రెవెన్యూ సమస్యలే అధికం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సమస్యలే అధికం

Mar 17 2026 7:25 AM | Updated on Mar 17 2026 7:25 AM

రెవెన్యూ సమస్యలే అధికం è వేసవికాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ ఏలూరి రామచంద్రారెడ్డి జేసీకి వినతిపత్రం అందచేశారు. è మార్కాపురం మండలం ఇడుపూరు గ్రామ ఇలాఖాలో సర్వేనెంబరు 51లో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసిందని, అయితే ఈ భూమి ఎం వెంకటయ్య, చిన్నగురవయ్య, రామారావు పేర్లపై 1.25 ప్రకారం 3.75 సెంట్ల భూమి వీరి పేర్లపై ఆన్‌లైన్‌లో నమోదై ఉందని, వీరిపేర్లను తొలగించి నా పేరుపై ఆన్‌లైన్‌ చేయాలని ఎం గురవయ్య వినతిపత్రం అందచేశారు. è కనిగిరి డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న నాకు 2014లో ప్రమాదం జరిగి వెన్నుముక విరగడంతో ఉద్యోగం నుంచి తొలగించారని, నా సర్వీసు 6 ఏళ్లు ఉండగానే మెడికల్‌ అన్‌ఫిట్‌ కింద ఉద్యోగాన్ని నా కుమారుడికి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నట్లు సరస్వతి తెలిపారు. అయితే ఆర్టీసి అధికారులు నాకు రావాల్సిన బెనిఫిట్స్‌ ఇవ్వకపోగా నా కుమారుడికి ఉద్యోగం ఇవ్వకపోవడంతో వ్యాపారం చేసుకుంటూ మనోవేదకు గురై 2022లో మృతి చెందాడని, భర్త లేక కుమారుడు లేక ఒంటరిగా జీవిస్తున్నానని నాపై ఆర్టీసీ అధికారులు నగదు విషయంలో చీటింగ్‌ కేసు నమోదుచేశారని, ఎటువంటి చీటింగ్‌కు నేను పాల్పడలేదని, ప్రస్తుతం ఒంటరిగా అనాథశ్రమంలో ఉంటున్నానని, నాకు రావాల్సిన బెనిఫిట్లను మంజూరు చేయాలని కోరారు. ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు

జాయింట్‌ కలెక్టర్‌ పులి శ్రీనివాసులు

మార్కాపురం టౌన్‌: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు రెవెన్యూ సమస్యలే అధికంగా వస్తున్నాయని, సంబంధిత రెవెన్యూ అధికారులు వాటిని పరిష్కరించి న్యాయంచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ పులి శ్రీనివాసులు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 181 అర్జీలు రాగా అందులో 124 రెవెన్యూ సమస్యలపై ఉన్నాయన్నారు. అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సమస్యలపై ఆలస్యం చేయకుండా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీఓ ప్రభాకర్‌, జిల్లా స్ధాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురం: పోలీసుల వద్దకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు తెలిపారు. మార్కాపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జిల్లా వ్యాప్తంగా 32 అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుదారునితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు పంపుతున్నామని సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఫిర్యాదు దారులకు దగ్గరలో ఉన్న పోలీసుస్టేషన్‌ ఎస్సై, సీఐలతో మాట్లాడారు. చట్టప్రకారం విచారణ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలకు గురికావద్దని, ఎవరూ ఉద్యోగాలు ఇప్పించలేరని, ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్‌ ద్వారానే పరీక్షలు రాసి పాసై ఉద్యోగాలు సాధించాలని చెప్పారు. పొదిలి, గిద్దలూరు, కంభం సీఐలు రాజేష్‌కుమార్‌, రామకోటయ్య, మల్లికార్జున పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement