breaking news
Prakasam District Latest News
-
చెన్నారెడ్డిని కోర్టుకు తరలించిన పోలీసులు
సాక్షి టాస్క్ఫోర్స్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి నెమలిదిన్నె చెన్నారెడ్డిపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో గురువారం మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన హైవే రోడ్డులో ఉన్న టీస్టాల్ను పరిశీలించి వివరాలు సేకరించారు. చెన్నారెడ్డి గురువారం ఉదయం మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో హాజరయ్యాడు. మాజీ ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, అన్నావెంకటరాంబాబు డీఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లి అధికారులు, వైఎస్సార్ సీపీ నాయకులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో చెన్నారెడ్డిని మార్కాపురం డీఎస్పీ కార్యాలయం నుంచి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చి అక్కడ వైద్య పరీక్షల అనంతరం గిద్దలూరు కోర్టుకు తీసుకెళ్లారు. చెన్నారెడ్డి వైద్యశాలకు తీసుకొచ్చారని తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు అధిక సంఖ్యలో వైద్యశాలకు చేరుకొని సంఘీభావం తెలిపారు. -
కారు డ్రైవర్కు సంకెళ్లు
యర్రగొండపాలెం: టోల్గేట్ల వద్ద చలానా ఎగ్గొట్టేందుకు, పోలీసుల చెకింగ్ నుంచి బయటపడేందుకు కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్, పోలీస్ సైరన్తో తిరుగుతున్న డ్రైవర్ను స్థానిక పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కె.అజయ్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. మార్కాపురానికి చెందిన షేక్ మున్వర్ అలియాస్ మున్నా ఐదేళ్ల క్రితం అప్పటి గిద్దలూరు ఎమ్మెల్యే కారు డ్రైవర్గా పనిచేశాడు. ఆ సమయంలో గడువుదీరిన ఎమ్మెల్యే స్టిక్కర్ను నిందితుడు తన వద్ద ఉంచుకొని దానిపై వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు పేరుతో నకిలీ స్టిక్కర్ తయారు చేయించుకొని కారు ముందు భాగాన పెట్టుకొని తిరుగుతున్నాడు. గడువు తీరిన ఎమ్మెల్యే స్టిక్కర్తో టోల్గేట్, ఫారెస్ట్ చెక్క్ పోస్టుల వద్ద డబ్బులు చెల్లించకుండా దర్జాగా తన కారును తిప్పుతున్నాడు. ఎస్పీ హర్షవర్ధన్రాజు, మార్కాపురం డీఎస్పీ నాగరాజు ఆదేశాల మేరకు ఎస్సై పి.చైడయ్య మాచర్ల రోడ్డులోని మిల్లంపల్లి టోల్ గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో అతని బాగోతం బయటపడింది. నకిలీ స్టిక్కర్తో పాటు కారు నంబర్ ఏపీ07డీజడ్1807లో ఉన్న డీని బ్లూ కలర్ స్టిక్కర్తో బ్లాక్ చేశాడు. నిందితుడు మున్వర్పై ట్యాంపరింగ్, ఎంవీ కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. అర్హత లేని వారు తమ వాహనాలపై పోలీస్, ప్రెస్, మెజిస్ట్రేట్, ఎమ్మెల్యే, ప్రభుత్వ శాఖలకు చెందిన లోగోలు వాడుతున్నారని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అజయ్కుమార్ హెచ్చరించారు. ● నూతన అధ్యక్షుడిగా శిద్దా సుధీర్కుమార్ ఎమ్మెల్యే నకిలీ స్టిక్కర్తో తిరుగుతున్న నిందితుడు వివరాలు వెల్లడించిన సీఐ అజయ్కుమార్ -
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
కనిగిరిరూరల్: మంచినీటి సమస్యలపై స్థానిక పదో వార్డు 6వ సచివాలయం వద్ద మహిళలు ఖాళీ బిందెలతో గురువారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ పదో వార్డులోని కంది పప్పు మిల్లు వీధి, ప్రధాన వీధులకు కొన్ని రోజులుగా నీళ్లు రావడం లేదన్నారు. ఇటీవల డీప్ బోర్వెల్ మరమ్మతులు చేసినా కుళాయిలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. దీంతో నీటి కోసం వార్డు ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నామన్నారు. సచివాలయ ఎమ్యునిటీ అధికారి ఇన్చార్జి కావడంతో వార్డులోని నీటి సమస్యను పట్టించుకోవడం లేదని మహిళలు అరోపించారు. అనంతరం సచివాలయ అధికారులకు వినతిపత్రం అందచేశారు. టంగుటూరు: బాల్య వివాహాలతో ఎన్నో అనర్థాలు ఉన్నాయని జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్కుమార్ అన్నారు. బాల్య వివాహాల విముక్తి భారత్ వందరోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలోని బి.నిడమానూరు కేజీబీవీ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, చిన్న వయసులోనే వివాహాలు చేస్తే పిల్లల అమూల్యమైన జీవితం నాశనం అవుతుందన్నారు. బాలిక ఇంటికి భారమనే అపోహలో తల్లిదండ్రులు ఉన్నారని, ఇటువంటి అపోహల నుంచి విద్యార్థులు బయటకు రావాలని సూచించారు. ప్రతి బాలిక అభివృద్ధి చెందుతే కుటుంబ వ్యవస్థ, సమాజం అభివృద్ధి చెందినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో టంగుటూరు, సింగరాయకొండ ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: గంజాయికి అడ్డాగా మారిన చీమకుర్తిపై పోలీసులు దృష్టి సారించారు. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండంలోని జీఎల్పురం గ్రామం ఎస్టీ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న నాగలూరి మార్తమ్మ అనే మహిళను గురువారం అదుపులోనికి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న 1.850 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ముగ్గురు వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు మార్తమ్మ తెలిపింది. దీంతో ఆ ముగ్గురిని అరెస్టు చేసేందుకు ముమ్మర గాలింపు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
లైంగిక దాడి కేసులో నిందితునికి పదేళ్ల జైలు
ఒంగోలు: మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితునికి పదేళ్ల జైలు శిక్ష విఽధిస్తూ 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి పందిరి లలిత గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మానసిక వికలాంగురాలైన బాధితురాలిది ఒంగోలు. 2021 మార్చి 20న సాయంత్రం 4 గంటల సమయంలో నాగినేని నారాయణ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అప్పటి సీఐ సత్యకై లాష్ కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఇరువైపులా వాదనల అనంతరం నేరం రుజువైనట్లు పేర్కొంటూ నిందితుడు నారాయణకు పదేళ్ల జైలుశిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి పందిరి లలిత తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పీపీ కేవీ రామేశ్వరరెడ్డి, కోర్టు లైజన్గా ఏఎస్సై కె.లక్ష్మీనారాయణ, హెచ్సీ కె.నరేంద్రరావులు వ్యవహరించారు. సింగరాయకొండ: వేటకు వెళ్లి మత్స్యకారుడు ప్రమాదశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం మండలంలోని పాకల గ్రామ పంచాయతీ పోతయ్యగారి పట్టపుపాలెం వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..పోతయ్యగారి పట్టపుపాలెంకు చెందిన కోడూరి ఏడుకొండలు(47) గురువారం తెల్లవారుజామున తన ఇద్దరు కుమారులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. చేపల కోసం వల వేసి వల లాగే క్రమంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి చెందాడు. దీంతో ఇద్దరు కుమారులు తండ్రి ఏడుకొండలు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై బి. మహేంద్ర పేర్కొన్నారు. సింగరాయకొండ: రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్రైలు ఢీకొని అంగన్వాడీ కార్యకర్త కరేటి రమాదేవి(62) మృతి చెందింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం సోమరాజుపల్లి రైల్వే గేటు సమీపంలోని 3వ రైల్వేలైనుపై జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..సోమరాజుపల్లి ఎస్సీ కాలనీ–2 లోని అంగన్వాడీ కేంద్రంలో రమాదేవి పనిచేస్తోంది. మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళుతుండగా రైలు పట్టాలు దాటే క్రమంలో కావలి నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న గూడ్స్రైలు ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రమాదేవి మృతికి ఆయాలు, కార్యకర్తలు, సూపర్వైజర్లు సంతాపం తెలియజేశారు. అంగన్వాడీ సూపర్వైజర్ రిజ్వానా, స్నేహితురాలు ఖమురున్నీసా సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఒంగోలు సిటీ: జిల్లా విద్యాశాఖాధికారిగా సీవీ రేణుక గురువారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు డీఈఓగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుంటూ ముందుకు పోతామన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రిపూడి: పాముకాటుకు మహిళ మృతి చెం దింది. ఈ సంఘటన మండలంలోని కెల్లంపల్లి పంచాయతీ జి.అగ్రహారంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కెల్లంపల్లి పంచాయతీ జి.అగ్రహారం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీటీసీ కందిమళ్ల రామయ్య, అతన భార్య అరుణ(40) ఇద్దరు కలిసి పశువులకు గడ్డి కోసేందుకు గ్రామానికి సమీపంలోని పొలంలోకి వెళ్లారు. కోసిన గడ్డిని ట్రాక్టర్లో వేసే క్రమంలో గడ్డిలో ఉన్న పాము కాటు వేసింది. దీంతో బాధితురాలిని పొదిలి వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమపిత్తం ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మెరుగైన ఫలితాలు సాధించాలి
కనిగిరిరూరల్: మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఇంటర్ విద్య గుంటూరు జోన్ సంయుక్త సంచాలకురాలు జె.పద్మ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంకల్ప–2026 కార్యాచరణ ప్రణాళిక అమలు తీరును, బోధనాభ్యాసాన్ని, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఏబీసీ కేటగిరిలుగా వర్గీకరించి నిర్వహిస్తున్న పరీక్షల విధానం, ఫలితాల విశ్లేషణను సమీక్షించారు. మెరుగైన ఫలితాలు సాధించాలని తెలిపారు. అనంతరం రికార్డులను, సైన్స్ ల్యాబ్ను, మధ్యాహ్న భోజన పథకం, వసతులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పొలంరెడ్డి రమణారెడ్డి, అధ్యాపకులు కుమ్మరకుంట సురేష్, సీహెచ్ చెన్నకేశవులు, పద్మజ, రవీంద్ర, హనుమంతరావు, రామరాజు, కోటి సాహెబ్, వెంకటరాజు, గురవమ్మ, నాగమణి, ప్రమోద్, వెంకట సురేష్, మార్తమ్మ, మహాబూబ్ బాషా, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆర్జేడీ పద్మ -
విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వద్దు
దర్శి: విద్యార్థులకు వసతులు కల్పించే విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆయన గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి ఆరా తీశారు. వంటగది, తాగునీరు, మరుగుదొడ్లను పరిశీలించారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా వైద్యులు వస్తున్నారా లేదా, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, హాస్టల్లో కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు బాలికల వసతి గృహాన్ని పరిశీలించినట్లు తెలిపారు. వసతులు, భోజనంపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీనాయక్, దర్శి నియాజకవర్గ ప్రత్యేకాధికారి జూన్సన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు, తహసీల్దార్ శ్రావణ్కుమార్, ఏఎస్డబ్ల్యూఓ ఆదిలక్ష్మి, హాస్టల్ వార్డెన్ అరుణ పాల్గొన్నారు బాలికల హాస్టల్ను తనిఖీ చేసిన డీఆర్వో ఓబులేసు -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా షంషేర్ ఆలీబేగ్
మార్కాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా మార్కాపురం పట్టణానికి చెందిన డాక్టర్ మీర్జా షంషేర్ ఆలీబేగ్ను నియమిస్తూ తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. ఈయన గతంలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా, మార్కాపురం మార్కెట్ యార్డు చైర్మన్గా పనిచేశారు. తనపై నమ్మకంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని, కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని షంషేర్ తెలిపారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. -
కనిపించకుండా వణికిస్తోంది..
స్క్రబ్ టైఫస్.. ఈ పేరు జిల్లా వాసులను వణికిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ఇద్దరు మృత్యువాత పడగా, మరికొందరు ఒంగోలు, గుంటూరు జీజీహెచ్లలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇది కనిపిస్తోంది. అదీ పశ్చిమ ప్రకాశంలో ఎక్కువ ప్రభావం చూపుతోంది. పొలాలకు వెళ్లే మహిళలలో ఈ తరహా జ్వరాలు కనిపిస్తుండటంతో గ్రామీణ మహిళలు పొలాలకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. జ్వరం వస్తేనే బెంబేలెత్తుతున్నారు. దీనిపై అవగాహన లేకపోవడంతో జ్వర బాధితులు సకాలంలో చికిత్స చేయించుకోక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒంగోలు టౌన్: వరుస మరణాలతో జిల్లాలో కలకలం... స్క్రబ్ టైఫస్తో వరుస మరణాలు సంభవించడంతో జిల్లాలో కలకలం రేగింది. జిల్లాలో ఇద్దరు మరణించగా, మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యర్రగొండపాలెం గ్రామంలోని ఇజ్రాయిల్పేటకు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు పరిమళ దానమ్మ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఈ నెల 6వ తేదీ తెల్లవారుజామున మృతి చెందింది. గత నెల 16వ తేదీ జ్వరం, నీళ్ల విరేచనాలు, నీరసంతో ఆమె బాధపడుతూ ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందింది. అక్కడ తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కి పంపించారు. 18 రోజుల పాటు గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే సంతనూతలపాడు మండంలోని రుద్రవరం గ్రామానికి చెందిన కోయ నాగేంద్రమ్మ అనే 51 ఏళ్ల వృద్ధురాలు కూడా స్క్రబ్ టైఫస్తో బాధపడుతూ మరణించింది. జ్వరం బారిన పడిన నాగేంద్రమ్మకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసినప్పటికీ తగ్గకపోవడంతో గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 9వ తేదీ మరణించింది. మరో ఆరుగురికి పాజిటివ్... కొనకనమిట్ల మండలంలోని అంబాపురం గ్రామానికి చెందిన మరో వృద్ధురాలికి స్క్రబ్ టైఫస్ సోకింది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు కొనకనమిట్ల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. ఎంతకూ తగ్గకపోవడంతో వైద్య పరీక్షలు చేసి స్క్రబ్ టైఫస్ సోకినట్లు నిర్ధారించారు. వెంటనే ఒంగోలు జీజీహెచ్కి తరలించి వైద్యం చేస్తున్నారు. అయితే, స్క్రబ్ టైఫస్తో బాధపడుతూ ఒంగోలు జీజీహెచ్కి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి గురువారం వరకు ఐదుగురు స్క్రబ్ టైఫస్తో బాధపడుతూ జీజీహెచ్లో చేరినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.మాణిక్యరావు తెలిపారు. 9వ తేదీ ఒక్కరోజే జీజీహెచ్కి ముగ్గురు వచ్చారు. 10వ తేదీ ఒకరు, 11వ తేదీ మరొకరు చేరినట్టు సమాచారం. అంతేగాకుండా ప్రైవేటు ఆస్పత్రి నుంచి మరొక కేసు కూడా జీజీహెచ్కి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ మూడు రోజుల్లో ఆరు పాజిటివ్ కేసులు నమోదై జీజీహెచ్లో చేరారు. బాధితుల్లో ఒంగోలు నగరంతో పాటు పొదిలి, కందుకూరు, మార్కాపురం, కంభాలపాడు గ్రామాలకు చెందిన వారున్నారు. ప్రస్తుతం వీరంతా ఆరోగ్యంగా ఉన్నారని, ఒకటీరెండు రోజుల్లో వీరిని డిశ్చార్జి చేస్తామని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. భయాందోళన అవసరం లేదు స్క్రబ్ టైఫస్ ప్రమాదకరం కాదు. డాక్సిసైక్లిన్ ట్యాబ్లెట్తో నయమవుతుంది. నిజానికి ఇది గత రెండుమూడేళ్లుగా కనిపిస్తోంది. మన జిల్లాలో 2024లో 31 కేసులు పాజిటివ్ వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 కేసులు నమోదయ్యాయి. వారం రోజులుగా జరుగుతున్న ప్రచారం వలన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే వ్యాధి సోకిన తర్వాత ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. – డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి భయం వద్దు.. సకాలంలో చికిత్స అవసరం... స్క్రబ్ టైఫస్ అనేది వైరస్ కాదు. అంటే ఒకరి నుంచి మరొకరికి సోకదు. ప్రాణాపాయం కూడా కాదు. ఇది సాధారణమైన జ్వరం మాత్రమేని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో స్క్రబ్ టైఫస్ సోకి చనిపోయిన వారంతా 60 ఏళ్ల వయసు కలిగిన వారు కావడాన్ని గమనించాలని చెబుతున్నారు. వృద్ధాప్యంలో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు స్క్రబ్ టైఫస్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు వైద్యులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఆర్ఎంపీల వద్ద చికిత్స చేయించుకోవడం సర్వసాధారణమైపోయింది. దీంతో విలువైన కాలం హరించుకుపోతుందని, వ్యాధిని నిర్ధారించే సరికి ప్రాణం పోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, చలి కనిపించిన వెంటనే సమీపంలోని ప్రాథమిక వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు. -
శాపం కాకూడదు.!
వరం కావాలి.. ● మార్కాపురం జిల్లాపై వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: కొత్తగా ఏర్పడబోతున్న మార్కాపురం జిల్లా ప్రజలకు ఒక వరంగా ఉండాలని, శాపం కాకూడదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. గురువారం మార్కాపురంలో దళిత సంఘాల నాయకులు ప్రెస్ మీట్ పెట్టి తనను వలస నేతగా విమర్శించడంపై ఆయన స్పందించారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ తనపై దళిత నాయకులు చేసిన విమర్శలను ఖండించారు. తాను వలస నేతను కాదని, ప్రకాశం బిడ్డనని స్పష్టం చేశారు. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఒక బహుమానంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్న ఉద్దేశంతో బాధ్యత గల ప్రజాప్రతినిధిగా తాను మాట్లాడుతున్నానని అన్నారు. పశ్చిమ ప్రకాశంలో బహుజనులు, గిరిజనులు, మధ్యతరగతి కుటుంబీకులు, వెనుకబడిన తరగతులకు చెందినవారు, మైనార్టీ లు, అన్ని వర్గాలకు చెందిన వారిలో అత్యంత పేద కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. వారి అభ్యున్నతికి కొత్తగా ఏర్పడనున్న జిల్లా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలు ఎవరికీ శాశ్వతం కాదని, రాజకీయ నాయకులకు కొమ్ముకాయడం మానుకుని వాస్తవాలు విశ్లేశించాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఏర్పడబోతున్న జిల్లాల్లో మార్కాపురం జిల్లా అత్యంత వెనుకబడిందన్న సత్యాన్ని గుర్తించాలన్నారు. చంద్రశేఖర్కు ఏం తెలుసు అనే మేధావులు.. కొత్త జిల్లాకు ఆర్థిక పురోగతి అవసరమా, కాదా అనే విషయాన్ని గుండెలపై చేయివేసుకుని ఆలోచించాలని అన్నారు. ఆర్థిక వనరులులేని ఈ ప్రాంతంలో పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయినప్పటికీ సాగు, తాగునీటి అవసరాల కోసం అనేక గ్రామాలు అలమటిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత తక్కువ ధరకు అత్యంత ఎక్కువ స్థాయిలో వ్యవసాయ అధారిత ఫ్యాక్టరీలు, కంపెనీలు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మూడు రాష్ట్రాలకు రవాణా వ్యవస్థలు కలిగిన ఈ ప్రాంతంలో ఆర్థిక వనరులు హక్కుగా రావాలే తప్ప.. మరే ఇతర మార్గాలలో రావన్న సత్యాన్ని గమనించాలని కోరారు. తాను సంపూర్ణ అవగాహనతో ప్రజాప్రతినిధిగా పశ్చిమ ప్రాంత ప్రజలకు మేలు చేయాలన్న మంచి ఉద్దేశంతో కొత్తగా ఏర్పడబోతున్న జిల్లా పరిస్థితులపై మాట్లాడుతున్నానని తెలిపారు. దళిత కార్డులు ఉపయోగించుకుని మీతో మాట్లాడిస్తున్న నేతలను ప్రశ్నించండని, ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జిల్లా గెజిట్ ప్రకారం మేలు ఏంటో, కీడు ఏంటో బహిరంగంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో మాట్లాడించండని అన్నారు. జీవిత కాలం అత్యంత పేద జిల్లాగా మార్కాపురాన్ని మార్చే కుట్రను గ్రహించాలని హితవు పలికారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్కాపురం ఒక అడ్డాగా మారి వెనుకబడిన తరగతులకు, పేదలకు అందని ద్రాక్షగా తయారైందన్నారు. కొంతమంది కబంధ హస్తాలలో బిగించబడటాన్ని గ్రహించాలని, చౌకబారు వ్యాఖ్యలుమాని ఈ ప్రాంతాభివృద్ధి కోసం పోరాటం చేయాలని తాటిపర్తి చంద్రశేఖర్ హితవు పలికారు. పేదల బిడ్డల కోసం, పేదల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేసిన టీడీపీ నాయకులకు మార్కాపురం గురించి మాట్లేడే నైతిక హక్కు లేదన్నారు. మిర్చి యార్డ్ ఏర్పాటు గురించి మాట్లాడలేని వారికి రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉందో తెలుస్తోందన్నారు. ఇండస్ట్రియల్ హబ్గా ఉన్న దొనకొండ, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీశైలంను వదులుకుని చంద్రబాబు కంబంధ హస్తాలలో బంధించబడిన టీడీపీ ఎమ్మెల్యేల బాధ్యతారాహిత్యం ఈ జిల్లాకు శాపంగా మారబోతుందన్న విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. -
రేపు నవోదయ ప్రవేశ పరీక్ష
ఒంగోలు సిటీ: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 13వ తేదీ పరీక్ష నిర్వహించనున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ సి.శివరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 25 కేంద్రాల్లో 5,502 మంది విద్యార్థులకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ప్రవేశ కార్డు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఒంగోలు: అండర్–12 బాలుర జిల్లా క్రికెట్ జట్టును ఈ నెల 13వ తేదీ స్థానిక మంగమూరు రోడ్డులోని అసోసియేషన్ సబ్ సెంటర్లో ఎంపిక చేయనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తప్పనిసరిగా వైట్ డ్రస్, షూ, సొంత కిట్తో హాజరుకావాలని సూచించారు. జనన ధ్రువీకరణ పత్రం (ఫారం 5), ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్ వెంట తీసుకురావాలన్నారు. 2013 సెప్టెంబర్ 1 నుంచి 2015 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించిన వారు మాత్రమే ఎంపికకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పూర్తి వివరాలకు కోచ్ల మొబైల్ నంబర్లు 9701022333, 9246222999ను సంప్రదించాలని నాగేశ్వరరావు సూచించారు. ఒంగోలు: జాతీయస్థాయి 40వ తైక్వాండో చాంపియన్షిప్ను ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు విజయవాడలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు కోచ్, తైక్వాండో 5వ డాన్ షేక్ కరిముల్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాల్గొనదలచిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీ స్థానిక సీవీఎన్ రీడింగ్ రూం ఆవరణలో నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. తద్వారా విజయవాడలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోచ్ కరిముల్లా సూచించారు. ● జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి రాజ్యలక్ష్మి ఒంగోలు: కక్షిదారులు ఈ నెల 13వ తేదీ నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ చైర్పర్సన్ టి.రాజ్యలక్ష్మి కోరారు. స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను ఆమె వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీకి అర్హత కలిగిన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా వ్యాజ్యాలు, అన్ని రకాల బ్యాంకు కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రీ లిటిగేషన్ స్థాయిలో కూడా కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ కేసులు, ట్రాఫిక్ కేసులు కూడా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం నిమిత్తం 29 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రీ సిట్టింగ్ల ద్వారా ఇప్పటికే 15,150 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. దీనివల్ల కేసులు వేగవంతంగా పరిష్కరించుకునే సౌల భ్యం ఉందన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజ్యలక్ష్మి కోరారు. ఒంగోలు వన్టౌన్: దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనం 2026 ఫిబ్రవరి 8న నిర్వహించనున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ తెలిపారు. జిల్లాకు వచ్చిన ఆయన ఒంగోలులోని సమితి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యాదవులపై ఆగ్రకుల దాడులను ప్రభుత్వం అరికట్టాలన్నారు. మార్కాపురం జిల్లాకు కాటమరాజు జిల్లాగా పేరును నిర్ణయించాలని కోరారు. యాదవ నాయకులు జాజుల శ్రీనివాస యాదవ్, కుట్టుబోయిన కోటియాదవ్, పాశం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పీపీపీలు కుప్పకూలుతాయి
యర్రగొండపాలెం: దేశంలో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించిన ఇండిగో విమానాలు ఒక్కసారిగా గాలిలోకి ఎగరకుండా మొరాయించాయని, అదే విధంగా చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవస్థ కుప్ప కూలితే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులను ఒంగోలుకు తరలించే వాహనాన్ని ఆయన పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండిగోలో 65 శాతం వాటా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండటం వలన ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ విమానాలను ఆకస్మికంగా నిలిపేశారని, దీనివలన లక్షలాది మంది విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అనేక మంది మానసిక వ్యథకు గురయ్యారన్నారు. ఇతర దేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు, ఉద్యోగులు తమ ప్రయాణాలను నిలుపుకోవాల్సి వచ్చిందని అన్నారు. చంద్రబాబు పీపీపీ పద్ధతిలో అమ్మకానికి పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణ తమకు చేతకాదని ప్రైవేటు వ్యక్తులు చేతులు ఎత్తివేస్తే అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు, శస్త్ర చికిత్స చేయించుకోవటానికి సిద్ధంగా ఉన్న వారితో పాటు లక్షలాది మంది మెడికో విద్యార్థుల పరిస్థితి ఎలాగుంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు, విద్యార్థుల పరిస్థితి గుర్తించి అన్ని వర్గాలకు చెందిన పేద పిల్లల తల్లిదండ్రులు కంటున్న మెడికో కలలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించారని, వాటి నిర్మాణాలకు కోట్లాది రూపాయలు కేటాయించి పనులు వేగవంతం చేయించారన్నారు. వాటిలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయించారని చెప్పారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన 18 ఏళ్ల పదవీ కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు చేయించలేకపోయారని, ఉన్న కాలేజీలను నిర్వీర్యం చేసేందుకు పథకాలు పన్నుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్న తరువాత రాష్ట్రంలో రెడ్బుక్ సంస్కృతిని తీసుకొచ్చి అల్లకల్లోలం చేస్తున్నారని, ఎక్కడ చూసినా దోపిడీలు, హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. నియోజకవర్గం మొత్తం మీద 61,190 సంతకాలను సేకరించగలిగామని అన్నారు. -
ఎంఎస్ఎంఈ పార్క్ స్థలాన్ని పరిశీలించిన జేసీ
కొండపి: మండలంలోని నెన్నూరుపాడు గ్రామంలో సర్వే నంబర్ 433 లో 44.31 ఎకరాల భూమిలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు స్థలాన్ని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ బుధవారం పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలిచ్చారు. ఆయన వెంట తహసీల్దార్ శీలం శ్రీనివాసరావు, ఆర్ఐ శ్రీనివాసరావు మండల సర్వేయర్ రాజు, ఏపీ 11సీ జోనల్ మేనేజర్, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు. చీమకుర్తి: ప్రకాశం జిల్లా బాలికలు, మహిళల ఖోఖో జట్ల ఎంపిక ఈనెల 12న చీమకుర్తి ప్రభుత్వ హైస్కూలులో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీ.రఘుబాబు, కే హనుమంతురావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 44వ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హాజరయ్యే క్రీడాకారిణులు వయస్సు ధ్రువీకరణకు ఆధార్ కార్డులను తీసుకొని హాజరు కావాలన్నారు. ఒంగోలు వన్టౌన్: స్థానిక సంస్థలు, చట్ట సభల్లో ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించే బిల్లులను ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా చట్టాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఒంగోలులోని సంఘ జిల్లా కార్యాలయంలో ‘హలో బీసీ–చలో ఢిల్లీ’ వాల్పోస్టర్ను పలువురు బీసీ నాయకులతో కలసి బుధవారం ఆవిష్కరించారు. ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న మహా ధర్నా, పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో బీసీలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈనెల 15న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాతో పాటు, పార్లమెంటు ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 16న ఓబీసీలకు జనాభా దామాషా మేరకు రాజకీయ రిజర్వేషన్లతో పాటు, మహిళా రిజర్వేషన్ చట్టసవరణ చేసి ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ విజ్ఞాపన పత్రాలను ప్రముఖులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమ్మరి క్రాంతి కుమార్, జిల్లా మేదర సంఘం అధ్యక్షుడు కేతా చలపతిరావు, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గోగుశివుడు, వడ్డెర సంఘం నాయకుడు తన్నీరు శ్రీనివాసరావు, రజక సంఘం నాయకుడు నాగేశ్వరరావు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు భోదనం శ్రీనివాసరావు, జంగం సంఘ నాయకులు దోగిపర్తి సుబ్బారావు, కృష్ట బలిజ సంఘం నాయకుడు బీకే మూర్తి, మేదర సంఘం నాయకుల సిరివెళ్ల బాలకృష్ట, పిల్లి మధు, వీరా చంద్రశేఖర్ శనగవరపు రాజేంద్రప్రసాద్, సైభ మురళి, వాసు, సూర్యబలిజ నాయకులు మద్దెల మురళి పాల్గొన్నారు. -
ఉచిత వైద్యం అందించడమే ధ్యేయం
దర్శి: పేదలందరికీ ఉచిత వైద్యం అందించడమే వైఎస్సార్ సీపీ ధ్యేయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ స్పష్టం చేశారు. కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా దర్శి నియోజకవర్గంలో సేకరించిన 60 వేల సంతకాల ప్రతులను బుధవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ఒంగోలుకు తరలించారు. పార్టీ కార్యాలయంలో ప్రతులను ప్రదర్శించి వాహనంలో 30 బాక్సుల్లో ప్రతులను ఉంచి బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మలు జెండా ఊపి వాహనాన్ని ర్యాలీగా తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో 60 వేల సంతకాలు పూర్తి చేసి ఆన్లైన్ చేసినట్లు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల ఉద్యమానికి మద్దతు పలికారని చెప్పారు. ఈనెల 15వ తేదీన జిల్లాలో అన్నీ నియోజకవర్గాల నుంచి ఒంగోలుకు వచ్చిన ప్రతులను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయానికి చేర్చుతారన్నారు. గ్రామంలో ఉద్యమంలా సంతకాల సేకరణ విజయవంతంగా జరిగిందని చెప్పారు. చంద్రబాబు పేదలకు ఉచిత వైద్యం దూరం చేస్తున్న తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రతి పేదవాడు టీడీపీకి ఓటు ఎందుకు వేశామా అని బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పేదలకు మేలు చేయాలి కానీ ఇలా తమ స్వార్థం కోసం గత పాలకులు తీసుకొచ్చిన ప్రభుత్వ ఆస్తులను దోచుకోవాలనుకోవడం దురదృష్టకరమన్నారు. వైఎస్ జగన్కు మంచి పేరు రావడాన్ని టీడీపీ నేతలు, చంద్రబాబు జీర్ణించుకోలేక పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో తన బినామీలకు అప్పగించి ప్రైవేటుపరం చేసి పేదలకు వెన్నుపోటు పొడిచేందుకు కుట్రలు చేస్తు్ాన్నరన్నారు. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పేదలకు ఉచిత వైద్యం అందుతుందా అని ప్రశ్నించారు. ఇదేనా పేదల పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి అని మండిపడ్డారు. ఇప్పటికై నా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని పీపీపీ విధానం వెనక్కు తీసుకుని పేదలకు ఉచిత మెడికల్ విద్య, ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జగనన్న ఆదేశాల మేరకు పేదల కోసం ఎందాకై నా పోరాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. -
కోటి సంతకాల గర్జన
కోటి సంతకాల ప్రతులుసాక్షి ప్రతినిధి, ఒంగోలు: పేదల వైద్య విద్యకు, వైద్యానికి పాతరేసే ప్రభుత్వ నిర్ణయంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టే కుటిలయత్నంపై సమరభేరి మోగించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది. రెండు నెలలుగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేసి సీఎం చంద్రబాబుకు హెచ్చరికలు చేశారు. ఎనిమిది నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు ఉద్యమ స్థాయిలో వేల మంది సంతకాల ప్రతులను బుధవారం జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. అన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి ప్రతులను ప్రత్యేక వాహనాల్లో జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి వాటిని భద్రపరిచారు. ప్రభుత్వమే నిర్వహించాలి.. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతులను ఒంగోలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చ్ని నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు. ఒంగోలు నియోజకవర్గంలో సేకరించిన 62 వేల సంతకాల ప్రతుల బాక్సులన్నింటినీ ప్రత్యేక వాహనంలో తరలించారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి జెండా ఊపి ఆ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేశారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. నిరంతర ఉద్యమం సింగరాయకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి కోటి సంతకాల ప్రతులను ఒంగోలుకు తరలించారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వాటిని ఒంగోలుకు తరలించారు. కార్లతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు జారీ చేసిన జీఓ నెంబరు.590 ను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నియోజకవర్గంలో 59,504 సంతకాలను సేకరించి ఒంగోలు పార్టీ కార్యాలయానికి తరలించామన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య, ఎస్ఈసీ సభ్యుడు డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీసీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. పీపీపీ వద్దే వద్దు.. సంతనూతలపాడు నియోజకవర్గంలోని సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో సేకరించిన 72 వేల సంతకాల ప్రతులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, నాయకులు ర్యాలీగా ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు. మద్దిపాడులోని పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద సంతకాల ప్రతులను ఆటోలో నింపి మేరుగు నాగార్జున జెండా ఊపి ఆటోను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు సీఎం చంద్రబాబు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో ప్రజలకు దూరం చేస్తున్నారన్నారు. పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలు నిర్వహిస్తే పేద ప్రజలకు వైద్యం, వైద్య విద్య అందదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు బొట్ల రామారావు, జెడ్పీటీసీ, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ,,సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన మార్కాపురం నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో మార్కాపురం టౌన్, రూరల్, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి టౌన్, పొదిలి మండలాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు, రైతులు, మహిళలు వ్యవసాయ కూలీలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వమే కళాశాలతో పాటు వైద్యశాలను కూడా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వాహనాన్ని జెండా ఊపి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రారంభించారు. కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం కళ్లుతెరచి ప్రజల మనోభావాలను గుర్తించి మెడికల్ కాలేజీని పీపీపీ విధానానికి ఇచ్చిన జీవోను రద్దుచేసి ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే కే ఆదెన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ ఆలీబేగ్, ఎస్ఈసీ సభ్యుడు వెన్నా హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అన్యాయం మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజలు ఛీకొడుతున్నారని వైఎస్సార్ సీపీ గిద్దలూరు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు. 56,500 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారని వెల్లడించారు. బుధవారం ఉదయం సంతకాల ప్రతులతో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ విభాగం కార్యదర్శి వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు పాల్గొన్నారు. బాబు నిర్ణయం దుర్మార్గం కనిగిరిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల పత్రాలను పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంలో బుధవారం ఒంగోలుకు తరలించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి బైక్లు, కార్లతో ర్యాలీగా బయలుదేరి స్థానిక చెక్పోస్టు వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దద్దాల మాట్లాడుతూ పేదలకు విద్య, వైద్యం అందించాలన్న లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే వాటిని బాబు సర్కార్ ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. నియోజకవర్గంలో 60,230 సంతకాలు సేకరించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు కదిరి బాబూరావు, పీడీసీసీబీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి(బన్నీ) పాల్గొన్నారు. -
రెండు ఆయిల్ ట్యాంకర్ల పట్టివేత
ఒంగోలు టౌన్: చైన్నె నుంచి ఇండస్ట్రీయల్ మిక్స్డ్ ఆయిల్తో వస్తున్న రెండు ట్యాంకర్లను విజిలెన్స్ పోలీసులు ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో పట్టుకున్నారు. విజిలెన్స్ సీఐలు రాఘవరావు, రవిబాబు, డీసీటీ ఓ.రామారావు, ఎస్సై నాగేశ్వరరావు, ఎస్ఓ పుల్లయ్య బృందం బుధవారం పొదిలి మెయిన్ రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ట్యాంకర్లు పట్టుబడ్డాయి. గ్రానైట్ కంపెనీలు, క్వారీల్లో ఉపయోగించే మిక్స్డ్ అయిల్ ను అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారించారు. ప్రభుత్వానికి కట్టాల్సిన జీఎస్టీ రూ.2.70 చెల్లించకుండా ట్యాంకర్ల ద్వారా చెన్పై కు చెందిన రాజమణి ఒంగోలులోని శ్రీనివాస లూబ్రికెంట్స్కు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. దీదన్ని డీజిల్ బదులుగా చీమకుర్తిలోని గ్రానైట్ పరిశ్రమలకు, క్రషర్ వాహనాలకు వినియోగించడానికి రూ.87లకు అమ్మివేసినట్లు తేలింది. తక్కువ పరిణామం ఉన్నట్లు వే బిల్లు తయారు చేసి జీఎస్టీ కూడా ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రెండు ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారుల బృందం నమునాలు సేకరించారు. అక్రమంగా రవాణా చేస్తున్న ఒంగోలుకు చెందిన ఏల్చూరి శ్రీనివాసరావు, చీమకుర్తికి చెందిన ఎర్లా నారాయణ, చైన్నె దివ్య ఇండస్ట్రీస్కు చెందిన రాజమణిలపై కేసు నమోదు చేశారు. టెన్త్ విద్యార్థులకు ఆల్ఇన్వన్లు అందించిన బూచేపల్లిచీమకుర్తి రూరల్: బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని దేవరపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు ఆల్ఇన్వన్ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణ కలిగి విద్యనభ్యసించాలని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తమ కుటుంబం పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ చేయూతనిస్తుందన్నారు. పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య ఉందని ఉపాధ్యాయులు చెప్పడంతో జెడ్పీ నుంచి నిధులు కేటాయిస్తామని వెంకాయమ్మ తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు పాఠశాలకు రావడానికి బస్సు సౌకర్యం లేదని తెలపగా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్టు ద్వారా విద్యార్థులకు చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఓబులరెడ్డి, వైస్ ప్రసిడెంటు చిన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ టీ గాంధీ, పులి వెంకారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
యర్రగొండపాలెం సీఐకు మెమో
● ఎరిక్షన్ బాబు బర్త్డే వేడుకల్లో పోలీసుల ఓవరాక్షన్పై ఎస్పీ సీరియస్ ● సెలవు మీద వెళుతున్న దోర్నాల ఎస్సై ఒంగోలు టౌన్: యర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడమే కాకుండా ఆయన పట్ల అత్యంత వినయం ప్రదర్శించిన సీఐ కె.అజయ్ కుమార్, ఎస్సై చౌడయ్య, దోర్నాల ఎస్సై వి.మహేష్, పుల్లలచెరువు ఎస్సై సంపత్ కుమార్లపై ఎస్పీ హర్షవర్థన్ రాజు సీరియస్ అయ్యారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి తలంటినట్లు తెలిసింది. పోలీసు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఏంటని ప్రఽశ్నించినట్లు సమాచారం. ఈ విషయం గురించి వివరణ అడుగుతూ సీఐ, ఎస్సైలకు చార్జిమెమో ఇచ్చినట్లు తెలుస్తోంది. యరిక్షన్బాబు పుట్టినరోజున సీఐ, ఎస్సైలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొదిలి: టెట్ పరీక్ష సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని యూటీఎఫ్ కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి విశ్వనాథపురంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులంతా రెండేళ్ల లోపు టెట్ పరీక్ష పాస్ కావాలని, అలా లేకుంటే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని సెప్టెంబర్ 1న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ తీర్పుపై ప్రభుత్వాలు కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. ఈ తీర్పుతో రాష్ట్రంలో లక్ష మంది ఉపాధ్యాయుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. డీఎస్సీ ద్వారా నియామకం పొంది సర్వీసులో పలు రకాల శిక్షణలు తీసుకున్న తరువాత కూడా టెట్ పాస్ కావాలని కోర్టు తీర్పు ఇవ్వడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రివ్యూ పిటిషన్ వేయటం, లేదా విద్యా హక్కు చట్టంతో మార్పులు చేయాలన్నారు. నిరసనలో జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు బుజ్జిబాబు, పొదిలి మండల అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణరెడ్డి, పాలడుగు వెంకటేశ్వర్లు, బీంపాటి శ్రీనివాసరెడ్డి, గంజి రమణారెడ్డి, సింగంపల్లి సుబ్బారావు, తోట శ్రీనివాసులు, డి.గురవమ్మ, రమణమ్మ, కేవీ నారాయణ, ఆర్.సోమరాజు, శ్రీనివాస్, శైలజ, ఎం.సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తి రూరల్: విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం..మండలంలోని చండ్రపాడు ఎంపీయూపీ పాఠశాలలో జలదీక్షా వారోత్సవాల్లో భాగంగా పాఠశాల ఆవరణలోని నీళ్ల ట్యాంకును శుభ్రం చేసేందుకు ముగ్గురు కూలీలను మాట్లాడారు. వారు బాత్రూం పైగా ట్యాంకు ఎక్కే క్రమంలో 11 కేవీ విద్యుత్ తీగ తగలడంతో అనపర్తి రవికుమార్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతునిది ఏలూరివారిపాలెం. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుత్రికి తరలించారు. సాక్షిటాస్క్ఫోర్స్: టీడీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి నెమలిదిన్నె చెన్నారెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కంభం పోలీసులు బుధవారం మధ్యాహ్నం చెన్నారెడ్డిని కంభం పోలీస్స్టేషన్కు పిలిపించారు. సుమారు 3 గంటల సమయంలో కంభం పోలీస్స్టేషన్ నుంచి చెన్నారెడ్డిని మార్కాపురం డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఆరు గంటల తర్వాత మార్కాపురం డీఎస్పీ చెన్నారెడ్డిని కొంతసేపు విచారణ చేపట్టిన అనంతరం గురువారం ఉదయం తిరిగి హాజరు కావాలని చెప్పి బయటకు పంపారు. చెన్నారెడ్డిని కంభం నుంచి మార్కాపురం డీఎస్పీ కార్యాలయానికి పోలీసులు తీసుకెళ్లారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపి నాయకులు మార్కాపురం చేరుకున్నారు. డీఎస్పీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అనంతరం చెన్నారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. -
కాలువలో పడి యువకుడు మృతి
నాగులుప్పలపాడు: ద్విచక్రవాహనంపై వెళుతున్న యువకుడు అదుపుతప్పి రోడ్డు పక్కన కాలువలో పడటంతో మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..మద్దిపాడు మండలం తిమ్మనపాలెం గ్రామానికి చెందిన బోజేపల్లి కోటయ్య (32) మోటారు సైకిల్పై ఉప్పుగుండూరు నుంచి నాగులుప్పలపాడు వెళుతున్నాడు. ఈ క్రమంలో మధ్యలో వారాహగిరి కోల్డ్ స్టోరేజీ సమీపంలో మోటార్ సైకిల్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న నీటి కుంటలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. -
హుస్సేన్బీ ఇంటిని పరిశీలించిన తహసీల్దార్
పొన్నలూరు: మండలంలోని కె.అగ్రహారంలో ఎస్కే హుస్సేన్బీ సర్వే నంబర్ 447/3ఏలోని 78 గజాల స్థలంలో సుమారుగా 40 ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటుంది. హుస్సేన్బీకి ముగ్గురు కుమార్తెలు కాగా మూడో కుమార్తె తన తల్లి ఇంటిని దక్కించుకునేందుకు స్థానిక టీడీపీ సానుభూతిపరుడి సహకారంతో స్థానిక వీఆర్వో సంతకం, స్టాంపును ఫోర్జరీ చేసి తన పేరుపై పొజిషన్ సర్టిఫికెట్ తయారు చేశారు. ఈ తరువాత కుమార్తె ఫోర్జరీ పత్రంతో తన భర్తకి గత అక్టోబర్లో రిజిస్ట్రేషన్ చేసింది. విషయం తెలుసుకున్న హుస్సేన్బీ ఆధారాలతో కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేసింది. దీనిపై అధికారులు పట్టించుకోకపోవడంతో హుస్సేన్బీ సమస్యపై సాక్షిలో మంగళవారం శ్రీఅక్రమాల కేటుగాళ్లుశ్రీ అనే శీర్షికన ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఉన్నతాధికారులు ఈ విషయంపై విచారించాలని తహసీల్దార్ను ఆదేశించారు. దీంతో బుధవారం తహసీల్దార్ పుల్లారావు గ్రామానికి చేరుకొని బాధితురాలితో మాట్లాడారు. అనంతరం సచివాలయానికి చేరుకొని హుస్సేన్బీతో పాటు కుమార్తెని విచారించారు. ఇద్దరికీ నోటీసులు జారీ చేస్తామని, నాలుగు రోజుల్లో అర్హత పత్రాలు చూపించాలని, లేకుంటే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
స్మార్ట్గా జాప్యం
మార్కాపురం: జిల్లాలో స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీలో స్మార్ట్గా జాప్యం జరుగుతోంది. చంద్రబాబు సర్కార్ అధికారంలోనికి వచ్చిన తర్వాత రేషన్కార్డుల స్థానంలో స్మార్ట్కార్డులు ముద్రించారు. వీటి పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాల్లో మొత్తం 6,51,820 రేషన్కార్డులు పంపిణీ చేయాలనే లక్ష్యం పెట్టుకోగా ఇంకా 47 వేల రేషన్ కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. అత్యధికంగా జిల్లా ఉన్నతాధికారులు ఉండే ఒంగోలులోనే 7054 స్మార్ట్ రేషన్ కార్డులు వినియోగదారులకు అందించాల్సి ఉంది. రెవెన్యూ, సచివాలయ సిబ్బంది సంబంధిత వినియోగదారులకు వీటిని అందించాలి. ఎక్కువగా పశ్చిమ ప్రకాశంలోనే పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉపాధి హామీ పనులు ఆగిపోవడంతో మార్కాపురం గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పలువురు కుటుంబ పోషణ కోసం తెలంగాణ ప్రాంతానికి వలసలు వెళ్లారు. వారందరికీ స్మార్ట్కార్డుల పంపిణీ నిలిచిపోయింది. రేషన్కార్డుల పంపిణీని జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, సచివాలయ సిబ్బంది డీలర్ల ద్వారా అందించాలని నిర్ణయించారు. పలుచోట్ల గ్రామ సచివాలయ సిబ్బందికి పనిభారం, కార్డుదారులు వలస పోవడంతో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుతం ప్రతి పథకానికి రేషన్కార్డును లింక్ చేయడంతో లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందకుండాపోయే ప్రమాదం ఉంది. తల్లికి వందనం, రైతు భరోసా తదితర పథకాలకు రేషన్కార్డే ఆధారం. ఈ నేపథ్యంలో రేషన్కార్డుల పంపిణీపై స్పెషల్ డ్రైవ్ చేస్తే తప్ప లబ్ధిదారులకు అందే అవకాశం లేదు. నత్తనడకన రేషన్ కార్డుల పంపిణీ జిల్లా వ్యాప్తంగా 6,51,820 స్మార్ట్కార్డులు ఒక్క ఒంగోలులోనే 7,054 పెండింగ్ పంపిణీ చేయాల్సిన రేషన్కార్డులు 47 వేలు త్వరలో అందిస్తాం: మార్కాపురం మండలంలో ఇంకా సుమారు 2 వేల స్మార్ట్ రేషన్కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. పలువురు తమ స్వగ్రామాల్లో లేకపోవడంతో మా సిబ్బంది అందించలేక పోయారు. త్వరలోనే కార్డులు అందజేస్తాం. – చిరంజీవి, తహసీల్దార్, మార్కాపురం -
మార్కాపురం జిల్లాలో దర్శిని కలపాలి
● డీఆర్ఓకు వినతిపత్రం అందించిన జంకె మార్కాపురం: నూతనంగా ఏర్పాటు చేయనున్న మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని కలపాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి బుధవారం ఒంగోలులో డీఆర్ఓకు వినతిపత్రం అందచేశారు. జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలను కలిపి పశ్చిమ ప్రకాశంగా పిలుస్తారని, అలాంటి దర్శి నియోజకవర్గాన్ని ఒంగోలులో కలపడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రజలతో పాటు విద్యావంతులు, మేధావులు, సామాజికవేత్తలు, రాజకీయపార్టీల ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల వారు సైతం దర్శిని మార్కాపురంలో కలపాలని కోరుతున్నారన్నారు. భౌగోళికంగా, సాంస్కృతికంగా ఐదు నియోజకవర్గ ప్రాంతాలు సారూప్యతను కలిగి ఉన్నాయన్నారు. ఇందుకు భిన్నంగా మార్కాపురం జిల్లాలో దర్శిని మినహాయించడం మంచిది కాదన్నారు. దర్శి లేకుండా జిల్లా ఏర్పాటు చేయడం అసంబద్ధగా, అసమతుల్యంగా అన్యాయంగా ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు. మార్కాపురం పట్టణానికి దగ్గరగా దొనకొండ, కురిచేడు మండలాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికై నా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి దర్శిని మార్కాపురం నియోజకవర్గంలో కలపాలని కోరారు. 2022లో జిల్లా పునర్వ్యవస్ధీకరణలో భాగంగా మార్కాపురంను జిల్లా చేయాలని వినతిపత్రాలు అందించామని జంకె పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను పరిశీలించి దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని ఆయన కోరారు. ఈయన వెంట పార్టీ నాయకులు ధర్మానాయక్, మందటి శివారెడ్డి తదితరులు ఉన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట నిఘా
● గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సింగరాయకొండ: జిల్లాలో శాంతిభధ్రతల పరిరక్షణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గంజాయి రవాణా, విక్రయాలు, నియంత్రణ, నేరాల నియంత్రణ, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, కీలక కేసుల పురోగతిపై ఎస్పీ వి.హర్షవర్ధన్రాజుతో కలిసి సమీక్షించారు. ఐజీ మాట్లాడుతూ చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యం ద్వారా నిందితులను గుర్తించి అరెస్టు చేయాలన్నారు. పెండింగ్ కేసులను సాధ్యమైనంత త్వరగా విచారించి నిందితులకు చట్టపర శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్ను సందర్శించే బాధితులకు నమ్మకం, ధైర్యాన్ని కల్పించేలా ప్రతి కేసునూ పోలీసు అధికారులు సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐలు సీహెచ్ హజరత్తయ్య, నాగరాజు, రామారావు, ప్రసాద్, రాజేష్కుమార్, ఎస్సైలు బి.మహేంద్ర, నాగమల్లేశ్వరరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
8 నెలలుగా పశువైద్యశాలల్లో మందుల్లేవ్
ఒంగోలు టౌన్: ఎనిమిది నెలలుగా ప్రభుత్వ పశువైద్యశాలలకు మందులు రావడం లేదని, దీంతో సరైన చికిత్స అందక పళువులు చనిపోతున్నాయని ఏపీ గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసపాటి వెంకటరావు అన్నారు. ఈ మేరకు నగరంలోని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి ఎన్.వెంకటేశ్వరరావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పూసపాటి వెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేకపోవడంతో ప్రైవేట్ మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొనాల్సి వస్తుందని, దీంతో పెంపకందార్లు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు. గ్రామాల్లో అంటువ్యాధులు తీవ్రంగా ఉన్నాయని, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఇప్పటికై నా గ్రామాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి జీవాలను కాపాడాలని డిమాండ్ చేశారు. పశు బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం గత 5 నెలలుగా నిధులు విడుదల చేయడం లేదని, దీంతో వేలాది జీవాలు చనిపోయినా ఎలాంటి నష్టపరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తరహాలోనే పశు బీమా పథకాన్ని అమలు చేయాలని, పశు బీమాకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. డిసెంబర్, జనవరి నెలల్లో పశువులకు బొబ్బవ్యాధి, నాచురోగం వచ్చే అవకాశాలు ఉంటాయని, వ్యాధి నివారణ కోసం ముందస్తు టీకాలు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వ పశు వైద్యశాలలో టీకాలు కూడా అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందన్నారు. దీంతో పశు పెంపకందార్లు తీవ్ర అందోళనకు గురవుతున్నారని, వెంటనే టీకాలను అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశువులు చనిపోయి నష్టపోయిన పెంపకందారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పావలా వడ్డీకే రుణ పరపతి సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లాలోని అన్నీ బ్యాంకులకు, లీడ్ బ్యాంక్ మేనేజర్కు రుణాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి తోట తిరుపతిరావు, జిల్లా కమిటీ సభ్యులు కొండరాజు జయరాం, మువ్వా రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి
● కలెక్టర్ రాజాబాబు చీమకుర్తి: కార్మికుల ఆరోగ్యంపై గ్రానైట్ క్వారీల యజమానులు దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. చీమకుర్తిలోని గ్రానైట్ క్వారీలు, ప్రభుత్వ పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, సురక్షిత తాగునీటి ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గ్రానైట్ వనరులపై ఆదాయం పెరిగేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వానికి గ్రానైట్ నుంచి రూ.180 కోట్ల ఆదాయం వచ్చిందని, రానున్న ఏడాదికి రూ.220 కోట్లు టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలిపారు. గ్రానైట్ క్వారీల యజమానుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామన్నారు. క్వారీల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అనంతరం చీమకుర్తి ప్రభుత్వ హైస్కూలు, ఏపీ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలను సందర్శించారు. అక్కడ మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. మద్యాహ్న భోజనం ఈ రోజే బాగుందా లేక ప్రతిరోజూ మెనూ పాటిస్తూ నాణ్యతతో అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులను అడిగి 100 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి, టీచర్లు తీసుకుంటున్న చర్యలు విద్యార్థులకు ఏ విధంగా దోహదపడుతుందో తెలుసుకున్నారు. పాటిమీదపాలెంలోని సురక్షిత తాగునీటి శుభ్రత, కుళాయిల నీరు ఏ విధంగా ఉందో అక్కడికక్కడే నిపుణలతో పరీక్షించారు. కార్యక్రమాలలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్, ఎస్డీసీ విజయజ్యోతి, మైన్స్ డీడీ టీ.రాజశేఖర్, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, డీఎంహెచ్ఓ టి.వెంకటేశ్వరరావు, స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
జిల్లా విద్యాశాఖాధికారిగా రేణుక
ఒంగోలు సిటీ: జిల్లా విద్యాశాఖాధికారిగా సి.వి.రేణుక నియమితులయ్యారు. గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న ఆమె బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ డీఈఓగా విధులు నిర్వహించిన ఎ.కిరణ్కుమార్ గతంలో పనిచేసిన బోయపాలెం డైట్ కళాశాలలో సీనియర్ లెక్చరర్గా వెళ్లారు. కురిచేడు: మండలంలోని కల్లూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడు పీ సురేష్ ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ మంగళవారం తెలిపారు. గత నెల 21న విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన డీఈఓ ఉపాధ్యాయుడు సురేష్ ను క్రమశిక్షణ చర్యల కింద విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సింగరాయకొండ: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై మండలంలోని పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు సీహెచ్ మాధవరావును సస్పెండ్ చేసినట్లు డీఈఓ కిరణ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారని ఈ ఆదేశాలను వెంటనే అమలు చేశామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ తెలిపారు. గత జూలై 30వ తేదీ విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణపై పాఠశాలలో ఒంగోలు డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వరరావు, జీసీడీఓ హేమలత విచారణ జరపగా సీహెచ్ మాధవరావుపై విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనిపై నవంబరు 21వ తేదీ మాధవరావు పై సింగరాయకొండ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు కాగా అతనికి ఎస్సై బీ మహేంద్ర నిబంధనల ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చారు. తరువాత మాధవరావు విధులకు హాజరవుతున్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి రావటంతో డీఈఓ ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు వేశారు. -
ఎన్జీజీఓ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు ఏకగ్రీవం
ఒంగోలు సబర్బన్: ఏపీ ఎన్జీజీఓ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో వరుసగా నాలుగో సారి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా కే.శరత్ బాబు, కృష్ణారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఎన్జీఓ హోంలో జిల్లా కమిటీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఒక్కొక్క పోస్టుకు ఒక్కో అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి బి.వెంకటేశ్వర్లు ప్రకటించారు. సహాధ్యక్షులుగా ఎం.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా బి.ఏడుకొండలు, తోట శ్రీనివాసులు, పి.రామాంజనేయులు, బి.విజయ్ కుమార్, ఆర్.దీపక్ కుమార్, ఉపాధ్యక్షురాలుగా (మహిళ) కె.కోటేశ్వరమ్మ, కార్యనిర్వాహక కార్యదర్శిగా బి.కృష్ణ కిశోర్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.శ్రీనివాసరావు(వాసు), డి.వెంకటేశ్వర్లు, డి.మధుసూదన రెడ్డి, కె.రాజేష్ బాబు, హరిబాబు, సంయుక్త కార్యదర్శిగా (మహిళ) బి.పద్మ కుమారి, కోశాధికారిగా కె.శివ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా రాష్ట్ర కార్యదర్శి రామ్ ప్రసాద్, సహాయ ఎన్నికల అధికారిగా నెల్లూరు జిల్లా కార్యదర్శి జీ రామకృష్ణ వ్యవహరించారు. తొలుత కలెక్టరేట్ నుంచి ఎన్జీజీఓ అసోసియేషన్ నాయకులు, సభ్యులు భారీ ర్యాలీగా బయలు దేరారు. ర్యాలీలో రాష్ట్ర అధ్యక్షుడు విద్యా సాగర్తో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఎన్జీఓ హోం వరకు సాగింది. కమిటీ ఏకగ్రీవం అయిన తరువాత రాష్ట్ర అధ్యక్షుడు విద్యా సాగర్ అసోసియేషన్ చేపడుతున్న పలు కార్యక్రమాలు, ఉద్యోగుల కోసం చేస్తున్న పోరాటం గురించి మాట్లాడారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జీజీఓ సంఘ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస రావు, రాష్ట్ర ఎన్జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కె జగదీశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ పీ మాధవి ఒంగోలు పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి మంజేష్, కార్యదర్శి షేక్ మగ్దుమ్ షరీఫ్, మహిళా విభాగం చైర్మెన్ కే కోటేశ్వరమ్మ, కన్వీనర్ సీహెచ్ శిరీష, వివిధ డిపార్ట్మెంట్స్ అధ్యక్ష కార్యదర్శులు, అన్ని తాలూకా అధ్యక్ష, కార్యదర్శలు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
2 కోట్ల సంతకాలకు చేరువగా ప్రజా ఉద్యమం
మార్కాపురం/ మార్కాపురం టౌన్: మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజల మద్దతుతో ప్రజా ఉద్యమంలా మారి 2 కోట్ల సంతకాలకు చేరువైందని పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. మార్కాపురం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారని చెప్పారు. పశ్చిమ ప్రకాశంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నీ వర్గాల ప్రజలకు నష్టం కలిగిందన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే విద్య, వైద్య పేదలకు దూరమవుతాయన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలు పూర్తయి అందుబాటులోకి వస్తాయన్నారు. కందులా ఇలా మాట్లాడటం తగునా.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము ఉద్యమం చేస్తుంటే అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యే మాట్లాడటం తగదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు అన్నారు. తాను వెంటనే స్పందిస్తే ఈ ఉద్యమం పక్కదారి పట్టే ప్రమాదం ఉన్నందున ఇప్పటి వరకూ ఏమీ మాట్లాడలేదన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉండి ఉద్యమాలు చేసినప్పుడు ఏనాడూ ఎగతాళిగా మాట్లాడలేదని అన్నారు. అధికార పార్టీలో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని, అధికార బలంతో, మదంతో మాట్లాడితే సమాజం క్షమించదన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇటీవల విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారని, ఇది మంచిపద్ధతి కాదన్నారు. ఇటీవల పొదిలి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల ఒక కులాన్ని కించపరుస్తూ మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ ఆలీబేగ్, స్టేట్ కమిటీ సభ్యులు వెన్నా హనుమారెడ్డి, జెడ్పీటీసీ నారు బాపన్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చెంచిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, మోర శంకర్రెడ్డి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సలీమ్, సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, కొనకనమిట్ల జెడ్పీటీసి అక్కిదాసరి ఏడుకొండలు, ఎంపీపీ మురళీకృష్ణయాదవ్, డాక్టర్ మగ్బుల్ బాషా, సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాసులు, కౌన్సిలర్లు సిరాజ్, చాటకొండ చంద్ర, ముంగమూరి శ్రీను, కొత్త కృష్ణ, వార్డు ఇన్ఛార్జిలు ఏడుకొండలు, గఫూర్, మౌలాలి, గుంటక అంజిరెడ్డి, బొగ్గరపు శేషయ్య, బాలకృష్ణారెడ్డి, కె.ఆది, చిప్స్ శ్రీనివాస్, పీవీ నాయుడు, కరీముల్లా, ముత్తారెడ్డి వెంకటరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, ఎస్ వెంకటరెడ్డి, బ్రహ్మారెడ్డి, సుబ్బారావు, సీహెచ్ వెంకటరామిరెడ్డి, చాటకొండ నాగరాజు, న్యాయవాదులు భూపని కాశయ్య, చౌడేశ్వరరావు, వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య సోషల్ మీడియా అధ్యక్షుడు మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడెడ్ విద్యార్థులకు మెటీరియల్ ఇవ్వాలి
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ విద్యార్థులకు మెటీరియల్ ఇవ్వకుండా ఎఫ్ఎల్ఎన్ 75 రోజుల కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకట్రావు, ప్రభాకర్రెడ్డిలు మంగళవారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం పని చేస్తున్న 80 ప్రాథమిక, 22 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివే పేద విద్యార్థులకు మెటీరియల్ ఇవ్వకుండా గ్యారంటీ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసే ప్రోగ్రాం ఎఫ్ఎల్ఎన్ ఏ విధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో నిర్వహించాలని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. సర్వశిక్ష అభియాన్ అధికారులను ఎన్నిసార్లు అడిగినా ఎయిడెడ్ విద్యార్థులకు సంబంధించి ఎఫ్ఎల్ఎన్, తరల్ కిట్లు, స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వలేదని, డిసెంబర్ 5న జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్కు సంబంధించిన నిధులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంభం: జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు మంగళవారం కంభం, బేస్తవారిపేట మండల విద్యాశాఖాధికారులు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు, మధుసూదన్రెడ్డి ఎయిడెడ్ పాఠశాలలను తనిఖీ చేశారు. స్థానిక రంగరాజు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో గత మూడేళ్లుగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, హాజరు, అడ్మిషన్లు, బదిలీ రికార్డులు తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. వసతులు, సౌకర్యాలు, క్రీడా పరికరాలు, మైదానం వాస్తవ స్థితిని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. -
చెడు అలవాట్లకు బానిసై చోరీలు
కొమరోలు: చెడు అలవాట్లకు బానిసలైన ముగ్గురు స్నేహితులు సులభంగా నగదు సంపాదించాలన్న ఉద్దేశంతో విద్యుత్ శాఖ సామగ్రి చోరీ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో కాపర్ వైరు, అల్యూమినియం వైర్లు, విద్యుత్ స్తంభాలు చోరీ చేశారు. ఈ క్రమంలో నిఘా ఉంచి మండలంలోని నారాయపల్లె క్రాస్ రోడ్డు వద్ద నంధ్యాల జిల్లా మహానంది మండలం కొట్టాల గ్రామానికి చెందిన నిసినం ఇర్మియా, చిగుళ్ల ఆంజనేయులు, మహానందిగారి శ్రీనివాసులను అరెస్టు చేసినట్లు సీఐ జె.రామకోటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. నిందితులు ఒకే గ్రామానికి చెందిన వారని, గతంలో వెదురు కర్రలు కొట్టుకొని జీవనం సాగించేవారని, తర్వాత చెడు అలవాట్లకు బానిసై చిన్న చిన్న దొంగతనాలు చేసేవారన్నారు. ఈ క్రమంలో 2022లో కూడా నంద్యాల జిల్లాలో పలు దొంగతనాల కేసుల్లో అరెస్టు అయి జైలుకు వెళ్లారు. మూడు నెలల నుంచి కొమరోలు, రాచర్ల మండలాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ లైన్లలో విద్యుత్ తీగలను దొంగతనం చేశారన్నారు. కొమరోలు మండలంలో సుమారు 152 విద్యుత్ స్తంభాలు, 11 కేవీ అల్యూమినియం కరెంటు వైరు, 7600 మీటర్ల పొడవైన వైరును దొంగిలించారన్నారు. అదే విధంగా రాచర్ల పోలీస్స్టేషన్ పరిధిలో 11 కేవీ అల్యూమినియం కరెంటు వైరు, సుమారు 50 విద్యుత్ స్తంభాలు, గిద్దలూరు పోలీసుస్టేషన్ పరిధిలో 30 కిలోల బరువైన కాపర్ వైరు, పెద్దారవీడు పోలీసుస్టేషన్ పరిధిలో 10 కిలోల కాపర్ వైరు, కంభం పోలీసుస్టేషన్ పరిధిలో 5 కిలోల కాపర్ వైరు చోరీకి గురైనట్లు ఆయా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు నమోదై ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మండలంలోని నారాయణపల్లె క్రాస్రోడ్డు వద్ద కొమరోలు ఎస్సై జె.నాగరాజు దొంగలను పట్టుకుని రూ.3.85 లక్షల విలువైన విద్యుత్ సామగ్రిని, నేరానికి ఉపయోగించిన ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన ముగ్గురు స్నేహితులను అరెస్టు చేసిన పోలీసులు రూ.3.85 లక్షల విలువైన కరెంట్ సామాగ్రి స్వాధీనం -
ఉరేసుకొని దివ్యాంగుడు ఆత్మహత్య
బేస్తవారిపేట: మండలంలోని చింతలపాలెం ఎస్సీకాలనీలో ఉరేసుకొని మూగ వ్యక్తి పెద్ద మూగయ్య(35) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి సమయంలో జరిగింది. అర్థవీడు మండలం వెలగలపాయకు చెందిన పెద్ద మూగయ్య కొన్నేళ్లుగా చింతలపాలెంలోని వాటర్ప్లాంట్లో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య దానమ్మ పిల్లలతో కలిసి ఎస్సీకాలనీలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానంతో అప్పుడప్పుడు గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం స్వగ్రామం వెలగలపాయకు వెళ్లాడు. వాటర్ప్లాంట్ నిర్వాహకుడు నచ్చజెప్పడంతో నెల రోజుల క్రితం భార్య వద్దకు వచ్చాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంటి పక్కన ఉన్న పూరిపాకలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్సై రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సురక్షితమైన తాగునీరు అందించాలి
● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: జిల్లాలో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. జల సురక్ష, స్కబ్ టైఫస్ జ్వరాలు, ప్రధానమంత్రి సూర్యఘర్, గృహనిర్మాణాలు, క్యాటిల్ షెడ్స్ నిర్మాణాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై కలెక్టరేట్ నుంచి మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి జలసురక్ష మాసంగా నెల రోజులు పాటు తాగునీటి పథకాలను పరిశుభ్రం చేయటం, పైప్లైన్లు, తాగునీటిబోర్ల మరమ్మతులుచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 856 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉంటే ఇప్పటికే 500కు పైగా తాగునీటి ట్యాంకులను శుభ్రం చేశామన్నారు. మిగిలిన ట్యాంకులను నెలాఖరు లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. మండలస్థాయి అధికారులు వారంలో మూడు రోజులు పాటు గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. మండలస్థాయి అధికారులు గ్రామాల్లో తిరిగి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. జిల్లాలో స్కబ్ టైఫస్ జ్వరం గురించి ప్రజలు ఆందోళన చెందకుండా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సూర్యఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసిన క్యాటిల్ షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన గృహ నిర్మాణాలను ఉగాది నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసఫ్కుమార్, ట్రాన్స్కో ఎస్ఈ కట్టా వెంకటేశ్వరరావు, గ్రామీణ నీటిసరఫరాశాఖ ఎస్ఈ బాల శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణపై కోటి గొంతుకలతో సింహనాదం
● మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా సాగిందని, కోటి గొంతుకలు ఎలుగెత్తి సంతకాలు చేయటం ద్వారా తమ నిరసనను తెలియజేశాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం కోటి సంతకాల కార్యక్రమంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రభుత్వం విద్యావ్యవస్థకు శాపంలా మారిందన్నారు. కోటి సంతకాల సేకరణలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రజా వ్యతిరేకతను తెలియజేశారని చెప్పారు. ఈ నెల 10వ తేదీ బుధవారం కందుకూరు రోడ్డు సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ర్యాలీగా ఒంగోలు పార్టీ కార్యాలయానికి ఈ సంతకాల పత్రాలు చేరుస్తామని, అక్కడి నుంచి ఈ నెల 15వ తేది ఒంగోలు లోని మినీ స్టేడియం నుంచి 7 నియోజకవర్గాల పత్రాలను మొత్తం కలిపి కలెక్టరేట్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. పేదలకు అందని ద్రాక్ష పండుగా వైద్య విద్య, వైద్యం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం వల్ల పేద, బడుగు, బలహీన, ఆర్థికంగా వెనకబడిన ఉన్నత వర్గాల వారికి వైద్య విద్య, వైద్యం అందని ద్రాక్ష పండులా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను పూర్తి చేశారని, 650 పడకల ఆస్పత్రి కూడా సిద్ధమయ్యాయని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కాలేజీలకు 150 సీట్లు మంజూరు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం వద్దని తిరస్కరించిందన్నారు. అక్టోబర్ 10న పాకలలో కోటిసంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభం కాగా ఇప్పటి వరకు మండలాల వారీగా పొన్నలూరులో 9,877, సింగరాయకొండలో 10,830, కొండపిలో 7,922, జరుగుమల్లిలో 7,350, మర్రిపూడిలో 8,465, టంగుటూరులో 12,160 కలిపి మొత్తం 56,604 సంతకాలు పూర్తయ్యాయన్నారు. బుధవారం 11 గంటలకు బయలు దేరే నాటికి లక్ష్యంగా నిర్ణయించుకున్న 60 వేల దాటి 63 వేల సంతకాలు చేసిన పత్రాలను ఒంగోలులోని పార్టి కార్యాలయంలో అందజేస్తామని వివరించారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఇంతపెద్ద ప్రజా ఉద్యమం జరగలేదన్నారు. కోటి సంతకాల సేకరణ పత్రాలన్నింటినీ సంతకం చేసిన వ్యక్తి పేరు, ఫోన్నంబర్, మండలం, గ్రామం పేరుతో ఆన్లైన్ చేస్తామని వివరించారు. అసత్య ప్రచారం తగదు కోటి సంతకాల సేకరణ ఒక ఉద్యమంలా చేస్తుంటే ప్రభుత్వానికి కొమ్ముకాసే పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని హెచ్చరించారు. పార్టీ ఎస్ఈసీ సభ్యుడు డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, బచ్చల కోటేశ్వరరావు, షేక్ సుల్తాన్, ఎంపీటీసీ గోళ్లమూడి అశోక్రెడ్డి, చుక్కా కిరణ్కుమార్, షేక్ కరీం, పిల్లి తిరుపతిరెడ్డి, కోమిట్ల వెంకారెడ్డి, పాకనాటి రమణారెడ్డి, చొప్పర శివ, లింగాబత్తిన నరేష్, భరత్రెడ్డి, రామకృష్ణ, షేక్ అబ్దుల్లా, బుజ్జమ్మ, పెరికాల సునీల్,మిరియం సుధాకర్, నాగార్జున, భాను, బత్తిన మదన మనోహరరావు, బల్లెల ప్రబాకరరెడ్డి, కాకి జయపాల్, షేక్ అల్లా, షేక్ అల్లాభక్షు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
దోచిపెట్టే వారికి మెడికల్ కాలేజీలు
యర్రగొండపాలెం: దోచుకో, దాచుకో అన్న సూత్రాన్ని వల్లెవేసే చంద్రబాబు తనకు దోచిపెట్టేవారికి మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో అప్పచెప్తున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. రచ్చ బండ–కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని, వారి బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వైద్య కళాశాలలను బహుమతిగా ఇచ్చారని, వాటిని తమ బాబు సొత్తు అన్నట్లుగా చంద్రబాబు తన అస్మదీయులకు దానం చేస్తున్నాడని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజలు ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా, పేద తల్లుల పిల్లలు డాక్టర్లుగా ఎదిగేందుకు రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించి పనులు వేగవంతం చేయించారని వారు అన్నారు. కరోనా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూనే రాష్ట్రంలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయించగలిగారని, అందులో 5 కళాశాలలు ప్రారంభమయ్యాయని, మరో రెండు కళాశాలలు ఎన్నికల కోడ్ వలన ప్రారంభించలేక పోయారని, మిగిలిన 10 కళాశాలలు వివిధ స్థాయిలో పురోభివృద్ధిలో ఉన్నాయన్నారు. ఆయా కళాశాలల్లో ఎటా దాదాపు 20,250 మంది పేద విద్యార్థులు వైద్యులుగా ఎదిగి రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్రెడ్డి బృహత్తర ఆలోచన చేశారని అన్నారు. అటువంటి పరిస్థితులను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు కళాశాలలకు మంజూరైన మెడికల్ సీట్లను సైతం తమకు వద్దని వెనక్కి పంపించారన్నారు. ఆ కళాశాలల్లో వైద్యులుగా ఎదగాల్సిన 5 వేల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని వారు విమర్శించారు. చంద్రబాబు నాయుడు తన 18 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ అయిన తీసుకొచ్చాడా అని వారు ప్రశ్నించారు. పూర్తిగా వెనకబడిన పశ్చిమ ప్రాంతంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించవచ్చన్న ఉద్దేశంతో జిల్లాలో రెండో కళాశాలను మార్కాపురానికి మంజూరు చేయించి పనులు వేగవంతంగా జరిగేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పశ్చిమ ప్రాంతాల ప్రజలు అనారోగ్యానికి గురైనా, ప్రమాదాలు జరిగినా వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు, ఒంగోలు, కర్నూలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, దూర ప్రయాణం వలన అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారన్నారు. మార్కాపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటైతే అటువంటి పరిస్థితి నెలకొని ఉండేది కాదని అన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలకు కేటాయించిన స్థలం ప్రభుత్వానిది, నిర్మాణాలకు అయ్యే ఖర్చు ప్రభుత్వానిది, వైద్యులకు, ఇతర సిబ్బందికి ఇచ్చే జీతభత్యాలు ప్రభుత్వానిదని అటువంటప్పుడు ఆ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పచెప్తున్నారన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన దుశ్చర్యను గవర్నర్ దృష్టికి తీసుకొని వెళ్లేందుకు రచ్చబండ–కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ కార్యక్రమానికి ప్రజల్లో అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. ఎటువంటి అభివృద్ధి చూపకుండా మార్కాపురం జిల్లాగా ప్రకటించారని, దీనివలన వెనకబడిన ప్రాంతం మరింతగా వెనకబడి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలపకపోవడంతో చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ అర్థమవుతుందని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, వాగ్యా నాయక్, పార్టీ మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంట వెంకట రమణారెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల అరుణ, ఆదిత్య విద్యా సంస్థల అధినేత సూరె వెంకట రమేష్, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, ఎం.బాలగురవయ్య, ఎం.సుబ్బారెడ్డి, ఎం.ఆదిశేషు, ఆర్.అరుణాబాయి, కె.కాశీవిశ్వనాధ్, పి.శ్రీనివాసులు, డి.సంతోష్ కుమార్, పి.రాములు నాయక్, ఎ.రమణారెడ్డి, వై.శ్రీనివాసులురెడ్డి, ఎస్.ప్రసాద్, రంగనాయకులు, శార, షేక్.మహమ్మద్ కాశిం, సురేష్ నాయక్ పాల్గొన్నారు. -
17న శాసనసభ అంచనాల కమిటీ రాక
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ ఈ నెల 17వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 సాయంత్రం 6 గంటలకు నెల్లూరు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రికి ఒంగోలు చేరుకొని స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారు. 17వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమవుతారు. 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్ అంచనాలపై సమీక్షిస్తారు. అనంతరం గుంటూరుకు బయలుదేరి వెళతారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఒంగోలు: కక్షిదారులు ఈనెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ చైర్పర్సన్ టి.రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీకి అర్హత కలిగిన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాదబీమా వ్యాజ్యాలు, అన్ని రకాల బ్యాంకు కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రీలిటిగేన్ స్థాయిలో కూడా కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ కేసులు, ట్రాఫిక్ కేసులు కూడా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకుని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం నిమిత్తం 29 బెంచీలను ఏర్పాటుచేశామన్నారు. దీనివల్ల వేగవంతంగా కేసులు పరిష్కరించుకునే సౌలభ్యం ఉందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బేస్తవారిపేట: మండలంలోని ఒందుట్లకు చెందిన శతాధిక వృద్ధుడు సూరం సుబ్బారెడ్డి (104) మంగళవారం మృతిచెందారు. ఇతడు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో లా డిగ్రీ చదివారు. సోషల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్) గా గిద్ద లూరు, బేస్తవారిపేట, మార్కాపురం, యర్రగొండపాలెంలో పనిచేశారు. ఉద్యోగ జీవితంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఎస్ఈఓగా పేరు నిలిచిపోయింది. 1950–52లో గుంటూరు లో విద్యనభ్యసించే సమయంలో గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. వ్యవసాయంపై మక్కువతో గిద్దలూరు నియోజకవర్గంలో మొదటగా బత్తాయి సాగు చేశారు. మృతుడికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి, కేంద్ర మంత్రి పులి వెంకటరెడ్డిలు ఇతని క్లాస్మేట్స్. బుధ వారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మద్దిపాడు: డివైడర్ను ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి ఏడుకొండలపాడు సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన దొప్పలపూడి నాగేశ్వరరావు(55) సోమవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఆటోలో ఒంగోలు వైపు వెళుతూ ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్ పై డివైడర్ను ఢీకొట్టారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అంబున్సెలో ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీ టెట్ పకడ్బందీగా నిర్వహించాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పీ.రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో ఏపీ టెట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు ఈనెల 10 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఈనెల 10 నుంచి 21వ తేదీ వరకు జిల్లాలో జరిగే టెట్ పరీక్షలకు 810 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. 8 కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక అధికారులను కూడా నియమించినట్లు చెప్పారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. టెట్కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతి లేదని చెప్పారు. ఉదయం పూట 510 మంది, సాయంత్రం జరిగే పరీక్షలకు 300 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అదికారులను ఆదేశించారు. సమావేశంలో డైట్ ప్రిన్సిపల్ ఎస్.సుబ్బారావు, డిప్యూటీ డీఈఓ చంద్రమౌళి, ఏడీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఏపీ టెట్ ఈ నెల 10 నుంచి 21 వరకు అధికారులతో సమీక్షించిన కలెక్టర్ పీ.రాజా బాబు -
ఎస్టీయూ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
ఒంగోలు సిటీ: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ప్రకాశం జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి పి. రమణారెడ్డి, ఎన్నికల పరిశీలకుడు బి.శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 79 వ వార్షిక కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఓ.ఎర్రయ్య అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన జిల్లా అధ్యక్షునిగా చేతల వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గవిని శివశంకర్, ఆర్థిక కార్యదర్శిగా ఓ.కృష్ణ, గౌరవాధ్యక్షునిగా కడియాల ప్రసాదు, మహిళా విభాగం కన్వీనర్గా ఎ.శ్రీదేవి, రాష్ట్ర కౌన్సిలర్స్ గా వేమ శేషు, చల్లా శ్రీనివాసులు, పొతకమూరి కృష్ణయ్య, పిగిలి కొండయ్య, ఎ.నాగయ్య ఎన్నికయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేయాలని, పీఆర్సీ నియామకం చేపట్టాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఎగ్జామ్ నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, సహాయ కార్యదర్శి వెంకట్రావు, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు సీహెచ్.ఆదినారాయణ, ఎస్టీయూ నాయకులు నరసింహారెడ్డి, మేకల మోహన్రావు, గద్దగుంట వెంకటేశ్వర్లు, కాపులూరి వెంకటేశ్వర్లు, వేల్పుల రమేష్, రవికిరణ్ యాదవ్, మాలిరావు, ఎ.రమేష్, మధుసూదన్ రావు, చల్లా అంకరాజు, టి.రమణయ్య, ఒ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
రాజ్యాంగేతర శక్తిగా లోకేష్
సింగరాయకొండ: రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారాలోకేష్ రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడనటానికి ఇండిగో సంక్షోభంలో జోక్యం చేసుకోవటమే నిదర్శనమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. మండల కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రిత్వ శాఖకు సంబంధించి అంశం పరిష్కారానికి కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజవరపు రామ్మోహన్నాయుడు ఉన్నాడన్నారు. ఇండిగో సమస్య పరిష్కారానికి రామ్మోహన్నాయుడు సమీక్ష నిర్వహించాల్సి ఉండగా నారాలోకేష్ సమీక్ష చేయటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా మారాడనటానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలన్నారు. లోకేష్ విద్యాశాఖ తప్ప మిగతా అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్నాడని ఆరోపించారు. విమాన సర్వీసులను, అందులో పనిచేసే సిబ్బందికి పనిచేసే రోస్టర్ను అమలు చేయించటంలో డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. విమానాయాన సంస్థల్లో పనిచేసే సిబ్బంది శ్రమ దోపిడీని నివారించేందుకు నిబంధనలు విధించిందన్నారు. కానీ ఆరురోజులుగా ఇండిగో సంస్థ గందరగోళం సృష్టిస్తే సమస్య పరిష్కారానికి సమీక్షలు నిర్వహించాల్సిన కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ఎక్కడ దాక్కున్నాడని ప్రశ్నించారు. ఇండిగో విమానయాన సంస్థతో చర్చలు లేవని, దానిపై చర్యలు కూడా లేవన్నారు. దేశంలో లక్షలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని దీంతో ఎయిర్పోర్టులు ఆర్టీసీ బస్టాండులు, రైల్వేస్టేషన్లుగా మారాయన్నారు. ఇది పూర్తిగా కేంద్రమంత్రి వైఫల్యమని, ఈ వ్యవహారంలో నారాలోకేష్ మితిమీరిన జోక్యానికి నిదర్శనమన్నారు. తక్షణమే మంత్రులు నారాలోకేష్, రామ్మోహన్నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరకామణి అంశంతో డైవర్షన్ రాజకీయం: ఇండిగో సమస్యను పక్కదారి పట్టించేందుకు పరకామణి అంశాన్ని టీడీపీ నాయకులు తెరపైకి తెచ్చారని ఆరోపించారు. పరకామణి అంశంలో జగనన్న మాటలను టీడీపీ నాయకులు పూర్తిగా వక్రీకరించారని విమర్శించారు. పరకామణి వ్యవహారంలో దోషిగా ఉన్న రవికుమార్ చేసింది ఘోర అపచారమని జగనన్న అన్నాడని, కానీ చేసిన దొంగతనం మాత్రం చిన్నదని అన్నాడన్నారు. వాస్తవానికి రవికుమార్ 100 డాలర్ల నోట్లు 9 దొంగిలించాడని వాటి విలువ సుమారు రూ.72 వేలు కాగా ఆయన తాను అపచారానికి ప్రాయశ్చిత్తంగా స్వామి వారికి రూ.14 కోట్లు విలువైన ఆస్తులు రాసిచ్చాడన్నారు. ఈ అంశాన్ని టీడీపీ నాయకులు రాజకీయం చేయటం సమంజసం కాదని హితవు పలికారు. -
కుంటనక్కలు..!
గ్రామానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఎగదాల చెరువును కబ్జా కోరల నుంచి రక్షించాలి. కొందరు స్వార్థపరులు యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న కబ్జాదారులు ఎకరా రూ.25 లక్షలకు పైగా అమ్ముకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు మేలుకొని కబ్జా చెరనుంచి చెరువును కాపాడాల్సిన అవసరం ఉంది. లేకుంటే భవిష్యత్తు తరాలకు నీటి నిల్వ కుంటలు, చెరువులు లేకపోతే ప్రజలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. దానికి తోడు అభివృద్ధి చెందుతున్న ఒంగోలు నగర పాలక సంస్థకు ఆ చెరువు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది. – పూసపాటి సమర సింహా రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, చెరువుకొమ్ముపాలెం. ఒంగోలు నగర శివారు చెరువుకొమ్ముపాలెం ఎగదాల చెరువును అధికార పార్టీ నేతలు చెరబట్టారు. ఈ చెరువు 20.18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు 15 ఎకరాలు అధికార టీడీపీ నేతలు ఆక్రమించేశారు. ఈ చెరువు సమీపంలో పెద్దా, చిన్నా పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ఎకరా రూ.80 లక్షల ధర పలుకుతోంది. అయితే ఆక్రమణదారులు ఎకరా రూ.25 లక్షలకు విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు కావడంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మా చెరువును కాపాడండి మహా ప్రభో అని గ్రామస్తులు వేడుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఎగదాల చెరువు మొత్తాన్ని సర్వేచేసి రెవెన్యూ రికార్డుల ప్రకారం నిర్ధారించాలి. తద్వారా చెరువు పాత పద్ధతిలో మాదిరిగా పునరుద్ధరించాలి. ఆక్రమణ చెర నుంచి కాపాడకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేసి అయినా చెరువును కాపాడుకుంటాం. చెరువుకు హద్దులు వేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి చెరువుకొమ్ముపాలెం ప్రజలు, రైతులను ఆదుకోవాలి. చుట్టూ ఉన్న రైతుల అవసరాలను తీర్చేలా చెరువును తయారు చేయాలి. గ్రామంలోని పశువులకు కూడా తాగునీటి సమస్యను తీర్చాలి. కొందరు స్వార్ధపరులు చెరువును తమ కబంద హస్తాల్లోకి తీసుకొని నిలువునా అమ్ముకుంటున్నారు. దానిని అధికారులు అడ్డుకోవాలి. – తాటిపర్తి రాగయ్య, చెరువుకొమ్ముపాలెం ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థ పరిధి 18వ డివిజన్ చెరువుకొమ్ముపాలెం గ్రామంలోని ఎగదాల చెరువు ఉంది. ఆర్ఎస్ఆర్లో ఆ చెరువు పేరు రెడ్డివాని కుంటగా రికార్డుల్లో నమోదై ఉంది. కానీ చెరువుకొమ్ము పాలెం గ్రామానికి పై వైపున ఉండటంతో పాటు మరికొన్ని కుంటలు చెరువులు ఉండటంతో ఆ చెరువును గుర్తుగా ఉండటం కోసం ఎగదాల చెరువుగా పిలుచుకుంటుంటారు. చెరువుకొమ్ముపాలెం గ్రామ సర్వే నెం. 243లో కుంట పోరంబోకుకు చెందిన దాదాపు 20.18 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఇందులో దాదాపు 15 ఎకరాలు పైగా ఆక్రమణలకు గురైంది. కుంచించుకుపోయి చెరువు ప్రస్తుతం 5 ఎకరాలలోపునకు చేరింది. చెరువు కాస్తా కుంటగా మారిపోయింది. ఈ చెరువు తరాల నుంచి ఆ గ్రామస్తుల సాగు నీటి అవసరాలు తీరుస్తూ వస్తోంది. అదేవిధంగా పశువుల దాహార్తిని తీర్చుకోవటానికి కూడా ఈ చెరువును వినియోగించేవారు. గ్రామస్తుల వ్యవసాయ పనులకు ఉపయోగకరంగా ఉండేది. పంట పొలాలకు ఆ చెరువులోని నీటిని ఇంజన్ల ద్వారా, తాగాణీల ద్వారా, ఎత్తిపోసుకోవడం ద్వారా రైతులు వినియోగించుకునేవారు. ఈ చెరువు చుట్టూ దాదాపు 100 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. రూ.20 నుంచి రూ.25 లక్షలకు అమ్ముకుంటున్న టీడీపీ నేత... ఎగదాల చెరువు ఆక్రమించుకొని యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. దొంగ సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఒక టీడీపీ నేత 4.5 ఎకరాలు కబ్జా చేశాడు. అందులో ఇటీవల ఎకరా రూ.25 లక్షలకు విక్రయించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అతనిని చూసి మరికొందరు కబ్జాదారులు కూడా ఇటీవల ఎకరా రూ.20 లక్షలకు బేరం పెట్టినట్లు సమాచారం. ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో పెద్దా, చిన్నా పరిశ్రమలు రావడంతో ఆ ఎగదాల చెరువు స్థలాలకు కూడా గిరాకీ పెరిగింది. దాంతో అధికార టీడీపీ నేత చెరువు పోరంబోకు స్థలాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువుకొమ్ముపాలెం నుంచి కొణిజేడు వెళ్లే రోడ్డు ఫేస్లో ఇటీవల ఎకరా రూ.80 లక్షలు పలికింది. ఇప్పటికే దాదాపు ఐదు ఎకరాలకు పైగా స్థలం పలు చేతులు కూడా మారాయి. చెరువు ఆక్రమించుకుని దర్జాగా విక్రయించేస్తున్నా మామూళ్లు తీసుకున్న అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి నీరు రాకుండా అడ్డుకట్ట.. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువుపై అధికార టీడీపీ నేతలు కన్నేశారు. దాదాపు 15 ఎకరాల వరకూ కబ్జా చేసేశారు. ఆక్రమణదారులు కొంత మంది వీటిని వ్యవసాయ భూములుగా ఉపయోగించుకొంటున్నారు. ఎగువ ప్రాంతం నుంచి చెరువులోకి వచ్చే నీటిని కూడా రానీయకుండా ఆక్రమణదారులు అడ్డుకట్టలు వేసేశారు. అంతేకాదు చుట్టు పక్కల ఉన్న రైతులకు చెరువు నీరు రాకుండా చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఆక్రమణ దారుల నుంచి ఈ చెరువు కాపాడి అభివృద్ధి చేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచాలని చెరువుకొమ్ముపాలెం గ్రామస్తులు కోరుతున్నారు. నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే భూగర్భ జలాల నీటి మట్టం పెరిగి చుట్టూ ఉన్న రైతుల బోర్లలో నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయి. వేసవికాలంలో కూడా చుట్టు పక్కల రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవటానికి ప్రయోజనకరంగా ఉంటుంది. చెరువును పరిరక్షించాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నా పట్టించుకున్న దాఖలాల్లేవు. -
ప్రైవేటీకరణపై ఉద్యమం తీవ్రతరం
ఒంగోలు సిటీ: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఉద్యమం కోటి సంతకాలతో ఆగిపోదని, ప్రభుత్వమే వీటిని నిర్వహించేలా నిర్ణయం తీసుకునే వరకూ ఆందోళనలను తీవ్రతరం చేస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. పేదల ఆరోగ్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోందని, ఆరోగ్యశ్రీని అటకెక్కించిందని, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని మరింత పటిష్టం చేసిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోనే కాదు చైన్నె, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం చేయించుకునే అవకాశం ఉండేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలు వైద్య విద్యతో పాటు, సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారన్నారు. మెడికల్ కళాశాలలు వస్తే సూపర్ స్పెషాలిటీ వైద్యులు, సీనియర్ వైద్యులు అందుబాటులో ఉంటారని, అంతే కాకుండా తక్కువ ఖర్చుతో వైద్య విద్య నేర్చుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆ కళాశాలలను నేడు చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తూ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఈ నిర్ణయం ఫలితంగా రూ.కోట్లు ఖర్చు పెట్టి సీట్లు కొనుక్కునే పరిస్థితి దాపురిస్తుందని ధ్వజమెత్తారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరించేందుకు వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపునిచ్చారని చెప్పారు. కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి సంతకాలు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపాలన జరుగుతోందని విమర్శించారు. దాచుకో, దోచుకో, పంచుకో అనేలా పాలన సాగుతోందని కారుమూరి ధ్వజమెత్తారు. జగన్మోహన్రెడ్డి కోట్లాది రూపాయల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు అండ్కో ఎన్నో ఆరోపణలు చేసిందన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి జగన్ పేదలు అండగా నిలిచారన్నారు. అది తట్టుకోలేని వారు అసత్య ప్రచారాలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ ఏ పథకాలూ అమలు చేయకుండా రూ.2.76 లక్షల కోట్లు అప్పుచేసి ఏం చేశారని ప్రశ్నించారు. రూ.5 వేల కోట్లతో మెడికల్ కళాశాలలన్నీ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. రూ.2.76 లక్షల కోట్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి కళాశాలలను పూర్తి చేసి ఉండొచ్చుకదా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ‘‘డాక్టర్లకు, సిబ్బందికి జీతాలు ప్రభుత్వం ఇస్తుందంట, లాభాలు మాత్రం ప్రైవేటు వ్యక్తులు తీసుకుంటారంట ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ను చంపేస్తే ఏమవుతుందని రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారని, అలాగే చంద్రబాబు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైజాగ్లో రూ.50 కోట్లు విలువజేసే స్థలాన్ని యాదవుల కళ్యాణ మండపం కోసం ఇస్తే నేడు దానిని రద్దు చేసి శివారులో ఎక్కడో స్థలం ఇవ్వడం వారికి అన్యాయం చేయడం కాదా అని కారుమూరి ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మీ సొంత మీడియాతో అసత్య ప్రచారాలు చేయించుకుంటున్నారని, అన్నింటిలో లోకేష్ చక్రం తిప్పుతున్నాడని, సొంత మీడియాలో డబ్బాలు కొట్టుకుంటున్నారని, మీ వైఫల్యాలను జాతీయ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి ఎండగడుతున్నాడని గుర్తు చేశారు. కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన.. చంద్రబాబు కుట్రలతో ప్రభుత్వం చేపట్టాల్సిన మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వచ్చిందని దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 60 వేల నుంచి 80 వేల వరకూ సంతకాల సేకరణ జరిగిందన్నారు. ప్రజల నుంచి సేకరించిన సంతకాల పుస్తకాలను అన్ని నియోజకవర్గాల నుంచి ఈ నెల 10 తేదీన జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకొస్తారన్నారు. ఒంగోలులో మినీ స్టేడియం నుంచి బయలుదేరి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీగా వెళ్లి అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పూలమాలలు వేస్తామన్నారు. పేదలకు అండగా నిలిచేందుకు చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని బూచేపల్లి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, ఉడుముల శ్రీనివాసరెడ్డి, కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్లు చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పరిపాలన
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన జరుగుతోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ ప్రకాశానికి సంజీవనిలా వైద్య కళాశాలను తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఆ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి, ప్రభుత్వం అనుమతి, ప్రభుత్వ డబ్బుతో నిర్మాణం, ప్రభుత్వమే పెట్టే వైద్యులు, మరి ప్రైవేటు వారు ఎందుకు ? ప్రైవేటు వారి వద్ద డబ్బులు దండుకోవడానికేనా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల స్థలం వందల కోట్ల రూపాయలని, ముందు అది తెలుసుకోవాలన్నారు. నిర్మాణం చాలా వరకు పూర్తయిందని, వైద్యులు ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారని చెప్పారు. మెడికల్ కాలేజీ ఉంటే పేద విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. సంవత్సరానికి 50 నుంచి 100 మంది వరకు డాక్టర్లు అయ్యే అవకాశం ఉందన్నారు. మెడికల్ కాలేజీ ఉండటం వల్ల అన్నీ విభాగాలకు చెందిన నిపుణులు అక్కడ ఉంటారన్నారు. పేదవాడికి మంచి వైద్యం అందడానికి మార్కాపురం వేదిక అవుతుందన్నారు. అలాంటి వైద్యాన్ని దూరం చేసి చంద్రబాబు ప్రభుత్వం ఏం సాధిస్తుందన్నారు. ఇటీవల మోంథా తుపాను ప్రభావం వల్ల పంట నష్టపోయిన రైతులకు అర్థరూపాయి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసిందని ధ్వజమెత్తారు. వైద్యాన్ని అందుబాటులో లేకుండా చేసి ప్రైవేటు వారికి ఇవ్వడానికేనని విమర్శించారు. రైతు అరటిని అమ్మేది అర్ధరూపాయికి, మరలా కొనాలంటే పదిరూపాయలకి ఇదేమీ న్యాయమన్నారు. అడ్డదారుల్లో బియ్యం బొక్కేస్తున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిందని ధ్వజమెత్తారు. దేశంలో మన రాష్ట్ర పోలీసులు 36 వ ర్యాంకుతో చిట్టచివరి స్థానంలో ఉన్నారని, పోలీసు అధికారులు నిద్ర లేవాలన్నారు. ఒక నియోజకవర్గ ఇన్చార్జ్ పుట్టినరోజుకు పసుపుబొకే తీసుకెళ్లి పోలీసులు ఇస్తున్నారని విమర్శించారు. సంబరాలు చేసుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కాపురం జిల్లాకు ఏం చేశారో చెప్పాలన్నారు. జిల్లా కేంద్రంగా మార్కాపురం ప్రకటించడం వల్ల ఆర్ధికంగా ఏ విధంగా నిలదొక్కుకుంటుందో చెప్పాలన్నారు. అత్యధిక భూమి ఉన్న దొనకొండను, దర్శిని ప్రకాశం జిల్లాకు తీసుకెళ్లారని, మరి మార్కాపురానికి ఏం మిగిలిందన్నారు. యర్రగొండపాలెం అంతర్భాగంలోని శ్రీశైలంను నంద్యాల వారికి ఇచ్చారన్నారు. వెలిగొండ పూర్తయినా నీళ్లు రాని ప్రాంతాలు చాలా ఉన్నాయని, అందులో యర్రగొండపాలెం ఉందని చెప్పారు. ప్రజలపై బాధ్యతలేని ప్రభుత్వం ఇదన్నారు. అత్యంత ఎక్కువగా 18 లక్షల 60 వేల మంది జాబ్కార్డులు తీసేసిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమన్నారు. విడో పెన్షన్లు పెండింగ్, వికలాంగుల పెన్షన్లు రాయడంలో వివక్ష, ఎంక్వయిరీల పేరుతో ఎరివేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మార్కాపురం జిల్లా ఆర్ధికంగా పుష్టి చేయాలంటే మిర్చి యార్డును ఏర్పాటు చేయాలన్నారు. పశ్చిమ ప్రకాశం నుంచి మిర్చిని గుంటూరుకు తీసుకుపోయి అమ్ముకోవాలంటే ట్రాన్స్పోర్టు ఎక్కువవుతోందన్నారు. అలాగే శ్రీశైలంతో పాటుగా త్రిపురాంతకం, మార్కాపురం చెన్నకేశవస్వామి దేవాలయాన్ని టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఈ ప్రాంత సమస్యలపై పెద్ద ఎత్తున ప్రజలంతా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. -
అక్రమాల కేటుగాళ్లు..!
పొన్నలూరు: గ్రామాల్లో టీడీపీ నాయకుల అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. ఏకంగా ప్రభుత్వ అధికారుల సంతకం, స్టాంపును ఫోర్జరీ చేసి దొంగ పత్రాలు సృష్టించారు. ఆ దొంగ పత్రాలతో ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. ఈ సంఘటన మండలంలోని కె. అగ్రహారంలో జరిగింది. బాధితురాలి వివరాల మేరకు..గ్రామానికి చెందిన ఎస్కే హుస్సేన్బీకి సర్వే నంబర్ 447/3ఏ లోని 78 గజాల స్థలంలో సుమారుగా 40 ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించుకోని నివాసం ఉంటుంది. ఈ నివాసానికి సంబంధించిన హక్కు పత్రంతో పాటు విద్యుత్ మీటర్ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అయితే హుస్సేన్బీకి ఇద్దరు కుమార్తెలు. వీరిలోని రెండో కుమార్తె తన తల్లి ఇంటిని ఏ విధంగానైనా దక్కించుకోవాలని పథకం రచించింది. దీంతో గ్రామంలోని టీడీపీ సానుభూతిపరుడిని ఆశ్రయించింది. ఈ క్రమంలో తెలుగు తమ్ముడు స్థానిక వీఆర్వో సంతకం, స్టాంపును ఫోర్జరీ చేసి హుస్సేన్బీ ఇంటిని తన రెండవ కుమార్తెది అయినట్లుగా పొజిషన్ సర్టిఫికెట్ తయారు చేశాడు. ఈ ఫోర్జరీ పత్రాన్ని స్థానిక పంచాయతీ కార్యదర్శికి చూపించి రెండో కుమార్తె పేరుపై ఇంటి పన్ను కూడా కట్టినట్లు రశీదు ఇప్పించాడు. అయితే పొజిషన్ సర్టిఫికెట్ను వీఆర్వో 2025 ఏప్రిల్ 3వ తేదీన మంజూరు చేసినట్లు సదరు పత్రంలో ఉండగా, సంబంధిత వీఆర్వో 2024 అక్టోబర్లో పొన్నలూరు మండలం నుంచి మరో మండలానికి బదిలీపై వెళ్లడం కొసమెరుపు. ఫోర్జరీ పత్రంతో దొంగ రిజిస్ట్రేషన్... హుస్సేన్బీ ఇంటిని కాజేయాలని చూసిన రెండో కుమార్తె వెంటనే టీడీపీ సానుభూతిపరుడు ఏర్పాటు చేసిన ఫోర్జరీ పత్రం, ఇంటి పన్నుతో తన తల్లికి ఎలాంటి విషయం తెలియనీయకుండా తన భర్తకి గత అక్టోబర్లో రిజిస్ట్రేషన్ చేసింది. అయితే ఈ తతంగాన్ని తెలుసుకున్న హుస్సేన్బీ సంబంధిత వీఆర్వోని ప్రశ్నించగా సంబంధిత హక్కు పత్రం తాను మంజూరు చేయలేదని, తన సంతకం, స్టాంపుతో ఫోర్జరీ చేసినట్లు తెలిపాడు. కలెక్టర్కి ఫిర్యాదు..ఫలితం శూన్యం వాస్తవంగా హుస్సేన్బీ తన ఇంటి దొంగ రిజిస్ట్రేషన్పై రెండు వారాల క్రితం కలెక్టర్, ఆర్డీఓని కలిసి స్పందనలో హక్కు పత్రాలతో ఫిర్యాదు చేసింది. అయినా వారి నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం మరోసారి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందనలో అర్జీ సమర్పించి కలెక్టర్కి అందించిన అర్జీ గురించి ప్రశ్నించింది. దీనికి స్పందించిన తహసీల్దార్ కలెక్టరేట్ నుంచి తమకు ఎలాంటి అర్జీ రాలేదని సమాధానం చెప్పినట్లు బాధితురాలు తెలిపింది. స్థానిక టీడీపీ సానుభూతిపరుడు అధికారాన్ని అడ్డుపెట్టుకోని మంత్రి స్వామితో అధికారులకు చెప్పించి తనకు న్యాయం జరగకుండా చూస్తున్నాడని తహసీల్దార్ కార్యాలయం దగ్గర వాపోయింది.అధికారం అండగా తెలుగు తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏకంగా ప్రభుత్వ అధికారి సంతకం, స్టాంప్ ఫోర్జరీ చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేశారు. ఫోర్జరీ పత్రాలతో తల్లి ఇంటిని కుమార్తె పేరుపై మార్పు చేశారు. దీనిపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్య తీసుకోలేదంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారని ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులే పట్టించుకోకుంటే మేం ఏం చేయాలంటూ బాధితురాలు వాపోతోంది. కె.అగ్రహారంలో తెలుగు తమ్ముడి నిర్వాకం వీఆర్వో సంతకం, స్టాంప్ ఫోర్జరీ ఫోర్జరీ పత్రాలతో తల్లి ఇంటిని కుమార్తె పేరుపై మార్పు దొంగపత్రం సృష్టించి తల్లి ఇంటిని భర్తకు రిజిస్ట్రేషన్ చేసిన కుమార్తె న్యాయం చేయాలని కలెక్టర్, ఆర్డీఓకి బాధితురాలి ఫిర్యాదు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం దొంగ రిజిస్ట్రేషన్ను రద్దు చేసి తనకు న్యాయం చేయాలని వేడుకోలు -
ఒంగోలు జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత
● నళిని పోస్టుమార్టం వద్ద దళిత సంఘాల ఆందోళన ఒంగోలు సిటీ: ఎంటెక్ విద్యార్థిని మైరాల నళిని ఆత్మహత్య ఘటనపై ఒంగోలు జీజీహెచ్ వద్ద దళిత సంఘాలు, పోలీసుల మధ్య సోమవారం ఉద్రిక్తత నెలకొంది. నళిని ఆత్మహత్య చేసుకుంటే.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ పోస్టుమార్టం సమయంలో దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో జీజీహెచ్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక కబాడీపాలేనికి చెందిన ఎంటెక్ విద్యార్థిని మైరాల నళిని – స్థానిక మహేంద్ర నగర్కు చెందిన సింగోతు శ్రీనివాస్ గత పదేళ్లుగా ప్రేమించుకున్నారు. కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని నళిని కోరుతుంది. కులాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని శ్రీనివాస్ తెగేసి చెప్పడంతో మనస్తాపానికి గురై గత శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని మరణించింది. తాను ఏ విధంగా మోసపోయిందనే విషయాన్ని సూసైడ్ నోట్లో వివరంగా రాసింది. అయినప్పటికీ ఎమ్మెల్యే ఒత్తిడితో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘ నాయకుడు నీలం నాగేంద్రం ఆధ్వర్యంలో జీజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. తొలుత కేసు మార్చేందుకు పోలీసులు అంగీకరించకుండా మొండికేశారు. దళిత సంఘాల ఆందోళన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుగా మార్చారు. అనంతరం నళిని మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆందోళనలో మాజీ కౌన్సిలర్ కట్ట సుధాకర్, మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్ కుమార్, ముప్పవరపు గోపి, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో కేసు నమోదు
దర్శి: బాలికను నమ్మించి మోసం చేయగా..ఆత్మహత్య చేసుకున్న కేసులో దర్శి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై మురళీ తెలిపిన వివరాల మేరకు..జముకులదిన్నె గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా గర్భిణి అని తేలింది. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన నరేంద్ర వల్ల గర్భిణి అయిందని అనుమానంతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీన బాలిక మృతి చెందగా ఈ కేసు విషయాలు ఇప్పటికీ బయటకు రాకపోవడం గమనార్హం. కేసు విషయంలో ప్రతిరోజు బాలిక తల్లిదండ్రులు పోలీస్స్టేషన్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. పొన్నలూరు: ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని రావుకొల్లులో సోమవారం జరిగింది. కుటుంబసభ్యుల వివరాలు మేరకు..గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన దాసరి ప్రశాంత్(18) నరసరావుపేటలోని ప్రైవేట్ కళాశాల్లో పాలిటెక్నిక్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఇటీవల కళాశాల నుంచి ఇంటికి వచ్చి గ్రామంలో ఉంటున్నాడు. అయితే కుటుంబసభ్యులు కళాశాలకు వెళ్లాలని చెప్పడంతో సోమవారం తప్పకుండా వెళ్తానని చెప్పి గ్రామంలోని అతని తాత వాళ్ల ఇంటి దగ్గర నిద్రించడానికి ఆదివారం రాత్రి వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం చీరతో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఆసక్తి లేకపోవడంతో కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ● ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ మృతి బేస్తవారిపేట: మడ్డీ ఆయిల్ ట్యాంకర్ను మినీలారీ ఢీకొట్టిన సంఘటన మండలంలోని పెంచికలపాడు సమీపంలో సోమవారం జరిగింది. ఈ సంఘటన ఒంగోలు–నంద్యాల హైవేరోడ్డు చోటు చేసుకుంది. అనంతపురం నుంచి టమోటా బాక్స్ల లోడుతో మినీలారీ వైజాగ్ వెళ్తుంది. పెంచికలపాడు సమీపంలోకి వచ్చే సమయానికి టైర్ పేలింది. అదే సమయంలో ఎదురుగా రాజమండ్రి నుంచి తాడిపత్రికి సిమెంట్ ఫ్యాక్టరీకి మడ్డీ ఆయిల్ ట్యాంకర్ వాహనం వెళ్తుంది. టైర్ పేలి అదుపుతప్పిన టమోటా లోడు లారీ ఆయిల్ ట్యాంకర్ వాహనాన్ని ముందు వైపు ఢీకొట్టి రోడ్డు పక్కన బోల్తాపడింది. రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ వాహనంలో ఉన్న డ్రైవర్ పైడికొండల దుర్గారావు పూర్తిగా మంటల్లో కాలిపోయాడు. మృతుడు వెస్ట్ గోదావరి జిల్లా దేవరపల్లెకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మినీలారీ డ్రైవర్ కుంపటి ఆదిశేషయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దుర్గారావు మృతదేహం మంటల్లో మాడిపోయి గుర్తుపట్టలేని విధంగా మాడిపోయింది. మంటల్లో చిక్కుకున్న ఆయిల్ ట్యాంకర్ పేలే అవకాశం ఉండటంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటరు మేర వాహనాలు గంటన్నర పాటు నిలిచిపోయాయి. గిద్దలూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎస్సై ఎస్వీ రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తహసీల్దార్ జితేంద్రకుమార్ సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
హైవేపై విద్యార్థుల ధర్నా
బేస్తవారిపేట: ఆర్టీసీ బస్ సమయం మార్చారని, కనిగిరి డిపో బస్లలో ఎక్కించుకోవడం లేదని విద్యార్థినీ, విద్యార్థులు జాతీయ రహదారిపై ధర్నా చేసిన సంఘటన సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో జరిగింది. బేస్తవారిపేట జెడ్పీ బాలికల, జెడ్పీ బాలుర హైస్కూల్స్లో రెట్లపల్లె, పెద్ద ఓబినేనిపల్లె, చిన్న ఓబినేనిపల్లె, సలకలవీడు గ్రామాలకు చెందిన 35 మంది విద్యార్థినిలు, 20 మంది బాలురు చదువుకుంటున్నారు. సాయంత్రం 5–5.30 గంటల సమయంలో గొల్లపల్లెకు వెళ్లే బస్లో ప్రతిరోజు వెళ్తున్నారు. నెల రోజులుగా రాత్రి 6.30 – 7 గంటల సమయంలో ఈ బస్ వస్తుండటంతో హైవే రోడ్డుపై దిగి చిన్న ఓబినేనిపల్లె, సలకలవీడుకు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందికరంగా మారిందని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. కనిగిరి డిపో బస్లలో ఎక్కనివ్వడంలేదని, హేళనగా మాట్లాడుతున్నారని విద్యార్థినిలు తెలిపారు. బస్టాండ్ ఆవరణలో కనీసం బస్షెల్టర్ లేకపోవడంతో దుకాణాల ముందు గంటల తరబడి కూర్చోవాల్సిన పరిస్థితి, లేదంటే హైవేపై నిలబడాల్సి దుస్థితి ఉందని బాలికలు వాపోయారు. పెంచికలపాడు వద్ద జరిగిన యాక్సిడెంట్ వద్దకు వెళ్తున్న మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు విద్యార్థుల ధర్నాను గమనించి అక్కడకు చేరారు. సమస్య ఏదైనా ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని హైవేరోడ్డుపై ధర్నాలు చేయకూడదని ధర్నాను విరమింపచేశారు. నిత్యం బాలికల అవస్థలు బస్టాండ్లో చూస్తున్నామని, రాత్రి 7 గంటల వరకు బస్ రాకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటోందని స్థానికులు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. -
సత్వర పరిష్కారం చూపాలి
ఒంగోలు సిటీ: ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ చేపట్టి సత్వర పరిష్కారం చూపాలని ఎస్పీ వి.హర్షవర్థన్రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్రాజు, పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలను లిఖితపూర్వకంగా ఎస్పీకి, పోలీస్ అధికారులకు విన్నవించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని వాటిని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ, పోలీస్ అధికారులు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదులపై తక్షణ విచారణ చేపట్టి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని భాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులోగా ఫిర్యాదులు పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్నవారి సమస్యలు విని వారికి సత్వర న్యాయం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వి.వి.రమణకుమార్, పీసీఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, దర్శి సీఐ వై.రామారావు, మార్కాపురం సీఐ సుబ్బారావు, కొండపి సీఐ సోమశేఖర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్రావు, సిబ్బంది పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... పోలీస్ గ్రీవెన్స్లో ఎస్పీ హర్షవర్థన్రాజు మొత్తం 119 ఫిర్యాదులు -
కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు ప్రైవేటీకరణ
మద్దిపాడు: కార్పొరేట్లకు దోచి పెట్టేందుకే చంద్రబాబు వైద్య విద్యను ప్రైవేటీకరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైద్యశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని నేలటూరులో నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 కళాశాలను మంజూరు చేయించారని, వాటిలో 7 కళాశాలలను పూర్తి చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించారన్నారు. మిగిలిన 10 కళాశాలలు నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో పీపీపీ విధానంలో తన అనుయాయులైన కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. దోచుకో దాచుకో అన్న చందంగా ప్రభుత్వం పనితీరు ఉందని విమర్శించారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం పట్టని చంద్రబాబు ప్రభుత్వంలో కల్తీ మద్యం ఏరులై పారుతున్నా నోరు విప్పడం లేదన్నారు. కిందిస్థాయి నాయకులు ఇసుక, గ్రావెల్ అక్రమ ఇష్టం వచ్చినట్లు అక్రమ రవాణా చేస్తూ అక్రమంగా దోచేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి హైదరాబాద్ టూ తాడేపల్లి ఫ్లైట్లలో చేసిన షటిల్ సర్వీసు ఖర్చులో ఒక భాగం వైద్యశాలలకు ఖర్చు చేస్తే 17 మెడికల్ కళాశాలలు పూర్తయ్యేవని అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన ఈ 18 నెలల కాల వ్యవధిలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. ప్రజలు తిరగబడతారన్న భయంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ప్రశ్నించిన వారి గొంతు నొక్కడం, వారిపై దాడులు చేయించడం, అక్రమంగా కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేయడం సరికాదన్నారు. పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని మేకను కుక్క అని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన వెంట సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు బొట్ల రామారావు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, నాయకులు పాకనాటి మహానందరెడ్డి, కందుల డానియేల్, నాదెండ్ల మహేష్, గద్దె జాలయ్య, అచ్యుత్, డి.శ్రీనివాస్, యోగేశ్వరరావు, మాలే శ్రీనివాసరెడ్డి, కె.నరసింహారెడ్డి, డి.కృష్ణారెడ్డి, వి.వెంకటేశ్వరరెడ్డి, గజేంద్ర పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. పేదలకు వైద్యం దూరం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మాజీ మంత్రి మేరుగు నాగార్జున -
ఎమ్మెల్యే కార్యాలయం నుంచే మెప్మా అవినీతి
● వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు ఒంగోలు సిటీ: మెప్మాలో అవినీతి అక్రమాలన్నీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కార్యాలయం నుంచే జరిగినట్లు ఆరోపణలున్నాయని, ఈ విషయంలో ఎమ్మెల్యే దామచర్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన మెప్మాలో ఒంగోలులో జరిగిన అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోందన్నారు. 39 గ్రూపుల్లో అధికారికంగా అవినీతి జరిగినట్లు తెలుస్తోందన్నారు. 200కుపైగా ఫేక్ గ్రూపులతో నిధులు కాజేశారని వార్తలు వస్తున్నాయని తెలిపారు. అవగాహన లేని ఎస్టీలతో గ్రూపులు ఏర్పాటు చేసి వారికి వెయ్యి లేదా రెండు వేలు ఇచ్చి వారి పేర్ల మీద లోన్లు ఇచ్చి డ్రా చేసినట్లు నిర్ధారణ అవుతోందన్నారు. ‘మీరు గొడవ చేస్తే మాకేం భయం లేదు.. మా వెనకాల పార్టీ ఉంది, ఇలాంటివి చాలా చూశాం’ అంటూ అవినీతి అక్రమాలకు పాల్పడిన రిసోర్సుపర్సన్ మాట్లాడుతోందని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. 2021 నుంచి ఈ రోజు వరకు గ్రూపుల్లో ఎవరైతే బినామీలుగా రుణాలు తీసుకున్నారో.. వారందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. అక్రమార్కులు జనసేన, టీడీపీలలో ఏ పార్టీ వారయినా అందరూ మీ దగ్గరే ఉన్నారన్నారు. ఇక్కడ పార్టీల ప్రస్తావన కంటే కూడా అవినీతిని అవినీతిగా చూడాలన్నారు. ఎమ్మెల్యే రెండు వారాల్లో కమిటీ వేసి విచారణ పూర్తి చేసి నిందితులను అరెస్ట్ చేస్తామన్నారని, జేసీ కమిటీ విచారణ చేస్తున్నారని చెప్పారని, రెండు వారాలుగా అసలు ఏం జరిగిందో నివేదిక ఇవ్వగలరా.? అని ప్రశ్నించారు. ఎందుకంటే మీ విచారణపై మాకు నమ్మకం లేదని రవిబాబు అన్నారు. గతంలో చాల చెప్పారని, కొణిజేడు కొండ మట్టి గురించి విచారణ చేస్తామన్నారని, రియల్ ఎస్టేట్లో మట్టి గురించి విచారణ చేస్తున్నామని చెప్పారని, కానీ, ఆ తర్వాత సిట్ విచారణ చేసి భూములు అప్పగిస్తామని చెప్పారని, కబ్జాకోరుల నుంచి ఎవరి భూములు వారికి అప్పగిస్తామని చెప్పారని, అయితే, అవేమీ పరిష్కారం కాలేదనీ రవిబాబు గుర్తుచేశారు. మెప్మాలో అవినీతి విషయంలోనైనా ఎమ్మెల్యే కార్యాలయంవైపు వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎమ్మెల్యే దామచర్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. లేకుంటే అవినీతి అక్రమాలపై ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని రవిబాబు హెచ్చరించారు. -
ప్రైవేటీకరణతో వైద్యం అందని ద్రాక్షే
మార్కాపురం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో వైద్యం అందని ద్రాక్ష అవుతుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు అన్నారు. పట్టణంలోని వివిధ వార్డుల ఇన్చార్జిలు, అధ్యక్షులు తాము సేకరించిన కోటి సంతకాల పుస్తకాలను పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ సలీమ్ ద్వారా అన్నా రాంబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ ఇది ఎన్నికలకు, పార్టీలకు సంబంధించిన అంశం కాదని, ఇప్పుడు మౌనంగా ఉంటే 66 ఏళ్ల పాటు వైద్య సేవలు ప్రైవేట్పరం అవుతాయన్నారు. వైద్యం మరింత ఖరీదై పేదలు ఇబ్బందులు పడతారని చెప్పారు. రాజకీయం చేయడానికో, ఎన్నికల కోసమో.. ప్రజల వద్దకు రావడం లేదని, ప్రజా సంక్షేమం కోసమే ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా లక్ష్యాలను పూర్తిచేసిన వార్డు ఇన్చార్జిలను, అధ్యక్షులను అన్నా రాంబాబు అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాల మురళీకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ జి.శ్రీనివాసరెడ్డి, అధ్యక్షుడు జి.శ్రీధర్, పట్టణ కార్యదర్శి రాచకొండ నాగరాజు, ప్రసాదు, గొంట్ల శ్రీనివాసులు, పి.చిన్న, అయ్యప్ప, వార్డు ఇన్చార్జి గుంటక చెన్నారెడ్డి, అధ్యక్షులు ఎస్ తిరుపతిరెడ్డి, జి. లింగారెడ్డి, బ్రహ్మారెడ్డి, శివశంకర్రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా పాల్గొనండి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు -
21 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు
ఒంగోలు టౌన్: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 23 వరకు కాకినాడ జేఎన్టీయులో రాష్ట్ర స్థాయిలో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించనున్నట్లు జేవీవీ సీనియర్ నాయకుడు ఏవీ పుల్లారావు తెలిపారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో ఆదివారం రాష్ట్రస్థాయి సైన్స్ సంబరాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో 5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలను పెంపొందించేందుకే ఏటా సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ జయప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సంబరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో స్థాయిలో నిర్వహించిన సంబరాల్లో మొదటి స్థానం సంపాదించిన విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఇస్రో, సీసీఎంబీ శాస్త్రవేత్తలు, విద్యా ఆరోగ్య, పర్యావరణ రంగాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొంటారని చెప్పారు. పోటీల్లో విద్యార్థులకు రాత పరీక్షలతో పాటుగా క్విజ్, ఎక్స్ పెరిమెంట్స్ రౌండ్ ఉంటుందన్నారు. ఇస్రో, ఓషినోగ్రఫి, పర్యావరణ శాస్త్రవేత్తలతో విద్యార్థులకు ముఖాముఖి నిర్వహిస్తామన్నారు. జేవీవీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యు.వెంకటరావు, జి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో మూఢనమ్మకాలు నిరోధించేందుకు, ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించేందుకు సైన్సు పట్ల, ప్రయోగాల పట్ల ఆసక్తిని కలిగించాలన్న లక్ష్యంతో సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మాలకొండారెడ్డి, కె.సుబ్రహ్మణ్యం, ఎస్వీ రంగారెడ్డి, శంకర్ పాల్గొన్నారు. పెద్దదోర్నాల: పోగొట్టుకున్న ఓ ప్రయాణికురాలి బ్యాగును పోలీసులు తిరిగి అప్పగించారు. ఈ సంఘటన మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్సై.మహేష్ కథనం మేరకు వినుకొండకు చెందిన ఓ మహిళా దైవదర్శనం నిమిత్తం శ్రీశైల పుణ్యక్షేత్రానికి బయలుదేరింది. ఈ క్రమంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో లగేజీ బ్యాగును పోగొట్టుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..వాహన తనిఖీలు చేసిన పోలీసులు పోగొట్టుకున్న ప్రయాణికురాలి బ్యాగును తిరిగి అప్పజెప్పారు. -
ఆటవిడుపు అడవిపాలు..!
పెద్దదోర్నాల: రాష్ట్రంలోనే పేరొందిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి తరలి వెళ్లే భక్తులతో మండల కేంద్రం నిరంతరం రద్దీగా ఉంటుంది. దీంతో శ్రీశైలం వెళ్లే యాత్రికులు, సందర్శకులకు నల్లమల అందాలతో పాటు, కాస్తంత ఆటవిడుపు కల్పించేందుకు రూ.లక్షలు వెచ్చించి శ్రీశైలం రహదారిలోని గణపతి చెక్పోస్టు వద్ద ఎడ్వంచర్ పార్కును ఏర్పాటు చేశారు. అయితే ఎంతో ఆర్భాటంగా పనులు పూర్తి చేసినా..నేటికీ ప్రారంభానికి నోచుకోని ఎడ్వంచర్ పార్కు నేడు పిచ్చిచెట్ల నడుమ అధికారుల నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తోంది. శ్రీశైలం వెళ్లే యాత్రికులకు ఎడ్వంచర్ గేమ్లతో ఆహ్లాదాన్ని అందించటంతో పాటు, అటవీశాఖకు అదనపు ఆదాయాన్ని సమకూర్చవచ్చనే ఉద్దేశంతో ఈ పార్కు ఏర్పాటు చేశారు. అయితే అధికారుల ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. నల్లమల అడవుల్లోని వన్యప్రాణులను సంరక్షించడంతో పాటు, యాత్రికులకు ఆహ్లాదాన్ని అందించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన ఎడ్వంచర్ పార్కు ఏడాది క్రితమే పూర్తయింది. కానీ ఇంత వరకు ప్రారంభించలేదు. దీంతో చిల్లచెట్ల మధ్య దిష్టి బొమ్మలా మిగిలిపోయింది. పార్కు కోసం కొనుగోలు చేసిన విలువైన పరికరాలు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ నిరుపయోగంగా మారాయి. గణపతి చెక్పోస్టు వద్ద ఉన్న సువిశాల అటవీ భూముల్లో ఎడ్వంచర్ పార్కు ఏర్పాటు చేయాలని అనుకున్నదే తడవుగా అధికారులు టెండర్లు పిలిచారు. వెంటనే అటవీ భూముల్లోని పొదలు, చెట్లను తొలగించి పార్కులో బాడీ జార్బింగ్, ల్యాండ్ జార్బింగ్, జిప్ లైనర్, బంగా ట్రాంఫో లైన్, 360 డిగ్రీ సైకిల్, హ్యూమన్గైరోలతో కూడిన ఎడ్వంచర్ గేమ్స్కు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేశారు. స్థానికులు, చిన్నారులను ఆకట్టుకునేందుకు గేమ్స్తో పాటు, జిమ్ సౌకర్యాలతో పార్కు సిద్ధం చేశారు. వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఎడ్వంచర్ పార్కుతో పాటు, మండల ప్రజలకు వినియోగపడేలా ఏర్పాటు చేసిన సాధారణ పార్కు సైతం ఏడాదిగా ప్రారంభానికి నోచుకోలేదు. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసి ఇంత నిర్లక్ష్యంగా పార్కును ఎలా వదిలేస్తారని స్థానికులు అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. ఎడ్వంచర్ పార్కు ప్రారంభం విషయాన్ని పక్కన పెట్టిన అధికారులు, పార్కుకు సంబంధించిన ప్రకటన బోర్డులను మాత్రం నల్లమల అభయారణ్యంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం విశేషం. దీంతో ఎంతో మంది శ్రీశైలం వెళ్లే యాత్రికులు ఈ బోర్డులను చూసి ఎడ్వంచర్ పార్కు ఎక్కడ ఉందోనని కోసం స్థానికంగా ఆరా తీస్తున్నారు. కానీ తీరా ప్రారంభించకుండా వదిలేశారని తెలిసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రజాధనం లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఎడ్వంచర్ పార్కులను అటవీశాఖ అధికారులు వెంటనే ప్రారంభించాలని శ్రీఽశైలం వెల్లే యాత్రికులు, సందర్శకులు కోరుతున్నారు. -
వైఎస్సార్ సీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి
పొన్నలూరు: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. పొన్నలూరులో ఆదివారం పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత విధ్వంస పాలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఆర్థిక భరోసా, రక్షణ లేకుండా పోతుందన్నారు. చెప్పిన పథకాలు అమలు చేయకుండా చేశానని చెప్పుకుంటూ తన ఎల్లో మీడియాతో డబ్బాకొట్టుకుంటున్న ఘనత సీఎం చంద్రబాబుకు దక్కిందన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన గాడితప్పిందని, అమాయక ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులపై కేసులు పెట్టి వేధించడం తప్ప అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశారన్నారు. అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకోని లిక్కర్, ఇసుక, మట్టి, గంజాయి మాఫియాగా తయారై రాష్ట్రంలో దోచుకుంటూ, శాంతిభధ్రతలు లేకుండా చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలోపే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ శ్రేణులు ప్రజా పక్షాన నిలవాలన్నారు. పార్టీ పదవులు పొందిన వారు అలంకారప్రాయంగా ఉండకుండా పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి గ్రామాల్లో పార్టీ అభివృద్ధికి కృషిచేయాలన్నారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు గడ్డం మాల్యాద్రి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, అనుమోలు ప్రసాద్, గొల్లపూడి రవణయ్య పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపు -
మొద్దుకత్తితో దాడి
బేస్తవారిపేట: మండలంలోని పూసలపాడులో మతిస్థిమితం లేని వ్యక్తి మొద్దుకత్తితో ఒకరిపై దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. ఎస్సీకాలనీ సమీపంలో బొగ్గు చిన్న రంగయ్య ఇంటి పక్కన స్థలం శుభ్రం చేసుకుంటున్నాడు. ఇతని ఇంటి ఎదురుగా నివాసముంటున్న మతిస్థిమితం సక్రమంగా లేని వడ్డే లాజరు మొద్దుకత్తి తీసుకుని దాడి చేశాడు. ఈ సంఘటనలో చిన్న రంగయ్య ఎడమ చెయ్యి తెగి తీవ్రంగా గాయపడ్డాడు. లాజరు తరుచూ భార్యతో గొడవపడుతున్న సమయంలో చిన్న రంగయ్య అడ్డుకుని నచ్చచెప్పేవాడు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. క్షతగాత్రున్ని ఆటోలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం కుటుంబసభ్యులు ఒంగోలుకు తరలించారు. ● రోడ్డుపై ప్రయాణికుల అవస్థలు పొదిలి: విజయవాడ నుంచి అనంతపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్డౌన్తో నగర పంచాయతీ పరిధిలోని కంభాలపాడు వద్ద శనివారం రాత్రి నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు అర్ధరాత్రి రోడ్డుపై చలికి అవస్థలు పడ్డారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ డబ్బులు ఇస్తే ఎవరి దారిన వారు వెళతామని డ్రైవర్ను డిమాండ్ చేశారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటే తన వద్ద నగదు ఎందుకు ఉంటాయని డ్రైవర్ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాడు. రెండు గంటలు తరువాత అదే యాజమాన్యానికి చెందిన బస్సు అనంతపురం నుంచి విజయవాడ వెళుతూ ఆగిపోయిన బస్సులోని ప్రయాణికులను పొదిలిలో చేర్చింది. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఎవరి టికెట్ డబ్బులు వారికి యాజమాన్యం అందజేశారు. దీంతో ప్రయాణికులు ఎవరికి తోచిన రీతిలో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. ఒంగోలు టౌన్: కుటుంబ కలహాలతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం...మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన చేగిరెడ్డి పుల్లారెడ్డి (35) ఆదివారం ఉదయం సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్ట చెరువుకట్ట వద్దకు తన ద్విచక్రవాహనంపై చేరుకున్నాడు. చెరువు కట్ట వద్ద చెట్టుకు వైరుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాలుకా ఎస్సై హరిబాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కంభం: వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో వ్యక్తి తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ సంఘటన హైవే రోడ్డుపై ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. మార్కాపురం మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన ఎనిబెర ఆకాశ్ (22) ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై కంభం వస్తున్న సమయంలో జంగంగుంట్ల – కంభం మధ్యలో వాహనం అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లగా ఆకాశ్ రోడ్డుపైన పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా మారడంతో ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిసింది. మార్కాపురం మండలం చింతకుంట్ల గ్రామ మాజీ సర్పంచ్ నాగయ్య కుమారుడైన ఆకాష్కు ఐదు నెలల క్రితం వివాహమైంది. విషయం తెలుసుకున్న ఆకాష్ కుటుంబసభ్యులు కంభం ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని బోరున విలపించారు. ఎస్సై నరసింహారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వైద్యశాలలో వివరాలు సేకరించారు. -
బీజేపీ పాలనలో ప్రమాదం అంచున దేశం
ఒంగోలు టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ప్రమాదకర దిశగా నడుపుతోందని, మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి దేశ ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. సుందరయ్య రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ప్రజలను మతం మత్తులో ఉంచి దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ సూత్రాన్ని అమలు చేయకపోగా ఏకంగా రాజ్యాంగాన్ని విధ్వంసం చేయడానికి వెనకాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత భావాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను మరుగున పడేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సీపీఎం సీనియర్ నాయకులు పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, నిరుద్యోగం, అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయని చెప్పారు. చైనా వంటి సోషలిస్టు దేశాలు ఎలాంటి సంక్షోభాలకు గురవకుండా ప్రపంచానికి ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాన్ని చూపుతున్నాయన్నారు. ప్రపంచ యువత సోషలిజం వైపు ఆకర్షితులవుతున్నారన్నది ప్రస్తుత రాజకీయ ఆర్థిక పరిస్థితికి నిదర్శనమన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందని, దేశ సంపదను మోదీ అనుయాయులకు దోచిపెట్టడమే పరిపాలనగా కొనసాగుతోందని విమర్శించారు. వ్యవసాయ వ్యతిరేక విధానాల వలన రైతాంగం ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, జిల్లా నాయకులు కంకణాల ఆంజనేయులు, జీవీ కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, ఎం.రమేష్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
కోటి సంతకాలు వేగవంతం చేయండి
● మాజీ మంత్రి, సంతనూతలపాడు ఇన్చార్జి మేరుగు నాగార్జున చీమకుర్తి రూరల్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని కూనంనేనివారిపాలెంలో పార్టీ మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు మండలంలోని 24 పంచాయతీల్లో 10 వేలకు పైగా సంతకాలు సేకరించారని, ఇంకా మిగిలి ఉన్న గ్రామాల్లో కూడా సంతకాల సేకరణ చేసి ఆ పత్రులను 9వ తేదీ లోగా అందజేయాలని కోరారు. ఇప్పటి వరకు సంతనూతలపాడు నియోజకవర్గంలో 60 వేలకు పైగా సంతకాల సేకరణ చేశారని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారన్నారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, జిల్లా రైతు విభాగం ప్రధానకార్యదర్శి గంగిరెడ్డి ఓబులరెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు బొడ్డు కోటేశ్వరావు, మండల ఉపాధ్యధ్యాక్షుడు చీదర్ల శేషు, వసంతరావు, మోహన్ కల్లూరి నారాయణ, వేమా గోవింద్, హరీష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బహుజన ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడిగా అంజయ్య
ఒంగోలు టౌన్: బహుజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా తేళ్ల అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక హైదరి క్లబ్లో మిడసల నాగార్జున అధ్యక్షతన జిల్లా ప్రభుత్వ, ప్రైవేటురంగ ఉద్యోగుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా నక్కా కాంతారావు, జి.అవినాష్, ప్రధాన కార్యదర్శిగా మిడసల నాగార్జున, సహాయ కార్యదర్శిగా జె.నారాయణ రావు, జాయింట్ సెక్రటరిగా ఎం.తిరుపాలు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె.వీరాంజనేయులు, కోశాధికారిగా ఎస్.లలిత కుమారి ఎంపికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా ఎస్.జాన్సన్, గౌరవ సలహాదారుడిగా ఎం.కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. సమావేశంలో విధి నిర్వాహణలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న వేధింపులు, అన్నీ శాఖలలో ఆర్ఓఆర్ను సక్రమంగా అమలు చేయకపోవడం, ఉద్యోగుల నియామకాల్లో ఫోకల్ ప్రింట్ ఆర్డర్స్ను అమలు చేయకపోవడం గురించి సమగ్రంగా చర్చించినట్లు మిడలస నాగార్జున తెలిపారు. ఒంగోలు: రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు జిల్లా నుంచి ఏడుగురు ఎంపికయ్యారు. స్థానిక ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఆవరణలో ఆదివారం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహించిన సీనియర్ బాక్సింగ్ పోటీల్లో జిల్లావ్యాప్తంగా పలువురు క్రీడాకారులు పాల్గొని తమ సత్తాచాటారు. వీరిలో ప్రతిభ కనబరిచిన కె.వంశీకృష్ణ, ఎస్కె ఆసిఫ్, జస్వంత్, గణేష్, రామస్వామి, ఏడుకొండలును ఎంపిక చేసినట్లు బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి లెమ్యూల్ రాజు, జవహర్ నవోదయ ఒంగోలు విద్యాలయ వ్యాయామ ఉపాధ్యాయులు కిషోర్లు తెలిపారు. ఎంపికై న ఈ క్రీడాకారులు ఈనెల 13, 14 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని వారు పేర్కొన్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆయన ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే కాదు...పోనీ ఎంపీపీ కాదు..చివరికి గ్రామ సర్పంచ్ కూడా కాదు. అధికార పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న నాయకుడు. యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గుడూరి ఎరిక్షన్ బాబు పుట్టిన రోజు వేడుకలు ఆదివారం యర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య జరిగిన ఈ పుట్టిన రోజు వేడుకల్లో యర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ బొకేతో ప్రత్యక్షం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన సర్కిల్ పరిధిలోని వైపాలెం ఎస్సై చౌడయ్య, దోర్నాల ఎసై మహేష్, పుల్లల చెరువు ఎస్సై సంపత్ కుమార్లతో పసుపు పచ్చరంగు బొకేతో రంగ ప్రవేశం చేసిన సీఐ అజయ్ కుమార్ టీడీపీ నాయకుడికి కేక్ కట్ చేసి తినిపించారు. తానొక సీఐ అనే స్పృహ లేకుండా సామాన్య కార్యకర్తలాగా ఎరిక్షన్ బాబు పట్ల అత్యంత వినయంగా వ్యవహరించడం చూసిన పచ్చ తమ్ముళ్లు సైతం విస్మయానికి గురయ్యారు. నిబంధనలను గాలికి ఒదిలేసిన సీఐ పచ్చపార్టీ నాయకుడికి గులాంగిరి చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో వరుస సంఖ్య 10లో గూటం జగదీష్తో పాటుగా ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ని గెలిపించాల్సిందిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 16 ఏళ్ల తరువాత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికలు కేవలం ఫార్మాసిస్టుల భవిష్యత్తును నిర్ణయించేవే కాకుండా మందుల మాఫియాకు ముకుతాడు వేసే ఎన్నికలుగా అభివర్ణించారు. -
ప్రభుత్వ ఆస్పత్రులు లేకుంటే పేదల పరిస్థితేంటి..?
ఒంగోలు టౌన్: నిరుపేద ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు లేకుండా చేయడం వలన పేదలకు ఉచితంగా అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆదివారం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. బీసీ సెల్ నగర అధ్యక్షుడు సుతారం శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేద సామాన్య ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని తెలిపారు. 5 మెడికల్ కాలేజీలను నిర్మించి తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు పాలనలో ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. సొంత వ్యక్తులకు మేలు చేయడానికి ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు చులకనని, లేకపోతే ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసేయాలని ఎందుకు ప్రయత్నిస్తారన్నారు. పేదల పిల్లలు డాక్టర్ చదువులు చదవకుండా మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారని ప్రశ్నించారు. ప్రజానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చి నిరుపేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. తండ్రికి తగ్గ తనయుడిగా జననేత జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దారని, రూ.25 లక్షల వరకు వైద్య సేవలను ఉచితంగా అందించేలా చేశారని తెలిపారు. జగనన్న పాలన మళ్లీ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. జగనన్న సురక్ష పథకం ద్వారా ఇంటి వద్దకే స్పెషాలిటీ వైద్యం అందించారన్నారు. నిరుపేద ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ప్రజలు ఉల్లాసంగా పాల్గొంటున్నారని, మహిళలు చంద్రబాబు పాలన పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఈ నెల 16వ తేదీ వైఎస్సార్ సీపీ సేకరించిన కోటి సంతకాలను గవర్నర్కు అందజేయనున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజేష్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు జనార్ధన్ రెడ్డి, పిగిలి శ్రీనివాసరావు, సుబ్బారావు, శ్రీను, జానీ, బొప్పరాజు జ్యోతి, అఫ్సర్ బేగం, బడుగు ఇందిర, మేరి, రాధిక, సుబ్బులు, రజని, వేముల శ్రీకాంత్, సాయి, నవీన్, మణికంఠ, నాని, యశ్వంత్ రెడ్డి పాల్గొన్నారు. -
ఎరిక్షన్ బాబువి అవినీతి రాజకీయాలు
యర్రగొండపాలెం: టీడీపీ యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబుపై సొంత పార్టీ వారే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన చేసిన, చేస్తున్న అవినీతి బాగోతాన్ని ఎండగట్టారు. అధికారులు, పోలీసులు, తన పార్టీ భజన నాయకులతో ఆనందంగా పుట్టిన రోజు పార్టీ చేసుకున్న ఎరిక్షన్బాబుకు కునుకులేకుండా చేశారు. స్థానిక ఉదయ్–రవీంద్ర మల్టీస్పెషాలిటీ వైద్యశాలలో ఆదివారం టీడీపీలో ఉన్న వర్గీయులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న టెక్నాలజీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మన్నె రవీంద్ర, టీడీపీ త్రిసభ్య కమిటీ మాజీ సభ్యుడు అంబటి వీరారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో తమతోపాటు కార్యకర్తలు కష్టించి పనిచేశారన్నారు. ఎన్నికల్లో నియోజకవర్గానికి వచ్చిన ఎంపీ మనుషులను తరిమేశావని, నీవు చేసిన తప్పిదాలతోనే ఓడిపోయి ఆ నిందను తమపై వేస్తున్నావని ఎరిక్షన్బాబుపై మండిపడ్డారు. అధికారం ఉందని ఇసుక, బియ్యం, మద్యం, మట్టి రవాణాచేసే అక్రమార్కులను పెట్టుకొని బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఆధ్వర్యంలో జరుగుతున్న అవినీతి జిల్లాలో మరెక్కడాలేదని, ఈ విషయం చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయని అన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తన మనుషులను పెట్టుకొని మామూళ్లు వసూలు చేసుకుంటున్నావని, రోజు కష్టపడితేనే కడుపు నింపుకునే ఉపాధి కూలీలను సైతం వదలడంలేదని వారు దుయ్యబట్టారు. ఎరిక్షన్బాబు అండ చూసుకొని పోలీసులు సైతం రెచ్చిపోతున్నారని, స్టేషన్లోనే పంచాయితీలు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నారని అన్నారు. తాము అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లు అనిపిస్తుందని, పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లేకుండా పోయిందని అన్నారు. ఎన్నికల కంటే ముందు ఎరిక్షన్బాబు డాక్టర్ను బతిమిలాడుకొని నియోజకవర్గంలో అడుగు పెట్టగలిగాడని, త్రిపురాంతకంలో బాలత్రిపుర సుందరి సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కమీషన్లకు పాల్పడుతున్నాడని టీడీపీ త్రిసభ్య కమిటీ మాజీ సభ్యుడు సభ్యుడు అంబటి వీరారెడ్డి విమర్శించారు. పెద్దదోర్నాల మండలంలోని రామచంద్రకోటలో ఆంజనేయ స్వామి గుడి కట్టేందుకు కావలసిన ఇసుక టన్నుకు రూ.300 వసూలు చేయించారని ఆరోపించారు. ఇటీవల పార్టీ మండల అధ్యక్షుల ఎంపిక అసంబద్ధంగా జరిగిందని, డబ్బులు ఇచ్చినవారికే ఆ పదవుల్లో కూర్చోపెట్టారని అన్నారు. అక్రమంగా రేషన్ దందాచేసే వారిని ప్రోత్సహించలేదా, వైపాలెం సెంటర్కు వస్తే ఆ విషయం రుజువు చేయిస్తామని సవాల్ విసిరారు. పార్టీని అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయలు దండుకోవడంతోపాటు పార్టీలో వర్గ రాజకీయాలు నడుపుతూ టీడీపీని భూ స్థాపితం చేస్తున్నావు, నియోజకవర్గంలో ఉన్న నిజమైన కార్యకర్తలు, ప్రజలు నిన్ను వదలరన్నారు. త్వరలో పెద్ద ఎత్తున సభ నిర్వహించి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి ఈ కమీషన్ల పంచాయితీని ఆయన దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారు. సమావేశంలో టీడీపీ మండల మాజీ అధ్యక్షులు షేక్.జిలాని, వెన్నా వెంకటరెడ్డి, నాయకులు పులుకూరి పిచ్చయ్య, పోతిరెడ్డి రమణారెడ్డి, షేక్ ఇస్మాయిల్, షేక్ ఖుద్దూస్, శ్రీనివాసరెడ్డి, రంగనాయకులు, మల్లారెడ్డి పాల్గొన్నారు. -
అందని పుస్తకం
మార్కాపురం: ఆధునిక దేవాలయాలుగా పేరుబడిన గ్రంథాలయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు లేకపోవడంతో అటు పాఠకులు, ఇటు నిరుద్యోగుల ఆదరణ కరువై నిర్వీర్యం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం, కొత్త పుస్తకాల కొనుగోలుకు అనుమతి లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రంథాలయాల మనుగడకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తే తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 66 గ్రంథాలయాలు ఉన్నాయి. ఒంగోలు, మార్కాపురంలో గ్రేడ్ 1 గ్రంథాలయాలు ఉండగా, గ్రేడ్ 2 గ్రంథాలయాలు కంభం, కనిగిరి, పర్చూరు, చీరాలలో ఉన్నాయి. మిగిలినవి గ్రేడ్ 3 గ్రంథాలయాలు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 66 గ్రంథాలయాల్లో 25 చోట్ల మాత్రమే సొంత భవనాలు ఉండగా మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పుస్తకాల కొనుగోలు లేకపోవడంతో 2023 నాటి పుస్తకాలే పాఠకులకు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అందుబాటులో ఉండటంతో వారు గ్రంథాలయాలకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. గడచిన రెండేళ్లకాలంలో క్రీడలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు గణనీయంగా మారాయి. అన్ని రంగాల్లో కరెంట్ అఫైర్స్ మారిపోయాయి. వీటన్నింటితో కూడిన పుస్తకాలు టెట్, డీఎస్సీతోపాటు బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గ్రంథాలయాల్లో అందుబాటులో లేవు. ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షలు రాసేవారికి ఎకానమీ, హిస్టరీ, పొలిటికల్ సైన్సు అండ్ టెక్నాలజీ, కరెంటు అఫైర్స్ పుస్తకాలు అవసరం. అయితే గ్రంథాలయాల్లో పాత పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ నిరుద్యోగ అభ్యర్థులకు అప్డేట్ కరెంటు అఫైర్స్ అందుబాటులో లేకపోవడంతో గ్రంథాలయాలకు వచ్చి నిరాశగా వెనుతిరుగుతున్నారు. ఈనెల, వచ్చే నెలలో టెట్తోపాటు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. దీంతో పలువురు అభ్యర్థులు ప్రైవేటు లైబ్రరీలకు వెళ్లి చదువుకుంటున్నారు. మరికొంతమంది పాత పుస్తకాలనే ఆశ్రయిస్తున్నారు. ఉద్యోగుల ఖాళీలు.. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ శాఖలో 105 మంది వివిధ విభాగాల్లో పనిచేయాల్సి ఉండగా కేవలం 30 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దాదాపు 85 ఖాళీలు ఉన్నాయి. ఔట్సోర్సింగ్స్ విభాగంలో 11 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పార్ట్టైమ్ వర్కర్ల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల్లో ఉన్న విలేజ్ లైబ్రరీల్లో 26 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా రికార్డు అసిస్టెంట్లు, టైపిస్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 6,06,607 పుస్తకాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న 66 గ్రంథాలయాల్లో 70,659 మంది సభ్యులు ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. గ్రూప్స్, డీఎస్సీ, టెట్లు, బ్యాంకింగ్ ఉద్యోగాలకు సంబంధించి సోషియాలజీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరంట్ అఫైర్స్, జనరల్ సైన్సు, స్పోర్ట్స్ తదితర విభాగాలకు చెందిన తాజా సమాచారంతో ఉన్న పుస్తకాలు అవసరం. వీటిని గ్రంథాలయాల్లో ఉంచితే పాఠకులు పెరగడంతోపాటు నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. -
వైద్య విద్యను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు
పొన్నలూరు: ప్రభుత్వ వైద్య విద్యను పేద ప్రజలకు అందకుండా ప్రైవేటీకరణ పేరుతో సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్సార్సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం కుట్రలో భాగంగా ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పొన్నలూరులో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే నేడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైద్య విద్యను పీపీపీ పేరుతో తన అనుచరులకు, కార్పొరేటర్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించి వాటిలో 7 మెడికల్ కళాశాలలను పూర్తి చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించారన్నారు. ఆ తరువాత ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న పనులకు నిధులు కేటాయించి పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాలలు వాడుకలోకి వస్తాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం పట్టడం లేదని, కేవలం కల్తీ మద్యం తయారీ, అక్రమ ఇసుక, మట్టి రవాణా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు పెడుతున్నారు తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్తులు, వ్యవస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రజల సంపదను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు కార్పొరేట్ విధానం వలన రాష్ట్ర అభివృద్ధి మరో 70 ఏళ్లు వెనుక్కుపోయిందన్నారు. చంద్రబాబు సర్కార్ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. పచ్చ మీడియాను అడ్డుపెట్టుకొని చేయని పనులను కూడా చేసినట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పిలుపుతో రాష్ట్రంలో ప్రజా ఉద్యమం ప్రారంభమైందని, రాబోవు రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పొన్నలూరు మండలంలో 12 వేలు, కొండపి నియోజకవర్గంలో 70 వేలకు పైగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారన్నారు. వీటిని ఈ నెల 10న జిల్లా కేంద్రానికి చేర్చుతామని, 17న మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో రాష్ట్ర గవర్నర్కి అందజేస్తామన్నారు. ఈ రెండు కార్యక్రమాల్లో ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, పొన్నలూరు, మర్రిపూడి మండల కన్వీనర్లు దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి, ఇంకొల్లు సుబ్బారెడ్డి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, గడ్డం మాల్యాద్రి, అనుమోలు ప్రసాద్, గొల్లపూడి రవణయ్య అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రేపు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్
ఒంగోలు సిటీ: కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) జాతీయ స్థాయిలో ఈ నెల 8, 9 తేదీల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ – 2025 (ఎస్ఐహెచ్–2025) నిర్వహించనున్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2025 సాఫ్ట్వేర్ ఎడిషన్ ఫైనల్ పోటీలకు ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాల ఆతిథ్యం ఇవ్వనున్నట్లు క్విస్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నిడమానూరి సూర్యకల్యాణ్ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ నిడమానూరి గాయత్రి తెలిపారు. సంబంధిత పోస్టర్ను సూర్య కల్యాణ్ చక్రవర్తి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్కి క్విస్ ఇంజినీరింగ్ కళాశాల మూడోసారి ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు. గతంలో హార్డ్వేర్ ఎడిషన్, సాఫ్ట్వేర్ ఎడిషన్ నిర్వహించామని, ఈ ఏడాది సాఫ్ట్వేర్ ఎడిషన్కి ఆతిథ్యం ఇస్తున్నామని అన్నారు. క్విస్ కళాశాలకు మూడోసారి అవకాశం ఇచ్చినందుకు ఐఏసీటీఈ, విద్యామంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో కేవలం మూడు కాలేజీలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని, దానిలో తమ కళాశాల ఒకటి అని అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 20 టీమ్లు పాల్గొని నాలుగు ప్రాబ్లమ్ స్టేట్మెంట్లకు పరిష్కారాలు కనుక్కుంటాయన్నారు. క్విస్ కాలేజీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని మరో 60 విద్యాలయాలు, ఐఐటీల్లో జరిగే ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా పాల్గొని విద్యార్థులతో మాట్లాడతారని చెప్పారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.వి.హనుమంతరావు, ఎస్ఐహెచ్ 2025 క్విస్ నోడల్ సెంటర్ కన్వీనర్ డాక్టర్ డి.బుజ్జిబాబు, కో – కన్వీనర్ డాక్టర్ భార్గవ్, వివిధ విభాగాల హెచ్వోడీలు, డీన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. 8160 మంది పోటీదారులు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 కోసం దేశవ్యాప్తంగా 1,42,715 టీమ్లు తమ ఐడియాలతో ముందుకు వచ్చాయి. వారిలో 1360 టీమ్లను ఫైనల్స్కు ఎంపిక చేశారు. మొత్తం 60 నోడల్ సెంటర్లలో దాదాపు 8160 మంది పోటీపడనున్నట్లు ఏఐసీటీఈ ప్రకటించింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యంగా వివిధ రాష్ట్రాల విద్యార్థులను వేర్వేరు రాష్ట్రాల్లోని నోడల్ సెంటర్లకు పంపేలా చర్యలు తీసుకున్నారు. ఒక జట్టుగా ప్రాబ్లమ్ స్టేట్మెంట్లపై పరిష్కారం చూపనున్నారు. ఒంగోలు క్విస్ కళాశాలలో నిర్వహణ వర్చువల్గా పాల్గొననున్న ప్రధాని నరేంద్రమోదీ -
యువకుడి ఆత్మహత్యాయత్నం
● కాపాడిన పోలీసులు మార్కాపురం రూరల్ (మార్కాపురం): కుటుంబ సమస్యల కారణంగా కనిగిరికి చెందిన వ్యక్తి మార్కాపురం రైల్వే ఫ్లయిఓవర్పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా సకాలంలో మార్కాపురం రూరల్ పోలీసులు వచ్చి కాపాడిన సంఘటన శనివారం జరిగింది. రూరల్ ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరికి చెందిన 26 ఏళ్ల వ్యక్తి కుటుంబ సమస్యలతో శనివారం ఉదయం స్థానిక రాయవరం సమీపంలోని ఫ్లయిఓవరు బ్రిడ్జి వద్దకు వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సమీపంలో ఉన్న వారు 112కు డయల్ చేసి సమాచారం అందించారు. సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావులు ఆ వ్యక్తి వద్దకు వచ్చి అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదని చెప్పారు. వ్యక్తి ప్రాణం కాపాడిన సీఐ, ఎస్సైలను ఎస్పీ హర్షవర్ధన్రాజు అభినందించారు. -
జై భవానీ..
చీమకుర్తి: కనకదుర్గ భవానీ అమ్మవారి నగరోత్సవం సందర్భంగా శనివారం చీమకుర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో పాటు పలువురు గురుస్వాముల పర్యవేక్షణలో అమ్మవారిని, 516 కలశాలతో శుద్ద అభిషేక జలాలతో గాంధీనగర్లోని కోదండరామస్వామి ఆలయం నుంచి మెయిన్రోడ్డు మీదుగా సాక్షి రామలింగేశ్వరస్వామి ఆలయం వరకు నిర్వహించిన ఊరేగింపులో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాక్షిరామలింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి జెడ్పీచైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులందరికీ బూచేపల్లి వెంకాయమ్మ అన్నదానం నిర్వహించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి పాల్గొని అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. రాత్రి చీమకుర్తి ప్రధాన రహదారిలో అమ్మవారి నగరోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమంలో చిన్నారి బాలలు జ్యోతులను వెలిగించి అమ్మవారికి ఘనంగా స్వాగతం పలికారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
● వర్ధంతి కార్యక్రమంలో మంత్రి డోలా ఒంగోలు వన్టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కోరారు. అంబేడ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం ఒంగోలు నగరంలోని హెచ్సీఎం కళాశాల ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ పి.రాజాబాబు, తదితరులతో కలిసి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేడ్కర్ చూపిన మార్గంలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం అవిశ్రాంతంగా కృషిచేసిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి అంబేడ్కర్ అందించారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జనార్దన్, విజయకుమార్, నగర మేయర్ సుజాత, డీఆర్ఓ ఓబులేసు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్నాయక్, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఒంగోలు కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆర్.వెంకట్రావు, దళిత సంఘాల నాయకులు నీలం నాగేంద్రరావు, బిల్లా చెన్నయ్య, చప్పిడి వెంగళరావు, తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆలోచనలతో శక్తివంతమైన దేశ నిర్మాణం: ఎస్పీ హర్షవర్థన్రాజు ఒంగోలు టౌన్: దేశ ప్రజలందరికీ సమాన హక్కులు ప్రసాదించే విధంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ ఆలోచనలను అమలు చేయడం మనందరి బాధ్యతని, తద్వారా శక్తివంతమైన దేశ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ హర్షవర్థన్రాజు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అంబేడ్కర్ వర్ధంతి నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మహానుభావుడు అంబేడ్కర్ అని కొనియాడారు. కుల నిర్మూలను కోసం చివరిదాకా పోరాడారని, బహుజనుల సామాజిక హక్కుల కోసం అహర్నిశలు శ్రమించారని చెప్పారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ చిరంజీవి, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, సీఐలు మేడా శ్రీనివాసరావు, నాగరాజు, సుధాకర్, పాండురంగారావు, శ్రీకాంత్ బాబు, వెంకటేశ్వర్లు, ఆర్ఐ రమణారెడ్డి పాల్గొన్నారు. -
కేసుల పరిష్కారానికి పోలీసులు సహకరించాలి
● జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి రాజ్యలక్ష్మి ఒంగోలు: వ్యాజ్యాల పరిష్కారానికి పోలీసు డిపార్టుమెంట్ సహకరించాలని జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ టి.రాజ్యలక్ష్మి కోరారు. ఈ నెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్పై శనివారం స్థానిక తన చాంబరులో జిల్లాలోని పోలీసు అధికారులతో సమీక్షించారు. రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసుల్లో కక్షిదారులకు అవగాహన కల్పించి ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేందుకు చొరవ చూపాలని సూచించారు. దీనిద్వారా కక్షిదారులకు వారి విలువైన సమయం, ధనం ఆదా అవుతుందని తెలిపారు. సివిల్ కేసులు పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులు కోర్టులో చెల్లించిన ఫీజు తిరిగిపొందవచ్చని, ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చే ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా పోలీసు అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు. జిల్లావ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోసం న్యాయమూర్తులు, సభ్యులతో కూడిన బెంచ్లు ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి టి.రాజావెంకటాద్రి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, సబ్ డివిజినల్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
రంగస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాచర్ల: మండలంలోని జేపీ చెరువు సమీపం నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి భక్తులు శనివారం అధిక సంఖ్యలో తరలి వచ్చారు. స్వామి దర్శనం కోసం గంటలు తరబడి క్యూలో నిలబడ్డారు. తొలుత దేవస్థానం అర్చకులైన అన్నవరం సత్యనారాయణచార్యులు, అన్నవరం పాండురంగాచార్యులు స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాన్ని పంచిపెట్టారు. భక్తులకు కాశీనాయన రెడ్లు, యోగి వేమనరెడ్లు, గోపాలకృష్ణ యాదవ, కృష్ణదేవరాయుల కాపు బలిజ, ఆర్యవైశ్య అన్నసత్రాల్లో అన్న సంతర్పణ చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: పట్టణంలోని జవహర్నగర్ కాలనీలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత అమలక లక్ష్మీనారాయణ స్వామి ఆలయాభివృద్ధికి ఎన్ఆర్ఐ దుగ్గెంపూడి సత్యనారాయణరెడ్డి, సుధారాణి దంపతులు రూ.1.50 లక్షల విరాళం అందజేసినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు డాక్టర్ డీవీ కృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ఈ నిధులతో ఆలయ అభివృద్ధితో పాటు ఏసీ కల్యాణ మండ పం కూడా నిర్మించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా దాత సత్యనారాయణరెడ్డి దంపతులు ఆలయంలో పూజల అనంతరం అర్చకులు రఘునాధాచార్యులు, చరణ్లు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. అధ్యక్షురాలు జి.వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శ జీసీ వెంకటరెడ్డి, సభ్యులు కె.వేణుగోపాల్రెడ్డి, వై. సత్యనారాయణరెడ్డి, ఎస్.యోగిరెడ్డి పాల్గొన్నారు. మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి జరుగుతున్న సర్వేలో భాగంగా 6వ రోజైన శనివారం శాఖాహార జంతువుల సర్వే చేపట్టినట్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగరాజు తెలిపారు. గుండంచర్ల బీట్లోని రిజర్వు ఫారెస్టు చిన్న ఎడ్లపాయ ఏరియా నుంచి కంపాస్, రేంజ్ ఫైండర్ల ద్వారా శాఖాహార జంతువుల సర్వే చేపట్టామని, ఎకలాజికల్ యాప్లో వివరాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. 7, 8, తేదీల్లో కూడా శాఖాహార జంతువుల సర్వే ఉంటుందన్నారు. ప్రతి 400 మీటర్ల పరిధిలో ఉన్న పెద్ద వృక్షాలు, పొదలు, కలుపు మొక్కలు, మెడిసిన్ ప్లాంట్, గడ్డిజాతి మొక్కలను నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బేస్ క్యాంపు సిబ్బంది నాగయ్య, జానీ పాల్గొన్నారు. -
హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యత
● హోంగార్డు రైజింగ్ డేలో ఎస్పీ హర్షవర్థన్రాజుఒంగోలు టౌన్: పోలీసు శాఖలో ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న హోంగార్డుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ హర్షవర్థన్రాజు తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో 63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కవాతులో ఎస్పీ పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో హోంగార్డులు అంతర్భాగమని అన్నారు. పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు, నేర నియంత్రణ, టెక్నికల్ విభాగాలతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, డయల్ 112, మహిళా పోలీసు స్టేషన్లో విధులు, విపత్తుల నిర్వహణలో అహర్నిశలు విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. మోంథా తుఫాన్ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా హోంగార్డులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. పోలీసు శాఖలోని హోంగార్డులు పలు రకాల విధులను చాకచక్యంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. హోంగార్డుల సంక్షేమం కోసం అనేక పథకాలు... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో హోంగార్డుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయడం ద్వారా అవసరమైన వారికి లక్ష రూపాయల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అత్యవసర సమయాలలో 5 వేల రూపాయల సాయం మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ గుర్తింపు కార్డు, సబ్సిడీతో సరుకులు కొనుగోలు చేసేందుకు పోలీసు క్యాంటీన్ కార్డు, మహిళా హోంగార్డులకు మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, నెలకు రెండు రోజుల జీతంతో కూడిన సెలవులు, హోంగార్డుల కూతుళ్ల పెళ్లికి, మెడికల్ సహాయార్థం 5 వేల రూపాయల సాయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన హోంగార్డులకు రూ.5 లక్షలను ప్రభుత్వం ఆర్థిక సహాయంగా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. హోంగార్డుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే నిర్వహించి వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరణించిన హోంగార్డుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ జిల్లా పోలీసు శాఖలో ఉత్తమ సేవలందిస్తూ విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు మారుతి కుమార్రెడ్డి సతీమణి తేజస్వినికి హోంగార్డుల ఒక రోజు వేతనం నుంచి సేకరించిన రూ.4,78,540 చెక్కును ఎస్పీ అందజేశారు. ఉద్యోగ విరమణ చేసిన జానకి రామయ్యకు హోంగార్డుల ఒకరోజు వేతనంతో సేకరించిన రూ.4,80,670 చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. మోంథా తుఫాన్ సమయంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన హోంగార్డులకు ప్రశంసపత్రాలు అందజేశారు. విజేతలకు బహుమతులు... హోంగార్డులకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో విజేతలకు ఎస్పీ హర్షవర్థన్రాజు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వ్యక్తిగత, జుట్టు విభాగాలలో షాట్పుట్, లాంగ్ జంప్, 100 మీటర్లు, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడలు నిర్వహించారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. అనంతరం పోలీసు పరేడ్ గ్రౌండ్ నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు హోంగార్డులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ చిరంజీవి, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివసరావు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు నాగరాజు, వెంకటేశ్వర్లు, మేడా శ్రీనివాసరావు, శ్రీకాంత్, సుధాకర్, పాండురంగారావు, ఆర్ఐలు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలికను మేనమామ చెంతకు చేర్చిన పోలీసులు
మార్కాపురం: ఇంటి నుంచి తప్పిపోయి పట్టణంలో తిరుగుతున్న నాలుగేళ్ల బాలికను పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చి మేనమామ చెంతకు చేర్చిన సంఘటన శనివారం జరిగింది. బోడపాడుకు చెందిన ప్రసాద్ కుమార్తె హేమప్రియ పట్టణంలోని కొండేపల్లి రోడ్డులో నివాసముంటున్న మేనమామ ఇంటికి వచ్చింది. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి మళ్లీ అడ్రస్ తెలీక అలా నడుచుకుంటూ ఆర్టీసీ బస్టాండ్ సమీపానికి వచ్చింది. పోలీసులు గుర్తించి పట్టణ పోలీసుస్టేషన్కు తీసుకొచ్చారు. పాప ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మేనమామ శ్రీరాం నరసింహారావు గుర్తించి పోలీసుల వద్దకు రావడంతో సీఐ సుబ్బారావు పాపను అప్పగించారు. పాపను గుర్తించడంలో కృషి చేసిన హోంగార్డు కాశయ్య, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావును సీఐ అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో బైకిస్టు దుర్మరణం
కురిచేడు: మండలంలోని పడమర గంగవరం గ్రామానికి చెందిన ఇందూరి వెంకటరెడ్డి (54) ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కిందపడి తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పడమర గంగవరం గ్రామానికి చెంనని వెంకటరెడ్డి బంధువుల ఇరుముడి కార్యక్రమానికి పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటీగలపాలేనికి తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. నూజెండ్ల మండలం సీతారామపురం దాటగానే గుర్తుతెలియన వాహనం ఢీకొనడంతో రోడ్డుపై పడ్డాడు. కుడికాలు విరిగి పక్కన పడింది. తలకు వెనుక వైపు బలమైన గాయం కావడంతో 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లాలని సూచించారు. క్షతగాత్రుడిని గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. వెంకటరెడ్డి మృతివార్త తెలియగానే పడమర గంగవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బ్రహ్మానందరెడ్డి
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జిల్లాలోని దర్శి నియోజకవర్గానికి చెందిన సుంకర బ్రహ్మానందరెడ్డిని నియమించారు. ఆమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒంగోలు వన్టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు ఒంగోలు హెచ్సీఎం కళాశాల ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి, కోలాస్ హోటల్ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి కలెక్టర్ రాజాబాబు పూల మాలలు వేస్తారని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరక్టర్ ఎన్ లక్ష్మానాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు హాజరు కావాల్సిందిగా కోరారు.ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీలో మొదటి సారిగా ప్రీ పీహెచ్డీ పరీక్షలను యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ యూనివర్సిటీలో మొత్తం 11 డిపార్టుమెంట్లు ఉన్నాయి. అందులో 52 మంది స్కాలర్స్కు పరీక్షలు నిర్వహించగా 50 మంది హాజరయ్యారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిర్మలమణి తెలిపారు. ప్రీ పీహెచ్డీ పరీక్షలను ప్రొఫెసర్ జి.సోమశేఖర, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిర్మలామణి పర్యవేక్షించారు. టంగుటూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన వల్లూరు గ్రామంలో వేంచేసిన వల్లూరమ్మ ఆలయంలో శుక్రవారం హుండీలను దేవదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకుడు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తం 188 రోజులకు గాను 10 హుండీలు లెక్కించగా రూ.21,05,056 ఆదాయం వచ్చింది. అలాగే 32 గ్రాముల బంగారం, 185 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి రమేష్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సేవా సంఘం సభ్యులు సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. సీఎస్పురం (పామూరు): ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రాంతం భైరవకోన భైరవేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమం దేవదాయ ధర్మాదాయశాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పర్యవేక్షణలో చేపట్టారు. హుండీ కానుకలు సెప్టెంబర్ 17 నుంచి డిసెంబర్ 05వ తేదీ వరకు 2 నెలల 18 రోజులకు సంబంధించి లెక్కింపు నిర్వహించగా మొత్తం రూ.5,63,596 ఆదాయం వచ్చినట్లు ఈఓ డి.వంశీకృష్ణారెడ్డి తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ముద్దులూరి వెంకటరాజు, రుద్రరాజు, రాజేంద్ర, రణధీర్వర్మ, అర్చకబృందం, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
స్క్రబ్ టైఫస్ జ్వరాలకు ఆందోళన పడొద్దు
ఒంగోలు టౌన్: స్క్రబ్ టైఫస్ జ్వరాల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి సౌరబ్ గౌర్ చెప్పారు. కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్తో కలిసి శుక్రవారం రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు, జీజీహెచ్ సూపరింటెండెంట్లతో ఆయన మాట్లాడారు. స్క్రబ్ టైఫస్ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాబొరేటరీల్లో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్నీ బోధనాస్పత్రుల్లో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో 7 వీఆర్డీఏ ల్యాబులు ఉన్నాయన్నారు. పరీక్షల సంఖ్యను పెంచేందుకు, రీయేజంట్లను ఆస్పత్రులకు పంపించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నల్లమచ్చ కనిపించి జ్వరం వస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు 736 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయన్నారు. వర్షాకాలంలోనే ఈ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు చెప్పారు. జ్వరంతోపాటుగా తలనొప్పి, శరీరంపై కీటకం కుట్టిన చోట నల్లని మచ్చలు ఏర్పడుతున్నట్లు గమనించామన్నారు. ముఖ్యంగా ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ప్రభావితమయ్యే కీటకాలు కుట్టడం వలన ఈ వ్యాధి సోకుతుందన్నారు. స్క్రబ్ టైఫస్ జ్వరాలకు వైద్య చికిత్సకు అవసరమైన డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ ఔషధాలను ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో తీసుకున్నట్లుగానే దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వ్యక్తులు మరిన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, మైక్రోబయాలజీ హెచ్ఓడీ పద్మప్రియ, కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు శ్రీదేవి, చిన్నపిల్లల వైద్య నిపుణులు తిరుపతి రెడ్డి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ పద్మలత పాల్గొన్నారు. -
3.0 సమయం వృథా..!
ఒంగోలు సిటీ: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు. జిల్లాలో 2409 స్కూళ్లు ఉండగా దాదాపు 80 శాతం స్కూళ్లలో తల్లిదండ్రుల హాజరు శాతం 20కి మించలేదంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. తమ పిల్లులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశాలతో సమయం వృథా తప్ప విద్యార్థులకు జరిగే మేలు శూన్యమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. హెచ్ఎంకు ఆర్థిక భారం... ఈ సమావేశాల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు ఆర్థిక భారంగా మారింది. 150 మంది విద్యార్థుల సంఖ్య దాటిన స్కూళ్లకు ప్రభుత్వం రూ.4,500 ఇస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఆయా స్కూళ్లలో నిర్వహణ ఖర్చు సుమారు రూ.20 వేలు దాటుతోందని ప్రభుత్వం ఇచ్చేది ఒక మూలకు సరిపోదని పలువురు ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. తొలిసారిగా నిర్వహించిన సమావేశాలకు ప్రభుత్వం అరకొరగా నిధులు విదిల్చింది. రెండో దఫా నిర్వహించిన సమావేశాలకు మాత్రం స్కూళ్ల నిర్వహణ పద్దు నుంచి సమావేశాలు బిల్లులు తీసుకోవాలని జిల్లా అధికారులు హెచ్ఎంలకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. శుక్రవారం నిర్వహించిన సమావేశాలకు సంబంధించి జిల్లాలోని స్కూళ్లకు డబ్బులు అందలేదు. హెచ్ఎంలు తమ జేబుల్లోంచి కొంత, దాతల దగ్గర నుంచి మరికొంత విరాళాలు సేకరించినట్టు సమాచారం. వారం రోజులుగా పాఠాలకు దూరం.. రానున్నది పరీక్షల సీజన్. ఈ సమయంలో పేరెంట్, టీచర్ సమావేశాలు నిర్వహించడం సబబు కాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశాలను ఆర్భాటంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో దాదాపు అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరగతి గదులకు దూరమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. సమావేశానికి సంబంధించిన పనులు చేయడం, వాటి స్థితిని ప్రతిరోజు ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయడంతోనే సరిపోయిందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. శనివారం నుంచి పదో తరగతి విద్యార్థులకు రివిజన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ సమావేశాల వల్ల రివిజన్ ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదన్న ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ వరుస వర్షాలు కురిశాయి. దీంతో సమావేశాలను మైదానాలను సిద్ధం చేసేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కష్టపడాల్సి వచ్చిందని తెలిసింది. ● మార్కాపురం నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లో పాఠశాలలో సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మార్కాపురం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ కమిటీ మీటింగుల్లో తమ పిల్లలు ఆటలాడేందుకు ప్లే గ్రౌండ్ కావాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే బీసీ హాస్టల్ భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. పొదిలి జిల్లా పరిషత్ హైస్కూల్లో అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని పేరెంట్స్ విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాలకు మీ తల్లిదండ్రులు కచ్చితంగా హాజరుకావాలని పలుచోట్ల ప్రధానపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారు. పొదిలి మండలంలోని ఉప్పలపాడు హైస్కూల్లో జరిగిన మీటింగుకు పలువురు వృద్ధులు హాజరయ్యారు. కొనకనమిట్ల మండలం గొట్లగట్లు హైస్కూల్లో 500 మంది విద్యార్ధులకు గానూ సుమారు 150 మంది పేరెంట్స్ హాజరయ్యారు. ● కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సుమారు మూడు గంటలకు భోజనం పెట్టడంతో ఇబ్బంది పడ్డారు. రెచ్చంపాడు మండలం సీతారాంపురంలో నాడు–నేడు పనులు పూర్తి చేయాలని తల్లిదండ్రులు అడిగారు. పలు పాఠశాలల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 10 శాతం మంది మాత్రమే తల్లిదండ్రులు హాజరయ్యారు. ● యర్రగొండపాలెం గవర్నమెంట్ హైస్కూల్లో 800 మంది విద్యార్థులు ఉండగా కేవలం దాదాపుగా 90 మంది పేరెంట్స్ పాల్గొన్నారు. పేరెంట్స్ కంటే టీడీపీ నాయకులు, కార్యకర్తల సంఖ్యే ఎక్కువగా ఉంది. ● కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం కొణిజేడులో నిర్వహించిన కార్యక్రమం రాజీ సమావేశాలను తలపించింది. ఈ ఉన్నత పాఠశాలలో 145 మంది విద్యార్థులు ఉండగా కేవలం 60 మంది విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సమావేశానికి మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో ఈ సమావేశం రాజకీయ సభగా మారిపోయింది. ఇక మంత్రి స్వగ్రామమైన తూర్పునాయుడుపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 120 మంది విద్యార్థులు ఉండగా 50 మంది తల్లిదండ్రులు హాజరు కావడం గమనార్హం. ● పొన్నలూరు మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తమకు తల్లికి వందనం డబ్బులు అరకొరగా పడినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశానికి హాజరైన నాయకులు, అధికారులను ప్రశ్నించారు. -
వామ్మో.. వాసేపల్లిపాడు రోడ్డు..!
ఒంగోలు సబర్బన్: ఆ రోడ్డులో ప్రయాణమంటే నరకానికి మార్గం వేసుకున్నట్లే.. వందలకొద్దీ గోతులతో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఆ రోడ్డులో ఎక్కువగా ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు తిరుగుతాయి. కానీ, రోడ్డు మాత్రం ఛిద్రమవడంతో ఈ రోడ్డుపై ప్రయాణించలేము బాబో అంటూ వాహనచోదకులు అల్లాడిపోతున్నారు. ఏదైనా ప్రమాదకర పరిస్థితుల్లో వేగంగా ఒంగోలు రావాలంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇంతకు ఈ రోడ్డు ఎక్కడో లేదు.. ఒంగోలు నగరపాలక సంస్థకు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. నగరపాలక సంస్థ పరిధిలోని పెళ్లూరు పొలిమేర నుంచి మూడు కిలోమీటర్లలోనే ఉంది. అదే వాసేపల్లిపాడు గ్రామం. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో ఆ గ్రామస్తులు పడుతున్న రోడ్డు వెతలు అన్నీఇన్నీ కాకుండా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే... ఒంగోలు నగరపాలక సంస్థకు కొత్తపట్నం మండలానికి మధ్యలో వాసేపల్లిపాడు గ్రామం ఉంది. ఈ గ్రామం రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలోని టంగుటూరు మండలం పరిధిలో ఉంది. వాస్తవానికి వాసేపల్లిపాడు టంగుటూరు మండలానికి విసిరేసినట్లుగా ఉంటుంది. దీనికి దక్షిణం వైపున సంకువానికుంట గ్రామం ఉంటుంది. ఆ గ్రామం మాత్రం కొత్తపట్నం మండల పరిధిలోకి వస్తుంది. ఒంగోలుకు ఆనుకుని కొత్తపట్నం మండలం మధ్యలో ఉన్న వాసేపల్లిపాడును గతంలో రాజకీయ నాయకులు ఓట్ల లెక్కల్లో భాగంగా టంగుటూరు మండలంలో కలిపారు. వాస్తవానికి మండల కార్యాలయాల్లో పనులు ఉంటే తప్ప వాసేపల్లిపాడు గ్రామస్తులకు టంగుటూరుతో పనే ఉండదు. ఆ గ్రామస్తులు చిన్నాచితకా పనులన్నింటికీ ఒంగోలు రావాల్సిందే. వాసేపల్లిపాడు గ్రామం నుంచి పెళ్లూరు హైవే వరకు ఐదు కిలోమీటర్లు ఉంటుంది. కానీ, మండల కేంద్రమైన టంగుటూరు మాత్రం 20 కిలోమీటర్లకుపైనే ఉంటుంది. గోతులమయంగా రోడ్డు... వాసేపల్లిపాడు రోడ్డు గోతులమయంగా మారింది. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్డు మొదలుకుని గ్రామంలోకి వెళ్లేంత వరకు ఈ రోడ్డు మరీ అధ్వానంగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు వందల సంఖ్యలో గోతులు. ఆ రోడ్డుపై ప్రయాణమంటే ప్రాణం మీదకు వచ్చే విధంగా ఉంటుంది. ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు ప్రయాణించే ఈ రోడ్డు ధ్వంసం అయినా పాలకులు పట్టించుకోవటం లేదు. పెళ్లూరు–వాసేపల్లిపాడు మధ్యలో ఉన్న ఈ రోడ్డు ప్రయాణానికి కష్టతరంగా మారింది. వాహనాల టైర్లకు పంక్చర్లు చేసేలా ఉందంటే ఈ రోడ్డు దుస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే గ్రామస్తులు రాష్ట్ర మంత్రి బాలవీరాంజనేయస్వామి ఒకసారి గ్రామంలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. రోడ్డును మూసేస్తున్న చిల్ల చెట్లు... వాసేపల్లిపాడు రోడ్డు గోతులు, గొయ్యిలమయంగా మారటం ప్రయాణానికి ఒక రకంగా ప్రమాదమైతే.. ఆ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిల్లచెట్లు మరీ ప్రమాదకరంగా మారాయి. కొన్ని చోట్ల చిల్లచెట్లు రోడ్డును పూర్తిగా మూసేశాయి. ఒకపక్క గోతులతో వాహనాల ప్రయాణం ప్రమాదకరంగా మారితే.. మరోపక్క రోడ్డును మూసేసిన చిల్లచెట్ల వల్ల ఆ రోడ్డులో ప్రయాణం భయంభయంగా సాగుతోంది. రాత్రివేళ ప్రయాణమంటే తోడు లేకుండా ఒంటరిగా చేయడానికి గ్రామస్తులు వణికిపోతున్నారు. చెట్ల పొదల్లో మాటువేసి ఎవరైనా దాడులు చేసినా, అటకాయించినా ఆ రోడ్డులో తప్పించుకుని వేగంగా వెళ్లే పరిస్థితులు కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పట్టించుకోని పాలకులు... టంగుటూరు మండలానికి విసిరేసినట్లు ఉండే వాసేపల్లిపాడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. అటు కొండపి నియోజకవర్గానికి చెందిన మంత్రి స్వామి పట్టించుకోడు. ఇటు ఒంగోలు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పట్టించుకోడు. పాలకులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయినా కనీసం అధికారులైనా పట్టించుకుంటారా అంటే అదీ లేదు. గ్రామ సమస్యలపై నోరు మెదిపే అధికారులు కూడా కరువయ్యారు. మంత్రి స్వామి నియోజకవర్గంలోని రోడ్డు దుస్థితిపై ఆ గ్రామస్తుల ఆందోళన ఆ రోడ్డుపై ప్రయాణమంటేనే దడపుడుతోందని ఆవేదన ఒకటా.. రెండా.. వందలకొద్దీ గోతులు ఆపై.. రోడ్డును కప్పేసిని చిల్లచెట్లు ఆ రోడ్డుపై ప్రయాణమంటే నరకానికి మార్గమేనంటూ విమర్శలు రాత్రివేళల్లో ప్రయాణమంటే ప్రాణాలు అరచేత పట్టుకోవాల్సిందే జిల్లా కేంద్రమైన ఒంగోలును ఆనుకుని ఉన్నప్పటికీ పట్టించుకోని పాలకులు, అధికారులు మంత్రి స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. జనసేనకు ఓట్లేశారంటూ దెప్పిపొడుపులు -
సాగర్ కాలువలో యువకుడి మృతదేహం గుర్తింపు
కురిచేడు: త్రిపురాంతకం మండలం రాజుపాలెం సాగర్ ప్రధాన కాల్వలో గల్లంతైన పెద్దపూడి సురేంద్రరెడ్డి (20) మృతదేహం శుక్రవారం మండలంలోని నాయుడుపాలెం సాగర్ కాల్వలో లభ్యమైంది. సురేంద్రరెడ్డి గుంటూరులో బీటెక్ చదువుతూ బంధువుల ఇంట్లో అయ్యప్పస్వామి ఇరుముడి కార్యక్రమానికి స్వగ్రామం వచ్చాడు. గురువారం ఉదయం కాలువకు వచ్చి జారిపడి కనిపించక పోవడంతో సురేంద్రరెడ్డి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. కాలువ కట్టపై ద్విచక్ర వాహనం, చెప్పులు కనిపించాయి. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో సురేంద్రరెడ్డి మృతదేహాన్ని శుక్రవారం మండలంలోని పడమరనాయుడుపాలెం వద్ద నాగార్జునసాగర్ కాలువలో గుర్తించి ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సురేంద్రరెడ్డి తండ్రి సుబ్బారెడ్డికి అప్పగించారు. గిద్దలూరు రూరల్: మండలంలోని వెల్లుపల్లెలో ఓ వ్యక్తి బైక్కు దుండగులు నిప్పు అంటించిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. అందిన వివరాల ప్రకారం.. గ్రామంలో జంగాల రవికి చెందిన ఫ్యాషన్ ప్రో బైక్ను ఇంటి ముందు ఉంచి నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బైక్ను అక్కడి నుంచి గ్రామానికి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి నిప్పు అంటించారు. బైక్ పూర్తిగా దగ్ధమైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలు వన్టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అబుదాబి – దుబాయి ప్రాంతాలలో హోంకేర్ నర్స్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జె.రవితేజ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోంకేర్ నర్స్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలన్నారు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. మహిళలు మాత్రమే అర్హులని తెలిపారు. కనీసం 2 సంవత్సరాలు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలన్నారు. తప్పనిసరిగా ఇంగ్లిష్ భాష వచ్చి ఉండాలన్నారు. జీతం నెలకు 1,08,900 నుంచి 2,00,000 రూపాయలు ఉంటుందన్నారు. రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ వ్యవధి ఉంటుందన్నారు. రోజుకు 10 గంటలు లేదా వారంలో 6 రోజులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. సంవత్సరానికి 20 రోజులు సెలవులు ఉంటాయన్నారు. పన్ను రహిత జీతం ఉంటుందని, ఉచిత భోజనం, వసతి, వైద్యం, రవాణా ఉంటుందన్నారు. వీసా, విమాన ప్రయాణ ఖర్చులు కంపెనీ భరిస్తుందన్నారు. అభ్యర్థులు సర్వీస్ చార్జీల కింద 1,75,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు పాస్పోర్ట్, అనుభవ సర్టిఫికెట్, విద్యార్హత సర్టిఫికెట్లు, ఈఅఏ, ఈఏఅ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 7వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9988853335, 8712655686, 8790118349, 8790117279 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఉలవపాడు: గుడ్లూరు మండలంలో భూసేకరణ సమావేశానికి సీపీఎం నాయకులు వస్తారని పోలీసులు శుక్రవారం ముందస్తుగా వారిని అరెస్టు చేసి ఉలవపాడు పోలీసుస్టేషన్కు తరలించారు. కందుకూరులో ఉంటున్న సీపీఎం నాయకులు జీవీబీ కుమార్, గౌస్ను అరెస్టు చేసి ఉలవపాడు స్టేషన్కు తీసుకొచ్చారు. గ్రామ సభకు వెళ్తున్న సీపీఎం గుడ్లూరు మండల కార్యదర్శి జి.వెంకటేశ్వర్లును చేవూరు వద్ద అరెస్టు చేసి ఉలవపాడు స్టేషన్కు తీసుకొచ్చారు. చేవూరు గ్రామానికి చెందిన ఇరువూరి ఉపేంద్రబాబు, గోచిపాతల జక్రయ్య, రావూరుకు చెందిన కాకు మల్లికార్జున, మిరియం వెంకట్రావులను అర్ధరాత్రి అరెస్టు చేసి స్టేషన్లో ఉంచారు. సాయంత్రం 3 గంటలకు సమావేశం పూర్తయిన తర్వాత వారిని పంపించారు. ప్రజాభిప్రాయసేకరణ అని చెప్పి అరెస్టులు చేయడం దారుణమని వారు బయటకు వచ్చిన తర్వాత ఖండించారు. పచ్చని భూములను కార్పొరేటుకు కట్టబెడుతున్నారని విమర్శించారు. -
బెత్తెడు జీతంతో వీఆర్ఏల బండచాకిరి
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో వీఆర్ఏలు శ్రమదోపిడీకి గురవుతున్నారని, బెత్తెడు జీతంతో బండచాకిరి చేస్తున్నా కుటుంబాన్ని పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నారని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో వీఆర్ఏలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా కనీసం ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. కనీస వేతనాలను అమలు చేస్తామని గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయకుండా మాటతప్పారని మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంగా ఒక్క రూపాయి కూడా వీఆర్ఏలకు జీతాలు పెంచకపోగా వారితో బండచాకిరి చేయిస్తున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తున్నారని, పే స్కేలు అమలు చేయడంతో అక్కడ రూ.20 వేలకు పైగా వేతనాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రం పే స్కేలు ఊసే లేదన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా పే స్కేలు పెంచాలని డిమాండ్ చేశారు. అటెండర్, నైట్ వాచ్మెన్లకు 70 శాతం పే స్కేలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చదువుకున్న వీఆర్ఏలు పదోన్నతులకు నోచుకోకుండా నిరాశకు గురవుతున్నారని, ఎప్పటికీ వీఆర్ఏలుగానే మిగిలి పోవాలా అని ప్రశ్నించారు. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి వయోభారం పెరుగుతోందని, రిటైర్మెంట్ నాటికై నా ప్రమోషన్లు ఇస్తారో లేదో చెప్పాలని నిలదీశారు. ఏళ్ల తరబడి నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా గుర్తించడంలేదని చెప్పారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు చెందిన వీఆర్ఏలను అకలి బాధల నుంచి కాపాడాలని కోరారు. వేతనాలు పెంచకుండా, ఖాళీలను భర్తీ చేయకుండా వీఆర్ఏలకు డ్రైవర్లుగా, నైట్వాచ్మెన్లుగా అక్రమంగా డ్యూటీలు వేస్తున్నారని ఆరోపించారు. వీఆర్ఏల సంఘం గౌరవాధ్యక్షుడు గంటినపల్లె శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీఆర్వో, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్, వాచ్మెన్ పోస్టులను వీఆర్ఏల చేత భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు పి.జ్యోతి అధ్యక్షత వహించగా సోములు, చంద్ర, నాగేంద్ర, సుందర్ రావు, శివయ్య పాల్గొన్నారు. -
కోటి సంతకాలతో కనువిప్పు కావాలి
తర్లుపాడు: ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వైద్యశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా శుక్రవారం రాత్రి తర్లుపాడు మండలంలోని సూరేపల్లి, సీతానాగులవరం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. పశ్చిమ ప్రకాశం ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం, వైద్య విద్య, అర్హులైన వారికి అందాలంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలు నిర్మించాలని, అందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వాలని అన్నా రాంబాబు కోరారు. నాడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించి ప్రజల మనసుల్లో నిలిచిపోయాడని, ఆయన స్థానాన్ని ఎవరూ తొలగించలేరని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆస్థులను తన అనుచరులకు కట్టబెట్టేందుకు పీపీపీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. దీన్ని అడ్డుకోవాలని ప్రజలు పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రజలు తెలుసుకోలేకపోతే భవిష్యత్తులో ఉచిత వైద్యం దూరమవుతుందన్నారు. భవిష్యత్తు తరాల కోసమే కోటి సంతకాల ఉద్యమం చేపట్టామన్నారు. 66 ఏళ్లపాటు మెడికల్ కళాశాలలను ప్రైవేటు వారికి అప్పగిస్తే ఈ ప్రాంత ప్రజలు ఉచిత వైద్యం కోసం గతంలో లాగా ఒంగోలు, గుంటూరు, కర్నూలు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వలన పేదలకు ఉచితవైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. 3500 మెడికల్ సీట్లు రాష్ట్రానికి తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అన్నారు. రాజకీయ విమర్శల కోసం, ఓట్ల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదని, భవిష్యత్ తరాల కోసమే అన్నారు. పేద వారి చదువు, వైద్యం కోసం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ప్రవేశ పెడితే ఆయన తనయుడు అమ్మఒడి పథకాన్ని పెట్టారని గుర్తుచేశారు. కార్యక్రమంలో అన్నా రాంబాబుకు నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. ఎంపీపీ భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, జెడ్పీటీసీ వెన్న ఇందిర, మార్కాపురం, తర్లుపాడు మండల పార్టీ అధ్యక్షులు మురారి వెంకటేశ్వర్లు, పీ చెంచిరెడ్డి, సర్పంచ్ నవ్య రమణయ్య, ఎంపీటీసీ రేగుల సాలమ్మ, పార్టీ నాయకులు అంకయ్య, సర్పంచ్లు ఆంజనేయులు, దాసయ్య, ఎంపీటీసీ అంకయ్య ఆధ్వర్యంలో అన్నాకు ఘనస్వాగతం పలికారు. -
గుర్తింపు లేని ఉద్యోగం..!
ఒంగోలు టౌన్: పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు సమాన గుర్తింపు లభించడం లేదు. బందోబస్తులు, ట్రాఫిక్ డ్యూటీ, నైట్ బీట్లు తదితర విధులు నిర్వహిస్తున్నప్పటికీ శ్రమకు తగిన వేతనాలు, గుర్తింపు లేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం భేఖాతరు చేస్తోంది. వేతనాలు, హోదా విషయంలో అంతులేని వివక్ష కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని హోంగార్డులు మొరపెట్టుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 6వ తేదీ హోంగార్డు రైజింగ్ డే నిర్వహించడం మినహా వారి భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలను ప్రకటించకపోవడంతో తీవ్రమైన నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లాలో 726 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. ఇందులో పురుష హోంగార్డులు 640 మంది మహిళా హోంగార్డులు సుమారు 86 మంది ఉన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, సభలు, సమావేశాలకు బందోబస్తు, నేరాల ఛేదించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లాలో 35 సంవత్సరాలకు పైబడి విధులు నిర్వహిస్తున్నవారున్నారు. ఎలాంటి పదోన్నతులు లేకుండానే రిటైర్డ్ అయినవారున్నారు. రిటైర్డ్ అయ్యే రోజు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒట్టిచేతులతో రిటైర్డ్ కావడం జీవన సంధ్యలో ఆదుకునేవారు లేక అల్లాడిపోతున్నారు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగులు... రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం జరుగుతోంది. సీఎఫ్ఎంఎస్ పరిధిలో వుండడంతో వీరికి ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. ఎన్టీఆర్ భరోసా కింద 60 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.4 వేల పింఛన్ వస్తుంది. కానీ, 35 ఏళ్లకుపైగా సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసినప్పటికీ హోంగార్డులకు మాత్రం పింఛన్ రాదు. పింఛన్ కోసం సచివాలయం వెళ్లి ఆఽన్లైన్లో ఆధార్ కార్డు నంబర్ కొట్టగానే ప్రభుత్వ ఉద్యోగిగా చూపుతోంది. దాంతో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అనర్హులుగా పరిగణిస్తున్నారు. అరకొర వేతనాలతో పనిచేసే హోంగార్డుల పిల్లల చదువులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కాలర్షిప్పులు కూడా రావడంలేదు. పిల్లలను చదివించుకోడానికి అప్పులు చేయాల్సి వస్తోందని హోంగార్డులు వాపోతున్నారు. దేశంలో తొలిసారిగా హోంగార్డు కో ఆపరేటివ్ సొసైటీ... 2019లో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంగోలులో హోంగార్డుల సంక్షేమం కోసం కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా పిల్లల పెళ్లిళ్లు, చదువులకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరిగింది. తొలుత ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున 444 మందికి రుణాలిచ్చారు. ఆ తరువాత కొంతకాలానికి రుణపరిమితిని లక్ష రూపాయలకు పెంచారు. ఇప్పటి వరకు 353 మందికి లక్ష రూపాయల చొప్పున రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ సొసైటీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసలు పొందింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వేతనాలు ఇవ్వాలి... హోంగార్డు రైజింగ్ డే సందర్భంగా తమకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వేతనాలు ఇవ్వాలని జిల్లాలోని హోంగార్డులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2015 సంవత్సరం నుంచి రావాల్సిన బకాయిలు మంజూరు చేయాలని, హోంగార్డులకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలని, ఇతర న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హోంగార్డులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నారు. రిక్రూట్మెంట్తో సంబంధం లేకుండా సీనియార్టీ ప్రకారం హోంగార్డులకు కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా గుర్తింపునకు నోచుకోని హోంగార్డులు ఏళ్ల తరబడి విధులు నిర్వర్తించినా ఒకటే హోదా సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నా పట్టించుకోని వైనం కానిస్టేబుళ్లుగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ నేడు హోంగార్డుల దినోత్సవం గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హోంగార్డులకు వేతనాలను రూ.110 వరకు పెంచారు. అప్పటి వరకు రోజుకు రూ.600 వేతనం ఇస్తుండగా దాన్ని రూ.110కు పెంచి రూ.710 ఇచ్చింది. అంతేగాకుండా కానిస్టేబుల్ ఉద్యోగాలలో సివిల్ పోస్టులకు 15 శాతం, ఏపీఎస్పీ పోస్టులకు 25 శాతం కోటా ఇచ్చింది. దాంతో జిల్లా నుంచి 9 మంది హోంగార్డులు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. హోంగార్డులకు ఇంటి స్థలం ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క రూపాయి వేతనం పెంచలేదు. ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలుపుకోలేదు. -
కొణిజేడులో పీటీఎంకు హాజరుకాని తల్లిదండ్రులు
టంగుటూరు: మండలంలోని కొణిజేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఇతర అధికారులు హాజరయ్యారు. పాఠశాలలో 145 మంచి విద్యార్థులు ఉండగా కేవలం 60 మంది తల్లిదండ్రులు రావడంతో చేసేది ఏమీ లేక టీడీపీ నాయకులు, మండల అధికారులు, డ్వాక్రా మహిళలను తరలించి సమావేశం మమ అనిపించారు. కొణిజేడు టీడీపీలో రెండు వర్గాలు ఉండగా దామచర్ల సత్య వర్గం గైర్హాజరైంది. మంత్రి వద్ద మార్కులు పొందడం కోసం కార్యక్రమాన్ని రాజకీయ సభగా మార్చడంపై గ్రామ ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. వాస్తవానికి 145 మంది పిల్లలు చదువుతుంటే 60 మంది తల్లిదండ్రులు రాగా దాదాపు 500 మంది ప్రజలు హాజరు కావడం, అందులో డ్వాక్రా మహిళలు ఉండటంతో రాజకీయ సభలా కనిపించింది. పాఠశాలలో ఏర్పాటు చేసే కార్యక్రమాలను రాజకీయ సభలుగా మార్చొద్దని ప్రజలు హితవు పలుకుతున్నారు. మరోపక్క మంత్రి స్వామి స్వగ్రామం తూర్పునాయుడుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 120 మంది విద్యార్థులు చదువుతుండగా 50 మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు కూడా తల్లిదండ్రుల సమావేశం ప్రారంభం కాలేదు. -
అంతర్ యూనివర్సిటీ క్రీడా పోటీలకు సన్నద్ధం
ఒంగోలు సిటీ: ఏకేయూ అంతర్ యూనివర్సిటీ క్రీడా పోటీలకు టీములను సిద్ధం చేయాలని వైస్ చాన్సలర్ డీవీఆర్మూర్తి అన్నారు. ఒంగోలులోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ మీటింగ్ వీసీ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవీఆర్ మూర్తి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ తరఫున పాల్గొనే వివిధ టీంల టోర్నమెంట్ల నిర్వహణ, టీమ్స్ సెలక్షన్ సంబంధించిన ఆర్థిక అంశాలు, విధి విధానాల్ని నిర్ణయించినట్లు తెలిపారు. వాలీబాల్, హ్యాండ్ బాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, అథ్లెటిక్స్ తదితర క్రీడలకు టీములను సిద్ధం చేయడంపై ఆమోదం తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, ప్రిన్సిపాల్, డిపార్టుమెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ నిర్మలామణి, విశ్వవిద్యాలయ సీడీసీ డీన్ డాక్టర్ కేవీఎన్ రాజు, డీన్ ఆఫ్ అకాడమిక్స్ ప్రొఫెసర్ జి రాజమోహన్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సత్యపాల్, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అఫ్లియేటెడ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్లు కరుణ కుమార్, టీఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కందుకూరు, రమేష్ బాబు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కనిగిరి, సుశీలమ్మ, కేఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అద్దంకి కళాశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. -
గంజాయి ఆనవాళ్లు లేకుండా చేయాలి
ఒంగోలు టౌన్: జిల్లాలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేయాలని, గంజాయి విక్రేతలు, వినియోగదారులపై నిఘా పెట్టి కట్టడి చేయాలని ఎస్పీ హర్షవర్థన్రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా పలువురు డీఎస్పీలతో కలిసి ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రవాణా చేసే వారిపై గట్టి నిఘా ఉంచాలన్నారు. లోకల్ పెడ్లర్స్తోపాటు రిసీవర్లను గుర్తించాలని, పెడ్లర్స్తో సంబంధాలున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను సేవించేవారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. గంజాయి కేసుల్లో నిందితులపై అధికారులతో చర్చించి పీడీ చట్టం ప్రయోగించడానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. రౌడీషీటర్ల దైనందిన జీవన విధానాన్ని, వారి వ్యక్తిగత ప్రవర్తనను గమనించాలన్నారు. పదే పదే నేరాలకు పాల్పడడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వాతావరణంలో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని పొగమంచు ఏర్పడే సమయాలలో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వాహనచోదకులు ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. పోక్సో, మహిళలపై నేరాల కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే విచారణ వేగవంతం చేయాలని, నిర్ణీత సమయంలో చార్జిషీట్ ఫైల్ చేసేందుకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. త్వరలో జరగబోవు లోక్ అదాలత్లో అత్యధికంగా కేసులు రాజీపడేలా చూడాలన్నారు. సమీక్షలో ఎస్బీ డీఎస్పీ చిరంజీవి, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, పీసీఆర్ సీఐ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
అబద్ధాల మేళం..!
రైతన్నా మీ కోసం.. మా ఊళ్లో సమావేశం ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు మా గ్రామంలో రైతన్నకు మీ కోసం సమావేశం ఎప్పుడు జరిగిందో మాకు తెలియనే తెలియదు. నేను నాలుగు ఎకరాల్లో మినుము, అలసంద సాగు చేశా. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా నీటమునిగి పంట దెబ్బతింది. సబ్సిడీపై విత్తనాలు ఇవ్వలేదు. బయట మార్కెట్లో కొని సాగుచేసుకుంటున్నా. చంద్రబాబు ఏటా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ ఇస్తామని చెప్పారు. తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది రెండు దఫాలుగా సగమే వేశారు. ఆర్బీకేల ద్వారా సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేదు. పంట నష్టపరిహారం ఇవ్వలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా రైతు భరోసా కేంద్రం ద్వారా అన్నీ ఇచ్చారు. చంద్రబాబు పాలనలో రైతులను మోసం చేస్తున్నారు. – దారా నాగయ్య, వెంగపల్లి , హనుమంతునిపాడు మండలంప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో అన్ని రకాలుగా రైతును ముంచేసింది. చంద్రబాబు ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉండడంతో అధికారులు తూతూమంత్రంగా నిర్వహించి కార్యక్రమాన్ని మ..మ అనిపించారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో మొత్తం 5,31,369 మంది రైతులున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్, రబీ సీజన్లలో వివిధ రకాల పంటలు సాగుచేసిన రైతులు లాభారు ఆర్జించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతల పరిస్థితి తలకిందులైంది. మొదటి సంవత్సరం పాలనలో రెండు సార్లు ఖరీఫ్లోనూ, రబీలోనూ కరువు కరాళనృత్యం చేసింది. దాంతో ఒకసారి 17 మండలాలు, రెండోసారి 30 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. దాంతో పంటలు నష్టపోయిన రైతుల జాబితాలు సిద్ధం చేసి నష్టం అంచనాలను ప్రభుత్వానికి పంపారు. కానీ ఇంతవరకు పంట నష్టం రైతుకు చేరింది లేదు. గత సంవత్సరం దాదాపు రూ.100 కోట్లకుపైగా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నా ఇంత వరకు ఇవ్వలేదు. పంటల బీమా లేదు. యాంత్రీకరణ లేదు. ఇలా చెప్పుకుంటూపోతే రైతన్న కంట కన్నీళ్లు ఒలుకుతాయి. సబ్సిడీ విత్తనాలు లేవు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతన్నలు అప్పుల బాధతో విలవిల్లాడుతున్నారు. పొగాకు రైతులు పూర్తిగా పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారు. బ్లాక్ బర్లీ పొగాకు తూతూమంత్రంగా కొనుగోలు చేసి పొగాకు రైతులను నిలువునా ముంచారు. ఇక, సజ్జ, మొక్కజొన్న, మిర్చి, పత్తి, వరి, జొన్న, కందులు, మినుములు ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కలేదు. ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోలు చేయనూ లేదు. ఇంతటి దీనావస్థలో రైతులు కొట్టుమిట్టాడుతుంటే రైతన్నా మీ కోసం ఏమి ఒరగబెట్టడానికి చేపట్టారన్న విమర్శలు చంద్రబాబు ప్రభుత్వంపై పెల్లుబుకుతున్నాయి. మోంథా తుఫాన్తో జిల్లాలో పత్తి 35,750 ఎకరాలు, సజ్జ 7,300, వరి 9,500, మొక్కజొన్న 7,100, ఇతర పంటలు 36 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. తుఫాన్ వచ్చి నెలరోజులవుతున్నా ప్రభుత్వం నేటికీ పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. గత ఏడాది ఫెంగల్ తుఫాన్ జిల్లాలోని పది మండలాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. 7650 మంది రైతులు 25540 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకూ సాయం అందలేదని రైతులు వాపోతున్నారు. ఇక, అన్నదాత సుఖీభవకు ప్రభుత్వం కోతలు పెట్టింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఈ పథకాన్ని ఎగ్గొట్టి రైతులకు పంగనామాలు పెట్టారు. రెండో ఏడాదిలోనూ జిల్లాలో 15,970 మంది రైతులకు మొండిచేయి చూపారు. వైఎస్సార్ రైతు భరోసా 2,84,113 మందికి వర్తిస్తే నేడు 2,68,163 మంది అర్హులుగా గుర్తించారు. మరోవైపు దాదాపు 45 వేల మంది కౌలు రైతులకు నయాపైసా కూడా ఇవ్వకుండా వారికి వేదన మిగిల్చారు. రైతులకు ఎంతో ఉపయోగకరమైన 616 రైతు భరోసా కేంద్రాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మొక్కుబడి సమావేశాలు మినహా నష్టపరిహారమేదీ పది ఎకరాల్లో పత్తి సాగు చేశా. సుమారు రూ.3 లక్షల వరకూ ఖర్చు చేశా. మోంథా తుఫాన్తో కురిసిన భారీ వర్షాలకు పంట మొత్తం నష్టపోయా. నాణ్యత తగ్గి దిగుబడి లేక పొలాల్లో పీకిన పత్తిని కొనేవారులేక ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంలేదు. వ్యవసాయ సిబ్బంది మాత్రం గ్రామాల్లో రైతుల కోసమంటూ సమావేశాలు పెడుతున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా మొక్కుబడి సమావేశాలు ఎందుకో తెలియడం లేదు. పరిహారం ఇస్తేనే మేము కోలుకుంటాం. – నర్రావుల బసవారెడ్డి, పత్తి రైతు, వెలిగండ్ల, కొనకనమిట్ల మండలం -
మార్కాపురం ప్రజల ఆనందం ఆవిరి..!
మార్కాపురం: మార్కాపురం జిల్లా వచ్చిందన్న ఆనందం ఆవిరైపోతోందని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ వైద్యశాల, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ, మరోవైపు ఆర్టీఓ కార్యాలయం జారీచేసే ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేసే అధికారాన్ని నంద్యాలకు బదిలీ చేయడంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం వాహనదారులకు శాపంగా మారిందంటున్నారు. మార్కాపురం రవాణాశాఖ అధికారి పరిధిలోని ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి నంద్యాల, గుంటూరు ఆర్టీఓ పరిధిలోకి మారుస్తూ తీసుకున్న నిర్ణయం వాహనదారులకు భారంగా మారింది. మార్కాపురం రవాణాశాఖ కార్యాలయ పరిధిలో మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం అన్ని రకాల వాహనాలు కలిపి 20,351 ఉన్నాయి. వీరంతా ఇప్పటివరకూ ఫిట్నెస్ సర్టిఫికెట్లు మార్కాపురంలోనే తీసుకుంటున్నారు. ఈ నెల 1 నుంచి ఈ సర్టిఫికెట్ల జారీని నంద్యాల, గుంటూరుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.20 వేల అదనపు భారంతో ఆందోళన... మార్కాపురం ప్రాంత లారీల యజమానులు ఇప్పటి వరకూ ఫిట్నెస్ సర్టిఫికెట్కు కేవలం ప్రభుత్వ చలానా చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు నంద్యాల లేదా గుంటూరు వెళ్లాలంటే సుమారు 20 నుంచి 22 వేల రూపాయలు అదనంగా చలానా భారం పడనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం మార్కాపురంలో పలువురు ఆటో డ్రైవర్లు, మోటారు వర్కర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆటోలు, కార్లు, లారీలు, ట్రాక్టర్లు, స్కూల్ బస్సులు, ప్రైవేటు బస్సులకు ప్రభుత్వ నిర్ణయం భారం కానుందని వాపోయారు. మార్కాపురం ఆర్టీఓ పరిధిలో ఎల్జీవీ పెద్దవి 711, చిన్నవి 2050, ట్రాక్టర్లు 404, క్యాబ్లు 1785, స్కూల్ బస్సులు 296, కార్లు 6051, ఆటోలు 2679, ట్రాక్టర్ ట్రైలర్లు 1304, వ్యవసాయ ట్రాక్టర్లు 6282 వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా 20,351 వాహనాలు ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీరంతా ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం ఇకపై గుంటూరు లేదా నంద్యాల వెళ్లాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలి ఇప్పటివరకూ మార్కాపురం ఆర్టీఓ పరిధిలో ఇస్తున్న ఫిట్నెస్ సర్టిఫికెట్లను నంద్యాల లేదా గుంటూరుకు మార్చడం మంచిది కాదు. మాకెంత ఆర్థిక భారం కానుందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎటుచూసినా సుమారు 200 కిలోమీటర్లు వెళ్లి ఫిట్నెస్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకుని యథావిధిగా మార్కాపురంలోనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. – శ్రీనివాసులు, ఆటో డ్రైవర్, మార్కాపురం ప్రభుత్వ నిర్ణయం సరికాదు మార్కాపురం పట్టణంలో ఆర్టీఓ కార్యాలయం ఉన్నప్పటికీ ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీని నంద్యాల లేదా గుంటూరు పరిధిలోకి ప్రభుత్వం మార్చడం సరికాదు. డ్రైవర్లకు చాలా ఇబ్బంది కలిగించే అంశం. అదనంగా ఆర్థిక భారం పడుతోంది. తక్షణమే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. లేదంటే ఆటో కార్మికుల కోసం ఉద్యమం చేపడతాం. – ఎస్కే ఖాశీం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి -
ఎర్ర కాళ్ల కొంగలు కనువిందు
పెద్దదోర్నాల: మండల కేంద్రంలో ఎర్ర కాళ్ల కొంగలు (పెయింటెడ్ స్టార్క్) కనువిందు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఈ కొంగలు సంచరిస్తుండటంతో మండల ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. మండల కేంద్రంలోని నేషనల్ హైవే బైపాస్ రోడ్డులో కొద్దిరోజుల నుంచి ఎర్ర కాళ్ల కొంగలు సంచరిస్తున్నాయి. ఇవి దక్షిణాసియాతో పాటు సైబీరియా దేశాలలో సంచరిస్తుంటాయని, శీతాకాలంలో వలస వస్తుంటాయని ప్రముఖ వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ మహమ్మద్ హయాత్ తెలిపారు. ఇవి ఎక్కవగా నీటి వనరులు, పచ్చిక బయళ్లు ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తుంటాయని, వీటి ముక్కు పొడవుగా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు వెడల్పాటి రెక్కలతో చూసేందుకు అందంగా ఉంటాయని ఆయన తెలిపారు. ● నేడు పేరెంట్స్–టీచర్స్ సమావేశాలపై విమర్శలు ఒంగోలు సిటీ: పేరెంట్స్–టీచర్స్ సమావేశాల పేరుతో హడావిడి తప్ప ఏమీ ఉపయోగం లేదనే విమర్శలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి. శుక్రవారం ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఈ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాకపోవడంతో హెచ్ఎంలు తమ జేబులకు చిల్లు తప్పదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం పూర్తవుతున్నప్పటికీ స్కూళ్లలో నాడు–నేడు పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం వదిలేసింది. నాణ్యమైన మెనూకు మంగళం పాడింది. ఇటువంటి సమస్యల మధ్య విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు పరీక్షల సీజన్లో విద్యార్థులపై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంది. ఈ సమయంలో అవసరమైన చర్యలు చేపట్టకుండా మొక్కుబడి సమావేశాలు అవసరమా అంటూ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒంగోలు సబర్బన్: డివిజన్ స్థాయిలో అభివృద్ధి అధికారి ఉండటం వలన క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పర్యవేక్షణ పెరిగి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని కలెక్టర్ రాజాబాబు అన్నారు. స్థానిక పాత జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఒంగోలు డివిజిన్ డెవలప్మెంట్ అధికారి, డివిజినల్ పంచాయతీ అధికారి, డ్వామా ఏపీడీ కార్యాలయాలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో డీపీఓ వెంకటేశ్వరరావు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, పంచాయతీరాజ్ ఎస్ఈ అశోక్, జెడ్పీ ఇన్చార్జ్ సీఈవో జాలమ్మ, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డీఎల్డీవో సువార్త, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మార్కాపురంలోనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలి
● ఆటోడ్రైవర్ల నిరసన ప్రదర్శన మార్కాపురంలోనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆటో డ్రైవర్లు గురువారం పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మార్కాపురం ఆర్టీఓ కార్యాలయంలో జారీ చేస్తున్న ఫిట్నెస్ సర్టిఫికెట్లను ఈ నెల 1వ తేదీ నుంచి నంద్యాల లేదా గుంటూరుకు మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు డీకేయం రఫీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఫిట్నెస్ సర్టిఫికెట్లను మార్కాపురం నుంచి నంద్యాలకు మార్చడం మంచిది కాదన్నారు. ఇప్పటికే బాడుగలు లేక కిస్తీలు కట్టలేక కుటుంబాలను పోషించుకోలేక అవస్థలు పడుతున్నామని అన్నారు. తక్షణమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని మార్కాపురంలోనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయం నుంచి బస్టాండు వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు అందె నాసరయ్య, తదితరులు పాల్గొన్నారు. -
దోచుకునేందుకే ప్రైవేటీకరణ
కోటి సంతకాల సేకరణకు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు పొదిలిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న అన్నా రాంబాబుపొదిలి రూరల్: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో శ్రీకారం చుట్టారని, కానీ, ఆయనకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న అక్కసుతో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. బుధవారం పొదిలి నగర పంచాయతీలోని 5, 6, 7 వార్డుల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. నగర పంచాయతీ అధ్యక్షుడు సానికొమ్ము శ్రీనివాసులరెడ్డి అధ్యక్షత వహించగా, అన్నా రాంబాబు మాట్లాడుతూ రారష్ట్రంలో పేద, బడుగు, బలహీనవర్గాలకు ఉచిత వైద్యం, ఉచిత వైద్య విద్య అందించాలని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంపై బాధ్యత లేదన్నారు. వేల కోట్లు ఖర్చు చేసి జగనన్న నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులను పూర్తిచేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంతో వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోందన్నారు. ప్రైవేటు వ్యక్తులు పేదలకు ఉచితంగా వైద్యం చేస్తారా..? అని అన్నా రాంబాబు ప్రశ్నించారు. కేవలం ప్రైవేటు వైద్యం పేరుతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల నుంచి డబ్బు దోచుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలలో పీపీపీ విధానాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్మించిన వైద్య కళాశాలలను కొనసాగించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల ముందు మోసపూరిత హామీలిచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కుట్రపూరిత పాలన సాగిస్తోందన్నారు. ఓవైపు ప్రజలందరికీ ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పూనుకోవడం, మరోవైపు ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసి పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. చంద్రబాబు తన హయాంలో రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా స్థాపించలేకపోయారన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు లేవన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామంటూ అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, ఉడుముల వరలక్ష్మమ్మ, నూర్జహాన్బేగం, గౌసియాబేగం, మస్తాన్వలి, యక్కలి శేషగిరిరావు, పి.భాను, యశోదరావు, గౌస్బాషా, రబ్బానీ, బాజీ, రమణకిషార్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలపై చంద్రబాబు కుయుక్తులు ప్రైవేటీకరిస్తే పేదలకు వైద్యం దూరం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పొదిలి పట్టణంలోని 5, 6, 7 వార్డుల్లో కోటి సంతకాల సేకరణ -
పాస్టర్ హత్య కేసులో 12 మంది అరెస్ట్
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్ కనిగిరి రూరల్: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాచవరం గ్రామంలో పాస్టర్ ఉడుముల ప్రకాష్ ను హత్య చేసిన కేసులో 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ బుధవారం తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. మాచవరం గ్రామం సుందరయ్యకాలనీ, కనిగిరి పట్టణానికి చెందిన ఏ–1 చీమలదిన్నె వెంగయ్య, ఏ–2 తాళ్లపల్లి కొండమ్మ, ఏ–3 తాళ్లపల్లి బాలవెంగయ్య, ఏ–4 తాళ్లపల్లి వెంగళరావు, ఏ–5 చీమలదిన్నె వంశీ, ఏ–6 చీమలదిన్నె గురవమ్మ, ఏ–7 పిక్కిలి మధు, ఏ–8 తాళ్లపల్లి గురుబాబు, ఏ–9 తాళ్లపల్లి మాలకొండయ్య, ఏ–10 పొలిచెర్ల చెన్నకేశవులు, ఏ–11 కోడూరి లక్ష్మీప్రసన్న, ఏ–12 ఉర్లగంటి పిచ్చయ్యను అరెస్టు చేసినట్లు వివరించారు. కేసు వివరాల ప్రకారం.. మృతుడు ఉడుముల ప్రకాష్ మాచవరం గ్రామంలో చర్చి నిర్మించుకుని అదే చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చీమలదిన్నె గురవమ్మతో పాస్టర్కు మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో నిందితులు పలు మార్లు పాస్టర్తో గొడవపడి బెదిరించారు. వారి బెదిరింపులను మృతుడు లెక్కచేయకుండా గ్రామంలో చర్చి నడుపుతూ ప్రార్థనలు చేస్తున్నాడు. 2025 జూలై నెలాఖరులో మృతుడు ఉడుముల ప్రకాష్కు, చీమలదిన్నె గురవమ్మ (ఏ–6)కు మధ్య మనస్పర్థలు వచ్చాయి. వివాహేతర సంబంధం గురించి చీమలదిన్నె గురవమ్మ తన బంధువులు (ఏ–1 నుంచి ఏ–5, ఏ–7, ఏ–9)కు తెలిపింది. వారు పాస్టర్పై కక్ష పెంచుకుని చంపాలనే ఉద్దేశంతో గత ఆగస్టు 6వ తేదీ సుమారు 2 గంటల సమయంలో చర్చిలో పడుకుని ఉన్న పాస్టర్తో ఏ–1 నుంచి ఏ–9 వరకు నిందితులు ఏ–10, ఏ–12 ప్రోద్భలంతో చర్చిలోకి అక్రమంగా ప్రవేశించి గొడవపడి కులం పేరుతో దూషించారు. ఇష్టానుసారం కాళ్లతో, చేతులతో కొట్టి బురదలో పడేసి వెళ్లిపోయారు. బంధువులకు ఫోన్ చేసి పాస్టర్ బురదలో పడి ఉన్నాడు.. తెచ్చుకోండి అని చెప్పారు. అతని శరీరంపై కనిపించని గాయాలతో పాటు కడుపు నొప్పితో బాధపడుతుండటంతో కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి బంధువులు తరలించి చికిత్స చేయించారు. నిందితులకు భయపడి హాస్పిటల్ నుంచి పాస్టర్ పారిపోయి కనిపించకుండా వెళ్లాడు. అక్టోబర్ 11వ తేదీ సుమారు 7 గంటల సమయంలో ఒంగోలులోని సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద అపస్మారక స్థితిలో పడిఉన్న పాస్టర్ ప్రకాష్ను సమాచారం అందుకున్న అతని బంధువులు ఒంగోలు జీజీహెచ్లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అక్టోబర్ 14వ తేదీ ఉదయం 6.22 గంటలకు ఆయన మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఎస్సై టీ శ్రీరాం, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సాగర్ కాలువలో బీటెక్ విద్యార్థి గల్లంతు
త్రిపురాంతకం: సాగర్ కాలువలో బీటెక్ చదువుతున్న విద్యార్థి గల్లంతైన సంఘటన బుధవారం జరిగింది. త్రిపురాంతకం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన పెద్దపూడి సురేంద్రరెడ్డి సాగర్ కాలువ వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడినట్లు తెలిసింది. గ్రామస్తులు, బంధువులు వెతికినా అతని ఆచూకీ లభించలేదు. సురేంద్రరెడ్డి గుంటూరులో బీటెక్ చదువుతున్నాడు. బంధువులు ఇరుముడి కట్టుకుని శబరిమల వెళ్తుండటంతో స్వగ్రామం వచ్చాడు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో బంధువర్గం వెతకగా ఉదయం కాలువకు వెళ్లినట్లు సమాచారం అందడంతో కాలువ కట్టపై గాలించారు. అక్కడ బైక్, పాదరక్షలు ఉండటంతో గ్రామస్తులు సురేంద్రరెడ్డి ఆచూకీ కోసం కాలువలో వెతికినా ఫలితం లేకుండాపోయింది. పెద్దపూడి సుబ్బారెడ్డికి కుమారుడు సురేంద్రరెడ్డితో పాటు మరో కుమారుడు ఉన్నాడు. సురేంద్రరెడ్డి ఆచూకీ లభించకపోవడంతో బంధువర్గంలో ఆందోళన నెలకొంది. దీంతో త్రిపురాంతకం తహసీల్దార్ కృష్ణమోహన్, ఎస్ఐ శివబసవరాజుకు సమాచారం అందించారు. త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద ఘటన గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు -
రస్తా పోరంబోకు స్థలంలో కందిసాగు
కోసేసిన కంది చెట్లతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న మాజీ సైనికుడు కంది పంటను కోసేస్తున్న రెవెన్యూ సిబ్బంది కంభం: తాము సాగుచేసుకుంటున్న కంది పంటను రెవెన్యూ అధికారులు అన్యాయంగా కోసేశారంటూ ఓ మాజీ సైనికుడి కుటుంబ సభ్యులు బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సైనికుడు హరికిరణ్ మాట్లాడుతూ తాను ఉద్యోగ విరమణ తర్వాత కందులాపురం ఇలాఖాలో హైవే రోడ్డులో స్థలం కొనుక్కుని షెడ్డు వేసుకున్నానని, పక్కనే ఉన్న భూమిలో కంది పంట వేసుకున్నానని తెలిపారు. తాను కంది పంట వేసుకున్న పొలం పోరంబోకు స్థలం అని చెబుతూ రెవెన్యూ అధికారులు బుధవారం కోత దశలో ఉన్న కంది పంటను కోసి పక్కన పడేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ సిబ్బంది కోసిపడేసిన కంది చెట్లతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సదరు పొలం విషయంపై కోర్టులో పిటీషను దాఖలు చేసి ఉన్నానని చెప్పినా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోలేదని, అన్యాయంగా కోత దశలో ఉన్న తన పంట మొత్తం నాశనం చేసి తమపైనే కేసు పెట్టారని వాపోయారు. కొత్తగా వేసిన వెంచర్లలో ప్రభుత్వ డొంకరోడ్లను కలిపేసుకుంటున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు తాము వేసుకున్న పంటను నాశనం చేశారని వాపోయారు. ఈ విషయంపై తహసీల్దార్ కిరణ్ మాట్లాడుతూ రస్తా పోరంబోకు స్థలాన్ని సదరు మాజీ సైనికుడు ఆక్రమించాడని, ఆ స్థలంలో ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. పలుమార్లు చెప్పినా వినకపోవడంతో బుధవారం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కోత దశలో ఉన్న పంటను కోసేసిన రెవెన్యూ అధికారులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన మాజీ సైనికుడి కుటుంబం -
దొంగతనాలు ఎలా చేయాలో.. యూట్యూబ్ ద్వారా తెలుసుకుని..!
పుల్లలచెరువు: అప్పులు చేసి జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు అన్నదమ్ములు.. చేసిన అప్పులు తీర్చే దారి లేక యూట్యూబ్ ద్వారా దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకున్నారు. సుమారు రూ.10 లక్షల విలువైన 10 మోటారు సైకిళ్లు చోరీ చేసి చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యా రు. పుల్లలచెరువు మండలంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కాపురం డీఎస్సీ నాగరాజు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పుల్లలచెరువు మండలంలోని పాతచెర్వుతండాకు చెందిన ఎం.లక్ష్మానాయక్ గత నెల 29వ తేదీ పుల్లలచెరువు వచ్చి గుంటూరు వెళ్లే క్రమంలో పుల్లలచెరువు బస్టాండ్ సెంటర్లో బైక్ ఉంచగా, అదేరోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పుల్లలచెరువు ఎస్సై సంపత్కుమార్ తన సిబ్బందితో కలిసి తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ నెల 3వ తేదీ మండలంలోని ముటుకుల వద్ద వినుకొండ మండలంలోని గణేష్పాలేనికి చెందిన చొప్పర పు వేణు, చొప్పవరపు సన్నీ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో తారసపడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలతో పాటు విచారణ చేయగా వారి వద్ద మోటార్ సైకిళ్లను దొంగిలించే వివిధ పరికరాలు ఉన్నాయి. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి వారిని అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన పల్సర్ బండిని స్వాధీనం చేసుకున్నారు. దొంగలుగా నిర్ధారణ చేసుకుని విచారణ చేయగా వారి ఇంటి వద్ద దాచి ఉంచిన వివిధ జిల్లాలకు చెందిన బైకులతో పాటు తెలంగాణకు చెందినవి కలిపి మొత్తం 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.10 లక్షల మేరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ అజయ్కుమార్ నేతృత్వంలోని ఎస్ఐ సంతప్కుమార్, సిబ్బంది అరుణ్కుమార్, వీరాంజనేయులు, వేణు, కాశీబాబు, హెడ్కానిస్టేబుల్ సత్యనారాయణను ఎస్పీ హర్షవర్థన్రాజు అభినందించి రివార్డు ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు. డీఎస్సీ నాగరాజు ప్రత్యేకంగా వారిని అభినందించి రివార్డులు అందజేశారు. జల్సాల కోసం మోటారు సైకిళ్ల చోరీ అన్నదమ్ములను అరెస్టు చేసిన పోలీసులు రూ.10 లక్షల విలువైన మోటారు సైకిళ్లు స్వాధీనం -
కలెక్టర్ గారూ.. ఇది తగునా
యర్రగొండపాలెం: ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల ప్రాతినిధ్యం లేకుండా ఎటువంటి అర్హతలేని వారితో ఆ కార్యక్రమాలు నిర్వహింపచేస్తున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఆర్సీ మీటింగ్లలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్లను కూర్చోపెట్టుకొని నిర్వహించడం సరైన పద్ధతి కాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటి చర్య అని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిబంధనలు తుంగలో తొక్కి స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యం లేకుండా, ఎటువంటి అర్హతలేని వ్యక్తిని వెంటేసుకొని కలెక్టర్ పర్యటన సాగడం అత్యంత దుర్మార్గపు చర్య అని, ఇటువంటి పరిస్థితి కలెక్టర్కు తెలిసే జరుగుతోందని, ఆయన ప్రోత్సాహంతోనే అధికారులు టీడీపీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ఆయన విమర్శించారు. తాజాగా దోర్నాల మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే, ఎంపీటీసీలు, సర్పంచ్లకు సరైన సమాచారం అందివ్వకుండా ఆ సమావేశాన్ని మమ అనిపించి వాయిదా వేసిన తీరు అత్యంత దారుణమని, ఇదే పరిస్థితి కొనసాగితే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నియోజకవర్గంలోని అధికారులు టీడీపీ ఇన్చార్జికి అన్ని శాఖలకు చెందిన అధికారులు పూజ చేస్తూ వాళ్ల విధులను విస్మరిస్తున్నారని, వారి తీరు చూస్తుంటే బానిసత్వాన్ని తలపిస్తోందని అన్నారు. అధికారాన్ని చూపించి ఎటువంటి హోదాలేని వారి ఆధ్వర్యంలో సభలు నిర్వహించడం అధికారుల అవినీతి బాగోతం కప్పిపుచ్చుకోవటానికేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భూమిలో ఉన్న నీటిపైపులు తొలగించి ఎత్తుకొని వెళ్లినా, ప్రభుత్వ ఉద్యోగి అక్రమంగా ఇసుక రవాణా వ్యాపారం చేస్తున్నా, గ్రామాల్లో తమ ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీకి చెందిన వారి పింఛన్లు ఎటువంటి కారణాలు లేకుండా తొలగిస్తున్నారని, రెండేళ్లుగా తాగునీటి తోలకం జరిపిన ట్యాంకర్ల యజమానుల బిల్లులను నిలిపేశారన్నారు. ఎన్ఆర్ఈజీఎస్లో ఉపాధి కూలీలను నిలువు దోపిడీ చేస్తున్నారని, మొక్కల బిల్లుల కోసం రైతులు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేడని, ఎస్సీ హాస్టళ్లలో తాగు నీరు, సరైన భోజన సదుపాయం లేదన్నారు. ఒక వర్గానికి చెందిన వారి హౌసింగ్ అర్జీలు నమోదు చేయనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, యేర్వ చలమారెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి సుబ్బారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల అరుణ, ఆయా మండలాల పార్టీ కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంట వెంకట రమణారెడ్డి, దోమకాలు వెంకటేశ్వర్లు, ఎస్.పోలిరెడ్డి, వివిధ విభాగాల నాయకులు ఆళ్ల ఆంజనేయరెడ్డి, కె.ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, జానకిరఘు, వి.వెంకటేశ్వర్లు, గడ్డం సుబ్బయ్య, వై.శ్రీనివాసరెడ్డి, ఎస్.సుబ్బారావు, ఎస్.రంగబాబు, మోహన్దాస్, సరళ, శార, పెద్దకాపు వెంకటరెడ్డి, షేక్.మహమ్మద్ కాశిం పాల్గొన్నారు. -
సంక్రాంతికి జాతీయ స్థాయి ఎడ్ల పందేలు
యర్రగొండపాలెం: సంక్రాంతి పండుగ సందర్భంగా జాతీయ స్థాయిలో ఎడ్ల పందేలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. 2026 జనవరి 12, 13, 14 తేదీల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని, ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు కమిటీగా ఏర్పడి ఆయా కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని, ఎడ్లతోపాటు వాటితో వచ్చిన వారికి మంచి వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండేళ్లుగా అన్ని విధాలుగా కుదేలైన రైతులకు ఉపశమనం కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక పుల్లలచెరువు రోడ్డులోని పార్కుకు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎద్దులు లాగే బండలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర మాజీ కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి, రైతు విభాగం జిల్లా కార్యదర్శి వై.వెంకటేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి, సుబ్బారెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంట వెంకటరమణారెడ్డి, ఎస్.పోలిరెడ్డి, దోమకాలు వెంకటేశ్వర్లు, ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, యేర్వ చలమారెడ్డి, నాయకులు ఆళ్ల ఆంజనేయరెడ్డి, కె.ఓబులరెడ్డి, జానకి రఘు, ఎస్.రంగబాబు, సయ్యద్ జబీవుల్లా, కందూరి కాశీవిశ్వనాథ్, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సూరె శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్ కుమార్, సరళ, శార, జి.సుబ్బయ్య, ఎల్.రాములు, శంబిరెడ్డి పాల్గొన్నారు. -
బసాపురంలో వైద్య శిబిరం
కొనకనమిట్ల: మండలంలోని మునగపాడు పంచాయతీ బసాపురం గ్రామంలో బుధవారం పారిశుధ్య పనులు చేపట్టారు. ఇటీవల కొన్ని రోజులుగా ప్రజలు మలేరియా జ్వరాలతో బాధపడుతుండగా ఇద్దరు చిన్నారులకు డెంగీ జ్వరం అని నిర్థారణ కావడంతో బసాపురంలో జ్వరాలు శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన మండల అధికారులు, వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎంపీడీఓ ఈశ్వరమ్మ, ఈఓపీఆర్డీ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టి అన్నీ వీధుల్లో బ్లీచింగ్ చల్లించారు. మురికి నీరు నిల్వ ఉన్న చోట ఎబేట్ ద్రావణం పిచికారి చేయించారు. కొనకనమిట్ల ప్రభుత్వ వైద్యులు సురేఖ పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరపీడితులను పరీక్షించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. జ్వరాలు తగ్గుముఖం పట్టే వరకు గ్రామంలో వైద్యసేవలు అందిస్తామని డాక్టర్ సురేఖ అన్నారు. డెంగీ జ్వరాలతో ఒంగోలులో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. -
విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పీ.రాజబాబు అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని కలెక్టరేట్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు కల్పిస్తామన్నారు. వారి కోసం సమగ్ర సంక్షేమ హాస్టల్ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. విభిన్న ప్రతిభావంతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కలెక్టరేట్లో ఒక లిఫ్టు సౌకర్యం, ప్రత్యేకమైన మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల స్వయం సహాయక సంఘాల బలోపేతం చేయడానికి వారి ఆర్థిక అభివృద్ధి కోసం కృప స్వచ్ఛంద సంస్థతో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ డైరెక్టర్ ఎంఓయూ కుదుర్చుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ సుజాత, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, లోక్అదాలత్ జడ్జి ఎస్.కె ఇబ్రహీం షరీఫ్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ అధికారి సువార్త, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పోటీలు
పెద్దారవీడు: మండలంలోని దేవరాజుగట్టు గ్రామం సమీపంలో వెలసిన కాశినాయన ఆశ్రమంలో త్రింశత్ (30వ) ఆరాధన మహోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాష్ట్ర స్థాయి పెద్దసైజు బండలాగుడు ఎడ్ల పందేలు గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు కమిటీ సభ్యులు బుధవారం సాయంత్రం తెలిపారు. 1 నుంచి 5వ బహుమతులు వరుసగా రూ.60,116, రూ.40,116, రూ.30,116, రూ 20,116, రూ.10,116 దాతలు ప్రకటించారు. ఒంగోలు సిటీ: జిల్లాలోని ప్రైమరీ, ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కిరణ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 5వ తేదీ లోపల ఆయా మండల విద్యాశాఖాధికారులను అందజేయాలని కోరారు. పోస్టుల వివరాలకు సంబంధిత మండల విద్యాశాఖాధికారులను సంప్రదించాలన్నారు. ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయటానికి 43 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా సహకార అధికారి దేవిరెడ్డి శ్రీలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లాలో సహకార శాఖ ద్వారా మొత్తం 43 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో 31 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా, 9 పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ద్వారా, 3 జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ద్వారా కేంద్రాలు నిర్వహిస్తారన్నారు. రైతులందరూ తామ పండించిన ధాన్యాన్ని సమీపంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించుకుని ప్రభుత్వ మద్దతు ధర (ఎంఎస్పీ) పొందాలని విజ్ఞప్తి చేశారు. మద్దిపాడు: సంక్షేమ వసతి గృహాలను, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులను పట్టించుకోకుంటే సిబ్బందికి సస్పెన్షనే శిక్ష అని కలెక్టర్ రాజాబాబు హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఆయన మండల కేంద్రం మద్దిపాడులోని బీసీ, ఎస్సీ హాస్టల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బీసీ హాస్టల్ లో విద్యార్థుల రోల్ గురించి వార్డెన్ ను ప్రశ్నించగా ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. హాస్టల్లో అణువణువు పరిశీలించిన ఆయన బాత్రూముల డోర్లు చిరుకుపోయి ఉండడం గమనించారు. విద్యార్థుల మెనూ గురించి వార్డెన్ ను ప్రశ్నించారు. ప్రతి విషయం లోను వార్డెన్ పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో ఈ విధంగా పని చేస్తే సస్పెండ్ చేసేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువు కోసం తల్లిదండ్రుల నుంచి దూరంగా వసతి గృహాల్లో ఉంటుంటారని, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత లేదా అంటూ గట్టిగా ప్రశ్నించారు. వారం రోజుల వ్యవధి ఇస్తూ పని తీరు మార్చుకోవాలని, లేదా ఇంటికి వెళ్లి పోవాల్సి వస్తుందని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం ఆయన ఎస్సీ హాస్టల్ ను పరిశీలించారు. రెండు బాలుర వసతి గృహాలు పరిశీలించిన అనంతరం వసతి గృహాల్లో చేయాల్సిన మార్పుల గురించి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ నాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి నిర్మల జ్యోతి తో మాట్లాడారు. ఈ క్రమంలో ట్యూటర్ లను నియమిస్తే వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని విలేకరులు ప్రస్తావించగా, పీపీపీ విధానంలో ఎవరైనా స్పాన్సర్ని చూడాల్సి ఉందని అన్నారు. రెండు వసతి గృహాల్లో తీసుకోవాల్సిన చర్యలు గురించి ఆయన సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడారు. అదే క్రమంలో విద్యార్థులు చదవడానికి కూర్చునే ప్రాంతాన్ని పరిశీలించి ఇంజనీర్ తో మాట్లాడి అక్కడ ఎటువంటి నిర్మాణం చేపట్టాలన్న విషయంపై సమగ్రంగా ఫైల్ తయారు చేయాలని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ ఆదిలక్ష్మి, ఇన్చార్జి ఎంపీడీవో వరప్రసాద్, పలువురు జిల్లాస్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం విధ్వంసం
● మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: చంద్రబాబు రెండేళ్ల పాలనలోనే వ్యవసాయాన్ని విధ్వంసం చేశారని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కానీ, చంద్రబాబు మాత్రం తన అనుకూల పచ్చపత్రికలలో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి మరీ రైతులకు అండగా ఉన్న ప్రభుత్వమంటూ ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉన్న శనగలను క్వింటా రూ.1,500 చొప్పున కొనుగోలు చేసి 30 క్వింటాళ్లకు రూ.45 వేలను రైతుల బ్యాంకు ఖాతాలకు జగనన్న జమచేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీలలో సుమారు 90 వేల టన్నుల శనగలు నిల్వ ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే వాటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బోనస్గా క్వింటాకు రూ.1,500 ఇవ్వాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉత్తుత్తి ప్రకటనలు ఇవ్వకుండా రైతు సంక్షేమం కోసం కృషి చేయాలని ఆదిమూలపు సురేష్ హితవు పలికారు. -
మద్యాన్ని నిషేధించాలి
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై హింస పెరిగిపోతోందని, మహిళలపై హింసకు కారణమైన మద్యాన్ని నిషేధించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్ చేశారు. హింసా వ్యతిరేక ప్రచారోద్యమంలో భాగంగా బుధవారం స్థానిక గాంధీనగర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ నవంబర్ 25వ తేదీ అంతర్జాతీయ హింసా వ్యతిరేక దినోత్సవం నుంచి ఈ నెల 10వ తేదీ మానవ హక్కుల దినోత్సవం వరకు మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఐద్వా ఆధ్యర్యంలో ప్రచారోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక సమాజంలో కూడా ప్రతిరోజూ ఏదోక చోట ఏదోక రకమైన హింస జరగడం విచారకరమన్నారు. లైంగికత ఆధారంగా జరుగుతున్న హింసను అరికట్టేందుకు సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐద్వా నాయకురాలు బి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు బి.గోవిందమ్మ, ఎస్కే నాగూర్బీ, కె.రాజేశ్వరి, ఎస్డీ అమీరున్నీసా, కె.కోమలి, లక్ష్మి, టి.బాలమ్మ, కోటేశ్వరమ్మ, రమణమ్మ పాల్గొన్నారు. -
జాతీయస్థాయి హాకీ పోటీలకు మద్దిపాడు విద్యార్థిని
మద్దిపాడు: మద్దిపాడులోని కడియాల యానాదయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని కే సిరివల్లి జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికై ంది. నవంబర్ 23, 24, 25 తేదీల్లో అన్నమయ్య జిల్లా చంద్రగిరిలో జరిగిన అండర్–14 రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో ప్రకాశం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రతిభ కనబరచడంతో ఆమెను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పాఠశాల పీడీ కే వనజ తెలిపారు. త్వరలో మధ్యప్రదేశ్లో జరగబోయే జాతీయస్థాయి హాకీ పోటీల్లో సిరివల్లి పాల్గొంటుందని పీడీ తెలిపారు. ఆమెను జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్, ఏపీసీ డి.అనిల్కుమార్ అభినందించారు. పాఠశాల హెచ్ఎం హర్షం వ్యక్తం చేసి పీడీలు వనజ, సౌజన్యను అభినందించారు. జిల్లా హాకీ అసోసియేషన్ సెక్రటరీ టి.శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా క్రాంతికుమార్
ఒంగోలు సిటీ: టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా వైఎస్సార్ సీపీ నాయకుడు దామరాజు క్రాంతికుమార్ నియమితులయ్యారు. తనకు ఈ అవకాశం కల్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డికి, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబుకు క్రాంతికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. మద్దిపాడు: మండలంలోని గుండ్లాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కందుల స్టీఫెన్ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. ఇతను జనవరి నెలలో రాజస్థాన్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాడు. అదేవిధంగా అండర్ 14 బాలికల విభాగంలో కుంచాల దీపిక, తలకాయల హర్ష రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టును ద్వితీయ స్థానంలో నిలబెట్టడానికి కృషి చేశారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మండవ ప్రభాకర్, పీడీలు మాధవి లత విజయ్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అభినందించారు. ● వచ్చే ఏడాది వెలుగొండ పూర్తి చేయాలి ● పదేళ్లపాటు ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించాలి ● పశ్చిమ ప్రకాశం విద్యావంతుల, మేధావుల వేదిక డిమాండ్ మార్కాపురం టౌన్: నూతనంగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గంలోని దొనకొండ మండలాన్ని కలిపి పదేళ్లపాటు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో పాటు వచ్చే ఏడాదిలోపు వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసి నీటిని అందించాలని పశ్చిమ ప్రకాశం విద్యావంతుల మేధావుల వేదిక ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నూతన మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గం లేకపోవడంతో అందరూ నిరాశ చెందుతున్నారని అన్నారు. రాజధాని స్థాయి కలిగిన దొనకొండను మార్కాపురంలో కలపాలని డిమాండ్ చేశారు. తమ అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. 1973లో నాగార్జునసాగర్ కుడికాలువను మార్కాపురం ప్రాంతానికి తీసుకునిరావాలని ఉద్యమాలు చేసినప్పటికీ ఈ ప్రాంతానికి నీరివ్వకుండా దర్శి, కురిచేడు ప్రాంతాలకు తీసుకెళ్లి అన్యాయం చేశారన్నారు. 1971లో కర్నూలు జిల్లాలో భాగమైన మార్కాపురం డివిజన్ను కలుపుతూ ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేసినప్పుడు బడ్జెట్లో 19 శాతం నిధులు కేటాయిస్తామని ఆనాడు చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారని నేటికీ నెరవేరలేదన్నారు. 2014 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాజధాని ఎంపికలో శివరామకృష్ణ కమిటీ దొనకొండ రాజధానికి అనుకూలంగా ఉంటుందని నివేదిక ఇచ్చినప్పటికీ చేయకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను ప్రభుత్వం గుర్తించాలని ప్రతినిధులు ఓఏ మల్లిక్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి, అందె నాసరయ్య, దేవిరెడ్డి నాగేంద్రుడు, ఎం ప్రసాద్, జె మధుసూధనరావు డిమాండ్ చేశారు. -
లాభాలు తెచ్చే పంటలేవో చంద్రబాబు చెప్పాలి
ఒంగోలు టౌన్: రైతాంగానికి లాభాలు తెచ్చి పెట్టే పంటలేవో, మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న పంటలేవో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సమాధానం చెప్పాలని కోరారు. మంగళవారం మల్లయ్యలింగం భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలేవో, వాటికి ప్రభుత్వం ఏ విధంగా గిట్టుబాటు ధరలు ఇస్తుందో, రైతాంగం నుంచి ఎలా సేకరిస్తున్నారో, వారికి నగదు ఎంత చెల్లిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ఎన్డీఏ పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేక, ఏ పంటలు వేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల గిట్టుబాటు ధరల గురించి, రైతుల సంక్షేమం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కనీసం ఒక్కసారైనా సమీక్ష నిర్వహించకపోవడం దారుణమన్నారు. జిల్లాలో మిర్చి సాగు చేయడానికి ఎకరాకు రూ.2 లక్షలు ఖర్చు చేశారని, ఇటీవల వచ్చిన వరుస తుపాన్లతో పంట దెబ్బతిందని, నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.10 వేలు ప్రకటించడం దుర్మార్గమన్నారు. రూ.లక్షల్లో నష్టపోయిన రైతులకు వేలల్లో పరిహారం ప్రకటించడమేనా రైతుల పట్ల మీ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి మాట్లాడుతూ ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లో కొనేవారు లేక 3 క్వింటాళ్ల శనగ కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్నాయని, రెండేళ్లవుతున్నా కూటమి పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రెండేళ్ల పంటను కాదని రబీ సీజన్లో పంటను మాత్రమే కొనుగోలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం శనగపై 30 శాతం సుంకం తగ్గించడంతో క్వింటా కాక్ 2 రకం శనగ రూ.10,500 నుంచి రూ.8500 కు తగ్గిపోయిందని తెలిపారు. రైతులకు రూ.40 వేల వరకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. గత ఏడాది పొగాకు కిలో రూ.276 పలికితే ఈ ఏడాది రూ.220 దక్కిందన్నారు. కిలో పొగాకుకు రూ.55 నష్టం జరుగుతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు సర్కార్ మాయమాటలతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. సమావేశంలో రైతు నాయకులు బీమవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాలో ఉచిత వైద్యం కరువు
కంభం: కొత్తగా ఏర్పడనున్న మార్కాపురం జిల్లాలో పేద ప్రజలకు ఉచిత వైద్యం కరువుకానుందని వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలోని చిన్నకంభం గ్రామంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో మార్కాపురంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం కోసం 14 నెలలు కష్టపడి 50 ఎకరాలు సేకరించి సుమారు రూ.350 కోట్లు వెచ్చించి వైద్యశాల భవన నిర్మాణాలను ప్రారంభించారన్నారు. ఈ కళాశాల పూర్తయితే సుమారు వెయ్యికి పైగా బెడ్లు, వందమంది వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని, అప్పుడు పేద ప్రజలు ధైర్యంగా ఉచిత వైద్యం చేయించుకోవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేస్తుండటంతో అట్టడుగు వర్గాలకు, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం పూర్తిగా దూరమవుతుందన్నారు. డబ్బు ఖర్చు పెడితే గానీ అక్కడ చూసే పరిస్థితి ఉండదన్నారు. చిన్నపాటి సమస్యలకు, సర్జరీలకు పేద ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. కోటి సంతకాల కార్యక్రమం ద్వారా సంతకాలు సేకరించి రాష్ట్రంలో కోటి కుటుంబాలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలు సంతకాలు చేసే కార్యక్రమం చేపట్టారు. సమావేశంలో స్టేట్ యూత్వింగ్ సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి, మండల కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి, గ్రామ సర్పంచ్ రసూల్, అడ్డా నాగయ్య, గంటా రాజశేఖర్, ప్రకాశ్ రావు, ఖాసింబాష, జంగం వెంకటేశ్వర్లు, కాకర్ల సుబ్బారావు, పాపారావు, పట్టా రామయ్య, సాల్మన్, పొదిలి ప్రభాకర్, సయ్యద్ ఖాసిం, డిష్ మున్నా, సలీం, పెద్దకోటేశ్వరరావు, మహబూబ్ పీరా, సబ్బసాని సాంబశివారెడ్డి, ఆనంద్, నాగబూషణం, ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు. -
అయ్యవార్లొచ్చేది రెండ్రోజులే!
యర్రగొండపాలెం: డీటీడబ్ల్యూ ఆధ్వర్యంలో నడిచే పాలుట్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు స్థానికంగా ఉండే ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యా వలంటీర్లే చదువులు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజన విద్యార్థులు విద్యకు దూరంగా ఉండటంతోపాటు ప్రభుత్వ మెనూ ప్రకారం భోజన సదుపాయం కూడా లేకపోవడంతో వారు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో ఇలా... గత ప్రభుత్వ కాలంలో ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన క్వార్టర్స్లో ఉపాధ్యాయులు ఉండి సక్రమంగా ఆశ్రమ పాఠశాలను నడిపించేవారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యావ్యవస్థపై ముఖ్యంగా గిరిజన పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించేవారు. ఎప్పుడు తమ పాఠశాలలను విజిట్ చేస్తారన్న భయంతో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వర్తించేవారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజన వసతి కల్పించేవారు. గిరిజన విద్యార్థులు కూడా బడికి క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. నాడు–నేడు పథకం కింద పాలుట్ల గిరిజన ఆశ్రమ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. చంద్రబాబు ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా ఆశ్రమ పాఠశాలల నిర్వహణ: చంద్రబాబు ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేకుండా పోవడంతో హెచ్ఎంలతోపాటు ఉపాధ్యాయులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. యర్రగొండపాలెం మండలంలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలుట్ల గిరిజనగూడెంలో ఉన్న ఆ పాఠశాలలో డీటీడబ్ల్యూ పర్యవేక్షణలో 7వ తరగతి వరకు గిరిజన విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంది. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించేందుకు హెచ్ఎంతోపాటు ఏడుగురు ఉపాధ్యాయులను నియమించింది. వారిలో ఇటీవల నియమితులైన ముగ్గురు డీఎస్సీ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వీరితోపాటు ఒకరు విద్యావలంటీర్ గిరిజన పిల్లలకు విద్యాబోధన చేయాలి. ఆ పాఠశాల హెచ్ఎం బైస్వామి టీడీపీ నాయకుడి అడుగులకు మడుగులు వత్తుతుండటంతో ఆయన చెప్పిందే ఆ పాఠశాలలో వేదంగా మారింది. ఉపాధ్యాయులు వారానికి రెండు రోజులు (సోమ, మంగళవారాలు) విజిట్ చేసే ఆఫీసర్లుగా వచ్చి, రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లిపోతారని ఆ గూడెంవాసులు కె.సురేష్ నాయక్, సురేంద్ర నాయక్ తెలిపారు. మిగిలిన రోజుల్లో స్థానికంగా ఉండే ఉపాధ్యాయుడు కుడుముల పోతురాజు, మరో విద్యా వలంటీర్ వెంకటేశ్ 7 తరగతులు తిరిగి చదువులు చెప్తుంటారని వారు తెలిపారు. దీనివలన గిరిజన విద్యార్థులు చదువులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆశ్రమ పాఠశాలకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులు ప్రతి నెలా హెచ్ఎంకు ఎంతోకొంత ముట్టచెప్తుంటారని వారు ఆరోపించారు. భోజనంలో పప్పులపొడి చల్లి సర్దేస్తుంటారు పాలుట్ల ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పిల్లలకు భోజన సదుపాయాలు కల్పించడంలేదు. వారు ఇంటి నుంచి కూరలు తెచ్చుకొని భోజనాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ రోజులు టిఫన్లో పొంగల్, భోజనంలో పప్పుల పొడి చల్లి సర్దేసుకొని పోతుంటారు. నిత్యం స్నాక్స్ కింద ఇచ్చే చిక్కీలు, గుగ్గుళ్లు, అరటిపండ్లు ఆ పాఠశాలలో ఏ మాత్రం కనిపించవని ఆ గూడెం ప్రజలు తెలిపారు. బైస్వామి హెచ్ఎం బాధ్యతతోపాటు వార్డెన్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుండటంతో కనీసం పిల్లలు తినే తిండిలో కూడా కోత విధించడం దారుణమని పలువురు ఆరోపిస్తున్నారు. పాలుట్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న సంఘటనలపై కలెక్టర్, డీటీడబ్ల్యూ, ఎంఈవోలకు విన్నవించుకున్నా వారు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి ఆశ్రమ పాఠశాలలో చదువులు సక్రమంగా కొనసాగేలా చూడాలని, హెచ్ఎంతోపాటు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆ గూడెంవాసులు కోరుతున్నారు. -
వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా...
వరుస అల్పపీడనాలు, తుపానుల ప్రభావంతో రెండు నెలలుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మోంథా తుపాన్తో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. తాజాగా దిత్వా తుఫాన్కు రెండు రోజులుగా చిరుజల్లులు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, నదుల్లో నీటి నిల్వలతో ఇసుక తవ్వకాలకు ఆటంకం ఏర్పడిందంటూ అక్రమార్కులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచేస్తూ రెచ్చిపోతున్నారు. పెరిగిన ఇసుక ధరలు తడిసి మోపెడవుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అధికార టీడీపీ నేతల కనుసన్నల్లో ఈ దందా జరుగుతుండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తుఫాన్ బూచి..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో మొత్తం 12 ఇసుక యార్డులున్నాయి. సగటున 1000 టన్నుల వరకు వినియోగం ఉంటుంది. జిల్లాకు అవసరమైన ఇసుక ప్రధానంగా నెల్లూరు జిల్లా నుంచి వస్తోంది. పశ్చిమ ప్రకాశానికి నెల్లూరు ఇసుకతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఇసుక తీసుకొస్తుంటారు. తూర్పు ప్రకాశంలోని ఒంగోలు పరిసర ప్రాంతాలకు కొండపి నియోజకవర్గం నుంచి ఇసుక తరలిస్తున్నారు. కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి, పొన్నలూరు మండలాల పరిధిలో మన్నేరు, పాలేరు, ముసి నదలున్నాయి. వీటిలో మన్నేరు నది నుంచి సేకరించే ఇసుక నాణ్యమైనదిగా చెబుతారు. ఈ ఇసుకను ఒంగోలు పరిసరాలకు తరలిస్తారు. మోంథా తుఫాన్కు ముందు మన్నేరు ఇసుక టన్ను 250 రూపాయలకు విక్రయించేవాళ్లు. తుఫాన్ ప్రభావంతో రోజుల తరబడి వర్షాలు కురవడంతో నదులు, వాగులు, వంకల్లో నీరు నిలిచిపోయింది. దాంతో ఇసుక తవ్వకాలకు అవకాశం లేకుండా పోయింది. దీన్ని సాకుగా చెబుతూ ఇసుక ధరలు రెట్టింపు చేశారు. తుపాను తర్వాత టన్ను ఇసుక రూ.500కు పెంచారు. ట్రాక్టర్ లోడింగ్ రీచ్లో రూ.500 ఉంటే ఇప్పుడు 1000 రూపాయలకు పెంచారు. టిప్పర్ ఇసుక తుఫాన్కు ముందు 15 నుంచి 20 వేల రూపాయల వరకు ఉంటే.. ఇప్పుడు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నిలబెట్టి విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి... జిల్లాలోని కంభం, గిద్దలూరు మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన ఇసుక డంపింగ్ యార్డులలో ఇసుక ధరలు టన్ను రూ.1350 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. టిప్పర్ ఇసుక తీసుకుంటే 1350 రూపాయలు, అదే ఇసుకను లూజుగా ట్రాక్టర్లో తీసుకుంటే 1500 రూపాయలకు విక్రయిస్తున్నారు. కంభం లోయ ప్రాంతంలో మొదటి నుంచి టన్నుకు 1500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని పామూరు డంపింగ్ యార్డులో 1000 రూపాయలకు విక్రయిస్తున్నారు. పొదిలిలో ట్రాక్టరు ఇసుక 1400 నుంచి 1500 రూపాయలకు విక్రయిస్తున్నారు. మార్కాపురంలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ తుఫాన్కు ముందు 1350 రూపాయలకు విక్రయిస్తుండగా, ఇప్పుడు 1550 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక్కడ డంపింగ్ యార్డు లేకపోతే 800 నుంచి 900 రూపాయలకే లభ్యమయ్యే అవకాశం ఉందని యూనియన్ నాయకులు చెబుతున్నారు. దర్శి నియోజకవర్గంలో ఇసుక దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఇక్కడ టన్నుకు 100 నుంచి 300 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో టన్ను ఇసుక 1450 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాలలో టన్ను ఇసుకకు అదనంగా 200 నుంచి 300 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు సైన్యంతో దందా... జిల్లాలో ఇసుక వ్యాపారమంతా టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో నడుస్తున్న విషయం బహిరంగ రహస్యమే. కొన్ని నియోజకవర్గాలలో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దందాను ఇష్టారాజ్యం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి మండలానికి ముగ్గురు, నలుగురు చొప్పున యువకులను నియమించుకుని వారికి నెలకు 16 వేల రూపాయల జీతంతో పాటు రోజువారీ ఖర్చులకు అదనంగా 200 రూపాయలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏ మండలానికి ఆ మండలంలో వచ్చిపోయే ఇసుక లారీలను గమనించడం, ఎవరైనా నేరుగా పొరుగు జిల్లాల నుంచి ఇసుక కొనితెచ్చుకుంటే ఆ లారీని స్వాధీనం చేసుకుని కాటా వేయించి టన్ను ఇసుకకు రూ.300 టీ–ట్యాక్స్ వేసి బలవంతంగా వసూలు చేస్తుంటారని సమాచారం. ఎవరైనా ట్యాక్స్ కట్టకపోతే భౌతిక దాడులు చేయడం, పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి అక్రమ కేసులు నమోదు చేయించడం వంటి అనధికార బెదిరింపు కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇసుక దోచి.!వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వర్షాకాలానికి ముందే ఇసుక సేకరించి నిల్వలు చేశారు. తుఫాన్ వంటి విపత్తుల సమయంలో కూడా ముందస్తుగా ఇసుక సేకరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి ముందుచూపు లోపించింది. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని స్థానిక టీడీపీ నాయకులు ఇష్టమొచ్చిన ధరలకు ఇసుక అమ్ముకుంటున్నారు. అడిగేవారు లేకపోవడంతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దిత్వా తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఇప్పట్లో ఇసుక ధరలు తగ్గే సూచనలు లేవని భవన నిర్మాణదారులు, కూలీలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఎక్కడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇసుక విక్రయాలు జరగడం లేదు. టీడీపీ కీలక నాయకులు చెప్పిన రేటుకే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. పగలూరాత్రీ తేడా లేకుండా ఇష్టారాజ్యంగా వాహనాల్లో ఇసుక తరలిస్తున్నారు. అయినప్పటికీ మైనింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలవారీ మామూళ్లకు అలవాటుపడిపోయిన అధికారులు ఇసుక అక్రమాలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. -
మార్కాపురం జిల్లాకు చంద్రబాబు వెన్నుపోటు
ఒంగోలు సిటీ: మార్కాపురాన్ని నూతన జిల్లాగా ఏర్పాటు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి ఆరోపించారు. ఒంగోలు నగరంలోని రామ్నగర్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో మార్కాపురం, దర్శి, కనిగిరి, యరగ్రొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మోసం చేశారని విమర్శించారు. దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపి నూతనంగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లాకి తీవ్ర అన్యాయం చేశారన్నారు. పశ్చిమ ప్రకాశానికి దొనకొండ చాలా అవసరమన్నారు. ఆ దొనకొండను మార్కాపురంలోకి కాకుండా ప్రకాశం జిల్లాలో కలిపితే పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుందన్నారు. ఈ విషయాన్ని నాయకులు పక్కన పెట్టి కొత్త జిల్లా పేరుతో సంబరాలు చేసుకోవడం ఆ ప్రాంత ప్రజల్ని వంచించడమేనన్నారు. ఒకపక్క దొనకొండ ప్రాంతంలో 50 వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని చెబుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామంటూనే.. మరోపక్క మార్కాపురం జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న దొనకొండను ప్రకాశం జిల్లాలో కలపడమంటే ఆ జిల్లా ప్రజలను పూర్తిగా మోసం చేయడమేనని అన్నారు. ఆదాయం వచ్చే దొనకొండను ప్రకాశం జిల్లాలో కలిపి వెనుకబడిన ప్రాంతాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తే ఆ జిల్లా ప్రజలకు వచ్చే లాభం ఏమిటని ప్రశ్నించారు. మార్కాపురం జిల్లా ప్రజల పట్ల చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైందన్నారు. ఇప్పటికే మెడికల్ కళాశాల, వెలిగొండ ప్రాజెక్టును విస్మరించి ఎంతో ద్రోహం... మార్కాపురం జిల్లాకి ఇప్పటికే చంద్రబాబు ఎంతో ద్రోహం చేశారని కేవీ రమణారెడ్డి విమర్శించారు. మార్కాపురం జిల్లాలో ఉన్న మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేయడమే కాకుండా మార్కాపురం ప్రాంతానికి సాగు, తాగునీటి సౌకర్యం కల్పించే వెలిగొండ ప్రాజెక్టును విస్మరించారని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా వరకూ పూర్తిచేయగా, చంద్రబాబు చిన్నచిన్న పనులు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. చివరికి మార్కాపురం జిల్లా పేరుతో కొత్త డ్రామా సృష్టించి పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలను మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తూ మరింత ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతో కొంత అభివృద్ధి చెందిన దర్శి ప్రాంతాన్ని కూడా ఆ జిల్లాకు చెందకుండా చేయడమంటే మరోసారి మార్కాపురం జిల్లా ప్రజల్ని మోసం చేయడమే అవుతుందన్నారు. నిజంగా చంద్రబాబుకి మార్కాపురం జిల్లా ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. పక్కనే ఉన్న శ్రీశైలం క్షేత్రాన్ని, అదేవిధంగా పారిశ్రామిక క్షేత్రంగా తయారయ్యేందుకు సిద్ధంగా ఉన్న దొనకొండ ప్రాంతాన్ని తప్పనిసరిగా మార్కాపురం జిల్లాలో చేర్చాలన్నారు. పరిపాలనా సౌలభ్యం పేరుతో రామాయపట్నం ఉండే కందుకూరు నియోజకవర్గం, బల్లికురవ గ్రానైట్ ఉండే అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలిపారని, కానీ, ఎక్కడో సుదూరంగా ఉండే దొనకొండను కూడా ప్రకాశం జిల్లాలో కలపడం అంటే మార్కాపురం జిల్లాకు తీవ్ర అన్యాయం చేయడమే అవుతుందని అన్నారు. రామాయపట్నం పోర్టు లేదని, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ లేదని, చీమకుర్తి గ్రానైట్ లేదని, బల్లికురవ గ్రానైట్ లేదని, 100 ఎకరాల మాగాణి భూమి లేదని, ఒక రూపాయి ఆదాయం వచ్చే ఆర్థిక వనరు లేదని, చివరికి దొనకొండ కూడా లేదని, ఇక మార్కాపురం జిల్లా ఎవరి కోసమని ప్రశ్నించారు. ఈ జిల్లాను కేవలం చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం, పశ్చిమ ప్రకాశం ప్రజలపై ఉన్న కోపం తీర్చుకునేందుకు ఏర్పాటు చేసి శాశ్వతంగా వెనుకబడిన పేదరికంతో కూడిన ప్రాంతంగా తయారు చేయాలనుకోవడం అత్యంత దుర్మార్గమని రమణారెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వరరావు, ఇంటలెక్చువల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రంలో వికృత రాజకీయాలు
యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి రాష్ట్రంలో వికృత రాజకీయ క్రీడ ఆడుతోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. యర్రగొండపాలెంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తీవ్ర కరువు, కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎటువంటి సహాయం చేయలేదని, తాగునీటికి అలమటిస్తున్న ఈ ప్రాంత ప్రజల మొర ఆలకించడం లేదని మండిపడ్డారు. తాగు, సాగునీటి కోసం మహానేత వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారని, ఆయన తనయుడు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కార్యాన్ని చాలావరకు పూర్తి చేశారని వివరించారు. మిగిలి ఉన్న పనులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయకుండా వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యంగా గాలికొదిలేసిందన్నారు. ప్రకాశం జిల్లాపై నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం అంతగా ఉండదని, రాష్ట్రమంతా మిగులు వర్షపాతం నమోదై ప్రధాన నదులు వరదలతో పొంగిన సమయంలో కూడా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో తాగునీటికి ట్యాంకర్లపై ఆధారపడాల్సి ఉంటుందని వివరించారు. మండు వేసవిలోనే కాకుండా ఏడాది పొడువునా తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిందేనన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంతో పాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి వెలిగొండ ప్రాజెక్ట్ ఒక్కటే శరణ్యమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగంగా అమరావతిలో 10,500 ఎకరాలకు వరద ముంపు తగ్గించడానికి రూ.3,790 కోట్లు ఖర్చు పెట్టారని, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు, దాదాపు 25 లక్షల మందికి తాగునీటి కోసం వెలిగొండ ప్రాజెక్టుకు కావాల్సింది కేవలం రూ.1400 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఆ నిధులు కూడా కేటాయించకుండా జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా 2014 నాటికి 5 ప్రధాన కాలువలు 80 శాతం పూర్తి చేశారని, 3 ఆనకట్టలు నిర్మించారని చెప్పారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పలు పర్యాయాలు జిల్లాలో పర్యటించారని, వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తిచేసి పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేస్తానని వాగ్దానాలు చేసి వెళ్లారే తప్ప ఒక్క టన్నెల్ కూడా పూర్తి చేయలేదని తాటిపర్తి చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్కు సంబంధించిన రెండు టన్నెళ్ల పొడవు సుమారు 38 కిలోమీటర్లు ఉంటే.. చంద్రబాబు తన 16 ఏళ్ల పదవీ కాలంలో తవ్వింది కేవలం 4 కిలోమీటర్లేనని గుర్తు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ మొదటి టన్నెల్లో మిగిలిన 5.22 కిలోమీటర్లు తవ్వకాలు జరిపించారని, రెండో టన్నెల్లో 10.04 కిలోమీటర్ల మేర తవ్వకాల పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు. ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న 11 గ్రామాలకు చెందిన 7,270 కుటుంబాలకు పునరావాసం పూర్తి చేస్తే పశ్చిమ ప్రకాశంకు కృష్ణ జలాలు తీసుకురావచ్చని, అందుకు కేవలం రూ.1400 కోట్లు ఖర్చుపెడితే సరిపోతుందని తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజల కష్టాలను గాలికొదిలేసిన చంద్రబాబు.. ఆర్భాటపు ప్రకటనలతో 20 నెలల నుంచి కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. వృథాగా ఖర్చు చేసే నిధుల నుంచి కేవలం పావలా వంతు వెలిగొండకు ఖర్చు చేస్తే సరిపోతుందన్న విషయం గమనించాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హితవు పలికారు. -
స్వచ్ఛంద స్పందన..!
ఒంగోలు టౌన్: భార్య అంత్యక్రియలకు డబ్బుల్లేక.. అనే శీర్షికతో సోమవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్వచ్ఛంద సంస్థలు స్పందించాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ బాధ్యతను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీసుకున్నారు. పామూరు మండలం బోడపాడు గ్రామానికి చెందిన యోహాను కందుకూరులో రిక్షా తొక్కుతూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఆయన భార్య జాను నెల రోజుల క్రితం అనారోగ్యం బారిన పడింది. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత బుధవారం మరణించింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన బోడపాడు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా యోహాను వద్ద చిల్లిగవ్వ లేకపోవడంతో నాలుగు రోజుల పాటు భార్య మృతదేహాన్ని జీజీహెచ్ మార్చూరీలో ఉంచి తన ఇద్దరు పిల్లలతో హాస్పిటల్ బయటే ఉంటూ సాయం చేసే వారి కోసం ఎదురుచూస్తున్నాడు. జీజీహెచ్లో మరణించిన నిరుపేదల మృతదేహాలను తరలించడానికి మహాప్రస్థానం అంబులెన్స్ ఉన్నప్పటికీ ఆయనకు ఉపయోగపడలేదు. జీజీహెచ్ అధికారులెవరూ ఆయనకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈ క్రమంలో యోహాను కన్నీటి వ్యథను సాక్షి దినపత్రిక ప్రచురించింది. దాంతో నగరానికి చెందిన హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బీవీ సాగర్ ముందుకొచ్చారు. జిల్లా బాలల సంరక్షణాధికారి పి.దినేష్ కుమార్తో కలిసి జీజీహెచ్ మార్చూరీ వద్ద ఉన్న యోహానుతో మాట్లాడి ఒంగోలులోనే అంత్యక్రియలు చేసేందుకు ఒప్పించారు. కొత్తపట్నం బస్టాండు సెంటర్లో ఉన్న ముస్లిం శ్మశాన వాటికలో జాను అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు యోహను రెండేళ్ల కూతురిని శిశు గృహలో, ఏడేళ్ల బాలుడిని బొమ్మరిల్లు ఆశ్రమంలో చేర్పించారు. యోహాను దయనీయ పరిస్థితిపై స్పందించిన ఒంగోలు నగరానికి చెందిన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ జాను అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించింది. దాతల సహకారంతో సేకరించిన 38 వేల రూపాయలను ట్రస్ట్ కార్యదర్శి ఎస్కే సర్దార్బాషా చేతుల మీదుగా యోహానుకు అందజేశారు. దీంతో హెల్ప్ స్వచ్ఛంద సంస్థతో పాటు సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్కు పలువురు అభినందనలు తెలిపారు. -
గేదైపె పెద్ద పులి దాడి
రాచర్ల: మేత మేసేందుకు పొలానికి వెళ్లిన గేదైపె పెద్ద పులి దాడి చేసిన సంఘటన రాచర్ల మండలంలోని అనుములపల్లె గ్రామ సమీపంలో లింగమయ్యకొండ ప్రాంతంలో సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. అనుములపల్లె గ్రామానికి కొంతమంది పశువులను తీసుకెళ్లి ఆ గ్రామ సమీపంలోని లింగమయ్యకొండలో మేత మేయిస్తున్న సమయంలో పశువులపై పెద్ద పులి దాడి చేసింది. పెద్ద పులి దాడిలో గ్రామంలోని యమా భాస్కర్కు చెందిన తొలి చూడి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ దాదాపు రూ.35 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. అనుములపల్లె గ్రామ సమీపంలోని లింగమయ్యకొండ తిప్పల్లో పెద్ద పులి సంచరిస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాలైన జేపీ చెరువు, అనుములపల్లె, పలుగుంటిపల్లె, చోళ్లవీడు, చినగానిపల్లె గ్రామాల ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. గొర్రెల కాపరులు, పశుపోషకులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. టంగుటూరు: దిత్వా తుఫాన్ కారణంగా మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని జిల్లా పంచాయతీ అధికారి, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు సూచించారు. మండలంలోని తీర ప్రాంత గ్రామాలైన ఆలకూరపాడు, అనంతవరం, తాళ్లపాలెం, పసుకుదురు తదితర గ్రామాల్లో తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో దేవసేనకుమారితో కలిసి సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడారు. సముద్రం, నదుల్లో వేటకు వెళ్లరాదని, పడవలను ఒడ్డుకు తెచ్చుకోవాలని, భద్రంగా ఇళ్లలో ఉండాలని సూచించారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమం
ఒంగోలు టౌన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ అలుపెరుగని పోరాటాలు చేస్తోందని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు తెలిపారు. ఈ నెల 31 నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభల పోస్టర్లను సోమవారం స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాలం సుబ్బారావు మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికుల హక్కులను తాకట్టుపెడుతోందని విమర్శించారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారన్నారు. వాటి ద్వారా కార్మికుల జీవితాలను దుర్భరం చేసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపేది కార్మికవర్గమేనని, కార్మికులను దెబ్బ తీస్తే దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినట్టేనని చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణతో పాటు కార్మికులకు సంబంధించిన భవిష్యత్ పోరాట కార్యక్రమాల గురించి మహాసభలలో చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీవీ కొండారెడ్డి, పి.కల్పన, సీహెచ్ చిరంజీవి, పారా శ్రీనివాసరావు, కొర్నెపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో భరోసా శూన్యం
కొనకనమిట్ల: చంద్రబాబు పాలనలో ప్రజలకు భరోసా శూన్యమని, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడానికి కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానంలో నిర్మించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా సోమవారం సాయంత్రం కొనకనమిట్ల మండలంలోని సిద్ధవరం, కాట్రగుంట గ్రామాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 5 పూర్తి చేసి వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలతో ప్రైవేట్ వ్యక్తలకు కాలేజీలను కట్టబెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలకు జరుగుతున్న అన్నాయాన్ని సంతకాల రూపంలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడానికి వైఎస్సార్ సీపీ ఆద్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని పేర్కొన్నారు. కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వం కళ్లు తెరిపించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. సిద్ధవరంలో సర్పంచ్ రావినూతల మరియమ్మ ఇమ్మానియేలు, ఎంపీటీసీ మీరావళి, మాజీ ఎంపీటీసీ బాలఅంకయ్య, సర్పంచ్ యలమందల శ్రీనివాసులు, గ్రామ పార్టీ నాయకులు టి.నాగిరెడ్డి, కె.బాలవెంకటరెడ్డి, కాట్రగుంటలో నాయకులు గంగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కందెర పెద్దన్న, కుమ్మరి రమణయ్య ఏదుబాటి వెంకటరావు, సానికొమ్ము రవీంద్ర, అలవల నాగిరెడ్డి, మోరా చెన్నారెడ్డి, మోరా వెంకటరెడ్డి, కుర్రా యోగయ్య, రాజాల వెంకటేశ్వరరెడ్డి, చల్లా వెంకటేశ్వర్లు, టి.సుబ్బారావు, పెండెం కొండయ్య, కొండలరావు తదితరుల ఆధ్వర్యంలో అన్నాతో పాటు మండల నాయకులకు ఘన స్వాగతం పలికారు. కోటి సంతకాల సేకరణలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్, జడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, వైస్ ఎంపీపీ గొంగటి జెనీఫా, మండల పార్టీ అధ్యక్షులు మోరా శంకర్రెడ్డి, విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్ ఏలూరి సంజీవరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ ఉడుముల కాశిరెడ్డి, పార్టీ అనుబంధ విభాగల సభ్యులు గాడి కోనేటిరెడ్డి, గొంగటి కరుణయ్య పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దారుణం చంద్రబాబు సర్కారు కుట్రలను ప్రజలంతా తిప్పి కొట్టాలి వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ధ్వజం -
నూతన జిల్లా ఏర్పాటులో దర్శికి అన్యాయం
దర్శి: నూతన జిల్లా ఏర్పాటులో దర్శి నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్.కరుణానిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నూతనంగా ఏర్పాటవుతున్న మార్కాపురం జిల్లాలో దొనకొండ, కురిచేడు మండలాలను కలపాలని డిమాండ్ చేశారు. దర్శిని మార్కాపురం రెవెన్యూ డివిజన్లో చేర్చితే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దొనకొండను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి మార్కాపురం జిల్లాకు ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. కురిచేడు మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని విన్నవించారు. వెలిగొండను త్వరితగతిన పూర్తి చేసి పశ్చిమ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని కోరారు. దర్శిని మార్కాపురం జిల్లాలో కలపాలని, ఇందుకోసం కలిసివచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో పోరాడతామని స్పష్టం చేశారు. ● రూ.1.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం ముండ్లమూరు(దర్శి): మండలంలోని సుంకరవారిపాలెం గ్రామంలో గునుపూడి సురేష్బాబు నివాసంలో వెండి వస్తువులు దొంగిలించిన వ్యక్తిని ముండ్లమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్సై కమలాకర్ వెల్లడించారు. చోరీ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం వేంపాడు గ్రామం మారెళ్ల రోడ్డులో అనుమానస్పదంగా తిరుగుతున్న ఆరవీటి కోటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి రూ.1.10 లక్షల విలువైన 2 వెండి కంచాలు, వెండి ప్లేటు, కలశం చెంబులు, వెండి మొలతాడు, కుంకుమ భరిణె, తాళాలగుత్తి, పొంగళిగిన్నెలు, గ్లాసులు, దీపం ప్రమిదలు, బత్తీల స్టాండ్లు, గంధం, కమలం గిన్నెలు, ఎనిమిది జతల పట్టీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు. త్రిపురాంతకం: జాతీయ రహదారిపై సంభవించిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళా ఉద్యోగిని మృతి చెందింది. మండలంలోని సోమేపల్లి రోడ్డు సమీపంలో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దూపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో మేనేజర్గా పని చేస్తున్న షేక్ హాబీబున్నీసా(30) అసిస్టెంట్ మేనేజర్ సాయికుమార్తో కలిసి త్రిపురాంతకం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్క నుంచి ఓ ముంగిస వేగంగా వచ్చి బైక్ చక్రాల మధ్య పడడంతో అదుపు తప్పింది. హబీబున్నీసా రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. ఆమెను త్రిపురాంతకం వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైపాలెం తరలించగా అక్కడ మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా జీజీహెచ్
● వైద్యశాఖ సమీక్షలో కలెక్టర్ రాజాబాబు ఒంగోలు టౌన్: నగరంలోని ప్రైవేట్, కార్పొనరేట్ ఆస్పత్రులకు దీటుగా జీజీహెచ్ను తీర్చిదిద్దాలని వైద్యశాఖ అధికారులను కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఆయన చాంబర్లో జీజీహెచ్ అభివృద్ధిపై వైద్యారోగ్య శాఖ, సర్వజన ఆసుపత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 85 శాతం నిరుపేద, సామాన్య ప్రజలు వైద్య చికిత్స కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వస్తుంటారన్నారు. వైద్యులు సానుకూలంగా స్పందిస్తే సగం రోగం నయమవుతుందని, రోగుల పట్ల ఆప్యాయతతో వ్యవహరించాలని సూచించారు. జీజీహెచ్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్కిటెక్ట్ సూచనల మేరకు అవసరమైన మేర నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. రోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమీక్షలో జిల్లా రెవెన్యూ అఽధికారి చిన ఓబులేసు, డీఎంహెచ్ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం: మార్కాపురం జీజీహెచ్లో ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్)లో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సీహెచ్ గౌతమ్రెడ్డి(28) సోమవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పట్టణ, రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, తల్లిదండ్రులు ఉన్నారు. శనివారం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ వైద్యశాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిసింది. -
ఇంటిని కూల్చి.. స్థలాన్ని ఆక్రమించి..
ఒంగోలు టౌన్: ఇరవై ఏళ్లుగా నివసిస్తున్న ఇంటిని నగర పాలక సంస్థ అధికారులు, తాలుకా పోలీసులతో కలిసి టీడీపీ నాయకుడు అక్రమంగా కూల్చివేశాడని ఆరోపిస్తూ నగరంలోని నెహ్రూ నగర్ కాలనీకి చెందిన ఈద జాస్మిన్, విజయ్ దంపతులు దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ మాట్లాడుతూ.. హోటళ్లలో పనిచేసుకుంటూ పొట్టపోసుకుంటున్న నిరుపేద దళిత కుటుంబానికి చెందిన జాస్మిన్, విజయ్ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో రేకుల షెడ్డు వేసుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. టీడీపీ నాయకుడు పసుపులేటి శ్రీనివాసులు అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటరావుతోపాటు తాలుకా పోలీసులతో కుమ్మకై ్కన పసుపులేటి శ్రీనివాసరావు నవంబర్ 28వ తేదీన కుట్ర పూరితంగా దళితుడి ఇంటిని కూలగొట్టించారని ఆరోపించారు. డాక్యుమెంట్లు చూపించాలని అడిగితే పోలీసులు కేసు పెడతామని బెదిరించడం దుర్మార్గమన్నారు. ఇంటి కూల్చివేతకు పాల్పడిన, అందుకు సహకరించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఽనిరసనలో దళిత నాయకులు ఎం.వెంకట్, గణేష్, ఓ.కృష్ణ, సీహెచ్ స్రవంతి, మల్లికార్జున, సుప్రియ, చప్పిడిరాణి, బాలమ్మ, చెన్నమ్మ, కమలమ్మ, మరియమ్మ, వెంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు, మార్కాపురంలో టీడీపీ నాయకుల బరితెగింపు ఒంగోలు నెహ్రూనగర్లో దళితుడి ఇల్లు కూల్చివేత మార్కాపురం మండలం దరిమడుగులో అంబేడ్కర్ విగ్రహ స్థలానికి కంచె -
గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద పోలీసుల తనిఖీలు
మద్దిపాడు: మండలంలోని మల్లవరం సమీపంలో ఉన్న కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్, ఆ పక్కనే ఉన్న మల్లవరం వెంకటేశ్వరస్వామి దేవాలయం, పరిసరాలను ఆదివారం పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా మద్దిపాడు ఎస్సై వెంకట సూర్య, ఆర్ఎస్ఐ తిరుపతిస్వామి, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం సభ్యులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రవేశ మార్గాలు, డ్యామ్ పైభాగం, ఉద్యానవన ప్రదేశాలను తనిఖీ చేశారు. పేలుడు పదార్థాలను గుర్తించే ప్రత్యేక జాగిలంతో సహా బాంబ్ డిస్పోజల్ టీంతో పరిశీలించారు. ప్రజలు తరచూ సందర్శించే ప్రదేశం కావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలను గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని, లేకుంటే డయల్ 112 కాల్ చేయాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు నేర నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజల భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యమని మద్దిపాడు ఎస్సై తెలిపారు. మార్కాపురం టౌన్: పట్టణంలో ఆదివారం ఎంవీఐ మాధవరావు చేపట్టిన వాహన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మూడు వాహనాలను సీజ్ చేశారు. పన్ను చెల్లించకుండా తిరుగుతున్న ఒక బస్సుకు 98,365 రూపాయల జరిమానా విధించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని రెండు వాహనాలను సీజ్ చేశారు. వాటిపై కేసులు కూడా నమోదు చేసినట్లు ఎంవీఐ తెలిపారు. -
నేటి నుంచి 30 పోలీసు యాక్ట్ అమలు
ఒంగోలు టౌన్: శాంతి భద్రతల్లో భాగంగా ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 30 పోలీసుయాక్ట్ అమలులో ఉంటుందని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సబ్ డివిజన్ పరిధిలోని ప్రజా సంఘాలు, కార్మిక యూనియన్లు, రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించకూడదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా, ఉల్లంఘించినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్నారు.మార్కాపురం రూరల్ (మార్కాపురం): మార్కాపురం నుంచి కంభం వైపునకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న హోంగార్డు చింతగుంట్ల వద్ద ఎద్దును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామానికి చెందిన పి.రాముడు జరుగుమల్లి పోలీసు స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై కంభం వెళ్తూ చింతగుంట్ల వద్ద అరకతో వెళ్తున్న ఎద్దును ఢీకొని కిందపడటంతో గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై అంకమరావు తెలిపారు. పీసీపల్లి: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గుదేవారిపాలెం సమీపంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..రామాపురం గ్రామానికి చెందిన గన్నవరపు మాలకొండయ్య(50) టీ తాగేందుకు రామాపురం నుంచి గుదేవారిపాలెం నడుచుకుంటూ వస్తున్నాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో కనిగిరి నుంచి పీసీపల్లి వెళుతున్న కారు ఢీకొట్టడంతో మాలకొండయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలుఉన్నారు. ఉలవపాడు: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉలవపాడు మండల పరిధిలోని కరేడు పంచాయతీ చిల్లకాల్వ సమీపంలోని రొయ్యల చెరువుల వద్ద ఆదివారం జరిగింది. ఆ వివరాల మేరకు.. వేటపాలెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన రావూరి సాంబశివరావు (52) ఉలవపాడు గ్రామానికి చెందిన ఓగుబోయిన ప్రసాద్కు చెందిన చెరువుల వద్ద పనిచేస్తున్నాడు. గత 17 ఏళ్ల నుంచి తన భార్య కోటేశ్వరమ్మతో విభేదించి వచ్చి రొయ్యల చెరువుల వద్ద ఉన్న రేకుల షెడ్డులోనే ఉంటున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెంది చనిపోవాలనే ఉద్దేశంతో రేకుల షెడ్డుకు ఉన్న ఇనుప కమ్మెకు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని సీఐ అన్వర్ బాషా, ఎస్సై అంకమ్మ పరిశీలించారు. భార్య కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరైనా రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇంతవరకూ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకపోవడం శోచనీయమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు విమర్శించారు. ఇప్పటికి పలు దఫాలుగా వాయిదాలు వేశారని, వచ్చే జనవరి 1వ తేదీలోపు కార్డులు ఇవ్వకుంటే సమాచార శాఖామంత్రి పార్థసారధి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం మార్కాపురం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, ప్రమాద బీమా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఇంతవరకూ పరిష్కరించలేదని అన్నారు. సమాచార శాఖాధికారులతో ఎన్నిసార్లు మాట్లాడినా స్పందించడం లేదని ఆరోపించారు. నవంబరు 30వ తేదీతో అక్రెడిటేషన్ కార్డుల గడువు ముగిసిందని, కొత్త కార్డులు ఇస్తామని చెప్పి మళ్లీ 2 నెలలు పొడిగించారని అన్నారు. జనవరి 1కి గుర్తింపు కార్డులు ఇవ్వకుంటే మంత్రి రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు ఎన్వీ రమణ, రాష్ట్ర నాయకుడు అల్లూరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మార్కాపురం జిల్లా ప్రకటనలోనే అన్యాయం
యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా మార్కాపురం జిల్లాగా ప్రకటించడంలోనే అన్యాయం జరిగిందని, ఎటువంటి ఆర్థిక వనరుల సమకూర్చకుండా పశ్చిమ ప్రాంత ప్రజల కన్నీటి తుడుపుగా జిల్లాగా ప్రకటించి చేతులు దులుపుకున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దేవేండ్ల శ్రీనివాస్ ఆరోపించారు. శ్రీశైలం మండలాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గంలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక పూలసుబ్బయ్య శాంతి భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం దేవస్థానాన్ని గతంలో కర్నూలు జిల్లాలో కలిపారని, జిల్లాల పునర్విభజన సమయంలో కూడా ఆ దేవస్థానాన్ని నంద్యాల జిల్లాకు మార్పు చేశారన్నారు. నంద్యాల జిల్లాకు దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలంను కొత్తగా ఏర్పాటు చేస్తున్న మార్కాపురం జిల్లాలో ఎందుకు కలపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు శ్రీశైలం వెళ్లాలంటే మార్కాపురం జిల్లాలో అంతర్భాగమైన పెద్దదోర్నాల నుంచి వెళ్లాల్సిందేనని, శ్రీశైలం మండలాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గంలో కలిపితే పూర్తిగా వెనకబడిన మార్కాపురం జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దర్శి నియోజకవర్గాన్ని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపురం జిల్లాలో కలపకుండా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలులో కలపడం పశ్చిమ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలం మండలం, దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలపకుంటే ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, బాణాల రామయ్య, వై.వెంకటశివయ్య పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దేవేండ్ల శ్రీనివాస్ -
ఎయిడ్స్ భూతం..!
కబళిస్తున్న.. ఎయిడ్స్ భూతం కబళిస్తోంది. అవగాహన లేమి, నిర్లక్ష్యంతో హెచ్ఐవీ బారిన బారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఓ పక్క స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా యువత పెడచెవిన పెట్టి వ్యాధి బారిన పడి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మార్కాపురం: ఎయిడ్స్..ఈ పేరు వింటేనే అందరికీ భయం. అయినా నిర్లక్ష్యంతో ఈ వ్యాధి బారిన పడి జీవితాలను, కుటుంబాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో పశ్చిమ ప్రకాశంలో ఎయిడ్స్ బారిన పడే వారిన సంఖ్య పెరుగుతోంది. పశ్చిమ ప్రకాశం నుంచి విజయవాడ, గుంటూరు, ఒంగోలుకు వెళ్లి చికిత్స చేయించుకునే వారి సంఖ్య దాదాపు 4500లకు పైగా ఉన్నారు. అనైతిక శృంగారం, ఇన్ఫెక్టెడ్ నీడిల్స్, ఇన్ఫెక్టెడ్ రక్తాన్ని మరొకరికి ఎక్కించటం ద్వారా, గర్భిణి బిడ్డకు వ్యాప్తి, హెచ్ఐవీ బారిన పడిన తల్లి పాలు ఇచ్చినప్పుడు తల్లి నుంచి బిడ్డకు వ్యాపిస్తోంది. జిల్లాలో హెచ్ఐవీ నిర్ధారణ కేంద్రాలు మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఒంగోలు, యర్రగొండపాలెం, కంభం, పొదిలి, దర్శి, సింగరాయకొండలో ఉన్నాయి. మార్కాపురం, ఒంగోలులో ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న బాధితులు జిల్లాలో మార్కాపురం, కంభం, బేస్తవారిపేట, రాచర్ల, అర్ధవీడు, త్రిపురాంతకం, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, గిద్దలూరు, కొమరోలు తదితర ప్రాంతాల్లో హెచ్ఐవీ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో శాశ్వతమైన నీటి వనరులు, ఫ్యాక్టరీలు లేవు. దీంతో ఉపాధి నిమిత్తం ఈ ప్రాంత ప్రజలు ఏడాదిలో ఆరు నెలల పాటు కుటుంబాలను వదిలి దేశంలోని ప్రధాన నగరాలకు వలస వెళుతుంటారు. ఇది వారికి శాపంగా మారుతోంది. మార్కాపురం జిల్లా వైద్యశాలలో ఏఆర్టీ (యాంటీ రెట్రో వైరల్ ట్రిట్మెంట్) సెంటర్లో నమోదైన వివరాలను పరిశీలిస్తే హెచ్ఐవీ శరవేగంగా చాప కింద నీరులా పలువురి ప్రాణాలను బలి కోరుతుంది. ఎక్కువగా ఆటో, లారీ డ్రైవర్లు, వలస కూలీలు, పలకల కార్మికులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. హెచ్ఐవీతో జన్మించిన చిన్నారులకు 15 ఏళ్ల వారికి ప్రభుత్వం వాత్సల్య పథకం అమలు చేస్తోంది. ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స.. ఈ వ్యాధి బారిన పడిన వారు పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలలతో పాటు హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, గుంటూరులలో చికిత్స పొందుతున్నారు. ఇలా ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారు సుమారు 4500 మందికి పైగా ఉండొచ్చని అంచనా. మార్కాపురం డివిజన్లో మార్కాపురం, గిద్దలూరు, కంభం, యర్రగొండపాలెం, బేస్తవారిపేట, కొమరోలు, పుల్లలచెరువు, బేస్తవారపేట, పెద్దారవీడు, పెద్దదోర్నాల ప్రాంతాల్లో ఎయిడ్స్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. డివిజన్లో అత్యధికంగా దొనకొండ, త్రిపురాంతకం, పుల్లలచెరువు, కొమరోలు మండలాల్లో హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ ప్రాంతం నుంచి వందలాది మంది కూలీలు కుటుంబాలకు దూరంగా వలసలు పోవటం కారణమవుతోంది. వీరిలో ఎక్కువ మంది 20 నుంచి 40 ఏళ్ల లోపు వారే. గిద్దలూరు, కొమరోలు, కంభం ప్రాంతాల్లో పలువురు సైనికోద్యోగులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఎయిడ్స్ వ్యాదిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులను అందిస్తోంది. ఈ మందులు వారి జీవితకాలాన్ని పొడిగిస్తాయి. కాగా ఇటీవల కాలంలో చికిత్స తీసుకోకుండా పలువురు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. మండలం పేరు మందులు వాడుతున్న వారు మార్కాపురం 1350 అర్ధవీడు 155 కంభం 260 బేస్తవారపేట 290 దోర్నాల 301 గిద్దలూరు 570 దొనకొండ 325 కొమరోలు 260 కొనకనమిట్ల 150 కురిచేడు 247 పెద్దారవీడు 242 పుల్లలచెరువు 345 త్రిపురాంతకం 478 యర్రగొండపాలెం 62 తర్లుపాడు 295 రాచర్ల 223 -
ప్రైవేటీకరణతో ఉచిత వైద్య సేవలు ఎలా..?
మార్కాపురం: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను, వాటి అనుబంధ వైద్యశాలలను ప్రైవేట్పరం చేస్తే పేదలకు ఉచిత వైద్యసేవలు ఎలా అందుతాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు ప్రశ్నించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్కాపురం పట్టణంలోని , 12, 15వ బ్లాకుల్లో ఆదివారం నిర్వహించిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణలో ఆయన మాట్లాడారు. దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ 7 మెడికల్ కళాశాలలు ఉన్నాయని, వైఎస్సార్ హయాంలో 5 మంజూరు చేశారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 17 మెడికల్ కళాశాలలు మంజూరుచేసి చరిత్ర సృష్టించారని అన్నారు. ఇప్పుడున్న మెడికల్ కళాశాలల్లో ఏ ఒక్కటైనా చంద్రబాబు తెచ్చాడా అని ప్రశ్నించారు. 14 ఏళ్లలో మూడుసార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు మెడికల్ కళాశాలలను తేలేకపోయాడని ప్రశ్నించారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందించడం, మెడికల్ విద్యను అందరికీ అందుబాటులోనికి తేవడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి బృహత్తర ఆశయంతో మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీపీపీ విధానానికి వెళ్లడం దుర్మార్గమన్నారు. ఈ ఉద్యమం పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమం కోసం చేపట్టిందని, అందరూ ముందుకు వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సంతకాల సేకరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజల అభిప్రాయాన్ని మన్నించి ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2024లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే మిగిలిన కాలేజీలు కూడా పూర్తయితే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య సీట్లు దక్కేవన్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ పీపీపీ విధానంలో తన బినామీలకు దోచిపెట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎవ్వరూ చేయని అభివృద్ధిని వైవెస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపారన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ ఆలీబేగ్, పీఎల్పీ యాదవ్, డాక్టర్ మగ్బుల్ బాషా, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు సలీమ్, చెంచిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వమే రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను నిర్మించాలని, ప్రైవేట్పరం చేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నారు బాపన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాసులు, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులతో కలిసి పాల్గొని మాట్లాడారు. కౌన్సిలర్లు డాక్టర్ కనకదుర్గ, సిరాజ్, కొత్త కృష్ణ, చాటకొండ చంద్ర, ఉత్తమ్కుమార్, రోజ్లిడియా, గుంటక వనజాక్షి చెన్నారెడ్డి, ముత్తారెడ్డి వెంకటరెడ్డి, పత్తి రవిచంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి గొలమారి సత్యనారాయణరెడ్డి, రైతు విభాగం పట్టణ అద్యక్షులు నూనె శివారెడ్డి, మాజీ ఎంపీపీ గాయం శ్రీనివాసరెడ్డి, గౌస్ మొహిద్దీన్, పత్తి కృష్ణ, పంబి వెంకటరెడ్డి, వార్డుల ఇన్ఛార్జిలు ఉస్మాన్, కోటిరెడ్డి, తనుబుద్ధి నాగార్జునరెడ్డి, బిలాల్, రాచకొండ శ్రీను, సాయి, దస్తగిరి, సర్పంచ్ గురునాధం, చిప్స్ శ్రీనివాస్, గుంటక అంజిరెడ్డి, ఏడుకొండలు, రఫీ, మందటి శివారెడ్డి, చాటకొండ నాగరాజు, పోరుమామిళ్ల విజయలక్ష్మి, రామిరెడ్డి, మహమ్మద్, జాఫర్, ఉస్మాన్, షేక్ కరీముల్లా, మల్లిక, చదలవాడ రమణారెడ్డి, ఖాశీం, సయ్యద్ గఫూర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్డుల్లో అన్నా రాంబాబు, జంకె వెంకటరెడ్డిలను క్రేన్ సహయంతో గజమాలతో సత్కరించారు. పేదలకు మెరుగైన వైద్యం చంద్రబాబుకు ఇష్టం లేదు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్నా రాంబాబు -
పెంచలయ్య హంతకులను కఠినంగా శిక్షించాలి
ఒంగోలు టౌన్: నెల్లూరుకు చెందిన సీపీఎం నాయకుడు, ప్రజా కళాకారుడు పెంచలయ్యను దారుణంగా హత్య చేసిన గంజాయి ముఠాను కఠినంగా శిక్షించాలని డైఫీ ఎస్ఎఫ్ఐ, ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. హంతకులను శిక్షించాలని కోరుతూ ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెంచలయ్య హత్య రాష్ట్రంలో గంజాయి ముఠా ఎంతగా చెలరేగిపోతుందో తెలియజేస్తుందని చెప్పారు. ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పోలీసు అధికారులతో కలిసి గంజాయి వ్యతిరేక సదస్సులను నిర్వహించిన పెంచలయ్యకు రక్షణ కల్పించడంలో పోలీసులు వైఫల్యం చెందారన్నారు. ప్రజా నాట్యమండలి నాయకుడు పేతూరు మాట్లాడుతూ గంజాయి , మత్తు మందులకు బానిసలైన విద్యార్థులు అనేక మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెడు మార్గం పట్టిన యువకులు ఎంతటి దారుణాలకై నా ఒడిగడుతున్నారన్నారు. సంఘవిద్రోహ శక్తులుగా మారుతూ సమాజానికి, తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతున్నారని చెప్పారు. ప్రభుత్వం, పోలీసులు నిబద్ధతగా వ్యవహరించకపోవడం వల్లే గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నారని, పట్టపగలే హత్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైఫీ నగర కార్యదర్శి పి.కిరణ్ మాట్లాడుతూ పెంచలయ్య హత్యపై పోలీసులు కఠినంగా వ్యవహరించకపోతే గంజాయి ముఠాలు మరింతగా రెచ్చిపోవడం ఖాయమన్నారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం గంజాయి పట్ల కట్టడి చేయడానికి ప్రయత్నం చేయాలని కోరారు. కార్యక్రమంలో విజయ్, ఆనంద్, రాజేశ్వరి, ఇంద్రజ్యోతి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో డైఫీ,ఎస్ఎఫ్ఐ, ఐద్వా నేతల ర్యాలీ -
ఆర్థిక వనరులు లేకుండా జిల్లా ఏర్పాటు బాధాకరం
● మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి గిద్దలూరు (బేస్తవారిపేట): మార్కాపురం జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్నామని.. అయితే పూర్తిగా ఆర్థిక వనరులు లేకుండా చేయడం బాధాకరమైన విషయమని వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం గిద్దలూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. లక్ష ఎకరాల ప్రభుత్వ భూములున్న దర్శి నియోజకవర్గాన్ని పాత ప్రకాశం జిల్లాలో కలపడంతో మార్కాపురం జిల్లాకు అన్యాయం చేసినట్లే అన్నారు. దర్శి మార్కాపురం జిల్లాలో ఏదో ఒకనాడు ఇండస్ట్రియల్ కారిడార్ అయ్యేదన్నారు. నూతన జిల్లాలో ఉద్యోగ అవకాశాలు, జిల్లాకు ఆర్థిక వనరుగా ఉండేదని చెప్పారు. కొత్త జిల్లాలో ఉన్న ఏకై క మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తే జిల్లా ప్రజలకు ఉచిత వైద్యం దూరమవుతుందన్నారు. గిద్దలూరును నూతన రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరారు. ఇప్పటికే ఉన్న కనిగిరి, మార్కాపురం డివిజన్తోపాటు గిద్దలూరును చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం నూతన జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాలు అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, జెడ్పీటీసీ సారె వెంకటనాయుడు, మండల కన్వీనర్లు మానం బాలిరెడ్డి, ఆవుల శ్రీధర్రెడ్డి, గొంగటి చెన్నారెడ్డి, ఏరువ రంగారెడ్డి, యేలం మురళి, రవికుమార్, నాయకులు స్వామిరంగారెడ్డి, బీవీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ఎ.ఈశ్వర రెడ్డి ఆదివారం ప్రకటించారు. అధ్యక్షునిగా సంతనూతలపాడు డీఈఈ ఓ.కృష్ణ మోహన్, జనరల్ సెక్రటరీగా మార్కాపురం ఏఈఈ విజయ మోహన్ రాజా, వైస్ ప్రెసిడెంట్గా కందుకూరు డీఈఈ మాలకొండయ్య, ట్రెజరర్గా మార్కాపురం ఏఈఈ వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కనిగిరి ఏఈఈ బి.బ్రహ్మయ్యలను ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికై న నూతన కార్యవర్గాన్ని పంచాయతీరాజ్ ఎస్ఈ అశోక్ అభినందనలు తెలిపారు. -
భార్య అంత్యక్రియలకు డబ్బుల్లేక..
ఒంగోలు టౌన్: అతడి పేరు యోహాన్. నెల్లూరు జిల్లా కందుకూరులో రిక్షా తొక్కుతూ భార్యా బిడ్డలను పోషిస్తుంటాడు. పామూరు మండలంలోని బోడవాడ స్వగ్రామం. భార్య జాను, ఇద్దరు పిల్లలతో నిన్నా మొన్నటి వరకు సంతోషంగా సాగిన కాపురంలో విషాదం చోటుచేసుకుంది. భార్యా జాను కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలైంది. పగలంతా రిక్షా తొక్కితే వచ్చే డబ్బులతో పొట్ట నింపుకోవడానికే సరిపోతున్నాయి. ఇక వైద్యం చేయించే పరిస్థితి లేకపోవడంతో ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యం చేయించసాగాడు. నెల రోజులుగా జీజీహెచ్లో భార్యకు చికిత్స చేయిస్తున్నాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. బుధవారం జాను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. దాంతో యోహను గుండె పగిలిపోయింది. పాపం పుణ్యం తెలియని ఇద్దరు చిన్నారులను గుండెలకత్తుకొని గుక్కపట్టి ఏడ్చాడు. జాను మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. నాలుగు రోజులవుతోంది. భార్య మృతదేహాన్ని సొంత ఊరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. కనిపించని దేవుడికి మొక్కుకున్నాడు. కనికరించలేదు. కళ్ల ముందు కనిపించిన ప్రతి ఒక్కరినీ ప్రాధేయపడ్డాడు. ఒక్కరూ దయతలచ లేదు. దాంతో ఇద్దరు చిన్నారులను తీసుకొని పగలు రాత్రి మార్చూరీ చుట్టే తిరుగుతున్నాడు. ఎవరైనా ఓ ముద్ద పెడితే పిల్లలకు తినిపిస్తున్నాడు. లేకపోతే పస్తులతో పడుకోబెడుతున్నాడు. అమ్మ కావాలని అడుగుతున్న చిన్నారులకు సర్ది చెప్పలేక సతమతమవుతున్నాడు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సాయం చేస్తే భార్య జాను మృతదేహాన్ని స్వగ్రామం బోడపాడుకు తరలించి అంత్యక్రియలు చేసుకుంటానని ప్రాధేయ పడుతున్నాడు. -
సాయం మరచి.. అన్నదాతను ముంచి
రైతులకు ఎంతో ఉపయోగకరమైన 616 రైతు భరోసా కేంద్రాలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులతో పాటు రైతులకు సాగులో సలహాలు సైతం అందించింది. కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఇటువంటి రైతుహిత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. బేస్తవారిపేట: అన్నదాతలను ప్రకృతి కరుణించడం లేదు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదు. మార్కెట్ మాయాజాలానికి పతనమైన ధరలతో అడుగడుగునా నష్టపోతున్నా ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ఏమీ చేయకుండానే ప్రచార డబ్బా కొట్టుకునేందుకు చంద్రబాబు సర్కారు మళ్లీ ముందుకొచ్చింది. జనాన్ని నమ్మించి మోసం చేసేందుకు రైతన్నా–మీ కోసం అంటూ కొత్త ఎత్తుగడతో ప్రచారానికి తెరలేపింది. రైతులకు ఎంతో చేశామని కలరింగ్ ఇచ్చేందుకు నాంది పలికింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది రైతుల ఇంటి వద్దకు వెళ్లి ‘రైతన్న మీ కోసం’ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. నీటిభద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతుపై అవగాహన కల్పిస్తారు. ఈనెల 3వ తేదీన రైతు సేవా కేంద్రాల్లో వర్క్షాపులు పెట్టి, రానున్న రబీ, వచ్చే ఏడాది ఖరీఫ్, రబీ పంటలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. చేసిందేమీ లేకున్నా..ఇప్పుడు మా ముందుకు ఎందుకొస్తున్నారంటూ రైతులు గుసగుసలాడుకుంటున్నారు. సుఖీభవ అంటూ దుఃఖపెట్టారు.. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తామని గత ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి కూటమి నేతలు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఈ పథకాన్ని ఎగ్గొట్టి రైతులకు పంగనామాలు పెట్టారు. రెండో ఏడాదిలోనూ జిల్లాలో 15,970 మంది రైతులకు మొండిచేయి చూపారు. వైఎస్సార్ రైతు భరోసా 2,84,113 మందికి వర్తిస్తే నేడు 2,68,163 మంది అర్హులుగా గుర్తించారు. మరోవైపు దాదాపు 45 వేల మంది కౌలు రైతులకు నయాపైసా కూడా ఇవ్వకుండా వారికి వేదననే మిగిల్చారు. ఉచిత బీమాకు మంగళం... ఉచిత బీమా పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రీమియం చెల్లింపు భారాన్ని రైతులపైనే మోపింది. బీమా ప్రీమియం భారం కావడంతో వందల మంది రైతులు బీమాకు దూరమయ్యారు. బీమా చెల్లించిన రైతులకు పంటలు నష్టపోయినా ఇన్సూరెన్స్ రాలేదు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రైతులకు గత ప్రభుత్వం అండగా నిలిచింది. నేడు చంద్రబాబు సర్కారు సున్నా వడ్డీ రాయితీని గాలిలో పెట్టింది. మోంథా సాయం లేదు.. మోంథా తుపానుతో జిల్లాలో పత్తి 35,750 ఎకరాలు, సజ్జ 7,300, వరి 9,500, మొక్కజొన్న 7,100, ఇతర పంటలు 36 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. తుపాను వచ్చి నెల రోజులవుతున్నా ప్రభుత్వం నేటికీ పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి. 2024 డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన ఫెంగల్ తుపాను ధాటికి జిల్లాలోని పది మండలాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. శనగ పంట 5,506 హెక్టార్లు, మినుము 1,902 హెక్టార్లు, పొగాకు 1,333 హెక్టార్లు, మినుములు 1902 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. అప్పట్లో 7650 మంది రైతులు 25540 ఎకరాల్లో హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2024 అక్టోబర్ కురిసిన అధిక వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. అక్టోబర్ 13 నుంచి 21వ తేదీ వరకు ముసురుపట్టి భారీ వర్షాలు పడటంతో దాదాపు 24,700 ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. నేటికీ రైతులకు ఒక్క రూపాయి ప్రభుత్వం విడుదల చేయలేదు. మోంథా తుపానుతో తీవ్రంగా నష్టపోయాను కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో అరటి, మూడు ఎకరాలు వరి, ఒక ఎకరా పసుపు పంట సాగు చేశాను. పది రోజులుగా వర్షం విడవకుండా పడింది. కతువ ఉప్పొంగి పొలాలను వరద నీరు ముంచెత్తింది. నిండు కాపుతో ఉన్న అరటి చెట్లు కిందపడిపోయాయి. పంట మొత్తం నాశనమైంది. ప్రభుత్వం నష్టపరిహారం విడుదల చేయాలి. – చిట్టె మల్లిఖార్జున, సోమవారిపేట కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ ఇవ్వాలి అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపచేయాలి. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్కు అదనంగా రూ.20 వేలు ఇస్తామన్నారు. గతంలో అకాల వర్షాలు, తుపాను రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేటికీ నష్ట పరిహారం విడుదల చేయలేదు. గత నెలలో మోంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయారు. ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి. – ఢాకాల పుల్లయ్య, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి -
రూ.కోటి స్వాహా అనడం దుర్మార్గం
సంతనూతలపాడు: భవన నిర్మాణమే రూ.98 లక్షలైతే కోటి రూపాయల అవినీతి ఎలా సాధ్యమని సంతనూతలపాడు సిండికేట్ రైతు సొసైటీ మాజీ అధ్యక్షులు దుంపా యల్లమందారెడ్డి, మాదాల వెంకట్రావు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ పాలనల్లో సొసైటీకి స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపట్టామని, టీడీపీ పాలనలో పట్టించుకున్న దాఖలు లేవని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా సొసైటీకి భారీ భవనాన్ని నిర్మిస్తే దాన్ని ఓర్చుకోలేక నేటి చైర్మన్, ఆడిటర్ ప్రోద్బలంతో పత్రికల్లో మాజీ అధ్యక్షుల వ్యక్తిత్వంపై బురద జల్లే కార్యక్రమం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి ప్రతి ఒక్క రూపాయి ఎంబుక్లో రికార్డు చేసి ఉందని స్పష్టం చేశారు. తమ హయాంలో క్రాప్ లోన్లకు వడ్డీ రేట్లు కూడా తగ్గించామని, రుణాలు, డిపాజిట్లు భారీగా పెరిగాయన్నారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలపై నేడు డిపాజిదారులు, బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు ఆరోపణతో సొసైటీ రోడ్డున పడే పరిస్థితి తీసుకొస్తున్నారన్నారు. ఇటీవల ఓ పత్రికకు పార్టీ తరఫున చైర్మన్ ఇచ్చిన ప్రైవేట్ యాడ్కు సొసైటీ నుంచి నిధులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రస్తుత సొసైటీ ఆడిటర్ పక్షపాత వైఖరితో ఇతరుల పోద్బలంతో తప్పుడు నివేదికలను తయారు చేసి ఇచ్చారని, దీనిలో ఇచ్చినవి నిరూపించకపోతే లీగల్గా పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశారు. తమ పాలనలో ఎటువంటి అవినీతి జరగలేదని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి మాట్లాడుతూ ఆడిటర్ ఆడిటింగ్ చేయకుండా రాజకీయాలు చేస్తూన్నారని, వీలైతే ఆడిట్ చేసి ఏదైనా తప్పు జరిగి ఉంటే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలిగానీ ఈ విధంగా లీకులతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశంలో సొసైటీ మాజీ డైరెక్టర్లు తన్నీరు మోహన్రావు, కొనికి కోటేశ్వరరావు, కొడవటి హరిబాబు పాల్గొన్నారు. సంతనూతలపాడు సిండికేట్ రైతు సొసైటీ మాజీ చైర్మన్, డైరెక్టర్లు -
108లో కవలలు జననం
దర్శి: స్థానిక సీహెచ్సీలో వైద్యులు ఓ గర్భిణికి కాన్పు చేయలేమని చేతులెత్తేశారు. ఒంగోలు తీసుకెళ్లాలని బంధువులకు సలహా ఇచ్చారు. చేసేది లేక 108లో ఒంగోలు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో 108 సిబ్బంది కాన్పు చేశారు. ఆమె కవలలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన శనివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన తిరుపతమ్మకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారమిచ్చారు. దర్శి 108 సిబ్బంది వెంకటరెడ్డి, గౌస్బాషాలు సంఘటన స్థలానికి చేరుకొని ఆమె దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు తిరుపతమ్మకు కడుపులో కవల పిల్లలు ఉన్నారని, కవలలు ఉండటంతో పాటు రక్తహీనత కలిగి ఉందని చెప్పి ఒంగోలు రిమ్స్కు రిఫర్ చేశారు. అక్కడి నుంచి మళ్లీ 108లో ఒంగోలు వెళ్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. వెల్లంపల్లి సమీపంలో వాహనాన్ని పక్కకు ఆపి ఎంటీ, ఫైలెట్లే కాన్పు చేశారు. 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో కవల పిల్లలు 108లోనే జన్మించారు. ఆ వెంటనే తల్లి, పిల్లలను ఒంగోలు రిమ్స్ వద్ద క్షేమంగా వదిలి పెట్టారు. అక్కడి వైద్యులు వారికి వైద్య పరీక్షలు చేశారు. తల్లి, పిల్లలకు ప్రమాదం లేకుండా కాన్పు చేసిన 108 సిబ్బంది గౌస్బాషా, వెంకటరెడ్డిలను ఓఈ మహేష్ అభినందించారు. -
పెళ్లి ఇంట్లో దొంగతనం
● 7 సవర్ల బంగారం, రూ.4.73 లక్షల నగదు చోరీ చీమకుర్తి: జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు ఇంట్లో చోరీ జరిగింది. 6 సవర్ల బంగారు పూలహారం, 7 గ్రాముల ఉంగరం, రూ.4.73 లక్షల నగదును దొంగలు అపహరించినట్లు ఆయన శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 27వ తేదీ రాత్రి వేమా శ్రీనివాసరావు తన కుమారుడి వివాహాన్ని చీమకుర్తిలోని బీవీఎస్ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించారు. అదే రాత్రి 12 గంటల వరకు కల్యాణ మండపం వద్ద ఉన్నారు. అనంతరం పెళ్లి కార్యక్రమాన్ని ముగించుకొని కూనంనేనివారిపాలెంలోని తన నివాసానికి వెళ్లారు. ఇంటి వెనుక తలుపులు తెరిచి బీరువాను ధ్వసం చేసినట్లు గుర్తించారు. బీరువాలో ఉంచిన 6 సవర్ల బంగారు పూలహారం, 7 గ్రాముల ఉంగరంతో పాటు రూ.4.73 లక్షల నగదు కనిపించటం లేదని అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత వేమా శ్రీనివాసరావు వధూవరులతో కలిసి తిరుపతి వెళ్లాల్సి ఉండటంతో వెళ్లి తిరిగి వచ్చి శనివారం పోలీసుస్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశౠరు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ దాసరి ప్రసాద్ తెలిపారు. -
లక్ష్మీచెన్నకేశవ మార్కాపురం జిల్లాగా నామకరణం చేయాలి
మార్కాపురం టౌన్: కొత్త జిల్లాకు లక్ష్మీచెన్నకేశవ మార్కాపురం జిల్లాగా నామకరణం చేయాలని, ఆర్థిక వనరులు లేకుండా మార్కాపురం జిల్లాను ప్రకటించిన ఘనత చంద్రబాబు సర్కార్కే దక్కిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూర్వం కడపలో, తర్వాత కర్నూలు, ఆ తర్వాత ప్రకాశంలో ఉండి ఇప్పుడు మార్కాపురం జిల్లాగా నాయకులు ప్రకటించారన్నారు. కేవలం మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలను కలుపుతూ ఏ ప్రాతిపదికన ప్రకటించారో అర్థం కావడం లేదన్నారు. పూర్వం మార్కాపురం పలకల పరిశ్రమతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో వ్యాపారం జరిగిందని, ఇప్పుడు కార్డు బోర్డుతో పాటు వివిధ రూపాల్లో పలకలు తయారు చేసుకోవడంతో మార్కాపురం బొడిపలకగా మారి పరిశ్రమ కుంటుపడిందన్నారు. ఇక గిద్దలూరు, యర్రగొండపాలెం అటవీ ప్రాంతాలుగా, కనిగిరి ఫ్లోరైడ్ ప్రాంతంగా ఉందని, ఈ జిల్లాకు ఆర్థిక పరిపుష్టికి ఎక్కడి నుంచి వస్తుందో టీడీపీ నాయకులు తెలపాలన్నారు. రాజకీయ ఎత్తుగడ కోసం జిల్లాగా ప్రకటించారన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారన్నారు. మార్కాపురం జిల్లాలో దర్శి, కురిచేడును కలపాలని, శిఖరం వరకు సరిహద్దు ఉన్న శ్రీశైలాఇ్న మార్కాపురంలో కలిపే విధంగా మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జిల్లాకు ఒకరూపు తేవాలని జంకె డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు ధర్మానాయక్, నల్లబోతుల కొండయ్య, పంబి వెంకటరెడ్డి, ఎస్.సాంబశివారెడ్డి, గౌస్ మోహిద్దీన్, రమణారెడ్డి ఉన్నారు. వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి -
శ్రీశైలం ఘాట్లో ప్రమాదం
ెపద్దదోర్నాల: వేగంగా వస్తున్న ఓ కారు తొలుత కొండను.. ఆ తర్వాత బస్సును ఢీకొని రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వాహనాల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడగా పెను ప్రమాదమే తప్పింది. ఈ సంఘటన శ్రీశైలం రహదారిలోని చింతల సమీపంలో శనివారం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. అందిన వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన కొందరు శ్రీశైలంలో దైవ దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో చింతల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు తొలుత కొండను, అనంతరం ఎదురుగా వస్తున్న మార్కాపురం డిపో లగ్జరీ బస్సును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ క్రమంలో శ్రీశైలం వెళ్తున్న నంద్యాల జిల్లా పోలీసులు రోడ్డుకు అడ్డంగా బోల్తా పడిన కారును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సును ఢీకొని బోల్తా పడిన కారు -
వైన్షాపులో చోరీ
కంభం: స్థానిక బస్టాండ్ సమీపంలోని ఓ మద్యం దుకాణంలో దొంగలు పడి నగదు అపహరించుకెళ్లారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరగగా శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బస్టాండ్ ఎదురుగా ఉన్న విజయదుర్గ వైన్స్ షాపును రోజూలాగే రాత్రి మూసి వెళ్లి శనివారం ఉదయం షాపు తెరిచారు. అనంతరం దొంగతనం జరిగినట్లు గుర్తించారు. షాపు వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించిన దొంగలు కౌంటర్ లోని నగదును అపహరించుకెళ్లినట్లు గుర్తించారు. కౌంటర్లో ఉన్న సుమారు రూ.లక్షన్నర వరకు నగదు పోయిందని, మద్యం బాటిల్స్ ఎన్ని పోయాయో లెక్కవేస్తే తెలుస్తుందని షాపు యజమానులు తెలిపారు. దొంగలు తమ ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు సీసీ కెమెరా డివిఆర్ను, మానిటర్ను కాలువలో పడేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ కె.మల్లికార్జున చోరీ జరిగిన దుకాణాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మార్కాపురం నుంచి వచ్చిన క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. ఇటీవల ఇదే షాపునకు ఎదురుగా రెండు దుకాణాల్లో చోరీ జరిగిన విషయం విధితమే. పది రోజులు తిరగక ముందే మళ్లీ చోరీ జరగడంతో బస్టాండ్ పరిసరాల్లోని దుకాణాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నా వాటిని కూడా దొంగతనానికి వచ్చిన వారు ధ్వంసం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాత్రి పూట పోలీసులు గస్తీ పెంచి దొంగతనాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు. రూ.లక్షన్నర నగదు మాయం -
నకిలీ పాలసేకరణ కేంద్రంపై దాడి
దర్శి: కల్తీపాలు తయారు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి శివతేజ హెచ్చరించారు. మండలంలోని చలివేంద్రంలో కల్తీపాల తయారీ స్థావరంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడులు చేశారు. అక్కడ తయారు చేస్తున్న కల్తీపాలు, అందుకు ఉపయోగించే ఆయిల్ ప్యాకెట్లను భారీగా స్వాధీనం చేసుకున్నారు. పాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపించారు. ఈ సందర్భంగా శివతేజ మాట్లాడుతూ తమకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు చలివేంద్రలో సందు రామాంజనేయులు అనే వ్యక్తి పాల సేకరణ కేద్రం ఏర్పాటు చేసుకుని పలు డెయిరీలకు పాలు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఆ పాలతో పాటు మరికొన్ని కల్తీపాలు తయారు చేసి వాటిలో కలిపి డెయిరీలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. రెండు రోజులుగా గ్రామంలో రెక్కీ నిర్వహించి డాడులు చేసి నకిలీ పాలను పట్టుకున్నట్లు ఆయన వివరించారు. నకిలీ పాలు తయారు చేసేందుకు ఉపయోగించే సామగ్రి, సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పాలలో ఆయిల్ కలపడంతో ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతుందని కొందరు అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేందుకు కల్తీపాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీపాలు తయారు చేసేందుకు ఉపయోగించిన ఆయిల్ ప్యాకెట్లు, పాలు శాంపిల్స్ తీసుకున్నామని చెప్పారు. వాటిని ల్యాబ్కు పంపి రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా కల్తీపాలు తయారు చేస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని శివతేజ చెప్పారు. పలు శాంపిళ్లు స్వాధీనం కల్తీపాలు తయారు చేస్తే చర్యలు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ -
గమ్యం చేరగా..
సంకల్పం తోడుగా.. ఒంగోలు వన్టౌన్: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని దివ్యాంగులకు ఆటలు, క్రీడల పోటీలను శనివారం ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించారు. పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖాధికారి సీహెచ్. సువార్త మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెస్, క్యారమ్స్, రన్నింగ్, షార్ట్ఫుట్, బ్లైండ్ క్రికెట్, స్కిప్పింగ్ టగ్ ఆప్ వార్, డిస్కస్ త్రో, ట్రై సైకిళ్లరేస్, మోటార్ బైక్ రేస్, వాలీబాల్ తదితర పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ ప్రత్యేక పాఠశాలలు, ప్రభుత్వ బాలుర వసతి గృహ విద్యార్థులతో పాటు వివిధ ప్రైవేటు ప్రత్యేక పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ప్రభుత్వ బధిరుల పాఠశాల, ఒంగోలు, దివ్యాంగుల బాలుర వసతి గృహం, ఒంగోలు, బధిరుల ప్రత్యేక పాఠశాల, చీమకుర్తి ప్రత్యేక మానసిక, బధిరుల పాఠశాల, కనిగిరి మనోవికాస్ మానసిక, ఒంగోలులోని ప్రత్యేక అవసరాల పాఠశాల, మార్కాపురంలోని స్ఫూర్తి మానసిక, ప్రత్యేక అవసరాల పాఠశాల, చైతన్య బధిరుల ప్రత్యేక పాఠశాల, సారా కవెనంట్ హోం, గుడ్ డే అంధుల ప్రత్యేక పాఠశాల, దివ్యాంగుల సంఘాల నుంచి దాదాపు 500 మంది దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొని వివిధ క్రీడా విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. గెలుపొందిన వారికి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజు బహుమతులు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు ప్రారంభించారు. -
బడుగుల ఇళ్లు కూలగొట్టి..
ఒంగోలు సబర్బన్: ఆమె నగర ప్రథమ పౌరురాలు...ఆమె ఇంటికి డ్రైనేజీ సౌకర్యం కోసం పేదలపై ప్రతాపం చూపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువుకొమ్ముపాలెంలో డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నారు. అడ్డగోలుగా బడుగుల రేకుల షెడ్లను నిలువునా కూల్చేశారు. రోడ్డుకు అవతల వైపున ఉన్న డ్రైనేజీని కాదని కూలీ నాలీ చేసుకునే పేదల ఇళ్లు నేలమట్టం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లేయమని అడిగిన ఆమె నేడు ఇళ్లు కూలగొట్టంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. చెరువుకొమ్ముపాలెం గ్రామంలో మేయర్కు చెందిన భారీ భవనం ఉంది. ఆ భవనం ఆనుకొని పాత కల్వర్టులు, డ్రైనేజీ ఉంది. అది చెరువుకొమ్ముపాలెం గ్రామంలోకి వెళ్లే రోడ్డుకు మేయర్ భవనం ఉత్తరం వైపు ఉంటుంది. ఆ వైపు డ్రైనేజీ తీస్తే మేయర్ భవనం సగానికి కూలగొట్టాలి. ఆమేరకు గతంలో ఎక్కడి వరకు కూలగొట్టాలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు మార్కింగ్ కూడా చేశారు. దాంతో భవనం కూలగొడితే చాలా నష్టపోవాల్సి వస్తుందని భావించిన ఆమె పేదల ఇళ్లను టార్గెట్ చేశారు. పాత డ్రైనేజీ ఉన్నా ఇటీవల రూ.40 లక్షల అంచనాలతో డ్రైనేజీ నిర్మాణానికి కౌన్సిల్లో ఆమోదం చేయించుకున్నారు. అడ్డగోలుగా డ్రైనేజీ నిర్మాణం చేసుకుంటూ 26 మంది బడుగుల ఇళ్లు కూల్చివేస్తున్నారు. 30 అడుగుల రోడ్డుకు పడమరగా ప్రభుత్వ స్థలం ఉంది. అది కాదని పేదలు ఉంటున్న ఇళ్లను కూల్చివేసి ఆరు అడుగుల లోతులో భారీ డ్రైనేజ్ నిర్మిస్తున్నారు కార్పొరేషన్ అధికారులు. ఇదేం అన్యాయం అంటూ వారు అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోకుండా పనులు చేపట్టారు. ఇదేమని అడిగితే గంజాయి కేసుపెట్టి ఇరికిస్తానని మేయర్ అనుచరుడు బెదిరిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులను అడ్డంపెట్టుకొని పేదలపై ప్రతాపం చూపిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సిల్ తీర్మానం ప్రకారమే డ్రైనేజీ నిర్మాణం.. చెరువుకొమ్ముపాలెం గ్రామంలోని కొత్తపాలెం వద్ద ఒంగోలు కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం ప్రకారమే డ్రైనేజీ నిర్మిస్తున్నామని ఒంగోలు నగర పాలక సంస్థ ఇంజినీర్ ఏసయ్య తెలిపారు. మేయర్ సుజాతకు చెందిన భవనానికి ఆనుకొని ఉన్న పాత డ్రైనేజీని కాదని ఎందుకు కొత్త డ్రైనేజీని తీస్తున్నారని అడిగిన ప్రశ్నకు పాత డ్రైనేజీతో తమకు సంబంధం లేదని, మేయర్ తీర్మానం చేసిన కౌన్సిల్ ఆమోదం ప్రకారం ఇళ్లు తొలగించి పెద్ద డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. గతంలో చేసిన మార్కింగ్ను కాదని మేయర్ భవనం కూలగొట్టాల్సి వస్తుందని రోడ్డుకు అవతల వైపు డ్రైనేజీ తీస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. కాంట్రాక్టర్ కాకుండా స్థానిక నాయకుడు సుధాకర్ వచ్చి మరీ ప్రజలను భయపెట్టి పొక్లెయిన్తో రేకుల షెడ్డులు కూలగొట్టించారట కదా అని అడిగిన ప్రశ్నకు ఆ విషయం తమకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారు. -
రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు
యర్రగొండపాలెం: స్థానిక సీఎస్ గోడౌన్తో పాటు పట్టణంలోని పలు రేషన్ షాపులపై డిప్యూటీ కలెక్టర్ అరవకుమార్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. తొలుత గోడౌన్లో ఉన్న బియ్యం, రికార్డులు, ఆయా రేషన్ షాపుల్లో ఉన్న స్టాక్తోపాటు రికార్డులు తనిఖీ చేశారు. ఈ నెల 1వ తేదీన రేషన్ పంపిణీ చేయాల్సి ఉంది. అందుకు రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార నిల్వ ఉంచారు. రేషన్ పంపిణీ చేయకముందే కొంతమంది గోడౌన్ నుంచి నేరుగా బియ్యం అక్రమంగా తెలుగు తమ్ముళ్ల గోడౌన్లకు చేరుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు రేషన్ షాపులను తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. దాడుల్లో ఎన్ఫోర్స్ మెంట్ డీటీ చంద్రశేఖర్, గోడౌన్ డీటీ భ్రమరాంబ, ఆర్ఐ షేక్ సర్దార్ పాల్గొన్నారు. -
కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్లు
ఒంగోలు టౌన్: కార్మికులను కార్పొరేట్ శక్తుల కట్టుబానిసలుగా మార్చేందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రాధా కృష్ణమూర్తి అన్నారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో ఏఐటీయూసీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి సయ్యద్ యాసిన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాధా కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్లలో కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కార్మిక లోకం ఎన్నో త్యాగాలతో సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న మోదీ సర్కార్ చరిత్రలో చేతులు కట్టుకొని నిలబడక తప్పదని హెచ్చరించారు. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కోట్లాది మంది కార్మికులు రోడ్లమీదకు వచ్చి నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా మోదీ సర్కార్కు చీమకుట్టినట్టయినా లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న మోదీ వారికి ప్రయోజనం కలిగించేందుకే నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారని చెప్పారు. కార్పొరేట్లకు కోరిన వెంటనే ఉచితంగా భూములను పంచిపెడుతున్నారని, చట్టాలను వారికి చుట్టాలుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. 8 గంటల పనివిధానానికి స్వస్తి పలికి 13 గంటల పనివిధానాన్ని తీసుకొచ్చారని చెప్పారు. పనిచేయకుండా కార్మికులకు వేతనాలు ఇస్తారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కార్మికులు ఏడాదికి రూ.400 కోట్లకు పైగా సంపద సృష్టిస్తున్నారని తెలిపారు. అయినా కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు సిద్ధించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్ ఉద్యోగాల స్థానంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసుకొస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఏకై క ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, కొత్తకోట వెంకటేశ్వర్లు, కాటన్ శెట్టి హనుమంతరావు, సుభాన్ నాయుడు, పుల్లమ్మ, దాసరి మల్లికార్జునరావు, దాసరి సునిత, కె.అంజయ్య, వివిధ రంగాలకు చెందిన కార్మికులు, పాల్గొన్నారు. -
ఖేలో ఇండియా పోటీల్లో మెరిసిన ఏకేయూ విద్యార్థి
● అఖిల భారత స్థాయిలో రజత పతకం కై వసం ఒంగోలు సిటీ: రాజస్థాన్ రాష్ట్రంలోని బిఖనూర్లో ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్న ఖోలో ఇండియా పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్లో ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి చెందిన ఎన్.వెంకట మహేష్ ప్రతిభ కనబరిచాడు. సీఎస్ పురంలోని బెల్లంకొండ డిగ్రీ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థి మహేష్ గురువారం నిర్వహించిన 79 కిలోల విభాగం వెయిట్ లిఫ్టింగ్ ఫైనల్స్లో జాతీయ స్థాయిలో రన్నరప్గా నిలిచి రజత పతకం కై వసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా మహేష్కు వైస్ చాన్సలర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవీ వరప్రసాద్ అభినందనలు తెలిపారు. ● 16 మంది జూదరులు అరెస్టు ● రూ.3,18,086 నగదు, 19 ఫోన్లు, 21 బైకులు సీజ్ ముండ్లమూరు(దర్శి): మండలంలోని నూజిల్లపల్లి–శంకరాపురం గ్రామాల మధ్య పొలాల్లో కోతముక్క ఆడుతున్న 16 మందిని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై కె.కమలాకర్ తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ముండ్లమూరు, తాళ్లూరు మండలాల పోలీసు సిబ్బంది కలిసి పొలాల్లో పేకాట శిబిరాన్ని చుట్టుముట్టారు. సంఘటన స్థలంలో పట్టుబడిన నిందితుల నుంచి రూ.3,18,086 నగదు, 19 సెల్ఫోన్లు, 21 మోటారుసైకిళ్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఒంగోలు టౌన్: టంగుటూరు ఎమ్మార్వో కార్యాలయం 27 ఏళ్ల క్రితం తగలబడిన కేసును ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. 1998వ సంవత్సరంలో టంగుటూరు ఎమ్మార్వో కార్యాలయం దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు 25 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మందకృష్ణమాదిగ, కొమ్మూరి కనకారావు, పేరుపోగు వెంకటేశ్వరరావు, చాట్ల రమేష్ దొరకకపోవడంతో కేసు స్పిటప్ చేశారు. గర్నెపూడి సుబ్బారావు తదితరుల మీద కేసును విచారించి 2017లో కొట్టివేశారు. ముద్దాయిలుగా మిగిలిన కొమ్మూరి కనకారావు, పేరుపోగు వెంకటేశ్వరరావు, చాట్ల రమేష్ మీద కేసు విచారణ సుదీర్ఘ కాలం కొనసాగింది. శుక్రవారం తుది విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎస్.హేమలత కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కేసును వాదించి అండగా నిలిచిన న్యాయవాది పిట్టల లక్ష్మయ్య, జూనియర్ న్యాయవాదులు నాగేశ్వరరావు, పార్వతి, యగ్నేశ్వరరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు వన్టౌన్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖఽ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ పరీక్షల ఉచిత శిక్షణకు డిసెంబర్ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎస్.నిర్మలా జ్యోతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులకు డిసెంబర్ 7వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 14వ తేదీ నుంచి విజయవాడ నగరంలోని గొల్లపూడిలో ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను కలెక్టరేట్ ఎదురుగా ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్లో ఏపీ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలని స్పష్టం చేశారు. వివరాలకు 08592–231232, 9989285530, 8985090926ను సంప్రదించాలని సూచించారు. ● మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా కొనకనమిట్ల: పేద మహిళల అవసరాలను ఆసరాగా తీసుకున్న ఓ ముఠా.. ఆ అభాగ్యురాళ్లను పడుపు వృత్తిలోకి దించుతోంది. జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలాలను తమ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేసింది. పట్టపగలే బహిరంగంగా వ్యభిచారం చేయిస్తున్నా హైవే పెట్రోలింగ్ సిబ్బంది, మండల పోలీసులు సైతం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామ శివారు నందనమారెళ్ల కొండ సమీపంలో గత కొంత కాలంగా పట్టపగలే మహిళలతో వ్యభిచారం చేయిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి ప్రాంతానికి చెందిన పలువురు మహిళలను పెదారికట్ల సమీపంలోని కొండ ప్రాంతానికి తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దించుతున్నట్లు సమాచారం. వీరి చర్యలతో కొండ సమీపంలోని పొలాల రైతులు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పోలీసులు స్పందించి హైవే వెంట అసాంఘిక చర్యలను కట్టడి చేయాలని పెదారికట్ల వాసులు కోరుతున్నారు. -
మిర్చి తోటలో గంజాయి సాగు!
పెద్దదోర్నాల: సాగులో ఉన్న మిర్చి తోటలో గంజాయి మొక్కలను ఎకై ్సజ్ అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. ఈ సంఘటన పెద్దదోర్నాల మండల పరిధిలోని జమ్మిదోర్నాల పంట పొలాల్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎకై ్సజ్ సీఐ ముక్కు వెంకటరెడ్డి కథనం మేరకు.. జమ్మిదోర్నాలలో రైతు బోయపాటి రాజబాబు మిర్చి తోటలో అక్కడక్కడా పెంచిన గంజాయి మొక్కలను ఎకై ్సజ్ పోలీసులు గుర్తించారు. ఆ మొక్కలను మధ్యవర్తుల సమక్షంలో పీకి ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. గురువారం మండలంలో గంజాయి కలిగిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించడంతోపాటు వారి వద్ద కిలోన్నర గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజే జమ్మిదోర్నాలలో గంజాయి మొక్కలు వెలుగుచూడటం ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాల వినియోగం మితిమీరుతోందని స్పష్టమైంది. దాడిలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బాలయ్య, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణతోపాటు ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. మొక్కలు గుర్తించి ధ్వంసం చేసిన ఎకై ్సజ్ అధికారులు -
రేయింబవళ్లుతవ్వుడు.. తోలుడే..!
పాలేరును చెరబట్టిన ‘పచ్చ’ ముఠా రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి రూ.10 కోట్ల పైగా పోగేసిన టీడీపీ ముఠాకొండపి: విచ్చలవిడిగా ఇసుక అక్రమ దందా సాగిస్తున్న టీడీపీ ముఠాను కట్టడి చేయడంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ఇసుక లారీలపై దాడి చేస్తే ఎక్కడ తమపై రెడ్ బుక్ ప్రయోగిస్తారోనన్న భయం కొందరిదైతే, సంపాదన యావలో పడి మరికొందరు అధికారులు పచ్చ ముఠా ఇసుక దోపిడీని గుడ్లప్పగించి చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి, పొన్నలూరు మండలాల పరిధిలో ప్రవహించే పాలేరులో ఇసుకను టీడీపీ నాయకులు కొల్లగొడుతున్నారు. గడిచిన 4 నెలలుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా పాలేరులో ఇసుకను జేసీబీలతో తవ్వి, యథేచ్ఛగా టిప్పర్లతో తరలిస్తున్నారు. నిత్యం 3 నుంచి 4 జేసీబీలు పాలేరులో ధ్వంసరచన చేస్తున్నాయి. రోజూ 40 టిప్పర్లకు పైగా ఇసుక అక్రమంగా కొండపి నియోజకవర్గంతోపాటు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు తరలిపోతోంది. జరుగుమల్లి, పొన్నలూరు పరిధిలో తవ్విన ఇసుకను కొండపి మీదుగా చీమకుర్తి, సంతనూతలపాడు, మర్రిపూడి, పొదిలి వైపు తరలిస్తూ టీడీపీ నేతలు దండిగానే సంపద పోగేసుకుంటున్నారని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గడిచిన 4 నెలల్లో మోంథా తుఫాన్ సమయంలో 2 రోజులు మినహా మిగిలిన అన్ని రోజులూ ఇసుక అక్రమ రవాణా సాగింది. గురు, శుక్రవారాల్లో సైతం యథేచ్ఛగా ఇసుక తరలిపోయింది. మొత్తం మీద ఇప్పటి వరకు 4800 టిప్పర్ల ఇసుకను టీడీపీ నేతలు అక్రమంగా తరలించినట్లు కొండపి, జరుగుమల్లి, పొన్నలూరు మండలాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే టీడీపీ నేతలు పోగేసుకున్న సొమ్ము రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ధ్వంసమవుతున్న రోడ్లు ఇసుకను ఓవర్ లోడ్ చేసిన లారీలు, టిప్పర్లు కామేపల్లి నుంచి కొండపి వైపు రావడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే దెబ్బతిన్న ఇసుక లారీల కారణంగా మరింత గుల్లవుతున్నాయి. కామేపల్లి–నేతివారిపాలెం మధ్య రోడ్డు, కొండపి–అన్నకర్లపూడి మధ్య రోడ్డు ధ్వంసం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో ఇసుకను నేరుగా ప్రభుత్వమే విక్రయించగా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుకను టీడీపీ నేతలకు ఆదాయ వనరుగా మార్చేశారు. టీడీపీ ముఖ్య నేతల ఆదేశాలతో అధికారులు మౌనం దాల్చడంతో ఆ పార్టీ నాయకుల ఇసుక దందాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు భారీగా గండి పడుతోంది. రాష్ట్ర రెవెన్యూ ప్రభుత్వ ఉద్యోగుల జీతానికే సరిపోతోందని ఓ వైపు సన్నాయి నొక్కులు నొక్కుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఆదాయాన్ని పెంచే మార్గాలను గాలికొదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
భక్తుల మనోభావాలతో ఆటలా?
పొదిలి రూరల్: మార్కాపురాన్ని జిల్లా చేశారన్న సంతోషం కంటే పొదిలి మండల పరిధిలో ఉండే పృథులగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కొండపి నియోజకవర్గ పరిధిలోకి తీసుకెళ్లడం బాధగా ఉందని, ప్రజలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు సరికాదని వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జీ, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డితో కలిసి పొదిలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నా రాంబాబు మాట్లాడారు. తరతరాల చరిత్ర, బ్రిటీష్ వారి హయాం, వెంకటగిరి రాజా పాలన, ఫారెస్టు రికార్డులు, దేవదాయశాఖ రికార్డులు.. ఇలా ఏది చూసినా పృథులగిరి పొదిలి మండల పరిధిలో ఉందని స్పష్టం చేస్తున్నాయన్నారు. ఆ గుడి బాధ్యతలు పొదిలి గ్రూప్ టెంపుల్స్ ఈఓనే చూస్తున్నారని గుర్తు చేశారు. ఇవేవీ పరిశీలించకుండా అధికారం ఉంది కదా అని పృథులగిరి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి డీబీవీ స్వామి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గంలోకి లాగేసుకోవడం అన్యాయమన్నారు. మంత్రి స్వామి అనైతిక చర్యను మార్కాపురం ఎమ్మెల్యే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఆ ఆలయ కమిటీని మార్కాపురం ఎమ్మెల్యేగా ఎవరుంటే వారే పర్యవేక్షిస్తుంటారన్నారు. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. నరసింహస్వామి ఆలయం పొదిలి పరిధిలో ఉండే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అన్నా రాంబాబు హెచ్చరించారు. సమావేశంలో పార్టీ పట్టణాధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డి, నాయకులు జి.శ్రీనివాసులు, ఉడుముల వరలక్ష్మమ్మ, కొనకనమిట్ల మండల అధ్యక్షుడు మోరా శంకర్రెడ్డి, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయ రికార్డులన్నీ పొదిలి పరిధిలోనివే.. పృథులగిరి ఆలయాన్ని కొండపి నియోజకవర్గంలో ఎలా చేరుస్తారు? మంత్రి డోలా చర్యపై మార్కాపురం ఎమ్మెల్యే ఎందుకు ప్రతిఘటించలేదు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు -
మార్కాపూర్.. ట్రాఫికర్
వాహనాలపై నియంత్రణ లేక ప్రధాన రహదారులు, జంక్షన్లు జామ్ మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణాన్ని ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయట పడేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి వరకు రచించిన ప్రతివ్యూహాలు పెద్దగా ఫలితాన్నివ్వలేకపోయాయి. రహదారులపై ఆగిపోయిన భారీ వాహనాల మధ్య ద్విచక్రవాహనదారులు సర్కస్ ఫీట్లు చేస్తుండగా.. పాదచారులు సైతం పాములా మెలికలు తిరుగుతూ ముందుకెళ్తున్న దుస్థితి. వాహనాల రణగొణ ధ్వనుల మధ్య గమ్యస్థానాలకు చేరుకునేసరికి ఉద్యోగులతోపాటు ఇతర వర్గాలవారు డీలా పడిపోతున్నారు. రోడ్లపై ఆక్రమణలు తొలగించడం, అవసరమైన చోట రహదారుల విస్తరణ పనులు చేపట్టడం, అడ్డగోలు పార్కింగ్ను కట్టడి చేయడంతోపాటు ప్రధాన కూడళ్లలో సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే ట్రాఫిక్ సమస్య ఓ కొలిక్కొస్తుందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం నుంచి జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన మార్కాపురంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ● పట్టణ ప్రధాన కూడళ్లలో సిగ్నలింగ్ వ్యవస్థ అవశ్యం ● అడ్డగోలు పార్కింగ్ను కట్టడి చేయాలని జనం అభిలాష ● ట్రాఫిక్ స్టేషన్ ఏర్పాటుపై ఎస్పీ దృష్టి సారించాలని ప్రజల వినతి అడ్డగోలు పార్కింగ్తోనే సమస్య మార్కాపురం రోడ్లపై వాహనాలు నడపడమంటే సర్కస్ ఫీట్లు చేయడం లాంటిదే. నెహ్రూ బజారు, నాయుడు బజారు, మెయిన్ బజారులలో పార్కింగ్ స్ధలం లేకపోవడంతో హోటల్స్కు, కిరాణా షాపులకు, ఫ్యాన్సీ షాపులకు వచ్చేవారు తమ వాహనాలను షాపుల ముందు పార్కింగ్ చేస్తున్నారు. నాయుడు బజారు, కొత్తమార్కెట్, పాత మార్కెట్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో కూడా సమయపాలన పాటించకుండా లోడింగ్, అన్లోడింగ్ కోసం భారీ వాహనాలను రోడ్డుపై నిలిపి ఉంచడంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. పార్కింగ్ ప్రదేశాలు లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం, అలాగే షాపింగ్కు వచ్చిన ప్రజలు తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపి ఉంచుతున్నారు. దీంతో తరచుగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. రద్దీ ప్రదేశాల్లో సెంట్రల్ పార్కింగ్ సిస్టమ్పై పోలీసులు దృష్టి సారిస్తే కొంత మేర సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ట్రాఫిక్ స్టేషన్తోనే పరిష్కారం! ట్రాఫిక్ నియంత్రణకు మార్కాపురం పట్టణంలో వివిధ సెంటర్లలో 8 మంది హోంగార్డులు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక ఎస్సై ఉన్నప్పటికీ ట్రాఫిక్ నియంత్రణ కష్టంగా మారింది. కొందరు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఎక్కడపడితే అక్కడ ఆటోలు ఆపడం, టర్నింగ్ తిప్పడం లాంటివి చేస్తుండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవించడంతోపాటు ట్రాపిక్ సమస్యకు కారణమవుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికుల కోసం కంభం సెంటర్, దోర్నాల సెంటర్, గడియార స్తంభం సెంటర్, ఒంగోలు సెంటర్లో బస్సులు పదే పదే నిలపడం వల్ల కూడా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. మార్కాపురం పట్టణానికి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ మంజూరు చేయడంతోపాటు అదనపు సిబ్బందిని నియమిస్తే వాహనాల రద్దీని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రోజూ గంట వృథా.. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, నియంత్రణ లేని వాహనాలతో మార్కాపురం పట్టణ ప్రజలు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. సుమారు లక్ష జనాభా ఉన్న పట్టణంలో 4 వేలకు పైగా ఆటోలు, సుమారు 150కి పైగా బస్సులు 6 వేల ద్విచక్ర వాహనాలు, 1600కు పైగా కార్లు రాకపోకలు సాగిస్తున్నాయి. పట్టణంలో 4 ఇంజినీరింగ్ కళాశాలలు, 10 ఇంటర్, డిగ్రీ ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు పట్టణంలో వివిధ ప్రైవేట్ పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 40కి పైగా బస్సులు తిరుగుతుంటాయి. విద్యార్థులను తీసుకెళ్లేందుకు, దించేందుకు పాత బస్టాండ్, దోర్నాల సెంటరు, నాయుడు బజారు, కంభం సెంటరు, కోర్టు సెంటరు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో బస్సులు ఆపుతారు. ఈ క్రమంలో వెనుకవచ్చే వాహనాలన్నీ హారన్ల మోత మోగిస్తున్నాయి. కంభం రోడ్డులో ఎల్ఐసీ ఆఫీసు వద్ద ఉదయం, సాయంత్రం రోజూ సుమారు గంట సమయం ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయ్యప్పస్వామి గుడిలైన్లో ట్రాఫిక్ ఇలా 150 -
మార్కాపురాన్ని అన్యాయం చేయొద్దు
ఒంగోలు సిటీ: చంద్రబాబు తమ రాజకీయ స్వార్థం కోసం మార్కాపురాన్ని జిల్లాగా చేశారని వైఎస్సార్ పీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరు రవి విమర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ఎలాంటి ఆదాయ వనరులు చూపకుండా, కనీస నీటి సౌకర్యంలేని నాలుగు అసెంబ్లీలతో మార్కాపురాన్ని జిల్లా చేయడం సరికాదని బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో కనీసం రూ.వెయ్యి కోట్లు ఆదాయం తెచ్చే వనరులు లేవన్నారు. ఏదో జిల్లా ఇచ్చామని మాయ చేస్తున్నాన్నారు తప్ప ఆ జిల్లా ప్రజలకు మేలు చేసేందుకు కాదని దుయ్యబట్టారు. ఏ విధంగా ఆదాయం లేని, వ్యవసాయం లేని జిల్లాగా మార్కాపురాన్ని మార్చొద్దన్నారు. రాజకీయ స్వార్థం కోసం ఇలా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. దర్శిని కూడా మార్కాపురం జిల్లాలో కలపాలని ఆయన కోరారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే.. మా ప్రభుత్వ హయాంలో పనులు 90 శాతం పూర్తి చేశామన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి నీళ్లు ఇచ్చేవారమన్నారు. ఒంగోలులో మెడికల్ కళాశాల ఉన్నా..వెనుకబడిన ప్రాంతంగా ఉన్న పశ్చిమ ప్రకాశానికి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు, పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్యను అందుబాటులో తెచ్చేందుకు మార్కాపురంలో మరో మెడికల్ కళాశాల ఏర్పాటుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టారన్నారు. దానిని సైతం ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం మా ప్రభుత్వ హయాంలో పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లా ఏర్పాటు చేశామని వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జి చుండూరి రవిబాబు తెలిపారు. ఒక జిల్లాకు న్యాయం చేసి మరో జిల్లాకు అన్యాయం చేయడం సరికాదన్నారు. ప్రకాశం జిల్లాకు మళ్లీ పోర్టు వచ్చిందన్నారు. మార్కాపురం ఆదాయ వనరులు లేని జిల్లాగా చేయడం పాపమన్నారు. దొనకొండ పారిశ్రామికవాడగా అభివృద్ధి చేస్తామంటున్నారని, మార్కాపురానికి దగ్గరగా ఉన్న దొనకొండ ప్రాంతాన్ని ఆ జిల్లాలో కలపాలన్నారు. మెప్మా అవినీతి వేళ్లు ఎమ్మెల్యే కార్యాలయం వైపు మెప్మా అక్రమాల్లో ఎమ్మెల్యే పీఏల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయని, అన్ని వేళ్లూ ఎమ్మెల్యే కార్యాలయం వైపు చూపిస్తున్నాయని చుండూరు రవిబాబు ఆరోపించారు. 2021 నుంచి 2026 వరకూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదులన్నీ మెప్మా అధికారులపైనా, మీ పీఏలపైనా అని అన్నారు. విచారణ సత్వరం పూర్తి చేసి అమాయకులకు న్యాయం చేయాలని, దోషులను గుర్తించి వారి వద్ద నుంచి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. మా ప్రభుత్వంపై బుదరజల్లడం మాని తప్పుచేసిన వారిని శిక్షించాలని కోరుతున్నామన్నారు. -
జ్యోతిరావు పూలేకు నివాళులు
ఒంగోలు సిటీ: మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు శుక్రవారం ఘన నివాళులర్పించారు. పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు దుంపా చెంచురెడ్డి, ఉప్పలపాటి ఏడుకొండలు (వేణు), రొండా అంజిరెడ్డి, క్రాంతి కుమార్, కూనం గౌతం, పెట్లూరి ప్రసాద్, దాసరి కరుణాకర్, తాత నరసింహ గౌడ్, పాలడుగు రాజీవ్, షేక్ మీరావలి, సయ్యద్ అప్సర్, బత్తుల ప్రమీల, బడుగు ఇందిరా, బడుగు శోభ లత, బడుగు మాధవి, కార్పొరేటర్ ఇమ్రాన్ఖాన్, నాగరాజు, 48 డివిజన్ అధ్యక్షుడు, వీసం బాలకృష్ణ, షేక్ జిలాని బాషా, ఫణిదపు సుధాకర్, కుట్టుబోయిన కోటి యాదవ్, కుట్టు బోయిన సురేష్, సన్నపురెడ్డి రవణమ్మ, ఝాన్సీ, పులుసు సురేష్, దేవా, దేవరపల్లి అంజిరెడ్డి, పేరం ప్రసన్న, పి.కృష్ణవేణి, ఒ.మహాలక్ష్మి, జి.పద్మశ్రీ, ఎస్.లీలాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు తీరుతో ఉచిత వైద్యం కష్టమే
తర్లుపాడు: చంద్రబాబు తీరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన ప్రజలకు ఉచిత వైద్యం అందడం కష్టమని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్చార్జ్ అన్నా రాంబాబు అన్నారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందాలంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాల నిర్మించాలని, అందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి పార్టీలకతీతంగా మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని మీర్జపేట, గొల్లపల్లి గ్రామాల్లో శుక్రవారం రాత్రి కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకబడిన పశ్చిమ ప్రకాశానికి అదనంగా మెడికల్ కళాశాల మంజూరు, వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఈ ప్రాంతంపై ఉన్న అభిమానాన్ని, ప్రేమను చూపారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలలను తన అనుచరులకు కట్టబెట్టేందుకు పీపీపీ విధానం తీసుకొచ్చారని విమర్శించారు. ఈ చర్య దుర్మార్గమని అన్నారు. పార్టీలకు అతీతంగా సంతకాల సేకరణ జరుగుతోందని, ప్రజలు ప్రైవేటీకరణ వలన వచ్చే నష్టాన్ని అర్థం చేసుకుని దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 66 ఏళ్లపాటు మెడికల్ కళాశాలలను ప్రైవేటు వారికి అప్పగిస్తే ఈ ప్రాంత ప్రజలు ఉచిత వైద్యం కోసం గతంలో లాగా ఒంగోలు, గుంటూరు, కర్నూలు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వలన పేదలకు ఉచిత వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తు తరాల కోసమే ఈ ఉద్యమం కొనసాగుతోందని, అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ భూలక్ష్మీ రామసుబ్బారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మురారి వెంకటేశ్వర్లు, కంది ప్రమీలారెడ్డి, గాయం శ్రీనివాసరెడ్డి, మీర్జపేట, గొల్లపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్లు రామిరెడ్డి, మీరయ్య, రమణయ్య, ఎంపీటీసీ రమేష్రెడ్డి, రంగారెడ్డి, మల్లారెడ్డి, వెలుగొండారెడ్డి, కాశయ్య, భాస్కర్రెడ్డి, శేషయ్య, వెంకటరెడ్డి, బాలిరెడ్డి, కృపాకర్, సుబ్బారెడ్డి, మండలంలోని అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అన్నా రాంబాబుకు మేళాతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. -
5న పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
ఒంగోలు సబర్బన్: వచ్చేనెల 5వ తేదీన జరిగే మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని కలెక్టర్ పీ.రాజాబాబు ఆదేశించారు. ఈ విషయంపై శుక్రవారం ప్రకాశం భవనం నుంచి అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను, దాతలను, ప్రోటోకాల్ ప్రకారం అతిథులను ఆహ్వానించడంలో ఎలాంటి లోపం ఉండకూడదన్నారు. పాఠశాల ప్రాంగణం, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించటంతో పాటు వారి సూచనలు, సలహాలను కూడా తీసుకోవాలని అన్నారు. పదో తరగతి విద్యార్థులకు రాబోయే వంద రోజుల్లో అమలు చేయనున్న విద్యా ప్రణాళికను కూడా తల్లిదండ్రులకు వివరించి, ఉత్తమ ఫలితాలు రాబట్టడంలో వారు కూడా సహకరించేలా కోరాలని విద్యాధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. కేవలం చదువుపైనే కాకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, పాఠశాలలో మౌలిక సదుపాయాల నిర్వహణపైనా ప్రధానోపాధ్యాయులు దృష్టి సారించాలని ఆయన చెప్పారు. సురక్షిత తాగునీరు విద్యార్థులకు అందించాలని పునరుద్ఘాటించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ వంటి పత్రాల కోసం వాట్సప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సేవలపైనా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నిర్దేశించారు. సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
● సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ అనీల్కుమార్ ఒంగోలు సిటీ: కేజీబీవీ విద్యార్థినులంతా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ అనీల్కుమార్ దాసరి అన్నారు. జిల్లాలోని 28 కేజీబీవీల ప్రిన్సిపాళ్లతో ఒంగోలులోని తన ఛాంబర్లో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనీల్కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని కేజీబీవీల్లో 1077 మంది విద్యార్థినులు పదో తరగతి చదువుతున్నారని తెలిపారు. గత ఏడాది కేజీబీవీల్లో పదో తరగతికి సంబంధించి మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. 100 శాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థినులకు వంద రోజుల ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. నాగులుప్పలపాడు: మండలంలోని బి.నిడమానూరు జూనియర్ కళాశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అధ్యాపకుడి తీరుపై గురువారం డిప్యూటీ డీఈఓ చంద్రమౌళేశ్వరరావు విచారణ చేపట్టారు. కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడు బక్కమంతుల వినయ్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో గ్రామస్తులు కళాశాలకు చేరుకొని అధ్యాపకుడిని ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో గురువారం డిప్యూటీ డీఈఓ కళాశాలలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరు అధ్యాపకుడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. సింగరాయకొండ: విద్యుదాఘాతానికి మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పాకల పంచాయతీ చెల్లెమ్మగారి పట్టపుపాలెం వద్ద గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మత్స్యకారుడు కాలంగారి జాలయ్య(39) ఇంటి సమీపంలో విద్యుత్ కండక్టర్ తెగి పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. జాలయ్య మృతితో పాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. చేస్తున్నట్లు ఎస్సై బి మహేంద్ర వివరించారు. ● ఒకటిన్నర కిలోల గంజాయి స్వాధీనంపెద్దదోర్నాల: గంజాయిని విక్రయించేందుకు శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ( సుండిపెంట)కు వెళుతున్న ముగ్గురు యువకులను యర్రగొండపాలెం సీఐ అజయ్కుమార్, ఎస్సై మహేష్ వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలో శ్రీశైలం రహదారిలోని బోడేనాయక్ వద్ద గురువారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో పి. శ్రీను, లాలాశ్రీను, సురేస్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మండలానికి చెందిన పి.శ్రీను, లాలాశ్రీను, సురేస్లు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. దీంతో డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో గంజాయి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో తెలిసిన ఓ వ్యక్తి సహాయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలీ నుంచి గంజాయిని తెచ్చి మండల పరిసర ప్రాంతంలో విక్రయించేవారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు వీరి కోసం వెతుకుతున్న సమయంలో ఒకటిన్నర కిలోల గంజాయిని శ్రీశైలం వెళ్లే సాధువులకు విక్రయించేందుకు సుండిపెంటకు వెళుతున్నట్లు సమాచారం అందింది. సమాచామందుకున్న ఎస్సై మహేష్ బోడేనాయక్ తాండా వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న నిందితులు పోలీసులను చూసి పరిగెత్తగా అదుపులోనికి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. కంభం: మండలంలోని జంగంగుంట్ల గ్రామానికి చెందిన గొంగటి శ్రీను (45) కుటుంబ కలహాలతో గురువారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించిన హుటాహుటిన కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని చెప్పారు. నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు రావిపాడులో విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటం
చీమకుర్తి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటం ఆగదని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. చీమకుర్తిలో గురువారం రాత్రి నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మేరుగు నాగార్జున మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారన్నారు. వాటిని చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేందుకు పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ జపం చేస్తున్నాడని మండిపడ్డారు. పీపీపీ విధానం వల్ల పేదలకు ఎంతో అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతున్నా చంద్రబాబు సర్కార్లో ఎలాంటి చలనం లేకపోవడం శోచనీయమన్నారు. అనంతరం కోటిసంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, కౌన్సిలర్లు సోమా శేషాద్రి, బీమన వెంకట్రావు, మేకల సులోచన యల్లయ్య, చల్లా అంకులు, ఎన్.మాణిక్యం, పాటిబండ్ల గంగయ్య, తప్పెట బాబూరావు, ఆముదాలపల్లి ప్రమీల రామబ్రహ్మం, పత్తి కోటేశ్వరరావు, తెల్లమేకల గాంధీ, చిన్నపురెడ్డి మస్తాన్రెడ్డి, గోపురపు చంద్ర, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకే ప్రైవేటీకరణ చీమకుర్తిలో కోటిసంతకాల సేకరణలో పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున -
నిమ్మ రైతు కంట కన్నీరు
జిల్లాలో నిమ్మ రైతుకు కాలం కలిసి రావడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు.. దిగజారిన ధరలు.. గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం వెరసి నిమ్మ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జిల్లాలో సుమారు 7,185 ఎకరాల్లో నిమ్మసాగవుతుంది. కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఎక్కువగా సాగవుతుంది. అందులో ఎక్కువగా భాగం కనిగిరి నియోజకవర్గంలో 2600 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. దిగజారిన ధరలు.. పంటలకు తెగుళ్లు ఆశించి, దిగుబడి సరిగ్గా రాక.. వచ్చిన పంటకు ఆశించిన ధరలు లేక ఓ ఏడాది.. ఈ ఏడాది రైతుకు మంచి దిగుబడులు వచ్చినా.. ఎగుమతుల్లేక పాతాళంలోకి ధరలు దిగజారడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కార్తీక మాసంలో.. ప్రస్తుత కాలంలో నిమ్మ కాయలకు బయట మార్కెట్లో ధరలు ఉన్నా.. రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. పంటల దిగుబడి పెరగడంతో ధరలు లేవని కమీషన్ ఏజెంట్లు కూడా నిమ్మ కాయలను కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తగ్గిన ఎగుమతులు.. పెరిగిన దిగుబడులు జిల్లాలో అత్యధికంగా కనిగిరి, చినారికట్ల జంక్షన్ మార్కెట్ నుంచి.. గుంటూరు జిల్లాలో తెనాలి నుంచి, నెల్లూరు జిల్లా గూడూరు నుంచి నిమ్మ కాయలు బయట మార్కెట్లకు ఎగుమతి అవుతుంటాయి. నిత్యం కనిగిరి నుంచి కనీసం 3 నుంచి 5 లారీల లోడ్ల నిమ్మ కాయల లారీలు ఇతర రాష్ట్రాలకు, ఇతర (ముంబాయి, చైన్నె, అహమ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర) ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతాయి. అయితే ప్రస్తుతం ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయని.. జిల్లాలోని, రాష్ట్రంలోని ఇతర నిమ్మ మార్కెట్ పాయింట్లలో కూడా ఎక్కువగా ఉత్పత్తులు ఉన్నందు వల్ల కనిగిరి మార్కెట్లో కాయలకు డిమాండ్ లేదని కమీషన్ వ్యాపారులు చెప్తున్నారు. దీంతో పండు కాయ రూ.2 నుంచి రూ.3కు, పచ్చికాయ గ్రేడ్ 1 రకం రూ.8 నుంచి రూ.10కి, గ్రేడ్ 2 రకం రూ.7 నుంచి రూ.8కి, గ్రేడ్ 3 రకం రూ.6 నుంచి రూ.7కు కొనుగోలు చేస్తున్నారు. కూలీరాక..చెట్లపై వదిలేస్తూ.. రూ.లక్షలు పెట్టుబడులు పెట్టిన రైతులు కనీస పెట్టుబడులు రాక లబోదిబోమంటున్నారు. గతేడాది సీజన్లో కాస్తో కూస్తో ధరలు దక్కిన రైతులు ఈ ఏడాది నిండా మునిగిపోయారు. రాష్ట్రంలో, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో దిగుబడులు రావడం.. చలి తీవ్రత పెరగడంతో ధరలు లేక రైతులు డీలా పడ్డారు. బస్తా కాయలు కోయడానికి దాదాపు 8 నుంచి 10 మంది కూలీలు పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కో కూలీకి రూ.300 చెల్లించాలి. అంత చెల్లించి తీసుకెళ్లినా.. మార్కెట్లో కనీస కోత కూలీ రాకపోగా.. ఆటో ఖర్చు అదనపు భారంగా పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు చెట్టుమీదే కాయ కోత లేకుండా వదిలేస్తుండగా.. మరి కొందరు కాయ కోత కోయక పోతే రెండో ఏడాది చెట్టుకు పూత రాదనే భయంతో అదనపు ఖర్చుపెట్టి కాయను కోయించి పొలం గట్లపైనా.. రోడ్ల పైనే పారేస్తున్నారు. కొందరు రైతులు కోసిన కాయలను పొలాల్లో, ఇళ్లల్లో ఉంచుకోలేక.. కమీషన్ కొట్లకు కాయలు తెచ్చి వేస్తున్నారు. వచ్చిన కాడికి జమ అన్నట్లు కమీషన్ ఏజెంట్లు ఇచ్చినంత తీసుకుని కన్నీళ్లు తుడుచుకుంటున్నారు.. కమీషన్ ఏజెంట్లు గ్రేడ్ 1 రకం కాయలను మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో తెచ్చిన కాయలను కనిగిరి నుంచి తిరిగి వెనక్కి తీసుకెళ్లలేక రోడ్లపైన పడేస్తున్నారు. -
కోర్టు కేసులో ఉన్న భూములపై విచారణ
హనుమంతునిపాడు: కోర్టు కేసులో ఉన్న భూముల్లో పంటలు సాగు చేస్తున్నారన్న ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం రజనీకుమారి గురువారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హనుమంతునిపాడు మండలంలోని ఉపేంద్రాపురం రెవెన్యూలో వెలిగండ్ల మండలం నరసమాంబాపురం గ్రామానికి చెందిన సర్వేనంబర్ 505 నుంచి 519 వరకు ఉన్న 25 ఎకరాల పట్టా భూములు కోర్టు కేసులో ఉన్నాయి. అయితే ఆ భూముల్లో నరసమాంబాపురం గ్రామానికి చెందిన రైతులు శాగంరెడ్డి రామిరెడ్డి, రమణమ్మ, కర్నాటి ధనమ్మ, రత్తమ్మలు 2024–25లో కంది పంట సాగు చేశారని, ఈ క్రాపు చేసుకోని రైతు భరోసా తీసుకున్నారు. అయితే కోర్టు కేసులో ఉన్న భూముల్లో పంటలు ఎలా సాగు చేశారని పగిడిమర్రి కృష్ణప్రసాద్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ భూములను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ షేక్ జైన్లబ్దీన్, ఏఓలు రమణారావు, వి. రవికుమార్, ఏఏఏలు పాల్గొన్నారు. -
ఎస్బీ డీఎస్పీగా చిరంజీవి
ఒంగోలు టౌన్: స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా టీ చిరంజీవి బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయం నుంచి సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన ఇక్కడకు వచ్చారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఒంగోలు సబర్బన్: ఓటర్ల జాబితా ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయిందని కలెక్టర్ పీ.రాజా బాబు చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్ ) మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన పురోగతిని సమీక్షించారు. జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్ రాజాబాబు వివరించారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయిందని వాటిని సిస్టంలో ఆన్లైన్ చేయాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసును కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మాధురి, జాన్సన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: వికసిత గ్రామీణ భారత్ దిశగా మహిళలే ముందు ఉండాలని కలెక్టర్ పీ.రాజాబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక ఆయన ఛాంబర్లో గురువారం నయీ చేతన్ జెండర్ కాంపెయిన్ పోస్టర్ను కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 23 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక సహకారులుగా మహిళల పాత్ర, సమానత్వం, సమాన అవకాశాలు, భద్రత, పని పంచుకుందాం తదితర అంశాలపై నాలుగు వారాలు మండలం, గ్రామం, గ్రూప్ స్థాయి వరకు సీ్త్ర, పురుషులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. మహిళలు ఆర్థికంగా స్వాతంత్రంగా వారి కుటుంబం, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టరు టి.నారాయణ మాట్లాడుతూ ‘నయీ చేతన’ జెండర్ ప్రచారంలో భాగంగా మహిళా ఆర్థికాభివృద్ధి స్వేచ్ఛగా సంచరించగలిగే వాతావరణం కల్పించడం మహిళల స్వచ్ఛ, సమానత్వం గృహ పనులు పంచుకొనే సంస్కృతి ఏర్పాటు చేయటం, రుణాలు, మార్కెట్లు, సాంకేతిక మౌలిక సదుపాయలకు మహిళలకు ప్రాధాన్యత పెంచటం తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. -
సినిమా ఫక్కీలో బంగారు నగల దొంగ అరెస్టు
ఒంగోలు టౌన్: చార్మినార్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుల కళ్లుగప్పి బంగారు నగల చోరీకి పాల్పడిన తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ కు చెందిన మహమ్మద్ షకీల్ అనే దొంగను రైల్వే పోలీసులు సినిమా ఫక్కీలో అరెస్టు చేశారు. గురువారం జీఆర్పీ పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు సబ్ డివిజన్ డిఎస్ఆర్పీ జి.మురళీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ నెల 13వ తేదీ రాత్రి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఏత్రీ కోచ్లో ఒంగోలు పరిధిలో చోరీ జరిగింది. బెంగళూరుకు చెందిన కేకేఆర్ రెడ్డి హైదరాబాద్ వెళుతుండగా అతడి వద్ద ఉన్న బ్యాగును చోరీ చేశారు. దీంతో బాధితుడు రెడ్డి ఒంగోలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు డీఎస్ఆర్పీ మురళీధర్ మూడు టీంలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒంగోలు జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్ టీం ఒంగోలు నుంచి హైదరాబాద్ వరకు దర్యాప్తు ప్రారంభించింది. నెల్లూరు టీం కావలి నుంచి చెన్నయ్ వరకు దర్యాప్తు మొదలుపెట్టింది. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు చార్మినార్ ఎక్స్ప్రెస్ బీ1 కోచ్లో అనుమానాస్పదంగా తిరగడం షేక్ మౌలా షరీఫ్ బృందం గమనించింది. వెంటనే నిందితుడికి సంబంధించిన వివరాలను నెల్లూరు బృందానికి సమాచారం ఇచ్చారు. నిందితుడు నెల్లూరు రైల్వేస్టేషన్లో దిగి తిరిగి విక్రమ సింహపురి ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. వరంగల్ రైల్వే స్టేషన్లో నిందితుడి ఫొటోలను సీసీ ఫుటేజీ ద్వారా సేకరించారు. ఆ తరువాత హైదరాబాద్ చేరుకున్న నిందితుడు ఒక మోటార్ బైకు మీద వెళ్లడాన్ని గమనించి సీసీ ఫుటేజీ ద్వారా బైక్ నంబర్ను ట్రేస్చేసి నిందితుడి చిరునామాను కనుగొన్నారు. గురువారం విజయవాడలోని ఒక నగల దుకాణంలో ఉన్న నిందితుడు షకీల్ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.4.10 లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ చేశారు. కేసులో అత్యంత చాకచక్యంగా దొంగను పట్టుకొని బంగారు నగలను స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన ఒంగోలు జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్, ఆయన బృందంలోని చీరాల రైల్వే ఎస్సై కొండయ్య, హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, కానిస్టేబుల్ రాము, శ్రీనురాజు, హుసేన్, ప్రదీప్, సమన్వయంతో పనిచేసిన నెల్లూరు టీం సీఐ సుధాకర్ బృందాన్ని డీఎస్ఆర్పీ మురళీధర్ ప్రత్యేకంగా అఽభినందించారు. ఒంగోలు: ఈనెల 30న అండర్ 12 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక మంగమూరు రోడ్డులోని అసోసియేషన్ సబ్ సెంటర్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. 2013 సెప్టెంబర్ 1 – 2015 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులని, ఆసక్తి గల క్రీడాకారులు వైట్ డ్రస్, షూ, సొంత కిట్, జనన ధ్రువీకరణ పత్రం (ఫారం 5), ఆధార్కార్డు, స్టడీ సర్టిఫికెట్తో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు కోచ్ సుధాకర్ సెల్: 9701022333 లేదా బి.చంద్రశేఖర్ సెల్: 9246222999 నంబర్లను సంప్రదించాలని జిల్లా కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ● సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ ఒంగోలు టౌన్: ఎకై ్సజ్ శాఖలో పనిచేస్తున్న ఒక జిల్లా స్థాయి అధికారి తనను మోసం చేసినట్లు చిత్తూరు జిల్లా ఎకై ్సజ్ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఒకరు ‘మోసపోయిన ఓ అభాగ్యురాలు’ పేరుతో లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని ఎకై ్సజ్ శాఖ పోలీస్స్టేషన్లకు ఈ లేఖ అందినట్లు చెబుతున్నారు. ఒంటరి మహిళనైన తనను మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడని, పార్టీలు, విహారయాత్రలకు తిప్పి బదిలీపై వెళ్లి పోయాడని ఆ లేఖలో వివరించింది. ఎక్కడ విధులు నిర్వహిస్తే అక్కడ మహిళలను లోబరుచుకోవడం అతడికి అలవాటుగా మారిందని..ఆరోపించిన సదరు మహిళ గతంలో విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరుల్లో కూడా మహిళలను మోసగించినట్లు ఆరోపించింది. ఒంగోలులో కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నట్లు తెలిపింది. ఇదంతా అవాస్తవం... చిత్తూరు మహిళను మోసగించినట్లు సోషల్ మీడియాలో వచ్చిన లేఖ గురించి సదరు అధికారిని వివరణ కోరగా..అదంతా అవాస్తవమని ఖండించారు. గిట్టని వ్యక్తులెవరో తన మీద ఉద్దేశపూర్వకంగా ఈ లేఖను సృష్టించి ఉంటారని తెలిపారు. -
4న విద్యా సంస్థల బంద్
ఒంగోలు టౌన్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 4వ తేదీ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు స్థానిక ఎల్బీజీ భవనంలో గురువారం విద్యార్థి సంఘాల నాయకులు సమావేశమయ్యారు. బంద్కు సంబంధించి పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు సీహెచ్ వినోద్, పీడీఎస్యూ రాష్ట్ర నాయకుడు ఎల్.రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రభుత్వం నిర్మించకుండా పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పేదలకు నాణ్యమైన వైద్యం, నిరుపేద బిడ్డలకు వైద్యవిద్య అందని ద్రాక్షగా మారుతుందని చెప్పారు. కార్పొరేట్ శక్తులకు సంపద సృష్టించడానికే మెడికల్ కాలేజీలను వారికి అప్పగిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీని నిర్మించి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ కేవలం బోర్డుకు మాత్రమే పరిమితమైందని, నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడంలేదన్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని చెప్పారు. త్రిపుల్ ఐటీ విద్యార్థుల పరిస్థితి త్రిశంఖు స్వర్గంగా మారిందని, సొంత భవనాలు లేక ఆపసోపాలు పడుతున్నారన్నారు. ఆరేళ్ల చదువు పూర్తి చేయాలంటే మూడు ఊర్లు తిరగాల్సిన వింత పరిస్థితి ఉందన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, సంక్షేమ హాస్టళ్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని, అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని నిలిపివేయాలని, కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ జాక్ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రఘురాం, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కె.విజయ్, దేవ, కార్తీక్, పీడీఎస్యూ నాయకులు శ్యాం తదితరులు పాల్గొన్నారు. -
మార్కాపురంలో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
పశ్చిమ ప్రకాశంలో రైతులు మిర్చిని ఎక్కువగా సాగుచేస్తున్నారు. అయితే తాము పండించిన పత్తిని గుంటూరు మార్కెట్యార్డుకు వెళ్లి విక్రయించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దీని వలన రైతులపై అదనపు భారం పడుతోంది. రైతు క్షేమం కోసం మార్కాపురంలోనే మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు ఖర్చులు, కష్టాలు తప్పుతాయి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. – నూనే శివారెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు సంఘం కార్యదర్శి కేజీ పచ్చికాయ రూ.8కి తీసుకుంటున్నారు.. మేము 15 ఎకరాలు కౌలు తీసుకుని నిమ్మ తోట సాగు చేశాం. ఈ ఏడాది నిమ్మ కాయల దిగుబడి బాగా వచ్చింది. కానీ గిట్టుబాటు ధర లేదు. గతంలో ఇదే సీజన్లో కేజీ రూ.30 వరకు అమ్మిన కాయలు.. ఈ ఏడాది కేజీ రూ.8కి కమీషన్ మార్కెట్లో తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా దిగుబడి పెరగడంతో.. ఆ ప్రాంతాల్లో మార్కెట్ లేదని వ్యాపారులు చెప్తున్నారు. దీంతో ఏమీ చేయలేని దిక్కు తోచని స్థితిలో ఉన్నాం. చెట్టు మీద కాయ కోయకపోతే వచ్చే ఏడాది పూత రాదు. దీంతో రైతులు కోత చేస్తున్నారు. ఏడాదికి రూ.6 లక్షలు పెట్టుబడి పెట్టాం. కనీసం వడ్డీలు కూడా రాని పరిస్థితి. దీంతో దిక్కుతోచని దుస్థితిలో ఉన్నాం. ప్రభుత్వం నిమ్మ రైతును ఆదుకోవాలి. – పఠాన్ షారుక్ ఖాన్, తురకపల్లి గ్రామం, హనుమంతునిపాడు మండలం -
కాడి కదలక!
మద్దతు లేక..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నిమ్మ, మిర్చి పంటలు పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఎక్కువగా సాగుచేస్తారు. జిల్లా వ్యాప్తంగా 33,291 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. అందులో ఎక్కవ శాతం మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో ఎక్కువగా సాగవుతోంది. 2019 నుంచి 2024 మధ్య వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మిర్చి రైతుల పంట పడింది. మార్కెట్లో క్వింటా ధర గరిష్టంగా రూ.27 వేలకు వెళ్లింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా ధరలు పతనమయ్యాయి. గత సీజన్లో క్వింటా రూ.8 వేలు కూడా రాలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలా మంది రైతులు అప్పులపాలయ్యారు. గత సీజన్లో సుమారు 65 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రస్తుతం సాగు విస్తీర్ణం దాదాపు సగానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం 33,291 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. ఎకరాకు సుమారు రూ.1.25 లక్షల వరకూ ఖర్చుపెట్టారు. ఎకరాకు సుమారు 11 నుంచి 12 వేల మొక్కలు నాటారు. ఒక్కొక్క మొక్క రూపాయిన్నర ప్రకారం కొనుగోలు చేశారు. దీంతో మొక్కలకే సుమారు ఎకరాకు రూ.15 వేలు రాగా, నల్లతామర తెగులు సోకడంతో పురుగుమందులు వాడుతున్నారు. ఎకరాకు సుమారు రూ.20 వేల వరకూ ఖర్చుచేశారు. అధిక దిగుబడుల కోసం ఒక్కొక్క ఎకరాకు వివిధ రకాలకు చెందిన ఎరువులను 20 బస్తాల వరకూ వేశారు. సగటున రూ.30 వేల వరకూ ఎరువుల కోసం ఖర్చు చేశారు. ఇవి కాక సేద్యపు ఖర్చులు కూడా సుమారు రూ.20 వేల వరకూ వచ్చాయి. దీంతో ఎకరాకు 20 నుంచి క్వింటాళ్ల వరకూ దిగుబడులు వస్తేనే తమకు ఉపయోగమని రైతులు భావిస్తున్నారు. మోంథా తుఫాన్ దెబ్బకు పొలాల్లో నీరునిలబడి చాలా వరకూ పైర్లు దెబ్బతిన్నాయని, నల్లతామర తెగులు సోకడంతో ఎకరాకు 10 నుంచి 15 శాతం వరకూ దిగుబడులు తగ్గవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురంలో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు కొంత మేరుకు ప్రయాణపు ఖర్చులు తగ్గుతాయని రైతు సంఘాల నేతలు అంటున్నారు. -
భారతీయులంతా గర్వపడే రోజు
ఒంగోలు సబర్బన్: భారతీయులంతా భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా గర్వపడే రోజని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నగరంలోని హెచ్సీఎం సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 ఏళ్లు పూర్తయిందన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగంగా కొనియాడుతున్న భారత రాజ్యాంగాన్ని అందరూ స్మరించుకుంటున్నారన్నారు. రాజ్యాంగం గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికీ తెలియాలన్న ఉద్దేశంతో నవంబరు 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, నగర మేయర్ గంగాడ సుజాత, ఒడా చైర్మన్ షేక్ రియాజ్, ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్కుమార్, డీఆర్ఓ చినఓబులేసు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్నాయక్, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజాబాబు ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం -
పీపీపీతో వచ్చే తరాలకు అంధకారమే
మార్కాపురం: మెడికల్ కాలేజీలను, అనుబంధ వైద్యశాలలను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నందుకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగి నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు అన్నారు. మండలంలోని మాల్యవంతునిపాడు, బొడిచెర్ల గ్రామాల్లో బుధవారం రాత్రి కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీలను వారి అనుకూలమైన వారికి దోచిపెట్టేందుకు పీపీపీ విధానం తీసుకునిరావడం అన్యాయమని అన్నారు. 66 ఏళ్లపాటు ప్రభుత్వం లీజుకు ఇవ్వటం దారుణమన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రంతో మాట్లాడి 17 మెడికల్ కాలేజిలను ఒకేసారి రాష్ట్రంలో ప్రారంభించారన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుకానున్న మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో కట్టాలని చూస్తోందని, ఇలా అయితే భవిష్యత్తు తరాల విద్యార్థులకు అన్యాయం చేసిన వారమవుతామని, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కాలేజీలు పూర్తయితే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యతో పాటు ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. పాలకులు పార్టీలకతీతంగా పేద, మధ్య తరగతి వారికి విద్య, వైద్యం అందిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కాలేజీలను పూర్తి చేసేందుకు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి సుమారు రూ.550 కోట్లు ఖర్చుపెట్టకపోవడం కూటమి ప్రభుత్వం వైఫల్యమే అన్నారు. పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పోరెడ్డి చెంచిరెడ్డి, పీఎల్పీ యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ జీ.శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, నల్లబోతుల కొండయ్య, మాల్యవంతునిపాడు సర్పంచ్ జీ.వెంకటేశ్వర్లు, పీ.వెంకటేశ్వరరెడ్డి, పెద్దిరెడ్డి, శేషిరెడ్డి, గంజి శివారెడ్డి, వెంకటరెడ్డి, సత్యంరెడ్డి, వై.గాలిరెడ్డి, రామమహేశ్వరరెడ్డి, వై.శ్రీనివాసరెడ్డి, టీ.వెంకటరెడ్డి, ఏ.శ్రీనివాసులు, కె.దొనకొండయ్య, సుబ్బయ్య, రోశయ్య, పెద్దమల్లయ్య, ఉత్తమ్కుమార్, కె.శ్రీనివాసరెడ్డి, బూదల గురవయ్య, నాదబ్రహ్మం పాల్గొన్నారు. బొడిచర్ల సర్పంచ్ ఎం.కోటేశ్వరి, ఉప సర్పంచ్ బి.నాగమల్లేశ్వరి, ఎంపీటీసీ ఎం.లక్ష్మీదేవి, భవనం వెంకటరామిరెడ్డి, షేక్ మహ్మద్రఫీ, చంద్రశేఖరరెడ్డి, జీ.అనంతరెడ్డి, ఎస్.రామిరెడ్డి, దేవదాసు, నవయ్య, భాస్కర్రెడ్డి, కాశింవలి, బాలిరెడ్డి, పొదిలి శేఖర్, రాజ, రామసుబ్బారెడ్డి, వీరాంజనేయులు, తర్లుపాడు మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు, చదలవాడ రమణారెడ్డి, పలువురు పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అన్నా రాంబాబు వేసి నివాళులర్పించారు. -
స్మార్ట్ మిథ్యాహ్నం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా 2,327 ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 1,35,444 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉంది. అయితే రోజూ సుమారు 87 వేల మంది విద్యార్థులు మాత్రమే భోజన పథకానికి హాజరవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి డొక్కాసీతమ్మ పేరు పెట్టారు. దీని ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సింది పోయి తమ అనుయాయలకు మేలు జరిగే రీతిలో ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్మార్ట్కిచెన్ పేరుతో పార్టీ వారి జేబులు నింపేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి నివేదికలు పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆమేరకు జిల్లా అధికారులు ఆగమేఘాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. పైలట్ ప్రాజెక్టు పేరుతో జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం నియోజకవర్గాల్లో రెండేసి చొప్పున, మిగతా సంతనూతలపాడు, కొండపి, దర్శి, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయనున్నారు. 10 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి 18 రూట్ల ద్వారా 187 పాఠశాలలకు చెందిన 22,031 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసి అందించాలని ప్రతిపాదించారు. ఒక చోట భోజనం తయారు చేసి 1 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులకు భోజనం అందించాలన్నది ప్రభుత్వం ఆలోచన. పైలెట్ ప్రాజెక్టుగా.. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసే స్మార్ట్ కిచెన్ ద్వారా 2 కిలోమీటర్ల పరిధిలోని 21 పాఠశాలలకు భోజనం అందించాలని, త్రోవగుంట జెడ్పీ స్కూల్లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి చుట్టు పక్కల ఉన్న మరో 21 పాఠశాలలకు భోజనం అందించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ రెండు కిచెన్లతో 40 మందికి పైగా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. అలాగే మార్కాపురం, పొదిలి కేంద్రాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల ద్వారా 27 మంది కార్మికులు రోడ్డున పడనున్నారు. ఈ పథకాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తే ప్రభుత్వం ఈ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న వేలాది మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడిపోతాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులకు వేడి అన్నం లేనట్లే... ఎక్కడో 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులకు ఒక చోట భోజనం వండి వాహనాల్లో తీసుకెళ్లి ఇవ్వడం అన్నది వ్యయప్రసాలతో కూడుకుంది. దీనివలన విద్యార్థులకు వేడి అన్నం తినే భాగ్యం లేనట్లే అని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తే తెల్లవారు జామున వంట ప్రారంభిస్తే కానీ విద్యార్థులకు సకాలంలో భోజనం అందించలేని పరిస్థితి. ఇప్పటి దాకా పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్న భోజనం వండేవారు. ఈ పథకాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించేవారు. ఏరోజుకారోజు వండిన ఆహారాన్ని ఉపాధ్యాయులు స్వయంగా రుచి చూసిన తరువాతే విద్యార్థులకు వడ్డించేవారు. ఆహారం నాణ్యత, రుచి గురించి టెస్టింగ్ రిజిస్టర్లో నమోదు చేసేవారు. మెనూ ప్రకారం వంటవండేలా చూసేవారు. ఇప్పుడా పరిస్థితి కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోతుంది. వారు వండిందే వడ్డించే పరిస్థితి ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీని వలన విద్యార్థులకు పౌష్టికాహారం అనుమానమేనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని సంతృప్తి పరచడానికి స్మార్ట్ కిచెన్లు తీసుకొస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఆధారంగా ఉన్న ఈ పథకాన్ని బడా వ్యక్తులకు ఆదాయ వనరుగా ఎందుకు మారుస్తున్నారని నిలదీస్తున్నారు. సొంత పార్టీ నాయకుల బొజ్జలు నింపేందుకే స్మార్ట్ కిచెన్ పథకం రూపకల్పన జరిగినట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రోడ్డున పడనున్న మధ్యాహ్న భోజన కార్మికులు... ఈ స్మార్ట్ కిచెన్లతో వేలాది మంది మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలు రోడ్డున పడే దుస్థితి నెలకొందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం కింద జిల్లాలో మొత్తం 4112 మంది కార్మికులు పనిచేస్తున్నారు. స్మార్ట్ కిచెన్లు అమలైతే పాఠశాలలో ఉన్న వంటశాలలు మూతపడి కార్మికులు ఇంటిదారి పట్టాల్సిందే. వీరిలో 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారున్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికుల పొట్టలు కొట్టి పార్టీ నాయకుల బొజ్జలు నింపేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.


