breaking news
Prakasam District Latest News
-
పంచేసుకుందాం...!
నువ్వు కొంచెం..నేను కొంచెంఅధికారం మనది.. మనల్ని అడిగేదెవరు..అడ్డగించేదెవరు... ఖాళీగా ఉందిగా నువ్వు కొంచెం..నేను కొంచెం పంచేసుకుందాం. అన్నట్లు టీడీపీ నేతల తీరు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా టీడీపీ నాయకుల ఒత్తిడితో ఆక్రమణల జోలికి ఎవ్వరూ వెళ్లడం లేదు. చెరువు భూమిని చెరబట్టినా అధికారులు పట్టించుకోకుండా మిన్నకుండడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉలవపాడు: మండల పరిధిలోని ఎల్ రాజుపాలెంగ్రామంలోని రాజుల చెరువు లోని కొంత భూమి పై పచ్చనేతల కన్ను పడింది. రెండు నెలల నుంచి భూమిని చదును చేస్తున్నారు. రాజుపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు బీసీ నేతలు ఈ భూమిని ఆక్రమించారు. ఇద్దరు నేతలు చెరో ఎకరాను చదును చేశారు. ఒక నేత జామాయిల్ మొక్కలు వేశాడు. మరో నేత చదును చేసి మొక్కలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాజుల చెరువు సుమారు 50 ఎకరాలు ఉంటుంది. వర్షం పడిన సమయంలో చెరువు నిండినా కూడా కొంత భాగం నీరు లేకుండా ఉంటుంది. దీనిని ఆసరాగా తీసుకున్న సదరు నాయకులు ఆ భూమిని కబ్జా చేయడానికి పూనుకున్నారు. గతంలో ఎల్.రాజుపాలెంలోని ఎస్సీ, బీసీలు ఎవరైనా మరణిస్తే ఇక్కడే కూడా పూడ్చిపెట్టిన సంఘటనలు ఉన్నాయి. అంటే మరుభూమిగా కూడా ఈచెరువు భూమి గతంలో వాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా వర్షాలు లేని సమయంలో ఇక్కడ శవాలను పూడ్చిపెడుతుంటామని గ్రామస్తులు అంటున్నారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ చెరువు భూమిని ప్రస్తుతం ఇద్దరు టీడీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. ఒక్కసారి మొక్కలు వేస్తే ఇక ఎవరిని పూడ్చిపెట్టడానికి రారు అనే ఆలోచన తో సదరు నాయకులు ఆక్రమించినట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక అధికారులకు, జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా ఉపయోగంలేదని గ్రామస్థులు అంటున్నారు. ఫిర్యాదు చేసినా ఫలితం ఏది..? స్థానిక టీడీపీ నాయకులు చెరువు భూమిని ఆక్రమించి మొక్కలు నాటారని గ్రామస్తులు కలెక్టర్కు, స్థానిక తహసీల్దార్, నీటి పారుదల శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ శ్రీనివాసరావు, నీటిపారుదల శాఖ అధికారులు వచ్చి ఆక్రమణ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువు భూమిని నేతలు ఆక్రమించారని అధికారులు నెల రోజుల క్రితమే గుర్తించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందచేస్తామని ఆక్రమణలను తొలగిస్తామని తెలియచేశారు. కానీ టీడీపీకి చెందిన నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు కూడా ఆక్రమణదారుల వైపు ఉండి వారికి అండగా నిలుస్తున్నట్లు సమాచారం. మండల కేంద్రమైన ఉలవపాడులోని టీడీపీ నేత కుమారుడు అధికారులతో మాట్లాడి ఆక్రమణదారుల జోలికి వెళ్లవద్దని చెప్పడంతో అధికారులు కూడా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ఆక్రమణలను తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై వీఆర్ఓ పీరయ్య వివరణ కోరగా ఆక్రమణకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, నీటిపారుదలశాఖ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారుల సమక్షంలో పరిశీలించినట్లు తెలిపారు. భూమి ఆక్రమణపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించామని, వారి నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజుపాలెంలో రాజులచెరువు ఆక్రమణ రెండు ఎకరాల్లో జామాయిల్ సాగు ఇద్దరు టీడీపీ నేతల భూ కబ్జా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం -
కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ అండ
● సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున చీమకుర్తి రూరల్: వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున భరోసా ఇచ్చారు. చీమకుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. సోమవారం మండలంలోని తొర్రగుడిపాడు గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి పార్టీ సంస్థాగత కమిటీలపై సమావేశం నిర్వహించారు. ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, మేరుగు నాగార్జున మాట్లాడుతూ జగనన్న పిలుపు మేరకు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్పేలా చూడాలన్నారు. మనమంతా సమిష్టిగా కృషి చేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ చీమకుర్తి మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు యన్నం శేషురెడ్డి, నాయకుడు చీదర్ల శేషు, వైస్ ఎంపీపీ రావి లక్ష్మయ్య, జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి ఓబులరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటరావు, రైతు విభాగం మండల అధ్యక్షుడు నల్లూరి రామచంద్ర, యూత్ అధ్యక్షుడు సుడిదెల వెంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పొన్నపల్లి నాగేశ్వరరావు, నియోజకవర్గ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు మక్కెన రాజేంద్ర, నాయకులు బొంతా సంతోష్, కూడలి మాలకొండయ్య శ్రీను, కొణికి సుబ్రహ్మణ్యం, నాగార్జున, వెంకటేశ్వర్లు, సుంకర హరికృష్ణ, ఆంద్రియ తదితరులు పాల్గొన్నారు. -
మోసానికి బాబు బ్రాండ్ అంబాసిడర్
కురిచేడు: అబద్ధపు హామీలతో ప్రజలను వంచించండం చంద్రబాబు నైజమని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. మండలంలోని పడమర నాయుడుపాలెం, ఆవులమంద గ్రామాల మధ్య కొండపై వెలసిన ప్రసన్నాంజనేయ సమేత బొల్లి కొండ్రాయి స్వామి వార్షికోత్సవ తిరునాళ్ల సందర్భంగా యాదవులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పంటలకు సరైన మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ప్రజా పాలన లేదని విమర్శించారు. ప్రశ్నించే ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, కేసులకు భయపడే రోజులు పోయావని, అవినీతిని ప్రశ్నించే రోజులు వచ్చాయన్నారు. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి అని, మాట ఇస్తే తప్పడని, మడమ తిప్పని నాయకుడి వెంట మేమున్నామని బడుగు, బలహీన వర్గాల వారి కోసం, రైతుల కోసం, మహిళల కోసం ఎన్నికల ముందు మాట ఇచ్చి వంద శాతం హామీలను నెరవేర్చిన ఏకై క ముఖ్యమంత్రి జగనన్న అని తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన ఒక్క హామీని సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే విమర్శించారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు. రేషన్ బియ్యం, భూ కబ్జా చేసి దోచుకుంటున్నారని, బినామీ పేర్లకు తక్కువ ధరకు భూములు అప్పగించి కొత్త రకం భూ దందాకు పాల్పడుతున్నారన్నారు. 2029 ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా, దర్శి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని హర్షధ్వానాల మధ్య కోరారు. అనంతరం యాదవలు బూచేపల్లిని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యన్నాబత్తుల సుబ్బయ్య, జెడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ కండె గంగయ్య యాదవ్, సర్పంచ్ మహేష్, నాయకులు బొమ్మనబోయిన చిన్న ఆంజనేయులు, బొమ్మినీడు చెంచయ్య, చిన్న ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్బుక్ రాజ్యాంగానికి భయపడేది లేదు బూటకపు హామీలతో బాబు నిలువునా మోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం రెడ్బుక్ రాజ్యాంగానికి భయపడేది లేదు పార్టీకి కార్యకర్తలకే కొండంత బలం దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
ఆరుగురు పిల్లలను దత్తత తీసుకున్న దంపతులు
ఒంగోలు సబర్బన్: ఆరుగురు చిన్నారులకు దత్తత స్వీకార ప్రక్రియను కలెక్టర్ పి.రాజాబాబు సోమవారం నిర్వహించారు. స్థానిక కలెక్టర్ చాంబర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి వరకు అనాథ బాలలుగా ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆరుగురు చిన్నారులకు పలువురు దంపతులు తల్లిదండ్రులుగా మారారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రాంనగర్లోని శిశు గృహలో ఇప్పటి వరకు ఆ చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. వారిని కలెక్టర్ అధ్యక్షతన దత్తత ఇచ్చారు. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దంపతులు కలెక్టర్ చేతుల మీదుగా దత్తత ప్రక్రియ ద్వారా పిల్లలను స్వీకరించారు. వారంతా పోలీసు శాఖ, బ్యాంకు, సాఫ్ట్వేర్, బిజినెస్ రంగాల్లో స్థిరపడినవారు కాగా, వారితో కలెక్టర్ మాట్లాడుతూ ఈ పిల్లలు మీకు దేవుడిచ్చిన వరమని, మీ కడుపున పుట్టిన బిడ్డలుగా భావించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులకు దత్తత ఆర్డర్స్ను కలెక్టర్ అందించారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత జిల్లా అధికారిణి ఎం.నాగమణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలు నీలిమ వంశీలత, శిశుగృహ సిబ్బంది పాల్గొన్నారు. -
బాబు పాలన దోపిడీమయం
త్రిపురాంతకం: సీఎం చంద్రబాబు పాలన మొత్తం దోపిడీమయమని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మండలంలోని జి.ఉమ్మడివరం ఉగ్రనరసింహస్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై నుంచి ఆయన మాట్లాడారు. సంపద సృష్టించామని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాకా ఊది చెబుతుంటే ఆ సంపద తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి చేరడం తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. ఎన్నో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి నేతలు ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పార్టీలకతీతంగా అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, కష్ట కాలంలో ప్రజలను అన్ని విధాలా ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 2029లో వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, పార్టీ కోసం మీరు చేసిన త్యాగాలు వృథా కావని, ప్రతి ఒక్కరినీ గుర్తు రెండేళ్ల కూటమి పాలన మొత్తం అవినీతిమయమేనని మండిపడ్డారు. అందుకే చంద్రబాబు, లోకేష్ సభలకు జనం నుంచి స్పందన ఉండటం లేదన్నారు. కానీ జగన్మోహన్రెడ్డి ఎక్కడికి వెళ్లినా లక్షలాది మంది ప్రజలు ఆయన వెంట వస్తున్నారని, ప్రజల్లో ఆయనుకున్న అభిమానం అలాంటిదన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎస్ పోలిరెడ్డి, యూత్ కన్వీనర్ ఏ కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు ఎస్ రంగబాబు, ఎం గాలెయ్య, సుబ్రహ్మణ్యం, బాలకోటిరెడ్డి, ఆర్ పిచ్చయ్య, అంజయ్య, పెద్దిరాజు, వీరయ్య, ఆదిరాములు, నాసరయ్య, హనుమంతు తదితరులు ఉన్నారు. తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకి చేరుతున్న సంపద యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
కారు – ఐషర్ లారీ ఢీ
● ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు త్రిపురాంతకం: కారు – ఐషర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి సమీపంలో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడుకు చెందిన పోతుల బాలరంగయ్య, శ్రీను, చెన్నయ్య, సుబ్బయ్య కారులో పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొపకొప్పలలోని అమ్మవారి గుడికి వెళ్లి తిరిగి అమానిగుడిపాడు వస్తున్నారు. ఆ సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న ఐషర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోతుల బాలరంగయ్య మృతిచెందగా, మిగిలిన ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ శివరామయ్య తెలిపారు. ● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చేసిన ఫిర్యాదుల విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసంలో ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరిధిలో సమస్యలను పరిష్కరిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వృద్దులు, నడవలేనిస్థితిలో ఉన్న వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు సమర్పించాలన్నారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ వీవీ రమణకుమార్, వన్టౌన్ సీఐ నాగరాజు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, కొండపి సీఐ సోమశేఖర్, ఎస్సై జనార్దన్రావు, ప్యానల్ అడ్వకేట్ బాలాజీసింగ్ పాల్గొన్నారు. -
ఎస్సీ సెల్ సమావేశానికి తరలిరావాలి
మార్కాపురం: కాకినాడలో ఈనెల 11న నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశానికి పార్టీ శ్రేణులు తరలిరావాలని ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మురారి వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో కోరారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు టీజేఆర్ సుధాకర్బాబు ఆధ్వర్యంలో కాకినాడలో ఎస్సీ సెల్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, నియోజకవర్గాల నాయకులు హాజరుకావాలని కోరారు.కేసులను మిస్సింగ్ చేయొద్దు ఒంగోలు టౌన్: మిస్సింగ్ కేసులను అలక్ష్యం చేస్తే సహించేది లేదని, వీలైనంత త్వరగా విచారణ మొదలు పెట్టి ట్రేస్ చేయాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్ నుంచి ఉమ్మడి జిల్లా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా తప్పిపోయారని, కనిపించడం లేదని ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని చెప్పారు. తప్పిపోయిన వ్యక్తి ఫొటోలను అన్నీ పోలీసు స్టేషన్లకు పంపించి మెరుపు వేగంతో ట్రేస్ చేయడానికి ప్రయత్నించాలని చెప్పారు. మిస్సింగ్ కేసులను విభజించాలని, మతిస్థిమితంలేనివారు, చిన్నారులు, వృద్ధులు, బాలికలు, యువతులు, మహిళలు, పురుషులు తదితర కేటగిరీలుగా విభజించి విచారణ ప్రారంభించాలన్నారు. అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, అన్నీ కోణాల్లోనూ కేసును అధ్యయనం చేయాలని చెప్పారు. మిస్సింగ్ కేసుల్లో ఎంత త్వరగా స్పందించామన్నదే ముఖ్యమని, అప్పుడే కేసును ట్రేస్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఆలస్యమయ్యే కొద్దీ నష్టం జరిగే అవకాశం ఉంటుందన్నారు. అలాగే నాన్ బెయిలబుల్ వారంట్లు పెండింగ్ లేకుండా చూసుకోవాలని, సంబంధిత వ్యక్తులకు సకాలంలో సమన్స్ అందజేయాలని, మహిళలకు సంబంధించిన కేసుల్లో త్వరగా స్పందించాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, యాక్సిడెంట్ అయిన వెంటనే అధికారులు, సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించాలని సూచించారు. సమావేశంలో డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
పారా మెడికల్ ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించాలి
22ఏ భూ సమస్యలపై అధికారులు దృష్టి పెట్టండిపంచాయతీ కార్మికులకు రూ.21 వేలు ఇవ్వాలి ఒంగోలు టౌన్: వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న పారా మెడికల్ ఉద్యోగుల వేతన వ్యత్యాస బకాయిలను వెంటనే చెల్లించాలని యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డీఎంహెచ్ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన హాలులో డీఎంహెచ్ఓను కలిశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగులకు పే, డీఏ, హెచ్ఆర్ఏ వేతనాలు చెల్లించడానికి ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఇందుకుగాను రూ.21.51 కోట్లు కూడా విడుదల చేసిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం 2003 సెప్టంబర్ 14 నుంచి 2024 ఏప్రిల్లో రెగ్యులర్ అయిన హెల్త్ అసిస్టెంట్లు, ఫార్మాసిస్ట్లు, ల్యాబ్ టెక్నీషియన్లకు కూడా వర్తిస్తుందని వివరించారు. జిల్లాలో సుమారు 100కి పైగా వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారని, ఒక్కొక్కరికి సుమారు రూ.76 వేల వ్యత్యాస వేతన బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు పీహెచ్సీల నుంచి ఎరియర్ బిల్లులను ట్రెజరీలకు పంపించలేదని, దీనివలన ఆర్ధిక సంవత్సరం ముగిసి నిధులు వృథా అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లా ట్రెజరీ అధికారులు జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె.శ్రీధర్ బాబు, వై.సురేష్, కాలం సుబ్బారావు, సీహెచ్ పుల్లయ్య, మాచిరాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: పంచాయతీ కార్మికులు, ఎన్ఎంఆర్లు, గ్రీన్ అంబాసిడర్లకు మున్సిపల్ కార్మికుల మాదిరిగా నెలకు రూ.21 వేల జీతం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ పంచాయతీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమం సంఘ గౌరవాధ్యక్షుడు ఎం.రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల గ్రామ పంచాయతీ కార్మికులు, 20 వేల గ్రీన్ అంబాసిడర్లు, 700 మంది ఎన్ఎంఆర్లు దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత పనులు నిర్వహిస్తున్నారు. ఏడేళ్లుగా జీతాలు పెంచలేదని తెలిపారు. ప్రస్తుతం రూ.6 వేల నుంచి రూ.12 వేల లోపు మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారని, కొన్ని చోట్ల మహిళా కార్మికులకు పురుషులతో సమానంగా వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర కొర జీతాలు కూడా నెల నెలా చెల్లించకపోవడంతో 4 నుంచి 24 నెలల వరకు బకాయిలు పేరుకుపోయాయని, గ్రీన్ అంబాసిడర్లకు కొన్ని చోట్ల మూడేళ్లుగా జీతాలు ఇవ్వకుండా పని చేయిస్తున్నారని పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు పెరగడం, పెట్రోల్, గ్యాస్, కరెంట్ చార్జీల భారంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులకు రూ.21 వేల జీతం అమలు చేయడం, బకాయిలు చెల్లించడం, హైకోర్టు తీర్పులు అమలు చేయడం, గుర్తింపు కార్డులు, కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడం, చట్టబద్ధ సెలవులు కల్పించడం, ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచడం వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎన్ రత్న కుమార్, మేకల మగ్గారావు, ఇండ్ల వినాయకమ్మ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలో 22ఏ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఉమ్మడి జిల్లా డీఆర్వో ఓబులేసు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా 22ఏ భూసమస్యలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ సమస్యలపై వచ్చే అర్జీలను పాత పద్ధతిన తహశీల్దార్ నుంచి ఆర్డీవోకు మళ్లీ ఆర్డీవో నుంచి కలెక్టర్కు పంపిస్తే తగు చర్యలు తీసుకుంటారన్నారు. దీనిపై ఇంకా స్పష్టమైన జీవో రానందున సమస్యలు పరిష్కారం కావడం లేదని వివరించారు. దాదాపు 476 ఫైల్స్ పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారిని పిలిపించి వాటిని పరిశీలించి తగిన నివేదిక పంపాలని ఆదేశించారు. కారణం లేకుండా 22ఏలో చేర్చిన భూములపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా భూ వివాదాలను పరిష్కరించాలన్నారు. మిగిలిన సమస్యలపై కూడా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సమస్యలపై 86, ఇతర సమస్యలపై 51 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు ప్రభాకర్, శివరామిరెడ్డి, డీఎంహెచ్వో వాణీశ్రీ, మైక్రో ఇరిగేషన్ పీడీ జెన్నమ్మ, జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయాధికారి బాలాజీ నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026
వరిసాగుకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. అదే సమయంలో తూర్పు ప్రాంతంలో విస్తీర్ణం పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19,144 హెక్టార్లు లక్ష్యం కాగా 24,647 హెక్టార్లలో సాగైంది. పశ్చిమాన సాధారణ విస్తీర్ణం కంటే సుమారు 600 హెక్టార్లు తక్కువగా సాగైంది. ఫలితంగా మార్కాపురం జిల్లాలో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండగా ప్రకాశం జిల్లాలో ధాన్యం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. మార్కాపురం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 41,467 మంది వరిసాగు చేస్తున్నారు. ఖరీఫ్లో 12,826 హెక్టార్లలో వరిసాగు లక్ష్యం కాగా 16,704 హెక్టార్లలో, రబీలో 19,144 హెక్టార్లు లక్ష్యం కాగా 24,647 హెక్టార్లలో వరిసాగు జరిగింది. మార్కాపురం జిల్లాలో 4219 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 3623 హెక్టార్లలో సాగైంది. సాగు తగ్గడంతో మార్కాపురం జిల్లాలో బియ్యం ధరలు క్వింటాకు రూ.400 పెరిగింది. ప్రకాశం జిల్లాలో మాత్రం ధాన్యం ధరలు క్వింటాకు రూ.200 తగ్గాయి. ఎటుచూసినా అన్నదాత నష్టపోతున్నాడు. దళారులు, వ్యాపారులు పశ్చిమాన బియ్యం ధరలు అమాంతం పెంచేసి జనాన్ని దోచేస్తున్నారు. తూర్పున ధాన్యం ధరలు తగ్గించేసి రైతులు నిండా ముంచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టి రైతాంగాన్ని ఆదుకుంటున్నామని ప్రభుత్వ పెద్దలు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నా..క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులపై రైతులు మండిపడుతున్నారు. ధాన్యం ధరల పతనం ఇలా.. ప్రకాశం జిల్లాలో ధాన్యం ధరలు రోజు రోజుకూ దిగజారుతున్నాయి. నిన్నటి వరకు బీపీటీ రకం రూ.1,670 లు ఉండగా ప్రస్తుతం రూ.1,600 లకు దిగువన ధర పలుకుతోంది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న దళారులు ధాన్యం కోతలు జరగనంతసేపు మంచి రేటు ఇస్తానని నమ్మబలికి తీరా ధాన్యం కోతలు జరిగిన తరువాత మాట మార్చేశారు. 76 కేజీల ధాన్యం బస్తాధర రూ.1,500లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 76 కేజీల ధాన్యం ధర రూ.2,400 నుంచి రూ.2,600 వరకు ధర పలికింది. నేడు పరిస్థితి విరుద్దంగా ఉంది. నిన్నటి వరకు కేఎన్ఎం రకం 76 కేజీలు ధాన్యం బస్తా పాతవి రూ.1,800 లు ఉండగా నేడు రూ.1,700లు, బీపీటీ రకం కొత్తవి రూ.1,600లు ఉండగా నేడు రూ.1,500 లు మాత్రమే ధర పలుకుతోంది. పెరిగిన బియ్యం ధరలు మార్కాపురం జిల్లాలో వరిసాగు తగ్గటంతో ధాన్యానికి డిమాండ్ ఏర్పడింది. పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పలువురు వ్యాపారులు లారీల్లో బియ్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నారు. కొరతను ఆసరా చేసుకుని వ్యాపారులు బస్తాకు రూ.100 నుంచి రూ.200 పెంచి విక్రయిస్తున్నారు. గత నెలాఖరులో బీపీటీ రకం రూ.6 వేలు ఉండగా పదిరోజుల వ్యవధిలోనే బస్తా ధర రూ.200 పెరిగింది. గత 15 రోజుల నుంచి మరో రూ.100 పెంచి విక్రయిస్తున్నారు. మార్కాపురం పట్టణంలో సుమారు 25 మందికిపైగా బియ్యం హోల్సేల్ వ్యాపారులు ఉన్నారు. వీరు కర్నూల్ సోనా, బీిపీటీ, నెంబర్లు తదితర రకాల బియ్యాన్ని అమ్ముతుండటంతోపాటు స్థానికంగా బియ్యాన్ని సేకరించి ఏదో బ్రాండ్ నేమ్ బస్తాలపై వేసి సూపర్ క్వాలిటీ అంటూ పాతిక కిలోల టిక్కీ రూ.1400 నుంచి రూ.1600కు విక్రయిస్తున్నారు. అంటే బస్తాకు రూ.5600 నుంచి రూ.6400 వరకూ విక్రయిస్తున్నారు. కొంటే మంట..అమ్మితే చింత..!బియ్యం ధరలు పెరిగాయి గత నెల కంటే ఈనెలలో బియ్యం ధరలు పెరిగాయి. టిక్కీ (25 కిలోలు) 1350 నుంచి 1500 కు పెరిగింది. రాబోయే నాలుగైదు నెలల వరకూ కొత్త బియ్యం వచ్చే పరిస్థితి లేదు. దీంతో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో బియ్యం కొనిపెట్టుకుంటే మేలన్న అభిప్రాయం ఏర్పడింది. ధరలు పెరగకుండా అధికారులు చూడాలి. – సీఎం ఖాసీం, 17వ బ్లాకు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మార్కాపురం ఈ మండలాల్లో వరిసాగు నిల్... మార్కాపురం జిల్లాలోని పెద్దారవీడు, తర్లుపాడు, దోర్నాల, అర్ధవీడు, యర్రగొండపాలెం, గిద్దలూరు మండలాల్లో వరిసాగు పూర్తిగా మర్చిపోయారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు బియ్యాన్ని ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మరికొన్ని మండలాల్లో నామమాత్రంగా వరిసాగు చేపట్టారు. వర్షాలు లేకపోవడంతో రైతులు వరిపంట సాగు చేపట్టలేదు. -
గ్రీవెన్స్కు పోటెత్తిన అర్జీదారులు
ఒంగోలు సబర్బన్: స్థానిక ప్రకాశం భవన్లోని గ్రీవెన్స్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమంలో మొత్తం 277 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ పి.రాజా బాబు నిర్వహించిన కార్యక్రమంలో అర్జీదారులు పోటెత్తారు. ఈ సందర్భంగా మీకోసం అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత కీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సకాలంలో పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. పరిష్కరించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో వివరించాలన్నారు. కమ్యూనిటీ హాలును కబ్జా చెర నుంచి విడిపించాలి: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్లోని చెరువుకొమ్ముపాలెం ఎస్సీ కాలనీలో కబ్జాకు గురైన డాక్టర్ బాబూ జగజ్జీవన రామ్ కమ్యూనిటీ హాలును కబ్జా చెర నుంచి విడిపించాలని తాటిపర్తి రాగయ్యతో స్థానికులు కలెక్టర్ పి.రాజా బాబుకు ఫిర్యాదు చేశారు. చెరువుకొమ్ముపాలెలో 20 ఏళ్ల క్రితం ఊరిలోని సమస్యలను ప్రజలందరూ కూర్చొని మాట్లాడుకోవటానికి, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనేది చర్చించుకోవటానికి, లైబ్రరీగా కూడా ఉపయోగించుకోవటానికి డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ కమ్యూనిటీ హాల్ను ప్రభుత్వ నిధులతో నిర్మించారు. ప్రస్తుతం కమ్యూనిటీ భవనాన్ని గ్రామానికి చెందిన అధికార టీడీపీకి చెందిన జడా సుధాకర్ స్వలాభం కోసం వాడుకుంటూ ఆ భవనాన్ని కబ్జా చేశాడు. ఆ భవనంలో వారికి సంబంధించిన వస్తువులన్నింటినీ వారి అవసరాల కోసం తమ స్వంత ఇంటిలా ఉపయోగించుకొంటున్నాడు. ఆ భవనానికి తాళం వేసి తమ వద్దనే ఉంచుకొంటున్నాడు. ఈ విషయాన్ని పలుమార్లు గతంలో వీఆర్ఓకు, సచివాలయ సిబ్బందికి, కలెక్టర్ గ్రీవెన్స్లో కూడా అర్జీ ఇచ్చామన్నారు. మున్సిపల్ కమిషనర్కు అనేక సార్టు అర్జీ ఇచ్చామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కమ్యూనిటీ హాలును ఖాళీ చేయమని చెప్పటానికి వచ్చిన అధికారులను తన రాజకీయ బలంతో బెదిరింపులకు గురి చేస్తున్నాడన్నారు. ప్రజా అవసరాల కోసం ఉపయోగపడాల్సిన సదరు కమ్యూనిటీ హాలును స్వాధీనం చేసి గ్రామ కమిటీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులను బెదిరిస్తున్న జడ సుధాకర్పై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ డి. హిమవంశీ, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మాధురి, కళావతి, డీపీఓ వెంకటేశ్వరరావులతో కలసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్మిక నగర్ పేదలకు న్యాయం చేయాలి ఒంగోలు టౌన్: నగరంలోని కార్మిక నగర్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదల గుడిసెలు కూల్చివేయడం దారుణమని, పేదలు నివసిస్తున్న భూమిని సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని సీపీఎం నాయకులు కలెక్టర్ పి.రాజాబాబుకు కోరారు. సోమవారం స్పందనలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్వే నంబర్ 186లో నివసిస్తున్న పేదలకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో పెరిగిపోయిన అద్దెలను చెల్లించే స్థోమత లేని 70 కుటుంబాలు 15 ఏళ్ల క్రితం కార్మిక నగర్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని తెలిపారు. అక్కడ నివసిస్తున్న వారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీ కొందరు ప్రైవేటు వ్యక్తులు మూడు జేసీబీలు, 150 మంది వ్యక్తులతో కలిసి కార్మిక నగర్లోకి చొరబడి గుడిసెలను కూల్చివేశారని చెప్పారు. ఇంట్లో సామాన్లు తీసుకునేందుకు కూడా అనుమతించకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని, భౌతిక దాడులు చేశారని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు విధ్వంసం సృష్టించినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. దాంతో రెచ్చిపోయిన ప్రైవేటు వ్యక్తులు ఈ నెల 4వ తేదీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆక్రమించుకున్నారని, బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలు అక్కడే డేరాలు వేసుకొని నివసిస్తున్నారని, అధికారులు భూమి సర్వే చేసి బాధితులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. సీపీఎం నాయకులు జి.రమేష్, తంబి శ్రీనివాసరావు, సయ్యద్హుసేన్, దామా శ్రీనివాసరావు కలెక్టర్ను కలిసిన వారిలో వున్నారు. -
వేదపాఠశాలను సందర్శించిన విజయేంద్ర సరస్వతి
పొదిలి రూరల్: పొదిలి మండలంలోని ఓబులక్కపల్లి గ్రామంలో ఉన్న శంకర విద్యాలయాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి సోమవారం సందర్శించారు. ముందుగా దర్శి నుంచి పొదిలికి వచ్చిన స్వామికి స్థానికులు పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి దేవాలయం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ఓబులక్కపల్లి వేదపాఠశాలను సందర్శించారు. కొంతమంది భక్తులు స్వామి వారికి తమ ప్రాంతంలో ఎక్కువగా కిడ్నీ బాధితులు ఉన్నారని, ఫ్లోరైడ్ ప్రాంతం కావడంతో అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్వామి వారు ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. కిడ్నీ బాధితుల కోసం మంచి ఆస్పత్రి ఏర్పాటు చేయాలని విన్నవించారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మద్దిపాడు: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఘటనా స్థలంలోనే ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాతీయ రహదారిపై మద్దిపాడు ఫ్లై ఓవర్ వద్ద చోటుచేసుకుంది. మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన కొణిజేటి శివప్రసాద్ (38) ఒంగోలులో కిరాణాషాపు నిర్వహిస్తుంటాడు. శనివారం రాత్రి షాపు మూసివేసి తిరిగి వెల్లంపల్లికి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్తున్నాడు. మద్దిపాడు ఫ్లై ఓవర్పై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మహిళల భద్రతకు ప్రాధాన్యం
ఒంగోలు సబర్బన్: మహిళల భద్రతకు, వారి ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి స్వామి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఒంగోలు నగరంలోని బృందావనం కల్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ పథకాల కింద మెప్మా మహిళలకు రూ.18.60 కోట్లు, డీఆర్డీఏ మహిళలకు రూ.314.61 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.67.28 కోట్ల విలువైన బ్యాంకు చెక్కులను ఆర్థిక రుణాలుగా అందించారు. ఆ ప్రాంగణంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును కలెక్టర్ పి.రాజాబాబు ప్రారంభించి అర్హులైన బాలికకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించారు. మెప్మా, ఐసీడీఎస్, పోలీస్, డీఆర్డీఏ, ఏపీఎంఐపీ, బ్యాంకింగ్, పరిశ్రమలు, ఏపీఎస్ ఆర్టీసీ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి, కలెక్టర్తో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇతర అతిథులు వీక్షించారు. రాయితీ ద్వారా మంజూరైన ఒక ట్రాక్టర్, మూడు ఆటోలను లబ్ధిదారులకు అందించారు. ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, డీఆర్వో చిన ఓబులేసు, డీఆర్డీఏ పీడీ నారాయణ, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఎస్డీసీ కళావతి, ఎల్డీఎం రమేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఐసీడీఎస్ పీడీ నాగమణి, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
8 సమస్యాత్మక కేంద్రాలు...
పది పరీక్షలు నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 165 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 8 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సీసీ కెమెరాలను అమర్చారు. పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్లు జరగకుండా ఉండేందుకు 9 ఫ్లయింగ్, 10 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షల నిర్వహణకు 1718 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అలాగే చీఫ్ సూపరింటెండెంట్లు 165 మంది, డిపార్ట్మెంట్ అధికారులు 165 మందిని నియమించారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం సెట్–1, 11వ తేదీ సాయంత్రం సెట్–2 ప్రశ్నపత్రాలు జిల్లాకు వస్తాయని అధికారులు తెలిపారు. 12వ తేదీ ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా 38 స్టోరేజ్ పాయింట్లలో రెండు సెట్ల ప్రశ్నపత్రాలను భద్రపరచనున్నారు. -
వైఎస్ జగన్తోనే మహిళల సంక్షేమం
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో మహిళల సంక్షేమం అనేది కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ స్పష్టం చేశారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ అధ్యక్షత వహించగా, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళల సాధికారతకు సమిష్టి కృషి అవసరమన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని తెలిపారు. మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా కుటుంబాలు, సమాజం మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. మహిళల హక్కులు, గౌరవం కాపాడటంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు అవకాశాలతోనే సమాజం అభివృద్ధి : బూచేపల్లి శివప్రసాద్రెడ్డి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా సమాజం అభివృద్ధి సాధిస్తుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున మాట్లాడుతూ మహిళల సాధికారతకు రాజకీయ, సామాజిక రంగాల్లో మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న విశేషంగా కృషి చేశారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజలు ప్రశ్నించాలన్నారు. ముందు పార్టీ కార్యాలయంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, చుండూరి రవిబాబు గజమాలతో ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పీడీసీసీబీ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు సీఎం వెంకటేశ్వరరెడ్డి, ఒంగోలు జెడ్పీటీసీ చుండూరి కోమలేశ్వరి, అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలు కనపర్తి గోవిందమ్మ, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, కొండపి జెడ్పీటీసీ మారెడ్డి అరుణకుమారి, మర్రిపూడి జెడ్పీటీసీ మాకినేని సుధారాణి, జిల్లా ఉపాధ్యక్షురాలు పోలు వరలక్ష్మి, నాగులుప్పలపాడు ఎంపీపీ నలమలపు అంజమ్మ, టంగుటూరు జెడ్పీటీసీ మన్నం అరుణకుమారి, కనిగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ పులి శాంతి, కౌన్సిలర్ తమ్మినేని సుజాత, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీత, కోఆప్షన్ మెంబర్ షేక్ రషీదా, కౌన్సిలర్ వెన్నపూస కుమారి, మహిళా నాయకులు పేరం ప్రసన్న, వడ్లమూడి వాణి, బడుగు ఇందిర, మేరికుమారి, సయ్యద్ అప్సర్, బత్తుల ప్రమీల, బడుగు శోభలత, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రెండుమూడు నెలల్లోనే పూర్తి చేస్తాం
● యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన కలెక్టర్ మేదరమెట్ల: కొరిశపాడు మండలంలో నిర్మాణంలో ఉన్న యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పనులను రెండుమూడు నెలల్లోనే పూర్తి చేసి రైతులకు నీరందిస్తామని కలెక్టర్ పీ రాజాబాబు తెలిపారు. పథకానికి సంబంధించిన రిజర్వాయర్ను అధికారులతో కలిసి కొరిశపాడులో ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకం చాలా వరకు పూర్తయిందని, కొద్దిమేర పనులే మిగిలి ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా మూడు నెలల్లోపే పూర్తి చేసి పథకాన్ని వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తి చేసేందుకు, ముంపునకు గురైన గ్రామానికి నష్టపరిహారాన్ని అందజేసేందుకు రూ.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. కలెక్టర్ వెంట ప్రాజెక్టు ఎస్ఈ అబూత్అలీం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతి, త హసీల్దార్, ఎంపీడీవో, అధికారులు పాల్గొన్నారు. -
రెండు బైకులు ఢీకొని.. ఒకరు దుర్మరణం
మర్రిపూడి: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని చిలంకూరు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిలంకూరు గ్రామానికి చెందిన డాలు ఏడుకొండలు తన చిన్నాన్న డాలు నరసయ్య(62)లు కలిసి ద్విచక్ర వాహనంపై బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో మరో ద్విచక్ర వాహనంపై ఎదురుగా గురునాథం, యోహోషువాలు వస్తున్నారు. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో నలుగురూ చెల్లాచెదరుగా పడిపోయారు. పచ్చాకు మేసీ్త్రగా పనిచేసే నరసయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఏడుకొండలు, యెహోషువాలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు 108 వాహనానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రమేష్బాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తీవ్రగాయాలైన ఏడుకొండలు, యెహోషువాలను వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం కోసం నరసయ్య మృతదేహాన్ని కొండపి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. -
యువకుడిని కాపాడిన పోలీసులు
కంభం: ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా సకాలంలో స్పందించిన పోలీసులు అతడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన శనివారం రాత్రి స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. వివరాలు.. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన ఎల్.గౌతం మూడు నెలలుగా కంభంలో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో తాను చనిపోతున్నానని తన స్నేహితుడికి ‘ఐ మిస్ యూ’ అని మెసేజ్ పంపించాడు. అనుమానం వచ్చిన స్నేహితుడు 112 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఎస్సై శివకృష్ణారెడ్డి ఐటీ కోర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైల్వేస్టేషన్ సమీపంలో గౌతం ఉన్నట్లు గుర్తించి అతడి ప్రాణాలు కాపాడారు. కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి అతడి ప్రాణాలు కాపాడినందుకు పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో మంచి పనితీరు కనబరిచిన ఎస్సై, కంట్రోల్ రూమ్, ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. గౌతం లండన్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. తనతో పాటు చదువుకున్న ఓ అమ్మాయిని ప్రేమించగా ఆ అమ్మాయి వివాహం మరొకరితో జరగడం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. -
ఓట్ల తొలగింపునకు కుట్ర
కురిచేడు: గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లు ఎలాగైనా తొలగించాలని కుయుక్తులు పన్నుతున్నారు. విచారణ పేరుతో ఓటర్ల నుంచి తాము గ్రామంలో లేమని చెప్పించే యత్నాలు చేస్తున్నారు. ఓటర్లు తమకు స్వగ్రామంలో ఓట్లు ఉండాలని, కేవలం బతుకుదెరువు కోసమే వలసలు వెళ్తున్నామని చెబుతున్నా వినకుండా వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రస్తుతం ఉంటున్న చోట్లకు వెళ్లి ఓట్లు తొలగించినట్లు రసీదులు తేవాలని టీడీపీ నాయకుల ఎదుట ఓటర్లకు హుకుం జారీ చేస్తున్నారు. మండలంలోని నమశ్శివాయపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది ఓట్లు తొలగించాలని, వారంతా గ్రామంలో లేరని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మి, వీఆర్వో హనుమంతురావు, బీఎల్వోలు శేషగిరిరావు, కృష్ణతో కలిసి పంచాయతీ కార్యాలయంలో శనివారం విచారణ చేపట్టారు. విచారణలో ఓటర్లు తాము బతుకుదెరువు కోసం వెళ్లామని, ఇళ్లు, పొలాలు ఇక్కడే ఉన్నాయని, ఓటు ఇక్కడే కావాలని కోరుతున్నా వారి మాటలు పెడచెవిన పెట్టి.. మీరు ప్రతి నెలా ఇక్కడే రేషన్ తీసుకుంటున్నారా? విద్యుత్ బిల్లులు ఇక్కడే కడుతున్నారా? ప్రతి రోజు ఇక్కడే ఉంటున్నారా? అంటూ ప్రశ్నలు వేసి వారితో చివరకు తమకు ఇక్కడ ఓటు వద్దు అని చెప్పించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన వారు అక్కడే రేషన్ తీసుకోవచ్చని అవకాశంశ ఇచ్చింది. ఓట్లు రెండు చోట్ల నమోదైతే దానిని ఫారం–7 ద్వారా వారికి ఇష్టం వచ్చిన చోట ఓటు ఉంచేకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఇచ్చింది. కానీ విచారణ అధికారులు అందుకు భిన్నంగా ప్రస్తుతం ఉంటున్న చోటుకు వెళ్లి ఓటు రద్దు చేయించుకున్నట్లు రశీదు తీసుకురావాలని, గ్రామంలోనే రేషన్ తీసుకోవాలని అధికారులు చెప్పడం అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గారని స్పష్టంగా అర్థమవుతోంది. అంతే కాకుండా తాము ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా రోజూ తమ స్వగ్రామంలోని ఇంటికి వెళ్లి వస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా నిర్ధారించారు. ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే ఉండి ప్రజలకు సేవ చేయాల్సి ఉందన్న నిబంధనను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కలెక్టర్, ఎన్నికల కమిషన్ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తే గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొనే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఉన్నతాధికారులు ఆలోచించి ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఓట్ల తొలగింపు కార్యక్రమం నిబంధనల ప్రకారం, పారదర్శకంగా జరగాలని, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపే లక్ష్యం అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు గ్రామాల్లో టీడీపీ నాయకుల సమక్షంలో ఓటర్ల విచారణ -
కూటమి నేతల అజెండా
అబద్ధాలు, మోసాలే కురిచేడు: చంద్రబాబు పాలన అబద్ధాలు, మోసాలే అజెండాగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసన సభ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి దుయ్యబట్టారు. మండలంలోని బోధనంపాడులో వేంచేసి ఉన్న శ్రీవీరాంజనేయస్వామి తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం రాత్రి ఆయన స్వామి వారిని దర్శించుకుని అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి ప్రసంగించారు. ఎమ్మెల్యే బూచేపల్లి మాట్లాడుతూ ఎండలు మండుతున్న నేపథ్యంలో గ్రామాలు తాగునీరు లేక గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, ఓట్ల తొలగింపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న పనులకు ఆటంకాలు కలిగించటం, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని, జగనన్న పాలనలో మంజూరై పూర్తయిన ఇళ్లను తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం అంగన్వాడీలు జీతాలు పెంచమంటే వారిని నిర్ధాక్షిణంగా పోలీసులతో కొట్టించి స్టేషన్లకు తరలించటం మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్న గౌరవం ఏ పాటిదో అర్థమవుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేశారని మండిపడ్డారు. పింఛన్లు రద్దు చేసి ఎందరో వృద్ధులను అనాథలను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపులో కుట్ర రాబోవు ఎన్నికల్లో గెలవలేమని గ్రహించిన తెలుగుదేశం నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ఓట్లను అన్యాయంగా తొలగించేందుకు కుట్రపన్నుతున్నారని బూచేపల్లి మండిపడ్డారు. ఇసుక, మట్టి అమ్ముకోవడమే కాకుండా కమీషన్ల పర్వం కొనసాగిస్తున్న వారు ప్రజల యోగక్షేమాలు ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చుకుని జనరంజక పరిపాలన కొనసాగించుకుందామని పిలుపునిచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు వైవీ సుబ్బయ్య, ఉపాధ్యక్షుడు పోతిరెడ్డి నాగిరెడ్డి, గ్రామ నాయకులు వేమా వెంకటేశ్వర్లు, పవన్కుమార్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండేళ్లలో ఒక్క ఇల్లూ నిర్మించలేదు జగనన్నదే జనరంజక పాలన ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి -
శింగరకొండలో వైవీ ప్రత్యేక పూజలు
అద్దంకి: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం రాజ్యసభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణమ్మ, సోదరులు ఏఎంసీ మాజీ చైర్మన్ వైవీ భద్రారెడ్డి, హనుమారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాన్ని బహూకరించి పూలమాలతో సత్కరించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
బల్లికురవ: గుర్తు తెలియని వాహనం ఢీకొని బైకు నుంచి కిందపడి ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి మేదరమెట్ల–నార్కేట్పల్లి నామ్ రహదారి మండలంలోని కొప్పరపాడు సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద జరిగింది. అందిన సమాచారం ప్రకారం..కొప్పరపాడు గ్రామానికి చెందిన పందిరి ఇజ్రాయేల్ (27) బైకుపై అత్తగారి ఊరైన వైదన పంచాయతీ చవిటి మాదిగపల్లెకు వెళ్తున్నాడు. ప్రమాదంలో బైకు నుంచి కిందపడి చెవుల నుంచి రక్తం రావడంతో వైద్యం అందేలోపు చనిపోయాడు. మృతుని తండ్రి అంకారావు ఫిర్యాదు మేరకు శనివారం ఎస్సై వై.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
కోడిపందేల శిబిరంపై దాడి
పొన్నలూరు: మండలంలోని మాలపాడు శివారు అటవీ ప్రాంతంలో కోడిపందేల శిబిరంపై శనివారం పోలీసులు దాడి చేసి 23 మందిని అరెస్టు చేశారు. ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో కొండపి సీఐ సోమశేఖర్, మర్రిపూడి, కొండపి ఎస్సైలు రమేష్, ప్రేమ్కుమార్లు తమ సిబ్బందితో కలిసి శిబిరంపై దాడి చేశారు. పట్టుబడిన వారి నుంచి రూ.42,860 నగదుతో పాటు మూడు కోళ్లు, 18 బైకులు, 23 సెల్ఫోన్లు స్వాధినం చేసుకుని పొన్నలూరు పోలీసుస్టేషన్కు తరలించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. -
ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026
ఒంగోలు టౌన్: విధి ఆమెను చిన్నచూపు చూసినా నిరాశ చెందలేదు. సమస్యలు చుట్టుముట్టినా వెన్ను చూపలేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. విజయాన్ని తన సొంతం చేసుకుంది. ఆమె పేరు బత్తల హిమబిందు. ఒంగోలులోని గోపాల్నగర్. 2017లో కృష్ణ సుమంత్తో వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆ దంపతులకు ఇద్దరు సంతానం. భార్యభర్తలిద్దరూ ఉన్నత విద్యావంతులు కావడంతో ఒకరికొకరు తోడునీడగా ఉన్నారు. సంతోషంగా సాగుతున్న జీవితంలో కరోనా మహమ్మారి కాటు వేసింది. కరోనా బారిన పడి భర్త సుమంత్ మరణించారు. దాంతో ఒక్కసారిగా చీకటి ఆవరించింది. ఒంటరితనం చుట్టుముట్టింది. ఇంకేముందని ఆవేదనకు గురైతే కోలుకోవడం కష్టం. ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూడాలి. వారికి బంగారు భవిష్యత్తు చూపాలి. గుండెల్లోంచి తన్నుకొస్తున్న బాధను తమాయించుకుని బతుకు బరిలోకి దిగింది. ఇంటి నుంచి బయటకు అడుగు వేయకుండానే హాట్ ఎన్ క్రిప్సీ పేరుతో క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసింది. నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణంతో నాణ్యమైన ఫ్రైడ్ చికెన్, వెజ్ స్నాక్స్, అమెరికన్, కాంటినెంటల్, ఇటాలియన్ పిజ్జాలు తయారు చేసి స్విగ్గి, జొమాటో ఆర్డర్ల ద్వారా విక్రయించడం మొదలు పెట్టింది. ఆమె బతకడమే కాకుండా మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తోంది.ఆత్మస్థైర్యమే బలంగా..మొక్కవోని దీక్షతో తమ కలలను సాకారం చేసుకున్నారీ మహిళలు. వీరి సంకల్పానికి కుటుంబ సభ్యుల సహకారం తోడైంది. తాము అనుకున్నది సాధించి సగర్వంగా ముందుకు సాగుతున్నారు. రాళ్లు రప్పలున్న భూమినే ఎంచుకుని ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రకృతి వ్యవసాయం చేస్తూ ముందుకెళ్తున్నవారు ఒకరైతే.. గ్రామీణ ప్రాంతాల్లో దురాచారాలు, దేవదాసి వ్యవస్థలో జరిగే కొన్ని సంఘటనల నేపథ్యంలో సినిమా తీసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు మరొకరు. మాయదారి కరోనా భర్తను కబళించినా కుంగిపోకుండా స్వశక్తితో చిన్నపాటి ఫుడ్ బిజినెస్ ప్రారంభించి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇంకొకరు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మణిరత్నాలపై ప్రత్యేక కథనం... -
జిల్లా పోర్టు ఫోలియో జడ్జిని కలిసిన కలెక్టర్, ఎస్పీ
ఒంగోలు: జిల్లా న్యాయమూర్తుల సమావేశానికి శనివారం ఒంగోలు వచ్చిన జిల్లా పోర్టు ఫోలియో జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లును జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్రాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. వారితో పాటు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న తదితరులు పోర్టు ఫోలియో జడ్జిని కలిశారు. ఒంగోలు సబర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్పీ వి.హర్షవర్థన్రాజుతో కలిసి జిల్లాలోని పరిస్థితిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రెగ్యులర్ విద్యార్థులకు, ఈ నెల 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుధ్య నిర్వహణ వంటి మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు. సంబంధిత అధికారులు ఒక వారం ముందుగానే ఆయా కేంద్రాలను సందర్శించి సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, డీఈఓ సి.వి.రేణుక, ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు, ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీటీసీ సుశీల, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఏపీఎస్ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మహిళలంతా మహారాణులే..
చీమకుర్తి: ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ మహారాణుల్లా జీవిస్తున్నారని, ప్రతిభా నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం రావడం, విద్యాసంస్థలకు సెలవు దినం కావడంతో చీమకుర్తిలోని బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో శనివారం ముందస్తుగా మహిళా దినోత్సవం నిర్వహించారు. కాలేజీ అధ్యాపకులు, విద్యార్థినులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయ, సాంకేతిక, సామాజిక, వ్యాపార, ఇతర అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో మహిళలంతా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. తొలుత కాలేజీ విద్యార్థినులతో కలిసి కోలాటం ప్రదర్శించి ఆకట్టుకున్నారు. -
ఆత్మస్థైర్యంతో కల నెరవేర్చుకుని...
కొనకనమిట్ల: కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామానికి చెందిన చెన్నెబోయిన వెంకట నరసమ్మ, వెంకటేశ్వర్లు దంపతులది వ్యవసాయ కుటుంబం. నరసమ్మకు సినిమాలు అంటే ఇష్టం. ఎలాగైనా సినిమా తీయాలని అనుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే దురాచారాలు, దేవదాసి వ్యవస్థలో జరిగే కొన్ని సంఘటనలు ఆమెకు భాద కలిగించేవి. తన మనసులో మాటను భర్త వెంకటేశ్వర్లుకు తెలిపింది. ఛా ఊరుకో.. మనకు పొట్టకోస్తే అక్షరం ముక్కరాదు.. వేలిముద్రగాల్లం.. అసలు సినిమా తీయాలంటే కోట్లు కావాలి.. నువ్వేమైన కలలు కంటున్నావా అని అనేవాడు. దీంతో కుమారుడు వెంకటరవీంద్రనాథ్తో తన కోరికను తెలియజేసింది వెంకట నరసమ్మ. అతను కూడా పెద్ద ఆసక్తి చూపించలేదు. ఎలాగైనా సినిమా తీయాలన్న దృఢ నిశ్చయంతో తనకున్న కొద్దిపాటి పొలాన్ని, మేకలను, గేదెలను అమ్మగా వచ్చిన డబ్బుతో పాటు పెదారికట్లలో చిన్న హోటల్ పెట్టి కష్టపడి వచ్చిన ఆదాయం, కుమారుడి సహకారంతో సినిమా తీసింది. గ్రామీణ నేపథ్యంలో జరిగే కొన్ని సంఘటనలపై మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశామని ఆమె అంటోంది. తెలంగాణ దేవదాసి వ్యవస్థలానే కోస్తాంధ్రలో మాతంగులు ఉండేవారు. గ్రామాల్లో జరిగే జాతరలు, ఉత్సవాల్లో మాతంగులు నృత్యాలు చేసేవాళ్లు. మాతంగుల దుర్భర జీవితాలను, కష్టాలను కళ్లారా చూశాం. వారి పిల్లలు మాతంగుల వృత్తిలోకి రాకుండా ఉండాలని, చదువుకుని మంచిగా రాణించాలనే ఉద్దేశంతో ‘స్పిరిట్’ (ఈజ్ నాట్ వన్) సినిమా తీశామంటోంది. ఈ చిత్రంలో నటించేందుకు సినీనటులు చిత్రం శ్రీను, రవిబాబు, సత్య ప్రకాష్, చిట్టిబాబు, రమ్య, ప్రియాంక, పింకితో పాటు నటులు రాజశేఖర్, సైదులు, నాగతేజ ముందుకు వచ్చారు. సినిమాకు తన కుమారుడు వెంకటరవీంద్రనాథ్ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఎయిర్ వండర్ సినిమా పతాకంపై తను నిర్మించిన ‘స్పిరిట్’ (ఈజ్ నాట్ వన్) సినిమాను త్వరలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నామంటూ నిర్మాతగా మారిన వెంకట నరసమ్మ సంతోషం వ్యక్తం చేసింది. త్వరలో సినిమా విడుదలకు సన్నహాలు చేస్తున్నామని తెలిపింది. గతంలో గ్రామంలోని వాళ్లు, బంధువులు, స్నేహితులు మీరేంటి సినిమా తీసేది అంటూ కొంత హేళనగా మాట్లాడి ఎగతాళి చేశారు. ఇప్పుడు సినిమా పూర్తయిందని తెలుసుకుని ఆనాడు ఎగతాళి చేసిన వాళ్లే నేడు గౌరవంగా, ఆప్యాయంగా మాట్లాడుతున్నారని గర్వంగా చెబుతోంది. సినిమాలో తాను, తన చిన్న కుమారుడు కూడా నటించామని, సినిమా తీస్తున్న సమయంలో పాము కాటుకు గురై తన చిన్న కుమారుడు మృతి చెందటం కలచివేసిందని నరసమ్మ భర్త వెంకటేశ్వర్లు ఆవేదన చెందారు. ఆ విషాదం నుంచి కోలుకుని మళ్లీ సినిమా తీశామని తెలిపారు. హోటల్ నిర్వహిస్తున్న వెంకట నరసమ్మస్పిరిట్ (ఈజ్ నాట్ వన్) సినిమాను ఆదరిస్తాం... తమ గ్రామానికి చెందిన ఓ సాధారణ కుటుంబం సినిమా తీయడం సంతోషంగా ఉందని, ఆ సినిమాను ఆదరిస్తామని పెదారికట్ల గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంత వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇటీవల నిర్మాతలైన వెంకట నరసమ్మ, వెంకటేశ్వర్లు, దర్శకుడు వెంకట రవీంద్రనాథ్ను కళావేదిక తరఫున సన్మానించారు. ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సినీనటులు శ్రీకాంత్, సుమన్, ఆలీ, బాబుమోహన్తో పాటు పలువురు దర్శకులు అభినందించారు. -
శనగ రైతులను ఆదుకోవాలి
ఒంగోలు సబర్బన్: రాష్ట్రంలో శనగ పంట పండిస్తున్న రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు శనివారం కలెక్టర్ పి.రాజాబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు తదితర నాయకులు కలెక్టర్ను కలిసి శనగ రైతుల కష్టాలు వివరించారు. రాష్ట్రంతో పాటు జిల్లాలో ప్రధాన పంట అయిన శనగ రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో తెలియజేశారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ భారతదేశంలో 2019–20 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం సుమారు 11 నుంచి 12 మిలియన్ టన్నుల శనగ ఉత్పత్తి అవుతుందన్నారు. ఇది ప్రపంచ ఉత్పత్తిలో 70 శాతం కంటే ఎక్కువని తెలిపారు. దేశంలో వినియోగ అవసరం సంవత్సరానికి 10 నుంచి 10.50 మిలియన్ టన్నులు కాగా, ప్రతి సంవత్సరం క్యారీ ఫార్వర్డ్ నిల్వలు సుమారు 1 నుంచి 2 మిలియన్ టన్నులు ఉంటున్నాయన్నారు. అయితే, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం 2024 మే నెల సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ (ఎస్డబ్ల్యూఎస్) మినహాయించిందని, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగలకు సుంకం, సెస్ రద్దు చేయడం వల్ల దిగుమతులు 2023–24లో 1.64 లక్షల టన్నుల నుంచి 2024–25లో 15.06 లక్షల టన్నులకు తీవ్రంగా పెరిగాయని తెలిపారు. దిగుమతి సుంకం ఎత్తేయడంతో తక్కువ ధరకు విదేశీ శనగలు మార్కెట్లో లభ్యమవుతున్నాయన్నారు. తద్వారా దేశీయంగా మన రైతులు పండించిన శనగల ధర కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బెంగాల్ గ్రామ్ రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారన్నారు. గత సంవత్సరం ఉత్పత్తిలో లక్షల టన్నులు ఇప్పటికీ శీతల గిడ్డంగులలో మూలుగుతున్నాయని తెలిపారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసినట్లు కలెక్టర్కు మేరుగు నాగార్జున వివరించారు. మిర్చి రైతుల కష్టాలు కూడా వర్ణణాతీతంగా ఉన్నాయని, శనగ, మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు. రెండేళ్ల నుంచి మద్దతు ధరలు లేక కోల్డ్ స్టోరేజీల్లో శనగలు : చుండూరి రవిబాబు వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన పంట శనగ అని, కానీ.. రెండేళ్ల నుంచి పండించిన శనగలకు మద్దతు ధరలు లేక కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్నాయని తెలిపారు. మరి ఈ సంవత్సరం కూడా శనగ పంట చేతికొచ్చే స్థితిలో విదేశాల నుంచి సుంకాలు లేకుండా దిగుమతవుతున్న శనగల వల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో శనగ రైతులు నష్టపోతుంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్వింటాకు రూ.1500 చొప్పున ఒక్కో రైతుకు 35 క్వింటాళ్లకు ఇచ్చి ఆదుకున్నారన్నారు. మిర్చి రైతు పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. ఇక పొగాకు రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందన్నారు. నేటికీ వేలం ప్రారంభం కాకపోవటంతో పొగాకు రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. సిగరెట్లపై సుంకం పెంచటంతో పొగాకును తక్కువ ధరకు కొనుగోలు చేయాలని కంపెనీలు చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగపై 2021 నుంచి 2023 సంవత్సరాల్లో ఉన్నట్లుగా వ్యవసాయ మౌలిక సదుపాయాల–అభివృద్ధి సెస్ (ఏఐడీసీ), సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ (ఎస్డబ్ల్యూఎస్) విధించాలని, లేదా ఏఐడీసీ, ఎస్డబ్ల్యూఎస్ పరిహారంగా ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్ ఉత్పత్తికి క్వింటాకు రూ.1000 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు భరోసా లేదన్నారు. అన్ని పంటల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
కాపుల అభ్యున్నతికి జగన్ కృషి
ఒంగోలు సిటీ: కాపు కులస్తుల అభ్యున్నతికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశేషంగా కృషి చేశారని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. ఒంగోలులోని ఆయన నివాసంలో శనివారం కాపు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వైవీ సుబ్బారెడ్డితో పాటు వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబును సన్మానించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ బలోపేతానికి కాపు నాయకులంతా సమష్టిగా, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాపుల అభివృద్ధి కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కాపునేస్తం పథకాన్ని ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, 38, 32, 34 డివిజన్ల అధ్యక్షులు పాలడుగు శ్రీనివాసరావు, పసుపులేటి నవీన్కుమార్, బండారు ప్రభాకరరావు, ఒంగోలు నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ మల్లిశెట్టి దేవా, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ అడుసుమల్లి ప్రసన్న, జిల్లా డిసిప్లినరీ కమిటీ మెంబర్ రాయిని వెంకట్రావు, 36వ డివిజన్ యూత్ నాయకుడు హరీష్ కుమార్, 25వ డివిజన్ యూత్ నాయకుడు బండారు రాఘవేంద్ర, యూత్ సిటీ జనరల్ సెక్రటరీ అమెజాన్ ప్రశాంత్, 25వ డివిజన్ నాయకులు మల్లికార్జునరావు, కోవూరు కృష్ణ, అయినాబత్తిని సాయిబాబు, పడే దుర్గా, 37వ డివిజన్ యూత్ జనరల్ సెక్రటరీ కొండాదాసు, కిరణ్ కుమార్, సాయి తేజ, 37వ డివిజన్ నాయకుడు తోట బాబీ, తదితరులు పాల్గొన్నారు. -
పది పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తాం
ఒంగోలు సిటీ: పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పాత జెడ్పీ సమావేశ మందిరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు/ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 165 కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, 14 కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సూచనలు, నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు వెల్లడించారు. పరీక్షల సమయంలో మాల్ ప్రాక్టీస్ను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం గంట ముందుగా హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్, అవసరమైన స్టేషనరీ తెచ్చుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడం నిషేధించబడినట్లు తెలిపారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందుగానే హాలులో విద్యార్థులను కూర్చోబెట్టాలని, హాల్ టికెట్లు సరిచూసి మాత్రమే పరీక్ష హాలులోకి అనుమతించాలని అధికారులు, సిబ్బందికి ఆర్జేడీ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా పరీక్షల పరిశీలకులు ఎన్.గీత, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక, ఒంగోలు, మార్కాపురం ఉప విద్యాశాఖాధికారులు ఏ చంద్రమౌలీశ్వర్, శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ ఎం.శ్రీనివాసరావు, ఒంగోలు మండల విద్యాశాఖాధికారి టి.కిషోర్బాబు, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
రేషన్.. టెన్షన్..!
మార్కాపురం: మార్చి నెల ప్రారంభమై ఆరు రోజులు దాటినా మార్కాపురం జిల్లాలో కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వం పనితీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల రేషన్ ఇస్తారో..ఇవ్వరోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కనీసం స్టేజీ 1 నుంచి గోడౌన్లకు, అక్కడి నుంచి డీలర్ల వద్దకు నేటికీ రేషన్ సరఫరా పూర్తి కాలేదు. మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ.. దానిపై ఎవరికీ స్పష్టత లేదు. దీంతో కూటమి ప్రభుత్వం, పాలకులు, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందంటూ విమర్శిస్తున్నారు. స్టేజీ 1లోనే బియ్యం పంపిణీ జరగడం లేదని అధికారులు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మడం లేదు. 1వ తేదీ నుంచి రోజూ రేషన్ షాపులకు ప్రజలు వెళ్తుండగా, ఇంకా బియ్యం రాలేదని డీలర్లు చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా 1వ తేదీనే ఇంటివద్దకు వెళ్లి రేషన్ సరుకులైన బియ్యం, చక్కెర, కందిపప్పు, గోధుమపిండి సరఫరా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేయడంతో మళ్లీ రేషన్ షాపుల వద్దకు సుదూరం వెళ్లి సరుకులు తీసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం బియ్యం సరఫరా చేయకుండా చేతులెత్తేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మార్కాపురం జిల్లాలో సుమారు 170 షాపులకు రేషన్ పంపిణీ జరగాల్సి ఉంది. ముఖ్యంగా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు ఇంకా రేషన్ చేరలేదు. దీంతో కార్డుదారులకు అందాల్సిన సరుకులు అందలేదు. స్టేజీ 1లో ప్రతి నెలా మచిలీపట్నం, గుండ్లాపల్లి తదితర ప్రాంతాల నుంచి లారీల ద్వారా ఎంఎల్ఓ పాయింట్లకు బియ్యం వస్తాయి. అక్కడి నుంచి రేషన్ షాపులకు లారీల ద్వారా సరఫరా చేస్తారు. ఈ ప్రక్రియ ప్రతి నెలా 20 నుంచి 25 తేదీల మధ్య పూర్తవుతుంది. ఆ తర్వాత రేషన్ షాపులకు చేరితే ఒకటో తేదీ నుంచి రేషన్ పంపిణీ చేస్తారు. అయితే కూటమి నేతల జోక్యంతో బియ్యం పక్కదారి పడుతున్న విషయం బహిరంగం కాగా, ప్రభుత్వమే ఆలస్యంగా సరఫరా చేయడం గమనార్హం. జిల్లాలో దాదాపు లక్ష రేషన్ కార్డుదారులకు బియ్యం చేరాల్సి ఉంది. బియ్యం కోసం ఎదురుచూపులు... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాణ్యమైన సన్నబియ్యాన్ని ఇంటివద్దనే అందించడంతో ప్రజలు సంతోషంగా ఏ టెన్షన్ లేకుండా తీసుకునేవాళ్లు. కూటమి ప్రభుత్వంలో పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో మార్చి 6వ తేదీ దాటినా ఇంకా రేషన్ పంపిణీ ప్రారంభం కాలేదు. గత బుధవారం మార్కాపురం ఎంఎల్ఓ పాయింట్కు 60 టన్నుల బియ్యం మాత్రమే రాగా.. వాటిని కొన్ని షాపులకు పంపారు. గురువారం కూడా పూర్తిస్థాయిలో రాలేదు. గురువారం సాయంత్రానికి జిల్లాలోని కొన్ని రేషన్ షాపులకు మాత్రమే బియ్యం పంపారు. ఇంకా సుమారు 300 టన్నుల బియ్యం ఎంఎల్ఓ గోడౌన్ పాయింట్కు రావాల్సి ఉంది. అధికారులు మాత్రం జిల్లా విభజన వలన సాఫ్ట్వేర్లో మార్పులు చేయడంలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. రెండుమూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. ఏదిఏమైనా నిత్యావసర వస్తువులు అందకపోవడంతో కార్డుదారులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మార్కాపురం జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 3,34,528మొత్తం రేషన్ షాపులు 743 -
సన్.. ధనాధన్..!
మార్కాపురం: మార్చి నెల ఇలా వచ్చిందో లేదో.. అప్పుడే వేసవి కాలం మొదలైపోయింది. ఒక్కసారిగా సూర్య ప్రతాపం పెరిగిపోయింది. గడిచిన వారం రోజులుగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మార్కాపురం ప్రాంతంలో గత నాలుగు రోజుల నుంచి ఎండ వేడమి అధికంగా ఉంటోంది. ఈ ఏడాది మార్చి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ 2వ వారం నుంచి ఎండ తీవ్రత పెరుగుతుంటుంది. ఈ ఏడాది అనూహ్యంగా మార్చి మొదటివారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. గత మూడు రోజుల నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు విపరీతంగా కాస్తుండటంతో మధ్యాహ్నం 12 గంటలకే రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈసారి నెల రోజులు ముందుగానే వేసవి వచ్చి ప్రజలను కలవరపరుస్తోంది. మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు అధికంగా ఉండటంతో ప్రజలు బిత్తరపోతున్నారు. ఇప్పుడే ఇవేం ఎండలు బాబోయ్ అనుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వేసవి కాలంలో ప్రత్యేకంగా వ్యాపారాలు చేసేవారు సైతం అప్పుడే రంగంలోకి దిగారు. పుచ్చకాయలు, శీతల పానియాలు, కొబ్బరిబోండాల వంటి వ్యాపారాలు పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు అసలు వేసవి ఎండలు మే నుంచా.. లేకుంటే మార్చి నుంచా అని చర్చించుకుంటున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఒంటి పూట బడులు ప్రారంభం కాకపోవడం, అప్పుడే ఎండ తీవ్రత పెరగడంతో పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. మార్కాపురంలోని పాత బస్టాండు, కోర్టు సెంటర్, కంభం సెంటర్, దోర్నాల సెంటర్, తదితర ప్రాంతాలన్నీ శుక్రవారం మధ్యాహ్నం 12.30 నుంచి నిర్మానుష్యంగా కనిపించాయి. -
గ్రామ దేవతకే శఠగోపం.!
ముండ్లమూరు: అధికార టీడీపీ నాయకుల అక్రమాలు, దందాలకు రోజురోజుకూ అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు క్రమంగా పెరిగిపోతున్నాయి. చివరకు దేవుడి మాన్యం భూములను సైతం వదలకుండా ఆక్రమిస్తున్నారు. బహిరంగంగా బరితెగిస్తున్నప్పటికీ అధికార పార్టీ కావడంతో పోలీసులు, అధికారులు కూడా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. ముండ్లమూరు మండల కేంద్రంలో జరుగుతున్న దేవుడి మాన్యం భూముల ఆక్రమణలే అందుకు నిదర్శనంగా ఉన్నాయి. స్థానిక పోలేరమ్మ దేవస్థానానికి సర్వే నంబర్ 75/15లో 1.16 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో గ్రామ ప్రజలు, ఎండోమెంట్ సహకారంతో పోలేరమ్మ దేవస్థానం నిర్మించారు. అయితే, ఆ భూమి అద్దంకి – దర్శి ప్రధాన రోడ్డు పక్కన ముండ్లమూరులోని మెయిన్ సెంటర్లో ఉండటంతో దానిపై కబ్జాదారుల కన్ను పడింది. రేషన్ డీలర్ అయిన టీడీపీ మండల నాయకుడు వీరపనేని నాగేశ్వరరావు 20 సెంట్ల భూమిని కబ్జా చేసి గోడ నిర్మిస్తున్నాడు. దానిపై గ్రామస్తులు ప్రశ్నించగా, ఇది మా భూమి అంటూ దౌర్జన్యం చేస్తున్నాడు. ఆ భూమి ఎప్పటి నుంచో ఎండోమెంట్ పరిధిలో ఉన్న విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ, సుమారు మూడు కోట్ల రూపాయల విలువ చేసే దేవుడి మాన్యం భూమిని కబ్జా చేస్తూ అధికార పార్టీ అనే అహంకారంతో గ్రామస్తులపై దౌర్జన్యం చేస్తున్నాడు. ఈ ఆక్రమణ వెనుక టీడీపీ నియోజకవర్గ స్థాయి నాయకుడి హస్తముందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొలతలు వేయించి చర్యలు తీసుకుంటాం గోడ కడుతున్న భూమి దేవుడి మాన్యమే. భూమి కబ్జాకు గురైన విషయం తెలిసి కొలతల కోసం మండల తహసీల్దార్కు అర్జీ అందజేశాం. కొలతలు వేసిన తర్వాత కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ గోడలు తొలగిస్తాం. కార్తీక్, ఎండోమెంట్ ఈవో -
లెప్రసీ నివారణలో భాగస్వాములు కండి
ఒంగోలు టౌన్: లెప్రసీని నివారించడంలో పీహెచ్సీ వైద్యులు భాగస్వాములు కావాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ అధికారి డాక్టర్ బాలాజీ పిలుపునిచ్చారు. పీహెచ్సీ వైద్యులందరూ లెప్రసీ వ్యాధిపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో భాగంగా పీహెచ్సీ వైద్యులకు స్థానిక జీజీహెచ్లోని సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో పీహెచ్సీ, యూపీహెచ్సీ వైద్యులు, ఫార్మసిస్ట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ జిల్లా నుంచి లెప్రసీని పారదోలేందుకు సహకరించాలని కోరారు. లెప్రసీని గుర్తించిన వెంటనే తగిన వైద్యం అందించాలని సూచించారు. క్రమం తప్పకుండా ఔషధాలు తీసుకునేలా రోగికి అవగాహన కల్పించాలని చెప్పారు. జీజీహెచ్ చర్మవ్యాధుల విభాగం హెచ్ఓడీ డాక్టర్ రాజశేఖర్, డీఎఫ్ఐటీ ప్రాజెక్టు మేనేజర్ ఎస్.సతీష్, ఫిజియోథెరపిస్ట్ పీటర్, పీఎంఓ టి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026
అబద్ధాలకు కేరాఫ్.. చంద్రబాబు సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని మరిచి అబద్ధాలతో పరిపాలన సాగిస్తున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఉదయం పొగమంచు ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వాతావరణం వేడిగా ఉంటుంది. పోషకాలు అందించే పాలు కాలకూట విషంగా మారుతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు నిత్యం తాగే పాలు కల్తీ జరుగుతుండటంతో ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారిన దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. కొందరు స్వార్థపరులు కల్తీ పాలు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లాలో ఎక్కువగా కల్తీ పాలను కుటీర పరిశ్రమలా ఇళ్లలోనే తయారు చేస్తున్నారు. అధికారులు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెతున్నాయి. గేదెల ఫారాలు ఉన్న ప్రాంతంలో కల్తీ పాల తయారీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంగా పంపిణీ చేసే సెంట్రలైజ్డ్ కార్పొరేట్ డెయిరీలకు ఈ కల్తీ పాలు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏవి కల్తీ పాలు? ఏవి నిజమైన పాలు? కనిపెట్టలేని పరిస్థితి జిల్లాలో నెలకొంది. సేకరణ కేంద్రాల వారు కూడా తమ కమీషన్ తమకు వస్తుంది కదా అని కళ్లు మూసుకుని అలాగే ఆ పాలను సెంట్రలైజ్డ్ డెయిరీలకు తరలించేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో కుటీర పరిశ్రమలా కల్తీ పాలు తయారయ్యేవి. దీనికితోడు అప్పట్లో తక్కువ ధరకు వస్తుందని బీరు పొట్టు వేసి పాడి పశువులను మేపే వారు. బీరు పొట్టు మేసిన గేదెలు నాణ్యత లేని పాలు ఇవ్వడమే కాకుండా వాటి జీవిత కాలం కూడా తగ్గిపోయేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం కల్తీ పాలపై ప్రత్యేక దృష్టి సారించింది. కల్తీ పాల జాడ కూడా కనిపించకుండా పూర్తిగా కట్టడి చేసింది. బీరు పొట్టు కూడా గేదెలకు వేయకుండా పూర్తి స్థాయిలో నియంత్రించింది. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్తీ పాల తయారీకి అడ్డే లేకుండా పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. క్షీర సాగరళందర్శి: రాష్ట్రంలో పాల సేకరణలో ఉమ్మడి జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలో ప్రముఖ డెయిరీలతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 72 బల్క్ మిల్క్ యూనిట్లు ఉన్నాయి. వీటితో పాటు 147 డైయిరీలు, 760 వరకు పాల కేంద్రాలు ఉన్నాయి. అనధికారికంగా పాలకేంద్రాలు పదివేలకుపైగా ఉంటాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సుమారు 6.5 లక్షల పశువులు ఉన్నాయి. అందులో గేదెలు ఆరు లక్షలు, 50 వేలకుపైగా ఆవులు ఉన్నాయి. పాడి రైతులు సుమారు 1.30 లక్షల మంది ఉన్నారు. రోజుకు సరాసరి 23 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతోంది. కుటీర పరిశ్రమలా.. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు నగరంతో పాటు దర్శి, ముండ్లమూరు, సంతమాగులూరు, అద్దంకి తదితర మండలాల్లో కల్తీ పాలను కుటీర పరిశ్రమలా ఇళ్లలోనే తయారు చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో సుమారు 1200కుపైగా చిన్నాపెద్దా డెయిరీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడ, తదితర ప్రాంతాలకు పాలు విక్రయించేవి సుమారు 80కిపైగా ఉంటాయి. ఇక్కడ తరచూ కల్తీ పాల తయారీ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అధికారులు వీటిని పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారు. మొక్కుబడి దాడులతో సరిపెడుతూ తమ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం మేల్చూరులోని పాలకేంద్రంపై అధికారులు దాడులు చేశారు. ఇంట్లోనే కృత్రిమ పాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. వారిపై కేసులు పెట్టినా ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తోంది. రాజమండ్రి కల్తీ పాల ఉదంతాన్ని చూసి కూడా అధికారుల్లో చలనం కనిపించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాల కల్తీ ఇలా... యూరియా, పాలపొడి, సన్ ఫ్లవర్ ఆయిల్ను బాగా మిక్స్ చేస్తారు. వాటిలో నీళ్లు కలిపి కొన్ని మంచి పాలు కలిపి కల్తీ పాలు తయారు చేస్తారు. అనుకున్న ఫ్యాట్ వచ్చే మోతాదులో పాలు తయారు చేస్తారు. పాల కేంద్రాల్లో ఉండే సాధారణ మిల్క్టెస్టర్లో టెస్ట్ చేసినా తేడా కనిపించకుండా ఉండేందుకు పాల పొడి కలిపి ఎస్ఎన్ఎఫ్, వెన్నశాతం సమానంగా కనిపించేలా చేస్తారు. అయితే ప్రస్తుతం నూతన టెక్నాలజీతో వచ్చిన మిషన్లు యూరియా, పాల పొడి కల్తీ ఉన్నట్లు గుర్తిస్తున్నాయి. దీంతో కేవలం సన్ఫ్లవర్ ఆయిల్తోనే పాలు తయారు చేస్తున్నారు. దీంతో ఇక్కడ మిషన్లు ఆ కల్తీ పాలను పూర్తిస్థాయిలో కనిపెట్టలేకపోతున్నాయి. అవి కనిపెట్టే పరికరాలు రాష్ట్రంలో ఎక్కడా లేవని, అవి హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. ప్రతిరోజూ ఒక్కో పాల డెయిరీకి రెండు మూడు వందల క్యాన్లలో పాలు వస్తాయి. అయితే వాటన్నింటినీ పరిశీలించాలంటే సాధ్యం కాదు. దీంతో డెయిరీ యజమానులు కూడా చేతులెత్తేయాల్సి వస్తోంది. మొక్కుబడిగా తనిఖీలు... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కల్తీ పాలపై అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎందుకంటే టీడీపీకి చెందిన కీలక నేతల కనుసన్నల్లో పలు డెయిరీలు నడుస్తున్నాయి. దీంతో సంబంధిత అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారు. పట్టుబడిన నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇప్పటికై నా ప్రభుత్వం కల్తీ పాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజారోగ్యం కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
● అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ నెల 8వ తేదీ ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. ఆ దిశగా ఏర్పాట్లు చేసేందుకు సంబంధిత అధికారులతో శుక్రవారం స్థానిక ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. జిల్లాస్థాయిలో 3000 మందితో, నియోజకవర్గ స్థాయిలో 500 మందితో ఈ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినందున నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. వివిధ రంగాలలో విజయం సాధించిన మహిళలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడంతో పాటు వారి విజయాలను వీడియో రూపంలో చిత్రీకరించి ఆయా కార్యక్రమా ల్లో ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, డీఆర్డీఏ పీడీ నారాయణ, మెప్మా పీడీ ఆనంద్ సత్యపాల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ముస్లింల పవిత్ర మాసం రంజాన్
కురిచేడు: ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఆవిర్భవించిన నెల రంజాన్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. స్థానిక మదర్సాలో రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి షేక్ సైదా ఆధ్వర్యంలో శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ముస్లింలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ వారి అభివృద్ధికి సహకరించామన్నారు. చంద్రబాబు సర్కారు అందరితో పాటు ముస్లింలను కూడా మోసం చేసిందని విమర్శించారు. రానున్న రోజుల్లో మళ్లీ జగనన్నను సీఎం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ముస్లింలతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం బూచేపల్లి వెంకాయమ్మ చేతుల మీదుగా పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యన్నబత్తుల వెంకట సుబ్బయ్య, పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడు మేరువ సుబ్బారెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ షేక్ ఖాశీం, జెడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి, లీగల్ సెల్ నాయకులు పసుమర్తి వెంకటరావు, వైస్ ఎంపీపీ షేక్ చిన్న మస్తాన్, ఎన్వీ నాగిరెడ్డి, నుసుం ప్రతాప్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గోగులముడి లింగారెడ్డి, బోరిగర్ల శ్రీను, సాదం నారయ్య, గొట్టిపాటి బాలకోటయ్య, షేక్ జానీ, షేక్ సుభాని, షేక్ నాయబ్ రసూల్, షేక్ యూసఫ్, కండె గంగయ్య తదితరులు పాల్గొన్నారు. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
రీ సర్వేలో సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు సబర్బన్: రీ సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకాశం భవన్లోని సర్వే ఏడీ కార్యాలయం ముందు పెన్డౌన్ చేసి నిరసనకు దిగారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపాల కృష్ణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి వారి అభిప్రాయాల ఆధారంగా మాత్రమే తదుపరి రీ సర్వే ప్రాజెక్ట్పై ముందుకు వెళ్లాలన్నారు. ప్రస్తుతం నాల్గవ విడత రీసర్వే గ్రామాల్లో రోజుకు ఒక టీం 25 ఎకరాలు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలతో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని వాపోయారు. పనిభారంతో మానసికంగా తీవ్ర ఒత్తికి లోనవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రీసర్వే ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయ్యే వరకు స్వామిత్వ ప్రాజెక్ట్లో మేము భాగస్వాములం అవ్వలేమని తెగేసి చెప్పారు. అధిక పనిభారం కారణంగా అర్ధరాత్రి వరకు పనిచేయడం వల్ల గ్రామ సర్వేయర్లు ప్రయాణాల్లో ప్రమాదాలకు గురవుతున్నారని వివరించారు. పదోన్నతులు కల్పించి ఆదుకోవాలన్నారు. పే స్కేలు అంశాలను పరిష్కరించాలన్నారు. నిరసన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: గ్రామ సర్వేయర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని శుక్రవారం నిరసనకు దిగారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలతో పాటు రిక్రూట్ అయిన ఇతర ఉద్యోగుల మాదిరిగా ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన గ్రామ సర్వేయర్లకు జిల్లా వారీగా 70 శాతం వరకు గ్రేడ్ 1 ప్రమోషన్లు, రూ.34,580 బేసిక్ స్కేల్ అమలు చేయాలని కోరారు. గ్రామ సర్వేయర్ గ్రేడ్ 1కు మండల డిప్యూటీ సర్వేయర్కు మధ్య స్పెషల్ సర్వేయర్ పోస్టు సాంకేతిక విభాగ సమాన పేరోల్ కనీసం రూ.37,640 బేసిక్ అమలు చేయాలన్నారు. ఐదేళ్లుగా పై స్థాయి నుంచి మండల సర్వేయర్ పోస్టు వరకు పదోన్నతులు వస్తున్నాయని, కానీ విలేజ్ సర్వేయర్లకు మండల డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు స్పెషల్ గ్రేడ్ సర్వే పోస్టులకు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 ఎటువంటి పదోన్నతులు రావడం లేదని, త్వరితగతిన ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం సర్వే ఏడీ కార్యాలయం ముందు సర్వేయర్ల నిరసన -
కదలని గ్రానైట్ బ్లాక్లు
సింగరాయకొండ: మద్యం మత్తులో లారీ అతివేగంగా నడపడంతో భారీ గ్రానైట్ బ్లాక్లు రోడ్డుపై అడ్డంగా పడిన విషయం విదితమే. బల్లికురవ నుంచి బెంగళూరుకు రవాణా చేస్తుండగా స్థానిక పెరల్ డిస్టిలరీ సమీపంలో రోడ్డుపై గ్రానైట్ బ్లాక్లు పడ్డాయి. అయితే ఈ గ్రానైట్ బ్లాక్లను తిరిగి ట్రాలీపై ఎక్కించడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జాతీయరహదారి అధికారులు టంగుటూరు, గుండ్లాపల్లి టోల్ప్లాజాల నుంచి మూడు భారీ ట్రాలీలను తీసుకువచ్చారు. గ్రానైట్ బ్లాక్లను రోడ్డుకు అడ్డంగా లేకుండా డివైడర్ మధ్యలోకి జరిపే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రేన్లు సుమారు 30 టన్నుల బరువు ఎత్తే సామర్థ్యం ఉండగా గ్రానైట్ బ్లాక్లు 50 టన్నులకు పైగా బరువు ఉన్నాయి. దీంతో ఆ బ్లాక్లను పక్కకు జరపడానికి కుదరలేదు. వాటిని పక్కకు నెట్టే క్రమంలో క్రేన్ల చైన్లు తెగిపోయాయని లారీ యజమానులు వాపోతున్నారు. దీంతో చివరికి క్వారీ యజమానితో సంప్రదించి విజయవాడ నుంచి భారీ క్రేన్లు తెప్పించనున్నట్లు జాతీయరహదారి అధికారులు తెలియజేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం... జాతీయరహదారిపై పెట్రోలింగ్ నిర్వహించాల్సిన హైవే పెట్రోలింగ్ పోలీసులు, జాతీయరహదారి భధ్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తృటిలో ఘోర ప్రమాదమే తప్పింది. ట్రాలీ సామర్ాధ్యన్ని మించి అధిక లోడింగ్తో రవాణా జరుగుతుండగా పట్టించుకోవాల్సిన బ్రేక్ ఇన్స్పెక్టర్లు పత్తాలేరు. డ్రైవర్ ఒంగోలులో మద్యం సేవించి అతివేగంగా, అజాగ్రత్తగా ట్రాలీ నడుపుతుంటే పర్యవేక్షించాల్సిన హైవే పెట్రోలింగ్ పోలీసులు, జాతీయ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కాని ప్రశ్న. చివరికి పెరల్ డిస్టిలరీ సమీపంలో ఈ భారీ గ్రానైట్ బ్లాక్లు జారి కిందపడి అవతల రోడ్డు వైపుకు వెళ్లాయి. ఆ సమయంలో వాహనాల సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అదే కనుక ప్రైవేట్ బస్సు, కారు వచ్చి ఉంటే ఈ ఘటనను ఊహించడమే కష్టం. ఈ ఘటనతో అధికారులు స్పందించి జాతీయరహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. మూడు క్రేన్లతో గ్రానైట్ బ్లాక్ల తొలగింపునకు చర్యలు ఫలించని హైవే అధికారుల కృషి విజయవాడ నుంచి భారీ క్రేన్లు వస్తాయంటున్న హైవే అధికారులు -
ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో గంజాయి పట్టివేత
ఒంగోలు టౌన్: ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో మళ్లీ గంజాయి పట్టుబడింది. మహిళా పోలీస్స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం శుక్రవారం మాదక ద్రవ్యాలను గుర్తించే జాగిలంతో తనిఖీలు నిర్వహించారు. పలు ఎక్స్ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసరాలు, పార్సెల్ కేంద్రాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నుంచి కావలి వైపు వెళుతున్న ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద వ్యక్తులు తారసపడ్డారు. వారి బ్యాగులను పరిశీలించగా 1.2 కిలోల గంజాయి లభ్యమైంది. ఒడిశా రాష్ట్రంలోని జేక్ పూర్ గ్రామానికి చెందిన మచ్చా భూను అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో ఎస్సైలు శ్రీరాం, చెంచయ్య, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ బొమ్మ వద్ద శుక్రవారం నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బీటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర దేవా సహాయం మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, పెండింగ్ ఉన్న నాలుగు డీఏలను మంజూరు చేయాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రే వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల శరత్ చంద్రబాబు, జిల్లా గౌరవ అధ్యక్షుడు పారబత్తెన జాలరామయ్య, జిల్లా నాయకులు జగన్నాథం ప్రసాదరావు, చెక్క కోటేశ్వరరావు, పల్లె కృష్ణమూర్తి, నూకతోటి కుమారస్వామి, పల్లె తిరుపతిస్వామి, కొండమూరి కొండల రాయుడు, గాలిమోటు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. కొత్తపట్నం: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కె.పల్లెపాలెంలో శుక్రవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే..పెదగంజాం పల్లెపాలెం గ్రామానికి చెందిన కొల్లాటి వెంకట గోపి (30) బేల్దారీ పనులు చేసేవాడు. మండలంలోని కె.పల్లెపాలెం గ్రామానికి తిరుపమ్మతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన గోపి భార్యను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం కె.పల్లెపాలెం వచ్చాడు. నాలుగు రోజుల క్రితం కుటుంబసభ్యులంతా తిరుపతమ్మ తిరునాళ్లకు వెళ్లారు. అయితే గోపీ మాత్రం తిరునాళ్లకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంట్లోని వారంతా తిరునాళ్లకు వెళ్లి వచ్చే సరికి బీరువా పగులగొట్టి అందులోని నగదు దొంగిలించి మద్యం తాగాడు. కుటుంబసభ్యులు గ్రామంలో వెతికి పట్టుకున్నారు. అయితే ఇప్పుడు వస్తానని బయటకు వెళ్లిన గోపీ తుఫాన్ షెల్టర్ పక్కనే ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై వేముల సుధాకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. త్రిపురాంతకం: నేషనల్ హైవేపై బైక్, కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. త్రిపురాంతకంకు చెందిన కాశీం (62) హైవేలో ఉన్న తన హోటల్ వద్ద నుంచి బైక్పై వచ్చే క్రమంలో ఎదురుగా శ్రీశైలం నుంచి విజయవాడ వైపు వెళ్లే కారు ఢీకొట్టింది. ప్రమాదం కాశీం తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్రిపురాంతకం: చెరువుకొమ్ముతండా గ్రామ పరిధిలో గుర్తుతెలియని వృద్ధుడు మృతదేహం గుర్తించినట్లు ఎస్సై శివరామయ్య తెలిపారు. త్రిపురాంతకం మండలం సంఘంతండా పంచాయతీ పరిధిలోని చెరువుకొమ్ముతండా పరిసర ప్రాంతంలోని పొలంలో సుమారు 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెంది ఉన్నాడు. తెలుపు రంగు చొక్కా ధరించి ఉండగా ఇతని వద్ద ఎరుపు రంగు దుప్పటి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మార్కాపురం జిల్లా అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి
మార్కాపురం: మార్కాపురం జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ప్యాకేజీని వెంటనే ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు శుక్రవారం చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనేక దశాబ్ధాలుగా అన్ని రంగాల్లో వెనుకబడి ఇటీవలే జిల్లాగా ఏర్పడిన మార్కాపురం జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కురిచేడు, దొనకొండ మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. జిల్లాగా నేటికీ కలెక్టర్, ఎస్పీ, రెవిన్యూ ఆఫీసరు లాంటి కీలక పోస్టులను భర్తీ చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఇన్ఛార్జిలతో ఎంతకాలం పాలన కొనసాగిస్తారని ప్రశ్నించారు. వెంటనే కలెక్టర్, ఎస్పీ పోస్టులను భర్తీ చేసి ఇక్కడే ఉండి పాలన చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈశ్వరయ్య కోరారు. 4 లక్షల 32 వేల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మందికి తాగునీరు అందించే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.2 వేల కోట్లు కేటాయించాలని పార్టీ డిమాండ్ చేయగా, బడ్జెట్లో రూ.490 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం పోరాటాలు చేసిన పూల సుబ్బయ్య పేరును నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, ప్రాజెక్టు పేరుకు ముందు పూలసుబ్బయ్య పేరు చేర్చారని, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కాపురం బహిరంగ సభలో ఆయన పేరును ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. జిల్లా కేంద్రమైన మార్కాపురంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడం బాధాకరమని, తక్షణమే విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి సీపీఐ జిల్లా కార్యదర్శిగా ఎంపికై న ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు తక్షణమే ఆర్ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి 3 దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా పూర్తికాకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు అందె నాసరయ్య, కేవీ కృష్ణ గౌడ్, రైతు సంఘం నాయకులు డి శ్రీనివాస్, నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి అందె నాసరయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ -
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
పెద్దదోర్నాల: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం కర్నూలు రోడ్డులోని మోట్ల మల్లికార్జునపురం సమీపంలో జరిగింది. ఈ ఘటనలో ద్విక్రవాహనంపై ప్రయాణిస్తున్న కర్నూలు జిల్లా బోమన చెరువుకు చెందిన బెస్త శరత్కుమార్ (25) మృతి చెందగా, మరో యువకుడు దేవేంద్రకుమార్కు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై వెంకట రమణయ్య కథనం మేరకు..కర్నూల్ జిల్లా బోమనచెరువుకు చెందిన బెస్త శరత్కుమార్, దేవేంద్రకుమార్ హైదరాబాద్ నుంచి పల్నాడు జిల్లా మాచర్లలలో స్నేహితులను కలిసేందుకు వచ్చారు. స్నేహితులను కలిసిన అనంతరం మాచర్ల నుంచి డ్రోన్కు ద్విచక్రవాహనంపై వెళుతుండగా మోట్లమల్లికార్జునపురం వద్దకు రాగానే ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై వెంకట రమణయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కేరాఫ్ చంద్రబాబు
అబద్ధాలకు పుల్లలచెరువు: రాష్ట్ర అభివృద్ధిని మరిచి కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం, అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటుగా మారిందని, అరాచక పాలన సాగిస్తున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మండలంలోని ముటకుల గ్రామంలో సంతాన వేణుగోపాలస్వామి తిరునాళ్ల సందర్భంగా స్వామిని దర్శించుకున్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేలా రాష్ట్ర ప్రజల ఆశీస్సులు మెండుగా ఇవ్వాలని ఆ దేవున్ని మొక్కినట్లుగా తెలిపారు. అనంతరం వైఎస్సాఆర్ సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై ఆశేష జనవాహిని మధ్య ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఆరాచక పాలన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అభివృద్ధిని మరిచిపోయి అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. గతంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు రాష్ట్రంలో జనరంజక పాలన సాగించారని గుర్తుచేశారు. ప్రస్తుత చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని, కేవలం వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్లు విహారయాత్రల పేరుతో విమానాల్లో తిరుగుతూ కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయకుండా అబద్ధపు మాటలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీని వదిలేశారని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు లేక విద్యా వ్యవస్థ కునారిల్లుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి మంచి చేశాందో నాయకులు చెప్పాలన్నారు. ఆలయ ప్రతిష్టను కాపాడలేని వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవా..? తిరుపతి లడ్డూ విషయంలో పదే పదే అబద్ధాలు వల్లె వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు చూస్తున్నారని, కానీ ప్రజలు అన్నీ విషయాలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆలయ ప్రతిష్టను కాపాడలేని వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవిని ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సీ్త్ర లోలుడు అయిన బీఆర్ నాయుడుకు చైర్మన్ పదవిని ఇచ్చి తిరుమల ఆలయ ప్రతిష్టను మంట కలిపారని విమర్శించారు. బీఆర్ నాయుడు చేస్తున్న పనులను గురించి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధి వదిలేసి ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును త్వరలో సాగనంపాలని, రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటాని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కన్వీనర్ దోమకాలు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ ఎల్, రాములు, సర్పంచ్లు సత్యనారాయణరెడ్డి, ఆవుల కోటిరెడ్డి, జె, వెంకటరెడ్డి, ఆవుల రమణారెడ్డి, బోల్లేపల్లి సాంబయ్య, శేషయ్య, మాజీ పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ, గద్దె బ్రహ్మయ్య, రవణారెడ్డి, మండల మహిళా అధ్యక్షరాలు రవణమ్మ, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గంగరాజు, దినేష్యాదవ్, ఆవులయ్య, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు ఎక్కడ బాబు..? ఊకదంపుడు మాటలు తప్ప అభివృద్ధి శూన్యం రాష్ట్రంలో అరాచక పాలన ముటుకుల తిరునాళ్లలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ ధ్వజం -
యుద్ధోన్మాది ట్రంప్.. కొమ్ముకాస్తున్న మోదీ
ఒంగోలు టౌన్: ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న యుద్ధోన్మాది ట్రంప్ దుర్నీతికి ప్రధానమంత్రి మోదీ కొమ్ముకాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. గురువారం స్థానిక మల్లయ్యలింగం భవనంలో నిర్వహించిన సీపీఐ జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ అమెరికా విధానాలను నిర్ద్వందంగా తిరస్కరించగా.. నేటి ప్రధానమంత్రి ట్రంపు విధానాలకు తలూపుతున్నారని మండిపడ్డారు. చిన్న దేశాలపై అమెరికా చేస్తున్న యుద్ధాలు ప్రపంచ వ్యాప్తంగా శాంతియుత వాతావరణానికి ముప్పుగా పరిణమించాయని చెప్పారు. దేశంలో మోదీ అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ప్రమాదకరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మతాల పేరుతో ప్రజలను విభజించి పాలించడమే బీజేపీ విధానాలని, దీని వలన దేశ ప్రగతి కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతూ కాలయాపన చేస్తోందన్నారు. 1996లో వెలిగొండకు పునాదిరాయి వేసి 30 సంవత్సరాలు అవుతోందని, నేటికీ ఆ ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ వ్యవహారం చంద్రబాబు అధికారంలో కొనసాగేంత వరకు సాగదీస్తారని వా్య్ఖ్యానించారు. ప్రజల సమస్యలను మరుగున పడేసేందుకు తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని వాడుకుంటున్నారని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలకు ఎకరా 99 పైసలకు ఇవ్వడం సరికాదని, లోకేష్ కుటుంబ ఆస్తి ఇచ్చుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని అన్నారు. ప్రజా సమస్యలపై ఈ నెల 24వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి జంగాల అజయ్ కుమార్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సహాయ కార్యదర్శి ఆర్.వెంకటరావు, అరిగెల సాయి, తన్నీర సింగరకొండ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శ -
వ్యాజ్యాల పరిష్కారం అభినందనీయం
ఒంగోలు: ప్రాథమిక స్థాయిలోనే వ్యాజ్యాల పరిష్కార కార్యక్రమం అభినందనీయమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. గురువారం స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ప్యానల్ అడ్వకేట్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షిదారులకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు ప్రాథమిక స్థాయిలోనే వ్యాజ్యాల పరిష్కారంతో కక్షిదారులకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయి న్యాయసేవాధికార సంస్థ రూపొందించిన న్యాయ సహాయ జాబితాలో భాగంగా చట్టాల పట్ల అవగాహన కూడా కలిగిస్తున్న విధానాన్ని వివరించారు. ఏడాదికి రూ.3 లక్షల్లోపు ఆదాయం కలిగిన కుటుంబాలు, మహిళలు, షెడ్యూల్డు తెగలు, జాతుల వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అవసరమైన ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.వీర రాఘవులు, న్యాయవాదులు పరుచూరి లక్ష్మీకుమారి, షేక్ అజీజ్, నాయుడు ఈశ్వరరావు, డేగల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: నిరుద్యోగుల పట్ల కపట ప్రేమ నటిస్తున్న చంద్రబాబు రాష్ట్ర చరిత్రలో విఫల ముఖ్యమంత్రిగా నిలబడిపోతారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని, కోట్లాది రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని 20 నెలలుగా ఊదరగొట్టడమే కానీ ఒక్క కంపెనీ రాలేదు, నిధులు రాలేదని తేల్చి చెప్పారు. మాయమాటలతో రాష్ట్రంలోని నిరుద్యోగులను మోసపుచ్చుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయడం లేదని అడిగారు. నిరుద్యోగుల ఆకలి కేకలు ముఖ్యమంత్రికి వినిపించడంలేదని, చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలకు చెందిన విలువైన భూములను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి లడ్డూ రాజకీయంతో విలువైన అసెంబ్లీ సమయాన్ని వృథా చేశారని విమర్శించారు. ఇప్పటికై నా ఒట్టిమాటలు కట్టబెట్టి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, జిల్లాలో భారీ పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగమో, ఉపాధి కల్పనో చూపించేంత వరకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.3 వేల భృతి ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతుల ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కరుణానిధి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.పవన్, ఎస్.రామాంజి యాదవ్, ఊటికొండ గోపి, కట్ట ఆంజనేయులు, నాగరాజు పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్ -
నయన మనోహరం.. శ్రీవారి పరిణయం
కొనకనమిట్ల: ప్రసిద్ధిగాంచిన వెలుగొండ పుణ్యక్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడమ శ్రీలక్ష్మీ అలివేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణతో వెలగొండ క్షేత్రం ప్రతిధ్వనించింది. ముందుగా రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన వేదికపై ఉభయదేవేరులతో సహా శ్రీవారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి పూజలు చేశారు. కల్యాణ ఉభయదాతలుగా వాగిచెర్ల, జూటూరి, మూర్తి, తాడి కుటుంబ సభ్యులు, ఆలయ ఈఓ చెన్నకేశవరెడ్డి, కమిటీ సభ్యుడు కుందురు కాశిరెడ్డి దంపతులు వ్యవహరించి స్వామి వారికి పట్టువస్త్రాలు, పసిడి, రజత, ఆభరణాలు సమర్పించారు. వేద పండితులు వెంకటరమణాచార్యులు భార్గవ రామాచార్యులు, పవన్కుమార్శర్మ, తిరుమలాచార్యులు కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణ వ్యాఖ్యాతగా తాల్లూరి దుర్గా వెంకటేశ్వరరావు వ్యవహరించారు. వెలుగొండ క్షేత్ర పరిసర గ్రామాల ప్రజలతోపాటు ఒంగోలు, మార్కాపురం, విజయవాడ, తెనాలి, చీరాల, వినుకొండ, నంద్యాల, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై కల్యాణాన్ని తిలకించారు. శ్రీవారికి ముత్యాల తలంబ్రాలు స్వామివారికి భక్తులు సమర్పించిన ముత్యాలతో ఉభయదాతలు తలంబ్రాలు పోశారు. తొలుత తాడివారిపల్లికి చెందిన తాడివారు కత్తులు కటార్లతో ఆచారం ప్రకారం గుర్రాల మీద ఉత్సవంగా ఆలయానికి చేరుకున్నారు. కల్యాణానికి ముందు నిశ్చితార్ధ రాయబార ఘట్టం ఉత్సాహంగా సాగింది. కల్యాణం అనంతరం మహిళలకు ముత్యాల తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలు, అలాగే లాటరీ ద్వారా 10 మంది మహిళా భక్తులకు చీరలు అందజేశారు. ఉదయం ఆల్పాహరాన్ని బ్రాహ్మణ అన్నదాన సత్రం కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. వైభవంగా సాగుతున్న వెలుగొండ బ్రహ్మోత్సవాలు ముత్యాలతో స్వామివారికి తలంబ్రాలు గోవింద నామస్మరణతో పరవశించిన భక్తులు -
మద్యం మత్తులో.. గ్రానైట్ లారీ బీభత్సం
సింగరాయకొండ: సరైన భద్రతా చర్యలు పాటించకుండా మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడపడంతో రెండు భారీ గ్రానైట్ బండలు రోడ్డుపై జారిపడిన సంఘటన జాతీయ రహదారిపై సింగరాయకొండ మండల పరిధిలో పెరల్ డిస్టిలరీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టంగానీ, గాయాలుగానీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. పోలీసుల కథనం ప్రకారం.. బల్లికురవలోని ఓ గ్రానైట్ క్వారీ నుంచి బెంగళూరుకు రెండు భారీ గ్రానైట్ బండలను ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకుండా రవాణా చేస్తున్నారు. దానికితోడు లారీ ట్రాలీ డ్రైవర్ ఎన్.తిరుమల మద్యం సేవించి అతివేగంగా నడపటంతో పెరల్ డిస్టిలరీ సమీపంలోకి రాగానే రెండు గ్రానైట్ రాళ్లు ట్రాలీ నుంచి జారి రోడ్డు మధ్యలో డివైడర్పై పడ్డాయి. ఒంగోలు వైపు వెళ్లే రోడ్డుకు డివైడర్ అంచునపడగా, ఆ సమయంలో అటుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదమే తప్పింది. ట్రాలీ లారీ డ్రైవర్కు డ్రంక్ డ్రైవ్ పరీక్ష చేయగా, 264 పాయింట్లు వచ్చిందని, పూర్తిగా మద్యం మత్తులో వాహనం నడపడం, భద్రతా చర్యలు చేపట్టకపోవడం వలనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని స్థానిక ఎస్సై బీ మహేంద్ర తెలిపారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని, లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు. హైవేపై జారి పడిన భారీ గ్రానైట్ బ్లాకులు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అతివేగంగా వాహనం నడపడమే కారణమంటున్న పోలీసులు -
రెండు రోజులైనా దొరకని మహిళ ఆచూకీ
● ఆందోళనలో కుటుంబ సభ్యులు బల్లికురవ: సాగర్ అద్దంకి బ్రాంచ్ కెనాల్లో మంచి నీటి కోసం దిగి గల్లంతైన మహిళ ఆచూకీ రెండు రోజులైనా లభించలేదు. మండలంలోని వల్లాపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి భవాని(28) భర్త వీరాంజనేయులుతో కలిసి మంగళవారం సాయంత్రం గొర్రెపిల్లల మేత కోసం అద్దంకి బ్రాంచ్ కాలువ 33/0 మైలు ఎగువకు వెళ్లింది. ఈ క్రమంలో దాహం వేయడంతో నీటి కోసం సాగర్ కాలువలోకి దిగింది. పైకి వచ్చే క్రమంలో జారి పడటంతో నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీమ్ సభ్యులు రెండు రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో కాలువలో అనుమానిత ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. అయినప్పటికీ భవానీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆశతో కుటుంబ సభ్యులంతా సాగర్ కాలువ కట్టపైనే పడిగాపులు కాస్తున్నారు. కొనకనమిట్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెలుగొండలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 11, 12, 13వ తేదీల్లో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి, సభ్యులు జవ్వాజి బాషాపతినాయుడు, మేకలవారిపల్లి రెడ్ల సంఘం సభ్యులు తెలిపారు. 11వ తేదీన ఆరు పళ్ల సైజు విభాగంలో, 12, 13వ తేదీల్లో న్యూ కేటగిరీ, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా విభాగాల పోటీలలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. బహుమతుల వివరాలివీ.. ఆరు పళ్ల సైజు విభాగంలో గెలుపొందిన ఎడ్లకు మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు బహుమతులు వరుసగా రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.7 వేలు, న్యూ కేటగిరీ విభాగంలో గెలుపొందిన ఎడ్లకు మొదటి ఏడు బహుమతులు వరుసగా రూ.75 వేలు, రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.8 వేలు, అలాగే సీనియర్ విభాగంలో గెలుపొందిన ఎడ్లకు మొదటి ఏడు బహుమతులు వరుసగా రూ.90 వేలు, రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలను దాతల సహకారంతో అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఎడ్ల పోటీల్లో పాల్గొని బహుమతి దక్కని ప్రతి ఎడ్ల జతకు రూ.5 వేల చొప్పున కాసు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కాసు వెంకటేశ్వరరెడ్డి అందజేస్తారని కమిటీ సభ్యులు ప్రకటించారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల యజమానులు ప్రవేశ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 8008716521, 9505345703, 9963429928, 9581137317ను సంప్రదించాలని సూచించారు. ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ షేక్ సాజిద్ కుటుంబానికి 2009 బ్యాచ్కు చెందిన పోలీసు సిబ్బంది అండగా నిలిచారు. కందుకూరు పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ ఈ ఏడాది జనవరి 19వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో సాజిద్ మరణించారు. అతని కుటుంబం కోసం సహోద్యోగులు సేకరించిన రూ.2,14,000ను గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్రాజు చేతుల మీదుగా సాజిద్ తండ్రి షేక్ బాషాకు అందజేశారు. ఈ సందర్భంగా సాజిద్ కుటంబ వివరాలడిగి తెలుసుకున్న ఎస్పీ.. పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏవైనా సమస్యలుంటే తనను సంప్రదించాలని సూచించారు. సాజిద్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన సహోద్యోగులను అభినందించారు. -
రేపటి నుంచి రాష్ట్ర స్థాయి లాన్ టెన్నిస్ పోటీలు
ఒంగోలు: రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాలెంజ్ లాన్ టెన్నిస్ క్రీడా పోటీలు ఈనెల 7, 8 తేదీల్లో స్థానిక హైదరీ ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు లాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే మోహన్రెడ్డి, హైదరీ ఆఫీసర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.రాఘవ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మెన్ ఓపెన్, 40 ప్లస్, 50 ప్లస్, 60 ప్లస్, 70 ప్లస్ విభాగాల్లో జరిగే ఈ పోటీలకు రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు పాల్గొంటారని, విజేతలకు విలువైన నగదు బహుమతులు అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు సిటీ: ఒంగోలు నగరంలోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, ఎంఈఓలు, ఉప విద్యాశాఖాధికారులకు ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు డీఈఓ సీవీ రేణుక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి కలెక్టర్ పి.రాజాబాబు, జిల్లా నోడల్ ఆఫీసర్ ఏ.సుబ్బారెడ్డి, మార్కాపురం జిల్లా పరిశీలకులు ఎన్.గీత, పాఠశాల విద్య ప్రాంతీయ సంచాలకులు బి.లింగేశ్వరరెడ్డి పాల్గొంటున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులందరూ నిర్దేశిత సమయానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ఒంగోలు సిటీ: జిల్లాలో గురువారం నిర్వహించిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ తెలుగు పరీక్షలో 2518 మంది విద్యార్థులకు గాను 2133 మంది హాజరైనట్లు డీఈఓ సీవీ రేణుక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందీ పరీక్షలో 27 మంది విద్యార్థులకు గాను 23 మంది, ఉర్దూ పరీక్షలో 10 మంది విద్యార్థులకు గాను 10 మంది హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు తెలిపారు. రాష్ట్ర పరిశీలకులు గీత అకస్మాత్తుగా మార్కాపురం, గిద్దలూరు లోని ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయులకు తక్షణమే ఆర్జేడీ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్ల నుంచి విద్యార్థులు లేక వివిధ పాఠశాలల్లో పనిచేస్తూ, జీవో నంబర్ వన్ ప్రకారం మిగులుగా ఉన్న ఎయిడెడ్ ఉపాధ్యాయులు సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 108 మంది, స్కూల్ అసిస్టెంట్ గణితం 8 మంది, సోషల్ ఆరుగురు, సైన్స్ నలుగురు, తెలుగు పండితులు ఆరుగురు, హిందీ పండిట్లు ఐదుగురు, పీఈటీలు ఐదుగురు, క్రాఫ్ట్ డ్రాయింగ్ ముగ్గురు, నాన్ టీచింగ్ స్టాఫ్ 20 మంది అదనంగా ఉన్నారన్నారు. వీరికి సీనియార్టీ లిస్టు రూపొందించి ఆర్జేడీ బీ లింగేశ్వర్ రెడ్డి ఏప్రిల్ చివరిలో కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. మార్కాపురం: మార్కాపురం జిల్లా హౌసింగ్ పీడీగా ఎంవీ మోహన్రావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన నెల్లూరు హౌసింగ్ ఈఈగా పనిచేస్తూ పదోన్నతిపై మార్కాపురం హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టరుగా వచ్చారు. అనంతరం ఒంగోలుకు వెళ్లి కలెక్టర్ రాజాబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగులో ఉన్న గృహాలను త్వరగా పూర్తిచేయిస్తానని తెలిపారు. హౌసింగ్ డీఈ పవన్కుమార్, ఏఈలు సిబ్బంది ఆయనను కలిశారు. -
రాష్ట్రంలో విధ్వంసక పాలన
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తోందని, విద్యా వ్యవస్థను దెబ్బతీస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు వేసి చంద్రబాబు అండ్ కో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తే నేడు వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారన్నారు. జిల్లాలో శనగ రైతు పూర్తిగా దెబ్బతిన్నాడని, మద్దతు ధర లేక సరుకును కోల్డ్స్టోజీల్లో ఉంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతు పరిస్థితి కూడా దారుణంగా ఉందని, మా ప్రభుత్వ హయాంలో ధరలు తగ్గకుండా చూశామన్నారు. రైతులకు ఈ ప్రభుత్వం ఉచిత బీమా పథకాన్ని తీసేసిందని ఆరోపించారు. మిర్చి రైతులను సైతం ముంచేశారన్నారు. చంద్రబాబు పాలన అంతా విధ్వంసమేనని విమర్శించారు. డెత్ సర్టిఫికెట్ పొందాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రెవెన్యూ విభాగం అవినీతి మయమైందన్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేయడం లేదన్నారు. ఇదేనా సుపరిపాలనా అని ఆయన నిలదీశారు. వెలిగొండ ఫీడర్ కాలువ శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా మార్కాపురంలో నిర్వహించిన సభలో ‘‘తమ్ముళ్లూ నేను ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేస్తానా? ఆడిన మాట తప్పుతానా? అబద్దాలు ఆడతానా’’ అని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబని ఆయన ఎద్దేవా చేశారు. మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలు నేడు అమలు అవుతుంటే వాటిని మీ ఖాతాల్లో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కళాశాలను కట్టడం మీకు చేతనైందా అని ఆయన ప్రశ్నించారు.ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రై వేటుకు అప్పగించడం సరికాదన్నారు.విలువైన ప్రభుత్వ స్థలాలను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కారుచవగ్గా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. తిరుమల లడ్డూపై రాజకీయాలా..? భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో రాజకీయాలు, అసత్య ప్రచారాలు చేస్తోందని చుండూరి మండిపడ్డారు. దేవుడి ప్రసాదాన్ని అప్రతిష్టపాలు చేశారన్నారు. జగన్ హయాంలో దేశం నలుమూలల టీటీడీ ఆధ్వర్యంలో గుడులు కట్టారని, దళితవాడల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించారని గుర్తు చేశారు. మీరు మాత్రం బోలేబాబాలతో మిలాఖత్ అయి నెయ్యి విషయంలో మోసం చేస్తున్నారని ఆరోపించారు. స్వామి అంటే మీకు భక్తిలేదని ధ్వజమెత్తారు. పవన్ కషాయ వస్త్రాలు వేసి సనాతన ధర్మం పేరుతో డ్రామాలు ఆడారని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లీలలపై ఎందుకు పవన్ స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ నాయుడు సైతం తగ్గేదేలే అన్నారు. దేవుడి దగ్గర ఉన్నానన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ బలోపేతం.. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సహకారంతో నియోజకవర్గంలో కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని చుండూరి రవిబాబు తెలిపారు. మెప్మా అవినీతి వెలుగులోకి వచ్చి మూడు నెలలైందని, అప్పటి జేసీ చేసిన విచారణ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్ నగర్ బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి మీద చేసిన జనసేన నాయకుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన్ను జైలులో వేస్తే సంతోషిస్తాను అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. బొమ్మినేని మురళిని దామచర్ల జనార్దన్ అనుచరుడు రాము కొట్టాడనీ, కేసులు కట్టారనీ, ఎవరివీ అరెస్ట్లు లేవన్నారు. రిమ్స్ ఆస్పత్రి వద్ద, వెంగముక్కలపాలెం వద్ద కొట్లాటలు జరిగాయన్నారు. మొత్తం 94 మంది మీద కేసులు పెట్టారన్నారు. చార్జిషీట్లో దామచర్ల, బాలినేని, ప్రణీత్, మధు, మాల్యాద్రి, పేర్లు తీసేశారని, మిగిలిన 94 మంది మీకోసం జైలుకు వెళ్లాలా అని ప్రశ్నించారు. మీ ఇద్దరు ఒకటీ మేము ఒకటా అన్నారు. అన్ని సమస్యల మీద వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పోరాడుతున్నామన్నారు. 5 వేల మంది పార్టీలో పనిచేయడానికి ముందుకు వచ్చారన్నారు. మా పాలనలో ట్రాక్టరు ఇసుక రూ.3 వేలు అయితే ఇప్పుడు ట్రాక్టరు రూ.5 వేలు అని, డబ్బంతా ఎటు పోతోందని విమర్శించారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్, కార్పొరేటర్ ఇమ్రాన్ఖాన్, వైఎస్సార్ సీపీ నాయకులు గౌతమ్ అశోక్, రొండా అంజిరెడ్డి, సీఎం వెంకటేశ్వరరెడ్డి, పల్నాటి రవీంద్రారెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, పేరం ప్రసన్న, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు
ఒంగోలు టౌన్: వేసవి ప్రభావంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయని, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరమని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు చెప్పారు. అగ్నిమాపకదళ సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఆస్పత్రులు, అపార్ట్మెంట్లలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. షార్ట్ సర్క్యూట్, గ్యాస్, ఏసీ మెషిన్లు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలను వివరించారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బట్టి నీరు, ఫోమ్, సీఓ2, పౌడర్లను ఉపయోగించే విధానాలను తెలిపారు. జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ అద్దెయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై ఆస్పత్రి సిబ్బందికి దశలవారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. విద్యుత్ పరికరాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ తిరుపతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సీఎస్ఆర్ఎంఓ మాధవీలత, అసిస్టెంట్ డైరక్టర్ అనిల్ రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎం.విజయలలిత, సెక్యూరిటీ, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. -
పదిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
బేస్తవారిపేట: పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ గీత అన్నారు. స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్, పాపాయిపల్లె ప్రాథమిక పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల విద్యార్థులను గణితంపై ప్రశ్నలు అడిగారు. ప్రాథమిక పాఠశాల దశలోనే విద్యార్థులు టేబుల్స్ 20 వరకు, 5 వేల వరకు అంకెలు, చదవడం, రాయడం చక్కగా నేర్చుకోవాలన్నారు. చిన్నారులతో బోర్డుపై గణితంపై పలు ప్రశ్నలడిగి సమాధానాలు రాయించారు. బోర్డ్పై అంకెలను రాసి ఎలా నేర్చుకోవాలో విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎంఈఓలు ఎన్ మధుసూదన్రెడ్డి, చేగిరెడ్డి రమణారెడ్డి, హైస్కూల్ హెచ్ఎం ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
దళితుల సమస్యలపై కేవీపీఎస్ ఇంటింటి సర్వే
ఒంగోలు టౌన్: దళితులు ఎదుర్కొంటున్న పలు దైనిందిన సమస్యలపై కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించి రాబోయే రోజుల్లో ప్రతిఘటన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ రఘురాం తెలిపారు. స్థానిక ఎల్బీజీ భవనంలో గురువారం కేవీపీఎస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జువ్వాజి రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం, వివిధ రూపాల్లో కొనసాగుతున్న కులవివక్ష, శ్మశానాలకు సంబంధించిన సమస్యలపై దళిత వాడల్లో అధ్యయనం నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వే అంశాలపై దళితులను చైతన్యం చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తామన్నారు. దళితుల సమస్యలపై గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతిఘటనా పోరాటాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి సమస్యల సుడిగుండంలోనే దళితులు జీవితాలను గడుపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దళితుల సమస్యల పట్ల చూపుతున్న నిర్లక్ష్యంపై పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అట్లూరి రాఘవులు, వి.మోజేష్, పరదేశి రాజశేఖర్, దిడ్ల నారాయణ, కొలనీడి నరేష్, కాకుమాను సుబ్బారావు, మెడిబలిమి ప్రసాద్, జువ్విగుంట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలనపై దృష్టి
● కలెక్టర్ పి.రాజాబాబు ఒంగోలు సిటీ: పేదరిక నిర్మూలనకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ), జీరో పావర్టీ (పీ–4)పై మరింత దృష్టి పెట్టాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ విజనరీ ప్లానింగ్ సభ్యులతో గురువారం పీజీఆర్ఎస్ హాల్లో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ అధికారుల వ్యక్తిగత పనితీరుకు వివిధ అంశాల్లో సాధించిన పురోగతిని తెలిపే కేపీఐ ప్రతిబింబాలుగా ఉంటాయన్నారు. ప్రతినెలా పదో తేదీతో డేటా ఎంట్రీ ఫ్రీజ్ అవుతుందని, వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో రూపొందించిన విజన్ యాక్షన్ ప్లాన్ను జిల్లా స్థాయి ప్రణాళికతో సమన్వయం చేస్తూ అమలు చేసేలా అధికారులు పనిచేయాలన్నారు. ‘బంగారు కుటుంబా’ల అవసరాలను గుర్తించి వాటికి అండగా నిలిచేలా ‘మార్గదర్శు’లను అనుసంధానం చేయాలన్నారు. సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ డి.హిమవంశీ, సీపీఓ సుధాకర్ రెడ్డి, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
వేలం మార్చిపోయారా!
పొగాకు రైతు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. రెండేళ్లుగా కనీస మద్దతు ధర లభించక ఆర్థికంగా కుదేలయ్యాడు. కొనుగోళ్లు సరిగ్గా లేక, నాణ్యత పేరుతో తక్కువ ధర నిర్ణయిస్తూ కంపెనీలు మోసం చేయడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తక్కువ ధరకు తెగనమ్ముకోలేని రైతులు పొగాకును కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరుచుకున్నారు. ఈసారైనా కష్టాలు తీరుతాయని ఆశలు పెంచుకున్నారు. అయితే ఇప్పటి వరకూ వేలం కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, బోర్డు అధికారులు సైతం ఏర్పాట్లు చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న వేలంలో ఆశించిన ధరలు రాకపోవడం ఇక్కడి రైతుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో ప్రధాన పంట అయిన పొగాకు అమ్మకాల ప్రారంభంపై స్పష్టత రావడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో వేలం ఆలస్యం ఇక్కడి వేలం ప్రారంభంపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికీ కర్ణాటకలో వేలం పూర్తికాకపోవడంతో 2026–27 ఏడాదికి సంబంధించిన వేలాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ఒక నిర్ణయానికి బోర్డు అధికారులు రాలేకపోతున్నారు. జాప్యంతో నష్టం.. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా పొగాకు పంటను రైతులు ముందుగానే సాగు చేశారు. దీంతో ఇప్పటికే ఆకురెలుపు, క్యూరింగ్ జరిగి రైతుల వద్ద పొగాకు ఉత్పత్తులు అధికంగా నిల్వ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అయితే ఇప్పటికే పొగాకు బోర్డు పరిధిలోని 11 వేలం కేంద్రాల పరిధిలో పొగాకు వేలం ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. ప్రతి ఏడాది కర్ణాటక రాష్ట్రంలో వేలం ప్రక్రియ ముగిసిన తరువాత ఇక్కడ వేలం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది కర్ణాటకలో వేలం ప్రక్రియ దాదాపు రెండు వారాల ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం కర్ణాటక వేలం కొనసాగుతోంది. దీంతో ఇక్కడ ప్రారంభం కావాల్సిన వేలం ప్రక్రియ ఆలస్యమవుతోంది. అదే గతేడాది మార్చి 10వ తేదీ నాటికే జిల్లాలోని పలు వేలం కేంద్రాల్లో వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది ఇప్పటికీ బోర్డు అధికారులు ఓ స్పష్టతకు రావడం లేదు. ఇటీవల జరిగిన బోర్డు అధికారుల సమావేశంలో మార్చి నెలాఖరు నుంచి వేలం ప్రారంభించాలని భావించినా దానిపై కూడా అధికారికంగా ఓ నిర్ణయానికి రాలేదు. వేలం కేంద్రాల వారీగా రైతుల అభిప్రాయాలు తీసుకొని వేలం ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే వేలం ప్రక్రియ జాప్యం జరిగితే రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పెరుగుతున్న ఎండల దృష్ట్యా వాటి నాణ్యత దెబ్బతింటుందనే ఆందోళన రైతుల్లో ఉంది. ఆశలు రేకెత్తిస్తున్న నాణ్యత ఒంగోలు పొగాకు రీజినల్ పొగాకు బోర్డు పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో దాదాపు 85 వేల హెక్టార్లలో ఈ ఏడాది పొగాకు పంటను సాగైంది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈ ఏడాది పొగాకు పంట నాణ్యత బాగుంది. క్యూరింగ్లో అధికంగా దాదాపు 60 శాతానికి పైగా బ్రైట్ గ్రేడ్ రకం పొగాకు ఉత్పత్తులు రావడం రైతుల్లో ఆశలు పెంచుతోంది. రెండేళ్ల నుంచి రైతులకు సరైన ధరలు రావడం లేదు. దీంతో రైతులు నష్టాలను మూటగట్టుకున్నారు. కనీసం ఈ ఏడాదైనా మద్దతు ధరలు ఇచ్చి ఆదుకోవాలని రైతుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. కర్ణాటక ప్రభావం ఎంత... కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న పొగాకు వేలంలో ఆశించిన మేర ధరలు రాకపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగించే అంశం. మొదట్లో బ్రైట్గ్రేడ్ రకం పొగాకు కేజీకి రూ.320లకు ధరలు ఇచ్చి వ్యాపారులు తరువాత దాన్ని రూ.280లకు తగ్గించి ప్రస్తుతం రూ.300ల వరకు ఇస్తున్నారు. ఈ ప్రభావం ఇక్కడి మార్కెట్ ఎంత ఉంటుందనే చర్చలు నడుస్తున్నాయి. ఇక్కడ ప్రారంభమయ్యే వేలం కూడా ఇదే రకమైన రేట్లు ఉంటే మరోసారి నష్టాలు తప్పవనే అభిప్రాయం రైతుల్లో ఉంది. నేడు బోర్డు మీటింగ్ పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభంపై నేడు గుంటూరులో పొగాకు బోర్డు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పొగాకు వేలం ప్రారంభంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి నెలాఖరుకు ప్రారంభించాలా లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించాలా అన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో వేలం ముగియనందునే ఇక్కడ ఆలస్యమవుతుందని, అక్కడి వేలం ముగిసి వ్యాపారులు వస్తేనే వేలం ప్రారంభించాలనే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వేలం ప్రారంభంపై నేడు జరిగే బోర్డు మీటింగ్ కీలకం కానుంది.కోల్డ్ స్టోరేజ్ల్లో భారీగా నిల్వలు ఇప్పటికే క్యూరింగ్ పూర్తి అవడంతో రైతుల వద్ద భారీగా పొగాకు ఉత్పత్తులు నిల్వ ఉన్నాయి. దీంతో వీటి నాణ్యత దెబ్బతినకుండా కోల్డ్స్టోరేజ్ల్లో నిల్వ చేస్తున్నారు. బోర్డు నిర్ణయించిన దాని ప్రకారం 11 వేలం కేంద్రాల పరిధిలో 90.20 మిలియన్ కేజీలు మాత్రమే విక్రయించాల్సి ఉంది. దాదాపు 130 మిలియన్ కేజీల వరకు ఉత్పత్తి ఉండవచ్చని బోర్డు అధికారులు భావిస్తున్నారు. అంటే దాదాపు నవంబర్, డిసెంబర్ వరకు వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘకాలం వేలం జరిగే అవకాశం ఉన్నందున నాణ్యత దెబ్బతినకుండా, మార్కెట్కు అనుగుణంగా అమ్ముకోవచ్చనే అభిప్రాయంతో రైతులు కోల్డ్స్టోరేజ్ల్లో అధికంగా పొగాకును నిల్వ చేసుకుంటున్నారు. -
వైఎస్సార్ సీపీ నేతలపై ఎస్సై దురుసు ప్రవర్తన
పొన్నలూరు: శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన పోలీసులే అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తుండడంతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి సంఘటన పొన్నలూరు మండలం ఉప్పలదిన్నెలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు... ఉప్పలదిన్నె గ్రామం సర్వే నంబర్ 54/1లో కుంట పోరంబోకు భూమి ఉంది. ఈ భూమి ఉప్పలదిన్నెకి కిలోమీటర్ ముందు రోడ్డు పక్కనే గ్రామానికి ప్రారంభంలో చిన్న జంక్షన్లా ఉంటుంది. ఇక్కడి నుంచి రావులకొల్లు, వేంపాడు తదితర గ్రామాలకు వెళ్లేందుకు రోడ్లు ఉంటాయి. ఉప్పలదిన్నె, వేంపాడు గ్రామస్తులు కూడా ఈ జంక్షన్ నుంచి ఆటోలు, ఇతర వాహనాలు ఎక్కి పొన్నలూరు, కందుకూరు ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. దీంతో గతంలో దాతలు ఈ జంక్షన్లో బస్ షెల్టర్ నిర్మించగా, ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 15 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ జంక్షన్లో ప్రయాణికులు, బాటసారులు కూర్చోవడానికి గ్రామ ఉప సర్పంచ్ కట్టా కరుణాకర్ రూ.10 వేలు వెచ్చించి రెండు బల్లలు ఏర్పాటు చేశారు. ఇది మింగుడు పడని స్థానిక టీడీపీ నాయకుడు గత శుక్రవారం పంచాయతీ కార్యదర్శిని పురమాయించి బల్లలను తొలగించి పక్కన పడేశారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ మన్నెం పద్మ, ఉప సర్పంచ్ కట్టా కరుణాకర్, మన్నెం చిన్న వెంకటేశ్వర్లు, గ్రామస్తులు కార్యదర్శిని ప్రశ్నించగా... తనపై ఒత్తిడి ఉండటం వల్ల అలా చేయాల్సి వచ్చిందంటూ సమాధానమిచ్చాడు. మరోసారి అడ్డుకున్న పోలీసులు... ఈ నేపథ్యంలో బుధవారం మరోసారి ఉప సర్పంచ్ కట్టా కరుణాకర్, సర్పంచ్ భర్త మన్నెం చిన్న వెంకటేశ్వర్లు, గ్రామస్తులు బల్లలను ఏర్పాటు చేయడానికి జంక్షన్కు వెళ్లారు. సిమెంట్ బల్లలు ఏర్పాటు చేసిన తర్వాత... ఎస్సై సత్యనారాయణతో స్థానిక టీడీపీ నాయకుడు మాట్లాడి వారి మీదకు ఉసిగొల్పాడు. దీంతో టీడీపీ నాయకుడు చెప్పిందే తడవుగా ఎస్సై రంగప్రవేశం చేసి సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయడానికి వీలు లేదంటూ వైఎస్సార్ సీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ప్రాంతంలో బల్లలు ఏర్పాటు చేయడం వల్ల ఎవరికీ అభ్యంతరం ఉండదని, ప్రయాణికులు, బాటసారులకు ఉపయోగపడతాయిని చెప్పినప్పటికీ ఎస్సై దురుసుగా ప్రవర్తించి... నాయకులపై చెయ్యి వేస్తూ పోలీస్ స్టేషన్కు పదండంటూ ఓవరాక్షన్ చేశాడు. బల్లలు తొలగించకపోతే కేసులు పెడతామని బెదిరించాడు. పోలీసుల తీరును ప్రశ్నించిన స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ వెంకటేశ్వర్లు పట్ల కూడా ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. జెడ్పీటీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీపు ఎక్కు.. పోలీస్ స్టేషన్కు నడువంటూ హూంకరించాడు. ఎస్సై ఓవరాక్షన్తో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరడంతో కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నాయకుడు చెప్పాడంటూ ఎస్సై దురుసుగా ప్రవర్తించడం ఏమిటంటూ గ్రామస్తులు నిలదీశారు. మొత్తంగా బల్లలు ఏర్పాటుపై టీడీపీ నాయకుడు, పోలీసుల తీరు వల్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
రోడ్డు ప్రమాదంలో గిరిజన యువకుడి మృతి
పెద్దదోర్నాల: రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ వృద్ధుడిని ఢీకొన్న మోటారుసైకిల్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మోటార్సైకిల్పై ప్రయాణిస్తున్న గిరిజన యువకుడు పులిచర్ల బయ్యన్న (20) మృతి చెందగా రోడ్డుపై నడిచి వెళ్తున్న మద్దయ్యతో పాటు బైక్పై ఉన్న సానికొమ్ము కార్తీక్రెడ్డి, ఉడుతల భరత్లు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక యువకులు మోసుకుంటూ వైద్యశాలకు తరలించగా వైద్యశాలలో చికిత్స పొందుతూ పులిచర్ల బయ్యన్న మృతి చెందాడు. గాయపడిన వృద్ధుడు మద్దయ్య, కార్తీక్రెడ్డిలను నరసరావుపేటకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
కొనుగోలు కేంద్రాలు ఉపయోగించుకోండి
● జేసీ శ్రీనివాసులు మార్కాపురం: కందులు, శనగల కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు సూచించారు. మార్కాపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందులు, శనగల కొనుగోలు కేంద్రాలను ఆయన ఏడీఏ బాలాజీ నాయక్తో కలిసి పరిశీలించి మాట్లాడుతూ దళారులకు అమ్మి రైతులు నష్టపోవద్దని తెలిపారు. కందుల్లో 12 శాతం, శనగలు 14 శాతం తేమ ఉంటే మంచి ధర లభిస్తుందని ఏడీఏ బాలాజీ నాయక్ తెలిపారు. అనంతరం జేసీ రికార్డులను, రైతుల నుంచి కొనుగోలు చేసిన కందులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మార్కాపురం, పెద్దారవీడు ఏఓలు బుజ్జీబాయి, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
న్యాయం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటాం..
ఒంగోలు టౌన్: ‘‘మేము 17 ఏళ్లుగా కార్మిక నగర్లో కాపురం ఉంటున్నాం. 2016లో మాకు పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. కొంతమంది 2018లో కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి అయితేనే మాకు పట్టాలు ఇవ్వండి, ప్రైవేటు భూమి అయితే మేమే దండం పెట్టి వెళ్లిపోతామని చెబుతున్నాం. అయినా వినకుండా గత నెల 4వ తేదీ కొందరు వ్యక్తులు వచ్చి దౌర్జన్యంగా మా ఇళ్లను రాత్రికి రాత్రి పడ గొట్టారు. 200 మంది ప్రైవేటు వ్యక్తులు, మూడు జేసీబీలు తీసుకొచ్చి విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు పోలీసులతో వచ్చి బలవంతంగా ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇది అన్యాయం..మాకు న్యాయం చేయకపోతే మేము పెట్రోలు పోసుకొని తగలబెట్టుకొని చనిపోతాం. మా చావుకు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పాలకులు, అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని’’ కార్మిక నగర్ బాధితురాలు చెరుకూరి లక్ష్మి చెప్పారు. కార్మిక నగర్లో నిరుపేదల గృహాలను కూల్చిన ప్రైవేటు వ్యక్తులు బుధవారం పోలీసులతో వచ్చారు. కూల్చివేసిన నివాసాల వద్ద ఉంటున్న బాధితులను స్థలంలోంచి బయటకు రావాలని హెచ్చరించారు. స్థానికులు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా స్థలం చుట్టూ బలవంతంగా ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న మహిళలు అడ్డుకున్నారు. ఫెన్సింగ్ వేయడం ఆపకపోతే పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళనకు దిగారు. దాంతో వెంటనే మరికొంతమంది పోలీసులు రంగంలోకి దిగారు. స్థలాలు ఖాళీ చేయించారు. దీంతో బాధితులు పోలీసులతో వాదనకు దిగారు. మాకు నోటీసులు ఇవ్వకుండా ఎలా ఫెన్సింగు వేస్తారని బాధిత మహిళలు ప్రశ్నించారు. అప్పటికప్పుడు గత 14వ తేదీ నోటీసులు ఇచ్చినట్లు రెవెన్యూ సిబ్బంది ఒకరు మొబైల్ ఫోన్లో మెసేజ్ సృష్టించినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆర్డీఓ జారీ చేసినట్లు చెబుతున్న ఉత్తర్వులను తీసుకోవాల్సిందిగా బాధితుల మీద పోలీసులు ఒత్తిడి చేశారు. ఉత్తర్వులు తీసుకోని బాధితుల మీద కేసులు పెడతామని బెదిరించారు. ఇది జరుగుతున్న సమయంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, లీగల్ సెల్ నాయకులు హరిబాబు, జయచంద్ర నాయక్, శేషాద్రి రెడ్డిలతో కలిసి అక్కడకు చేరుకున్నారు. బాధితుల కుటుంబాలతో మాట్లాడి సమస్యను జిల్లా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళతామని భరోసా ఇచ్చారు. ఒకవైపు రవిబాబు మాట్లాడుతుండగానే మరోవైపు పోలీసులు దగ్గరుండి మరీ ఫెన్సింగ్ వేయించారు. ఇది గమనించిన రవిబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు కానీ, నగర పాలక సంస్థ అధికారులు కానీ లేకుండా ఫెన్సింగ్ ఎలా వేస్తున్నారని రవిబాబు ప్రశ్నించినా సమాధానం లేదు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఫెన్సింగ్ వేయడం గమనార్హం. దీంతో బాధితులంతా రాత్రంతా రోడ్డు మీదనే గడిపారు. చిన్నపిల్లలతో కలిసి రోడ్డు పక్కనే భోజనాలు వండుకొన్నారు. ప్రైవేటు స్థలం అయితే మేమే వెళ్లిపోతాం... కార్మిక నగర్ స్థలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బాధిత మహిళ చెరుకూరి లక్ష్మి ఆరోపించారు. ఇప్పటికే ఈ స్థలం విషయంలో కోర్టుకు వెళ్లామని, కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓలకు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. స్థలం ఎవరిదో తేల్చాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రైవేటు స్థలం అయితే మేమే వెళ్లిపోతామని చెప్పినా స్థలాన్ని ఎందుకు సర్వే చేయడం లేదని ప్రశ్నించారు. దౌర్జన్యంగా, అక్రమంగా మా నివాసాలను కూల్చివేసిన వారికి అధికారులు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. మరో బాధితురాలు కామేపల్లి సీతమ్మ మాట్లాడుతూ కార్మిక నగర్ పేదలపై దౌర్జన్యం చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం పోయిందని చెప్పారు. బాధితులతో మాట్లాడుతున్న చుండూరి రవిబాబు -
శునక విశ్వాసం
ఒంగోలు వన్టౌన్: ప్రస్తుత సమాజంలో మానవత్వం లేని మనుషుల కంటే మూగజీవాలే నయం అని నిరూపించే ఘటన వెలుగు చూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న పెంపుడు కుక్కకు ఓ వీధి కుక్క రక్తం దానం చేసి సాటి మూగజీవి ప్రాణం కాపాడింది. మనుషుల హృదయాలను కదలించే ఈ ఘటన బుధవారం ఒంగోలులో వెలుగు చూసింది. ఒంగోలులోని అంజయ్య రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన ఇంట్లో రూబీ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. అది అనారోగ్యం బారిన పడడంతో అతను పశువైద్యులను సంప్రదించాడు. వారు కుక్కను పరిశీలించి రక్తం ఎక్కించాలని చెప్పడంతో రూబీ యజమాని సేవ్ ది యానిమల్స్ ఫౌండేషన్ నిర్వాహకురాలు తాటిపర్తి దివ్యను సంప్రదించాడు. ఇటీవల ప్రమాదంలో గాయపడి సేవ్ ది యానిమల్స్ ఫౌండేషన్లో కోలుకున్న వీధి శునకం రక్తాన్ని సేకరించారు. ఒంగోలు పశువైద్యశాలలో డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఎన్ జగత్ శ్రీనివాస్ పర్యవేక్షణలో పశువైద్యులు 3 గంటలు శ్రమించి రక్తం రూబీకి ఎక్కించారు. -
సేవలకు పరీక్ష
అద్దంకి: వ్యవసాయం దండగ కాకుండా పండుగలాగా సాగాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రైతులు, పశుపోషకులు, ఆక్వా రైతుల కోసం ఇంటిగ్రేడెట్ అగ్రి ల్యాబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 10 ల్యాబ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిర్మాణాలు ప్రారంభించగా అందులో 8 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో ల్యాబ్కు రూ.62.70 లక్షలు కేటాయించింది. యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి, కందుకూరు, సింగరాయకొండ, సంతనూతలపాడు, గిద్దలూరు, అద్దంకిలలో ల్యాబ్లు వినియోగంలోకి వచ్చాయి. సింగరాయకొండలో మాత్రం వ్యవసాయ, పశుసంవర్ధక, ఆక్వా కలిపి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సిబ్బంది కొరత సాకుగా చూపి అగ్రి, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ల నిర్వీర్యానికి కుట్రలు చేస్తోంది. ఇందులో పనిచేస్తున్న వ్యవసాయశాఖకు చెందిన సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. దీంతో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం కందుకూరు, దర్శి, గిద్దలూరులోని అగ్రి ల్యాబ్ల్లో అరకొరగా సేవలందుతున్నాయి. సింగరాయకొండ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లో కేవలం ఆక్వా రైతులకు మాత్రమే మొక్కుబడిగా సేవలందుతున్నాయి. ఉపయోగాలు ఇవీ.. ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తే రైతు సొంతంగా తయారు చేసుకున్న విత్తనం లేదా, కొనుగోలు చేసిన విత్తనాన్ని తీసుకెళ్లి ఉచితంగా మొలక పరీక్ష చేయించుకోవచ్చు. ఎరువుల నాణ్యతను తెలుసుకోవచ్చు. విత్తన పరీక్ష నివేదికను వారం నుంచి పది రోజుల్లోపు పొందవచ్చు. ఎరువుల నాణ్యతను రెండు మూడు రోజుల్లోనే పొందవచ్చు. రైతులకు అన్ని పరీక్షలు పూర్తిగా ఉచితం. ప్రతి ల్యాబ్లో ఆటోమేషన్ నమూనాల పరీక్ష కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ క్వాలిటీ కంట్రోల్ యాప్ (ఇన్సైట్) అభివృద్ధి చేశారు. ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి లేబరేటరీలో ఆటోమేషన్ ఏర్పాటు చేశారు. టెస్టింగ్ చేసిన ప్రతీ ఒక్కటి రికార్డు కావడంతోపాటు ఫలితాలు ఆటోమేటిగ్గా సిస్టంలో నమోదవుతాయి. ఏ ల్యాబ్ లో ఏ బ్యాచ్ శాంపిల్ ఏ సమయంలో పరీక్షించారో నిర్ధారిస్తూ ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా ఈ టెక్నాలజీ నమోదు చేస్తుంది. రైతు షాపుకెళ్లినప్పుడు బ్యాచ్ నంబర్ చెక్ చేసుకుంటే చాలు నాణ్యతా సర్టిఫికెట్ ఉందో లేదో తెలిసిపోతుంది. శాంపిల్ టెస్టింగ్ జరిగిందో లేదో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. నిధులు లేవు..భద్రత లేదు భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ భవనం కిటికీలకు అద్దాలు మాత్రమే బిగించారు. గ్రిల్స్ ఏర్పాటు చేయలేదు. దాంతో అందులో విలువైన పరికరాలు ఉంచితే భద్రత ముప్పు ఏర్పడుతుందని పరికరాలు బిగించలేదు. కెమికల్స్ ఇవ్వలేదు. – ఏడీఏ ఎఫ్రాయిమ్ నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతులు అద్దంకి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఏర్పాటుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో ల్యాబ్ నిర్మాణానికి రూ.62.70 లక్షలు కేటాయించింది. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో భవనాన్ని నిర్మించి నియోజకవర్గ స్థాయిలో ప్రయోగశాలలను అందుబాటులోకి తెచ్చింది. ఒక వైపు భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టరు ఆ భవనానికి ఏర్పాటు చేసిన కిటికీలకు అద్దాలు మాత్రమే పెట్టి గ్రిల్స్ ఏర్పాటు చేయలేదు. దీనిని గత ప్రభుత్వం హయాంలోనే ప్రారంభించినా అన్ సెక్యూరిటీతో(భద్రత) అధికారులు పరికరాలను అందులో ఉంచలేదు. ఫలితంగా ప్రయోగశాల ఉపయోగంలోకి రాలేదు. విత్తనాల మొలక, మందుల నాణ్యత పరీక్షించే అవకాశం లేక నియోజకవర్గంలోని జే పంగులూరు, ఇతర మండలాల్లో నకిలీ విత్తనాలను రైతులు వాడి నష్టపోతున్నారు. అయితే ఇక్కడ వెటర్నరీ ల్యాబ్లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన
కొనకనమిట్ల: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే రోజులు దగ్గర పడుతున్నాయని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, ఉడుముల శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మునగపాడులో చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా సోమవారం రాత్రి గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై వారు మాట్లాడారు. చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం కోసం తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానని మాయ మాటలతో గద్దెనెక్కిన చంద్రబాబు అవేమీ అమలు చేయకుండా మరోమారు ప్రజలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. గత జగనన్న పాలన సంక్షేమ పథకాలతో అభివృద్ధి పరుగులు పెడుతూ ప్రతిరోజూ పండగలాగే ఉండేదని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిసలు కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి మనమందరం అండగా ఉండి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య అన్నా, ఉడుముల పిలపునిచ్చారు. విద్యుత్ ప్రభ ఏర్పాటు చేసిన మునగపాడు సర్పంచ్ పార్లపల్లి సిద్దానభి, పార్టీ నాయకులు గర్రె శ్రీనివాసులు, బాలపిచ్చయ్య, చంద్రశేఖర్ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల పార్టీ కన్వీనర్ మోరా శంకర్రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ కామసాని వెంకటేశ్వరరెడ్డి, వెలిగండ్ల సర్పంచ్ పాతకోట వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్లు గర్రె కుసమ కుమారి శ్రీనివాసులు, భత్తుల రవియాదవ్ పార్టీ అనుబంద విభాగాల సభ్యులు ఏలూరి సంజీవరెడ్డి, పావులూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
లక్ష్యం మేరకు లబ్ధిదారులకు అందాలి
● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పేదల గృహ నిర్మాణాలకు నిర్దేశించిన లేఅవుట్స్లో అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత తొందరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్న లక్ష్యంతో ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో అగ్రహారం, యరజర్ల వద్ద లే అవుట్స్ను వేశారని, ఈ రెండు లేఅవుట్స్లో అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత తొందరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒంగోలు నగరంలో నిరుపయోగంగా, ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో పీపీపీ పద్ధతిలో నగర కార్పొరేషన్కు ఆదాయం వచ్చేలా షాప్స్, మాల్స్ నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమీక్షలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ మధుసూదన్ రావు, రిజిస్ట్రేషన్, సర్వే అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం: జనాభా లెక్కల సేకరణ సమగ్రంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు సిబ్బందిని ఆదేశించారు. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులోని జవహర్ నవోదయ కేంద్రియ విద్యాలయలో మంగళవారం జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఎస్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని జేసీ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటిస్తూ జనాభా లెక్కల సేకరణ త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమానికి కేటాయించిన అధికారులు సమగ్రంగా సర్వే నిర్వహించి లోటుపాట్లు లేకుండా పూర్తిచేయాలన్నారు. సెన్సెస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ దఫా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ చేపట్టాలన్నారు. మొదటి విడతలో ఇళ్లు, రెండో విడతలో జన, కుల గణన చేపడతామన్నారు. ప్రజలే తమ వివరాలను స్వయంగా ఇంటివద్ద నుంచే నమోదు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్ను తీసుకొచ్చామన్నారు. మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని, ఇక్కడ శిక్షణ పొందిన వారు మండల స్థాయిలో జనాభా లెక్కల ప్రక్రియలో పాల్గొన్న సిబ్బందికి వివరించాలన్నారు. మార్కాపురం జిల్లాలో మొత్తం 497 గ్రామాల్లో జనాభా లెక్కల సేకరణ చేయాల్సి ఉంటుందన్నారు. మే నెల 1 నుంచి 30 వ తేదీ వరకూ మొదటి విడత జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ డీసీహెచ్ ఓబులేస్, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు ప్రభాకర్, శివరామిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
హామీల అమలులో విఫలం
ఒంగోలు సిటీ: ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ కీర్తి అన్నారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బి.వెంకట్రావు, ఆర్. సంజీవ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా హామీలు నెరవేర్చకపోగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. హామీలన్నీ అమలు చేయకుంటే భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. పీఆర్సీ కమిటీ వేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలని, అరియర్స్ బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐఫియా కౌన్సిలర్ ఎం.రాఘవరావు మాట్లాడుతూ ఏపీటీఎఫ్ ప్రభుత్వం ముందుంచిన 20 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎన్.లక్ష్మీనారాయణ, టి.పాండురంగ స్వామి, ఐపీయూ కౌన్సిలరు పీవీ సుబ్బారావు, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.శ్రీనివాసులు, మాజీ ప్రధాన కార్యదర్శి బి.అశోక్కుమార్, జిల్లా గౌరవాధ్యక్షుడు ఏ.అమ్మయ్య, కబీర, సబ్ కమిటీ మెంబర్లు ఎం.సురేష్బాబు, కె.పెద్దన్న, గురులింగం, సి.సుబ్బారావు, టీఎల్ కాంతారావు, హరినాథ్ బాబు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.మహబూబ్ఖాన్, పండిత్ పరిషత్ నాయకులు సీహెచ్ కొండయ్య, సీనియర్ నాయకులు కె.వెంకటేశ్వర్లు, టి.వెంకటేశ్వర్లు, పి.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఏప్రిల్లో చలో సెక్రటేరియట్
మార్కాపురం: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్లో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ కార్యదర్శి ఓవీ వీరారెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన యూటీఎఫ్ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కే శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదని, ఇప్పటికే యూటీఎఫ్ రణభేరీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అయినా ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు. నాలుగు డీఏలు పెండింగులో ఉన్నాయని, 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయలేదన్నారు. హెల్త్కార్డుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. సమస్యలు పరిష్కరించలేని పక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని చెప్పారు. మార్చి 24న నియోజకవర్గ స్థాయిలో రిలే దీక్షలు, ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా స్థాయిలో రిలే దీక్షలను, ఏప్రిల్ 14 నుంచి 19 వరకూ రాష్ట్ర స్థాయి రిలే దీక్షలు, ఏప్రిల్ 28న చలో సెక్రటరీయట్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచే కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొనాలని సూచించారు. -
బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026
ప్రతి గ్రామంలో ఏజెంటు.. రేషన్ బియ్యం అక్రమ దందాకు ఒంగోలుకు చెందిన ముఠా గ్రామ గ్రామాన ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో రేషన్ మాఫియా ముఠా లారీ వచ్చినప్పుడు దగ్గరుండి.. రేషన్ షాపులకు తిప్పడంతో పాటు.. ఆ రేషన్ షాపులో ప్రతి నెలా ఎన్ని బస్తాలు మిగులుతాయి.. మాఫియా లారీలోకి ఎన్ని బస్తాల లోడ్ ఎక్కించాడు. ఏమైనా ఇతర వ్యాపారులకు అమ్ముతున్నాడా.. ఇవన్నీ గ్రామ బియ్యం ఏజెంట్లు పర్యవేక్షించాలి. ముందుగా ఏ షాపులో ఎంత స్టాక్ ఉందనేది చెప్పడంతో పాటు లారీ లోడ్ అయ్యాక.. మండల కేంద్రం దాటేంత వరకు పర్యవేక్షించాలి. దీనికి గాను ఆ ఏజెంట్లకు కేజీకి కొంత నగదు చెల్లింపు ఉంటుంది. అధికార పార్టీ నేతలు సంపద సృష్టిలో తలమునకలవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రేషన్ అక్రమ దందాకు అధికారిక రెక్కలు వచ్చాయి. రేషన్ షాపులను కూటమి నేతలు హస్తగతం చేసుకున్నాక రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు చేరాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి జేబులు నింపుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోంది. జోరుగా దందా.. అక్రమార్కులు ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీని కూడా అక్రమ మార్గానికి వాడుకుంటున్నారు. ప్రతి నెలా 26 నుంచి 31 తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, వికలాంగులు, బెడ్రిడెన్ పేషంట్లకు ఇంటికి పోయి నేరుగా కార్డు థంబ్ వేయించుకుని రేషన్ బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా మార్చుకుని.. రేషన్ డీలర్లు ముందుగానే సాధారణ రేషన్ కార్డుదారుల థంబ్ను కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది కార్డుదారులకు బియ్యం స్థానంలో ప్రతి కేజీకి రూ.10 నగదు చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఒక్క కనిగిరి మున్సిపల్ పరిధిలో బెడ్రిడెన్, దివ్యాంగుల రేషన్ కార్డులు 1,500 వరకు మాత్రమే ఉంటాయి. కానీ నెలాఖరు లోపు సుమారు 4 వేలకు పైగా రేషన్ కార్డులకు బియ్యం ఇచ్చినట్లు డీలర్లు నివేదికలు ఇస్తున్నారు.రేషన్ దందాకుకనిగిరిరూరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ వ్యవస్థ పూర్తిగా తెలుగు తమ్ముళ్ల చేతిలోకి వెళ్లిపోయింది. ఏదో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా అధికార పార్టీకి చెందిన వాళ్లే. ఎంతలా అంటే తహసీల్దార్ స్థాయి అధికారులను సైతం రేషన్ డీలర్లు బెదిరించే పరిస్థితి. అధికార పార్టీ నేతల హుకుం.. వ్యవస్థలోని లాలూచీ వారిని ఏమీ చేయలేని నిశ్చేష్టులుగా మార్చింది. గడిచిన 19 నెలలుగా అసలు రెవెన్యూ అధికారులు ఒక్క డీలర్ షాపును తనిఖీ చేసిన పరిస్థితి లేదంటే అతిశయోక్తి కాదు. రేషన్ డీలర్లపై అనేక ఫిర్యాదులు వస్తున్నా.. ఆర్డీఓ స్థాయి అధికారులు సైతం రేషన్ షాపుల గడప తొక్కలేదనే ఆరోపణలున్నాయి. పంపిణీకి ముందే దోపిడీ.. జిల్లాలో సుమారు 1392 రేషన్ దుకాణాలు ఉండగా.. సుమారు 6.37 లక్షల రేషన్కార్డులున్నాయి. జిల్లాలో ప్రతి నెలా 10,500 మెట్రిక్ టన్నులు బియ్యం వస్తుండగా.. అందులో 45 శాతం బియ్యం అక్రమ మార్గాన తరలుతోంది. కనిగిరి నియోజకవర్గంలోని 201 షాపుల్లో సుమారు 75 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. నియోజకవర్గంలోని కనిగిరి, పామూరు మండల కేంద్రాల్లో ఎఫ్సీఐ గోడౌన్ పాయింట్లు ఉన్నాయి. కనిగిరి ఎఫ్సీఐ గోడౌన్ పాయింట్ నుంచి 600 టన్నుల బియ్యం, అలాగే పామూరు పాయింట్ నుంచి మూడు మండలాల రేషన్ షాపులకు 530 టన్నుల పీడీఎస్ బియ్యం పరఫరా చేస్తుండగా.. వాటిలో సింహ భాగం రేషన్ మాఫియా చేతుల్లోకి వెళ్తోంది. కార్డుదారులతో ముందే థంబ్.. చాలా వరకు రేషన్ షాపుల్లో బియ్యానికి ముందే స్లిప్పులు ఇస్తున్నారు. ఒక కార్డుదారునికి 20 కేజీలు బియ్యం ఇవ్వాల్సి ఉంటే 10 కేజీలు మాత్రమే బియ్యం... మిగతా పది కేజీలకు కేజీ రూ.10 చొప్పున ముందే చెల్లిస్తున్నారు. అదేంటి మాకు మొత్తం బియ్యం కావాలని ఏవరైనా ప్రశ్నిస్తే.. బియ్యం పూర్తిగా రాలేదు అలా అయితే పూర్తిగా వచ్చినప్పుడు చెప్తాం.. అప్పుడు తీసుకో.. నీ థంబ్ సరిగా పడటం లేదు... తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లండనీ.. మీ అలాట్మెంట్ ఈ సారి మరో రేషన్ షాపునకు వచ్చిందని.. ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కొందరు దీనిపై ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నా డీలర్లంతా అధికార పార్టీ నేతలు కావడం, బియ్యం కార్డుదారులు ఎక్కువ మంది పేద వర్గాలకు చెందిన వారు కావడంతో జంకుతున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలియదనుకుంటే పొరపాటే. పూర్తిగా నిఘా వైఫల్యం.. గతంలో ప్రతి షాపు వద్ద నుంచి నెలాఖరులో లారీ ద్వారా ఎక్కించుకుని కనిగిరి నియోజకవర్గం మొత్తం నాలుగు రోజుల్లో బియ్యాన్ని వివిధ మార్గాల ద్వారా బయటకు తరలించే వారు. ఇటీవల కనిగిరి పట్టణంలో లారీని ప్రజా సంఘాల నాయకులు పట్టుకున్నారు. అందులో పలు రేషన్ షాపుల బియ్యంతో పాటు.. విద్యార్థుల బియ్యం కలిపి మొత్తం 235 బస్తాలు పట్టుబడ్డాయి. అవి ఏ పాఠశాల నుంచి లిఫ్ట్ చేశారనేది ఇప్పటి వరకు అధికారులు తేల్చలేదు. దీంతో రూటు మార్చిన రేషన్ మాఫియా.. వాహనాల ద్వారా ముందుగా ఒక పాయింట్లో మొత్తం సరుకును డంప్ చేసి.. అక్కడి నుంచి రాత్రికి రాత్రికి ఎత్తుతున్నట్లు తెలిసింది. అయితే డంపింగ్ పాయింట్లుగా ఒక చోట కాకుండా పల్లెలోని రేషన్ షాపులను, పట్టణంలోని రేషన్ షాపులను, గ్రామ శివారు ప్రాంతాల్లోని జన సంచారం లేని గృహాల వద్ద ఎంచుకుని దిగుమతి చేసుకుని రాత్రి వేళ తరలిస్తున్నారు. రైస్ మిల్లులకే సింహభాగం.. ప్రస్తుతం ఎక్కువ రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పొదిలి, కంభం, నెల్లూరు, గిద్దలూరు రైస్ మిల్లులకు.. తక్కువ శాతం మాత్రమే పోర్టుకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కార్డుదారుడి దగ్గర డీలర్ రూ.10కి కొనుగోలు చేస్తుండగా.. డీలర్ రేషన్ ముఠాకు రూ.16 నుంచి రూ.17కు విక్రయిస్తాడు. అక్కడి నుంచి అన్ని రకాల అమ్యామ్యాలు.. ఖర్చులు మొత్తం కలిపి రూ.25 వరకు పడుతుంది. రైస్ మిల్లర్ మాఫియా దగ్గర రూ.30 నుంచి రూ.35 వరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పోర్టుకు తరలించే రిస్క్ను తగ్గించుకుని రైస్ మిల్లర్లకే ఎక్కువగా సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రేషన్ అక్రమ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు కనీసం నిఘా పెట్టడం లేదు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే.. పట్టిస్తే.. కేసులు రాయడం తప్పా.. నిఘా పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అధికారిక రెక్కలువిజిలెన్స్ కమిటీ ఉన్నట్లా..లేనట్లా.. ? అసలు రెవెన్యూ అధికారులు ఉన్నారా.. విజిలెన్స్ కమిటీ పర్యవేక్షణ ఉందా.. అనేది ప్రశ్నార్థకం. ప్రతి నెలా, లేదా రెండు నెలలకొకసారి జరగాల్సిన విజిలెన్స్ కమిటీ (ఆహార సలహా సంఘం) సమావేశం ఎప్పుడు జరుగుతుందో...అనేది ఎవరికి తెలియని దుస్థితి. గడిచిన రెండేళ్లలో ప్రజా సంఘాల నేతలు పట్టుకున్న బియ్యం తప్పా.. అధికారులు ఒక్క బస్తా బియ్యం పట్టుకున్న దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. పట్టణ శివారు ప్రాంతాలకు వెళ్లి ఒక్కసారి కార్డుదారులను పలకరిస్తే.. డీలర్ల బాగోతం బట్టబయలవుతుంది. మేం ఏ బియ్యమూ పట్టుకోలేదు రేషన్ షాపుల తనిఖీలు నిర్వహిస్తున్నాం. విజిలెన్స్ కమిటీ సమావేశం జరుగుతుంది. గత రెండేళ్లల్లో ప్రజా సంఘాల నాయకులు పట్టుకున్న బియ్యం తప్పా.. మరేమీ పట్టుకోలేదు. అందులోని విద్యార్థుల బియ్యం 136 బస్తాలపై విచారణ కొనసాగుతోంది. – ఎన్ఫోర్స్మెంట్ డీటీ భూపతి -
కమనీయం లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం
● ఘనంగా కళ్యాణ గజోత్సవం మర్రిపూడి: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి కల్యాణం మంగళవారం రాత్రి కనులపండువగా సాగింది. వేదమంత్రాలు, భాజాభజంత్రీల నడుమ కల్యాణం నిర్వహించారు. అర్చకులు నారాయణం మారుతీ చార్యులు, నారాయణం శ్రీనివాసాచార్యులు, నారాయణం తిరుమలా చార్యులు, వేంకటసాయి చార్యులు కల్యాణ ఘట్ట్టాన్ని జరిపించారు. కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో కొండకు చేరుకున్నారు. ఆలయ ఆవరణలో భక్తులతో కిక్కిరిసింది. ఘనంగా గజోత్సవం శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఎదురుకోల ఉత్సవం, గజోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజ్యలక్ష్మీసహితుడైన నృసింహుని పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి ముందుగా ఎదురుకోల ఉత్సవం చేశారు. అనంతరం స్వామి ప్రతిమలను పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి పల్లకిపై ఉంచి ఆలయం చుట్టూ ఊరేగించారు. కుప్పం పెద కొల్లారావు, కుప్పం చిన కొల్లారావు, ప్రసాదు, సత్యన్నారాయణ, బీఎల్ఎన్ శాసీ్త్ర అన్నదమ్ములు, కుమారులు ఉభయదాతలుగా వ్యహరించారు. ఆలయాన్ని విద్యుత్దీపాలతో ప్రత్యేంగా అలంకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కల్యాణం తిలకిస్తున్న భక్తులు (ఇన్సెట్) కల్యాణం జరిపిస్తున్న వేదపండితులుపల్లకిపై లక్ష్మీ నృసింహ స్వామి ఊరేగింపు -
పెద ఉల్లగల్లులో భారీ చోరీ
ముండ్లమూరు: తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో భద్రపరిచిన 11 సవర్ల బంగారు ఆభరణాలు, అర కేజీ వెండి వస్తువులు, రూ.20 వేల నగదు అపహరించారు. ముండ్లమూరు మండలంలోని పెదఉల్లగల్లులో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ భారీ చోరీ వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సికాకొల్లి శంకరరావు తన భార్యాపిల్లలతో కలిసి సోమవారం రాత్రి 8 గంటలకు శింగరకొండ తిరునాళ్లకు వెళ్లారు. మంగళవారం వేకువజామున ఇంటికి చేరుకున్న శంకరరావు దంపతులు.. తలుపులు తెరిచి ఉండటంతో కంగుతిన్నారు. బీరువా తెరిచి ఉండటంతోపాటు దుస్తులు, వస్తువులు మంచంపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు లేకపోవడాన్ని గుర్తించి, వెంటనే ముండ్లమూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఒంగోలు క్లూస్ టీం సీఐ కె.రవీంద్రారెడ్డి, దర్శి సీఐతోపాటు ఎస్సై కమలాకర్ పరిశీలించి ఆధారాలు సేకరించారు. బంగారు నల్లపూసల దండ, ఫ్యాన్సీ పూసల దండ, గుండ్లు పుస్తెల దండ, చెవి కమ్మలు, ఒక జత చెంప సవరాలు, ఒక జత మాటీలు, ఒక జత చిన్న కమ్మలు, వెండి అరకిలో, రూ.20 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు శంకరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీ అయిన సొత్తు విలువ రూ.17 లక్షలు ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాలు తప్పించి చోరీ శంకరరావు ఇంట్లో ముందు వైపు కిరాణా షాపు, ఇంటి పక్కన ఆర్ఓ ప్లాంట్ నిర్వహిస్తుండటంతో భద్రత కోసం నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే దొంగలు ఇంటి వెనుక వైపున సీసీ కెమెరాను పైకి తిప్పి లోపలికి ప్రవేశించి, మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టారు. 11 సవర్ల బంగారు ఆభరణాలు, అర కేజీ వెండి, 20 వేల నగదు అపహరణ శింగరకొండ తిరునాళ్లకు వెళ్లి వచ్చేలోగా ఇల్లు లూటీ సీసీ కెమెరాలు ఉన్నా ఉపయోగపడని వైనం -
శింగరకొండ తిరునాళ్లలో టీడీపీ దుశ్చర్య
అద్దంకి రూరల్: శింగరకొండ తిరునాళ్లలో సోమవారం రాత్రి పచ్చ తమ్ముళ్లు దుశ్యర్యకు పాల్పడ్డారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభల వద్ద వైఎస్సార్ సీపీ జెండాలను తగలబెట్టి రాక్షసానందం పొందారు. ఈ దుశ్యర్య తాలూకూ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై వైఎస్సార్ సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల జరగడం ఇష్టం లేని పచ్చ తమ్ముళ్లు వైఎస్సార్ సీపీ జెండాలను తగలబెట్టడం ద్వారా తమ బలహీనతను బయటపెట్టుకున్నారని వైఎస్సార్ సీపీ అద్దంకి ఇన్చార్జి చింతలపూడి అశోక్కుమార్ పేర్కొన్నారు. జెండాలను తగలబెట్టడం పిరికి పంద చర్య అని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను రాజకీయంగా ఎదుర్కోలేక ద్వేషం, అసహనంతో దిగజారుడు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. పచ్చమూక దుశ్యర్యను సమర్థిస్తారా లేక ఖండిస్తారా అంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను ప్రశ్నించారు. జెండాలను తగలబెట్టినంత మాత్రాన పార్టీ శ్రేణుల ఆత్మగౌరవాన్ని, సంకల్పాన్ని దహనం చేయలేరన్నారు. జెండాలు కాల్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ జెండాకు నిప్పుపెట్టిన పచ్చ తమ్ముళ్లు పిరికిపందల చర్యగా పేర్కొన్న వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అశోక్కుమార్ -
ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ
కంభం: ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొన్న సంఘటన మంగళవారం తెల్లవారుజామున కంభంలో అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. కర్ణాటక నుంచి ఓ ట్రావెల్స్ బస్సు శ్రీశైలం వెళ్తున్న క్రమంలో కంభం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రావెల్స్ బస్సు అద్దాలు పగిలిపోయాయి. బస్సులో సుమారు 20 మంది వరకు ప్రయాణికులు ఉండగా.. పలువురి మోచేతులు, కాళ్లకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం శ్రీశైలం వెళ్తున్న మరో బస్సులో ఎక్కించి పంపించారు. పెను ప్రమాదం తప్పడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలాన్ని కంభం పోలీసులు పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీతోపాటు దెబ్బతిన్న ట్రావెల్స్ బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలోనూ ఇదే ఫ్లైఓవర్ పరిసరాల్లో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, నివారణకు హైవే అధికారులు, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు. ● ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు టంగుటూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని తూర్పునాయుడుపాలెం ఫ్లైఓవర్పై మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల వివరాల మేరకు..విజయవాడ నుంచి చైన్నె పని నిమిత్తం కారులో వెళుతుండగా తూర్పునాయుడుపాలెం ఫ్లైఓవర్ ఎక్కే సమయంలో సమయంలో ముందు వెళ్తున్న కట్టెల లోడు లారీ ఒక్కసారిగా నెమ్మదించడంతో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు వైపు కూర్చొని ఉన్న ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన షేక్ అబ్దుల్లా(27) అక్కడికక్కడే మృతి చెందగా దుర్గాప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. కారులోని చరణ్, సీతారామయ్య, షఫీలటు ఎటువంటి గాయాలు కాలేదు. ఎస్సై నాగమల్లేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కంభంలో అనంతపురం–అమరావతి హైవే రోడ్డుపై ప్రమాదం బస్సులో 20 మంది ప్రయాణికులు.. పలువురికి స్వల్పగాయాలు పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు ప్రథమ చికిత్స అనంతరం మరో బస్సులో శ్రీశైలం పయనం -
రెడ్డి జనాభ్యుదయ సంఘ సేవలు ప్రశంసనీయం
ఒంగోలు వన్టౌన్: ఒంగోలులోని రెడ్డి జనాభ్యుదయ సంఘం పేద విద్యార్థులకు చేస్తున్న సేవలు అమోఘమని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ ఆలూరుకు చెందిన గాదె శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మామిడిపాలెంలోని రెడ్డి హాస్టల్ను ఆయన మంగళవారం సందర్శించి హాస్టల్ యాజమాన్యంతో కలిసి హాస్టల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. విద్యార్థుల వసతి కోసం మూడవ అంతస్తు నిర్మాణాన్ని తన సొంత నిధులతో నిర్మిస్తామని చెప్పారు. భవన నిర్మాణానికి ఈ నెల 8న శంకుస్థాపన చేస్తామన్నారు. హాస్టల్లో చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డిని సంఘ అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి, కార్యదర్శి అన్నపురెడ్డి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో శేషి రెడ్డి, శంకర్రెడ్డి, నరసింహారెడ్డి, రామసుబ్బారెడ్డి, వెంకట్రామిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, యుగంధర్రెడ్డి, సుబ్బారెడ్డి, వినయ్కుమార్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శివ రామిరెడ్డి, వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తపట్నంలో చోరీ ● రూ.2.30 లక్షల విలువైన బంగారం, నగదు చోరీ కొత్తపట్నం: మండలంలో కొత్తపట్నంలో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన పురిణి సరోజినీ ఇంట్లో మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రిళ్లు తన తండ్రి రఘురాములు ఇంటికి వెళ్లి నిద్రిస్తున్నారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి ఉండగా బీరువా పగులగొట్టి ఉంది. అందులోని రూ.72 వేల నగదు, నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. దీంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వేలిముద్రలు సేకరించారు. ఎస్సై వేముల సుధాకర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● నాలుగు గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్ మార్కాపురం: తర్లుపాడు మండల పరిధిలోని కర్నూలు–ఒంగోలు హైవేపై తాడివారిపల్లి ఘాట్ రోడ్డులో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో క్రేన్ అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. పొదిలి వైపు నుంచి తాడివారిపల్లి వైపు వెళ్తున్న క్రేన్ అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పడటంతో సుమారు 4 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు, కార్లు ట్రాఫిక్లో చిక్కుకోవడంతో వాహనదారులంతా అవస్థలు పడ్డారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని క్రేన్ను పక్కకు తొలగించి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు. మార్కాపురం టౌన్: అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రీఫైనల్, ఈ నెల 15వ తేదీన ఫైనల్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,00,900 మందిని అక్షరాంధ్రలో నమోదు చేశామని, అభ్యాసకుల సంసిద్ధత కార్యక్రమంలో భాగంగా ప్రీఫైనల్ పరీక్ష నిర్వహిస్తున్నామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలు, శ్రమ శక్తి సంఘాల్లోని సీ్త్ర, పురుషులకు వలంటరీ టీచర్లతో గ్రామాల్లో శిక్షణ ఇచ్చినట్లు వయోజన విద్య జిల్లా డీడీ బి.జగన్మోహన్రావు తెలిపారు. -
ఈడ్చుకెళ్లడం అమానుషం
● అంగన్వాడీలు అరెస్టును ఖండించిన ప్రగతిశీల మహిళా సంఘం ఒంగోలు టౌన్: శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను మహిళలన్న విజ్ఞత లేకుండా అమానుషంగా ఈడ్చుకెళ్లడం దుర్మార్గమని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి ఖండించారు. న్యాయమైన హక్కుల సాధన కోసం ధర్నా చేస్తున్న అంగన్వాడీ యూనియన్ నాయకుల అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ స్థానిక ఎల్బీజీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ మహిళలన్న కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఽఅర్దరాత్రి ధర్నా శిబిరం వద్దకు వచ్చి లైట్లు ఆపేసి, టెంట్లు కూల్చేయడం, మేము ఉగ్రవాదులం కాదు, ఉద్యమకారులం అని చెబుతున్నా వినకుండా పురుష పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం, చివరికి వాష్ రూంలకు వెళ్లి వస్తామన్నా వినకుండా దురుసుగా వ్యవహరించడం కిరాతకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్నారని, వాగ్దానాలను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. నిరసనలో ఐద్వా నాయకులు జి.ఆదిలక్ష్మి, ఉమా మహేశ్వరి, కె.రాజేశ్వరి, జి.కళ్యాణి, బి.రంగమ్మ, జి.నాగేశ్వరమ్మ, ఎస్.జ్యోతి, వై.అంజనీదేవి పాల్గొన్నారు. -
రణభేరికి సన్నద్ధంకండి
ఒంగోలు సిటీ: యూటీఎఫ్ త్వరలో చేపట్టబోయే 3.ఓ రణభేరి కార్యక్రమానికి సన్నద్ధం కావాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై పిలుపునిచ్చారు. యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ వేయాలని, ఐఆర్ 29 శాతం ప్రకటించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు రూ.25 వేల కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ప్రకటించాలన్నారు. తక్షణమే సరెండర్ లీవ్ బకాయిలు, డీఏ బకాయిలు మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించి ఊరి బడిని కాపాడుకుందామని యూటీఎఫ్ స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టిందని సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రవి అన్నారు. ప్రకాశం జిల్లా శాఖ వివిధ మండల శాఖలకు మీ మండలంలోని అత్యధికంగా ఎన్రోల్మెంట్ విద్యార్థులను చేసిన వారికి ప్రత్యేకమైన బహుమతులు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు డీ వీరాంజనేయులు, జిల్లా సహాధ్యక్షుడు వై వెంకట్రావ్, సహాధ్యక్షురాలు జీ ఉమామహేశ్వరి, జిల్లా కోశాధికారి ఎన్ చిన్నస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పీ రాజ సులోచన, జే బాబురావు, జిల్లా కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి, ఎం సంధ్యారాణి, వైఎస్ఎన్ జ్యోతి, మీదిగ శీను, టీ రాజశేఖర్, పీ రామాంజనేయులు, ఎస్డీవీ ప్రసాద్, ఎం మాలకొండయ్య, జీ మధుసూదన్ రావు, పీ వలిఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతానికి ఒకరికి తీవ్ర గాయాలు
గాయపడిన నలబోలు కొండారెడ్డి సబ్స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న బంధువులు ● సబ్స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన పీసీపల్లి: విద్యుదాఘాతానికి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..జంగాలపల్లికి చెందిన నల్లబోలు కొండారెడ్డి చిన్నచిన్న విద్యుత్ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం విద్యుత్ అధికారులు ఎవరూ అందుబాటులోకి రాకపోవడంతో పీసీపల్లికి చెందిన నూకతోటి మాలకొండయ్య లైన్మన్ సులోమన్కు ఫోన్ చేశాడు. సులోమన్ ఎల్సీ ఇస్తాను, జంగాపల్లికి చెందిన కొండారెడ్డిని పిలిపించుకొని హెడ్ ఫీజు వేసుకొని సలహా ఇచ్చారు. ఆ తరువాత సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేషటర్ గోపాల్, లైన్మెన్ సులేమాన్, ప్రైవేట్ వ్యక్తి కొండారెడ్డి ముగ్గురు ఫోన్ లైన్లో ఉండి కొండారెడ్డిని స్తంభం ఎక్కమని చెప్పారు. అయితే ఎల్సీ ఇచ్చిన వెంటనే మళ్లీ మారెళ్ల ఫీడర్కు కరెంట్ ఇవ్వడంతో కొండారెడ్డికి విద్యుదాఘాతానికి గురై కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. కుడికాలు, కుడి చేయి, ఎడుమచేయికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో బంధువులు హుటాహుటిన పీసీపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. సబ్స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన అయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొండారెడ్డి విద్యుదాఘాతానికి గురయ్యాడని గ్రామస్తులు సబ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడ నుంచి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆందోళనలో రైతులు ఓబుల్ రెడ్డి, నాగిరెడ్డి, పెసల నరసింహారెడ్డి, కసిరెడ్డి మాలకొండయ్య, నలబోలు నారాయణ, నలబోలు కష్ణారెడ్డి, నలబోలు చిన్నపరెడ్డి, సాదు వెంకటేశ్వర్లు, పెసల కొండారెడ్డి, వెలుతుర్ల ప్రభాకర్ రెడ్డి, గంగిశెట్టి నరసింహంలు పాల్గొన్నారు. -
దుర్మార్గం
అంగన్వాడీల అరెస్టు ● అరెస్టులకు నిరసనగా అంగన్వాడీల మానవహారం ఒంగోలు టౌన్: అంగన్వాడీల వేతనాలు పెంచాలని, ప్రీ స్కూళ్లను బలోపేతం చేయాలని కోరుతూ చేపట్టిన చలో విజయవాడ మహాధర్నాలో పాల్గొన్న అంగన్వాడీ రాష్ట్ర నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ ఖండించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా నిర్వహించారు. అనంతరం యూనియన్ నాయకులు, కార్యకర్తలు చర్చి సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్భంధానికి వ్యతిరేకంగా, అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీ నాయకులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ధర్నాకు ఒంగోలు ప్రాజెక్టు కార్యదర్శి కె.ఎమీమా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెల 22వ తేదీ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనివార్య పరిస్థితులలో విజయవాడలో మహాధర్నా చేపట్టినట్లు వివరించారు. ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీలు హాజరయ్యారని, దీన్ని సహించలేక మూడో తేదీ ఉదయం 4.30 సమయంలో నిద్రలో ఉన్న రాష్ట్ర నాయకులను లేపి పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారని తెలిపారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు వాహనాలలో తీసుకెళ్లి అరెస్టు చేశారని , ఇది దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్వాడీలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయన్నారు. ఐసీడీస్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిరా అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించడం లేదని, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ , పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదని చెప్పారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని అడగడం నేరమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేయడం మాట తప్పడమేనని చెప్పారు. న్యాయమైన డిమాండ్ల కోసం విజయవాడ మహాధర్నాలో పాల్గొన్న నాయకులపై పోలీసులను ఉసిగొల్పడం దారుణమన్నారు. సీఐటీయూ నాయకులు సీహెచ్ మంజుదార్, జి.రమేష్ మాట్లాడుతూ కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు పెంచడానికి ఖజానాలో డబ్బులు లేవని చెబుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్లు విమానాల్లో తిరగడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ధర్నాలో కేవి.సుబ్బమ్మ, నిర్మలా దేవి, శేషమ్మ, సంధ్య, మాధవి, శోభ, అరుణ, స్వామిరెడ్డి, తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. -
బాలికపై అసభ్య ప్రవర్తన
● యువకునిపై పోక్సో కేసు నమోదు హనుమంతునిపాడు: మండలంలోని రశీదుపురంలో 14 ఏళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన యువకునిపై పోక్సో కేసు నమోదైంది. ఈ సంఘటన సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. రశీదుపురం గ్రామానికి చెందిన మేకల సుబ్బయ్య కుమారుడు మేకల నాగార్జున్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించి చేయి పట్టుకొని చెట్లలోకి లాగి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు యువకునిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం మాధవరావు తెలిపారు. ఒంగోలు టౌన్: జనసేన సభ్యత్వ నమోదులో భాగంగా ఏర్పాటు చేసిన ఉద్యమి సమావేశానికి మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి దూరంగా ఉన్నారు. సోమవారం రవిప్రియమాల్లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాలినేని వర్గం దూరంగా ఉందన్న విషయం తెలుసుకుని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బాలినేని ఇంటికి వెళ్లారు. ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం కొణతాల మీడియాతో మాట్లాడి సమావేశానికి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బేస్తవారిపేట: అంతర్జాతీయ పారా త్రోబాల్ చాంపియన్షిప్కు బేస్తవారిపేట మండలంలోని ఆర్.కొత్తపల్లెకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు పండుగల రాయుడు ఎంపికయ్యాడు. ఫిబ్రవరిలో రాజస్థాన్లో నిర్వహించిన నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీల్లో ఏపీ జట్టు విజయం సాధించింది. ఉత్తమ ప్రతిభ కనపరిచిన రాయుడు మలేషియాలోని కౌలాలంపూర్లో ఏప్రిల్ 20 నుంచి 25 వరకు నిర్వహించనున్న రెండో ఏషియన్ ఇంటర్నేషనల్ పారా త్రో బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు సెలక్ట్ అయ్యాడు. ఈ మేరకు పారా త్రోబాల్ అసోసియేషన్ ఇఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు అందాయి. టంగుటూరు: రైలు కిందపడి వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన టంగుటూరు రైల్వేస్టేషన్ సమీపంలోని 193 రైల్వే గేట్ వద్ద సోమవారం జరిగింది. ఒంగోలు రైల్వే పోలీసులు, టంగుటూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు..టంగుటూరు రైల్వేస్టేషన్ ఉత్తర పక్కన రైల్వే ఎల్సీ గేట్ 193 దిగువ లైన్ వద్ద గుర్తు తెలియని వృద్దురాలి మృతదేహం పడి ఉంది. రైల్వేస్టేషన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్సై టి.శ్రీరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. -
పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు
● పాఠశాల విద్య జేడీ ఎన్.గీత కనిగిరి రూరల్: పబ్లిక్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్, పరీక్షల రాష్ట్ర పరిశీలకురాలు ఎన్.గీత పేర్కొన్నారు. కనిగిరి బాలికోన్నత పాఠశాల, చింతలపాలెం పాఠశాలల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలను సోమవారం ఫ్లయింగ్ స్క్వాడ్ రాజాల కొండారెడ్డితో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లా గిద్దలూరు, వైపాలెం, మార్కాపురం, కనిగిరి పట్టణాల్లో 7 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2,909 మంది పరీక్షలు రాస్తున్నట్లు వెల్లడించారు. పదో తరగతి రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సిబ్బంది నియామకం పూర్తయిందని తెలిపారు. అనంతనం కనిగిరి జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం, కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 100 రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. -
పృథులాద్రి
భక్తులతో పులకించినమర్రిపూడి: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటైన పృథులగిరి లక్ష్మీనృసింహస్వామి తిరుణాళ్ల సోమవారం వైభవంగా సాగింది. పృథులగిరి భక్తులతో పోటెత్తింది. గత నెల 25 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అశేషభక్త సమూహంతో పృథులాద్రి కిటకిటలాడింది. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణం మారుతీచార్యులు, ఆదిశేషాచార్యులు, శ్రీనివాసాచార్యులు, వెంకటసాయిలు స్వామిని ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించారు. గరుడసేవ సందర్భంగా స్వామిని పల్లకిపై ఉంచి, బోయిలు సహయంతో స్వామిని మెట్లమార్గాన తీసుకెళ్లి అన్ని సత్రాల సమీపంలోని భక్తులకు దర్శనార్థానికి వీలుగా ఊరేగించారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, గ్రామాల నుంచి భక్తులు స్వామిని దర్శించుకొని ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి స్వామికి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు బారులుదీరారు. వివిధ సామాజిక సత్రాల్లో భక్తులకు అన్నదానంచేశారు. స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిగ, పులిహోర, పెరుగన్నం పంపిణీ చేశారు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. సంతానలేమితో బాధపడుతున్న వారు స్వామి సన్నిధిలో ఊయల కట్టడం ఆనవాయితీ. మెట్ల మార్గాన నడిచి వచ్చే భక్తులకు సీతమ్మవారి పాదాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భక్తులు మెట్లను పసుపు, కుంకుమలతో పూజించి మొక్కులు తీర్చుకున్నారు. మర్రిపూడి వైద్యాధికారి వీరబాబు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కందుకూరు డీఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, కొండపి సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో మర్రిపూడి, కొండపి, పొన్నలూరు ఎస్సైలు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైభవంగా గరుడోత్సవం తిరునాళ్లను పురస్కరించనుకొని ఆలయ ఆవరణలో గరుడోత్సవం వైభవంగా సాగింది. అలవల వెంకయ్య, సుందరరావు, వలేటి నర్శింహారావులు ఉభయదాతలుగా వ్యవహరించారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కమనీయం శివపార్వతుల కల్యాణం.. శివ,విష్ణు పుణ్యక్షేత్రాలు ఒకే చోట కొలువై ఉండటంతో ఈ పృథులాద్రి ప్రత్యేకతను సంతరించుకుంది. లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి తూర్పు వైపున వేంచేసిన శివాలయంలో తిరునాళ్లను పురస్కరించుకొని స్వామి ప్రతిమలను పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. గండ్రకోట సోదరులు శ్రీనివాసశర్మ, వాసు, సురేంద్ర, కుమార్ తదితరులు శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పోటీపడ్టారు. ఘనంగా లక్ష్మీనృసింహస్వామి గరుడోత్సవం లక్ష్మీనృసింహుని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం కమనీయం శివపార్వతుల కళ్యాణం -
అక్రమ రిజిస్ట్రేషన్పై పోరాడుతున్నా పట్టించుకోరా?
● అధికారులకు 15 సార్లు అర్జీలు ఇచ్చినా న్యాయం జరగలేదు ● కన్నీటి పర్యంతమైన సుబ్బలక్ష్మి తనకు చెందిన భూమిని మరో మహిళ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై 15 సార్లు అధికారులకు అర్జీలిచ్చినా న్యాయం చేయలేదని యర్రగొండపాలేనికి చెందిన వెలగపూడి సుబ్బలక్ష్మి సోమవారం కలెక్టరేట్లో జేసీ శ్రీనివాసులు, ఆర్డీఓ ప్రభాకర్ ఎదుట కన్నీటి పర్యంతమైంది. ‘యర్రగొండపాలెం పట్టణంలో సర్వే నం.58/1లో నాకు 570 చదరపు గజాల ఇంటి స్థలం ఉంది. అందులో 390 చదరపు గజాల స్థలంలో రేకుల షెడ్ వేసుకున్నా. ఈ స్థిరాస్తి మా అత్త వెలగపూడి వసుంధరాదేవి ద్వారా సంక్రమించింది. సెటిల్మెంట్ అగ్రిమెంట్ ద్వారా నాకు లభించిన స్థలాన్ని యర్రగొండపాలెం మండలం సర్వాయపాలేనికి చెందిన బి.యోగమ్మ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. న్యాయం చేయాలని కోరుతూ.. యర్రగొండపాలెం ఎమ్మార్వో, జిల్లా రిజిస్ట్రార్కు ఇప్పటి వరకు 15 సార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు. నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. పూర్తి రికార్డులు పరిశీలించి అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని వేడుకుంటున్నా’ అని జేసీకి విన్నవించింది. దీనిపై స్పందించిన జేసీ పూర్తి రికార్డులు పరిశీలించి సమస్య పరిష్కరించాలని మార్కాపురం రిజిస్ట్రార్ను ఆదేశించారు. -
అర్జీల పరంపర.. సమస్యల మొర
మార్కాపురం టౌన్: క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్కు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. రోజులు, నెలల తరబడి మండల కేంద్రాల్లో అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన బాధితులంతా జిల్లా కలెక్టరేట్లో లిఖితపూర్వకంగా అర్జీలు అందజేశారు. తమ సమస్యలను జిల్లా అధికారులకు వివరించి న్యాయం చేయాలని వేడుకున్నారు. సోమవారం ప్రకాశం కలెక్టరేట్లో గ్రీవెన్స్కు 281 అర్జీలు, మార్కాపురం కలెక్టరేట్లో గ్రీవెన్స్కు 83 అర్జీలు అందాయని ఆయా కార్యాలయాల అధికారులు వెల్లడించారు. మార్కాపురంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ పులి శ్రీనివాసులు, జిల్లా గనుల శాఖ ఏడీ పోలిరెడ్డి, ఏపీ మైక్రో ఇరిగేషన్ పీడీ జెన్నెమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేష్బాబు, ఆర్డీఓ ప్రభాకర్, ఐసీడీఎస్ పీడీ పద్మావతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రీవెన్స్కు గైర్హాజరైతే వేటు తప్పదు ● మార్కాపురం జేసీ హెచ్చరిక మార్కాపురం జిల్లాలోని ప్రతి మండలంలో రెవెన్యూ సమస్యలపై అర్జీలు అధికంగా వస్తున్నాయని తహసీల్దార్లు, సిబ్బంది దృష్టి సారించి వేగంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి జేసీ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవిన్యూ సమస్యలపై పదే పదే అర్జీలు వస్తున్నాయని, క్షేత్ర స్థాయిలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. అర్జీదారులను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గైర్హాజరైన కొందరు అధికారులకు ఫోన్ చేసి ఆహ్రహం వ్యక్తం చేశారు. మరోసారి నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఇకపై జిల్లా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. వారంలో మంగళ, గురు, శనివారాల్లో పట్టణాలు, గ్రామాల్లోని వైద్యశాలలు, ప్రభుత్వ పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాలు, అన్నా క్యాంటీన్, ఆర్టీసీ బస్టాండ్లను తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పధకాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. గ్రీవెన్స్కు వచ్చిన అర్జీల్లో కొన్ని.. రెవెన్యూ గ్రీవెన్స్కు ప్రకాశంలో 281, మార్కాపురంలో 83 అర్జీలు సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించాలని జేసీల ఆదేశం -
ఒంగోలులో మీ కోసంకు 281 అర్జీలు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 281 అర్జీలు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వచ్చిన అర్జీలను నేరుగా గడువు లోగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లీనిక్ల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువు లోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. పరిష్కరించకుంటే ఎందుకు పరిష్కరించలేదో అర్జీదారులకు సవివరంగా వివరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్రెడ్డి, మాధురి, కళావతి, విజయజ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంపై మరింత శ్రద్ధ చూపాలి
● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశం ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం వేదికలో 80 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. అత్తారింటి వేధింపులు, ఉద్యోగ మోసాలపై అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. చట్టపరిధిలో విచారణ చేసి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..మీ కోసం ఫిర్యాదులపై తక్షణమే విచారణ ప్రారంభించాలని సూచించారు. జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని చెప్పారు. బాధితులకు నమ్మకం కలిగేలా నిర్ణీత గడువు లోగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. పోలీసు మీ కోసంలో ఫిర్యాదులు చేసేందుకు ఒంగోలు వరకు రాలేని బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, కందుకూరు సీఐ అన్వర్బాషా, చీమకుర్తి సీఐ ప్రసాద్, మీ కోసం ఎస్సై జనార్దన్రావు, ప్యానల్ అడ్వకేట్ బాలాజీసింగ్, సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం పోలీస్ గ్రీవెన్స్కు 32 అర్జీలు మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 32 అర్జీలు అందినట్లు డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల నుంచి వచ్చిన పలువురు అర్జీదారులతో మాట్లాడి సమస్యల పూర్వాపరాలు తెలుసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి అర్జీలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్ కేసులు, ఉద్యోగ మోసాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయని డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో అర్బన్ సీఐ సురేష్, కంభం సీఐ కె.మల్లికార్జునరావు సిబ్బంది పాల్గొన్నారు. కందుకూరు రూరల్: పాత కక్షల నేపథ్యంలో దాడి చేశారని మనస్తాపం చెందిన ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఓగూరులో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..కందుకూరులోని ఆనందపురంకు చెందిన కె.మాధవరావు ట్రాక్టర్ల ఫైనాన్స్లో పని చేస్తుండేవాడు. ఆ పనిపై సుమారు రెండేళ్ల క్రితం కారులో ఓగూరు గ్రామానికి వెళ్లాడు. రోడ్డులో కారు అడ్డంగా పెట్టావని ఓగూరు గ్రామానికి చెందిన ఏ.వరుణ్ సాయి మాధవరావు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వరుణ్ సాయి మాధవరావును కొట్టి కారు అద్దాలు పగలగొట్టాడు. దీంతో అప్పుడు మధ్యవర్తులు మాట్లాడి సరిచేసి పంపారు. అప్పటి నుంచి కె.మాధవరావు వరుణ్ సాయిపై కక్షపెట్టుకొని ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం వరుణ్ సాయి తన స్నేహితుడితో కలిసి కందుకూరులోని ఓ మద్యం షాపుకు వెళ్లి మద్యం సేవిస్తున్నారు. అక్కడే మద్యం సేవిస్తున్న మాధవరావు, మరో నలుగురు కలిసి వరుణ్ సాయిపై దాడి చేసి, కొట్టి గాయపరిచారు. అక్కడ నుంచి బయటపడిన వరుణ్ సాయి ఇంటికి వచ్చి బంధువులకు చెప్పారు. మాధవరావు అనే వ్యక్తి నన్ను చేస్తాడని కుటుంబ సభ్యులతో, బంధువుల వద్ద వాపోయాడు. అనంతరం మనస్తాపానికి గురైన వరుణ్ సాయి (22) తన చావుకి కారణంగా ఆనందపురంకు చెందిన మాధవరావు అని ఫోన్ సెల్ఫీ వీడియో తీసుకొని ఫోన్ అక్కడే పెట్టి ఊరిలోనే ఉన్న పాడుపడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంభం: మండలంలోని తురిమెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థిని సిట్టింగ్ స్క్వాడ్ డీబార్ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సోనీ తెలిపారు. ప్రథమ సంవత్సరం బ్యాక్ లాగ్ పరీక్ష రాస్తున్న విద్యార్థి కాపీయింగ్ చేస్తున్నట్లు గుర్తించిన సిట్టింగ్ స్క్వాడ్ సదరు విద్యార్థిని డీబార్ చేసినట్లు తెలిసింది. సీఎస్పురం(పామూరు): మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయం వద్ద వివిధ రకాల దుకాణాలు, ఇతరాల నిర్వహణకు సంబంధించి వేలం నిర్వహించగా వేలం ద్వారా రూ.31,84,700 ఆదాయం వచ్చినట్లు ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు, వ్యవస్థాపక ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ తెలిపారు. సోమవారం దేవదాయ, ధర్మాదాయ శాఖ కందుకూరు డివిజన్ ఇన్స్పెక్టర్ జి.ఏ.సత్యనారాయణ పర్యవేక్షణలో ఈఓ, ధర్మకర్తల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో దుకాణాలు, ఇతరాలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2027 మార్చి 31 వ తేదీ వరకు నిర్వహించుకునేందుకు వేలం వేశారు. తలనీలాలు పోగు చేసుకునేందుకు రూ.18,11,700, టోల్గేట్ నిర్వహణకు రూ.5.71 లక్షలు, కొబ్బరి చిప్పలు పోగుచేసుకునేందుకు రూ.4.22 లక్షలు, కూల్డ్రింక్స్ దుకాణం నిర్వహణకు రూ.2 లక్షలు, క్యాంటిన్, మిఠాయిల కోసం రూ.1.80 లక్షలు ఆదాయంగా వచ్చినట్లు ఈఓ, ధర్మకర్త తెలిపారు. -
ఉపాధిలో 125 రోజుల పనిదినాలు పచ్చి మోసమే..
ఒంగోలు టౌన్: ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి వీబీ జీ రాంజి పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చిన మోదీ సర్కార్ గ్రామీణ ప్రజల కడుపు కొట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. జీ రాంజీ పథకంలో ఏడాదిలో 125 రోజలు పనిదినాలు కల్పిస్తున్నట్లు చెబుతున్న మోదీ ప్రభుత్వం దానికి అవసరమైన నిధులను మాత్రం కేటాయించలేదని చెప్పారు. ఈ పథకం అమలుకు 2.30 లక్షల కోట్ల రూపాయలు అవసరం కాగా కేవలం 95 వేల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించడం పచ్చి మోసమని ధ్వజమెత్తారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతదంగా కొనసాగించాలని, వీబీ జీ రాంజీ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులను కేటాయిస్తుండగా ఇప్పుడు అమలు చేయనున్న కొత్త పథకంలో కేవలం 60 శాతం నిధులను కేంద్రం, మిగతా 40 శాతం నిధులను రాష్ట్రం భరించాలని చెప్పడం మసిపూసి మాయ చేయడమేనన్నారు. ఆంధ్ర రాష్ట్రం దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, ఇటీవల బడ్జెట్లో రూ.3,346 కోట్లు కేటాయించిన సీఎం చంద్రబాబు ఉపాధి కూలీలకు 125 రోజుల పని ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. హక్కులు, నిధులు లేని వీబీ జీ రాంజీ పథకాన్ని గ్రామీణ ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అత్యధికంగా 58 శాతం నిరుపేద మహిళలు, 19 శాతం దళితులు, 18 శాతం గిరిజనులు పనిచేస్తున్నారని వివరించారు. ఈ పథకాన్ని రద్దు చేసిన మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, ధనిక వర్గాలకు ఉపయోగం కలిగేలా వీబీ జీ రాంజీ పథకాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. మోదీ విధానాలను వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వీబీ జీ రాంజీ పథకం రాష్ట్రాలపై మోయలేని భారం మోపుతోందంటూ అరుణోదయ సంస్థ ఏర్పాటు చేసిన దృశ్యమాలిక అందరినీ ఆలోచింపజేసింది. ధర్నాలో పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పద్మ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.మంజుల, ఎస్.భారతి, రైతు కూలీ సంఘం నాయకులు హనుమంతరావు, చంద్రశేఖర్, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు జాలన్న, సీపీఐ న్యూ డెమోక్రసీ నాయకులు సీఎస్ సాగర్, ఎల్.రాజశేఖర్, సీహెచ్ పద్మ, కృష్ణారావు, సీతారావమ్మ, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అసలు దొంగలెవరో తేల్చాలి..
మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026ఒంగోలులో అధికార కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ‘‘నువ్వు దొంగంటే.. కాదుం నువ్వే దొంగ’’ అంటూ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు గుప్పించుకుంటూ ఇరుపార్టీల నేతలు పోటాపోటీగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. బహిరంగంగానే బురదజల్లుకోవడంతో స్థానిక రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ–జనసేన పార్టీ నేతలు కలిసి అధికారం అనుభవిస్తున్నప్పటికీ, ఒంగోలులో పరస్పర ఆరోపణలతో రోడ్డెక్కడం సంచలనంగా మారింది. ఇంత జరుగుతున్నా పార్టీ అధినాయకత్వం చూసిచూడనట్టుగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయి. నగర రాజకీయాలు ఇక ఎటు మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. నవ్వుల పాలవుతున్న కూటమి నాయకుల తీరు.. వారిద్దరూ అధికార కూటమి పార్టీ నాయకులే. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మరొకవైపు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి నువ్వంటే నువ్వని ఒకరి మీద మరొకరు అవినీతి అరోపణలు చేసుకుంటున్నారు. నువ్వు చేసిన కబ్జాలు ప్రజలందరికీ తెలుసంటూ దామచర్ల భగ్గుమంటే, నీ అవినీతి అరాచకాలను బయటపెట్టేంత వరకు వదిలి పెట్టేది లేదని బాలినేని సవాల్ విసురుతున్నారు. ఒంగోలులో జరుగుతున్న భూ కబ్జాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో నిరుపేద ప్రజలు భయపడిపోతున్నారని, వారికి అండగా నిలబడతానని ప్రకటించారు. నువ్వేం దోచుకుంటున్నావో, నేనేం దోచుకున్నానో ప్రజలకు తెలుసన్నారు. దీనికి స్పందించిన దామచర్ల.. హైదరాబాద్ నుంచి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, నీ ఇష్టం వచ్చినట్లు ఇసుక, మట్టి లూటీ అని మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసి బాలినేని గురించి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. దొంగ నువ్వంటే నువ్వేనని ఒకరి మీద మరొకరు అవినీతి అరోపణలు చేసుకుంటుంటే అసలు దొంగలెవరో తేల్చాలని ఒంగోలు ప్రజలు కోరుతున్నారు.మాటలు వేడెక్కి..కూటమి వీధికెక్కి!సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలులో రాజకీయాలు వేడెక్కాయి. ఇటీవల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై వచ్చిన లేఖ ఈ చిచ్చును మరింత రాజేసింది. దీంతో కూటమి నాయకులు నువ్వా నేనా అంటూ కుస్తీకి దిగారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వచ్చారు. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని, ఇసుక, మట్టి, రేషన్, మద్యం లూటీ జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు. మెప్మా అవినీతికి పాల్పడిన వారి పేర్లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల అవినీతి జరిగితే అధికారులను బలిచేసి సొంత మనుషులను కాపాడుకున్నారని ఆరోపించారు. తన హయాంలో బ్రాహ్మణుల భూమిని కబ్జా చేసినట్లు దామచర్ల తప్పుడు ప్రచారం చేయించారని గుర్తు చేసిన బాలినేని ఇప్పుడా భూమిని ఎవరు కబ్జా చేశారో తేల్చాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల భూమి ఒక్కటే కాదని ఇంకా నాలుగైదు భూముల కబ్జా చేశారని, వాటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని విచారణ జరపాలని చెప్పారు. ఎమ్మెల్యే అవినీతిపై వచ్చిన లేఖ గురించి ప్రస్తావించారు. ఆ లేఖను హైదరాబాద్లో కూర్చొని రాయించినట్లు తనపై విమర్శలు చేయడాన్ని ఖండించారు. సొంత ఇంటి మనిషే లేఖ రాసినట్లు తేలితే ఇంటికి పిలిపించుకొని రాజీ చేసుకున్నారని ఆరోపించారు. తన మీద లేఖ రాసిన వ్యక్తిని ఎవరైనా ఇంటికి పిలిపించుకుంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దామచర్ల సొంత మనుషులే మెప్మా దొంగలని, వారిని కాపాడేందుకు అధికారులను బలిచేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే దామచర్ల మీద లెటర్ వేయించలేదని తన కుమారుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, నా పాత్ర ఉందని నీవు నీ కూతురి మీద ప్రమాణం చేయగలవా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలినేనిపై రెచ్చి పోయారు. పరుష పదజాలంతో దూషణలందుకున్నారు. తన మీద వచ్చిన లేఖను వెనక బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నట్లు ఆరోపణలు చేశారు. లేఖ రాసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బొమ్మినేని మురళిని రక్షించేందుకు బాలినేని ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు ఆరోపించారు. ఇప్పుడు తనకేమీ తెలియదంటే ఎలాగని ప్రశ్నించారు. ఎప్పటిలాగే బాలినేనిని ఒదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఒకరి మీద మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ రోడ్డెక్కారు. మెప్మా అవినీతిపై విచారణ జరపాలి.. మెప్మా అవినీతిపై విచారణ జరపాలని, అసలు నిందితుల పేర్లను బయట పెట్టాలని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి నేరుగా కలెక్టర్కు ఫోన్ చేసినట్లు చెప్పడం సంచలనం సృష్టించింది. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తనకు చెప్పారని మీడియా సమావేశంలో బాలినేని చెప్పారు. మెప్మాలో జరిగిన అవినీతి మీద ఊరికే ఆరోపణలు చేయకుండా కలెక్టర్ వద్దకు వెళ్లి కలవాలని చెప్పిన దామచర్లకు గొంతులో వెలక్కాయ పడినట్లయిందని టీడీపీలోని అసంతృప్తి వర్గం చెబుతోంది. తొలి నుంచి ఒంగోలు కూటమిలో ఎమ్మెల్యే దామచర్ల, జనసేన నేత బాలినేని మధ్య విభేదాలున్నాయి. ఇప్పటి వరకు చాపకింద నీరులా ఉన్న విభేదాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. నాయకులిద్దరూ ఒకరి మీద మరొకరు తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసుకుంటుంటే ఆ రెండు పార్టీలకు చెందిన అధినాయకత్వం చూసిచూడనట్లు వదిలిపెట్టడం వెనక ఉద్దేశం ఏమిటో అర్థంకాక టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. బాలినేని మీద ఆరోపణలు చేస్తున్న దామచర్ల తాను ఎమ్మెల్యేగా మాట్లాడడం లేదని చెబుతున్నారు. బాలినేని సైతం తాను జనసేన నాయకుడిగా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నానని చెబుతున్నారు. కూటమి ఐక్యత కోసం ఏడాదిన్నర కాలం ఊరుకున్నట్లు ఇద్దరు నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో కలిసి అధికారం అనుభవిస్తున్న టీడీపీ, జనసేన నాయకులు ఒంగోలులో పరస్పర ఆరోపణలతో రోడ్డెక్కడంపై రెండు పార్టీల కేడర్ అయోమయంలో పడిపోయింది. వారం రోజులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
కల్తీ లడ్డూతోనే కాలయాపన
● ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని, చింతలపూడి అద్దంకి రూరల్: కూటమి ప్రభుత్వం లేనిపోనివి సృష్టించి తిరుమల లడ్డూ కల్తీ అంటూ అసత్య ప్రచారాలతో కాలం వెళ్లదీస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. శింగరకొండ తిరునాళ్ల సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని, అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు సోమవారం రాత్రి ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వారికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తరువాత వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు కొత్తరెడ్డిపాలెం, అద్దంకి టౌన్ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలను సందర్శించారు. ఈ సందర్భంగా చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో అద్దంకిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, అద్దంకి మండల కన్వీనర్ గుజ్జుల జగన్మోహన్రెడ్డి, బల్లికురవ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, కొరిశపాడు మండల కన్వీనర్ పాలపర్తి శ్రీధర్, పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
తల్లిని కోల్పోయినా..లక్ష్యం చెదరక..
● ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరైన కుమారుడు జె.పంగులూరు: అనారోగ్యంతో తల్లి మృతి చెందిన బాధలో ఉన్న కుమారుడు ఇంట్లో తల్లి మృతదేహం ఉండగానే..ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు హాజరైన ఘటన జే పంగులూరు మండల పరిధిలోని అలవలపాడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన కాకర్లమూడి సుజాత (35) రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. ఒంగోలు ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయిస్తున్నారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం భర్త ఆదాం ఆమెను చైన్నె తీసుకెళ్లాడు. సుజాత చైన్నె వెళ్లే సమయంలో తన ముగ్గురు పిల్లలైన రత్నరాణి, ప్రేమ్కుమార్, విజయ్తో మాట్లాడింది. బాగా చదువుకోవాలని..తాను చూపించుకొని వెంటనే వస్తానని చెప్పి వెళ్లింది. ఆదివారం రాత్రి చైన్నెలో చికిత్స పొందుతూ సుజాత మృతి చెందింది. సోమవారం ఆమె మృతదేహాన్ని అలవలపాడు గ్రామానికి తీసుకొచ్చారు. తల్లి మృతదేహం చూసిన ముగ్గురు పిల్లలు బోరున విలపించారు. తల్లి మృతదేహం ఇంటిలో ఉండగానే ఆమె కోరినట్లు తన భవిష్యత్తు కోసం కుమారుడు ప్రేమ్ కుమార్ అద్దంకిలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాసిన అనంతరం తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కుమార్తె రత్నరాణి డిగ్రీ చదువుతోంది. మూడో కుమారుడు విజయ్ గ్రామంలోనే 7వ తరగతి చదువుతున్నాడు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
● గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం అద్దంకి: గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్ అదుపుతప్పి డివైడర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిలో మధురానగర్ సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..మండలంలోని కొంగపాడు ఎస్సీ కాలనీకి చెందిన ఏసపోగు వినోద్(28), ఎచ్చెర్ల చిన్నా(22) పచ్చాకు కూలీ పనులు చేసుకుంటూ జీవన సాగిస్తున్నారు. వినోద్కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉండగా, చిన్నాకు వివాహం కాలేదు. వీరిద్దరు ఆదివారం పని నిమిత్తం బైకుపై అద్దంకికి వచ్చారు. పనులు ముగించుకుని, బైక్పై తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా రాష్ట్రీయ రహదారిలో మధురానగర్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వినోద్ భార్య అనిత, చిన్నా తల్లి నవనీతం ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రెండు కుటుంబాల్లో విషాదం ఒకే రోజు రెండు కుటుంబాలకు చెందిన ఆశల దీపాలు ఆరిపోవడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వందేళ్లు తనకు తోడుంటాడనుకున్న భర్త మరణంతో వినోద్ భార్య, తమ కుమారుడు మృతితో చిన్నా తల్లి మృతదేహాలను చూసి తల్లిడిల్లిపోయారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి కొత్తపట్నం: గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జాలన్ జిల్లా, ఎయిర్ గ్రామానికి చెందిన అశ్రపి (63) పానీపూరి బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి తను స్వగ్రామానికి కుమారుడు నరేంద్రతో కలిసి ఆటోలో వెళుతున్నారు. ఒంగోలు నుంచి గుర్తు తెలియని వాహనం కొత్తపట్నం సమీపంలో మార్కెట్ యార్డ్ ఎదురుగా వచ్చే సరికి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆశ్రపికి బలమైన గాయాలు కావడంతో ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు ఉలవపాడు: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని జాతీయరహదారిపై కరేడు ర్యాంపు వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉలవపాడు వరిగచేను సంఘంకు చెందిన పోట్లూరి కోటేశ్వరరావు, పోట్లూరి రమేష్ ద్విచక్రవాహనంపై సింగరాయకొండ వెళుతూ ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి కిందపడిపోయారు. ఇద్దరికి గాయాలయ్యాయి. ముందు వాహనం నడుపుతున్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. గాయాలైన ఇద్దరిని 108 సిబ్బంది ఉలవపాడు సీహెచ్సీ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం దుకాణంలో చోరీ
● రూ.1.75 లక్షలు అపహరించిన దుండగులు నాగులుప్పలపాడు: మద్యం దుకాణం తాళాలను గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి కౌంటర్లో ఉంచిన నగదు కాజేశారు. ఈ సంఘటన నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. ఉప్పుగుండూరు గ్రామంలోని వైన్ షాపు నంబర్ 30లో శనివారం రాత్రి వ్యాపారం తాలూకా నగదు రూ.1.75 లక్షలను కౌంటర్లో ఉంచి మూసివేశారు. ఈ దుకాణానికి వాచ్మన్ను నియమించినప్పటికీ శనివారం అతను విధుల్లో లేడు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు అర్ధరాత్రి తర్వాత దుకాణం తాళాలు పగలగొట్టి నగదు కాజేశారు. ఆదివారం సాయంత్రం సంఘటనా స్థలాన్ని క్లూస్ టీంతో కలిసి ఎస్సై మహేంద్ర నాయక్ పరిశీలించారు. దుకాణంలో ఉన్న సీసీ ఫుటేజ్ను సేకరించారు. చోరీ కేసు త్వరలోనే చేధిస్తామని ఎస్సై చెప్పారు. -
చంపేస్తామని బెదిరిస్తున్నారు
● రక్షణ కల్పించండని మహిళ ఆవదేన గిద్దలూరు రూరల్: కూటమి ప్రభుత్వంలో రెడ్బుక్ పాలనతో గ్రామాల్లో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ఓ ఇంటి వద్దకు శనివారం సుమారు 50 మంది వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో మహిళ ఒక్కరే ఉన్నారు. అంత మంది ఒక్కసారిగా రావడంతో ఆమె భయభ్రాంతులకు గురై పోలీసులకు, 100కు సమాచారం ఇచ్చింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. బాధితురాలు మదిరె ప్రభావతి తెలియజేసిన వివరాల ప్రకారం రాచర్ల మండలం ఎడవల్లి పరిధిలో 781 సర్వే నంబర్లో తన భర్త నెమిరెడ్డి పేరుపై 2000లో 5 ఎకరాలు భూమి ఇచ్చారు. తరువాత 2002, 2003 మధ్య కాలంలో లెదర్ పార్కు కోసం ప్రభుత్వం అదే సర్వే నంబర్లో ఉన్న మరి కొంత భూమి 25 ఎకరాల మేర లేదర్ పార్కు కోసం కేటాయించి అక్కడ లెదర్ పార్కు షెడ్డు నిర్మాణం చేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఎటువంటి సమాచారం లేకుండా తమ పొలంలో నుంచి దౌర్జన్యంగా లెదర్ పార్కుకు రోడ్డు వేసేందుకు ప్రయత్నించారు. దీంతో తన భర్త నెమిలిరెడ్డి న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మా విన్నపాన్ని ఆలకించి రోడ్డు పనులు నిలుపుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం మింగుడు పట్టని కొందరు టీడీపీ నాయకులు ఫోన్ చేస్తూ బెదిరిస్తున్నారని వాపోయింది. అయినా తాము గట్టిగా నిలబడటంతో టీడీపీ నాయకులు మరింత కక్ష పెట్టుకొని ఇంటికిపైగా గుంపులు గుంపులుగా వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి సానుకూలంగా ఉన్నామని తమకు ఇచ్చిన పొలంలో అక్రమంగా రోడ్డు వేసి తమను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని చెప్పారు. తన భర్త ఇంట్లో లేని సమయంలో సుమారు 50 మంది ఇంటి మీదకు వచ్చి రోడ్డు పనులను నిలుపుదలు చేస్తారా చంపేయమంటారా అంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దౌర్జన్య చేయడం అంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా భర్తకు ప్రాణహాని ఉందని, తమకు పూర్తిగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. -
మహిళపై భర్త, అత్తమామల దాడి
ఒంగోలు టౌన్: అత్తమామలతో కలిసి తన భర్త వేధిస్తున్నాడని, భర్త, మరిది, అత్తమామలు కలిసి తనతో బలవంతంగా మత్తు మాత్రలు మింగించి ఇంటి నుంచి గెంటేశారని వివాహిత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు.. విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ నశీర్ అహ్మద్, హుసేన్ బీ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దమ్మాయి షేక్ మనీషాను ఒంగోలు సీతారామపురంలో నివాసం ఉండే షేక్ బిస్మిల్లా కుమారుడు ఆరీఫ్ అల్లాకు ఇచ్చి 2021లో వివాహం చేశారు. వివాహ సమయంలో 50 సవర్ల బంగారు నగలు, వేరు కాపురానికి రూ.10 లక్షల నగదు ఇచ్చారు. రూ.50 లక్షలు ఖర్చు చేసి అట్టహాసంగా వివాహం జరిపించారు. బీటెక్ చదువుకున్న ఆరీఫ్ ఉద్యోగం చేయకుండా తండ్రి నిర్వహించే రెస్టారెంట్, వడ్డీ వ్యాపారాలు చూసుకుంటుంటాడు. చెడు వ్యసనాలకు బానిసైన ఆరీఫ్ భార్యతో సరిగా కాపురం చేయకపోవడంతో మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో విడాకుల కోసం సంతకం చేసి వెళ్లి పోవాలని మనీషాను వేధించసాగాడు. దీంతో మనీషా పుట్టింటికి చేరింది. గత ఏడాది డిసెంబర్లో తిరిగి అత్తారింటికి వచ్చింది. అయినప్పటికీ వేధింపులు మానలేదు. దీంతో కొద్ది రోజులుగా తల్లి హుసేన్ బీ కూతురికి తోడుగా ఒంగోలుకు వచ్చి ఉంటోంది. ఎలాగైనా సరే మనీషాను వదిలించుకోవాలని భావిస్తున్న ఆరీఫ్, అతని తల్లిదండ్రులు, తమ్ముడు మరికొందరితో కలిసి ఆదివారం దాడికి పాల్పడ్డారు. మనీషాతో బలవంతంగా మత్తు మాత్రలు మింగించారు. ఆమె తల్లి హుసేన్బీని ఇంటి బయటకు గెంటేశారు. ప్రస్తుతం మనీషా జీజీహెచ్లో చికిత్స పొందుతోంది. దాడిపై బాధితులు ఒంగోలు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మనీషాను అత్తామామలు వేధిస్తున్నట్లు ఆమె తలిదండ్రులు ఫిర్యాదు చేశారని, విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని వన్టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. -
పసిపాపకు పాము కాటు
అద్దంకి: ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్న పసిపాపను పాము కాటేసిన సంఘటన అద్దంకి పట్టణంలోని పాత దామావారిపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. వల్లెపు చిరంజీవి కుమార్తె(14 నెలల వయసు) తమ ఇంటి పరసరాల్లో రోజూలాగే ఆడుకుంటోంది. ఈ క్రమంలో అక్కడ సంచరిస్తున్న పాము పాప ఎడమ చేతిపై కాటు వేసింది. నొప్పి భరించలేక పాప ఏడవడంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు తమ కుమార్తెను పాము కాటేసిందని గుర్తించారు. స్థానికులు 108కు ఫోన్ చేయడంతో తొలుత అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు, మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గిద్దలూరు రూరల్: పట్టణంలోని సెయింట్పాల్స్ హైస్కూల్ సమీపంలో ఓ ఇంట్లో ఆదివారం అనుమానాస్పద స్థితిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. అందిన వివరాల ప్రకారం.. ఒంగోలు హైవే రోడ్డుని టీ షాపులో పనిచేస్తున్న దంపతులు పది రోజుల క్రితం ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ తీవ్ర రక్త గాయాలతో ఉన్న మహిళను తన భర్త బయటకు తీసుకువచ్చి ఆటోలో తీసుకెళ్లాడు. ఈ సంఘటనను చూసిన స్థానికులు ఆ ఇంటి వద్ద పెద్ద ఎత్తు గుమిగూడారు. మరణించిన మహిళ వయసు 35 ఏళ్లు ఉంటుందని, వారికి ఒక పాప కూడా ఉందని తెలిసింది. ఇంటి యజమాని హైదరాబాద్లో ఉండటం వల్ల వారి పూర్తి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
నేడు లక్ష్మీనృసింహస్వామి తిరునాళ్ల
మర్రిపూడి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పృథులగిరి లక్ష్మీనృసింహాస్వామి తిరునాళ్లను సోమవారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ నర్రా నారాయణరెడ్డి తెలిపారు. వైఖానస ఆగమయోక్తంగా రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనృసింహ స్వామిని గరుడ వాహనంపై ఊరేగిస్తున్నట్లు తెలిపారు. గరుడోత్సవ సేవకు అలవల వెంకయ్య, సుందరరావు కుమారులు ఉభయదాతలుగా వ్యవహరించనున్నారు. తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం పొదిలి నుంచి 10 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. కొండపి సీఐ సోమశేఖరరావు, ఎస్సై రమేష్బాబు తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పలు సామాజిక వర్గాలకు చెందిన సత్రాల్లో అన్న సంతర్పణకు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు సిటీ: ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు సంబంధించి ఇంటర్మీడియెట్ సంస్కృత సబ్జెక్టు జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆర్ఐఓ ఆంజనేయులు తెలిపారు. ఒంగోలులోని అంజయ్య రోడ్లో గల ఏకేవీకే జూనియర్ కళాశాలలో మూల్యాంకనానికి ఏర్పాట్లు చేసినట్లు ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ ఇంటర్మీడియెట్ విద్యా మండలి నుంచి ఆర్డర్లు పొందిన ఏఈలు, ఏసీఓ(వాల్యూషన్)లు తప్పనిసరిగా నిర్దేశిత తేదీ, సమయానికి మూల్యాంకన కేంద్రంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఆర్డర్లు పొంది మూల్యాంకనానికి హాజరు కాకపోతే.. సదరు వ్యక్తులపైనే కాకుండా సంబంధిత కళాశాలలపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కాపురం రూరల్: సీపీఎం మార్కాపురం జిల్లా కార్యదర్శిగా దగ్గుపాటి సోమయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో మార్కాపురం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ సభ్యులుగా ఎస్డీ హనీఫ్, ఊసా వెంకటేశ్వర్లు, కేశవరావు, మాల్యాద్రి, డీకేఎం రఫీ, గుమ్మా బాలనాగయ్యను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడతామని సోమయ్య తెలిపారు. ఒంగోలు సిటీ: ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే సరైన ఆధారాలతో ఈ నెల 2వ తేది నుంచి 9వ తేదీ లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని డీఈఓ సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల యజమాన్యాలతో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు (స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ), సమానమైన క్యాడర్) వారి సాధారణ సీనియారిటీ జాబితా వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపారు. ఉపాధ్యాయులంతా గమనించాలని కోరారు. ఒంగోలు టౌన్: కోడి పందేల శిబిరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఒంగోలు రూరల్ మండలంలోని గుండాయపాలెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని సముద్రం కాలువ ప్రాంతంలో రహస్యంగా కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. టాస్క్ఫోర్స్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్సైలు శివరామయ్య, చెంచయ్య, ఏఎస్సై మహబూబ్బాషా మారు వేషాల్లో రంగంలోకి దిగారు. జూద శిబిరంపై ఆకస్మికంగా దాడి చేసి 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 సెల్ఫోన్లు, 2 పందెం కోళ్లు, రూ.43,750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
అదుపులోకి అగ్నికీలలు
టంగుటూరు: మండల కేంద్రంలో బెల్లం కోటయ్యకు చెందిన పొగాకు గూడెంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు మంటలు అదుపు చేసే పనిలో అగ్నిమాపక యంత్రాంగం నిమగ్నమయ్యారు. ఆదివారం సాయంత్రం వరకు గోడౌన్లో సహాయక చర్యలు కొనసాగాయి. ఈ సహాయక చర్యల్లో టంగుటూరు, కొండపి, ఒంగోలు అగ్నిమాపక కేంద్ర సిబ్బంది మంటలను అదుపు చేసినా ఎంతకు అదుపులోకి రాకపోవడంతో కందుకూరు నుంచి మరో అగ్నిమాపక వాహనాన్ని తెప్పించారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత మంటలు అదుపులోనికి రావడంతో ఆయా వాహనాలను పంపించి వేశారు. టంగుటూరు వాహనం సిబ్బంది మాత్రం ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాద సంఘటన జరిగిన ప్రాంతాన్ని విజయవాడ నుంచి అగ్నిమాపక శాఖ రీజనల్ అధికారి జిలానీ, డీఎఫ్ఓ శ్రీకాంత్రెడ్డి సందర్శించారు. ప్రమాదంలో 600 బేళ్లు అగ్నికి ఆహుతైనట్లు జీపీఐ సిబ్బంది తెలిపినట్లు డీఎఫ్ఓ తెలిపారు. ఆస్తినష్టం అంచనా మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. -
వలపు వల!
ఖాకీ కనుసన్నల్లోనేనాగులుప్పలపాడు: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. ఆ తప్పుడు పనులను వెనకేసుకురావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో వ్యభిచారం జోరుగా నిర్వహిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు, ఎం.ముప్పాళ్ల గ్రామానికి చెందిన మరో యువకుడు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం ఉప్పుగుండూరు గ్రామంలోని ఓ మహిళ ఇంటి వద్దకు తెలంగాణకు చెందిన ముగ్గురు యువతులు వచ్చారు. దీంతో ఆ మహిళ భర్త ‘ఎవరు వీరు’ అని ప్రశ్నించడంతో సదరు యువతులతో ఉన్న యువకులు దాడి చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సదరు మహిళ కూడా ఒంగోలు జీజీహెచ్లో చేరి ఆ నివేదిక ఆధారంగా పోలీసులను ఆశ్రయించారు. పరస్పర ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఆ మహిళ తీసుకొచ్చిన యువతులు ఎవరు? సదరు యువతులతోపాటు ఆ ఇంటిలో ఉన్న యువకుల పాత్ర ఏమిటన్నది నాగులుప్పలపాడు పోలీసులు ఇంత వరకు వెల్లడించలేదు. ఇదిలా ఉండగా.. సదరు మహిళ భర్త కృష్ణ మాత్రం అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. తన సెల్ఫోన్లో అక్కడి బాగోతాన్ని రికార్డు చేశానని, తనపై దాడి చేసిన వారు ఫోన్ లాగేసుకున్నారని చెబుతున్నాడు. ఫోన్ను రికవరీ చేయాలని తాను పోలీసులను కోరగా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ బాగోతానికి వెన్నుదన్నుగా ఉన్న పోలీసు సిబ్బంది తనను బెదిరిస్తున్నారని కృష్ణ ఆరోపిస్తుండటం సంచలనంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు పారదర్శకంగా విచారణ చేపడితే వాస్తవాలు వెల్లడవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పచ్చ నేత పంచాయితీ.. ఉప్పుగుండూరుకు వచ్చిన యువతులను ప్రశ్నించడంతో దాడి చోటుచేసుకోగా.. పోలీసులు నమోదు చేసిన కేసుల్లో వారి గురించి కనీస ప్రస్తావన చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. యువతులను తరచూ ఇక్కడికి తీసుకొస్తున్న వారే ఓ కానిస్టేబుల్ సహకారంతో ఇటీవల స్టేషన్లో మరమ్మతులు చేయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులు చర్యలకు వెనుకాడుతున్నారనేందుకు ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఉప్పుగుండూరుకు చెందిన ఓ టీడీపీ నేత పోలీస్స్టేషన్లో పంచాయితీ చేయడం, స్టేషన్ నుంచి టీడీపీ నేత వెళ్లిపోగానే తెలంగాణ యువతులు, నిర్వాహకులను ఆగమేఘాల మీద విడుదల చేయడం, వ్యభిచార వ్యవహారాన్ని గుట్టుగానే ఉంచి భార్యాభర్తల గొడవలా చిత్రీకరించేందుకు పోలీసులు యత్నించడంపై స్థానికంగా సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఈ విషయంలో గ్రామంలో టీడీపీ పరువు పోవడంతో డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారు. సామాజిక మాధ్యమాల్లో వైఎస్సార్ సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. అయితే పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించిన జనసేన నేతపై బెదిరింపులకు దిగడం గమనార్హం. ఉప్పుగుండూరులో తెలంగాణ యువతులు వ్యభిచార నిర్వాహకురాలిని భర్త ప్రశ్నించడంతో దాడి కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు నాగులుప్పలపాడు పోలీసులపై ఆరోపణలు ఏకంగా పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు చేస్తున్న పచ్చ నేత -
‘అల్లుకున్న’ ప్రతిభ
● ఒక్కడే 1150 పొగాకు కర్రలు అల్లిన వైనం తాళ్లూరు: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన పూరిమిట్ల బాబు పొగాకు (పచ్చాకు) అల్లికలో ఒక్కడే 1150 పొగాకు కర్రలు అల్లి ప్రతిభ కనబరిచాడు. అదే గ్రామానికి చెందిన మేసీ్త్ర ఆర్ చంద్రపాల్ ముఠాలో ప్రతి రోజు పొగాకు పని చేయటంలో భాగంగా బ్యార్నీకి ఆకు అల్లటానికి వెళ్తుంటారు. సాధారణంగా ఒక బ్యార్నీకి పచ్చాకు (పొగాకు) అల్లాలంటే 8 మంది మగవాళ్లు, 16 మంది మహిళలు అవసరమవుతుంది. కానీ ఆదివారం అద్దంకి మండలం దేనవకొండ గ్రామానికి చెందిన అన్యం ప్రసాద్ అనే రైతుకి బ్యార్నీకి పొగాకు పూరిమిట్ల బాబు ఇద్దరి మహిళల సహాయంతో 1150 కర్రలను అల్లాడు. దీంతో గ్రామ రైతులు, కూలీలు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతిభ కనబరిచిన పూరిమిట్ల బాబుకు రైతు ప్రసాద్ కూలీ డబ్బులతో పాటు అదనపు బహుమతిగా రూ.3116 నగదు అందజేశారు. -
భజే వాయుపుత్రం
అద్దంకి: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శింగరకొండపైనున్న లక్ష్మీ నరసింహ స్వామి, కొండ కింద ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి 71వ వార్షిక ప్రధాన తిరునాళ్ల నేడు కావడంతో ఆలయ పరిసరాలు తిరునాళ్ల శోభను సంతరించుకున్నాయి. ఆలయ రాజగోపురాలు, ప్రాకారాలు రంగు రంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్షేత్రానికి వెళ్లే దారిలో వివిధ రకాల దుకాణాలు, వినోదాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. త్రయాహ్నికంగా (మూడు రోజులపాటు) నిర్వహించనున్న తిరునాళ్ల కార్యక్రమాలు శనివారం ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల తరహా లడ్డూ.. శింగరకొండ తిరునాళ్లకు వచ్చి స్వామి వారిని దర్శించుకునే భక్తులకు తిరుమల తరహా లడ్డూను అందించేందుకు ఆలయ పాలకమండలి ఈవో తిమ్మనాయుడు ఆధ్వర్యంలో తిరుమల నుంచి నిష్ణాతులైన వారిని తీసుకొచ్చి లడ్డూ తయారు చేయిస్తున్నారు. అదే విధంగా ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లతో రూ.50, రూ.100 టికెట్ దర్శనంతో పాటు, ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. తొమ్మిది ప్రభలు.. తిరునాళ్లలో భక్తులను అలరించడం కోసం పరిసర గ్రామాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల సానుభూతిపరులు తొమ్మిది ప్రభలు ఏర్పాటు చేయనున్నారు. వాటిపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరునాళ్ల సందర్భంగా మూడు రోజుల పాటు దేవస్థానం ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి గజ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. ఆదివారం ఉదయం నుంచి వివిధ రకాల పూజలు, రాత్రికి భజనా కార్యక్రమం, హనుమాన్ భజనా బృందంచే కోలాట ప్రదర్శన, నాటక ప్రదర్శన నిర్వహించారు. 30 ప్రత్యేక బస్సులు తిరునాళ్లకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం శింగరకొండలో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అద్దంకి నుంచి 30 ప్రత్యేక బస్సులతోపాటు, ప్రధాన పట్టణాల నుంచి తిరునాళ్లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా భక్తులకు అన్నదాన సత్రాల్లో అన్నదానం చేయనున్నారు. నేటి కార్యక్రమాలు.. సుప్రభాత సేవ, నిత్య విధులతోపాటు, దేవస్థాన వేదపండితులు, వేద విద్యార్థులతో మన్యుసూక్త పారాయణం, హోమం, భజన, కూచిపూడి నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి ఏడు గంటలకు ఆలయం వద్ద రథోత్సవం నిర్వహించనున్నారు. -
సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026
ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెచ్చుమీరుతోంది. కూటమి నాయకుల అండదండలతో వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. నేరుగా డబ్బులు అడిగితే ఇబ్బందుల్లో పడతామని భావిస్తున్న కొందరు జిల్లా అధికారులు కింది స్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారు. చిరుద్యోగులు కాసుల కక్కుర్తితో వసూళ్లకు పాల్పడుతూ ఏసీబీ వలలో చిక్కుతున్నారు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే జిల్లాలోని ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం ఉద్యోగుల్లో కలకలం సృష్టిస్తోంది. కూటమి కంత్రీలు..పచ్చని వసూళ్లు! -
వెలిగొండపై ఇంకెన్నాళ్లు అబద్ధాలాడతారు
మార్కాపురం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుపై ఇంకెన్నాళ్లు అబద్ధాలు ఆడతారని సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు సీఎం చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. మార్కాపురం ప్రెస్క్లబ్లో సీపీఎం ప్లీనరీ సమావేశం సందర్భంగా ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల సీఎం మార్కాపురం వచ్చినప్పుడు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది నేనే.. ప్రారంభించేది నేనే అని చెప్పుకోవడం కాదని, నిర్వాసితుల కష్టాలను అర్థం చేసుకోవాలన్నారు. వచ్చే జులైకి వెలిగొండ నీరు ఇస్తామని ప్రకటించారని, నిర్వాసితులకు ప్యాకేజి ఇవ్వకుండా వారిని ఎలా బయటకు తీసుకొస్తారని ప్రశ్నించారు. 2019 కటాఫ్ తేదీ తరువాత ప్యాకేజికి అర్హత పొందిన వారు చాలా మంది ఉన్నారని, వారందరికీ పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారని, వారిని కుటుంబంగా గుర్తించి ప్యాకేజి ఇవ్వాలన్నారు. గ్రామాలు ఖాళీ చేసే నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్యాకేజి ఇచ్చి పునరావాస కాలనీలో ఇళ్లు కట్టించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇచ్చే ప్యాకేజిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాలని కోరారు. వెలిగొండ కోసం గ్రామాలను, ఇళ్లను త్యాగం చేసిన వారిని ప్రభుత్వం గుర్తించి సంతోషంగా బయటకు తేవాలన్నారు. వెలిగొండ నిర్వాసితులకు తాము అండగా ఉంటామని, అవసరమైతే మళ్లీ పోరాడటానికి సిద్ధంగా ఉంటామన్నారు. సీఎం ప్రకటనల రూపంలో కాకుండా ఆచరణలో, బడ్జెట్లో నిధులు కేటాయించి త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి, జిల్లా కార్యదర్శి సోమయ్య పాల్గొన్నారు. సుంకేసుల గ్రామం సందర్శన పెద్దారవీడు: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల గోడు వినకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు మండిపడ్డారు. సీపీఎం మార్కాపురం జిల్లా ప్రతినిధి బృందం సుంకేసుల గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ఉదారంగా వ్యవహరించాల్సిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల ఊసే ఎత్తకుండా మార్కాపురం జిల్లా పర్యటన ముగించుకోవటం క్షంతవ్యం కాదన్నారు. నిర్వాసితుల సమస్యలు వినడానికి, అర్జీ సైతం తీసుకునేందుకు అనుమతి నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. 2013లో భూ సేకరణ చట్ట ప్రకారం ప్యాకేజి చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి, మార్కాపురం జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హనీఫ్, ఊసా వెంకటేశ్వర్లు, కె మాల్యాద్రి, దోర్నాల మండల కార్యదర్శి డి తిరుపతిరెడ్డి, మార్కాపురం పట్టణ కమిటీ సభ్యులు జవ్వాజి రాజు, రైతు సంఘం సీనియర్ నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీలపై పోలీసు నిర్బంధం
ఒంగోలు టౌన్/పామూరు: అంగన్వాడీలపై చంద్రబాబు ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమంపై నిర్బంధం విధిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని, ప్రీ స్కూళ్లను బలోపేతం చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీలు సోమవారం చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జిల్లాలోని అంగన్వాడీలు విజయవాడకు వెళ్లకుండా అధికారులు, అధికార పార్టీ నాయకుల ద్వారా ఒత్తిళ్లకు గురి చేయడమే కాకుండా పోలీసుల ద్వారా వేధింపులకు పాల్పడుతోందని సీఐటీయూ నాయకులు ఆరోపిస్తున్నారు. విజయవాడ ధర్నాకు వెళ్లకుండా మైనంపాడులోని అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ నివాసం వద్ద ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లను కాపలా పెట్టారు. పొదిలిలోనూ ఇదే తరహాలో పోలీసులు ఒత్తిడి పెంచారు. పొదిలి ప్రాజెక్టు అధ్యక్షురాలు యం.శోభారాణి ఇంటి వద్ద పోలీసులను కాపలా పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పామూరులో అంగన్వాడీ టీచర్లను, యూనియన్ నాయకులను పోలీసు స్టేషన్కు పిలిపించి 8 మందిని బైండోవర్ చేయించారు. అయితే మహిళలను రాత్రి పూట పోలీసు స్టేషన్కు పిలిపించకూడదన్న నిబంధనలను పట్టించుకోకుండా మహిళా నాయకురాళ్లను రాత్రి పూట పోలీసు స్టేషన్కు పిలిపించాల్సిన అవసరమేముందని యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమర్ధనీయం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు చేస్తున్న పోలీసులు నాయకుల ఇంటి చిరునామాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు చోట్ల నేరుగా నాయకుల ఇళ్లకు వెళ్లి విజయవాడ ధర్నాకు వెళ్లవద్దని బెదిరించినట్లు సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అంగన్వాడీలు విజయవాడ వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు యూనియన్ నాయకులు చెబుతున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అంగన్వాడీలను ఇళ్లకు పిలిపించుకొని ఒత్తిడి చేస్తున్నట్లు సీఐటీయూ నాయకులు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా విజయవాడ ధర్నాను విఫలం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించడం ఏమిటని అంగన్వాడీ యూనియన్ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అదే తరహాలో నిర్బంధాలకు పాల్పడుతోందని గుర్తు చేస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
● రూ.20 వేలు నగదు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు గుడ్లూరు: వీఆర్వో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న సంఘటన గుడ్లూరులో శనివారం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... గుడ్లూరుకు చెందిన రామాల మాధవరెడ్డి స్థానిక పెద్ద చెరువులోని మట్టిని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు అడ్డుకొని రెండు జేసీబీలు, ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈ వాహనాలను విడుదల చేసుకునేందుకు మాధవరెడ్డి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నాడు. అయితే వాటిని తహసీల్దార్ కార్యాలయం ద్వారా రిలీజ్ చేయించుకోవాలంటే ష్యూరిటీ సర్టిఫికెట్లు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో మాధవరెడ్డి స్నేహితుడైన కె.వెంకట్రావు పేరుపై ష్యూరిటీ సర్టిఫికెట్లకు దరఖాస్తు చేసుకున్నాడు. సర్టిఫికెట్ల విషయమై వీఆర్వో చలమారెడ్డిని సంప్రదించారు. ష్యూరిటీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి చలమారెడ్డి రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని మాధవరెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. అధికారుల సూచనలతో వీఆర్వోను పట్టుకునేందుకు పథకం రచించారు. వీఆర్వోకి మాధవరెడ్డి ఫోన్ చేసి గుడ్లూరులోని ఓ దుస్తుల దుకాణంలోకి వస్తే మీరు అడిగిన నగదు ఇస్తానని చెప్పాడు. దీంతో వీఆర్వో దుస్తుల షాపులోకి వచ్చారు. మాధవరెడ్డి తెచ్చిన నగదును ఒక కవర్లో పెట్టి వీఆర్వోకి ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు వీఆర్వోను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయన్ను తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు, సీఐ విజయ్ కుమార్, మరో ముగ్గురు సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. -
జలతరింగిణి–2026 క్రీడలు ప్రారంభం
ఒంగోలు సబర్బన్: జలతరంగిణి–2026 వార్షిక క్రీడాపోటీలను హైదరీ ఆఫీసర్ క్లబ్లో శనివారం కన్స్ట్రక్షన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్. అబూతలీం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న జలవనరుల శాఖా ఉద్యోగులకు క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిట్ పోటీలు నిర్వహిస్తామన్నారు. విజేతలను జోనల్ పోటీలకు పంపుతామన్నారు. డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ జీ బాలమురళీ కృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులకు ఇలాంటి పోటీలు నిర్వహించటం ఆనంద దాయకం అని, వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని సద్వినియోగించుకోవాలన్నారు. ఈ పోటీలకు నోడల్ అధికారి అయిన చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) కె.రమేశ్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. పోటీల నిర్వహణకు కోఆర్డినేటర్లు వి.నికేష్, బి.కృష్ణ కిషోర్, కె.సునీల్ కుమార్, టి.వేణు బాబులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంఘం జిల్లా అధ్యక్షుడు రాకేష్ బాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ తేజ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. -
తౌషిక్ మృతి కేసులో పోలీసుల వైఫల్యం
సింగరాయకొండ: స్థానిక శ్రీ చైతన్య నవోదయ స్కూలులో అనుమానాస్పదంగా మృతి చెందిన తౌషిక్ కేసులో పోలీసులు, త్రిసభ్య కమిటీ మొక్కుబడి విచారణ జరుపుతూ స్కూలు యాజమాన్యానికి అండగా ఉన్నారని, ఈ కేసుపై జ్యుడిషియల్ విచారణ చేసి బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సరస్వతి కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం ఆయన విద్యార్థి తల్లిదండ్రులు సయ్యద్ ఆలీ, మౌలాబితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ సాయంత్రం 6వ తరగతి చదువుతున్న తౌషిక్ (11) అనుమానాస్పద మృతి వ్యవహారంలో వార్డెన్ కాని వార్డెన్ బాబ్జీకి, కరస్పాండెంట్ కుమారుడు చైతన్యకు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని సంబంధం ఉందని ఆరోపించారు. విద్యార్థిపై ఉన్న దెబ్బలను బట్టి గోడకేసి కొట్టి కానీ, గొంతునులిమి కానీ చంపేశారని ఈ ఘటనను ఆత్మహత్యగా సృష్టించి తమకు ఉన్న పలుకుబడితో కేసు నుంచి బయటపడతామన్న ధీమాతో చంపేశారని ఆరోపించారు. పోలీసులు మాత్రం నేటికీ విచారణ జరుపుతున్నామని చెబుతున్నారన్నారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనుమానితుల పేర్లను చేర్చి దోషులను అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులు స్కూలు యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఈ కోచింగ్ సెంటర్కు గానీ, పాఠశాలకు కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లేవని, హాస్టల్ భవనానికి అనుమతులు లేవన్నారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న ఇద్దరు మహిళలకు, వార్డెన్ బాబ్జీ, కరస్పాండెంట్ కుమారుడు చైతన్యకు మధ్య ఉన్న సంబంధాన్ని పోలీసులు నిజాయితీగా విచారిస్తే కేసు కొలిక్కి వస్తుందని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎస్సై మహేంద్ర, సీఐలు బాధితుల పక్షాన నిలబడకుండా ఫిర్యాదు చేయటానికి వచ్చిన వారిని బూతులు తిట్టి భయభ్రాంతులకు గురి చేశారని, దీంతో వీరిని కాదని కేసు విచారణ అధికారిగా కందుకూరు సీఐ షేక్ అన్వర్బాషాను నియమిస్తే ఆయన కూడా స్కూలు లో విచారణ చేయకుండా కనిగిరి పోయి విచారిస్తూ యాజమాన్యానికి కొమ్ముకాసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో విద్యాశాఖామంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. స్కూలు గుర్తింపును రద్దు చేయటంతో పాటు స్కూలు యాజమాన్యాన్ని, వార్డెన్ బాబ్జీని, ఇద్దరు టీచర్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.35 లక్షలు చేతులు మారాయని ఎస్సై, ఇద్దరు సీఐలు, డీఈఓ, ఎంఈఓలను సస్పెండ్ చేయాలన్నారు. విద్యార్థి మృతి ఘటనపై ప్రజాసంఘాలు, కుల సంఘాలు న్యాయం చేయాలని పోరాటం చేస్తుంటే మంత్రి స్వామి మాత్రం ఈ రోజు వరకు స్పందించలేదని, కనీస భాధ్యతగా విచారణ జరపలేదని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ 11వ సంవత్సరాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని స్కూలు యాజమాన్యం చెప్పటం దానిని పోలీసులు సపోర్టు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎస్సై మహేంద్ర బాధితులు తమ కొడుకు చనిపోయాడని ఫిర్యాదు చేయటానికి వస్తే వారిని బూతులు తిట్టడం బాధాకరమన్నారు. వారిపైనే కేసులు పెడతాననడం ఎస్సై నిరంకుశతత్వానికి నిదర్శనమన్నారు. కరేడు మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు విద్యార్థిని ప్రత్యక్షంగా చంపేస్తే పోలీసులు పరోక్షంగా హత్య చేశారని ఆరోపించారు. కలెక్టర్ వేసిన త్రిసభ్య కమిటీ పత్తా లేదన్నారు. మైనారిటీ నాయకుడు షేక్ సుల్తాన్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయన్నారు. బిడ్డ చనిపోయాడు ఎస్సై ని కేసు తీసుకోమంటే పట్టించుకోకుండా వారిపైనే నిందలు వేశాడని, అతను అవినీతికి నిలువెత్తు రూపంగా మారారని ఆరోపించారు. విద్యార్థి తండ్రి ఆలీ మాట్లాడుతూ కుమారుడు చనిపోయినప్పుడు జరిగిన ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించారు. కుమారుడి మృతదేహాన్ని స్కూలు వద్దకు తీసుకొచ్చినప్పుడు ఎస్సై మహేంద్ర మాపై కేసులు పెడతామని బెదిరించి తరువాత ఇది హత్యే.. నేను కేసు నమోదు చేస్తానని మాయమాటలు చెప్పి తెల్లారి మాట మార్చి మాపైనే కేసులు పెడతామని బెదిరించారని ఆరోపించారు. అంతకు ముందు ఈశ్వరయ్య తన పార్టీ నాయకులతో కలిసి స్కూలును, ఘటనా స్థలాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. పార్టీ నాయకులు వీరారెడ్డి, ఆర్ వెంకటరావు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కూటమితో విలపింఛన్
మర్రిపూడి: భర్త మరణించి ఆదరువు కోల్పోయిన భార్య వితంతు పింఛన్ కోసం రెండేళ్లుగా ఎదురు చూసింది. ఎట్టకేలకు పింఛన్ మంజూరైనా కూటమి నాయకులు కక్ష కట్టి ఆమెకు పార్టీలు అంటగట్టి పింఛన్ ఇవ్వకుండా అధికారులను కట్టడి చేశారు. దీంతో మూడు నెలల నుంచి పింఛన్ అందడం లేదని ఆమె విలపిస్తోంది. బాధితురాలి కథనం మేరకు.. మండల పరిధి మర్రిపూడి పంచాయతీలోని పొట్టిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చందల నర్సయ్య, అచ్చమ్మలు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. వీరికి ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికీ పెళ్లిళ్లు అయి వేరు కాపురం ఉంటున్నారు. అనారోగ్యంతో కుటుంబ పెద్ద అయిన నర్సయ్య (70) 2024 ఏప్రిల్ 15న మరణించాడు. అప్పటి నుంచి అచ్చమ్మ ఒంటరిగా ఉంటోంది. వితంతు పింఛన్ కోసం రెండేళ్ల పాటూ కార్యాలయాల చుట్టూ తిరిగింది. ఎట్టకేలకు పింఛన్ (పెన్షన్ ఐడీ: 108931649) మంజూరు చేయించుకుంది. అయితే దేవుడు కరుణించినా పూజారి మాత్రం కరుణించలేదన్న చందాన తయారైంది అచ్చమ్మ పరిస్థితి. ఆమెకు మంజూరైన పింఛన్కు కూటమి నాయకులు మోకాలడ్డుతున్నారు. ఈ విషయంపై 4 సార్లు కలెక్టర్ను సంప్రదించానని అచ్చమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 5 వ సారి జాయింట్ కలెక్టర్ ముందు గోడు వెళ్లబోసుకుంది. మర్రిపూడి ఎంపీడీఓ నాగూర్వలికి జేసీ ఫోన్చేసి మంజూరైన పింఛన్ను ఎందుకు ఆపుతున్నారని.. మీవద్ద నగదు ఉందికదా? ఆమె పింఛన్ సొమ్ము ఇచ్చి తనకు సమాచారం ఇవ్వాలని ఆదేశించినా అధికారులు ఇవ్వలేదని ఆమె విలపించింది. మంజూరైన మొదటి నెల పింఛన్ ఇవ్వకుండా రెండో నెలలో మొత్తం పింఛన్ సొమ్ము రూ.8 వేలు తీసుకుందువు వెళ్లిపో అన్నారు. రెండో నెలలో సచివాలయానికి వెళ్తే స్థానిక టీడీపీ నాయకులు, మంత్రి స్వామి, సత్య అందరూ పింఛన్ను ఆపమన్నారని కార్యదర్శి నాయుడు చెబుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన వృద్ధురాలు మంజూరైన మూడు నెలల పింఛన్ సొమ్ము ఇస్తారేమోనని వృద్ధురాలు చందల అచ్చమ్మ శనివారం స్థానిక సచివాలయానికి వెళ్లింది. పింఛన్ సొమ్ము ఇస్తావా లేదా? అని పంచాయతీ కార్యదర్శి నాయుడును నిలదీసింది. ఏం సమాధానం చెప్పలేక ఆయన మిన్నకుండిపోయాడు. అచ్చమ్మను చూసి కార్యదర్శి బయటకు వెళుతున్న తరుణంలో ఆమె పెద్ద కుమారుడు సుబ్బారెడ్డి సైతం పిలుస్తున్నా వినిపించుకోకుండా పలాయనం చిత్తగించాడు. పింఛన్ మంజూరైనా ఇవ్వకుండా నాయకులు అడ్డుకుంటున్నారని నా ఉసురు తగిలి కూటమి ప్రభుత్వ నాశనం అయిపోతుందని ఆమె శాపనార్థాలు పెట్టింది. ఈ విషయంపై ఎంపీడీఓ ఎస్కే నాగూర్వలి, పంచాయతీ కార్యదర్శి నాయుడును వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారి నుంచి స్పందన లేదు. -
ఆర్టీసీలో మౌలిక వసతులపై శ్రద్ధ చూపండి
ఒంగోలు టౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ను కలెక్టర్ పి.రాజాబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల ఇబ్బందులను స్వయంగా పరిశీలించేందుకు బస్టాండ్ మొత్తం కలియతిరిగారు. డిపోలోని పరిస్థితులను గమనించారు. బస్టాండులో ఉన్న రద్దీ, మరుగుదొడ్ల పరిస్థితి, పార్కింగ్ సదుపాయాలను పరిశీలించారు. మౌలిక వసతులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు నగరానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చిపోతుంటారని, వారికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై మరింత శ్రద్ధ చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, పారిశుధ్యంపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించి మాట్లాడుతూ.. సదుపాయాలపై మరింత దృష్టి సారించాలని చెప్పారు. వారం రోజుల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించి తనకు నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. నెల రోజుల్లో డిపో రూపురేఖలు మార్చే విధంగా గణనీయమైన మార్పులు చేపట్టాలని స్పష్టం చేశారు. తనిఖీల్లో జిల్లా ప్రజా రవాణా అధికారి జి.సత్యనారాయణ, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ మధుసూదనరావు, డిపో మేనేజర్ ఘట్టమనేని శ్రీనివాసరావు, ట్రాఫిక్ సూపర్వైజర్ ఫణికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజాబాబు -
రాజకీయ లబ్ధి కోసమే కల్తీ లడ్డూ వివాదం
ఒంగోలు టౌన్: రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ లడ్డూ వివాదాన్ని రేపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఒంగోలులోని మల్లయ్యలింగం భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డూ నిజంగా కల్తీ జరిగి ఉంటే ఎప్పుడు జరిగిందో, ఎలా జరిగిందో, ఏ ల్యాబ్లో నిర్థారణ చేశారో తెలపాలని కోరారు. కల్తీ లడ్డూ విషయం ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేని స్థితిలో, చట్టాన్ని చెప్పు చేతుల్లోకి తీసుకొని భౌతిక దాడులకు పాల్పడే వారి చేతుల్లోకి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కల్తీ జరగని ఆహారం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రం కల్తీ ఆహారానికి కేంద్రంగా తయారైందని ఆరోపించారు. తాగే నీరు, పసి పిల్లలు తాగే పాలు ప్రజల ప్రాణాలను బలిగొంటుంటే పట్టించుకోకుండా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా లడ్డూ కల్తీ ఆరోపణలతో కాలయాపన చేయడం క్షమార్హం కాదన్నారు. ఇప్పటికై నా లడ్డూ వివాదానికి స్వస్తి పలికి రాష్ట్ర ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించకుండా సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఒట్టిచేతులతో వెలిగొండను సందర్శించడం వలన ఉయోగమేమిటని ప్రశ్నించారు. నేటి నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటింటికీ తిరిగి సామాజిక సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సహాయ కార్యదర్శి ఆర్.వెంకటరావు, నగర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ● ఎదురెదురుగా కారు–మోటారు సైకిల్ ఢీ ● ఇద్దరు గిరిజన యువకులకు తీవ్రగాయాలు పెద్దదోర్నాల: ఎదురెదురుగా వచ్చిన కారు – మోటారు సైకిల్ ఢీకొని ఇద్దరు గిరిజన యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిన్నమూల టర్నింగ్ వద్ద శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నంద్యాల జిల్లా పెచ్చెరువు గూడేనికి చెందిన గిరిజన యువకులు దాసరి మూగెన్న, దాసరి నాగన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం మేరకు.. పెద్దదోర్నాల నుంచి నంద్యాల జిల్లా పెచ్చెరువుకు మోటారు సైకిల్పై వెళ్తున్న దాసరి మూగెన్న, దాసరి నాగన్నలను శ్రీశైలంలో దైవదర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న కారు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పెద్దదోర్నాల ప్రభుత్వ వైధ్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శ -
ప్రజాధనం దుర్వినియోగం
మార్కాపురం టౌన్: చూస్తూచూస్తూ ప్రజాధనాన్ని అధికారులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే దానికి అద్దం పట్టే సంఘటన శనివారం జిల్లా కేంద్రమైన మార్కాపురంలో జరిగింది. అధికారులకు ముందుచూపు లేకపోతే ప్రజాధనం ఎలా నిరుపయోగం అవుతుందో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. మార్కాపురంకు ఏడాది వ్యవధిలో రెండుసార్లు ముఖ్యమంత్రి, ఒకసారి ఉప ముఖ్యమంత్రి వచ్చారు. వారు వచ్చినప్పుడు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు మొదట్లోనే ఆర్అండ్బీ అధికారులు ప్రభుత్వ స్థలంలో శాశ్వత ప్రాతిపదికపై హెలిప్యాడ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. కానీ, అలా చేయలేదు. ఆర్అండ్బీ, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయాల్సిన హెలిప్యాడ్ను ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేశారు. ఒకసారి హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వచ్చివెళ్లిన తర్వాత ఆ స్థలం యజమాని జేసీబీతో హెలిప్యాడ్ను తొలగించారు. మార్కాపురం జిల్లాలో ఈ నెల 25వ తేదీ జరిగిన సీఎం సభకు సాయిబాలాజీ స్కూల్ ఎదురుగా ప్రైవేటు వ్యక్తుల స్థలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను కూడా శనివారం సదరు స్థలం యజమాని తొలగించారు. దీంతో హెలిప్యాడ్ కోసం ఖర్చు పెట్టిన సుమారు రూ.5 లక్షల ప్రజాధనం దుర్వినియోగం అయింది. అదే హెలిప్యాడ్ను ప్రభుత్వం స్థలంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకుని ఉంటే బాగుండేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లను కూడా ఇలాగే తొలగించడంతో వాటికి పెట్టిన ఖర్చు కూడా వృథా అయిందని, పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసి ధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం సమంజసం కాదని అధికారుల తీరును ప్రజలు విమర్శిస్తున్నారు. హెలిప్యాడ్ ధ్వంసంతో రూ.5 లక్షల ప్రభుత్వ నిధులు నిరుపయోగం -
వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీ చించివేత
మార్కాపురం రూరల్: తర్లుపాడు మండలంలోని కారుమానుపల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని టీడీపీ కార్యకర్తలు శనివారం చించివేశారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దొండపాటి ఇంద్రారెడ్డి ఇటీవల పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గ్రామానికి వచ్చినప్పుడు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దానిని అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త జీ శ్రీనివాసరెడ్డి, మరో వ్యక్తి కలిసి పూర్తిగా చించివేయడంతో ఫ్రేమ్ మాత్రమే మిగిలిందని ఇంద్రారెడ్డి తెలిపారు. తమ గ్రామానికే చెందిన వ్యక్తి తనను ఫోన్లో బెదిరిస్తూ మాట్లాడాడని, ఆ విషయాన్ని అన్నా రాంబాబుకు, పోలీసులకు తాను చెప్పానని, దాన్ని మనసులో పెట్టుకుని ఫ్లెక్సీ చించివేశారని ఇంద్రారెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీ వలన ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదని, ఉద్దేశపూర్వకంగా దాన్ని చించివేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మహిమాన్వితం.. శింగరకొండ క్షేత్రం!
అద్దంకి రూరల్: కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు నమ్మకంతో మహిమాన్విత క్షేతంగా విరాజిల్లుతోంది శింగరకొండ. శింగరకొండ క్షేత్రం 14వ శతాబ్ధం నాటికే కొండపై లక్ష్మీ నరసింహాస్వామి దేవాలయం భక్తుల పూజలందుకుంటోంది. సుమారు 150 ఏళ్ల క్రితం లక్ష్మీనరసింహాస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ధ్వజ స్తంభం ప్రతిష్ట జరుగుతుండగా భవనాశి తటాకం ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం తేజోవంతమై యోగీశ్వరుడు కొండ దిగువున ప్రసన్నాంజనేయస్వామి విగ్రహాన్ని పూజించి అదృశ్యమయ్యాడు. ఆ అద్భుతాన్ని కొండపై నుంచి చూసిన వేలాది మంది భక్తుల కొండ దిగి వచ్చి భక్తిశ్రద్ధలతో స్వామి వారిని పూజించి తరించారు. అప్పటి నుంచి శింగరకొండలో వెలసిన ప్రసన్నాంజనేయస్వామి వారి దేవస్థానం దివ్యక్షేత్రమై విరాజిల్లుతోంది. దక్షిణాభిముఖం ఆలయం విశిష్టత శ్రీరామ చంద్రుడి ఆజ్ఞ మేరకు సీతమ్మ తల్లిని వెతుకుతూ దక్షిణ పథంగా బయల్దేరిన ఆంజనేయుడు ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడని ఒక నమ్మకం. అందువల్లే ఈ క్షేత్రంలో ప్రసన్నాంజనేయుడు నెలవై ఉన్న దేవాలయం దక్షిణ ముఖంగా ఉంది. అన్ని దేవాలయాలు తూర్పు, ఉత్తర ముఖ ద్వారాలు కలిగి ఉండగా ఒక్క శింగరకొండ క్షేత్రం దక్షిణాభిముఖం కలిగి ఉండటం విశేషం. కొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి, కొండ కింద ప్రసన్నాంజనేయుడి దేవాలయాలతో ఉభయ దేవతా క్షేత్రంగా పేరుపొందిన శింగరకొండ క్షేత్రం దర్శనం సర్వపాపాల నివారిణిగా భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి మంగళ, శనివారాల్లో విశేష పూజలు, ఉగాది, శ్రీరామనవమి, హనుమజ్జయంతి, ముక్కోటి, సంక్రాంతి, తిరునాళ్లకు భక్తులు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతారు. తమల పాకులు పూజలు, అరటి పండ్ల పూజ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నుంచి చదుర్ధశి వరకు గత నెల 28వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు 71వ వార్షిక తిరునాళ్ల జరుగుతుంది. 2వ తేదీన జరిగే ప్రధాన తిరునాళ్ల రాత్రికి భక్తులు ఏర్పాటు చేసే విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తిరునాళ్లకు వచ్చే భక్తులకు అన్ని సామాజిక వర్గాలకు చెందిన సత్రాలు అన్నప్రసాదాన్ని అందజేస్తున్నాయి. వినోదానికి భారీ జెయింట్ వీల్, మ్యాజిక్ చైర్స్, పిల్లలకు రంగుల రాట్నాలు సిద్ధంగా ఉన్నాయి. కొండపై లక్ష్మీనరసింహస్వామి, కొండ కింద ప్రసన్నాంజనేయస్వామి దక్షిణాభిముఖంగా వెలసిన ప్రసన్నాంజనేయస్వామి ఆలయం క్షేత్ర దర్శనం సర్వపాపాల నివారిణిగా భక్తుల నమ్మకం 71వ వార్షిక తిరునాళ్ల ప్రారంభం తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి ప్రత్యేక ఆకర్షణగా ప్రభలు క్షేత్రాన్ని చేరుకునే మార్గం ఇలా.. ఒంగోలు నుంచి బస్సులో అద్దంకి చేరుకున్న తర్వాత అద్దంకి నుంచి 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న శింగరకొండకు ప్రతి 30 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్ వైపు నుంచే భక్తులకు సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం జంక్షన్ నుంచి నామ్ హైవేపై నేరుగా రావచ్చు. తిరునాళ్ల ప్రత్యేక రోజుల్లో అద్దంకి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు. -
జెడ్పీ స్థాయి సంఘ సమావేశం
ఒంగోలు సిటీ: జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. జెడ్పీ కార్యాలయంలో సీఈఓ చిరంజీవి అధ్యక్షత వహించారు. 5వ స్థాయి సంఘం సీ్త్ర, శిశు సంక్షేమశాఖ స్థాయి సంఘానికి మారెడ్డి అరుణకుమారి అధ్యక్షత వహించారు. 2వ స్థాయి సంఘమైన గ్రామీణాభివృద్ధి శాఖ పై సమీక్షించేందుకు మూడు జిల్లాలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. 3వ స్థాయి సంఘమైన వ్యవసాయం, 4వ స్థాయి సంఘమైన విద్య, వైద్యం, ఆర్ధిక విషయాలపై సమీక్ష నిర్వహించారు. పై విషయాలపై మూడు జిల్లాలకు సంబంధించిన అధికారులు హాజరై సమాచారం ఇచ్చారని సీఈఓ తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ● డీఈఓ సీవీ రేణుక ఒంగోలు సిటీ: 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని సంతనూతలపాడు, గణపవరం, అమ్మనబ్రోలు గురుకుల విద్యాలయాల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. డీఈఓ కార్యాలయంలో శనివారం గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం వాల్పోస్టర్ను డీఈఓ రేణుక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీఆర్ఎస్ క్యాట్–2026, రాష్ట్రంలోని 7 జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్లో ప్రవేశానికి, ఒక డిగ్రీ కళాశాల (బాలుర, నాగార్జునసాగర్) మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 తుది గడువు అని తెలిపారు. ఏపీఆర్ఎస్ క్యాట్–2026 పరీక్ష ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఏపీఆర్జేసీ అండ్ డీసీ సెట్–2026 పరీక్ష ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జిల్లా కేంద్రాల్లో జరుగుతుందని తెలిపారు. వివరాలకు 87126 25043, 87126 25044 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
పదిలమేనా!
బేస్తవారిపేట: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 354 ప్రభుత్వ పాఠశాలల్లో 16,954 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో బాలికలు 9,375, బాలురు 7,579 మంది ఉన్నారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ తరగతులు జరుగుతాయి. ఇంటికి చేరుకునే సరికి ఆరు గంటలు దాటుతోంది. దూర ప్రాంతాల పిల్లలకు రాత్రి 8 గంటలు దాటుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు అందించే మధ్యాహ్న భోజనం మాత్రమే అందుతోంది. ఫలితంగా విద్యార్థులు నీరసించిపోతున్నారు. అల్పాహారం అందక అవస్థలు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల కార్యక్రమానికి నిధుల కొరత సమస్యగా మారింది. ప్రత్యేక తరగతులకు విద్యార్థులు ఇంటి నుంచి బయలు దేరి ఇంటికి చేరే సరికి దాదాపు 12 గంటల సమయం అవుతోంది. ఉదయం 7.30కి పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో పాటు అల్పాహారం అందించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అల్పాహారానికి నిధులు విడుదలచేయలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా 16,954 మంది విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. సాయంత్రం వరకు చదువుకుంటున్న విద్యార్థులు నీరసించిపోతున్నారు. కాలే కడుపుతో చదువుపై పూర్తి స్థాయిలో ఏకాగ్రత నిలపలేక ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ విద్యార్థుల అవస్థలు గ్రామీణ ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నాలుగైదు కి.మీ.లు నడిచి వచ్చే విద్యార్థులు ఇంటికి వెళ్లే సరికి రాత్రి ఏనిమిది గంటలు అవుతుండడంతో.. వారు పూర్తిగా నీరసించిపోతున్నారు. ఉదయం వంట కాకపోవడంతో మధ్యాహ్నం వరకు ఖాళీ కడుపుతో ఉండి క్లాసులు వినాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు వాపోతున్నారు. తగ్గుతున్న హాజరు శాతం ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆరోగ్యంపై చూపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు సమస్యలు ఎదురవుతుండడంతో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని తెలుస్తోంది. రోజువారి హాజరు పరిశీలిస్తే 15 నుంచి 20 శాతం మంది విద్యార్థులు సక్రమంగా స్టడీ అవర్స్కు రావడంలేదు. తల్లిదండ్రులను సంప్రదించినా ఫలితం ఉండడం లేదని తెలుస్తోంది. -
గ్రావెల్ అక్రమంగా తరలింపు
గుడ్లూరు: మండలంలోని కొత్తపేట చెరువు నుంచి గ్రావెల్ను అధికార పార్టీ నాయకుల అండతో అక్రమార్కులు కొందరు బయటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి తవ్వకాలు జరపుతుండటంతో కొత్తపేట గ్రామస్తులు కొందరు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. వారు అక్కడ ఉన్నంత వరకు తవ్వకాలు నిలిపేసిన అక్రమార్కులు ఆ తర్వాత యథావిధిగా తవ్వకాలు ప్రారంభించారు. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ అధికారులకు సమాచాం ఇచ్చినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విలువైన మట్టి, గ్రావెల్ను ఎలాంటి అనుమతులు లేకుండా కొత్తపేట పంచాయతీలోని ఓ ప్రైవేటు వెంచర్కు తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకుల అండదండలతో యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నారు. ఓ జేసీబీతో పాట్లు నాలుగు ట్రాక్టర్లు రాత్రి వేళల్లో మట్టి తరలించడంపై అధికారులు స్పందించి గ్రావెల్ తవ్వకాలు నిలిపేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
శాసీ్త్రయ ఆలోచనలను రేకెత్తించడమే జేవీవీ లక్ష్యం
ఒంగోలు టౌన్: ప్రజల్లో ముఖ్యంగా చిన్నారులు, విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక పనిచేస్తుందని జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ జయప్రకాష్ చెప్పారు. స్థానిక ఎల్బీజీ భవనంలో శనివారం జేవీవీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకుడు ఏవీ పుల్లారావు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ 1988వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ జేవీవీ ఆవిర్భవించిందని, మూఢనమ్మకాల నిరోధం, పర్యావరణ పరిరక్షణ, అందరికీ విద్య, నాణ్యమైన వైద్యం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆ సంస్థ రిసోర్స్పర్సన్ డి.వీరాంజనేయులు మాట్లాడుతూ చిన్నారుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిశోధనలు, సైన్స్ ప్రయోగాలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి యురేకా కాంపిటేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు పాఠశాలల యజమాన్యాలు, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఈనెల 8వ తేదీలోపు తమ ప్రయోగాల వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, పూర్తి వివరాలకు 85002 32432కు సంప్రదించాలని తెలిపారు. మార్కాపురం: మెడికల్ మాఫియాను అరికట్టాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు అందె నాసరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన మందులు, వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే కాశిం, మాజీ కౌన్సిలర్ పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. -
అర్ధాకలితో
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామంటూ విద్యాశాఖ ఊదరగొట్టింది. ఇందుకోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పింది. అయితే విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది. దాదాపు పది గంటల పాటు పాఠశాలలో ఉండే విద్యార్థులకు అల్పాహారం అందించాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు విడుదలచేయకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో అల్లాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయులు దాతల సహకారం తీసుకుని స్నాక్స్ అందిస్తున్నారు. దాతలు సహకారంతో.. వంద రోజుల ప్రణాళికతో వంద శాతం ఉత్తీర్ణతతో పాటు ఉత్తమ ఫలితాల కోసం ప్రభుత్వం ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఫలితాలపై ఉన్న దృష్టి విద్యార్థుల ఆరోగ్యంపై సారించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థులకు అల్పాహారం అందించాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదలజేయలేదు. అల్పాహారం అందించాలంటే ఒక్కో పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రోజుకు రూ.1000 నుంచి రూ.2 వేలు ఖర్చవుతోంది. విద్యార్థుల అవస్థలు చూడలేక కొన్ని పాఠశాలల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అర్ధాకలితో అల్లాడిపోతున్న వారికి అల్పాహారం అందించేలా చర్యలు తీసుకున్నారు. పూర్వ విద్యార్థులు, గ్రామంలోని పెద్దలకు పరిస్థితిని వివరించి మజ్జిగ, పండ్లు ఇచ్చేందుకు నిధులు సమీకరించారు. -
మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): సంతనూతలపాడు మండల పరిధిలోని ఎండ్లూరు డొంకలో గల జిల్లా మహిళా ప్రాంగణంలో మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ మాదవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 15 నుంచి 45 సంవత్సరాల్లోపు నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు పూర్తి వివరాలకు 6302733492, 9000850869 నంబర్లను సంప్రదించాలని కోరారు. పుల్లలచెరువు: ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకుగాను పుల్లలచెరువు మండలం చాపలమడుగు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ వి.శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఇన్చార్జి కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీఓ మరియదాసు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు 12,75,012 రూపాయలను శ్రీనివాసరావు అక్రమంగా వాడుకున్నారని డిప్యూటీ ఎంపీడీఓ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి, ఆ మేరకు సస్పెండ్ చేశారని ఎంపీడీఓ వెల్లడించారు. మార్కాపురం రూరల్: అర్ధవీడు మండలంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో లేని మొక్కలను ఉన్నట్టుగా చూపుతూ లక్షల రూపాయల అవినీతికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ఈసీ(ఇంజినీరింగ్ కన్సల్టెంట్) బెల్లంకొండ కిశోర్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం మార్కాపురం ఉపాధి హామీ పథకంలో ఈసీగా విధులు నిర్వర్తిస్తున్న కిశోర్కుమార్ను సస్పెండ్ చేస్తూ డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జోసెఫ్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మార్కాపురం టౌన్: ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నరేష్కుమార్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్ధి టి.గోపాల్రెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షునిగా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన ఏరువ శేషశయనారెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు తనకు రాష్ట్ర కమిటీ నుంచి నియామకపత్రం అందినట్లు ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెడ్డి సంఘం కీర్తి ప్రతిష్ఠలు పెంచుతానని పేర్కొన్న ఆయన తనకు పదవీ బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. -
భవనం పైనుంచి పడి మహిళా కూలీ మృతి
కనిగిరి రూరల్: నిర్మాణంలో ఉన్న భవనం రెండో అంతస్తు నుంచి ఓ మహిళా కూలీ ప్రమాదవశాత్తు జారి పడటంతో తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఈ సంఘటన కనిగిరి పట్టణంలోని కేశిరెడ్డి నగర్లో శుక్రవారం చోటుచేసుకుంది. కనిగిరి అర్బన్ కాలనీకి చెందిన పందిటి రాధ(40), తన భర్త బ్రహ్మయ్యతో కలిసి కేశిరెడ్డి నగర్లో భవన నిర్మాణ పని చేస్తోంది. ఈ క్రమంలో రెండో అంతస్తులో పని చేస్తూ జారి కింద పడటంతో తల, మెడ భాగంలో బలమైన గాయాలయ్యాయి. కనిగిరిలోని ఓ ఆస్పత్రిలో ప్రథక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో పరిస్థితి విషమించడంతో కందుకూరులోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ రాధ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ విషయమై తమకు ఎటువంటి సమాచారం లేదని పోలీసులు చెప్పారు. -
తాకట్టు పెట్టిన బంగారాన్ని అమ్మేశారు
గిద్దలూరు రూరల్: తాము తాకట్టుపెట్టిన బంగారాన్ని అమ్మేశారని, తిరిగి తూకం తక్కువ బంగారాన్ని ఇస్తామంటున్నారని గిద్దలూరు పట్టణంలోని కుమ్మరాంకట్టసెంటర్ వద్ద ఉన్న మణప్పురం గోల్డ్లోన్ కార్యాలయం ఎదుట శుక్రవారం బాధిత కుటుంబం నిరసన వ్యక్తం చేసింది. గుండ్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన దూదేకుల హజరత్, రమీజాబీ దంపతులు వారి కుమారుడితో సహా నిరసనకు దిగారు. గోల్డ్ లోన్ కార్యాలయం తెరవనివ్వకుండా మెట్లపై బైఠాయించి అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 2024 మార్చి 12వ తేదీ హజరత్ కుటుంబానికి డబ్బులు అవసరమై 37 గ్రాముల కేడీఎం బంగారంతో తయారు చేసిన నల్లపూసల దండను రూ.82 వేలకు తన పేరు మీద హజరత్ తాకట్టు పెట్టాడు. కాగా మణప్పురం గోల్డ్లోన్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఒకరు ఆ బంగారాన్ని అతని బంధువు దమ్ము గోపాల్ పేరు మీదకు మార్చుకుని సెప్టెంబర్ 2026లో విక్రయించాడు. తాకట్టు పెట్టిన తన బంగారం వస్తువును తనకు ఇప్పించాలని నాలుగు రోజుల క్రితం మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయం వద్దకు హజరత్ వెళ్లగా అసలు విషయం వెలుగుచూసింది. దీనిపై మణప్పురం గోల్డ్ సిబ్బందిని నిలదీయగా.. విషయం బయటపడితే కంపెనీ పరువుపోతుందని భావించిన సిబ్బంది.. హజరత్ బంగారంకు బదులుగా అదే తూకంలో బంగారం ఇస్తామంటూ నచ్చజెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో హజరత్ అందుకు అంగీకరించాడు. కానీ, మణప్పురం గోల్డ్ లోన్ వారు హజరత్కు కేడీఎం బంగారం కాకుండా తక్కువ రకం బంగారాన్ని ఇవ్వడంతో ఆగ్రహం చెంది తమకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోగా, మీరు బయట చూసుకోండి.. కోర్టుకు వెళ్లండంటూ సీఐ సురేష్ తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని, నన్ను అడిగి తాకట్టు పెట్టారా అంటూ ప్రశ్నించారని బాధితులు వాపోయారు. తన భార్య రమీజాబీ ముందే సీఐ బూతుల పురాణం మొదలుపెట్టాడంటూ హజరత్ వాపోయాడు. అన్యాయం జరిగింది.. న్యాయం చేయడంటూ పోలీసు స్టేషన్కు వెళ్తే అగౌరవంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా అయితే తమకు న్యాయం జరగదని భావించి శుక్రవారం గోల్డ్ లోన్ కార్యాలయం ఎదుట తన కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని హజరత్ కుటుంబ సభ్యులతో చర్చించారు. బాధితులతో ఏఎస్సై జిలాని మాట్లాడారు. వారితో పాటు గోల్డ్ లోన్ సిబ్బందిని పోలీసు స్టేషన్కు పిలిపించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు నిరసన విరమించి వెనుదిరిగారు. గిద్దలూరులో మణప్పురం కార్యాలయం వద్ద బాధిత కుటుంబం నిరసన సీఐ పట్టించుకోకపోగా తమనే బూతులు తిట్టారంటూ ఆవేదన -
అంగన్వాడీలను చిన్నచూపు చూస్తున్నారు
ఒంగోలు టౌన్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీలను చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రతిసారి ఎమ్మెల్యేల వేతనాలు, అలవెన్సులు పెంచుకుంటున్న పాలకులకు చిరుద్యోగులైన అంగన్వాడీల వేతనాలు పెంచడానికి మనసొప్పడం లేదని, ఇది అత్యంత బాధాకరమని అన్నారు. అంగన్వాడీల సమస్యలపై ఎన్నికల సమయంలో మొసలి కన్నీరు కార్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించి దగా చేస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ప్రీ స్కూళ్లను బలోపేతం చేయాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం మూడో రోజుకు చేరాయి. కందుకూరు, ఉలవపాడు ప్రాజెక్టుల అధ్యక్షులు కె.రాజేశ్వరి, చిడితోటి ఇంద్రావతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంగన్వాడీలను చిన్నచూపు చూస్తోందని, అమ్మ ఒడి నుంచే బాలబాలికల ఆలనాపాలనా చూస్తున్న అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయడం క్షమార్హం కాదని అన్నారు. చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్న అంగన్వాడీల సేవలను విస్మరించడానికి వీలులేదని చెప్పారు. తల్లి తరువాత తల్లిలా పిల్లలకు బడి ఈడు వచ్చేంత వరకు నడక, నడత నేర్పిస్తున్న అంగన్వాడీల సమస్యలను పాలకులు నిర్లక్ష్యం చేయడం అంటే భావిభారతాన్ని నిర్లక్ష్యం చేయడమేనని స్పష్టం చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం మార్చి 2వ తేదీ చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొని సత్తాచాటాలని పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు రూ.24,800, ఆయాలకు రూ.20300 వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా నాయకురాలు నెరుసుల మాలతి మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా అమానవీయంగా ఉందన్నారు. సుదీర్ఘకాలం సేవలు చేయించుకుని ఒక్క రుపాయి కూడా ఇవ్వకుండా రిటైర్డ్మెంట్ తర్వాత ఇంటికి పంపించడం దుర్మార్గమన్నారు. మెడికల్ అలవెన్సులు, టీఏ బిల్లులను సకాలంలో ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. నిరాహార దీక్షలలో అంగన్వాడీ యూనియన్ నాయకురాలు ఎస్.గీతా, సీఐటీయూ జిల్లా నాయకుడు గంటెనపల్లి వెంకటేశ్వర్లు, బి.నిర్మల, వై.కృష్ణవేణి, పి.క్రాంతి, జ్యోతి, లక్ష్మమ్మ, ఉమామహేశ్వరి, కత్తి బుజ్జమ్మ, మార్తమ్మ, సుగుణ, తిరుపతమ్మ, రమాదేవి, సుష్మిత, భూలక్ష్మి, అమరా గీత, అనూష శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు ధ్వజం మూడో రోజు కొనసాగిన అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలి
అద్దంకి: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరంతరం ప్రజల మధ్యనే వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఉండాలని ఆ పార్టీ ప్రకాశం జిల్లా టాస్క్ఫోర్స్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. అద్దంకిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీ సమావేశం నిర్వహించారు. పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్డర్ చింతలపూడి అశోక్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, అద్దంకి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు వైవీ భద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో లోపాలను బయటపెట్టి ఓటర్లను చైతన్యవంతం చేయాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపతం చేసే దిశగా నాయకులు, కార్యకర్తలు అడుగులు వేయాలని కోరారు. ప్రతి గ్రామంలో కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త రాబోయే స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసే వారిని గెలిపించే విధంగా చూడాలని చెప్పారు. వరికూటి అశోక్బాబు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ బలంగా ఉండాలంటే బలమైన నాయకత్వం అవసరమన్నారు. పార్టీకి విధేయులుగా పనిచేసే వారిని గుర్తించి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ వైవీ భద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లను చైతన్యవంతం చేయాలని చెప్పారు. డాక్టర్ అశోక్కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని చెప్పారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి రాబోయే రోజుల్లో అద్దంకి గడ్డపై వైఎస్సార్ సీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ కన్వీనర్లు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా టాస్క్ఫోర్స్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి -
పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా
ఉలవపాడు: మండల పరిఽఽధిలోని భీమవరం ఎస్సీ కాలనీకి చెందిన మేరీరోజ్ బంధువులు శుక్రవారం ఉలవపాడు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. గురువారం మేరీరోజ్పై కరేడు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహం వద్ద దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాడి కేసులో కరేడుకు చెందిన నిందితులు 41ఏ నోటీసు తీసుకోవడానికి శుక్రవారం స్టేషన్కు వచ్చిన సమయంలో.. భీమవరం గ్రామం నుంచి 3 ఆటోల్లో వచ్చినవారు తమ బిడ్డను అన్యాయంగా కొట్టారంటూ వాగ్వివాదానికి దిగారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వివాదం ప్రారంభమైంది. కాసేపటికి బయటకు వచ్చిన భీమవరం వాసులు మెయిన్ రోడ్పై ధర్నాకు దిగారు. దీంతో 15 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి. కరేడుకు చెందిన మహిళ శిరీష భర్త రోజ్ మేరీతో కావలిలో కలిసి ఉంటున్నాడన్న కారణంతో ఈ వివాదం చోటుచేసుకుంది. గతంలో ఇదే విషయమై పోలీస్స్టేషన్లో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరినా మళ్లీ వివాదం చెలరేగింది. -
30 శాతం ఐఆర్ ప్రకటించాలి
మార్కాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతిని జూన్ 2024 నుంచి ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే నాయబ్ రసూల్ డిమాండ్ చేశారు. శుక్రవారం మార్కాపురం తాలూకా కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ప్రతి ఆరు నెలలకు మంజూరు చేయాల్సిన కరువు భత్యం, అలాగే ఉద్యోగ విరమణ అనంతర నిధులు, ఇతర బకాయిలను అందించడం లేదన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు ఇంత వరకు చెల్లించలేదని, 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ 20 నెలల క్రితం రాజీనామా చేసినా ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. పాఠశాల వ్యవస్థలో 117 జీవోను రద్దుచేసినట్లుగా ప్రభుత్వం చెబుతున్నా, అవే అంశాలను జీవో 19, 20 రూపంలో తీసుకొచ్చి 1 నుంచి 10వ తరగతి వరకు ఒకే పాఠశాలలో విద్యను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వివిధ యాప్లు, పోస్టింగులతో ఉపాధ్యాయులకు పనిభారం ఎక్కువైందని, 100 రోజుల పాటు పరీక్షల షెడ్యూల్ ఇస్తే 120 రోజుల్లో సిలబస్ ఎలా పూర్తిచేయాలని ప్రశ్నించారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి జె.ఆనందరావు అధ్యక్షత వహించగా, జోన్ సీనియర్ నాయకులు పి.పాండు, జిల్లా కార్యదర్శి మల్లికార్జున, రాష్ట్ర కౌన్సిలర్ నారాయణరెడ్డి, రాష్ట్ర పూర్వపు కార్యదర్శి రఘుబాబు, భాస్కర్ నాయుడు, రంగస్వామి, ప్రసాదరావు, బాలూనాయక్, శ్రీనివాసరావు, అంకిరెడ్డి, చక్రధారి తదితర 60 మందికి పైగా ఉపాధ్యాయులు ధర్నాలో పాల్గొన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి ఏపీటీఎఫ్ డిమాండ్ -
జాతీయ రహదారిపై కారు దగ్ధం
సీఎస్పురం(పామూరు): జాతీయ రహదారిపై కారు దగ్ధమైన సంఘటన సీఎస్పురం మండలంలోని కంభంపాడు–ర్కేపల్లి అడ్డ రోడ్డు మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. సీఎస్పురం మండలంలోని రెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన నారా నారాయణ పామూరులోని తన మిత్రుని వద్ద ఉదయం కారు తీసుకుని ఆరేపల్లికి వెళ్లాడు. అనంతరం గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి కారులో వెళ్లి తిరిగి ఆర్కేపల్లి వెళ్తున్నారు. ఈ క్రమంలో కంభంపాడు, ఆర్కేపల్లి అడ్డ రోడ్డు మధ్యలో కారుకు గొర్రెల మంద అడ్డుగా రాగా నిలిపారు. ఇంతలో కారు నుంచి మంటలు రావడాన్ని గొర్రెల కాపరులు గమనించి కార్లో వ్యక్తులను అప్రమత్తం చేశారు. కారు రోడ్డు పక్కన నిలిపి మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. క్షణాల వ్యవధిలో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి పెట్రోల్ లీకేజీనే కారణమని భావిస్తున్నారు. అడ్డుగా వచ్చిన గొర్రెల మందతో తృటిలో తప్పిన ప్రమాదం -
ట్రబుల్ ఐటీ
రాష్ట్ర ప్రభుత్వ తీరుతో కనిగిరిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. అధికార పార్టీ నేతల ఆర్భాటపు ప్రకటనలు ఉత్త గాలి మాటలుగానే ఉండిపోతున్నాయి. ఇటీవల ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ విద్యార్థులు అక్కడే ఉండాలని నిరసనలు తెలపడం.. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ట్రిపుల్ ఐటీ సొంత భవనాలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం.. వైపాలెం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు కనిగిరి ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణం ఊసే ఎత్తకపోవడంతో ప్రజల అనుమానాలకు, ప్రశ్నలకు మరింత ఊతమిచ్చాయి. బల్లిపల్లి వద్ద ట్రిపుల్ ఐటీ నిర్మించే ప్రాంతం ఇదే కనిగిరిరూరల్: జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన కనిగిరిలో ట్రిపుల్ ఐటీ కాలేజీని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది. అయితే కాలేజీ ఏర్పాటు, సొంత భవనాల నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎటువంటి ముందడుగు పండటం లేదు. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2018 ఆగస్టులో అప్పటి సీఎంగా చంద్రబాబు.. మంత్రులు ఎంతో ఆర్భాటంగా నియోజకవర్గంలోని పామూరు మండలం దూబగుంట వద్ద ట్రిపుల్ ఐటీ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.1,200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఒక్క రూపాయి నిధులు మంజూరు కాలేదు. పనులు జరగలేదు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజామోదం మేరకు కనిగిరి–పామూరు ప్రధాన రహదారి (ఎన్హెచ్565) పక్కన కనిగిరి నియోజకవర్గ కేంద్రానికి 15 కి.మీల దూరంలో బల్లిపల్లి వద్దకు ట్రిపుల్ ఐటీ కళాశాలను బదలాయించారు. బల్లిపల్లి రెవెన్యూలోని సర్వే నంబర్ 766, 766–1లో సుమారు 255 ఎకరాలు భూ కేటాయింపు చేశారు. భూ సంబంధిత సర్వేలు, రికార్డుల ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత తిరిగి అధికారంలో వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణమే తమ లక్ష్యం అని ఆ పార్టీ నేతలు ప్రచారం హోరెత్తించారు. స్థల శుభ్రత, చదునుకు కొంత నిధులు కేటాయించారంటూ.. పనుల ప్రక్రియ జరుగుతుందంటూ ఊదరగొట్టారు. విద్యా శాఖ ఉన్నతాధికారులు సైతం ట్రిపుల్ ఐటీ స్థలం వద్దకు పరిశీలనలు చేస్తున్నట్లు హడావుడి చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పీసీపల్లి పర్యటనకు వచ్చినప్పుడు కనిగిరిలోనే ట్రిపుల్ ఐటీ కాలేజీ నిర్మిస్తామని, సీఎం చేతుల మీదుగానే శంకుస్థాపన జరుగుతుందని వెల్లడించారు. కానీ నిధుల కేటాయింపు ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై విద్యార్థి, వివిధ సంఘాల నాయకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఇటీవల ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ విద్యార్థులు కాలేజీని అక్కడే ఉండాలని, కనిగిరి ప్రాంతానికి తరలించవద్దంటూ నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ట్రిపుల్ ఐటీ కాలేజీ ఏర్పాటవుతుందా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. బల్లిపల్లి జంక్షన్లో ట్రిపుల్ ఐటీ నిర్మిస్తే ఈ ప్రాంత విద్యార్థులకు విద్యా సౌకర్యంతో పాటు వెనుకబడిన కనిగిరి ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రమైన కనిగిరికి 15 కి.మీల దూరంలోనే ట్రిపుల్ ఐటీ కాలేజీ ఉంటుంది. బల్లిపల్లి రెవెన్యూ పరిధిలోనే నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే లైన్ పాయింట్ ఉంది. ట్రిపుల్ ఐటీకి దగ్గరలోనే.. కనిగిరికి సమీపంలో ఎన్ఎహెచ్ 565 ప్రధాన రహదారి లైన్తో పాటు, గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు, రింగ్ రోడ్డు నిర్మిస్తున్నారు. బల్లిపల్లిలో కళాశాల వల్ల మార్కాపురం జిల్లాతో పాటు, నెల్లూరు, కడప ప్రాంతాల విద్యార్థులకు దగ్గరగా ఉంటుంది. అయితే దీన్ని ఆసరాగా చూపించి.. కనిగిరిలో అధికార పార్టీ నేతలు జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించారు. నిన్నటి వరకు ఎకరా రిజిస్టర్ భూమి రూ.15 నుంచి రూ.20 లక్షలు ఉన్న దాన్ని ఏకంగా రూ.50 నుంచి రూ.60 లక్షలకు పెంచారు. మరీ విచిత్రం ఏమిటంటే ఓ రియల్ వ్యాపార సంస్థకు చెందిన ప్రైవేటు కంపెనీ వారు బాలవెంకటేశ్వర పురంలోని కొండ శివారు ప్రాంతానికి ఆనుకుని ఉన్న సుమారు 120 ఎకరాల భూమిని ఎకరా పది లక్షలకు పెట్టి కొనుగోలు చేశారంటే ఇక్కడ వ్యాపారం ఎంతలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలు, చంద్రబాబు మార్కాపురం పర్యటన తర్వాత ఒక్క సారిగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు డీలాపడ్డాయి. -
దర్శి టీడీపీలో ముసలం
దర్శి: దర్శి నియోజకవర్గ టీడీపీలో అసంతృప్త నేతలు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి మళ్లీ పోటీ చేసే ఉద్దేశం లేకపోవడం వల్లే టీడీపీ నేతల వద్దే కమీషన్లు వసూలు చేస్తూ అందిన కాడికి దోచుకుని ఊడ్చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ముండ్లమూరు మాజీ మండల కన్వీనర్ సోమేపల్లి శ్రీనివాసరావు అయితే ఏకంగా 2024లో టీడీపీ అధికారంలోకి ఎందుకు వచ్చిందా అని తన చెప్పుతో తానే కొట్టుకున్న వీడియో సంచలనంగా మారింది. ఆ వీడియో చూసిన ప్రజలు సైతం అవాక్కయ్యారు. సాధారణంగా పార్టీలో కొనసాగటం ఇష్టం లేకపోతే రాజీనామా చేస్తారు. అయితే తాను సెల్ఫీ వీడియో తీసుకుని మరీ చెప్పుతో కొట్టుకుని ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారంటే పార్టీ పరిస్థితి నియోజకవర్గంలో ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, 14 ఏళ్లు పార్టీ మండల కన్వీనర్గా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తికే అసహనం పుట్టి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారంటే ఆ దారిలో మరి ఎంత మంది ఉన్నారన్న విషయం చర్చనీయాంశమైంది. ఇటీవల ముండ్లమూరులో ఓ వెంచర్ కు మట్టి తోలకాలు, ఇతర పనుల కాంట్రాక్ట్ మొత్తం వెంచర్ యజమాని వద్ద డీల్ కుదుర్చుకుని ఈయనే ఆ పనులు చేస్తున్నారు. భారీ వెంచర్ వేసేందుకు ఇన్చార్జ్ అనుమతి కోసం కోటి రూపాయలు డీల్ కుదిర్చారని, అందులో రూ.60 లక్షలు ఇవ్వగా ఇంకా రూ.40 లక్షలు ఇవ్వాలని సమాచారం. మిగతా డబ్బు కోసం ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారని తెలిసింది. అందులో భాగంగా తలెత్తిన వివాదం కూడా ఆయన చెప్పుతో కొట్టుకోవడానికి ఒక కారణంగా చర్చించుకుంటున్నారు. అంతే కాకుండా గతంలో చేసిన పనుల్లో కమీషన్లు ఇవ్వలేదని బిల్లులు అడ్డుకుని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి వివాదాల కారణంగానే ఇటీవల కాలంలో టీడీపీ నాయకులు సైతం జనసేన పార్టీలో చేరినట్లు సమాచారం. అధికార పార్టీలో ఇలా నాయకుల అసంతృప్తికి కారణం ఇక్కడ కమీషన్ల దందాలేనని చెప్పుకుంటున్నారు. ఇతర సామాజికవర్గాలకు చెందిన టీడీపీ నాయకుల్లోనూ గొట్టిపాటి లక్ష్మి ఒంటెత్తుపోకడలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో ఇసుక, మట్టి ఏ నాయకున్నీ తోలుకోనివ్వకుండా మొత్తం ఇక్కడ ఇన్చార్జే దోచుకుంటున్నారని ఇసుక వనరులు ఉన్న ప్రాంతాల్లో టీడీపీ నాయకులు సైతం అసంతృప్తిగా ఉన్నారు. గతంలో అధికార పార్టీకి చెందిన టిప్పర్లు ఇన్చార్జ్ అనుమతి లేకుండా ఇసుక సరఫరా చేస్తున్నారని కమ్మవారి పాలేనికి చెందిన టీడీపీ నేత లారీని కూడా ఇన్చార్జ్ అనుచరులు ధ్వంసం చేశారు. నియోజకవర్గంలో ఎక్కడైనా గ్రావెల్ ఎత్తాలన్నా తమకు కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేయడంతో టీడీపీ నేతలు కొందరు టిప్పర్లు కూడా అమ్ముకున్నారు. ఏ పనిచేయాలన్నా కప్పం కట్టాల్సిందే.. నియోజకవర్గంలో ఏ పనులు చేసినా బిల్లులు చెల్లించాలంటే తమకు కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారు. గ్రామాల్లో అవకాశం ఉన్న చోట్ల చేపల చెరువులు పాటలు పెట్టకుండానే చేపలు వేయించి అనధికారికంగా దోపిడీకి పాల్పడుతున్నారు. పులిపాడు సమీపంలో పోలీసులను కాపలా పెట్టి మరీ చెరువు పక్కన పదేళ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్డును తీసి వేసి ఆ రోడ్డు స్థానంలో అర ఎకరా ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకునేందుకు భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకుని నూతన రోడ్డును పోసి చెరువు భూమిని ఆక్రమించుకున్నారు. ఈ విషయంలో టీడీపీ ఇన్చార్జ్ పీఏ భారీ మొత్తంలో వసూళ్లు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో ఎవరైనా అధికారులు పని చేయాలంటే కప్పం కట్టాల్సిందేనన్న విషయం చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగానే ఇటీవల దర్శి ఎంపీడీఓ కార్యాలయంలో ఓ ఉద్యోగిని విధుల్లోకి తీసుకోలేదని సమాచారం. ముండ్లమూరు మండలంలోని ఓ మాజీ ఎంపీపీ కూడా ఇన్చార్జ్ తీరుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయనకు మండలం పెత్తనం మొత్తం నీదే అని చెప్పడం..ఆ తరువాత అధికారులకు ఫోన్ చేసి ఆయన చెప్పిన పనులు చెయ్యవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్ నాయకుడైన తనకు విలువ ఇవ్వడం లేదని ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నేతలను విస్మరించి పనులు చక్కదిద్దేందుకు పైకం ముట్టచెప్పే వారికే పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎంతో మంది సీనియర్ నాయకులు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని ఆపార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. -
దళితులపై విద్యుత్ బకాయిల భారం
సాక్షి టాస్క్ఫోర్స్: దళితుల ఇళ్లకు వేలకు వేలు విద్యుత్ బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని విద్యుత్ అధికారులు చెప్పడంతో వారితో వాగ్వాదానికి దిగిన ఘటన తాళ్లూరు మండలం బొద్దికూరపాడు ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీవాసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం విద్యుత్ అధికారులు కాలనీలో విద్యుత్ బకాయిల వసూళ్లకు వెళ్లారు. కాలనీలో 300 కుటుంబాలుంటాయి. కాలనీకి చెందిన మారిపోగు బజారమ్మకు రూ.15 వేలు, మందా మరియమ్మకు రూ.28 వేలు, మందా చిన్న వెంకటయ్యకు రూ.52811 ఇలా దాదాపు 8 కుటుంబాలు వేలాది రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలని అధికారులు చెప్పారు. బకాయిలు మొత్తం చెల్లించాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మారిపోగు బజారమ్మ, మందా మరియమ్మల ఇళ్లలో అసలు విద్యుత్ మీటర్లే లేవు. అయితే గతంలో వారి ఇళ్లలో విద్యుత్ మీటర్లు ఉన్నాయని, బకాయిలు చెల్లించకపోవడంతో వాటిని తొలగించామని ఆ బకాయిల భారం ఇంత అయిందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులమవడం వల్లే తమకు ఇలా వేలకు వేలు బకాయిలున్నట్లు అధికారులు చెబుతున్నారని దళితులు వాపోయారు. ఇంతింత విద్యుత్ బకాయిలు ఎక్కడ నుంచి వచ్చాయని కాలనీవాసులు నిలదీసి విద్యుత్ అధికారులతో గొడవకు దిగారు. దీంతో కాలనీకి ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఈ విషయమై మండల విద్యుత్ ఏఈ రామకృష్ణను వివరణ కోరగా పెండింగ్ ఉన్న పాత విద్యుత్ బకాయిలను గ్రామం మొత్తం వసూలు చేస్తున్నామన్నారు. అలాగే బొద్దికూరపాడు ఎస్సీ కాలనీ వాసులు గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ బకాయిలు చెల్లించడంలేదన్నారు. ● రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో డీఆర్ఓ ఒంగోలు సబర్బన్: జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి బీసీహెచ్.ఓబులేసు ఏఈఆర్ఓలను ఆదేశించారు. శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి తన చాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులతో జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల ఏఈఆర్ఓలతో సమావేశమయ్యారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ పరిష్కారంపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు 75.44 శాతం పూర్తి చేశారన్నారు. ఈ నెల 28వ తేదీ, మార్చి 1వ తేదీ, మార్చి 7, 8 తేదీల్లో 4 రోజులు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తారన్నారు. సమావేశంలో ఎస్డీసీలు మాధురి, జాన్సన్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్ పాల్గొన్నారు. పెద్దదోర్నాల: ఫారెస్టు బీట్ ఆఫీసర్పై చెంచు గిరిజనులు దాడి చేసి గాయపరిచిన సంఘటన పెద్దారుట్ల బేస్క్యాంపు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ మదన్కుమార్కు గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం మేరకు.. పెద్దారుట్ల వద్ద రోడ్ల విషయమై గిరిజనులకు, ఫారెస్టు సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గిరిజనులు గడ్డి కోసే కొడవలితో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై దాడికి పాల్పడ్డారు. అతను చేయి అడ్డం పెట్టడంతో చేతికి గాయాలైనట్లు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. -
అసత్య ప్రచారాలతో మభ్యపెట్టొద్దు
మార్కాపురం టౌన్: ‘‘1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శిలాఫలకం వేసింది నేనే అని 2026 జూలై నాటికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తానని’’ ఈనెల 25న మార్కాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో చెప్పుకోవడం 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకే చెల్లిందని మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా, ఏ ముఖ్యమంత్రి కాలంలో అభివృద్ధి చేసినా ఆ క్రెడిట్నంతా తమ ఖాతాలో వేసుకోవడం చంద్రబాబు నైజమన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు బహిరంగ సభలో చెప్పిన అసత్యాలపై ఆయన మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో చంద్రబాబు శిలాఫలకం వేశారని, ఆ తరువాత 8 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉండి ప్రాజెక్టుకు ఎంతమేర పనులు చేశారో.. ఎంత నిధులు కేటాయించారో ప్రజలకు వివరించలేదని అన్నారు. ప్రాజెక్టు భూ సేకరణకుగానీ, బడ్జెట్లో నిధుల కేటాయింపులు కానీ చేయకుండా 2026 జూలై నాటికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తానని చెప్పడం హాస్యాప్పదంగా ఉందన్నారు. 2005లో ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు ఫేజ్–1 కింద రూ.5455 కోట్లు ఖర్చు చేశారని, సీఎంగా ఉన్నంత కాలం చంద్రబాబు హయాంలో ఖర్చు చేసింది రూ.1100 కోట్లు మాత్రమేనన్నారు. ఇంకా ప్రాజెక్టు కోసం సుమారు రూ.3500 కోట్లు అవసరమైతే ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.496 కోట్లు కేటాయించి జూలై నాటికి వెలిగొండకు నీళ్లిచ్చి జాతికి అంకితం చేస్తానని చెప్పుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో రెండేళ్లు కరోనా పోగా మిగిలిన మూడేళ్లలో రూ.1050 కోట్లు ఖర్చు చేశారన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి టన్నెల్ పూర్తయిన సందర్భంగా జాతికి అంకితం చేశారేకానీ ప్రాజెక్టు మొత్తం జాతికి అంకితం చేయలేదని చెప్పిన సంగతి మీకు తెలీదా అన్నారు. ఇప్పటికై నా ప్రాజెక్టు పనులపై మాయమాటలు, అబద్ధాలు ప్రజలకు చెప్పవద్దని హితవు పలికారు. ప్రజలకు తాగు, సాగు నీరు అందించాలి తాను గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పాపినేనిపల్లి, వెలగలపాయ గ్రామాల పరిధిలో ఉన్న ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు డ్రిప్ ఇరిగేషన్ను మంజూరు చేయించుకున్నామని, కానీ టెండర్లు రద్దుకావడంతోనే పనులు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్రెడ్డి డ్రిప్ ఇరిగేషన్పై దృష్టిసారించి ముఖ్యమంత్రి నుంచి నిధులు మంజూరు చేయించుకుని ఆ ప్రాంత ప్రజలకు తాగు, సాగు నీరు అందించాలని కోరారు. జగన్ హయాంలో జరిగిన భూముల రీసర్వేపై ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ది పొందింది కూటమి నాయకులు కాదా అని ప్రశ్నించారు. పార్లమెంటు స్థానాలను యూనిట్గా తీసుకొని మాజీ సీఎం వైఎస్ జగన్ నూతన జిల్లాలను ఏర్పాటు చేశారని, అందువలనే మార్కాపురం జిల్లాను ప్రకటించలేకపోయారన్నారు. దూరాన్ని ప్రాతిపదికన తీసుకొని ఒంగోలు నుంచి మార్కాపురం జిల్లాను ప్రకటించిన నీవు దొనకొండను కూతవేటు దూరంలో ఉన్న మార్కాపురంలో కలపకుండా ఒంగోలులో కలపడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డూ విషయంలో రోజుకో మాట మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. సూపర్ 6.. సూపర్ హిట్ అయిందని కూటమి నాయకులు పండుగ చేసుకుంటున్నారని, ఆడబిడ్డ నిధికింద నెలకు రూ.1500, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లలో సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తానన్న నీవు ఎంత నగదు ఇచ్చావో ప్రజలకు తెలపలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్నా మెడికల్ కాలేజీ విషయం పట్టించుకోకపోవడం ఈ ప్రాంత పేద మధ్య తరగతి ప్రజల ఆరోగ్యంపై మీకున్న చిత్తశుద్ధి అర్ధమవుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి షంషేర్ ఆలీబేగ్, జెడ్పీటీసీలు నారు బాపన్రెడ్డి, ఏడుకొండలు, మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీమ్, మాజీ ఏఎంసీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, మార్కాపురం, తర్లుపాడు మండల అధ్యక్షుడు పోరెడ్డి చెంచిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ 2 అంజమ్మ శ్రీనివాసులు, ముత్తారెడ్డి వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మోరా శంకర్రెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, గొలమారి సత్యనారాయణరెడ్డి, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. -
తౌషిక్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి
కనిగిరిరూరల్: సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో కనిగిరికి చెందిన విద్యార్థి సయ్యద్ తౌషిక్ (11) మృతికి కారణమైన వారిని గుర్తించి నిందితులను కఠినంగా శిక్షించాలని, కోచింగ్ సెంటర్ను తక్షణం మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా, నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి జీపీ రామారావు మాట్లాడుతూ విద్యార్థి తౌషిక్ మృతి చెంది పది రోజులు దాటినా.. అధికారులు కమిటీల పేరుతో కాలయాపన చేయడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. పూర్తి ఆధారాలు ఇస్తున్నా.. త్రిసభ్య కమిటీ, పోలీస్ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు, అధికారులు పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించి తౌషిక్ మృతికి కారణమైన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి గుజ్జుల బాలిరెడ్డి మాట్లాడుతూ తౌషిక్ మృతిపై అధికారులు చేస్తున్న జాప్యం, నిర్లక్ష్యం ముమ్మాటికి ప్రభుత్వ కుట్రేనని విమర్శించారు. న్యాయం చేసేంత వరకు పోరాటం సాగిస్తాం.. తన కుమారుడు తౌషిక్ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు పోరాటం సాగిస్తామని విద్యార్థి తౌషిక్ తండ్రి సయ్యద్ ఆలీ అన్నారు. తౌషిక్ మృతి చెంది పది రోజులైనా పూర్తి ఆధారాలు చూపిస్తున్నా..పోలీసులు, అధికారులు కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తన కుమారుడ్ని కోచింగ్ సెంటర్ యాజమాన్యం, సిబ్బందే హత్య చేశారని ఆరోపించారు. నిందితులను గుర్తించి తక్షణం అరెస్ట్ చేయాలని, కోచింగ్ సెంటర్ను మూసివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గఫార్ మాట్లాడుతూ తౌషిక్ మృతిపై దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. పది రోజులైనా పీఎం రిపోర్టు నివేదిక రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అధికారులు, పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్ధి, మహిళా, యువజన, ప్రజా సంఘాల నాయకులు ఎస్కే తాహిద్, సయ్యద్ ఇఫ్రాజ్, నాగూర్ బీ, బషీర్బీ, మద్దిశెట్టి భారతీ, తదితరులు పాల్గొన్నారు. -
రైలు నుంచి పడిపోయిన బాలిక
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ ఓ బాలిక పడిపోయింది. సకాలంలో స్పందించిన ఆర్పీఎఫ్, జీఆర్పీ, స్టేషన్ సిబ్బంది సమన్వయంతో బాలికను రక్షించారు. ఈ ఘటన బుధవారం రాత్రి ఒంగోలు రైల్వేస్టేషన్ పరిసరాల్లో జరిగింది. బుధవారం రాత్రి 11.53 గంటల సమయంలో ధర్మవరం – నర్సాపూర్ (17248) ఎక్స్ప్రెస్ రైలు ఒంగోలు స్టేషన్కు రెండు మీలోమీటర్ల దూరంలో సూరారెడ్డిపాలెం – ఒంగోలు సెక్షన్ మధ్యలో ప్రయాణిస్తుండగా తొమ్మిదేళ్ల బాలిక ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిపోయింది. రైలు రాత్రి 12.03 గంటలకు రైలు ఒంగోలు స్టేషన్కు చేరుకోగా ఆమె కుటుంబ సభ్యులు స్టేషన్ మాస్టర్, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ మార్గంలో వస్తున్న తిరుపతి – కరీంనగర్ ఎక్స్ప్రెస్ (12761) రైలులోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. లోకో పైలెట్ ట్రాక్ పక్కన పడిపోయిన బాలికను గుర్తించి రైలును నిలపడంతో జనరల్ కోచ్లోని సిబ్బంది ఆమెను రక్షించారు. అప్పటికే ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది కూడా బాలిక కోసం గాలిస్తూ అక్కడకు చేరుకున్నారు. గాయాలతో ఉన్న బాలికను ఒంగోలు స్టేషన్కు తరలించారు. ఆమె ఎడమ చేతికి, కాళ్లకు స్పల్ప గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేసి, అనంతరం దగ్గరలోని ఆస్పత్రిలో చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాలికను రక్షించిన రైల్వే సిబ్బంది, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
పూలసుబ్బయ్య పేరు ప్రస్తావించకపోవడం బాధాకరం
● చంద్రబాబు తీరుపై సీపీఐ నేతల ఆగ్రహం మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి ఆధ్యుడైన పూలసుబ్బయ్య పేరును మార్కాపురం బహిరంగ సభలో సీఎం చంద్రబాబునాయుడు, కూటమి నాయకులు ప్రస్తావించకపోవడం బాధాకరమని సీపీఐ రాష్ట్ర నాయకులు అందె నాసరయ్య, నియోజకవర్గ పార్టీ కార్యదర్శి ఎస్కే ఖాశీం అన్నారు. స్థానిక పూలసుబ్బయ్య శాంతి భవన్లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రాజెక్టు సాధన కోసం అవిశ్రాంత పోరాటాలు చేసిన పూలసుబ్బయ్య సేవలను దృష్టిలో ఉంచుకుని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పెద్ద మనసుతో వెలిగొండ ప్రాజెక్టుకు ముందు పూలసుబ్బయ్య పేరును జత చేసి పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరణం చేశారని గుర్తు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు ప్రదర్శించిన ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అని పేర్కొనలేదని గుర్తుచేశారు. దీన్ని బట్టి కూటమి ప్రభుత్వానికి పూలసుబ్బయ్య అన్నా.. ప్రాజెక్టుపైనా.. ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందన్నారు. ఆయన పేరును ప్రస్తావించడమంటే భవిష్యత్ తరాలకు గొప్ప నిస్వార్ధ సేవలకు ప్రతిరూపమైన వ్యక్తులను పరిచయం చేయడమే అన్నారు. భవిష్యత్లోనైనా ఇలాంటి తప్పులు చేయవద్దని కూటమి నాయకులకు వారు హితవు పలికారు. -
చెత్తకుప్పలో గర్భిణుల ఔషధాలు
పెద్దదోర్నాల: గర్భిణులు, రక్తహీనత కలిగిన రోగులకు ఇచ్చే ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఔషధాలు చెత్తకుప్పలో దర్శనమివ్వడం పెద్దదోర్నాలలో గురువారం కలకలం రేపింది. మండల కేంద్రానికి కొద్దిపాటి దూరంలో బైపాస్ రోడ్డు సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో ఆ మందులు పడేయడం వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. మండల పరిధిలో పలు గిరిజన గూడేలు ఉన్నాయి. ఆయా గూడేల్లో నివసిస్తున్న చెంచు గిరిజనులు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతుంటారు. అటువంటి వారి కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఐరన్ మాత్రలు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ సిరప్లు సరఫరా చేస్తుంటుంది. ముఖ్యంగా చెంచు గిరిజనుల్లో మాతాశిశు మరణాలు నివారించేందుకు గర్భిణులు రక్తహీనతను అధిగమించేందుకు ఆయా మందులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అటువంటి మందులను అవసరమైన వారికి సక్రమంగా వినియోగించకుండా రోడ్ల పక్కన చెత్తకుప్పలో పడేయడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. చెంచు గిరిజనులే కాకుండా ఇతర మైదాన ప్రాంతాలకు చెందిన గర్భిణులు సైతం రక్తహీనతతో బాధపడుతున్నారు. అటువంటి వారికి ఉపయోగపడే విలువైన మందులను ఎవరికీ పనికిరాకుండా రోడ్డు పక్కన చెత్తకుప్పలో వేయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఆయా ఔషధాలు ఏ వైద్యశాలకు చెందినవో అధికారులు విచారించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మా గురించి పట్టించుకోనప్పుడు పన్నులెందుకు కట్టాలి..!
జె.పంగులూరు: ‘గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పారిశుధ్య పనులు చేయడం లేదు. గ్రామంలో ఒక్క బోరు పనిచేయదు. ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. అలాంటప్పుడు మేమెందుకు పన్నులు కట్టాలిశ్రీ అని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఇంటి పన్నుల వసూళ్లలో భాగంగా డీపీఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ కె.స్వరూపారాణి, డిప్యూటీ ఎంపీడీఓ సుమంత్, పంచాయతీ కార్యదర్శిఅనీల్కుమార్, వీఆర్ఓ రవికుమార్ కొండమూరు ఎస్సీ కాలనీకి వెళ్లారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మంచినీటి ట్యాంకు పనికిరాకుండా పోయినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో డీపీఓ ఎం వెంకటేశ్వర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత గ్రామ సచివాలయాన్ని, డంపింగ్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ జిల్లాలో రూ.45 కోట్ల ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.28 కోట్లు వసూలైనట్లు చెప్పారు. అధికారులను నిలదీసిన గ్రామస్తులు -
విద్యా వ్యవస్థలో పేరుకుపోయిన సమస్యలు
ఒంగోలు సిటీ: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యా వ్యవస్థలో సమస్యలు పేరుకుపోయాయని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ మంజుల ధ్వజమెత్తారు. 44 సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయులకు యాప్ల భారాన్ని, ఆన్లైన్ పని భారాన్ని తగ్గించి బోధనా కార్యక్రమాలకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలన్నారు. 30 శాతం మధ్యంతర భృతి, 11వ పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న నాలుగు విడతల డీఏలు ప్రకటించాలన్నారు. ఉద్యోగులకు సీపీఎస్, పెన్షనర్లకు నగదు రూపంలో డీఏ బకాయిలు చెల్లించాలన్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నత పాఠశాలకు హెడ్మాస్టర్, పీడీ పోస్టులు మంజూరు చేయాలన్నారు. పెన్షనర్లకు 70 సంవత్సరాలకు 10 శాతం, 75 సంవత్సరాలకు 15 శాతం అడిషనల్ క్వాంటం పెన్షన్ను పునరుద్ధరించాలన్నారు. టెట్ నుంచి ఇన్సర్వీస్ టీచర్లను మినహాయించాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు జీవో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలన్నారు. ఎంఈఓ–1, ఎంఈఓ–2లకు జాబ్ చార్టులో బాధ్యతలు సమానంగా కేటాయించాలన్నారు. ఉన్నత పాఠశాలల నుంచి 1 నుంచి 5 తరగతులను వేరుచేయాలన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పెరిగిన జనాఽభాకు అనుగుణంగా నూతన పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శేషారావు, జోన్ కన్వీనరు ఎస్కే బషీరున్నీసా, రమేష్, రాష్ట్ర కౌన్సిలర్ డి.శ్రీనివాసులు, ఎన్.గోపాలరెడ్డి, బి.రఘబాబు, ఐ.విజయసారధి, ఎస్జీపీఏ నాయకులు పి.సుబ్బారావు, కె.సుబ్బారావు, అంకిరెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు. -
జిల్లాలో 60 వేల వెబ్ల్యాండ్ పెండింగ్ కేసులు
యర్రగొండపాలెం: మార్కాపురం జిల్లాలో వెబ్ల్యాండ్ పెండింగ్ కేసులు 60వేలు ఉన్నాయని, ఈ సమస్యతో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అన్నారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఓలు, సర్వేయర్లతో రీ సర్వేలో ఉన్న లోటుపాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ విలేకరులతో మాట్లాడుతూ రీ సర్వేలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, భూముల ఫీడ్బ్యాక్లో వాస్తవ లబ్ధిదారుల పేర్లు ఉన్నా అప్పటి మండల రెవెన్యూ అధికారులు వెబ్ల్యాండ్లో ఇతరులు అని నమోదు చేయడంతో ఈ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. సమస్యలను 6 నెలల్లోగా అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వీఆర్ఓలు, సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామని, మ్యూటేషన్ కారణాలతో ఆన్లైన్ జరగకుండా నిలిచిపోయిన వాటిని పరిశీలించి వాటికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్లు ఉంటేనే ఆన్లైన్ చేయడం, లేకుంటే వాటిని పెండింగ్లో పెడతామని చెప్పారు. గ్రీవెన్స్లో జేసీ, ఆర్డీఓల వద్ద అర్జీలు దాఖలు చేసిన వారు అనేక మంది రైతులు ఉన్నారని, వాటిని కూడా పరిశీలిస్తున్నామనన్నారు. గతంలో వాగు పోరంబోకు భూమలకు కూడా పట్టాలు ఇచ్చారని, వారు భూమిపై ఉన్నా ఆన్లైన్లో వారి పేర్లు నమోదై ఉండవని తెలిపారు. ఇప్పుడు ఆన్లైన్ కాకుండా ఉంటే మరెప్పుడూ ఆన్లైన్ కావని, అందుకే రానున్న 6 నెలల్లో ప్రత్యేక దృష్టి సారించి సమస్యలనుపరిష్కరిస్తామన్నారు. రీసర్వే ప్రక్రియకు ప్రజల సహకారం కావాలని, సాగు చేసుకుంటున్న భూములకు తగిన ఆధారాలు లేకుంటే తామేమీ చేయలేమని ఆయన తెలిపారు. కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు కూడా తమ పరిధిలోకి తీసుకొని పరిశీలిస్తామని, 22ఏలో ఉన్న వాటిపై కూడా ప్రత్యేకంగా విచారించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తండ్రి మరణాంతరం అన్నదమ్ములు సివిల్ వివాదాల్లో ఉన్న కేసులు అనేకం ఉన్నాయని, వారికి ఉన్న హక్కుపై విచారించి ఆ కేసులు కూడా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ మంజునాథరెడ్డి ఉన్నారు. -
మాట తప్పిన చంద్రబాబు
ఒంగోలు టౌన్: అధికారంలోకి రాగానే అంగన్వాడీల వేతనాలు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా వేతనాలు పెంచకుండా మాట తప్పారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గెంటనపల్లి శ్రీనివాసులు విమర్శించారు. మూడు బడ్జెట్లలో అంగన్వాడీల వేతనాల గురించి ప్రస్తావించకపోవడం మహిళలను మోసగించడమేనని మండిపడ్డారు. అంగన్వాడీల వేతనాలు పెంచాలని, ప్రీ స్కూళ్లను బలోపేతం చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండో రోజుకు చేరాయి. దీక్షల్లో మద్దిపాడు, కొండపి, ఉలవపాడు, కందుకూరు ప్రాజెక్టులకు సంబంధించి 20 మంది రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. సుమారు 100 మందికి పైగా సంఘీభావంగా హాజరయ్యారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, మే నెలంతా సెలవులు ఇవ్వాలని నినాదాలు చేశారు. అంగన్వాడీల నినాదాలతో దీక్షా శిబిరం వద్ద దద్దరిల్లింది. ఈ సందర్భంగా గెంటనపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ...అంగన్వాడీలకు వేతనాలు పెంచమని అడుగుతుంటే పట్టించుకోని ప్రభుత్వం పనిభారం పెంచి ఒత్తిడికి గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీ స్కూళ్లను బలోపేతం చేయడానికి బదులుగా నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తుందని విమర్శించారు. అంగన్వాడీలకు నెలకు రూ.24,800 వేతనం, ఆయాలకు రూ.20,300 వేతనం ఇవ్వాలని గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని, అందుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం ఆయాలకు కేవలం రూ.7000 మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. ప్రీస్కూళ్లను బలోపేతం చేయడం ద్వారా బాల్యం నుంచే విద్యార్థుల్లో చదువులపై ఆసక్తి పెంచినట్లవుతుందని చెప్పారు. మేనెలలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అంగన్వాడీలకు మాత్రం ఎందుకు సెలవులు ఇవ్వడం లేదని నిలదీశారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వై.సత్యవతి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల పాలకులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం తగదని హితువుపలికారు. సుదీర్ఘకాలంగా అంగన్వాడీలు సేవలు అందిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం దుర్మార్గమన్నారు. నిరాహార దీక్షలు చేస్తేనే కానీ అంగన్వాడీల వేతనాలు పెంచరా అని ప్రశ్నించారు. అంగన్వాడీలను చిన్నచూపు చూడడం పాలకులకు మంచిది కాదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రిలే దీక్షల్లో అంగన్వాడీ యూనియన్ నాయకులు పోలమ్మ, ప్రసన్న, మధురవాణి, ఎం.సుభాన్ తదితరులు పాల్గొన్నారు. ● చెప్పుతో కొట్టుకున్న టీడీపీ మాజీ మండల కన్వీనర్ ● టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు వెల్లడి ● సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో దర్శి: ‘ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినా విలువ లేదు’ అని ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ మాజీ మండల కన్వీనర్ సోమేపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు.టీడీపీ ఎందుకు అధికారంలోకి వచ్చిందా అని పశ్చాత్తపం వ్యక్తం చేశాడు. చెప్పుతో కొట్టుకుని వీడియో విడుదల చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండేళ్లుగా టీడీపీలో నరకం అనుభవిస్తున్నానని వీడియోలో వాపోయాడు. 14 ఏళ్ల పాటు టీడీపీ మండల కన్వీనర్గా పనిచేసిన తాను 2024లో టీడీపీ ఎందుకు అధికారంలోకి వచ్చిందా అని బాధపడుతున్నానని పలుమార్లు చెప్పుతో కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. అంగన్వాడీల రిలే సమ్మెలో సీఐటీయూ నాయకుల ధ్వజం -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
కనిగిరిరూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాయబ్ రసూల్ ధ్వజమెత్తారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు ఎస్కే నాయబ్ రసూల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారన్నారు. కరువు భత్యం ఇవ్వాలని, ఉద్యోగ విరమణ అనంతరం రావాల్సిన సౌలభ్యాలు, సరెండర్లీవ్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా నాయకులు పొట్టేండ్ల మాలకొండయ్య మాట్లాడుతూ 11వ పీఆర్సీ బకాయి చెల్లించాలని, 12వ పీఆర్సీ ఇవ్వాలని, 117వ జీవోను రద్దు చేయాలని, సీపీఎస్ను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానంను వర్తింప చేయాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లో కూడిన వినతిపత్రాన్ని ఆర్ఐకు అందచేశారు. ధర్నాకు ఎన్జీఓ నాయకుడు పిల్లి వెంకట రమణారెడ్డి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఆరు మండలాల ఏపీటీఎఫ్ నాయకులు కుడారి రామ్మోహన్రావు, ఎస్కే హుస్సేన్, ఏ హజతర్రెడ్డి, డి.పున్నమ్మ, సీహెచ్ సునితాదేవి, డి.మహేశ్వరి, నిర్మలా, మీనా, అరుణా, దానమ్మ, భవానీ, సయ్యద్ సల్మా, కె.సుభాషిణి, తోటా శ్రీనివాసులు, ఎస్కే ఖాజా మస్తాన్, మచ్చా ప్రసాద్, ఎన్ రమేష్ బాబు, జి.ప్రభాకర్, బీవీ ప్రసాద్, పెన్నా వెంకటేశ్వర్లు, హేమంత్కుమార్, డి.సుబ్బరాయుడు, జి.వెంకటేశ్వర్లు, విశ్రాంత ఉపాధ్యాయులు జి.మల్లికార్జునరాజు, బి శివ ప్రసాద్చారి, సాల్మన్, సీహెచ్ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాయబ్ రసూల్ ధ్వజం -
వైద్యం మూగబోయింది
చంద్రబాబు ప్రభుత్వం పశువైద్యాన్ని పక్కనపెట్టేసింది. వైద్యులు.. మందుల కొరతతో చికిత్స అందక మూగజీవాలు అవస్థలు పడుతున్నా.. కన్నబిడ్డల్లా చూసుకుంటున్న వాటికి వ్యాధులు సోకి విలవిల్లాడిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పశు వైద్యశాలల్లో సరైన వైద్యం అందక మూగజీవాల వేదన అరణ్యరోదనగా మారింది. ఫలితంగా పశుపోషణ భారంగా మారిందని వారు ఆందోళన చెందుతున్నారు. పల్లెల్లో పశు వైద్యం పడకేయడంతో పశుపోషణ భారంగా మారిందని వారు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెల్లపశువులు 60,000 మార్కాపురం: ఉమ్మడి జిల్లాలో రైతులకు వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమే ప్రధాన ఆదాయ వనరు. డాక్టర్లు, మందుల కొరతతో ఇక్కడ పశు వైద్యం గాలిలో దీపంగా మారింది. పశుసంపద రక్షణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 160కిపైగా పశు వైద్యశాలలు ఉన్నాయి. వాటిలో త్రిపురాంతకం, యర్రగొండపాలెం, మార్కాపురం, కంభం, బేస్తవారిపేట, గిద్దలూరు, హనుమంతునిపాడు, కనిగిరి, సీఎస్పురం, పొదిలి, కొండపి, టంగుటూరు, త్రోవగుంట, నాగులుప్పలపాడు, చీమకుర్తి, దర్శి, కురిచేడు, మద్దిపాడు, కందుకూరు, అద్దంకిలో అసిస్టెంటు డైరెక్టర్ స్థాయి కలిగిన వైద్యశాలలు ఉన్నాయి. పశువులకు వ్యాధులు సోకితే సరైన వైద్యం అందే పరిస్థితులు లేవు. వైద్యం కోసం పశువులను వైద్యశాలకు తీసుకెళ్తే అక్కడ సమస్యలు వెక్కిరిస్తున్నాయని రైతులు వాపోతున్నారు.మందుల కొరతతో అవస్థలు...జిల్లాలోని పలు వైద్యశాలల్లో దాదాపు 8నెలలుగా మందుల కొరత ఏర్పడింది. దీంతో డాక్టర్లు తమ వద్ద లేని మందులను బయట తెచ్చుకోవాలని చీటీపై రాసిస్తున్నారు. మందులు తెచ్చుకుంటే వైద్యం చేస్తామని డాక్టర్లు చెబుతుండడంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. ఆర్ఎస్కేలలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. జ్వరానికి సంబంధించిన పారాసిటమాల్, మెలనెక్స్, హార్టి జోన్, అరుగుదలకు సంబంధించిన బీ కాంప్లెక్స్, నొప్పులకు సంబంధించి పెయిన్ కిల్లర్స్, పొట్ట ఉబ్బరం వస్తే ఉపయోగించే టిమ్ఫోనిన్, యాంటీబయాటిక్స్, బ్లోబెండ్, వాతం వస్తే ఉపయోగించే పొడి మందు జెన్సీన్, చిర్రెట్, జింజర్, పొదుగువాపు వ్యాధి వస్తే ఉపయోగించే మూడు రకాల మందులతో పాటు యాంటీబయాటిక్స్, జీవాలకు దగ్గు వస్తే వాడే టైల్సిన్, చర్మవ్యాధులొస్తే ఉపయోగించే సల్ఫర్ బేస్డ్ పౌడర్ ఇలా అన్ని ప్రధాన మందులకు కొరత ఏర్పడింది. వీటితోపాటు లైఫ్ సేవింగ్ మందులైన డెక్సామెథాజోన్, బీటా మెథాజోన్, ఐసోఫ్లెడ్ తదితర మందులు లభించడంలేదు. డాక్టర్లు చీటీరాసిస్తే ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి జీవాలను కాపాడుకుంటున్నారు. దీంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది.వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మెరుగైన వైద్యం...వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశుపోషణపై ప్రత్యేక దృష్టి సారించారు. మందుల కొరత లేకుండా చూశారు. వైద్యశాలలకు, రైతు సేవా కేంద్రాలకు మందులు సరఫరా చేశారు. మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. జిల్లాకు 16 సంచార అంబులెన్స్లు కేటాయించారు. 1962 నంబర్కు ఫోన్ చేస్తే ఇంటి ముంగిటే పశువులకు వైద్యం అందేది.పశ్చిమాన డాక్టర్ల కొరత...జిల్లాలో మొత్తం 11 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్ల, మొగుళ్లూరు, హనుమంతునిపాడు మండలంలోని ఎస్ఆర్ పురం, వేములపాడు, గురవాజీపేట, పీసీ పల్లి మండలంలోని పెద్ద అలవలపాడు, పామూరు మండలంలోని ఆర్సీ పల్లి, సీఎస్ పురం మండలంలోని అంబవరం, గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు, బేస్తవారిపేట మండలంలోని సోమవారపేట పశువైద్యశాలలో రెగ్యులర్ డాక్టర్లు లేకపోవడంతో ఇన్చార్జి డాక్టర్లే దిక్కయ్యారు. చిన్నదోర్నాలలో ఉన్న ఒక డాక్టరును మార్కాపురంకు డిప్యుటేషన్ వేశారు. దీంతో పశువైద్యశాలల కొరత ఏర్పడింది. పశువులు, గొర్రెలు, మేకల పెంపకందారులు ఇబ్బందులు పడుతున్నారు.పశువులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాంజిల్లాలో పశువులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. మందుల కొరత లేదు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను ఉన్నంత వరకూ ఆయా వైద్యశాలలకు పంపుతున్నాం. మా సిబ్బంది కూడా అందుబాటులో ఉండి పశువులకు చికిత్స చేస్తూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సిబ్బంది కొరతపై ప్రభుత్వానికి నివేదిక పంపాం. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరాం.– రాఘవయ్య, ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్, మార్కాపురండాక్టర్లను నియమించి మందులు అందించాలిరాష్ట్ర ప్రభుత్వం పశువైద్యశాలలకు డాక్టర్లను నియమించి వెంటనే మందులు సరఫరా చేయాలి. మందుల కొరత మూలంగా జీవాలకు అనారోగ్యం వచ్చి వైద్యశాలకు తీసుకెళ్తే మందులు లేవంటున్నారు. దీంతో బయట కొని వాటికి వైద్యం చేయించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెటర్నరీ మందులను త్వరగా వైద్యశాలలకు అందించాలి.– జి.బాలనాగయ్య, గొర్రెలు, మేకల పెంపకందారుల జిల్లా నాయకుడు, మార్కాపురం -
క్రెడిట్ చోరీకి కేరాఫ్ చంద్రబాబు
మార్కాపురం టౌన్: రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చెందినా ఆ ఘనత నాదేనంటూ క్రెడిట్ చోరీకి కేరాఫ్ అడ్రస్గా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలుస్తాడని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి విమర్శించారు. తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశానని, జూలై నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తానని మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.చంద్రబాబు ఆత్మ విమర్శ చేసుకో..ప్రాజెక్టుకు మీ హయాంలో ఏ మేర నిధులు మంజూరు చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రూ.3500 కోట్లతో జర్మనీతో పాటు ఇతర దేశాల నుంచి పరికరాలను తెప్పించి టన్నెల్ నిర్మాణం చేపట్టడంతో పాటు గొట్టిపడియ, సుంకేశుల, కాకర్ల గ్యాప్లను నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి 30 ఏళ్లు అవుతుందని, మీ హయాంలో ప్రాజెక్టు నిర్మాణానికి మంజూరు చేసిన నిధులను ప్రజలకు తెలపకుండా నేనే ప్రారంభించా.. నేనే పూర్తి చేస్తా.. అంటూ క్రెడిట్ చోరీకి పాల్పడటమే ఆయన ప్రత్యేకత అన్నారు. 2014 నుంచి 2019 వరకు బడ్జెట్లో ప్రాజెక్టు నిర్మాణం కోసం మంజూరు చేసిన నిధులను బహిరంగ సభలో తెలిపితే సులభతరంగా ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. అబద్ధాలతో పూట గడుపుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదన్నారు.వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయాలంటే ఆర్ఆర్ ప్యాకేజీ, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.1250 కోట్లు అవసరమని చెప్పిన నువ్వే బడ్జెట్లో కేవలం రూ.496 కోట్లను ప్రకటించి ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మేధావులు, వివిధ సంఘాల నాయకులు 2 నుంచి 3 వేల కోట్లు కేటాయిస్తేనే తప్ప పూర్తికాదన్న నినాదాలను కూడా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. టన్నెల్ పనులు పూర్తి చేయకుండానే టన్నెల్ లోనికి ఎలా వెళ్లారని మీకు తెలీదా అన్నారు. 30 ఏళ్లుగా వెలిగొండ ప్రాజెక్టుపై మీరు చెబుతున్న అబద్ధాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తుఫాన్లతో రైతులు పంటలను నష్టపోవడంతో పాటు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంటే నష్టపరిహారం ఇచ్చి ఏనాడైనా రైతులను ఆదుకున్నావా అని ప్రశ్నించారు.అప్పుడు దొనకొండ..ఇప్పుడు మార్కాపురం హబ్గతంలో దొనకొండను ఇండస్ట్రీయల్ హబ్ చేస్తానని చెప్పాకొని, ఇప్పుడు మార్కాపురాన్ని హార్టికల్చర్ హబ్గా మరుస్తానంటూ చెబుతున్నారని, మీ మాటలు ఈ ప్రాంత ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మార్కాపురం జిల్లాను ప్రకటించి కేవలం కలెక్టరేట్ నిర్మాణానికి రూ.50కోట్లు ప్రకటించారే గానీ నాలుగు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ప్రజలకు హామీ ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. రీసర్వేపై రైతులకు న్యాయం చేస్తానని, భూ కబ్జాలకు పాటుపడితే అధికారుల తాటతీస్తారని గొప్పలు చెప్పిన చంద్రబాబు..మార్కాపురం నియోజకవర్గంలో భూ కబ్జాలు చేస్తూ ఇసుక, మట్టి దందాలు చేస్తూ కోట్లు గడిస్తున్న ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో ప్రజలకు తెలపలేదన్నారు. అరకొరగా ఒకటీ రెండూ పథకాలు అమలు చేసి సూపర్స్ అన్నీ పథకాలు అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తే వాటిని పూర్తి చేయకుండా పీపీపీ అంటూ వాటికి మంగళం పలికింది నువ్వుకాదా అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ మంగళవారం వేలకోట్ల రూపాయలు అప్పులకు పోతున్నది నువ్వుకాదా ప్రశ్నించారు. జలజీవన్ మిషన్ కింద గత ప్రభుత్వంలోనే నిధులు మంజూరు చేసి నిర్మాణాలు చేపడితే మీ హయాంలోనే అని గొప్పలు చెప్పుకుంటూ ప్రారంభించిన పథకాన్ని మళ్లీ ప్రారంభించడం మీకే చెల్లిందని విమర్శించారు. మార్కాపురం జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లి వెళ్లినట్లుగా పర్యటన ఉందని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు నల్లబోతుల కొండయ్య, ధర్మా నాయక్, గౌస్ మొహిద్దీన్, సాంబశివారెడ్డి, సీహెచ్ రమణారెడ్డి, శివారెడ్డి తదితరులు ఉన్నారు. -
నా సభలకు మహిళలు రావడం లేదు
మార్కాపురం: మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నప్పటికీ తన సభలకు వారు రావడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మార్కాపురం సభలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. సీ్త్ర శక్తి పథకంతో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ తన మీటింగుకు తక్కువ సంఖ్యలో వారు వచ్చారని సీఎం అన్నారు. ‘నేనడుగుతున్నా.. నాకు మీరిచ్చే కానుక.. నేను ఎక్కడికొస్తే అక్కడ అధిక సంఖ్యలో ఆడబిడ్డలు కనబడితే నాకు కొండంత ధైర్యం. ముందుకు పోవడానికి బాగుంటుంది’ అని సీఎం మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. మహిళలు తక్కువ సంఖ్యలో హాజరుకావడంతో మార్కాపురం టీడీపీ నేతలపై కూడా సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎం సభ ప్రారంభం కాకముందే కొందరు వెళ్లిపోగా, ప్రారంభమైన కొద్దిసేపటికే మరికొంతమంది మహిళలు వెళ్లిపోవడంపై కూడా సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
బెట్టింగులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు
ఒంగోలు టౌన్: క్రికెట్ బెట్టింగులపై జిల్లా పోలీసులు కొరఢా ఝలిపించారు. ‘బెట్టింగ్ మామూళ్లే’ అనే పతాక శీర్షికతో గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఎస్పీ హర్షవర్థన్రాజు సీరియస్గా తీసుకున్నారు. పోలీసు అధికారులకు క్లాస్ తీసుకున్నట్లు విశ్వనీయ సమాచారం. అంతేగాకుండా వెంటనే రంగంలోకి దిగి బెట్టింగ్ రాయుళ్ల పనిపట్టాల్సిందిగా ఆదేశించారు. దాంతో పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేశారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు వన్టౌన్ సీఐ నాగరాజు, టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, 8 మంది ఎస్సైలు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది మొత్తం 11 బృందాలుగా ఏర్పడి తమ పరిధిలోని టీ షాపులు, బార్లు, హాస్టళ్లు, ఇతర ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, గుంపులుగా గుమిగూడి ఉండే ప్రాంతాల్లో వ్యక్తుల మొబైల్ ఫోన్లను పరిశీలించారు. క్రికెట్ బెట్టింగులకు సంబంధించి వివిధ యాప్ల వినియోగంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగులకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మధ్యవర్తులను కూడా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండాలని, బెట్టింగుల జోలికి వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని హితవు పలికారు. క్రికెట్ను ఒక ఆటగా ఆస్వాదించాలని, వ్యసనంగా చూడవద్దని సూచించారు. కష్టపడకుండా ఊరికే డబ్బులు రావని, రెట్టింపు నగదు వస్తుందని చెప్పే మాటలు నమ్మవద్దని హితవు పలికారు. గతంలో బెట్టింగులకు పాల్పడిన వారిపై, అనుమానితులపై నిఘా ఉంచినట్లు చెప్పారు. ఎక్కడైనా క్రికెట్ బెట్టింగు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే 112, డయల్ 100, సమీపంలోని పోలీసు స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. సింగరాయకొండలో బుకీల పరార్... క్రికెట్ బెట్టింగులకు అడ్డాగా మారిన సింగరాయకొండలో బుకీలు పరారయ్యారు. సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైన నేపథ్యంలో పోలీసులు దాడులు చేసే అవకాశం ఉందని భావించిన బుకీలు జాగ్రత్త పడినట్లు సమాచారం. అయితే, క్రికెట్ బెట్టింగులకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరిని మధ్యాహ్నమే వదిలిపెట్టగా, మిగిలిన నలుగురిని పోలీసు స్టేషన్లోనే ఉంచడంపై పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అధికార పార్టీ ఒత్తిడి వలనే ఒక్కరిని వదిలిపెట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా అసలు వ్యక్తుల జోలికి వెళ్లకుండా క్రికెట్ బెట్టింగులతో సంబంధం లేని వారిని తీసుకొచ్చి పోలీసులు షో చేస్తున్నారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. -
ఉప్పుగుండూరులో పత్తేపారం!
● తన ఇంటినే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చిన మహిళ ● మాజీ భర్త ఫిర్యాదుతో యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాగులుప్పలపాడు: మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి పలువురు యువతులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ మహిళ గత కొంత కాలంగా భర్తకు దూరంగా ఇదే గ్రామంలో ఉంటోంది. ఈ క్రమంలో పలువురు యువతులు, యువకులు ఆమె ఇంటికి తరచూ రాకపోకలు సాగిస్తున్నారు. ఈ తతంగంపై పోలీసులకు ఆమె భర్త, స్థానికులు సమాచారం ఇవ్వగా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేశారు. కొంత మంది పోలీసు సిబ్బంది సహకారం కూడా ఉండటంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి కొంత మంది యువతులు సదరు మహిళ ఇంటికి వచ్చారు. ఇది గమనించిన ఆమె భర్త వారి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించాడు. దీంతో కొత్తగా వచ్చిన యువతులు, స్థానిక యువకులు అతనిపై దాడి చేశారు. క్షతగాత్రుడి ఫిర్యాదుతో బుధవారం పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. వివరాలు బయటకు పొక్కకుండా, కేసు నమోదు చేయకుండా గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఒకరు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. నేరుగా పోలీస్ స్టేషన్లో రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. త్రిపురాంతకం: ఎదురుగా వస్తున్న మినీ ట్రక్ను తప్పించే క్రమంలో చేపల లోడు లారీ రోడ్డు మార్జిన్లోని పొలాల్లో బోల్తా పడింది. త్రిపురాంతకం మండలంలోని దివేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ షేక్ షౌకత్(40) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి నుంచి లారీలో పచ్చి చేపల లోడ్ చేసుకుని డ్రైవర్ షేక్ మౌలాలి, క్లీనర్ షౌకత్, కాశిం విజయవాడ బయలుదేరారు. త్రిపురాంతకం మండలం దివేపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న మినీ ట్రక్ను తప్పించే క్రమంలో లారీ డ్రైవర్ మౌలాలి చాకచక్యంగా వ్యవహరించాడు. అయితే లారీ పల్టీలు కొట్టి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో పడింది. క్లీనర్ షౌకత్కు తీవ్ర గాయాలు కాగా కాశిం, మౌలాలి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో వైపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షౌకత్ మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా బోల్తా పడిన లారీలో చేపలను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీసుకువెళ్లారు. -
తౌషిక్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారించాలి
సింగరాయకొండ: మండల కేంద్రమైన సింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ స్కూల్లో విద్యార్థి తౌషిక్(11) అనుమానాస్పద మృతిపై సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని, త్రీమెన్ కమిటీ విచారణ నివేదిక వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో బుధవారం శ్రీతౌషిక్ కుటుంబానికి అండగా నిలుద్దాంశ్రీ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తౌషిక్ మృతి ఒక కుటుంబానికి విషాదం మిగల్చటమే కాకుండా విద్యావ్యవస్థలో కొనసాగుతున్న అక్రమాలు, నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలకు నిదర్శనమని ఆరోపించారు. ఈ ఘటనపై విద్యాశాఖాధికారులు త్వరగా స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం, విచారణ నివేదికను విడుదల చేయడంలో జాప్యం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. తౌషిక్ గత రెండేళ్లుగా శ్రీచైతన్య నవోదయ స్కూల్లో చదువుతుండగా కనిగిరిలోని ప్రగతి విద్యాలయంలో హాజరు వేయడాన్ని తప్పుబట్టారు. ఇది విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధమని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చైతన్య పాఠశాలలో నవోదయ కోచింగ్, సైనిక్ స్కూల్ ప్రవేశాలకు అనుమతులు ఉన్నాయా లేదా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వసతి గృహం నిర్వహించడం విద్యార్థుల భద్రతకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. చైతన్య స్కూల్లో 400 మంది విద్యార్థులు ఉండగా, వీరంతా వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్నట్లు ఆధారాలు బయటపడటం విద్యాశాఖలో డొల్ల తనాన్ని స్పష్టం చేస్తోందన్నారు. తౌషిక్ అనుమానాస్పద మృతిపై వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాడతామని ప్రకటించారు. పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ప్రకాశం జిల్లా ఉద్యోగుల జేఏసీ ఎన్నిక ఏకగ్రీవం
ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లా ఏపీ జేఏసీ చైర్మన్గా కె.శరత్బాబు, సెక్రటరీ షేక్ అబ్దుల్ హై ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం ఒంగోలు నగరంలోని ఏపీ ఎన్జీవో కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఏపీ జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ నూతన చైర్మన్ శరత్బాబు మాట్లాడుతూ.. త్వరలోనే జిల్లాలోని అన్ని తాలూకా కేంద్రాల్లో జేఏసీ కమిటీల నిర్మాణం చేపడతామని రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు పోరాట షెడ్యూల్ ప్రకటిస్తామని తెలియజేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జేఏసీ కమిటీని ఆహ్వానించి ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై చర్చించాలని 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని డిమాండ్ చేశారు. జేఏసీ సెక్రెటరీ జనరల్ షేక్ అబ్దుల్ హై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఐఆర్ 29 శాతం ప్రకటించాలని, ఉద్యోగుల బకాయిలకు సంబంధించి రూట్ మ్యాప్ ప్రకటించాలన్నారు. హెల్త్ కార్డు మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు తక్షణమే అందజేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా జేఏసీ కో చైర్మన్లుగా ఆర్.అంజయ్య, ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఎం.లక్ష్మీనారాయణ, ఏపీటీఎఫ్ 1938 ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్లుగా బి.శేషారావు, టి.శ్రీనివాసరావు(ఇరిగేషన్ డిపార్టుమెంట్), ఎన్వీ కృష్ణ(ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్) జి.ఈశ్వర్రెడ్డి(ఏపీ పీఆర్ డిప్లొమా ఇంజినీర్ అసోసియేషన్), ఎం.కోటేశ్వరరావు(ఏపీ వెటర్నరీ ఎంప్లాయీస్ జేఏసీ), జాయింట్ సెక్రెటరీలుగా ఎన్.ఉదయలక్ష్మి(ఏపీ గవర్నమెంట్ నర్స్ అసోసియేషన్), ఎస్కే మోమిన్(పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయ్ అసోసియేషన్), కె.శ్రీనివాసరావు(పే అండ్ అకౌంట్స్ ఎంప్లాయ్ అసోసియేషన్), జి.శివశంకర్(ఎస్టీయూ), మహావిష్ణు(స్వర్ణ వార్డ్ స్వర్ణ గ్రామ ఎంప్లాయ్ అసోసియేషన్), కె.రామయ్య(ఏపీ అగ్రికల్చరల్ మినిస్టర్ అసోసియేషన్), బి.అంకిరెడ్డి(ఏపీ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్), ఆర్గనైజింగ్ సెక్రటరీగా కృష్ణకిషోర్, ఏపీ ఎన్జీవో ట్రెజరర్గా కె.శివకుమార్, ఏపీఎన్జీఓ ఈసీ మెంబర్లుగా పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. చైర్మన్గా శరత్బాబు, సెక్రటరీగా అబ్దుల్ హై 12వ పీఆర్సీ కమిషన్ వేయడంతోపాటు 29 శాతం ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ ఉద్యోగులకు బకాయిల చెల్లింపుపై రూట్ మ్యాప్ ప్రకటించాలని విజ్ఞప్తి -
పథకాలు అమలు చేయలేకనే డైవర్షన్ పాలిటిక్స్
● సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కదిరి ధ్వజం సీఎస్పురం(పామూరు): కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేయలేక సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కనిగిరి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కదిరి బాబూరావు ధ్వజమెత్తారు. బుధవారం సీఎస్పురం మండలంలోని శీలంవారిపల్లెలో ఆయన కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన నాయకులు శ్రీనీకు రూ.18 వేలు, నీకు రూ.15 వేలుశ్రీ అంటూ మహిళలను నమ్మించారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజల్లో తిరిగే ధైర్యం లేక ముఖం చాటేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా అన్ని విధాలుగా మోసం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తరాలు ఇవ్వడంతోపాటు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు ఇంటివద్దకే వచ్చాయని, ఇప్పుడు ఒక్క పెన్షన్ తప్ప ఏ పథకం రావడం లేదన్నారు. గడిచిన రెండేళ్లలో టీపీడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి 24 గంటలు మంద్యం అందుబాటులో ఉంచడం, మద్యం డోర్ డెలివరీ తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో పథకాలు అందక పేదలు అలమటిస్తున్నారని, జగన్ లాంటి వ్యక్తిని గెలిపించుకోలేకపోయామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ముంటే అధికారం చేపట్టిన తరువాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితా ప్రచురించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి పేద విద్యార్థులను డాక్టర్లను చేయాలని చూస్తే వాటిని ప్రైవేట్ పరంచేసి లబ్ధిపొందాలని చూసిన దుర్మార్గుడు చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డును కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమావేశంలో ఇరగని చలపతిరావు, మాజీ ఎంపీటీసీలు మునగల నారాయణరెడ్డి, మారం కాశిరెడ్డి, వైఎస్సార్సీపీ మైనారిటీసెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్.బుజ్జి, మస్తాన్రెడ్డి, నున్నా నారాయణ పలువురు పాల్గొన్నారు. -
ఇంగ్లిష్ పరీక్షకు 1536 మంది గైర్హాజరు
ఒంగోలు సిటీ: ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 1536 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆర్ఐఓ ఆంజనేయులు తెలిపారు. జనరల్ విద్యార్థులు 21,531 మందికి గాను 20,286 మంది హాజరు కాగా 1245 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే ఓకేషనల్ విద్యార్థులు 2270 మందికి గాను 1979 మంది హాజరు కాగా 291 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 67 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. ఆర్ఐఓ 5 సెంటర్లు, డీఈసీ 6 సెంటర్లు, స్క్వాడ్ 32 సెంటర్లను తనిఖీ చేశాయని పేర్కొన్నారు. సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్): పేర్నమిట్టలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ నిర్మాణానికి రూ.300 కోట్ల నిధులు కేటాయిచాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సీపీఎం నాయకుల బృందం విశ్వవిద్యాలయానికి కేటాయించిన 110 ఎకరాల స్థలాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం పేరు మార్చారే గానీ భవన నిర్మాణాలు చేయడం మరిచిపోయారన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.104 కోట్లు మాత్రమే నిధులు కేటాయించారని, ఆ నిధులు ఉద్యోగులకు జీతాలకే సరిపోతాయన్నారు. విశ్వవిద్యాలయం చుట్టుపక్కల కొంత భూమి ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేరన్నారు. ఇప్పటికై నా భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి తరగతులు ఇక్కడే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు శ్రీనివాసరావు సుబ్బారావు, వెంకటేశ్వర్లు, రామకృష్ణారెడ్డి, కాలేషా, రామకృష్ణ కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. కనిగిరిరూరల్: కనిగిరి ఆర్డీఓ బి.కేశవర్ధన్రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు బదిలీ ఉత్తరు్ువ్ల రావడంతో బుధవారం సాయంత్రం ఆయన రిలీవ్ అయ్యారు. కనిగిరి ఇన్చార్జి ఆర్డీఓగా కంభం ఆర్అండ్ఆర్ యూనిట్ డిప్యూటీ కలెక్టర్(ఎల్ఏ) శివరామిరెడ్డిని నియమించినట్లు తెలిసింది. ఒంగోలు సిటీ: ఐసీడీఎస్ పీడీగా ఎం. నాగమణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం పీడీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. అంగన్వాడీ పరిధిలోని చిన్నారులందరికీ మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందజేయాలన్నారు. అర్ధవీడు: మండలంలోని బొమ్మిలింగం గ్రామంలో కోదండరామస్వామి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల స్థాయిలో బుధవారం ఎడ్ల బల ప్రదర్శన పోటీలు మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో మొత్తం 11 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. పోటీల్లో నంధ్యాల జిల్లా సంబవరం గ్రామానికి చెందిన జూపల్లి ప్రభాకర్రెడ్డికి చెందిన రెండు జతల ఎడ్లు 4250 అడుగులు లాగి ప్రథమ, ద్వితీయ బహుమతులను కై వసం చేసుకున్నాయి. కురిచేడు మండలం పొట్లపాడుకు చెందిన మేడగం హర్షవర్ధన్ఎడ్డి ఎడ్ల జత 4250 అడుగులు లాగి మూడవ బహుమతిని, జె.పంగులూరుకు చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్ల జడ 4118 అడుగులు నాల్గవ బహుమతిని, గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన పమిడి అంజయ్య ఎడ్ల జత 4072 అడుగులు లాగి ఐదవ స్థానం, బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన దేవరపల్లి జాన్వికారెడ్డి, ఆన్వికారెడ్డి ఎడ్ల జత 4040 అడుగులు లాగి ఆరోస్థానంలో నిలిచాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు ఆలయ కమిటీ సభ్యులు బహుమతులు ప్రదానం చేశారు. -
మోసం.. బాబు నైజం
ఒంగోలు టౌన్: అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు..రెండేళ్లవుతున్నా పట్టించుకోకుండా నిలువునా మోసం చేశాడని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ విమర్శించారు. సమ్మె ఒప్పందాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు. అంగన్వాడీల వేతనాలు పెంచాలని, ప్రీ స్కూళ్లను బలోపేతం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బుధవారం ప్రకాశం భవనం వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఒంగోలు, ఉలవపాడు, కందుకూరు ప్రాజెక్టుల నుంచి 15 మంది రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. సుమారు 200 మందికి పైగా అంగన్వాడీలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ నాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ టీచర్కు రూ.24,800, ఆయాకు రూ.20,300 వేతనాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో ఆయాలకు అతి తక్కువగా కేవలం రూ.7 వేలు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచని ప్రభుత్వం పనిభారాన్ని మాత్రం పెంచడం దారుమన్నారు. సుదీర్ఘ కాలం పనిచేసి రిటైర్డ్ అయిన తరువాత ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఒట్టి చేతులతో ఇంటికి పంపించడం అమానవీయమన్నారు. మహిళల శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వకుండా చేయడమే మహిళల ఉద్దరణా అని ప్రశ్నించారు. రోజు రోజుకీ ప్రీ స్కూల్ లక్ష్యాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచి బడ్జెట్లో తగిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి.కల్పన మాట్లాడుతూ అంగన్వాడీలకు వేసవి సెలవులు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. మే నెలంతా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీలకు తగిన నిధులు కేటాయించకుండా కేంద్రంలోని మోదీ సర్కార్, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ఐసీడీఎస్ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రీ స్కూలు నిధులను పెంచి అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలని కోరారు. అంగన్వాడీలను పర్మినెంట్ చేసేంత వరకు వేతనాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు ఇందిరావతి, బి.పద్మ, కె.హెమీమా, రాజేశ్వరి, లతారెడ్డి, స్వాతి, శ్రీదేవి, ఉషా, ముక్తార్, సుభాషిణి, జ్యోతి, మార్తమ్మ, జి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు.. ఓ క్రెడిట్ చోరీ..
మార్కాపురం / మార్కాపురం టౌన్ / మార్కాపురం రూరల్ : వెలిగొండ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశా.. నేనే పూర్తి చేస్తా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లాలో ప్రతిసారీ చెప్పే అబద్ధాలే మళ్లీ ఘనంగా వళ్లించారు. 1996 మార్చి 5న మార్కాపురం మండలం గొట్టిపడియ వద్ద నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే పైసా విదిల్చింది మాత్రం ఏమీ లేదు. ఈ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణం పోశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అత్తెసర నిధులు విదిల్చారు. అవి కూడా ఆయన సొంతవారి జేబుల్లోకి వెళ్లిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు. కరోనా విపత్తుతో రెండేళ్లు పనులకు అంతరాలు ఏర్పడినా రెండు సొరంగాల పనులు పూర్తి చేశారు. పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి రోడ్లు, వాటర్ ట్యాంకులు, ఇతర పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి జిల్లా వాసులకు వాస్తవాలు తెలుసన్న విషయాన్ని మరిచిపోయిన చంద్రబాబు అండ్కో క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మార్కాపురం సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘తానే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని, జూలైలో నీళ్లిస్తానని’ ప్రకటించడంపై ఈ ప్రాంతవాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ‘‘ఇప్పటివరకూ వెలిగొండ ప్రాజెక్టుకు మొత్తం రూ.5455 కోట్లు ఖర్చు అయిందని, ఇంకా రూ. 2540 కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంది’’ అంటూ చెప్పుకొచ్చారు. పునరావాస ప్యాకేజీ ప్రకటించకుండా, బడ్జెట్లో నిధులు కేటాయించకుండా జూలై నెలాఖరు లోగా ఎలా ప్రాజెక్టును ఎలా పూర్తిచేస్తారో? నీళ్లు ఎలా ఇస్తారో? ఆ దేవుడికే ఎరుక అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది జూలై నాటికి నల్లమల సాగర్ పూర్తి చేసి వెలిగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో కార్యాలయాల ఏర్పాటుకు కేవలం రూ. 50 ఇస్తున్నానని ప్రకటించారు. ముఖ్యంగా పలకల పరిశ్రమను ఆదుకోవాలని, మిర్చి యార్డు ఇవ్వాలని, మెడికల్ కాాలేజీని పూర్తిచేయాలని, మార్కాపురం చెరువును ట్యాంకు బండ్గా మార్చాలని, తర్లుపాడు రోడ్డును డబుల్రోడ్డుగా చేయాలని, మున్సిపాలిటీకి నిధులివ్వాలని, పొదిలి ప్రాంత ఆయకట్టును వెలిగొండలోకి చేర్చాలని నియోజకవర్గ వాసులు కోరుతున్నారు. వీటిపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఊకదంపుడు ఉపన్యాసం..జనం నిరుత్సాహం.. చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసంపై సభకు తీసుకొచ్చిన జనం సైతం నిరుత్సాహానికి గురయ్యారు. చెప్పినవే పదే పదే చెబుతుండడంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు. మార్కాపురం జిల్లాకు ప్రత్యేకమైన వరాలు ఇవ్వకపోగా, తిరుపతి లడ్డూ, వైఎస్ వివేకానందరెడ్డి మరణం, తల్లి చెల్లి అంటూ చంద్రబాబు చెబుతున్న సమయంలో సభకు హాజరైన జనం పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయన ప్రసంగం ప్రారంభించిన కొద్ది సమయానికే సభకు తీసుకొచ్చిన జనం బయటకు వెళ్లిపోవడం కనిపించింది. మందు.. విందు.. కొట్లాటలు.. మార్కాపురం టౌన్ / మార్కాపురం రూరల్ / కొనకనమిట్ల / పొదిలి రూరల్ : జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారిగా మార్కాపురానికి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. బాబు దృష్టిలో పడేందుకు చేసిన హడావుడికి తర్లుపాడు రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు ఇబ్బంది పడ్డారు. సభకు జనాలను తరలించేందుకు పలు గ్రామాలకు లారీలు, ఆటోలు, బస్సులు, ఇతర వాహనాలను పెద్ద ఎత్తున కేటాయించారు. వాహనాల్లో సభకు వచ్చేవారికి మందు, విందు ఏర్పాటు చేశారు. అయితే కొందరు ఫూటుగా మద్యం సేవించి సభకు హాజరు కాకపోగా రోడ్లపై, చెట్లకింద దొర్లాడిన దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. మరికొన్ని ప్రాంతాల్లో మద్యం ఎక్కువై టీడీపీ కార్యకర్తలు కొట్టుకోవడం కూడా సోషల్మీడియాలో హల్చల్ చేసింది. ఆర్టీసీ బస్సుపై కూడా కూర్చుని ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించారు. సభకు హాజరయ్యేందుకు వచ్చిన కొందరికి భోజనాలు కూడా అందకపోవడంతో తిట్టుకుంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు. -
గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
బంతిబంతికీ గెలుపోటములు ఊగిసలాడుతూ ఉత్కంఠ రేపుతున్న టీ 20 క్రికెట్ మ్యాచ్ల వినోదం వెనుక బెట్టింగ్ విష క్రీడ పొంచి ఉంది. పందేలకు అలవాటుపడి కొద్దిపాటి సొమ్ముతో లాభాలు వస్తాయనే ఆశతో అమాయకులు వేలంవెర్రిగా క్రికెట్ బుకీల చేతుల్లో చిక్కి బలవుతున్నారు. అధికార పార్టీ అండదండలతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జోరుగా బెట్టింగ్ సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు భారీగా డబ్బు సంపాదించవచ్చని తనకు ఆశచూపి మోసం చేశారంటూ జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన ఒక బాధితుడు కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం బెట్టింగ్ మాఫియా ఆగడాలకు నిదర్శనంగా నిలుస్తోంది. -
బెట్టింగ్ మామూళ్లే!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రస్తుతం టీ– 20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగ్ వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. బుకీలు రంగంలోకి దిగారు. ఎవరికి ముట్టజెప్పాల్సింది వారికి ముట్టజెప్పి గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా జిల్లాలో రాష్ట్ర సాంఘిక శాఖామంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సొంత నియోజకవర్గంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఓ కీలకనేత తండ్రితో ఒక ఒప్పందం చేసుకున్న బుకీలు అమాయకులకు వల విసురుతున్నట్లు సమాచారం. కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ కేంద్రంగా జిల్లాలో బెట్టింగ్ దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ గతంలో బెట్టింగ్లలో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. ఊరొదిలి పోయినవారూ ఉన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వరల్డ్ కప్నకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారులు పత్తా లేకుండా పోయారు. కనీసం తనిఖీలు నిర్వహించడం, పాత ఆటగాళ్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం వంటివేమీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మామా అల్లుళ్ల బెట్టింగ్ వ్యాపారం... జరుగుమల్లి మండలంలోని చింతలపాలెం గ్రామానికి చెందిన మామా అల్లుళ్లు గ్రామీణ ప్రాంతాలకు చెందిన అమాయక యువకులను క్రికెట్ బెట్టింగ్ ఉచ్చులోకి దింపుతున్నట్లు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీ కోసంలో కాకుటూరివారిపాలెం గ్రామస్తుడు పాతూరి మదన్కుమార్ ఫిర్యాదు చేయడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... మదన్కుమార్ జరుగుమల్లి మండలంలోని చింతపాలెం గ్రామంలో అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉండి చదువుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అధికార టీడీపీ సానుభూతిపరులైన క్రికెట్ బుకీలు దండే హేమంత్ కుమార్, అతడి మేనమామ కంచర్ల శ్రీనివాసరావు పరిచమయ్యారు. బెట్టింగులో డబ్బులు పెడితే భారీగా డబ్బులు వస్తాయని ఆశ చూపారు. బెట్టింగు కోసమని పెట్టుబడిగా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దగ్గర రూ.3.20 లక్షలు అప్పుగా ఇప్పించారు. అవన్నీ బెట్టింగ్లో పోయాయి. ఇప్పుడు డబ్బులు చెల్లించాలని మదన్ మీద ఒత్తిడి చేస్తున్నారు. పోలీసు కేసు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. శానంపూడికి చెందిన వైద్యశాఖలో పనిచేసే ఒక ఉద్యోగి బెట్టింగులలో పెట్టుబడి పెట్టి అప్పుల పాలై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సింగరాయకొండకు చెందిన అనేక మంది లారీ ఓనర్లు తీవ్రంగా నష్టపోయి అంతా పోగొట్టుకుని క్లీనర్లుగా మారిపోయారు. మరెంతోమంది ఊరొదిలి పారిపోయారు. ఇప్పుడు అదే ఘటనలు పునరావృతమమవుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొండపి నియోజకవర్గంలో భారీగా... కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో బుకీలు కొందరు మళ్లీ బెట్టింగులు మొదలు పెట్టినట్లు సమాచారం. సింగరాయకొండ, గవదగుంట్లవారిపాలెం, మూలగుంటపాడు, ఫకీరుపాలెం గ్రామాలకు చెందిన బుకీలు సింగరాయకొండ గ్రామంలోని కందుకూరు ఫ్లై ఓవర్ కింద, దాని పరిసరాలలో కొత్తగా వెలిసిన టీ స్టాళ్లు కేంద్రంగా చేసుకుని క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా సింగరాయకొండ గ్రామంలోని ఓల్డ్ ట్రంక్ రోడ్డులో టీడీపీ నాయకుడికి చెందిన ఒక రెస్టారెంట్లో క్రికెట్ బెట్టింగులు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జరుగుమల్లి మండలంలో కూడా జోరుగా బెట్టింగులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. టంగుటూరు మండలంలో పోలీసు అధికారుల కనుసన్నల్లోనే బెట్టింగు వ్యవహారం నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ పరిసరాల్లో 25 మంది వరకు బుకీలు ఉన్నట్లు సమాచారం. 70 నుంచి 100 మంది వరకు సబ్ బుకీలను ఏర్పాటు చేసుకుని ఊరూర, వాడవాడలా బెట్టింగులు నిర్వహిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోనూ రెచ్చిపోతున్న మాఫియా... జిల్లా కేంద్రమైన ఒంగోలులో కూడా క్రికెట్ బెట్టింగు జోరుగా నడుస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో సింగిల్ నంబర్ లాటరీ ఆగిపోవడంతో కొందరు వ్యసనపరులు క్రికెట్ బెట్టింగులవైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇస్లాంపేట, గోపాలనగర్, భాగ్యనగర్, సుజాత నగర్, సత్యనారాయణపురం, రాజాపానగళ్ రోడ్డు, సంతపేటలోని ఆర్అండ్బీ బంగ్లా పరిసరాలు, ఆర్టీఓ కార్యాలయం పరిసరాలు, వల్లూరు, పెళ్లూరు పరిసరాలు, నల్లవాగు, కొత్తకూరగాయల మార్కెట్, రద్దీ ప్రాంతాల్లోని టీ దుకాణాలు, శివారు ప్రాంతాల్లోని హోటళ్లను కేంద్రంగా చేసుకుని బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతంలో ఒంగోలు విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగి ఒకరు బెట్టింగులతో నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటనను ఈ సందర్భంగా కొందరు ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు.ఈ నెల 23న ఒంగోలు మీకోసంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్న మదన్కుమార్(ఫైల్) -
అర్ధరాత్రి మాజీ ఎంపీపీ కారుకు నిప్పు
సాక్షి టాస్క్ఫోర్స్: ఇంట్లో పార్క్ చేసి ఉన్న కారుకు నిప్పంటించిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వైఎస్సార్ సీపీకి చెందిన మార్కాపురం జిల్లా అర్థవీడు మాజీ ఎంపీపీ గొటిక రాజేశ్వరరెడ్డి 20 ఏళ్లుగా కంభం పట్టణంలోని రావిపాడు రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటి ఒకటిన్నర గంటల సమయంలో ఇంటి బయట మంటలను గమనించి బయటకు వచ్చి చూస్తే కారు మంటల్లో కాలిపోతోంది. వెంటనే మంటలను ఆర్పేసి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ నారాయణ, ఫైర్ సిబ్బంది ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గొటిక రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన పాపినేనిపల్లిలో తనతో పాటు పక్కన ఉన్న రైతులకు చెందిన బత్తాయి, జామాయిల్ తోటలకు ఎవరో నిప్పంటించడంతో కాలిపోయి నష్టం వాటిల్లిందన్నారు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు తన కారుకు నిప్పంటించారన్నారు. ఇద్దరు వ్యక్తులు ముసుగు వేసుకొచ్చి కారుకు నిప్పంటించినట్లు తెలుస్తోందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాజకీయ కక్షతోనే నిప్పంటించారు అర్థవీడు మాజీ ఎంపీపీ రాజేశ్వరరెడ్డి -
సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
● ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్రాజు వెల్లడి మార్కాపురం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం మార్కాపురం, పెద్దదోర్నాల మండలంలో పర్యటిస్తున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్రాజు తెలిపారు. ఇద్దరు ఏఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 37 మంది సీఐలు, 90 మంది ఎస్సైలతోపాటు 1162 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ పోలీసులు, ఏపీఎస్పీ సిబ్బందిని బందోబస్తుకు నియమించినట్లు వివరించారు. పోలీసులు సూచించిన విధంగా వాహనదారులు పార్కింగ్ ప్లేసుల్లో మాత్రమే తమ వాహనాలు నిలపాలని సూచించారు. హెలిప్యాడ్, సభాస్థలిని అధికారులతో కలిసి ఎస్పీ పరిశీలించారు. అనంతరం ట్రయల్ రన్ నిర్వహించారు. ఎస్పీ వెంట ఎస్ఎస్జీ అడిషనల్ ఎస్పీ రమణ, నెల్లూరు అడిషనల్ ఎస్పీ సౌజన్య, పల్నాడు అడిషనల్ ఎస్పీ సత్యరాజు, డీఎస్పీలు ఉన్నారు. పెద్దదోర్నాల: ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పెద్దదోర్నాల మండలంలోని గంటవానిపల్లెలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇక్కడి హెలిప్యాడ్ వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ఎండ తీవ్రతకు స్పృహ తప్పి అస్వస్థతకు గురైంది. గంటవానిపల్లె ఫీడర్ కెనాల్ సమీపంలో హెలిప్యాడ్ను మంగళవారం మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్రాజు పరిశీలిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్పీ ఆదేశాల మేరకు అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు పోలీసు వాహనంలో మహిళా కానిస్టేబుల్ను పెద్దదోర్నాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నీరసం వల్ల కళ్లు తిరిగి పడిపోయారని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని సహచర ఉద్యోగులు పేర్కొన్నారు. -
వలేటివారిపాలెంలో గుప్త నిధుల తవ్వకాలు
వలేటివారిపాలెం: మండల కేంద్రమైన వలేటివారిపాలెంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. సోమవారం అర్ధరాత్రి వేళ స్థానికంగా ఉన్న పురాతనమైన జనార్దన స్వామి గుడి ఆవరణలో నాలుగు స్తంభాల కల్యాణ మండపంలో సుమారు 11 అడుగుల లోతున గొయ్యి తవ్వారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. ఆలయ ఆవరణలో గొయ్యి తవ్వి ఉండటాన్ని గ్రామానికి చెందిన పశుపోషకాలు గమనించి గ్రామ పెద్దలకు తెలియజేశారు. రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన జనార్దన ఆలయం ఆవరణలో 200 అడుగుల ఎత్తు గల రాతి స్తంభం వద్ద కల్యాణ మండపం ఉంది. గతంలో కూడా గుప్త నిధుల కోసం ఇదే గుడిలో ఒక సారి, రాతి స్తంభం కింద ఒకసారి తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికై నా ప్రభుత్వం, పురావస్తు శాఖ అధికారులు స్పందించి జీర్ణావస్థకు చేరిన ఆలయానికి మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.


