటరీ ప్యాడ్స్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలన్నీ హాస్టళ్ల నిర్వహణ తీరు, బాలికల సంక్షేమంపై సర్కారు నిర్లక్ష్య వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి. తనిఖీలతోనే సమస్యలు కొలిక్కి! బాలికల హాస్టళ్లలో వెల్ఫేర్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మెనూ పాటించకపోయినా, ఎలా వండినా తప్పనిసరిగా అదే తినాల్సిన పరిస్థితి హాస్టళ్లలో నెలకొంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు, ఐసీడీఎస్, మహిళా సమాఖ్య సంఘాలు, మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా అధికారులు, సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తరచూ హాస్టళ్లను తనిఖీ చేస్తే బాలికల సమస్యలు వెలుగులోకి వచ్చి కొంత మేరయినా పరిష్కారయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టు కూడా హాస్టళ్లను అధికారులు తనిఖీ చేసిన నివేదికలు తమ ముందు ఉంచాలని ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికై నా పాలకులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
నిరుపేద కుటుంబాల్లో విషాదం
పెద్దదోర్నాల: మండల పరిధిలోని చిన్నగుడిపాడు చెరువులో శుక్రవారం ఇరువురు బాలురు నీట మునిగి మృత్యవాత పడ్డారన్న సమాచారం జమ్మిదోర్నాల గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృత్యవాతపడ్డ పులుకూరి పవన్కుమార్(14) తండ్రి పులుకూరి గాలెయ్య ఏడేళ్ల క్రితమే మృతి చెందగా, చూపు సరిగా లేని తల్లి పులుకూరి రాకాటి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో మండల కేంద్రంలోని సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న కుమారుడు సెలవులకు ఇంటి వచ్చి మృత్యువాతపడటంతో తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. అదే కాలనీలోనే నివాసం ఉంటున్న పులుకూరి అద్భుత కుమార్(16) తండ్రి పెద్దపోలయ్య నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హమాలీ పనిపై వచ్చే సంపాదనతోనే ముగ్గురు పిల్లలను చదివించుకుంటున్నాడు. పెద్ద కుమారుడు నీట మునిగి చనిపోవడంతో పెద్దపోలయ్య, మేరీరాణి దంపతులు హృదయ విదారకంగా రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాతపడటంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా మట్టిని అక్రమంగా తరలించడం కోసం చెరువులో ఇష్టారీతిగా గుంతలు తీసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని మృతి చెందిన చిన్నారుల బంధువులు డిమాండ్ చేశారు. ఇద్దరు చిన్నారుల ఉసురు తీసిన ఈత సరదా మట్టి అక్రమ రవాణాకు తీసిన గుంతలే కారణమని బంధువుల ఆగ్రహం -
యువ ఆంధ్ర ప్రో కబడ్డీ అంపైర్గా శ్రావణి
వేటపాలెం: స్థానికి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న జరుబుల శ్రావణి యువ ఆంధ్ర కబడ్డీ సీజన్–1 కి రిఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్ర కబడ్డీ రిఫరీస్ బోర్డ్ నుంచి ఎంపికై నట్లు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కబడ్డీలో 30 నేషనల్స్ ఆడి జిల్లా కీర్తి ప్రతిష్టలను శ్రావణి నిలబెట్టారన్నారు. ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు వేటపాలెం విద్యార్థులు వేటపాలెం: రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ సరోజిని శుక్రవారం తెలిపారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా గురువారం బాపట్లలో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు సెలక్షన్స్ జరిగాయి. ఈ సెలక్షన్స్లో హైస్కూల్ చదువుతున్న కె.గాయత్రి, పి.బిందు వాలీబాల్ పోటీలకు, షేక్ నస్రీన్, ఎల్.వైష్ణవి కబడ్డీకి ఎంపికయ్యారని తెలిపారు. గుంటూరులో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారన్నారు. -
ఆధ్యాత్మిక పరిమళం
శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. సౌభాగ్యాన్ని, సిరిసంపదలను ప్రసాదించే వరలక్ష్మీ అమ్మవారిని ఆలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. ముత్తైదువులకు వాయినాలు ఇచ్చుకున్నారు. మరోవైపు చారిత్రక కంభం చెరువు కట్టపై తేరాతేజి (గరికతొక్కుడు) పండుగను ముస్లింలు వైభవంగా జరుపుకున్నారు. నూతన వధూవరులు కంభం చెరువులో పెళ్లినాటి దండలు వదిలి తమ మొక్కులు తీర్చుకున్నారు. కట్టపై ఉన్న దీనాషావలి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
పూరీ ఎక్స్ప్రెస్లో గంజాయి స్వాధీనం
● రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు ఒంగోలు టౌన్: గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టడంలో భాగంగా పోలీసులు, స్పెషల్ పార్టీ, ఈగల్ టీమ్, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది సంయుక్తంగా ఒంగోలు రైల్వే స్టేషన్లో శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ తో కలిసి రైల్వేస్టేషన్ పరిసరాలు, అనుమానస్పద పార్శిళ్లు, ప్రయాణికుల బ్యాగులను పరిశీలించారు. పూరి ఎక్స్ప్రెస్లో మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు నిమిత్తం జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. ఎవరైనా గంజాయి, మాదక ద్రవ్యాలను రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకొంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు ఆంజనేయులు, శ్రీకాంత్, మధుసూదన్ రావు, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. హజ్ యాత్రికులతో చంద్రబాబు డబుల్ గేమ్ ● ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ సాలార్ ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ నుంచి పవిత్ర హజ్ యాత్ర చేసే ముస్లింలతో చంద్రబాబు ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోందని ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ సాలార్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఇస్లాంపేటలో విలేకరులతో మాట్లాడుతూ... గన్నవరం నుంచి మక్కా యాత్రకు వెళ్లిన వారికి మాత్రమే సబ్సిడీ ఇచ్చి హైదరాబాద్, బెంగళూరు నుంచి మక్కా యాత్రకు వెళ్లి వచ్చిన ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికులకు మొండిచేయి చూపడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శమన్నారు. 2025వ సంవత్సరంలో గన్నవరం నుంచి దరఖాస్తు చేసుకొని హజ్ యాత్ర చేసి వచ్చిన 72 మందికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల సబ్సిడీ ఇచ్చి మొత్తం ముస్లిం సమాజానికి ఏదో పెద్ద మేలు చేసినట్లు ఫోజులు కొడుతోందని ధ్వజమెత్తారు. నిజానికి ఈ ఏడాది రాష్టానికి చెందిన హజ్ యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా మక్కాకు వెళ్లి వచ్చారని తెలిపారు. వారికి మాత్రం ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వలేదన్నారు. గన్నవరం ఎంబర్కేషన్ పాయింట్ నుంచి యాత్రికులు దరఖాస్తు చేసుకోవాలంటే ఇతర ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకునే వారి కంటే ఎక్కువ మొత్తలో వసూలు చేస్తున్నారని చెప్పారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హజ్ యాత్రికులకు తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి రూ.60 వేలు, ఇతరులకు రూ.30 వేలు సబ్సిడీ ఇవ్వడమే కాకుండా గన్నవరం ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లే యాత్రికుల నుంచి వసూలు చేసే అదనపు సొమ్మును కూడా తిరిగి చెల్లించిందని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగానే గన్నవరం ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్ర చేసే ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న అదనపు సొమ్మును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే హజ్ యాత్రికుల ప్రయాణ చార్జీల మధ్య వ్యత్యాసాన్ని సరి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. సమావేశంలో ఇన్సాఫ్ నాయకులు షేక్ ఇమ్రాన్, షేక్ ఆసిఫ్, షేక్ ఫయాజ్ పాల్గొన్నారు. -
పడిపోతున్న పొగాకు కనిష్ట ధరలు
కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో కనిష్ట ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గురువారం నిర్వహించిన వేలంలో పొగాకు కనిష్ట ధర కేజీ రూ.150 పలికింది. శుక్రవారం నిర్వహించిన వేలంలో ఒక్క రోజులోని పది రూపాయలు తగ్గి రూ.140 కు పడిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలం ప్రారంభం సమయంలో కనిష్ట ధర కేజీ రూ.260 ఉండగా తొమ్మిదో రౌండ్ మధ్యలోకి వచ్చేసరికి ప్రారంభ ధరతో పోలిస్తే దాదాపు రూ.120 పడిపోవడంతో రైతులు ఏం చేయాలని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. గత సంవత్సరం వేలంలో వేలం ప్రారంభించిన తర్వాత ధరలు పెరుగుతూ పోతే ఈ సంవత్సరం వేలం ప్రారంభించిన తర్వాత ధరలు తగ్గుతూ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక సంఖ్యలో బేళ్ల తిరస్కరణ ఒకవైపు, గిట్టుబాటు ధర లేక మరొక వైపు రైతులు తీవ్ర ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని పొగాకు రైతులు కోరుతున్నారు. పొగాకు కనిష్ట ధర కేజీ రూ.140 స్థానిక పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వేలంలో పొగాకు కనిష్టధర కేజీ రూ.140 పలికిందని ఇన్చార్జి వేలం నిర్వహణ అధికారి ఎం.సత్య శ్రీనివాస్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని కామేపల్లి పచ్చవ గ్రామాలకు చెందిన రైతులు 1022 బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. అందులో 842 బేళ్లు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 180 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ట ధర కేజీ రూ.282, కనిష్ట ధర కేజీ రూ.140, సరాసరి ధర కేజీ రూ.228.68 గా నమోదైంది. వేలంలో 25 కంపెనీలు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. టంగుటూరులో.. టంగుటూరు: స్థానిక వేలం కేంద్రంలో రోజురోజుకీ కనిష్ట ధరలు పడిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే 39 మంది కంపెనీ ప్రతినిధులు ఉంటున్నారు. కేవలం పట్టుమని 10 కంపెనీలే పొగాకు కొనుగోలు చేస్తున్నాయి. మిగిలిన కంపెనీ ప్రతినిధులు ఒకటో అరో బేళ్లు కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నారు. పొగాకు బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని, వేలంలో అన్నీ కంపెనీలు పాల్గొనటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. స్థానిక పొగాకు వేలం కేంద్రంలో నిర్వహించిన వేలంలో శుక్రవారం కనిష్ట ధర రూ.150కి పడిపోయింది. వేలం కేంద్రానికి మల్లవరప్పాడు, శివపురం, గొర్లమిట్ట, మట్టిపాడు గ్రామాలకి చెందిన రైతులు వేలానికి 832 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 628 కొనుగోలు చేయగా, 204 పొగాకు బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.281 కాగా, కనిష్ట ధర రూ.150 పలకగా, సరాసరి రూ.220.49 ధర పలికింది. ఈ వేలంలో మొత్తం 39 మంది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు -
వసతి బరువు!
రక్షణ కరువు..ఒంగోలు వన్టౌన్: కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ వసతి గృహాలు సమస్యలతో కునారిల్లుతున్నాయి. పేద విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన హాస్టళ్లలో కనీస రక్షణ కరువైంది. చాలా హాస్టళ్లకు ఇన్చార్జిలే ఉండడంతో విద్యార్థుల బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారు. సాక్షాత్తూ సంక్షేమశాఖ మంత్రి డోలబాల వీరాంజనేయస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గం సింగరాయకొండ బాలుర వసతి గృహం అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. జిల్లాలో ఇటీవల పలు హాస్టళ్లలో చోటుచేసుకున్న ఘటనలు ఒక్కసారి పరిశీలిస్తే అక్కడ నెలకొన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అవగతమవుతుంది. చాలా మంది వార్డన్లు హాస్టళ్లకు విజిటింగ్ ప్రొఫెసర్లుగా వచ్చిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగించేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 175 వసతి గృహాల్లో 17,250 మంది విద్యార్థులు ఉంటూ చదువుకుంటున్నారు. ఇందులో 24 ఎస్సీ, 18 బీసీ, 10 ఎస్టీ వసతి గృహాలు ఇన్చార్జిల పాలనలో నడుస్తున్నాయి. మంటల్లో విద్యార్థికి గాయాలు జూలై 25వ తేదీన సింగరాయకొండ బాలుర వసతి గృహం ఆవరణలో విద్యార్థి మంటల్లో పడి గాయపడ్డాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ముగ్గురు విద్యార్థులు వసతి గృహంలోని ఇసుక కుప్పల వద్దకు వెళ్లారు. హాస్టళ్లలో జరుగుతున్న పనుల కోసం ఉంచిన టర్పెన్టైన్ ఆయిల్ బాటిల్ను కిందవేసి వెలిగించాడు. ఆ తరువాత ఆ మంటలను చూద్దామని అక్కడికి వేగంగా వచ్చిన మరో విద్యార్థి ప్రమాదవశాత్తూ రాయి తట్టుకుని మంటలపై పడి గాయపడ్డాడు. బాలుడిని తోటి విద్యార్థులు ప్రథమ చికిత్స నిమిత్తం సమీపంలోని పీహెచ్సీకి తరలించారు. అక్కడ నుంచి 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. హాస్టల్కు రెగ్యులర్ వార్డన్ లేరు. ఒంగోలు అంజయ్య రోడ్డులోని కళాశాల వసతి గృహం వార్డన్ ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇన్చార్జి వార్డన్ 35 కిలో మీటర్లు ప్రయాణం చేసి ఇక్కడకు వస్తున్నారు. దీంతో ఈ వసతి గృహ అధికారి ఎక్కడా న్యాయం చేయలేక, సింగరాయకొండకు, ఒంగోలుకు ప్రయాణం చేయడంతోనే సమయం గడుస్తోంది. పాముకాటు..చికిత్సకు 150 కిలోమీటర్లు గిద్దలూరు సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహంలో జూలై 23వ తేదీన ఓ విద్యార్థిని పాముకాటు వేసింది. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతనిని వెంటనే గిద్దలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మార్కాపురం తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణిస్తేగాని విద్యార్థి ప్రాణం దక్కలేదు. స్థానికంగా ఉండే ఆస్పత్రులో అత్యవసర సేవలు సరిగా అందడంలేదనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. కనీసం వాచ్మన్ ఉన్నా సంఘటనను అడ్డుకునే ప్రయత్నం జరిగేది. ఆయనా అందుబాటులో లేడు. మొత్తంగా ఇన్చార్జి వార్డన్ల పాలనలో హాస్టల్ విద్యార్థులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం ఉన్నతాధికారులు వచ్చి హడావుడిచేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో వసతి గృహాల్లో విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారుతోంది. ప్రమాదం అంచున వసతి గృహ విద్యార్థులు ఇన్చార్జి వార్డ్డెన్లతో విద్యార్థులకు రక్షణ కరువు 52 వసతి గృహాలకు ఇన్చార్జిలే దిక్కు.. పర్యవేక్షణ లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు, వివాదాలు పట్టించుకోని ఉన్నతాధికారులు ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు సంక్షేమశాఖ మంత్రి సొంత జిల్లాలో అస్తవ్యస్తంగా వసతి గృహాలుఒంగోలు గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల మధ్య కొట్లాట.. చీమకుర్తి బాలికల వసతి గృహంలో బాలిక జడ కత్తిరింపు.. సింగరాయకొండ బాలుర వసతి గృహంలో మంటల్లో పడి విద్యార్థికి గాయాలు.. ఇలా జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో నిత్యం ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉన్నాయి. పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన వసతి గృహాలపై ఉన్నతాధికారుల దగ్గర నుంచి వార్డన్ వరకూ పర్యవేక్షణ కరువైంది. చాలా హాస్టళ్లు ఇన్చార్జుల పాలనలో ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. 175 హాస్టళ్లు ఉండగా అందులో 52 హాస్టళ్లకు ఇన్చార్జిలే దిక్కు. సంక్షేమశాఖ మంత్రి డోలబాల వీరాంజనేయస్వామి సొంత జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ నిలయాలుగా మారాయి. విద్యార్థి జడ కత్తిరింపు కలకలం... చీమకుర్తి బాలికల వసతి గృహంలో ఈ నెల 2వ తేదీన ఓ విద్యార్థిని జడ కత్తిరింపు కలకలం రేపింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక శుక్రవారం రాత్రి నిద్రపోయింది. శనివారం ఉదయం నిద్రలేవగానే జడ కత్తిరించి ఉండడంతో విస్తుపోయింది. వెంటనే ఈ విషయాన్ని సహచర విద్యార్థినులతో పాటు వార్డన్కు సమాచారం అందించింది. జిల్లాలో సంచలనంగా మారిన ఈ ఘటన సంక్షేమ హాస్టళ్లలో బాలికలకు భద్రత కరువైందన్న దానికి రుజువుగా నిలుస్తోంది. దాదాపు 180 మంది విద్యార్థినులు ఐదు గదుల్లోనే సర్దుకుంటున్నారు. ఇంతమంది బాలికలు ఉన్న హాస్టల్ వార్డన్ ఒంగోలులో ఉండి రోజూ గంటపాటు వచ్చి పోతుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకూ దోషులను తేల్చకపోవడం గమనార్హం. ఆడపిల్లలలకు ఇక్కడ రక్షణ కరువైందని బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన జరిగిందని తెలిసుకున్న మాజీ మంత్రి, సంతనూతలపాడు వైఎస్సార్సీపీ ఇన్చార్జి మేరుగు నాగార్జున హాస్టల్ను సందర్శించి బాలికలకు ధైర్యం చెప్పి వచ్చారు. అలాగే హాస్టల్లో బాలికలకు భద్రత కల్పించే విషయంలో ఉన్నతాధికారులు దృష్టిసారించాలని డిమాండ్ చేశారు.గిరిజన హాస్టల్లో డిష్యుం..డిష్యుం.. ఒంగోలు గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఈ నెల 2వ తేదీన కొందరు విద్యార్థులు తన్నుకున్నారు. సీనియర్, జూనియర్ విద్యార్థులతో పాటు బయట నుంచి వచ్చిన వారి మధ్య వివాదం జరిగి కొట్టుకోవడంతో ఇరువురికి గాయాలయ్యాయి. వారిని పక్కనే ఉన్న జీజీహెచ్కు తరలించారు. చదువు పూర్తయిన నలుగురు విద్యార్థులు, ఇంటర్న్ షిప్ పేరుతో హాస్టల్లో ఉంటున్నారు. అలాగే ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి అనధికారికంగా ఉంటున్నారు. వీరు రెగ్యులర్గా హాస్టల్లో ఉంటున్న విద్యార్థులతో గొడవపడ్డారు. అనధికారికంగా ఉంటున్న విద్యార్థులకు తోడుగా బయట నుంచి కొంత మంది వచ్చి హాస్టల్ విద్యార్థులను చితకబాదారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ అనధికారికంగా విద్యార్థులు ఉంటుంటే హాస్టల్ వార్డన్ ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ కూడా రెగ్యులర్ వార్డన్ లేరు. చీమకుర్తి గురుకులు పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆయన అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటారని తెలిసింది. -
ఓట్లు తీసేసేలా కేంద్ర ప్రభుత్వం కుట్ర
ఒంగోలు టౌన్: బీహార్లో దొడ్డిదారి విజయం కోసం దేశ పౌరులను ఓటు హక్కు లేకుండా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిరసిస్తూ దేశ వ్యాప్త పిలుపులో భాగంగా సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీపీఎం జిల్లా నాయకులు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా మాబు మాట్లాడుతూ మరో రెండు నెలల్లో బీహార్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాగైనా సరే అధికారం చేపట్టాలని బీజేపీ కుయుక్తులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఓటర్ లిస్టులో డబుల్ ఎంట్రీలు, విదేశీ ఓటర్లు ఉన్నారనే నెపంతో ఎస్ఆర్ఐ ప్రక్రియ ద్వారా 64 లక్షల ఓట్లను తొలగించిందని చెప్పారు. ఓటు హక్కు కోసం పౌరసత్వం కోసం నిర్దేశించిన డాక్యుమెంట్లను ప్రమాణికంగా పేర్కొనడం దొడ్డిదారిన ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండాను అమలు చేయడమేనని ధ్వజమెత్తారు. చట్టాల పేరుతో ప్రజల మధ్య విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఎం న్యూ డెమొక్రసి జిల్లా కార్యదర్శి సీహెచ్ సాగర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకున్న బీజేపీ దేశంలోని ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించడం ద్వారా ఓటర్ల హక్కులు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల సవరణ చేపట్టడం వెనక పెద్ద కుట్ర దాగుందని విమర్శించారు. బీజేపీ విజయం కోసం ఓట్ల తారుమారుకు పాల్పడుతోందని మండిపడ్డారు. దేశ ప్రజలంతా ఓటర్ల సవరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో పి.కల్పన, ఉబ్బా ఆదిలక్ష్మి, జయంతిబాబు, ఎం.రమేష్, పెంచాల హనుమంతరావు, బాలకోటయ్య, టి.రాము, మస్తాన్, దామా శ్రీనివాసరావు, సిహె చ్ లక్ష్మి నారాయణ, బంకా సుబ్బారావు పాల్గొన్నారు. ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహిస్తున్న వామపక్ష నాయకులు -
సాగులో ఉన్న పంట ధ్వంసం
మర్రిపూడి: మూడు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూమిలో ఉన్న కంది పంటను ఆ భూమి తమకు చెందిందంటూ ఓ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు ట్రాక్టర్తో దున్నివేసిన సంఘటన మర్రిపూడి మండలం ఎస్టీరాజుపాలెం గ్రామశివారులో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎస్టీరాజుపాలెం గ్రామానికి చెందిన గిరిజన రైతు పొన్నర్సు నాగేశ్వరరావు 33 ఏళ్ల క్రితం పొదిలి మండలం రాజుపాలేనికి చెందిన చిలకా వెంకయ్య, తుళ్లూరి పెద్దన్న వద్ద ఎస్టీరాజుపాలెం గ్రామ శివారులో సర్వే నంబర్ 178–2లో 4.32 ఎకరాలు, సర్వే నంబర్ 56–2లో 4.09 ఎకరాల భూమి కొనుగోలు చేసి అనుభవిస్తున్నారు. అప్పటి నుంచి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు సాగుచేసుకుంటున్నారు. అయితే, ఇటీవల ఆ భూమిని గతంలో అమ్మిన చిలకా వెంకయ్య కుటుంబానికి చెందిన వారసులు తమదంటూ వచ్చి సాగులో ఉన్న వారిపై గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో బాధితులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామిని ఆశ్రయించి తమ గోడు వెల్లబోసుకున్నారు. నేనున్నానని మంత్రి హామీ ఇవ్వడంతో సదరు భూమిలో కంది పంట సాగుచేశారు. ప్రస్తుతం కంది పంట మొలకెత్తింది. ఆ పంటను చిలకా వెంకయ్య కుటుంబ సభ్యులు, వారి బావ మరుదులు 3 ట్రాక్టర్లతో వచ్చి నిలువునా దున్నేశారు. అడ్డుకోబోయిన బాధితుడు, అతని కుటుంబ సభ్యులతో వాదనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితులు అడ్డం తిరిగితే అంతమొందించేందుకు సైతం మారణాయుధాలను పొలం వద్దకు ట్రాక్టర్లో తీసుకొచ్చినట్లు బాధితురాలు పొన్నర్సు శ్రీదేవి తెలిపారు. దీనిపై బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. సాగర్ కెనాల్లో గల్లంతైన యువకుడు మృతి దొనకొండ: మండలంలోని పోలేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బెజవాడ మనోజ్(18) బుధవారం చందవరం సమీపంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లి నీటి ప్రవాహంలో గల్లంతైన విషయం తెలిసిందే. గురువారం ఎస్సై టి.త్యాగరాజు పర్యవేక్షణలో పోలీస్, అగ్నిమాపక సిబ్బంది మనోజ్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ ఆపరేటర్ నాయక్ సహాయంతో మృతదేహాన్ని గుర్తించి, పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి తిరుపాలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్మీ జవాన్ ఇంట్లో చోరీ కంభం: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి నగలు, నగదు అపహరించిన సంఘటన స్థానిక వెంకటేశ్వరనగర్లో బుధవారం రాత్రి చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. స్థానిక న్యూ ఆల్ఫా స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న ఆర్మీ జవాన్ మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఇంటి బయట గేటు తాళం పగలగొట్టి ఉండటాన్ని పక్కింటి వారు గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి అందులోని వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. దీంతో స్థానికులు ఇంటి యజమానికి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై నరసింహారావు పరిశీలించారు. మార్కాపురం క్లూజ్ టీమ్ బృందం వేలిముద్రలు సేకరించింది. ఇంట్లో 2 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి పట్టీలు, రూ.50 వేల నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. ఇటీవల కాలంలో పట్టణంలో దొంగతనాలు పెరిగిపోతుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. పండగ పూట మృత్యు‘కీర్తన’ త్రిపురాంతకం: కళాశాలకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తండ్రితో కలిసి బైక్పై సంతోషంగా ఇంటికి వెళ్తున్న బాలికను మార్గమధ్యంతో మృత్యువు బలితీసుకుంది. ఈ సంఘటన త్రిపురాంతకం మండలంలోని కంకణాలపల్లి రోడ్డులో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. కురిచేడు పడమర మాలపల్లెకు చెందిన బుట్టి కీర్తన(17) త్రిపురాంతకంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వరలక్ష్మి వ్రతం, రెండో శనివారం, ఆదివారం.. ఇలా వరుసగా 3 రోజులు కళాశాలకు సెలవు రావడంతో తండ్రితో కలిసి బైక్పై ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో కంకణాలపల్లి వద్ద బైక్ అదుపు తప్పడంతో సీసీ రోడ్డుకు కీర్తన తల బలంగా కొట్టుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెకు స్థానిక వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం పల్నాడు జిల్లా వినుకొండ తరలించగా అక్కడ మృతి చెందింది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పిడుగుపాటుకు ఒకరు మృతి ● మృతుడు వీరరాంపురం గ్రామ వైస్ సర్పంచ్ హనుమంతునిపాడు: మండల పరిధిలోని వీరరాంపురం గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ గోనా దానయ్య(48) గురువారం సాయంత్రం పిడుగుపాటుకు మృతి చెందారు. వివరాలు.. దానయ్య వ్యక్తిగత పని నిమిత్తం బైక్పై నందనవనం వెళ్లి సాయంత్రం స్వగ్రామానికి తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలవడంతో రోడ్డు పక్కనే ఉన్న నందనవనం ఎంపీటీసీ నారాయణస్వామి పొలంలో రేకుల షెడ్ వైపు అడుగులు వేశారు. అదే సమయంలో పిడుగు పడటంతో దానయ్య అక్కడికక్కడే మృతి చెందారు. రేకుల షెడ్ కింద ఉన్న మరో ఇద్దరు షాక్కు గురై కాసేపటికి తేరుకున్నారు. మృతుడు దానయ్య భార్య సనీత అంగన్వాడీ కార్యాకర్తగా పనిచేస్తూ అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందింది. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. అందరితో కలివిడిగా ఉండే దానయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆవును ఢీకొట్టిన ఆటో ● వృద్ధురాలు మృతి.. మరో ముగ్గురికి గాయాలు కంభం: ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రోడ్డుపై అడ్డుగా వచ్చిన ఆవును ఽఢీకొట్టిన ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం రాత్రి అనంతపురం–అమరావతి హైవే రోడ్డుపై కంభం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. కందులాపురం సెంటర్ నుంచి జంగంగుంట్లకు వెళ్తున్న ఆటో గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద అడ్డుగా వచ్చిన ఆవును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దూదేకుల సిద్ధమ్మ(65) మృతి చెందగా వెంగమ్మ, ఖాసింబి, ఆటో డ్రైవర్ ఓబుల్ రెడ్డికి మోస్తరు గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని, క్షతగాత్రులకు కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 33 ఏళ్లుగా అనుభవంలో ఉన్న గిరిజన రైతు మొలకెత్తిన పంటను అక్రమంగా దున్నిన అమ్మకందారుని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించిన గిరిజనులు -
రైతు గోడు పట్టని ప్రభుత్వం
ఒంగోలు సబర్బన్: పొగాకు రైతుల గోడును కనీసం విననైనా వినకుండా, కననైనా కనకుండా కళ్లులేని కబోదిలా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలకులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, పార్టీ నాయకులతో కలిసి ఒంగోలు–2 పొగాకు వేలం కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. స్థానిక త్రోవగుంటలోని వేలం కేంద్రంలో వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. రైతులు, పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న వేలం గురించి తెలుసుకున్న మేరుగు నాగార్జున.. పొగాకు రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావన్నారు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను నిలువునా మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. పొగాకు వ్యాపార కంపెనీలతో ప్రభుత్వం చేతులు కలిపి మరీ పొగాకు రైతును నట్టేటముంచే పనిలో ఉందన్నారు. చంద్రబాబు సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పొగాకు రైతు కుదేలవుతుంటే చూడలేక మరో దఫా వేలం తీరును పరిశీలించేందుకు తాము వచ్చామన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతుల బాధలను కళ్లారా చూసేందుకు పొదిలి వచ్చారన్నారు. పొగాకు రైతులు పడుతున్న కష్టనష్టాలపై కేంద్రానికి, రాష్ట్రానికి లేఖలు కూడా రాశారని గుర్తు చేశారు. అసలు రైతులను ఏం చేయాలనుకుంటున్నారు చంద్రబాబూ అంటూ మేరుగు నాగార్జున ప్రశ్నించారు. పొగాకు రైతును పాతాళానికి నెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా పొగాకు ధర రూ.28 వేలకు వెళ్తే.. చంద్రబాబు ప్రభుత్వంలో అదికాస్తా రూ.15 వేలకంటే కిందకు దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ బర్లీ పొగాకును రైతులందరి వద్ద కొనుగోలు చేయకుండా టీడీపీ నాయకులకు చెందిన పొగాకును మాత్రమే చీటీలు తీసుకుని మరీ కొనుగోలు చేయటం దుర్మార్గమైన చర్యని అన్నారు. కుదేలవుతున్న రైతులను చూస్తూ ఉండలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను తాను వేడుకుంటున్నానని, చంద్రబాబు వద్దకు వెళ్లి పొగాకు రైతులను ఏ విధంగా ఆదుకుంటారో అడగాలని సలహా ఇచ్చారు. నాణ్యమైన పొగాకుకు కూడా రూ.280 దాటడం లేదు : చుండూరు రవిబాబు నాణ్యమైన పొగాకును కూడా కేజీ రూ.280 దాటకుండా కొనుగోలు చేస్తున్నారంటే.. వ్యాపారులు, ప్రభుత్వం ఏ విధంగా లాలూచీపడ్డారో అర్థమవుతోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. వ్యాపారులు, ప్రభుత్వ పెద్దలు కమ్మకై ్క పొగాకు రైతును నిలువునా అప్పులపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పొగాకుకు డిమాండ్ క్రియేట్ చేయటంలో పొగాకు బోర్డు తీవ్రంగా వైఫల్యం చెందిందన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు సిగ్గుపడాలన్నారు. కనీసం చంద్రబాబుతో మాట్లాడి రూ.200 కోట్లు తీసుకొచ్చి రిజెక్టు చేసి వెనక్కుపంపుతున్న పొగాకును కొనుగోలు చేయలేని ఎమ్మెల్యేలు ఎందుకున్నారంటూ ఆయన ప్రశ్నించారు. రైతుల్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు మాట్లాడుతూ లో గ్రేడ్ పొగాకును వెనక్కుపంపే పనిలోనే వ్యాపారులు, బోర్డు ఉన్నాయన్నారు. ఇంత పండించండి అని ఆఽథరైజేషన్ ఇచ్చి మరీ కొనుగోలు వద్దకు వచ్చేసరికి ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నారని నిలదీశారు. రాష్ట్రంలో రూ.1.93 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు రూ.500 కోట్లు ఇచ్చి పొగాకు రైతును ఆదుకోలేడా అంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడు బీఎస్ఆర్ మూర్తి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, నాయకులు కాట్రగడ్డ మహేష్ బాబు, పోలవరం శ్రీమన్నారాయణ, రైతులు పాల్గొన్నారు. పొగాకు రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలం ఆత్మహత్యలు చేసుకునే స్థితికి రైతులను తీసుకెళ్తున్న పాలకులు ఒంగోలు–2 పొగాకు వేలం కేంద్రంలో వేలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున -
రైతును ఆదుకోవాల్సిన బాధ్యత టీడీపీ ఎమ్మెల్యేలకు లేదా..
పొగాకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత టీడీపీ కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు లేదా.? రైతుల ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేలుగా జిల్లాలో గెలిచారు కదా.. మరెందుకు పొగాకు రైతుల కష్టాలు పట్టించుకోవటం లేదు. ఏదో నామమాత్రంగా బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన మంత్రి స్వామి పొగాకు రైతుల కష్టాలను సీఎం చంద్రబాబు దృష్టికి ఎందుకు తీసుకెళ్లడంలేదో ప్రజలకు చెప్పాలి. ఇంతటి తీవ్రమైన కరువులో జిల్లా రైతాంగం ఉండటంతో పాటు పొగాకు రైతు కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. పొదిలి వేలం కేంద్రానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు ధరలో కొద్దిగా కదలిక వచ్చింది. ఆ తర్వాత యథావిధిగానే వ్యాపారులు కూటమి కట్టి మరీ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు. – చుండూరు రవిబాబు, వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ లో గ్రేడ్ కోసం రూ.1000 కోట్లు కేటాయించాలి జిల్లాలోని రైతుల వద్ద ఉన్న లో గ్రేడ్ పొగాకు కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయిస్తేనే ఈ సంక్షోభం తీరుతుంది. క్వింటా రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలి. ఈ ఏడాది వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా వర్జీనియా పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కంపెనీలు, బోర్డు సూచనలకు అనుగుణంగా సాగుచేసిన రైతుకు సరైన దిగుబడులు రాక, గిట్టుబాటు ధర లభించక, వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు జరక్క తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. – పమిడి వెంకట్రావు, ఏపీ రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి -
చేనేత ఉత్పత్తులను ఆదరించాలి
ఒంగోలు సబర్బన్: చేనేత ఉత్పత్తులను ఆదరించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులతో కలిసి స్థానిక కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వదేశీ ఉద్యమంలో చేనేత ఉత్పత్తులు కూడా కీలకపాత్ర పోషించాయన్నారు. కాలపరీక్షను ఎదుర్కొని నిలబడిన చేనేత రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చారిత్రక విశిష్టత కలిగిన చేనేత రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం విద్యుత్, జీఎస్టీ రాయితీతోపాటు చేనేతకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. చేనేత సొసైటీలకు ఆప్కో నుంచి రావాల్సిన బకాయిలు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా చేనేత ఉత్పత్తులను సొసైటీలు విక్రయించుకునేలా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. మరో స్వాతంత్య్ర ఉద్యమంలా చేనేత ఉత్పత్తులను ఆదరించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఎల్డీఎం రమేష్ మాట్లాడుతూ చేనేతకారులకు ముద్ర రుణాలు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. చేనేత, జౌళి సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రఘునందన్ మాట్లాడుతూ ముద్ర పథకం కింద బ్యాంకు రుణాల కోసం 2024 – 25 సంవత్సరంలో 217 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 27 దరఖాస్తుదారులకు రూ.26 లక్షల రుణం మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం ఏడుగురు చేనేతకారులను జాయింట్ కలెక్టర్ సన్మానించారు. చేనేత వస్త్రాల ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వి.భీమయ్య, డెవలప్మెంట్ ఆఫీసర్ ఏ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ టి.వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముందుగా ప్రకాశం భవనం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీని డీఆర్ఓ బి.చిన ఓబులేసు ప్రారంభించారు. చేనేత రంగ విశిష్టతను ఆయన కొనియాడారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం -
9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ఒంగోలు వన్టౌన్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల 9వ తేదీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖాధికారి, ఎస్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ అధికారి వరలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు మినీ స్టేడియం పక్కనున్న గిరిజన భవన్లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 22న తపాలా జీవిత బీమా ఏజెంట్ల ఎంపిక ఒంగోలు వన్టౌన్: భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు కట్టించే ఏజెంట్లను ఎంపిక చేసేందుకు ఈ నెల 22వ తేదీ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టు ఆఫీసెస్ ప్రకాశం డివిజిన్ ఎండీ జాఫర్ సాధిక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న ఏజెంట్లకు వారు సేకరించిన పాలసీలపై ఆకర్షణీయమైన కమీషన్ చెల్లించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి పాసై 18 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. ప్రాంతీయంగా పరిచయాలు కలిగి ఇన్సూరెన్స్ గురించి తెలిసి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటాతో పాటు టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, 2 పాస్పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డుతో 22వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రకాశం పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఆంజనేయ కాంప్లెక్స్, భాగ్యనగర్ 2వ లైన్, ఒంగోలులో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులు రూ.5 వేలకు ఎన్ఎస్సీ, కేవీపీ అకౌంట్ రూపంలో సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని తెలిపారు. క్రీడా స్ఫూర్తి చాటాలి ఒంగోలు: ప్రతిఒక్కరూ క్రీడాస్ఫూర్తి చాటుతూ త్వరలో నిర్వహించనున్న సౌత్ జోన్ పోటీల్లో జిల్లా పతాకాన్ని రెపరెపలాడించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఓ చిన్నఓబులేసు పిలుపునిచ్చారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ పీ ఆనంద్ మినీ స్టేడియంలో గురువారం నిర్వహించిన 10 రకాల ఆటల పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జాతీయ పతాకంతో పాటు జిల్లా పతాకాన్ని, జిల్లా క్రీడాపతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ క్రీడాకారులు ప్రతిభ చాటేందుకు ఈ పోటీలు మంచి అవకాశమని అన్నారు. డీఈఓ కిరణ్కుమార్ మాట్లాడుతూ ఏ రంగంలో రాణించాలన్నా క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ఇది క్రీడాకారుల్లో ఎక్కువగా ఉంటుందని, అందువల్ల చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి జి.రాజరాజేశ్వరి మాట్లాడుతూ అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, హాకీ, వాలీబాల్ పోటీలు నిర్వహించి అండర్–22 విభాగానికి జిల్లా బాలబాలికల జట్లు ఎంపిక చేస్తున్నామన్నారు. ఎంపికై న జట్లు త్వరలో జరిగే సౌత్జోన్ పోటీల్లో తలపడతాయని తెలిపారు. అనంతరం పోటీలు నిర్వహించి జట్లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, క్రీడల ఇన్చార్జి వై.శీనయ్య, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి ఒంగోలు వన్టౌన్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు చెందిన అర్హత ఉన్న విద్యార్థులు తమ పోస్టుమెట్రిక్ అనంతర ఉపకార వేతనాల రెన్యువల్స్కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.లక్ష్మానాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గెలవలేకే రమేష్ యాదవ్పై దాడి
ఒంగోలు టౌన్: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో గెలుపుపై నమ్మకం లేకనే కూటమి పార్టీల పాలకులు, నాయకులు కలిసి వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై హత్యాయత్నానికి పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందారెడ్డి విమర్శించారు. పులివెందుల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని బీఆర్ అంబేడ్కర్, జ్యోతీరావుపూలే విగ్రహాలకు గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పార్టీ నాయకుడు రామలింగారెడ్డిపై కత్తులు, ఇనుపరాడ్లు, రాళ్లతో దాడి చేయడం అత్యంత హేయమైన చర్యని ఖండించారు. ఈ చర్యలు ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ఉన్నాయన్నారు. ఎన్నికల నియమావలిని అనుసరించకుండా కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పోలీసుల వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జన్సీ నడుస్తున్నట్లు కనిపిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. కొండపి పంచాయతీ ఎన్నికలలో వైఎస్సార్ సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న మేరీ అనే మహిళా అభ్యర్థిని కూడా ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి చేయడాన్ని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావులేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మంచిదికాదన్నారు. ఇలాగైతే 2029లో రానున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలు బయట తిరగలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, నాయకుడు బొట్ల రామారావు, నగర ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ఖాన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు... వైఎస్సార్ సీపీ నాయకుల నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నిరసన కార్యక్రమం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. తొలుత వన్టౌన్ సీఐ నాగరాజు పార్టీ నాయకులకు ఫోన్ చేశారు. ఇది మీ పరిధి కాదు కదా అని నాయకులు ప్రశ్నించిన వెంటనే టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు తెరమీదకు వచ్చారు. ఒకసారి పోలీసు స్టేషన్కు రావాలని బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావుకు ఫోన్ చేశారు. పోలీసు స్టేషన్కు వెళ్లిన ఆయనతో సీఐ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా నిరసన ప్రదర్శనలు చేయడానికి వీలులేదని హుకుం జారీ చేశారు. సమాచారం అందుకున్న చుండూరి రవిబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఇతర నాయకులు పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. పోలీసుల అనుమతి కోరుతూ లేఖ రాసిచ్చారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని చెప్పినప్పటికీ సీఐ వినలేదు. పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడి నుంచి వచ్చిన నాయకులు అంబేడ్కర్, పూలే విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా ముగ్గురు ఎస్సైలు వచ్చి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని, విగ్రహాలకు పూలదండలు వేయకూడదని అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయంలో చేసుకోవాలంటూ ఎస్సై సందీప్ ఉచిత సలహా ఇచ్చారు. దాంతో బొట్ల రామారావుకు ఎస్సైకు మధ్య వాదన జరిగింది. అయినప్పటికీ పార్టీ నాయకులను బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. పోలీసుల ఓవరాక్షన్పై పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇలాగైతే రేపు మీ పార్టీ కార్యకర్తలు రోడ్లపై తిరగలేరు కూటమి పార్టీలకు వైఎస్సార్ సీపీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, చుండూరి రవిబాబు హెచ్చరిక -
హామీలకు తూట్లు !
బకాయిలు కోట్లు..నల్ల బర్లీ పొగాకు చివరి ఆకు వరకూ కొంటాం.. ఇది వ్యవసాయ శాఖామంత్రి అచ్చెంనాయుడు చెప్పిన మాట.. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో 6,325 టన్నుల నల్ల బర్లీ పొగాకు ఉత్పత్తి కాగా, ఇప్పటి వరకుకొనుగోలు చేసింది కేవలం 860 టన్నులు మాత్రమే. అంటే, ఉత్పత్తిలో కేవలం 15 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. ఇందుకు రైతులకు చెల్లించాల్సిన రూ.7 కోట్ల బకాయిలు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అసలే మద్దతు ధర రాక అల్లాడుతున్న రైతులు కూటమి ప్రభుత్వ చర్యలతో మరింత ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఒంగోలు సబర్బన్: మిర్చి రైతును దగా చేసినట్టుగానే ప్రభుత్వం పొగాకు రైతునూ నయవంచన చేస్తోంది. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నా మని కూటమి ప్రభుత్వ పెద్దలు.. కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు 48 రోజుల కావస్తోంది. అయినా ఇంత వరకు ఒక్క రూపాయి కూడా రైతుకు చెల్లించలేదు. రైతులు పెట్టిన పెట్టుబడి, బయట తెచ్చిన అప్పులతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్న ఆలోచన కూడా చేయడం లేదు చంద్రబాబు ప్రభుత్వం. రైతుల వద్దే 5,465 టన్నులు... జిల్లాలో బ్లాక్ బర్లీ పొగాకు దాదాపు 6,325 టన్నులు ఉత్పత్తి అయినట్లు అధికారులు అంచనాలు రూపొందించారు. జిల్లాలోని దాదాపు 20 మండలాల్లో బ్లాక్ బర్లీ పొగాకు సాగు చేశారు. ప్రధానంగా నాగులుప్పలపాడు, రాచర్ల, మద్దిపాడు, ముండ్లమూరు, దొనకొండ, కురిచేడు, పామూరు, కొమరోలు, తాళ్లూరు మండలాల్లో అత్యధికంగా సాగు చేయగా, మరో 11 మండలాల్లో ఒక మోస్తరుగా సాగు చేశారు. మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని రైతులందరూ బ్లాక్ బర్లీ పొగాకును అక్కడకు తీసుకురావాలని సూచించారు. ఇంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయితే.. తొలుత 500 టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆ తర్వాత 800 టన్నులు అన్నారు. ప్రస్తుతానికి 1000 టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 400 మంది రైతుల నుంచి 860 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అయినా ఏ ఒక్క రైతుకూ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. ఇప్పటి వరకు జిల్లాలోని రైతాంగానికి దాదాపు రూ.7 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఆంక్షలతో చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం... రైతుల వద్ద ఉన్న చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆచరణకు వచ్చేసరికి ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 20 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయబోమని ప్లేటు ఫిరాయించింది. దానికితోడు 20 శాతానికి మించి తేమ శాతం ఉండరాదని కూడా స్పష్టంగా ఆంక్షలు విధించింది. ఇలాంటి సందర్భాల్లో సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇస్తారు. గరిష్టంగా ఐదు, 10 ఎకరాల పరిధిలోని రైతుల వద్ద పంట నిల్వలు కొనుగోలు చేయాలి. ఐదెకరాల్లోపు చిన్న రైతు దగ్గర సైతం దాదాపు 60 టన్నులకు తక్కువ కాకుండా పొగాకు నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం 20 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే మిగిలిన 40 క్వింటాళ్లను ఆ రైతు ఏం చేసుకోవాలి. కొనుగోలు చేస్తామని నమ్మించి మోసం చేసిన కంపెనీలు కొనుగోలు చేయకపోవడంతోనే ఈ సంక్షోభం ఏర్పడింది. పొగాకు రైతును నమ్మించి మోసం చేస్తున్న ప్రభుత్వం బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేస్తున్నామంటూ ఊరిస్తున్న వైనం జిల్లాలో 6,325 టన్నుల ఉత్పత్తి ఇప్పటివరకు కేవలం 860 టన్నులే కొనుగోలు ఒక్క రూపాయి కూడా రైతుకు చెల్లించని ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సింది రూ.7 కోట్లు దిక్కుతోచని స్థితిలో జిల్లాలోని పొగాకు రైతులు ఆశగా ఎదురుచూస్తున్న వర్జీనియా రైతులు... వ్యాపారుల చేతిలో చిక్కిశల్యమవుతున్న వర్జీనియా పొగాకు రైతులు కూడా మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయిస్తుందేమోనన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు ఇదేవిధంగా కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతుంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్ఫెడ్ను రంగంలోకి దించి రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయించారు. చివరకు లో గ్రేడుకు మంచి ధర రాగా ఎందుకూ పనికిరాని మాడు రకం పొగాకుకు కూడా అనుకోని విధంగా ధరలు పెరిగి రైతులు ఎంతో లాభపడ్డారు. కానీ, ప్రస్తుతం బ్లాక్ బర్లీ పొగాకులో ఉత్పత్తి అయిన దానిలో కనీసం 15 శాతం మాత్రమే కొనుగోలు చేసి రైతులను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇక వర్జీనియా పొగాకు రైతులను ఆదుకునే అవకాశాలు కనుచూపు మేరలో కనపడటం లేదని రైతు సంఘ నాయకులు అంటున్నారు. -
అర్జీల ఆడిట్లో నిర్లక్ష్యం వద్దు
– కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: గ్రీవెన్స్ అర్జీల ఆడిట్ విషయంలో నిర్లక్ష్యం వద్దని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. గ్రీవెన్స్ అర్జీలు పరిష్కారమవుతున్న తీరుతో పాటు పౌరసరఫరాలు, రెవెన్యూ సంబంధిత అంశాలపై బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జేసీ ఆర్ గోపాలకృష్ణతో కలిసి ఆమె సమీక్షించారు. ఆడిట్లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల విషయంలో పెండింగ్ ఉండకూడదన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నందున అర్జీదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలన్నారు. వృద్ధులకు నేరుగా ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీలో పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. పేదలకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే గుర్తించిన ప్లాట్లలో ఖాళీలు, సాంకేతిక ఇబ్బందులపైనా అధికారులతో ఆమె చర్చించారు. సమావేశంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, డీఎస్ఓ పద్మశ్రీ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి రవి, గ్రీవెన్స్ ఆడిట్ బృంద సభ్యులు పాల్గొన్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం ఒంగోలు టౌన్: నగర శివారులోని జగనన్న లే ఔట్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం... నగర శివారులోని అగ్రహారంలో జగనన్న లే ఔట్లో నీటి గుంతలో బుధవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే కొత్తపట్నం మండలం పోలీసు స్టేషన్లో మూడు రోజుల క్రితం ఒక మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోలీసులు వారికి సమాచారం ఇచ్చారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏ ఒక్కరూ బాధ్యతలు విస్మరించరాదు
● జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్టి షేక్ ఇబ్రహీం షరీఫ్ ఒంగోలు సబర్బన్: కార్మికులు, వాహనదారులు ఏ ఒక్కరూ బాధ్యతలు విస్మరించరాదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. స్థానిక వెంగముక్కల రోడ్డులోని రవాణాశాఖ డీటీసీ కార్యాలయంలో బుధవారం వాహనాల యజమానులకు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హక్కుల గురించి పోరాటం చేస్తుంటారని, కానీ బాధ్యతల గురించి పట్టించుకోరని గుర్తు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి వ్యక్తి వెనుక ఒక కుటుంబం ఉంటుందన్న విషయాన్ని విస్మరించకూడదన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె.రామచంద్రరావు మాట్లాడుతూ వాహన చోదకులు రహదారి భద్రతా నియమాలను పాటించాలన్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా రవాణా శాఖ అవగాహన కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్.సుశీల, డిప్యూటీ లేబర్ కమిషనర్ భవాని, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరిశింగరావు, బాలల హక్కుల పరిరక్షణ అధికారి దినేష్కుమార్, జేజే బోర్డు లీగల్ అడ్వైజర్ రత్నప్రసాద్, న్యాయ సేవ సహాయకులు వావిలాల సదాశివశాస్త్రి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఏ కిరణ్ ప్రభాకర్, ఎల్.సురేంద్ర ప్రసాద్, ఏఎంవిఐ కే.జయ ప్రకాష్, యు.ధర్మేంద్ర, బి.భాను ప్రకాష్, డి.జశ్వంత్, పరిపాలనాధికారులు డి.సుధాకర్, ఎం.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
తేరాతేజీ
అనుబంధాల సుమగంధంసహపంక్తి భోజనాలు చేస్తున్న ప్రజలు(ఫైల్) ● తేరాతేజీ వేడుకలకు సిద్ధమవుతున్న చారిత్రాత్మక కంభం చెరువు ● పెళ్లినాటి దండలను నీటిలో వదిలి మొక్కులు తీర్చుకోనున్న నూతన వధూవరులు ● వరుస సెలవు దినాలు కావడంతో సందర్శకులు పోటెత్తే అవకాశం కంభం: ఆధ్యాత్మికత, అనుబంధాలకు ప్రతీకగా భావించే తేరాతేజీ(గరిక తొక్కుడు) పండగకు చారిత్రాత్మక కంభం చెరువు కట్ట సిద్ధమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేవలం కంభంలో మాత్రమే నిర్వహించుకునే ఈ పండగకు ముస్లింలు భారీ సంఖ్యలో తరలివస్తారు. శుక్రవారం పండగ సందర్భంగా కొత్త జంటలు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో చెరువు కట్ట కోలాహలంగా మారనుంది. ఇదీ పండగ విశిష్టత ఏటా ఆగస్టులో నెల పొడుపు కనిపించిన 13వ రోజు తేరాతేజీ పండగను ముస్లింలు నిర్వహించుకుంటారు. తేరాతేజీ నెలను చేదు నెలగా చెబుతుంటారు. కొత్తగా వివాహం చేసుకున్న జంటలు నెల పొడుపు కనిపించినప్పటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా 13వ రోజు తేరాతేజీ నాడు కంభం చెరువు కట్టపై కలుసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అక్కడే వారి పెళ్లినాటి దండలను నీటిలో వదిలి మొక్కులు తీర్చుకుంటారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. చెరువు కట్టపై ఉన్న దీనాషావళి దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. చెరువు కట్టపై ఉన్న పచ్చికను తొక్కితే ఆరోగ్యానికి మంచిదని ముస్లింల నమ్మకం. అందుకే గరికతొక్కుడు పండగగా పిలుస్తారు. చెరువుకట్టకు ఉదయాన్నే చేరుకుని సాయంత్రం వరకు అక్కడే గడిపి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో ఉన్న మామిడి చెట్ల ఆకులు తీసుకెళ్లి గుమ్మాలకు కట్టుకుంటుంటారు. పోటెత్తనున్న భక్తులు అధికారికంగా సెలవు దినం లేకపోయినా తేరాతేజీ పండగ కోసం ముస్లింలు ఎదురుచూస్తుంటారు. హైదరబాద్, గుంటూరు, కర్నూలు, బెంగళూరు తదితర దూరప్రాంతాల్లో స్థిరపడిన వారు పండగ రోజున కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన కంభం చేరుకుంటారు. అలాగే కర్నూలు, గుంటూరు, నంద్యాల, గిద్దలూరు, దొనకొండ, వినుకొండ తదితర ప్రాంతాలకు చెందిన ముస్లింలు కూడా చెరువు కట్టకు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇతర కులాలకు చెందిన వారు సైతం పిల్లలతో కలిసి సరదాగా చెరువు కట్టపైకి వచ్చి వెళ్తారు. రైలు మార్గంలో వచ్చే వారు కంభం చెరువు సమీపంలోనే రైళ్లను ఆపేసి అక్కడే దిగుతుంటారు. ఈ దఫా శుక్రవారంతోపాటు శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మూడు రోజులపాటు ప్రజలు చెరువు కట్టకు వచ్చే అవకాశం ఉంది. అధిక సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
బాబును నమ్మితే మోసం గ్యారంటీ
చీమకుర్తి రూరల్: మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని ఎర్రగుడిపాడు, మంచికలపాడు, బండ్లమూడి గ్రామాల్లో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అనే పథకాలతో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలుపొందిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక హామీలను తుంగలో తొక్కి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అనంతరం చంద్రబాబు మోసాలను తెలియజేసే క్యూర్ కోడ్ కలిగిన పత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు యనం శేషరెడ్డి శ్రీధర్ల శేషు, సీనియర్ నాయకులు ఓబుల్ రెడ్డి మాస్టారు, జి. ఓబుల్ రెడ్డి, గంగిరేకుల వెంకటరావు, నల్లూరి చంద్ర, మొగిలిచెట్టి వెంకటేశ్వర్లు, పొన్నపల్లి సుబ్బారావు, పెరికల నాగేశ్వరరావు, పొన్నపల్లి నాగేశ్వరరావు అత్యాల అంకయ్య మాగులూరి ఇమ్మానియేల్, జడ రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స.హ చట్టంపై అవగాహన అవసరం ఒంగోలు సబర్బన్: సమాచార హక్కు చట్టంపై ప్రకృతి వ్యవసాయ రైతులు, సిబ్బంది అవగాహన పెంపొందించుకోవాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వి.సుభాషిణి పేర్కొన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో మంగళవారం సమాచార హక్కు చట్టంపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స.హ చట్టం ఉద్దేశం, పౌరులు సమాచారం పొందే విధానం, అధికారుల విధులు, బాధ్యతలను వివరించారు. ఈ చట్టం ద్వారా ప్రజలు తమ హక్కులను ఎలా వినియోగించుకోవచ్చు, పాలక వ్యవస్థలో ఎలా జవాబుదారీతనం తీసుకురావచ్చో ఉదాహరణలతో విశదీకరించారు. ఈ సందర్భంగా పలువురి సందేహాలను నివృత్తి చేశారు. -
అంతా నా ఇష్టం..!
ఈ ఫొటోలో గేటు బయట దీనంగా ఎదురుచూస్తున్న వ్యక్తి ఎవరో కాదు. ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు. గత ఏడు సంవత్సరాలుగా పాఠశాల విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన ఘనత ఆయనిది. కానీ అదే ఆయనకు చేటు తెచ్చిపెట్టింది. పాఠశాల ప్రిన్సిపాల్ సదరు వ్యాయామ ఉపాధ్యాయుడిపై కక్ష కట్టి పాఠశాలలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. పీడీ రామారావును విధుల్లోకి తీసుకోవాలని విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినా ఆ ప్రిన్సిపాల్కు అవేం పట్టడం లేదు. నన్ను ఎవరేం చేయలేరన్న భావనలో ఆయన వ్యవహార శైలి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులే ఆరోపిస్తున్నారు.ముండ్లమూరు(దర్శి): ముండ్లమూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేయాల్సిన ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..ముండ్లమూరు మోడల్ స్కూల్లో 2018 నుంచి వ్యాయామ ఉపాధ్యాయునిగా రామారావు పనిచేస్తున్నారు. పీడీ రామారావు అప్పటి నుంచి పాఠశాల విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా సైతం తీర్చిదిద్దారు. రామారావు శిక్షణ జాతీయస్థాయిలో ఒకరు, రాష్ట్రస్థాయిలో నలుగురు, జిల్లా స్థాయిలో ఎంతో మంది విద్యార్థులు పాఠశాలలో రామారావు వద్ద శిక్షణ తీసుకొని రాణించారు. మండల స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు క్రీడల్లో విద్యార్థులకు మంచి గుర్తింపు వచ్చేలా తీర్చిదిద్దారు. అయితే రామారావుకు మంచి పేరు రావడం ప్రిన్సిపాల్ సహించలేకపోయారు. దీంతో గత ఏడాది విద్యార్థులను జిల్లా స్థాయి క్రీడలకు పోనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులను క్రీడలకు ఎందుకు పంపరని ప్రిన్సిపాల్ను పీడీ ప్రశ్నించారు. అప్పటి నుంచి కక్ష పెట్టుకున్న ప్రిన్సిపాల్..పీడీ విధులకు భంగం కలిగిస్తూ వస్తున్నాడు. జిల్లా స్థాయి పోటీలకు పిల్లలను పంపకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ను అడిగారు. దీంతో అప్పటి నుంచి తోటి ఉద్యోగి అన్న గౌరవం లేకుండా అందరి ముందు దుర్భాషలాడుతున్నాడు. విధుల్లోకి రానివ్వకుండా అడ్డగింత ఈ క్రమంలో నెల రోజులుగా పీడీ పాఠశాలకు రాకుండా ప్రిన్సిపాల్ అడ్డుకుంటున్నాడు. గేటు బయట వాచ్మెన్లు పెట్టి పీడీ లోపలికి రానివ్వడం లేదు. దీంతో ఏడు ఏళ్లుగా ఏ పాఠశాలలో విద్యార్థులను రాష్ట్ర, జాతీయస్థాయిలో తీర్చిదిద్దారో..అదే పాఠశాలలోకి ప్రవేశం లేక దీనంగా పాఠశాల గేటు బయట ఎదురుచూస్తున్నారు. ఇటీవల పాఠశాలలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వాచ్మెన్లు దాడి చేసి ఫోన్ పగులగొట్టారని పీడీ వాపోయారు. ప్రిన్సిపాల్ వ్యవహార శైలి పట్ల తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నన్ను ఎవరేం చేస్తారనే భావనలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, విద్యా శాఖ ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకోకుంటే మా పిల్లలను స్కూల్కు పంపమని చెబుతున్నారు. విధుల్లోకి తీసుకోమని చెప్పాం: కిరణ్కుమార్, డీఈఓ ఈ విషయమై డీఈఓ కిరణ్కుమార్ను ఫోన్లో వివరణ కోరగా..గతంలోనే పీడీ రామారావును విధుల్లోకి చేర్చుకోవాలని ప్రిన్సిపాల్ను ఆదేశించాం. కానీ చేర్చుకోలేదు. విద్యార్థుల క్రీడా భవిష్యత్ నాశనం అవుతుందని ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావుకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చాం. ఉన్నతాధికారులు సైతం తెలియజేశాం. ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా తదుపరి ముందుకు వెళతాం. ప్రిన్సిపాల్ నిర్వాకం.. పీడీకి సంకటం మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ ఇష్టారాజ్యం నెల రోజులుగా పీడీపై కక్ష సాధింపు రెన్యువల్ ఆర్డర్ వచ్చినా విధుల్లోకి తీసుకోకుండా ఇబ్బందులు క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు ప్రిన్సిపాల్ వైఖరిపై సర్వత్రా విమర్శలు -
హత్య కేసు కొట్టివేత
మార్కాపురం టౌన్: హత్య కేసులో నేరం రుజువు కానందున కేసు కొట్టివేస్తూ ఆరో అదనపు జిల్లా జడ్జి ఎం.శుభవాణి తీర్పు ఇచ్చినట్లు నిందితుల తరఫున న్యాయవాదులు లక్ష్మీకుమార్రెడ్డి, భూపని కాశయ్య, పురుషోత్తమనాయక్ బుధవారం తెలిపారు. వివరాలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం పట్టణానికి చెందిన సద్దుల గౌరి అలియాస్ గీత చీరల వ్యాపారం చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతుండేది. ఈ క్రమంలో జిల్లాలోని తాళ్లూరు మండలం దారంవారిపాలెం గ్రామానికి చెందిన ఎడ్లపల్లి అచ్చయ్యతో ఏర్పడిన పరిచయంతో సన్నిహితంగా మెలిగేది. వీరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో తేతపూడి వజ్రయ్య, కోటయ్య, అచ్చయ్య కలిసి 2010 ఆగస్టు 21న తాళ్లూరు మండలం తురకపాలెం గ్రామ పొలాల్లో ఆమెను గొంతునులిమి చంపారని తాళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే కేసులో సాక్షులను విచారించిన తర్వాత నిందితులపై నేరం రుజువు కానందున కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు.మద్యం తాగి వాహనాలు నడపొద్దు● ఎస్పీ ఏఆర్ దామోదర్ఒంగోలు టౌన్: మద్యం తాగి వాహనాలు నడపి భవిష్యత్తును దెబ్బ తీసుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. రాచర్ల మండలంలో మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తిని గిద్దలూరు కోర్టులో హాజరుపరచగా 50 రోజుల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక నుంచి జిల్లాలో రోజూ వాహనాలు తనిఖీ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తలిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిదొనకొండ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..దర్శి మండలం కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన గర్నెపూడి మోషే (25) టెంట్ హౌస్ సప్లయిర్స్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దొనకొండలోని బేతేలుపురానికి చెందిన రమ్యతో ఏడాది క్రితం వివాహమైంది. దొనకొండలో ఉన్న భార్య దగ్గరకు వచ్చిన మోషేకు తమ్ముడుకు బాగా లేదనే సమాచారంతో మంగళవారం రాత్రి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. చిన్నగుడిపాడు గ్రామం సమీపంలోని మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపై పడి పోయాడు. రాత్రి కావడంతో ఆలస్యంగా గుర్తించారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. చికిత్స పొందుతూ మోషే మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై టి.త్యాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.డిజిటల్ అసిస్టెంట్పై పంచాయతీ కార్యదర్శి వేధింపులు● అధికారుల ముందే పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన మహిళతాళ్లూరు: తాళ్లూరు సచివాలయం–1 డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహిళపై అదే సచివాలయంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి ఐవీ రమణారెడ్డి వేధింపులకు గురిచేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేధింపుల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక సదరు మహిళా డిజిటల్ అసిస్టెంట్ మదనపడుతోంది. ఈ క్రమంలో బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి హాజరైన సదరు మహిళా డిజిటల్ అసిస్టెంట్..కార్యక్రమానికి హాజరైన అధికారుల ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. పంచాయతీ కార్యదర్శి ఏ విధంగా వేధిస్తున్నారో వివరించి అధికారుల ముందే అతన్ని నిలదీసింది. దీంతో ఏం చేయాలో తెలియని పంచాయతీ కార్యదర్శి నీళ్లు నమిలాడు. పంచాయతీ కార్యదర్శి ఏ విధంగా వేధిస్తున్నాడో ఫోన్లో ఉన్న ఆధారాలను అధికారులకు చూపించింది. విషయం తెలుసుకున్న సదరు మహిళ కుటుంబసభ్యులు అక్కడకు చేరుకొని పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని చెదరగొట్టారు. సమస్య ఉంటే పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పారు. -
మంత్రి హామీలు నీటి మూటలేనా.. ?
● మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకుల ప్రశ్న ఒంగోలు టౌన్: సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు ఇస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇచ్చిన హామీ కేవలం నీటి మూటేనా అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొర్నిపాటి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహిచంచారు. ఈ సందర్భంగా కొర్నిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ...మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూలై 10 రోజుల పాటు సమ్మె నిర్వహించారని, అనంతరం జరిగిన చర్చల సందర్బంగా సమ్మె కాలపు వేతనాలను చెల్లిస్తామని మంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదన్నారు. జిల్లాలో చనిపోయిన, అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు అనేక మంది ఉన్నారని, ఆ స్థానంలో వారి కుటుంబసభ్యులకు ఉపాధి చూపాలని కోరుతుంటే అదుకు భిన్నంగా టీడీపీ కార్యకర్తలతో ఆయా స్థానాలను భర్తీ చేస్తున్నారని, ఇదేం న్యాయమని ప్రశ్నించారు. కోవిడ్ కార్మికులను ఆప్కాస్లో తీసుకోవాలని, కనీస వేతనాలను అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. ఒంగోలులో మున్సిపల్ కార్మికులపై రాజకీయ వేధింఫులు ఎక్కువయ్యాయని, సమస్యలు పరిష్కరించకుండా పనిభారాన్ని పెంచడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదన్నారు. మున్సిపల్ కార్మికులపై పనిభారాన్ని తగ్గించాలని, న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సామ్రాజ్యం, సుబ్బరాయుడు, పి.పద్మ, మరియమ్మ, ఏడుకొండలు, చెన్నమ్మ పాల్గొన్నారు. -
సాగర్ కాలువలో యువకుడు గల్లంతు
దొనకొండ: సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ సంఘటన బుధవారం దొనకొండ మండలంలోని చందవరం గ్రామ సమీపంలో సాగర్ కాలువ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. దొనకొండ మండలంలోని పోలేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బెజవాడ మనోజ్, ఎనిబెర నాని, దానియేల్ అనే ముగ్గురు యువకులు ఈత నేర్చుకునేందుకు కాలనీ నుంచి 3 కిమీ దూరంలో ఉన్న చందవరం సమీపంలోని సాగర్ కాలువ వద్దకు వెళ్లారు. ఇటీవల కాలువకు నీరు విడుదల చేయడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. గట్టుపై కూర్చున్న బెజవాడ మనోజ్(18) ఈత కొట్టాలనే తాపత్రయంతో కాలువలోకి దిగాడు. నీటి ప్రవాహ ఉధృతికి మనోజ్ కొట్టుకుపోతుండగా గట్టుపై ఉన్న స్నేహితులు పెద్ద పెట్టున కేకలు వేశారు. వారికి ఈత రాకపోవడంతో కాలువలోకి దిగేందుకు సాహసించలేదు. కనుచూపు మేరలోనే నీటి ప్రవాహంలో మిత్రుడు గల్లంతవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు హుటాహుటిన సాగర్ కెనాల్ వద్దకు వెళ్లి గాలించినా మనోజ్ ఆచూకీ లభ్యం కాలేదు. చేతికందివచ్చిన కుమారుడు కాలువలో గల్లంతవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
కొండపిలో కూటమి అక్రమాలు
ఒంగోలు సిటీ: కొండపి సర్పంచ్ ఎన్నికల్లో కూటమి నేతలు వైఎస్సార్ సీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. బుధవారం ఆయన ఒంగోలు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థను అడ్డంపెట్టుకుని మంత్రి, నాయకులు అడ్డగోలుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వైఎస్సార్ సీపీ అభ్యర్థుల దరఖాస్తులను ఫోర్జరీ సంతకాలతో ఎన్నికల అధికారికి సమర్పించి ఉపసంహరణల కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల అధికారులను సైతం లొంగదీసుకుని ఈ అక్రమాలకు తెగబడ్డారని ఆయన ధ్వజమెత్తారు. సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ముగ్గురు మహిళలు ముందుకు వచ్చారని, నామినేషన్ వేయకుండా వారిపై రకరకాలుగా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. వై కళ్యాణి, ఏ విమలమ్మ, పల్లె మేరి నామినేషన్లు వేశారని, నామినేషన్ల సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కళ్యాణి భర్త వసంతరావు పోలీస్ డిపార్టుమెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారని, ఆయన్ను సైతం భయాందోళనకు గురిచేసి బలవంతంగా నామినేషన్లు ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించారన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీ, కనిగిరి డీఎస్పీలకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే కళ్యాణిని ఎవరూ ఒత్తిడి చేయలేదని, ఆమే స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారని, వాటిని పోలీస్ స్టేషన్లో ఇచ్చిందని డీఎస్పీ మాట్లాడడం సరికాదని ధ్వజమెత్తారు. ఉపసంహరణ పత్రాలు ఎన్నికల అధికారికి ఇస్తారు కానీ పోలీస్ స్టేషన్లో ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. అధికారపార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి ఊరు విడిచి ఎక్కడో తలదాచుకున్న విమలమ్మ వద్దకు వెళ్లి టెర్రరిస్టులను వేటాడినట్టుగా వేటాడి వారి వద్ద నుంచి ఉపసంహరణ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. సమయం ముగిసినా కూడా ఎన్నికల అధికారి విమలమ్మ లేకుండా ఆమె పత్రాలను తీసుకుని ఉపసంహరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇక పల్లెమేరి ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమయ్యారని, నామినేషన్ వేసేందుకు రక్షణ కల్పించాలని కోరిందని, తాము వెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఆమె సంతకాలు ఫోర్జరీ చేసి ఉపసంహరించేలా చేశారని ఆరోపించారు. తాను పోటీలో ఉన్నానని చెబుతున్నా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కొండపిలో జరిగిన అక్రమాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కొండపిలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించి వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. 4వ తేదీ రాత్రి నుంచి అధికార కూటమి నేతల అరాచకాలు ప్రారంభమయ్యాయన్నారు. ఉపసంహరణల సమయం గంట ముందు వరకూ తనతో ఫోన్లో మాట్లాడిన ఎన్నికల అధికారి తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారంటే ఆయన పై మంత్రి, నాయకులు ఎంత ఒత్తిడి తీసుకొచ్చారో అర్థమవుతోందన్నారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని నామినేషన్ల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి న్యాయబద్ధంగా ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలకు తెగబడడం, ఓటర్లను, పోటీలో ఉండే అభ్యర్థులను కూటమి నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీపై జరిగిన దాడిని అందరూ ఖండించాలన్నారు. మాకు ప్రత్యర్థి అధికార కూటమా? అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికారులా? అన్న సందేహం కలుగుతోందన్నారు. నామినేషన్లు వేసిన నాటి నుంచి వేధింపులు.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారని పల్లె మేరి ఆరోపించారు. వారి చర్యలకు భయపడి ఊరు వదిలి వందల కిలోమీటర్లు దూరం వెళ్లి తలదాచుకున్నామని, తన భర్తను, పిల్లల్ని రకరకాలుగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. పోలీసులు, నాయకులు అందరూ టార్గెట్ చేశారని, అయినా తాను భయపడలేదని, ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ ఉపసంహరణ పత్రాలు అధికారులకు ఇచ్చారని ఆరోపించారు. తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అధికారులు న్యాయం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వ బెదిరింపులు దారుణం: ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ స్వేచ్ఛగా ఎన్నికలు జరగకుండా కూటమి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడం దారుణమన్నారు. ఇటువంటి నియంతృత్వ విధానాలకు త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శించారు. కార్యక్రమంలో యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ మారెడ్డి వెంకటాద్రిరెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ఢాకా పిచ్చిరెడ్డి, జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలు కనపర్తి గోవిందమ్మ, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు పుట్టా వెంకటరావు, పల్లె శివరావు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు బచ్చల కోటేశ్వరరావు, చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసరావు, ఇనకొల్లు సుబ్బారెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మారెంరెడ్డి గంగాధరరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు యామవరపు వీరవసంతరావు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికలు జరగకుండా కుట్రలు వైఎస్సార్ సీపీ నాయకులపై బెదిరింపులు అధికారులపై మంత్రి, నాయకుల ఒత్తిళ్లు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి అభ్యర్థులను బెదిరించారు ఎన్నికలు నిర్వహించే వరకూ పోరాడతాం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ -
ఎకై ్సజ్లో పచ్చ పెత్తనం
● ఉన్నతాధికారులను సైతం లెక్క చేయని కిందిస్థాయి సిబ్బంది ● సూపరింటెండెంట్తో ఒంగోలు ఎకై ్సజ్ సీఐ వాగ్వాదం ● అధికార పార్టీ అండదండలతో పొదిలి ఎకై ్సజ్ సీఐని దూషించిన ఎస్సై ● ఎకై ్సజ్ శాఖలో పెత్తనం చెలాయిస్తున్న టీడీపీ మద్దతు సీఐలు ● డీసీ కార్యాలయంలోని ఒక ఎల్లో సీఐ ఫిర్యాదుతోనే గతంలో ఈఎస్ ఖాజా మొహిద్దిన్పై వేటు ? ● సుమారు రూ.2.50 కోట్లు కాజేసిన అధికారపార్టీ సామాజిక వర్గానికి చెందిన కానిస్టేబుల్ ఎకై ్సజ్ శాఖలో పచ్చ పెత్తనం పెచ్చుమీరిపోయింది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నారు. అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన కొందరు ఉద్యోగులే బరితెగిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతూ ప్రశ్నించిన ఉన్నతాధికారులపై సైతం తిరగబడుతున్నారు. కానిస్టేబుళ్ల నుంచి సీఐ స్థాయి అధికారుల వరకూ అందరిదీ ఇదే తీరు. ఈ ప్రభుత్వం మాది మేమేం చేసినా చెల్లుబాటవుతుందన్న అహంకారంతో వ్యవహరించడం విమర్శల పాలవుతోంది. పొదిలి ఎస్సై సస్పెండ్... ఇటీవల పొదిలి ఎస్సై సైమన్ను సస్పెండ్ చేయడం ఎకై ్సజ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా కనీసం 10 నుంచి 15 బెల్ట్ షాపులను అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇదంతా అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పొదిలి ఎకై ్సజ్ ఎస్సై సైమన్కు ఒక వ్యక్తి వద్ద మూడు మద్యం బాటిళ్లు దొరికాయి. నిబంధనల ప్రకారం మూడు మద్యం బాటిళ్లు ఉండవచ్చు కనుక అతడిని ఆయన వదిలిపెట్టినట్లు సమాచారం. అయితే ఉన్నతాధికారులకు తెలియకుండా ఆయన బెల్ట్ షాపు నిర్వాహకుడిని పట్టుకొని వదిలేసినట్లు, ఈ విషయం గురించి ప్రశ్నించిన సీఐ అరుణకుమారిని దూషించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయనను మాత్రం ఆఘమేఘాల మీద సస్పెండ్ చేశారు. దీని మీద ఎకై ్సజ్ శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనా వ్యవస్థ కుప్పకూలిపోయింది. రాజకీయ జోక్యం మితిమీరడంతో అధికారులు చేష్టలుడిగి చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. అన్నీ ప్రభుత్వ శాఖల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పచ్చపార్టీ కార్యకర్తలు, నాయకులు నేరుగా ప్రభుత్వాధికారులను ఆదేశిస్తున్నారు. అవసరమైతే బెదిరింపులకు దిగుతున్నారు. ఎకై ్సజ్ శాఖలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఆ శాఖలో పనిచేస్తున్న అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులే బరితెగించి ప్రవరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఎకై ్సజ్ శాఖలో జరుగుతున్న పరిణామాలను ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొనవచ్చు. జిల్లా కేంద్రంలోని ఎలైట్ మాల్లో ఒక ఎకై ్సజ్ కానిస్టేబుల్ గుట్టుచప్పుడు కాకుండా రూ.2.50 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు బయటపడింది. అయినా ఆయన మీద ఈగ వాలకుండా కూటమి ప్రభుత్వం కాపు కాయడం చూసి ప్రజలు నోటిమీద వేలేసుకున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన మరికొందరు ఉద్యోగులు ఉన్నతాధికారులపై తిరగబడి మాట్లాడడం లాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఇటీవల ఒంగోలు ఎకై ్సజ్ సీఐ ఒకరు ఏకంగా ఎకై ్సజ్ సూపరింటెండెంట్తో వాదన పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఇదేం పద్ధతి అనిఅడిగితే మమ్మల్నెవరురా ఆపేది అంటూ కాలరెగరేస్తున్నట్లు సహోద్యోగులు చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మాది మేమేం చేసినా చెల్లుబాటవుతుందన్న అహంకారంతో వ్యవహరించడం విమర్శల పాలవుతోంది. పాత ఈఎస్ను సాగనంపారు... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈఎస్గా షేక్ ఖాజా మొహిద్దిన్ను పోస్టింగ్ ఇచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి కూటమి నాయకులకు సానుకూలంగా వ్యవహరించారు. మీడియాతో మాట్లాడే సమయంలో కూడా తన స్వామి భక్తిని దాచుకోకుండా కూటమి పాట పాడేవారు. ఎంత పచ్చసేవలో పావనమైనప్పటికీ ఆయనను అధికార పార్టీ సామాజిక వర్గం వదిలిపెట్టలేదని ప్రచారం జరుగుతోంది. డీసీ కార్యాలయంలో పనిచేసే అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక సీఐ ఆయనపై పెత్తనం చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. దీన్ని ఆయన అంగీకరించకపోయే సరికి కథ అడ్డం తిరిగింది. అప్పటిదాకా మావాడే అనిచెప్పిన తమ్ముళ్లు ఆయనను సాగనంపేందుకు ప్లాన్ చేశారు. ఎల్లో సీఐ కనుసన్నల్లో కమిషనర్కు ఫిర్యాదులు పంపించినట్లు సమాచారం. అంతటితో ఊరుకోకుండా కమిషనర్ కార్యాలయంలో చక్రం తిప్పడంతో కూటమి ప్రభుత్వం ఖాజా మొహిద్దిన్ మీద వేటు వేసినట్లు తెలుస్తోంది. 2024 సెప్టెంబర్లో ఒంగోలులో ఈఎస్గా బాధ్యతలు చేపట్టిన ఆయన చేత అన్నీ రకాలుగా ఊడిగం చేయించుకొని కేవలం 9 నెలలకే ఇంటికి పంపించారు. తన పరిధికి మించి కూటమి సేవ చేసినా ఆయనకు ఇప్పటి వరకు పోస్టింగు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఎకై ్సజ్ శాఖ ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. రూ.2.42 కోట్లు కాజేసినా చర్యల్లేవు...ఈఎస్ను లెక్కచేయని ఆబ్కారీ సీఐ.. జిల్లా కేంద్రమైన ఒంగోలు ఎకై ్సజ్ సీఐ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన సీఐ లీనా గత కొంతకాలంగా ఉన్నతాధికారులకు సహకరించడంలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం పోలీసు స్టేషన్ తనిఖీ నిమిత్తం వెళ్లారు. రికార్డు నిర్వహణ సక్రమంగా లేకపోవడాన్ని ప్రశ్నించారు. రికార్డులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. రికార్డులు ఇవ్వడానికి సీఐ తిరస్కరించడమే కాకుండా ఈఎస్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈఎస్ ఎదుటే చేతిలోని సెల్ఫోన్ను నేలకు విసిరి కొట్టి ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై అధికారితో దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉన్న ఉద్యోగులు విస్మయానికి గురయ్యారు. విధి నిర్వహణలో వైఫల్యం చెందడమే కాకుండా జిల్లా అధికారి పట్ల దురుసుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈఎస్ మీద దురుసుగా ప్రవర్తించిన సీఐ లీనాను కమిషనరేట్లో సరెండ్ మాత్రమే చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందన్న అహంకారంతోనే సదరు సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కొందరు కిందిస్థాయి ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఇదేరీతిలో తాము వ్యవహరించి ఉంటే ఇప్పటికే సస్పెండ్ చేసి ఉండేవారని అంటున్నారు. -
బాబు నైజం
నమ్మక ద్రోహం..పుల్లలచెరువు: తాము అధికారంలోకి వస్తే జగన్ కంటే రెండింతలు సంక్షేమ పథకాలు ఇస్తానని ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు సీఎం అయ్యాక ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. మండల కేంద్రంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం బుధవారం జిల్లా కార్యవర్గసభ్యుడు డి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయడం, అబద్ధాలు ఆడటం తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు రాష్ట్రంలో ప్రజలకు గుర్తుండే పథకం ఏదైనా చేశాడా అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని గుర్తు చేసుకుంటారని అన్నారు. పేద ప్రజల వద్దకు పరిపాలన తెచ్చిన ఘనత జగనన్నకు దక్కుతుందని అన్నారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఒక్కసారి 50 వేల డాక్టర్ పోస్టులు ఇచ్చిన ఘనత జగనన్నదన్నారు. బాబు ష్యూరిటీ అంటూ ఎన్నికల్లో గెలవక ముందు ఒక్కొక్క ఇంటికి రూ.6 లక్షలు, రూ.5 లక్షలు ఇస్తానంటూ చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారన్నారు. సూపర్సిక్స్ పథకాలంటూ 143 హామీలు అమలు చేస్తామని చెప్పి మళ్లీ ప్రజలను మోసం చేశారన్నారు. అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన తరువాత పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రెడ్బుక్ పేరుతో స్వీయ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో వారి దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి క్యూ ఆర్కోడ్ లను ఆవిష్కరించారు. దీనిని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. నియోజకవర్గంలో దోచుకోవడమే లక్ష్యంగా కూటమి నాయకులు: నియోజకవర్గంలోని కూటమి నాయకులు చేయని దోపిడీ అంటూ లేదని, ఇసుక, మద్యం, బియ్యం లాంటి అక్రమ పనులు చేస్తూ దోచుకుంటున్నారని అన్నారు. గ్రామాల్లోకి ఇసుక రావాలంటే కప్పం కట్టందీ రాదని, వస్తే వారిపై కేసులు నమోదు చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఇటీవల నియోజకవర్గంలో 20 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్ను జేసీబీలతో తవ్వుకుని కోట్ల రూపాయలు దోచుకునేందుకు కూటమి నాయకులు ప్లాన్ చేశారని, దానిని జిల్లా అధికారులకు తెలియజేసి ఆపేశామని అన్నారు. ఎస్టీలకు అన్యాయం: నియోజకవర్గ మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఎస్టీకి కేటాయిస్తే దానిని అగ్రవర్ణాల వారికి కట్టపెట్టారని ఇది ఎస్టీలకు అన్యాయం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఇదే జగనన్న పరిపాలలో ఎస్సీ, ఎస్టీలకు తగిన న్యాయం జరిగిందని, చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీలు అంటే ఏహ్యభావం ఉందని అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజనుల నృత్యాలతో స్వాగతం పలకగా, బస్స్టాండ్ సెంటర్ లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య సభావేదికకు చేరుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీ బి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఉడుముల అరుణ, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎల్.రాములు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జానకిరఘు, మాజీ ఎంపీపీ ఎం.సుబ్బారెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నీ పాలనలో గుర్తుండే పథకం ఒక్కటి చెప్పు బాబు సూపర్సిక్స్ పథకాలంటూ ప్రజలను మరోసారి మోసం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ సభలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం -
రాష్ట్రంలో రెడ్బుక్ పాలన
మార్కాపురం/తర్లుపాడు: పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల సమయంలో ఓటమి భయంతో కూటమి నాయకులు బరితెగించి బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్యాదవ్, వైఎస్సార్సీపీ నేత వేల్పుల రాముతోపాటు పలువురిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తమ నాయకులపై దాడి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తోందని అన్నారు. ప్రజలకు ఏం చేయాలి.. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి.. అనే అంశాన్ని మరచి రెడ్బుక్ పాలన నడిపిస్తున్నారని విమర్శిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్యాదవ్పై దాడికి దిగడం దారుణమన్నారు. ఒక ఎమ్మెల్సీకి పోలీసులు కనీస భద్రత కల్పించలేరా అని ప్రశ్నించారు. పులివెందులలో శాంతి భద్రతలు కాపాడేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో బీసీ నాయకులపై దాడులు పెరిగాయని వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మా రాజేంద్రప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బీసీ నేత, పులివెందుల శాసనమండలి సభ్యుడు రమేష్ యాదవ్పై మంగళవారం టీడీపీ గూండాలు చేసిన దాడిని ఆయన ఓ ప్రకటనలో ఖండించారు. ఇది బీసీలపై చేసిన దాడిగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. దాడి చేసిన నిందితులను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ రమేష్యాదవ్పై దాడిని ఖండించిన జంకె -
ప్రలోభాలు..బెదిరింపులు
సాక్షి, టాస్క్ఫోర్స్: కొండపి గ్రామ పంచాయతీ ఎన్నిక కూటమి ప్రభుత్వంలోని డొల్లతనాన్ని బయట పెట్టింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి లేవని నిరూపితమైంది. కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి టీడీపీ నాయకులు ప్రలోభానికి తెరలేపారు. మొదట వైఎస్సార్ సీపీతో 14 వార్డుల్లో 9 టీడీపీ, 5 వైఎస్సార్ సీపీకి, సర్పంచ్ టీడీపీ మద్దతు అభ్యర్థులకి కేటాయించేటట్లు ప్రలోభాలతో ప్రారంభించారు. ఈ ప్రతిపాదనను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తిరస్కరించి ఎన్నికల బరిలో సర్పంచ్ పదవికి, 14 వార్డు పదవులకు నామినేషన్ దాఖలు చేయించారు. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు సమీపించడంతో టీడీపీ అధిష్టానం ఎలాగైనా ఏకగ్రీవంగా గెలవాలని ఇందుకోసం సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించింది. మొదట నాయకుల చేత రాజీ చర్చలు ఫలప్రదం కాకపోవటంతో దండోపాయాన్ని ఎంచుకుని తమ తొత్తులైన పోలీసులను రంగంలోకి దించింది. దీంతో వీరు మంగళవారం ఉదయం నుంచే వైఎస్సార్ సీపీ మద్దతుతో పోటీలో ఉన్న ముగ్గురు మహిళా అభ్యర్థులు యనమద్ని కళ్యాణి, అడ్డగబొట్టు విమలమ్మ, పల్లెమేరిలను టార్గెట్ చేసి తమ పథకాన్ని అమలు చేశారు. మొదట కళ్యాణి ఇంటికి భారీగా పోలీసులతో వెళ్లి ఆమెను ఒక సీఐ బెదిరించి విత్డ్రా చేయించారు. తరువాత పక్క జిల్లాకు చెందిన సీఐను రంగంలోకి దింపి పల్లె మేరిని ప్రలోభపెట్టే పనిచేశారు. చివరగా విమలమ్మ ఎలాగైనా పోటీలో ఉండాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులకు దొరక్కుండా బస్సులో వెళుతుండగా టెక్నాలజీ సహాయంతో పసిగట్టి మరొక సీఐని రంగంలోకి దింపి అతని చేత వెళ్తున్న బస్సును ఆపి మరీ విమలమ్మను బెదిరించి ఆమె చేత బలవంతంగా వేలి ముద్రలు వేయించి నామినేషన్ విత్డ్రా చేయించారు. వాస్తవానికి 3 గంటలకల్లా నామినేషన్ విత్డ్రా కార్యక్రమం ముగించాల్సి ఉంది. కానీ ఎన్నికల అధికారి రవిబాబు ఆదేశాలతో మధ్యాహ్నం 3.15 గంటలకు గది తలుపులు మూశారు. దీంతో సర్పంచ్ ఎన్నికల జరుగుతుందని భావించారు. అయితే వైఎస్సార్ సీపీ అభ్యర్థులంతా విత్డ్రా చేసుకున్నారని, ఒక వేళ అభ్యర్థి విత్డ్రా చేయటానికి రాలేకపోతే ఆమె నామినేషన్కు ప్రపోజల్ పెట్టిన వారి చేత విత్డ్రా పత్రాలు సమర్పించవచ్చని ఆ ప్రకారం విత్డ్రా పత్రాలు ఎన్నికల అధికారి వద్దకు చేరాయని ఇక ఏకగ్రీవం అని ప్రకటించటమే తరువాయని టీడీపీ నాయకులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన ఆదిమూలపు సురేష్ ముందు జాగ్రత్త చర్యగా మేరి ఆరోగ్యంగా ఉందని, ఆమె అనారోగ్యంగా ఉండి రాలేని పరిస్థితిలో ఆమెకు ప్రపోజల్ సంతకం పెట్టిన వ్యక్తి ఫోర్జరీ సంతకాలతో విత్డ్రా ఫారం అందజేసే అవకాశం ఉందని, దానిని ఆమోదించవద్దని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి కలిసే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన సీఐ సోమశేఖర్ వెంటనే సురేష్ ఎన్నికల అధికారిని కలవాలంటే 5 గంటల తరువాతేనని చెప్పి అడ్డుకుని ఆయనను అక్కడి నుంచి పంపించేశారు. వీళ్లకో న్యాయం..వాళ్లకో న్యాయమా.. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియగా 3.15 గంటలకు ఎన్నికల అధికారి తలుపులు మూసి ఇంకెవరు విత్డ్రా లు చేసుకోవటానికి లేదన్నారు. కానీ టీడీనీ నాయకులు తరువాత కూడా కార్యాలయంలోకి వెళ్లి వస్తున్నా వారిని ఎవరూ అడ్డుకోలేదు. 3.45 గంటలకు కార్యాలయానికి వచ్చిన సురేష్ను ఎన్నికల అధికారిని కలవకుండా అడ్డుకుని పంపించేశారు. తరువాత 4 గంటల సమయంలో ఉపాధి హామీ పథకానికి చెందిన సిబ్బంది విమలమ్మ చేత సీఐ బలవంతంగా వేలిముద్రలు వేయించిన కాగితాలను తీసుకొచ్చి ఎన్నికల అధికారికి అందజేసి చివరికి ఎన్నిక ఏకగ్రీవం అని ప్రకటించారు. భారీ బందోబస్తు.. గ్రామ పంచాయతీ ఎన్నికల విత్డ్రా కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేయటంపై కొండపి గ్రామ ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించగా ఒక సీఐ, ఐదుగురు ఎస్సైలు, దాదాపు 150 సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థులను బెదిరించి విత్డ్రా చేసే క్రమంలో ప్రజలు ఏమైనా తిరగబడతారేమోనన్న అనుమానంతో ఈ విధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారా అని మండల ప్రజలు చర్చించుకున్నారు. ఆద్యంతం బెదిరింపుల పర్వం గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి విత్డ్రా ప్రక్రియ ముగించే వరకు పోలీసులు బెదిరింపుల పర్వం సాగించారు. మొదట వార్డు సభ్యులను సోమవారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల అధికారి 8 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరుల విత్డ్రాలను ఆమోదించారు. దీనిపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి సురేష్ ఎన్నికల అధికారి రవిబాబును నిబంధనల ప్రకారం ఎలా విత్డ్రాలు చేస్తారని ప్రశ్నిస్తే సాయంత్రం 5 గంటల లోపే వారి చేత విత్డ్రా చేయించానని బుకాయించే ప్రయత్నం చేశారు. దీనిపై సురేష్ స్పందిస్తూ 5 గంటల సమయంలో వారు తన వద్దే ఉన్నారని అలాంటప్పుడు విత్డ్రా ఎలా చేస్తారని ప్రశ్నించటంతో నీళ్లు నమలటం రవిబాబు వంతయింది. దీనిపై డీజీపీ, గుంటూరు డీఐజీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, మానవ హక్కుల సంఘానికి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్కు వాట్సాప్ ద్వారా సురేష్ ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని కోర్టులను ఆశ్రయిస్తానని తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యాలయానికి బందోబస్తు వైఎస్సార్సీపీ నాయకులు అడక్కుండానే పార్టీ కార్యాలయం వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లను సాధారణ దుస్తుల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. తరువాత కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారి వద్ద ముగ్గురు ఎస్సైలు, 10 మంది కానిస్టేబుల్స్ బందోబస్తు నిర్వహించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన వారు బయటకు వెళ్తుంటే రోడ్డు మొదట్లో ఎస్సై ప్రేమ్కుమార్ ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అడ్డుకున్నారు. చివరికి ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత కార్యాలయంలో విలేకరుల సమావేశానికి వస్తున్న విలేకరులను కూడా ఎస్సై స్థాయి అధికారి అడ్డుకునే ప్రయత్నం చేశారు. తరువాత కార్యాలయంలో విలేకరుల సమావేశం జరుగుతున్నంత సేపు డ్రోన్ కెమెరాతో వీడియో తీసే ప్రయత్నం చేశారు. ఈ విధంగా వైఎస్సార్ సీపీ నాయకులను అడుగడుగునా పోలీసులు అడ్డుకుని ఎట్టకేలకు సర్పంచ్ పదవిని టీడీపీకి అప్పగించారు. పోలీసుల కనుసన్నల్లో కొండపి పంచాయతీ ఎన్నికలు ఓటమి భయంతో పోలీసులనే నమ్ముకున్న టీడీపీ అధిష్టానం ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వానికి ఓటమే అంటున్న ప్రజలు ఫోర్జరీ సంతకాలు, బెదిరింపులతో ఏకగ్రీవం చేసుకున్న ప్రభుత్వం ముమ్మాటికీ అప్రజాస్వామిక గెలుపు అంటున్న వైఎస్సార్ సీపీ -
ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దు
ఒంగోలు సబర్బన్: తమ ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారని ఏఐటీఎఫ్యూ రాష్ట్ర నాయకుడు డీవీ స్వామి అన్నారు. ఈ మేరకు ఒంగోలు నగరంలోని సంతపేట వద్ద స్థానిక ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ ఒంగోలు నగర్ కార్యదర్శి టీ మహేష్ అధ్యక్షత వహించారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ విద్యుత్ రంగ ప్రైవేటీకరణలో భాగంగా అదానీ కంపెనీకి స్మార్ట్ మీటర్ల బిగింపునకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. స్మార్ట్ మీటరు బిగింపు విద్యుత్ వినియోగదారులందరికీ ప్రమాదకరంగా తయారవుతుందన్నారు. స్మార్ట్ మీటర్ల బిగింపునకు అయ్యే ఖర్చు కూడా ప్రజల మీద మోపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీలు పెంచే పద్ధతిలో భారాలు వేయటం అత్యంత దారుణమన్నారు. బిగించిన విద్యుత్ స్మార్ట్ మీటర్లు తొలగించాలని, ఇంటికి బిగించే స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలని, విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ రైతు సంఘం సంయుక్త జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్.కే మాబు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి, ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఎంఎస్ సాయిబాబా, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జి.కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు ఆర్.మోహన్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐద్వా, పెన్షనర్ల సంఘం, పట్టణ అభివృద్ధి కమిటీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలపై విద్యుత్ భారాలు రద్దు చేయాలి విద్యుత్ భవన్ వద్ద ధర్నాలో ఏఐటీఎఫ్యూ రాష్ట్ర నాయకుడు డీవీ స్వామినిరసన తెలుపుతున్న ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్కొండపి: కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. దాదాపు 14 ఏళ్ల తరువాత జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించిన దళిత మహిళల ఆశలను పోలీసుల అండదండలతో అడియాశలు చేశారని, ఇందులో టీడీపీ నాయకులు ప్రధానపాత్ర పోషించారని ఆరోపించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ నాయకుల అరాచకాలను సురేష్ వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయి విత్డ్రా కార్యక్రమం ముగిసే వరకు కూటమి నాయకులు పోలీసుల సహకారంతో అనేక వికృత విన్యాసాలు చేశారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించారని, దీంతో టీడీపీ నాయకులు పోలీసుల అండదండలతో అరాచకానికి తెరతీశారన్నారు. వైఎస్సార్ సీపీ మద్దతుతో బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. చట్టాలను, ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా 5 రోజుల ముందే పోలీసుల బెదిరింపులతో ఎన్నికలు ముగించారన్నారు. ముగ్గురు సీఐలతో బెదిరింపుల పర్వం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు, టీడీపీ నాయకులు, అధికారులు సంయుక్తంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు మహిళా అభ్యర్థులపై బెదిరింపు రాజకీయాలకు దిగారని ఇందులో ముగ్గురు సీఐలు ప్రధానపాత్ర పోషించారని ఆరోపించారు. మా మద్దతు అభ్యర్థుల్లో ఒకరైన యనమద్ని కళ్యాణి ఇంటికి ఒక సీఐ వెళ్లి బెదిరించి మరీ విత్డ్రా ఫారాలపై సంతకాలు తీసుకున్నారన్నారు. కళ్యాణి భర్త వసంతరావు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడని, నీ భర్త ఉద్యోగం ఎలా చేస్తాడో చూస్తామని బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ఈ విషయమై కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్కు సదరు సీఐపై ఫిర్యాదు చేస్తే ఆయన కొత్త కథ అల్లారని విమర్శించారు. అభ్యర్థి కళ్యాణి విత్డ్రా ఫారాలు తీసుకుని సీఐ వద్దకు వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయటం లేదని చెప్పిందని కట్టుకథ అల్లారని విమర్శించారు. ఏ అభ్యర్థి అయినా ఎన్నికల్లో విత్డ్రా చేయాలంటే ఎన్నికల అధికారి వద్దకు వెళ్తారే తప్ప పోలీసుస్టేషన్కు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. మరో అభ్యర్థి పల్లెమేరి చేత విత్డ్రా చేయించే బాధ్యత మరో సీఐ పై టీడీపీ నాయకులు పెట్టారన్నారు. ఈమె సుమారు 200 కిలోమీటర్ల దూరంలో పూర్తి ఆరోగ్యంగా ఉంటే .. అనారోగ్యంగా ఉందని విత్డ్రా చేయటానికి రాలేదని చెప్పి ఈమెకు ప్రపోజల్ చేసిన వ్యక్తి చేత విత్డ్రా ఫారాలపై ఫోర్జరీ సంతకాలు చేసి ఇచ్చారన్నారు. ఈ ఫోర్జరీ బాగోతంపై తాను ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేద్దామని వెళితే సీఐ సోమశేఖర్ తనను కలవకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మరో అభ్యర్థి అడ్డబొట్టు విమలమ్మ టీడీపీ నాయకుల నుంచి భద్రత లేకపోవటంతో విత్డ్రా సమయం ముగిసే వరకు బస్సుల్లో తిరుగుతుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఈమెను మద్దిపాడు వద్ద బస్సు ఆపి చదువురాని ఈమె చేత బలవంతంగా విత్డ్రా ఫారాలపై వేలిముద్రలు వేయించి సుమారు 4 గంటల సమయంలో ఆ విత్డ్రా ఫారాలను తీసుకొచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఒక ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగి చేత ఇప్పించారని ఆరోపించారు. ఈ విధంగా ఎన్నికల్లో పోలీసులు తమ పాత్ర పోషించి చివరికి ఎన్నికలు ఏకగ్రీవం అని ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేది మహిళా అభ్యర్థులు: కొంతమంది టీడీపీ నాయకులు సర్పంచ్ అభ్యర్థి విషయంపై అసభ్యకరంగా మాట్లాడారని.. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి మహిళ అని గుర్తు చేశారు. మగతనం అంటే ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని మహిళలను బెదిరించి అడ్డదారుల్లో గెలవటం కాదని, చేతనైతే దమ్ముంటే ప్రజాస్వామ్య యుతంగా స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి గెలవాలని హితవు పలికారు. ఎన్నికల ప్రక్రియను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, టీడీపీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో సురేష్ వెంట పార్టీ మండల అధ్యక్షుడు బచ్చల కోటేశ్వరరావు, ఢాకా పిచ్చిరెడ్డి, మారంరెడ్డి వెంకటాద్రిరెడ్డి, వసంత్రావు, దుద్దుగంట మల్లిఖార్జునరావు, బెజవాడ వెంకటేశ్వర్లు, చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసులు, ఇనకొల్లు సుబ్బారెడ్డి, బొల్లినేని నాగేశ్వరరావు, పెట్లూరి కృష్ణమూర్తి,వి మల్లిఖార్జునరెడ్డి, షేక్ సల్తాన్, షేక్ కరీం, పాకనాటి సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. పోలీసుల కనుసన్నల్లో కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికలు వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థులను సీఐలు బెదిరించారు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ -
పారిశుధ్య కార్మికులకు రాజకీయ వేధింపులు
● మస్టర్ పాయింట్ల వద్ద పారిశుధ్య కార్మికుల ఆందోళన ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులపై రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని సీఐటీయూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం మస్టర్ పాయింట్ల వద్ద కార్మికులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న వారిని వివిధ రాజకీయ కారణాలతో విధుల నుంచి తప్పించారన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని, 60 ఏళ్లు నిండిన వారికి జీఓ నంబర్–25 ప్రకారం ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు కార్మికులపై పర్యవేక్షణ పేరుతో పని జరగట్లేదని వివిధ కారణాలతో కార్మికుల్ని మస్టర్ ఆపేయటం, విధుల నుంచి తొలగించి మీ ఉద్యోగం తీసేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కార్మికులకు పీఎఫ్ గానీ, ఈఎస్ఐ కార్డులు గానీ పరిపూర్ణంగా అమలు చేయలేదన్నారు. చనిపోయిన కార్మికులకి పెండింగ్లో ఉన్న పీఎఫ్ క్లైమ్ చేయడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్మికులు చనిపోతే రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా కార్మికులకి అందలేదన్నారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు జి.నరసింహ, టి.విజయమ్మ, నాయకులు యు.రత్నకుమారి, మోహన్, రాములు, ఎద్దురవి, ఎం .బాబు, ఆర్ శ్రీనివాసరావు, పి సుబ్బారావు, ఆనంద్, కె. వెంకటేశ్వర్లు, ఎం లక్ష్మీకాంతం, నాగలక్ష్మి, కే వంశీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు మాయం
● పోలీస్స్టేషన్లో కేసు నమోదు ముండ్లమూరు(దర్శి): మండలంలోని శంఖరాపురం గ్రామానికి చెందిన 1బీ రికార్డు మాయమైంది. దీంతో ఆరుగురు రెవెన్యూ అధికారులపై మండ్లమూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..శంఖరాపురం గ్రామానికి చెందిన మేడికొండ వెంకటకృష్ణారావుకు, అదే గ్రామంలో మరొకరికి పొలం వివాదం ఉంది. 1బీ మాన్యువల్ రికార్డు చూసి న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను ప్రాధేయపడినా ఉపయోగం లేకుండాపోయింది. దీంతో కృష్ణారావు హైకోర్టులో కేసు వేశారు. ఈ రికార్డు అటు శంఖరాపురంలో వీఆర్వో వద్ద కానీ, ఇటు తహసీల్దార్ కార్యాలయంలో గానీ లేదు. దీంతో రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగానే మాయంచేసి ఉంటారని హైకోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. 1బీ రికార్డు మాయం వెనుక ఎవరెవరి పాత్ర ఉందో గుర్తించటంతో పాటు 2018 నుంచి 2022 వరకు పనిచేసిన రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈమేరకు కలెక్టర్ స్థానిక తహశీల్దార్ లక్ష్మీనారాయణను అప్పడు పనిచేసిన అధికారులపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఆయన ఫిర్యాదు మేరకు అప్పటి తహసీల్దార్లు జి.నాంచారయ్య, పాలపర్తి పార్వతి, అప్పటి డీటీ కె.రవికుమార్, ప్రస్తుత డీటీ అద్దంకి స్రవంతి, అప్పటి సీనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, అప్పటి శంఖరాపురం వీఆర్వో నంబూరి గురవయ్యలను అనుమానితులుగా భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కమలాకర్ తెలిపారు. ఆర్ఐఓగా ఆంజనేయులు బాధ్యతల స్వీకరణ ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకాశం జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారిగా ఇంటర్ విద్య అధికారిగా వ్యవహరిస్తున్న తాళ్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె. ఆంజనేయులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్ఐఓగా పనిచేస్తున్న ఏ సైమన్విక్టర్ ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణ అధికారిగా నియామకం పొందడంతో ఆ బాధ్యతలను కూడా డీఐఈఓ ఆంజనేయులకు అప్పగిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ కృతికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆంజనేయులు ఆర్ఐఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. -
కుమారుడిపై తండ్రి దాడి
పెద్దదోర్నాల: కుమారుడిపై తండ్రి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని అయ్యన్నకుంటలో సోమవారం రాత్రి జరిగింది. ఈ సంఘటనలో బయ్యన్న తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన కుడుముల వెంకటేశం భార్యపై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతని కుమారుడు బయ్యన్న..తండ్రిని అడ్డుకోవడంతో గొడ్డలిలో దాడి చేయడంతో అతని తలపై తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బయ్యన్నను బంధువులు చికిత్స నిమిత్తం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బిడ్డకు పాలిస్తే రొమ్ము క్యాన్సర్ దూరం ఒంగోలు టౌన్: నిర్ణీత కాలం వరకు బిడ్డకు పాలివ్వడం ద్వారా రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా తల్లులను కాపాడవచ్చని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం జీజీహెచ్లోని గైనకాలజీ విభాగంలో తల్లులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యరావు మాట్లాడుతూ...తల్లిపాలు తాగిన పిల్లలు బలంగా ఉంటారని, వారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని, తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. సృష్టిలో తల్లిపాలకు మించింది లేదన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్కుమార్ మాట్లాడుతూ సదస్సులో పాల్గొన్న మహిళలు ఇంటికి వెళ్లినప్పుడు తల్లిపాల ప్రాముఖ్యత గురించి చుట్టుపక్కల వారికి తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో గైనకాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ సంధ్యారాణి, పెడియాట్రిక్ హెచ్ఓడీ డాక్టర్ తిరుపతిరెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు ● మహిళ మృతి, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు చౌటుప్పల్ రూరల్: రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ ని కారు ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చిరుకూరపాడు గ్రామానికి చెందిన మద్దిరాల ప్రవీణ్కుమార్ బెంగళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ.. నెల రోజుల క్రితం హైదరాబాద్కు బదిలీ అయ్యాడు. హైదరాబాద్లోని ఈసీఐఎల్లో నివాసం ఉండడానికి ఇల్లు చూసుకున్నాడు. తన తల్లి గోవిందమ్మ(62), భార్య సుమతితో కలిసి అద్దె ఇంట్లో దిగేందుకు స్వగ్రామం చిరుకూరుపాడు నుంచి సోమవారం రాత్రి 9గంటలకు కారులో హైదరాబాద్కు బయల్దేరాడు. మార్గమధ్యలో మంగళవారం తెల్లవారుజామున చౌటుప్పల్ దాటిన తర్వాత బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారు ముందు సీట్లలో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్, అతడి భార్య సుమతికి స్వల్ప గాయాలయ్యాయి. వెనుక సీట్లులో కూర్చున్న ప్రవీణ్ తల్లి గోవిందమ్మకు ఛాతీ భాగంలో బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. గోవిందమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి మరిది మద్దిరాల నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. సీఐ మన్మథకుమార్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
ఉచిత బస్సు ఎలా.?
ఉన్న బస్సులతోమార్కాపురం: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న ప్రవేశపెట్టనున్న ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ అధికారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఉన్న బస్సులతో ఎలా నడపాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొత్త బస్సులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం కూడా కొత్త బస్సులపై ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో ఉన్న బస్సులను ఉచిత బస్సులుగా మారిస్తే కొన్ని రూట్లలో బస్సు సర్వీసులను రద్దు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ప్రయాణికుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఆ రూట్లలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటే సంస్థ ఆదాయం తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు..? మార్కాపురం డివిజన్లో మార్కాపురం, గిద్దలూరు, పొదిలి డిపోలు ఉన్నాయి. మార్కాపురం డిపోలో ప్రస్తుతం 90 ఆర్టీసీ బస్సులు, 16 హైర్ బస్సులు ఉన్నాయి. వీటిలో 50 పల్లెవెలుగు సర్వీసులు ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 39 వేల కిలోమీటర్లు తిరుగుతాయి. ఉచిత బస్సు అమలు చేస్తే మార్కాపురం, ఒంగోలు, నంద్యాల తదితర ప్రాంతాలకు నడిపే సర్వీసులను కొంత దూరం వరకే పరిమితం చేసే అవకాశం ఉంది. ఉచిత బస్సు అమలయ్యే తరువాత నుంచి మార్కాపురం నుంచి ఒంగోలుకు ప్రస్తుతం నడుపుతున్న ఆర్డీనరీ సర్వీసులను పొదిలి వరకు మాత్రమే నడపాలని అధికారులు తాత్కాలికంగా నిర్ణయించారు. ఇలా అయితే పొదిలి, ఒంగోలు మధ్య మార్కాపురం డిపో నుంచి ఆర్డినరీ సర్వీసులు తగ్గనున్నాయి. అలా చేస్తే ప్రయాణికులు ఇబ్బంది పడతారు. ఉచిత బస్ ప్రయాణంపై ఆర్టీసీ అధికారుల్లో టెన్షన్ తగ్గనున్న బస్ రూట్లు ఇప్పటికీ చాలా గ్రామాలకు ఆటోలే దిక్కు.. ఆ గ్రామాలకు ఆటోలే దిక్కు... ఇప్పటికీ మార్కాపురం, తర్లుపాడు మండలాల్లోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు ఆటోల్లోనే మార్కాపురం వస్తుంటారు. మార్కాపురం మండలంలోని బోడపాడు, రాజుపాలెం, నాగులవరం, నికరంపల్లి, తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు, మీర్జపేట, కారుమానిపల్లె తదితర గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ సౌకర్యం లేదు. ఈ గ్రామాల ప్రజలకు అత్యవసరమైనా సాధారణ పనైనా.. ఆటోల్లో, బొలెరో వాహనాల్లో పనులకు రావాల్సిందే. ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ నెల 15 నుంచి ప్రారంభించే ఉచిత సర్వీసులకు వీరు దూరం కానున్నారు. తమ స్వగ్రామాల నుంచి ఆటోల్లో మార్కాపురం వచ్చి తాము ప్రయాణం చేయాల్సిన గమ్యానికి వెళ్లాల్సిందే. ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం విషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఒక వైపు కొత్తబస్సులు రాకపోగా, ఉన్న బస్సులనే రాజధానికి జిల్లా కేంద్రానికి కేటాయిస్తే ప్రస్తుతం నడుస్తున్న సర్వీసుల్లో కొన్నైనా రద్దు చేయాల్సిందే. దీనితో ఎలా చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉచిత బస్సుపై ప్రజల్లో, ప్రభుత్వంపై వ్యతిరేకతో పాటు అయోమయం, గందరగోళం నెలకొంది. -
వెట్టిచాకిరీ నుంచి 40 మందికి విముక్తి
● ఒడిశా, చత్తీస్గఢ్వాసులకు రిలీఫ్ సర్టిఫికెట్లు ఇచ్చి స్వగ్రామాలకు.. ఒంగోలు సబర్బన్: టంగుటూరు మండలంలోని రెండు రొయ్యల పరిశ్రమల్లో వెట్టి చాకిరీ చేస్తున్న 40 మంది ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్ర వాసులకు జిల్లా అధికారులు విముక్తి కల్పించారు. ఈ మేరకు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వారికి రిలీఫ్ సర్టిఫికెట్లు అందించారు. పనిచేసిన కాలానికి చట్ట ప్రకారం వారికి రావాల్సిన నగదును ఇప్పించడంతో పాటు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించి బాధితులను వారి స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. వీటికి సంబంధించిన వివరాలను ఒంగోలు ఆర్డీఓ కె.లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఒడిశా నుంచి 17 మంది, చత్తీస్గఢ్ నుంచి 23 మంది వచ్చి టంగుటూరు మండలంలోని రెండు రొయ్యల పరిశ్రమలలో పనిచేస్తున్నట్లు చెప్పారు. తమ జిల్లా ప్రజలు ఇక్కడ వెట్టి చాకిరీ చేస్తున్నారని ఛత్తీస్గడ్లోని బస్తర్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వ అధికారులు ఈ బాధితులను సోమవారం రక్షించినట్లు తెలిపారు. ఒక మధ్యవర్తి మాయమాటలు చెప్పి ఈ వెట్టి చాకిరీ ఊబిలోకి దించారని, తమకు సరైన వసతిగానీ, ఆహారం గానీ, చేసిన పనికి డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని బాధితులు చెప్పినట్లు ఆర్డీఓ వివరించారు. బాధితుల్లో మైనర్లు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సదరు పరిశ్రమలపై వెట్టిచాకిరీ నిర్మూలన, బాల కార్మిక నిర్మూలన, కనీస వేతన చట్టాల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి బస్తర్ జిల్లా నుంచి వచ్చిన అధికారులతో వారి స్వస్థలాలకు పంపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎఎస్ పీడీ సువర్ణ, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఎం.కోటేశ్వరరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మేరీ సుజాత, టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులు, డీసీపీఓ దినేష్కుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సునీల్కుమార్, శ్యామ్ పాల్గొన్నారు. -
అన్నదాతలను పట్టించుకోని ప్రభుత్వం
ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వ లోప భూయిష్ట నిర్ణయాలతో రైతులకు సకాలంలో ఎరువులు అందక, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సాగుచేసిన పంటలకు కనీసం పెట్టుబడులు కూడా రాక జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. గిద్దలూరు మండలం ఓబులాపురం గ్రామంలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు తొట్టెంపూడి దిలీప్కుమార్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు చనిపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. చనిపోయిన రైతు కుటుంబాలకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో వ్యవసాయ భూముల్లో సీఎం చంద్రబాబు షో చేసి వెళ్లిపోయారని విమర్శించారు. జిల్లాలో వేలాది మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా పడలేదని మండిపడ్డారు. నగదు కోసం వారంతా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. తెగుళ్లు, ప్రకతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. యూరియాతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులు గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా స్థానికంగానే పంపిణీ చేసిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్ ఎరువులను బస్తాకు రూ.100 నుంచి రూ.255 వరకు పెంచి విక్రయిస్తున్నా పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర కల్పనలో విఫలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మామిడి కిలో రూ. 29 మద్దతు ధర ఉండగా, ఈ ఏడాది రెండు రూపాయలే రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం నగదు మొత్తాన్ని 24 గంటల్లో రైతు బ్యాంకు ఖాతాలో తమ చేస్తానని చెప్పిన ప్రభుత్వం, నెలలు గడిచినా జాడలేదని ఆరోపించారు. టమోటా, పత్తి, మిర్చి, శనగ, రొయ్యల రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు. పొగాకు రైతుల పరిస్థితి మరీ దారుణం.. పండించిన పొగాకు మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం చివరకు రైతుకు 20 చెక్కులకే పరిమితం చేయటం ఏంటని ప్రశ్నించారు. వేలం కేంద్రాలకు వస్తున్న బేళ్లలో అధిక సంఖ్యలో తిరస్కరిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం ఆందోళన కలిగిస్తున్న రైతు ఆత్మహత్యలు ఎరువుల పంపిణీ, గిట్టుబాటు ధరలు కల్పించడంలో వైఫల్యం అన్నదాత సుఖీభవ నగదు పడక అన్నదాతల అవస్థలు వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి -
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
● ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్కుమారెడ్డి ఒంగోలు సిటీ: ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అన్న కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు రాంనగర్ 5వ లైన్ల ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నాలుగు డీఏలు, పీఆర్సీ కమిటీ, ఐఆర్ మధ్యంత భృతి వంటి విషయాల గురించి చర్చించామన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వరకుమార్, ఉపాధ్యక్షుడు రమణ వెంకటేశ్వరరెడ్డి, గోపికృష్ణ, కోశాధికారి రంగారెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, కోశాధికారి ఏసురత్నం, శ్రీనివాసరావు, సునీల్ జవహరాలి, తాలూకా అధ్యక్షుడు సురేష్ బాబు, కార్యదర్శి శ్రీదేవి, చంద్రశేఖర్ శ్రీనివాసులు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మానస, వనజ, సుమతి, గౌరీ తదితరులు పాల్గొన్నారు. -
ఆటపాటలతో ప్రభుత్వాలను నిలదీస్తాం
ఒంగోలు టౌన్: ఆట, పాట, మాటలతో ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వాలను నిలదీస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. సీపీఐ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని ఏపీ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ప్రచార బస్సు యాత్రను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. అనంతరం గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ పోరాటాల పురిటి గడ్డ ఒంగోలు నగరంలో తొలిసారిగా సీపీఐ రాష్ట్రమహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఏర్పటి నాటి నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఇక్కడి ప్రజల పేరు చెప్పుకొని నాయకులు బాగుపడ్డారే కానీ ప్రజల జీవితాల్లో ఎలాంటి అభివృద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రకాశం జిల్లాకు జీవనాధారమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించి నేటికి 29 ఏళ్లు గడుస్తున్నా పనులు నత్త నడకన సాగుతున్నాయని చెప్పారు. కనిగిరి ప్రాంతంలో నిమ్జ్, దొనకొండలో పారిశ్రామిక వాడలు కేవలం హామీలుగానే మిగిలిపోయాయయని చెప్పారు. ఈ హామీలు అమలుకాక పోవడంతో జిల్లాలో నిరుద్యోగం తాండవిస్తుందన్నారు. ప్రజలకు ఉపాధి లేక వలసబాటలు పడుతున్నారన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహాసభలను పురస్కరించుకొని వెయ్యి మంది కళాకారులు, 100 గొంతుకలతో, 100 కళారూపాలతో ప్రజా కళా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాలకు దర్శకుడు బాబ్జీ, వందేమాతరం శ్రీనివాస్, మాదాల రవి, అజయ్ఘోష్, గోరటి వెంకన్న తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ బస్సు ప్రచారయాత్ర ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రా నాయక్, ఆర్.రామకృష్ణ, ఆరేటి రామారావు, ఎస్కే నజీర్, పిచ్చయ్య, గుర్రప్ప, అనంతలక్ష్మి, దేవరకొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
● జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు మద్దిపాడు: పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.శ్రీనివాసరావు రైతులకు సూచించారు. పొగాకుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆత్మ సౌజన్యంతో మండలంలోని నాగన్నపాలెం గ్రామంలో సోమవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏవో స్వర్ణలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సంవత్సరం బర్లీ పొగాకు వలన రైతులు నష్టపోయారని, రాబోయే సంవత్సరం పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు వేసుకోవాలని ఆయన సూచించారు. డీపీఎం సుభాషిని మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎరువులు, పురుగు మందులు వేయకుండా పంట దిగుబడులు పెంచుకోవాలన్నారు. రైతులంతా ఆరోగ్యవంతమైన పంటలు పండించాలని కోరారు. ఆత్మ డీపీడీ విజయనిర్మల మాట్లాడుతూ మట్టి పరీక్ష కార్డుల ఆధారంగా ఎరువులు వేసుకోవాలని తెలిపారు. రైతులంతా తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలన్నారు. మండల వ్యవసాయ అధికారి స్వర్ణలత మాట్లాడుతూ రైతులంతా పంట వేయనటువంటి నేలను కూడా నమోదు చేయించుకోవాలని తెలిపారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన పథకాల డబ్బులు జమ కాని రైతులు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చని తెలిపారు. డీఏవో ఎస్.శ్రీనివాసరావు మినుము వేసే రైతులకు మినుము కిట్లు అందించారు. సర్పంచ్, రైతులకు నవధాన్యాల కిట్లు అందించారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. -
నకిలీ ఉత్తర్వులతో రూ.2 లక్షలకు టోకరా
● ఎస్పీ దామోదర్కు ఫిర్యాదు చేసిన మహిళ ఒంగోలు టౌన్: ఉద్యోగం ఇప్పిస్తానంటూ నకిలీ ఉత్తర్వులు చూపించి ఒంగోలుకు చెందిన ఒక వ్యక్తి తన వద్ద 2 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడని కందుకూరు టౌన్కు చెందిన ఓ మహిళ సోమవారం ఎస్పీ ఏఆర్ దామోదర్కు ఫిర్యాదు చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆమె ఎస్పీని కలిసి తన సమస్యను విన్నవించుకున్నారు. అదేవిధంగా ఏటీఎం వద్ద మోసానికి గురయ్యానని ఒంగోలు నగరంలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం ఏటీఎంలో 50 వేల రూపాయల డబ్బు బదిలీ చేసేందుకు వెళ్లగా, ఏటీఎం పనిచేయకపోవడంతో ఏం చేయాలో తోచక నిలుచున్నానని, ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి నెఫ్ట్ ద్వారా డబ్బులు పంపిస్తానని నమ్మబాలికాడని తెలిపారు. అతడి చేతికి 50 వేలు ఇచ్చానని, డబ్బులు అకౌంటులో పడకపోవడంతో మోసం జరిగినట్లు గ్రహించానని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నాడు. బాధితుల ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ.. వెంటనే ఆయా పోలీసు స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ సీఐ దుర్గా ప్రసాద్, డీటీసీ ఇన్స్పెక్టర్ షమీముల్లా, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, మీ కోసం ఎస్సై జనార్దన్ పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మార్కాపురం టౌన్: భార్యపై కోపంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మార్కాపురం రూరల్ ఎస్సై అంకమరావు తెలిపారు. మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన చెన్నమ్మతో దొనకొండ మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన మనుమాల బ్రహ్మయ్య(40)కు వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు సంతానం. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నమ్మ తన పిల్లలను తీసుకుని రాయవరంలోని పుట్టింటికి వచ్చింది. ఆదివారం బ్రహ్మయ్య అత్తగారి ఇంటికి వచ్చి భార్యను తనతో ఇంటికి రమ్మని పిలవగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన బ్రహ్మయ్యను కుటుంబ సభ్యులు హుటాహుటిన మార్కాపురం జీజీహెచ్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతంతో ఒకరు మృతి గిద్దలూరు రూరల్: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట రైల్వే స్టేషన్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. దిగువమెట్ట తండాకు చెందిన దేశావత్ పాపానాయక్(55) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రైల్వే స్టేషన్ వద్ద కాంట్రాక్టర్ నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులకు సోమవారం హాజరయ్యాడు. టిప్పర్ లారీలో ఇనుప సామగ్రిని అన్లోడ్ చేసేందుకు డ్రైవర్ ట్రాలీని పైకి లేపిన సమయంలో విద్యుత్ తీగలు తగిలాయి. అది గమనించని పాపానాయక్ టిప్పర్లోని సామగ్రి తీసేందుకు ప్రయత్నించడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి చేరాడు. అక్కడే ఉన్న వ్యక్తులు పాపానాయక్ను కర్రలతో పక్కకు నెట్టి, చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మార్కాపురంలో భారీ చోరీ! మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని సత్యనారాయణ స్వామి గుడి సమీపంలోని బాబు కూల్ డ్రింక్స్ దుకాణంలో భారీ చోరీ చోటుచేసుకుంది. వివరాలు.. షాపు యజమాని షేక్ బాబు 4 రోజుల క్రితం మరో ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం రాత్రి బాబు ఇంటి వద్ద రంపం, ఇతర ఇనుప సామగ్రి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ యు.నాగరాజు, ఎస్సై సైదుబాబుతోపాటు క్లూస్ టీం అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం ఇంటి యజమాని అందుబాటులో లేరు. సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురై ఉంటాయని బంధువులు చెబుతున్నారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ను రప్పించి తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండుగలా జరపాలి
ఒంగోలు సబర్బన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు. సోమవారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 15న 79వ స్వాతంత్య్ర దిన వేడుకలకు అతిథులకు ఆహ్వానం, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం, ప్రభుత్వ పథకాలు తెలియజేసేలా శకటాలు, ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు, ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, వీటిని వీక్షించేందుకు విద్యార్థులను తరలించడంపై వంటివాటిపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఉదయం 8:30 గంటలకల్లా విద్యార్థులను పరేడ్ గ్రౌండ్లోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రోటోకాల్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీ నాటికి ప్రశంస పత్రాల కోసం ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. పీ – 4 పథకంలో మార్గదర్శకులను చురుకుగా గుర్తించిన వారిని, స్వతహాగా మార్గదర్శకులుగా మారిన అధికారులను ప్రశంస పత్రాలకు ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక కార్యక్రమాల ఏర్పాట్లపై దృష్టి సారించాలి జిల్లా అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా వీడియో కాన్ఫరెన్స్ -
నేడు ఈతముక్కల పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
కొత్తపట్నం: మండలంలోని ఈతముక్కల గ్రామంలో ఉన్న ఎస్యూవీఆర్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికిగానూ డీసీసీపీ కోర్సులో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా మంగళవారం భర్తీ చేయనున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ వి.ఏసుప్రసాద్రావు తెలిపారు. ఉదయం 10 గంటలకు అడ్మిషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. పాలీసెట్ – 2025 ఎంట్రెన్స్ రాసి అర్హులై కౌన్సిలింగ్కు హాజరుకాని వారు, ఎంట్రెన్స్లో క్వాలిఫై కానివారు, దరఖాస్తు చేసి పరీక్ష రాయని వారితో పాటు పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వారి సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్లు అయిన వెంటనే ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు తన మొబైల్ నంబర్ 9441885492ను సంప్రదించాలని కోరారు. రేపు జూనియర్ టార్గెట్ బాల్ ఎంపిక పోటీలు సింగరాయకొండ: మండలంలోని పాత సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా జూనియర్ టార్గెట్ బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం నిర్వహించనున్నట్లు టార్గెట్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి షేక్ మునీర్ తెలిపారు. పోటీలో పాల్గొనేందుకు 2008 జనవరి ఒకటో తేదీకి ముందు జన్మించిన వారు అర్హులని స్పష్టం చేశారు. వివరాలకు 9701523167ను సంప్రదించాలని సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. గ్రంథాలయాల్లో పోస్టులు భర్తీ చేయాలి ● డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పిచ్చయ్య మార్కాపురం: గ్రంథాలయాల్లో పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికపై భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురంలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం డీవైఎఫ్ఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పబ్లిక్ గ్రంథాలయాల్లో 974 పోస్టులు, స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1800 పోస్టులు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో 300 లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి లైబ్రేరియన్ కోర్సు చేసిన వారికి వయసు పెరిగిపోతోందని, ఈ విషయమై విద్యాశాఖ మంత్రి లోకేష్ను కలిసినా ఫలితం లేదన్నారు. గ్రంథాలయాల్లో పోస్టులు భర్తీ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం గ్రంథాలయ శాఖ ఖాళీ పోస్టుల సాధన కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్ష్య కార్యదర్శులుగా సీహెచ్ మణికంఠ, ఎం.చెన్నారెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్యాంబాబు, బాదరయ్య, శివ, సభ్యులుగా గురవయ్య, తేజ, మల్లికార్జున తదితరులను ఎన్నుకున్నట్లు డివిజన్ అధ్యక్షుడు షేక్ జబ్బార్ తెలిపారు. 11 నుంచి ఉచిత శిక్షణ ఒంగోలు వన్టౌన్: సీసీ కెమెరా, సెక్యూరిటీ అలారం ఇన్స్టాలేషన్, సర్వీసింగ్పై ఈ నెల 11 నుంచి 23వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఒంగోలు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులు అర్హులని చెప్పారు. శిక్షణ పొందగోరే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 8309915577 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
దర్శి యువకుడు బెంగళూరులో మృతి
దర్శి: దర్శికి చెందిన మార్తుల ఖగోల్రెడ్డి (31) బెంగళూరులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విశ్రాంత ఎస్సై మార్తుల వెంకటేశ్వరరెడ్డి కుమారుడైన ఖగోల్రెడ్డి గత నాలుగేళ్లుగా లండన్లో ఉండి మాస్టర్ ఎంబీఏ పూర్తి చేశారు. గత మార్చిలో ఇండియా వచ్చి బెంగళూరులోని డేటా సెంటర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆది వారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహితుడితో కలిసి బెంగళూరు వస్కోట్లో ఉదయం 4 గంటల సమయంలో 4 ఏఎం బిర్యానీ పాయింట్కి మోటార్ సైకిల్పై వెళ్లారు. ఆ హోటల్ తీయకపోవడంతో తిరిగి వస్తుండగా, లలియ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే ఫ్లైఓవర్పై స్నేహితుడి హెల్మెట్ కిందపడింది. మోటార్ సైకిల్ వెనుకవైపు కూర్చుని ఉన్న ఖగోల్రెడ్డి కిందకు దిగి హెల్మెట్ తీసుకొస్తున్న సమయంలో హైవేపై వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో హైవేపైనుంచి కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ఖగోల్రెడ్డి మృతిచెందాడు. సోమవారం బెంగళూరులోని ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు. మంగళవారం దర్శిలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. విశ్రాంత ఎస్సై వెంకటేశ్వరరెడ్డికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా కుమార్తెలకు వివాహం జరిగింది. ఏకై క కుమారునికి పెళ్లి చేయాలని కలలు కంటున్న సమయంలో మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పుచ్చలమిట్టలోని వారి నివాసం వద్ద విషదం అలముకుంది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం నాలుగేళ్లుగా లండన్లో ఉండి ఇటీవలే బెంగళూరు వచ్చి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం -
ప్రభుత్వ భవనాలు కబ్జా!
కంభం/రాచర్ల: వినియోగంలో లేని ప్రభుత్వ పాఠశాల గదులు, ప్రభుత్వ భవనాలను ప్రైవేట్ వ్యక్తులు సొంతానికి వినియోగించుకుంటున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంభం పంచాయతీ పరిధిలోని సాధుమియా వీధిలో పంచాయతీ నిధులతో సుమారు పదేళ్ల క్రితం పశువైద్యశాల నిర్మించారు. నేటికీ ఆ భవనాన్ని పశువైద్యాధికారులు స్వాధీనం చేసుకుని, సేవలందించేందుకు ముందుకు రాకపోవడంతో అది నిరుపయోగంగా ఉంది. ఈ భవనంలో ఓ టెంట్ హౌస్ నిర్వాహకుడు ఇటీవలే పాగా వేశాడు. కొద్ది రోజుల నుంచి టెంట్ హౌస్ సామగ్రిని భద్రపరుకుంటున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అలాగే రాచర్ల మండలం సత్యవోలు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పాఠశాల భవనంలో మకాం వేశాడు. సొంత ఇల్లు నిర్మించుకుంటున్న ఆయన.. స్కూల్ భవనంలో కాపురం పెట్టినా అధికారులు చోద్యం చూస్తున్నారు. సొంతానికి వాడుకుంటున్న ప్రైవేట్ వ్యక్తులు పట్టించుకోని అధికారులు -
నిమ్మతోటలను పరిశీలించిన ఉద్యానవన అధికారులు
పాతసింగరాయకొండలోని ఊరచెరువులో అక్రమంగా మట్టి తవ్విన ప్రదేశం నేడు ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ ఒంగోలు సిటీ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఒంగోలులోని రామ్నగర్ 5వ లైన్లో గల ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ కార్యాలయంలో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల రూపాయల బకాయిలు, 12వ పీఆర్సీ, ఐఆర్, పెండిండ్ డీఏలు, సరెండర్ లీవ్స్ బకాయిలు తదితర ప్రధాన డిమాండ్లపై చర్చించేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఒక వీడియో రూపంలో ముందుకు రానున్నట్లు తెలిపారు.హనుమంతునిపాడు: మండలంలోని సీతారాంపురంలో నిమ్మ తోటలను ఉద్యానవనశాఖ అధికారులు సోమవారం పరిశీలించారు. నిమ్మ ధరలు భారీగా పడిపోవడంతో పాటు తోటలకు తెగుళ్ల ఆశించాయని రైతులు ఆందోళన చెందుతుండటంపై సాక్షి దినపత్రికలో ‘పాతాళంలోకి నిమ్మ ధరలు’ శీర్షికతో సోమవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన హార్టీకల్చర్ అధికారులు సీతారాంపురంలోని నిమ్మ తోటలను పరిశీలించి ఎండుపుల్ల, పులుసు పురుగు సమస్య ఎక్కువగా ఉందని గుర్తించారు. తెల్లపులుసు పురుగు, రసం పీల్చే పురుగు, కొమ్మ ఎండుతెగులు ఎక్కువగా ఉందని, వేరుకుళ్లు తెగులు కూడా ఉందని ఉద్యానవన శాఖాధికారిణి విష్ణుప్రియ తెలిపారు. తెగుళ్ల నివారణకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, పిచికారీ చేయాల్సిన క్రిమిసంహారక మందులపై రైతులకు సలహాలు, సూచనలు చేశారు. ఎండుపుల్లలు వచ్చిన వెంటనే కత్తిరించాలని తెలిపారు. నిమ్మతోటటకు డ్రిప్ ద్వారా నీటిని అందించాలన్నారు. వేసవిలో నిమ్మ పండ్లు కోతకు వచ్చేలా బహార్ పద్ధతి పాటించడం వలన కాయకు మంచి గిరాకీ వస్తుందన్నారు. రైతు ఆదాయం పొందుతారన్నారు. ఆమె వెంట వీఏఏ భరత్, రైతులు ఉన్నారు. -
కొండపి పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ
● వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కొండపి: కొండపి పంచాయతీ ఎన్నికల్లో పార్టి అధిష్టానం ఆదేశాల ప్రకారం సర్పంచ్తో పాటు, అన్ని వార్డుల్లో పార్టీ సానుభూతిపరులు పోటీ చేస్తారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీమంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన నాయకులు, కార్యకర్తలతో ఎన్నికలపై ఆయన సమీక్షించారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పోటీ విషయమై కూటమి ప్రభుత్వ నాయకులు రాజీకి వచ్చారని 14 వార్డుల్లో 9 టీడీపీకి, 5 వైఎస్సార్సీపీ కి కేటాయిస్తామని, సర్పంచ్ అభ్యర్థి టీడీపీకి కేటాయించాలని ప్రతిపాదించారని, కానీ ఈ ఒప్పందానికి తాను ఒప్పుకోలేదని విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానన్నారు. అధిష్టానం సూచనలతో సర్పంచ్తో పాటు అన్ని వార్డులకు అభ్యర్థులు బరిలో ఉంటారని ఆయన వివరించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.పది రోజులుగా పోస్టింగ్ కోసం ఎదురుచూపులు బేస్తవారిపేట: స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఎన్ఆర్ఈజీఎస్లో జేఈ పోస్టింగ్ కోసం పది రోజులుగా ఓ మహిళా అధికారి ఎదురుచూపులు చూస్తోంది. తర్లుపాడు మండలంలో ఎన్ఆర్ఈజీఎస్లో జేఈగా పనిచేస్తున్న సుభద్రాదేవి బేస్తవారిపేట మండల జేఈగా చేరేందుకు ఎమ్మెల్యే లెటర్ తీసుకున్నారు. ఈ మేరకు గతనెల 25వ తేదీ డ్వామా పీడీ బేస్తవారిపేట మండల ఎన్ఆర్ఈజీఎస్ జేఈగా అపాయిన్మెంట్ లెటర్ ఇచ్చారు. అదేరోజు ఎంపీడీఓ కార్యాలయంలో జాయినింగ్ లెటర్ అందజేశారు. రాచర్ల మండలం జేఈగా పనిచేస్తున్న నాగేశ్వరరావు బేస్తవారిపేటలో ఇన్చార్జ్గా పనిచేస్తున్నాడు. ఇతను రిలీవ్ కాకపోవడంతో సుభద్రాదేవి పది రోజుల నుంచి కార్యాలయానికి రావడం, కనీసం సంతకాలు కూడా చేయకుండా వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినా నాగేశ్వరరావును బేస్తవారిపేటలో ఉంచాలని, సుభద్రాదేవిని చేర్చుకోవద్దని టీడీపీ నాయకులు ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 12న జాతీయ నులిపురుగుల దినోత్సవం ఒంగోలు సబర్బన్: నులిపురుగులు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు హాని కలిగిస్తాయని జేసీ ఆర్.గోపాల కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని మీ కోసం కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జాతీయ నులిపురుగుల దినోత్సవంపై కన్వెర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. జాతీయ నులిపురుగులు దినోత్సవ పోస్టర్ను జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ జాతీయ నులిపురుగుల దినోత్సవంలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని తెలిపారు. జిల్లాలో 1–19 ఏళ్లలోపు పిల్లలు 5,96,751 మంది ఉన్నారని వారికి 6,08,000 ఆల్బెండజోల్ మాత్రలు అవసరం అవుతాయన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిల్లలు నులిపురుగుల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆర్.బి.ఎస్.కె ప్రోగ్రాం అధికారి డాక్టర్ భగీరథి మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలు అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలకు, ఇతర విద్యా సంస్థలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ నాయక్, డాక్టర్ సూరిబాబు, డాక్టర్ కమలశ్రీ,, ఐసీడీఎస్ పీడీ, ఆర్బీఎస్కే సిబ్బంది పాల్గొన్నారు. -
శిక్షణ భారం!
ఒత్తిడి పాఠం..ఒంగోలు సిటీ: పాఠశాలలు ప్రారంభమై రెండో నెలలు పూర్తైనా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. తరగతుల్లో బోధనకు బదులుగా వారికి విభిన్నమైన బోధనేతర పనులు అప్పగిస్తుండడంతో విద్యార్థుల భవిష్యత్పై ప్రతికూల ప్రభావం పడుతోంది. పాఠశాలలు జూన్ 12న ప్రారంభమైనప్పటికీ, ఉపాధ్యాయులు అప్పటి నుంచే బదిలీల కౌన్సెలింగ్లు, శిక్షణ కార్యక్రమాలు, వివిధ యాజమాన్య సమావేశాలతో తలమునకలయ్యారు. బోధనేతర పనులతో టీచర్లు బిజీగా ఉండడంతో మా పిల్లల చదువు దెబ్బతింటోందని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లు తెరుచుకున్నా కొనసాగిన బదిలీల కౌన్సెలింగ్.. ● జూన్ 12న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వ నిర్వాకం, విద్యాశాఖ ముందుచూపు లేకపోవడంతో స్కూళ్ల తలుపులు తెరుచుకున్నా టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ జరుగుతూ వచ్చింది. కౌన్సెలింగ్ నిబంధనల ప్రకారం జగరడంలేదని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసిన సంగతి విదితమే. బదిలీల తంతు ముగిసింది. బదిలీ అయిన వారు విధుల్లో చేరారు. అప్పటికే వారం పాటు విద్యార్థులకు పాఠాలు దూరమయ్యాయి. ప్రభుత్వ ప్రచార యావ.. గురువులకు, విద్యార్థులకు శాపం.. జూన్ 21న కూటమి ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శాపంగా మారింది. గిన్నిస్ రికార్డు కోసం కూటమి ప్రభుత్వం నానా హంగామా చేయడంతో ఉపాధ్యాయులు పడరాని పాట్లుపడ్డారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ జిల్లా ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఫలితంగా విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. జూలై 10వ తేదీ ఆర్భాటంగా నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాల(మెగా పీటీఎం)కు పదిహేను రోజుల ముందు నుంచే టీచర్లు తగరతి గదులకు దూరమయ్యారు. ఫ్యాప్టో నేతల ధర్నా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, శిక్షణలతో మానసిక ఒత్తిడిలకు గురవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బలవంతపు పీ 4 కార్యక్రమంతో ఉపాధ్యాయులను నిర్బంధానికి గురి చేయరాదన్నారు. బదిలీల ప్రమోషన్లు తీసుకున్నా పొజిషన్ ఐడీలు రాని ఉపాధ్యాయుల జీతాలు చెల్లించాలని, మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ సమస్య పరిష్కరించాలని, అంతర జిల్లాల బదిలీలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబరు 57 ను అమలు చేయాలని, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. -
రైతులు కష్టాలపాలు
ఒంగోలు సబర్బన్: టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను మరిన్ని కష్టాలపాలు చేస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు చుండూరు రవిబాబు, దద్దాల నారాయణలతో పాటు మరికొంత మంది నాయకులతో కలిసి సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ సెల్కు వచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణను కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బ్రహ్మానంద రెడ్డి రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని, జూన్, 2024 నుంచే దీన్ని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిందని మండిపడ్డారు. ఈ రెండు సంవత్సరాలకు గాను ప్రతి రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. అంతేకాక 7 లక్షల మందికి ఈ పథకంలో కోత విధించారన్నారు. దీనివల్ల వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు అధిక వడ్డీలతో ప్రైవేటు అప్పుల మీద ఆధారపడే పరిస్థితిని సృష్టించారన్నారు. ఏరైతుకూ గిట్టుబాటు ధర దొరకడంలేదన్నారు. రైతు తాను పండించిన పంటలను రోడ్డుమీద వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత పంటల బీమా రద్దు చేశారని, గత ఏడాది ఇన్సూరెన్సు చెల్లించకపోవడంతో రైతులకు బీమా డబ్బులు రాని పరిస్థితి ఏర్పడిందని, రైతులకు సున్నావడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేశారని మండిపడ్డారు. రైతుకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ అండగా ఉన్న ఆర్బీకేల వ్యవస్థను పూర్తిగా నీరుగార్చారన్నారు. రైతులకు ఎరువులను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. యూరియా దొరక్కపోవడంతో ఎక్కడకు వెళ్లాలో రైతులకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. యూరియా కేటాయింపులకు, సరఫరాకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. పొటాష్ కలిసిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా బస్తాపై బ్లాక్ మార్కెట్లో రూ.60 నుంచి రూ.100 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ చుండూరు రవి బాబు మాట్లాడుతూ రైతాంగం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, అధిక రేట్లు పెట్టి ప్రైవేటు వ్యాపారుల వద్ద ఎరువులు కొంటున్నారని అన్నారు. రైతులు ఓవైపు కష్టాలు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షలు చేసే పరిస్థితి కూడా కనిపించడంలేదని మండిపడ్డారు. రైతులకు వెంటనే ఎరువులు అందుబాటులో ఉంచాలని, ఎరువుల బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని, బ్లాక్ మార్కెట్కు తరలించే వారి లైసెన్సులు రద్దు చేయాలని వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు వేలం కేంద్రాల నుంచి ఒక్కో రైతు 40 నుంచి 50 శాతం బేళ్లు వెనక్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. పొగాకు కిలో రూ.200 తగ్గకుండా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కనిగిరి వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ, పార్టీ జోనల్ రైతు విభాగం అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెళ్ల బంగారు బాబు, మాజీ ఎమ్మెల్యే కుసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణా రెడ్డి, పార్టీ నాయకులు కాట్రగడ్డ మహేష్ బాబు, పోలవరం శ్రీమన్నారాయణ, మన్నే శ్రీనివాస రావులతో పాటు పలువురు పాల్గొన్నారు. రైతులను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం యూరియా సహా ఎరువుల కొరత తీర్చాలి ఎరువుల పంపిణీ, గిట్టుబాటు ధరల్లో ప్రభుత్వం విఫలం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంటుపరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి జేసీ గోపాల కృష్ణను కలిసి వినతిపత్రం అందజేత -
అక్రమంగా భూములు ఆన్లైన్ చేసుకున్నారు
ఒంగోలు సబర్బన్: పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రైతుల భూములను మాజీ సర్పంచ్ భర్త మేకల శంకరరావు అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నాడని తోకపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమాన్ని జేసీ రోణంకి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చిన తోకపల్లి గ్రామస్తులు జేసీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామంలోని అనేక సర్వే నంబర్లలోని భూములను మేకల శంకరరావు అధికారులను లోబరుచుకొని అక్రమంగా ఆన్లైన్లో ఎక్కించుకున్నాడన్నారు. శంకరరావు పేరుమీద 50కి పైగా భూముల ఆన్లైన్ ఖాతా నంబర్లు ఉన్నాయని జేసీకి వివరించారు. అతని వద్ద నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, నకిలీ రిజిస్టర్ డాక్యుమెంట్లు సృష్టించి గ్రామంలోని ఇతరుల భూములను ఆన్లైన్ చేయించుకున్నాడని వివరించారు. అతని ఇంట్లో రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులు, సర్వే అధికారుల స్టాంపులు, లెటర్ ప్యాడ్లు అనేకం ఉన్నాయన్నారు. అదేమని అడిగితే చంపుతానంటూ బెదిరిస్తున్నాడని వాపోయారు. గ్రామానికి చెందిన బిట్రా తిరుమలమ్మ (85)కు చెందిన 4 ఎకరాల భూమిని కూడా అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నాడని, ఆమె ఆరు నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం లేదని జేసీ దృష్టికి తెచ్చారు. వంద ఎకరాల పశువుల బీడు కబ్జా.. కనిగిరి మండలం వంగపాడు గ్రామంలోని వంద ఎకరాల పశువుల బీడు కబ్జాకు గురైందని గ్రామానికి చెందిన కాకర్ల శ్రీనివాసులు జేసీకి ఫిర్యాదు చేశాడు. గ్రామానికి చెందిన కాకర్ల సత్యం, కాకర్ల కొండయ్య, కాకర్ల సూర్యంతో పాటు మరికొంతమంది కలిసి పశువుల బీడు భూమిని అన్యాక్రాంతం చేశారన్నారు. దాదాపు 15 సర్వే నంబర్లలోని ఈ భూమి కొంతమంది చేతుల్లోకి వెళ్లటంతో గ్రామంలోని మిగతా రైతులు, పశు పోషకులకు చెందిన పశువులను పొలాల్లోకి వాళ్లు రానీయటం లేదన్నారు. రెవెన్యూ అధికారులు కూడా వాళ్లతో కలిసిపోయారని వివరించారు. కనీసం ఆర్టీఐ కింద సమాచారం అడిగినా రెవెన్యూ అధికారులు ఇవ్వటం లేదన్నారు. 1996 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి.. 1996 డీఎస్సీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని అప్పటి డీఎస్సీ అభ్యర్థులు పలువురు మీకోసం కార్యక్రమంలో సింగరాయకొండకు చెందిన రావూరి మురళీ కృష్ణ ఆధ్వర్యంలో అర్జీ సమర్పించారు. 1996 డీఎస్సీలో క్వాలిఫై అయ్యానని, మూడు విడతలుగా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారన్నారు. ఎంపికై నా సెలక్షన్ జాబితాలో తన పేరు లేదన్నారు. కొందరు కోర్టుకు వెళ్లారని, తాను ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉండి కోర్టుకు వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 1998 అభ్యర్ధులకు మాత్రం ఎంటీఎస్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఎంటీఎస్ మాదిరిగా 1996 అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని వేడుకున్నారు. తోకపల్లి మాజీ సర్పంచ్ గ్రామంలోని పొలాలు అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నాడు కనిగిరి మండలం వంగపాడులో పశువుల బీడు 100 ఎకరాలు కబ్జా మీ కోసంలో జేసీ గోపాలకృష్ణకు ఫిర్యాదు -
వైద్యశాలలో రాజకీయాలొద్దు
● హాస్పిటల్ అభివృద్ధికి కలిసికట్టుగా పాటుపడదాం ● అంబులెన్స్ను ప్రారంభించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: ప్రభుత్వ వైద్యశాలలో రాజకీయాలకు తావివ్వవద్దని, హాస్పిటల్ అభివృద్ధికి తామందరం కలిసికట్టుగా పాటుపడదామని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. వివిధ రోగాలతో వైద్యశాలకు వచ్చిన పేదలను రక్త పరీక్షల కోసం బయటికి పంపుతున్నారని, ఇంజక్షన్లు, మందులు రాసిచ్చి మెడికల్ షాపుల వద్దకు పంపడం సరైంది కాదని, దీనివలన రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ అందుబాటులో ఉండకపోవడం, వైద్యశాలలో బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో రోడ్డు ప్రమాద బాధితులు అనేక మంది మృతి చెందారని, అటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటానన్నారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని డీఆర్సీ, జెడ్పీ సమావేశాలలో అనేక పర్యాయాలు అడిగినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. వైద్యశాలలో ఏర్పాటు చేస్తున్న భోజన కాంట్రాక్టర్ స్థానికంగా ఉండేలా చూడాలని, రోగులకు రెండు పూటలా మంచి భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యశాలలో పూర్తి స్థాయిలో వైద్యులున్నా తగిన సదుపాయాలు, ల్యాబ్లు లేకపోవడంతో రోగులు ఈ హాస్పిటల్ను గుర్తించడం లేదని, ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి రోగులు ప్రాణాలు పోగొట్టుకోవడంతోపాటు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. అభివృద్ధి కమిటీ సభ్యులుగా మందుల ఆదిశేషు, పాత్లావత్ బాలు నాయక్లను ఎమ్మెల్యే ప్రకటించారు. సభ్యులుగా నియమితులైన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి వైద్యశాలలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. ఆర్థోపెడిక్ విభాగంలో సి–యాం మిషన్, ఆపరేషన్ థియేటర్కు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయడంతోపాటు మరో 10 తీర్మానాలు చేసి కమిటీ ఆమోదం తెలిపింది. అనంతరం వైద్యశాలకు మంజూరైన అంబులెన్స్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. పూర్తి సదుపాయాలు కలిగిన మరొక అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నారని, వైద్యశాల మార్చురీలో ఫ్రీజర్ బాక్స్, మృతులను తమ నివాసాలకు చేర్చేందుకు వాహనాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ యదిద్యా, డాక్టర్ ముబినా, డాక్టర్ రాంజీ నాయక్, ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, సర్పంచ్ ఆర్.అరుణాబాయి, పార్టీ జిల్లా కార్యదర్శి కె.ఓబులరెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి పాల్గొన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
యర్రగొండపాలెం: అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక శివాలయం కమ్యూనిటీ హాలులో ఆదివారం మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు నియోజకవర్గాల్లో కంపెనీకి చెందిన వేలాది ఎకరాల భూములు అగ్రిగోల్డ్ యాజమాన్యం డైరెక్టర్ల పేరుతో ఉన్నాయని, అవ్వా కుటుంబ సభ్యుల పేర్లతో ఎక్కువగా భూములు ఉన్నాయని, అవ్వా వెంకటరామారావు చైర్మన్గా, తన సోదరులు 8 రాష్ట్రాల్లో 32 లక్షల మందిని నిలువునా ముంచేశారని అన్నారు. కోర్టు పేరుతో తప్పుడు పద్దతుల్ని అవలంబిస్తూ ప్రభుత్వాన్ని, బాధితులను మోసంచేసి ఆస్తులను కొల్లగొట్టటానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. యాజమాన్యం ఆస్తులను కొల్లగొట్టినా, సీఎం చంద్రబాబు సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పినా అగ్రిగోల్డ్ బాధితులకు మాత్రం న్యాయం జరగదని అన్నారు. బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై సానుకూల ఒత్తిడి తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఒక గంట అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై దృష్టి పెడితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. సమావేశంలో అగ్రిగోల్డ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కేవీవీ.ప్రసాద్, అగ్రిగోల్డ్ బాధిత సంఘ నాయకులు జీఎల్ సుబ్బారావు, పి.రామయ్య, జి.వెంకటసుబ్బయ్య, పిచ్చయ్య పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు -
అబద్ధపు హామీలతో బాబు వంచన
సభలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సభాప్రాంగణానికి ర్యాలీగా వస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులుపెద్దదోర్నాల: ఎన్నికల్లో అలివికాని హామీలిచ్చిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. శ్రీశైలం రహదారిలోని మల్లికార్జున ఎస్టేట్స్లో ఆదివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మండల పార్టీ కన్వీనర్ గంటా రమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవక ముందు ఒక్కొక్క ఇంటికి రూ.6 లక్షలు ఇస్తామంటూ చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారన్నారు. ఆరు హామీలతో పాటు మరో 143 అదనపు హామీలు జూలై 24 నుంచి అమలవుతాయని మోసం చేశారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ కులాలు, సినిమాలను అడ్డు పెట్టుకున్నారని, అడ్డగోలు హామీలతో, ఒక జెండా, అజెండా లేని పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకొని ప్రజలను మోసం చేశారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ప్రతి ఒక్క మహిళకు రూ.18 వేల ఆర్థిక సహాయం, తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క బిడ్డకు రూ.15 వేలు, ఉచిత ఇసుక, రైతు భరోసాను పేరు మార్చి అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతులకు డబ్బులు ఈ విధంగా ఎన్నో పథకాలు అందిస్తామంటూ బాండ్లు కూడా ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఈ అబద్ధపు హామీలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై కూటమి నిర్లక్ష్యం: తీవ్ర కరువు కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంతానికి సంజీవని అయిన వెలిగొండ ప్రాజెక్టును దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి తీసుకొచ్చారని, ఆయన తనయుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆ ప్రాజెక్ట్కు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి జాతికి అంకితం చేశారని అన్నారు. కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించి ముంపు గ్రామాల ప్రజలను అక్కడ నుంచి తరలిస్తే శ్రీశైలం డ్యాం నుంచి పుష్కలంగా వచ్చే నీటి వరద ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేదని అన్నారు. సముద్రంలో వృథాగా కలిసే 30 టీఎంసీల నీటితో నల్లమల సాగర్ నీటితో కళకళలాడేదని ఆయన పేర్కొన్నారు. కేవలం మీ చాతగాని, దద్దమ్మ కూటమి పాలన వల్ల నిధులు కేటాయించలేకపోయారని విమర్శించారు. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి సభలు పెట్టడం చంద్రశేఖర్ మీద సవాళ్లు విసరటం కాదని, దమ్ముంటే మీ పరిపాలనపై ఇప్పుడే డిబేట్ చేద్దామని ఆయన సవాల్ విసిరారు. జిల్లా ఇన్చార్జి మంత్రికి ఇక్కడి కష్ట సుఖాలు ఏం తెలుసో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వైఎస్.రాజశేఖర్రెడ్డి మంత్రి వర్గంలో పని చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రికి ఇక్కడి సమస్యలపై 12 లెటర్లు ఇచ్చానని, ఆయన ఎంత మాత్రం స్పందించి ఇక్కడ పనులు చేశారో చెప్పాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్ మీ అబ్బ సొత్తా.. తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని ఆర్టీసీ బస్టాండ్లో పెట్టుకోవటానికి అదేమన్నా మీ అబ్బ సొత్తా అంటూ ఎమ్మెల్యే తాటిపర్తి ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. ఇన్చార్జి అని పేరు పెట్టుకున్న ఓ నేత నియోజకవర్గాన్ని లూటీ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు తిరగబడటం మొదలు పెడితే వీళ్లందరి పంచెలు ఊడి పోతాయని హెచ్చరించారు. ప్రజలకు మీరు సేవ చేస్తారన్న ఆశతో మంచి అవకాశం ఇచ్చారని, కానీ రాబందులుగా మారి ప్రజలను దోచుకుంటున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో 20 ఏళ్ల క్రితం వేసిన పైపులైనును జేసీబీలతో తవ్వుకుని రూ.25 కోట్లు దోచుకునేందుకు ప్లాన్ వేశారని, తాను కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే ఒక కిలో మీటర్ తవ్వేందుకు అనుమతి ఇచ్చామని అధికారుల చెప్పారన్నారు. ఒక నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన పైప్లైన్ను మరో నియోజకవర్గంలో వేసేందుకు అనుమతులు ఉంటాయా అని అయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీని నిర్వహించిన ఎమ్మెల్యే తొలుత నటరాజ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మోటారు బైక్ ర్యాలీతో సభాప్రాంగణానికి చేరుకున్నారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ మజీద్, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షులు దొందేటి నాగేశ్వరరెడ్డి, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి గుమ్మా పద్మజా యల్లేష్, ఎస్టీ నాయకులు డుమావత్ లతా చంద్రకాంత్నాయక్, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి దూదేకుల రసూల్, పుల్లలచెరువు పార్టీ నాయకుడు ఉడుముల శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఆరు హామీలతో పాటు మరో అదనపు హామీలంటూ మోసం మీ ఇంటికే నేరుగా డబ్బులు అందుతాయని అబద్ధపు హామీలు బాబు మోసాలను ఎండగట్టిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
మెడికలేనా..
నిలిచిపోయిన మెడికల్ కళాశాలమార్కాపురం: కూటమి ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీలపై కక్ష కట్టింది. మొదట్లో పీపీపీ విధానంలో నిర్మిస్తామంటూ చెప్పి నిర్మాణాలు మాత్రం నిలిపేసింది. దీంతో మార్కాపురంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. కాలేజీ నిర్మాణ పనులు యధావిధిగా జరిగి ఉంటే ఈ ఏడాదైనా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమై ఉండేవి. కానీ అలా జరగలేదు. దీంతో ఈ ఏడాది మెడికల్ కౌన్సెలింగ్లో మార్కాపురం మెడికల్ కాలేజీని చేర్చలేదు. నిర్మాణం పూర్తయి ఉంటే నీట్ రాసిన విద్యార్థులు మార్కాపురం మెడికల్ కాలేజీలో ఆప్షన్ ఎంచుకునేవారు ఎంబీబీఎస్లో చేరేందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల నమోదు ఇప్పటికే ప్రారంభమైంది. అందులో మార్కాపురం మెడికల్ కాలేజీ లేకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పశ్చిమ ప్రకాశం నుంచి నీట్ పరీక్షను సుమారు 5 వేల మంది రాశారు. పలువురు అర్హత సాధించారు. అయితే వారందరూ మార్కాపురం మెడికల్ కళాశాల పూర్తికాకపోవడంతో రాష్ట్రంలోని వివిధ మెడికల్ కళాశాలలను ఆప్షన్లుగా ఎంచుకున్నారు. గత ప్రభుత్వంలో 75 శాతం పూర్తయిన పనులు: పశ్చిమ ప్రకాశంలోని సుమారు 8 లక్షల మంది ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కాపురానికి సుమారు రూ.475 కోట్లతో మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. 150 ఎంబీబీఎస్ సీట్లను దృష్టిలో ఉంచుకొని జీజీహెచ్ వైద్యశాల అభివృద్ధి పనులను, మెడికల్ కళాశాల నిర్మాణ పనులు చేపట్టారు. మార్కాపురం మండలం రాయవరం వద్ద 41.97 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు గత ఏడాది సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రిజల్ట్ వచ్చే వరకూ జరిగాయి. పనులు కూడా గత రెండేళ్లలో వేగంగా జరగడంతో దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. సిబ్బంది క్వార్టర్లు, నర్సింగ్ కళాశాల, జంట్స్, లేడీస్ హాస్టల్స్, క్లాసు రూములు, సెంట్రల్ క్యాంటిన్ పూర్తయ్యాయి. ప్రస్తుతం కళాశాలలో విద్యుత్ వైరింగ్, ప్లంబింగ్ పనులు, రంగులతోపాటు కొన్ని భవనాల నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉంది. జిల్లా వైద్యశాలను జీజీహెచ్గా మార్చడంతోపాటు 450 బెడ్లు ఏర్పాటుచేసి, 82 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు, డాక్టర్లు అందుబాటులో ఉంచారు. దీంతో రోజుకు సుమారు 750 నుంచి 800 మంది పేషంట్లు వైద్యసేవలు పొందేవారు. 3 ఆక్సిజన్ ప్లాంట్లు, ఐసీయూ యూనిట్, వెంటిలేటర్ సౌకర్యాలను కూడా కల్పించారు. గత ఏడాది జూన్ 24న నేషనల్ మెడికల్ కౌన్సిల్ఆఫ్ ఇండియా బృందం మెడికల్ కాలేజీని, జీజీహెచ్ను సందర్శించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే ఆ నివేదిక ఏమైందో తెలీదు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అసంపూర్తి భవనాలంటూ నిలిపేయడంతో పాటు జీజీహెచ్లో ఉన్న సుమారు 40 మంది మెడికల్ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. అయితే ఏడాది నుంచి ఈ పనులు కూడా జరగలేదు. కళాశాల నిర్మాణం పూర్తయి ఉంటే జీజీహెచ్లో ఏర్పాటు చేసిన 450 బెడ్లు ఉపయోగపడి ఉండేవి. వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం అనేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా జనరల్ మెడిసిన్ కోసం 100, ఆప్తమాలజీ 20, డెర్మటాలజీ 10, సైకియాట్రీ విభాగం 10, జనరల్ సర్జరీల కోసం 100, ఆర్థోపెడిక్ విభాగానికి 40, ఈఎన్టీకి 20, ఐసీయూ బెడ్లు 20, పీడియాట్రిక్స్ 50, ఓబీజీ (ప్రసూతి గైనకాలజీకి) 50 బెడ్లను కేటాయించారు. వీటిలో ప్రస్తుతం కొన్ని బెడ్లు మాత్రమే రోగుల కోసం ఉపయోగిస్తున్నారు. ఏడాదిగా నిలిచిన మార్కాపురం మెడికల్ కళాశాల నిర్మాణం ఎంబీబీఎస్ కౌన్సెలింగ్లో మార్కాపురం కాలేజీని చేర్చని ప్రభుత్వం ఈ ఏడాది కూడా అడ్మిషన్లు లేనట్టే మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులుమెడికల్ కాలేజీ త్వరగా పూర్తిచేయాలి మార్కాపురం మండలం రాయవరం దగ్గర నిర్మిస్తున్న మెడికల్ కాలేజీని ప్రభుత్వం త్వరగా పూర్తిచేయాలి. దీని వలన 100 మెడికల్ సీట్లు మంజూరైతే ఈ ప్రాంత విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య అందుబాటులోకి వస్తుంది. దీనితోపాటు జీజీహెచ్లో కూడా రోగులకు మెరుగైన సేవలు లభిస్తాయి. ప్రభుత్వమే మెడికల్ కాలేజీని నిర్వహించాలి. పీపీపీ విధానం వద్దు. – డీఎంకే రఫీ, సీపీఎం నాయకులు -
జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపిక
ఒంగోలు: స్థానిక మంగమూరు రోడ్డులోని ఏసీఏ క్రికెట్ సబ్ సెంటర్ మైదానంలో ఆదివారం సీనియర్ మహిళా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్ 23, సీనియర్ మహిళా క్రికెట్ జట్ల ఎంపికకు ఉమ్మడి జిల్లా నుంచి మహిళా క్రికెటర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఫీల్డింగ్, బ్యాటింగ్, కీపింగ్, బౌలింగ్ తదితర అంశాల్లో క్రీడాకారుల ప్రతిభను కోచ్లు కొప్పోలు సుధాకర్, లెఫ్ట్ శ్రీను, చంద్ర పరిశీలించారు. మొత్తం 20 మంది ప్రతిభావంతులకు ఈనెల 9, 10వ తేదీల్లో బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల క్రికెట్ స్టేడియంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం వారిలో 16 మంది క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేస్తామని ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపికై న జట్లు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో నిర్వహించనున్న అంతర్ జిల్లా క్రికెట్ పోటీల్లో ప్రకాశం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఎంపిక ప్రక్రియను ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్కుమార్, సంయుక్త కార్యదర్శి బచ్చు శ్రీనివాసరావు, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు బలరాం పర్యవేక్షించారు. -
మద్యం మత్తులో మిత్రుల ఘర్షణ
● బైక్పై పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనం ఒంగోలు టౌన్: మద్యం మత్తులో ఉన్న ముగ్గురు మిత్రుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకోగా.. ఓ యువకుడు పెట్రోల్ పోసి బైకును తగలబెట్టాడు. ఈ సంఘటన ఒంగోలు–కర్నూలు రోడ్డులోని పాలకేంద్రం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్కు చెందిన లోనా రాం, అర్జున్, కిషోర్ స్నేహితులు. ముగ్గురూ చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమల్లో పనులు చేస్తుంటారు. ఆదివారం కావడంతో సరదాగా ఒంగోలు నగరానికి వచ్చారు. తాము తెచ్చుకున్న బైకులో పెట్రోల్ అయిపోవడంతో పాలకేంద్రం వద్ద ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంచారు. ఒక బాటిల్లో పెట్రోలు పోయించుకుని వస్తూ మార్గమధ్యంలోని ఓ వైన్ షాప్లో ముగ్గురూ కలిసి మద్యం తాగారు. మత్తు తలకెక్కడంతో వారి మధ్య మాటల యుద్ధం మొదలైంది. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. ఆ కోపంతో ఓ వర్గం యువకుడు బైక్కు నిప్పంటించి తగులబెట్టాడు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
ఈ వాచ్మన్ వద్దండి
దర్శి: పట్టణంలోని లంకోజనపల్లి రోడ్డులో ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్లో వాచ్ ఉమన్ బదులు ఆమె భర్త విధులు నిర్వహించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాచ్మెన్గా పురుషుడు వద్దంటూ ఏఎస్డబ్ల్యూఓకు ఆదివారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. బాలికల హాస్టల్లో వాచ్ ఉమన్ డ్యూటీ చేయాల్సిన స్వప్న తన భర్తను విధులకు ఎలా పంపుతోందని, ఆడపిల్లల హాస్టల్లోకి మగవారిని ఎలా అనుమతించారని ఏఎస్డబ్ల్యూఓను ప్రశ్నించారు. దీనిపై ఏఎస్డబ్ల్యూఓ స్పందిస్తూ.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాచ్ ఉమన్ స్వప్నను బదిలీ చేస్తామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించి వెనుదిరిగారు. కాగా వాచ్మన్కు వార్డెన్కు మధ్య విభేదాల వల్ల హాస్టల్లో నిత్యం వివాదం చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ● దర్శి ఎస్సీ బాలికల హాస్టల్ వద్ద తల్లిదండ్రుల నిరసన ● వాచ్ ఉమన్ బదులు భర్త విధుల్లో ఉండటంపై ఆగ్రహం -
భూ కబ్జా ఆపండి
మార్కాపురం: తమ పొలాలను కబ్జా చేసేందుకు ఒక టీడీపీ నాయకుడు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ ఆదివారం మార్కాపురం మండలంలోని నాగులవరం గ్రామస్తులు ఆదివారం ధర్నా నిర్వహించారు. వారసత్వంగా వస్తున్న తమ పొలాలను మార్కాపురం పట్టణానికి చెందిన ఒక టీడీపీ నేత ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని, తమ భూములను కాపాడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ కబ్జా విషయంపై ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ధర్నాలో గ్రామానికి చెందిన మంగమ్మ, వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, గురుస్వామి, పెద్ద అంకయ్య, ఆంజనేయులు, లక్ష్మీదేవి తదితరులు పాల్గొని టీడీపీ నాయకుడి తీరును తూర్పారబట్టారు. తమకు ఆ పొలమే జీవనాధారమని, తమ పొలాన్ని సర్వే చేసి కబ్జా కాకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మార్కాపురం మండలం నాగులవరంలో గ్రామస్తుల ధర్నా టీడీపీ నాయకుడి తీరుపై ఆగ్రహం -
ఆ డీలర్లపై 6ఏ కేసులు
తర్లుపాడు: డీలర్లు రేషన్ బియ్యం ఇవ్వకుండా వాటికి బదులుగా కార్డుదారులకు డబ్బులు ఇస్తుండటంపై ఆదివారం సాక్షి మెయిన్ ఎడిషన్లో ప్రచురితమైన ‘‘బియ్యం లేవ్.. డబ్బులు తీస్కో..’’ కథనంపై ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ డీటీ డేవిడ్రాజు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ముకుంద హరి స్పందించారు. మండలంలోని కేతగుడిపి, సూరేపల్లి రేషన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. డీలర్ల సమక్షంలో స్టాక్ను పరిశీలించారు. రెండు చోట్ల ఎక్కువ మొత్తంలో బియ్యం ఉన్నట్లు గుర్తించారు. కేతగుడిపిలో వీఆర్వో కాశీశ్వర్రెడ్డికి స్టాక్ అప్పగించారు. సూరేపల్లిలో డీలర్ పొంతన లేని సమాధానం ఇచ్చారు. దీంతో ఇద్దరు డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ 1100 ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్–1100ను ప్రవేశపెట్టిందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ ద్వారా ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోనవచ్చన్నారు. అర్జీదారులు 1100 నంబర్కు డయల్ చేసి, తమ సమస్యను విన్నవిస్తే ఆన్లైన్లో ఫిర్యాదు రిజిస్టర్ చేసుకుంటుందని వివరించారు. ఆ సమస్యను సంబంధిత అధికారికి పంపి తద్వారా పరిష్కరించేందుకు వీలుకలుగుతుందన్నారు. సమస్యను కాల్ సెంటర్లో నమోదు చేసిన మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా నిర్ధారణ సందేశం పంపుతారని వివరించారు. -
ఉమ్మడి సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు ఇవ్వాలి
ఒంగోలు సిటీ: ఉమ్మడి సీనియారిటీ ప్రాతిపదికపై ప్రమోషన్లు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఒంగోలులోని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘ కార్యాలయంలో ఫ్యాప్టో, జాక్టో ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం, మండల విద్యాశాఖ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. మొట్టమొదట పీఆర్టీయూ పక్షాన ఒకే నియామక పరీక్ష ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికై న వారి ఖాళీలను బట్టి వివిధ మేనేజ్మెంట్ల పాఠశాలల్లో నియమించారన్నారు. అయినప్పటికీ పాఠశాల విద్యాశాఖ నియంతృత్వ ధోరణితో స్కూల్ అసిస్టెంట్లను ఎంఈఓలుగా నియమించిందని, వారికంటే సీనియర్ ప్రధానోపాధ్యాయులు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు ఉన్నప్పటికీ జూనియర్లను ఎంఈఓలుగా నియమించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఉమ్మడి సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని, దీనిపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. డైట్ లెక్చరర్లు సీనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్ పొందగానే డీఈఓలుగా ఎఫ్ఏసీ ఇచ్చారు కానీ డైట్ లెక్చరర్లకు ఈక్వల్ గా ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలను మాత్రం డీవైఈఓలుగా, డీఈఓలుగా నియమించకపోవడం చాలా అన్యాయమని, ఈ విధానాన్ని ఖండిస్తున్నామన్నారు. జాక్టో తరఫున శ్రీనివాసరావు, నరహరంజిరెడ్డి, మల్లికార్జున రావు ఫ్యాప్టో తరఫున అబ్దుల్ హై, రఘు, సుబ్బారావు, శ్రీనివాసరావు, పర్రె వెంకట్రావు, ప్రధానోపాధ్యాయుల సంఘం తరఫున వై.వెంకట్రావు. సాయి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారుల సంఘం తరఫున కిషోర్ బాబు, నాగేంద్రవదన్ పాల్గొన్నారు. ఎంఈఓల నియామకాల్లో సీనియర్లను పక్కనబెట్టడం సరికాదు విద్యాశాఖ తప్పు సరిదిద్దుకోకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం ప్రభుత్వానికి ఫ్యాప్టో, జాక్టో సంఘాల హెచ్చరిక -
రాష్ట్ర స్థాయి పోటీలకు చీమకుర్తి క్రీడాకారిణిలు
చీమకుర్తి: చీమకుర్తిలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూలుకు చెందిన క్రీడాకారిణిలు రాష్ట్ర స్థాయి బాల్ బాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. ఆదివారం కావలి సమీపంలోని చేవూరులో జరిగిన అంతర జిల్లా స్థాయి బాలికల పోటీల్లో చీమకుర్తి నుంచి ఎంపికై న వారి వివరాలను పీడీ డీ.స్వరూపావాణి చీమకుర్తిలోని మీడియాకు తెలిపారు. జూనియర్ బాడ్మింటన్ పోటీలకు దీక్ష, సబ్ జూనియర్ పోటీలకు కృప, మేఘన, అక్షయ ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో జూనియర్స్కు అనంతపురంలోను, సబ్జూనియర్స్కు చేవూరులో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తారని పీడీ తెలిపారు. ఎంపికై న క్రీడాకారిణిలను చీమకుర్తి జిల్లా పరిషత్ బాలికల హైస్కూలు టీచర్స్, వారి తల్లిదండ్రులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
టంగుటూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాతపడగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. టంగుటూరు మండలంలోని సూరారెడ్డిపాలెం ఫ్లయ్ ఓవర్పై చోటుచేసుకున్న ప్రమాదంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం చిన్నులగారిపల్లి గ్రామానికి చెందిన పులి గంగాధర్(35) మృతి చెందారు. ఆయన తన భార్య గాయత్రి, అత్త రాధ, కొడుకు గంధర్వ్తో కలిసి చైన్నె నుంచి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో సూరారెడ్డిపాలెం ఫ్లయ్ ఓవర్పై ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో గంగాధర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మరణించారు. ఈ ప్రమాదంలో గంగాధర్ అత్త రాధ, అతని కొడుకు గంధర్వ్ గాయపడగా చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై నాగమల్లేశ్వరరావు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ట్రక్ ఢీకొనియువకుడు మృతి పొదిలి: మినీ ట్రక్ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం పొదిలి టైలర్స్ కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చీమకుర్తి మండలం లక్ష్మీపురం పంచాయతీ రాజుపాలేనికి చెందిన సుబ్బారావు పొదిలి పెద్ద చెరువు సాగర్ పైప్ లైన్ నిర్మాణ పనుల్లో క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. మల్లవరం సమీపంలో పనులు ముగించుకొని స్వగ్రామానికి బైక్పై వెళ్తున్న సుబ్బారావును టైలర్స్ కాలనీ వద్ద ఒంగోలు నుంచి కనిగిరి వైపు వేగంగా వెళ్తున్న మినీ ట్రక్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. -
నిమ్మ ధర!
పాతాళంలోకిహనుమంతునిపాడు: నిమ్మకాయల ధరలు పాతాళంలోకి పడిపోవడంతో ఆ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నష్టాలు తప్పేలా లేవంటూ ఆందోళన చెందుతున్నారు. కాయలు కోసి మార్కెట్కు తీసుకెళ్లినా.. వ్యాపారులు కొనుగోలు చేయమని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో తోటల్లోని చెట్లకే కాయలు వదిలేస్తున్నారు. అవన్నీ రాలిపోయి చెట్ల కింద పడుతున్నాయి. చెట్ల పాదుల్లో అలాగే వదిలేయడంతో ఆ కాయలన్నీ కుళ్లిపోయి ఆ వాసనకు నల్లి తెగులు వ్యాపిస్తోంది. ఈ తెగులు చెట్లకు సోకి ఏకంగా తోటలన్నీ తెగులు బారిన పడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కూలీల ఖర్చులకు, ఆటో బాడుగలకు సరిపడా ధరలు కూడా పలకకపోవడంతో కాయను కోయడం కంటే చెట్లకు వదిలేయడమే మేలనే రైతులు వదిలేస్తున్నారు. కిలో రూ.2 నుంచి రూ.3 మాత్రమే... నిమ్మ ధరలు నిలకడ లేకుండా రోజుకో ధర పలుకుతోంది. హనుమంతునిపాడు మండలం నిమ్మ సాగులో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది. 2,874 హెక్టార్లకుపైగా సాగుచేస్తున్నారు. ముదురు, లేత తోటల సాగు సుమారు 2000 ఎకరాలపైబడి జరుగుతోంది. ఈ మండలం నుంచి ప్రతిరోజూ కనిగిరి మార్కెట్కు ఆటోలు, మినీ లారీల్లో నిమ్మ కాయలు తరలిస్తుంటారు. ఇటీవల ధర పూర్తిగా పడిపోవడంతో రైతులకు సమస్యలొచ్చిపడ్డాయి. ప్రస్తుతం నిమ్మకాయలు కిలో రూ.2 నుంచి రూ.3కు మించి పలకడం లేదు. కమిషన్ వ్యాపారులు ధర లేదని కాయను కొనుగోలు చేయడం లేదు. పచ్చి కాయ కిలో రూ.5 నుంచి రూ.6 మించి కొనుగోలు చేయడం లేదు. కోత కూలీలు, ఆటో బాడుగలు కూడా రావడం లేదు. ఈ ఏడాది మొదటి నుంచి నిమ్మకు ధర లేకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం నిమ్మ రైతుల గురించి పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లి తెగులుతో దెబ్బతింటున్న నిమ్మ తోటలు... నిమ్మకాయలను చెట్లకే వదిలేయడంతో అవన్నీ పండిపోయి రాలిపోతున్నాయి. పాదుల్లో కుళ్లిపోతున్నాయి. కుళ్లిన వాసనకు నల్లి తెగులు సోకి చెట్ల ఆకులు సైతం రాలిపోతున్నాయి. ఎండు పుల్లల తెగులు కూడా సోకుతోంది. వైరస్ సోకడంతో తోటలన్నీ పూర్తిగా దెబ్బతింటున్నాయి. దీంతో రాలిన కాయను ఏరి రోడ్ల పక్కన పోస్తూ రైతులు నలిగిపోతున్నారు. పట్టించుకోని హార్టీకల్చర్ అధికారులు... నిమ్మతోటల్లో నల్లి తెగులు, వైరస్ వ్యాపిస్తున్నప్పటికీ హార్టీకల్చర్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాటి నివారణ చర్యల గురించి రైతులకు కనీస సలహాలు, సూచనలు కూడా ఇవ్వకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నిమ్మతోటలకు వేరు కుళ్లు, ఎండుపుల్ల తెగులు, పేను బంక, కాయకు మంగు, మచ్చలు వచ్చి నాణ్యత కోల్పోతున్నాయి. మంగు, గజ్జి, మచ్చలున్న కాయను గ్రేడ్ చేసి పనికి రావంటూ రోడ్ల పక్కన పోస్తున్నారు. తోటల్లో చెట్లకే వదిలేయడంతో రాలిపోతున్న నిమ్మకాయలు ధర లేకనే వదిలేశామంటున్న రైతులు కాయలు తీసుకొచ్చినా కొనుగోలు చేయమంటున్న వ్యాపారులు పాదుల్లో వదిలేసిన కాయలు కుళ్లిపోయి సోకుతున్న నల్లి తెగులు నల్లి తెగులుతో దెబ్బతింటున్న నిమ్మ తోటలు పట్టించుకోని అధికారులు, పాలకులు నష్టాలు తప్పడం లేదంటున్న నిమ్మ రైతులు ఈ ఏడాది పూర్తిగా నష్టపోయాం నిమ్మకాయకు ధర లేక కాయను కోయడం లేదు. కిలో రూ.2కు కూడా వ్యాపారుల అడగడం లేదు. కోత కూలీలకు వచ్చేలా కూడా ధరలు లేకపోవడంతో 5 ఎకరాల్లో సాగుచేస్తున్న నిమ్మ తోటల్లో కాయను కోయకుండా వదిలేశాను. ఈ ఏడాది పూర్తిగా నష్టపోయాం. నిమ్మ రైతు గురించి పట్టించుకునే నాథుడే లేడు. – జె.దేవదానం, రైతు, సీతారాంపురం -
అన్నం పెట్టే రైతులకు సున్నం
నిరుపేదల ఉపాధికి గండి..ఒంగోలు టౌన్: వ్యవసాయ రంగంలో 70 శాతానికి పైగా పనిచేస్తున్న మహిళలకు తగిన గుర్తింపు దక్కడం లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను నీరుగార్చి ఆహార భద్రతకు తూట్లు పొడుస్తున్నాయని మండిపడ్డారు. ఆదివారం ఒంగోలులోని ఐద్వా కార్యాలయంలో జిల్లా మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. గ్రామీణ నిరుపేదలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని పక్కదారి పట్టించారని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలను దెబ్బ తీస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించేందుకు మహిళను సమాయత్తం చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 19, 20వ తేదీల్లో కొండపిలో నిర్వహించనున్న ఐద్వా 13వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సయ్యద్ షర్మిల మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కరువైందన్నారు. గత మూడేళ్ల కాలంలో చేపట్టిన ఉద్యమాలను సమీక్షించుకుని భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు మహాసభల్లో కార్యాచరణ రూపొందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఊసా రాజ్యలక్ష్మి, నెరుసుల మాలతి, ఎ.ఆదిలక్ష్మి, కె.ప్రసన్న, భావన రాజ్యలక్ష్మి, డి.శారా, కె.రాజేశ్వరి, శాంత కుమారి, అనంతలక్ష్మి, టి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో మహిళల శ్రమకు గుర్తింపు లేదు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి -
బనకచర్ల నిర్మిస్తారా?
రైతులను ఆదుకోలేని సీఎంఒంగోలు టౌన్: గిట్టుబాటు ధరలు రాక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలోని రైతులను ఆదుకోలేని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష కోట్ల రూపాయలతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పడం హాస్యాస్పదమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి విమర్శించారు. స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శి పంట పొలాల్లో మీటింగ్ పెట్టి రైతుల బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.5 వేలు వేశారని, దీని వలన రైతుల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయో చెప్పాలని ప్రశ్నించారు. బర్లీ, వర్జీనియా పొగాకు కొనుగోలు చేసేందుకు రూ.1000 కోట్లు కేటాయించాలని రైతులు అడుగుతుంటే స్పందించని ముఖ్యమంత్రి మాయమాటలతో మభ్యపెట్టాలని ప్రయత్నిన్నారని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలో అమరరాజా కంపెనీ జ్యూస్ కంపెనీ ఏర్పాటు చేయడంతో చిన్న, చితక ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, దీనివల్లనే మామిడికి ధరలు రాలేదని చెప్పారు. కనీసం కూలి కూడా దక్కని పరిస్థితుల్లో మామిడి రైతులకు రూ.100 కోట్లు కేటాయించాలని కోరినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెవికెక్కడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ రకాల పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు అల్లాడిపోతున్నారని చెప్పారు. రైతులు, సామాన్య ప్రజలు పెరిగిన ధరలతో అల్లాడి పోతుంటే ట్రూ అప్ చార్జీలు, సర్దుబాటు చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలను పెంచడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగులగొట్టమని ప్రచారం చేసిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే స్మార్ట్ మీటర్లను బిగించడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. విద్వేషాలను రెచ్చగొడుతున్న ఉప ముఖ్యమంత్రి .. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ చరిత్రను వక్రీకరిస్తూ సినిమాలు తీయడం ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని రమాదేవి ఆరోపించారు. మైనారిటీల మనోభావాలను దెబ్బతీయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. మహారాష్ట్ర, బీహారు ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండేలా ఓటర్ల ప్రత్యేక సవరణ నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లా సీపీఎం కార్యదర్శి ఎస్కే మాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా రూపొందించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు. కార్యక్రమంలో సయ్యద్ హనీఫ్, చీకటి శ్రీనివాసరావు, కొండారెడ్డి, ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి -
పరిమళించిన మానవత్వం
గిద్దలూరు రూరల్: పట్టణానికి చెందిన గలిబిలి ప్రసాద్ అనే వ్యక్తి మద్యానికి బానిసై కుటుంబ సభ్యులకు దూరమయ్యాడు. స్థానిక గ్రంథాలయం ఎదుట రోడ్డు మీద గత 5 రోజుల నుంచి పడిపోయి ఉన్నాడు. అక్కడే మలమూత్ర విసర్జన చేస్తూ దుర్భర స్థితిలో పడి ఉన్న అతని సమీపంలోకి వెళ్లేందుకు స్థానికులు సాహసం చేయలేదు. సమాచారం తెలుసుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బీఎస్ నారాయణరెడ్డి స్పందించి మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రసాద్కు క్షవరంతోపాటు స్నానం చేయించి నూతన వస్త్రాలు వేయించారు. అనంతరం ప్రసాద్ను కడప జిల్లా కాశినాయన మండలం ఓబులాపురం గ్రామంలోని వివేకానంద సేవాశ్రమానికి తరలించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డిని స్థానికులు అభినందించారు. -
జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యం
చీమకుర్తి: టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా 2029లో ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ చీమకుర్తి మండల స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ 2029లో కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2.0 పరిపాలనలో పార్టీ నాయకులు, కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారంటూ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తన సొంత జిల్లాను వదిలిపెట్టి సంతనూతలపాడు నియోజకవర్గానికి వచ్చిన మేరుగు నాగార్జునను వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు... మేరుగు నాగార్జున మాట్లాడుతూ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలిలో నిర్వహించిన కార్యక్రమానికి 50 వేల మంది రైతులు హాజరైతే.. వారిపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టిందని, కానీ, ఇప్పుడు వచ్చి అన్నదాత సుఖీభవ అంటూ రైతుల పట్ల చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశాడు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ పథకాలతో పాటు 134 హామీలతో ప్రజలను మోసం చేసి చంద్రబాబు సీఎం అయ్యారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా కాలంలో ప్రజలకు పార్టీలకతీతంగా ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో, ఇప్పుడు చంద్రబాబు ఏడాది పాలనలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో తేల్చుకుందామని, బహిరంగ చర్చకు సిద్ధమా..? అని కూటమి నేతలకు సవాల్ విసిరారు. జగన్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గడప గడపకు అందిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఇప్పుడు చంద్రబాబు పథకాలేమీ అమలు చేయకుండానే సుపరిపాలనకు తొలి అడుగు అంటూ ప్రజల్లో వెళ్తే ప్రజలు మొహం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పిలుపు మేరకు బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ పేరుతో సంతనూతలపాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ సూపర్ సిక్స్, ఆడబిడ్డ నిధి పథకాలను ఎగ్గొట్టి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. సమావేశం అనంతరం బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం బూచేపల్లి శివప్రసాదరెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, మేరుగు నాగార్జునను పార్టీ నాయకులు గజమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, పార్టీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మండల రూరల్ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, నాయకులు గోపిరెడ్డి ఓబుల్రెడ్డి, చిన్నపురెడ్డి మస్తాన్రెడ్డి, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వెంకాయమ్మ, మేరుగు నాగార్జున పొగాకు రైతులపై కేసులు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అంటున్నాడని ధ్వజం -
జగన్ పర్యటనను అడ్డుకుంటే శిక్ష తప్పదు
● వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి మార్కాపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటే ప్రజాకోర్టులో వారికి శిక్ష తప్పదని వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హెచ్చరించారు. శనివారం మార్కాపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలిరాగా, అడ్డుకునేందుకు కూటమి సర్కారు చేసిన కుట్రలు అప్రజాస్వామికమని అన్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య అంటూ తీవ్రంగా ఖండించారు. ప్రజల్లోకి వెళ్లే స్వేచ్ఛ ప్రతి నాయకునికి ఉంటుందన్నారు. తమ అభిమాన నేత పర్యటనకు వెళ్లే పూర్తి అధికారం స్వేచ్ఛ ప్రజలకు కూడా ఉంటుందని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న కూటమి సర్కార్.. జగన్ను, ప్రజలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. జగన్ పర్యటనను ఎంత అడ్డుకుంటే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అంత కోపం పెరుగుందని హెచ్చరించారు. దీని ఫలితం వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కార్ అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికై నా కూటమి సర్కార్ ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. కూటమి సర్కార్ తీరులో మార్పు రాకపోతే ప్రజలే ఆ ప్రభుత్వాన్ని మారుస్తారన్నారు. వైఎస్ జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో ప్రజలకు ఏం చేశారని కూటమి సర్కార్ పెద్దలు హాస్యాస్పదంగా ప్రశ్నిస్తున్నారని, జగన్ ఏం చేశారో జనంలోకి వెళ్లి అడిగే దమ్ము ఈ ప్రభుత్వ పెద్దలకు ఉందా.? అని జంకె సవాల్ విసిరారు. తన పాలనలో మూడేళ్లు కరోనా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా మారినప్పటికీ పేదల సంక్షేమాన్ని వదలకుండా అనేక పథకాలను వైఎస్ జగన్ అమలు చేసిన విషయం ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని అన్నారు. ఈ విషయం కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు కూడా తెలుసన్నారు. ఈ విషయాన్ని గమనించిన కూటమి పెద్దలు.. జగన్ జనంలోకి వెళితే ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుస్తుందన్న భయంతో జగన్ పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని జంకె విమర్శించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వ పెద్దలు ఇటువంటి విధానాలను విడిచిపెట్టాలని ఆయన హితవు పలికారు. -
విద్యుదాఘాతానికి రైతు బలి
పొదిలి రూరల్: పొలంలో వ్యవసాయ విద్యుత్ బోరుకు సంబంధించిన పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ సంఘటన పొదిలి మండలం అన్నవరంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యర్రంరెడ్డి చెన్నారెడ్డి (55) తన పొలంలో ఉన్న విద్యుత్ బోరుకు మరమ్మతులు చేస్తున్నాడు. బోరులోకి పైపులు దించే క్రమంలో పైన పొలాలకు సరఫరా చేసే 11కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చెన్నారెడ్డికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తిరోగమనం వైపు విద్యా వ్యవస్థ
రెండు ఓట్లు కలిగి ఉండటం నేరంఒంగోలు సబర్బన్: రెండు ఓట్లు కలిగి ఉండటం చట్ట ప్రకారం నేరమని ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అన్నారు. ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలోని తన ఛాంబర్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలక్షన్ కమీషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్..31, ఆర్పీఏ–1950 ప్రకారం రెండు ఓట్లు కలిగిఉన్న వారిపై ఒక ఏడాది జైలు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా విధిస్తారన్నారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెలా నియోజకవర్గ స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో రెండేసి ఓట్లు కలిగిన వారు వెంటనే ఒక ఓటును రద్దు చేసుకోవాలన్నారు. మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ మాత్రమే ఓటును కలిగి ఉండాలని తెలిపారు. రెండో ఓటును వెంటనే రద్దు చేసుకోకపోతే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నేరంగా పరిగణిస్తారన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు. వెంటనే రెండో ఓటును తొలగించుకోవాలని ఒంగోలు నియోజకవర్గంలోని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారు ఆధార్ అనుసంధానం వెంటనే చేసుకోవాలని కోరారు. 18 ఏళ్లు నిండిన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఒంగోలు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లలో 1200 ఓట్ల కంటే ఎక్కువ కలిగిన పోలింగ్ బూత్లోని ఓట్లను పక్కనే ఉన్న వేరే పోలింగ్ స్టేషన్కు మారుస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో లొకేషన్ చేంజ్ 12 పోలింగ్ బూతులు, కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లు 12 వరకు పెరుగుతాయని మొత్తం పోలింగ్ స్టేషన్లు ఒంగోలు నియోజకవర్గంలో 271 ఏర్పడతాయని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గంలో ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా రెండేసి ఓట్లు కలిగిన ఓటర్లు దాదాపుగా 30 నుండి 35 వేల మంది ఉన్నారని ఇటువంటి ఓటర్ల వల్ల ఎన్నికల వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో అన్ని పొలిటికల్ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఒంగోలు కృష్ణ మోహన్, సుధాకర్, బాబురావు, రాంభూపాల్ రెడ్డి, పద్మజ, నాయుడు, శేషుబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.ఒంగోలు సిటీ: విద్యా వ్యవస్థను తిరోగమనం వైపు నెడుతున్న కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం హెచ్చరించింది. ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం స్థానిక ప్రకాశం భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఫ్యాప్టో చైర్మన్ కె.ఎర్రయ్య అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఉపాధ్యాయ, ఎంఈఓ, పెన్షనర్ల సంఘాల నేతలు పలువురు పాల్గొని మాట్లాడారు. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను పూర్తిస్థాయి విముక్తులను చేస్తామని, మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రి లోకేష్.. కనీసం ఉపాధ్యాయ సంఘ నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. ఎంఈఓల రాష్ట్ర సంఘ నేతలు తొలిసారిగా ధర్నాలో పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించగా, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎస్ఎండీ రఫీ ధర్నాను ప్రారంభించారు. ఎంఈఓల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కిషోర్బాబు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానివేసి వారికి పెట్టిన తిండి లెక్కలు తేల్చడానికి ఉపాధ్యాయులు సమయం వెచ్చించాల్సి రావడం విచారకరమన్నారు. ఎంఈఓ, హెచ్ఎం, డిప్యూటీ డీఈఓ ప్రమోషన్ల ప్రక్రియలో కామన్ సర్వీస్ రూల్స్ అమలుకు ఉన్న అడ్డంకులు తొలగించాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఉపాధ్యాయులచే ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈఓ, డైట్ కాలేజీ లెక్చరర్లు, ఎంఈఓల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసేలా ఉండటం విచారకరమన్నారు. ఉపాధ్యాయులను గిన్నిస్ బుక్ రికార్డు కోసం యోగాంధ్ర, మెగా పీటీఎం వంటి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు అమలు చేసే వారుగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 మంది విద్యార్థులున్న ప్రత్యేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు కాపలాదారుగా పనిచేయాల్సి రావడం విద్యా వ్యవస్థకే తీరని అవమానమని అన్నారు. బోధన వ్యవస్థకు ఆటంకం కలిగిస్తున్న యాప్లను పూర్తిగా రద్దు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని, తదితర 19 డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీటీఏ జిల్లా అధ్యక్షుడు పర్రె వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను తిరోగమనం వైపు నెడుతోందని దుయ్యబట్టారు. మరో పదేళ్లలో ప్రభుత్వ బడులు లేకుండా చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఉపాధ్యాయుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి... ఎంఈఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్.నాగేంద్రవదన్ మాట్లాడుతూ సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు లేనిదే సమాజం లేదని, అటువంటి ఉపాధ్యాయుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని హితవు పలికారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ మంజుల మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం, మంత్రులు నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. హెచ్ఎంల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వై.వెంకటరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే అబ్దుల్ హై, బి.వెంగళరెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు పీవీ సుబ్బారావు మాట్లాడుతూ ఎంఈఓ–1 పోస్టుల భర్తీకి తీసుకున్న జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. జెడ్పీ, గవర్నమెంట్ మేనేజ్మెంట్లలో సంయుక్త సీనియారిటీ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు టీసీహెచ్ సుబ్బారావు, ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కంచర్ల సుబ్బారావు పాల్గొని వారి సంఘాల తరఫున మద్దతు ప్రకటించారు. ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాల నాయకులు డి.శ్రీనివాసులు (ఏపీటీఎఫ్–257), బి.వెంకట్రావు(ఏపీటీఎఫ్ 1938), చల్లా శ్రీనివాసులు, ఎస్.రవి, ఎన్.చిన్నస్వామి, వి.మాధవరావు, డి.జయరావు, జీఎండీ సనాఉల్లా, వి.జనార్దనరెడ్డి (ఏపీటీఎఫ్ 257), కె.శ్రీనివాసరావు, పరిటాల సుబ్బారావు, అట్లూరి అమ్మయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న కూటమి ప్రభుత్వ విధానాలే కారణం బోధనకు దూరమవుతున్న ఉపాధ్యాయులు ఫ్యాప్టో ధర్నాలో పలువురు ఉపాధ్యాయ సంఘ నేతల ఆందోళన తొలిసారి ఎంఈఓ అసోసియేషన్ సంఘీభావం -
జిల్లాకు రిక్త హస్తం చూపించిన బాబు
ఒంగోలు సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ప్రజలకు రిక్తహస్తం చూపించారని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ జిల్లాకు చంద్రబాబు వస్తుంటే పొగాకు రైతుల కోసం ఏదైనా ప్రకటన చేస్తారేమోనని ఆశగా చూశారని, తీరా సినిమా సెట్టింగ్ వేసుకుని వెళ్లిపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారన్నారు. జిల్లాలో పొగాకు రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొని ఉందని, వేలం కేంద్రాల్లో ధర రాకపోవడం, ఎక్కువగా తిరస్కరణ బేళ్లు ఉండటంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. వారిని ఆదుకోవడం మానేసి రైతులకు అన్నీ చేస్తున్నామని అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్రెడ్డిని జనం ఒక దైవంలా చూసుకుంటున్నారని, అది చూసి ఓర్వలేక ఆయనపై బురదజల్లే కార్యక్రమాలు చేయడం మంచిది కాదన్నారు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్తో పాటుగా ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రసంగంలో దొనకొండ పారిశ్రామికవాడ ఊసే లేదన్నారు. డిగ్రీ కళాశాల ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. ఇసుక, మట్టి దోపిడీ, మద్యం, రేషన్ బియ్యం మాఫియాలు, తాజాగా చేపలు చెరువుల వద్ద నుంచి వసూలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మీరు సమావేశం పెట్టుకున్న పక్కనే ఒక రైతు ఇంటిపై మీ నియోజకవర్గ ఇన్చార్జి దౌర్జన్యానికి పాల్పడిందని, దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును ప్రశ్నించారు. పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులు పెడుతోందన్నారు. రైతులకు మేలుచేసిన రైతు భరోసా కేంద్రాలు తిరిగి పనిచేసేలా చూడాలని బూచేపల్లి డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమంలో లక్షలాది మంది లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా ముంచేశారన్నారు. ‘‘నాడు వ్యవసాయం దండుగ అన్నారు. నేడు రైతు పక్షపాతిగా ఉండే ప్రసక్తే లేదు’’ అని చంద్రబాబు అంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేశారన్నారన్నారు. వెలుగొండను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సంక్షేమశాఖ మంత్రి సొంత జిల్లా, చీమకుర్తి పట్టణంలో సంక్షేమ హాస్టల్లో ఉంటున్న బాలిక వెంట్రుకలను కోసేశారని, దీనికి మంత్రి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నేం శ్రీధర్బాబు, వైఎస్సార్ సీపీ నాయకులు బెజవాడ రాము, కోటిరెడ్డి, సుధాకర్, ఓబుల్రెడ్డి, అన్వేష్, చెంచిరెడ్డి, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
బాబు ఫ్లాప్ షో
అన్నదాత సుఖీభవ డబ్బుల పంపిణీ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు సినిమా సెట్టింగ్ను తలపించేలా పంట పొలాల మధ్య..నులక మంచాలపై కూర్చొని మెడలో పచ్చ కండువాలు వేసుకున్న రైతుల మధ్య చేసిన కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. మండుటెండతో రైతులు మధ్యలోనే జారుకోగా..టీడీపీ కార్యకర్తలతో సభను మమ అనిపించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఏ ఒక్క కొత్త హామీనీ ఇవ్వకుండా పాత హామీలనే వల్లెవేసిన బాబు తీరుపై అధికార పార్టీ కార్యకర్తల్లోనే అసంతృప్తి వ్యక్తమైంది. దర్శి: బాబు వస్తారు..వరాల జల్లు కురిపిస్తారు అన్న ఆశతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి అన్నదాత సుఖీభవ మొదటి కార్యక్రమం దర్శి మండలం తూర్పువీరాయపాలెంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని వినూత్న రీతిలో ఖర్చు లేకుండా పేరు సంపాదించేలా ఉండాలని దర్శి టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అధికారులు రెండు రోజులు భారీ ఎత్తున వచ్చి హడావిడి చేశారు. వచ్చే రైతులకు పాస్లు కూడా ఇచ్చి పంపారు. శనివారం ఉదయం 10 గంటలకు నాయకులు, కార్యకర్తలు వచ్చారు. వచ్చిన వారు అక్కడ చూసి ఖంగుతిన్నారు. అక్కడ అన్నీ నులక మంచాలే దర్శనం ఇచ్చాయి. ఒక్కటంటే ఒక్క కుర్చీ లేదు. టెంట్లు లేవు, ఎండకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు కూడా లేవు. పొలంలో ఎండలో కేవలం నులక మంచాలు మాత్రమే వేసి పెట్టారు. ఆ మంచాలపై టీడీపీ సానుభూతిపరులైన రైతులను కూర్చోబెట్టి ఆ ప్రోగ్రాం అయినా సక్సెస్ చేద్దామనుకున్న ప్రయత్నం విఫలమైంది. మండుటెండలో మంచాలతో ప్రహసనం: రైతులను ఆకుపచ్చ కండువాలు వేసి వారికి కేటాయించిన మంచాల పై కూర్చోబెట్టారు. అంత వరకు బాగానే ఉంది. పది గంటల నుంచి భానుడు భగ్గుమన్నాడు. ఆ ఎండకు మెడలో కండువాలు కాస్తా తలపైకి చేరాయి. ఎల్ఈడీ స్క్రీన్లో ప్రధాని మోదీ హిందీలో చెప్తున్న ప్రసంగాన్ని పెట్టడంతో జనానికి అర్థంకాక తలపట్టుకున్నారు. పైన టెంట్ లేకపోవడం, అక్కడ పూర్తి స్థాయిలో తాగునీరు లేకపోవడంతో వచ్చిన రైతులు, మహిళలు ఆ ఎండదెబ్బకు తట్టుకోలేక చల్లగా జారుకున్నారు. దీంతో మంచాలన్నీ ఖాళీ అయ్యాయి. ఆ తరువాత టీడీపీ అనుకూల రైతులకు పాస్లు ఇచ్చి పిలిచి కూర్చోబెట్టారు. వారు కూడా ఎండదెబ్బకు జారుకోవడం మొదలుపెట్టారు. దీంతో చంద్రబాబు వచ్చే సమయమైంది మంచాలు ఖాళీగా కనిపిస్తున్నాయని చెకింగ్ పాయింట్ తీసేసి కార్యకర్తలందరినీ వదిలేశారు. చంద్రబాబు, మంత్రులు, అధికారులు వచ్చి ఆయనతో పాటు మంచాల మీద కూర్చున్నారు. దీంతో వెనకున్న వారికి వచ్చిన వారు కనిపించలేదు. మంచాలపై కూర్చోకుండా నిలబడటం మొదలైంది. ఆ తరువాత ఒకరిని చూసి మరొకరు అందరూ మంచాలపై నుంచి లేచి నిలబడ్డారు. మంచాలు విరిగి తుక్కు తక్కు అయిపోయాయి. దీంతో మంచాల డ్రామా సెట్టింగ్ కాస్తా అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక్క హామీ ఇవ్వని వైనం బాబు వస్తారు..వరాలు కురిపిస్తారు.. హామీలిస్తారని ఎదురుచూసిన కార్యకర్తలకు తీవ్ర నైరాశ్యం మిగిలింది. నియోజకవర్గానికి సంబంధించి ఒక్క హామీ ఇచ్చిన పాపాన పోలేదు. నియోజకవర్గంలో గత ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అదే హామీలను మళ్లీమళ్లీ కొత్తగా ఇస్తున్నట్టు వల్లెవేశారు. జిల్లాలో రైతులకు రూ.122.74 కోట్లు: అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 2,68,165 రైతులకు రూ.122.74 కోట్లు, దర్శి నియోజకవర్గంలోని 42,871 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.29.06 కోట్ల నగదును పంపిణీ చేశామంటూ రైతులైన సుబ్బరత్తమ్మ, పేరయ్యలకు చెక్కు రూపంలో నగదును సీఎం అందజేశారు. దర్శి మండలంలో 10,987 మంది రైతులకు రూ.7.69 కోట్లు, తూర్పు వీరాయపాలెంలో 476 మంది రైతులకు రూ.7.20 కోట్లు నగదు ఇచ్చామన్నారు. ఉదయం 11.30 గంటలకు రైతుల వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి దాదాపు రెండు గంటలపాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, టీడీపీ దర్శి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాసులు ఉన్నారు.నారపుశెట్టికి అవమానం దర్శి నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కులా ఉన్న మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుకు, ఆయన సోదరుడు నగర పంచాయతీ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్యకు చంద్రబాబు పర్యటనలో అవమానం ఎదురైంది. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావును చంద్రబాబు వాహనంలోకి ఎక్కనివ్వలేదు. అలాగే హెలిపాడ్ వద్ద పిచ్చయ్యను చంద్రబాబును కలిసేందుకు అవకాశం కల్పించలేదు. దీంతో నారపుశెట్టి పాపారావు అభిమానులకు విషయం తెలిసి భగ్గుమంటున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే ఉన్న పాపారావును సీఎం వాహనం ఎక్కనివ్వకపోవడం దర్శి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సీఎం పాల్గొన్న కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అవడంపై కార్యకర్తల్లో అసంతృప్తి మంచాలతో డ్రామా సెట్టింగులు పల్లె వాతావరణం తీసుకురావాలనే ప్రయత్నం బెడిసికొట్టిన వైనం ఇదేం కార్యక్రమమంటూ ముక్కున వేలేసుకున్న రైతులు, టీడీపీ కార్యకర్తలు ప్రసంగంలో దర్శి అభివృద్ధి ఊసే ఎత్తని చంద్రబాబుబాబు సభలో కార్యకర్తలు ఎక్కి తొక్కడంతో విరిగిపోయిన మంచాలు -
భార్య గొంతు కోసిన భర్త
● కుటుంబ కలహాల నేపథ్యమే కారణం పెద్దదోర్నాల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్య గొంతు కోశాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురం పడమటపల్లెలో శనివారం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వివాహిత మల్లేశ్వరి తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రురాలిని 108లో మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని పెద్ద బొమ్మలాపురానికి చెందిన స్వేచ్ఛకుమార్, మల్లేశ్వరి దంపతులు. స్వేచ్ఛకుమార్ గతంలో కొన్నాళ్లు హోంగార్డుగా విధులు నిర్వహించాడు. కొన్ని కారణాల రీత్యా విధుల నుంచి పోలీసు అధికారులు తప్పించారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆమె అదే గ్రామంలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటోంది. గ్రామ సమీపంలో ఉన్న కొండ వద్దకు బహిర్భూమికి వెళ్లిన మల్లేశ్వరిని అటకాయించిన స్వేచ్ఛకుమార్ కత్తితో ఆమె గొంతు కోసి పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
గొర్రెలు, మేకల పెంపకం సంఘానికి అన్యాయం
సంతమాగులూరు (అద్దంకి): కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా గొర్రెలు, మేకల పెంపకం సంఘానికి రూపాయి కేటాయించలేదని గొర్రెలు, మేకల సంఘ రాష్ట్ర కార్యదర్శి పెద్దబ్బాయి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘ 7వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి పిలుపునిచ్చారు. అందులో భాగంగా శనివారం బాపట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లోని కొప్పెరపాడు, ఎస్ఎల్ గుడిపాడు, ఎంకే పాలెం, మామిళ్లపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి మహాసభల కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 17 ,18వ తేదీల్లో ఒంగోలులో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వృత్తి రక్షణ, వృత్తిదారుల సంక్షేమం కోసం మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెంపకందార్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి సమగ్ర కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెల పెంపకం ప్రధానమైన జీవనాధారంగా ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రెండు కోట్ల 21 లక్షల గొర్రెలు, మేకల సంపద, ఐదు వేలకు పైగా పెంపకందార్ల సహకార సంఘాలు, సుమారు నాలుగు లక్షల కుటుంబాలకుపైగా ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నాయన్నారు. గ్రామీణ స్థాయి సొసైటీల్లో జిల్లా స్థాయిలో యూనియన్లు, రాష్ట్రాల్లో ఫెడరేషన్ ఏర్పాటు చేసినా వాటికి తగిన నిధులు ప్రభుత్వాలు కేటాయింపులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సమాజానికి బలమైన నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తున్న కీలకమైన రంగాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్యాయన్నారు. బీమా పథకాలు సరిగా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు గొర్రెలను అడవిలోకి రానివ్వకపోయినా పశువుల పోరంబోకు భూములు, కుంటలు, దారులు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మందులు, టీకాలు, డీ వార్మింగ్ కోసం బడ్జెట్లో నిధులు పెంచాల్సిన అవసరం ఉందని, నా బార్డు ద్వారా 50 శాతం సబ్సిడీ రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి తోట తిరుపతిరావు, రాష్ట్ర బాధ్యులు పూసపాటి వెంకట్రావు, బాపట్ల జిల్లా సంఘ కార్యదర్శి బుర్రి ఆంజనేయులు, చిమట సైదులు, పెద సింగరయ్య పాల్గొన్నారు. -
పట్టపగలు దొంగల హల్చల్
● సుమారు 10 సవర్ల బంగారం చోరీ సింగరాయకొండ: పట్టపగలే ఓ ఇంటి తాళం పగలకొట్టి చోరీకి పాల్పడి పోలీసులకు దొంగలు సవాల్ విసిరారు. సుమారు 10 సవర్ల బంగారం అపహరించారు. ఈ ఘటన సింగరాయకొండ మండల కేంద్రంలోని చేపల మార్కెట్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ నగర్–4వ లైన్లో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఇంటి యజమాని బండి కృష్ణవేణి గుడ్లూరు మండలం పెదపవనిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో లెక్చరర్గా పనిచేస్తోంది. ఆమె భర్త వెంకటేశ్వర్లు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు. శుక్రవారం ఉదయం భార్యభర్తలిద్దరూ కలిసి గురుకుల పాఠశాలకు కారులో వెళ్లారు. అయితే, మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా తాళం వేసి ఉండటాన్ని ఆ ఇంటి పైపోర్షన్లో అద్దెకు ఉండేవారు చూశారు. కానీ, సాయంత్రం 4.30 గంటలకు తాళం పగలకొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే చోరీ జరిగిన సమాచారాన్ని కృష్ణవేణికి తెలిపారు. వారు ఇంటికొచ్చి చూడగా బీరువాలోని దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. సుమారు 10 సవర్ల బంగారం చోరీ అయిందని గుర్తించారు. ఇంకా ఎంత మొత్తం చోరీ జరిగిందనే దానిపై ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులు ఆధారాలు సేకరించారు. బిర్యానీ రేటు దగ్గర గొడవ ● రెచ్చిపోయిన మందుబాబులు ఒంగోలు టౌన్: నగరంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. పీకలదాకా తాగి గొడవలకు దిగుతున్నారు. ఇటీవల త్రోవగుంట రోడ్డులోని ఒక రెస్టారెంటులో మద్యం బాబులు గొడవకు దిగగా.. శుక్రవారం సౌత్ బైపాస్లో రెచ్చిపోయారు. నగరంలోని ప్రగతి నగర్కు చెందిన కొందరు యువకులు సౌత్ బైపాస్లో రోడ్డు పక్కన బీఫ్ బిర్యానీ పాయింట్ దగ్గరకు వచ్చారు. బిర్యానీ తిన్న తరువాత రేటు విషయంలో నిర్వాహకురాలు మరియమ్మతో గొడవ పెట్టుకున్నారు. ఈ తతంగాన్ని గమనిస్తున్న అక్కడున్న వెల్డింగు షాపు నిర్వాహకుడు తంగిరాల ఏసురత్నం కల్పించుకున్నాడు. మహిళతో దురుసుగా ప్రవర్తించడం సరికాదని హితవు పలికాడు. దాంతో మద్యం మత్తులో వున్న యువకులు రెచ్చిపోయారు. మాకే నీతులు చెబుతావా అంటూ గొడవకు దిగారు. స్నేహితులతో వచ్చి ఏసురత్నం మీద దాడి చేశారు. గాయపడిన ఏసురత్నాన్ని ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది.