Prakasam District Latest News
-
రోడ్డెక్కిన పొగాకు రైతు
ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి మార్కాపురం: ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం సాయంత్రం మార్కాపురం మండలంలోని కుంట – చింతగుంట్ల గ్రామాల మధ్య జరిగింది. రూరల్ ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న లారీకి టైరు పంక్చర్ కావడంతో కుంట – చింతగుంట్ల గ్రామాల మధ్య రోడ్డు పక్కన ఆపి ఉంది. టైరుకు పంక్చర్ వేసుకుంటుండగా, మార్కాపురం సబ్స్టేషన్లో హెల్పర్గా పనిచేసే తిప్పాయపాలేనికి చెందిన కుందురు చిన్న నారాయణరెడ్డి (32) ఇంటికి వెళ్తూ ఏమరపాటుతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి రెండు సంవత్సరాల క్రితమే వివాహమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న భార్య, తల్లిదండ్రుల రోదనలు చూపరులతో సైతం కంటతడి పెట్టించాయి. రూరల్ ఎస్సై అంకమరావు, ఏఎస్సై శ్రీనివాసరావు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం ఒంగోలు: స్థానిక మినీ స్టేడియంలో 12వ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి శనివారం క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులంతా క్రీడా స్ఫూర్తి ప్రదర్శిస్తూ విజేతలుగా నిలిచేందుకు కృషిచేయాలన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి జి.రాజరాజేశ్వరి మాట్లాడుతూ మూడు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. జిల్లా కార్యదర్శి జి.భక్తధృవుడు మాట్లాడుతూ సబ్జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్ విభాగాలలో పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ సౌత్జోన్ అసోసియేషన్ అధ్యక్షుడు గంటా వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఎస్.కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు ప్రభాకరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొండపి: వ్యాపారుల ధోరణితో పొగాకు రైతుల సహనం నశించింది. రోడ్డెక్కి రాస్తారోకో చేసేందుకు దారితీసింది. కొండపిలోని పొగాకు వేలం కేంద్రంలో శనివారం మూగచింతల, నెన్నూరుపాడు, గురప్పడియా, కే అగ్రహారం, చతుకుపాడు గ్రామాల రైతులు బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. కొనుగోలు ప్రారంభం నుంచి డిస్ప్లే బోర్డుపై ధరలు కనిపించాల్సి ఉండగా, ఒక లైను పొగాకు కొనుగోలయ్యేంత వరకు ధరలు కనిపించలేదు. వేలం ప్రారంభంలో లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేశారని, వేలం కొనసాగుతున్నకొద్దీ ఎఫ్–3 పొగాకు బేళ్లను నో బిడ్లుగా చూపిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాన్ని బహిష్కరించి బయటకు వెళ్లారు. అనంతరం రైతులతో వేలం నిర్వహణ అధికారి మాట్లాడి వేలం కొనసాగించడానికి ప్రయత్నించారు. లోపలికి వెళ్లిన రైతులు అదే పరిస్థితి కొనసాగడంతో బయ్యర్లతో వాగ్వాదానికి దిగి వేలాన్ని బహిష్కరించి బయటికి వచ్చేశారు. అనంతరం రైతులు కొండపి, టంగుటూరు రోడ్డులో ధర్నాకు దిగి ఆందోళన వ్యక్తం చేశారు. వేలం నిర్వహణ అధికారి రైతుల పక్షాన నిలిచి వ్యాపారులతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించాలని, బేళ్ల కొనుగోలును ప్రారంభించాలని నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో స్థానిక ఎస్సై ప్రేమ్కుమార్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. వేలం నిర్వహణ అధికారితో చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. వేలం నిర్వహణ అధికారి దగ్గరికి మీరు కూడా రావాలని ఎస్ఐని రైతులు కోరగా, అందుకు అంగీకరించడంతో రైతులు ధర్నాను విరమించారు. రైతును బట్టి ధరలా..? వేలం కేంద్రంలో రైతును బట్టి గ్రేడ్, ధరలు నిర్ణయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మంచి ధర కల్పించాలని నిలదీస్తే అటువంటి రైతును టార్గెట్ చేసి ధర తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలం అధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న రైతులకు మంచి గ్రేడ్లు, ధర ఇస్తున్నారన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుని రైతులందరికీ గ్రేడ్లను బట్టి మంచి ధరలు దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దిగివచ్చి పొగాకు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని రైతు కూలీ సంఘ కార్యదర్శి లలిత కుమారి, సహాయ కార్యదర్శి పరిటాల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా నిలిచి రోడ్డుపై వారు బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి రైతులకు మద్దతు ధర కల్పించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎట్టకేలకు ప్రారంభమైన వేలం... రైతులతో పలు దఫాలుగా పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి చర్చలు జరిపిన అనంతరం గిట్టుబాటు ధర కల్పించే విధంగా బయ్యర్లతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో రైతులు అంగీకరించి వేలానికి మొగ్గుచూపారు. అనంతరం ఆగిన చోట నుంచి వేలం ప్రారంభమైంది. ఆందోళనలతో కాకుండా చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని రైతులకు వేలం నిర్వహణ అధికారి సూచించారు. వేలం బహిష్కరించి రాస్తారోకో అధిక సంఖ్యలో మీడియం గ్రేడ్ బేళ్లను తిరస్కరిస్తున్నారంటూ ఆందోళన అన్ని బేళ్లను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ -
సమాచారశాఖ ఉద్యోగికి ఘనంగా వీడ్కోలు
ఒంగోలు సబర్బన్: సమాచారశాఖలో సుమారు 38 ఏళ్లపాటు టైపిస్టుగా విధులు నిర్వర్తించి శనివారం ఉద్యోగ విరమణ పొందిన ఓ ఇందిరాకుమారిని సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. స్థానిక ప్రకాశం భవన్లోని కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఐపీఆర్ఓ వేణుగోపాల్, డీపీఆర్ఓ రమేష్, డివిజినల్ పీఆర్ఓ దుర్గాప్రసాద్, రిటైర్డ్ డీఈఐఈ రమణమూర్తి, రిటైర్డ్ డీపీఆర్ఓ నారాయణ, కార్యాలయ సబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం డివిజన్ కార్యాలయంతో పాటు ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో పనిచేసిన ఇందిరాకుమారి సేవలను కొనియాడారు. -
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
ఒంగోలు సిటీ: జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు. ఆమె అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. గ్రామీణ నీటి సరఫరా, డ్వామా, డీఆర్డీఏ, విద్య, వ్యవసాయం, ఉద్యానవన శాఖల ద్వారా అందుతున్న సేవల గురించి వివరించారు. చట్టసభ సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సూచించారు. ముందుగా పహల్గాం ఉగ్ర దాడిలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. బాధిత రైతుకు పరిహారం అందించాలి : యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని గురిజేపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు బొప్పాయి పంటను నష్టపరిచారని, బాధిత రైతుకు పరిహారం అందేలా చూడాలని అధికారులను కోరారు. యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ జాబితాలో 320 మంది పేర్లు లేవని, పరిశీలించి వాటిని చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రక్షిత మంచినీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలో జలజీవన్ మిషన్ పనులను పూర్తి చేసే గడువును 2028 వరకు పెంచినందున ఆయా పనులను వేగవంతం చేయాలని చెప్పారు. రైతుల వద్ద పొగాకు నిల్వలు భారీగా ఉన్నందున మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. కొత్త జెడ్పీ సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యకు తోడు సాగర్నీటిని పంపణీ చేసే పైపులైన్లు దెబ్బతిన్నందున కొత్త పైపులైన్లు వేయాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులందరికీ పెన్షన్లు అందేలా చూడాలన్నారు. హనుమంతునిపాడు మండలంలో తక్కువ వర్షపాతం నమోదైనా కరువు మండలంగా ప్రకటించలేదని, పున:పరిశీలన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు చెప్పారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణపై మరింత దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. రామతీర్ధం, గుండ్లకమ్మ కాలువలను బాగుచేయించాలని సూచించారు. సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. జూన్ నెలాఖరుకు పూర్తిచేయకపోతే నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం ఉండదన్నారు. పలు సమస్యలు ఏకరువు పెట్టిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు... పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు అనేక సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. స్కూళ్లలో విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలయ్యే విధంగా చూడాలని కోరారు. చీమకుర్తి బాలికల హాస్టల్లో భోజనం నాణ్యంగా లేదని, వర్కర్లు దారుణంగా మాట్లాడుతున్నారని, ఈ సమస్యపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో ఫ్లోరైడ్ నీటి సమస్యను పరిష్కరించాలని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసిన వారికి పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలని అధికారులను కోరారు. రామతీర్థం ప్రాజెక్టుకు వెళ్లే దారిలో ఉన్న ముళ్లచెట్లను తొలగించాలని, శ్మశానాలలో ముళ్లచెట్లను తొలగించి చుట్టూ ప్రహరీ నిర్మించాలని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మండలాల్లో ఆధార్ కేంద్రాల సంఖ్య పెంచాలని కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి : జేసీ గోపాలకృష్ణ జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యాహక్కుచట్టం అమలు, అర్హతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ జాబితాలో పేర్లు లేని వారి అర్హతను పరిశీలించేందుకు గ్రామసభలు పెట్టామన్నారు. అర్హులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు. కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ సవరించిన మార్గదర్శకాల మేరకు, మండల పరిషత్ ఆమోదించే పనుల అంచనాల విలువను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు, జిల్లా పరిషత్ ఆమోదించే పనుల అంచనాల విలువను రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్రభుత్వం పెంచిందన్నారు. కొత్త జెడ్పీ సమావేశ మందిరం నిర్మాణానికి గతంలో రూపొందించిన రూ.20 కోట్ల అంచనాలను సవరించేందుకు గత రెండు స్టాండింగ్ కమిటీలలో ఆమోదించిన 350 ప్రతిపాదనలకు కూడా సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు. బాపట్ల, నెల్లూరు జిల్లాల డీఆర్వోలు గంగాధరగౌడ్, ఉదయభాస్కర్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశంలో పాల్గొన్నారు.ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించడం లేదు : దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి జెడ్పీ సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో జాబ్కార్డులు కలిగిన వారందరికీ పని ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఉన్న జాబ్కార్డుల్లో యాభై శాతం మందికి కూడా పని కల్పించడం లేదన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల వారికి పని కల్పించడం కోసమే ఉపాధి హామీ పథకం ఉందన్నారు. కానీ, అధికారులను అడిగినా పని కల్పించడం లేదన్నారు. కిందిస్థాయిలో ఇబ్బందిపెడుతున్నారని, అటువంటివి లేకుండా అందరికీ పని కల్పించాలని కోరారు. తన నియోజకవర్గంలో పంటలు నష్టపోయిన ఉద్యానవన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
ఎండగడదాం
చంద్రబాబు నయవంచనను ● 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ● వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున పిలుపు సంతనూతలపాడు: కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన నయవంచనను ఎండగట్టాలని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ సంతనూతలపాడు మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సంతనూతలపాడులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాదైనా నేటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దగా చేశాడంటూ మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలు, కులమతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఏడాది పాలన చూసి మోసపోయామని గ్రహించిన ప్రజలు.. కూటమిని గెలిపించి తప్పు చేశామని పశ్చాత్తాపానికి గురవుతున్నారన్నారు. చంద్రబాబు మోసాన్ని, నయవంచనను నిలదీసేందుకు జూన్ 4న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామని మేరుగు నాగార్జున వెల్లడించారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. ఎందుకు నెరవేర్చలేదో చంద్రబాబు చెప్పాలని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం పథకం పేరుతో ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఇంత వరకు అమలుచేయలేదన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. 18 ఏళ్లు నిండిన యువతులకు ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామన్నారని, మహిళలకు ఉచిత బస్సు అన్నారని, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారని, కానీ, అవన్నీ ఏమయ్యాయని నిలదీశారు. యువగళంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారం చేపట్టి ఏడాదైనా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. వలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని వారిని అసలు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఇంటింటికి రేషన్ అందించామని, చంద్రబాబు ఎండీయూ వాహనాలను రద్దు చేసి ఇంటి వద్దకే రేషన్ అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదైనా కొత్త పింఛన్ ఒక్కటి కూడా ఇవ్వలేదని, ఉన్న పింఛన్లు తొలగించడం బాధాకరమని అన్నారు. వీటన్నింటికి నిరసనగా నిర్వహించనున్న వెన్నుపోటు దినం ర్యాలీలో చంద్రబాబు చేతిలో మోసపోయిన మహిళలు, రైతులు, నిరుద్యోగులు, వలంటీర్లు భారీగా పాల్గొనాలని మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. సమావేశానికి వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి అధ్యక్షత వహించగా, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, సొసైటీ మాజీ అధ్యక్షుడు దుంపా యలమందారెడ్డి, నాయకుడు రావూరి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీలు కే వెంకటేశ్వరరావు, కే సుబ్బారావు, వి.కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం పనిచేయకపోతే ప్రశ్నిస్తా అంటూ గతంలో హడావుడి చేశారు. నేడు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. పోలీసు యంత్రాంగాన్ని చేతుల్లో ఉంచుక
ఆస్పత్రిలో ఉంటే... పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి. బీటెక్ చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. వినాయక చవితి పండుగ సమయంలో విగ్రహం ఏర్పాటుకు డబ్బులు వసూలు చేయడాన్ని ప్రశ్నించాడు. అది కూటమి పాలకులకు పెద్ద నేరంగా కనిపించింది. అతడి మీద సంతనూతలపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయించింది. తిరుపతిలో మరో కేసు బనాయించింది. ఈలోపు అనుకోకుండా సదరు యువకుడికి ఆరోగ్యం దెబ్బతింది. దాంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లాడు. వైద్యులు అతడికి ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. దాంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. అతడిని అరెస్టు చేసేందుకు తిరుపతి పోలీసులు ఆస్పత్రికి వెళ్లారంటే రెడ్బుక్ రాజ్యాంగం దుర్మార్గాలను అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ తరువాత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్కు వచ్చి సీఐ ఎదుట విచారణకు హాజరయ్యాడు. -
గంజివారిపల్లిలో పులి కలకలం
యర్రగొండపాలెం: మండలంలోని గంజివారిపల్లిలో పులి కలకలం రేపింది. మూడు రోజుల క్రితం గంజివారిపల్లి నుంచి కొలుకుల వెళ్లే దారిలో ఉన్న పొలాల్లో పులి సంచరించినట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఈ మేరకు అటవీ శాఖాధికారులు తమ సిబ్బందితో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే వారికి పులి సంచరించినట్లు ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. పులి సంచరించినట్లు వచ్చిన సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లోని అటవీ శివారు ప్రాంతాలతోపాటు పొలాలను పరిశీలించామని, పులి అడుగు జాడలు తమకు కనిపించలేదని గంజివారిపల్లె రేంజర్ సుబ్బారావు తెలిపారు. పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని, పులి జాడ తెలిసిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్గా సీతారామయ్య ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్గా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య శనివారం బాధ్యతలు చేపట్టారు. కష్టపడి పని చేసి బ్యాంకును అభివృద్ధి బాటలో నడిపిస్తామని అన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ కుంభా రాఘవయ్య, అధికారులు ఎన్.ఇందిరా దేవి, బ్యాంకు డీజీఎమ్, ఏజీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. రంగనాయకుని దర్శనానికి పోటెత్తిన భక్తులు రాచర్ల: వుండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తొలుత నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం సమీపంలోని నీటిగుండంలో స్నానాలు ఆచరించి, గంటల తరబడి క్యూలో నిలబడి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు అన్నవరం పాండురంగచార్యులు, సత్యనారాయణచార్యులు ఆధ్వర్యంలో నెమలిగుండ్ల రంగనాయకస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూల అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు కృష్ణదేవరాయుల కాపుబలిజ, గోపాలకృష్ణ యాదవ, కాశినాయన, యోగి వేమన రెడ్ల, ఆర్యవైశ్య అన్నదాన సత్రాల్లో అన్నసంతర్పణ చేశారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి ఎడ్ల పందేల విజేత కర్నూలు ఎడ్లజత తర్లుపాడు: మండల కేంద్రమైన తర్లుపాడులో నీలంపాటి అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు నిర్వహించారు. కర్నూలు జిల్లా పాణ్యంకు చెందిన సుబ్రమణ్యేశ్వరరెడ్డి ఎడ్లజత మొదటి బహుమతిని, బాపట్ల జిల్లా బల్లికురవకు చెందిన పాలూరి వీరయ్య చౌదరికి చెందిన ఎడ్ల జత ద్వితీయ బహుమతిని, కర్నూలు జిల్లా మిడుతూరుకు చెందిన రోలిమెడం ఎడ్ల జత తృతీయ బహుమతి సాధించారు. విజేతలకు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ అన్నా రాంబాబు బహుమతులు అందజేశారు. తొలుత ఆలయంలో అన్నా రాంబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ మురారి, ఎంపీపీ రామసుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు రామచంద్రారెడ్డి, గాయం శ్రీనివాసరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, సర్పంచ్ పీ వరాలు, వైస్ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎడ్ల పందెం నిర్వాహకులు వెన్న చిన్న సత్యనారాయణరెడ్డి, ఏరువ మల్లారెడ్డిలను, ట్రాక్టరు దాతలు అశోక్రెడ్డి, నాగార్జునరెడ్డిలను మాజీ ఎమ్మెల్యే అన్నా అభినందించారు. -
ప్రకాశం
36 /25జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంజిల్లా సమగ్రాభివృద్ధే ల క్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. 7గరిష్టం/కనిష్టంరోడ్డెక్కిన పొగాకు రైతువ్యాపారుల ధోరణితో సహనం నశించిన పొగాకు రైతులు కొండపిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో జల్లులు పడవచ్చు.– 8లో.. ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025 -
పాలన ఎరుపెక్కి!
ప్రశ్నించే గొంతునొక్కి.. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చి కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద అడ్డగోలుగా కేసులు పెట్టి వేధించడం మొదలు పెట్టింది. ఎప్పుడో సోషల్మీడియాలో చంద్రబాబు, లోకేష్లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద కూడా కేసులు పెట్టింది. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై ఏకంగా ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి మీద కూడా కేసులు పెట్టించింది. భయానక వాతావరణాన్ని సృష్టించి రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడకుండా చేసింది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేయించి భీతావహ వాతావరణాన్ని సృష్టించింది. ఏడాది పాలన -
తనిఖీల్లో కిరికిరి.. థియేటర్లపైనే గురి!
సాక్షి నెట్వర్క్: ‘కూటమి ప్రభుత్వంపై సినీ పరిశ్రమకు కృతజ్ఞత లేదు. మీ కోసం ఎంతో చేస్తే ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా..’ అంటూ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. థియేటర్లకు అద్దె కాకుండా షేర్ ఇవ్వాలని యజమానుల యూనియన్ కోరిన నేపథ్యంలో బంద్ ప్రస్తావన తెరపైకి రావడం, దీనిపై లోతుగా విచారించాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. థియేటర్లలో వసతులు, టికెట్ ధరలు, తినుబండారాల ధరలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని డీప్యూటీ సీఎం కార్యాలయం ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు రెండు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోనూ శుక్రవారం తనిఖీలు ప్రారంభించారు. అయితే నేరుగా థియేటర్లను మాత్రమే తనిఖీ చేస్తే ప్రజల్లోకి మరో విధంగా సందేశం వెళ్తుందని భావించిన కూటమి పాలకులు రూటు మార్చారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్లు, ఎంఎల్ఎస్ పాయింట్లు, ఆర్టీసీ డిపోలు తదితర వ్యాపార కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించడం గమనార్హం. -
సత్తా చాటిన బాపట్ల జిల్లా ఎడ్లు
రాచర్ల: మండలంలోని ఒద్దులవాగుపల్లె పంచాయతీ పరిధిలోని అచ్చంపల్లె గ్రామంలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత పట్టాభిరామస్వామి నూతన విగ్రహ, ధ్వజ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి న్యూ కేటగిరీ ఎడ్ల బండలాగుడు పోటీల్లో బాపట్ల జిల్లా ఎడ్ల జతలు సత్తా చాటాయి. పోటీల్లో మొత్తం 7 జతల ఎడ్లు పాల్గొన్నాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన శివకృష్ణచౌదరి ఎడ్లు నిర్ణీత 20 నిమిషాల్లో 3767 అడుగులు లాగి మొదటి బహుమతి రూ.80 వేలు సాధించాయి. నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన బొరెడ్డి కేశవరెడ్డి ఎడ్ల జతలు రెండో బహుమతి, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడు గ్రామానికి చెందిన గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎడ్లు మూడో బహుమతి, కురిచేడు మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన ఎం.బయ్యపురెడ్డి ఎడ్లు నాలుగో బహుమతి, బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఉప్పుమాగుటూరు గ్రామానికి చెందిన తేజశ్రీరెడ్డి ఎడ్లు ఐదో బహుమతి, తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా కోదాడ గ్రామానికి చెందిన డాక్టర్ హుసేన్ ఎడ్లు ఆరో బహుమతి, నంద్యాల మండలం ఎన్.కొత్తపల్లి గ్రామానికి చెందిన చల్లా వెంకటహారిక ఎడ్లు ఏడో బహుమతి గెలుపొందాయి. ప్రథమ బహుమతిని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి కేపీ నాగార్జునరెడ్డి బహూకరించారు. -
రెచ్చిపోయిన దొంగలు
బేస్తవారిపేట: ఇంటి యజమానులు ఆరుబయట నిద్రిస్తుండగా దొంగలు చేతివాటం చూపించారు. వరుసగా ఉన్న ముగ్గురు అన్నదమ్ముళ్ల గృహాల్లో 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.65 వేల నగదు దోచుకెళ్లారు. ఈ సంఘటన బేస్తవారిపేట మండలంలోని పీవీపురంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచిన యజమానులు చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల కథనం మేరకు.. పీవీ పురంలో అన్నదమ్ముళ్లు తమటం గురునారాయణరెడ్డి, తమటం జగన్మోహన్రెడ్డి, తమటం చిన్నవెంకరెడ్డి గృహాలు వరుసగా ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ గురువారం రాత్రి ఆరుబయట, వరండాలో నిద్రపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ గృహం వెనుక వైపు తలుపు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఒక ఇంట్లో నుంచి మరో ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉండటంతో వరుసగా ఉన్న మూడు ఇళ్లను లూటీ చేశారు. షెల్ఫ్ల్లో దుస్తుల కింద దాచిపెట్టిన బీరువా తాళాలు తీసుకుని చోరీకి పాల్పడ్డారు. తమటం గురునారాయణరెడ్డి గృహంలో 13 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు, జగన్మోహన్రెడ్డి ఇంట్లో 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు, చిన్న వెంకటరెడ్డి ఇంట్లో బంగారు ఉంగరం, రూ.5 వేల నగదు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు, కంభం సీఐ కె.మల్లికార్జున, ఎస్సై రవీంద్రారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు క్లూస్ టీమ్ ఎస్సై శరత్కుమార్ వేలిముద్రలు సేకరించారు. పోలీస్ జాగిలాలు గృహాల వెనుక వైపున పొలాలు, పాఠశాల వద్దకు, గృహ పరిసరాల్లో తిరిగాయి. ఆ ఇళ్లపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు. వీరాయపాలెంలో నిద్రిస్తున్న మహిళల మెడలో.. దర్శి(కురిచేడు): దర్శి మండలంలోని తూర్పువీరాయపాలెం గ్రామంలో గురువారం అర్థరాత్రి దొంగలు హల్చల్ చేశారు. రెండు ఇళ్లలో చోరీకి విఫలయత్నం చేశారు. పంచల్లో పడుకున్న మహిళల మెడల్లో నాలుగున్నర సవర్ల బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యారు. వివరాలు.. తూర్పు వీరాయపాలెం గ్రామంలోని ముప్పరాజు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఇంటి వరండాలో నిద్రిస్తున్నారు. ఇద్దరు దొంగలు రాత్రి 12.30 గంటల సమయంలో ఇంట్లోకి గోడదూకి ప్రవేశించారు. నాగేశ్వరరావు భార్య పద్మ మెడలో బంగారు తాళిబొట్టు, నానుతాడు కట్ చేశారు. అయితే తాళిబొట్టు కిందపడటంతో పద్మకు మెళకువ వచ్చింది. లేచి చూసే సరికి దొంగలు తాడు తీసుకుని పరారయ్యారు. నాగేశ్వరరావు వెంటపడినా ఫలితం లేకపోయింది. అదే గ్రామంలో రాత్రి ఒంటి గంట తరువాత మధుమంచి ఏడుకొండలు కుటుంబ సభ్యులు వారి ఇంటి ముందు ఆరుబయట నిద్రిస్తున్నారు. ఏడుకొండలు భార్య గురువర్దిని మెడలోని తాళిబొట్టు, నానుతాడు లాక్కుని పరారవుతుండగా ఏడుకొండలు వెంటపడ్డాడు. దొంగలు పొలాల్లో గుండా పారిపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. బేస్తవారిపేట మండలం పీవీ పురంలో ముగ్గురు సోదరుల గృహాల్లో దొంగతనం 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.65 వేల నగదు అపహరణ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐ కురిచేడు మండలం తూర్పువీరాయపాలెంలో మహిళ మెడలో గొలుసు చోరీ -
పెళ్లింట తీవ్ర విషాదం
కొమరోలు: బావ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన బావమరిది పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగిరాని లోకాలకు చేరాడు. ఈ విషాద సంఘటన కొమరోలు మండలం యర్రపల్లె గ్రామం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు కొమరోలు మండలం మదవపల్లె గ్రామానికి చెందిన బైరగాని శ్రీకాంత్(23) నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ప్రైవేట్ ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. తన బావ మల్లికార్జున వివాహ వేడుకల్లో పాల్గొనడానికి 4 రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. దగ్గరుండి పెళ్లి పనులు చూడసాగాడు. శుక్ర, శనివారాల్లో మృతుడి బావ మల్లికార్జున వివాహ వేడుకలు నిర్వహించడానికి పెద్దలు ఏర్పాట్లు చేశారు. పెళ్లికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి కొమరోలుకు బైక్పై వెళ్లి వస్తున్న శ్రీకాంత్ను యర్రపల్లె గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. అదే సమయంలో కడప వైపు వెళ్తున్న లారీ రోడ్డుపై పడిపోయిన శ్రీకాంత్ మీదుగా వెళ్లడంతో శరీర భాగాలు ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదే ప్రమాదంలో వైఎస్సార్ కడప జిల్లా బూరవారిపల్లె గ్రామానికి చెందిన బట్టపోతుల నారాయణ కాలు విరిగింది. క్షతగాత్రుడిని ప్రైవేట్ వాహనంలో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. మరో రెండు నెలల్లో శ్రీకాంత్కు వివాహం మృతుడు శ్రీకాంత్కు మరో రెండు నెలల్లో వివాహం కావాల్సి ఉంది. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన యువతితో నెల రోజుల క్రితం పెద్దల సమక్షంలో నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు రంగమ్మ, నడిపి తిరుమలయ్య గుండెలవిసేలా విలపించారు. వివాహానికి వచ్చిన బంధువులంతా సంఘటన స్థలంలో కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటన స్థలాన్ని ఎస్సై నాగరాజు పరిశీలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బావ పెళ్లికి వచ్చి మృత్యు ఒడిలోకి చేరిన యువకుడు వచ్చే శ్రావణ మాసంలోనే వివాహం నిశ్చయం -
పేలిన గ్యాస్ సిలిండర్
● కర్రీస్ షాప్లో వంట సామగ్రి దగ్ధం ● తప్పిన పెను ప్రమాదం పొదిలి: కర్రీస్ షాప్లో గ్యాస్ సిలిండర్ పేలడంలో మంటలు ఎగసిపడి వంట సామగ్రి దగ్ధమైన సంఘటన పొదిలిలోని విశ్వనాథపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. దర్శి అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు. వివరాలు.. విశ్వనాథపురంలోని కాలేజీ రోడ్డు మొదటి లైనులో కూరలు, పాలు విక్రయించే దుకాణంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. అదృష్టవశాత్తూ సిలిండర్లో గ్యాస్ స్వల్పంగా ఉండటం, జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవనంపై భాగంగా పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తుంటారు. అక్కడ కూడా ఎవరూ లేక పోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంత మేర ఆస్తినష్టం సంభవించిందని యజమాని బంకా అనంతరావు చెప్పారు. రెగ్యులేటర్ ఆపకపోవడం, నాణ్యతలేని పైపును వాడటం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మూలంగానే ప్రమాదం చోటుచేసుకుందని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొన్నారు. నగల దుకాణంలో మహిళ చేతివాటం మార్కాపురం: పట్టణంలోని ఓ నగల దుకాణంలో మహిళ చేతివాటం చూపి ఆభరణాలు అపహరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పట్టణంలోని చెన్నకేశవ స్వామి గుడి సమీపంలోని బంగారు నగల వీధిలోని ఓ దుకాణానికి మహిళలు వెళ్లారు. ఈ సమయంలో ఓ మహిళ దుకాణ యజమానిని ఏమార్చి ఆభరణం దొంగిలించి వెళ్లిపోయింది. సీసీ ఫుటేజీలో ఆలస్యంగా చోరీ విషయాన్ని గుర్తించిన షాపు యజమాని సదరు మహిళలను నిలదీశారు. దీంతో వారు తమ తప్పు ఒప్పుకొని ఆ ఆభరణాన్ని వెనక్కి ఇచ్చారు. -
నేటి నుంచి రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు
తర్లుపాడు: తర్లుపాడులోని నీలంపాటి లక్ష్మీ అమ్మవారి పంచమదశ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నుంచి రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సీనియర్ విభాగంలో విజేతలకు ప్రథమ బహుమతి రూ.60 వేలు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.40 వేలు, చతుర్థ బహుమతి రూ.30 వేలతోపాటు 8 జతల ఎడ్ల యజమానులకు కన్సోలేషన్ బహుమతులు అందించనున్నట్లు వివరించారు. వివరాలకు 9440791698, 9640408773ను సంప్రదించాలని సూచించారు.విద్యుత్ తీగలు తెగి 4 దూడలు మృతిఅర్ధవీడు: రోడ్డుపై 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడటంతో నాలుగు దూడలు చనిపోయిన సంఘటన శుక్రవారం అర్ధవీడులోని ఈద్గా సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడటంతో మామిళ్ల మల్లికార్జునరెడ్డికి చెందిన 4 దూడలు చనిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీగలను సరిచేశారు. -
ఉర్దూ బోధనకు ఉరి!
కంభం: ప్రస్తుతం నిర్వహిస్తున్న టీచర్ల బదిలీలు ఉర్దూ మీడియం విద్యకు మైనారిటీ విద్యార్థులను దూరం చేసేలా ఉన్నాయని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. బదిలీల్లో భాగంగా 8 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్లో ఉన్న ఉపాధ్యాయులు కచ్చితంగా మరో చోటకు వెళ్లిపోవాల్సి ఉంది. ఆ పాఠశాలల్లో తిరిగి ఉపాధ్యాయులను నియమిస్తే అక్కడ చదువుకునే ఉర్దూ మీడియం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుత బదిలీల నిబంధనల ప్రకారం 40 శాతం ఖాళీలను పీహెచ్(ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్) కోటా కింద భర్తీ చేయాల్సి ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముగ్గురు మాత్రమే సీహెచ్ ఉపాద్యాయులుండగా జిల్లాలో 8 పాఠశాలలను పీహెచ్ కోటాకు కేటాయించారు. పీహెచ్ కోటా ఉపాధ్యాయులు ఉన్న చోటే యథావిధిగా కొనసాగవచ్చని ఇప్పటికే కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో వారు తమ స్థానాల్లోనే కొనసాగితే ఖాళీ అవనున్న ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండరని తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యూనియన్ నాయకులు ఎంఈఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా విద్యాశాఖాధికారులు మాత్రం స్పందించడం లేదు. పీహెచ్ కోటా పాఠశాలలివే.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కంభం మండల కేంద్రం అర్బన్కాలనీ ఉర్థూ పాఠశాల, లింగోజిపల్లి ప్రాథమిక పాఠశాల, చీమకుర్తి ప్రాథమిక పాఠశాల, కందుకూరులోని సరూర్ నగర్ ప్రాథమిక పాఠశాల, పొదిలిలోని ప్రాథమిక పాఠశాల, సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు, కొమ్మలపాడు ప్రాథమిక పాఠశాలలు, యర్రగొండపాలెం ప్రాథమిక పాఠశాలలు పీహెచ్ కోటా కిందకు వచ్చాయి. ఇక్కడ పనిచేసే ఉర్దూ ఉపాద్యాయులు లాంగ్ స్టాండింగ్ కావడంతో వారు వెళ్లిపోనున్నారు. జిల్లాలో పీహెచ్ ఉపాద్యాయుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో అక్కడ చదువుకునే ఉర్దూ మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరగనుంది. హైస్కూళ్లుగా అప్గ్రేడ్ కానున్న యూపీ స్కూళ్లు ఉర్దూ యూపీ స్కూళ్లలో 6, 7, 8వ తరగతుల్లో 30 మందికన్నా ఎక్కువగా విద్యార్థులుంటే వాటిని హైస్కూళ్లుగా అప్గ్రేడ్ చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వైపాలెం, ఏల్చూరు, కొమ్మలపాడు, కందుకూరు, ఖాజీపాలెం, వలపర్ల యూపీ స్కూళ్లు ఈ విద్యా సంవత్సరం నుంచి హైస్కూళ్లుగా మారనున్నాయి. ఈ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను భర్తీ చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో ఉర్థూ మీడియం పాఠశాలల వివరాలు ఉర్దూ విద్యార్థులకు అన్యాయం చేసేలా టీచర్ల బదిలీల ప్రక్రియ నిబంధనల ప్రకారం పీహెచ్ కోటా కింద 40 శాతం బదిలీలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పీహెచ్సీ కింద 8 పాఠశాలలు అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులు ముగ్గురు మాత్రమే.. ఖాళీ పోస్టులు భర్తీ చేసి ఇబ్బంది లేకుండా చూడాలని తల్లిదండ్రుల వినతి ఖాళీల వివరాలు పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడాలి నా ఇద్దరు పిల్లలను ఉర్దూ మీడియంలో చదివిస్తున్నా. తెలుగు మీడియం ఉపాధ్యాయులు ఉర్దూ బోధించలేరు. కాబట్టి ఉర్దూ పాఠశాలల్లో ఉర్దూ బోధించేవారినే నియమించాలి. లేదంటే పిల్లలకు ఇబ్బందిగా ఉంటుంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – పఠాన్ రుక్సానా, విద్యార్థి తల్లి ఉన్నతాధికారుల దృష్టికి సమస్య జిల్లాలో ఉర్దూ పాఠశాలల్లో ఉన్న ఖాళీల వివరాలు, ఉర్దూ పాఠశాలల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను జిల్లా విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. – మొయినుద్దీన్, జిల్లా ఉర్దూ డీఐ -
జీవితాలు కూల్చి!
సంపద సృష్టిస్తాం.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం.. లేనిపక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికలప్పుడు కూటమి నేతలు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే చిరుద్యోగులపై కక్షగట్టారు. వారు చేస్తున్న ఉద్యోగాలను నిర్దాక్షణ్యంగా ఊడగొట్టి రోడ్డున పడేశారు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఏళ్ల తరబడి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్లు, ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, హెల్పర్లు, పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులు, నైట్ వాచ్మెన్లు.. ఇలా జిల్లాలో సుమారు 18 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించి వారి పొట్టగొట్టారు. హామీల బూచి..చిరుద్యోగుల పొట్టకొట్టి...మద్యం దుకాణాల్లో సూపర్వైజర్లు 178మద్యం దుకాణాల్లో సేల్స్మెన్లు 356మధ్యాహ్న భోజన పథకం కార్మికులు 3000వైద్యశాలల్లో పనిచేసిన పారిశుధ్య సిబ్బంది 180 ఒంగోలు నగరంలో మేసీ్త్రల సంఖ్య 45ఒంగోలు నగరంలో పారిశుధ్య కార్మికులు 23 ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఖ్య 650డ్వాక్రా వీఓఏలు 700సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రజలకు జీవనోపాధి చూపించాల్సిన ప్రభుత్వం రాజకీయ కారణాలతో వివిధ శాఖలకు చెందిన చిరుద్యోగులను తొలగించి వారి కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేసింది. ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న వారిని కూడా తొలగించి ఒంగోలులోని కలెక్టరేట్ ఎదురుగా నిరసన ప్రదర్శనలకు దిగినా పట్టించుకోలేదు. దీన్నిబట్టి కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చని ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. వలంటీర్లను వంచించి... అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తామని, ప్రస్తుతం పనిచేస్తున్న వలంటీర్లను కొనసాగిస్తామని గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం జిల్లాలో పనిచేస్తున్న 12,489 మంది వలంటీర్లను కూటమి ప్రభుత్వం పీకేసింది. అప్పటి వరకు ఇంటింటికి అందించే పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను సైతం నిలిపివేసింది. వలంటీర్లకు బదులుగా ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయిస్తోంది. వలంటీర్లు వివిధ మార్గాల్లో పోరాటాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే, చంద్రబాబు కేబినేట్లో ఉన్న మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వలంటీర్ల శాఖకు మంత్రిగా ఉండటం గమనార్హం. కోర్టు ఉత్తర్వులు సైతం లెక్కచేయకుండా... ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 5,500 మందికిపైగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులున్నారు. వీరిలో చాలా మంది 20 ఏళ్లకుపైగా పనిచేస్తున్నారు. ప్రభుత్వాలు సకాలంలో బిల్లులు చెల్లించకపోయినప్పటికీ అప్పులు చేసి వంట వండి పిల్లలకు భోజనం పెడుతున్నారు. ఎక్కువగా ఎస్సీ, బీసీ మహిళలే పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 3 వేల మందితో బలవంతంగా రాజీనామాలు చేయించింది. అయితే, కొంత మంది అంగీకరించలేదు. ప్రజా సంఘాలతో కలిసి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో పోరాటానికి దిగారు. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నాలు చేశారు. మరికొందరు మాత్రం న్యాయస్థానాలకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. వారిని కూటమి నేతలు వేధించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ వేధింపులు కొనసాగుతుండటం శోచనీయం. తాజాగా ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలిని తొలగించి తమ సొంత మనుషులను నియమించుకున్నారు. సెలవుల తర్వాత నుంచి విధులకు రావద్దని బెదిరిస్తున్నట్లు సమాచారం. రోడ్డున పడిన పారిశుధ్య కార్మికుల కుటుంబాలు... కూటమి అధికారంలోకి రాగానే పారిశుధ్య కార్మికులనూ వదల్లేదు. వారిపై వైఎస్సార్ సీపీ ముద్ర వేసి ఉద్యోగాల నుంచి తొలగించేసింది. ఒంగోలు నగరంలో పనిచేస్తున్న 45 మంది మేసీ్త్రలు, 23 మంది పారిశుధ్య కార్మికులను ఉన్నపళంగా తొలగించింది. స్థానిక ఎమ్మెల్యేను కలిసి మాట్లాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రోజుల తరబడి దీక్షలు చేసినా పట్టించుకోలేదు. ఆప్కాస్ను రద్దు చేస్తామని ప్రభుత్వం చెబుతుండడంతో పారిశుధ్య కార్మికులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఆప్కాస్ను రద్దు చేస్తే కార్మికులకు వేతనాలు సక్రమంగా రావని, పీఎఫ్ చెల్లింపులు సరిగ్గా జరగవని, మొత్తం కార్మికుల ప్రాథమిక హక్కులు కాలరాసి బానిస వ్యవస్థను తయారు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని కూటమి పాలకులపై కార్మికులు మండిపడుతున్నారు. ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పట్టణ ప్రజలకు పారిశుధ్య సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ప్రజాసంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ల ఉపాధికి దెబ్బ... జిల్లాలోని ఉపాధి హామీ పథకంలో 729 మంది పీల్డ్ అసిస్టెంట్లు ఉండాల్సి ఉండగా, వారిలో 60 పంచాయతీలకు ఫీల్డ్ అసిస్టెంట్లు లేరు. దీంతో 650 మందికిపైగా ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే టీడీపీ నాయకులు వీరిపై దాడులు చేయడం మొదలుపెట్టారు. రేపటి నుంచి పనికి వస్తే ఊరుకోమంటూ హుకుం జారీ చేశారు. రాజకీయంగా అధికారులపై ఒత్తిడి చేశారు. పోలీసుల ద్వారా బెదిరించారు. బలప్రయోగం చేస్తామంటూ వార్నింగులిచ్చారు. దాంతో కొందరు స్వచ్ఛందంగా ఉద్యోగం మానుకున్నారు. మరికొందరితో రాజీనామాలు చేయించారు. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలను నియమించుకున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులను అమ్ముకున్నట్లు ప్రచారం జరిగింది. ఏదేమైనా కూటమి పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి ఉపాధిని దెబ్బకొట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో తొలగించిన ఉద్యోగుల వివరాలు...ఏడాది పాలన లక్షల ఉద్యోగాలంటూ ఎన్నికల ముందు చంద్రబాబు హామీ వలంటీర్లకు రెట్టింపు జీతమంటూ నిట్టనిలువునా మోసం అధికారంలోకి వచ్చీరాగానే చిరుద్యోగులపై ప్రతాపం పారిశుధ్య కార్మికులనూ వేధించిన పాలకులు మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టకొట్టిన బాబు రోడ్డున పడిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు డ్వాక్రా వీఓఏలపై కూటమి కక్ష సాధింపులుజిల్లాలో 1200 మంది డ్వాక్రా వీఓఏలు ఉన్నారు. వారిలో 700 మందిని ప్రభుత్వం తొలగించి వారికి అన్యాయం చేసింది. జిల్లాలో ఉన్న 178 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సేల్స్మెన్లు, సూపర్వైజర్లు 534 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎత్తివేయడంతో వారంతా ఉద్యోగాలు కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జిల్లాలో 1,392 రేషన్ దుకాణాలు ఉన్నాయి. పచ్చకూటమి పాలనలోకి రాగానే దాదాపుగా వారందరినీ తొలగించింది. గత వైఎస్సార్ సీపీ పాలనలో వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ తెచ్చి ఇచ్చేవారు. జిల్లాలో 385 వాహనాలు ఉండగా, వాటిని కూడా తీసేసి రేషన్ దుకాణాల వద్దకే వెళ్లి తెచ్చుకోవాలని ఆదేశాలిచ్చింది. కూటమి పాలనలో ఏ ఒక్క శాఖనూ వదలకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నింటిలో పచ్చమందను తెచ్చిపెట్టింది. -
జలజీవన్ మిషన్ను సద్వినియోగం చేసుకోండి
● కేంద్ర ప్రత్యేకాధికారి వగీష్ తివారి యర్రగొండపాలెం: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆ మిషన్ ప్రత్యేకాధికారి డాక్టర్ వగీష్ తివారి సూచించారు. యర్రగొండపాలెం మండలంలోని గురిజేపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన ఫారం పాండ్లు, గ్రామంలో ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తివారి మాట్లాడుతూ ఫారం పాండ్లతో రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. వీటి ద్వారా రైతులు పొలాల్లోనే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. భూగర్భ జలాలు కూడా పెరుగుతాయన్నారు. ఆయా ప్రాంతాల్లోని రైతులంతా పొలాల్లో ఫారం పాండ్లు ఏర్పాటు చేసుకునేలా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం కింద ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిల నుంచి సక్రమంగా నీటి సరఫరా జరుగుతుందా..? అని ప్రజలనడిగి తెలుసుకున్నారు. తాగునీటిని వృథా చేయకుండా ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం సచివాలయంలో నీటిని పరీక్షించే మిషన్ల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని, మురారిపల్లెలో ఉన్న ఫారెస్ట్ నర్సరీలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జలజీవన్ మిషన్ నోడల్ అధికారి దినేష్కుమార్ పేరివాల్, డ్వామా పీడీ జోసఫ్కుమార్, మార్కాపురం క్లస్టర్ ఏపీడీ నిర్మలాదేవి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఐటీడీఏ ప్రత్యేకాధికారి కె.నాగేశ్వరరావు, ఏపీవో శైలజ, ఈసీ లక్ష్మానాయక్ పాల్గొన్నారు. -
కూటమి పాలకులు నా నోటికాడ కూడు తీసేశారు
కూటమి ప్రభుత్వం వచ్చాక చిరుద్యోగులను తొలగించి వారి నోటికాడ కూడు తీసేసింది. నేను 2009 నుంచి ఎన్ఆర్ఈజీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా. నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ వేతనం లభించేది. భార్య, ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నా. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకుల ఒత్తిడితో అధికారులు నన్ను తొలగించారు. ప్రస్తుతం నా పరిస్థితి దయనీయంగా ఉంది. పొట్టకూటి కోసం బేల్దారి పనికి వెళ్తున్నా. – పరిశపోగు జీవన్, దొడ్డిచింతల, హెచ్ఎం పాడు మండలం -
నోటికాడ కూడు కాజేశారు
ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు కొత్తపల్లి రాణి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా 15 సంవత్సరాలుగా అర్థవీడులో పనిచేస్తున్నారు. రాణి భర్త ఆరేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయారు. ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ వచ్చిన జీతంతో తన ముగ్గురు పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీఓ శ్రీనివాసరెడ్డి అకారణంగా రాణిని విధులకు రానివ్వకుండా అడ్డుకున్నారు. కూటమి నేతల ఆదేశాలతో ఆమెను అన్యాయంగా తొలగించి ఇబ్బందులకు గురిచేశారు. 2024 జూన్ నుంచి జీతం కూడా ఇవ్వకుండా నిలిపివేశారు. భర్త కూడా లేని రాణితో పాటు ఆమె ముగ్గురు పిల్లల నోటికాడ కూడు కాజేశారు. -
ఆగిన రేషన్ బండి..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రేషన్ సరుకులను ఎండీయూ వాహనం ద్వారా ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేశారు. ఇప్పటి వరకు అదే వ్యవస్థను కొనసాగించిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం జూన్ 1 నుంచి ఆ వాహనాలను రద్దు చేసింది. ఇక నుంచి రేషన్ షాపు వద్దకు వెళ్లి క్యూలో పడిగాపులు కాస్తూ రేషన్ తీసుకోవాలి. దీంతో ప్రజలు అవస్థలు పడటంతో పాటు ఎండీయూ వాహనాల ఆపరేటర్లు రోడ్డున పడ్డారు. జిల్లాలో మొత్తం 1,392 రేషన్ షాపులు ఉన్నాయి. అందుకుగానూ రేషన్ సరఫరా చేసే వాహనాలు 385 ఉన్నాయి. వీటిని రద్దు చేయడంతో 385 మంది ఆపరేటర్లు రోడ్డున పడ్డారు. జిల్లాలో 6,70,627 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులందరూ జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సిందే. -
ఏడాది శోకాలు!
పారని పథకాలు.. టంగుటూరు మండలం జమ్ములపాలెంలో నిరుపయోగంగా సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ భవనాలునెల మొదటి తేదీ సూర్యోదయానికంటే ముందే వలంటీర్లు ఇంటి తలుపుతట్టి పింఛన్ ఇచ్చేవారు. 50 ఇళ్లకో వలంటీరు ద్వారా సకల సేవలూ అందేవి. కూటమి పార్టీలు వారిని సంఘ విద్రోహశక్తుల్లా అభివర్ణించాయి. అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థకు మంగళం పాడేశాయి. విచిత్రమేమిటంటే వలంటీర్లకు ఒక మంత్రి కూడా ఉన్నారు. ఇక గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎలాంటి సర్టిఫికెట్లు కావాలన్నా ఉచితంగా ఇంటి సమీపంలోనే అందేవి. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనితప్పింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అవి కళతప్పాయి. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగే దుస్థితి ఏర్పడింది. సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ఐదేళ్లు జిల్లా వ్యాప్తంగా 59,30,289 సేవలు అందాయి. పల్లెల్లో ఆర్బీకేలు, సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ ఇలా అన్నీ ఒకేచోట ఉండేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భవనాలు నిర్మించింది. చాలా ప్రాంతాల్లో అవి వినియోగంలో లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతుండటం గమనార్హం. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు మొక్కుబడిగా సేవలందుతున్నాయి. దీంతో పల్లెలు కళతప్పాయి. సేవలు మృగ్యమై జనం కంట కన్నీరుకారుతోంది. ఏడాది పాలన -
రేపటి నుంచి రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు
ఒంగోలు: రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలను ఈ నెల 31 నుంచి జూన్ 2వ తేదీ వరకు స్థానిక మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి.భక్తధృవుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పురుషులకు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్ విభాగాలలో పోటీలు జరుగుతాయన్నారు. మహిళలకు 43, 47, 52 కేజీల విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. 31వ తేదీ సాయంత్రం 3 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. గ్రేడ్–2 మున్సిపాలిటీగా గిద్దలూరు గిద్దలూరు రూరల్: గిద్దలూరు నగర పంచాయతీని గ్రేడ్–2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీని ద్వారా మున్సిపాలిటీకి అదనంగా నిధులు విడుదలై అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. సిబ్బంది పెరుగుదల, అన్నిశాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి హెచ్ఆర్ఏ పెరుగుదల వంటి వసతులు దక్కనున్నాయి. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా 2011 ఆగస్టు 22లో గిద్దలూరు మార్పు చెందింది. ప్రస్తుతం నగర పంచాయతీ నుంచి గ్రేడ్–2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. ఇంటర్ విద్య జిల్లాఅధికారిగా ఆంజనేయులు ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారి (డీఐఈఓ)గా తాళ్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులు గురువారం ఒంగోలులోని డీఈఓ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు పనిచేసిన ఐ.శ్రీనివాసరావు నుంచి ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ప్రిన్సిపాళ్ల సంఘం, అధ్యాపకుల సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆంజనేయులుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ చైర్మన్ కుమ్మరకుంట సురేష్, ప్రిన్సిపాళ్ల సంఘ నాయకులు కె.పి.రంగనాయకులు, బి.సి.హెచ్.అల్లూరయ్య, విశ్వనాథబాబు, వెంకట్రావు, పాలపర్తి మాధవరావు, వై.గురవయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. చీకట్లో మాన్యువల్ కౌన్సెలింగ్ ● ఉపాధ్యాయుల వెబ్ కౌన్సెలింగ్ అమలులో ప్రభుత్వం ఘోర వైఫల్యం ● చివరికి హడావిడిగా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న వైనంఒంగోలు సిటీ: స్కూల్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వెబ్ కౌన్సెలింగ్లో ప్రభుత్వం విఫలమవడంతో రెండు రోజుల నుంచి సంబంధిత ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. అన్ని యాజమాన్యాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయుల బదిలీలు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి గత పది రోజులుగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం తారుమారైంది. ఈ పదోన్నతులకు సంబంధించి జెడ్పీలో 83, మున్సిపల్ యాజమాన్యం కింద 4, మున్సిపల్ కార్పొరేషన్ కింద 1 పోస్టుకు పదోన్నతులు నిర్వహించాలని విద్యాశాఖ భావించింది. దీనికి సంబంధించిన పదోన్నతులలో 1:3 నిష్పత్తిలో 245 వరకు పిలిచినట్లు సమాచారం. 28వ తేదీ మధ్యాహ్నం పదోన్నతులు నిర్వహించాలనే సమాచారం అందడంతో ఉపాధ్యాయులంతా ఒంగోలు డీఆర్ఆర్ఎం హైస్కూల్కు చేరుకున్నారు. సాయంత్రం 9 గంటల వరకు ఉన్నారు. అయితే, గురువారం ఉదయం 8 గంటలకు హాజరుకావాలని ఉపాధ్యాయులను కోరారు. సాయంత్రం 6.30 గంటలకల్లా వెబ్ కౌన్సెలింగ్ పెట్టాలని చూశారు. చివరికి మాన్యువల్గా జరుపుకోవాలని డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. ఈ ప్రమోషన్లకి సంబంధించి 28వ తేదీ మధ్యాహ్నం నుంచి 29వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు ఉపాధ్యాయులు పడిగాపులు కాశారు. గత ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఉపాధ్యాయులు పెట్టుకున్న వెబ్ ఆప్షన్ల ప్రకారం బదిలీలు, పదోన్నతులకు ఆటోమేటిక్గా ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో పూర్తిగా విఫలమైంది. చివరి సమయంలో మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా అనేక అక్రమాలు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అవకతవకలకు పాల్పడినట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
రైతుల జీవితాలతో కూటమి చెలగాటం
● వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి సింగరాయకొండ: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ రాష్ట్రంలోని పొగాకు రైతుల్లో జిల్లాలోనే 70 శాతం ఉండగా, కొండపి నియోజకవర్గంలోనూ అత్యధికంగా ఉన్నారన్నారు. పొగాకు బోర్డు 170 మిలియన్ టన్నులు పొగాకు పండించుకోవడానికి అనుమతిచ్చిందన్నారు. మే నెలాఖరుకు 70 శాతం కొనుగోలు చేయాల్సి ఉండగా, కేవలం 25 శాతంలోపే కొనుగోలు చేశారన్నారు. గత ప్రభుత్వంలో పొగాకు క్వింటా ధర రూ.38 వేల వరకు ఉంటే.. కూటమి ప్రభుత్వంలో రూ.20 వేలలోపు మాత్రమే ఉందన్నారు. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి జగనన్న వస్తున్నాడన్న ప్రకటనతో మేల్కొన్న కూటమి ప్రభుత్వం రూ.20 వేల నుంచి రూ.23 వేలకు కొనుగోలు చేయాలని ఆదేశించినప్పటికి 5 శాతం కొనుగోలు చేసి మిగతా పొగాకు వెనక్కి పంపుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఐఎల్టీడీ కంపెనీ గుత్తాధిపత్యానికి గండికొట్టిన జగనన్న.. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయించి రైతులకు మంచి ధరలు ఇప్పించారని బత్తుల గుర్తుచేశారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిన జగనన్న... రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన విషయాన్ని బత్తుల బ్రహ్మానందరెడ్డి గుర్తుచేశారు. ఆ నిధిని రూ.7 వేల కోట్లకు పెంచి రైతుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని జగనన్న చాటుకున్నారన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రూ.5 వేల కోట్లతోఽ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదైనా ఒక్క పంటకూ మద్దతు ధర కల్పించకుండా రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. ఐటీసీ కంపెనీతో కుమ్మక్కై పొగాకు రైతులను నట్టేట ముంచిందన్నారు. మహానాడు వేదికగా సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఎన్నికల్లో చెప్పని పథకాలు కూడా అమలు చేస్తున్నామని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారంటూ బత్తుల బ్రహ్మానందరెడ్డి ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, మండలాల అధ్యక్షులు పిన్నిక శ్రీనివాసులు, చింతపల్లి హరిబాబు, బచ్చల కోటేశ్వరరావు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్ పాల్గొన్నారు. -
రైతుకు దక్కని భరోసా..
జిల్లాలో మొత్తం 616 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటికి జిల్లా వ్యాప్తంగా 593 భవన నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.12,553.40 లక్షల అంచనాలతో నిధులు మంజూరు చేయగా, 400 భవనాలు పూర్తయ్యాయి. మిగతా భవనాలు పురోగతిలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద దాదాపు 3 లక్షల మంది రైతులకు నాలుగు విడతలుగా రూ.13,500ను నేరుగా వారి ఖాతాలకు జమచేసేవారు. రైతులకు నిత్యం అవగాహన కార్యక్రమాలు జరిగేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవన్నీ నిలిచిపోయాయి. అన్నదాతతో అనుబంధం పెంచుకున్న రైతు భరోసా కేంద్రం నిర్జీవమైపోయింది. అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్క పైసా విదిల్చలేదు. పండించిన పంటలకు మద్దతు ధర లభించక అప్పుల పాలై రైతులు రోడ్డున పడుతున్నారు. పేదల పిల్లలు ఆంగ్లం నేర్చుకోకూడదా.? కూటమి ప్రభుత్వం వచ్చాక పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమం అందకుండా చేస్తోంది. 2019 వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్య నేర్చుకోవాలంటే ధనికుల పిల్లలకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని పేదలకు ఆంగ్ల మాధ్యమం చేతికందిన అమృత ఫలంలా మారింది. దానిని జీర్ణించుకోలేని కూటమి నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం రద్దు చేసి పేదలకు అందని ద్రాక్షలా చేసింది. – ఇందూరి దేవి, కురిచేడు ఆర్బీకేలు అన్నదాతకు అండగా నిలిచాయి రైతు భరోసా కేంద్రాలు అన్నదాతకు అండగా నిలిచాయి. క్షేత్రస్థాయిలోనే రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందజేసి అన్ని రకాల సేవలు ఒకేచోట లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. పెట్టుబడి నిధులు మంజూరు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట పండించక ముందే ఆయా పంటలకు మద్దతు ధర, విపత్తుల సమయంలో బీమా సౌకర్యం, ఇన్పుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అనేక సౌకర్యాలు కల్పించారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. రైతులను అన్ని విధాలుగా కూటమి ముంచేసింది. – వెన్నపూస మాల్యాద్రిరెడ్డి, రైతు, చెన్నిపాడు, పొన్నలూరు -
ఇంత బరితెగింపా..!
కురిచేడు: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన అధికారులే భక్షకులుగా మారుతున్నారు. ప్రభుత్వ భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులే అక్రమాలకు తెరలేపారు. దీంతో ఎన్నో ఏళ్ల నాటి ప్రభుత్వ భూములు రాత్రికి రాత్రే ప్రైవేట్పరం అయిపోతున్నాయి. స్థానిక రెవెన్యూ కార్యాలయంలోని అధికారుల లీలలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. కూటమి నాయకుల అండదండలతో అడ్డగోలుగా ప్రభుత్వ భూములకు ఆన్లైన్ చేసి దండుకుంటున్నారు. ఒక వైపు ఉన్నతాధికారులు ప్రభుత్వ భూములపై విచారణ జరిపేందుకు ఆదేశాలు ఇచ్చినా, కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నా వాటిని పట్టించుకోకుండా ఆన్లైన్ చేయడం విశేషం. ప్రభుత్వభూమి ఆన్లైన్.. మండలంలోని కల్లూరు గ్రామ సర్వే నంబర్ 272/74 లోని ప్రభుత్వ భూమిని కొంతమంది పేర్లతో ఆన్లైన్ ఎక్కించినట్లు గ్రామ వైఎస్సార్ సీపీ నాయకుడు పాలెబోయిన పెద్ద పెద్దయ్య ఆధారాలతో సహా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల అవినీతి దాహంతో గ్రామంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రామస్తులు కలెక్టర్కు ఫిరా్య్దు చేసినా రెవెన్యూ అధికారులు బరితెగించి మాకు కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని బాహాటంగా చెప్పుకుంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే ఒక వ్యక్తి తన కుటుంబసభ్యుల పేరుపై సర్వే నంబఱ్ 272/1కే లోని 3 ఎకరాల భూమిని ఆన్లైన్ చేశారు. అలాగే 272/74 లోని ప్రభుత్వ భూమిని నక్కా ఆంజనేయులు పేరుతో 50 సెంట్లు ఆన్లైన్ చేశారు. అదే సర్వే నంబర్లోని మరో 50 సెంట్లు నక్కా లింగమ్మకు అనువంశికం కింద ఆన్లైన్ చేశారు. వల్లెం వెంకటేశ్వర్లు పేరుతో కూడి మరో 50 సెంట్ల భూమిని ఈ నెల 19వ తేదీ ఆన్లైన్ చేశారు. వాస్తవానికి ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూమి గయాల్ అని ఉంది. గతంలో పనిచేసిన తహసీల్దార్ నాగుల్మీరా సైతం ప్రభుత్వ భూమి అని ఎండార్స్మెంట్ చేశారు. అలాగే సమాచార హక్కుచట్టం ద్వారా కూడా 272/1కే, 39 సర్వేనంబర్లు గయాలు భూమిగా సమాధానం ఇచ్చారు. అలాగే నక్కా లక్ష్మిదేవి పేరుపై ఉన్న మూడు ఎకరాల భూమిపై విచారణ చేయాలని డీఆర్ఓ ఓబులేశు గత మార్చి నెలలో విచారణకు ఆదేశించారు. ఈ భూములపై గ్రామస్తులు సైతం హైకోర్టులో కేసు వేశారు. ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నా, కోర్టుల్లో పెండింగ్ ఉన్నా అధికారులు అవేమీ మాకు సంబంధం లేదని అక్రమంగా ఆన్లైన్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే రెవెన్యూ అధికారుల లీలలు బయటకు వస్తాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అడ్డగోలుగా ప్రభుత్వ భూముల ఆన్లైన్ నేతల అండదండలతో బరితెగిస్తున్న అధికారులు, సిబ్బంది ప్రభుత్వ భూమని తెలిసినా అక్రమంగా ఆన్లైన్ చేసేస్తున్న వైనం ఉన్నతాధికారుల ఆదేశాలూ బేఖాతరు. -
అతి వేగం.. టిప్పర్ బీభత్సం
పొదిలి: మితిమీరిన వేగంతో వెళ్తున్న టిప్పర్ అదుపు తప్పి బైక్ను ఢీకొట్టడమే కాకుండా పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బీభత్సం సృష్టించిన ఈ సంఘటన గురువారం పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కాటూరివారిపాలెం సమీపంలో ఒంగోలు–కర్నూలు హైవేపై చోటుచేసుకుంది. వివరాలు.. వినుకొండకు చెందిన పెనుమాల్ల లక్ష్మీనారాయణ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను డ్రైవింగ్ చేసే మినీ లారీ మర్రిపూడి మండలం చిమట గ్రామంలో బొప్పాయి కాయల లోడింగ్కు వెళ్లింది. లారీ ఓనర్ తాను డ్రైవింగ్ చేస్తానని చెప్పి తన మోటారుసైకిల్పై లక్ష్మీనారాయణను వెళ్లాలని సూచించాడు. బైక్పై పొదిలి వైపు వస్తున్న లక్ష్మీనారాయణను కాటూరివారిపాలెం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. బైక్ను తొక్కుకుంటూ పెట్రోల్ బంకు వైపు దూసుకెళ్లిన టిప్పర్ అక్కడ ఉన్న హోర్డింగ్లను ఢీకొట్టి, సిమెంటు దిమ్మె పైకి ఎక్కింది. పెట్రోల్ బంకులోకి నేరుగా దూసుకెళ్లి ఉంటే పెను ప్రమాదమే జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన లక్ష్మీనారాయణను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. టిప్పర్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. సురక్షితమైన తాగునీరు అందించాలి పొదిలి రూరల్: ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ నోడల్ అధికారి వి.దినేష్కుమార్ అన్నారు. మండలంలోని అక్కచెరువు గ్రామంలో రూ.96.10 లక్షలతో చేపట్టిన జల జీవన్ మిషన్ పథకం పనులను గురువారంఆయన పరిశీలించారు. తొలుత పంచాయతీ కార్యాలయంలో పథకానికి సంబంధించి పనుల పురోగతిని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకర్రావు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తరువాత రికార్డులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో దినేష్కుమార్ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడి భూగర్భనీటి వనరులు పెంచాలన్నారు. ఈ పథకం అమల్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని గ్రామస్తులు అడిగారు. ఈ క్రమంలో గృహఆలు హెచ్చు తగ్గులుగా ఉండటంతో శివారు ప్రాంతాలకు నీరు సరఫరా అందడం లేదని తెలిపారు. అనంతరం కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంకు, ఇంటింటికీ ఏర్పాటు చేసిన నీటి కుళాయి, పశువుల షెడ్డు, ఫారంపాండ్లను పరిశీలించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ జోసఫ్కుమార్, ఎంపీడీఓ విజయలక్ష్మి, సర్పంచ్ చేరెడ్డి నాగలక్ష్మి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు జాబ్మేళా ఒంగోలు వన్టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి కె.రవితేజ యాదవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండ్లూరు డొంక మహిళా ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి జాబ్మేళా నిర్వహిస్తామన్నారు. జాబ్మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. అభ్యర్థులు 10వ తరగతి ఆపైన విద్యార్హత ఉండాలన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఇస్తామన్నారు. పూర్తి వివరాలకు 9963005209 నంబర్ను సంప్రదించాలని కోరారు. బైక్ను ఢీకొట్టి, పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన వైనం ఒకరికి తీవ్ర గాయాలు జలజీవన్ మిషన్ నోడల్ అధికారి దినేష్కుమార్ -
బడుగు యువకులపై దాడి మంత్రి మనోహర్ పనే..
ఒంగోలు వన్టౌన్: తెనాలిలో దళిత, మైనారిటీ యువకులను దారుణంగా హింసించి, కర్కశంగా ప్రవర్తించిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. యువకులను బహిరంగంగా లాఠీలతో మోది చిత్రహింసలు పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం దళిత సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ ప్రదర్శన చేపట్టి, కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత యువకులపై కూటమి ప్రభుత్వ మంత్రి నాదెండ్ల మనోహర్ దాడి చేయించారని ఆరోపించారు. తెనాలి ఐతా నగర్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించేందుకు మంత్రితోపాటు పొలీసు, మున్సిపల్ అధికారులు చేసిన ప్రయత్నాలను దళితులు అడ్డుకున్నారన్నారు. మూడు రోజులపాటు దళితులు ఆందోళన చేయడంతో మంత్రి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ క్రమంలో పొలీసులకు, దళితులకు మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని గుర్తుచేశారు. ఇది మనసులో పెట్టుకుని దళిత యువకులను పోలీసులు దారుణంగా కొట్టారని, కిరాతక పోలీసులు రాములు నాయక్, రమేష్ బాబును అరెస్టు చేయాలని, నాదెండ్ల మనోహర్ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కోటిమాదిగ, మాల సంఘాల జేఏసీ నాయకులు టి.శోక్బాబు, కె.ఏడుకొండలు, కేవీపీఎస్ నాయకుడు రఘురాం తదితరులు పాల్గొన్నారు. నాదెండ్లను బర్తరఫ్ చేయాలని దళిత సంఘాల డిమాండ్ -
కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
గిద్దలూరు రూరల్: మండలంలోని కేఎస్పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా అర్ధవీడులో పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తుంటాడు. ప్రసాద్ తన కుటుంబసభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం తిరుపతికి వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తెరిచి అందులోని వస్తువులు అపహరించారు. ప్రసాద్ తిరుపతి నుంచి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంటి వెనుక భాగంలో ఉన్న తలుపులు తెరచి ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బైక్ ఢీకొని దంపతులకు తీవ్రగాయాలు మార్కాపురం: టూవీలర్ను వెనుక నుంచి మరో టూవీలర్ ఢీకొట్టడంతో దంపతులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం రాత్రి పట్టణంలోని వై జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. తర్లుపాడు మండలం మంగళికుంట గ్రామానికి చెందిన భార్యభర్తలు షకీలా, నాగేశ్వరరావు వ్యక్తిగత పనిపై మార్కాపురం పట్టణానికి వస్తున్నారు. వారి వెనుకే వస్తున్న మరో టూవీలర్ అదుపుతప్పి భార్యాభర్తలను ఢీకొట్టింది. గాయాలైన సంఘటన చోటుచేసుకుందని పట్టణ పోలీస్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను మెరుగైన చికిత్స కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. న్యాయవాదులు బాధ్యతగా పనిచేయాలి సింగరాయకొండ: న్యాయవాదులు బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించి న్యాయాన్ని కాపాడాలని హైకోర్టు జడ్జి కె.మన్మథరావు పిలుపునిచ్చారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని గంజి కళ్యాణ మండపంలో గురువారం రాత్రి ఆయనకు ఆత్మీయ పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మన్మథరావు మాట్లాడుతూ దేశంలో కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందన్నారు. ఇటీవల హైకోర్టు జడ్జిలంతా సమష్టి కృషితో కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. తాను ఒక్కడినే 13 వేల కేసులు పరిష్కరించానన్నారు. దీంతో కేసుల పరిష్కారంలో ఏపీకి రెండో స్థానం దక్కిందన్నారు. సింగరాయకొండలో నూతన కోర్టు ఏర్పాటుకు తన కృషి కన్నా ఇక్కడి అవసరాలే కారణమన్నారు. అనంతరం జడ్జి మన్మథరావుకు ఆత్మీయ పౌర సన్మానం చేశారు. సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులనాయుడు, అడ్వకేట్ పంగులూరి గోవిందయ్య, మేకల రామ్మూర్తి, డాక్టర్ కొంపల్లి హెచ్ఎస్ఎస్ సుందర్, డాక్టర్ నూకసాని సుబ్బారావు, అడ్వకేట్ రాయి రమేష్, కొల్లూరి నరసింహారావు, బక్కమంతుల వెంకటేశ్వర్లు, పంతగాని వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
పీఆర్సీ కమిషన్ నియమించాలి
ఒంగోలు సిటీ: సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో 12వ పీఆర్సీ కమిషన్ను నియమించడంతోపాటు మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్ కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. సంఘ ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీన విజయవాడలోని లయోలా కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించనున్న రాష్ట్ర కౌన్సిల్ మూడో సమావేశానికి ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది హాజరై విజయవంతం చేయాలని కోరారు. గురువారం స్థానిక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న 14 ప్రధాన డిమాండ్ల సాధనకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.20 వేల కోట్లకు పైగా ఉన్న పీఆర్సీ, డీఏ, ఎస్ఎల్ఎస్, ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపునకు కాలపరిమితితో కూడిన రూట్ మ్యాప్ విడుదల చేయాలన్నారు. సీపీఎస్/జీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణకు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు. ఒకటో తేదీనే వేతనం, పెన్షన్ల చెల్లింపు చట్టబద్ధం చేయాలన్నారు. జూన్ 5వ తేదీన ఉదయం 6 గంటలకు ప్రకాశం భవన్ నుంచి విజయవాడకు బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి వరకుమార్, పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, ట్రెజరర్ యేసు రత్నం, తాలూకా అధ్యక్షుడు సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ 14 ప్రధాన సమస్యల పరిష్కారానికి జూన్ 5న కౌన్సిల్ సమావేశం -
ప్రకటనలు దాటని జిల్లా ఏర్పాటు...
ఎన్నికల ప్రచారంలో మార్కాపురాన్ని జిల్లా చేస్తామని చంద్రబాబు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా చేసిన తరువాతనే మార్కాపురంలో అడుగుపెడతానంటూ పశ్చిమ ప్రకాశం ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోంది. ఇప్పటికీ ఆయన రెండుసార్లు మార్కాపురం వచ్చి వెళ్లారు. మొదటిసారి పర్యటనలో మార్కాపురంను జిల్లా చేయడం ఇప్పట్లో కుదరదని తేల్చి చెప్పారు. రెండోసారైనా ఏమైనా చెబుతారేమోనని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మార్కాపురం వచ్చిన ఆయన జిల్లా గురించి ప్రస్తావించకుండా వెళ్లిపోయారు. చంద్రబాబు ఏదైనా మాట ఇచ్చారంటే దానిని చేయరని అర్థం చేసుకోవాలని పశ్చిమ ప్రాంత ప్రజలు నిట్టూరుస్తున్నారు. -
గాల్లో మేడలు..!
● దొనకొండను పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేస్తామంటూ పట్టించుకోని కూటమి పాలకులు ● ట్రిపుల్ ఐటీ ఒంగోలు క్యాంపస్ ఎత్తివేసి ఇడుపులపాయకు తరలింపు ● ఒంగోలు ప్రజల దాహార్తి తీర్చే ప్రాజెక్టును అటకెక్కించారు. ● ఒక్క హామీ అమలు చేయకుండా నిత్య కలహాలతో కాలయాపన చేస్తున్న కూటమి పాలకులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లా అభివృద్ధికి అది చేస్తాం..ఇది చేస్తామంటూ చాలా హామీలిచ్చారు. నోటికొచ్చినట్లు వాగ్దానాలు చేశారు. తీరా హామీల అమలును ప్రశ్నిస్తే సోషల్ మీడియా కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీసులను ఉసిగొల్పి చుక్కలు చూపిస్తున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కూటమిలో కుంపటి రాజేసి కలహాలతో కాలపయాపన చేస్తున్నారు. వెలిగొండకు మొండిచేయి మార్కాపురం జిల్లా పట్టాలెక్కేనాఒంగోలు ఎయిర్పోర్ట్ కొత్త నాటకం మెడికల్ కళాశాలకు గ్రహణంఏడాది పాలన -
నా భర్తను కాపాడండి
సీఎం గారూ.. ఒంగోలు టౌన్: ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారూ.. నా భర్త ప్రాణాలు కాపాడండి.. వైద్యపరంగా చికిత్స కోసం సాయం అందించండి’ అంటూ గిద్దలూరుకు చెందిన కందుల విజయలక్ష్మి వేడుకున్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద ఆమె పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించారు. తన భర్త సురేంద్ర మార్కాపురానికి చెందిన సుబ్బారెడ్డి వద్ద లారీ కొనుగోలు చేశారని, రూ.2.25 లక్షలకు బేరం మాట్లాడుకుని రూ.1.50 లక్షల అడ్వాన్స్గా ఇచ్చారని వివరించారు. మిగతా డబ్బు ఫైనాన్స్ ద్వారా చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని, అయితే లారీ చూసి రావడానికి వెళ్లిన రోజే తమ లారీ ఒకటి ప్రమాదానికి గురవడంతో సురేంద్ర సెంటిమెంట్గా భావించారని, దాంతో లారీ వద్దని సుబ్బారెడ్డికి చెప్పినట్లు తెలిపారు. ఈ విషయంలో సుబ్బారెడ్డితో విభేదాలు రావడంతో పోలీసులతో కలిసి వేధిస్తున్నారని, మనస్తాపానికి గురైన తన భర్త గడ్డిమందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని విలపించారు. తన భర్త నంద్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడని, తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఇదిలా ఉండగా 2024 నవంబర్లో సురేంద్రకు లారీ విక్రయించినట్లు సుబ్బారెడ్డి చెబుతున్నారు. అప్పటి నుంచి ఫైనాన్స్ కిస్తీలు సక్రమంగా చెల్లించకుండా లారీ తిప్పకొంటున్నారని, ఫైనాన్స్ విషయంలో వచ్చిన సమస్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసులపై ఆరోపణలు అవాస్తవం : డీఎస్పీ నాగరాజు సురేంద్ర కుటుంబ సభ్యులు పోలీసుల మీద చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మార్కాపురం డీఎస్పీ నాగరాజు చెప్పారు. సురేంద్ర రెడ్డి ఒక లారీని మిస్సింగ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని, విచారణ నిమిత్తంి స్టేషన్కు పిపలిచారని వివరించారు. సురేంద్రను కొట్టలేదని, వివరాలు కనుక్కొని పంపించి వేశామన్నారు. -
దొనకొండ కారిడార్ సంగతేంటి..?
దొనకొండలో 25 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో దొనకొండలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. అవేవీ పట్టించుకోని చంద్రబాబు దొనకొండను పారిశ్రామిక కారిడార్ చేస్తానంటూ హంగామా చేశారు. 2014–19లో దొనకొండకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. తిరిగి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదేపాట పాడుతున్నారు. బ్రిటీష్ పాలనలో ఇక్కడ ఏర్పాటు చేసిన విమానాశ్రయాన్ని మూలనపడేశాడు. నిజానికి దొనకొండను పారిశ్రామికకారిడార్గా చేసేపనైతే విమానాశ్రయాన్ని ఒంగోలు తరలించడం దేనికనే ప్రశ్నకు సమాధానం లేదు. -
జిల్లాను సస్యశ్యామలం చేయాలి
● కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ నోడల్ అధికారి దినేష్కుమార్ పెరివాల్ ఒంగోలు సబర్బన్: సవాళ్లను అధిగమించి జిల్లాను సస్యశ్యామలం చేసేలా పథకాలు అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారి వాగేష్ తివారీ, డాక్టర్ దినేష్ కుమార్ పెరివాల్ అన్నారు. జలజీవన్ మిషన్ కింద జిల్లాలో చేపట్టిన పనులను పరిశీలించేందుకు వచ్చిన ఇద్దరు అధికారులు కలెక్టర్తో కలిసి ప్రకాశం భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకరరావు జిల్లాలో జల్జీవన్ మిషన్ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. డ్వామా పీడీ జోసఫ్కుమార్ మాట్లాడుతూ జిల్లా భౌగోళిక పరిస్థితి, వర్షం నీటిని ఒడిసిపట్టేందుకు, భూగర్భ నీటి మట్టాన్ని, పచ్చదనాన్ని పెంచేందుకు, నీటి వనరుల మరమ్మతులకు చేపట్టిన చర్యలు వివరించారు. గ్రౌండ్ వాటర్ ఈఈ విద్యాసాగర్ మాట్లాడుతూ జిల్లాలోని 12 మండలాల్లో 93 గ్రామాలను పరిమితికి మించి భూగర్భ జలాలను వాడినట్లుగా గుర్తించామన్నారు. అయితే జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో భూగర్భ నీటిమట్టం ఏడాదిలోనే సగటున 3 మీటర్లు పెరిగిందన్నారు. దీనిపై వాగేష్ తివారీ స్పందిస్తూ జిల్లాలోని క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. డీపీఓ గొట్టిపాటి వెంకటనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలపై పచ్చపడగ...
వెనకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ, కర్నూలు, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఇది గమనించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య విద్యతో పాటు పశ్చిమ ప్రజలకు వైద్య చికిత్స అందించే లక్ష్యంతో మార్కాపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రాయవరం వద్ద 41.97 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.475 కోట్లు మంజూరు చేసి 75 శాతం పనులు పూర్తి చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో మెడికల్ కళాశాల ప్రారంభించాలని భావించారు. ఊహించని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే మార్కాపురం మెడికల్ కళాశాల నిర్మాణాన్ని నిలిపివేసింది. అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందిని బదిలీ చేసింది. దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేస్తోంది. -
వేర్వేరు ఆలయాల్లో చోరీ
● రూ.2.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.25 వేల నగదు అపహరణ జరుగుమల్లి(సింగరాయకొండ)/కొండపి: కొండపి నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో మంగళవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి తెగబడ్డారు. జరుగుమల్లి మండలం ఎన్ఎన్ కండ్రిక కొత్తపాలెంలోని అంకమ్మ తల్లి ఆలయంలో రూ.70 వేల విలువైన వెండి కిరీటం, సుమారు రూ.20 వేల నగదు చోరీ అయినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను పిలిపించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ● కొండపి మండలంలోని పెట్లూరు శివాలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడి నగలు దోచుకెళ్లారు. సుమారు రూ.1.50 లక్షల విలువైన ఆభరణాలు చోరీ అయ్యాయని గ్రామస్తులు తెలిపారు. కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ అంకారావు తెలిపారు. -
కార్డుదారులందరికీ రేషన్ అందాలి
● రేషన్ షాపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ఒంగోలు సబర్బన్: కార్డుదారులందరికీ సకాలంలో రేషన్ అందాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పౌర సరఫరాల శాఖ అధికారులు, రేషన్ దుకాణాల డీలర్లను ఆదేశించారు. ఒంగోలు నగర పరిధిలోని చెరువుకొమ్ముపాలెంలో ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీని చేపడుతున్న విషయం తెలిసిందేనన్నారు. అందుకు అనుగుణంగా జిల్లాలో రేషన్ షాపుల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నెలాఖరు నాటికి ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖాధికారులను ఆదేశించారు. గ్రామంలో ఎంతమంది కార్డుదారులు ఉన్నారు, ఎంత రేషన్ సరఫరా చేశారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాపుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పద్మశ్రీ, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు తహసీల్దార్ మధుసూదనరావు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
మాజీ సీఎం ఎన్టీఆర్కు నివాళి
ఒంగోలు సబర్బన్: మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా బుధవారం ఒంగోలు అద్దంకి బస్టాండ్లోని ఆయన విగ్రహానికి కలెక్టర్ తమీమ్ అన్సారియా నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డీఆర్ఓ చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, మెప్మా పీడీ శ్రీహరి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్టీఆర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. -
అటకెక్కిన మంచినీటి పథకం...
రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఒంగోలు నగరంలో 3.50 లక్షల జనాభా ఉన్నారు. 50 డివిజన్లకుపైగా విస్తరించింది. అయితే, ఒంగోలు నగర, నగర శివారు ప్రాంతాల ప్రజలను మంచినీటి కొరత వేధిస్తోంది. జిల్లా పర్యటనకు వచ్చిన ఆప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడంతో వెంటనే స్పందించారు. నగర ప్రజలకు ప్రతిరోజూ మంచినీరు అందించేందుకు రూ.350 కోట్లు మంజూరు చేశారు. దీనికి పరిపాలనాపరమైన అనుమతులు కూడా వచ్చేశాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం పూర్తిగా అటకెక్కింది. -
పులి దాడిలో ఆవు మృతి?
ఆర్ధవీడు: పాపినేనిపల్లె ఫారెస్టు బీట్ పరిధిలోని నారాయనపల్లి గ్రామ కొండ అంచు వ్యవసాయ పొలాల్లో ఆవుపై అడవి మృగం దాడి చేసి చంపింది. బొప్పాయి తోటలో ఆవు మరణించి ఉండటాన్ని రైతులు బుధవారం మధ్యాహ్నం గుర్తించారు. ఆవు మెడ, ఎడమ కాలిపై మృగం కొరికిన ఆనవాళ్లు ఉండటంతో పులి దాడి చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. పులి సంచరిస్తోందన్న వార్త ఆనోటా ఈనోటా తెలియడంతో నారాయనపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆవు మృతి చెందిన విషయం అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో ట్రాప్ కెమెరాలు అమర్చారు. బుదవారం రాత్రి కెమెరాల ఫుటేజీని పరిశీలించి ఏ జంతువు దాడి చేసిందో నిర్ధారిస్తామని ఫారెస్ట్ బీట్ అధికారి మురళీకృష్ణ తెలిపారు.ఆర్మీ జవాన్ మృతిపై కేసు నమోదుకొమరోలు: మండలంలోని తాటిచెర్ల గ్రామంలో ఆర్మీ జవాన్ రవి(41) మంగళవారం ఉదయం మృతి చెందారు. రాజస్థాన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన సెలవుపై గత సోమవారమే స్వగ్రామానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం వేకువజామున కుటుంబ సభ్యులు ఎంతగా పిలిచినా లేవకపోవడంతో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. రవి తల్లి రత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు బుధవారం తెలిపారు. మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనారోగ్యంతో మరణించారా మరేదైనా కారణమా అనేది పోస్టుమార్టంలో వెల్లడవుతుందని ఎస్సై చెప్పారు. -
ఏషియన్ అడ్మిరబుల్ అచీవర్స్లో మధుసూదన్కు స్థానం
మార్కాపురం: గిన్నిస్ బుక్తో సమానమైన ఏషియన్ అడ్మిరబుల్ అచీవర్స్ బుక్లో మార్కాపురం పట్టణానికి చెందిన డాక్టర్ కప్పగంతుల మధుసూదన్శాస్త్రికి స్థానం దక్కింది. సంబంధించిన పత్రాలను అందుకున్న ఆయన అవార్డు వివరాలను బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆసియా ఖండంలో విశిష్ట సేవలు, అత్యంత ప్రతిభ కనపరిచిన వారి విశేషాలను ఈ బుక్ ప్రచురిస్తుంది. ఈ ఏడాది విడుదల చేసిన బుక్లో మొత్తం 498 మంది వివరాలు ఉండగా అందులో 13వ వాల్యూంలో మధుసూదన్శాస్త్రి వివరాలు నమోదు చేశారు. 1980 నుంచి న్యూఢిల్లీకి చెందిన రవిభూషన్ ఏషియన్ అడ్మిరబుల్ అచీవర్స్ బుక్ ప్రచురిస్తున్నారు. ఈ పుస్తకంలో మధుసూదన్ తండ్రి వేణుగోపాల కృష్ణమూర్తి 1988లో చోటు సంపాదించడం విశేషం. ఈ సందర్భంగా ఆయనను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోపాలుని హరిహారరావు, విశ్రాంత విద్యాశాఖ ఆర్జేడీ డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం చంద్రశేఖరరెడ్డి తదితరులు అభినందించారు.హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవంమార్కాపురం టౌన్: హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మార్కాపురంలోని జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి ఎం.శుభవాణి బుధవారం తీర్పు వెల్లడించారు. తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన పఠాన్ ఖాశింఖాన్ను 2015 జూన్ 21న మార్కాపురం మండలంలోని రాయవరం సమీపంలో బాషా టిఫిన్ బంకు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తన భర్తకు వ్యవసాయ భూమి విషయంలో షేక్ సుబానీ, అతని మనుషులతో గొడవలు జరిగాయని, వారే హత్య చేసి ఉండవచ్చని మార్కాపురం రూరల్ పోలీసులకు ఖాశింఖాన్ భార్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పటి సీఐ కరుణాకర్రావు కేసు దర్యాప్తు చేశారు. తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన పఠాన్ సుబానీ అలియాస్ గడ్డ అలియాస్ గడ్డగాడు, రాయవరం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన షేక్ బాషా అలియాస్ లేషా, ఇదే ప్రాంతానికి చెందిన సయ్యద్ మాబుసుబానీ, సయ్యద్ బడే హుస్సేన్ను నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ట్రయల్ నడుస్తున్న క్రమంలో సయ్యద్ మాబుసుబానీ, సయ్యద్ బడే హుస్సేన్ మృతి చెందారు. బుధవారం తుది విచారణలో నేరం రుజువు కావడంతో పఠాన్ సుబానీ, షేక్ బాషాకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.బాలునాయక్ పేర్కొన్నారు. ఒక్కో నిందితుడికి రూ.1,000 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. నేరస్తులకు శిక్ష పడేలా కోర్టులో సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టిన అప్పటి సీఐ కరుణాకర్రావు, ప్రస్తుత సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావు, లైజన్ హెడ్ కానిస్టేబుల్ ఐవీ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ కిషోర్కుమార్ను ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. -
నేడు ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు
ఒంగోలు సిటీ: స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతుల కార్యక్రమం స్థానిక డీఆర్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు డీఈఓ ఏ.కిరణ్కుమార్ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియారిటీ లిస్టులో 249 నంబర్ వరకు పేర్లు ఉన్న వారు ప్రమోషన్లకు తప్పకుండా హాజరుకావాలని కోరారు.బెల్ట్షాప్ నిర్వాహకుడు అరెస్టుయర్రగొండపాలెం: పద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టులో నిర్వహిస్తున్న మద్యం బెల్ట్ షాపుపై బుధవారం మార్కాపురం ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖాధికారులు దాడులు దాడులు చేసి ఆ షాప్ యజమాన్ని అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న 20 మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. ‘దేవరాజుగట్టులో ఓపెన్ బెల్ట్ షాపు’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆ శాఖ ఎస్సై ఎంవీ గోపాలకృష్ణ స్పందించి దాడులు చేశారు. బెల్ట్షాపులు నిర్వహించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నలుగురు చిన్నారులకు విద్యుత్ షాక్చీమకుర్తి రూరల్: మండలంలోని కూనంనేనివారిపాలెం సచివాలయం సమీపంలో బీసీకాలనీ చిన్నారులు నలుగురు బుధవారం విద్యుత్ షాక్కు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు.. బీసీ కాలనీ దగ్గర విద్యుత్ స్తంభం ఒరిగిపోవడంతో తీగలు కిందకు జారిపోయి నేలకు మూడడుగుల ఎత్తులోనే ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న చిన్నారులు రేవూరి ధనుష్, పాలకీటి దివ్య, పాలకీటి దీపిక, దాసరి విజయలక్ష్మి విద్యుత్ తీగలకు తగలడంతో షాక్కు గురయ్యారు. అందరూ క్షేమంగా బయటపడటంతో వారి కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అధికారులు స్పందించి తక్షణమే సమస్య పరిష్కరించాలని ఎంపీటీసీ వేమా అశ్వని, స్థానికులు డిమాండ్ చేశారు.ప్రశాంత జీవనానికి యోగా ఉత్తమం● ఎస్పీ ఏఆర్ దామోదర్ఒంగోలు టౌన్: శారీరక, మానసిక ఆరోగ్యానికి, ప్రశాంత జీవనానికి యోగా ఏకై క మార్గమని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. యోగాంధ్ర –2025లో భాగంగా బుధవారం పోలీసు కల్యాణ మండపంలో యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..పోలీసు సిబ్బంది రోజువారి విధి నిర్వహణలో ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారని చెప్పారు. మానసిక ఒత్తిడిని తగ్తించే శక్తి యోగాకు ఉందన్నారు. యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదని, శరీరం, మనసు మధ్య సమతుల్యం ఏర్పరిచే సాధనమన్నారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సీఐలు నాగరాజు, విజయకృష్ణ, మేడా శ్రీనివాసరావు పాల్గొన్నారు.డీఐఈఓగా ఆంజనేయులుతాళ్లూరు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.ఆంజనేయులు డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఐఈఓ)గా పదోన్నతి వచ్చింది. ఈ మేరకు కాలేజీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్తీక్ శుక్లా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మర్రిపూడిలో రెవెన్యూ రికార్డుల తనిఖీ
మర్రిపూడి: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ రికార్డులను కనిగిరి ఆర్డీఓ జి.కేశవర్థన్రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. మండలంలోని గుండ్లసముద్రంలో సర్వే నంబర్ 571లో ఉన్న 207.86 ఎకరాల పశువుల బీడులో నిబంధనలకు విరుద్ధంగా కొంత భూమిని అధికారపార్టీ నాయకులు ఆన్లైన్ చేయించుకున్నారు. దీనిపై ఈ నెల17న ‘పశువుల బీడు ఫలహారం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైంది. అలాగే మండల కేంద్రమైన మర్రిపూడిలో లక్ష్మీనృసింహస్వామి కొండ సమీపంలో సర్వే నంబరు 990–1లో 327.27 ఎకరాల భూమి ఉంది. దీనిలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని అప్పటి జిల్లా కలెకర్ట్ బ్లాక్లిస్టులో పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నెల 25వ తేదీ ఆదివారం రోజున తహసీల్దార్ జ్వాలా నరసింహారావు తమ సిబ్బందితో కలిసి సర్వే నంబర్ 990–1లో కొంత భూమిని టీడీపీ సానుభూతిపరులకు ఆన్లైన్ చేయడంతో అసలైన భూ హక్కుదారులు కార్యాలయానికి వచ్చి గగ్గోలుపెట్టారు. ఈ విషయంపై ఈ నెల 26న ‘పచ్చనేతల తెగింపు.. తహసీల్దార్ బరితెగింపు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. వీటిపై స్పందించిన కలెక్టర్ తమీమ్అన్సారియా విచారణకు ఆదేశించడంతో ఆర్డీఓ బుధవారం రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. గుండ్లసముద్రం, మర్రిపూడి భూరికార్డుల తనిఖీ నివేదినకను కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. -
ట్రిపుల్ ఐటీ తరలింపు...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలు నిర్మించి అభివృద్ధి చేస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. అదంతా నిజమేనని జిల్లా ప్రజలు నమ్మారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలు నిర్మించకుండా ఏడాదిగా కాలయాపన చేస్తున్నారు. అంతేగాకుండా గత వ్రభుత్వ హయాంలో ఇడుపులపాయలో ఇబ్బంది పడుతున్న ఒంగోలు క్యాంపస్ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని వారిని ఒంగోలు తరలించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒంగోలు క్యాంపస్ విద్యార్థులను తిరిగి ఇడుపులపాయకు తరలిస్తోంది. ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన ఎమ్మెల్యే తాటిపర్తి, చుండూరి
ఒంగోలు సిటీ/యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు చుండూరి రవిబాబు తదితరులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ జగన్కు ప్రకాశం జిల్లా లీగల్ టీమ్ సభ్యులను చెవిరెడ్డి, చుండూరి పరిచయం చేశారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, లీగల్ టీమ్ సభ్యులు ధర్నాసి హరిబాబు, కాకుటూరి సంపత్కుమార్, కత్తి కోటేష్బాబు, బి.నాగమల్లేశ్వరరెడ్డి, నాయకులు రాయపాటి అంకయ్య, మలిశెట్టి దేవ, పులుసు సురేష్ తదితరులు ఉన్నారు. -
రైతులకు కష్టాలు, కరువు
చంద్రబాబు జమానాలోనే ఒంగోలు సిటీ: సీఎం చంద్రబాబు గద్దెనెక్కగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతులకు కష్టాలు వస్తున్నాయని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు విమర్శించారు. మంగళవారం ఒంగోలులోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పొగాకుకు గిట్టుబాటు ధర లేక రెండు నెలలుగా రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారని, కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ఖరారు కాగానే సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం ఆగమేఘాలపై స్పందించడాన్ని ఎండగట్టారు. అవసరమైతే మార్క్ఫెడ్ను రంగంలోకి దించుతామని సీఎం మౌఖికంగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులకు అవసరమయ్యే మార్క్ఫెడ్తో కొనుగోళ్లు చేయించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ లేవనెత్తే వరకు రాష్ట్రంలో ఏ సమస్యలూ ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. మిర్చి ధరలు పతనమై ఇబ్బంది పడుతున్న రైతులను గుంటూరు మిర్చియార్డులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన తర్వాత మార్క్ఫెడ్తో కొనుగోలు చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు జీఓ ఇవ్వలేదని విమర్శించారు. రైతులు పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీ పెరుగుతోందని, గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని సూచించారు. పొగాకుకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నా ధర పడిపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రెండు నెలలు నుంచి టుబాకో బోర్డు అధికారులు సైతం రైతులకు అబద్ధాలు చెబుతూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మార్క్ఫెడ్ను రంగంలోకి దించడంతోపాటు పొగాకు కంపెనీలతో సమావేశం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ను రంగంలోకి దించితే లాభాలే తప్ప నష్టాలు వచ్చే అవకాశమే లేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉందంటే వ్యాపారులకు లాభాలు తెచ్చిపెట్టే ఎత్తుగడ కాక మరేమిటని నిలదీశారు. రైతులను మోసం చేస్తే చరిత్ర హీనులు కావడం ఖాయమన్నారు. పొగాకు రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందని, ప్రభుత్వం మెడలు వంచి గిట్టుబాటు ధర దక్కేలా చూసే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతులను గ్రూపులుగా విడదీయడం, గట్టిగా నిలదీసేవారి బేళ్లు కొనడం, పేద రైతుల బేళ్లు తిరస్కరించడం టుబాకో బోర్డు అధికారులకు సరికాదన్నారు. బోర్డు అధికారుల మీద నమ్మకం పోతే రైతులు తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు. పొగాకు ధరల పతనంపై కూటమి స్పందన శూన్యం పొగాకు రైతులకు అండగా వైఎస్సార్ సీపీ పోరాటం వైఎస్సార్ సీపీ ఒంగోలు ఇన్చార్జి చుండూరి రవిబాబు -
ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి
● హౌసింగ్ స్పెషలాఫీసర్ అన్నపూర్ణ అల్లూరు (కొత్తపట్నం): మండలంలోని అల్లూరు గ్రామ పరిధిలోని జగనన్న లే అవుట్లను హౌసింగ్ స్పెషలాఫీసర్ ఎన్ అన్నపూర్ణ మంగళవారం పరిశీలించారు. గ్రామంలోని నాలుగు జగనన్న లే అవుట్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎస్టీలకు అదనంగా రూ.75 వేలు కేటాయిస్తే ఎందుకు ఇళ్లు నిర్మించుకోలేదని, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ నీటి వసతి లేకపోవడంతో నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. కాలనీలకు నీరు వచ్చేలా చూడాలని కోరారు. నాలుగు లే అవుట్లలో 193 గృహాలు మంజూరు కాగా 42 పూర్తయ్యాయని, శ్లాబ్ దశలో 14, బేస్మట్టం 95, మిగిలిన 42 వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. లే అవుట్లకు నీటి సౌకర్యం వెంటనే కల్పించాలని ఎంపీడీఓను ఆదేశించారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాసరావు, హౌసింగ్ ఇన్చార్జి ఏఈ వలిరాజు, ఉప సర్పంచ్ తాటపర్తి సుబ్బారెడ్డి తదితరులు పాల్గోన్నారు. -
పొగాకు రైతుల సమస్యలపై పోరాటం
● ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య ఒంగోలు టౌన్: రాష్ట్ర మంత్రులు ఆర్భాటాలు చేయడం మానుకొని గిట్టుబాటు ధరలకు పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో సోమవారం రైతు సంఘం జిల్లా కమిటి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జజ్జూరి జయంతి బాబు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసే చర్యల్లో భాగంగానే ప్రభుత్వం పొగాకు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కంపెనీలు సరైన ధరలు ఇవ్వకపోవడం, సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో ఇప్పటికే నల్లబర్లీ సాగు చేసిన నలుగురు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతులు ఆత్యహత్యలు చేసుకోకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అవసరమైతే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థలతో పొగాకును కొనుగోలు చేయించాలని కోరారు. వర్జీనియా పొగాకు లో గ్రేడ్ రకాన్ని కంపెనీలు అసలు కొనుగోలు చేయడం లేదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి రామారావు తెలిపారు. వర్జీనియా పొగాకు ధరలను తగ్గించేందుకు కంపెనీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే బ్యారన్కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నష్టం వస్తుందని వివరించారు. ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి పొగాకును కొనాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాబు మాట్లాడుతూ పొగాకు రైతులను ఆదుకునేందుకు పోరాటాలు చేస్తామని చెప్పారు. సమావేశంలో రైతు నాయకులు హనుమంతరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, బెజవాడ శ్రీనివాసరావు, కిష్టిపాటి చిన్నపరెడ్డి, కనపర్తి సుబ్బారావు, శ్రీకాంత్, ఉషా వెంకటేశ్వర్లు, సోమయ్య, ముప్పరాజు బ్రహ్మయ్య, సింగయ్య, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
కారు, బైకు ఢీ.. ఒకరు మృతి
మార్కాపురం: బైకును కారు ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై మిట్టమీదిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. పెద్దారవీడు మండలం శివాపురం గ్రామానికి చెందిన పోతిరెడ్డి వెంకటేశ్వర్లు(30) తన బైక్పై కంభం వెళ్తున్నాడు. మహానంది నుంచి శ్రీశైలం వెళ్తున్న కారు తిప్పాయపాలెం–చింతకుంట్ల గ్రామాల మధ్య మిట్టమీదిపల్లి హైవే రోడ్డు దగ్గర బైకును ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే వెంకటేశ్వర్లు మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మార్కాపురం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఫారంపాండ్లో పడి యువకుడు మృతియర్రగొండపాలెం: నీళ్ల కోసం వెళ్లి ఫారం పాండ్లో జారిపడి యువకుడు మృతి చెందిన సంఘటన స్థానిక మార్కాపురం రోడ్లోని హైవే రెస్ట్ హౌస్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వీరభద్రాపురం గ్రామానికి చెందిన ఆలేటి అఖిల్(23) రెస్ట్ హౌస్ సమీపంలో భవన నిర్మాణ పనికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు నీళ్లు తీసుకురావడానికి సమీప పొలంలో ఉన్న ఫారం పాండ్ వద్దకు చేరుకున్నాడు. నీరు పట్టుకునే క్రమంలో కాలుజారి పాండ్లో పడిపోయాడు. బయటకు రాలేక నీట మునిగి మృతి చెందాడని తోటి కార్మికులు చెప్పారు. అఖిల్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నత విద్య కోసం వేచి ఉన్నాడు. వేసవి సెలవులు కావడంతో కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా ఉండేందుకు బేల్దారి పనులకు వెళ్తున్నాడని అతని బంధువులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.చౌడయ్య తెలిపారు. -
30న జిల్లాస్థాయి ఫుట్బాల్ జట్ల ఎంపిక
ఒంగోలు: జిల్లాస్థాయి ఫుట్బాల్ సబ్ జూనియర్, జూనియర్ బాల బాలికల క్రీడా జట్ల ఎంపిక ఈ నెల 30న స్థానిక డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి అంచిపోగు రమేష్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎంపిక ప్రారంభమవుతుందన్నారు. జూనియర్స్ విభాగంలో 2010 జనవరి నుంచి 2011 డిసెంబర్ మధ్య జన్మించిన వారు, సబ్ జూనియర్స్ విభాగంలో 2012 జనవరి నుంచి 2013 డిసెంబర్ మధ్య జన్మించిన వారు పాల్గొనేందుకు అర్హులన్నారు. ఎంపికకు హాజరయ్యే వారు ఆధార్కార్డు, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు తీసుకురావాలన్నారు. ఎంపికై న క్రీడాజట్లు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9849760566 నంబర్ను సంప్రదించాలని కోరారు. 2న వాలీబాల్ సెలక్షన్స్ ఒంగోలు: స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా(సాయి) వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక జూన్ 2న విశాఖపట్నం పోర్టు స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ జిల్లా ఇన్చార్జి కార్యదర్శి డాక్టర్ జి.ధనుంజయరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 190 సెంటీమీటర్ల కనీస ఎత్తు కలిగిన బాలురు, 170 సెంటీమీటర్ల కనీస ఎత్తు కలిగిన బాలికలు ఎంపికకు అర్హులు. ఎంపికై న బాలబాలికలకు ఉచిత వసతి, భోజనంతో పాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ప్రభుత్వ వైద్యుని మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, 5 పాస్పోర్టు సైజు ఫోటోలు, స్పోర్ట్సు సర్టిఫికెట్లు తీసుకుని ఎంపిక కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 9490382802 నంబర్ను సంప్రదించాలని డాక్టర్ జి.ధనుంజయరావు విజ్ఞప్తి చేశారు. సీనియారిటీ జాబితా సరిచేయాలి ఒంగోలు సిటీ: ఉపాధ్యాయులు పదోన్నతుల బదిలీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్–2 హెచ్ఎంగా పదోన్నతుల జాబితాలో అనేక పొరపాట్లు ఉన్నాయని, వాటిని సరిచేయాలని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు మంగళవారం డిమాండ్ చేశారు. రూల్ ప్రకారం ఒకే డీఎస్సీలో నియామకం పొంది వివిధ సబ్జెక్టులకు పదోన్నతి పొంది ఒకే తేదీ జాయిన్ అయిన వారి ఇంటర్ సీనియారిటీ నిర్ణయించేటప్పుడు వారి సీనియారిటీ ఫీడర్ కేడర్ తీసుకురావాలన్నారు. ఈ నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పదోన్నతుల జాబితా సరిచేస్తామని డీఈఓ కార్యాలయం ప్రకటించింది. వెంటనే ఆ జాబితా సరిచేసి గ్రేడ్–2 హెచ్ఎంల పదోన్నతుల జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాగునీటి చెరువులకే సాగర్ జలాలు ● ఎస్ఎస్పీ ఎస్ఈ నాగమురళీమోహన్ కురిచేడు: నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేసిన నీరు కేవలం తాగునీటి అవసరాల కోసమేనని ఎన్ఎస్పీ ఎస్ఈ నాగమురళిమోహన్ తెలిపారు. మంగళవారం ఆయన సాగర్కాలువపై పరిశీలించారు. ఒంగోలు బ్రాంచికాలువ హెడ్ రెగ్యులేటర్, దర్శి బ్రాంచి కాలువ హెడ్రెగ్యులేటర్, త్రిపురాంతకం, జిల్లా సరిహద్దు 85/3 మైలు వరకు పర్యటించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సిబ్బంది తమ తాగునీటి చెరువులను నింపుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్థానిక అట్లపల్లి రిజర్వాయర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి అవసరాల కోసం కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలకు కలిపి విడుదల చేశారని, వారం రోజుల్లో కాలువ నిలిపివేస్తారన్నారు. నోటిఫై చెరువులు మాత్రమే నింపుకోవాలని, అలా కాకుండా నీటి చౌర్యానికి పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. జిల్లా ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట ఈఈ రామకృష్ణ, డీఈఈ అక్బర్బాషా, ఏఈలు శ్రీకాంత్రెడ్డి, రవీంద్రరెడ్డి, సాంబశివరావు, సిబ్బంది ఉన్నారు. -
జైలు జీవితం మార్పునకు నాంది పలకాలి
● జిల్లా జైలును సందర్శించిన ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: జైలు జీవితం కేవలం శిక్షకు మాత్రమే పరిమితం కాదని.. అక్కడి నుంచే సానుకూల మార్పునకు నాంది పలకాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. మంగళవారం జిల్లా జైలును ఆయన సందర్శించారు. జైలు గదులు, హాస్పిటల్, పరిసరాలను పరిశీలించారు. అనంతరం జైలు అంతర్గత భద్రతపై జైలు అధికారులు, సెక్యురిటీ రివ్యూ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళా ఖైదీలకు ప్రత్యేక భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జైలులో నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. రిమాండ్ ఖైదీలను తరలించే సమయంలో పోలీసులు, జైలు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్పీ వెంట జైలు సూపరెండెంట్ పి. వరుణా రెడ్డి, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలుకా సీఐ విజయ కృష్ణ, టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, వన్ టౌన్ సీఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఆర్ఐ సీతారామి రెడ్డి, జిల్లా జైలర్ రమేష్, ఎం.శ్రీనివాసరావు, ఎన్. శ్రీనివాసరావు, కారాగార వైద్యాధికారి యస్వియస్ బ్రహ్మతేజ తదితరులు వున్నారు. -
మహిళలు సమాజ చోదకులు
ఒంగోలు సబర్బన్: మహిళలు కుటుంబ, సమాజ చోదక శక్తిగా ఎదగాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బ్యాంకర్లు కూడా స్వయం సహాయక సంఘ సభ్యులకు రుణాలు మంజూరు చేసి అండగా నిలవాలని కోరారు. డ్వాక్రా మహిళలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే వార్షిక రుణ, జీవనోపాధి కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో డీఆర్డీఏ, మెప్మా అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 4.5 లక్షల మంది స్వయం సహాయక సంఘ మహిళలు ఉన్నారని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళా వ్యాపారవేత్తగా తయారు కావాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. డీఆర్డీఏతో బ్యాంకర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. బోగస్ గ్రూపులను, రుణాలు తీసుకోవడంలో డూప్లికేషన్ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చిందన్నారు. మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులో 10 శాతం నిల్వ ఉంచి మిగతా నిధులను వారికే రుణంగా మంజూరు చేయాలని స్పష్టం చేశారు. లక్ష మంది మహిళా వ్యాపారవేత్తలను తయారు చేసే క్రమంలో జూన్ 5వ తేదీ నాటికి జిల్లాలో 1,720 యూనిట్లు అందుబాటులోకి రావాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యమని చెప్పారు. ఇందుకుగాను రూ.23 కోట్ల రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు. ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.6759.13 కోట్ల మేర రుణాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. అనంతరం కొత్త యూనిట్ల ఏర్పాటుకు మంజూరైన రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. 2025–26 ఆర్థిక సంవత్సర వార్షిక రుణ ప్రణాళిక పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్, ఎల్డీఎం రమేష్ మాట్లాడుతూ.. త్వరగా సబ్సిడీ క్రెడిట్ అయ్యేలా పీఎంఎఫ్ఎంఈ పథకం కింద యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని డీఆర్డీఏ అధికారులకు సూచించారు. డీఆర్డీఏ పీడీ నారాయణ మాట్లాడుతూ.. ఎస్హెచ్జీ మహిళలకు ఇచ్చే వ్యక్తిగత రుణాలకు డీఆర్డీఏనే ష్యూరిటీ ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మెప్మా పీడీ శ్రీహరి, డీపీఎంలు, ఏపీఎంలు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకర్లు సహకరించాలి డీఆర్డీఏ, మెప్మా, బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా -
వేగవంతం చేయండి
లబ్ధిదారుల గుర్తింపు ● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మండల స్థాయి అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రకాశం భవనం నుంచి మంగళవారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, సీసీఆర్సీ కార్డుల మంజూరుపై క్షేత్ర స్థాయి అధికారులకు సూచనలు చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ, ఇతర ప్రయోజనాలు లభించడానికి సీసీఆర్సీ కార్డులే ప్రధానమైనందున రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో కౌలుదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. వాస్తవ భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా సాగుదారులకు ప్రభుత్వ ప్రయోజనాలు లభించేలా చూడాలన్నారు. గ్రీవెన్స్ ఆర్జీల పరిష్కారంపై, రెవెన్యూ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ సారించాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ మాట్లాడుతూ సీబీజీ, ఎంఎస్ఎంఈ, ఇతర పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అర్హులైన వారు ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మ్యుటేషన్లు, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై ప్రతి నెలా మూడో సోమవారం ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నందున ఎలాంటి లోపాలు లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. -
బ్యాంగ్!
బూమ్..మేఘాల్లో ధన, రుణావేశం పిడుగుల జననం జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు జనాన్ని ఆశ్చర్యానికి, అయోమయానికి గురిచేస్తున్నాయి. అంతకు మించి భయాన్ని పుట్టిస్తున్నాయి.! అనూహ్య రీతిలో వాతావరణం మారిపోయి, ఆకాశంలో మబ్బులు కమ్మేయడం.. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో పిడుగులు పడుతుండటంతో మనుషులతోపాటు మూగ జీవాలు బలవుతున్నాయి. పిడుగుల బారి నుంచి రక్షణ పొందాలంటే అప్రమత్తతే ఆయుధం. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న హెచ్చరికలను అనుసరించడం అత్యంత ముఖ్యం.పొన్నలూరు/కనిగిరి రూరల్: వేసవి కాలం అయినప్పటికీ బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా అడపా దడపా వర్షాలు కురిశాయి. పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలోనే చెట్లు, నివాసాలు, ఖాళీ స్థలాలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఆలయాలపై పిడుగులు పడటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సాధారణంగా పిడుగుపాటు బారి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే వర్షాలు కురిసే సమయాల్లో చెట్ల కింద, ఎత్తయిన ప్రదేశాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉంటే ప్రాణాలు కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.సమయ స్ఫూర్తి ఎంతో అవసరం..వ్యవసాయ పనులు చేసేటప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుంటే పిడుగులు పడతాయని భావించి రైతులు అప్రమత్తం కావాలి. వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. ఒక వేళ సురక్షిత ప్రాంతానికి వెళ్లే సమయం లేకుంటే సమయస్ఫూర్తితో వ్యవహరించి.. మోకాళ్లపై కూర్చుని చేతులు, తల నేలకు తగిలేలా ముడుచుకుని కూర్చోవాలి. దీని వల్ల సమీపంలో పిడుగు పడినా ఆ ప్రభావం తక్కువగా ఉండి ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. అలా కుదరని పరిస్థితిలో కాళ్లను భూమి మీద పూర్తిగా ఆనించకుండా, కాలి వేళ్లపై నిల్చునేందుకు ప్రయత్నించాలి.ఈ జాగ్రత్తలు పాటించాలిæ సాధారణంగా ఎత్తుగా ఉండే నిర్మాణాలు, ప్రాంతాలపై పిడుగులు ఎక్కువగా పడతాయి. అందువల్ల వర్షం కురిసే సమయంలో చెట్లు, సెల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు, కొండల వద్దకు వెళ్లకూడదు.æ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, విద్యుత్ కుక్కర్లు, ల్యాప్ టాప్లు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర విద్యుత్ పరికరాలు ఉపయోగించకూడదు.æ గుంపులు గుంపులుగా కాకుండా దూరంగా ఉండాలి.ప్రథమ చికిత్స ఇలా..● పిడుగుపాటుతో అస్వస్థతకు గురైన వారిని గాలి, వెలుతురు తగిలే విశాలమైన ప్రాంతంలో ఉంచాలి.● తడి దుస్తులు తొలగించి పొడి దుస్తులు వేయాలి.● తల ఒక వైపునకు తిప్పి, రెండు కాళ్లు కాస్త పైకి ఎత్తి ఉంచాలి.● తాగు నీరు, ఆహార పదార్థాలు అందించకూడదు.● అందుబాటులో ఉన్న వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించాలి.జిల్లాలో పిడుగుల గర్జనì ఏప్రిల్ 3న వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి పంచాయతీ కట్టకిందపల్లిలో బి.తిరుపాలుకు చెందిన సుమారు 10 జీవాలు పిడుగుపాటుకు మృతి చెందాయి.ì ఏప్రిల్ 4న కొమరోలు మండలం ఎడమకల్లులో ఎం.యాకోబుకు చెందిన మూడు గేదెలు చనిపోయాయి.ì ఏప్రిల్ 20న బేస్తవారిపేట మండలంలోని పెద్ద ఓబినేనిపల్లెలో క్రికెట్ ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు విద్యుర్థులు ఆకాష్, సన్ని పిడుగుపాటుతో మృత్యువాతపడ్డారు. గొర్రెల కాపరి తిరుపతయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.ì కొమరోలు మండలం తాటిచర్ల మోటులో గుమ్మళ్ల శింగరయ్యకు చెందిన రెండు గేదెలు, రెండు దూడలు పిడుగుపాటుకు చనిపోయాయి.ì ఏప్రెల్ 16న అర్ధవీడు మండలం యాచవరంలో పొలంలో పనిచేస్తున్న కూలీలపై పిడుగు పడటంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.ì ఏప్రిల్ 30న కంభంలోని హజరత్ గూడెంలో పిడుగుపాటుకు రెండు గేదెలు మృతిచెందాయి.ì మే 2న కనిగిరి మండలం కలగట్ల సమీపంలో నూకపోటి శివపార్వతమ్మకు చెందిన గొర్రెల మందపై పిడుగు పడి 20 మేకలు మృత్యువాతపడ్డాయి.ì మే 4న నాగులుప్పలపాడు మండలం ఈదుమూడికి చెందిన కొండపి నాగమల్లేశ్వరరావు పిడుగుపాటుతో మృతి చెందారు.ì మే 16న సింగరాయకొండ మండలం బేసిన్ పల్లెపాలెంలో రామాలయంపై పిడుగుపడి మూడు విగ్రహాలు ధ్వంసమయ్యాయి.ì మే 17న రాచర్ల మండలంలోని జేపీ చెరువు సమీపంలో పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి చెందాయి.ì ఇటీవల ముండ్లమూరు మండలంలో ఓ నివాసంపై పిడుగుపడటంతో చుట్టుపక్కల 12 ఇళ్లలో గృహోపకరణాలు దెబ్బతిని రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది.పిడుగుల ప్రతాపం ఏప్రిల్, మే, జూన్ మాసాల్లోనే అధికం గడిచిన నెలన్నర వ్యవధిలో దాదాపు 20 వరకు పిడుగుపాట్లు మనుషులతోపాటు మూగజీవాలు మృత్యువాత గృహోపకరణాలు దగ్ధమై భారీగా నష్టం పిడుగులు పడే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న వాతవరణ శాఖ గృహాలు, కార్యాలయాలపై లైట్నింగ్ కండక్టర్ ఏర్పాటు ముఖ్యంలైట్నింగ్ కండక్టర్తో ప్రయోజనం30,000 డిగ్రీల ఉష్ణం గంటకు 4.34 లక్షల కి.మీ వేగంపిడుగులు పడే సమయంలో శక్తి విస్ఫోటనం చెంది అధిక ఉష్ణోగ్రత వెలువడుతుంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం పిడుగు పడినపుడు 50 వేల డిగ్రీల ఫారన్ హీట్ లేదా 30 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణగ్రత విడుదల అవుతుంది. సుమారు 300 మిలియన్ వాట్ల విద్యుత్ జనిస్తుంది. గంటకు 4.34 లక్షల కిలోమీటర్ల వేగంతో పిడుగు భూమికి చేరుతుంది.విరుద్ధ విద్యుదావేశాలున్న రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు వాటి మధ్య జనించే శక్తినే పిడుగు అని పిలుస్తాం. ధ్వని వేగం కన్నా కాంతి వేగం ఎక్కువ కావడంతో ముందుగా మెరుపు కనిపిస్తుంది. తర్వాత ఉరుము శబ్ధం వినిపిస్తుంది. తేమ విద్యుత్ ప్రవాహంగా పనిచేయడం వల్ల ధనావేశం ఉన్న విద్యుత్ శక్తి భూమిపై రుణావేశం గల ప్రదేశానికి క్షణాల వ్యవధిలో దూసుకొస్తుంది. పిడుగులు ఎత్తయిన ప్రదేశాలపై పడి భూమిలోకి తటస్థంగా వెళ్లిపోతాయి. సహజంగా భూమిపై చెట్లు ఎత్తుగా ఉండటం వల్ల పిడుగులు వాటిపైనే అధికంగా పడుతుంటాయి.చెట్లకు దూరంగా ఉండాలి..ప్రజలు వర్షం కురిసినప్పుడు చెట్ల దగ్గరకు వెళ్లకపోవడమే మంచిది. అలాగే వర్షం వచ్చేటప్పుడు సెల్ ఫోన్ వినియోగించడం కూడా మంచిది కాదు. విద్యుత్ను గ్రహించే వాటికి దూరంగా ఉండాలి. పిడుగుపాటుకు గురైతే వెంటనే స్పృహ కోల్పోతారు. ప్రథమ చికిత్సకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పిడుగుపాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పి వెంటనే వైద్యులను సంప్రదించాలి.– డాక్టర్ రవికిరణ్, పీహెచ్సీ, పొన్నలూరుపిడుగుల నుంచి రక్షణ కోసం భౌతిక శాస్త్రవేత్త బెంజిమన్ ప్రాంక్లిన్ రాగి తీగలతో లైట్నింగ్ కండక్టర్ రూపొందించారు. వీటిని ఎత్తయిన భవనాలు, గుడి గోపురాలపై అమర్చేవారు. ఈ కండక్టర్ పిడుగుల్లోని విద్యుదావేశాన్ని గ్రహించి రాగి తీగల ద్వారా నేరుగా భూమిలోకి పంపిస్తుంది. ఈ క్రమంలో రాగి తీగలు కూడా కరిగిపోతుంటాయి. ప్రస్తుతం రాగి, కాంస్య మిశ్రమంతో రూపొందిచిన లైట్నింగ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని కూడా ప్రజలు అవసరాన్ని బట్టి వినియోగించి పిడుగుల బారి నుంచి రక్షణ పొందవచ్చు. -
కూలిన వందేళ్ల భారీ వృక్షం
టంగుటూరులో కూలిన భారీ వృక్షం టంగుటూరు: రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 100 సంవత్సరాల నాటి భారీ వృక్షం కూలిన సంఘటన టంగుటూరు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షానికి నాని నాని వృక్షం ఒక్కసారిగా మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వాలింది. ఆ రోడ్డు మార్గాన నిత్యం ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు వందలాదిగా రాకపోకలు సాగిస్తుంటాయి. వృక్షం వాలిన సమయం మధ్యాహ్నం కావటంతో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు వాహనాలను దారిమల్లించారు. పంచాయతీ అధికారులు, పోలీసులు వాలిన భారీ వృక్షాన్ని తొలగించడంతో రాకపోకలు ఎప్పటిలాగే సాగాయి. -
దళిత, ముస్లిం యువకులకు బహిరంగ శిక్ష దారుణం
సింగరాయకొండ: టీడీపీ కూటమి ప్రభుత్వంలో దళితులు, మైనార్టీలపై దాడులు తీవ్రమయ్యాయనేందుకు గుంటూరు జిల్లా తెనాలిలో నడిరోడ్డుపై యువకులను పోలీసులు కొట్టడమే నిదర్శనమని, ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనేనని పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య ఆరోపించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో రోజూ దళితులు, మైనార్టీలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని తెనాలి ఘటనే ఇందుకు పరాకాష్ట అని ప్రభుత్వ పనితీరును విమర్శించారు. పోలీసులు తమ దందాలకు సహకరించడం లేదని ఆ యువకులను అతిక్రూరత్వంగా, రాక్షసత్వంగా గాయపరిచారని, దీంతో ఆ ప్రాంత ప్రజలు పోలీస్స్టేషన్కు వెళ్లాలంటేనే భయపడుతున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల కుమారులు తప్పు చేస్తే ఈ విధంగా బహిరంగంగా శిక్షిస్తారా అని ప్రశ్నించారు. యువకులపై అతికిరాతకంగా దాడి చేసిన పోలీసు అధికారులను కఠినంగా శిక్షించి, తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య -
నేతలు వీధికెక్కి !
మాటలు వేడెక్కి.. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ముందస్తు రుతుపవనాలతో జిల్లాలో వాతావరణం చల్లబడింది. అయితే మినీ మహానాడులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన విమర్శలతో జిల్లా కేంద్రం ఒంగోలులో మాత్రం రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కింది. అప్పటి నుంచి గత వారం రోజులుగా టీడీపీ, జనసేన నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. దామచర్ల చేసిన విమర్శలకు ప్రతిగా జనసేన నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు జడా బాల నాగేంద్ర ఎమ్మెల్యే దామచర్లపై విమర్శలు చేయడంతో కూటమిలో కుంపటి రాజుకుంది. అది ఈ విడత శృతి మించింది. టీడీపీ, జనసేన నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడంతో మరింత వేడి రాజుకుంది. ఇరు పార్టీల నాయకులు పత్రికల్లో రాయలేని భాషలో తిట్టుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తిట్లను వినలేక ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. అధికారం ఇచ్చి పరిపాలన చేయమంటే దాన్ని వదిలేసి కూటమి నాయకులు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ రోడ్డున పడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. దామచర్ల విమర్శలు వ్యక్తిగతమా... ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అవకాశం చిక్కినప్పుడల్లా మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని విమర్శిస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒంగోలులో జరిగిన మినీ మహానాడులో బాలినేనిపై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఒంగోలును సర్వనాశనం చేసి హైదరాబాద్ వెళ్లి ప్రశాంతంగా ఆడుకుంటున్నాడని విమర్శించారు. అంతేకాకుండా ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో హైదరాబాద్ పారిపోయి జనసేన పార్టీలో చేరాడని ఎద్దేవా చేశారు. అయినా జనసేన నాయకులు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. జనసేనలో మొదట్నుంచి రెండు గ్రూపులు ఉన్నాయి. అందులో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తొలి నుంచి దామచర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా ఆయన దామచర్లతోనే కొనసాగుతున్నాడు. దాంతో బాలినేనిపై దామచర్ల చేసిన విమర్శలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, దానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని రియాజ్ చెబుతున్నారు. అంతేకాకుండా నిన్నా మొన్నటి వరకు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్పుకుంటూ తిరిగిన నాయకురాలు కూడా మౌనంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో జడా నాగేంద్ర కౌంటర్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. దామచర్లకు కౌంటర్ ఇచ్చిన నాగేంద్ర... ఎమ్మెల్యే దామచర్ల చేసిన విమర్శలకు జనసేన నాయకుడు జడా బాల నాగేంద్ర కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల కూటమి ధర్మాన్ని పాటించాలని హితవు పలికారు. గత ఎన్నికల్లో జనసేన మద్దతు వల్లనే దామచర్ల గెలిచాడని గుర్తు చేసిన ఆయన... బాలినేని ఏదో పార్టీలో చేరాడని విమర్శించడం అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. నీకు దమ్ముంటే రాజీనామా చేసి సొంతంగా బాలినేనిపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. 7 మంది పీఏలను పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నావని, నీ పాపాల చిట్టా లోకేష్ దగ్గర ఉందని ధ్వజమెత్తారు. ఒంగోలులో ఉద్యోగులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కార్మికుల వద్ద నుంచి జె.టాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దాంతో కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరాయి. వ్యక్తిగత విమర్శలతో వీధిలో పడ్డ కూటమి నాయకులు... ఈ రెండు ఘటన తరువాత టీడీపీ, జనసేన నాయకుల మధ్య విమర్శలు శృతి మించి రాగాన పడ్డాయి. ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా తిట్టుకోవడం మొదలుపెట్టారు. బాలినేని దయాదాక్షిణ్యాలపై నాగేంద్ర బతుకుతున్నాడంటూ పరుష పదజాలంతో టీడీపీ నాయకులు తిట్లదండకం అందుకున్నారు. డొక్కా సీతమ్మ అన్నదానం పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన నాగేంద్ర సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. దొంగలు, కిరాయి హంతకులు, కాల్మనీగాళ్లతో ప్రెస్మీట్ పెట్టించి బెదిరించాలనుకుంటున్నారా అంటూ ఎమ్మెల్యే దామచర్లను ప్రశ్నించారు. నగరపాలక సంస్థలోనూ ఇదే తంతు.. నగర కార్పొరేషన్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలలో చేరిన కార్పొరేటర్ల మధ్య కూడా విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీలో చేరిన 14 మంది కార్పొరేటర్లు నగర మేయర్ గంగాడ సుజాత తీరుపై గుర్రుగా ఉన్నారు. మేయర్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సొంత పార్టీ కార్పొరేటర్లను కూడా వదిలిపెట్టడం లేదని, వారి నుంచి కూడా డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కూటమి కార్పొరేటర్లు ఎడ్డెమంటే తెడ్డెమంటూ ఒకరి వెనక మరొకరు గోతులు తవ్వుకుంటూ అభివృద్ధి పనులను గాలికి వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా నగరంలోని అనేక డివిజన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. డివిజన్ల అభివృద్ధిపై దీని ప్రభావం కనిపిస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. తెలుగుదేశం మినీ మహానాడులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై చేసిన విమర్శలతో రేగిన చిచ్చు చల్లారడం లేదు. వారం రోజులుగా టీడీపీ, జనసేన నాయకులు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం గమనార్హం. ఇరు పార్టీల నేతలు పరిధి దాటి పత్రికల్లో రాయలేని పదజాలంతో దూషణలకు దిగుతున్నారు. కుటుంబసభ్యులను సైతం ఇందులోకి లాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిలో తారస్థాయికి చేరిన విభేదాలు ఎమ్మెల్యే దామచర్ల విమర్శలతో రాజుకున్న చిచ్చు బాలినేనిపై విమర్శలు చేసినా పట్టించుకోని జనసేన నాయకులు బాలినేని అనుచరుడు జడా బాల నాగేంద్ర, టీడీపీ నాయకుల వ్యక్తిగత విమర్శలతో కాక రాయడానికి వీల్లేని భాషలో దూషించుకుంటూ వీధిన పడిన కూటమి నాయకులు వ్యక్తిగత విమర్శలపై మండిపడుతున్న జనం -
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
దర్శి(కురిచేడు): భర్త మందలించాడని మనస్తాపం చెందిన మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దర్శి మండలంలోని తూర్పు వీరాయపాలెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై మురళి కథనం మేరకు.. తూర్పువీరాయపాలెం గ్రామానికి చెందిన చెరుగూరి వెంకటరత్నం(30)ను సోమవారం రాత్రి అన్నం వండే విషయమై ఆమె భర్త బాల సుందరరాజు మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం వేకువ జామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని, మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ట్రాక్టర్ను ఢీకొట్టిన కంటైనర్ లారీ
టంగుటూరు: ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో నలుగురు పచ్చాకు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన టంగుటూరు మండలంలోని సూరారెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై బాబాయ్ హోటల్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సూరారెడ్డిపాలెం గ్రామానికి చెందిన నల్లగొర్ల అశోక్ ట్రాక్టర్లో పచ్చాకుతో సహా కూలీలను తీసుకుని తూర్పునాయుడుపాలెం వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఒంగోలు వైపు నుంచి చైన్నె వైపు వెళ్తున్న కంటైనర్ లారీ పచ్చాకు ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లుకు కాలు విరగగా, జక్రయ్య, మార్కు, రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని ఎస్సై నాగమళ్లీశ్వరరావు పరిశీలించారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ట్రాక్టర్ను ఢీకొట్టిన కంటైనర్ లారీ ఆగకుండా వెళ్లిపోగా పోలీసులు గాలించి బోదనం టోల్గేట్ సమీపంలోని చిల్లకూరు వద్ద సీజ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నలుగురు పచ్చాకు కూలీలకు తీవ్ర గాయాలు -
కూటమి ప్రభుత్వంలో అటవిక పాలన
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అటవిక పాలన సాగుతోందని, ఇందుకు తెనాలి ఘటనే నిదర్శనమని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు పూర్తిగా రాజ్యాంగాన్ని విస్మరించి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, మరీ ముఖ్యంగా దళిత, మైనారిటీలను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. తెనాలిలో మైనారిటీ, దళిత యువకులపై పోలీసులు చేసిన అమానుష ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ పది నెలల కాలంలో దళితులు, మైనారిటీలు, మహిళలపై దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు. తెనాలిలో సభ్యసమాజం తలదించుకునేలా ఽథర్డ్డిగ్రీ ప్రయోగిస్తూ ఒక సీఐ కాళ్లను తొక్కుతూ మరొక సీఐ లాఠీతో విరిగిపోయే వరకు కొడుతూనే ఉండటం చూస్తుంటే రాష్ట్రంలో రక్షణ ఏమాత్రం ఉందో అర్థమవుతుందన్నారు. యువకులు నేరం చేస్తే విచారణ చేయాలే గానీ నడిబజారులో దారుణంగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ సంఘటనను వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ సంఘటనపై మానవహక్కుల సంఘం గానీ, ఎస్సీ కమిషన్ గానీ వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై రోజు రోజుకూ దాడులు తీవ్రతరం అవుతున్నాయన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరిగిందని, దీనికి ఆయన సమాధానం చెప్పాలన్నారు. ఘటన బయటకు వచ్చినా ఇంత వరకు ఆ పోలీసులపై శాఖాపర చర్యలు తీసుకుంటామని ప్రకటించకపోవడం దారుణమన్నారు. టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులు చేసినా పోలీస్స్టేషన్కు వెళ్లే పరిస్థితి కనిపించడంలేదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నామన్నారు. మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు ప్రవర్తించిన సంఘటనతో రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. దళితులకు, మైనారిటీలకు, మహిళలకు భద్రత కరువైందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల పట్ల ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్కళ్యాణ్ నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. పవన్కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోనే బహిష్కరిస్తే కనీసం అక్కడకు వెళ్లిన పాపాన పోలేదని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సిన పాలకులు దళిత మైనారిటీలపై దాడులు జరుగుతుంటే కనీస స్పందన లేదని విమర్శించారు. సూపర్సిక్స్ అమలు చేయలేని టీటీడీకి మహానాడు జరుపుకునే అర్హత లేదన్నారు. ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే దళిత హోంమంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెనాలి ఘటనపై తక్షణమే స్పందించి నిందితులైన పోలీసులపై చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ తెనాలిలో యువకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం దళితులు, మైనారిటీలపై ఒక పథకం ప్రకారం దాడులు చేయిస్తోందన్నారు. గ్రామాల్లో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేని కూటమి నేతలు ఇటువంటి ఘటన పట్ల మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్ప ఇంకేం లేదన్నారు. తప్పుడు పనులు చేసే పోలీసులను వదిలిపేట్టే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని ప్రతి పోలీసు గుర్తు పెట్టుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న మాట్లాడుతూ యువకులను కిరాతంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బడుగు ఇందిర, కార్పొరేటరు ఇమ్రాన్ఖాన్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ సుల్తాన్భాషా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దేవప్రసాద్, దర్శి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గల్లెపోగు ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం తెనాలి ఘటనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా పోలీసుల ప్రవర్తన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజం -
జీవితాలు కూలిపోయి
ధర పడిపోయి.. పొదిలి: పృధులాపురి రైతుల ధనాగారంగా ఉన్న పొగాకు నేడు పగాకుగా మారుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందనే ఆశతో పొగాకు సాగుకు మొగ్గు చూపారు. తీవ్ర కరువుతో పంటలకు నీరందుతుందన్న నమ్మకం లేక రైతులు తక్కువ నీటితో సాగయ్యే పొగాకు వైపు ఆసక్తి చూపి సాగుచేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కరువు రైతుపై కోలుకోలేని దెబ్బ పడనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ సహకారం లోపించడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పొగాకు రైతు కుదేలవుతున్నాడు. అధిక మొత్తంలో లో గ్రేడ్ ఉత్పత్తి కావడం, నాణ్యమైన పొగాకు ధర తగ్గుతుండటంతో లో గ్రేడ్ ధరలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలం జరిగే తీరుపై రైతుల్లో అసహనం నెలకొంది. కేంద్రాలకు వస్తున్న అధిక బేళ్లను తిప్పి పంపించివేస్తుండడంతో రైతుపై అదనపు భారం పడుతోంది. ఈ పరిణామాలన్నీ రైతు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు నెలల పంట.. ఆరు నెలల అమ్మకాలు... పొగాకు రైతులు నష్టపోయే మరొక సమస్య అమ్మకాలు. సకాలంలో అమ్మకాలు జరిగి డబ్బు చేతికొస్తే పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చుకుంటే వడ్డీలైనా మిగులుతాయి. మూడు నెలల పంట కాలం అయితే ఆరేడు నెలల పాటు అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో పెట్టుబడులకు వడ్డీలు పెరిగిపోవటంతో పాటు దీర్ఘకాలంగా నిల్వ ఉండడంతో పొగాకు నాణ్యత, బరువు తగ్గిపోతున్నాయి. సేద్యాలు చేసినందుకు, పచ్చాకు ముఠాలకు, క్యూరింగ్ కర్రకు, కూలీలకు అప్పులు తెచ్చారు. ఈ సంవత్సరం ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకు సుమారు 2 మిలియన్ కిలోలు కూడా కొనుగోలు జరగలేదు. గుబులు పుట్టిస్తున్న లో గ్రేడ్... ఈ ఏడు వాతావరణం అనుకూలించకపోవటం, లేత ప్లాంటేషన్ల కారణంగా లో గ్రేడ్ ఉత్పత్తి ఎక్కువగా జరిగింది. సుమారు 65 శాతం మేర సగటున లో గ్రేడ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సగటున లో గ్రేడ్కు రూ.230 ఉంటేనే రైతులు గట్టునపడే అవకాశం ఉంది. లేదంటే అప్పులు మిగిలే ప్రమాదం ఉంది. గ్రేడ్ పొగాకుకే ధరలు ఇచ్చేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవటంతో, అధిక శాతం ఉన్న లో గ్రేడ్ మార్కెట్ తలచుకుంటేనే గుబులు పుడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండగా నిలవాల్సిన టుబాకో బోర్డు, పాలకులు రైతును గాలికొదిలేశారు. కంపెనీలు సిండికేట్గా మారి దోపిడీ చేస్తున్నా.. కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ పాలనలో పొగాకు రైతుకు స్వర్ణయుగం... వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనలో పొగాకు రైతుకు స్వర్ణయుగంగా ఉంది. రైతులు పండించిన పొగాకుకు గతంలో ఎన్నడూ లేనంతగా సగటు ధర వచ్చింది. కంపెనీల వారు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటే, వెంటనే మార్క్ఫెడ్కు నిధులిచ్చి పొగాకు కొనుగోలు చేయించారు. దీంతో పలు కంపెనీల వారు చేసేదేమీ లేక పోటీ పడి అధిక ధరలకు పొగాకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో గత సంవత్సరం రూ.274.79 సగటు ధర వచ్చింది. ఈ ఏడు ప్రభుత్వం, బోర్డు పట్టించుకోకపోవడంతో రైతులకు నష్టాలు మిగిలి పొగాకు ధనాగారం వట్టిపోతుందనే ఆందోళన రైతాంగంలో ఉంది.కరువు రైతుపై పొగాకు పోటు గడిచిన ఐదేళ్లూ లాభాల పంటగా అమ్మకాలు గత సంవత్సరం సగటు ధర రూ.274.79 ప్రస్తుతం ధర తగ్గుతుండటంతో ఆందోళన రైతుల వద్ద భారీగా లోగ్రేడ్ పొగాకు నిల్వలు 2 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు పొదిలి వేలం కేంద్రం పరిధిలోని వివరాలు ఇలా... మొత్తం మండలాలు 13 మొత్తం బ్యారన్లు 2,602 మొత్తం రైతులు 4,390 అనుమతించిన విస్తీర్ణం 21,335 ఎకరాలు పొగాకు సాగు విస్తీర్ణం 27,577 అమ్మకాలకు అనుమతి 11.10 మి.కిలోలు ఉత్పత్తి అంచనా 18 మి.కిలోలు ఇప్పటి వరకూ కొనుగోలు 2 మి.కిలోలు నిన్నటి వరకూ కరువు మండలాల రైతుకు పొగాకు సాగు లాభాలు పండించింది. నీటి వనరులు తక్కువగా ఉండడంతో ఏళ్లతరబడి సాగుచేస్తున్న సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి తక్కువ నీటితో సాగయ్యే పొగాకుపై రైతులు దృష్టి సారించారు. ఇటు రైతులతో పాటు రైతు కూలీలకు కూడా మంచి ఆదాయం లభిస్తుండటంతో రైతులు పొగాకు సాగుపై ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ధరలు పడిపోవడంతో పరిస్థితి తలకిందులైంది. దీనిని నమ్ముకున్న రైతులు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయి. సంవత్సరం సాగు విస్తీర్ణం అమ్మకాలు సగటు ధర (ఎకరాలలో) (మిలియన్ కిలోలు) (రూపాయలు) 2019–20 19,305 9.35 104.50 2020–21 14,017 6.91 135.54 2021–22 12,432 6.76 167.16 2022–23 19,497 12.29 214.76 2023–24 20,532 13.00 274.79 ప్రతి సంవత్సరం సగటు ధర పెరుగుతుండటంతో రైతులకు లాభాలు వచ్చాయి. -
జగనన్న పర్యటనను విజయవంతం చేద్దాం
ఒంగోలు టౌన్: వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం విజయవంతం స్ఫూర్తితో పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు జిల్లాకు వస్తున్న పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను కూడా విజయవంతం చేయాలని పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు పిలుపునిచ్చారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ఈ నెల 28వ తేదీ పొదిలి పొగాకు బోర్డు వద్దకు జగన్ వస్తున్నారని తెలిపారు. పొగాకు రైతులకు చరిత్రలో ఎన్నడూ లేనంతగా వైఎస్సార్ సీపీ పాలనలో మంచి గిట్టుబాటు ధర లభించిందని తెలిపారు. కూటమి పాలనలో పొగాకుకు సరైన ధరలు లేక, అమ్ముడుపోక రైతులు అల్లాడుతున్నారని చెప్పారు. అందరికీ ధన్యవాదాలు... వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేసిన జగనన్న సైనికులు ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చుండూరి రవిబాబు తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పార్లమెంటు ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, హాజరైన నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ పెద్దలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశాన్ని బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్రావు, మండల అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, మన్నే శ్రీనివాసరావు, నగర కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ఖాన్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల కమిటీల నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ సీపీ సైన్యానికి ధన్యవాదాలు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు -
కాకాణి అరెస్ట్ దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఒంగోలు సిటీ: ఎవరో ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ కాకాణి అక్రమ అరెస్టును ఖండించారు. ఆదివారం కాకాణిని అరెస్టు చేశామని పోలీసు ధ్రువీకరించారన్నారు. అప్పటి నుంచి ఎక్కడ ఉంచారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న కనీస సమాచారం కూడా లేకుండా గోప్యంగా ఉంచడం చట్టవిరుద్ధమన్నారు. మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు కనీస సమాచారం ఇవ్వాలన్న బాధ్యత పోలీసులకు లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఈ విధంగా అక్రమ కేసులు నమోదు చేయలేదని, గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. కాకాణిపై పెట్టిన అక్రమ కేసుకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చట్టబద్ధంగా పోరాటం చేస్తుందన్నారు. ఈ కేసులో క్లీన్ చీట్తో కాకాణి బయటికి వస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. వైఎస్సార్ సీపీ కేడర్ మొత్తం కాకాణికి అండగా నిలుస్తుందన్నారు. హెచ్ఎంల పదోన్నతులకు నేడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఒంగోలు సిటీ: జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ కింద పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తున్నట్లు డీఈఓ ఏ కిరణ్కుమార్ సోమవారం తెలిపారు. పదోన్నతులకు సంబంధించిన సీనియార్టీ జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచినట్లు చెప్పారు. జిల్లా పరిషత్ యాజమాన్యం కింద 83 ఖాళీలున్నట్లు తెలిపారు. 249 మందితో జాబితా ఉందన్నారు. మొదటిరోజు ఈ నెల 27వ తేదీ 120 మంది, 29వ తేదీ మిగిలినవారి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు. అందరూ హాజరుకావాలని కోరారు. మున్సిపల్ యాజమాన్యం కింద 4 ఖాళీలున్నాయని, 12 మంది జాబితా ఉందని తెలిపారు. ఈ జాబితాలో ఉన్నవారు ఈ నెల 27వ తేదీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యం కింద ఒక ఖాళీ ఉందని, ముగ్గురు జాబితా ఉందని, వీరు ఈ నెల 27వ తేదీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుగు స్కూల్ అసిస్టెంట్లు వారి సేవా పుస్తకం, విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకుని డీఆర్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో హాజరు కావాలని కోరారు. గుంటూరు జోన్–3 పరిధిలో... గుంటూరు జోన్–3 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్యాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, తత్సమానమైన కేడర్లలో పనిచేస్తున్న వారికి ప్రధానోపాధ్యాయులు గ్రేడ్–2గా పదోన్నతి కల్పిస్తున్న సందర్భంగా ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య, గుంటూరు వారి కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు బి.లింగేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వచ్చేవారు తప్పనిసరిగా సేవా పుస్తకాలు, ఒరిజినల్ కుల ధ్రువీకరణ పత్రం, విద్యార్హతల సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. జోన్–3 పరిధిలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు పాత జిల్లాల్లోని ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్లు సీనియారిటీ జాబితాలో సీరియల్ నంబర్ 1 నుంచి 75 వరకు పేర్లున్న వారు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ప్రహసనంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియఒంగోలు సిటీ : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రహనంగా సాగుతోంది. అడుగడుగూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఆన్లైన్ సమస్య పరిష్కరిస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా అడపాదడపా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. సోమవారం వరకూ సుమారు 6,650 మంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. అందులో ప్రధానోపాధ్యాయులు 141 మంది, పీఎస్ హెచ్ఎంలు 149 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి లాగ్వేజస్ 2,660, నాన్ లాంగ్వేజస్ 3700 మంది అన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. -
జగన్ పర్యటనకు ఏర్పాట్లు వేగవంతం
● పనులను పరిశీలించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, నాయకులు పొదిలి రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు ఈ నెల 28వ తేదీ పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పొదిలిలో ఆయన పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జగనన్న పర్యటన ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, మార్కాపురం సమన్వయకర్త అన్నా రాంబాబు, కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి సోమవారం పరిశీలించారు. ముందుగా పొదిలి–దర్శి రోడ్డులోని ఎస్ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద జరుగుతున్న హెలిప్యాడ్ పనులను పరిశీలించారు. నాయకులు, కార్యకర్తలకు సలహాలు, సూచనలు చేశారు. హెలిప్యాడ్ ప్రాంతంలో చెట్ల తొలగింపు, మట్టితోలకం, చదును చేయడం వంటి పనులు వేగవంతం చేయాలని చెప్పారు. జగనన్న పర్యటనకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగా భోజనం, మంచినీరు, తదితరాలను ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందనే దానిపై స్థానిక నాయకులతో చర్చించారు. ఆయా ప్రదేశాలను పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, కొత్తపులి బ్రహ్మారెడ్డి, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు ధరలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు నాగులుప్పలపాడు: రాష్ట్రంలో పొగాకు రైతులతో పాటు ఇతర పంటలు పండించిన రైతాంగానికి మద్దతు ధరలు కల్పించకుండా ప్రభుత్వం వివక్ష చూపుతోందని, అది తగదని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావుమాదిగ అన్నారు. జిల్లాలో గిట్టుబాటు ధరలకు పొగాకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలిలో నేరుగా రైతులతో మాట్లాడనున్నట్లు తెలిపారు. పొగాకు రైతులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సోమవారం నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కనకారావు మాట్లాడారు. ఈ ఏడాది పొగాకు పంట సాగుచేసిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేదన్నారు. గత ప్రభుత్వంలో పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు సిండికేటై ఇలాగే రైతులను ఇబ్బందిపెట్టాలని చూసిన సందర్భంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా మార్క్ఫెడ్ ద్వారా రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు చేయడంతో పాటు రూ.3,500 కోట్లతో రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారన్నారు. తద్వారా మిగతా పంటలకు కనీస మద్దతు ధర ఇప్పించిన ఘనత జగన్మోహన్రెడ్డికి దక్కిందన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంగా రైతులు పడుతున్న తీవ్ర ఇబ్బందులు చూస్తూ కూడా గుడ్డిగా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికై నా ఈ ప్రభుత్వం కళ్లుతెరిచి రైతుల వద్ద ఉన్న పొగాకు పంటతో పాటు మిగతా పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు పొలినేని కోటేశ్వరరావు, రైతు విభాగం మండల అధ్యక్షుడు తగిరిస సుబ్బారావు, గ్రీవెన్సు సెల్ రాష్ట్ర కార్యదర్శి పేరాల చెన్నకేశవులు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జెట్టి శ్రీనివాసరావు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు రేణు, పార్టీ నాయకులు గండు హరిబాబు, యడవల్లి మోహనరావు, రైతులు అక్కి సాంబశివరావు, నల్లూరి సుబ్బారావు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో క్యాన్సర్ నిర్ధారణ పరికరం
ఒంగోలు టౌన్: పీజీ నిధులతో జీజీహెచ్కు మరో సరికొత్త వైద్య పరికరం సమకూరింది. క్యాన్సర్ నిర్ధారణ, నివారణకు ఉపయోగపడే ఇమ్యూనో హిస్టో కెమిస్ట్రీ(ఐహెచ్సీ) పరికరాన్ని సోమవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్, జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీజీ నిధులు రూ.40 లక్షలతో ఐహెచ్సీ పరికరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇమ్యూనో హిస్టో కెమిస్ట్రీ పరికరం క్యాన్సర్ ఏ రకానికి చెందినదో కచ్చితంగా నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. వ్యాధి నివారణకు ఏ రకమైన మందులను ఎంత డోస్ వాడాలి, ఎంత కాలం వాడాలన్నది ఐహెచ్సీ సాయంతో తెలుసుకోవచ్చన్నారు. రోగులకు ఓవర్ డోస్ సమస్య ఉత్పన్నం కాదన్నారు. మహా నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఐహెచ్సీని జిల్లా ప్రజలతోపాటుగా వైద్య రంగంలోని వారు కూడా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు, వివిధ విభాగాల హెచ్ఓడీలు దుర్గాదేవి, సుధాకర్, సుధాకర్ బాబు, కమ్యూనిటీ మెడిసిన్ శ్రీదేవి, మైక్రోబయాలజీ పద్మప్రియ, సర్జికల్ ఆంకాలజిస్ట్ కిషన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
కురిచేడు చేరిన సాగర్ జలాలు
కురిచేడు: జిల్లా ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేసిన సాగర్ జలాలు సోమవారం కురిచేడు చేరాయి. పది రోజులపాటు సరఫరా అయ్యే ఈ నీటితో రక్షిత నీటి పథకాల చెరువులను నింపాల్సి ఉందని, చేపల చెరువులు, నాన్ నోటిఫైడ్ చెరువులకు మళ్లిస్తే చర్యలు తీసుకుంటామని ఎన్ఎస్పీ డీఈఈ అక్బర్బాషా హెచ్చరించారు. సాగర్ ప్రధాన కాలువపై 9 రక్షిత నీటి పథకాలు ఉన్నట్లు తెలిపారు. సాగర్ డ్యాం వద్ద 5,500 క్యూసెక్కులు, 85/3 మైలు జిల్లా సరిహద్దు వద్ద 1793 క్యూసెక్కులు, దర్శి బ్రాంచి కాలువ హెడ్ రెగ్యులేటర్ 126వ మైలు కురిచేడు వద్ద 884 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోందని వివరించారు. -
విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఊరుకోం
● కార్మిక సంఘాల హెచ్చరిక ఒంగోలు టౌన్: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేది లేదని చెబుతూనే కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిలో ప్రయత్నాలు చేస్తోందని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరు రంగారావు విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల రూ.11 వేల కోట్ల నిధులు ఇచ్చినట్లు గొప్పగా చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం 4 వేల మంది కార్మికులను విధుల నుంచి తొలగించిందని, మూడు నెలలుగా వేతనం ఇవ్వకుండా ఆపేయడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి కార్మికులను ఏకం చేసి పోరాడుతామన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చీకటి శ్రీనివాసరావు, ఎస్డీ సర్దార్, పేరయ్య, శేషయ్య, రాంబాబు, రమేష్, తంబి శ్రీనివాసరావు, బీవీ రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు లోన్ పేరుతో రూ.57 లక్షలకు టోకరా
ఒంగోలు టౌన్: బ్యాంకు లోన్ పేరుతో ఒక పరిశ్రమ యజమాని వద్ద రూ.57 లక్షలు కాజేశాడు ఓ కేటుగాడు. చేతిలో ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నాక కానీ తాను మోసపోయానని బాధితుడికి అర్థం కాలేదు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కర వేదికలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నారు. ఒంగోలుకు చెందిన ఒక పరిశ్రమ నిర్వాహకుడిని గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో సంప్రదించాడు. 50 శాతం సబ్సిడీపై బ్యాంకు లోన్ ఇప్పిస్తానని, అందుకుగాను క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరు మీద కొంత నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నమ్మించాడు. వెనకా ముందు ఆలోచించకుండా గుడ్డిగా బాధితుడు రూ.57 లక్షలు ఫిక్స్డ్ చేశాడు. ఆ తర్వాత క్రెడిట్ సొసైటీ గురించి వాకబు చేయగా అలాంటి సంస్థ ఏదీ లేదని తెలిసింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా సదరు వ్యక్తి బెదిరింపులకు దిగాడు. దీంతో ఎస్పీని కలిసి మోసపోయిన తీరును వివరించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆన్లైన్ గేమ్ పేరుతో దగా కనిగిరి పట్టణానికి చెందిన ఒక మహిళ వాట్సప్కు కొంత నగదు ఇన్వెస్ట్ చేసి టెలిగ్రామ్లో గేమ్ అడితే భారీగా డబ్బు గెలుచుకోవచ్చని ఆశ పెట్టారు. ఇదంతా నిజమని నమ్మిన సదరు మహిళ విడతల వారీగా 1.15 లక్షల రుపాయలను ఫోన్ పే చేశారు. అయినప్పటికీ సంతృప్తి చెందని మోసగాడు ఇంకా అదనంగా డబ్బు చెల్లించాలని మెసేజ్ పంపించడంతో మోసపోయినట్లు గుర్తించి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ● విజయవాడ రైల్వే స్టేషన్లో ఔట్సోర్సింగ్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ విజయవాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు 25 వేల రుపాయలు అడ్వాన్స్గా తీసుకున్నారని, ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బు కూడా తిరిగివ్వడం లేదని సంతనూతలపాడుకు చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇలా జిల్లా నలుమూలల నుంచి పోలీస్ గ్రీవెన్స్కు మొత్తం 73 ఫిర్యాదులు అందాయి. బాధితుల సమస్యలు విన్న ఎస్పీ దామోదర్ ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడి చట్టపరంగా అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ సురేష్ బాబు, సీసీఎస్ సీఐ జగదీష్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, డీటీసీ సీఐ షమీవుల్లా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, నాగులుప్పలపాడు ఎస్సై షేక్ రజియా సుల్తానా, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ దామోదర్కు బాధితుడి ఫిర్యాదు పోలీస్ గ్రీవెన్స్కు 73 అర్జీలు -
పోలేరమ్మ ఆలయంలో చోరీ
బాలికపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తి అరెస్టు కంభం: బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు కంభం ఎస్సై బి. నరసింహారావు తెలిపారు. కేసు వివరాలను సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు. వివరాలు.. ఈనెల 23వ తేదీన మండలంలోని జంగంగుంట్ల గ్రామానికి చెందిన మునిగేటి శౌరయ్య అనే వృద్ధుడు అదే గ్రామానికి చెందిన ఓ బాలికకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. అదే రోజు మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక భయపడి కేకలు వేయడంతో వృద్ధుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం కంభం–జంగంగుంట్ల మధ్యలో హైవే రోడ్డుపై కందులాపురం అడ్డరోడ్డు వద్ద నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు. -
రెబల్స్తో తలపోటు!
మేయర్పై తిరుగుబాటు..ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థలో అధికార కూటమి ప్రభుత్వానికి చెందిన కార్పొరేటర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. తొలి నుంచీ టీడీపీలో ఉన్న కార్పొరేటర్లది ఒక మాటైతే.. వైఎస్సార్ సీపీ నుంచి జంప్ జిలానీలుగా మారిన కార్పొరేటర్లది మరో మాటగా ఉంది. మేయర్ జి.సుజాతపై గుర్రుగా ఉన్న జంప్ జిలానీలు గత రెండు రోజులుగా తమ ఆలోచనలకు పదునుబెట్టారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్ సీపీ నుంచి మేయర్తో మొత్తం 16 మందికి పైగా కార్పొరేటర్లు ప్రలోభాలకు లొంగిపోయి టీడీపీ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీలోకి జంప్ అయిన కార్పొరేటర్లు అక్కడ కూడా నిలకడగా ఉంటున్న పరిస్థితి కనిపించడం లేదు. నిన్నామొన్నటి వరకు మేయర్తో అంటకాగిన ఆ కార్పొరేటర్లు ఇప్పుడు ఆమైపె తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 14 మంది కార్పొరేటర్లు ఆదివారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కలిసి మేయర్ను దించేయాల్సిందేనంటూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. వీరితో రెండుసార్లు చర్చలు జరిపిన ఎమ్మెల్యే దామచర్ల సోమవారం ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాల్లో టీడీపీ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నుంచి జంప్ అయిన కార్పొరేటర్లు, మేయర్, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మేయర్కు, పార్టీలో రెబల్స్గా మారిన కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణకు మధ్య అగాధంపై సమావేశంలో ప్రస్థావనకు వచ్చినట్లు సమాచారం. అధికారులకు, మేయర్కు, రెబల్ కార్పొరేటర్లకు మధ్య ఏం జరుగుతోందనే విషయంపై ప్రత్యేకంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే దామచర్ల ఒక పక్క రెబల్ కార్పొరేటర్లను బుజ్జగిస్తూనే మరోపక్క బెదిరింపు ధోరణిని ప్రదర్శించినట్లు తెలిసింది. నగరపాలక సంస్థలో గందరగోళ పరిస్థితులకు ప్రధాన కారణం.. పనుల్లో పర్సెంటేజీలు, కమీషన్లు, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లో వచ్చే వాటాల పంపకాల్లో విభేదాలేనన్నది సమావేశంలో స్పష్టమైంది. పథకాలపై సమీక్ష పేరుతో రెబల్ కార్పొరేటర్లను శాంతింపజేయడమే ధ్యేయంగా సమావేశం సాగినట్లు సమాచారం. ఒంగోలు నగర కార్పొరేషన్లో మేయర్ పదవిపై లొల్లి టీడీపీలో రెబల్స్గా మారిన ‘జంపింగ్’ కార్పొరేటర్లు మేయర్ సుజాతను మార్చాలంటూ ఎమ్మెల్యే వద్ద పంచాయితీ కౌన్సిల్ హాల్లో మీటింగ్.. రెబల్స్కు బుజ్జగింపులతోపాటు బెదిరింపులు వాటాల పంపకాల్లో తేడాతోనే గందరగోళ పరిస్థితికౌన్సిల్ హాలా? పార్టీ ఆఫీసా? నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాల్లో కేవలం టీడీపీ కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయడంపై కూటమి కార్పొరేటర్లే మండిపడుతున్నారు. నగర అభివృద్ధిపై సమీక్ష అని చెప్పి మిగతా కార్పొరేటర్లకు సమాచారం లేకుండా కేవలం టీడీపీ వారినే పిలవడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులను సైతం సమావేశంలో భాగస్వాములను చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెబల్స్ను బుజ్జగించేందుకై తే పార్టీ కార్యాలయంలోనో లేక హోటళ్లలోనో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి కానీ కౌన్సిల్ హాల్లో రాజకీయాలు చేయడం సరికాదని కూటమిలోని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. -
ఒంగోలు నుంచే విజయభేరి
ఒంగోలు టౌన్: ఒంగోలు సభ నుంచే వైఎస్సార్ సీపీ విజయభేరి మొదలైందని, నియోజకవర్గ విస్తృతస్థాయి సభకు తరలివచ్చిన కార్యకర్తలంతా కూటమి పాలకులు వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కలిసికట్టుగా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. గత ఎన్నికల్లో 11 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పటికీ 40 శాతం ఓటింగ్ వైఎస్సార్ సీపీకి ఉందన్నారు. ఇది జగనన్న మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. ఆదివారం ఒంగోలు నగరంలోని సాయి ఐటీఏ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో విజయోత్సవ సభను తలపించింది. కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య జై జగన్ నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ప్రసంగిస్తూ గత జగనన్న ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమ పథకాలు అందజేస్తే.. ప్రస్తుత కూటమి పాలకులు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలంతా సుఖంగా ఉండాలన్న సదుద్దేశంతో సంక్షేమ పథకాల నగదును నేరుగా ప్రజలకు జగనన్న అందజేశారన్నారు. కానీ, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే లక్షన్నర కోట్ల రూపాయల అప్పు చేసి కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రైతులు ఎక్కువగా ఉంటారన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్న విషయాన్ని వివరించారు. శనగ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు శనగలు కొనుగోలు చేశారని, పొగాకుకు గిట్టుబాటు ధరలు అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి ఆదుకున్నారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల బాధలు వినిపించుకోవడం లేదని వైవీ మండిపడ్డారు. ఓట్లేయని వారికి కూడా సంక్షేమ పథకాలిచ్చిన జగనన్న : కారుమూరి నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రసంగిస్తూ తనకు ఓటేసిన వారితో పాటు ఓట్లేయని వారికి కూడా జగనన్న సంక్షేమ పథకాలు అందజేస్తే, కూటమి పాలకులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలను డాక్టర్లుగా నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి తీర్చిదిద్దితే, దానికి నాలుగడుగులు ముందుకేసిన జగనన్న.. చదువుల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టారని కొనియాడారు. అందుకు భిన్నంగా ఫార్టీ ఇయర్స్ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. పార్టీ మారిన కార్పొరేటర్లను చూస్తే జాలేస్తోంది : చెవిరెడ్డి ఎన్నికల తర్వాత వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీల్లోకి వెళ్లిన కార్పొరేటర్లను చూస్తే జాలేస్తోందని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. కూటమి నాయకుల గొడవల మధ్య ఎలాంటి గౌరవం లేకుండా అనామకులుగా వారు కొనసాగుతున్నారని, మాతృపార్టీలోకి తిరిగి రావాలని, తిరిగి వచ్చిన కార్పొరేటర్లను తగిన విధంగా గౌరవిస్తామని అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతోందని, ప్రజల పోరాటాలకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రసంగిస్తూ జగనన్న పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతుల సంక్షేమం కోసం పనిచేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారన్నారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ఒంగోలు ఇన్చార్జి చుండూరి రవిబాబు నాయకత్వంలో ఒంగోలు గడ్డపై వైఎస్సార్ సీపీ విజయపతాకాన్ని ఎగరేయడం ఖాయమన్నారు. ప్రత్యర్థులు సైతం ఉలిక్కిపడేలా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారని చుండూరిని అభినందించారు. జగనన్నను ఎదుర్కొనే శక్తి లేకనే : తాటిపర్తి యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రసంగిస్తూ ఎవ్వరికీ తలవంచని జగనన్నను ఎదుర్కొనే శక్తి లేకనే టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమి కట్టాయని విమర్శించారు. గుంపులుగా వచ్చినప్పటికీ తమ మీద తమకు నమ్మకం లేక చివరకు ఈవీఎంలతో మాయచేసి అధికారంలోకి వచ్చాయని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ములేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై ఇప్పటికే లిక్కర్ కుంభకోణం కేసు ఉందన్నారు. కూటమి పాలనలో బియ్యం, ఇసుక, మద్యం మాఫియాలు రెచ్చిపోతున్నాయని విమర్శించారు. సెకీ ఒప్పందం మీద ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు 2 రూపాయలు అదనంగా రేటు పెట్టి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో రైతులు, వ్యాపారులు నష్టపోతున్నారని, రొయ్యల వ్యాపారానికి క్రాప్ హాలిడే ప్రకటించారని, సినిమా హాళ్లను మూసేస్తున్నారని విమర్శించారు. స్కాములు చేయడం ఒక్కటే చంద్రబాబు పాలనలో జరుగుతోందన్నారు. మాజీ మంత్రి, కొండపి సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే ప్రాణమన్నారు. నాయకులను గెలిపించేది, వారి కోసం త్యాగాలు చేసేది కార్యకర్తలేనన్నారు. త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల సమయంలో తన మీద ఎల్లో మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని, పార్టీ కోసం ఏం చేయడానికై నా తాను సిద్ధమేనని చెప్పారు. మాజీ మంత్రి, సంతనూతలపాడు సమన్వయకర్త మేరుగు నాగార్జున ప్రసంగిస్తూ గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓట్లేసిన వారంతా ఇప్పుడు తప్పు చేసినట్లు బాధపడుతున్నారన్నారు. పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జిల్లాకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ వచ్చి తీరుతారని స్పష్టం చేశారు. మార్కాపురం సమన్వయకర్త అన్నా రాంబాబు ప్రసంగిస్తూ ఒంగోలు సభ జిల్లాకే స్ఫూర్తినిచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఈసారి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ప్రజలను మోసం చేస్తున్న బాబు : జూపూడి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో నాయకులకు కొరత లేదన్నారు. జగనన్న ఇస్తానన్న దానికి రెట్టింపు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒట్టిచేతులు చూపుతున్నారని ఎద్దేవా చేశారు. ఏడాదిన్నర పాలనలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని విమర్శించారు. ప్రపంచ స్థాయి రాజధాని సంగతి దేవుడెరుగు.. కనీసం మంగళగిరి స్థాయి నగరాన్ని అయినా నిర్మించగలరా అని ప్రశ్నించారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ కమిటీలు వేయాలని, పార్టీని అన్నివిధాలుగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన చుండూరి రవిబాబు ప్రసంగిస్తూ సమష్టి కృషితో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. సమావేశం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, కనిగిరి సమన్వయకర్త దద్దాల నారాయణయాదవ్, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఎస్సీసెల్ రాష్ట్ర నాయకుడు కొమ్మూరి కనరారావు, ప్రచార కమిటీ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, నగర అధ్యక్షుడు కటారి శంకర్రావు, వివిధ విభాగాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కార్పొరేటర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తల నడుమ వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం హాజరైన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి, ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు బూచేపల్లి, తాటిపర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మార్మోగిన జగన్ నినాదాలు విజయోత్సవ సభను తలపించిన సమావేశం -
నాగులుప్పలపాడుకు తొలి మహిళా ఎస్సై
● బాధ్యతలు స్వీకరించిన షేక్ రజియా సుల్తానా నాగులుప్పలపాడు: స్థానిక పోలీస్స్టేషన్కు మొదటిసారి మహిళా ఎస్సైను నియమించారు. నూతన ఎస్సైగా షేక్ రజియా సుల్తానా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వర్తించిన బి.శ్రీకాంత్పై పలు ఆరోపణలు రావడం, ఎస్పీ దామోదర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు నాగులుప్పలపాడు స్టేషన్కు ఎస్సైగా రజియా సుల్తానాను నియమించడంతో ఆదివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని తెలిపారు. పోలీస్స్టేషన్ ఏర్పడిన తర్వాత తొలిసారి బాధ్యతలు చేపట్టిన మహిళా ఎస్సైకి సిబ్బంది అభినందనలు తెలిపారు. దళితులపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి ఒంగోలు వన్టౌన్: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మాలలు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు పిలుపునిచ్చారు. ఒంగోలులోని ప్రభుత్వ సముదాయాల కార్యాలయం వద్ద ఆదివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగళరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు, సోషల్ బహిష్కరణలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పలువురు పాల్గొన్నారు. -
పచ్చనేతల తెగింపు.. తహసీల్దార్ బరితెగింపు..!
మర్రిపూడి: టీడీపీ నేతల భూ దాహం, రెవెన్యూ అధికారుల ధన దాహానికి ఆదివారం మర్రిపూడి తహసీల్దార్ కార్యాలయం తలుపులు తెరుచుకున్నాయి. పనిదినాల్లోనే కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చి అరకొరగా పనిచేసి వెళ్లిపోయే తహసీల్దార్ జ్వాల నరసింహారావు ఒక వీఆర్ఓ, మరొక ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్ను దగ్గర పెట్టుకుని భూముల ఆన్లైన్ పనులను బిజీబిజీగా చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయ తలుపులు మూసివేసి మరీ ఆదివారం గుట్టుచప్పుడు కాకుండా భూముల ఆన్లైన్ నమోదు పనులు చేపట్టారు. మర్రిపూడి పరిసరాలలోని పశువుల మేత భూమిని టీడీపీ నాయకుల పేర్లపై ఆన్లైన్ చేస్తున్నట్లు తెలుసుకున్న గ్రామస్తులు నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ను నిలదీశారు. ఎవరి పేరుతో అయితే ఆన్లైన్ చేస్తున్నారో.. వారు హక్కుదారులు కాదని, నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులకు ఆన్లైన్ చేయడం తగదని అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన తమకు అన్యాయం చేయవద్దంటూ వేడుకున్నారు. 60 ఏళ్లుగా తమ స్వాధీనంలో ఉన్న భూములను కాసులకు కక్కుర్తిపడి మరొకరికి ఆన్లైన్ చేయవద్దని అధికారులను కోరారు. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే అధికారులు ఈ తంతు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఇదీ అసలు కథ... మండల కేంద్రమైన మర్రిపూడిలో శ్రీపృధులగిరి లక్ష్మీనృసింహస్వామి కొండ సమీపంలో సర్వే నంబర్ 990–1లో 327.27 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని వెంకటగిరి రాజావారు తన హయాంలో పలు గ్రామాల వారు ఉమ్మడిగా పశువులు మేపుకునేందుకు వదిలారు. విపత్కర పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు పలు గ్రామాలకు చెందిన 57 మంది పేర్లతో అప్పటి రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. ఈ క్రమంలో 57 మంది వంశీకుల వారసులు కొందరు ఆ భూమిని ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్ముకున్నారు. గత టీడీపీ హయాంలో రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. దీంతో అప్పటి జిల్లా కలెక్టర్ ఆ భూమి అక్రమ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం మోపి బ్లాక్లిస్టులో పెట్టారు. ప్రస్తుతం మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు మరోసారి భూ అక్రమాలకు తెరలేపారు. ఆ భూమిని కొందరు హక్కుదారులు సాగుచేసుకుంటుండగా, మరికొంతమంది రైతులు అలాగే వదిలేశారు. మండలంలోని గుండ్లసముద్రం, రేగలగడ్డ, మర్రిపూడి, గంగపాలెం, పొట్టిరెడ్డిపాలెం తదితర గ్రామాలకు చెందిన వారు పశువులు మేపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పశువుల బీడుపై కన్నుపడింది. తెలుగు తమ్ముళ్ల ఒత్తిడితో పాటు కాసులకు కక్కుర్తిపడిన స్థానిక తహసీల్దార్.. ఆదివారం బీడు భూమిని అక్రమార్కుల పేరుతో ఆన్లైన్ పనులు చేపట్టారు. పమిడి రమేష్బాబు పేరుతో సర్వే నంబర్ 990–1సీ20లో 17.10 ఎకరాలు, నల్లూరి శ్రీనివాసరావు పేరుతో సర్వే నంబర్ 990–1సీ24లో 11.40 ఎకరాలు, నేరెళ్ల ఏడుకొండలు పేరుతో 990–1సీ4ఏలో 2.85 ఎకరాలు, 990–1సీ4ఏలో 2.85 ఎకరాలును ఆన్లైన్ చేశారు. విషయం తెలుసుకున్న ఆ భూమి వారసులైన గొంటు హనుమాయమ్మ, గొంటు వెంకట నర్శింహారెడ్డి, సూరే రమణారెడ్డి, మరి కొంతమంది భూహక్కుదారులు వెళ్లి తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఆన్లైన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎఫ్ఎల్ఆర్లో ఉన్న పేర్లకు నకిలీ వారసులను సృష్టించి వారితో రిజిస్ట్రేషన్ చేయించుకుని పాస్పుస్తకాలు మంజూరు చేయడం ఏమిటని మూకుమ్మడిగా తహసీల్దార్ను నిలదీశారు. ఆధారాలను పరిశీలించి ముందుగా తమకు ఆన్లైన్ చేయాలన్నారు. అసలైన వారసులను మీరు ఎలా గుర్తించారో.. మా పొలానికి వారు వారసులు ఎలా అవుతారో చెప్పాలని నిలదీశారు. తమకు అన్యాయం చేయవద్దని వేడుకున్నారు. దీంతో కంగుతిన్న తహసీల్దార్.. ఆధారాలు తీసుకువస్తే పరిశీలిస్తానని చెప్పారు. అయితే, సంబంధిత ఆధారాలను ఇప్పటికే మూడు సార్లు రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు అందజేశామని రైతులు తెలిపారు. దీంతో ఏం చేయాలో అర్థంగాక తహసీల్దార్ వెళ్లిపోయారు. పశువుల మేత భూములు కాజేసేందుకు చక్రం తిప్పిన టీడీపీ నేతలు ఆదివారం కార్యాలయ తలుపులు వేసుకుని మరీ ఆన్లైన్ చేస్తున్న తహసీల్దార్, సిబ్బంది గతంలో కలెక్టర్ హోల్డ్లో పెట్టినప్పటికీ.. నిబంధనలకు తూట్లు కాసులకు కక్కుర్తిపడి గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ పనులు విషయం తెలుసుకుని వెళ్లి నిలదీసిన గ్రామస్తులు తమకు అన్యాయం చేయవద్దంటూ తహసీల్దార్తో గగ్గోలు -
బతుకులు చితికి!
సంవత్సరం పొగాకు సరాసరి ధర 2014–15 రూ.81.37 2015–16 రూ.112.94 2016–17 రూ.116.47 2017–18 రూ.129.96 2018–19 రూ.118.23 అదో పీడకల.. 2014–19 మధ్య పొగాకు రైతులకు అన్నీ కష్టాలే.. ఆ రోజులు తలుచుకుంటేనే రైతు వెన్నుల్లో వణుకుపుడుతోంది. మద్దతు ధరల కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సిందే. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కనీస మద్దతు ధర సరాసరి రూ.118 దాటని పరిస్థితి. నష్టాలు మూటగట్టుకున్న రైతులు పొగాకు సాగుచేయాలంటే భయపడిపోయిన పరిస్థితులు నాడు నెలకొన్నాయి. నేడు అదే పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయి. వేలం ప్రారంభమై 70 రోజులు కావస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా వేలం కేంద్రాల్లో ధరలు రాకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. రైతులకు అండగా నిలవాల్సిన పొగాకు బోర్డు, కూటమి ప్రభుత్వం ప్రకటనలతో కాలక్షేపం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర రోడ్డెక్కి..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలుగుదేశం పాలన అంటనే రైతులకు ఓ శాపంలా మారుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధరల కోసం నిరంతర పోరాటాలు చేయాల్సిందే. అందుకు నిదర్శనం ప్రస్తుతం పొగాకు పంటకు ధరలు లేక రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటయిన పొగాకు రైతుల వెన్నువిరిచేలా చంద్రబాబు పాలనలో ధరలు పతనమయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మార్కెట్ ప్రకారం రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. దీంతో రైతులు మద్దతు ధరల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 2014–19 మధ్య సాగిన చంద్రబాబు పాలనలోనూ పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధరల కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సి వచ్చింది. అయినా రైతులకు మాత్రం మద్దతు ధరలు దక్కిన దాఖలాలు లేవు. దీంతో పొగాకు రైతులు తీవ్ర నష్టాలపాలై పొగాకు పంట సాగుచేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం అదే పరిస్థితులను పొగాకు రైతాంగం ఎదుర్కొంటోంది. నాటి ఐదేళ్లూ తీవ్ర నష్టాలే... చంద్రబాబు పాలనలో పొగాకు రైతులకు ఏనాడూ మద్దతు ధర దక్కిన పాపానపోలేదు. అందుకు 2014–19 మధ్య జరిగిన పాలనలో పొగాకు రైతులకు దక్కిన ధరలే నిదర్శనం. ఉమ్మడి ప్రకాశం జిల్లా కింద మొత్తం 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే.. అంటే 2014–15 సీజన్కు సంబంధించి పొగాకు ధరలు దారుణంగా పడిపోయాయి. అప్పట్లో విదేశీ ఆర్డర్లు రావడం లేదనే కారణంతో పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో పండించిన పొగాకు అతి తక్కువ ధరకు తెగనమ్ముకోవాల్సి వచ్చింది. 2014–15 సీజన్లో జిల్లాలో కేజీ పొగాకు సరాసరి ధర రూ 81.37 మాత్రమే అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అసలు లోగ్రేడ్ రకం పొగాకుకు అయితే కేవలం రూ.45 కూడా రాని పరిస్థితి. ఆ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ దెబ్బతో 2015–16 సీజన్లో పొగాకు సాగుచేసేందుకు రైతులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్లో బోర్డు అనుమతించిన పరిమితి కంటే కూడా రైతులు పొగాకును తక్కువగా పండించారు. సహజంగా మార్కెట్లో ఉత్పత్తులు తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ, ఆ సీజన్లో కూడా పొగాకు రైతులు భిన్నమైన పరిస్థితినే ఎదుర్కొన్నారు. మార్కెట్లో ఆశించిన స్థాయిలో ఉత్పత్తులు లేకపోయినా వ్యాపారులు ధరలు మాత్రం పెంచలేదు. కేవలం ఆ ఏడాది వచ్చిన పొగాకు సరాసరి ధర రూ.112.94 మాత్రమే. దీంతో వరుసగా రెండేళ్లపాటు వచ్చిన తీవ్ర నష్టాలతో అనేక మంది రైతులు పొగాకు సాగు వదిలేసి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక, 2016–17, 2017–18 సీజన్లలోనూ పొగాకు రైతులు మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధరల కోసం ఆ ఐదేళ్ల పాలనలో రైతులు ప్రతిరోజూ రోడెక్కి ధర్నాలు చేశారు. అయినా మార్కెట్లో ధరలు కల్పించడంలో నాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆర్థికంగా చితికిపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి చంద్రబాబు పాలనలో పొగాకు రైతులు ఆనాటి ఐదేళ్ల పాలనలో ఎదుర్కొన్న పరిస్థితులనే ఎదుర్కొంటుండడం గమనార్హం. పొగాకు రైతులకు అండగా వైఎస్ జగన్... చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పొగాకు రైతులు నష్టాల పాలవ్వగా, 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే పొగాకు రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణ చర్యలు తీసుకున్నారు. ఒకానొక సందర్భంలో మార్కెట్ ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రభుత్వం తరఫున మార్క్ఫెడ్ను రంగంలోకి దించి పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయించారు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ వాతావరణం ఏర్పడి తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అదనపు పొగాకు అమ్మకాలపై జరిమానాలను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో రైతులకు అదనపు లాభం కూడా చేకూరింది. గతేడాది వరకు పొగాకు పంటకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు ధరలు దక్కాయి. కేజీ పొగాకు ధర రూ.366 పలకగా, సరాసరి ధర రూ.275 వరకు వచ్చింది. సంవత్సరం తిరిగేలోపు పరిస్థితి తలకిందులైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరోసారి పొగాకు రైతుల పరిస్థితి తారుమారైంది. గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డునపడే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.. గతం తలుచుకుంటేనే భయమేస్తోంది... గతం తలుచుకుంటే భయమేస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 వరకు పొగాకు పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎన్ని ధర్నాలు చేసినా, పొగాకు వేలం నిలిపివేసినా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు. అప్పుడు రైతులు ఇంకో పంట సాగుచేయలేక, వచ్చే ఏడాది ఽఅయినా ధరలు పెరుగుతాయని ఐదు సంవత్సరాలు పొగాకు సాగు చేసి అప్పులపాలయ్యారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరోనా సమయంలో కూడా రైతులు లాభాలు పొందారు. అప్పటి పొగాకు వ్యాపారస్తులు ధరలు లేవని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగా ప్రభుత్వమే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి వ్యాపారుల్లో పోటీ పెంచి రైతులకు మద్దతు ధరలు కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొగాకు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. రైతులు పలు రకాలుగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – ఏలూరి వంశీకృష్ణ, పొగాకు రైతు, పొందూరు గ్రామం, టంగుటూరు మండలం. టీడీపీ గత ఐదేళ్ల పాలనలోనూ పొగాకు రైతులకు దక్కని మద్దతు ధర ధరల కోసం నాటి చంద్రబాబు పాలనలోనూ ఐదేళ్లపాటు రైతుల పోరాటాలు మరోసారి చంద్రబాబు పాలనలో కుదేలవుతున్న పొగాకు రైతులు ప్రస్తుతం పొగాకు వేలంలో ధరలు రాక భారీ నష్టాలు మూటగట్టుకుంటున్న రైతులు ఆదుకునేందుకు కనీస ప్రయత్నం చేయని కూటమి ప్రభుత్వం -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
పొదిలి: ఆర్టీసీ డిపో బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొనకనమిట్ల మండలం బచ్చలకూరపాడు పంచాయతీ మెట్టువారిపల్లి గ్రామానికి చెందిన మెట్టు మాధవరెడ్డి(27) బస్టాండ్ ఎదురుగా సాయిసూర్య లాడ్జిలో పనిచేస్తుంటాడు. ఆదివారం బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని కిందపడి చక్రాలు ఎక్కడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విజయవాడలో ఉంటున్న మాధవరెడ్డి ఇటీవలే స్వగ్రామం వచ్చి లాడ్జిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వవిరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇంటిపై పిడుగు ముండ్లమూరు(కురిచేడు): ముండ్లమూరు మండలంలోని తూర్పు కంభంపాడు గ్రామంలో ఇంటిపై పిడుగు పడింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. గ్రామంలోని తొట్టెంపూడి ధనలక్ష్మి ఇంటిపై కప్పు చివరన పిడుగుపడి కప్పు విరిగి ఇంటిపక్కన భూమిలోకి వెళ్లిపోయింది. ఇంటి పైకప్పు పాక్షికంగా దెబ్బతింది. పిడుగుపాటుకు చుట్టుపక్కల 12 గృహాల్లోని గృహోపకరణాలు షార్ట్ సర్క్యూట్కు గురయ్యాయి. ఇళ్లలోని టీవీలు, ఫ్రీజ్, కూలర్, మిక్సీలు కాలిపోవడంతో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి జేవీవీ కృషిపొదిలి: శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి జన విజ్ఞాన వేదిక 37 ఏళ్లుగా అలుపెరుగని కృషి చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి మురళీధర్ అన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో ఆదివారం జిల్లాస్థాయి విస్తృత సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి గురుస్వామి అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సభ్యత్వ నమోదు పోస్టర్ ఆవిష్కరించారు. మురళీధర్ మాట్లాడుతూ మూఢనమ్మకాల నిర్మూలన కోసం, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, అందరికీ నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం కల్పించాలనే ఆశయ సాధన కోసం జేవీవీని స్థాపించారన్నారు. ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజినీర్లు, మేధావులు, విద్యావంతులు జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరాలని కోరారు.రాష్ట్ర కమిటీ సభ్యులు వి.మాలకొండారెడ్డి, పి.స్వరూపరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక సమస్యలకు సైన్సు మాత్రమే పరిష్కారం చూపిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైన్సుకు, పరిశోధనలకు, అధ్యయనాలకు తగినన్ని నిధులు కేటాయించి ప్రోత్సహించాలన్నారు. జిల్లా మహాసభలను ఆగస్టు 9వ తేదీన గిద్దలూరులో నిర్వహించాలని తీర్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్.జయప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు ఖాజా హుస్సేన్, యు.వెంకటరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూదాల దేవ ప్రసాద్, ఎస్ఎండి.రఫీ, జి.శ్రీనివాసరెడ్డి, ఏ.విశ్వరూపం, వి.వెంకటేశ్వర్లు, ఎస్వి.రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డేగల కన్ను
కొండపోరంబోకు భూములపైభూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. తహసీల్దార్ ఆదేశాల మేరకు భూములు కొనుగోలు చేసిన వారిని, తెచ్చిన వాహనాలను పోలీసులకు అప్పగించాం. భూముల ఆక్రమణలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తాం. – రమాదేవి, వీఆర్ఓ అధికారులకు ముందే చెప్పాను ప్రభుత్వ భూముల్లో బోర్లు వేస్తున్నారని తహసీల్దార్కు రెండు సార్లు ఫిర్యాదు చేశాం. ఒకసారి వీఆర్వోను పంపారు. ఆ సమయంలో బోర్లు వేయలేదు. రాత్రికి రాత్రి బోర్లు వేశారు. మా భూములు కాపాడండి. భూములు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. – మారెళ్ల రామాంజి, గ్రామస్తుడు ఎవరు వచ్చినా అడ్డుకుంటాం .. ప్రభుత్వ భూములు మా నాన్న సర్పంచ్ కాలంలో ఇలాగే ఆక్రమణలు జరిగాయి. అప్పుడు అడ్డుకున్నాం. ఇప్పుడు మళ్లీ ఆక్రమించాలని చూస్తున్నారు. వాటిని కాపాడుకుంటాం. ఎవరు వచ్చి అడ్డుకుంటాం. ప్రభుత్వ కర్మాగారాలకు ఈ భూములను ఉపయోగించుకోవచ్చు. – మారెళ్ల కాశీ వెంకట చెన్నకేశవులు,మాజీ సర్పంచ్ అధికార పార్టీ అండగా..అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోయి తన్నుకుపోతున్నారు. ప్రభుత్వ భూముల సమాచారం సేకరిస్తున్న పెద్దలు ఆ భూములు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఆక్రమణల పర్వం జోరందుకుంది. అధికార పార్టీ నేతల అండ, అధికారుల సహకారంతో వందల ఎకరాలను గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. కురిచేడు: మండలంలోని పెద్దవరం రెవెన్యూ పరిధిలోని కొండపోరంబోకు భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. అధికార పార్టీ అండదండలతో పెద్ద పెద్ద డేగలు ఈ భూములపై వాలాయి. వివరాల్లోకి వెళితే..మండలంలో పెద్దవరం సర్వే నంబర్ 306 లో 630 ఎకరాల కొండపోరంబోకు ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని చాలా మంది ఆ ప్రాంత ప్రజలు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఏకంగా పక్కా జిల్లాల నుంచి ఆక్రమణదారులు రంగప్రవేశం చేశారు. వినుకొండకు చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి సదరు సర్వే నంబర్లోని 67 ఎకరాలను ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన వారికి విక్రయించి రూ.2 కోట్లు దండుకున్నాడు. మండలంలోని ఎన్ఎస్పీ అగ్రహారం గ్రామానికి చెందిన వ్యక్తి మధ్యవర్తిత్వం వహించి ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన చింతోటి వరప్రసాదు, నందిగం మండలం కొత్తబెల్లం కొండవారిపాలెం గ్రామానికి చెందిన పొన్నగంటి రమేష్, విజయవాడ భవానీపురం గ్రామానికి చెందిన చావ మదన్మోహన్, వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన కంతేటి వీరాంజనేయులు, చందర్లపాడుకు చెందిన కె.వెంకటేశ్వరరావు, బెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన కడియాల సుబ్బారావులకు ఆ భూములు విక్రయించారు. ఆ భూముల్లో సాగు చేసేందుకు ఇటీవల కాలంలో సుమారు 9 బోర్లు సైతం వేయించారు. ఈ క్రమంలో ఆదివారం 20 మందికి పైగా వచ్చి ఆ భూముల్లో సాగుకు ప్రయత్నాలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భూమల వద్దకు చేరుకున్నారు. సాగు చేస్తున్న వారిని అడ్డుకొని రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వీఆర్ఓ సంఘటనా స్థలానికి చేరుకొని భూములు సాగుచేసేందుకు వచ్చిన వారిని, వారి వాహనాలు, జనరేటర్, ఇతర మిషన్లను పోలీసులకు అప్పగించారు. గ్రామస్తులను ప్రలోభపెట్టేందుకు.. భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన ఆక్రమణదారుల వద్ద ఎటువంటి పట్టాలు గానీ, ఎటువంటి పత్రాలు లేని లేవు. కానీ గ్రామస్తులను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. కోట్లాను కోట్లు వెచ్చించి తాము కొనుగోలు చేశామని ఒకసారి, లీజుకు తీసుకున్నామని, సాగు చేసుకుంటున్న రైతులు లీజుకు ఇచ్చారని..ఆదినారాయణ లీజుకు ఇచ్చారని, రకరకాలుగా మాట్లాడి అధికారులను, గ్రామస్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. మాకు కూటమి నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని, ఎలాగైనా ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని, అధికారులతో మంతనాలు చేయడం విశేషం. ఈ ఆక్రమణదారులకు అండగా ఉన్న ప్రజాప్రతినిధులు, ఆక్రమణదారులు ఎవరని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అధికారుల అలసత్వం.. గత 20 ఏళ్లుగా ఈ కొండపోరంబోకు భూముల ఆక్రమణలు, వివాదాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వ అదికారులు పటిష్టమైన చర్యలు తీసుకోలేదు. దీంతో తరుచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ కర్మాగారాలకు ఈ భూములు కేటాయించి అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కనీసం ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారులకు కాసుల వర్షం కురిపిస్తున్న కొండపోరంబోకు భూములు 67 ఎకరాలు ఆక్రమించి విక్రయం భూములు స్వాధీనం చేసుకుంటుండగా అడ్డుకున్న గ్రామస్తులు ఆక్రమణదారులకు అధికార పార్టీ నేతల అండ -
టీడీపీ వర్గీయుల బాహాబాహీ..
సాక్షి నెట్వర్క్: జరుగుమల్లి మండలంలోని కె.బిట్రగుంట గ్రామం తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వయోవృద్ధులు, గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయ, దివ్యాంగులు శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి గ్రామంలోని ఒట్టిగుంట శివాజీ వర్గానికి మద్దతు తెలుపుతుండగా, చిమ్మిరి బ్రహ్మయ్య వర్గానికి రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మద్దతు ఇస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో దామచర్ల సత్య, మంత్రి స్వామి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలతో వీరి మధ్య అంతర్గతంగా విభేదాలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా నియోజకవర్గంలో టీడీపీ వారు రెండు వర్గాలుగా విడిపోయారన్న దానికి కె.బిట్రగుంట ఘటనే సాక్ష్యమని ఆ పార్టీ నేతలే ధ్రువీకరిస్తున్నారు. గ్రామానికి చెందిన చిమ్మిరిబ్రహ్మయ్య సర్పంచ్ అభ్యర్థి రేసులో ఉన్నాడు. ఈయన ఆదివారం ఉదయం పశువులకు గడ్డి తీసుకుని మోటారుసైకిల్ పై ఇంటికి ె వెళుతుండగా గ్రామ సెంటర్లో టీ తాగుతున్న శివాజీ అటుగా వెళ్తున్న బ్రహ్మయ్యను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో బ్రహ్మయ్య గడ్డి ఇంటి దగ్గర పడేసి తిరిగి వచ్చే క్రమంలో దారిలో ఒక మహిళతో శివాజీ తనను తిడుతున్నాడని చెబుతుండగా అక్కడికి వచ్చిన శివాజీ తన చేతిలోని కప్పులో ఉన్న టీని బ్రహ్మయ్య మొఖంపై పోసి కాలితో తన్నడంతో అతను మోటారుసైకిల్తో సహా కింద పడిపోయాడు. శివాజీ అంతటితో ఆగకుండా బ్రహ్మయ్యపై దాడిచేస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న మహిళ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వారు వచ్చి శివాజీని పక్కకు లాగటంతో అతను అదుపుతప్పి పడిపోయాడు. తరువాత గాయపడ్డ బ్రహ్మయ్యను 108లో ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా శివాజీ కూడా దెబ్బలు తగిలాయంటూ కొండపి ఏరియా ఆస్పత్రికి 108లో వెళ్లాడు. ఈ ఘటనలో బ్రహ్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ జరిగిన వెంటనే సింగరాయకొండ ఎస్సై బి.మహేంద్ర గ్రామానికి వచ్చి శివాజీకి బందోబస్తుగా ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శివాజీని ఎవరు గాయపరచలేదని అతనే గాయపరచుకుని రక్తం కారిన ఫొటోలు తీయించుకున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల గ్రామంలో చర్చనీయాంశంగా మారిన అంబేడ్కర్ ఊరేగింపును అడ్డుకున్న ఘటనలో బ్రహ్మయ్య వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావటం వెనుక శివాజీ హస్తముందని సత్య వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు ఐదుగురిపై నమోదు కాగా వారిలో ముగ్గురు దామచర్ల సత్య కుటుంబానికి అత్యంత సన్నిహితులని విశ్వసనీయ సమాచారం. కొండపి నియోజకవర్గంలో డోలా, సత్య వర్గాలుగా టీడీపీ సానుభూతిపరులు విడిపోయారని, రానున్న రోజుల్లో వీరి మధ్య ఆధిపత్య పోరు గ్రామస్తులకు, అధికారులకు తలనొప్పిగా మారే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కె.బిట్రగుంటలో ఒకరిపై ఒకరు దాడులు మంత్రి డోలా వర్సెస్, మారిటైం బోర్డు చైర్మన్ సత్య వర్గాలుగా విడిపోయిన టీడీపీ వర్గీయులు గాయపడ్డ ఇద్దరిలో ఒకరు కొండపికి, మరొకరు రిమ్స్కు తరలింపు కె.బిట్రగుంటలో రెండు వర్గాల మధ్య ముదిరిన వివాదం -
ధరల కాటు!
పొగాకు రైతుపైమార్కాపురం / తర్లుపాడు: పొగాకు రైతుల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోంది. కూటమి ప్రభుత్వంలో బయ్యర్లు కుమ్మకై ్క ధరలు తగ్గిస్తుండటంతో గిట్టుబాటు ధరలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. దీంతో వేలం ప్రారంభమై రెండు నెలలు దాటినా ధరల అనిశ్చితి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది భారీగా పెరిగిన పెట్టుబడులకు, వేలం కేంద్రాల్లో వస్తున్న ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. భారీగా పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ఈ ఏడాది పొగాకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో వేలంలో సరైన ధరలు రాకపోవడం, నిత్యం వందల సంఖ్యలో బేళ్లను కొనుగోలు చేయకుండా వ్యాపారులు తిరస్కరిస్తుండటంతో సహనం నశించిన రైతులు తక్కువ ధరకు అమ్ముకోలేక పొగాకును తగులబెడుతున్నారు. మందకొడిగా కొనుగోళ్లు పశ్చిమ ప్రకాశంలో పొదిలి పొగాకు వేలం కేంద్రం పరిధిలో 13 మండలాలు ఉన్నాయి. పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ, బేస్తవారపేట, కంభం, గిద్దలూరు, తర్లుపాడు, అర్ధవీడు, పెద్దారవీడు, కురిచేడు, మార్కాపురం మండలాలు ఉన్నాయి. మొత్తం 4,390 మంది రైతులు పొగాకును సాగు చేస్తున్నారు. 2,601 బ్యార్నీలు ఉండగా అధికారికంగా 8,534 హెక్టార్లలో పొగాకు సాగుచేయగా అనధికారికంగా మరో 2,497 హెక్టార్లలో సాగు చేశారు. మొత్తం 11.10 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు కొనుగోళ్లు మందకొడిగా సాగాయి. వేలంలో వ్యాపారులు కుమ్మక్కవడంతో పోటీ లేక రైతులకు అన్యాయం జరుగుతోంది. ఏడాదిలో అంతా తారుమారు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పొగాకు పంటకు మంచి ధర లభించింది. కానీ ఏడాదిలో అంత తారుమారైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కసారిగా ధరలు దిగజారిపోయాయి. గత ఏడాది కేజీ రూ.360 పైచిలుకు పలకగా ఈ ఏడాది గరిష్ట ధర రూ.280 మించి పలకలేదు. ఇక కనిష్ట ధరలు రోజు రోజుకు నేల చూపులు చూస్తున్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో మార్క్ఫెడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలోకి దిగడంతో వ్యాపారుల మధ్య పోటీ నెలకొంది. దీంతో వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేయడంతో గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగాయి. రైతులకు కాసుల వర్షం కురిసింది. అదే ఉత్సాహంతో ఈ ఏడాది రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ వేలం ప్రారంభమైన రోజు నుంచి నేటి వరకు ధరలు రోజు రోజుకు దిగజారుతూనే ఉన్నాయి. మార్కాపురం మండలంలోని కొండేపల్లి, మిట్టమీదిపల్లి, ఎల్బియస్ నగర్, వేములకోట,వేములపేట, తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం, కలుజువ్వలపాడు, చెన్నారెడ్డిపల్లి, తాడివారిపల్లి, తర్లుపాడు తదితర గ్రామాల్లో పొగాకు సాగుచేశారు. పొగాకు తగులబెడుతున్న రైతులు రోజులు గడుస్తున్నా ధరల్లో మార్పు రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాన్ని బహిష్కరించి పొగాకు బేళ్లను రోడ్డు మీదకు తీసుకువచ్చి తగులబెట్టి నిరసన తెలియజేస్తున్నారు. అయినా రైతుల గోడును ఆలకించే వారే కరువయ్యారు. రాచర్ల మండలం పలుగుంటిపల్లి గ్రామంలో పొగాకు రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక వారం క్రితం తగులబెట్టారు. క్వింటాకు రూ.10 వేల వ్యతాసం గత మూడేళ్లలో మంచి ధరలు రావడంతో ఈ ఏడాది ఎంతో ఆశతో 21 ఎకరాల్లో పొగాకు సాగు చేశాను. గతంతో పోలిస్తే పెట్టుబడులు భారీగా పెరిగాయి. ధర ఉంటే పెట్టుబడులు ఏంముందన్న ఆశతో ఉన్నాం. కానీ వేలం ప్రారంభం నుంచి రైతులను మోసం చేస్తున్నారు. గత ఏడాది రూ.36 వేలు పలికిన క్వింటా ఈ ఏడాది రూ.26 వేలకు కూడా కొనే పరిస్థితి లేదు. క్వింటాకు రూ.10 వేల తేడా ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతారు. పెట్టుబడులు, గిట్టుబాటు ధరల మధ్య భారీ వ్యత్యాసం మందకొడిగా సాగుతున్న కొనుగోళ్లు నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఊహించని ధరలు కూటమి ప్రభుత్వంలో తిరగబడిన పరిస్థితులు– రేగుల అంకయ్య, రైతు -
పొగాకు రైతులపై పచ్చపాతం
పొదిలి రూరల్: కష్టాల్లో ఉన్న పొగాకు రైతులను ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం వారిపై పచ్చపాతం చూపుతోందని, మద్దతు ధర కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ఈ నెల 28వ తేదీ ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి వస్తున్నారని తెలిపారు. జగన్ రాక కోసం హెలిప్యాడ్కు అనువైన స్థలాలను పొదిలి పట్టణంలోని దర్శి రోడ్డులో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదురెడ్డి, స్థానిక తహసీల్దారు కృష్ణారెడ్డితో కలిసి ఆదివారం చెవిరెడ్డి పరిశీలించారు. ఎస్ఎస్ఆర్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న విశాలమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ పొదిలి పొగాకు వేలం కేంద్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. రైతులను ఓదార్చడం, ధైర్యం చెప్పడం, వారి భవిష్యత్ కోసం పోరాటానికి సిద్ధమవడం కోసం ఆయన వస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ బాధలు చెప్పుకోవడానికి రైతులంతా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరికీ కనీస సహాయం అందలేదన్నారు. అన్నదాతలు పండించిన కంది, వరి, మిరప పంటలకు సరైన ధర లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పొగాకు రైతుకు గత నాలుగేళ్లతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బ్యారన్, పొలం కౌలు, పెట్టుబడి బాగా పెరిగిందన్నారు. గతేడాది వచ్చిన ఆదాయంతో పోల్చుకుంటే ఈ ఏడాది రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు చూస్తే రైతులకు దిక్కుతోచడం లేదన్నారు. ఎక్కడచూసినా పొగాకు బేళ్లు అమ్ముడుపోక, పెట్టిన పెట్టుబడి రాక రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. జగనన్న ప్రభుత్వంలో వచ్చిన ధరలు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదన్నారు. రైతుల కోసం మార్క్ఫెడ్ను రంగంలోకి దించి జగనన్న అండగా నిలిచారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లుతెరిచి రైతులకు మేలు చేయాలని కోరారు. పొగాకు పంటకు మద్దతు ధర వచ్చేంత వరకు రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందన్నారు. రైతుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు ప్రతి గ్రామం నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తి: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న పొదిలిలో తలపెట్టిన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపంలో ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. పొగాకు రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నా ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. రైతుల్లో మనోఽధైర్యాన్ని నింపేందుకు పొదిలికి వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మండల రూరల్ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్లు బాపతు వెంకటరెడ్డి, ఎన్.మాణిక్యం, మాజీ మున్సిపల్ చైర్మన్ చల్లా అంకులు, గోపురపు చంద్ర, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మద్దతు ధర కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలు తెలుసుకునేందుకే ఈ నెల 28న పొదిలికి వైఎస్ జగన్ రాక వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదురెడ్డి -
యోగాపై విస్తృతంగా అవగాహన కల్పించాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: యోగాంధ్ర–2025 మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో 10 లక్షల మందికి యోగా సాధనపై అవగాహన కల్పించేలా జిల్లావ్యాప్తంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఒంగోలులోని ప్రకాశం భవనం ఎదురుగా శనివారం ఉదయం ఏర్పాటు చేసిన యోగా రోడ్డులో కలెక్టర్తో పాటు జేసీ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర మేయర్ జి.సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది ప్రజలు పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగా మాసం జరుపుకుంటున్నామన్నారు. అందులో భాగంగా జిల్లాలో 10 లక్షల మందికి యోగా సాధనపై అవగాహన కల్పించే కార్యక్రమానికి రూపకల్పన చేశామని కలెక్టర్ వివరించారు. రోజుకో కార్యక్రమంతో యోగాపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో ఒక రోడ్డును యోగా రోడ్డుగా ప్రకటించి ఆ రోడ్డులో ప్రతిరోజూ ఉదయం యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యోగా సాధన చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ యోగాను జీవన విధానంగా అలవర్చుకోవాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ శాఖ సిబ్బంది, యోగా సాధకులు పాల్గొన్నారు. పాత భవనాల తొలగింపునకు 28న వేలం పాట నాగులుప్పలపాడు: మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో ఏపీ గురుకుల పాఠశాలలో శిథిలమైన భవనాలు తొలగించేందుకు ఈ నెల 28వ తేదీ వేలం పాట నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ కె.మాధవి తెలిపారు. ఆసక్తిగల వారు రూ.10 వేల ధరావత్తుతో పాటు రూ.3,540 ప్రవేశ రుసుంను డీడీ రూపంలో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పాఠశాలలో అందజేయాలని సూచించారు. అనంతరం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 87126 25043 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
పొగాకు రైతుల పరిస్థితి దారుణం
పొదిలి రూరల్: కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. పొగాకు కొనుగోళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా రైతులు పండించిన పంటలు కొనే దిక్కులేదన్నారు. రాష్ట్రంలో పొగాకు పండించే రైతుల పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉందన్నారు. టుబాకో బోర్డు వారు 18 మిలియన్ల పొగాకుకు అనుమతిచ్చి, అందులో కేవలం 20 శాతం.. అంటే 3 వేల మిలియన్లు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. అది కూడా బీ గ్రేడ్ అనే దానికి గతంలో రూ.28 వేల నుంచి రూ.38 వేల మార్కెట్ వరకు జరిగితే.. ఇప్పుడు రూ.18 వేల నుంచి రూ.23 వేల వరకు ఇస్తున్నారన్నారు. రైతులు సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ పొగాకుకు ధర దక్కదని తగలబెడుతున్నారన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడంతో పొగాకు రైతులు లాభాలు పొందారని చెప్పారు. ఎకరాకు రూ.3 లక్షల లాభం వచ్చిందని, ఇప్పుడు ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర నష్టం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బత్తుల తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకును గ్రేడ్లుగా విభజించి రైతులను దివాళా తీయిస్తున్నారన్నారు. రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేంత వరకు వారికి అండగా నిలిచి వైఎస్సార్ సీపీ పోరాడుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఈ నెల 28వ తేదీ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి రానున్న సందర్భంగా హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కేవీ రమణారెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి -
పొగాకు రైతులకు గడ్డుకాలం
టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామానికి చెందిన కె.కోటేశ్వరరావు 20 సంవత్సరాలకుపైగా పొగాకు పంట సాగుచేస్తున్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా ఎకరా పొలంలో పొగాకు సాగుచేయడానికి ఖర్చులు రూ.1.40 లక్షలయ్యేవి. పంట విక్రయించగా, ఆ ఖర్చులుపోను లాభాలు చూసేవాడు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పొగాకు కంపెనీలు కుమ్మకై ధరలు దిగజారుస్తున్న సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్ఫెడ్ను రంగంలోకి దించి పొగాకు రైతులను ఆదుకోవడంతో మూడేళ్లుగా కోటేశ్వరరావు లాభాలు పొందుతూ వచ్చాడు. ఈ ఏడాది పొగాకు సాగుకు ఎకరాకు పొలం కౌలు, కూలి ఖర్చులు, బ్యారన్ కౌలు, తదితరాలన్నీ కలుపుకుని రూ.1.80 లక్షలకుపైనే ఖర్చయింది. దీనికితోడు దిగుబడులు కూడా 30 శాతం తగ్గాయి. వేలం కేంద్రాల్లో పలుకుతున్న ధరలకు లాభాల సంగతి దేవుడెరుగు.. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని కోటేశ్వరరావు ఆందోళన చెందుతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొగాకు రైతులు పలు రకాలుగా నిరసనలు తెలుపుతున్నా పట్టించుకున్న పాపానపోలేదని వాపోతున్నాడు. ప్రస్తుతం పొగాకు రైతులకు గడ్డుకాలం దాపురించిందని, ఏం చేయాలో దిక్కుతోచడం లేదని అంటున్నాడు. -
● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్గా అమరావతి–అనంతపురం హైవే ● మార్కాపురం డివిజన్లో 15 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
మార్కాపురం/కంభం: అనంతపురం–అమరావతి జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. నేషనల్ హైవే కావడంతో గ్రామాల వద్ద క్రాస్ రోడ్లు, మూలమలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో తరుచూ యాక్సిడెంట్లు జరిగి పలువురు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. గిద్దలూరు నుంచి త్రిపురాంతకం వరకు ఉన్న హైవేలో 2022 నుంచి 2024 వరకు మొత్తం 350 రోడ్డు ప్రమాదాలు జరుగగా అందులో 343 మంది చనిపోయారు. 676 మంది క్షతగాత్రులయ్యారు. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న మార్కాపురం మండలం నికరంపల్లి వద్ద మిర్చి కూలీలతో ప్రయాణిస్తున్న టాటాఏస్ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో ఇద్దరు మృతి చెందారు. మార్చి 1న తిప్పాయిపాలెం వద్ద కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏప్రిల్ 5న తిప్పాయిపాలెం వద్ద రోడ్డుదాటుతున్న 10 ఏళ్ల బాలుడు శివకాశిని కారు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ నెల 21న చింతగుంట్ల– కుంట మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధులు మరణించారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపటం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుకోవడం, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలవుతున్నాయి. ముఖ్యంగా గిద్దలూరు నుంచి త్రిపురాంతకం వరకు ఉన్న నేషనల్ హైవేపై తరుచూ రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎక్కువగా గిద్దలూరు–దిగువమెట్ట, గిద్దలూరు–బేస్తవారపేట, మార్కాపురం–కంభం, మార్కాపురం– దేవరాజుగట్టు, దేవరాజుగట్టు–కుంట, కుంట–త్రిపురాంతకం మధ్య ఉన్న నేషనల్ హైవేపై సర్వీసు రోడ్లు సరిగా లేకపోవడంతో టూ వీలర్స్పై వచ్చేవారు రోడ్డెక్కే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. 15 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు మార్కాపురం డివిజన్లో మొత్తం 15 బ్లాక్ స్పాట్స్ను అధికారులు గుర్తించారు. ఇందులో మార్కాపురం మండలం కుంట, పెద్దారవీడు మండలం కుంట, గొబ్బూరు, త్రిపురాంతకం, దరిమడుగు నేషనల్ హైవేపై వై.జంక్షన్ తిప్పాయపాలెం, జంగంగుంట్ల, బేస్తవారపేట క్రాస్ రోడ్స్, గిద్దలూరు, తర్లుపాడు–తాడివారిపల్లి హైవే ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు గుర్తించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ఇటు పోలీసులు.. అటు రవాణాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారి బైకులను ఆపి వారికి జరిమానా విధించడంతో పాటు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పోలీసులు తరుచూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మూలమలుపుల వద్ద బ్లింకింగ్ లైట్లు, స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేశారు. కళాశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. స్పీడ్ గన్తో నేషనల్ హైవేపై రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఓవర్ స్పీడుతో వెళ్లే వారికి జరిమానా విధిస్తున్నారు. డేంజర్ జోన్గా ఎన్హెచ్ 544–డి అనంతపురం–అమరావతి (ఎన్హెచ్ 544–డి) హైవే ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. జాతీయ రహదారి నిర్మాణం అనంతరం రోడ్డు ప్రమాదాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. హైవే నిర్మించిన అధికారులు అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, యూటర్న్, మూలమలుపుల వద్ద లైటింగ్ లేక పోవడం, సూచికలు ఏర్పాటు చేయక పోవడం, హైవే మార్జిన్లు ప్రమాదకరంగా ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు మనం చేసే తప్పిదాలు, పొరపాట్లు మన కుటుంబాలతో పాటు ఎదుటి వారి కుటుంబాల్లో విషాదం మిగులుతోంది. పోలీసులు నిత్యం వాహనాలు తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తున్నా, రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో ఏ మాత్రం చలనం రావడం లేదు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణం మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపటంతో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల సమయంలో నిద్రమత్తులో ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. బేస్తవారిపేట మండలం పూసలపాడు, మోక్షగుండం, చింతలపాలెం, కంభం హైవేలో యూటర్న్, వై.జంక్షన్, జంగంగుంట్ల, మార్కాపురం మండలం తిప్పాయిపాలెం, చింతకుంట్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే..డెత్ వే!నిబంధనలు పాటించాలి వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. మితి మీరిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపకూడదు. రాత్రి వేళ దూరప్రయాణం చేసే వాళ్లు ఎక్కడైనా వాహనాన్ని ఆపుకొని కొద్దిసేపు నిద్రపోయి ఆ తర్వాతే డ్రైవింగ్ చెయ్యాలి. ద్విచక్ర వాహనదారుడు కచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు వాహనాలు ఇచ్చి పంపకూడదు. ప్రమాదాల నివారణకు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. – కె.మల్లికార్జున, సీఐ, కంభం -
కూటమి పొగ!
కొరగాని ధర..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు వేలం కేంద్రాల్లో ఈ ఏడాది ఆరంభ ధరలు చూసి రైతు సంబరపడ్డాడు. గతేడాదిలాగే ఈసారి కూడా లాభాలు మూటగట్టుకోవచ్చని ఆశపడ్డాడు. అయితే, తాజా పరిస్థితులు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. నాలుగేళ్లు లాభాలు చూసిన రైతు నేడు నష్టాల ఊబిలో కూరుకుపోయే దుస్థితి నెలకొంది. ప్రకాశం రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో సుమారు 30 వేల మంది రైతులు పొగాకు సాగుచేస్తున్నారు. పొగాకు బోర్డు ఈ ఏడాది 68,500 హెక్టార్లలో సాగుకు అనుమతివ్వగా పరిమితికి మించి 88 వేల హెక్టార్లలో సాగుచేశారు. బోర్డు అనుమతిచ్చిన పంట ఉత్పత్తి పరిమాణం సుమారు 105.27 మిలియన్ కిలోలు ఉండగా, పంట ఉత్పత్తి అంచనా సుమారు 162 మిలియన్ కిలోలుగా నిర్ణయించారు. రీజియన్ పరిధిలో మార్చి 10వ తేదీ పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు కిలో ధర అత్యధికంగా రూ.280, అత్యల్పంగా రూ.278 పలికింది. రానున్న రోజుల్లో మంచి ధరలు పలికి ఈసారి ఖర్చులు పెరిగినా గట్టెక్కొచ్చని భావించారు. కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయన్న తరుణంలో పరిస్థితి తలకిందులైంది. ధరలు తగ్గిపోవడం, వేలం కేంద్రాలకు వస్తున్న పొగాకు బ్యారన్లలో 40 శాతం వెనక్కిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దళారులు, బయ్యర్లు కుమ్మక్కయ్యారు. నాణ్యత పేరుతో దొంగాట మొదలెట్టారు. వేలం కేంద్రాలకు వచ్చిన వాటిలో 10 శాతం బేళ్లకు మాత్రమే అత్యధిక రేటు.. అంటే రూ.280 చెల్లిస్తూ మిగతా వాటిని వారికిష్టమొచ్చిన రేటుకు తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా బోర్టు అధికారులు పట్టించుకోవడం మానేశారు. దీంతో తెచ్చిన సరుకును వెనక్కి తీసుకెళ్లలేక కొంత మంది రైతులు వచ్చిన రేటుకే తెగనమ్ముకుంటున్నారు. మరికొంత మంది ఆర్థిక భారమైనా కోల్డ్స్టోరేజీలకు తరలిస్తున్నారు. మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో అని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నా వేలం కేంద్రాల సందర్శన, ఆర్భాటపు ప్రకటనలు మినహా ఒరిగిందేమీ లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు ప్రారంభమై దాదాపు 70 రోజులు గడుస్తున్నా ధరలు పుంజుకోకపోవడంతో రైతు పరిస్థితి మరింతగా దిగజారింది. గతేడాది కేజీ గరిష్ట ధర రూ.366... రీజియన్ పరిధిలో గతేడాది కేజీ పొగాకు గరిష్ట ధర రూ.366 పలకగా, ఈ ఏడాది వేలం మొదలై 65 రోజులు దాటుతున్నా ఇంత వరకు గరిష్ట ధర రూ.280కు మించలేదు. గత నాలుగేళ్లలో గరిష్ట ధరలను పరిశీలిస్తే 2020–21లో రూ.184, 2021–22లో రూ.199, 2022–23లో రూ.289, 2023–24లో రూ.366 పలకగా, ఈ ఏడాది.. అంటే 2024–25లో రూ.281 పలికింది. అది కూడా రెండుమూడు బేళ్లు తప్ప కొనుగోలు చేసిన బేళ్ల సరాసరి చూసుకుంటే ఈ ఏడాది రూ.255.35కు మాత్రమే పరిమితమైంది. భారీగా పెరిగిన పెట్టుబడులు... గత నాలుగేళ్లలో పొలాల కౌలు, పెట్టుబడి, బ్యారన్ అద్దెలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దాదాపు 80 శాతానికిపైగా ఖర్చులు పెరిగాయి. గత నాలుగేళ్లలో ఒక్కో బ్యారన్ రైతు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు లాభాలు గడించారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం పలుకుతున్న ధరలు చూసి రైతుల నోట మాట కూడా రావడం లేదు. ఒక్కో బ్యారన్కు సుమారు రూ.3 లక్షలకుపైగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరగడం, పొలాలు, బ్యారన్ల కౌలు, కూలీల ధరలు భారీగా పెరగడంతో సాగు వ్యయంలో సగానికి సగం కూడా రావడంలేదని వాపోతున్నారు. పొగాకు బేళ్లకు పలుకుతున్న ధరలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కేజీ పొగాకు గరిష్టంగా రూ.320 పలికితే రైతులు కొద్దోగొప్పో లాభాలతో బయటపడేవారు. కానీ, ప్రస్తుతం పలుకుతున్న ధరలు గరిష్టంగా రూ.260కు మించి పలకడం లేదు. ఎక్కడో ఒకటో రెండో బేళ్లకు మాత్రం రూ.280 పలుకుతోంది. మార్క్ఫెడ్ ద్వారా రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ సర్కార్... నాలుగేళ్ల కిందట బయ్యర్ల నుంచి సరైన ప్రోత్సాహం లభించక గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్న దశలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మార్క్ఫెడ్ను రంగంలోకి దించి అండగా నిలిచింది. రైతుల దగ్గర నుంచి పొగాకు కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కల్పించడంతో కష్టాల నుంచి గట్టెక్కారు. మార్కెట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పోటీతత్వం పెరగడంతో రైతులు లాభాల బాటపట్టారు. ఆనాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలిచిన విధానాన్ని ఇప్పుడు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రైతులు తీవ్రంగా నష్టాలపాలవుతున్నా వారి గురించి ఆలోచించే మంత్రులే లేరని వాపోతున్నారు. నాడు గుల్లాకుకూ మంచి రేటు... గత నాలుగేళ్లలో రైతులు అనుమతికి మించి పొగాకు సాగుచేసినా.. బోర్డు అధికారులు బయ్యర్లతో కొనుగోలు చేయించారు. గతేడాది (2023–24) 88.69 మిలియన్ కేజీలు కొనుగోలు చేసేందుకు బోర్డు అనుమతిచ్చింది. అయితే, రైతుల నుంచి ఏకంగా 154.41 మిలియన్ కేజీలు కొనుగోలు చేసింది. రైతుల వద్ద చివరిగా మిగిలిన పండాకు, మాడు, పచ్చ, గుల్ల వంటి ఆకును సైతం మంచి ధరకు కొనుగోలు చేశారు. నాలుగేళ్లుగా వచ్చిన పొగాకు ధరలు నేడు కనుమరుగు మార్క్ఫెడ్ను రంగంలోకి దించి రైతులకు అండగా నిలిచిన గత వైఎస్సార్ సీపీ సర్కార్ ప్రస్తుతం 40 శాతానికిపైగా పొగాకు బేళ్ల తిరస్కరణ బయ్యర్లు సిండికేట్ అయినా చోద్యం చూస్తున్న పొగాకు బోర్డు రైతుల కష్టాలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం ఒక్కో బ్యారన్కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల నష్టమంటూ రైతుల ఆందోళన గతేడాది గుల్లాకుకు వచ్చిన ధర నేడు గ్రేడ్–1 ఆకుకు రాని వైనం నష్టాల ఊబిలో కూరుకుపోతున్న పొగాకు రైతుఅమ్ముకోలేక, నిల్వ ఉంచలేక...మార్క్ఫెడ్ను రంగంలోకి దించాలి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పొగాకు ధరలు తగ్గిపోవడంతో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మార్క్ఫెడ్ను రంగంలోకి దించారు. దీంతో వ్యాపారుల్లో పోటీ నెలకొని పొగాకు ధరలు పెంచి కొనుగోలు చేశారు. పొగాకు రైతులు లాభాలు పొందారు. గత నాలుగు సంవత్సరాలుగా వారికి ఎనలేని మేలు జరిగింది. రైతు కుటుంబాల్లో పిల్లల చదువులు, వివాహాలు, ఇతర ఖర్చులకు ఎటువంటి సమస్యా లేకుండా గడిచింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది. దీంతో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను ఆదుకోవాలి. – వెన్నా రామిరెడ్డి, పొగాకు రైతు, గొట్లగట్టు మార్కెట్ మాయాజాలంలో చిక్కుకుని పొగాకు రైతు దగాపడ్డాడు. నాలుగేళ్లుగా లాభాలు చవిచూసిన రైతు పరిస్థితి నేడు తిరగబడింది. గత ధరలను ప్రస్తుత ధరలతో పోల్చుకుంటూ రైతులు ఘొల్లుమంటున్నారు. గతేడాది ఆల్ టైమ్ గరిష్ట ధర రూ.366గా నమోదైంది. ఈ ఏడాది 65 రోజులు గడుస్తున్నా నాణ్యమైన పొగాకు ధర రూ.280 దాటడం లేదు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కవడం, బోర్డు అధికారులు చోద్యం చూస్తుండటంతో కనీస గిట్టుబాటు ధరలు లభించక రైతులు విలవిల్లాడుతున్నాడు. వేలం కేంద్రాల్లో రైతుల నుంచి అరకొరగా కొనుగోలు చేయడం, తడిగా ఉందంటూ, నాణ్యత లేదంటూ సాకులు చెప్పి వెనక్కు పంపడం చేస్తున్నారు. వేలం కేంద్రాలకు వచ్చిన సరుకులో 40 శాతం వెనక్కి పంపిస్తుండడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెట్టిన పెట్టుబడి రాక, నష్టాలు భరించలేక, ప్రభుత్వం చేష్టలుడిగి చోద్యం చూస్తుండటంతో చేసేది లేక నాగులుప్పలపాడు, వెల్లంపల్లి, కొండపి ప్రాంతాల రైతులు వేలం కోసం తీసుకొచ్చిన బేళ్లను ఇంటికి తీసుకెళ్లలేక నడిరోడ్లుపై పడేసి ఆవేదనతో దహనం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమాత్రం చేయూతనివ్వకపోవడంతో జగన్ సర్కార్ కాలంలో పొగాకు రైతులకు అందించిన ధరలను గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడొస్తున్న ధరలతో పోల్చుకుంటూ కుమిలిపోతున్నారు. -
నాగులుప్పలపాడు ఎస్సైపై వేటు
● వీరయ్య చౌదరి హత్య కేసులో అనుమానితులను బెదిరించి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ● అంకమ్మతల్లి కొలుపుల వివాదంలోనూ ఎస్సైపై విమర్శలు ● విచారణకు ఆదేశించిన ఎస్పీ.. దీర్ఘకాలిక సెలవులో ఎస్సై ఒంగోలు టౌన్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో నాగులుప్పలపాడు ఎస్సై శ్రీకాంత్పై వేటుపడింది. శనివారం ఉదయం ఆయనను జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించిన ఎస్పీ ఏఆర్ దామోదర్.. చివాట్లు పెట్టినట్లు తెలిసింది. ఎస్పీ చాంబర్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయినట్లు సమాచారం. పోలీసు డిపార్ట్మెంటుకు సంబంధించిన సిమ్ కార్డును కూడా కార్యాలయంలో అప్పగించినట్లు తెలిసింది. నాగులుప్పలపాడు ఎస్సైగా శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి గత నెల 22వ తేదీ హత్యకు గురయిన కేసు విచారణను ఎస్సై శ్రీకాంత్ తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నాగులుప్పలపాడు మండలానికి చెందిన కొందరు అనుమానితులను పోలీసుస్టేషన్కు పిలిపించి వేధించడమే కాకుండా వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరికొందరికి ఫోన్లు చేసి బెదిరించి కిందిస్థాయి సిబ్బందిని వారి వద్దకు పంపించి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. అంకమ్మతల్లి కొలుపుల్లోనూ భారీగా ముడుపులు... ఇటీవల నాగులుప్పలపాడులో అంకమ్మతల్లి కొలుపుల నిర్వహణ విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొన్న సమయంలోనూ ఎస్సై శ్రీకాంత్ తీరుపై విమర్శలు వచ్చాయి. వైజాగ్ నుంచి వచ్చిన టీడీపీకి చెందిన ఒక వ్యాపారి వద్ద నుంచి భారీగా ముడుపులు తీసుకుని అతడికి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపించాయి. దీంతో స్థానికులు నలుగురు ఆత్మహత్యకు యత్నించడం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆత్మహత్యకు యత్నించిన వారితో పాటు స్థానికులు 16 మందిపై కేసులు బనాయించి ఒక మైనర్ బాలికను పోలీసుస్టేషన్కు పిలిపించి అసభ్యంగా దూషించినట్లు విమర్శలు వచ్చాయి. గత ఫిబ్రవరి నెలలో చేలల్లో మట్టి తోలుకుంటున్న రైతులను కూడా వదిలిపెట్టలేదని ప్రచారం జరిగింది. డబ్బులిచ్చిన తర్వాతే మట్టి తోలుకోవాలని రైతులను ఇబ్బందులకు గురిచేయడంతో వారంతా నాగులుప్పలపాడు పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఇక, అధికార పార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోయిన ఎస్సై శ్రీకాంత్.. పేకాటరాయుళ్లు, కోడిపందేల నిర్వాహకులు, బెల్టుషాపుల వ్యాపారస్తుల నుంచి కూడా భారీగా డబ్బులు పిండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్సై శ్రీకాంత్ వ్యవహారాన్ని ఎస్పీ ఏఆర్ దామోదర్ సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. -
చిన్నారులను రక్షించిన వ్యక్తికి రివార్డు
కొమరోలు: తాటిచెర్లమోటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికి చేరుకున్న తాటిచెర్ల గ్రామానికి చెందిన పాశం బాలవెంకటరెడ్డి చిన్నారుల ఆర్తనాదాలు విని కారు వెనుక వైపు డోరు అద్దాలు పగులగొట్టాడు. చిన్నారులు జీతన్, శిరీషలను బయటకు తీసి వెంటనే గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించేందుకు కృషి చేశాడు. ఈ విషయాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు దృష్టికి ఎస్సై నాగరాజు తీసుకెళ్లారు. బాలవెంకటరెడ్డికి డీఎస్పీ నగదు రివార్డును ప్రమాద స్థలంలో శనివారం అందించి అభినందించారు. బాలవెంకటరెడ్డి సాయం వెలకట్టలేనిదని కొనియాడారు. స్థానికులు కూడా ఆయన్ను అభినందించారు. -
మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం
కొమరోలు: తాటిచెర్లమోటు కారు ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని మార్కాపురం డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. ఆర్టీఓ అల్లం మాధవరావుతో కలిసి శనివారం ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన కారును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం 120 కిలోమీటర్లు ఉందని స్పష్టం చేశారు. కారు వేగంగా వెళ్లి లారీని ఢీకొనడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. వాహనాలను నిర్లక్ష్యంగా, వేగంగా ఎవరూ నడపొద్దని సూచించారు. నేషనల్ హైవే ప్రాజెక్టు మేనేజర్ మల్లికార్జునరెడ్డి, ఆర్అండ్బీ డీఈ ఎం.నరసింహులు, గిద్దలూరు, కంభం సీఐలు రామకోటయ్య, మల్లికార్జున, ఎస్సైలు రవీంద్రరెడ్డి, నాగరాజు, కోటేశ్వరరావు, సుదర్శన్ పాల్గొన్నారు. ప్రమాద సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు రాంగ్ రూటులో లారీని బలంగా ఢీకొట్టిన కారు వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు -
ముగిసిన పోస్టుమార్టం
కొమరోలు: మండలంలోని తాటిచెర్లమోటు సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే. బాపట్ల జిల్లా స్టూవర్టుపురం గ్రామానికి చెందిన గజ్జల అంకాలు (40), గజ్జల భవాని (25), గజ్జల నరసింహులు (20), గజ్జల జనార్దన్ (30), బొచ్చు సన్ని (30), కర్రెద్దుల దివాకర్ (30) మృతి చెందగా మృతదేహాలను పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న మృతుల బంధువులు స్టూవర్టుపురం నుంచి గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం వైద్యులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం ఆరు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఓ ప్రైవేట్ అంబులెన్స్లో మృతదేహాలను స్టూవర్టుపురానికి తరలించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారితో పాటు జీతన్, శిరీషలు ఆ కారులోనే ప్రయాణిస్తున్నారు. గాయపడిన వీరికి గిద్దలూరు వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తరలించినట్లు స్థానిక ఎస్సై నాగరాజు తెలిపారు. మృతదేహాలు బంధువులకు అప్పగింత స్వగ్రామానికి ప్రైవేట్ వాహనంలో తరలింపు -
జిల్లాలో విద్యుత్ బకాయిలు రూ.600 కోట్లు
మార్కాపురం: జిల్లాలో సుమారు 600 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నాయని, వీటి వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని ఆ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం మార్కాపురం ఈఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు రెండు టన్నెల్స్ విద్యుత్ బకాయిలు సుమారు రూ.97 కోట్లు ఉన్నాయని, ఇంకా ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ల నుంచి అధిక మొత్తంలో బకాయిలు వసూలు కావాల్సి ఉందని చెప్పారు. జిల్లాకు 1200 ట్రాన్స్ఫార్మర్లు అవసరం కాగా ఇప్పటి వరకు 300 వచ్చాయని, మిగిలినవి మరో మూడు నెలల్లో వస్తాయని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో వెయ్యి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని ఇంకా 2,500 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. మార్కాపురం డివిజన్లో 600 మంది రైతులకు వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని, ఇంకా 1200 మంది రైతులకు ఇవ్వాల్సి ఉందని వివరించారు. సబ్స్టేషన్లు మంజూరు గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు మండలంలోని కసినేపల్లి, రాచర్ల మండలంలోని మేడవారిపల్లి, పొదిలిమండలంలోని ఏలూరు, కురిచేడు మండలంలోని కల్లూరు, యర్రగొండపాలెం మండలంలోని గండిబావి చెరువు, కందుకూరు మండలంలోని మన్నేటికోట, కనిగిరిలోని గార్లపేట రోడ్డు, సంతనూతలపాడు మండలంలోని బూదవాడ, ఒంగోలులోని మంగమ్మ కాలేజీ వద్ద, ఒంగోలు పట్టణంలోని హౌసింగ్ బోర్డులో, టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలో విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు కాగా వీటిలో కొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. పశుపోషకులకు నష్టపరిహారం ఇస్తాం మార్కాపురం మండలంలోని తిప్పాయిపాలెం–చింతగుంట్ల గ్రామాల మధ్య హెచ్టీ విద్యుత్ లైన్లు తగిలి 18 గేదెలు మృతి చెందాయని, వీటి యజమానులకు ఒక్కో గేదెకు రూ.40 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ఎస్ఈ పేర్కొన్నారు. శుక్రవారం డీఈ, ఏడీఈ, ఏఈతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి పశుపోషకులతో మాట్లాడినట్లు తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రజలు కూడా రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వాడకం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే సమయంలో ఇంట్లో గీజర్, హీటర్, ఇతర విద్యుత్ ఉపకరణాలు వినియోగించవద్దని స్పష్టం చేశారు. అనంతరం డివిజన్లోని విద్యుత్ అఽధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఈఈ నాగేశ్వరరావు, ఎడిఈ సియా నాయక్, ఏఈలు నాగేందర్రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చింతగుంట్ల వద్ద్ద మృతి చెందిన గేదెలకు పరిహారం ఇస్తాం వర్షా కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విద్యుత్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు -
సత్తాచాటిన బసినేపల్లె ఎడ్లు
బేస్తవారిపేట: మండలంలోని చింతలపాలెం వీరాంజనేస్వామి ఆలయం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బేస్తవారిపేట మండలం బసినేపల్లెకు చెందిన వెంకట చైతన్యకుమార్ ఎడ్లు, గిద్దలూరు మండలం బురుజుపల్లెకు చెందిన వెంకట సోహిత్ ఎడ్లు, రాచర్ల మండలం కుంటకాడిపల్లికి చెందిన దందూరి శ్రీనివాసులు, బి.భూపాల్ సంయుక్త ఎడ్ల జత, కంభం మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన హేమలత నాయుడు ఎడ్లు వరుసగా మొదటి, రెండో, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున దాతల చేతులమీదుగా అందజేశారు. -
రైలు నుండి జారిపడి వృద్ధుడు మృతి
కురిచేడు: రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన కురిచేడు–గుండ్లకమ్మ రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. నంద్యాల–గుంటూరు మార్గంలో 103–15–16 మైల్ స్టోన్ వద్ద రైల్వే ట్రాక్పై శుక్రవారం ఓ వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. వృద్ధుడి మృతదేహంపై తెల్లని చొక్కా, తెల్లని పంచె ఉన్నాయి. వయసు సుమారు 60 ఏళ్లు ఉండవచ్చని అంచనా. మృతదేహాన్ని రైల్వే పోలీసులు వినుకొండలోని మార్చురీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసిన వారు 9440438256, 7013600365ను సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.నర్సాపూర్–హుబ్లీ రైళ్లకు అదనపు బోగీలుమార్కాపురం: ఈనెల 29వ తేదీ నుంచి మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే నర్సాపురం–హుబ్లీ, నర్సాపురం–అమరావతి ఎక్స్ప్రెస్(నంబర్లు : 17225/17226) రైళ్లకు రెండు ఏసీ 2 టైర్, ఒక స్లీపర్ అదనపు బోగీలను శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటు చేస్తున్నారని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్యూసీసీ మెంబర్ ఆర్కేజే నరసింహం తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్కాపురం మీదుగా వెళ్లే మచిలీపట్నం–యశ్వంత్పూర్, మచిలీపట్నం–కొండవీడు ఎక్స్ప్రెస్ రైలుకు శాశ్వత ప్రాతిపదికన ఒక అదనపు ఏసీ త్రీటైర్ బోగీ అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఇందులో ఒక ఏసీ ఫస్ట్ క్లాస్, 2 ఏసీ టూటైర్, 7 ఏసీ త్రీటైర్, 6 స్లీపర్, ఒక జనరల్, ఒక బ్రేక్ వ్యాన్, ఒక పవర్కార్ బోగీలు ఉంటాయని వివరించారు. మార్కాపురం మీదుగా గుంటూరు–తిరుపతి ఎక్స్ప్రెస్కు ఈనెల 27 నుంచి శాశ్వత ప్రాతిపదికన ఒక స్లీపర్, ఒక జనరల్ బోగీని అదనంగా రైల్వే అధికారులు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈనెల 25నుంచి మార్కాపురం మీదుగా వెళ్లే గుంటూరు–ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ రైలుకు మరొక అదనపు స్లీపర్ బోగీని శాశ్వత ప్రాతిపదికపై రైల్వే అధికారులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. -
అంబేడ్కర్ను అవమానించినా కేసుల్లేవ్
జరుగుమల్లి(సింగరాయకొండ): రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గంలో అంబేడ్కర్ ఊరేగింపును అడ్డుకున్నా పోలీసులు చర్యలు తీసుకోకుండా ఓ వర్గానికి కొమ్ముకాయడం దారుణమని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. జరుగుమల్లి మండలం కె బిట్రగుంట గ్రామంలో ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ఊరేగింపును అడ్డుకున్న అగ్రవర్ణాల వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై బి.మహేంద్రను సస్పెండ్ చేయాలని కోరుతూ శుక్రవారం దళిత సంఘం నాయకుడు నీలం నాగేంద్రం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కె.బిట్రగుంటలో బుధ్దుడు, అంబేడ్కర్ చిత్రపటాల ఊరేగింపును అగ్రవర్ణాల వారు అడ్డుకున్న సమయంలో సింగరాయకొండ సీఐ సీహెచ్ హజరత్తయ్య, జరుగుమల్లి ఎస్సై బి.మహేంద్ర వచ్చి దళితులకు సూక్తులు చెప్పారే తప్ప కార్యక్రమ నిర్వహణకు సహకరించలేదని ఆరోపించారు. దీనిపై ఏప్రిల్ 29వ తేదీన ఫిర్యాదు చేసినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో దళితులు అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్స్టేషన్లో వినతిపత్రం అందజేశారు. పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అధికార పార్టీ నేతలకు తొత్తుగా మారిన ఎస్సైని సస్పెండ్ చేయాలి దళిత మంత్రి స్వామి నియోజకవర్గంలో ఘటన జరగడం దారుణం జరుగుమల్లి పోలీస్ స్టేషన్ వద్ద దళిత సంఘాల ధర్నా -
తిరస్కారమే పరిష్కారమా?
పొగాకుకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు.. మాటలతో మభ్యపెడుతున్న పాలకులు పొదిలి: పొగాకు రైతులతో వ్యాపారులు బంతాట ఆడుతుండగా రాష్ట్ర ప్రభుత్వం గుడ్లప్పగించి చోద్యం చూస్తోంది. మద్దతు ధర కల్పిస్తామని మాయమాటలు చెబుతూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కాలం వెళ్లబుచ్చుతున్నారే కానీ.. వ్యాపారులు, రైతులకు మధ్యేమార్గంగా వ్యవహరించి ఓ నిర్ణయం తీసుకోకుండా జాగు చేస్తున్నారు. ప్రస్తుతం పొగాకు వేలం కేంద్రాల్లో పరిమాణాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తొలుత ఆశాజనకంగా ప్రారంభమైన పొగాకు వేలం ప్రక్రియ రోజుల వ్యవధిలోనే రైతుల ఆశలను అడియాసలు చేసింది. వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను దించడంతో ఏమి చేయాలో దిక్కుతోచక రైతులు సతమతం అవుతున్నారు. వేలానికి ఉంచిన బేళ్లు భారీగా తిరస్కరణకు గురవుతుండటం, మరో వైపు మద్దతు ధర లేకపోవడంతో పొగాకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పొదిలిలో పొగాకు వేలం తీరు రైతుల ఆందోళనను రోజురోజుకూ పెంచుతోంది. ధరలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన ఒక వైపు, మరో వైపు రిటర్న్ బేళ్ల టెన్షన్ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మండుతున్న ఎండల్లో బేళ్లను వేలం కేంద్రానికి పదే పదే తీసుకురాలేక రైతులు వ్యయ ప్రయాసాలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పొగాకు బేళ్ల తూకంతోపాటు నాణ్యత తగ్గిపోతుండటంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొదిలి వేలం కేంద్రానికి ఈ నెల 22వ తేదీ వరకు 36,586 బేళ్లను తీసుకురాగా 25,886 బేళ్లు కొనుగోలయ్యాయి. గత బుధవారం ఒక్క రోజే 829 బేళ్లను రైతులు వేలంలో ఉంచగా 310 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రిటర్న్ బేళ్లను స్థానికంగా నిల్వ చేసే అవకాశం లేక, తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీకావు. కొంత మంది రైతులు మాత్రమే ఒక్కో బేల్కు రోజుకు రూ.10 చొప్పున అద్దె చెల్లిస్తూ వేలం కేంద్రం సమీపంలో నిల్వ చేసుకుంటున్నారు. మిగిలిన వారికి ఆ అవకాశం లేక బేళ్లను తీసుకుని ఇంటి బాట పడుతున్నారు. తిరస్కరించినవి 25 శాతం పొదిలి వేలం కేంద్రానికి ఇప్పటి వరకు వచ్చిన మొత్తం బేళ్లలో సుమారు 25 శాతం తిరష్కరణకు గురయ్యాయి. వ్యాపారులు ఎఫ్ 1, ఎఫ్ 2 రకాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సుమారు 30 శాతం మేర ఈ రెండు రకాలే ఉండటంతో మిగిలిన బేళ్ల పరిిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులపై రూ.50 లక్షల అదనపు భారం వివిధ కారణాలతో తిరస్కరణకు గురైన బేళ్లను రైతులు ఇంటికి తీసుకెళ్లి మళ్లీ వేలం కేంద్రానికి తీసుకురావాలంటే సగటున రూ.500 వరకు ఖర్చు అవుతోంది. ఈ లెక్కన రైతులు ఇప్పటి వరకు సుమారు రూ.50 లక్షల మేర అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. మున్ముందు ఈ అదనపు వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. రిటర్న్ బేళ్లను మళ్లీ వేలంలో ఉంచినా నాణ్యతకు తగిన ధర ఇచ్చి కొనుగోలు చేస్తారనే నమ్మకం రైతుల్లో సన్నగిల్లిపోతోంది. పొదిలి కేంద్రంలో వేలానికి ఉంచిన బేళ్లు 36,586 వ్యాపారుల తిరస్కరణకు గురైనవి 10,031 మండుతున్న ఎండలతో తగ్గుతున్న బేళ్ల తూకం, నాణ్యత రిటర్న్ బేళ్లను తిరిగి వేలానికి తేవాలంటే అధిక భారం పొదిలి వేలం కేంద్రంలో రిటర్న్ బేళ్ల వివరాలు ఇలా.. (నోట్ : ఈ నెల 22వ తేదీ వరకు) మొత్తం వేలానికి ఉంచిన బేళ్లు 36,586 కొనుగోలు చేసినవి 25,886 రిటన్ బేళ్లు 10,031 నో సేల్ 1,56 నో బిడ్ 7,127 రైతు రిజక్షన్ 1,022 కంపెనీ రిజెక్షన్ 1,712 బీఆర్ 14 జంపింగ్ బేళ్లు 669 -
స్పర్శ్ సమస్యల పరిష్కారానికి కృషి
● సైనిక్ వెల్ఫ్ర్ డైరెక్టర్ వీవీ రెడ్డి కంభం: స్థానిక మాజీ సైనికుల సంఘం కార్యాలయాన్ని శుక్రవారం సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ వీవీ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పర్శ్ సమస్యలు పరిష్కరించడం కోసం జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మాజీ సైనికుల సంఘ అధ్యక్షుడు శెట్లం వేణుగోపాల్ మాట్లాడుతూ.. మాజీ సైనికులకు ఇంటి పన్ను ఎలాంటి షరతులు లేకుండా మినహాయింపు ఇవ్వాలని, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందజేసేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సైనికులు పుల్లయ్య, పోలయ్య, సంకతాల ప్రసాద్, మస్తాన్వలి, పాండు రంగయ్య, రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుల ఎంపిక ఒంగోలు: జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఒంగోలులోని భారత జాతీయ వ్యాయామ కళాశాలలో ఆదివారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.భక్తధృవుడు ఓ ప్రకటనలో తెలిపారు. పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ విభాగాల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ బాలబాలికలు, మాస్టర్స్ సీ్త్ర, పురుష క్రీడాకారులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, వయసు ధ్రువీకరణ పత్రం వెంట తీసుకురావాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 31 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వివరాలకు 8142555000ను సంప్రదించాలని సూచించారు. సీఐపై దాడి కేసులో నిందితుల అరెస్టు ఒంగోలు టౌన్: విధి నిర్వహణలో ఉన్న ఒంగోలు టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావుపై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు శుక్రవారం కటకటాల్లోకి నెట్టారు. ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున కర్నూలు బైపాస్లోని ఒక హోటల్ వద్ద గొడవ చేస్తున్న యువకులను అదే సమయంలో అటుగా వచ్చిన టూటౌన్ సీఐ మందలించారు. పీకలదాకా తప్పతాగిన ఆ యువకులు ఎదుట ఉన్నది పోలీస్ అధికారి అనే స్పృహ లేకుండా అనూహ్య రీతిలో దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న యువకులు దాడి చేయడంతో సీఐ తలకు గాయమైన సంగతి పాఠకులకు తెలిసిందే. కాగా, పరారైన నిందితులు కొత్తపట్నం మండంల ఆలూరు గ్రామానికి చెందిన తూముకూరి చంద్రశేఖర్, ఒంగోలు నగరంలోని కొప్పోలుకు చెందిన పాటూరి ప్రశాంత్ కుమార్, క్లౌపేటకు చెందిన దొడ్డి స్టీఫెన్ రాజాగా గుర్తించిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహం సింగరాయకొండ: ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్లే రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి(47) మృతి చెందిన సంఘటన శుక్రవారం సింగరాయకొండ మండల పరిధిలోని దేవి సీ ఫుడ్స్ సమీపంలో వెలుగుచూసింది. ఒంగోలు జీఆర్పీ ఎస్సై కె.మధుసూదనరావు కథనం ప్రకారం.. మృతునికి సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. శరీరంపై మెరూన్ రంగు చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాగా ఇతను రైల్లో నుంచి జారిపడ్డాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న విషయంపై విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9440627647కు సమాచారం అందించాలని కోరారు. లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు మద్దిపాడు: లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం సాయంత్రం మద్దిపాడు మండలంలోని బెల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. వడ్లమూడి సరోజనమ్మ(70) తమ సుగ్రామమైన మేదరమెట్ల నుంచి వెల్లంపల్లికి బయలుదేరింది. జాతీయ రహదారిపై దిగి అక్కడ నుంచి వెల్లంపల్లి వెళ్లడానికి జాతీయ రహదారి దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో సరోజనమ్మ తల వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు మద్దిపాడు 108 వాహన సిబ్బంది వృద్ధురాలిని ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. మద్దిపాడు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
‘ఉపాధి’ అక్రమాలపై విచారణ.. ఇలాగేనా?
కొనకనమిట్ల: కొనకనమిట్లలో ఇటీవల చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో దొంగ మస్టర్లు వేసి అవకతవకలకు పాల్పడిన వైనంపై ఏపీడీ విచారణకు రాగా ఓ వర్గం మోకాలడ్డింది. పనుల్లో అక్రమాలకు పాల్పడి ప్రజాధనం దుర్వినియోగం చేశారని గ్రామనికి చెందిన పలువురు ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీడీ లలిత కుమారి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ.. పనులకు రానివారికి, గ్రామంలో లేనివారికి మస్టర్ వేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదు అందిందని తెలిపారు. విచారణ నివేదికను జిల్లా అధికారులకు అందజేయనున్నట్లు చెప్పారు. ఆమె వెంట ఏపీఓ బుల్లెన్నరావ్ ఉన్నారు. పాత ఫీల్డ్ అసిస్టెంట్పై దౌర్జన్యం ఏపీడీ విచారణ చేసి వెళ్లిన తర్వాత ఓ వర్గం వారు మాజీ ఫీల్డ్ అసిసెంట్పై దౌర్జన్యానికి దిగారు. తమపైనే ఫిర్యాదు చేయిస్తావా అంటూ హెచ్చరించారు. కాగా విచారణ పేరుతో గ్రామంలోకి వచ్చిన ఏపీడీ చేసిందేమీ లేదని పలువురు ఆరోపించారు. ఏపీడీని ఫీల్డ్కు వెళ్లనీయకుండా ఓ వర్గం వారు సచివాలయంలో కూర్చోబెడితే అక్రమాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ తరుణంలో సచివాలయం నుంచి వెళ్లిన ఏపీడీ ఓ ఫిర్యాదుదారుడిని మండల పరిషత్ కార్యాలయంలో విచారణకు రావాలని పిలిచారు. కూటమి నాయకులు దాడికి పాల్పడతారనే ఉద్దేశంతో అతను ఏపీడీ పిలుపును తిరస్కరించినట్లు సమాచారం. మాజీ ఫీల్డ్ అసిస్టెంట్తో గొడవ పడుతున్న ఓ వర్గం వారు ఏపీడీ క్షేత్రస్థాయిలో పర్యటించకుండా మోకాలడ్డు సచివాలయంలో కూర్చోబెట్టి అక్రమాల్లేవని చెప్పే యత్నం -
మృతదేహాలను వెలికితీసి
● కొమరోలు రోడ్డు ప్రమాదంలో లారీ కిందకు సగభాగం దూసుకెళ్లిన కారు ● కారు ముందు సీట్లలో ఇరుక్కుపోయిన మృతదేహాలు జేసీబీ సాయంతో వెలికితీత ● మొత్తం ఆరుగురు మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు ● అందరూ బాపట్ల జిల్లా స్టూవర్టుపురానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు ● కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా నిర్ధారించిన పోలీసులు ● వైరల్ అవుతున్న సీసీ టీవీ ఫుటేజ్ అరగంట శ్రమించి.. జేసీబీ సహాయంతో కారును వెనక్కు లాగిస్తున్న పోలీసులుకొమరోలు: ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందిన సంఘటన జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై కొమరోలు మండలంలోని తాటిచెర్లమోటు సమీపంలో హెచ్పీ పెట్రోలు బంకు వద్ద శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో చోటుచేసుకున్న పలు విషయాలు జిల్లావాసులను ఉలికిపాటుకు గురిచేశాయి. డ్రైవర్ కర్రెద్దుల దివాకర్ కారును అతివేగంగా నడపడం కారణంగా లారీని ఢీకొట్టి సగభాగం వరకూ లారీ కిందకు కారు దూసుకెళ్లింది. దీంతో కారు ముందు సీట్లలో ఉన్న డ్రైవర్ దివాకర్, పక్క సీటులో ఉన్న బొచ్చు సన్ని మృతదేహాలు ఇరుక్కుపోయాయి. వారి మృతదేహాలను కారులో నుంచి బయటకు తీసేందుకు జేసీబీ సహాయంతో అరగంటపాటు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. రెండు మృతదేహాలు ఛిద్రమైపోయి భయాందోళన కలిగించేలా ఉన్నాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దం... డ్రైవర్ దివాకర్ అతివేగంగా కారు నడుపుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించినట్లు రోడ్డుపక్కన పెట్రోలు బంకులో ఉన్న వ్యక్తులు తెలిపారు. అతివేగం కారణంగా లారీని బలంగా ఢీకొని లారీ కిందకు సగభాగం వరకు కారు దూసుకెళ్లడంతో ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదం అంతా పెట్రోలు బంకులోని సీసీ టీవీలో రికార్డయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బాపట్ల జిల్లా స్టూవర్టుపురం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. గజ్జల అంకాలు (40), గజ్జల భవాని (25), గజ్జల నరసింహులు (20), గజ్జల జనార్దన్ (30), బొచ్చు సన్ని (30), కర్రెద్దుల దివాకర్ (30) మృతిచెందారు. మరో ఇద్దరు చిన్నారులు జీతన్, శిరీషలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడు జీతన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలించారు. చిన్నారి శిరీష ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ కలహాలపై చర్చించి పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుండగా... బాపట్ల జిల్లా స్టూవర్టుపురం గ్రామంలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు చిన్నారులతో కలిసి కుటుంబ కలహాలపై చర్చించేందుకు నంద్యాల జిల్లా డోన్లోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ చర్చల అనంతరం నంద్యాల జిల్లాలోనే ఉన్న మహానంది పుణ్యక్షేత్రానికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన మార్కాపురం డీఎస్పీ... ఘోర రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పెట్రోల్ బంకు ఉండటంతో అందులోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. కారు అతివేగంగా వెళ్లి లారీని ఢీకొన్నట్లు తెలుసుకున్నారు. పలకల లోడుతో వెళ్తున్న లారీని కారు వేగంగా ఢీకొట్టిందని డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు మృతిచెందడం బాధాకరమని అన్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్, కంభం సీఐ మల్లికార్జునరావు, కొమరోలు, గిద్దలూరు, అర్థవీడు, కంభం ఎస్సైలు నాగరాజు, ఇమ్మానియేలు, సుదర్శన్, నరసింహారావు, గిద్దలూరు సర్కిల్ పోలీసుస్టేషన్లలోని సిబ్బంది పాల్గొన్నారు. -
జగనన్న పర్యటనను విజయవంతం చేయండి
దర్శి (కురిచేడు): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28వ తేదీ పొదిలి పొగాకు వేలం కేంద్రం సందర్శనను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి కోరారు. దర్శిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిరప, వరి, కంది, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను నష్టాలబాట పట్టించిందని విమర్శించారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జిల్లాలో పొగాకు రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావన్నారు. వేలం కేంద్రానికి వెళ్లి పొగాకు అమ్ముడుపోక బేళ్లను వెనక్కు తీసుకెళ్తున్నారన్నారు. పొగాకు రైతుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి వేలం కేంద్రానికి వస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి రైతు సోదరులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి జగనన్న పర్యటనను విజయవంతం చేయాలని బూచేపల్లి కోరారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు మద్దతు ధర కల్పించి వారికి భరోసా ఇచ్చారని కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లుతెరిచి రైతులను ఆదుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీతాబ్రహ్మారెడ్డి, జెడ్పీటీసీ రత్నరాజు, దర్శి వైస్ ఎంపీపీలు సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్యయాదవ్, రాష్ట్ర మున్సిపాలిటీ వింగ్ కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జీ దేవప్రసాద్, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కొల్లా భాస్కర్, వైఎస్సార్ టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా నిలవండి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
మార్కెట్కి అనుగుణంగా బేళ్లు తీసుకురావాలి
● పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్కుమార్ కొండపి: మార్కెట్కి అనుగుణంగా పొగాకు బేళ్లు తీసుకురావాలని పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్కుమార్ సూచించారు. శుక్రవారం కొండపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ రైతులంతా మార్కెట్లోకి అనుగుణంగా పొగాకు బేళ్లను తీసుకురావాలని కోరారు. మండెల్లో మగ్గిన పొగాకును బేళ్లు కట్టుకుని అమ్మకానికి తీసుకురావాలన్నారు. బేళ్లను అమ్మకానికి తీసుకొచ్చేటప్పుడు తేమ, వేడి లాంటివి లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులను రైతులకు వివరించారు. రైతులు వేలానికి తీసుకొచ్చిన బేళ్లలో నోబిడ్స్ లేకుండా మంచి సరాసరి ధరతో కొనుగోలు చేసేలా బయ్యర్లతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం ఎంతో అవసరమని అన్నారు. ఇది రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించడంలో కీలకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య, వేలం నిర్వహణ అధికారి జి.సునీల్కుమార్, రైతులు పాల్గొన్నారు. -
రేపు ఒంగోలులో మెగా జాబ్మేళా
ఒంగోలు వన్టౌన్: స్థానిక మంగమూరు రోడ్డులోని నాగార్జున డిగ్రీ కళాశాలలో ఈ నెల 24వ తేదీ మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువతీ యువకులు పాల్గొనవచ్చన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ, ఫార్మసీ, ప్రొడక్షన్, మాన్యుఫాక్చరింగ్, వివిధ కంపెనీలు, రాపిడో డిస్ట్రిబ్యూషన్, హెల్మెట్, షర్ట్లు, టీ షర్ట్లు, తదితర కంపెనీలు జాబ్మేళాలో పాల్గొంటాయన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో జాబ్మేళాలో పాల్గొనాలని కోరారు. ఏపీఈఏపీ సెట్కు 1886 మంది హాజరు ఒంగోలు సిటీ: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఏపీఈఏపీ సెట్ పరీక్షకు జిల్లాలో 1,886 మంది హాజరయ్యారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాకినాడలోని జేఎన్టీయూ భాగస్వామ్యంతో ఏపీఈఏపీ సెట్–2025 నిర్వహిస్తోంది. జిల్లాలో రెండోరోజు మొత్తం 1959 మందికిగానూ, 1886 మంది (96.27 శాతం) హాజరయ్యారు. యోగా పాఠ్యాంశం రాజ్యాంగ విరుద్ధం ఒంగోలు వన్టౌన్: పాఠ్యాంశంగా యోగాను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని భారత హేతువాద సంఘ అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య అన్నారు. ఒంగోలులోని సంఘ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాను పాఠ్యాంశంగా చేరుస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యోగా అనేది మతపరమైన ఆచారమని అన్నారు. క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం పతంజలి ఆత్మ పరమాత్మలో కలిసేందుకు యోగా మార్గమని ప్రతిపాదించాడన్నారు. యోగా చావుకి దగ్గరి మార్గమని, యోగా లక్ష్యం ముక్తిపొందడం అని అన్నారు. యోగా శాసీ్త్రయం కాదన్నారు. యోగా వంటి మతపరమైన కార్యక్రమాలను లౌకికరాజ్యంలో ప్రతిఒక్కరూ పాటించాలని ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. విలేకరుల సమావేశంలో ఏపీ హేతువాద సంఘ అధ్యక్షుడు ఎంకే బేగ్, సీపీఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు, శిఖా చంద్రశేఖర్బాబు, పౌరహక్కుల సంఘ నాయకులు గుమ్మళ్ల నరసింహారావు, సుభానీ, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డున పడిన సచివాలయ ధ్రువీకరణ పత్రాలు!
కొమరోలు: గ్రామ సచివాలయంలో ఉండాల్సిన సచివాలయ ఖాళీ ధ్రువీకరణ పత్రాలు రోడ్డునపడ్డాయి. కొమరోలు మండలంలోని పురుషోత్తమునిపల్లె గ్రామ రహదారికి ఇరువైపులా కిలోమీటరు మేర ధ్రువీకరణ పత్రాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ఓ పొలంలో వందలకొద్ది ఖాళీ బాండ్ పేపర్లు పడి ఉండటాన్ని అటువైపుగా వెళ్తున్న ప్రజలు చూసి విస్తుపోయారు. ప్రజలకు అవసరమైన కుల, ఆదాయ, జనన, మరణ తదితర ధ్రువీకరణ పత్రాలను గ్రామ సచివాలయంలో ఈ బాండ్ పేపర్ మీదనే ప్రింట్ తీసి ఇస్తారు. ఈ మార్గానికి సమీపంలో సచివాలయం లేకపోవడంతో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ గ్రామ సచివాలయానికి చెందినవని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
యోగా మాసోత్సవాలు విజయవంతం చేయాలి
ఒంగోలు సబర్బన్: యోగా మాసోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. శ్రీయోగాంధ్ర–2025శ్రీ మాసోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు ముందస్తు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలి, అందుకు చేపట్టవలసిన చర్యలపై గ్రామ, మండల, జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలు రుపొందించాలని సూచించారు. నెల రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఉంటుందన్నారు. అందులో భాగంగా జూన్ 18వ తేదీన 5 వేల మంది స్వయం సహాయక సభ్యులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో ముఖ్యమైన పర్యాటక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మే 26వ తేదీ, జూన్ 2, 8, 15వ తేదీల్లో జిల్లాలోని పర్యాటక ప్రదేశాల్లో కనీసం వేయి మందితో యోగా సాధన చేయించాలని చెప్పారు. యోగాపై గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాలని సూచించారు. రోజూ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జిల్లాలోని గ్రామాలు, నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో ప్రజలతో రోడ్లపై యోగా సాధన చేయించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో 100 మంది మాస్టర్ ట్రైనర్లు, మండల స్థాయిలో 200 మంది ట్రైనర్లను గుర్తించి జాబితా రుపొందించాలని ఆయుష్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. యోగా శిక్షణ కోసం జిల్లాలోని ప్రజలందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేకించి మండల స్థాయిలో మహిళా స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ కూలీలు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఎస్హెచ్జీ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఇలా అందరినీ సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రజలంతా ఈ నెల రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, అంతర్జాతీయ యోగా వేడుకలను వివిధ సంస్థలు, మీడియా సహకారంతో విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, ఆయుష్ శాఖ ఆర్డీడీ పద్మజాతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు పాల్గొన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా యోగాంధ్ర–2025పై జిల్లా అధికారులతో సమీక్ష -
లైంగికదాడి కేసులో నిందితుడు అరెస్టు
ముండ్లమూరు(కురిచేడు): పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ముండ్లమూరు ఎస్సై కమలాకర్ తెలిపారు. మండలంలోని రమణారెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఇస్తాల మణికంఠ అనే యువకుడు ఇటీవల ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం ఉల్లగల్లు గ్రామంలోని వేముల బస్టాండ్ వద్ద మణికంఠను అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతంతో బీహార్ వాసి మృతి పొదిలి రూరల్: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కాటూరివారిపాలెంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాటూరి నారాయణరావు పశువుల ఫారంలో బీహార్కు చెందిన నితీష్కుమార్(45) పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే పని చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన డీఎల్డీఓ మార్కాపురం: మార్కాపురం డీఎల్డీఓగా పి.బాలునాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా మాచర్లలో డీఆర్డీఏ క్లస్టర్ ఏపీడీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను మార్కాపురం డీఎల్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన డీఎల్డీఓకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారిస్తానని చెప్పారు. -
సీఎం గారూ.. సీహెచ్ఓల వైపు చూడండి
● కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల వినూత్న నిరసన ఒంగోలు టౌన్: అయ్యా సీఎం గారూ.. గత 24 రోజులుగా సమ్మె చేస్తున్నాం.. మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చేతులెత్తి వేడుకుంటున్నాం.. ఇప్పటి వరకూ మావైపు చూడలేదు.. కనీసం ఒక అధికారిని పంపించి మమ్మల్ని పలకరించలేదు.. మా సమ్మెతో గ్రామాల్లో వైద్యసేవలందక ప్రజలు అవస్థపడుతున్నారు.. గ్రామాలకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్సీలకు వెళ్లలేక బాధపడుతున్నారు.. ఆర్ఎంపీల వద్దకు వెళ్లి ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు.. సార్, మావైపు చూడండి... అంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద మహిళా సీహెచ్ఓలు చున్నీలతో ఆయ్యా సీఎం సార్.. మా సీహెచ్ఓల వైపు చూడండంటూ రోడ్డుపై రాసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీహెచ్ఓలు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న సీహెచ్ఓలను ఇప్పటి వరకు ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు అందజేయడమే కాకుండా గ్రామీణ తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పడు పరిశీలిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న సీహెచ్ఓలు సమ్మె చేపడితే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని వాపోయారు. ఇప్పటికై నా సీహెచ్ఓల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎంసీఏ జిల్లా నాయకులు, సీహెచ్ఓలు పాల్గొన్నారు. -
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న శ్యామల
బేస్తవారిపేట: హనుమాన్ జయంతి సందర్భంగా బేస్తవారిపేట మండలంలోని సలకలవీడు గ్రామంలో అభయ వీరాంజనేయస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష పూజలు, సువర్చ సహిత ఆంజనేయస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. తొలుత ఆమెకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త బిక్కా రామాంజనేయరెడ్డి, గ్రామస్తులు ఘనస్వాగతం పలికి సన్మానించారు. కుక్కల దాడిలో జింక మృతి టంగుటూరు: అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన జింకను కుక్కలు వేటాడి చంపేశాయి. ఈ సంఘటన టంగుటూరు మండలంలోని జమ్ములపాలెం గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామ శివారులో జింకను నాలుగు కుక్కలు దాడి చేస్తున్న సమయంలో స్థానికులు గమనించి తరమికొట్టారు. అప్పటికే జింక మృతి చెందింది. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రైల్వే స్టేషన్లో గంజాయి విక్రేత అరెస్టు ● 1.7 కేజీల గంజాయి స్వాధీనం ఒంగోలు టౌన్: ౖరెల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న కేరళకు చెందిన వ్యక్తి నుంచి రైల్వే పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలు రైల్వే స్టేషన్ మూడో నంబర్ ప్లాట్ఫారంపై గురువారం సాయంత్రం ఓ వ్యక్తి చేతిలో గ్రే కలర్ సంచితో అనుమానాస్పదంగా తిరగడాన్ని పోలీసులు గమనించారు. అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 1.7 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసుల దర్యాప్తులో సదరు వ్యక్తి కేరళకు చెందిన ఎస్ఆర్ విజయ్గా తేలింది. గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. తనిఖీలో జీఆర్పీ ఎస్సై మధుసూదనరావు, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. -
సాగర్ పైప్లైన్ పనులు ప్రారంభం
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణానికి సాగర్ నీరు అందించే పైప్లైన్లకు మరమ్మతులు ప్రారంభించారు. మార్కాపురం పట్టణ ప్రజల తాగునీటి కష్టాలపై ఈనెల 18న ‘పురం గొంతులో నీటి ముల్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. త్రిపురాంతకం మండలం దూపాడు వద్ద మార్కాపురం ఎస్ఎస్ ట్యాంకు ఉంది. అక్కడి నుంచి మార్కాపురం వరకు 26 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఓవర్హెడ్ ట్యాంకులకు నింపి నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఈ పైప్లైన్కు అక్కడక్కడా లీకేజీలు ఏర్పడడటంతో నీటి సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతోంది. సక్రమంగా మరమ్మతులు చేయకపోవడంతో పట్టణ ప్రజలకు 6 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నీటి కష్టాలపై ‘సాక్షి’లో కథనం రావడంతో అధికారులు స్పందించి మరమ్మతుల పనులు ప్రారంభించారు. -
ఇళ్లకు డోర్ నంబర్లు వేయిస్తాం
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఇళ్లకు డోర్ నంబర్లు వేయిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో నెలవారీగా పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే మీటింగ్లో భాగంగా స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో డీఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెలా జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోవడం తప్పనిసరని ఎన్నికల సంఘం సూచించిందని తెలిపారు. ఆధార్ అనుసంధానం చేసుకోని వారు ఓటు హక్కును కోల్పోతారన్నారు. జిల్లాలోని పోలింగ్ స్టేషన్లు సరిగ్గా ఉన్నదీ, లేనిదీ గుర్తిస్తున్నట్లు తెలిపారు. పొలిటికల్ పార్టీల సభ్యులు సమావేశంలో అడిగిన ప్రశ్నలకు డీఆర్వో సమాధానం చెప్పారు. చనిపోయిన వారి ఓట్లు తెలపాలని, వారి ఓట్లు తొలగించటానికి ప్రజలు సహకరించాలని కోరారు. వైఎస్సార్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామాల్లో డోర్ నంబర్లు లేకపోవడం వలన కొత్తగా ఓట్లు చేర్చుకోవడం కష్టతరమవుతోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డోర్ నంబర్లు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందిపడుతున్నారని, వెంటనే డోర్ నంబర్లు వేయించాలని కోరారు. డీఆర్ఓ సమాధానమిస్తూ కమిషనర్లకు చెప్పి డోర్ నంబర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలి జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు -
విద్యుదాఘాతంతో 22 గేదెలు మృతి
మార్కాపురం: పొలాల్లో మేతకు వెళ్లిన 20 గేదెలు విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాయి. ఈ సంఘటన గురువారం మార్కాపురం మండలం చింతగుంట్ల–తిప్పాయిపాలెం గ్రామాల మధ్య ఉన్న రామిరెడ్డి నగర్ సమీపంలో చోటుచేసుకుంది. చింతగుంట్ల, అయ్యవారిపల్లి, బడేఖాన్ పేట, తిప్పాయిపాలెం గ్రామాలకు చెందిన పాడి రైతులు తమ గేదెలను గురువారం ఉదయం మేత కోసం సమీప పొలాల్లోకి తోలారు. చీకటి పడినా గేదెలు ఇంటికి రాకపోవడంతో వెదుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో రామిరెడ్డినగర్ వాసులు ఒకే చోట 20 గేదెలు విద్యుదాఘాతానికి గురై మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. మందటి చిన్న ఆనందరెడ్డికి చెందిన 2 గేదెలు, మందటి వెంకటరెడ్డి 2 గేదెలు, దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 2, తేలుకుట్ల చిన్న వెంకటరెడ్డి 3, సింగపోగు గురవమ్మ 8, ఎం.రంగారెడ్డికి చెందిన ఒక గేదెతోపాటు ఇంకా పలువురు రైతులకు చెందిన పాడి గేదెలు ఉన్నాయి. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న పాడి రైతులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.15 లక్షలు ఉండొచ్చని అంచనా. హెటీ లైన్ తెగి పడటమే కారణం బుధవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి హెటీ లైన్ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మేతకు వెళ్లిన గేదెలకు ఆ తీగలు తగలడంతో షాక్కు గురై మృతి చెందినట్లు తెలుస్తోంది. గేదెల మృతిపై విద్యుత్ శాఖ ఏఈ నాగేందర్ రెడ్డిని వివరణ కోరగా విద్యుత్ షాక్కు గురైతే ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ అయి సరఫరా నిలిచిపోతుందని, కానీ అలా జరగలేదన్నారు. పిడుగుపాటుకు గురై మృతి చెంది ఉండొచ్చని చెప్పారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రావిపాడులో రెండు గేదెలు మృతి కంభం: విద్యుదాఘాతానికి గురై రెండు గేదెలు మృతి చెందిన సంఘటన కంభం మండలంలోని రావిపాడు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామ రైతు నారాయణరెడ్డికి చెందిన రెండు గేదెలు స్థానిక బీసీ కాలనీలోని విద్యుత్ స్తంభం వద్ద షాక్కు గురై మృతి చెందాయి. సుమారు 1.80 లక్షల విలువ చేసే గేదెలు మృతి చెందడంతో రైతు బోరుమని విలపించాడు. నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. పాడి రైతులకు రూ.17 లక్షల నష్టం -
వల!
చేపను బట్టిఆదివారమొస్తే మాంసప్రియులు ఏ చేప తినాలో నిర్ణయించుకుని జిహ్వా చాపల్యాన్ని చల్లార్చుకోవడం సహజం. ఆ చేపల వెనుక గంగపుత్రుల కష్టం దాగి ఉంది. ఎగసిపడే అలలకు ఎదురెళ్లి చేపలు పట్టడమంటే మార్కెట్లో డబ్చిచ్చి కొనుగోలు చేసినంత సులువు కాదు.! చేపల రకాన్ని బట్టి వలలు వినియోగించి, రేయింబవళ్లు శ్రమించి వేట సాగిస్తారు మత్స్యకారులు. సముద్రంలో వాతావరణాన్ని బట్టి ఎటువంటి చేపలు పడతాయో అంచనా వేసి ఆ వలలే ఉపయోగిస్తారు. ఈ క్రమంలో మత్స్య సంపద చిక్కక ఒడ్డుకొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం వేట విరామ సమయం కావడంతో కొత్తపట్నం తీరంలోని మత్స్యకారులు 16 రకాల వలలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయిల్ ఇంజన్లకు మరమ్మతులు చేయించుకోవడంతోపాటు బోట్లనూ రెడీ చేస్తున్నారు. కొత్తపట్నం: విరామం వేటకే కానీ తమకు కాదంటున్నారు మత్స్యకారులు. పూట గడవడానికి కొందరు పనులకు వెళ్తుండగా మరికొందరు వలలు, బోట్లు, ఇంజన్లు సిద్ధం చేసుకునే పనిలో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఏడాది పొడవునా వేట సాగించేందుకు వీలుగా అవసరమైన సామగ్రిని జాగ్రత్తగా సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వం వేట విరామం తేదీ ప్రకటించగానే బోట్లను ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు.. కొద్ది రోజులకే కొత్త వలలు కొనుగోలు చేశారు. వాటిని క్రమ పద్ధతిలో అల్లుకుంటున్నారు. సముద్రంలో లభించే దాదాపు 52 రకాల చేపలు వేటాడేందుకు మత్స్యకారులు 16 రకాల వలలను వినియోగిస్తారు. వేట విరామం గడువు ముగిసిన తర్వాత సాగర గర్భంలో మత్స్య సంపద విరివిగా లభించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వేటకు వీలుగా అన్ని రకాల వలలను సమకూర్చుకుంటున్నారు. ఒక్కో బోటుకు 16 రకాల వలలు తయారు చేసుకుంటున్నట్లు జిల్లాలోని తీరప్రాంత మత్స్యకారులు చెబుతున్నారు. వంజరం వలలు, చందువా, బంక సీదలు, సీదలు, గుల్ల రొయ్యల వలలు, గేరకాళ్లు, పెద్ద రొయ్యల వలలు, అడస రొయ్యల వల, పూసల వల, జాయింట్ వల.. ఇలా వివిధ రకాల వలలను రూ.లక్ష నుంచి రూ. 2.5 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. పెద్ద కూనాం చేపలను వేటాడేందుకు వినియోగించే రింగు వలలు రకం, పరిమాణాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా, బోటు రూ.3.5 లక్షల వరకు ఉంటుంది. మూడు ఇంజన్లు వినియోగించే ఈ బోట్లు, రింగు వలలు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో మత్స్యకారులు బృందంగా ఏర్పడి వేట సాగిస్తున్నారు. వేట విరామ సమయంలో బిజీబిజీగా మత్స్యకారులు ఒక్కో బోటుకు 16 రకాల వలలు సిద్ధం చేసే పనిలో నిమగ్నం ఇంజన్లకు మరమ్మతులు, బోట్లకు తుది మెరుగులు జూన్ 15 నుంచి మొదలుకానున్న బతుకు వేట -
తప్పుల తడక
అయ్యోర్ల బదిలీల్లో.. ఒంగోలు సిటీ: టీచర్ల బదిలీల వ్యవహారమంతా గందరగోళంగా మారింది. బుధవారం నుంచి ఈ ప్రకియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆరంభం రోజే సాంకేతిక సమస్య తలెత్తింది. సర్వర్ పనిచేయకపోవడంతో దరఖాస్తుదారులు అవస్థలు పడ్డారు. రెండోరోజు కూడా అదే పరిస్థితి. వెబ్సైట్ మొరాయిస్తోంది. జిల్లాలో విద్యాశాఖ నింబంధనల ప్రకారం హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు సుమారు 2 వేల మంది బదిలీ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంది. తొలి రెండు రోజులు ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని 56 మండలాలకు సంబంధించి 133 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు 11 మంది ఉన్నారు. గురువారం మధ్యాహ్నం వరకు సర్వర్ సక్రమంగా పనిచేయలేదని, ఆ తర్వాత నుంచి సర్వర్ పరవాలేదని ప్రధానోపాధ్యాయులు తెలియజేస్తున్నారు. అయితే, హెచ్ఆర్ఏ సమస్య రాత్రి పది గంటల సమయంలో పరిష్కారమైనట్టు తెలిసింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఆన్లైన్ వివరాలు అస్తవ్యస్తం... ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్టు ఉపాధ్యాయులు వాపోతున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఆన్లైన్లో బయోడేటా అంతా బాగానే ఉన్నా సర్వీస్ పాయింట్లు తప్పుల తడకలుగా చూపిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయుల ఎన్టైటిల్ పాయింట్లు గుణించి సీనియారిటీ జాబితా తయారు చేస్తారు. వీరిలో ప్రిఫరెన్షియల్ కేటగిరీ కిందకు వచ్చే వారికి తొలి ప్రాధాన్యతతో బదిలీకి అవకాశం కల్పిస్తారు. అయితే, ఈ పాయింట్లకు సంబంధించి తప్పుల తడకలుగా చూపిస్తున్నట్టు సమాచారం. 15 సర్వీసు పాయింట్లు ఉండాల్సి ఉంటే పది మాత్రమే చూపిస్తోందని, చాలా మందికి ఇదే సమస్య ఎదురవుతోందని తెలిసింది. అలాగే భార్యాభర్తలు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పటికీ స్పౌజ్ పెట్టుకోకపోయినా ఆన్లైన్లో స్పౌజ్ చూపిస్తోందని, ఆప్షన్ డెలీట్ చేసినా స్పౌజ్ అని చూపిస్తోందని కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికితోడు సర్వర్ సమస్య తలెత్తుతూనే ఉంది. ఇక ఎస్జీటీలకు అయితే అసలు సర్వర్ పనిచేయలేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులైతే అసలు మిగులు ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు.. ఎక్కవ ఉన్నారని చెప్పకుండా బదిలీల ప్రక్రియ ఏ విధంగా ప్రారంభిస్తారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 1:45 అంగీకరించకుండానే... ఒక్కో సెక్షన్కు 1:63 ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో దాన్ని 1:49కి మార్చింది. దాన్ని కూడా ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించడం లేదు. కానీ, సోమ, మంగళవారాలలో విద్యాశాఖ కార్యదర్శి సమక్షంలో నిర్వహించిన చర్చల్లో 1:49నే ఫైనల్ చేశారు. దీని వలన భవిష్యత్తులో ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 7 వేల మంది ఉపాధ్యాయులు అధికంగా ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. 1:45 ప్రకారం సెక్షన్లు విభజిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించడం తెలిసిందే. ఇప్పటికే 7 వేల మంది ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారని చెబుతున్న ప్రభుత్వం.. మెగా డీఎస్సీని ఏం చేస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఒక ప్రహసనంగా కొనసాగుతోంది. ఎస్జీటీ బదిలీల లాబీయింగ్ షురూ... ఎస్జీటీల బదిలీల ప్రక్రియలో దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. మిగతా వెరిఫికేషన్ లాంటివన్నీ ఆఫ్లైన్లో చేయనున్నారు. దీంతో ఎస్జీటీల బదిలీల్లో పెద్ద ఎత్తున చేతులు మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆరంభం నుంచే వెంటాడుతున్న సాంకేతిక సమస్య రెండోరోజూ సర్వర్ డౌన్ ఆన్లైన్లో వ్యక్తిగత వివరాల్లో తప్పులు 1:45 అంగీకారం కుదరకుండానే బదిలీలు సమస్యలు పరిష్కరించాకే ప్రక్రియ ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ తొందరపడి దరఖాస్తు చేసుకోవద్దంటున్న సంఘాలు జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా సాగుతోంది. రెండు రోజులుగా సర్వర్ మొరాయిస్తోంది. అలాగే ఆన్లైన్లో వ్యక్తిగత వివరాలన్నీ తప్పులతడకలుగా ఉన్నాయి. సమస్యలు పరిష్కరించకుండా బదిలీలు ఎలా అంటూ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. దీనికితోడు పాఠశాలల పునర్వ్యవస్థీకరణ సమస్యపై ఉపాధ్యాయులకు అభ్యంతరాలున్నాయి. దాన్ని పూర్తిగా పరిష్కరించకుండానే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. మొత్తం మీద ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. జిల్లావ్యాప్తంగా సుమారు రెండువేల మంది వరకూ బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తొందరపడకండి... సమస్యలు పరిష్కరించకుండా ఆగమేఘాల మీద బదిలీలు ఎందుకు చేపట్టాల్సి వచ్చిందని ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముందుగా సమస్యలు పరిష్కరించిన తర్వాతే బదిలీలు చేపట్టాలని పలుమార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా మోసం చేసిందని, తొందరపడి దరఖాస్తు చేసుకోవద్దని ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూచిస్తున్నారు. మొత్తం మీద బదిలీల ప్రక్రియలో రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు తలెత్తుతాయోనని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టనట్లు తన పని తాను చేసుకునిపోతూ చుక్కలు చూపిస్తోందన్న ఆరోపణలు ఉపాధ్యాయవర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇదిలా, ఉండగా పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు డీఈఓ కార్యాలయ ఉద్యోగులెవరూ సెలవులు పెట్టవద్దని డీఈఓ కిరణ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
పొగాకు రైతుకు అండగా వైఎస్సార్ సీపీ
ఒంగోలు సిటీ: పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28వ తేదీ పొదిలి వేలం కేంద్రానికి రానున్నారని వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. ఒంగోలు నగరంలో పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకర్లతో వారు మాట్లాడారు. మాయమాటలతో, అబద్ధాలతో రైతులను చిన్నచూపు చూడటం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటేనని కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేస్తే.. వ్యవసాయం దండగ అన్న రీతిలో చంద్రబాబు పాలన ఉంటోందని విమర్శించారు. గతేడాది పొగాకు క్వింటా రూ.36,000కు కొనుగోలు జరిగితే.. నేడు రూ.24,000కు కూడా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. రానున్న రోజుల్లో ధరలు ఇంకా తగ్గే ప్రమాదముందన్నారు. రైతులకు మేలు చేయాలని టుబాకో బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమన్నారు. టుబాకోను మేము పట్టించుకోమని వ్యవసాయ శాఖామంత్రి అంటుంటే.. అసలు ఈ ప్రభుత్వం ఉన్నట్టా.. లేనట్టా అని కారుమూరి మండిపడ్డారు. రాష్ట్రానికి వెన్నెముకలాంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. దళారీలకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఈ క్రాప్ చేయించి ప్రభుత్వమే బీమా చేయించి రైతులను సకాలంలో ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. పంట నష్టం జరిగితే వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు పక్షపాతిగా నిలిచారన్నారు. మద్దతు ధర లభించక రైతాంగం కుదేలవుతున్నా నేటి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్ళించారు. కందిపప్పు, పెసర పప్పు, మినప్పప్పు.. ఏదైనా సరే బహిరంగ మార్కెట్లో అధిక ధరలు ఉన్నాయని, రైతుకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు. దళారులు రైతు కష్టాన్ని దోచేస్తుంటే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కారుమూరి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతులకు డబ్బులిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రగల్భాలు పలికారని, మే 6వ తేదీ కొనుగోలు చేస్తే నేడు 22వ తేదీ అయినా రైతుకు డబ్బులివ్వలేదని ఆరోపించారు. పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మాత్రం అండగా ఉంటోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులను పట్టించుకోడని ఆరోపించారు. రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 28వ తేదీ పొదిలిలో వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. రైతు బంధు.. వైఎస్ జగన్ : ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి గతంలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లభించక అవస్థపడుతుంటే రూ.100 కోట్లు కేటాయించి మార్క్ఫెడ్ను రంగంలోకి దించి ఆదుకున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి గుర్తుచేశారు. నాడు క్వింటా రూ.34,000 నుంచి రూ.35,000 మధ్య కొనుగోలు చేయడంతో పొగాకు రైతులు బాగుపడ్డారని తెలిపారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని జగన్ నమ్మారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుగానీ, కూటమి నాయకులుగానీ రైతులకు భరోసా ఇవ్వడంలేదని మండిపడ్డారు. పొగాకు అమ్మకాలు జరుగుతున్న పలు వేలం కేంద్రాలను పరిశీలించానని, ప్రస్తుతం ఒక క్వింటా రూ.24,000కు కూడా కొనే పరిస్థితి లేదని అన్నారు. లో గ్రేడ్ అయితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదన్నారు. వేలం కేంద్రాల వద్ద పొగాకు కొనుగోలు చేయకపోతే దానిని తిరిగి వెనక్కి తీసుకెళ్తున్నారని, ఫలితంగా రైతుపై ఎకరాకు రూ.50 వేలకుపైగా, బ్యారన్పై రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ భారం పడుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణయాదవ్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్ సీపీ నాయకులు ఉడుముల శ్రీనివాసరెడ్డి, అన్నా కృష్ణచైతన్య, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, మారెడ్డి సుబ్బారెడ్డి, మీరావలి, తదితరులు పాల్గొన్నారు. 28న పొదిలి రానున్న పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ప్రభుత్వంలో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు రైతుకు అండగా నిలిచిన జగన్ ప్రస్తుతం మద్దతు ధర లభించక కుదేలవుతున్న అన్నదాతలు దళారులకు వత్తాసు పలుకుతున్న కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
యోగాతో ఆరోగ్యకరమైన జీవితం
ఒంగోలు సిటీ: దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేస్తే ఆరోగ్యకరమైన జీవితం సాకారమవుతుందని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా బుధవారం ఉదయం ఒంగోలులోని కేంద్రియ విద్యాలయంలో నిర్వహించిన మెగా యోగా సాధనలో కలెక్టర్తోపాటు ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, ఒంగోలు మేయర్ సుజాత, ఏపీ పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 21వ తేదీన నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖకు వస్తున్న సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ యోగేంద్ర కార్యక్రమాన్ని నెల రోజులపాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో యోగా సాధనపై అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. రానున్న నెల రోజులపాటు ప్రణాళిక ప్రకారం జిల్లాలోని ప్రతి గ్రామంలో యోగా సాధన చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు, యోగా సాధకులు, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆయుష్ శాఖ ఆర్డీడీ పద్మజాతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా -
కేబినెట్ మీటింగ్లు కావ్లే..!
కాకులు వరుసగా అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నాయ్..! మరి కాకులంటే మాటలా. లోకులతో పాటు తామూ తెలివైనవాళ్లమే అని వాటి ఫీలింగ్. నిజమే.. కాకులు ఆరేడేళ్ల పిల్లలతో సమానంగా ఐక్యూ కలిగి ఉంటాయని ఆర్నిథాలజిస్ట్లూ తేల్చారు. అంతకంటే ముందే.. కాకుల ప్రవర్తనను బట్టి భవిష్యత్ను అంచనా వేస్తూ ఏకంగా కాకి శాస్త్రమే రూపొందించారు మన పూర్వీకులు. ఇంతకీ విషయమేమిటంటే బేస్తవారిపేటలోని ఓ భవంతిపై వందలాది కాకులు తరచూ సమావేశమై వాటి భాషలో చర్చలు జరుపుతున్నాయ్. సాధారణంగా ఇవి గుంపుగూడాయంటే ఏదో జరగబోతోంది! ఎవరికో మూడింది! అని ఓ అంచనాకు వచ్చేయడం పరిపాటి. వాస్తవానికి ఆహారాన్ని సంపాదించుకోవడం, ముప్పును ఎదుర్కోవడంపై సంభాషించుకునేందుకు అవి ఇలా సమావేశమవుతాయట..! – బేస్తవారిపేట -
పశ్చిమాన మోస్తరు వర్షం
ఖరీఫ్ సాగుకు సన్నద్ధం గత ఐదు రోజులుగా జిల్లాలో చెదురు ముదురు జల్లులతోపాటు భారీ వర్షాలు కురవడంతో పదునెక్కిన పొలాల్లో రైతులు సేద్యాలు ప్రారంభించారు. మార్కాపురం మండలంలోని వేములకోట, దరిమడుగు, గజ్జలకొండ, రాయవరం, నాయుడుపల్లి, మన్నెంవారిపల్లి, బోడపాడు పెద్దనాగులవరం, జమ్మనపల్లి, కోలభీమునిపాడు, చింతగుంట్ల, తిప్పాయపాలెం, ఎల్బీయస్ నగర్ తదితర గ్రామాల్లో వేసవి దక్కులు ప్రారంభమయ్యాయి. నైరుతి రుతుపవనాలు కూడా ముందుగానే వస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో సాగుకు సిద్ధమవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. తొలకరి వర్షాలు పడిన వెంటనే సజ్జ, కంది, ఆముదం, వేసవి పత్తి సాగు చేసేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. మార్కాపురం/పెద్దదోర్నాల/కనిగిరి: పశ్చిమ ప్రకాశంలోని పలు మండలాల్లో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దోర్నాల మండలంలో 10.2 మి.మీ, గిద్దలూరు 4.2 మి.మీ, పొదిలి 3.6 మి.మీ, రాచర్ల 3.6 మి.మీ, దొనకొండ 3.4 మి.మీ, కొనకనమిట్ల 3.0 మి.మీ, కంభం మండలంలో 2.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మార్కాపురం, త్రిపురాంతకం, తర్లుపాడు, అర్ధవీడు, పుల్లలచెరువు, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. పొంగిపొర్లిన తీగలేరు పెద్దదోర్నాల మండల కేంద్రంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. లోతట్టు వీధులు జలమయంగా మారాయి. వర్ష ప్రభావంలో శ్రీశైలం రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయ పరిసర ప్రాంతాలు నీటి మడుగులను తలపించాయి. చిన్నదోర్నాల వద్ద తీగలేరు పొంగిపొర్లడంతో మార్కాపురం–దోర్నాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కనిగిరిలో జోరువాన కనిగిరి ప్రాంతంలో బుధవారం రాత్రి 8 గంటల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కనిగిరి ప్రధాన వీధుల్లో డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో అస్తవ్యస్తంగా మారాయి. ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చిన్నదోర్నాల వద్ద పొంగిపొర్లిన తీగలేరు వాహనాల రాకపోకలకు అంతరాయం కనిగిరిలో ఉరుములు, మెరుపులతో వాన ఈదురుగాలుల ధాటికి నిలిచిన విద్యుత్ సరఫరా ఖరీఫ్ సాగుకు సేద్యాలు ప్రారంభించిన రైతులు -
పిల్లలం.. కాలువ ఈదేస్తాం..
వేసవి సెలవులంటేనే పిల్లలు ఎగిరి గంతేస్తారు. అదే ఉత్సాహాన్ని రెండింతలు చేసి, దేహ దారుఢ్యాన్ని పెంచుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఈత కొట్టాల్సిందే.! గతంలో పల్లెటూర్లు, పట్టణ శివార్లలో అక్కడక్కడా బావులు ఉండేవి. కాలక్రమంలో పల్లెటూర్లలోని 80 శాతం బావులు పూడ్చేసిన పరిస్థితి. పట్టణ ప్రాంతాల్లో చిన్నారులు స్విమ్మింగ్ పూల్స్ను ఆశ్రయిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు వేసవి తాపాన్ని తీర్చుకుంటున్నారు. పల్లెటూర్లలో చెరువులు, కుంటలు ఈతకు యోగ్యంగా లేకపోవడంతో పిల్ల కాలువల్లో ఈదుతూ చిన్నారులు సరదా తీర్చుకుంటున్నారు. – బేస్తవారిపేట -
ఆటో బోల్తా.. యువకుడు మృతి
● మరో ఇద్దరికి స్వల్ప గాయాలు సింగరాయకొండ: ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడటంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం ఉదయం పాకల శివాలయం సమీపంలోని కోనేరు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాకల పల్లెపాలేనికి చెందిన స్నేహితులు రేవు రాజేష్(21), కొక్కిలిగడ్డ కిరణ్, సైకం సంతోష్ ఆటోలో వెళ్తున్నారు. ఆటో శివాలయం సమీపంలోని కోనేరు వద్దకు రాగానే అదుపుతప్పి ప్రమాదవశాత్తు తిరగబడింది. ప్రమాదంలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో సింగరాయకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మృతుడు రాజేష్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. చేతికందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడిని మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు రేవు నాగేంద్రం, కృష్ణమ్మలు బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేర నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలి
కనిగిరిరూరల్: నేరాల నియంత్రణకు సాంకేతికతను ఉపయోగించుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతికత పాత్ర కీలకమన్నారు. స్థానిక పవిత్ర కల్యాణ మండపంలో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలన్నారు. పెండింగ్ కేసులను తగ్గించేందుకు అన్నిస్థాయిలోని అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపర చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు. డ్రోన్, సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధన వేగవంతం చేయాలన్నారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్స్, ఈవ్టీజింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ఏరియాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, ఇతర నేరాలు జరిగే ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలను ముందుగానే గుర్తించి ఆ ప్రాంతాలకు డ్రోన్లు పంపి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగించాలని సూచించారు. కేసుల పురోగతిపై సమీక్ష.. ఈ సందర్భంగా హత్య కేసులు, లైంగిక దాడులు, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, పెండింగ్ కేసులపై ఎస్పీ సమీక్షించారు. పోలీస్స్టేషన్ల వారీగా కేసుల పరోగతిపై సమీక్షించారు. జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, చెడు నడత కల్గిన వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి సమీక్షించారు. ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. ప్రతిభ కనబర్చిన అధికారులకు అభినందన ఈ నెల 12న కొండపి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును త్వరగా ఛేదించి రూ.15 లక్షల విలువైన సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబర్చిన సీఐ, ఎస్సై, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలను, రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అత్యాధునిక సాంకేతికత కల్గిన డ్రోన్ కెమెరాలను ఎస్పీకి అందచేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరావు, డీఎస్పీలు ఆర్ శ్రీనివాసరావు, లక్ష్మీ నారాయణ, సాయి ఈశ్వర్ యశ్వంత్, రమణ కుమార్, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు సాంకేతికతను అందిపుచ్చుకోండి పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించండి నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ -
క్రమశిక్షణ పాటించకుంటే కఠిన చర్యలు
ఒంగోలు సబర్బన్: సచివాలయ సిబ్బంది క్రమశిక్షణ పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. ఒంగోలు శివారులోని కొప్పోలు వార్డు సచివాలయాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా స్థానికులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రీసర్వే డేటాను పరిశీలించారు. ఆధార్ కార్డ్ లేని చిన్నారులు సచివాలయం పరిధిలో ఎంత మంది ఉన్నారు...వారికి ఆధార్ కార్డులు అందేలా ఎలాంటి చర్యలు తీసుకున్నారని మహిళా సంరక్షణ కార్యదర్శిని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది వేస్తున్న బయోమెట్రిక్ హాజరు వివరాలను పరిశీలించారు. కొందరు సిబ్బంది 11 గంటలకు వచ్చినట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన, సేవల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సచివాలయ పరిధిలో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నతో కలిసి నగరంలో ఇంటి పట్టాలకు సంబంధించి రీ వెరిఫికేషన్ చేశారు. ఇంటి నివేశన పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆధార్ కార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ తహసీల్దార్ పిన్నిక మధుసూదన్రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఉన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా కొప్పోలు వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ -
న్యాయపోరాటానికి సిద్ధం...
అగ్రిమెంట్ కాలం ఉండగానే మమ్మల్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయం. మా వాహనాలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడాలో పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఎన్ఓసీ ఇప్పించాలి. న్యాయం చేయకుండా జూన్ ఒకటి నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యం సరఫరా చేస్తే న్యాయపోరాటానికి సిద్ధం. – కొప్పుల అరవింద్, జిల్లా ప్రెసిడెంట్, ఎండీయూ ఆపరేటర్ల సంఘం ఉపాధి కోల్పోయా వచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని పోషించుకునే వాడిని. గత ఐదేళ్లుగా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాను. ఒక్కసారిగా తొలగించడం అన్యాయం. ఉపాధి కోల్పోయిన ఆపరేటర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలి. – అనిల్, ఎండీయూ ఆపరేటర్, కంభం మండల -
శివకేశవ ఆలయాల మధ్య అడ్డుగోడ
● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు, గ్రామస్తులు పొన్నలూరు: స్థానిక శివాలయం, చెన్నకేశవ ఆలయాల మధ్య కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రహరీ నిర్మాణం వివాదానికి దారితీస్తోంది. రెండు ఆలయాల మధ్య శాస్త్ర విరుద్ధంగా కొందరు కావాలనే గోడను నిర్మించడంపై భక్తులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొన్నలూరు గ్రామంలో దశాబ్ధ కాలం నుంచి దక్షిణముఖ శివాలయం, చెన్నకేశవ ఆలయాలు ఉండటం చాలా అరుదుగా చెప్పుకుంటారు. ఈ రెండు దేవాలయాల్లో భక్తులు పూజలు చేస్తుంటారు. శివాలయం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండగా, చెన్నకేశవ స్వామి ఆలయ నిర్వాహణ బాధ్యతలను ధర్మకర్తలు చూస్తున్నారు. అయితే శాస్త్ర విరుద్ధంగా మూడు రోజుల క్రితం రెండు ఆలయాల మధ్య ప్రహరీ నిర్మించడం పట్ల భక్తులు, గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు, దేవాదాయ శాఖ అధికారులకు తెలియకుండా చెన్నకేశస్వామి ఆలయ ధర్మకర్తలే ఈ పనికి పూనుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శివాలయం వెనుక వైపు కనీసం భక్తులు ప్రదక్షణలు చేయడానికి కూడా వీలు లేకుండా గోడ నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఈఏపీసెట్కు 2271 మంది హాజరు ఒంగోలు సిటీ: జేఎన్టీయూ కాకినాడలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్ష జరగనుంది. జిల్లాలో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించి మొత్తం 2357 మందికి గాను 2271 మంది హజరయ్యారు. 96.35 శాతం మంది ప్రవేశపరీక్షకు హజరయ్యారు. ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలి ● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ టంగుటూరు: హౌసింగ్ లే అవుట్లో ఇళ్ల నిర్మాణాలు ప్రతి ఒక్కరూ వెంంటనే ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. మండలంలోని జమ్ములపాలెం హౌసింగ్ లే అవుట్ని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ హౌసింగ్ లే అవుట్లో ఎన్ని ప్లాట్లు ఇచ్చారు, ఎంత మంది నిర్మాణాలు చేపట్టారని వివరాలు అడిగి తీసుకున్నారు. ఇళ్ల పట్టాల లబ్ధిధారుల రీ వెరిఫికేషన్ చేసి అర్హులను గుర్తించాలన్నారు. అర్హులంతా త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్ఐ హనుమంతరావు, వీఆర్ఓ లక్ష్మి, ఇంజినీరింగ్ అసిస్టెంట్ శరత్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వరంగ సంస్థలను రంగంలోకి దింపాలి
ఒంగోలు సిటీ: పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను వెంటనే రంగంలోకి దింపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఒంగోలు పరిధిలోని పేర్నమిట్ట, త్రోవగుంట వేలం కేంద్రాలను బుధవారం సంఘం బృందం పరిశీలించారు. రెండు వేలం కేంద్రాల్లో వేలంలో పాల్గొన్న బయ్యర్లు ఏ ఒక్కరూ కూడా లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయకపోవడంపై రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జుజ్జూరి జయంతిబాబు, పమిడి వెంకటరావు, ఉపాధ్యక్షుడు పెంట్యాల హనుమంతరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు అక్షేపణ వ్యక్తం చేశారు. రైతులు తీసుకువస్తున్న బేళ్లలో 50 శాతం బేళ్లు తిరస్కరిస్తే రైతులకు ఎంత నష్టం కలుగుతుందో తెలుసా అని నిర్వాహకులను ప్రశ్నించారు. కనిష్ట ధర రూ.200 తగ్గించడం దారుణమన్నారు. గత ఏడాది రూ.360 చొప్పున కొనుగోలు చేసిన కంపెనీలు ఈ ఏడాది ఎందుకు కొనుగోలు చేయడం లేదని కంపెనీ ప్రతినిధులను, వేలం నిర్వహణాధికారి జె.తులసిని ప్రశ్నించారు. 160 మిలియన్ కిలోల పొగాకుకు బోర్డు అనుమతించిందని, కానీ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది చాలా స్వల్పమన్నారు. కంపెనీలకు విదేశీ ఆర్డర్లు రానందున కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని, ఈ నెలాఖరుకు విదేశీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని కంపెనీలు చెబుతున్నాయని నిర్వహణాధికారి తులసి పేర్కొన్నారు. కంపెనీల యాజమాన్యం సూచనల మేరకు లో గ్రేడ్ కొనుగోలు చేయడం లేదని బయ్యర్ల ప్రతినిధులు పేర్కొన్నారు. మార్కెట్ ఇదే రీతిలో కొనసాగితే 90 శాతం మంది రైతులకు బ్యారన్కు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు నష్టపోతారని తెలిపారు. వేలం ప్రారంభంలో రూ.240 ఉన్న కనిష్ట ధర పది రోజుల్లోనే రూ.200 పడిపోవడం వెనుక బయ్యర్ల సిండికేట్ అయినట్లు తెలుస్తుందన్నారు. రైతు సంఘ నేతలు బెజవాడ శ్రీనివాసరావు, కరిచేటి హనుమంతరావు, కిలారి పెద్దబ్బాయి, సుబ్బారావు పాల్గొన్నారు. నిత్యం వందలాది బేళ్లను తిరస్కరిస్తే ఎలా..? లో గ్రేడ్ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలి వేలం కేంద్రాలను పరిశీలించిన రైతు సంఘం ప్రతినిధులు -
సబ్స్టేషన్కు పసుపు రంగు
రాచర్ల: ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడంపై గతంలో నానా రచ్చ చేసిన కూటమి నాయకులు.. తాము అధికారంలోకి రాగానే తాపీగా పసుపు రంగు రాస్తున్నారు. రాచర్ల మండలంలోని మేడంవారిపల్లెలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్కు నిధులు మంజూరు చేశారు. సోమిదేవిపల్లె, గుడిమెట్ట, రామాపురం, సత్యవోలు, శీలంవెంకటరెడ్డిపల్లె, సంగపేట, ఒద్దులవాగుపల్లె, మేడంవారిపల్లెలో విద్యుత్ లోఓల్టేజీ సమస్యతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో గత ప్రభుత్వం రూ.30 లోలతో సబ్స్టేషన్ నిర్మించింది. అప్పటి ఎమ్మెల్యే అన్నా రాంబాబు భూమి పూజ చేయగా.. కాంట్రాక్టర్ పనులు సకాలంలో పూర్తి చేశారు. సబ్ స్టేషన్ గదితోపాటు ప్రధాన గేటుకు గ్రామ కూటమి నాయకులు పసుపు రంగు వేయించడం చర్చనీయాంశమైంది. ‘‘కడాన మీ మొహానికి రంగులేసుకోండి..’’ అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను గ్రామస్తులు గుర్తుచేస్తూ.. మరి ఇప్పుడు పసుపు రంగు ఎలా వేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
బంగారు దుకాణంలో చోరీ
● 40 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణ కనిగిరిరూరల్: పట్టణంలోని బోడ్డుచావిడి సెంటర్లో ఉన్న అచ్చుత పద్మ శివ జ్యూయలరీ షాపులో మంగళవారం చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జ్యుయలరీ షాపు యజమాని అచ్చుత పద్మ సొంత పనులపై తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లగా దుండగులు షాపులోకి ప్రవేశించి షాపులోని సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఈ మేరకు పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీరాం తెలిపారు. సీఐ ఎస్కే ఖాజావలి, ఎస్సైలు టీ శ్రీరాం, మాధవరావులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
హిందీ పరీక్షకు 215 మంది గైర్హాజరు
ఒంగోలు సిటీ: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు రెండో రోజు హిందీ పరీక్షకు 215 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 286 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 71 మంది మాత్రమే హాజరయ్యారు. అలాగే ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం జరిగాయి. ఇంటర్కు తెలుగు పరీక్షకు మొత్తం 1013 మంది విద్యార్థులకు గాను 838 హాజరు కాగా 175 మంది గైర్హజరయ్యారు. హిందీ పరీక్షకు 14 మందికి గాను ముగ్గురు గైర్హాజరయ్యారు. ఇంగ్లిష్ పరీక్షకు మొత్తం 653 మంది విద్యార్థులకు గాను 511 మంది హాజరుకాగా 142 మంది గైర్హజరయ్యారు. డీఈఓ కిరణ్కుమార్ 12 కేంద్రాలను పరిశీలించారు. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ ● ప్రమాదంలో డ్రైవర్ మృతి త్రిపురాంతకం: వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఇంట్లోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై మేడపి సమీపంలో చోటుచేసుకుంది. త్రిపురాంతకం మండలంలోని ముడివేముల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ వెంకటనారాయణ.. వినుకొండ వైపు నుంచి యర్రగొండపాలెం వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. లారీ అదుపు తప్పి పాత మిద్దెలోకి దూసుకెళ్లడంతో క్యాబిన్లో ఇరుక్కుపోయిన వెంకటనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ను రక్షించేందకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. చేపల వేటకు వెళ్లి మృత్యు ఒడిలోకి.. ● పొన్నలూరు చెరువులో పడి వ్యక్తి మృతి పొన్నలూరు: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యు ఒడికి చేరాడు. ఈ సంఘటన మంగళవారం పొన్నలూరు చెరువు వద్ద చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని పైరెడ్డిపాలెం గ్రామాకి చెందిన కొడవల్లూరి శేషయ్య(48)కు వివాహమై భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పొన్నలూరు చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడటంతో మృతి చెందారు. చెరువు దగ్గర ఉన్న శేషయ్య వద్దకు వెళ్లిన ఆయన బంధువు.. విగతజీవిగా నీటిలో తేలుతున్న మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు తెలియజేశాడు. దీంతో గ్రామస్తులు వచ్చి శేషయ్య మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. శేషయ్యకు మూర్చ వ్యాధి ఉండటం వల్ల చేపలు పట్టే సమయంలో చెరువులో పడి మృతి చెంది ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనూక్ తెలిపారు. -
పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి
విద్యార్థులు చదువుకోవాల్సిన వయసులో గంజాయి, ఇతర చెడు వ్యసనాలకు బానిసలై నేరస్తులుగా మారిపోతున్నారు. గంజాయి కేసులో పిల్లలు మొదటిసారి పట్టుబడితే ఒంగోలులోని రిహాబిలిటేషన్ సెంటరుకు పంపించి కౌన్సెలింగ్ ఇప్పిస్తాం. రెండోసారి పట్టుబడితే కేసు నమోదు చేస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎవరైనా గంజాయి సేవిస్తున్నా, విక్రయాలు జరుపుతున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – కె.మల్లికార్జున, కంభం సీఐ -
సెల్ టవర్ ఎక్కిన యువకుడు
యర్రగొండపాలెం: పోలీసులు తాను ఇచ్చిన కేసు నమోదు చేయడం లేదని స్థానిక అంబేడ్కర్ నగర్కు చెందిన అలేటి సురేష్ మంగళవారం పోలీస్స్టేషన్ ఆవరణలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..సురేష్ పట్టణంలోని ఇద్దరు వ్యాపారుల వద్ద నుంచి కొంతమేర అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించడం లేదని వారు అతన్ని తీవ్రంగా హింసించడంతో పాటు దాడి చేశారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ దాడిలో అతని కుడిచేయి విరిగిపోయింది. దీంతో సురేష్ పోలీస్స్టేషన్కు వెళ్లి తనపై దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఈ కేసును తీసుకోకుండా నిందితులను పిలిపించి విచారిస్తామని చెప్పి అతన్ని పంపించేవారు. పోలీస్స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆ యువకుడు సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. లేకుంటే దూకి ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించాడు. కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో అతను కిందికి దిగివచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతోనే.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దిగివచ్చిన వైనం -
తూర్పుగోదావరి మైసూరు ఎడ్లు
సత్తా చాటిన ● ఆకట్టుకున్న రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పరుగు పోటీలు స్వర్ణ(కారంచేడు): మండలంలోని స్వర్ణ గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మైసూర్ ఎడ్ల బండి పరుగు పందెం పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వల్లూరు నరేంద్రకుమార్కు చెందిన మైసూర్ ఎడ్లు ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాయి. స్వర్ణమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా తిమిడెదపాడు డొంకలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 23 ఎడ్ల జతలు తమ పేర్లు నమోదు చేసుకోగా వర్షం కారణంగా కేవలం 18 ఎడ్ల జతలు మాత్రమే పాల్గొన్నాయి. ఎంపిక చేసిన రెండు కిలోమీటర్ల దూరాన్ని ఎడ్లు టైరు బండితో కలిసి పరుగెత్తాయి. మొదటి స్థానం పొందిన నరేంద్రకుమార్ ఎడ్ల జత 4 నిమిషాల 29 సెకన్ల, 69 మిల్లీ సెకన్ల సమయంలో గమ్యం చేరుకున్నాయి. తరువాత రెండో స్థానంను బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కఠారి వేణుబాబుకు చెందిన ఎడ్ల జత 4 నిమిషాల 36 సెకన్ల, 50 మిల్లీ సెకన్లలో, మూడో స్థానం.. భవనం క్రితిక్షరెడ్డికి చెందిన ఎడ్ల జత 4.37 నిమిషాల్లో, నాలుగో స్థానాన్ని ప్రకాశం జిల్లా అల్లూరుకు చెందిన జరుగుమల్లి మోహన్చంద్ ఎడ్ల జత 4.38 నిమిషాల వ్యవధిలో నిర్దిష్ట గమ్యం చేరుకున్నాయి. ప్రథమ బహుమతిని గ్రామానికి చెందిన శివరామకృష్ణప్రసాద్ రూ. 20000, రెండో బహుమతి రూ. 15000ను కట్టా బుజ్జి, నక్కా పిచ్చియ్య, కొమ్మాలపాటి వెంకటేశ్వర్లు అందించారు. మూడో బహుమతి రూ. 10000 నార్నె వాసు, చైతన్య పంపిణీ చేశారు. నాలుగో బహుమతి రూ. 5000ను భాను, రోహిత్సాయి అందించారు. న్యాయనిర్ణేతలుగా శివరామకృష్ణప్రసాద్, కట్టా ప్రసాద్, పూల గోపిలు వ్యవహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహక కమిటీ సభ్యులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. -
చోరీ కేసులో మహిళ అరెస్టు
మార్కాపురం: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలిగా నటిస్తూ సుమారు రూ.10 లక్షల విలువైన 127 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేసిన మహిళను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా 24 గంటల్లోనే నిందితురాలిని అరెస్టు చేసి సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం సీఐ పి.సుబ్బారావు పేర్కొన్నారు. మంగళవారం సీఐ తన కార్యాలయంలో ఎస్సైలు సైదుబాబు, డాక్టర్ రాజమోహన్రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చోరీ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు కొమరోలు మండలం బొంతపల్లి గ్రామానికి చెందిన మజ్జారి బాల వెంకటయ్య మార్కాపురం పట్టణంలో ఉన్న తన అన్న మనవడి పెళ్లికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాడు. మార్కాపురం డిపోలో దిగి తన లగేజీని చూసుకోగా బంగారు ఆభరణాలు ఉంచిన బ్యాగ్ కనిపించలేదు. ఆ బ్యాగును ఓ గుర్తుతెలియని వ్యక్తి కంభం సెంటర్లో దిగుతూ తీసుకెళ్లినట్లు తోటి ప్రయాణికులు చెప్పారు. పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఐ సుబ్బారావు, ఎస్సైలు సైదుబాబు, రాజమోహన్రావు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కంభం సెంటర్లో ఓ మహిళ అనుమానాస్పద కదలికలను గుర్తించి వివరాలు సేకరించారు. పట్టణంలోని జగదీశ్వరీ థియేటర్ వద్ద నివాసముండే దూదేకుల హుస్సేన్బీగా గుర్తించి మంగళవారం ఆమె ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి నుంచి 25 గ్రాముల గోల్డ్ బ్రాస్లెట్, 25 గ్రాముల బంగారు చెవిదుద్దులు, 2 గ్రాముల 3 పూసల దండ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ షేక్ షరీఫ్, డి.కోటి నాయక్కు రివార్డులు అందించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులను సీఐ సన్మానించారు. 127 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం నిందితురాలిని పట్టించిన సీసీ కెమెరాలు -
రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించండి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: రెవెన్యూ సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంపై లోతుగా సమీక్షించారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ, భూ అప్పగించి, రీ సర్వే, రెవెన్యూ సర్వీసులు, వాటర్ టాక్స్ తదితర అంశాలపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేసేలా మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత తహసీల్దార్లతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో డివిజనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమించుకునే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ చట్టాలు, రెవెన్యూ అంశాలపై అధికారులు పూర్తి అవగాహనతో పనిచేయాలన్నారు. రెగ్యులరైజేషన్ స్కీం 2025 ప్రక్రియపై రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, అందుకనుగుణంగా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో వాటర్ టాక్స్ వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటి స్థల పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. భూముల రీ సర్వేలో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలు తయారు చేసి పంపాలన్నారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, వెంకట శివరామిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు వరకుమార్, సత్యనారాయణ, శ్రీధర్, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్బాషా, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాస్, వివిధ సెక్షన్స్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
ముక్కలు చెక్కలు
సంక్షేమం రేషనలైజేషన్ పేరుతో గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయం రెవెన్యూ శాఖను ఓ కుదుపు కుదిపింది. సచివాలయ ఉద్యోగులను మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ అనే మూడు కేటగిరీలుగా విభజస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేషనలైజేషన్ తర్వాత మిగులుగా ఉన్నవారిని ఎక్కడ, ఎలా వినియోగిస్తారనే స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తుండగా, సేవలు సక్రమంగా అందవేమోనని ప్రజలు అనుమానిస్తున్నారు. కంభం: రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆ శాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వీఆర్వోలు ఆందోళనకు గురవుతున్నారు. సచివాలయాలను క్లస్టర్లుగా విభజించడంతోపాటు సిబ్బందిని రేషనలైజేషన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18వ తేదీన జీవో నంబర్ 4 విడుదల చేసింది. దీని ప్రకారం జనాభా ప్రాతిపదికన రెండు లేదా మూడు గ్రామ/వార్డు సచివాలయాలను ఓ క్లస్టర్గా ఏర్పాటు చేసి ఉద్యోగుల సంఖ్యను సైతం కుదిస్తున్నారు. ఈ విధానంపై రెవెన్యూ శాఖలోని వీఆర్వోలు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఒక సచివాలయలో ఒక వీఆర్వో, ఒక సర్వేయర్ పనిచేస్తుండగా నూతన విధానంలో మాత్రం ఆ క్లస్టర్లోని ఒక సచివాలయంలో వీఆర్వో, మరోదానిలో సర్వేయర్ ఉంటారు. ఈ లెక్కన జిల్లాలో 353 మంది వీఆర్వోలు, 278 మంది సర్వేయర్లను మిగులు సిబ్బందిగా చూపుతున్నారు. మిగులు సిబ్బందిని ఎక్కడ సర్దుబాటు చేస్తారో ప్రభుత్వం గానీ, ఉన్నతాధికారులుగానీ స్పష్టత ఇవ్వకపోవడంతో వారంతా సతమతమవుతున్నారు. గతంలో ఏఆర్ఐ పోస్టులను తొలగించి రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు కేటాయించిన నేపథ్యలో సిబ్బంది కొరత ఏర్పడింది. ప్రస్తుతం వీఆర్వోలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో మండలంలోని సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మిగులు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చిన తర్వాతే రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని వీఆర్వోలు డిమాండ్ చేస్తున్నారు. పదోన్నతి కోసం ఎదురుచూపులు వీఆర్వోలను పాత విధానంలోనే కొనసాగించాలని వీఆర్వోలు కోరుతున్నారు. ఇప్పటికే చాలా మంది వీఆర్వోలు ప్రమోషన్ పొందేందుకు అర్హులైన వారు సర్కారు నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగి శాఖాపరమైన పరీక్షలు, సర్వే శిక్షణ, సీపీటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అందరికీ సీనియారిటీ ప్రకారం ఏక కాలంలో సీనియర్ అసిస్టెంట్ లేదా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించాలన్నది వీఆర్వోల డిమాండ్. ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ వేతనం పొందుతున్న సీనియర్ వీఆర్వోలకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నాయకులు చెబుతున్నారు. మిగులుగా ఉన్న వీఆర్వోలకు రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు సృష్టించి పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు. రెవెన్యూ వ్యవస్థ రెక్కలు విరిచేలా కూటమి ప్రభుత్వం అడుగులు సచివాలయాలను క్లస్టర్లుగా విభజిస్తూ జీవో నంబర్ 4 విడుదల ప్రస్తుతం ఒక్కో సచివాలయానికి ఒక వీఆర్వో, ఒక సర్వేయర్ కొత్త జీవో ప్రకారం రెండు సచివాలయాలకు కలిపి ఒక్కరే వీఆర్వో జిల్లాలో మిగులు ఉద్యోగులుగా 285 వీఆర్వోలు, 278 మంది సర్వేయర్లు పని భారం పెంచొద్దని, అర్హులకు ప్రమోషన్ ఇచ్చి రేషనలైజ్ చేయాలని డిమాండ్ -
ఒకే ఫొటోతో 50 మందికి మస్టర్
మార్కాపురం: నిన్న కొనకనమిట్ల... నేడు మార్కాపురం... కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పధకంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, కూటమినాయకుల పెత్తనం వెరసి ఉపాధి హామీ పథకం చిత్ర విచిత్రంగా జరుగుతోంది. ఏరోజు ఎవరికి ఎలా మస్టర్ వేస్తారో.. ఆ దేవుడికి కూడా అర్థం కావడం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టం వచ్చినట్లుగా ఫొటోలు తీసి అప్లోడ్చేస్తూ కూటమి నాయకుల మెప్పు పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే. మండలంలోని బోడపాడు గ్రామంలో రామన్నకుంటలో నీటికుంట తవ్వేందుకు పనులు చేపట్టారు. అయితే ఒకే ఫోటోతో 50 మందికి మస్టర్లు వేయడం పెద్దఎత్తున విమర్శలకు తావిస్తోంది. ఫీల్డు అసిస్టెంట్ కె.శ్రీనివాసులు ఒకే ఫొటోతో 50 మందికి మస్టర్లు వేసి అప్లోడ్ చేశారు. పనికి హాజరైన కూలీల ఫొటోలనే అన్నీ మస్టర్లకు చూపడం గమనార్హం. కొరవడిన అధికారుల పర్యవేక్షణ కేవలం అధికారపార్టీ నాయకుల జేబులు నింపేందుకే ఉపాధిహామీ పథకం తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలను వదిలి బయటకు రాకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు వేసిందే మస్టరు... పంపిందే ఫొటో... వచ్చిందే వేతనం.. లాగా తయారైంది. కూలీలు రాకపోయినా, మస్టర్ వేస్తూ కమీషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పథకం నిర్వహణపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నారు. అలా జరిగిందా.. జరగదే.. చూస్తాంలే అంటూ సమాధానాలు దాటవేస్తున్నారు. కొంతమంది సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. పనులకు రాకపోయినా వచ్చినట్లుగా మస్టర్ వేసి వారి వద్ద నుంచి కమీషన్లు తీసుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా జరిగే అవకాశం లేదు:ఏపీఓఈ విషయమై మార్కాపురం ఏపీఓ నాగరాజును వివరణ కోరగా అలా జరిగే అవకాశం లేదని, కూలీలు హాజరైనా హడావుడిలో ఒకే ఫొటోతో మస్టర్ వేసి ఉండవచ్చని, అయినా కచ్చితంగా విచారణ చేస్తానని చెప్పారు. ఉపాధిహామీలో చిత్రవిచిత్రాలు కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ -
26 నుంచి వ్యాక్సిన్ డ్రైవ్
ఒంగోలు టౌన్: మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ ప్రత్యేక కార్యక్రమాన్ని మే 26న ప్రారంభించి, జూలై 26వ తేదీ వరకు వ్యాక్సిన్లు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టి. వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాక్సిన్లతో ప్రమాదకర న్యూమోనియా, అతిసార, మెదడుకు సంబంధించిన వ్యాధులు నివారించవచ్చని తెలిపారు. 9 నుంచి 12 నెలల మధ్య మొదటి డోసు, 16 నుంచి 24 నెలల మధ్య రెండో డోసు వేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ నిర్దేశిత సమయంలో టీకాలు వేయించని 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ ప్రత్యేక కార్యక్రమంలో తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు. మే 26 నుంచి 31 వరకు మొదటి రౌండ్, జూన్ 23 నుంచి 28 వరకు రెండవ రౌండ్, జూలై 21 నుంచి 26 వరకు మూడో రౌండ్ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో టీకాలు వేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటి నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలు ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ యాజమాన్యాల్లో పనిచేస్తున్న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు డీఈఓ కిరణ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తప్పనిసరిగా బదిలీ అయ్యేవారు, అభ్యర్థన బదిలీ కోరుకునే వారు ఈ నెల 21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రిఫరెన్షియల్ కేటగిరిలో బదిలీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెడికల్ బోర్డు చెకప్కు హాజరు కాకుంటే..వెంటనే మెడికల్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు. లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాటం ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ కార్మిక, కర్షక వ్యతిరేక మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నాలుగేళ్లుగా పోరాటలు చేస్తున్నా మోడీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా సర్క్యులర్ విడుదల చేయడం దుర్మార్గమన్నారు. ఉమ్మడి పోరాటాల ద్వారా కేంద్రం కుట్రలను తిప్పి కొడతామని స్పష్టం చేశారు. దేశంలోని కార్మికులు కనీస వేతనాలు ఇవ్వకపోవడంతో దయనీయ స్థితిలో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయకుండా హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా కేంద్రం దిగివచ్చి లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు నాయకులు వీరా రెడ్డి, పి.కల్పన, చీకటి శ్రీనివాసరావు, హనుమంతు, రాజశేఖర్, దాసరి సుందరం, తంబి శ్రీనివాసరావు, జార్జి, సారధి పాల్గొన్నారు. తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి ఒంగోలు సిటీ: మాతృభాషలో విద్యా బోధన చేయడంతోనే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని, రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్టీయూ జిల్లా కార్యదర్శి గవిని శివశంకర్ మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల పునర్వవస్థీకరణలో భాగంగా 1 నుంచి 8 తరగతులు బోధించే ప్రాథమికోన్నత స్థాయిలో తెలుగు ఉపాధ్యాయులను తొలగించడం, తెలుగు మాధ్యమం లేదని ఉత్తర్వులు ఇవ్వడం కూటమి ప్రభుత్వానికి తగదని ఆక్షేపించారు. కూటమి పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు మాధ్యమాన్ని విస్మరించడం సమంజసం కాదని పేర్కొన్నారు. విద్యార్థులు మాతృభాషలో చదువుకుంటే సులభంగా నేర్చుకొని భావ వ్యక్తీకరణ చేయగలుగుతారని, తెలుగు మాధ్యమం కొనసాగించి పిల్లలు వారికి ఇష్టమైన మాధ్యమాన్ని ఎంచుకునే విధంగా అవకాశం ప్రభుత్వం కల్పించాలన్నారు. -
ప్రకాశం పంతులు జీవితం ఆదర్శం
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రకాశం పంతులు వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశస్వాతంత్య్ర పోరాటంలో, దేశాభివృద్ధిలో టంగుటూరి ప్రకాశం పంతులు పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామన్నారు. తొలుత టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుమడు టంగుటూరి సంతోష్ కుమార్ను ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డీఆర్ఓ సీహెచ్.ఓబులేసు, కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వర రావు, సీఈఓ శ్రీమన్నారాయణ, ప్రకాశం భవనంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్ : బ్రిటీష్ ముష్కరుల తుపాకులకు ఎదురొడ్డి గుండె తీసి చూపించిన ధీరుడు, స్వాతంత్య్ర పోరాటంలో తెలుగు వాడి దమ్ము చాటి చెప్పిన సాహసి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరిచిపోదని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ప్రకాశం పంతులు వర్ధంతి నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు ఎన్నో సేవలు చేశారని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, సీసీస్ సీఐ జగదీష్, ఆర్ఐ రమణారెడ్డి, ఏఆర్ ఎస్సైలు ప్రసాద్, పాపిరెడ్డి పాల్గొన్నారు. -
భూ సేకరణ వేగవంతం చేయండి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: జిల్లా నుంచి వెళుతున్న ప్రధాన రహదారులు, రైల్వే మార్గాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణతో కలిసి సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన రహదారులు, రైల్వే మార్గాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని పూర్తి చేయాలన్నారు. 565, 544(డీ), 167 (బి). 765, 544 (జి) జాతీయ రహదారులు, నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే మార్గాల నిర్మాణ ప్రాజెక్టులపై చర్చించారు. ఆయా నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ కోసం నిధుల చెల్లింపు, పెండింగ్ క్లెయిమ్స్, యాజమాన్య హక్కుల వివాదాలపై కలెక్టర్ ఆరా తీశారు. వీటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. వీటి పురోగతిపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం, పునరావాస కేంద్రాల ఏర్పాటు, నిధుల చెల్లింపులపై కలెక్టర్ ఆరా తీశారు. కొత్తపట్నం మండలంలో ఫిష్షింగ్ హార్బర్ ఏర్పాటుకు భూ సేకరణపై సమావేశంలో చర్చించారు. పాదర్తి, గుండాయపాలెం, పిన్నివారిపాలెం తదితర గ్రామాల్లో భూముల లభ్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవసరాన్ని బట్టి వాటిని సేకరించే విషయంలో ఒక స్పష్టత తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో డీఆర్ఓ బి.చినఓబులేసు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, కనిగిరి ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఎన్హెచ్ఏఐ అధికారులు పాల్గొన్నారు. -
పొగాకు వేలం అడ్డగింత
టంగుటూరు: ‘లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం లేదు. మీడియం రకం పొగాకుకు రోజు రోజుకు ధరలు తగ్గిస్తున్నారు. పెరిగిన పెట్టుబడులకు మీరు ఇస్తున్న ధరలకు ఏమాత్రం పొంతనం ఉండటం లేదు. ధరలు తగ్గించుకుంటూ పోతే మేం ఎలా బతకాలంటూ’ పొగాకు రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. టంగుటూరు వేలం కేంద్రం పరిధిలో మంగళవారం పొందూరు, ఆలకూరపాడు గ్రామాల రైతులు పొగాకు బేళ్లను వేలానికి తీసుకువచ్చారు. అయితే వేలం ప్రారంభం తరువాత ధరలను చూసిన రైతులు ఆగ్రహంతో వేలాన్ని అడ్డుకున్నారు. మీడియం రకం పొగాకుకు కేవలం రూ.205 వేయడాన్ని రైతులు మండిపడ్డారు. గత ఏడాది ఇదే రకం పొగాకును రూ.360లకు కొనుగోలు చేశారని, ఇప్పుడు ఇంత తక్కువ ధరలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. దీంతో ఆర్ఎం లక్ష్మణరావు కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. అరగంట పాటు రైతు నాయకులు, రైతులతో చర్చల అనంతరం వేలాన్ని కొనసాగించారు. రైతులు వేలానికి 447 బేళ్లను తీసుకురాగా 362 బేళ్లను కొనుగోలుచేసి 85 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.205, సరాసరి ధర రూ.241.20గా నమోదైంది. వేలంలో 23 కంపెనీలు పాల్గొన్నాయి. లో గ్రేడ్ కొనుగోలు చేయడం లేదని రైతుల ఆగ్రహం రోజు రోజుకూ ధరలు పతనమవుతున్నాయని మండిపాటు కంపెనీ ప్రతినిధులతో చర్చల అనంతరం తిరిగి ప్రారంభం -
వైస్ ఎంపీపీల ఎన్నిక ఏకగ్రీవం
మార్కాపురం టౌన్/త్రిపురాంతకం: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికై సత్తా చాటారు. జిల్లాలో మార్కాపురం, త్రిపురాంతకం మండలాల్లో ఖాళీ అయిన ఉపాధ్యక్ష స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. మార్కాపురం మండలం వైస్ ఎంపీపీ–2గా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడు కుందురు మాల్లారెడ్డి, త్రిపురాంతకం వైస్ ఎంపీపీగా పాటిబండ్ల కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మార్కాపురం మండల పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి, డీఎల్పీవో కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు. మండలంలో మొత్తం 13 మంది ఎంపీటీసీ సభ్యులు, ఒక కోఆప్షన్ సభ్యుడు ఉన్నారు. వీరిలో 11 మంది సభ్యులు వైస్ ఎంపీపీగా కుందురు మల్లారెడ్డిని బలపరిచారు. మల్లారెడ్డికి ప్రిసైడింగ్ ఆఫీసర్ ధ్రువీకరణ పత్రం అందించి, ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా వైస్ ఎంపీపీ స్థానానికి బరిలో నిలిచిన కుందురు మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు తన నివాసంలో సోమవారం బి–ఫారం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నారు బాపన్రెడ్డి, ఎంపీపీ బి.లక్ష్మీదేవి, ఎంపీటీసీ సభ్యులు పి.అరుణ చెంచిరెడ్డి, లక్ష్మమ్మ, పేతురు, సంధ్యారాణి, లక్ష్మీదేవి, వీరమ్మ, వెంకటసుబ్బమ్మ, వీరనారాయణమ్మ, ఎల్లమ్మ, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మల్లారెడ్డికి అభినందనలు మార్కాపురం మండల వైస్ ఎంపీపీగా ఎన్నికై న మల్లారెడ్డిని మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కుందురు నాగార్జునరెడ్డి అభినందించారు. మండల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పార్టీ ఏపీ మున్సిపల్ విభాగ కమిటీ సెక్రటరీ వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు నాయకులు, అధికారులు అభినందనలు తెలియజేశారు. త్రిపురాంతకంలో.. త్రిపురాంతకం మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పాటిబండ్ల కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. త్రిపురాంతకం ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ మేడపి ఎంపీటీసీ సభ్యుడు కృష్ణ పేరును ప్రతిపాదించగా ముడివేముల ఎంపీటీసీ సాయపునేని సుబ్బారావు, మిగిలిన సభ్యులు బలపరిచారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎంపీటీసీ సభ్యులను సమన్వయపరిచి ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా కృషి చేశారు. ఈ మేరకు పాటిబండ్ల కృష్ణతో ఎన్నికల అధికారి, మండల ప్రత్యేకాధికారి అయిన వండర్మేన్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎంపీడీఓ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం, త్రిపురాంతకంలో మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికలు రెండు మండలాల్లోనూ సత్తా చాటిన వైఎస్సార్ సీపీ వైస్ ఎంపీపీలుగా ఎన్నికై న కుందురు మల్లారెడ్డి, పాటిబండ్ల కృష్ణ -
బాధితులకు న్యాయం చేయాలి
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ దామోదర్ ఒంగోలు టౌన్ : ప్రజా ఫిర్యాదులను నిర్ణీత కాలపరిమితి లోగా విచారించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమంలో సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 70 ఫిర్యాదులు రాగా, ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. రాతపూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ దామోదర్, పోలీస్ అధికారులు.. బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆయా ఫిర్యాదుల గురించి సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో మాట్లాడి చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఆయా ఫిర్యాదులపై తీసుకునే చర్యలపై నివేదిక కూడా ఇవ్వాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం పోలీసు స్టేషన్లు/కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదు దారులతో పోలీసు అధికారులు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించి చట్ట పరిధిలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ సురేష్బాబు, మహిళా పీఎస్ డీఎస్పీ రమణకుమార్, ఎస్సీ, ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, డీటీసీ ఇన్స్పెక్టర్ షమీముల్లా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు రజియా సుల్తాన్, సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా మహా కుంభాభిషేకం
అద్దంకి/అద్దంకి రూరల్: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ప్రాంగణం ‘జై శ్రీరామ్.. జై ఆంజనేయం, ప్రసన్నాంజనేయం’ నామస్మరణతో మార్మోగిపోయింది. సోమవారం మహా కుంభాభిషేక నూతన ఆలయ ప్రారంభం, విమాన శిఖర కలశ ప్రతిష్ట, జీవ ధ్వజ స్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు దేవదాయశాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ నెల 14న ప్రారంభమైన కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. కుంభాభిషేకంలో భాగంగా విమాన శిఖర కలశ ప్రతిష్ట, నూతన ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్ట నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 3 వేల మంది మహిళా భక్తులతో ఉదయాన్నే అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నది నుంచి మూడు వేల కళశాలతో జలాన్ని తీసుకుని ‘జై శ్రీరామ్.. జై శ్రీరామ్’ నామస్మరణ చేసుకుంటూ శింగరకొండ వరకు శోభాయాత్ర నిర్వహించారు. కేరళ వాయిద్యాలు, ప్రత్యేక నృత్యాలతో, దేవతా వేషధారుల విన్యాసాలతో కన్నుల పండువగా సాగింది. కిక్కిరిసిన క్యూలైన్ల్లు.. కుంభాభిషేక కార్యక్రమాన్ని శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామి నిర్వహించారు. కుంభాభిషేకానికి హాజరైన భక్తులతో క్షేత్రంలోని ప్రత్యేక క్యూలైన్లు కిక్కిరిశాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ సామాజిక వర్గాల్లోని సత్రాల్లో అన్నదానంతోపాటు, దేవాలయ అధికారుల ఆధ్వర్యంలో 30 వేల మందికి అన్న సంతర్పణ చేశారు. అద్దంకి బస్టాండ్ నుంచి భవిష్య పాఠశాలకు చెందిన రెండు బస్సులు భక్తులను ఉచితంగా చేరవేశాయి. కోటా శ్రీనివాసకుమార్ భక్తులకు తాగునీరు సరఫరా చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి ప్రసన్నాంజనేయ స్వామికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్శాఖ మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం తిమ్మనాయుడు, సిబ్బంది పర్యవేక్షించారు. 700 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. బందోబస్తును చీరాల డీఎస్పీ మొయిన్, అద్దంకి సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగిన శింగరకొండ క్షేత్రం గుండ్లకమ్మ నది నుంచి శింగరకొండ వరకు 3 వేల మంది మహిళలతో శోభాయాత్ర యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మేనక(ఏనుగు) ప్రత్యేక అతిథిగా హాజరైన శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామిమహిమాన్వితుడు అంజన సుతుడు విధుశేఖర భారతిస్వామి లక్షల డబ్బు ఖర్చు పెట్టే పని లేకుండా 108 సార్లు రామనామ జపం చేస్తే చాలా ఎక్కువ ఫలితం పొందవచ్చని శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామి అన్నారు. మహా కుంభాభిషేకం అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. రామాయణంలోని సుందరకాండలో, కిష్కిందకాండలో ఆంజనేయస్వామి దివ్యమైన చరిత్ర మనకు తెలుస్తుందని చెప్పారు. అనాది కాలం నుంచి ఆంజనేయస్వామి ఆరాధనను చేయడం సంప్రదాయంగా వస్తుందని, ఆయన మహిమ అపారమైనదన్నారు. శింగరకొండలో ఒకే దేవతను రెండు రూపాల్లో కొండపైన లక్ష్మీ నరసింహాస్వామి గానూ, కొండ కింద ఆంజనేయస్వామిగానూ మనకు దర్శనం ఇస్తున్నారన్నారు. శింగరకొండ దివ్య క్షేత్రమని చెప్పారు. అటువంటి క్షేత్రంలో ఆ స్వామికి నూతనాలయం, నూతన విమాన గోపుర, కలశ ప్రతిష్ఠ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొన్న వారంతా భగవత్ అనుగ్రహానికి పాత్రులు అయ్యారన్నారు. ఏదో పూర్వజన్మ పుణ్యం ఉంటేనే ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని చెప్పారు. -
వైఎస్సార్ సీపీపై అభిమానం అభినందనీయం
● పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఒంగోలు సిటీ: మార్కాపురం మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షునిగా కుందురు మల్లారెడ్డి, త్రిపురాంతకం మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షునిగా పాటిబండ్ల కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికవడం, వైఎస్సార్ సీపీ పట్ల వారు చూపిన అంకితభావం ఎంతో అభినందనీయమని పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం అవుతుందనడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. జిల్లాలో పార్టీ ప్రతిష్ట పెంచుతూ నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుండి నడిపిస్తున్న జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. -
గంజాయి విక్రేతలు ముగ్గురు అరెస్టు
● నిందితుల నుంచి 2 కేజీల గంజాయి స్వాధీనం ● కేసు వివరాలు వెల్లడించిన కంభం సీఐ మల్లికార్జున కంభం: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కంభం సీఐ మల్లిఖార్జున తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం సీఐ విలేకర్ల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. వైజాగ్కు చెందిన ఓ సాధువు బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామంలోని ముక్తేశ్వరం గుడి వద్ద ఉన్న మావిళ్ల శ్రీనివాసులు అనే సాధువుతో పరిచయం ఏర్పచుకున్నాడు. ఈ క్రమంలో అతనికి గంజాయి అమ్మితే మంచి డబ్బులు వస్తాయని ఆశ చూపాడు. దీంతో శ్రీనివాసులు బేస్తవారిపేటకు చెందిన వీరిశెట్టి వెంకటేష్, కంభానికి చెందిన గంటా నవీన్కు సమాచారం ఇచ్చాడు. ముగ్గురూ కలిసి వైజాగ్ నుంచి వచ్చిన సాధువు వద్ద కేజీ రూ.8 వేల చొప్పున 2.150 గ్రాముల గంజాయి కొనుగోలు చేశారు. గంజాయిని గుడి వద్దనే ప్యాకెట్లుగా చేస్తే గ్రామస్తులకు తెలిసిపోతుందని భావించి కంభం చేరుకున్నారు. ఓ కిరాణా షాపులో చిన్న సైజు ప్లాస్టిక్ కవర్లు కొనుగోలు చేసి రావిపాడు రోడ్డులోని పంట పొలాల వద్దకు బయలుదేరారు. అదే మార్గంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురూ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయితో పట్టుబడ్డారు. తహసీల్దార్ వి.కిరణ్ సమక్షంలో గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గరినీ అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై నరసింహారావు పాల్గొన్నారు. -
పలు కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
సంతనూతలపాడు: మండలంలోని ఎండ్లూరు డొంక వద్ద గల జిల్లా మహిళా ప్రాంగణంలో త్వరలో బ్యూటీషియన్, మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడర్, ఫ్యాబ్రిక్ కట్టర్ కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు మహిళా ప్రాంగణ జిల్లా మేనేజర్ వై.అంజమ్మ తెలిపారు. ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో మహిళా ప్రాంగణ కార్యాలయానికి వచ్చి 18 నుంచి 45 సంవత్సరాల్లోపు మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెండుమూడు నెలల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 83339 21346 మొబైల్ నంబర్ను సంప్రదించాలని కోరారు. ప్రతి అర్జీపై శ్రద్ధ పెట్టాలి ● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు బదిలీ చేస్తూ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. మీ కోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వాటికి అర్ధవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు ప్రతిరోజూ లాగిన్ అయి ఆన్లైన్లో వచ్చిన వినతులను చూడాలని, రీ ఓపెన్ కేసులు రాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్ఓ బి.చినఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కుమార్, శ్రీధర్, వరకుమార్, డిప్యూటీ కలెక్టర్ పార్ధసారధి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నాయకులకు పదవులు ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దివ్యాంగుల విభాగం రాష్ట్ర సెక్రటరీగా సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన కాట్రగడ్డ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా దర్శి నియోజకవర్గానికి చెందిన దగ్గుల బ్రహ్మానందరెడ్డిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. జోరువానలోనూ సీహెచ్ఓల పోరుఒంగోలు టౌన్: పదోన్నతులు, క్రమబద్దీకరణ, పీఎఫ్ పునరుద్ధరణ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన సమ్మె సోమవారంతో 21వ రోజుకు చేరింది. సోమవారం భారీ వర్షంలోనూ సీహెచ్ఓలు దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందగిరి రాజేష్ మాట్లాడుతూ.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. సీహెచ్ఓల సమస్యలు పరిష్కరించడం వల్ల ప్రభుత్వం మీద ఎలాంటి ఆర్థిక భారం పడదని చెప్పారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, పెరిగిన నిత్యావసరాల వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని వేతనం పెంచాలని కోరారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సీహెచ్ఓల్లో 85 శాతం మహిళలు ఉన్నారని, ఆడబిడ్డల మొహం చూసైనా న్యాయం చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు శ్రీకాంత్, శైలజ, కామేష్, ఖాదర్ వలి, బాబురావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
పొదిలి రూరల్: పొగాకు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ విమర్శించారు. సోమవారం పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని వారు సందర్శించారు. వారికి పూలమాలలతో రైతులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేలం బిడ్డింగ్లో పొగాకు కొనుగోళ్ల తీరును పరిశీలించి అధికారులు, రైతులతో మాట్లాడి వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలై తీవ్ర మనోవేదనతో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అప్పల బాధలు తట్టుకోలేక ఇటీవల పర్చూరు నియోజకవర్గంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు కంపెనీల ప్రతినిధులు రైతులను ప్రోత్సహించి పంట సాగు చేయించారని, తీరా కొనుగోళ్ల సమయంలో వారు కనిపించకపోవడం వలన రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అప్గ్రేడ్ ఉన్న ఎస్–2, ఎఫ్–1 రూ.240 నుంచి రూ.250కి కూడా అమ్ముడుపోయే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అమరావతి నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని, కానీ, పంటలు పండించే రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు... సూపర్సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినప్పటికీ రైతుల గురించి పట్టించుకోకపోవడంతో మిర్చి, పొగాకు, ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్ఫెడ్ ద్వారా సుమారు రూ.100 కోట్లు వెచ్చించి పొగాకు కొనుగోళ్లు చేయించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుతం లో గ్రేడ్ అని చెప్పి నో బిడ్ కింద వెనక్కి పంపిస్తున్నారని, పొగాకు ధరలు దారుణంగా పడిపోయి రైతులు అప్పల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది పెట్టుబడి ఎక్కువై పంట దిగుబడి కూడా తగ్గిందన్నారు. దీనికితోడు పొగాకు బోర్డు కొనుగోలు చేసే రేట్లు కూడా తగ్గడం వలన రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుకు అన్నిరకాలుగా అండగా నిలబడిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం దుర్మార్గంగా ప్రైవేటు వ్యాపారులు వారికిష్టమైన రేట్లు ఇవ్వడం వలన రైతాంగం పూర్తిగా నష్టపోతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునఃపరిశీలన చేసి గత ప్రభుత్వ విధానాలు అవలంబించి రైతులకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి గిరిరాజ్కుమార్, అధికారులు, పొదిలి, కొనకనమిట్ల మండలాల వైఎస్సార్ సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, జి.శ్రీనివాసులు, గొలమారి చెన్నారెడ్డి, మెట్టు వెంకటరెడ్డి, ఎం.మురళి, గుజ్జుల సంజీవరెడ్డి, ఫిరోజ్, రైతులు పాల్గొన్నారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పొదిలి పొగాకు వేలం కేంద్రం సందర్శన -
ద్రోహం!
ప్రతిష్టాత్మకఒంగోలులోని ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ క్యాంపస్లపై కూటమి ప్రభుత్వం శీతకన్ను వేసిందా..? అంటే, పరిశీలకులు అవుననే అంటున్నారు. అద్దె చెల్లించడం భారమవుతుందన్న సాకులు చెప్పి జిల్లా కేంద్రమైన ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్ను ఇడుపులపాయ, నూజివీడు సెంటర్లకు తరలిస్తూ గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అదే కారణంతో ఎస్ఎస్ఎన్ క్యాంపస్ను కూడా ఎత్తేసేందుకు తెరవెనుక యత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు క్యాంపస్లకు సంబంధించి రూ.3 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కాలేజీని పూర్తిగా ఎత్తేయాలన్న కుట్రతోనే అద్దెలు, కరెంటు బిల్లులు చెల్లించడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. విద్యుత్ బిల్లులు ఎందుకు చెల్లించలేదు..? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు రావ్ అండ్ నాయుడు క్యాంపస్ కరెంటు బిల్లు రూ.90,96,753, ఎస్ఎస్ఎన్ క్యాంపస్ విద్యుత్ బిల్లు రూ.1,82,00,262 చెల్లించాల్సి ఉంది. ఈ వారంలో రావ్ అండ్ నాయుడు క్యాంపస్కు విద్యుత్ సరఫరా కట్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన క్యాంపస్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఈ విషయం బయటకు తెలియకుండా విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి విద్యుత్ను పునరుద్ధరించారు. ఇలా తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యార్థులు విమర్శిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలు లేకపోవడంతో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం ఐదు బ్రాంచీలతో, రెండో సంవత్సరం సీఎస్ఈ విద్యార్థులతో నగరంలోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్లో కొనసాగుతోంది. చీమకుర్తి రోడ్డులోని ఎస్ఎస్ఎన్ క్యాంపస్లో 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులు విద్యనభ్యస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల నుంచి రావ్ అండ్ నాయుడు క్యాంపస్కు అద్దె చెల్లించడం నిలిపివేసింది. దాంతో అద్దె బకాయిలు భారీగా పేరుకుపోయాయి. అయినా క్యాంపస్ యజమాని మాలకొండయ్య నాయుడు కాలేజీపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని సమాచారం. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం. అయినప్పటికీ ప్రభుత్వం ఒంగోలు క్యాంపస్ను తరలించేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. దీని కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఒంగోలు క్యాంపస్ను తరలించేందుకుగానూ కమిటీ వేసినట్లు చెబుతున్నారు. అయితే, ఆ కమిటీ ఒంగోలు క్యాంపస్లో పనిచేస్తున్న ఉద్యోగులతోగానీ, విద్యార్థులతోగానీ మాట్లాడలేదు. పోనీ, ఇడుపులపాయలోని ఆర్కేవ్యాలీలోని అధికారులతో కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎవరితోనూ మాట్లాడకుండానే క్యాంపస్ తరలింపునకు అనుకూలంగా ఏప్రిల్ 28వ తేదీ వైస్ చాన్సిలర్కు నివేదిక ఇచ్చింది. దీనిపై ఈ నెల 6వ తేదీ ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్లో జరిగిన సమావేశంలో డైరెక్టర్, ఏఓ, అకడమిక్ డీన్లు క్యాంపస్ తరలించనున్నట్లు ప్రకటించారు. దీంతో విస్తుపోయిన రావ్ అండ్ నాయుడు క్యాంపస్ ఉద్యోగులు ఆర్టీయూకేటీలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందికి ఈ విషయం తెలియజేయాలని కోరారు. దీంతో 7వ తేదీ ఎస్ఎస్ఎన్ క్యాంపస్లో కూడా సమావేశం పెట్టి రావ్ అండ్ నాయుడు క్యాంపస్ను తరలిస్తున్నట్లు వెల్లడించారు. క్యాంపస్ను తరలించవద్దంటూ 80 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది 12వ తేదీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ముగుస్తున్న ఎస్ఎస్ఎన్ క్యాంపస్ లీజు... చీమకుర్తి రోడ్డులోని ఎస్ఎస్ఎన్ క్యాంపస్ లీజు 2027 జనవరిలో ముగియనుంది. దీనికి నెలకు రూ.40 లక్షల అద్దె చెల్లించేలా అగ్రిమెంటు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు అక్కడ క్యాంపస్ కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్న అధికారులు.. ఆ తర్వాత మాత్రం ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు. విద్యుత్ బిల్లులనే చెల్లించని ప్రభుత్వం, రూ.40 లక్షల అద్దె మాత్రం ఎందుకు చెల్లిస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. లీజు ముగిసిన తర్వాత ఎస్ఎస్ఎన్ క్యాంపస్ను కూడా తరలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమతున్నాయి. స్పందించని టీడీపీ ఎమ్మెల్యేలు... ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీని ఇడుపులపాయకు తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునే విషయంలో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులలో స్పందన కానరావడం లేదు. ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ కాలేజీని తరలిస్తూ వైస్ చాన్సిలర్ ఉత్తర్వులు జారీ చేసినా, ఆ విషయాన్ని అధికారులు, ఉద్యోగుల దృష్టికి తీసుకొచ్చినా టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు నటిస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఉన్న ట్రిపుల్ ఐటీని ఒంగోలు నుంచి తరలించడంపై జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లయినా లేదని పలువురు మండిపడుతున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి కష్టాలు విద్యుత్ బిల్లు, అద్దెలు చెల్లించకుండా కుట్రలు ఇప్పటికే రావ్ అండ్ నాయుడు క్యాంపస్కు మంగళం ఎస్ఎస్ఎన్ క్యాంపస్పై కూడా కన్ను 2027 జనవరితో ముగియనున్న ఎస్ఎస్ఎన్ క్యాంపస్ లీజు అగ్రిమెంట్ రూ.3 కోట్ల విద్యుత్ బకాయిలు స్పందించని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు -
కోర్టు కానిస్టేబుల్ పాత్ర చాలా కీలకం
● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: నేరస్తులకు శిక్ష విధించి, బాధితులకు న్యాయం చేయడంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర చాలా కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం కోర్టు మానిటరింగ్ సిబ్బందితో ఎస్పీ సమావేశమయ్యారు. కోర్టు ట్రయల్ దశలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకుని సూచనలు, సలహాలు ఇచ్చారు. సాక్షులు కోర్టులో సాక్ష్యం చెప్పేలా తర్ఫీదు ఇవ్వాలని, సేకరించిన సాక్ష్యాలను సరైన పద్ధతిలో కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పారు. పోలీసు స్టేషన్లో నమోదయ్యే కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో పొందుపరచాలని ఆదేశించారు. లోక్ అదాలత్ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు. సమావేశంలో డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, సిబ్బంది పాల్గొన్నారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి కొమరోలు: కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. వివరాలు.. కొమరోలు మండలంలోని క్రిష్ణంపల్లె గ్రామానికి చెందిన కె.మహేష్ ఈ నెల 16వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి గిద్దలూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా ఆరోగ్యం విషమించడంతో వైద్యులు ఒంగోలు జీజీహెచ్కు సిఫార్సు చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మహేష్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. బ్యాంకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పెద్దదోర్నాల: మండల కేంద్రమైన పెద్దదోర్నాలలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఖాతాదారులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ తీగలు కాలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బ్యాంకు సిబ్బంది వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తేవడంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. -
కటకటాల్లోకి కిలేడీ
కొండపి: ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో ఏమరపాటుగా ఉన్న మహిళ నుంచి బంగారు ఆభరాల బ్యాగ్ చోరీ చేసిన మహిళను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఈ నెల 12న కొండపి బస్టాండ్లో జరిగిన చోరీ కేసులో సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి చెందిన జి.కుమారి ఈ నెల 12న కందుకూరు మండలం విక్కిరాలపేటలో బంధువుల ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో కొండపి బస్టాండ్లో కందుకూరు బస్సు కోసం కొంత సమయం వేచి ఉన్నారు. బస్సు ఎక్కే క్రమంలో కర్రల సంచిలో ఉన్న బ్యాగ్ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయగా కాసేపటికే గుర్తించారు. బ్యాగ్లో 130 గ్రాముల బంగారు ఆభరణాలు, 120 గ్రాముల వెండి వస్తువులు, పాస్పోర్ట్ ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. దీంతో సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్ కుమార్ రెండు బృందాలుగా విడిపోయి కేసు దర్యాప్తు చేశారు. చీరాలకు చెందిన చవట అంజలిని నిందితురాలిగా గుర్తించారు. కందుకూరులో బంగారు ఆభరణాలు విక్రయించేందుకు వెళ్తున్న అంజలిని మద్దులూరు–అనకర్లపూడి గ్రామాల మధ్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి నుంచి మొత్తం 165 గ్రాముల బంగారు ఆభరణాలు, 120 గ్రాముల వెండి, పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. చోరీ కేసును వారం వ్యవధిలో ఛేదించిన కొండపి సీఐ, ఎస్సై బృందాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించినట్లు చెప్పారు. సమావేశంలో సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్ కుమార్, కానిస్టేబుళ్లు రవి, శంకర్, సుధాకర్, సురేష్, నాగలక్ష్మి పాల్గొన్నారు. చోరీ కేసు ఛేదించిన కొండపి పోలీసులు నిందితురాలి నుంచి 165 గ్రాముల బంగారం, 120 గ్రాముల వెండి, పాస్పోర్ట్ స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్ -
ఐదు గ్రానైట్ టిప్పర్ల సీజ్
చీమకుర్తి: ఓవర్ లోడుతో వెళ్తున్న ఐదు గ్రానైట్ టిప్పర్లను చీమకుర్తి సీఐ ఎం.సుబ్బారావు సోమవారం సీజ్ చేశారు. రామతీర్థం డంపింగ్ల నుంచి రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గ్రానైట్ వేస్ట్ రాళ్లతో వెళ్తున్న టిప్పర్లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. ఓవర్ లోడు కారణంగా తరచూ ట్రాఫిక్ అంతరాయం, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆర్టీఓ డిపార్టుమెంట్ అధికారులతో పాటు విజిలెన్స్ డిపార్టుమెంట్ వారు దృష్టి పెట్టి ఓవర్లోడుతో వెళ్లే వాహనాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. -
పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి
రాచర్ల: పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..జేపీచెరువు గ్రామానికి చెందిన ఒంటేరు రంగయ్య, పామూరు శ్రీనివాసులు, గోతం వలి కలిసి గొర్రెల మేత కోసం నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి చెందాయి. ఒంటేరు రంగయ్యకు చెందిన 12 గొర్రెలు, పామూరు శ్రీనివాసులకు చెందిన 5, గోతం వలికి చెందిన 5 గొర్రెలు మృతి చెందాయి. వాటి విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. -
స్వర్ణాంధ్ర– స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వాములు కండి
● బీట్ ద హీట్లో కలెక్టర్ తమీమ్ అన్సారియా కొత్తపట్నం: వేసవిలో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. స్వర్ణాంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని అల్లూరులో బీట్ ద హీట్ అనే కార్యక్రమం నిర్వహించారు. తొలుత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం రాజీవ్ కళామందిర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. గ్రామాల్లో సేకరించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించి చెత్తను ఎరువుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అల్లూరు గ్రామాన్ని కూడా విజువల్ క్లీన్ వీలేజ్గా తీర్చిదిద్దేలా గ్రామస్తులు కృషి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో అనేక పనులు చేపడతామన్నారు. గ్రామంలోని చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికీ చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలి మండలంలో 15 పంచాయతీల్లో పెండింగ్ పనులు ఉన్నాయని, పూర్తి చేయాలని ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి కలెక్టర్ను కోరారు. గత ప్రభుత్వ హయాంలో గ్రావెల్, మట్టి రోడ్లకు రూ.11 కోట్లు మంజూరయ్యాయని, ఆ నిధులు ఇప్పుడు నిలిచిపోయాయని, వాటిని తిరిగి మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. అల్లూరు చెరువులో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో డీకే భూములు 70 శాతం ఉన్నాయని, వాటిని వారి వారసుల పేర్లపై మార్చడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం స్వర్ణాంధ్ర–స్వచ్ఛంధ్ర కార్యక్రమానికి పంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నంబూరి సూర్యనారాయణ, ఆర్డీఓ లక్ష్మిప్రసన్న, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటనాయుడు, డ్వామా పీడీ జోసెఫ్కుమార్, ఆర్డబ్ల్యూస్ ఎస్ఈ బాల శంకరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాశాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ పి.మధుసూధన్రావు, ఎంపీడీఓ శ్రీకృష్ణ, ఈవోఆర్డీ వేణుగోపాల్ మూర్తి, ఎంపీటీసీ మిట్నసల శాంతారావు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. -
తిరగబడ్డ జెండా రంగులు
దర్శి(కురిచేడు): వీర సైనికులకు మద్దతుగా శనివారం దర్శి పట్టణంలో త్రివర్ణపతాకాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు ఆమె భర్త డాక్టర్ కడియాల లలిత్సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ మహేష్, తహసీల్దార్ శ్రావణ్కుమార్, సీఐ రామారావు, మాజీ సైనికోద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. త్రివర్ణపతాకానికి ఎక్కడా అవమానం జరగకూడదు. అది దేశానికి అవమానం జరిగినట్లు అవుతుందని ప్రతి పౌరుడు భావిస్తారు. అయితే ర్యాలీలో చాలా మంది ధరించిన తీవ్రర్ణ పతాకం టీ షర్టులపై త్రివర్ణాలు తిరగబడ్డాయి. ఈ విషయాన్ని ర్యాలీ నిర్వాహకులు సైతం గమనించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు ఒంగోలు టౌన్: వేగంగా వెళుతున్న ట్రావెల్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. పోలీసుల కథనం ప్రకారం..అమరావతిలోని ఉద్దండరాయుని పాలెం నుంచి తమిళనాడులోని నాగపట్నం వెళుతున్న మార్నింగ్ స్టార్ బస్సు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నగర శివారులోని త్రోవగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో 26 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన జుజ్జవరపు కోటమ్మ, మంద బుల్లమ్మాయి, పులిషారం పుష్ప, తుళ్లూరు మండలంలోని వెలగపూడి గ్రామానికి చెందిన చలివేంద్ర శ్రీలేఖ, రాయనపాడు గ్రామానికి చెందిన జుజ్జవరపు విక్రమ్, ఉద్దండరాయనిపాలెం గ్రామానికి చెందిన పులి పుష్పలను జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నీటి ముల్లు..!
పురం గొంతులోపశ్చిమ ప్రకాశానికి ముఖ ద్వారం మార్కాపురం. అక్కడ బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు పడుతున్నారు పట్టణవాసులు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లోపం వెరసి ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వారం రోజులకోసారి సాగర్ నీటిని ప్రజలకు అందిస్తుండడంతో ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. దూపాడు ఎస్ఎస్ ట్యాంకులో నీళ్లున్నా అందించలేని దుస్థితి. సుమారు లక్ష జనాభా ఉన్న పట్టణంలో అధికారుల మధ్య సమన్వయలోపం నీటి సమస్య తీవ్రరూపానికి కారణంగా మారుతోంది.మార్కాపురం టౌన్: పట్టణ ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి రాజీవ్ నగరబాటలో భాగంగా మార్కాపురం పర్యటనకు వచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే ఆయన రూ.45 కోట్లు మంజూరు చేశారు. దీంతో దూపాడు వద్ద నుంచి సుమారు 28 కిలోమీటర్ల మేర మార్కాపురానికి పైపులైన్లు ఏర్పాటు చేసి సాగర్ నీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు. 2,200 మిలియన్ లీటర్ల కెపాసిటీతో దూపాడు వద్ద సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించారు. నాటి నుంచి ప్రజలకు సాగర్నీటిని అందిస్తుండటంతో ఇబ్బందిలేకుండా కొనసాగింది. ప్రస్తుతం పట్టణ విస్తీర్ణం పెరగడంతో పాటు జనాభా కూడా పెరుగుతూ వస్తోంది. వారి అవసరాలకు సరిపడా నీటిని అందించలేకపోతున్నారు. అయితే, దూపాడు నుంచి కేశినేనిపల్లి వరకూ సుమారు 3 కిలోమీటర్ల మేర జీఆర్పీ పైపులైను తరచూ మరమ్మతులకు గురికావడంతో ప్రజలకు నీటి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. పైపులైన్లు పగిలితే ప్రజలకు నరకమే. గతంలో నాలుగు రోజులకొకసారి నీటిని అందించేవారు. ప్రస్తుతం వారానికొకసారి అందించడం కూడా గగనంగా మారింది. పైపులైన్లు మరమ్మతులకు గురైతే మరో మూడు రోజులు అదనంగా సమయం పడుతోంది. ఇదే అదునుగా నీటి వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ట్యాంకర్ నీటిని రూ.500 వరకూ విక్రయిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉంటే మరో రూ.200 అదనంగా తీసుకుంటున్నారు. 6 రోజులకొకసారి సాగర్ నీటి సరఫరా పైపులైన్లు పాడైతే నరకమే అడుగంటిన డీప్ బోర్లు శివారు కాలనీల్లో నీటి సమస్యలు ఎస్ఎస్ ట్యాంకులో నీరున్నా.. ప్రజలకు తప్పని నీటి కష్టాలు శివారు ప్రాంతాల్లో నీటి కష్టాలు... మార్కాపురం పట్టణంలోని శివారు ప్రాంతాలైన రాజ్యలక్ష్మినగర్, చెన్నకేశవనగర్, బాపూజీకాలనీ, పూలసుబ్బయ్యకాలనీ, కొండారెడ్డికాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఎస్సీ, బీసీకాలనీ, సుందరయ్యకాలనీ, ఎస్టేట్, డ్రైవర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఉన్న డీప్బోర్లలో కొన్ని అడుగంటిపోవడంతో నీటికి ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా నీరు వచ్చే డీప్బోర్ల వద్ద నీటిని పట్టుకుని వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో సుమారు 185 వరకూ డీప్బోర్లు ఉన్నాయి. ప్రస్తుతం వేసవికాలం కావడంతో భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతూ వస్తున్నాయి. 180 బోర్లలో నీరు పూర్తి స్థాయిలో రావడంలేదు. బోర్లు ఎండిపోయిన ప్రాంతాలకు మున్సిపాలిటీకి చెందిన రెండు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అవి కూడా సక్రమంగా రాకపోవడంతో బిందెనీటిని రూ.పదికి కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.