breaking news
Prakasam District Latest News
-
గంజాయి ముఠా అరెస్టు
● 3.100 కేజీల గంజాయి, రూ.9.06 లక్షల సొత్తు స్వాధీనం సింగరాయకొండ: గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 3.100 కేజీల గంజాయి, రూ.9.06 లక్షల విలువైన వెండి, బంగారు వస్తువులు, వెండి కరిగించే మిషన్, కట్టర్ స్వాధీనం చేసుకున్నట్లు సింగరాయకొండ సీఐ హజరత్తయ్య వెల్లడించారు. మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సీఐ హజరత్తయ్య మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హజంఘడ్ జిల్లా టేక్కా మండలం మెయిన్పూర్ గ్రామానికి చెందిన ముకేష్కుమార్ మద్దిపాడులో నివసిస్తున్నాడు. ఇతనితో పాటు 65 కేసుల్లో ముద్దాయిగా ఉన్న గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఒడ్లమాను శివారెడ్డి, ఒంగోలు లోని 10వ డివిజన్ ఎఫ్సీఐ గోడౌన్ వద్ద ఉన్న ఇందిరమ్మ కాలనీ దగ్గర గుర్రం జాషువా నగర్ లో నివసిస్తున్న ట్రంకు కార్తీక్ లు జరుగుమల్లి మండలం వావిలేటిపాడు అడ్డరోడ్డు వద్ద అనుమానాస్పదంగా ఉండగా వారిని విచారించామన్నారు. ముకేష్కుమార్ మద్దిపాడు జాతీయ రహదారి పై లారీల దగ్గర తక్కువ రేటుకు డీజిల్కొని అమ్మేవాడు. ఆ ఆదాయం చాలకపోవటంతో గంజాయి అమ్మి అధిక లాభాలు పొందాలనే అత్యాశతో లారీ యజమానుల దగ్గర ఒడిశా సరిహద్దుల్లో గంజాయి లభించే మార్గాలను తెలుసుకుని అక్కడికి వెళ్లి కేజీ రూ.10 వేలు చొప్పున తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లు చేసి అమ్మేవాడు. ఇతని వద్ద నుంచి కేజీ రూ.12 వేలకు శివారెడ్డి, కార్తీక్లు కొనుగోలు చేసి వారు కూడా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మేవారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ముకేష్కుమార్ ఒడిశా నుంచి తెప్పించిన 3.100 కేజీల గంజాయిని వీరిద్దరికి ఇచ్చే క్రమంలో పట్టుకుని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. తరువాత వారిని తనిఖీ చేయగా వారి వద్ద నుంచి మోటారుసైకిల్, వెండి కరిగించే మిషన్, సెల్ఫోన్లు, 8 కేజీల బరువున్న 57 వెండి కడ్డీలు, 9 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. వీరిలో శివారెడ్డి పై ఒంగోలు తాలూకా, హెచ్ఎంపాడు, పొన్నలూరు, జరుగుమల్లి, కొండపి, వెలిగండ్ల మండలాల్లో సుమారు 65 కేసులు ఉన్నాయన్నారు. వీరి పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు సీఐ వివరించారు. ఈ సందర్భంగా సీఐ హజరత్తయ్య, జరుగుమల్లి ఎస్సై బీ మహేంద్ర, సిబ్బంది అమీర్జాన్, నరశింహ, శివకుమార్, నాగూర్వలీ, సీసీఎస్ సిబ్బందిని ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. -
అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు వన్టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ డీ జయ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత గురుకులాల్లో దరఖాస్తులను విద్యార్థులు సమర్పించాలన్నారు. దరఖాస్తులు సమర్పించే విద్యార్థినీ, విద్యార్థులు 10వ తరగతిలో ప్రవేశాలకు 9వ తరగతిలో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రవేశాలు పొందగోరే వారు మొదటి సంవత్సరంలో 50 శాతానికి పైగా మార్కులు సాధించి ఉండాలని చెప్పారు. కుల ప్రాతిపదికన రోస్టర్ విధానంలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారన్నారు. ఈ నెల 16వ తేదీలోపు సంబంధిత పాఠశాల, కళాశాలలో దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుందన్నారు. మద్యం బాటిళ్లు పట్టివేత ● ముగ్గురిపై బైండోవర్ కేసులు నమోదు బేస్తవారిపేట: మండలంలోని పాత మల్లాపురం, శింగరపల్లెలో బెల్ట్షాపులపై కంభం ప్రొహిబిషన్–ఎకై ్సజ్శాఖ సీఐ కొండారెడ్డి తనిఖీలు నిర్వహించారు. సోమవారం సాక్షిలో ‘ఊరూరా ఎల్లో బెల్ట్’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. పాత మల్లాపురంలో 15 మద్యం క్వార్టర్ బాటిళ్లు కలిగిన కే దాయదును పట్టుకున్నారు. శింగరపల్లెలో పేరయ్య, గోవిందరెడ్డిలను అదుపులోకి తీసుకుని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేయించారు. యువతను మోసం చేస్తే ఊరుకునేది లేదు ● కూటమి ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ హెచ్చరిక ఒంగోలు టౌన్: గత ఎన్నికలకు ముందు కూటమి నాయకులు విద్యార్థులు, యువతకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఏడాది పాలన పూర్తి చేసుకున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ప్రభాకర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం యువతను మోసం చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాని డిమాండ్ చేశారు. ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇవ్వాలని, అన్నీ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించి అభివృద్ధి చేయాలని, 26 జిల్లాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పారు. అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఆర్.కరుణానిధి మాట్లాడుతూ కనిగిరి నిమ్జ్, దొనకొండలో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బి.రాంబాబు, గోపి, మత్తయ్య, శాంబాబు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.100 కోట్ల భూమి అన్యాక్రాంతం
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని పాత కూరగాయల మార్కెట్ వద్ద దాదాపు రూ.100 కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతం అయిందని వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ షేక్ ఇమ్రాన్ ఖాన్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణకు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లో మీ కోసం కార్యక్రమానికి ఒంగోలు నగరపాలక సంస్థకు చెందిన వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్, కార్పొరేటర్లు జి.ప్రవీణ్ కుమార్, వెన్నపూస కుమారి, కో–ఆప్షన్ సభ్యులు రషీదా, శ్యామ్ సాగర్లు ఇన్చార్జ్ కలెక్టర్ను కలిశారు. పాత మార్కెట్ స్థలం అన్యాక్రాంతంపై ఈ ఏడాది జూన్ 29న సాక్షిలో శ్రీభూదందాశ్రీ శీర్షికతో కథనం ప్రచురితమైందని ఆ పేపర్ క్లిప్పింగ్ను కూడా అందజేశారు. ఆ విషయమై విచారించామని సుమారుగా రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిందని నిర్ధారించినట్లు వివరించారు. ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులను వాటికి సంబంధించిన లీజు ప్రక్రియ ఆధారాలు అడిగినా సరైన సమాధానం చెప్పలేదన్నారు. ఈ భూమిని అధికార టీడీపీకి చెందిన ఓ నాయకుడుకి తాత్కాలిక లీజుకు ఇచ్చినట్లు తెలిపిందన్నారు. రోడ్డు మార్జిన్లో తాత్కాలికంగా పందిళ్లు, చలువ పందిళ్లు, రేకుల గుడారాలు వేసుకునేందుకు టౌన్ ప్లానింగ్ వారు ఒక వారానికి పరిమితంగా 10 చదరపు మీటర్లకు రూ.100 లు చొప్పున రుసుము వసూలు చేయటానికి సంబంధించిన సాధారణ అనుమతి మాత్రమే ఇచ్చారన్నారు. సర్వే నం.77, బ్లాకు నం.4, వార్డు నం.3లో 83 సెంట్ల స్థలంలో సంవత్సరం లీజుకు తాత్కాలిక అనుమతులు ఇస్తే దాదాపు రూ.25 లక్షలకు పైగా వెచ్చించి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని ఇన్చార్జ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ కౌన్సిల్ సమావేశంలో ఎటువంటి తీర్మానం చేయకుండానే టీడీపీ నాయకులకు మేలు చేసేలా అధికారులు తెగబడ్డారన్నారు. సాధారణ ఓపెన్ ఆక్షన్, టెండర్ జరిపితే దాదాపుగా ఈ స్థలానికి రూ.5 లక్షలు ప్రతినెలా అద్దె లీజు రూపంలో నగరపాలక సంస్థకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. కానీ కేవలం రూ.33,600 ఒక సంవత్సరం పాటు లీజుకు ఇవ్వటం అత్యంత హేయమైన చర్య అన్నారు. ఈ స్థలాన్ని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కమర్షియల్ కాంప్లెక్సుగా మార్చి అభివృద్ధి చేయాలని యత్నించి డిజైన్ల కోసం సీబీఆర్ఈ అనే సంస్థకు పంపారని గుర్తు చేశారు. ఇంజినీరింగ్ విభాగం నుంచి ప్రభుత్వానికి అనుమతి కోసం వెళ్లిందన్నారు. ఈ స్థలానికి సంబంధించిన తాత్కాలిక అనుమతులు తొలగించి ఒంగోలు నగరపాలక సంస్థ స్వాధీన పరచుకొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ సీరియస్ అయ్యారు. వెంటనే దీనిపై విచారణ కోసం ఒంగోలు తహశీల్దార్, నగర కమిషనర్, మున్సిపల్ సర్వేయర్తో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. మంగళవారం సాయంత్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సాధారణ లీజు పొంది శాశ్వత నిర్మాణాలు చేపడుతున్న అధికార పార్టీ నాయకులు వారితో ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు కుమ్మక్కు మీ కోసంలో ఇన్చార్జ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అన్యాక్రాంతంపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటురూ.కోట్ల విలువైన ఆస్తులు కబ్జాలకు ఆస్కారం ఒంగోలు నగరంలోని రూ.కోట్ల విలువైన ఆస్తులను టీడీపీ కూటమి ప్రభుత్వం కబ్జాలకు ఆస్కారం ఇస్తోందని వైఎస్సార్సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నగరంలోని పాత కూరగాయల మార్కెట్ స్థలం కబ్జాకు గురైందని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్కు మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారన్నారు. వైఎస్సార్సీపీ ఇలాంటి వాటిని ప్రోత్సహించదన్నారు. ప్రజల ఆస్తులు అన్యాక్రాంతం కావటాన్ని సహించేది లేదన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు. -
షాపులకు సీళ్లు
కూరగాయల మార్కెట్లో ఒంగోలు సబర్బన్: కొత్త కూరగాయల మార్కెట్ దుకాణదారులపై వేధింపులు ఆగటం లేదు. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు మార్కెట్పై దాడులు చేయటం పనిగా పెట్టుకున్నారు. సోమవారం పోలీసులను తీసుకొని కూరగాయల మార్కెట్లోని హోల్సేల్, రిటైల్ షాపులపై దాడులకు దిగారు. అద్దె బకాయిల పేరుతో నిత్యం వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం హోల్సేల్ షాపుల్లో 8 షాపులకు సీళ్లు వేశారు. అప్పటికప్పుడు రూ.లక్ష చొప్పున కట్టిన మూడు షాపులకు సీళ్లు తొలగించారు. రిటైల్ షాపులకు 15కు పైగా వేశారు. ఈ విధంగా మార్కెట్ని షాపులపై దాడులు చేయటంతో వ్యాపారులు బెంబేలెత్తారు. పాలకులు, అధికారులు చేసిన పాపానికి కూరగాయల మార్కెట్లోని షాపుల లీజుదారులు అల్లాడిపోతున్నారు. రిటైల్, హోల్సేల్ కలిపి దాదాపు 23 షాపులకు సీల్ మూడు షాపులకు ఒక్కొక్కరు రూ.లక్ష కడితే సీళ్లు తెరచిన అధికారులు -
కూటమి పార్టీల్లో ఆధిపత్య పోరు.!
సాక్షి ప్రతినిధి ఒంగోలు: దర్శి కేంద్రంగా కూటమి పార్టీల్లో ఆధిపత్య పోరు ఊపందుకుంది. దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవి విషయంలో కూటమి పార్టీలైన టీడీపీ–బీజేపీ మధ్య అగ్గి రాజుకుంది. ఈ పదవిని టీడీపీకి చెందిన ఓసీ మహిళకు కేటాయించేందుకు ఎస్సీ రిజర్వేషన్ను సైతం టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి మార్పించారు. టీడీపీకి చెందిన దారం సుబ్బారావు సతీమణి, దర్శి 19వ వార్డు కౌన్సిలర్ దారం నాగవేణి పేరును ప్రకటించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాగవేణి కోసం ఎస్సీలకు కేటాయించిన సీటును మార్పించి ఎస్సీలకు అన్యాయం చేశారు. కానీ, బీజేపీ నేతలు పావులు కదిపి ఆ పార్టీ నాయకుడు మాడపాకుల శ్రీనివాసులు భార్య నారాయణమ్మకు దర్శి ఏఎంసీ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. ఆ మేరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే, తాజాగా బీజేపీకి కేటాయించిన దర్శి ఏఎంసీ చైర్మన్ పదవిని మళ్లీ టీడీపీకే కట్టబెట్టారు. జీవో సవరణ పేరుతో గతంలో ప్రకటించిన మాడపాకుల నారాయణమ్మ పేరు మార్చి దారం నాగవేణికి చైర్మన్ పదవిస్తూ జీవో సవరణ చేశారు. దీంతో బీజేపీ నేతలకు టీడీపీ నేతలు షాక్ ఇచ్చినట్లయింది. మంత్రుల ద్వారా పావులు కదిపిన గొట్టిపాటి లక్ష్మి... బీజేపీ నాయకులు అనూహ్యంగా ఏఎంసీ చైర్మన్ పదవి దక్కించుకోగా, ఆ ఉత్తర్వులు మార్పించేందుకు మంత్రుల ద్వారా పావులు కదిపి గొట్టిపాటి లక్ష్మి సక్సెస్ అయ్యారు. బీసీ కులానికి చెందిన బీజేపీ నాయకుని భార్య మాలపాకుల నారాయణమ్మ పేరును చైర్మన్ పదవికి ఖరారు చేస్తూ జీవో విడుదలైంది. దీంతో తమకు మాట ఇచ్చి వేరొకరికి పదవి కట్టబెట్టడంపై గొట్టిపాటి లక్ష్మిని నాగవేణి వర్గీయులు, టీడీపీ నేతలు గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా గొట్టిపాటి లక్ష్మి పేరు మార్పు చేయించినట్లు సమాచారం. సోమవారం గుంటూరు మార్కెట్ యార్డ్లోనే ఈ మార్పు చేయించి సంబంధిత ఉత్తర్వుల కాపీ తీసుకున్న తర్వాతే గొట్టిపాటి లక్ష్మి దర్శి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మండిపడుతున్న ఎస్సీ, బీసీలు... సోమవారం కురిచేడు మండలం కల్లూరు వద్ద విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభానికి గొట్టిపాటి లక్ష్మి రావాల్సి ఉండగా, పేరు మార్చిన జీవో కాపీ చేతికి వచ్చిన తర్వాతే దర్శి వస్తానని పట్టుబట్టింది. ఆ జీవో తీసుకున్న తర్వాతే గొట్టిపాటి లక్ష్మి దర్శి వచ్చారని దర్శి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, నియోజకవర్గంలో ఎస్సీలకు కేటాయించిన సీటును కాదని ఓసీలకు మార్చారని, ఆ తర్వాత అధిష్టానం బీసీలకు కేటాయిస్తే వారికి కూడా దక్కనీయకుండా ఓసీలకు కట్టబెట్టడంపై ఎస్సీలు, బీసీలు మండిపడుతున్నారు. తమది బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ.. ఇప్పుడు బీసీలకు తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి బీజేపీ నేతలు... ఏఎంసీ చైర్మన్ పదవికి పేరు మార్చడంపై దర్శి బీజేపీ నేతలు వెంటనే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ని కలిసినట్లు తెలిసింది. తమకు జరిగిన అన్యాయాన్ని వారు వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు రాష్ట్ర అధ్యక్షుడు స్పందిస్తూ మరో పదవి ఇప్పించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా.. వచ్చేసారైనా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తమకు లభించేలా చేయాలని కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీకి ఇచ్చిన ఒక్క పదవి కూడా వారికి దక్కకుండా టీడీపీ నేతలు పేరు మార్చడంతో తామంతా పార్టీకి కష్టపడి పనిచేయడం ఎందుకని బీజేపీ నేతలు ఆవేదన వెల్లగక్కుతున్నారు. ఈ విషయంపై బీజేపీ నాయకుడు, మాడపాకుల నారాయణమ్మ భర్త శ్రీనివాసులను సాక్షి ప్రతినిధి సంప్రదించగా, తామంతా కూటమిలో భాగస్తులమని, గత ఎన్నికల్లో కూటమికి కష్టపడి పనిచేశామని చెప్పారు. తమకు వచ్చిన అవకాశాన్ని దక్కకుండా మార్పు చేయడం తమను ఎంతో బాధిస్తోంన్నారు. అధికారికంగా ఇచ్చిన జీవోలో సునాయాసంగా పేర్లు మార్పు చేయించడంపై అసహనం వ్యక్తం చేశారు. దర్శి ఏఎంసీ చైర్మన్ పదవి సాక్షిగా బహిర్గతం బీజేపీపై నెగ్గిన టీడీపీ పంతం టీడీపీకి చెందిన నాగవేణికే ఏఎంసీ చైర్మన్ పదవి తొలుత బీజేపీకి చెందిన నారాయణమ్మకు కేటాయిస్తూ ఉత్తర్వులు పంతానికి పోయి ఉత్తర్వులు మార్పించిన టీడీపీ దర్శి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి భగ్గుమంటున్న బీజేపీ నేతలు -
బరితెగించిన గ్రావెల్ మాఫియా
బేస్తవారిపేట: అధికార పార్టీ నేతల అండతో గిద్దలూరు నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమార్కులు చెలరేగుతున్నారు. ఇప్పటికే పెంచికలపాడు సమీపంలోని చెరువు మట్టిని బేస్తవారిపేట, కొమరోలు, గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో ఇటుకల బట్టీలకు నిరంతరం తరలిస్తున్నారు. తాజాగా జగనన్న కాలనీ వద్ద ఉన్న కొండపై అక్రమార్కుల కన్ను పడింది. అనుమతి తీసుకోకుండా యథేచ్ఛగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మండల స్థాయి అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి గ్రావెల్ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం సమీపంలో ఉన్న జగనన్న కాలనీ పైఎత్తున ఉన్న కొండపై అక్రమార్కులు కన్నేశారు. గత మూడు రోజులుగా ప్రభుత్వ భూముల్లో రెండు జేసీబీలతో గ్రావెల్ తవ్వి, 20 ట్రాక్టర్లతో దర్జాగా తరలిస్తున్నారు. రెండో శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో అక్రమార్కులకు అడ్డులేకుండాపోయింది. సోమవారం అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. అక్రమంగా మట్టి తరలిస్తున్నారని మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే శ్రీమా వద్ద స్టాఫ్ ఇద్దరే ఉన్నారు.. మేము ఎక్కడికని రావాలి.. స్థానికంగానే అడ్డుకోండిశ్రీ అని సెలవిచ్చారని మోక్షగుండం గ్రామస్తులు తెలిపారు. వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికై న రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుని మట్టి అక్రమ రవాణాను అడ్డుకుని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని మోక్షగుండం, పందిళ్లపల్లె గ్రామస్తులు కోరుతున్నారు. బేస్తవారిపేట మండలం మోక్షగుండం సమీపంలో కరిగిపోతున్న కొండ 2 జేసీబీలు, 20 ట్రాక్టర్లతో గ్రావెల్ అక్రమ రవాణా 3 రోజులుగా దోచేస్తున్నా చోద్యం చూస్తున్న అధికారులు -
బడిలో అవినీతి బాగోతం
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఆర్వో ప్లాంట్ నిర్వహణ, మధ్యాహ్న భోజనం నిర్వహణలో జరుగుతున్న అవినీతి బాగోతం బట్టబయలైంది. పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం అమలుతీరుపై పరిశీలించేందుకు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నాగూర్ ఖాన్ రాగా అక్కడ జరుగుతున్న అక్రమాలు బయటకు వచ్చాయి. రికార్డులు పరిశీలించగా రిజిస్టరులో నమోదు చేసిన బియ్యానికి, వంట మనుషుల వద్ద ఉన్న బియ్యానికి తేడా రావడంతో హెచ్ఎం శ్రీదేవిని ప్రశ్నించారు. దీంతో ఆమె హడావుడిగా రిజిస్టర్లను దిద్దటానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాను పిలిపించి జరుగుతున్న అక్రమాలను వెల్లడించారు. పాఠశాలలో సుమారు 802 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి అవసరమైన సుమారు 120 కిలోల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉండగా కేవలం 70 కిలోలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. కోడిగుడ్లు కూడా సక్రమంగా అందించకుండా బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారన్నారు. విద్యార్థులకు అవసరమైన మంచినీటి కోసం పాఠశాలలో ఆర్ఓ ప్లాంటును ఏర్పాటు చేశారు. అయితే గతేడాది ప్రభుత్వం నిర్వహణ నిమిత్తం లక్ష రూపాయలు మంజూరు చేయగా కేవలం రూ.10 వేలు ఖర్చుపెట్టి రూ.90 వేలు తన సొంతానికి వాడుకున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన మెనూ రికార్డులను తనముందే తారుమారు చేస్తున్నట్లు గుర్తించారన్నారు. రికార్డులకు సంబంధించిన రిజిస్టరును విలేకరుల ఎదుట చూపారు. పదో తరగతి పాసైన విద్యార్థుల నుంచి వారికి కావాల్సిన టీసీలు, మార్కు లిస్టులు తదితరాలు ఇచ్చేందుకు రూ.500 వసూలు చేస్తున్నారని తెలిపారు. హెచ్ఎం శ్రీదేవిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కలెక్టర్, సబ్కలెక్టర్ విచారణ చేపట్టాలని కోరారు. సబ్కలెక్టర్ విచారణ: జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యాకమిటీ చైర్మన్ ఆరోపణలపై మార్కాపురం సబ్కలెక్టర్ త్రివినాగ్, తహశీల్దార్ చిరంజీవి పాఠశాలకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేశామని, నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తహశీల్దార్ తెలిపారు. బట్టబయలు చేసిన పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ ఆర్ఓ ప్లాంటు మరమ్మతుల పేరుతో రూ.90 వేలు స్వాహా బియ్యం పంపిణీలో చేతివాటం అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థినులు సబ్కలెక్టర్ విచారణ -
నాయకత్వంపై హెచ్ఎంలకు శిక్షణ
పొదిలి: జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. పొదిలిలోని జోసఫ్ శ్రీహర్ష అండ్ ఇంద్రజ మేరీ ఎడ్యుకేషనల్ సొసైటీ కళాశాలలో నాలుగు రోజుల శిక్షణను మార్కాపురం డీవైఈఓ మామిళ్లపల్లి శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాలల్లో అమలు చేయాలని కోరారు. కోర్సు డైరెక్టర్గా మర్రిపూడి ఎంఈఓ రంగయ్య వ్యవహరించారు. శిక్షణ ఉద్దేశాలను వివరించారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి డి.నాగరాజు, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎం.జాలరత్నం, ఎంఈఓ యు.శ్రీనివాసులు, 289 పాఠశాలల హెచ్ఎంలు, 9 మంది మాస్టర్ ఫెసిలిటేటర్స్ పాల్గొన్నారు. పోలీసు గ్రీవెన్స్కు 94 ఫిర్యాదులు ఒంగోలు టౌన్: ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 94 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు పోలీసు అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. ఫిర్యాదులను స్వీకరించిన ఉన్నతాధికారులు ఆయా స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఎస్సీఎస్టీ సెల్ సీఐ దుర్గాప్రసాద్, డీటీసీ సీఐ షమీముల్లా, పీజీఆర్ఎస్ ఎస్సై జనార్దనరావు పాల్గొన్నారు. గ్రానైట్ గనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి చీమకుర్తి రూరల్: గ్రానైట్ గనుల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సూచించారు. సోమవారం చీమకుర్తి మండలంలోని పలు గ్రానైట్ గనులు, పరిశ్రమలను ఎస్పీ దామోదర్తో కలిసి ఐజీ సందర్శించారు. భద్రతా ప్రమాణాలపై పలు సలహాలు, సూచనలు చేశారు. ముందుగా చీమకుర్తి పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్ గనులు, పరిశ్రమలలో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అధిక సంఖ్యలో ఉండటంతో ఎక్కువ నేరాలు జరిగే అవకాశం ఉందన్నారు. ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. చీమకుర్తి సీఐ సుబ్బారావు, ఎసైలు కృష్ణయ్య, హరిబాబు, శివరామయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
రాజీకీయాలు!
కబ్జా తమ్ముళ్లు ..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు ఎడాపెడా భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అది ప్రభుత్వ, ప్రైవేటు భూమా అన్న తేడా లేకుండా భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో ఈ బెడద ఎక్కువగా ఉంది. ఏడాది కాలంలోనే ఒంగోలు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువ చేసే ఐదు భూ వివాదాలను పరిష్కరించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల నగరంలో జరిగిన ఒక భూ వివాదానికి సంబంధించిన పరిష్కారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన కీలక నేత నేరుగా రంగంలోకి దిగి పంచాయితీలు చేస్తుండడంతో కింది స్థాయి నాయకులు సైతం బరితెగిస్తున్నారు. పచ్చ గద్దల భూ మాయాజాలాన్ని చూసి నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. శివారు భూ వివాదంలో.. నగర శివారులోని ఓ భూమిపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తెరవెనుక మంత్రాంగం నడిపినట్టు సమాచారం. టీడీపీ కీలక నేత సమక్షంలో పంచాయితీ జరిగిందని తెలిసింది. దీంతో ఆస్థలం కొనుగోలు చేసిన వ్యక్తి సదరు నేతకు ఎకరం భూమి గిఫ్ట్గా ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే కేసులో కొంత మంది పోలీసు అధికారులకు సైతం పెద్ద ఎత్తున తాయిలాలు అందినట్టు సమాచారం. ఉర్దూ స్కూలును పడగొట్టి: పాత మార్కెట్ సమీపంలోనే ఉర్దూ స్కూలును 1938లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పదేళ్లుగా ఈ స్కూలు శిథిలావస్థకు చేరుకుంది. దీని విస్తీర్ణం 23 సెంట్లు కాగా ఇక్కడ గది రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంది. రూ.35 కోట్లకు పైగా విలువ చేసే ఉర్దూ స్కూలు భూమి మీద కన్నేసిన పచ్చదండు ఎలాగైనా సరే కబ్జా చేసేందుకు పావులు కదిపారు. ఉర్దూ స్కూలును నేలమట్టం చేసేందుకు మే 2వ తేదీ జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. జూలై 1వ తేదీ గుట్టుచప్పుడు కాకుండా ఉర్దూ స్కూలును నేలమట్టం చేశారు. ఇక్కడ టీడీపీకి చెందిన ఒక వ్యాపారవేత్త పెట్రోలు బంకు ఏర్పాటుకు యత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లీజు పేరుతో తక్కువ ధరకే ఈ భూమిని కాజేయాలని చూస్తున్నారని ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలోనూ కీలక నేతకు భారీగా ముడుపులు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ముక్తినూతలపాడు భూ కబ్జాకు ప్రయత్నం... నగర శివారులోని ముక్తినూతలపాడు పంచాయతీ సర్వే నంబర్ 15లో 21.60 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కీలక నేత అనుచరులు ప్రయత్నించడం వివాదంగా మారింది. ఈ భూమిలో 5.60 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆక్రమించారు. మార్కెట్లో దీని విలువ ఎకరం రూ.6 కోట్లు పైగానే ఉంది. 5.60 ఎకరాలు అంటే స్థలం విలువ సుమారు రూ.36 కోట్లు పైమాటే. కీలక నేత అండదండలతో ఒంగోలు కమ్మపాలేనికి చెందిన ఒక టీడీపీ నాయకుడు, ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన మరో టీడీపీ నాయకుడు కలిసి ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమి రికార్డుల్లో కుంట భూమిగా నమోదై ఉంది. దీనిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంటి స్థలాల కింద పంపిణీ చేయాలని జాన్ ప్రభాకర్ అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేశారు. కబ్జాకు గురైన స్థలాన్ని సందర్శించిన వైఎస్సార్ సీపీ నాయకులు ఈ భూమిని కాపాడాలంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నగరంలోని దత్తాత్రేయ కాలనీ ఎదురుగా ఉన్న 1.36 ఎకరాల అసైన్మెంట్ స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేసి అమ్మకాలు చేపట్టడం విమర్శల పాలైంది. ఈ భూమి విలువ సుమారుగా రూ.5 కోట్లకు పైగానే ఉంది. దీనిలో ప్లాట్లు వేసి పిల్లర్లు వేసి నిర్మాణాలు చేపట్టడం పచ్చదండు బరితెగింపునకు నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. కేశవరాజు కుంట వద్ద సర్వే నంబర్ 81లోని ప్రభుత్వ స్థలాన్ని సైతం పచ్చ మాఫియా కబ్జా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.రూ.వంద కోట్ల ప్రభుత్వ భూమిపై కన్ను... నగరం నడిబొడ్డున పాత కూరగాయల మార్కెట్ వద్ద 83 సెంట్ల ప్రభుత్వ స్థలంపై టీడీపీ యువనేత ఒకరు కన్నేశారు. 15 సెంట్ల స్థలానికి నగర పాలక సంస్థ నుంచి తాత్కాలిక ఒప్పందం మీద అనుమతులు తీసుకున్నారు. నగర పాలక సంస్థ ఇచ్చిన అనుమతుల ప్రకారం ఆ స్థలంలో ఎలాంటి కట్టడాలు నిర్మించడానికి వీలులేదు. నిబంధనలు బేఖాతరు చేస్తూ రెస్టారెంట్ ఏర్పాటుకు భారీ స్థాయిలో కట్టడాలు చేస్తున్నారు. ఇక్కడ గది రూ.25 లక్షల వరకు ఉంది. ఆ లెక్కన చూస్తే ఈ భూమి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇంత ఖరీదైన స్థలాన్ని దొడ్డిదారిన కాజేయడానికి పక్కా ప్రణాళికతోనే నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. -
వైఎస్సార్ విగ్రహం తొలగింపునకు కుట్ర
మార్కాపురం టౌన్: పెద్దారవీడు మండలంలోని హనుమాన్ జంక్షన్(కుంట) సెంటర్లో సుమారు 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించేందుకు చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని వైఎస్సార్ సీసీపీ నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ త్రివినాగ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. గుంటూరు, కర్నూలు బైపాస్ రోడ్డు ఏర్పాటుకు ఎటువంటి ఆటంకం లేకపోయినా వైఎస్సార్ విగ్రహన్ని తొలగించాలని అధికారులతో కలిసి కొందరు రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విగ్రహాన్ని తొలగించాలని చూడటం మంచి పద్ధతి కాదన్నారు. అర్జీ ఇచ్చినవారిలో సర్పంచ్ మల్లేశ్వరి, నాయకులు లక్ష్మీనారాయణ, మేకల కాశయ్య, ఎస్కె నూర్ అహ్మద్, రామచంద్రుడు, నారాయణ, దానం, సుబ్బారావు, నాగార్జునరెడ్డి, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు. సబ్ కలెక్టర్కు వైఎస్సార్ సీపీ నేతల అర్జీ -
ప్రకాశం
37 /297గరిష్టం/కనిష్టంగ్రావెల్ తవ్వకాల్లో బరితెగింపు బేస్తవారిపేట మండలం మోక్షగుండం సమీపంలోని కొండను తవ్వి గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారు. 2 జేసీబీలు, 20 ట్రాక్టర్లతో గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నారు. అరకొర నిధులు..పనులు సాగర్ కాలువల మరమ్మతుల విషయంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అరకొర నిధులివ్వడంతో కాలువల మరమ్మతు పనులు కూడా అరకొరగానే చేశారు. – వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు పడవచ్చు.మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025– 8లో.. -
‘గ్రామ సమాఖ్య’ స్ఫూర్తికి విఘాతం
బేస్తవారిపేట: టీడీపీ నాయకుల ఒత్తిడితో అక్రమంగా వీఓఏలను తొలగించిన అధికారులు తాజాగా గ్రామ సమాఖ్య కమిటీలను ఇష్టారీతిగా మార్చడం చర్చనీయాంశమైంది. రూల్స్ పుస్తకాల్లో ఉంటాయి.. కానీ తమకు వర్తించవు, తాము పాటించము అన్నట్లు ఉంది వెలుగు కార్యాలయ సీసీలు వ్యవహార శైలి. వివరాల్లోకి వెళ్తే.. బేస్తవారిపేట మండలంలోని వంగపాడు, ఖాజీపురం, ఎంపీ చెరువు గ్రామ సమాఖ్య కమిటీలను గుట్టుచప్పుడు కాకుండా తొలగించి కొత్త కమిటీలను తెరపైకి తీసుకొచ్చారు. సాధారణంగా ఒక్కో గ్రామ సమాఖ్య కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఏపీ పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం బైలా నిబంధనల ప్రకారం సభ్యుల తొలగింపునకు 30 రోజులు ముందుగా నోటీసులు ఇచ్చి గ్రామ సమాఖ్య సమావేశం నిర్వహించాలి. ఏటా 3తో భాగించబడే పాలకవర్గ సభ్యులు పదవీ విరమణ చేయగా.. కొత్తవారిని నియమించడం లేదంటే వారినే ఎన్నుకోవాలన్నది నిబంధన. ఎప్పటికీ ఐదుగురు సభ్యులను ఒకేసారి తొలగించకూడదనే నిబంధన సైతం బైలాలో పొందుపరిచారు. కొత్తగా ఇద్దరిని మాత్రమే గ్రామ సమాఖ్య కమిటీలోకి తీసుకోవాలని బైలాలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ పాత కమిటీ సభ్యులకు తెలియకుండానే వెలుగు సీసీలు నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఐదుగురు సభ్యులను కొత్తవారిని ఎన్నుకున్నట్లు సీసీ సంబంధిత బ్యాంకు మేనేజర్కు లెటర్ ఇవ్వడంతో బ్యాంకులో నూతన కమిటీ సభ్యులతో బ్యాంక్ ఖాతా నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో గ్రామ సమాఖ్యలో ఉన్న నగదు విత్డ్రా చేశారు. ఆ డబ్బు ఏమైందో తెలియడం లేదని పాత కమిటీ సభ్యులు వాపోతున్నారు. గ్రామ సమాఖ్య కమిటీ సభ్యుల అడ్డగోలు తొలగింపుపై వంగపాడు గ్రామానికి చెందిన పాత కమిటీ సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. బైలాను తుంగలో తొక్కి ఇష్టారీతిగా కమిటీల మార్పు సమాఖ్య నిధుల దోపిడీకి స్కెచ్ -
దేవుడి పేరుతో వేలంపాటలు..
జిల్లాలో అనేక గ్రామాల్లో దేవుడి పేరుతో బెల్టు షాపులను వేలం పాటలు వేస్తారు. గిద్దలూరు నియోజకవర్గంలోని 15 గ్రామాల్లో వేలంపాట పెట్టుకొని బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. బేస్తవారిపేట మండలంలోని పెద్ద ఓబినేనిపల్లె, చిన ఓబినేనిపల్లె, జేసీ అగ్రహారం, ఎంపీ చెరువు, బసినేపల్లి, గంటాపురం, కొత్తపేట, పీవీపురం, గలిజేరుగుళ్ల, పూసలపాడు గ్రామాల్లో దేవుడి పేరుతో వేలం పాటలు వేసి బెల్టు షాపులు దక్కించుకున్నారు. ఒక్కో గ్రామానికి అక్కడి జనసాంద్రత, ఆర్థిక స్థితిగతులను బట్టి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వేలం పాడుకున్నట్లు తెలుస్తోంది. గిద్దలూరు మండలం సంజీవరాయునిపేటలో రూ.2.5 లక్షలకు వేలం పాడినట్లు సమాచారం. మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం తుమ్మల చెరువులో పీర్ల పండుగ సందర్భంగా వేలం పాట నిర్వహించారు. కేవలం మూడు రోజులకు గాను రూ.3 లక్షలకు పాట పాడినట్లు ప్రచారం జరుగుతోంది. సింగరాయకొండ మండలంలోని మత్స్యకార గ్రామాల్లో కూడా వేలం పాటలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పాకల, ఊళ్లపాలెం గ్రామాల్లో వేలం వేసి వచ్చిన సొమ్ముతో గ్రామాభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక్కడ రూ.5 నుంచి రూ.15 లక్షల వరకు వేలం పాట వేసినట్లు తెలుస్తోంది. వేలం పాటలో బెల్టు షాపులు దక్కించుకున్న వారు మాత్రమే ఇక్కడ మద్యం విక్రయించాలి. బాటిల్ మీద రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేసే అధికారం కూడా నిర్వాహకుడికి ఉంటుంది. -
మద్యం విక్రయ కేంద్రాలుగా మారిన దాబా హోటళ్లు...
రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న దాబా హోటళ్లలో నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో ఎటు చూసినా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పక్కన అనేక దాబా హోటళ్లు వెలిశాయి. రాత్రయితే చాలు దాబా హోటళ్లు మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ వారు తాగి తందనాలాడటానికి సిటింగ్ ఏర్పాటు ఉండడంతో మందుబాబులకు అడ్డాగా మారాయి. దీంతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఒంగోలు నగర శివారులో వెంగముక్కలపాలేనికి వెళ్లే దారిలో ఉన్న ఒక దాబాలో అర్ధరాత్రి జరిగిన గొడవ రణరంగాన్ని తలపించింది. బిల్లు చెల్లించే విషయంలో హోటల్ నిర్వాహకులు, కస్టమర్లకు మధ్య చోటుచేసుకున్న వివాదం చినికి చినికి గాలివానగా మారి ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు చితక్కొట్టుకున్నారు. దాబా హోటళ్లు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలో మద్యం తాగే ఏర్పాటు చేయడం, అర్ధరాత్రి వరకు హోటళ్లు నిర్వహించడం, మద్యం తాగే వారికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడం, మందుబాబులకు సిట్టింగ్ ఏర్పాటు చేయడం లాంటివి జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని, నెలవారీ మాముళ్లు తీసుకుంటూ వీటిని పోలీసులు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ మద్దతు ఉండడంతో దాబా నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. -
ఊరూరా ఎల్లో బెల్ట్
జిల్లాలో లైసెన్స్డ్ మద్యం దుకాణాలు171గీత కార్మికులకు కేటాయించినవిసోమవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2025– 8లో.. ఎల్లో ‘బెల్ట్’..పచ్చని పల్లెలకు ఉరితాడుగా మారుతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్న పచ్చపార్టీ నేతలు లైసెన్సు షాపులకు అదనంగా పది నుంచి 15 బెల్టుషాపులు పెట్టి యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. బెల్టు షాపుల వద్దే సిట్టింగ్లు ఏర్పాటు చేసి పగలు, రాత్రి తేడా లేకుండా మందుపోస్తున్నారు. కొన్ని చోట్ల ఏకంగా ఆటోల్లో, బైక్ మీద వీధివీధినా తిరుగుతూ మద్యం అమ్ముతున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న ఎకై ్సజ్ అధికారులు వాటివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మొక్కుబడి దాడులు.. నామమాత్రపు హెచ్చరికలతో సరిపెడుతున్నారు. దీంతో బెల్టుషాపుల దందాకు అంతులేకుండా పోతోంది. -
మానుకోకుంటే ఖబడ్దార్
మహిళలపై దాడులు ఒంగోలు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇంటి నుంచి బయటకు రావాలంటే మహిళలు భయపడుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ విమర్శించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మీద తెలుగుదేశం, జనసేన గుండాలు చేసిన దాడిని ఖండిస్తూ వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒక బీసీ మహిళా నాయకురాలు, జిల్లాకే ప్రథమ పౌరురాలి మీద దాడి చేయడం, ఆమె కారు అద్దాలను పగులగొట్టి, రాళ్లతో దాడులు చేసి ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. హారికను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా హతమార్చేందుకే ఈ దాడి జరిగిందన్న అనుమానం వ్యక్తం చేశారు. గుడివాడలో జరిగిన దాడి దృశ్యాలను టీవీల్లో చూసిన రాష్ట్ర ప్రజలు, మహిళలు భయాందోళనకు గురయ్యారని చెప్పారు. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోవడం సిగ్గుచేటన్నారు. హారిక మీద దాడిని హోంమంత్రి ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. మహిళల మీద దాడులు చేయడమేనా మంచి ప్రభుత్వమంటే అని చురకలంటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అరగంటలోనే జెడ్పీ చైర్ పర్సన్ల గన్మెన్లను తొలగించారని, వారిని కొనసాగించి ఉంటే నేడు ఈ దాడి జరిగేదే కాదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి జనంలోకి వస్తుంటే మీకెందుకింత భయం అని నిలదీశారు. జగన్ పర్యటనలకు వేలాదిగా జనం తరలిరావడాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం వణికిపోతుందని ఎద్దేవా చేశారు. రేపు తాము అధికారంలోకి వస్తామని, ఈ రోజు గుండాయిజం చేసిన వాళ్లకు తగిన పాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని, మీ ధోరణి మార్చుకోకుంటే ఇంతకింత అనుభవిస్తారని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు. పార్టీ సమావేశాలకు హాజరవుతున్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ హారిక మీద టీడీపీ గూండాలు దాడులు చేయడం దుర్మార్గమన్నారు. మహిళలను ఏదైనా మాట అంటే ఊరుకోనన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీపీ గాయం సావిత్రి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి రవణమ్మ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడికొండ జయంతి, పార్టీ జిల్లా కార్యదర్శి సయ్యద్ అఫ్సర్, వాలంటీర్ విభాగం రాష్ట్ర కార్యదర్శి గోనెల మేరీ కుమారి, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న, నియోజకవర్గ అంగన్వాడీ అధ్యక్షురాలు వడ్లమూడి వాణి, సిటీ మహిళా అధ్యక్షురాలు బత్తుల ప్రమీల, మద్దలూరు సర్పంచ్ కె.రమణ, నాగమణి, నాగలక్ష్మి, బి.శైలజ, కె.లక్ష్మి పాల్గొన్నారు. మహిళలపై దాడులు చేయడమేనా మంచి ప్రభుత్వమంటే జెడ్పీ చైర్పర్సన్కే రక్షణ లేకుంటే ఇక సామాన్య మహిళల పరిస్థితేంటి ఇదే ధోరణి కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ -
ప్రభుత్వ పాఠశాలలకు 3 లక్షల మంది దూరం
చీమకుర్తి: కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పోయిందని, ఫలితంగా ఈ ఏడాది 3 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. చీమకుర్తిలో శనివారం నిర్వహించిన యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ మండల విద్యా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ఆదేశాలను విద్యారంగంపై రుద్దుతోందన్నారు. రెండేళ్ల క్రితం ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను అప్పటి ప్రభుత్వం హైస్కూళ్లకు పంపించిందని, వారికోసం పదోన్నతుల పేరుతో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా నియమించిందని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం హైస్కూళ్లలో ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపించిందన్నారు. అలాగే, విద్యార్థులు తక్కువగా ఉన్నారంటూ హైస్కూళ్లలో ఇటీవల పదోన్నతులు పొందిన స్కూలు అసిస్టెంట్లను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపించిందని తెలిపారు. అంతేతప్ప కూటమి ప్రభుత్వం విద్యారంగంలో కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలు ఏమీ లేవన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా ఈ సంవత్సరం 3 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారన్నారు. అమ్మ ఒడి, నాడు–నేడు ఆధునికీకరణతో కోవిడ్ సమయంలో ప్రైవేటు పాఠశాలల నుంచి 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చారన్నారు. నేడు తల్లికి వందనం వలన విద్యార్థుల హాజరు శాతం పెరగకపోగా, పలు రకాల యాప్ల భారం కారణంగా ఉపాధ్యాయులపై తీవ్రమైన పని ఒత్తిడి పెరిగి విద్యార్థులు నాణ్యమైన బోధనకు దూరమవుతున్నారన్నారు. దానివలన విద్యార్థుల తల్లిదండ్రులలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని కేఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏలు, పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, 11వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో ఉపాధ్యాయుల జీతాల సమస్యలు రాకుండా పొజిషన్ ఐడీలు, క్యాడర్ స్ట్రెంగ్త్లను వెంటనే తెప్పించాలన్నారు. తొలుత ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో యూటీఎఫ్ జిల్లా శాఖ నిర్వహిస్తున్న పాత్రను అభినందించారు. తొలుత యూటీఎఫ్ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ హైస్కూళ్లలో పదో తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను సత్కరించారు. ఇటీవల జరిగిన పదోన్నతులు, బదిలీలపై వెళ్లిన వారిని యూటీఎఫ్ మండల శాఖ తరఫున ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడు డాక్టర్ బీ జవహర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్హై, డీ వీరాంజనేయులు, జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్.రవి, జిల్లా కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే అక్బర్, చలువాది శ్రీనివాసరావు, యుటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ స్థానిక నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఈ ఏడాది తగ్గిన విద్యార్థుల అడ్మిషన్లు ఉపాధ్యాయులపై యాప్ల భారం.. విద్యార్థులకు బోధన దూరం తల్లిదండ్రుల విశ్వాసాన్ని కోల్పోయేలా చేసిన కూటమి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అనుసరిస్తున్న పాలకులు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ ధ్వజం -
దళితులకు రక్షణ కరువు
ఒంగోలు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, దళితులకు రక్షణ లేకుండా పోయిందని కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ఆరోపించారు. స్థానిక ఎల్బీజీ భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై దాడులు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. నేరస్తులకే అండగా నిలుస్తోందని విమర్శించారు. దళితులపై జరుగుతున్న అమానవీయ దాడులపై నిర్వహించాల్సిన మానిటరింగ్ కమిటీ సమావేశాలను సక్రమంగా జరపకపోవడం విచారకరమన్నారు. అసలు మానిటరింగ్ కమిటీనే ఏర్పాటు చేయకపోవడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఎస్సీ చైర్మన్గా మూడు నెలల క్రితం నియమితులైన జవహర్ చైర్మన్ హోదాలో ఇప్పటి వరకు దళితులపై దాడులు జరిగిన ప్రాంతాలను సందర్శించకపోవడం దారుణమన్నారు. ఏడాది కాలంగా దళితులపై జరిగిన దాడులపై విచారణ చేపట్టాలని మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఎస్సీలకు ఉచిత విద్యుత్ను నీరుగారుస్తున్న కూటమి... కూటమి అధికారంలోకి వచ్చాక దళితులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా ఎస్సీలకు అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. బాబూ జగ్జీవన్రామ్ పేరు మీద ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, దాన్ని నగరంలో అమలు చేయడం లేదని తెలిపారు. తమ బృందం జరిపిన పర్యటనలో ఒంగోలు నగరంలోని మామిడిపాలెం, గద్దలగుంటలో వినియోగదారుల నుంచి విద్యుత్ ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఎస్సీలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. పెంచిన ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంలో ఎస్సీలకు ఎలాంటి షరతులు లేకుండా సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని అమలు చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్మీటర్లను పగులగొట్టమంటూ పిలుపునిచ్చిన లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చి స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతాంగానికి వాడే మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద గ్రౌండ్ చేసిన 7 లక్షల మంది లబ్ధిదారులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వృద్ధాప్య పింఛన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని మాల్యాద్రి హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రఘురాం, జిల్లా నాయకులు అట్లూరి రాఘవులు, వి.మోజెస్ పాల్గొన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి విమర్శ -
షాక్..!
● దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంలో ఊహించని పరిణామం ● నాలుగు నెలల క్రితమే టీడీపీకి చెందిన నాగవేణిని ప్రకటించిన ఆ పార్టీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి ● బీజేపీకి చెందిన నారాయణమ్మను నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు ● పేరు మార్పిస్తామని, చైర్మన్ పదవి మాదేనని అంటున్న టీడీపీ నాయకులు ● నోరు మెదపని లక్ష్మి ● మా సంగతి ఏంటంటూ మదనపడుతున్న జనసేన నేతలునాగవేణికి నారాయణమ్మఇష్టారాజ్యంగా రిజర్వేషన్ల ఉల్లంఘనలు... ● మండిపడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకంలో కూటమి పాలకులు ఇష్టారాజ్యంగా రిజర్వేషన్లు ఉల్లంఘించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ జీవో నంబర్ 77 విడుదల చేశారు. ఇప్పుడు కూడా దాని ప్రకారమే ఏఎంసీ చైర్మన్లను నియమించాలని కలెక్టర్ల ద్వారా ఉత్తర్వులిచ్చిన కూటమి పాలకులు.. ఆచరణలో మాత్రం ఎక్కడా పాటించకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాది పాటు రిజర్వేషన్లను సడలిస్తున్నట్లు ఎక్కడికక్కడ జీవోలు విడుదల చేసి రిజర్వేషన్లకు తూట్లు పొడిచినట్లు సమాచారం. తద్వారా తమకు ఇష్టమొచ్చిన నాయకులు, తమను సంతృప్తిపరిచిన నాయకులు, గత ఎన్నికల్లో తమ కోసం భారీగా ఖర్చు చేసిన వారికి ఏఎంసీ చైర్మన్ పదవులు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. చైర్మన్ల నియామకాలకు సంబంధించిన రిజర్వేషన్లపై జీవో నంబర్ 77ను ఇటీవల కలెక్టర్ విడుదల చేశారు. దాని ప్రకారం యర్రగొండపాలెం ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్టీకి రిజర్వ్ అయింది. కానీ, కూటమి పాలకులు టీడీపీ సామాజికవర్గానికి చెందిన చేకూరి సుబ్బారావు పేరు ప్రకటించారు. అలాగే, పొదిలి చైర్మన్ పదవిని బీసీ మహిళ (మైనారిటీ)కు రిజర్వ్ చేశారు. కానీ, ఇక్కడ బీసీ జనరల్కు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కనిగిరిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కనిగిరికి ఎస్సీ మహిళను రిజర్వ్ చేయగా, పామూరు మండలానికి చెందిన యారవ శ్రీనివాసులచౌదరిని తొలుత చైర్మన్గా ప్రకటించారు. ఆ తర్వాత అతని సతీమణి పేరును ప్రకటించారు. ఎస్సీ మహిళకు కేటాయించిన ఈ స్థానంలో ఓసీని ఎలా నియమిస్తారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లు మార్చడం రాజ్యాంగ విరుద్ధమని, జీవో నంబర్ 77ను రద్దు చేయాలనుకుంటే కేబినేట్లో నిర్ణయం తీసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. రిజర్వేషన్లకు భిన్నంగా ఏఎంసీ చైర్మన్ల నియామకాలపై ఎస్సీ, ఎస్టీలు మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవి నియామకంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ పదవికి టీడీపీ నాయకుడు దారం సుబ్బారావు సతీమణి, దర్శి మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ అయిన దారం నాగవేణిని ఎంపిక చేసినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి నాలుగు నెలల క్రితమే ప్రకటించారు. దీంతో దారం సుబ్బారావు, నాగవేణి దంపతులు మార్కెట్ చైర్మన్ పేరుతో అనేక కార్యక్రమాలకు ఫ్లెక్సీలు కూడా పెట్టుకున్నారు. ఏఎంసీ చైర్మన్ పదవి దక్కుతుందనే ఉత్సాహంతో టీడీపీ కార్యక్రమాలకు భారీగా డబ్బు కూడా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా నాయకుడు, దర్శి నియోజకవర్గ ఇన్చార్జి మాడపాకుల శ్రీనివాసరావు సతీమణి నారాయణమ్మను దర్శి ఏఎంసీ చైర్మన్గా నియమిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం అకస్మాత్తుగా విడుదల చేసిన జాబితాలో దర్శి ఏఎంసీ చైర్మన్గా బీజేపీకి చెందిన నారాయణమ్మ పేరు ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా, టీడీపీ శ్రేణులు, నాగవేణి వర్గీయులు షాక్కు గురయ్యారు. గొట్టిపాటి లక్ష్మీపై తీవ్ర అసంతృప్తి... దర్శి ఏఎంసీ చైర్మన్ పదవిని తొలుత ఎస్సీ సామాజికవర్గానికి కేటాయించారు. గొట్టిపాటి లక్ష్మి చక్రం తిప్పి దానిని ఓసీగా మార్పించి కాపు సామాజికవర్గానికి చెందిన దారం నాగవేణిని ప్రకటించారు. అప్పటి నుంచి ఎస్సీ సామాజికవర్గం వారు తమకు వచ్చిన అవకాశాన్ని తమకు దక్కకుండా చేసిన గొట్టిపాటి లక్ష్మిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడిన ఎస్సీలంతా రగిలిపోతున్నారు. కానీ, చివరకు బీజేపీకి చెందిన బీసీ సామాజికవర్గ మహిళ మాడపాకుల నారాయణమ్మ పేరును ప్రభుత్వం ఫైనల్ చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి రెండు రోజులుగా నోరు మెదపకపోవడంతో టీడీపీ శ్రేణులు కూడా ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసులు ప్రెస్మీట్ పెట్టి బీజేపీకి ఏఎంసీ చైర్మన్ పదవి కేటాయించినందుకు గొట్టిపాటి లక్ష్మికి ధన్యవాదాలు తెలపడంతో లక్ష్మిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. దీనిపై ఆమె స్పందించకపోవడం, పేరు మార్పు ప్రచారం గురించి స్పష్టత ఇవ్వకపోవడంతో బీజేపీ వారికే బలం చేకూరినట్లయింది. నాలుగు నెలల క్రితమే తమ పేరు ప్రకటించినప్పటికీ పదవి దక్కకపోవడంపై టీడీపీ నాయకులు, దారం వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. జనసేన నాయకుల నైరాశ్యం... ఇదిలా ఉండగా, దర్శి ఏఎంసీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకుని ఉన్న జనసేన నాయకులు నైరాశ్యానికి గురయ్యారు. బీజేపీ కంటే ఎక్కువ శాతం ఓట్లు జనసేనకు ఉన్నాయని, తమ మద్దతుతోనే టీడీపీకి బలం చేకూరుతుందని, కానీ, తమకెందుకు ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వకూడదని జనసేన పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జనసేనకు ఇన్చార్జ్గా ఉన్న నేతలెవరూ ఇక్కడకు రాకపోవడం, తమ పార్టీ వారికి ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వాలని అడగకపోవడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ దర్శి ఏఎంసీ చైర్మన్ పదవి నియామకంతో నియోజకవర్గంలో రాజకీయ దుమారం లేచిందని, కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఏఎంసీ చైర్మన్ల జాబితాలో దర్శికి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ తప్పిదం వలన పేరు పొరపాటు పడిందని, నాగవేణికే చైర్మన్ పదవి కేటాయిస్తూ మార్పులు జరగడం ఖాయమని దారం సుబ్బారావు వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నాయకులు మాత్రం తమ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఒత్తిడి మేరకు బీజేపీ కోటా కింద దర్శి ఏఎంసీ పదవిని నారాయణమ్మకు కేటాయించారంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. టీడీపీ దర్శి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి కూడా తమకు సహకరించారంటూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ధన్యవాదాలు తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్ తప్పిదమని, పేరు మార్చడం ఖాయమని ప్రచారం... -
నేడు ఆక్రమించుకుని..!
నాడు పట్టాల పంపిణీ.. పీసీ పల్లి: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు పంపిణీ చేయగా, నేడు కూటమి ప్రభుత్వంలో అధికార టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఆయా భూములను ఆక్రమించుకుని ఏకంగా దున్నేస్తున్నారు. పీసీ పల్లి మండల పరిధిలోని మురుగమ్మి గ్రామ పంచాయతీలో శనివారం చోటుచేసుకున్న ఈ సంఘటన అధికార పార్టీ నేతల అరాచకాలకు అద్దం పడుతోంది. గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్ 333/6లో మొత్తం రెండెకరాలు ప్రభుత్వ భూమి ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆ భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. సుమారు 46 మంది పేదలకు పట్టాలు అందజేశారు. అయితే, ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడుతూ పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలను కూడా వదలకుండా కాజేస్తున్నారు. అందులో భాగంగానే శని, ఆదివారాలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు చూసుకుని ఓ టీడీపీ నాయకుడు మురుగమ్మి గ్రామంలో పేదలకు ఇళ్లస్థలాలుగా ఇచ్చిన భూమిని దర్జాగా కబ్జా చేశాడు. శనివారం సంబంధిత భూమిని ఏకంగా దున్నేశాడు. పంటలు సాగుచేసేందుకు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మురుగమ్మి గ్రామంలోని ఓ టీడీపీ నాయకుడు సచివాలయ శిలాఫలకాన్ని పగలగొట్టాడు. మరికొంత మంది నాయకులు అందినకాడికి దోచుకుందామంటూ అటవీ, పోరంబోకు, రెవెన్యూ భూములపై పడి రాత్రికిరాత్రి లారీలకు లారీల తెల్లరాయిని తరలిస్తున్నారు. వీటన్నింటినీ మరవకముందే తాజాగా పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసిన భూములను ఆక్రమించుకోవడంతో టీడీపీ నేతల దౌర్జన్యాలపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ట్రాక్టర్ కిందపడి మహిళ మృతి
పామూరు: ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాలీ టైరు కిందపడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన పామూరు మండలంలోని తిరగలదిన్నె గ్రామం వద్ద 565వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సీఎస్ పురం మండలం కంభంపాడు గ్రామానికి చెందిన మేకల అంజమ్మ (49) ఇసుక ట్రాక్టర్ పనికి వెళ్లింది. మండలంలోని తిరగలదిన్నెవద్ద నుంచి గోపాలపురంకు ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్.. తిరగలదిన్నె వద్ద 565వ నంబర్ జాతీయ రహదారిపైకి ఎక్కే సమయంలో అదుపుతప్పింది. జాతీయ రహదారి దిగి గుంతల్లోకి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్ర కుదుపులకు గురైంది. ఆ సమయంలో ట్రాక్టర్ ఇంజిన్పై డ్రైవర్ వెనుకవైపు ఉన్న చెక్కపై కూర్చున్న మేకల అంజమ్మ కిందపడగా ట్రాక్టర్ ట్రాలీ టైరు ఆమైపెగా వెళ్లింది. ఈ ప్రమాదంలో అంజమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. మృతుని బంధువు వసంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.కిషోర్బాబు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. మృతురాలికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పనికి వెళ్లిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో మృతురాలి కుమారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అధిక వేగమే ప్రమాదానికి కారణమని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
ముంచే ప్రభుత్వం
మంచి ప్రభుత్వం కాదురీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీపై క్యూఆర్ కోడ్ను ఆవిష్కరిస్తున్న ఆర్కే రోజా, కారుమూరి నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, సతీష్రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మ, బత్తుల బ్రహ్మానందరెడ్డి, తూమాటి మాధవరావు తదితరులుకొండపి: రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ప్రభుత్వం లేదని, ప్రజలను ముంచే ప్రభుత్వం మాత్రమే ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కొండపిలో శుక్రవారం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన రోజా మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూ కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశామని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పే ధైర్యం కూటమి నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. రెడ్బుక్ రాజ్యాంగం అంటూ ఎగిరి పడితే రాబోవు రోజుల్లో ప్రజలు ఎగరేసి తంతారని విమర్శించారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్ తోడు దొంగల్లాగా తయారై రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు, అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా అవేమీ తమకు పట్టవంటూ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రశ్నించడానికి పార్టీ స్థాపించానని బీరాలు పలికిన పవన్ కళ్యాణ్ నేడు పవర్ లేని స్టార్ గా మిగిలిపోయాడని విమర్శించారు.విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలో మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ని చూసి నేర్చుకోవాలని.. ఏ విధంగా ఉండకూడదో నారా లోకేష్ని చూస్తే తెలిసిపోతుందన్నారు. యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా టార్గెట్ జగన్ అన్నారు. జగనన్న పై కేసులు బనాయించి భూస్థాపితం చేస్తామనడం కూటమి నాయకుల కుట్రలకు అద్దం పడుతోందన్నారు. ఏడాది తర్వాత తల్లికి వందనం పథకాన్ని అరకొరగా అమలు చేసి ప్రజలకు ఏదో వెలగబెట్టినట్లు ఆ పథకం తన కుమారుడు లోకేష్ కనిపెట్టినట్లు చంద్రబాబు చెప్పుకోవడం ఆయన చేతగానితనానికి నిదర్శనం అన్నారు. కల్తీ మద్యం తయారుచేసి వారి బతుకులతో ఆడుకుంటున్నారన్నారు. ఈరోజు మద్యం సీసాలకు పవర్ స్టార్ పేరు పెట్టడం వలన పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా మిన్నకుండిపోయారన్నారు. చంద్రబాబు మూడు మాటలు మాట్లాడితే వాటిలో రెండు అబద్ధాలు..ఒకటి సొల్లు అని విమర్శించారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని చెప్పిన చంద్రబాబు నేడు ఉచిత బస్సును జిల్లాకే పరిమితం చేయడం మరోసారి మహిళలు మోసం చేయడమేమన్నారు. వేల కోట్ల విద్యుత్ చార్జీలు పెంచి పేద ప్రజలపై ఆర్థిక భారం మోపి ఆ నేరాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పై వేయటానికి చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగిరేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఆదిమూలపు సురేష్కి అండగా నిలవాలన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి చిత్రహింసలకు గురి చేయటం మంచి పద్ధతి కాదన్నారు. లోకేష్ రెడ్బుక్ మడిచి గూట్లో పెట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలన్నారు. వినేవాళ్లు వెధవలైతే చెప్పేవాడు చంద్రబాబు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగనన్న 2.0లో ఒక కన్ను ప్రజలైతే రెండవ కన్ను కార్యకర్తలేనని ఉత్సాహపరిచారు. జగనన్న 2.0లో కార్యకర్తలకు పెద్దపీట: జగనన్న 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నామని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మింగేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీలోకి ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని, ఎవరు పార్టీ వీడి వెళ్లినా వైఎస్సార్సీపీకి వచ్చిన నష్టం లేదని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి 2029లో జిల్లాలోని అన్ని స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క: కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరొక లెక్క అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి నాయకులు, కార్యకర్తలు హాజరవుతుంటే పోలీసులు అడుగడుగునా ఆంక్షలు సృష్టించారన్నారు. సమావేశాన్ని ఫెయిల్యూర్ చేయాలని మంత్రి స్వామి ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలుగా మారిన పోలీసులు సమావేశానికి వచ్చే ప్రతి ఒక్కరినీ ఇబ్బందులకు గురిచేశారన్నారు. కొంతమంది నాయకుల కార్యకర్తల ఫోన్లను తీసుకొని బెదిరింపులకు గురి చేశారని, అయినా నాయకులు లెక్క చేయకుండా భారీ సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. నియోజకవర్గంలో కూటమి సృష్టించే ఆగడాలకు అదుపు లేకుండా పోతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిందంటే విద్యా వ్యవస్థ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం పనితీరు ఇట్టే కనిపిస్తోందన్నారు. వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరును మీకు నచ్చిన బుక్కులో రాసుకోండని దానికి తప్పనిసరిగా ప్రతీకారం ఉంటుందని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వాటిని దీటుగా ఎదుర్కొంటామన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలపై హామీల జల్లు కురిపించిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయకుండా నట్టేట ముంచిందన్నారు. ఒంగోలు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. మిర్చి, పొగాకుతో పాటు మరి కొన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను దగా చేశాడన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా మారిందన్నారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అరాచక పాలనను రాష్ట్ర ప్రజలకు గమనిస్తున్నారని సరైన సమయంలో తప్పక బుద్ధి చెబుతానన్నారు బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో డాకా పిచ్చిరెడ్డి, బచ్చల కోటేశ్వరరావు, బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, మారెడ్డి వెంకటాద్రి రెడ్డి, శేషారెడ్డి, మురళి, మండవ మాలకొండయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, వేముల రమేష్, బొక్కిసం సుబ్బారావు, వసంతరావు, మణికంఠేశ్వర్ రెడ్డి, రామకృష్ణ, జెడ్పీటీసీ అరుణ వెంకటాద్రి, ఇనకొల్లు సుబ్బారెడ్డి, మసనం వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, దుద్దుగుంట మల్లికార్జున్ రెడ్డి, పిన్నిక శ్రీనివాసులు, బెజవాడ వెంకటేశ్వర్లు, మురళి, భువనగిరి సత్యనారాయణ, ఆరు మండలాల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పార్టీలో వివిధ విభాగాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రైతులకు రైతు ఉత్పత్తిదారుల సంస్థ అండగా ఉండాలి
ఒంగోలు వన్టౌన్: రైతులకు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జీవనోపాధులు పెంపొందించడంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ అండగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డైరక్టర్ టీ నారాయణ సూచించారు. ఒంగోలు భాగ్యనగర్లోని టీటీడీసీలో జిల్లాలోని 12 మండలాల ఎఫ్పీఓ–కమ్యూనిటీ కోఆర్డినేటర్స్, ఫార్మర్ మిత్రాలు, ఎఫ్పీఓ అకౌంటెంట్లతో శుక్రవారం పీడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు, మునగ సాగు, వెదురు సాగు, తేనెటీగల పెంపకం, కొర్రమీను చేప పెంపకం తదితర సబ్ సెక్టార్లకు 50 శాతం సబ్సిడీని చిన్న, సన్న కారు రైతులకు అందజేయాలని పీడీ తెలిపారు. షేడ్ నెట్ కల్టివేషన్, సోలార్ డ్రైయర్ ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ జోసెఫ్, ఉద్యాన వన శాఖ అధికారి డీ సంధ్యారాణి, డీ ఝాన్సీరాణి, జేపీఈ ఏపీసీఎన్ఎఫ్ లక్ష్మీరెడ్డి, అడిషనల్ పీడీ డి.దానం, జీవనోపాధుల డీపీఎం జే నారాయణ, లైవ్లీ హుడ్ యూనిట్ జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయండి
● ఇన్చార్జి కలెక్టర్ గోపాలకృష్ణ ఒంగోలు వన్టౌన్: జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్ నుంచి వీడియో సమావేశం ద్వారా రెవెన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్లు, ప్రాజెక్టు అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఎన్హెచ్ 565, ఎన్హెచ్ 216, ఎన్హెచ్ 544, ఎన్హెచ్ 167బి, ఎన్హెచ్ 765, ఎన్హెచ్ 544జి, నడికుడి–శ్రీకాళహస్తి రైల్వేలైన్, తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పురోగతిపై అధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. సంబంధిత ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ల్యాండ్ క్లెయిమ్స్, పెండింగ్ క్లెయిమ్స్ను పూర్తి చేయాలన్నారు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అవార్డులను పాస్ చేయాలన్నారు. రెవెన్యూ సంబంధిత ప్రాజెక్టుల అధికారులతో సమన్వయం చేసుకుని భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. -
గ్రానైట్ రాయి కింద పడి కూలీ మృతి
పొదిలి రూరల్: గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తుండగా రాయి జారి మీద పడటంతో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పొదిలి మండలంలోని ఏలూరు పంచాయతీ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఏలూరు పరిధిలోని వర్ణ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉత్తరప్రదేశ్కు చెందిన సుడమా కుష్వాహా(33) గత కొంత కాలం నుంచి పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే కటింగ్ మెషీన్తో భారీ గ్రానైట్ రాయిని కోసేందుకు సిద్ధం చేస్తున్న సమయంలో జారిపడింది. రాయి మీద పడటంతో కుష్వాహా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తోటి కార్మికులు గమనించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
న్యాయం కావాలి.. నిందితులను శిక్షించాలి
? కంభం: మూడేళ్ల బాలుడు పొదిలి లక్షిత్ అనుమానస్పద మృతి కేసులో తమకు న్యాయం చేయాలంటూ కంభం పోలీస్స్టేషన్ ఆవరణలో కుటుంబ సభ్యులు, లింగోజిపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కంభం మండలం లింగోజిపల్లిలో మంగళవారం ఉదయం 11 గంటలకు అంగన్వాడీ కేంద్రం నుంచి అదృశ్యమైన లక్షిత్ గ్రామానికి 3 కి.మీ దూరంలో సూరేపల్లి శివార్లలో ఉన్న పంటపొలాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడి మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీయగా.. అడవిలో చిక్కుకున్న బాలుడు ఆహారం, నీరు లేక మృతి చెంది ఉంటాడని ప్రాథమిక అంచనాకు వచ్చామని జిల్లా పోలీస్ అధికారులు చెప్పినట్లు కొన్ని మీడియా చానళ్లు, దినపత్రికల్లో(సాక్షి కాదు) వార్తలొచ్చాయి. దీంతో ఆగ్రహించిన బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ట్రాక్టర్లలో తరలివచ్చిన మహిళలు బాలుడి మృతిపై న్యాయం జరగడం లేదని ఆగ్రహించిన మహిళలు, గ్రామస్తులు రెండు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలపై పోలీస్స్టేషన్కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు మార్గమధ్యంలో వారిని అడ్డుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులతో వాదించిన గ్రామస్తులు అక్కడి నుంచి కంభం పోలీస్స్టేషన్కు చేరుకుని బైఠాయించారు. కేసు ప్రాథమిక దర్యాప్తులో ఉండగా పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే తమకు న్యాయం జరుగుతుందని అనిపించడం లేదని ఆగ్రహావేశాలకు లోనయ్యారు. బాలుడిని ఎవరు ఎత్తుకెళ్లారో, ఎందుకు చంపారో విచారించి నిందితులను శిక్షించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా బాబు తప్పిపోలేదు.. ఎవరో ఎత్తుకెళ్లారు తన కొడుకు లక్ష్మిత్ తప్పిపోలేదని ఎవరో పథకం ప్రకారం ఎత్తుకెళ్లి హత్య చేశారని తల్లి సురేఖ అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో కనిపెట్టాలని, సాధారణ మృతిగా మార్చేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ‘నా కొడుకు ఎలాగూ నాకు దక్కలేదు, ఇంకో తల్లికి ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల’ని కోరారు. పెద్దవాళ్లే దిగి ఎక్కలేని వాగును చిన్న పిల్లాడు ఎలా దాటతాడని, కేసును తప్పు దోవ పట్టించాలన్న ఉద్దేశంతోనే హంతకులు అక్కడ చెప్పులు పెట్టి ఉంటారని లక్షిత్ అమ్మమ్మ అనుమానం వ్యక్తం చేశారు. అంగన్వాడీ నిర్లక్ష్యంపై ఆగ్రహం అంగన్వాడీ కేంద్రంలో ఉన్న ఐదుగురు పిల్లల్లో ఒక బాలుడు అదృశ్యమై మృతి చెందిన నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లవాడి మరణానికి పరోక్షంగా వారు కూడా కారకులని నిప్పులు చెరిగారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చిన్నారి లక్షిత్ మృతి కేసు దర్యాప్తుపై బంధువులు, గ్రామస్తుల ఆగ్రహం కంభం పోలీస్ స్టేషన్ ఎదుట లింగోజిపల్లి వాసుల ఆందోళన రెండు ట్రాక్టర్లలో వస్తున్న మహిళలకు మధ్యలోనే నచ్చజెప్పేందుకు పోలీసుల యత్నం కేసు విచారణ కాకుండానే సాధారణ మృతి అని ఎలా చెబుతారని ఆగ్రహం అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యంపై నిప్పులుచెరిగిన స్థానికులు విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న సీఐ మల్లికార్జున 45 గంటల పాటు బాలుడు ఎక్కడున్నాడన్న దానిపై పలు అనుమాలు బాలుడి కుటుంబానికి ‘అన్నా’ పరామర్శ లింగోజిపల్లిలో అంగన్వాడీ కేంద్రం నుంచి అదృశ్యమై పంట పొలాల్లో శవమై తేలిన బాలుడు పొదిలి లక్షిత్ కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు శుక్రవారం పరామర్శించారు. తీరని వేదనతో కుమిలిపోతున్న లక్షిత్ తల్లిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అణ్యం పుణ్యం ఎరుగని బాలుడి అనుమానాస్పద మరణం తనను కలచివేసిందని, ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. ఆయన వెంట ఎల్కోట సర్పంచ్ బాషా, ఎంపీటీసీ రావూరి రవి, జగన్, బొల్లు రాములు ఉన్నారు. 45 గంటలపాటు బాలుడు ఏమయ్యాడు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో అదృశ్యమైన బాలుడు 45 గంటల తర్వాత విగతజీవిగా కనిపించాడు. లింగోజిపల్లి నుంచి సంఘటనా స్థలం ప్రాంతానికి చేరుకోవాలంటే మధ్యలో నల్లవాగు దాటాలి. ఈ నేపథ్యంలో బాలుడు ఒంటరిగా వెళ్లి ఉంటాడన్న వాదనను కొట్టిపడేస్తున్నారు. రెండో రోజు నల్లవాగు వద్ద బాలుడి చెప్పులు కనుగొన్న పోలీసులు చుట్టుపక్కల పంటపొలాలు, పరిసరాలను డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టారు. డాగ్ స్క్వాడ్తోపాటు గ్రామస్తులు ఆ ప్రాంతంలో అడుగడుగూ తిరిగినా ఆచూకీ లభించలేదు. బాలుడి మృతదేహం లభ్యమైన ప్రదేశంలో ముందురోజు ఏమీ కనబడలేదు. బాలుడు తప్పిపోయిన మొదటి రాజు రాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. బాలుడు నిజంగా తప్పిపోయి వచ్చి ఉంటే ఆ వర్షంలో ఎక్కడ ఉన్నాడు?, రెండు రాత్రులు ఎలా గడిచాయన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. బాలుడు అదృశ్యమైన కొంత సమయానికే పోలీసులు, గ్రామస్తులు చుట్టుముట్టడంతో కిడ్నాపర్లే అంతమొందించి ఉంటారన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది ఒంగోలు జీజీహెచ్కు చెందిన ప్రొఫెసర్తో బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం చేయించాం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తే సహజ మరణమా లేక బలవన్మరణమా అనే విషయం తెలుస్తుంది. బాలుడి అనుమానాస్పద మృతి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. దర్యాప్తు పూర్తయితే వివరాలు వెల్లడిస్తాం. – మల్లికార్జునరావు, కంభం సీఐ -
రైలు ఢీకొని గొర్రెల కాపరి మృతి
రాచర్ల: ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో గొర్రెల కాపరితోపాటు 10 జీవాలు మృతి చెందాయి. ఈ సంఘటన రాచర్ల మండలంలోని యడవల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 199–10 మైలు రాయి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. రాచర్ల మండలం రంగారెడ్డిపల్లె గ్రామానికి చెందిన కొత్తకోట రాధాకృష్ణ(38) తన 50 గొర్రెలను మేత కోసం సత్యవోలు వ్యవసాయ పొలాల్లోకి తీసుకెళ్తున్నాడు. గొర్రెల మందను రైల్వే ట్రాక్ దాటిస్తున్న సమయంలో గుంటూరు నుంచి ఔరంగబాద్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు దూసుకొచ్చింది. గొర్రెలను పక్కకు తోలేందుకు ప్రయత్నించిన రాధాకృష్ణను రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే ప్రమాదంలో 10 గొర్రెలు మృతి చెందగా, 5 గొర్రెలు తీవ్ర గాయాలతో ట్రాక్ పక్కన ఎగిరిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన రైల్వే గార్డు ఎక్స్ప్రెస్ను నిలిపి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రాధాకృష్ణను అదే రైలులో గిద్దలూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నంద్యాల జీఆర్పీ కానిస్టేబుల్ షేక్.ఖలీల్ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
అడుగడుగునా ఆంక్షలు..
కొండపి: కొండపిలో శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని అడ్డుకోవడానికి మంత్రి ఆదేశాలతో పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. గురువారం రాత్రి నుంచి ఆటంకాలు సృష్టిస్తూ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. భారీగా సమావేశం నిర్వహించడాన్ని జీర్ణించుకోలేని మంత్రి స్వామి ఎలాగైనా తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని సమావేశం జరగకుండా చేయాలని కుట్రలు పన్నారు. దీనికి పోలీసులతో అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఫ్లెక్సీలు కడుతున్న వారిని అడ్డుకొని వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరు చెబితే ఫ్లెక్సీలు కట్టారు, ఫ్లెక్సీలు కడితే మీ మీద కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి సురేష్ వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులతో మాట్లాడారు. ఎటువంటి ప్రభుత్వాన్ని కించపరిచే ఫ్లెక్సీలు లేనప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం నుంచి కొండపికి నలుమూలల ఎనిమిది చోట్ల చెక్పోస్ట్లు పెట్టి తనిఖీలు నిర్వహించారు. కొండపి నుంచి టంగుటూరు వెళ్లే గురుకుల పాఠశాల సమీపంలో ఒకటి, కే.ఉప్పలపాడు వద్ద, కామేపల్లి వెళ్లే రోడ్డులో హోసన్న చర్చి దగ్గర ఒకటి, పొదిలి వెళ్లే రోడ్డులో ఫైర్ స్టేషన్ దగ్గర, సంతనూతలపాడు వెళ్లే రోడ్డులో పోలీస్ స్టోరేజ్ వద్ద, జాళ్లపాలెం వెళ్లే రోడ్డులో జండా చెట్టు సెంటర్ వద్ద, కొండపి టౌన్లోని కామేపల్లి సెంటర్లో, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా వస్తున్న వారందరినీ కూడా ఒకే కారులో రావాలని అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారిని హెల్మెట్ లేదనే కారణంతో వెనక్కి తిప్పి పంపించారు. ఎన్నడూ లేని విధంగా హెల్మెట్లు, వాహన పత్రాలు తనిఖీ చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటోలను, కార్లను ఆపి తనిఖీలు చేశారు. మీకు కొండపిలో ఏం పని? ఈ సమయంలో కొండపి కి ఎందుకు వెళ్తున్నారు? విస్తృత స్థాయి సమావేశానికి వెళితే తిరుగు ప్రయాణంలో మీ మీద చర్యలు తీసుకుంటామని వాహనదారులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సమావేశానికి రాకుండా కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. కొంతమంది కార్యకర్తల మొబైల్ ఫోన్లు తీసుకొని సమావేశానికి రాకుండా ఆటంకపరిచారు. అయినా కార్యకర్తలు ఇవేవీ లెక్కచేయకుండా తమ వాహనాలను కొండపికి రెండు కిలోమీటర్ల దూరంలోనే నిలిపి నడుచుకుంటూ సమావేశ స్థలానికి చేరుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వేలాది మంది కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు మంత్రి ఆదేశాలతో నలుమూలల చెక్ పోస్టులు, తనిఖీలు అయినా భారీగా హాజరైన వైఎస్సార్ సీపీ శ్రేణులు -
ఇద్దరు మాజీ సైనికుల గృహాల్లో చోరీ
కంభం: ఇద్దరు మాజీ సైనికుల గృహాల్లో దొంగలు పడి బంగారు నగలు, నగదు అపహరించారు. ఈ సంఘటనలు శుక్రవారం కంభం పట్టణంలో చోటుచేసుకున్నాయి. వివరాలు.. బస్టాండ్ సమీపంలోని రహమత్నగర్ మొదటి లైనులో నివాసం ఉంటున్న మాజీ సైనికుడు చల్లా కోటయ్య కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో బేస్తవారిపేట మండలంలోని సలకలవీడు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చి చూసే సరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. మూడు బంగారు ఉంగరాలు, చెవి పొగులు, కమ్మలు సహా మొత్తం 3 తులాల బంగారం, రూ.2 వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఉదయం 10.30 గంటల తర్వాత ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకొని వచ్చి వెళ్లినట్లు సమీపంలోని సీసీ కెమెరాలో నిక్షిప్తమై ఉంది. ● ఎల్బీఎస్ నగర్లో నివాసం ఉంటున్న మరో మాజీ సైనికుడు రంగనాయకులు పది రోజుల క్రితం కుటుంబంతో కలిసి హైదరాబాద్కు వెళ్లారు. కింద ఇల్లు ఖాళీగా ఉండగా పైన వారు నివాసం ఉంటున్నారు. శుక్రవారం పైన ఇంటి కటాంజనం కొంత తెరుచుకొని ఉండటాన్ని గమనించిన స్థానికులు పైకి వెళ్లి చూడగా తాళం పగలగొట్టి ఉంది. యజమానులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇంటి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువా తలుపు పూర్తిగా విరగగొట్టి మంచం మీద పెట్టారు. బీరువాలో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు. సుమారు మూడున్నర తులాల బంగారు నగలు, రూ.10 వేల వరకు నగదు చోరీ అయినట్లు యజమానులు చెప్పారు. చోరీ జరిగిన రెండు గృహాలను ఎస్సై నరసింహారావు పరిశీలించారు. క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. బంగారు ఆభరణాలు, నగదు అపహరణ -
పేద కుటుంబాన్ని దత్తత తీసుకున్న ఇన్చార్జి కలెక్టర్
మద్దిపాడు: మండలంలోని మల్లవరం గ్రామంలో నివాసం ఉంటున్న శింగమనేని మరియమ్మ కుటుంబాన్ని ఇన్చార్జి కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ శుక్రవారం దత్తత తీసుకున్నారు. మరియమ్మ భర్త చనిపోగా ఆమె తన కుమార్తె, కుమారునితో కలిసి తల్లి వద్దనే ఉంటూ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమె కుటుంబాన్ని దత్తత తీసుకోవడానికి ఇన్చార్జి కలెక్టర్ ముందుకు వచ్చారు. మరియమ్మ కుమార్తె ఇంటర్ చదువుతుండగా, అబ్బాయి 9వ తరగతి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. కుమార్తెను ఏదైనా ఒకేషనల్ కోర్సులో చేర్పించి ఉద్యోగం వచ్చేలా తాను చూసుకుంటానని గోపాలకృష్ణ హామీ ఇచ్చారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇప్పిస్తానని, దానికి అదనంగా అవసరమైతే తాను డబ్బుఖర్చు చేస్తానని తెలిపారు. ఇన్చార్జి కలెక్టర్ మరియమ్మ ఇంటికి వెళ్లే క్రమంలో ఆ కుటుంబానికి కావలసిన రేషన్, కూరగాయలు, ఇతర వస్తువులు తాను స్వయంగా కొనుగోలు చేసి అందించారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, గ్రామ సర్పంచ్ నారా సుబ్బారెడ్డి, ఎంపీడీఓ వి జ్యోతి సచివాలయ సిబ్బంది పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. నగరంలో మెడికల్ షాపుల తనిఖీలు ఒంగోలు టౌన్: ఔషధ నియంత్రణ అధికారులు నగరంలో శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు, బాపట్ల, మార్కాపురం డ్రగ్ ఇన్స్పెక్టర్ల బృందం జీజీహెచ్, సుందరయ్య భవన్ రోడ్డు, కొత్తపట్నం సెంటర్, 60 అడుగుల రోడ్డు పరిసరాల్లోని 9 మెడికల్ షాపులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కొన్ని నిబంధనల ప్రకారం ఫార్మాసిస్ట్ లేకుండానే మెడికల్ షాపులను నిర్వహించడం, బిల్లులను ఇవ్వకుండానే ఔషధాలను విక్రయించడం వంటివి గుర్తించినట్లు అసిస్టెంట్ డైరక్టర్ జ్యోతి తెలిపారు. కొన్ని మెడికల్ షాపుల నుంచి జనరల్, జనరిక్ ఔషధాలకు సంబంధించిన శాంపిల్స్ను సేకరించినట్లు చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన షాపులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి సీఎస్పురం(పామూరు): రోడ్డు ప్రమాదంతో గాయపడిన యువకుడు తిరుపతి వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై ఎం.వెంకటేశ్వరనాయక్ కథనం మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురానికి చెందిన సురేష్(32), వినోద్ గురువారం పామూరులోని బంధువుల ఇంటికి వచ్చి, రాత్రి వేళ బైక్పై ఇంటికి వెళ్తున్నారు. అయ్యలూరివారిపల్లె సమీపంలో జాతీయ హైవేపై గేదెలు అడ్డురాగా బైక్ అదుపుతప్పి పడిపోవడంతో సురేష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఉదయగిరి వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో యువకుడు వినోద్కు స్వల్పగాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
రాచర్ల: వ్యవసాయ బోరు స్టార్టర్ బాక్స్ వద్ద ఫ్యూజులు తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురైన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన రాచర్ల మండలంలోని ఒద్దులవాగుపల్లె గ్రామ వ్యవసాయ పొలాల్లో శుక్రవారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అన్నపురెడ్డి రామ్భూపాల్రెడ్డి(61) ఒద్దులవాగుపల్లె–సత్యవోలు మార్గంలో ఉన్న తన పొలంలో 10 రోజుల క్రితం మొక్కజొన్న సాగు చేశారు. మొలక దశలో ఉన్న పంటను అడవి పందుల బారి నుంచి కాపాడుకునేందుకు గురువారం రాత్రి 10 గంటల సమయంలో మైకు ఏర్పాటు చేసి ఇంటికి వచ్చారు. మైకును తిరిగి ఇంటికి తెచ్చుకునేందుకు శుక్రవారం వేకువజామున బైక్పై పొలానికి వెళ్లారు. డీప్బోర్ స్టార్టర్ బాక్స్ ఫ్యూజులు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. రామ్భూపాల్రెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య లక్ష్మీదేవి పొలం వద్దకు వెళ్లి చూసింది. విగతజీవిగా పడి ఉన్న రామ్భూపాల్రెడ్డిని చూసి బోరున విలపిస్తూ బంధువులకు సమాచారమిచ్చింది. ఎస్సై పి.కోటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. రైల్వే స్టేషన్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు ఒంగోలు టౌన్: గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఒంగోలులో శుక్రవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈగిల్ టీం, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులతోపాటుగా పోలీసు డాగ్ స్క్వాడ్తో కలిసి రైల్వే స్టేషన్ పరిసరాలు, రైలు బోగీలలో విస్తృతంగా తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్లోని పార్సిల్ సర్వీసు సెంటర్లో అనుమాస్పదంగా కనిపించిన ప్రతి పార్సిల్ను పరిశీలించారు. ఒంగోలు మీంచి వెళ్లే పలు ఎక్స్ప్రెస్ రైళ్లోని బోగీలలో ఎక్కి అనువణువు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరంలోని అన్నీ ప్రధాన కూడళ్లతో పాటుగా రైల్వే స్టేషన్లోనూ తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇలువంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 11972, స్థానిక పోలీసులు, డయల్ 112 , పోలీసు వాట్సప్ నంబర్ 9121102266కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీలో మహిళా పీఎస్ సీఐ సుధాకర్, టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్, ఆర్పీఎఫ్ సీఐ కొండయ్య, ఈగల్ టీం, ఎస్సైలు పాల్గొన్నారు. టంగుటూరులో దొంగలు హల్చల్ ● 4 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ టంగుటూరు: తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారు ఆభరణాలు అపహరించిన సంఘటన టంగుటూరు పురం సెంటర్లో గురువారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. స్థానిక పురం సెంటర్లో నివాసం ఉండే బడుగు దీనదాసు కుటుంబ సభ్యులు నిమ్మకూరు గ్రామంలో చదువుతున్న కూతురు వద్దకు ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి ఇంటికి వచ్చారు. తలుపులు తెరిచి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. దుండగులు బీరువా పగలగొట్టి సుమారు నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని సింగరాయకొండ సీఐ చావా హజరత్తయ్య, ఎస్సై నాగమల్లీశ్వరరావు పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కడ‘గండ్ల’కు కారుకులెవరు?
సాగుకు సంకటం.. పునుగోడు రిజర్వాయర్ కనిగిరి రూరల్: పంట భూములకు సాగు నీరందించి, భూగర్భ జలాల మట్టాన్ని పెంచే రిజర్వాయర్లు, చెరువుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పాలకుల నిర్లక్ష్యం మూలంగా రిజర్వాయర్లలో, చెరువుల్లో నీరు నిలిచే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నిర్వహించిన మండల పరిషత్ సమావేశాల్లో సైతం చెరువుల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు అధికారుల నుంచి సరైన సమాధానం కరువైంది. కనిగిరి ప్రాంతంలోని ప్రధాన చెరువులకు ఏర్పడిన గండ్ల వెనుక చేపల కాంట్రాక్టర్ల హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనిగిరి నియోజకవర్గంలో 100 ఎకరాల ఆయకట్టు ఉన్న మైనర్ చెరువులు 53, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన మోపాడు రిజర్వాయర్ ఉన్నాయి. కనిగిరి మండలంలో పునుగోడు, ఎన్గొల్లపల్లి రిజర్వాయర్లతోకలిపి 13 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా... 100 ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చెరువులు 30 వరకు ఉన్నట్లు నివేదికలున్నాయి. ఇక 100 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులు పామూరులో 7, హెచ్ఎంపాడులో 3, వెలిగండ్లలో 8, పీసీపల్లిలో 10, సీఎస్పురంలో 12 వరకు ఉన్నాయి. దెబ్బతిన్న తూములు, షట్టర్లు కనిగిరి నియోజకవర్గంలో మోపాడు రిజర్వాయర్ కింద 12 వేల ఎకరాల ఆయకట్టు, నేలటూరి గొల్లపల్లి మైనర్ రిజర్వాయర్ కింద 2,500 ఎకరాల ఆయకట్టు, పునుగోడు రిజర్వాయర్ కింద 2 వేల ఎకరాల ఆయకట్టు, పందువ గండి రిజర్వాయర్ కింద వెయ్యి ఎకరాలకు పైగా ఆయకట్టు భూములు ఉన్నాయి. నేలటూరి గొల్లపల్లి రిజర్వాయర్ కట్ట, తూము, షట్టర్లు, కాలువలు పూర్తిగా అవసాన దశకు చేరాయి. భారీ వర్షం పడితే లీకుల నుంచి ఉధృతంగా నీరు ప్రవహించకుండా ఇసుక బస్తాలు వేసి మమ అనిపించారు. రిజర్వాయర్ రెండు ప్రధాన కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పునుగోడు రిజర్వాయర్ షట్టర్ తుప్పు పట్టి విరిగిపోయింది. రిజర్వాయర్ కట్టకు రంధ్రాలు పడటంతోపాటు చెట్లు మొలిచాయి. కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచి గోడలు నెర్రెలిచ్చాయి. మోపాడు రిజర్వాయర్కు గతంలో 5 చోట్ల నీరు ఊటరాగా శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టలేదు. కలగట్ల, జమ్మలమడక చెరువు కట్టలు దెబ్బతిన్నా నేటికీ పట్టించుకున్న దిక్కులేదు. ● బలహీనంగా మారిన పామూరు పాత చెరువు కట్ట బలోపేతానికి ఎటువంటి నిధులు కేటాయించలేదు. పామూరు కొత్త చెరువు కట్ట సైతం బలహీనంగా మారింది. 2023లో వర్షాలకు చెరువు నీరు కట్టపైకి చేరగా తాత్కాలికంగా బలోపేతం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఎటువంటి చర్యలు చేపట్టలేదు. వగ్గంపల్లె చెరువు అలుగువద్ద కట్ట దెబ్బతినగా మరమ్మతుల సంగతే మరిచారు. ● హనుమంతునిపాడు మండలంలో హాజీపురం, నందనవనం, తిమ్మారెడ్డిపల్లి, మిట్టపాలెం, వీరరాంపురం, వాలిచర్ల చెరువులు మరమ్మతులకు గురయ్యాయి. హాజీపురం, దొడ్డి చింతల చెరువుల కింద 1,250 ఎకరాల ఆయకట్టు ఉంది. పదేళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోలేదు. కట్టపై చిల్ల చెట్లు మొలవడంతోపాటు రాతి కతువ సైతం దెబ్బతింది. చెరువు కాలువలు మరమ్మతులకు గురయ్యాయి. ● పీసీపల్లి మండలంలోని 15 మైనర్ ఇరిగేషన్ చెరువులు చిల్లచెట్లతో నిండిపోయాయి. తూముల వద్ద లీకులతో నీరు నిలబడే పరిస్థితి లేదు. గతంలో మారెళ్ల చెరువు వర్షానికి నిండినా తూములకు లీకులు ఏర్పడి నీరంతా వృథాగా పోయాయి. చేపల కోసమే గండ్లు? మోపాడు రిజర్వాయర్లో చేపలు పట్టుకోవడం కోసం అందులోని నీటిని బయటకు పంపేందుకు కొద్ది నెలల క్రితం కాంట్రాక్టర్లు జేసీబీతో అలుగు వాగుకు గండి కొట్టారు. దీనిపై ఆగ్రహించిన ఆయకట్టు రైతులు, వామపక్షాలు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ విషయం తీవ్ర చర్చకు దారితీసింది. అలాగే పునుగోడు రిజర్వాయర్లో చేపల కోసం నీటిని బయటకు పంపేందుకు కాంట్రాక్టర్లు రహస్యంగా రంధ్రాలు వేశారన్న ఆరోపణలున్నాయి. ఇరిగేషన్ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని, పురాతన కాలం నాటి గోడలు కావడంతో చెట్ల వేర్ల వల్ల రంధ్రాలు పడుతున్నాయని చెబుతున్నారు. ప్రతిపాదనలు పంపాం పునుగోడు, నేలటూరి గొలపల్లి షట్టర్లు, తూములు దెబ్బతిన్నది వాస్తవమే. కలగట్ల చెరువు కట్టకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఎన్.గొల్లపల్లి రిజర్వాయర్ మరమ్మతులకు రూ.46 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. పునుగోడు రిజర్వాయర్ షట్టర్కు రూ.3 లక్షలతో కొద్దిరోజుల్లోనే మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 30 చెరువుల మరమ్మతులకు రూ.12.70 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. చేపల వేట కోసం నీళ్లను బయటకు పంపించేందుకు గండ్లు కొట్టారన్న ప్రచారంలో వాస్తవం లేదు. – మధుబాబు, ఇరిగేషన్ జేఈ -
మధ్యవర్తిత్వంపై అవగాహన అవసరం
ఒంగోలు: కక్షిదారులు మధ్యవర్తిత్వంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు. మధ్యవర్తిత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించే ర్యాలీని గురువారం జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం నుంచి బయల్దేరిన ర్యాలీ సీవీఎన్ రీడింగ్ రూం సెంటర్, కేశవస్వామిపేట జంక్షన్, నగరపాలక సంస్థ కార్యాలయం మీదుగా చర్చిసెంటర్ వరకు కొనసాగింది. ర్యాలీలో న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొని 1కే రన్ను జయప్రదం చేశారు. అనంతరం చర్చిసెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై కక్షిదారులకు, సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన మీడియేషన్ టు నేషన్ స్టాల్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. 7వ అదనపు జిల్లా జడ్జి టి.రాజా వెంకటాద్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 59 మంది మీడియేటర్లను నియమించామన్నారు. వీరి ద్వారా వివిద స్థాయిల్లో ఉన్న వ్యాజ్యాలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ర్యాలీలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి.రాజ్యలక్ష్మి, ఎ.పూర్ణిమ, పి.లలిత, జి.దీన, కె.శైలజ, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు ఎస్.హేమలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, ఒంగోలు బార్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, ఒంగోలు నగర డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి -
ఈదుమూడిలో అగ్ని ప్రమాదం
నాగులుప్పలపాడు: షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన మండలంలోని ఈదుమూడిలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన కృష్ణమూర్తి పెంకుడు ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో రూ.50 వేల నగదు, ద్విచక్రవాహనం, ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమమయ్యాయి. అగ్నిప్రమాదంతో కట్టుబట్టలతో మిగిలామని బాధితులు వాపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో వాళ్లంతా తాళం వేసి గుడికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ప్రమాదం జరిగిందని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పంటలను అదుపు చేశారు. రూ.1.10 లక్షల నగదు చోరీ సింగరాయకొండ: ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడి రూ.1.10 లక్షల నగదు, వెండి పట్టీలు చోరీ చేశారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున మండల కేంద్రంలోని ప్రశాంతి థియేటర్ ఎదురు సందులో నివాసం ఉంటున్న పఠాన్ రఫీఖాన్ నివాసంలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం..రఫీఖాన్ ఈతముక్కలలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. మొహర్రం పండుగను పురస్కరించుకొని భార్య, పిల్లలు ఈతముక్కలలోని బంధువుల ఇంటికి వెళ్లారు. గురువారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయని, లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.1.10 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేటి నుంచి డిగ్రీ రెండో సెమిస్టర్ మూల్యాంకనం ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం డిగ్రీ రెండో సెమిస్టర్ మూల్యాంకనం ఒంగోలులోని డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని క్యాంప్ ఆఫీసర్ డాక్టర్ డి.కళ్యాణి తెలిపారు. మూల్యాంకనానికి ఎంపిక చేసిన అధ్యాపకులు యూనివర్శిటీ ఐడీ కార్డులు, తమ కాలేజీ ప్రిన్సిపాల్ లేఖతో కళాశాలలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. అధ్యాపకులను తక్షణమే రిలీవ్ చేయాలని ప్రిన్సిపాళ్లను క్యాంప్ ఆఫీసర్ గురువారం ఓ ప్రకటనలో కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి 40 రోజుల జైలు రాచర్ల: మద్యం మత్తులో లారీ నడుపుతూ పట్టుబడిన ఒక వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. రాచర్ల మండల పరిధిలో హైవేపై ఈ నెల 9న డ్రంక్ అండ్ పరీక్షలు చేస్తుండగా ఒంగోలు మండలం త్రోవగుంట గ్రామానికి చెందిన పట్టిం వెంకటరావు పట్టుబడ్డాడు. నిందితుడిని గురువారం గిద్దలూరు కోర్టులో హాజరుపరచగా ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి కె.భరత్చంద్ర 40 రోజులు జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరియానా విధించారని, ఆరు నెలలపాటు లైసెన్స్ రద్దు చేశారని ఎస్సై వివరించారు. కరేడు రైతుల కోసం పోరాడతాం.. ఉలవపాడు: కరేడు రైతుల కోసం ఎంతవరకు పోరాడేందుకై నా సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గురువారం కరేడులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడ రైతులు భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, వారు రాస్తారోఖో చేసిన రోజే వామపక్షాలు, వాటి అనుబంధ సంఘాలు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాయన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కార్పొరేట్ల పక్షమా.. లేక ప్రజల పక్షమా తేల్చుకోవాలన్నారు. ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ తప్పుడు సమాచారం మీడియాకు చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి పనులు చేయడం మంచిది కాదన్నారు. ప్రజలతో మాట్లాడకుండా బయట ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఓట్లు వేసిన రైతులకు మేలు చేస్తాడా.. లేక కంపెనీలకు మేలు చేస్తాడా.. అనేది నిర్ణయించుకోవాలన్నారు. భూములు లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు పేర్కొంటున్నారని గుర్తు చేశారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, అవసరం అనుకుంటే మనమే ఒక హత్య చేద్దామని అన్నారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కూడా మాట్లాడతానని, రైతుల సమస్యలు తెలియజేస్తానన్నారు. రైతుల సమస్యల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ఏకం చేస్తామన్నారు. రైతులు అమరావతి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తొలుత భూములు వద్ద రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేవీవీ ప్రసాద్, సీపీఐ ప్రకాశం, నెల్లూరు జిల్లాల కార్యదర్శులు నారాయణ, దామా అంకయ్య, రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమారెడ్డి, కరేడు రైతు ఉద్యమ నాయకులు మిరియం శ్రీనివాసులు పాల్గొన్నారు. -
మా భూములు ఆన్లైన్ చేస్తారా లేదా?
కొత్తపట్నం: తమ భూములను ఆన్లైన్ చేయకుండా రెవెన్యూ, రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకొంటూ 20 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నారని కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని అడ్డుకుని నిలదీశారు. వివరాలు.. కొత్తపట్నం మండలంలో కె.పల్లెపాలెం రెవెన్యూ సర్వే నంబర్ 1680లో 119.40 ఎకరాల భూమిని సుమారు 70 ఏళ్ల నుంచి రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో క్రయ విక్రయాలు కూడా జరిగాయి. అయితే భూముల ఆన్లైన్ ప్రక్రియ అమల్లోకి వచ్చాక రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆన్లైన్లో భూమి చూపించడం లేదన్న కారణంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అది రిజర్వ్ ఫారెస్ట్ భూమి తామేమీ చేయలేమంటూ రెవవెన్యూ అధికారులు చేతులెత్తేశారు. రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు మాత్రం అది తమ భూమి కాదంటున్నారు. సుమారు 20 ఏళ్లుగా ఈ రెండు శాఖల అధికారుల మధ్య ఏర్పడిన సమన్వయ లోపం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఓపిక నశించిన రైతులు ఇటీవల గ్రీవెన్స్లో అర్జీలు ఇచ్చారు. దీంతో ఆర్డీఓ లక్ష్మీప్రసన్న గురువారం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు సరైన సమాచారం తీసుకురాకపోవడంతో ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్టాదారు పాస్పుస్తకాలు, భూముల డాక్యుమెంట్లు, భూముల్లో సాగు చేసిన పంటలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రికార్డులు తనఖీ చేసి, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ఆర్డీఓ చెప్పారు. -
నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు
కొండపి: మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రత్యేక దృష్టి సారించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం స్థానిక పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్ పరిసరాలను, స్టేషన్ నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించారు. కేసుల రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అడ్డుకట్ట వేసేలా పటిష్ట బీట్ సిస్టంను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసి ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. గుడ్ ట్రయిల్ మానిటరింగ్ ద్వారా కేసుల్లో శిక్షలు పడేలా చూలన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాలను కట్టడి చేయడానికి ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో శక్తి యాప్ గురించి, వారికి ఉన్న రక్షణ చట్టాల గురించి శక్తి టీం బృందాలపై అవగాహన కల్పించాలన్నారు. నేరం జరిగేందుకు అవకాశం ఉన్న ప్రతి ప్రదేశాల్లో, వాణిజ్య సముదాయాల్లో, నిర్మానుష ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ ఏఆర్ దామోదర్, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐ సోమశేఖర్, కొండపి ఎస్సై ప్రేమ్కుమార్, పొన్నలూరు ఎస్సై అనూక్, మర్రిపూడి ఎస్సై రమేష్బాబు, సిబ్బంది పాల్గొన్నారు. హనుమంతునిపాడు: స్థానిక పోలీస్స్టేషన్ను ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐ ఖాజావలి, ఎస్సైలు కె.మాధవరావు, శ్రీరామ్లు ఐజీకి, ఎస్పీ దామోదర్కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐజీ మాట్లాడారు. ప్రస్తుతం హనుమంతునిపాడు పోలీస్స్టేషన్ కనిగిరిలో ఉందని, మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న భవనం పూర్తయిన వెంటనే అక్కడకు మారుస్తామన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, మహిళలు, బాలికలపై లైంగిక దాడుల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
సర్వం సాయి..
గురుపౌర్ణమి వేడుకలు జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి. సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సాయినాథులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలులోని సంతపేట, లాయర్పేట సాయి మందిరాలు కిటకిటలాడాయి. సామూహిక పూజలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భారీగా తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. – సాక్షి, ఒంగోలు వైఎస్సార్ సీపీ మున్సిపల్ విభాగం ప్రధాన కార్యదర్శిగా శివప్రసాద్ ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ మున్సిపల్ విభాగం ప్రధాన కార్యదర్శిగా చావలి శివప్రసాద్ను నియమించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించిన ఎస్ఈ ఒంగోలు వన్టౌన్: నగరంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఆ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) కట్టా వెంకటేశ్వర్లు గురువారం పరిశీలించారు. ఇందిరాకాలనీ, పులివెంకటరెడ్డికాలనీలో లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా నూతనంగా ఏర్పాటు చేసిన 63 కేవీ ట్రాన్స్ఫార్మర్లను తనిఖీ చేశారు. అనంతరం ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి.శ్రీకాంత్, ఏఈఈ ఎంఎస్వీ రవిప్రకాష్ పాల్గొన్నారు. -
పేరెంట్స్ సమావేశం కాదు.. టీడీపీ సంబరాలు..!
యర్రగొండపాలెం: ప్రభుత్వం పాఠశాలల్లో అట్టహాసంగా నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం కాస్తా టీడీపీ సంబరాలుగా మారాయి. ఈ సమావేశాల్లో పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్ కార్యాచరణ, ఆయా పాఠశాలల్లో ఉన్న సమస్యలపై చర్చించడం లాంటివి జరగాల్సి ఉంది. అందుకు భిన్నంగా టీడీపీ నాయకులు సమావేశాల్లో పాల్గొని ఊకదంపుడు ప్రసంగాాలతో ముగించారు. ఈ సమావేశాల్లో పేరెంట్స్ కేవలం 40 శాతం మంది మాత్రమే పాల్గొన్నారు. గణపవరం గురుకుల పాఠశాలలో సమావేశం ప్రారంభం కాకముందే ఆ పాఠశాల ప్రిన్సిపాల్తో ఎస్ఎంసీ చైర్మన్ వాదనకు దిగారు. పేరెంట్స్–టీచర్స్ సమావేశం జరుగుతుందని తమకు సమాచారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. పెద్దదోర్నాల కేజీబీవీ కళాశాలలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు కళాశాల ప్రాంగణంలోకి చేరుతున్న మురుగునీరు, కోతుల బెడదపై ప్రిన్సిపాల్ను నిలదీశారు. కళాశాల పరిసర ప్రాంతాల్లో మురుగునీటి నిల్వలతో తమ పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారని, కోతులు కళాశాలలో ఎక్కువగా ఉంటున్నాయని, దుస్తులు శుభ్రం చేసుకుని ఆరబెట్టుకునే సమయంలో అవి తమ పిల్లలపై ఎక్కడ దాడి చేస్తాయోనని ఆందోళనగా ఉందని అన్నారు. యర్రగొండపాలెం, పుల్లలచెరువు పాఠశాలల్లో జరిగిన పేరెంట్స్–టీచర్స్ మీటింగ్లో ఎటువంటి అర్హతలేని పచ్చనేతలు పాల్గొన్నారు. సమస్యలపై చర్చించేందుకు వెళ్లిన తల్లిదండ్రులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. -
ప్రకాశం
37 /277గరిష్టం/కనిష్టంనేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు మహిళలు, చిన్నారులపై నేరాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి జిల్లాలోని పోలీస్ అధికారులను ఆదేశించారు. కడగండ్లకు కారకులెవరు? కనిగిరి నియోజకవర్గంలో చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు అధ్వానంగా తయారయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధికి నోచుకోక నిరుపయోగంగా మారాయి.వాతావరణం ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటుంది. గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది.– 8లో.. శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025 -
అండగా ఉంటాం..అధైర్యపడొద్దు
● కోర్టు వద్ద కార్యకర్తలను పరామర్శించిన బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మ, అన్నా రాంబాబు పొదిలి: అక్రమ కేసుల్లో అరైస్టె రిమాండ్లో ఉన్న కార్యకర్తలకు పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు భరోసా ఇచ్చారు. రిమాండ్లో ఉన్న పార్టీ కార్యకర్తలు వాయిదా రోజైన గురువారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. ఈ మేరకు కార్యకర్తలను కలిసి ధైర్యం చెప్పారు. తప్పు చేయలేదని నిరూపించేంత వరకు పార్టీ లీగల్ టీం న్యాయ సేవలు అండగా ఉంటాయని చెప్పారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పొదిలి పోరుబాట కార్యక్రమం ఊహించనంత విజయవంతం కావడంతో ఓర్వలేని కూటమి నేతలు అక్రమంగా అరెస్టులు చేయించి జైలుపాలు చేశారన్నారు. తప్పు చేయని కార్యకర్తలు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. పార్టీ కోసం మీరు చేసిన సేవలు గుర్తుంటాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, మాజీ వార్డు సభ్యులు షేక్.మస్తాన్వలి, ముల్లా జాకీర్, రియాజ్, అన్నవరం బ్రహ్మారెడ్డి, దోర్నాల చిన్న నారాయణరెడ్డి, శింగారెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి
ఒంగోలు టౌన్: అధిక ధరలకు మద్యం విక్రయాలు చేయకుండా ఎకై ్సజ్ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు ఆదేశించారు. స్థానిక డీసీ కార్యా లయంలో బుధవారం నెలవారీ నేర సమీక్షా సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 10 ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ల పరిధిలోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు జరిగేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. దుకాణాల్లో అన్నీ బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గంజాయితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం అరికట్టేందుకు గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. అనధికార మద్యం విక్రయాలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. లోక్ అదాలత్ను అధికారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పెండింగ్ కేసులు ఉంటే వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను త్వరితగతిన వేలం వేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు ఈ.వెంకట్, ఏ.జనార్దన్రావు, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చలేని బాబు సిగ్గుపడాలి
నాగులుప్పలపాడు: ప్రజలకు నాలుగింతల మంచి చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి వాటిని నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒంగోలు విష్ణుప్రియ ఫంక్షన్ హాలులో బుధవారం నిర్వహించిన సంతనూతలపాడు నియోజకవర్గ స్థాయి బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యకర్తలు, నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న రెడ్బుక్ రాజ్యాంగం ద్వారా గొంతెత్తిన వారిపై అక్రమ కేసులు, జైళ్లలో పెడుతున్నా కార్యకర్తలు, నాయకులు ఏ మాత్రం భయపడకుండా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఈ సమావేశానికి వచ్చిన వేలాది మంది కార్యకర్తలే నిదర్శనమన్నారు. ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తే వాటిని ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఓ సంచలనంగా ఉందని, దీనిని చంద్రబాబు ప్రభుత్వం ఓర్చుకోలేక అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. పొగాకు రైతుల పక్షాన పోరాటం చేస్తే తట్టుకోలేని కూటమి నాయకులు ఆ సభలో రాళ్లు రువ్వి చేసిన గందరగోళం ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎన్ని కూటములు ఏకమైనా, కుట్రలు చేసినా ప్రజాతీర్పు భవిష్యత్లో జగన్మోహన్ రెడ్డికే ఉందన్నారు. ఈ సారి జగన్ 2.0 పాలనలో కార్యకర్తలే కీలకంగా మారనున్నారన్నారు. తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం గోతులు తీసే నాయకత్వం చేయనని, జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ పేద ప్రజల ప్రాణాలకు విలువ ఇస్తూ ఆనాడు పాదయాత్రలో డా.వైఎస్సార్ అమలు చేసిన 108, ఆరోగ్యశ్రీ అనేవి ఈనాటికీ ప్రజల్లో చిరస్థాయి గా నిలిచిపోయాయన్నారు. అలాంటి పాలనే మళ్లీ జగన్మోహన్ రెడ్డిలో చూశామని అన్నారు. రాబోయే రోజుల్లో మనందరం కలిసికట్టుగా సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల్లో మేరుగు నాగార్జున, శివప్రసాద్ రెడ్డిలకు అండగా ఉండాలని కార్యకర్తలను కోరారు. పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ డా.మేరుగు నాగార్జున మాట్లాడుతూ తాను ఈ నియోజకవర్గానికి వచ్చాక ఈ ప్రాంతానికి మహానేత వైఎస్సార్ వలన జరిగిన మంచిని కళ్లారా చూశానని ఇలాంటి ప్రాంతానికి తాను సేవ చేసే భాగ్యం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞుడనన్నారు. మోసపూరిత హామీలతో గెలిచిన కూటమి నాయకులు నేడు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పారిపోయే రకాన్ని కాదన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్తను గుర్తుపెట్టుకొని భవిష్యత్ లో వారికి సముచిత స్థానం కల్పించడానికి కృషి చేస్తానన్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ డొల్లతనం బయటపడిందన్నారు. హామీలేవీ అమలు చేయకుండా మోసగించిందన్నారు. పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. ముసలోళ్లు కూడా బటన్ నొక్కుతారని ఎద్దేవా చేసిన చంద్రబాబు తన ముసలితనంలో బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నాడో సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ చంద్రబాబు తన పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వలన జగన్ కు వస్తున్న ఆదరణ చూసి అసలు అధికారంలో ఎవరున్నారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న మాట్లాడుతూ ఈవీఎంల ట్యాంపరింగ్ తో గెలిచిన కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందన్నారు. అనంతరం త్వరలో క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించే క్యూఆర్ కోడ్ స్కానర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనగంటి పిచ్చిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పాలడుగు రాజీవ్, వేమా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, వెంకటేశ్వర్లు, మేధావుల సంఘం రాష్ట్ర సెక్రటరీ కంచర్ల సుధాకర్, మారెడ్డి సుబ్బారెడ్డి, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు మండల పరిషత్ అధ్యక్షుడు నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, వాకా అరుణ కోటిరెడ్డి, బుడంపాటి విజయ, యద్దనపూడి శ్రీనివాసరావు, మండలాధ్యక్షులు పమిడి వెంకటేశ్వర్లు, పోలవరపు శ్రీమన్నారాయణ, దుంపా చెంచిరెడ్డి, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు కిష్టిపాటి శేఖర్ రెడ్డి, తేళ్ల పుల్లారావు, బెజవాడ రాము, గుడ్డపాతల రవి, నారా విజయలక్ష్మి, నన్నపురెడ్డి రవణమ్మ, కాకర్లపూడి రజనీ, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలు -
బధిరుల సమస్యలను పరిష్కరించాలి
ఒంగోలు వన్టౌన్: జిల్లాలోని బధిరుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బధిరుల సంఘ నాయకులు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ సువార్తని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క బధిరునికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో బధిరులకు రిజర్వేషన్ రోస్టర్ను తప్పక పాటించాలని కోరారు. బధిరులకు రుణాలను మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో బధిర సంఘం అధ్యక్షుడు ఎం.రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి ఎం.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్గదర్శకులను త్వరగా గుర్తించాలి ● జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఒంగోలు సబర్బన్: పీ–4 పథకం కింద మార్గదర్శకులను త్వరగా గుర్తించాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలోని పురోగతిపై సమీక్షించేందుకు బుధవారం ఆయన ప్రకాశం భవనం నుంచి నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు, మండలాల స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు కూడా తమ శక్తి మేరకు ‘బంగారు కుటుంబాల’కు అండగా నిలిచేలా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తాను కూడా 10 కుటుంబాలను దత్తత తీసుకుంటానని చెప్పారు. ఈ నెలాఖరికే మార్గదర్శకుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసేలా దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో సుమారు 75 వేల బంగారు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ప్రజా ప్రతినిధులను, ఉన్నత విద్యావంతులను, వ్యాపార, పారిశ్రామికవేత్తలను సంప్రదించి ‘మార్గదర్శకులు’గా వారు ముందుకు వచ్చేలా చూడాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
ఒంగోలు టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాలను దేశంలోని అన్నీ వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, తీరు మార్చుకోకుంటే మరింత ఉధృతంగా పోరాటాలను కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లకు అనుకూలంగా పనిగంటలను పెంచిందని మండిపడ్డారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డిపో నుంచి అద్దంకి బస్టాండు సెంటర్, మస్తాన్ దర్గా, ట్రంకు రోడ్డు, చర్చి సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ప్రకాశం భవనం వద్ద నిర్వహించిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన దేశంలోని నిరుపేద ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ధనవంతులు, అవినీతిపరులు, అక్రమార్కులు మాత్రమే ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని చెబుతున్నారని అన్నారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కనీసం మౌలిక వసతులను కూడా కల్పించలేని పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. నిరుద్యోగం పెరిగిపోతుందని, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా రూ.30 కోట్ల మంది ప్రజలు రోడ్డెక్కి పోరాడుతున్నారని తెలిపారు. కనీస వేతన చట్టాలు అమలు చేయాలి: సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల కోసం కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కనీస వేతన చట్టాలను అమలు చేయాలని, కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మానుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం దొడ్డిదారి ప్రయత్నాలు మానుకోకపోతే రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లు అమలులోకి వస్తే కార్మికులు తమ హక్కులను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు, ఉద్యోగుల అభిప్రాయాలను లెక్కచేయకుండా ఏకపక్షంగా చట్టాలను మార్చడం నియంతృత్వానికి నిదర్శనమన్నారు. ఉపాధిహామీ పనులను ఏడాదిలో 200 రోజులు నిర్వహించాలని, రోజుకి రూ.600 వేతనం ఇవ్వాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశ యూనియన్ల నాయకులు అన్నపూర్ణ, మేరి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్కీం వర్కర్లను తొలగించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీ సమ్మెకు ఎస్డీపీఐ నాయకులు షేక్ సత్తార్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎస్.లలిత కుమారి, బి.పద్మ, శ్రీరాం శ్రీనివాసరావు, జి.రమేష్, తంబి శ్రీనివాస్, ఎంఏ సాలార్, తాళ్లూరు వెంకటేశ్వర్లు, జె.ఉదయ కిరణ్, టి.విజయ, కేవీ సుబ్బమ్మ, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న చంద్రబాబు సర్కార్ సార్వత్రిక సమ్మెలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు హెచ్చరిక -
నాన్ బెయిలబుల్ కేసులో నిందితుడు అరెస్టు
టంగుటూరు: నాన్ బెయిలబుల్ కేసులో నిందితున్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ కారుమంచి గ్రామానికి చెందిన దోనంపూడి అచ్చమ్మకు భర్త దోనంపూడి రమేష్ మెయింటెనెన్స్ భరణం చెల్లించాలి. కానీ చెల్లించకపోవడంతో అచ్చమ్మ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా ఎస్సై నాగమల్లేశ్వరరావు, సిబ్బంది అరెస్టు చేసి ఎకై ్సజ్ కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ నెల రోజుల జైలుశిక్ష విధించారు. అక్రమ మద్యం విక్రేత అరెస్ట్ గిద్దలూరు రూరల్: మండలంలోని సంజీవరాయుడుపేట గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. స్థానిక ఎకై ్సజ్ శాఖ సీఐ ఎం.జయరావు తన సిబ్బందితో కలిసి గ్రామంలో సోదాలు నిర్వహించగా ఓ వ్యక్తి 10 మద్యం సీసాలతో పట్టుబడ్డాడు. తనిఖీల్లో సిబ్బంది శ్రీపతి, ఆర్షాదుల్లా, శంకర్, హరిబాబు పాల్గొన్నారు. వక్ఫ్ భూముల్లో ఆక్రమణల తొలగింపు పొదిలి: వక్ఫ్ భూముల్లో ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగిస్తామని నగర పంచాయతీ కమిషనర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. షెడ్లు ఏర్పాటు చేసుకుని, వాస్తవంగా నివాసం ఉంటున్న వారికి ప్రత్యామ్నాయం చూపుతామని చెప్పారు. ఇదిలా ఉండగా ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకుడు మోహన్ధర్మా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. నోటీసులు ఇవ్వకుండా నివాసాలు తొలగించడం సరికాదని, పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోగులకు మెరుగైన సేవలందించాలి ● ఇన్చార్జి కలెక్టర్ గోపాలకృష్ణ మద్దిపాడు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్య శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఇన్చార్జి కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవల వివరాలు, రోగుల రిజిష్టర్లు, రికార్డులు, క్యాజువాలిటీ రూం, అత్యవసర సేవా విభాగాన్ని, మెడిసిన్స్ భద్రపరుస్తున్న విధానాలను పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మూమోంట్ రిజిష్టర్, సిబ్బంది డ్యూటీ చార్ట్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ప్రసవాలు చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ ఆదిలక్ష్మి, ఎంపీడీఓ వి.జ్యోతి, ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శ్రావణ్, డాక్టర్ అన్వేష్, వైద్య శాఖ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో మెరుగైన పరిష్కారం
ఒంగోలు: న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం అనేది భవిష్యత్తు రోజుల్లో కక్షిదారుల సమస్యలను మరింత మెరుగ్గా పరిష్కరించనుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎ.భారతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా న్యాయస్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియేషన్ ఫర్ ద నేషన్ అనే కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం అనేది సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వేదికని అన్నారు. ఈ కార్యక్రమంపై ఈనెల 10 నుంచి 17వ తేదీ వరకు విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. మీడియేషన్కు సంబంధించి శిక్షణ ముగించిన న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల సేవా ప్రతినిధులు వారికి అప్పగించిన మీడియేషన్ వ్యాజ్యాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. మీడియేషన్పై స్థానిక న్యాయవాదులకు శిక్షణ ఇచ్చిన న్యాయవాది ఎస్.అరుణాచలంను అభినందించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి.రాజ్యలక్ష్మి, పి.లలిత, పూర్ణిమ, జి.దీన, టి.రాజా వెంకటాద్రి, సీనియర్ న్యాయమూర్తులు ఎస్.హేమలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, జూనియర్ న్యాయమూర్తులు, ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. నేడు కిలోమీటరు నడక మధ్యవర్తిత్వ అంశాన్ని కక్షిదారుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో భాగంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ గురువారం చేపట్టిన కిలోమీటరు నడక కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొనాలని ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 8.50 గంటలకు జిల్లా న్యాయస్థానం నుంచి చర్చి సెంటర్ వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. మూలికా వైద్య సంఘ జాతీయ అధ్యక్షుడిగా ఇమాంసాహేబ్ మార్కాపురం టౌన్: వంశపారంపర్య మూలికా వైద్య సంఘ జాతీయ అధ్యక్షుడిగా మార్కాపురం పట్టణానికి చెందిన మూలికా వైద్యుడు షేక్ ఇమాంసాహేబ్ ఎన్నికయ్యారు. రావులపాలెంలో నిర్వహించిన ఆయుర్వేద మూలికా వైద్యుల సమావేశంలో తనతోపాటు కార్యదర్శులుగా రామకృష్ణారెడ్డి, శంకర్, సహాయ కార్యదర్శిగా రాజు, మరికొందరు సభ్యులను ఎన్నుకున్నారయని ఆయన వివరించారు. -
జాడ లేని లక్ష్మిత్.. పోలీసుల ముమ్మర గాలింపు
కంభం: అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా.. పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కంభం మండలంలోని లింగోజిపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వచ్చిన మూడేళ్ల బాలుడు పొదిలి లక్ష్మిత్ అదృశ్యమైన సంగతి తెలిసిందే. తొలిరోజు మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ కె.మల్లికార్జున , ఎస్సై నరసింహారావు తమ సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరాలతో గ్రామ పరిసరాలను జల్లెడ పట్టినా ఆచూకీ లభించలేదు. బుధవారం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో నల్లవాగు వద్ద బాలుడి చెప్పులను పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు భారీగా నల్లవాగు వద్దకు చేరుకుని వెదికినా ఫలితం లేకుండా పోయింది. ఆగంతకులు ఎత్తుకెళ్లారా? బాలుడి చెప్పులు వాగు వద్ద గుర్తించిన పోలీసులు ఒంగోలు నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ను రప్పించారు. తొలుత పోలీస్ జాగిలం సంఘటనా స్థలం నుంచి నేరుగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్దకు వెళ్లి ఆగింది. రెండోసారి సంఘటనా స్థలం నుంచి నేరుగా సూరేపల్లి సమీపంలో కంభం–తర్లుపాడు రోడ్డుపైకి వచ్చి ఆగింది. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ బృందం వేలిముద్రలు సేకరించింది. పోలీస్ జాగిలం వెళ్లిన మార్గాన్ని బట్టి చూస్తే ఆగంతకులు బాలుడిని తీసుకుని నల్లవాగు వెంబడి సూరేపల్లి వద్ద రోడ్డుపైకి చేరుకుని వాహనంలో వెళ్లిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాలుడిని తీసుకెళ్తున్న క్రమంలో వాగు వద్ద చెప్పులు జారి పడినట్లు తెలుస్తోంది. గాలింపు చర్యల్లో 5 బృందాలు బాలుడి అదృశ్యం కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు మార్కాపురం డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో సీఐ కె.మల్లికార్జున ఆధ్వర్యంలో 5 బృందాలుగా ఏర్పడి కంభం, మార్కాపురం, తర్లుపాడు, గిద్దలూరు, పొదిలి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో గాలిస్తున్నారు. కొందరు కొత్త వ్యక్తులు చెత్త ఏరుకునేందుకు గ్రామంలోకి వచ్చారని గ్రామస్తులు చెబుతున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ విచారిస్తున్నారు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న పోలీసులు పంట పొలాల్లో నల్లవాగు సమీపంలో బాలుడి చెప్పులు లభ్యం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు గొట్లగట్టులో విషాద ఛాయలు కొనకనమిట్ల: లక్ష్మిత్ అదృశ్యం కావడంతో స్వగ్రామం కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో విషాద ఛాయలు నెలకొన్నాయి. బాలుడి తండ్రి పొదిలి శ్రీను ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉండగా, ఇటీవల వరకు లక్ష్మిత్ తన తల్లి సురేఖ, నానమ్మ తులశమ్మతో కలిసి గొట్లగట్టులో ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం లక్ష్మిత్ అమ్మమ్మ స్వగ్రామమైన కంభం మండలం లింగోజిపల్లికి వెళ్లాడు. ఎంతో చలాకీగా ఉండే లక్ష్మిత్ అదృశ్యం కావడంపై బంధువులతో పాటు గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. లక్ష్మిత్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా లక్ష్మిత్ అదృశ్యమైన ఘటన గ్రామాల్లో చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. -
ఎస్ఎంసీ చైర్మన్ అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం
యర్రగొండపాలెం: స్కూల్ మానిటరింగ్ కమిటీ(ఎస్ఎంసీ) చైర్మన్ అరాచకాలను తట్టుకోలేకపోతున్నామని, తమను మురికిమల్ల గిరిజన ఆశ్రమ పాఠశాల నుంచి ఎక్కడికై నా డిప్యుటేషన్పై బదిలీ చేయాలని కోరుతూ బుధవారం ఆ పాఠశాల హెచ్ఎం, పలువురు ఉపాధ్యాయులు డీటీడబ్ల్యూఓ వరలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. పుల్లలచెరువు మండలంలోని మాచర్ల హైవే రోడ్డుపై ఉన్న మురికిమల్ల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ బయ్యన్నతోపాటు మరో ఐదుగురు ఉపాధ్యాయులు మూకుమ్మడిగా సెలవుపెట్టి ఒంగోలు వెళ్లారు. అక్కడ డీటీడబ్ల్యూవో కార్యాలయంలో తమ గోడును లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఎస్ఎంసీ చైర్మన్ అనుమతి లేకుండా తాము పాఠశాలలోకి వెళ్లేందుకు వీలులేదని, రోజూ రోడ్డుపై నిల్చుని నమస్కారం చేసి పాఠశాలలోకి వెళ్లాలని చెబుతున్నాడని, ఆయన అనుమతి లేకుండా న్యూఅడ్మిషన్స్ చేర్చుకోవద్దని హుకుం జారీ చేస్తున్నాడని వినతి పత్రంలో ఉపాధ్యాయులు ఆరోపించారు. తనకు ఇష్టం వచ్చినప్పుడల్లా పాఠశాలలోకి వచ్చి ఫొటోలు, వీడియోలు తీస్తుంటాడని, క్లాస్ రూంలోకి వెళ్లి టీచర్ను బయటికి పంపి తానే క్లాస్ తీసుకుంటాడని, విద్యార్థుల ఎదుట హెచ్ఎంను, ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడుతున్నాడని డీటీడబ్ల్యూఓ దృష్టికి తీసుకెళ్లారు. వర్కర్స్ను బెదిరించి స్టోర్ రూంలోకి వెళ్లి అక్కడ ఉన్న నిత్యావసర సరుకులను తీసుకెళ్తుంటాడని, స్కూల్లో ఏమైనా కార్యక్రమాలు జరుగుతుంటే టీచర్స్ అందరూ కలిసి ఆయన ఇంటి వద్దకు వెళ్లి పిలవాలని హుకుం జారీ చేస్తున్నాడని, పాల్–లాబ్కు సంబంధించి రూ.22,500 అకౌంట్లో పడితే వాటిని డ్రా చేసి తనకు ఇవ్వమంటున్నాడని అర్జీలో పేర్కొన్నారు. సాధారణ బదిలీలపై ఉపాధ్యాయులు వెళ్లిపోతే వారికి తానే బదిలీ చేయించానని ప్రచారం చేస్తున్నాడని, ఎస్ఎంసీ చైర్మన్కు స్కూల్లో ప్రత్యేకంగా ఒక చాంబర్ ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీఇది నా స్కూల్, నాకు తెలియకుండా ఏ పని చేయకూడదశ్రీని ఆదేశాలిస్తున్నాడని, జిల్లా, మండల స్థాయి అధికారులు, ఫారెస్ట్ అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను కూడా ఆయన అనుమతి లేకుండా రానివ్వవద్దంటూ నిప్పులు చెరుగుతున్నాడని వినతి పత్రంలో పేర్కొన్నారు. గత జనవరిలో గిరిజన బాలికలను అరకులో చలి ఉత్సవాలకు తీసుకెళ్లాలని కలెక్టర్ ఆదేశించారని, ఆ ఉత్సవాలకు వెళ్లే బాలికలతోపాటు తాను కూడా వస్తానని, లేదంటే తనకు ప్రత్యేకంగా కారు కేటాయించి తీసుకెళ్లాలని ఒత్తిడి చేశాడని, అందుకు తాము అనుమతించలేదని డీటీడబ్ల్యూఓకు వివరించారు. బయట గ్రామాల్లో ఆయన కనిపిస్తే నమస్కారం చేసి, బిర్యానీ పెట్టించి, ఖర్చులకు డబ్బు ఇవ్వాలని అడుగుతున్నాడని టీచర్లు తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఎస్ఎంసీ చైర్మన్ అరాచకాలను తాము తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, వెంటనే తమను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని వేడుకున్నారు. మురికిమల్ల ఆశ్రమ పాఠశాల నుంచి బదిలీ చేయండి మూకుమ్మడిగా సెలవు పెట్టిన హెచ్ఎం, ఐదుగురు టీచర్లు డీటీడబ్ల్యూఓ వరలక్ష్మికి వినతి పత్రం అందజేత -
నీటి కుంటలో పడి యువకుడు మృతి
కురిచేడు: ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన కురిచేడు మండలంలోని అలవలపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రావి పెద్దకోటయ్య పొలం వద్ద ఉద్యానవనశాఖ నీటి కుంట నిర్మించింది. దాని కొలతల కోసం ఉద్యానశాఖ సిబ్బంది వచ్చారని, తోడుగా రమ్మని కొరివి రోశయ్య(30)ను పెద కోటయ్య తన వెంట తీసుకెళ్లాడు. కుంట కొలతలు తీసేందుకు గట్టుపై మెట్లు చెక్కాలని రోశయ్యను కోరాడు. పనిచేస్తున్న క్రమంలో అలసట తీర్చుకునేందుకు రోశయ్య కట్టపై ఉన్న వేప చెట్టు కింద కూర్చున్నాడు. ఆ సమయంలో ఏమైందో తెలియదు నీటి కుంటలో పడిపోయాడు. రైతుతోపాటు ఉద్యాన సిబ్బంది నీటి కుంటలో దిగి వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, వీఆర్వో రమాదేవి సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీతో కుంట కట్టకు గండి కొట్టించి నీటిని బయటకు పంపారు. రోశయ్య అప్పటికే మృతి చెందగా మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని భార్య గంగాభవాని ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో ఒక అబ్బాయి దివ్యాంగుడు. సంఘటనా స్థలానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యానవనశాఖ సిబ్బంది కొలతల సందర్భంలో ఘటన -
కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన
ఒంగోలు సబర్బన్: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు ఏఐబీఈఏ ఆధ్వర్యంలో బుధవారం సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని యూనియన్ బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ నుంచి నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా ప్రకాశం భవనం వద్ద కార్మిక సంఘాల ధర్నాలో పాల్గొన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పి. సుబ్బారావు, కె.రాజీవ్ రతన్దే్ , పి.రామయ్య, ఉమాశంకర్, హాసన్, బ్రహ్మానాయుడు, దుర్గాప్రసాద్, గాయత్రి తదితరులు నాయకత్వం వహించారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగ నాయకులు పీకే రాజేశ్వరరావు, వి.పార్ధసారధి, సీబీ రావు, బ్రహ్మయ్య తదితరులు వారి సమ్మెకు సంఘీభావం తెలిపారు. విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి పుల్లలచెరువు: విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొండారెడ్డి కొష్టాలు గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన మునగాల శేషరెడ్డి(65) అనే రైతు చౌటపాచర్ల గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ట్రాన్స్పార్మర్ తీగలు తగిలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంతప్కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య సీతారావమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా పాలన బ్యాంకు ఉద్యోగుల ధర్నాలో యూనియన్ నాయకుల ధ్వజం -
13న ఉచిత మెగా వైద్య కంటి శిబిరం
చీమకుర్తి: బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈనెల 13న చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. చీమకుర్తిలోని బూచేపల్లి కమలాకర్రెడ్డి పార్కులో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్ల నుంచి సినీ హీరో బూచేపల్లి కమలాకర్రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని శంకర కంటి ఆస్పత్రి వారి సహకారంతో కంటి వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 13వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు శంకర కంటి ఆస్పత్రి వైద్యులతో నిర్వహించే వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. హాజరైన రోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి మందులను ఉచితంగా అందిస్తారన్నారు. కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తే శంకర కంటి ఆస్పత్రికి బస్సుల్లోఉచితంగా తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించి తిరిగి చీమకుర్తిలో వదిలిపెడతారని తెలిపారు. వైద్య శిబిరంలో పాల్గొనే రోగులందరికీ మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని కూడా బూచేపల్లి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తొలుత ఉచిత మెగా కంటి వైద్య శిబిర వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మండల రూరల్ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్.మాణిక్యం, కౌన్సిలర్లు బీమన వెంకట్రావు, సోమా శేషాద్రి, పాటిబండ్ల గంగయ్య, ఖాజా, గోపురపు చంద్ర, మేకల యల్లయ్య, బడే అయ్యపరెడ్డి, తెల్లమేకల గాంధీ, చీదర్ల శేషు, కుంచాల రాంబాబు, షేక్ ఖాదర్బాషా, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బూచేపల్లి ట్రస్టు, శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో సినీ హీరో బూచేపల్లి కమలాకర్రెడ్డి వర్ధంతి సందర్భంగా.. -
మహా నివాళి!
జన బాంధవుడికి..వాడవాడలా సేవా కార్యక్రమాలు దర్శి నియోజకవర్గంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ నేతృత్వంలో అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరిగాయి. దర్శి వైఎస్సార్ సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. శివరాజ్నగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. ముండ్లమూరు మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి. వెంకాయమ్మ పాల్గొన్నారు. కురిచేడు బస్టాండ్సెంటర్లో పార్టీ నాయకులు అన్నదానం, మండలం పడమర వీరాయిపాలెం లోనిశ్రీ కరుణా వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. దొనకొండ పట్టణంలో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొండపిలో.. వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సింగరాయకొండ కందుకూరు రోడ్డు సెంటర్, బాలయోగినగర్ ఆర్చి, సుందర్నగర్, మూలగుంటపాడు, పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని వైఎస్సార్కు నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. బాలయోగినగర్లో దుస్తులు పంపిణీ చేశారు. ఆరోగ్య ప్రదాత వైఎస్సార్ చరిత్రలో గుర్తు పెట్టుకోగలిగిన నాయకుడు, ‘ఆరోగ్యశ్రీ’ తో ప్రజల గుండెల్లో నిలిచిన ఆరోగ్యప్రదాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి కొనియాడారు. మంగళవారం ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరంలను ముఖ్య అతిథులుగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, మాజీ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావులు ముఖ్య అతిథులుగా పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 45వ డివిజన్లో, చర్చి సెంటర్లోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పేదల కోసం పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని మ్యానిఫెస్టోలో పెట్టి రైతు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్కు దక్కుతుందన్నారు. 108, 104, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రజలకు దగ్గర చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు. ఇటువంటి నాయకుడిని చరిత్ర గుర్తు పెట్టుకుంటుందన్నారు. వైఎస్సార్ హాయాంలో ఎమ్మెల్యేగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి నిలిచిఉన్నారని, చిరస్మరణీయుడని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలన్నింటినీ గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్రెడ్డి అమలు చేశారన్నారు. 2029 లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారన్నారు. వై.పాలెంలో.. మహానేత వైఎస్సార్ జయంతిని వైపాలెం నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించారు. వై.పాలెంలోని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకులు వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పుల్లలచెరువు, పెద్దారవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకంలో ఆ పార్టీ నాయకులు వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాజన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు ఊరూ..వాడ అన్నదానాలు రక్తదాన శిబిరాలు.. వృద్ధాశ్రమాల్లో పండ్లు, దుస్తుల పంపిణీ -
ఓటర్ల జాబితాలో పొరపాట్లకు తావివ్వద్దు
● జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గోపాల కృష్ణ ఒంగోలు సబర్బన్: పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడంలో బీఎల్ఓల బాధ్యతలు కీలమని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ సూచించారు. మంగళవారం ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఓటర్ జాబితా తయారీ, బీఎల్ఓ యాప్ నిర్వహణపై ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి బీఎల్ఓలకు, బీఎల్ఓ సూపర్వైజర్లకు సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకుని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు అర్బన్ తహశీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు, బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రి ఫీజుల రేట్లు తెలియచేయాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ అల్లోపతి ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–2002 రూల్ నంబర్ 9 ప్రకారం జిల్లాలోని అన్నీ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, లేబొరేటరీలలో వసూలు చేసే ఫీజుల వివరాలను ఇంగ్లిషుతో పాటు స్థానిక భాషలో రిసెప్షన్ కౌంటర్ల వద్ద రోగులకు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, లేబొరేటరీలలో లభ్యమయ్యే సేవల వివరాలను ఈ నెల 15వ తేదీలోపు జిల్లా వైద్యారోగ్య శాఖ ఈ మెయిల్కు పంపించాలని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసే నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులను మోసం చేసిన మంత్రి లోకేష్ ఒంగోలు టౌన్: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ విద్యార్థి లోకాన్ని మోసం చేశారని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మిరియాలపాలెం సెంటర్లోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నాసర్జీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తూ తూ మంత్రంగా కేవలం రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ నాటికి రూ.3900 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండగా రూ.2600 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఆ కేటాయింపులు కేవలం పేపర్ల మీదకు మాత్రమే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. ఇంత వరకు కనీసం ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రుపాయికి కూడా రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదన్నారు. దీంతో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయని, విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్నా ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్లు తెచ్చుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి ఇచ్చిన మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఫణిరాజు, మరియబాబు, మధు, హుసేన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల హామీలపై నిలదీయండి
కనిగిరిరూరల్: ఎన్నికల హామీలు అమలు చేయకుండా కల్లిబొల్లి మాటలతో సుపరిపాలన పేరుతో గ్రామాల్లో తిరుగుతున్న కూటమి నేతలను పార్టీ శ్రేణులు, ప్రజలు.. హామీలు ఏమయ్యాయో నిలదీయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్రెడ్డి అన్నారు. స్థానిక పవిత్ర కళ్యాణ మండపంలో బాబు షూరిటీ–మోసం గ్యారంటీ (రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో) కు సంబంధించి క్యూర్ కోడ్ కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఎస్కే గఫార్ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో శివ ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ మోసం, వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు, మరో 143 హామీలతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి.. ఏడాదైనా వాటిని అమలు చేయకుండా తీవ్ర మోసం చేస్తున్నాడని విమర్శించారు. 2014, 2024 రెండు దఫాలు అబద్ధాల, మోస పూరిత హామీలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసి.. ప్రజా మన్ననలు పొందిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ 2.0 పాలనలో ప్రతి కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు. కనిగిరిలో పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కొరవ లేదని.. పార్టీ విజయానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని బూచేపల్లి శివ ప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. అక్రమ కేసులకు భయపడేది లేదు: బూచేపల్లి వెంకాయమ్మ కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. అటువంటి వాటికి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భయపడరని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలూ సంతోషంగా లేరన్నారు. సుపరిపాలన పేరుతో గ్రామాల్లో తిరుగుతున్న నేతలను హామీల అమలుపై గట్టిగా ప్రశ్నించాలన్నారు. ఎవరూ ఎల్లప్పుడు శాశ్వతంగా అధికారంలో ఉండరని.. మారుతుంటాయని.. అధికార పార్టీ నాయకులు అది గమనించుకుని.. వేధింపులు మానుకుని పథకాల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. బొద్దింకలు, వెంట్రుకల ఉన్న భోజనం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పెడుతున్నారని మండిపడ్డారు. కూటమి మోసాలను ప్రజలకు వివరించాలి: దద్దాల నారాయణ యాదవ్ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు వివరించేందుకు పార్టీ నేతలు, శ్రేణులు, అంతా సమష్టిగా పనిచేద్దామని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్కు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పేలా పనిచేద్దామన్నారు. కనిగిరిలో వైఎస్సార్ సీపీ జెండాను ఎగురేద్దామన్నారు. పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు: బత్తుల, కదిరి కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెప్పి.. అధికారంలోకి వచ్చారని పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, విశాఖపట్నం పరిశీలకుడు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, డీసీసీబీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు సున్నం పెట్టారని విమర్శించారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా సుపరిపాలన పేరుతో గ్రామాల్లోకి వస్తున్న టీడీపీ నేతలను యువకులు నిరుద్యోగ భృతి, ఉపాధి, ఉద్యోగాలు ఎక్కడా అని..? మహిళలు ఉచిత బస్సు ఏదీ అని..? విద్యార్థులు తల్లులు తల్లికి వందనం బిడ్డలందరికీ ఎందుకు ఇవ్వలేదనీ..? భరోసా, బీమా ఎక్కడా అని రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. కూటమి సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు గుంటక తిరుపతిరెడ్డి, కస్తూరిరెడ్డి, పులి శాంతి గోవర్ధన్రెడ్డి, తమ్మినేని సుజాతరెడ్డి, చింతంగుంట్ల సాల్మన్, వైఎం సరితా ప్రసాద్రెడ్డి, గంగసాని హుస్సేన్రెడ్డి, డాక్టర్ రసూల్, రహీం, సిద్దారెడ్డి, ఎస్కే జిలాని, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, ఎస్ నరసారెడ్డి, శ్రీహరిరెడ్డి, కాకర్ల వెంకటేశ్వర్లు, జీ ఆదినారాయణరెడ్డి, కటికల వెంకటరత్నం, యక్కంటి శ్రీనివాసులరెడ్డి, గట్టా విజయభాస్కర్రెడ్డి తదితరులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు మేకల శ్రీనివాస్ యాదవ్, చప్పిడి వెంకట సుబ్బయ్య, లక్ష్మీకాంతం రెడ్డి, ఎంపీపీలు గాయం సావిత్రి, మూడమంచు వెంకటేశ్వర్లు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఎస్కే చాంద్బాషా, యక్కంటి శ్రీను, జీ బొర్రారెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, పాలుగుల్ల మల్లి కార్జునరెడ్డి, వైస్ ఎంపీపీలు దుగ్గిరెడ్డి ప్రతాప్రెడ్డి, లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి, భూమిరెడ్డి వెంకటరెడ్డి, ముత్యాల నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీలు గాయం బలరాంరెడ్డి, భువనగిరి వెంకటయ్య, గట్ల విజయభాస్కర్రెడ్డి, ఎస్కే బుజ్జీ, ఆవుల భాస్కర్, పిల్లి లక్ష్మీ నారాయణరెడ్డి, పోలు జయరాంరెడ్డి, మితికల గురవయ్య, సాయి, పల్నాటి భాస్కర్రెడ్డి, వాకుమళ్ల రాజశేఖరరెడ్డి, ఎం నాగమణి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
తండ్రిపై హత్యాయత్నం కేసులో కుమారుడికి రిమాండ్
టంగుటూరు: తండ్రిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన కుమారుడికి రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామానికి చెందిన దివి చందు కొంత కాలం నుంచి చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో తల్లిదండ్రులను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. దీనిపై జూన్ 12వ తేదీ అతని తల్లిదండ్రులు దివి వెంకటరావు, దివి లక్ష్మి ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసం తమను చందు ఇబ్బందిపెడుతూ కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అడిగినప్పుడల్లా డబ్బులివ్వకపోతే చంపుతానని బెదిరించినట్లు చెప్పారు. అతనికి భయపడి బంధువుల ఇంటి వద్ద ఉంటున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ పెన్షన్ కోసం ఆలకూరపాడు గ్రామానికి దివి వెంకటరావు, దివి లక్ష్మి రాగా, రాత్రి 8.45 గంటల సమయంలో ఇంటికొచ్చిన చందు.. తన తండ్రి దివి వెంకటరావుతో గొడవపడ్డాడు. అతన్ని చంపాలనే ఉద్దేశంతో కర్ర తీసుకుని తలపై కొట్టగా తీవ్రగాయమైంది. వెంటనే ఒంగోలు జీజీహెచ్కి స్థానికులు తరలించారు. క్షతగాత్రుడి భార్య దివి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె కుమారుడు దివి చందుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సోమవారం అతన్ని అరెస్టు చేసి సింగరాయకొండ కోర్టులో జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై వివరించారు. ఏకేయూ కళాశాల నూతన ప్రిన్సిపాల్గా నిర్మలామణి ఒంగోలు సిటీ: మూడేళ్ల క్రితం ఏర్పడిన ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఇప్పటి వరకు వైస్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే కాకుండా తన పదవీ కాలంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ పదవికి వన్నె తెస్తానని అన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తానన్నారు. ఏకేయూ ఉప కులపతి, ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి సూచనల మేరకు ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్గా తనను నియమించిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నూతన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిర్మలామణిని సహచరులైన ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఓఎస్డీ, పూర్వపు ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుత్తి రాజమోహన్రావు, ఏకేయూ పరీక్షల నియంత్రణ అధికారి (సీఈ), ఏకేయూ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.సోమశేఖర్తో పాటు ఆంధ్రకేసరి యూనివర్సిటీకి చెందిన బోధన, బోధనేతర సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు బ్రహ్మయ్యమాదిగ ఒంగోలు వన్టౌన్: ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల అలుపెరుగని పోరాటం ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలో సోమవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో మాదిగ మహామేళా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్యమాదిగ మాట్లాడుతూ 30 సంవత్సరాల మాదిగల ఆశ, ఆకాంక్ష నెరవేరిందన్నారు. 1994 నుంచి 2024 వరకూ ఎస్సీ వర్గీకరణ పోరాటం జరిగిందన్నారు. 1994 జూలై 7వ తేదీ జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం ఈదుమూడిలో ఎస్సీ వర్గీకరణ కోసం 20 మందితో ఎమ్మార్పీఎస్ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మాదిగ దండోరా పేరుతో ఉద్యమాన్ని సాగించామన్నారు. పార్లమెంటులో చట్టం చేయాలనే డిమాండ్తో 2004 నుంచి 2023 వరకూ నిత్యం ఉద్యమం నిర్వహించామన్నారు. ఢిల్లీ వీధుల్లో కూడా వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
అడుగంటిన ఆశలు
అడుగంటి పోతున్న కంభం చెరువు (ప్రస్తుతం 5 అడుగులు ఉన్న నీటిమట్టం)గోవిందాపురం సమీపంలో చెరువు నీళ్ళతో చిన్నపాటి చెరువులను తలపిస్తున్న బీడుభూములుపెద్దకంభం తూములనుండి లీకేజి ద్వారా పంటకాల్వల్లో పారుతున్న నీళ్ళుకంభం: ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదైన కంభం చెరువు నిండితే మూడేళ్ల వరకు ఆయకట్టు కింద అధికారికంగా 6944 ఎకరాలు, అనధికారింగా 12 వేల ఎకరాలు సాగులో ఉండేది. ప్రస్తుతం సకాలంలో వర్షాలు కురవకపోవడంతో చెరువులో నీళ్లు చేరే పరిస్థితులు కనబడటంలేదు. మే నెలలో అడపా దడపా భారీ వర్షాలు కురిసినా కంభం చెరువుకు నీరుచేరే నల్లమల అటవీ ప్రాంతంలో కురవకపోవడంతో చెరువుకు నీళ్లు చేరలేదు. నీటికష్టాలు తప్పవా: కంభం చెరువులో నీళ్లుంటే చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు పుష్కలంగా ఉండి ఆ గ్రామాల్లో నీటి సమస్య ఉండదు. ప్రస్తుతం చెరువులో 5 అడుగుల మేర నీళ్లు ఉండగా ఇరిగేషన్ అధికారులు తూము ఎత్తడంతో నీటి మట్టం తగ్గిపోతోంది. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో నీటి సమస్య తలెత్తుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీళ్లు అందించారు. ట్యాంకర్ల ద్వారా టీడీపీ నాయకులు భారీగా డబ్బులు సంపాదించుకున్నారన్న విమర్శలు అప్పట్లో తీవ్రంగా వినిపించేవి. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు పుష్కలంగా పడి కంభం చెరువులో కొంత మేర నీళ్లు చేరడంతో ట్యాంకర్ల అవసరం లేకుండానే ఐదేళ్లు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీళ్లు అందించారు. ప్రస్తుతం చెరువు నీళ్లు అడుగంటి పోతుండటంతో వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు అడుగంటితే మళ్లీ ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడలా..ఇప్పుడేమో ఇలా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కంభం చెరువులో సుమారు 10 అడుగుల నీళ్లున్నప్పటికీ పంటల సాగుకు రైతులకు నీళ్లు వదిలితే చెరువు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోతాయన్న ఉద్దేశంతో జిల్లా ఉన్నతాధికారులు పొలాలకు నీళ్లు వదిలేందుకు అనుమతించలేదు. తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు మొరబెట్టుకున్నా తూములు ఎత్తేందుకు ససేమిరా అన్నారు. ప్రస్తుతం కంభం చెరువులో నీటి మట్టం 5 అడుగులకు పడిపోయి అడుగంటుతున్నా దర్గా గ్రామంలో కేవలం 70 ఎకరాల్లో సాగులో ఉన్న పత్తి పంట కోసం రెండుసార్లు చిన్నకంభం తూములు ఎత్తడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వృథాగా పోతున్న కంభం చెరువు నీళ్లు: ఇప్పటికే చిన్నకంభం, పెద్దకంభం, నక్కల గండి తూముల వద్ద లీకేజిల ద్వారా చాలా వరకు నీళ్లు వృథాగా వెళ్లిపోతున్నాయి. వాటిని అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్ అధికారులు చెరువులో ఉన్న కొద్దిపాటి నీళ్లను కాపాడుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. దర్గా గ్రామంలో రైతుల కోసం నీళ్లు వదలగా ఆ నీళ్లు చిన్నకంభం, గోవిందాపురం గ్రామాల మీదుగా పంటకాల్వల గుండా వెళ్తున్నాయి. దారి పొడువునా పంటల కాల్వలు సక్రమంగా లేకపోవడంతో గోవిందాపురం సమీపంలో ఉన్న పలు బీడు భూములు చెరువు నీళ్లతో నిండిపోయి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. ఇన్ని నీళ్లు వృథాగా వెళ్లిపోతున్నా ఇరిగేషన్ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. నక్కల గండి తూమును సైతం రాత్రి వేళల్లో పలువురు అక్రమంగా ఎత్తుకొని పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. కంభం చెరువు నీటి సామర్థ్యం: 3.30 టీఎంసీలు ప్రస్తుతం చెరువులో ఉన్న నీటి మట్టం: 5 అడుగులుసాగు విస్తీర్ణం: అధికారికంగా 6944 ఎకరాలు అడుగంటుతున్న చారిత్రాత్మక కంభం చెరువు నీటిమట్టం గతంలో పది అడుగుల నీళ్లున్నా రైతులకు నీళ్లొదలని ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం 5 అడుగులుంటేనే తూములెత్తేసిన వైనం ఇప్పటికే తూముల లీకేజి ద్వారావృథాగా వెళ్లిపోతున్న నీళ్లు భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో చారిత్రాత్మక కంభం చెరువు అడుగంటుతోంది. వర్షాలు లేక చెరువు నీళ్లు 5 అడుగులకు పడిపోగా.. ఉన్న నీటినీ ఇరిగేషన్ అధికారులు తూములెత్తి వదిలేయడంతో ఆ నీరు తూముల లీకేజీల ద్వారా వృథాగా పోతోంది. చెరువులో నీరు లేకపోవడంతో పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం పొంచి ఉంది. ఉన్న కొద్దిపాటి నీళ్లనూ కాపాడుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్గా రైతుల కోసం తూములు ఎత్తాం దర్గా గ్రామంలో పత్తి రైతులకు నీళ్లు కావాలని అడిగితే చిన్నకంభం తూములు ఎత్తాం. 15 రోజుల క్రితం ఒకసారి, ప్రస్తుతం రెండో సారి తూములు ఎత్తాం. నీళ్లు వృథాగా వెళ్లకుండా చర్యలు తీసుకుంటాం. – శ్రీను నాయక్, ఇరిగేషన్ ఏఈ, కంభం నీరు వృథాకాకుండా చూడాలి కంభం చెరువు నీళ్లు వృథా కాకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలి. చెరువులో నీళ్లు అయిపోతే భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉంది. అప్పుడు మండలంలో నీటి సమస్య తలెత్తుతుంది. చెరువు నీళ్లు వృథాగా వెళ్లకుండా ఇరిగేషన్ అధికారులు దృష్టి సారించాలి. – చేగిరెడ్డి తులశమ్మ, ఎంపీపీ కంభం గ్రామంలో ఇప్పటికే నీటి సమస్య ఉంది సూరేపల్లి గ్రామంలో ఎప్పుడూ నీటి సమస్య ఉంటుంది. చెరువులో నీళ్లున్నా 500 అడుగులకు పైగా బోర్లు వేసినా నీళ్లు పడని పరిస్థితి. చెరువు ఎండిపోతే ఎన్ని అడుగులు వేసినా ఈ గ్రామంలో నీళ్లు పడవు. అధికారులు నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. – బిజ్జం వెంకటేశ్వరరెడ్డి, సూరేపల్లి -
పట్టపగలే ఇంట్లో చోరీ
టంగుటూరు: పట్టపగలే ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీచేసిన సంఘటన శుక్రవారం జరగ్గా, సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టంగుటూరు మండలంలోని జయవరం గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఇత్తడి వినోద్కుమార్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. అతని భార్య అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఈ నెల 4వ తేదీ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చి చూడగా, ఇంటి తాళం పగలకొట్టి ఉంది. ఇంట్లో పరిశీలించగా దుస్తులు, వస్తువులు చల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువా పగలకొట్టి అందులోని రూ.92 వేల నగదు, మూడు సవర్ల బంగారు నల్లపూసల దండ, ఉంగరం, చెయిన్ను చోరీ చేశారు. దీనిపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా, క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు తెలిపారు. -
ఎకై ్సజ్ అధికారుల తనిఖీలు
టంగుటూరు: మండలంలోని ఎం.నిడమానూరు, పొందూరు గ్రామాల్లో ఒంగోలు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ లీనా, ఎస్సై గీత వారి సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై మద్యం విక్రయించడం గురించి.. మంత్రి ఇలాకాలో మొ‘బైక్’ మద్యం అనే శీర్షికతో సోమవారం సాక్షి దినపత్రిక మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనానికి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు సీఐ, ఎస్సైలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ లీనా మాట్లాడుతూ ఎక్కడైనా అనధికారికంగా మద్యం నిల్వ చేయడం, విక్రయించడం చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, అనధికారికంగా మద్యం నిల్వలు, విక్రయాలపై తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కాగా, ఆదివారం బైక్పై మద్యం విక్రయించిన వ్యక్తిని టంగుటూరు ఎస్సై అదుపులోకి తీసుకుని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు తెలిపారు. కార్లు అద్దెకు తీసుకుని వేధిస్తున్నారని ఫిర్యాదు ఒంగోలు టౌన్: తన కార్ ట్రావెల్స్లో మూడు కార్లు అద్దెకు తీసుకుని అద్దె చెల్లించకుండా, తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ బాధితుడు సోమవారం ఎస్పీ దామోదర్కి ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఒంగోలు మారుతీనగర్కు చెందిన వ్యక్తి.. తాను కార్ ట్రావెల్స్ నిర్వహిస్తూ జీవిస్తుండగా, ఒంగోలు సమతా నగర్కు చెందిన వ్యక్తి మూడు కార్లను అద్దెకు తీసుకున్నాడని, ఏడు నెలలైనా ఒక్క రూపాయి అద్దె చెల్లించకుండా కార్లను కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 79 ఫిర్యాదులు రాగా, బాధితులు ఎస్పీని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. -
10న మెగా టీచర్–పేరెంట్ మీటింగ్
ఒంగోలు సబర్బన్: మెగా టీచర్ – పేరెంట్ మీటింగులను జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్, జేసీ ఆర్.గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల విద్యాశాఖాధికారులతో వర్చువల్గా సమీక్షించారు. ఈ నెల 10న జిల్లాలో జరగనున్న మెగా టీచర్–పేరెంట్ మీటింగ్ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించడానికి విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధిని నిర్ధారించడానికి పాఠశాల విద్య, సమాజ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగులను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని మొత్తం 2,955 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, 188 జూనియర్ కళాశాలల్లో మీటింగులు నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. అలాగే పూర్వ విద్యార్థులు, అక్కడ చదివి ఉన్నత స్థానాల్లో నిలిచిన వారిని కూడా ఆహ్వానించి సన్మానించాలని సూచించారు. కార్యక్రమానికి విద్యార్థులందరూ యూనిఫాంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలలోని సృజనాత్మకతను వెలికితీసేలా పోటీలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులకు కూడా పోటీలు నిర్వహించి బహుమతులు అందించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించేలా యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఈఓ కిరణ్కుమార్, ఆర్ఐఓ సైమన్ విక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మెగా టీచర్–పేరెంట్ మీటింగులపై ఇన్చార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ సమీక్ష అదే రోజు ప్రతి పాఠశాల, కళాశాలలో మొక్కలు నాటాలని ఆదేశం -
వాకర్స్కు మంచినీటి సౌకర్యం కల్పించాలి
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలోని మామిడిపాలెం ఎస్ఎస్ ట్యాంక్–1 కట్టపై వాకర్స్ కోసం మంచినీటి సదుపాయం కల్పించాలని కోరుతూ ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రతినిధులు జాయింట్ కలెక్టర్, జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జేసీని కలిసి విజ్ఞప్తి చేశారు. వాకర్స్కు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తే ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఎస్ఎస్ ట్యాంకుపై మంచినీటి సదుపాయం కోసం జూన్ 23, 2025న ఒకసారి, జూన్ 30, 2025 మరోసారి జిల్లా కలెక్టర్కు మీ కోసం కార్యక్రమంలో అర్జీ సమర్పించామని చెప్పారు. ఎస్ఎస్ ట్యాంక్ కట్ట మీద నాలుగు చోట్ల షెడ్లు, బెంచీలు, టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయాలని విన్నవించారు. సమస్య పరిష్కారానికి త్వరలో చర్యలు చేపడతామని జేసీ హామీ ఇచ్చారు. నిర్దేశించిన సమయంలో సమస్యలు పరిష్కరించాలి... ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను నిర్దేశించిన సమయంలోగా శాశ్వతంగా పరిష్కరించాలని జేసీ, ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. డీఆర్వో చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్, జాన్సన్, పార్థసారధి, విజయజ్యోతితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక వ్యవస్థ ద్వారా అందిన దరఖాస్తులకు మెరుగైన పరిష్కారాన్ని చూపాలన్నారు. నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులకు సంబంధిత కారణాలను స్పష్టంగా దరఖాస్తుదారుడికి తెలియజేయాలని సూచించారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు తగిన పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కూడా జేసీ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీకి వినతిపత్రం నిర్దేశించిన సమయంలోగా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు జేసీ ఆదేశం -
మామిడికాయల లోడు వాహనం బోల్తా
మద్దిపాడు: మామిడికాయల లోడుతో వెళ్తున్న 407 వాహనం జాతీయ రహదారిపై మద్దిపాడు సమీపంలో బోల్తాపడింది. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల ప్రకారం.. చిత్తూరు నుంచి మామిడికాయల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న 407 వాహనం మద్దిపాడు సమీపంలోకి వచ్చేసరికి ముందు టైరు పేలిపోయి అదుపుతప్పి తిరగబడింది. వాహనంలోని మామిడి కాయలు మొత్తం రోడ్డుపై పడిపోయాయి. సమాచారం అందుకున్న మద్దిపాడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ గుమిగూడిన ప్రజలను అదుపుచేశారు. వాహనం నడుపుతున్న వ్యక్తికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
మంత్రి స్వామికి సమస్యల స్వాగతం
సింగరాయకొండ: మండలంలోని సోమరాజుపల్లి పంచాయతీ టీపీ నగర్, అప్పాపురం ఎస్టీకాలనీలో సోమవారం రాత్రి రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖామంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి నిర్వహించిన సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమంలో గ్రామస్తుల నుంచి సమస్యలు స్వాగతం పలికాయి. పింఛన్ మంజూరు కాలేదని, తల్లికి వందనం డబ్బులు రాలేదని, ఇళ్లు మంజూరు కాలేదని పలువురు ప్రజలు మంత్రికి ఏకరువు పెట్టారు. ఆధార్కార్డు లేక ప్రభుత్వ పథకాలు రావడం లేదని, ఆధార్కార్డు మంజూరు చేయించాలని ఎస్టీలు మంత్రికి విన్నవించుకున్నారు. వెంటనే పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని మంత్రి స్వామి అధికారులకు సూచించారు. టీపీ నగర్, అప్పాపురంలో సుమారు 1300 గృహాలుండగా, మంత్రి స్వామి కేవలం 300 గృహాలే తిరిగారని, తమ గృహాలకు రాలేదని టీపీ నగర్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. -
నేడు ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
ఒంగోలు సిటీ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు పాల్గొననున్నటు తెలిపారు. అన్ని నియోజకవర్గాల యూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తెస్తాం ● నూతనంగా విధుల్లో చేరిన పలువురు అడ్మిన్లు ఒంగోలు సిటీ: విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి నూతనంగా ఏర్పడిన ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ఏకేయూలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన కళాశాలల అభివృద్ధి మండలి (సీడీసీ)డీన్ డాక్టర్ కే.వి.ఎన్.రాజు, నూతనంగా ఏకేయూ పరీక్షల నియంత్రణ అధికారి (సి.ఈ)గా విధుల్లో చేరిన ప్రొఫెసర్ జి.సోమశేఖర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో వారి నూతన విభాగాల్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. వీరికి యూనివర్సిటీకి చెందిన సహచర అధ్యాపకులు, సిబ్బంది, పలు కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ‘అక్షర ఆంధ్ర’ ను విజయవంతం చేయాలి ●● సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ ఒంగోలు సబర్బన్: నిరక్షరాస్యులైన వయోజనులను కూడా అక్షరాస్యులుగా మార్చే ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో నిర్వహించారు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఉల్లాస్’ పథకంలో భాగంగా 2025–26 విద్యా సంవత్సరంలో ‘అక్షర ఆంధ్ర’ అనే ప్రత్యేక సాక్షరతా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్ మోహన్రావు ఈ సందర్భంగా వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 1,29,497 మందిని అక్షరాస్యులుగా చేయాల్సి ఉందన్నారు. ఆగస్టు 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బోధన ప్రారంభమయ్యేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించినందున, దీనికి సంబంధించిన వాలంటీర్ టీచర్ల గుర్తింపు, శిక్షణ కార్యక్రమాలను ప్రణాళిక మేరకు ఈ నెలలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జెడ్పీ సీఈవో చిరంజీవి, డీఈవో కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మేరు నగధీరుడు వైఎస్సార్
ఒంగోలు సిటీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలు జీవితకాలం గుర్తుంచుకోదగ్గ మేరు నగధీరుడు అని ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. నేడు వైఎస్సార్ 76వ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సోమవారం ఆయన పిలుపునిచ్చారు. బత్తుల మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో పేదవాడి గుండెచప్పుడు పసిగట్టిన దార్శనికుడు వైఎస్సార్ అని అన్నారు. వృత్తిపరంగా వైద్యుడైనా ధనిక, పేద వర్గాల మధ్య తారతమ్యాలను గుర్తించి ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్ వైద్యం పేదల దరి చేర్చారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్తో కార్పొరేట్ విద్య, 108 సేవలు ఆయన వల్లే పురుడు పోసుకున్న విషయాన్ని ఆయన రాజకీయ వైరులు సైతం స్వాగతించారన్నారు. నేడు వీధికి ఒక ఎన్నారై, ప్రతి పేదవాడి ఇంట ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నారంటే అది నాడు వైఎస్సార్ దార్శనికత వల్లే సాధ్యమైందని చెప్పారు. వ్యవసాయాన్ని సంస్కరణల బాట పట్టించి 82 నీటిపారుదల ప్రాజెక్టులను ప్రారంభించి అపర భగీరథునిగా వైఎస్సార్ నిలిచారన్నారు. ఎరువులు, విత్తనాలు సబ్సిడీతో అందించి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి వ్యవసాయాన్ని పండగ చేశారని చెప్పారు. విలువలతో కూడిన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రైతు పక్షపాతిగా, రాజకీయాల్లో మాటతప్పని, మడమ తిప్పని నేతగా నిలిచిన వైఎస్సార్ బాటలో నడుస్తున్న ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వెన్నంటి ఉండి దివంగత నేతకు నివాళులర్పిద్దామని పిలుపునిచ్చారు. నేడు మహానేత వైఎస్సార్ జయంతిని జయప్రదం చేద్దాం వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి బత్తుల బ్రహ్మానందరెడ్డి -
సంక్షేమ పరవళ్లు!
అభివృద్ధికి బాటలు..● వైఎస్సార్ హయాంలోనే శరవేగంగా వెలిగొండ నిర్మాణం ● గుండ్లకమ్మ, రామతీర్థంలకు జలసవ్వడులు ● రైతు రుణమాఫీతో అన్నదాతలకు అండగా నిలిచిన మహానేత ● వైఎస్సార్సీపీ పాలనలో పూర్తయిన వెలిగొండ ప్రాజెక్టు పనులు ● మార్కాపురంలో మెడికల్ కళాశాల పనులు వేగవంతం ● నేడు కూటమి పాలనలో అంతా తిరోగమనం పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సాయం.. కరువు జిల్లాగా పేరొందిన జిల్లాకు వెలిగొండ వచ్చింది. గుండ్లకమ్మ పరుగులు పెట్టింది. రామతీర్థం జలకళతో సవ్వడి చేసింది. రైతు మోముపై చిరునవ్వు తొణికిసలాడింది. జిల్లా కేంద్రం ఒంగోలుకు మెడికల్ కళాశాల వచ్చింది. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన పునాదులు జిల్లా అభివృద్ధికి బాటలు వేశాయి. అప్పటిదాకా కరువు కాటకాలతో విలయతాండవం చేసిన జిల్లాలో ఆయన నడిచినంత మేరా పచ్చనిపైర్లు పలకరించాయి. ఆయన వారసుడిగా వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి స్ఫూర్తితో పాలన కొనసాగించారు. మార్కాపురంలో మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించారు. సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని వర్గాలకు అండగా నిలిచారు. నేడు కూటమి పాలన అంతా తిరోగమనంలో సాగుతోంది. వెలిగొండపై నిర్లక్ష్యం.. మెడికల్ కళాశాల వెనక్కి..ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీపై నీలి నీడలు.. ఇలా ఏడాది కాలంలో కూటమి పాలకులు జిల్లాకు చేసిన అన్యాయంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా నాటి రాజన్న పాలనను జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద వైఎస్సార్ (ఫైల్)సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.477 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.20 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారు. శరవేగంగా పనులు సాగుతున్న సమయంలో ఆయన మరణంతో ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. 2014 నుంచి 2019 చంద్రబాబు పాలనలో వెలిగొండ దాదాపుగా మూలనపడింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపుగా పనులన్నీ పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఎన్నికల కోడ్ వల్ల నిలిచిన అరకొర పనులు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసురావడం లేదు. బడ్జెట్లలో కేవలం రూ.300 కోట్లు కేటాయించారంటే ఈ ప్రాజెక్టుపై వారి శ్రద్ధ అర్థం చేసుకోవచ్చని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి రూపాయి కూడా కేటాయించకుండా ప్రాజెక్టు పనులు పూర్తి కావడం అసాధ్యం. పేదరికం కారణంగా ఏ ఒక్కరి చదువులు ఆగిపోకూడదంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించారు. లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులనభ్యసించారు. చంద్రబాబు పాలనలో ఆ పథకం నీరుగారడంతో పేద విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తిరిగి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేయడం ద్వారా విద్యార్థులకు అండగా నిలిచారు. గత ఐదేళ్లలో 3,09,817 మంది విద్యార్థులకు విద్యా దీవెన, 2,72,315 మంది విద్యార్థులకు వసతి దీవెన ద్వారా కోట్ల రూపాయల సాయం అందించారు. మళ్లీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిగా విద్యార్థులకు సాయం అందించకుండా వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందివెలిగొండ ప్రాజెక్టు రెండు టన్నెళ్లు -
వైద్య రంగంలో ఆరోగ్య శ్రీ విప్లవం...
వైద్యారోగ్య రంగంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ, 108, 104 లాంటివి ఎందరో నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చాయి. జిల్లాలో 43 కార్పొరేట్ ఆస్పత్రులు, 64 పీహెచ్సీలు, 11 సెకండరీ హెల్త్ ఆస్పత్రులు ఆరోగ్య నెట్వర్క్ ఆస్పత్రులుగా వైద్య సేవలు అందిస్తున్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.25 లక్షల వరకు పెంచారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఆరోగ్య శ్రీని ఎత్తివేసేందుకు కుట్రలు మొదలు పెట్టింది. ఆస్పత్రులకు సకాలంలో బిల్లులను చెల్లించకుండా వేధిస్తోంది. ఆరోగ్య శ్రీని బీమా కిందకు తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇది అమలులోకి వస్తే నిరుపేదలకు ఆరోగ్య శ్రీ సేవలు దూరమైనట్టే. -
హైవే పక్కన ఆక్రమణల తొలగింపు
● ఫెన్సింగ్ తొలగించి దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు ● రూట్ ఆఫీసర్ నరసింహారావు హెచ్చరిక ఒంగోలు సబర్బన్: ఆరు లైన్ల జాతీయ రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని సింహపురి ఎక్స్ప్రెస్ హైవే రూట్ ఆఫీసర్ కే నరసింహారావు హెచ్చరించారు. 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ దాటి స్పీడ్ రోడ్డు మార్జిన్లో నిబంధనలకు విరుద్ధంగా పంక్చర్ షాపులు, దుకాణాలు, హోటళ్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఒంగోలులోని పెళ్లూరు వద్ద హైవే మార్జిన్లో ఏర్పాటు చేసిన దుకాణాలను ఆదివారం హైవే సిబ్బందితో తొలగించారు. దుకాణాలున్న ప్రాంతాల్లో వాహనాలను రోడ్డు మీద నిలిపివేస్తుండటంతో ఇటీవల ప్రమాదాలు జరిగాయన్నారు. స్పీడ్ రహదారి కావడంతో జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం ఫెన్సింగ్కు నష్టం కూడా చేయకూడదన్నారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైవే మార్జిన్లలో ఎక్కడా వాహనాలు నిలపరాదన్నారు. అలాంటిది ఏకంగా పంక్చర్ షాపులు, టీ, టిఫిన్ హోటళ్లు ఏర్పాటు చేయడం, వాటి వద్ద వాహనాలు నిలుపుతుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. అందుకోసం రోడ్డు మార్జిన్లలో దుకాణాలు నిర్వహిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి హైవే నిబంధనలను వివరించారు. దీనిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని నరసింహారావు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు సీహెచ్ నరసింహులు, సిబ్బంది మహేష్, మోహన్బాబు, రాబర్ట్, తదితరులు పాల్గొన్నారు. -
జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు
● మనుషుల నుంచి జంతువులకు కూడా.. ● వరల్డ్ జూనోసిస్ డేలో జిల్లా పశుసంవర్థక శాఖాధికారి రవికుమార్ ● పెంపుడు కుక్కలకు టీకాలు ఒంగోలు సబర్బన్: జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమిస్తాయని, అదేవిధంగా మనుషుల నుంచి జంతువులకు కూడా వ్యాధులు సంక్రమిస్తాయని జిల్లా పశుసంవర్థక శాఖాధికారి బి.రవికుమార్ తెలిపారు. వరల్డ్ జూనోసిస్ డేని పురస్కరించుకుని స్థానిక సంతపేటలోని బహుళార్ద పశువైద్యశాలలో ఆదివారం పెంపుడు కుక్కలకు వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ జంతువులతో మానవునికి సహచర్యం ఎంతో ప్రాచీనమైనదన్నారు. ప్రతి మనిషి పౌష్టికాహార అవసరాలకు పశుపక్ష్యాదుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు, గుడ్లు, మాంసంపై ఆధారపడి ఉన్నారన్నారు. మనుషులు, పశువుల సహచర్యంతో జూనోటిక్ వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులని పిలుస్తారన్నారు. ఈ వ్యాధులు సుమారు 280 వరకు గుర్తించబడ్డాయని తెలిపారు. లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారి 1885 జూలై 6వ తేదీ పిచ్చికుక్క కాటుకు గురైన బాలునికి వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకా మందును విజయవంతంగా ఇచ్చినందున ఆ రోజు నుంచి ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు వైరల్కు సంబంధించి రేబిస్, మెదడు వాపు, అమ్మవారు (పాక్స్), బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, నిఫా, బ్యాక్టీరియల్ వ్యాధులైన ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, సాలో నెల్లోసిస్, లిస్టీరియోసిస్, క్షయ (టీబీ), పారాసైటెక్ వ్యాధులు, అమీబియాసిస్, బాలాంటిడియోసిస్, సార్బోసిస్టోసిస్, టీనియాసిస్, ట్రైకినెల్లోసిస్, ఆస్కారియాసిస్, స్కేబీస్ (గజ్జి), తామర, హైడాటిడోసిస్, ఆంకై లోస్టోమియోసిస్ లాంటి వ్యాధులు వస్తాయన్నారు. రేబిస్ వ్యాధి పిచ్చికుక్కల కాటు ద్వారా వ్యాప్తిచెందే అతి భయంకరమైన వ్యాఽధి అని తెలిపారు. పెంపుడు కుక్కలకు రేబిస్ నిరోధక టీకాలను ప్రతి సంవత్సరం వేయించాలని సూచించారు. ఒంగోలు నగరంలోని 518 పెంపుడు కుక్కలను వాటి యజమానులు తీసుకొచ్చి రేబిస్ వ్యాక్సిన్ వేయించారు. పోలీస్ జాగిలాలను కూడా వాటి సంరక్షకులు తీసుకొచ్చి వ్యాక్సిన్ చేయించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, మేయర్ సుజాత, పశువైద్యశాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతుల మాట అబద్ధం.. కాదు పోలీసులదే తప్పు!
త్రిపురాంతకం: ఓ భూవివాదం పోలీసులు, రైతుల మధ్య మాటల మంటలు రేపింది. పోలీసులు అన్యాయం చేస్తున్నారని రైతులు ఓ వీడియోలో ఆరోపించగా.. అదంతా తప్పుడు ప్రచారమంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం త్రిపురాంతకం పోలీస్ స్టేషన్లో సీఐ హసన్, ఎస్సై శివబసవరాజు విలేకర్లతో మాట్లాడారు. త్రిపురాంతకం మండలం దీవేపల్లి వద్ద తలెత్తిన భూ వివాదంలో ఇరువర్గాల వారి మధ్య ఘర్షణ వాతావరణం ఉందన్నారు. రైతులు తమవని చెబుతున్న భూములు వేరే వ్యక్తులపై రిజిస్టర్ అయి ఉన్నాయని చెప్పారు. వివాదం నెలకొన్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులకు తెలియజేశామన్నారు. ఈ భూ తగాదాపై కేసు నమోదు చేశామని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతుల వాదన ఇదీ.. రైతులు ఒక వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. గత 40 ఏళ్లుగా తాము సాగుచేసుకుంటున్న భూములను అన్యాయంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని దివేపల్లికి చెందిన ఎస్.చెన్నయ్య, కొండయ్య, ఓబులు, నర్సమ్మ, దూపాడుకు చెందిన చెన్నయ్య, పుల్లయ్య, డేవిడ్ ఆరోపించారు. భూములు పోతే ఆత్మహత్యే శరణ్యమని పురుగు మందు బాటిళ్లతో హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ తెలియకుండా సర్వే నంబర్ 881లో తుమ్మలవాగు పోరంబోకు భూమి 7.70 ఎకరాలను రిటైర్డ్ ఉద్యోగి భార్య, కుమారుడు శివకుమార్పై అసైన్మెంట్ చేసుకున్నారని చెప్పారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములపై హక్కు కల్పించాలని కోరారు. -
ఆదాయం దిగదుడుపు.. రైతు చావులే రెట్టింపు
ఒంగోలు టౌన్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడతామని చెప్పిన మోదీ మాటలన్నీ నీటిలో మూటలయ్యాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ధ్వజమెత్తారు. మోదీ కార్పొరేట్ అనుకూల పాలనతో వ్యవసాయ రంగం మరింతగా సంక్షోభంలో కూరుకుపోయిందని, కనీస ఆదాయం కూడా లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని నిప్పులు చెరిగారు. కార్మికుల హక్కులు కాపాడాలని, రైతులకు గిట్టుబుటు ధరలు కల్పించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9న దేశ వ్యాప్తంగా చేపట్టనున్న సార్వత్రిక సమ్మెకు కర్షకులు, కార్మికులు కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. శనివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో సమ్మె కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంకణాల మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బలంగా తిప్పికొట్టేందుకు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 24 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లుగా కుదించడం దుర్మార్గమన్నారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు లేకుండా చేస్తున్నారని, లేబర్ కోడ్ల వల్ల 8 గంటల పని దినాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడమే కాకుండా, ఉపాధి హామీ చట్టాన్ని సైతం నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుదామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నెరసుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థించడం సిగ్గుచేటని విమర్శించారు. కార్మిక చట్టాలను ఒక్క కలం పోటుతో రద్దు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నోరుమూసుకొని కూర్చోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు ఊసా వెంకటేశ్వర్లు, అన్నవరపు శేషారావు, కంకణాల వెంకటేశ్వర్లు, గడ్డం పిచ్చయ్య, గోగుల నారాయణ, ఉబ్బా వెంకటేశ్వర్లు, తలారి ఆదాం, జి.వందనం, ఎం.దాసు, టి.అంజిబాబు, గోపి తదితరులు పాల్గొన్నారు. మోదీ పాలనలో సంక్షోభంలో వ్యవసాయం కార్మిక హక్కులు హరించేలా లేబర్ కోడ్లు దుర్మార్గం కార్మికులంతా ఏకంకండి.. సమ్మెకు కదిలిరండి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల -
నేడు తుమ్మలచెరువులో పెద్ద షహాదత్
తర్లుపాడు: మొహర్రం వేడుకల్లో భాగంగా ఆదివారం తుమ్మలచెరువులో పెద్ద షహాదత్ నిర్వహించనున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలను హిందూ, ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దర్గాలో కొలువైన పెద్ద ఖాశీం స్వామి, చిన్న ఖాశీం స్వాములను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పీర్ల మకాన్, దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. శనివారం రాత్రి అగ్ని గుండం మండించారు. తెల్లవారుజామున స్వామివారిని గ్రామంలో ఊరేగిస్తారు. కాగా, ఆర్టీసీ ఆధ్వర్యంలో తరుమ్మలచెరువుకు ప్రత్యేక బస్సులు, దర్గా కమిటీ ఆధ్వర్యంలో అన్న సంతర్పణకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పొదిలి సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏరులై పారుతున్న మద్యం పెద్ద షహాదత్ సందర్భంగా ఖాశీం స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తుండటంతో మార్కాపురానికి చెందిన సిండికేట్ నాయకుడు తన మనుషుల ద్వారా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నాడు. ఎకై ్సజ్, పోలీసు అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడంతో ఇష్టానుసారంగా ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. -
గోవా మద్యం స్వాధీనం
కంభం/గిద్దలూరు రూరల్: అక్రమంగా గోవా మద్యం తరలిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు రెండు చోట్ల చిక్కినట్టే చిక్కి పారిపోయారు. గిద్దలూరు, కంభం ఎకై ్సజ్ సీఐలు శనివారం తమ కార్యాలయాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, మార్కాపురం ఏఈఎస్టీఎఫ్ సిబ్బందితో కలిసి ఆర్పీఎఫ్ అధికారుల సహకారంతో కంభం రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించగా ఒక బ్యాగులో 4.7 లీటర్ల గోవా లిక్కర్ పట్టుబడింది. గుర్తు తెలియని నిందితుడు పారిపోయాడని ఎకై ్సజ్ సీఐ కొండారెడ్డి తెలిపారు. గిద్దలూరు రైల్వేస్టేషన్లో 7 గోవా మద్యం బాటిళ్లు సీజ్ చేశామని, నిందితుడు తప్పించుకున్నాడని స్థానిక ఎకై ్సజ్ పోలీసులు చెప్పారు. ఒకే రోజు రెండు సంఘటల్లో నిందితులు పారిపోయారని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిద్దలూరులో స్వాధీనం చేసుకున్న గోవా మద్యం -
12, 13న బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
ఒంగోలు: ఈనెల 12, 13వ తేదీల్లో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జేఎస్ లక్ష్మణ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–11,13,15,17,19 విభాగాల బాలబాలికలతోపాటు సీనియర్ మహిళలు, పురుషుల విభాగంలో క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్కార్డు, వయసు ధ్రువీకరణ పత్రంతో ఈనెల 10వ తేదీలోగా 9398260109ను సంప్రదించాలని సూచించారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్కాపురంలో ఇద్దరు యువకుల ఆత్మహత్య మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ యువకుడు ఉరేసుకుని తనువు చాలించగా, మరో యువకుడు పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మరణించాడు. పట్టణ ఎస్సై సైదుబాబు కథనం మేరకు.. పెద్దారవీడు మండలం ఎస్.కొత్తపల్లికి చెందిన వెన్నం రాంబాబు(24) తన కుటుంబ సభ్యులతో కలిసి మార్కాపురంలోని జవహర్నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఆయన తండ్రి ఒక అపార్టుమెంటులో వాచ్మెన్. కుటుంబ సమస్యల నేపథ్యంలో గురువారం రాత్రి గడ్డి మందు తాగడంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడి అన్న దశరథరాముడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● మార్కాపురం జవహర్నగర్ కాలనీలో నివాసముండే నూతలపాటి చెన్నకేశవులు(30) కుటుంబ సమస్యల కారణంగా శనివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. భార్య ఆగ్నేషా, కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన జీజీహెచ్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు ఉన్నత చదువు చదివాడు. ఇద్దరు పిల్లలున్నారు. కాగా ఇద్దరు యువకుల మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొని వ్యక్తి మృతి
కొత్తపట్నం: ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన ఈతముక్కల గ్రామంలో చెత్త సంపద తయారీ కేంద్రం వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. టంగుటూరు మండలం వాసేపల్లిపాడు గ్రామానికి చెందిన దూడల నారాయణ(40) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం ఈతముక్కలలో రొయ్యలు కొనుగులు చేసి తన బైక్పై ఇంటికి బయలుదేరాడు. గ్రామ శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ అదుపు తప్పి ఢీకొనడంతో నారాయణకు బలమైన గాయాలై స్పహ కోల్పోయాడు. స్థానికులు 108 అంబులెన్స్లో ఒంగోలు జీజీహెచ్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. ఎస్ఐ సుధాకర్బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఏకేయూ అడ్మిన్ స్థానాల్లో మార్పులు
ఒంగోలు సిటీ: ఆంధ్ర కేసరి యూనివర్శిటీలో పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి సూచనల మేరకు పలు అడ్మిన్ స్థానాల్లో మార్పులు చేసినట్లు రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బి. హరిబాబు శుక్రవారం తెలిపారు. ఏకేయూ నూతన ఓఎస్డీగా ప్రస్తుత ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ జి.రాజమోహన్రావును, ప్రస్తుత వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణిని ప్రిన్సిపాల్గా నియమించారు. సీడీసీ డీన్ ప్రొఫెసర్ జి.సోమశేఖరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, వైస్ ప్రిన్సిపాల్గా, అలాగే సీఈగా పనిచేస్తున్న డాక్టర్ కేవీఎన్ రాజుకు సీడీసీ డీన్గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత మార్పుచేర్పులు 4వ తేదీ నుంచే అమలులోకి వచ్చాయని రిజిస్టార్ స్పష్టం చేశారు. నూతనంగా విధుల్లో చేరనున్న అడ్మిన్లు ఈ పదవుల్లో తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు కొనసాగుతాయని రిజిస్ట్రార్ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతనంగా అడ్మిన్ స్థానాలు పొందిన ప్రొఫెసర్లకు వీసీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు తదితరులు నియామక పత్రాలు అందజేసి అభినందించారు. -
మేఘం మీద ఆన.. కురవట్లేదు వాన!
మార్కాపురంపై ఇటీవల కమ్ముకున్న మేఘాలు మార్కాపురం: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 20 రోజులు దాటుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జూన్ మొదటి వారం నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. నైరుతి రుతు పవనాలు ముందుగా వచ్చినప్పటికీ జూన్ రెండో వారం నుంచి సరైన వర్షాలు కురవలేదు. జూన్ మాసంలో జిల్లా సాధారణ వర్షపాతం 43.75 మిల్లీమీటర్లు కాగా 40.9 మి.మీ కురిసినట్లు ఐఎండీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం వర్షం జాడ లేక పొలాలు పదునెక్కలేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే పొలాలను దుక్కి దున్నిన రైతులు పదును వాన పడితే పంటలు సాగు చేసేందుకు ఎదురుచూస్తున్నారు. వ్యవసాయశాఖ ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేసినా వర్షాలు లేకపోవడంతో రైతులతో కలకలలాడాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల షాపులు వెలవెలబోతున్నాయి. వర్షం కురిస్తే రైతులు పత్తి, మిర్చి, కంది, సజ్జ, కొర్ర, ఆముదం, జొన్న తదితర పంటలు సాగుచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అదునుదాటి వర్షాలు కురిస్తే పంటలకు తెగుళ్లు సోకి పెట్టుబడి వ్యయం ఎక్కువవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి సాయమేది? ఖరీఫ్ సీజన్లో సాగు చేసే పంటల పెట్టుబడికి ప్రభుత్వం అందించే సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పంటల సాగుకు ముందే పెట్టుబడి సాయం అందించడంతో రైతులకు కొంత మేర ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తామన్న అన్నదాత సుఖీభవ పథకాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. ఎకరా పత్తి సాగు చేయాలంటే రూ.50 వేలు, మిర్చికి సుమారు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. దీంతో రైతులు అప్పు కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తున్న నైరుతి రుతుపవనాలు జూన్లో సాధారణ వర్షపాతం 43.75 మి.మీ కాగా కురిసింది 40.9 మి.మీ అదును దాటి వర్షాలు కురిస్తే తెగుళ్ల బెడద వెంటాడుతుందని ఆందోళన జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 4,62,944 ఎకరాలు ఇప్పటి వరకు సాగైంది 1687.7 ఎకరాలు ప్రారంభం కాని ప్రధాన పంటల సాగు అన్నదాత సుఖీభవ పథకం అమలులో సర్కారు వాయిదాల పర్వం పెట్టుబడి సాయం కోసం రైతుల ఎదురుచూపులు ఆకాశమే గంభీరం.. అన్నదాతల్లో సన్నగిల్లుతున్న ఆత్మస్థైర్యం సాగు అత్యల్పం! జిల్లాలో ప్రస్తుత సీజన్లో పంటల సాగు లక్ష్యం 4,62,944 ఎకరాలు కాగా ఇప్పటివరకు జిల్లాలో సుమారు 1700 ఎకరాల్లో మాత్రమే వివిధ రకాల పంటలు సాగు చేశారు. ప్రధానంగా వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్ర, మినుములు, పెసలు, కంది తదితర ప్రధాన పంటలు సాగు కాలేదు. వరి 12,826 హెక్టార్లు, సజ్జ 7,020, మొక్కజొన్న 3,120, కొర్ర 1,337, పెసలు 949, మినుములు 2,456, కంది 68,287 హెక్టార్లు, నువ్వులు 3,457, ఆముదం 1,537, పత్తి 26,981, మిర్చి 25,217 హెక్టార్లలో సాగు కావాల్సి ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు సజ్జ 88, ఆముదం 10, పత్తి 287, నూగులు 6 హెక్టార్లలో మాత్రమే సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కూరగాయలు 237 హెక్టార్లలో సాగవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం మీద ఖరీఫ్ సాగు ఆశాజనకంగా లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాన పడితేనే పంటలేస్తాం ఈ ఏడాది జూన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. పొలాలన్నీ దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నాం. వర్షం పడితే పత్తి, సజ్జ, కంది పంటలు వేసేందుకు అనువుగా ఉంటుంది. – టి.రామిరెడ్డి, రైతు -
భర్త వేధిస్తున్నాడంటూ భార్య నిరసన
ఒంగోలు టౌన్: వివాహమై 30 ఏళ్లయినా తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, పిల్లలను పట్టించుకోకుండా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. భర్త పనిచేస్తున్న స్థానిక రాజాపానగల్ రోడ్డులోని యూనియన్ చెస్ బ్యాంక్ వద్ద అతని ఫొటోతో కూడిన ఫ్లెక్సీ పట్టుకుని ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం... గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని వల్లభరావుపాలేనికి చెందిన ఇందిరకు ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెం గ్రామానికి చెందిన తొట్లెంపూడి పోలయ్యతో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు సంతానం కాగా, పోలయ్య ఒంగోలులోని ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 30వ తేదీ రిటైర్డ్ కాబోతున్నాడు. ఆయన కొంతకాలంగా ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని, ప్రస్తుతం ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళతో ఉంటున్నాడని ఇందిర ఆరోపించింది. ఒంగోలు నగరంలోని సుజాతనగర్లోని ఓ ఇంట్లో ఆమెతో కలిసి సహజీవనం చేస్తూ తనను, పిల్లలను బయటకు గెంటేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనతో విడాకులు కోరుతూ కోర్టులో కేసు కూడా వేశాడని తెలిపింది. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని, అతని సర్వీసు రికార్డులో తన పేరు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే పోలయ్యపై ఎస్పీ దామోదర్కు ఫిర్యాదు చేశానని, దిశ పోలీస్స్టేషన్కు రిఫర్ చేశారని తెలిపింది. తన భర్త మీద చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది. -
ఇంతుల కోర్టులోకే రుణాల బంతి!
పాత బకాయిలు రూ.16 కోట్లు చెల్లించాకే కొత్తవంటూ మెలిక బేస్తవారిపేట: డ్వాక్రా సంఘాల మహిళలకు సీ్త్ర నిధి రుణాల మంజూరులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పాత బకాయిల వసూలుకు కొత్త రుణాల మంజూరు ప్రక్రియకు ముడి పెట్టడంపై మహిళలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎల్పీ–ఎంసీపీ యాప్లో వివరాల నమోదులో కొనసాగుతున్న జాప్యం రుణాల మంజూరుకు మరో అడ్డంకిగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థల ఉచ్చులో చిక్కుకోకుండా, వారి జీవనోపాధి కోసం ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం స్రీనిధిని ఏర్పాటు చేసింది. చిన్న హోటళ్లు, కిరాణ దుకాణాలు, కూరగాయలు పండించడం–విక్రయించడం, పేపర్ ప్లేట్ల తయారీ, టైలరింగ్ లాంటి వ్యాపారాలు, వృత్తులు చేసుకునే స్వయం సహాయక సంఘాల మహిళలకు చిన్నచిన్న మొత్తాల్లో సీ్త్రనిధి బ్యాంకు రుణాలు అందిస్తుంది. మూడు నెలల క్రితం వరకు రుణం అవసరమైన డ్వాక్రా మహిళలకు సీ్త్రనిధి యాప్లో వివరాలు నమోదు చేసి, బ్యాంకుల నుంచి కావాల్సిన రుణం మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం హెచ్ఎల్పీ–ఎంసీపీ యాప్(హౌస్హోల్డ్ లవులీఉడ్ ప్లాన్–మైక్రో క్రెడిట్ ప్లాన్)లో గ్రూప్ సభ్యులందరి జీవనోపాధి వివరాలు నమోదు చేసి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ గత మూడు నెలలుగా కొనసాగుతుండటంతో సీ్త్రనిధి రుణాలు మంజూరు చేయకుండా నిలిపివేశారు. జిల్లాలో రూ.16 కోట్ల మేర సీ్త్రనిధి రుణాల బకాయిలు వసూలయ్యే వరకు కొత్త రుణాలు మంజూరు చేసేది లేదని చెబుతుండటంతో అర్హులైన మహిళలు విస్తుపోతున్నారు. సకాలంలో రుణాలు అందకపోవడంతో చిన్న చిన్న అవసరాల కోసం ప్త్రెవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వస్తోందని స్వయం సహాయక సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరు వ్యాపారం చేసుకునే మహిళలు పెట్టుబడి కోసం, అలాగే కళాశాలలు తెరవడంతో తమ పిల్లల ఫీజులు, పుస్తకాల కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ మహిళలకు ఉన్నతి కింద సున్నా వడ్డీకే సీ్త్రనిధి రుణాలు మంజూరు చేస్తారు. ఈ నేపథ్యంలో ఎస్సీ మహిళలు నెలల తరబడి ఎదురుచూపులు చూస్తున్నారు. ఉన్నాతాధికారులు స్పందించి సీ్త్రనిధి రుణాలు మంజూరు చేయాలని పొదుపు సంఘాల మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో డ్వాక్రా సభ్యులు 4,54,628 గ్రామ సమాఖ్య సంఘాలు 1,541 డ్వాక్రా సంఘాలు 45,062 సీ్త్రనిధి రుణాల కోసం డ్వాక్రా మహిళల ఎదురుచూపులు మూడు నెలలుగా రుణం మంజూరు కాక మహిళల అవస్థలు హెచ్ఎల్పీ–ఎంసీపీ యాప్లో సభ్యుల వివరాల నమోదుతో మరింత ఆలస్యం బయోమెట్రిక్ పూర్తయిన గ్రూపులు 34,814 సీ్త్రనిధి రుణాలు తీసుకున్న వారి నుంచి రికవరీ సరిగా లేదు. గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రూ.1.60 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీఓఏలు సక్రమంగా రుణాలు కట్టించడంలేదు. కొన్ని గ్రామ సంఘాల సభ్యులు రెండు నుంచి మూడేళ్లుగా రుణాలు చెల్లించడం లేదు. ప్రస్తుతం రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాం. – రాజేశ్వరి, గిద్దలూరు క్లస్టర్ సీ్త్రనిధి మేనేజర్ -
వర్జీనియా పొగాకు రైతుల సమస్యలు పట్టవా
టంగుటూరు: వర్జీనియా పొగాకు రైతుల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టవా అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే వీరారెడ్డి అన్నారు. స్థానిక వేలం కేంద్రం నిర్వహణాధికారి శ్రీనివాసరావుకు పొగాకు రైతుల సమస్యలపై బుధవారం వినతి పత్రం అందించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రైతులు పండించిన ఏ పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని అన్నారు. రైతులు పండించిన పొగాకు గతంలో క్వింటా రూ.36 వేలు పలికినా నేడు రూ.28 వేలు కూడా ఇవ్వటం లేదన్నారు. వ్యాపారుల సిండికేట్ ముసుగులో రైతులను దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం నష్టాల నుంచి కాపాడాలని కోరారు. రైతులకు అండగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పనిచేస్తుందని తెలిపారు. రైతులు తెచ్చిన పొగాకును వెనక్కి తీసుకెళ్లకుండా పొగాకు వేలం కేంద్రం అధికారులు చూడాలన్నారు. పొగాకు కంపెనీలపై ఒత్తిడి తెచ్చి రైతుల పొగాకును గిట్టుబాటు ధరలకు కొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి పొగాకు రైతుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని వేలం నిర్వహణ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి లక్ష్మి, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ప్రభాకర్, రైతు నాయకులు జీ ప్రసాద్, సుబ్బారెడ్డి, సుబ్బారావు, కిరణ్, కోటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి
● రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ ఒంగోలు టౌన్: చట్టాలపై సమగ్రంగా అవగాహన పెంపొందించుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ చెప్పారు. డైరక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ రాహుల్ దేవ్ శర్మతో కలిసి బుధవారం ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీని సందర్శించారు. కాలేజీలో శిక్షణ పొందుతున్న 102 మంది ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడారు. శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకై ్సజ్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ల ప్రకారం నిందితులను అరెస్టు చేయడం, కేసు నమోదు చేయడం వంటి విషయాలను వివరించారు. మహిళలను అరెస్టు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించారు. చెక్ పోస్టు నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నిత్యం చట్టాల గురించి అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ దయాసాగర్, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం, ఏఈఎస్లు, సీఐ, ఎస్సైలు, పీటీసీ అధికారులు పాల్గొన్నారు. -
నేడు ప్రైవేట్ పాఠశాలలు బంద్
ఒంగోలు సిటీ: ప్రైవేట్ యాజమాన్యాలపై అతిగా స్పందిస్తున్న కొంతమంది అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో గురువారం అన్ని ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు అపుస్మ ఒంగోలు టౌన్ ప్రెసిడెంట్, కార్యదర్శి కాట్రగడ్డ మురళీకృష్ణ, వంశీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది అధికారులు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై అతిగా స్పందించడం, పాఠశాలలపై 3 మెన్ కమిటీలు, తనిఖీలను అమలు చేయడం చాలా దురదృష్టకరమన్నారు. కొన్ని ఏకపక్ష వార్తలు, కొంతమంది వ్యక్తుల లేఖలు, తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా, ఎప్పటికప్పుడు నోటీసులు జారీచేయటం వాటిని వెంటనే అమలు చేయమనడం, కొంతమంది ఫీల్డ్ అధికారుల నుంచి అగౌరవకరమైన సందేశాలు, హెచ్చరికలు వంటి చర్యలు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల్లో తీవ్ర వేదన కలిగిస్తున్నాయన్నారు. కొంతమంది అధికారులు తీసుకున్న అన్యాయమైన, ఏకపక్ష నిర్ణయాలతో ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలను ఆర్టీఈ 12.1.సీ దరఖాస్తుదారులను తగిన ధ్రువీకరణ లేకుండా చేర్చుకోవాలని బలవంతం చేయడం, పాఠశాలలను షోకాజ్ నోటీసులతో వేధించడం, గుర్తింపు రద్దు చేస్తామని బెదిరించడం వంటి చర్యలకు ప్రతిస్పందనగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు మూసివేయనున్నట్లు తెలిపారు. సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం ఒంగోలు సిటీ: భారత ప్రభుత్వం 2025వ సంవత్సరానికి గాను జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 31వ తేదీ జాతీయ స్థాయిలో జాతీయ ఐక్యత, సమగ్రత పై అత్యుత్తమ సేవ చేసిన వ్యక్తులు, సంస్థలకు సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా అవార్డు ప్రదానం చేస్తున్నట్లు స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డు కోసం జిల్లాలో ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు జాతీయ ఐక్యత, సమగ్రతపై వారు చేసిన విశేష కృషిని తెలియచేస్తూ తమ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎడబ్ల్యూఆర్డీఎస్.జీవోవీ.ఇన్ అనే వెబ్ సైట్లో ఈ నెల 9వ తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు. ఆ దరఖాస్తును, ఇతర వివరాలను ముఖ్య కార్యనిర్వహణాధికారి, స్టెప్, జిల్లా యువజన సంక్షేమశాఖ, ఒంగోలు కార్యాలయంలో 9వ తేదీలోగా మూడు కాపీలు సమర్పించాలని కోరారు. ఇతర వివరాలకు కార్యాలయ పనివేళల్లో స్వయంగా కానీ లేదా ఫోన్ నంబర్ 91828 91095 ద్వారా తెలుసుకోవాల్సిందిగా కోరారు. జాతీయ స్థాయి ఎల్ఎస్వీఎస్ శిక్షణకు విజయానంద్ సింగరాయకొండ: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ ఆధ్వర్యంలో జూన్ 24, 25వ తేదీల్లో నిర్వహించిన ఎల్ఎస్వీఎస్ శిక్షణ కార్యక్రమంలో పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు డీ విజయానంద్ పాల్గొన్నారు. ఈ శిక్షణకు రాష్ట్రం నుంచి 10 మంది ఉపాధ్యాయులు పాల్గొనగా జిల్లా ప్రతినిధిగా విజయానంద్ ప్రాతినిధ్యం వహించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో నాణ్యతా ప్రమాణాల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసే పద్ధతులపై రెండు రోజులు శిక్షణ ఇచ్చారని విజయానంద్ వివరించారు. విజయవాడకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వారు తనను నామినేటెడ్ చేశారని, శిక్షణ పూర్తి చేసిన వారికి సంస్థ డీజీఎం చిత్రాగుప్తా, డాక్టర్ ఎస్ సూర్యకళ్యాణి ధ్రువపత్రాలు అందజేశారన్నారు. ఈ శిక్షణ ద్వారా తాను నేర్చుకున్న విజ్ఞానంతో విద్యార్థులను సాంకేతికంగా తీర్చిదిద్దటానికి కృషి చేస్తానన్నారు. -
భవితకు బీటలు!
పచ్చకుట్రలు..ఒంగోలు టిపుల్ ఐటీ రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్ భవనానికి తాళాలు వేసిన దృశ్యంక్యాంపస్ తరలిపోదంటూ మభ్యపెట్టి.. కొత్త విద్యా సంవత్సరం నుంచి రావ్ అండ్ నాయుడు క్యాంపస్ ఉండదని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వరుస కథనాలు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మభ్య పెట్టారు. క్యాంపస్ ఎక్కడికీ వెళ్లదంటూ చెప్పుకొచ్చారు. అధికారులతో సమావేశాలంటూ డ్రామాలకు తెరతీశారు. వారి మాటలన్నీ అబద్ధాలే అని నెల రోజుల తర్వాత స్పష్టమైంది. క్యాంపస్కు తాళాలు వేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కూటమి పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు ట్రిపుల్ ఐటీ ప్రారంభంలో సొంత భవనాలు లేకపోవడంతో ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో తరగతులు నిర్వహించారు. అక్కడ ఆర్కే వ్యాలీ విద్యార్థులకు, ఒంగోలు క్యాంపస్ విద్యార్థులకు మధ్య తరచుగా గొడవలు జరగడం మొదలయ్యాయి. సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజం లేకుండా పోయింది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇడుపులపాయలోని ఒంగోలు క్యాంపస్ను నగరంలోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్కు తరలించింది. ఆ తరువాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ రావడంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా చీమకుర్తి రోడ్డులోని ఎస్ఎస్ఎన్ క్యాంపస్ను లీజుకు తీసుకుంది. అప్పటి నుంచి విద్యార్థులు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా చదువుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంగోలు క్యాంపస్ విద్యార్థులకు సమస్యలు మొదలయ్యాయి. అద్దె బకాయిలు రూ.2.50 కోట్లు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రావ్ అండ్ నాయుడు క్యాంపస్కు అద్దె చెల్లించడం నిలిపివేసింది. ఏడాది కాలానికి గాను రూ.2.50 కోట్లు చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతోపాటుగా కళాశాల కరెంటు బిల్లులు చెల్లించడాన్ని పూర్తిగా నిలిపివేసింది. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తరచుగా విద్యార్థులు చీకటిలో మగ్గాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరికి విద్యార్థులకు కనీసావసరాలకు నీరు అందుబాటులో లేకుండా చేసింది. గత్యంతరంలేక విద్యార్థులు నాల్గవ అంతస్తు నుంచి బకెట్లలో నీళ్లు మోసుకోవాల్సి వచ్చింది. కుట్రపూరితంగానే విద్యార్థులను కష్టపెడుతూ వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. చిట్ట చివరకు కాలేజీనే ఎత్తేసింది. ప్రస్తుతం క్యాంపస్లోనే కళాశాలకు చెందిన సామగ్రి, విద్యార్థుల మంచాలు, బెడ్షీట్లతోపాటుగా ఎగ్జామ్ సెల్ కు సంబంధించిన పరికరాలు ఉండిపోయాయి. తమకు రావల్సిన బకాయిలు చెల్లించమని అడుగుతున్న భవన యజమాని కళాశాలకు తాళం వేసేశారు. దిక్కుతోచని అధికారులు కళాశాలకు చెందిన సామగ్రి, ఇతర పరికరాలకు 10 మంది సెక్యూరిటీ గార్డులను కాపలా పెట్టారు. ఎస్ఎస్ఎన్ క్యాంపస్ కూడా ఎత్తేస్తారా...? చీమకుర్తి రోడ్డులోని ఎస్ఎస్ఎన్ క్యాంపస్ లీజు 2026 డిసెంబర్ వరకు ఉంది. నాటి ప్రభుత్వం ముందు చూపుతో ఈ క్యాంపస్కు అడ్వాన్స్ చెల్లించడంతో ప్రస్తుత ప్రభుత్వం అద్దెలు చెల్లించకపోయినప్పటికీ క్యాంపస్ కొనసాగుతోంది. ఈ అడ్వాన్స్ అయిపోయాక ఎస్ఎస్ఎన్ క్యాంపస్ను కొనసాగించడం కూడా ప్రశ్నార్థకమేనని సిబ్బంది, విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ క్యాంపస్కు సైతం కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. ప్రస్తుతం రూ.2 కోట్లు వరకూ కరెంటు బిల్లు బకాయి ఉన్నట్లు సమాచారం. రావ్ అండ్ నాయుడు తరహాలో దీన్ని కూడా పూర్తిగా ఎత్తివేసేందుకు కూటమి పాలకులు కుట్రలు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. రాజీనామా బాటలో ఫ్యాకల్టీలు... రావ్ అండ్ నాయుడు క్యాంపస్లో 150 మంది వరకు ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. క్యాంపస్ ఎత్తివేయడంతో ఈ ఫ్యాకల్టీని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు ఎస్ఎస్ఎన్ క్యాంపస్లకు సర్దుబాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా అయినవారికి కంచాల్లో వడ్డిస్తున్నారు. తమకు సానుకూలంగా వ్యవహరిస్తున్న ఫ్యాకల్టీలను కోరిన చోట పోస్టింగులు ఇస్తున్నారని, మిగిలిన వారిని తమకు ఇష్టమైన చోటుకు బదిలీ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా క్యాంపస్ ఎత్తేయడంతో ఫ్యాకల్టీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కుటుంబ సభ్యులను తీసుకొని ఎక్కడికో వెళ్లలేక సుమారు 50 మంది ఫ్యాకల్టీలలో కొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టుకోగా, మరికొందరు రాజీనామా చేసినట్లు తెలిసింది. మరో 40 మంది బదిలీల విషయంలో వెసులుబాటు కల్పించాలని డైరక్టర్కు వినతిపత్రం అందజేసినట్లు సమాచారం. దీంతో అధ్యాపకుల కొరత ఏర్పడింది. నిన్నటి దాకా వేలాది మంది విద్యార్థులతో కళకళ నేడు నిర్మానుష్యంగా రావ్ అండ్ నాయుడు క్యాంపస్ అద్దె బకాయిలు రూ.2.5 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో క్యాంపస్కు తాళం వేసిన భవన యజమాని కరెంటు బిల్లులు కోటి రూపాయలకు పైగా బకాయి విద్యార్థులు, ఫ్యాకల్టీలతో మూడు ముక్కలాట తర్వాత ఎస్ఎస్ఎన్ క్యాంపస్ వంతు మభ్యపెట్టిన అధికార టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులునిర్మానుష్యంగా ఉన్న రావ్ అండ్ నాయుడు కాలేజీలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ -
ఖైదీలతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ముఖాముఖి
ఒంగోలు: ఖైదీలతో స్థానిక జిల్లా జైలులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ బుధవారం ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ క్షణికావేశంలో తప్పులు చేసి కుటుంబాలకు దూరంగా ఉండడం, తద్వారా సమాజానికి భారంగా ఉండడం దురదృష్టకరమన్నారు. న్యాయవాదిని నియమించుకునే స్థోమతలేని ఖైదీలకు ఉచితంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిస్టం ద్వారా న్యాయ సహాయం అందిస్తారన్నారు. ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాల, స్టోర్ రూమును పరిశీలించి మరింత మెరుగైన వసతుల కోసం అవసరమైన సలహాలిచ్చారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ పి.వరుణ్రెడ్డి, వైద్యులు బ్రహ్మతేజ, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి.రవిశంకర్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వీర రాఘవులు, జైలర్ యలమందయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి హాకీ పోటీలకు మైనంపాడు క్రీడాకారిణి సంతనూతలపాడు: హాకీ ఇండియా ఆధ్వర్యంలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నేటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు జరగనున్న 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే హాకీ ఆంధ్రప్రదేశ్ జట్టుకు మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆకుల లోహిత ఎంపికయ్యారని హెచ్ఎం డీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఎంపికై న క్రీడాకారిణిని జిల్లా అసోసియేషన్ సెక్రటరీ సుందరరామిరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో శర్మ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య, పీఈటీ దాసరి శ్రీనివాసరావు, పీఈటీ తిరుమలశెట్టి రవికుమార్, స్కూలు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బైక్ ఢీకొని వృద్ధుడు మృతి తర్లుపాడు: ఎదురెదురుగా వస్తున్న మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన తర్లుపాడు మండలంలోని ఓబాయపల్లి కలుజువ్వలపాడు మధ్య బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కొండారెడ్డిపల్లికి చెందిన వెంకటస్వామి(65) అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న తర్లుపాడు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 5న జాతీయ లోక్ అదాలత్ ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి ఒంగోలు: ఈ నెల 5న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎ.భారతి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజీకి అర్హత కలిగిన క్రిమినల్, సివిల్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా పరిహారం చెల్లింపు కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వివాహ సంబంధ వ్యాజ్యాలను కక్షిదారుల ఆమోదంతో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. లోక్ అదాలత్లో పరిష్కరించుకున్న కేసుల్లో తీర్పు అంతిమమని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో పరిష్కరించుకున్న వ్యాజ్యాలకు సంబంధించి కోర్టుకు చెల్లించిన ఫీజును వాపసు పొందే అవకాశం ఉందని, ప్రీ సిట్టింగ్ రూపంలో ఇరువర్గాల ఆమోదంతో ముందస్తుగా వ్యాజ్యాల పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సంబంధిత న్యాయవాదులు, మీడియేషన్ న్యాయవాదులు సహకరిస్తారన్నారు. ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి సహకరించాలని పోలీసు, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోరారు. -
దాణా సొమ్ము మేశారు!
మర్రిపూడి: రాయితీపై ప్రభుత్వం అందించే పశువుల దాణా కోసం నగదు చెల్లించిన పశుపోషకులను ఆ శాఖ సిబ్బంది ముప్పుతిప్పలు పెడుతున్నారు. పశువైద్యశాలలో దాణా నిల్వ ఉన్నా నగదు చెల్లించిన వారికి పంపిణీ చేయకపోవడంతో పశుపోషకులు ఆగ్రహించారు. బుధవారం మర్రిపూడి పశువైద్యశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. దాణా పేరుతో వసూలు చేసిన సొమ్మును సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మర్రిపూడి మండలంలోని కాకర్ల, మర్రిపూడి గ్రామాల్లో రెండు పశువైద్యశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆవులు, ఎద్దులు 1570, గేదెలు 18,240, మేకలు 61,200, గొర్రెలు 16200 ఉన్నాయి. కాగా మర్రిపూడి పశు వైద్యశాలలో లైవ్స్టాక్ అసిస్టెంట్ ఖాజావలి, అటెండర్ సురేష్ పశుపోషకుల వద్ద రూ.555 విలువ చేసే 50 కిలోల పెల్లెట్ దాణా బస్తాకు రూ.600 చొప్పున వసూలు చేశారు. ఇద్దరు ధైర్యంగా పశువైద్యశాలలోనే మద్యం సేవించడం, అక్కడే పడుకోవడం, ఉన్నతాధికారులను సైతం లెక్క చేయకపోవడం గమనార్హం. రెండు నెలల క్రితం వల్లాయపాలెం, మర్రిపూడి, రాజుపాలెం, దుగ్గిరెడ్డిపాలెం, గంగపాలెం తదితర గ్రామాలకు చెందిన సుమారు 200 మంది పశుపోషకుల వద్ద సుమారు రూ.1.20 లక్షలు వసూలు చేసి ఇప్పటికీ దాణా ఇవ్వకపోవడంతో పశుపోషకులు రోజూ ఆస్పత్రి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రెండు రోజుల క్రితం మర్రిపూడి వైద్యశాలలకు 44 బస్తాల దాణా వచ్చిన విషయం తెలుసుకున్న పశుపోషకులు బుధవారం ఆందోళన చేపట్టారు. దాణా పంపిణీ చేసే వరకు కదలబోమని భీష్మించారు. ఆస్పత్రిలో పరిస్థితి తెలుసుకున్న ఖాజావలి బుధవారం వైద్యశాలకు రాకపోగా, అటెండర్ సురేష్ స్టాక్ రూమ్కు తాళం వేసి పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం రైతులు రోజంతా గాలించారు. ఉదయం విధులకు హాజరైన పశు వైద్యాధికారి మంచాల మణిశేఖర్ ఆందోళనకు దిగిన పశుపోషకులను చూసి విస్తుపోయారు. ‘నేను వారం రోజుల క్రితం బాధ్యతలు చేపట్టాను. మీరు డబ్బు చెల్లించిన విషయం నాకు తెలియదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తా’ అని చెప్పడంతో రైతులు శాంతించారు. మర్రిపూడిలో పశువుల దాణా పేరుతో బస్తాకు రూ.600 చొప్పున వసూలు దాణా నిల్వ ఉన్నా పంపిణీ చేయకపోవడంపై అనుమానాలు 200 మంది రైతులు చెల్లించిన రూ.1.20 లక్షలు సొంత ఖాతాల్లోకి! రైతులు నిలదీయడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్న నూతన పశువైద్యాధికారి -
గ్రావెల్ మటాష్..!
సింగరాయకొండ: కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లో గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ తవ్వకాలకు పాల్పడుతోంది టీడీపీ నాయకులు కావడంతో ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ పరిధిలో ఉన్న జువ్వలగుంట చెరువులో టీడీపీ నాయకులు గద్దల్లా వాలిపోయారు. గడిచిన వారం రోజులుగా అక్రమంగా గ్రావెల్ తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా రాత్రి వేళల్లో జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల సాయంతో గ్రావెల్ తవ్వి తరలిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అమాత్యుడి ఆదేశాలతోనే అధికార గణం కళ్లు మూసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భగ్గుమన్న విభేదాలు చెరువులో గ్రావెల్ను పక్క గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తుండటంతో సొంత పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శానంపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల అక్రమ గ్రావెల్ దందాకు వీఆర్ఓలు కూడా సహకరిస్తున్నారని, తమ గ్రామ చెరువులో వారి పెత్తనం ఏమిటని మూలగుంటపాడు నాయకులు మంత్రి స్వామి వద్ద పంచాయతీ పెట్టినట్టు తెలిసింది. చోద్యం చూస్తున్న అధికారులు వారం రోజుల నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా అధికారులకు పట్టించుకోకపోగా పచ్చ నేతలకు సహకరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. రాత్రి వేళ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు కూడా గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. చెరువులో గ్రావెల్ తవ్వకంతో శ్మశాన స్థలం ధ్వంసమైందని, కర్మకాండలకు ఇబ్బందిగా మారిందని సమీపంలోని వెంకటేశ్వరనగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రావెల్ అక్రమ దందాకు అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాల్సిందే. జువ్వలగుంట చెరువులో గ్రావెల్ తవ్వేస్తున్న పచ్చ ముఠా గత వారం రోజులుగా రాత్రి వేళ సాగుతున్న అక్రమ దందా గ్రావెల్ తవ్వకాలపై పచ్చ తమ్ముళ్ల మధ్య తలెత్తిన విభేదాలు అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులు -
భూమి హాంఫట్!
1రూ. కోటిసాక్షి టాస్క్ఫోర్స్: మార్కాపురంలో ప్రసిద్ధిగాంచిన చెన్నకేశవ ఆలయానికి చెందిన భూములను కబ్జాల బారి నుంచి కాపాడుకుంటున్నట్లు గొప్పగా డప్పు వేస్తున్న పాలకులు.. కూటమి నాయకుల కబ్జా పర్వాన్ని మాత్రం కళ్లప్పగించి చూస్తున్నారు. చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన సుమారు రూ.కోటి విలువైన భూమిపై కన్ను వేసిన కూటమి నాయకులు ఆక్రమించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామివారికి భజంత్రీల ఇనాం కింద సుమారు 32 ఎకరాలు కేటాయించారు. అయితే ప్రభుత్వ అవసరాల నిమిత్తం వాటర్ ట్యాంకు, ఇళ్ల స్థలాలు తదితర నిర్మాణాల కింద కొంత భూమి పోగా ప్రస్తుతం సంక్రాంతి మండపం వద్ద పార్వేట నిమిత్తం 40 సెంట్ల స్థలం మిగిలింది. ఆ భూమిలో కూడా సొసైటీకి చెందిన స్థలం ఉందంటూ కూటమి నాయకులు జేసీబీలతో యథేచ్ఛగా చదును చేశారు. నాలుగేళ్ల క్రితం సంక్రాంతి మండపానికి చెందిన స్థలాన్ని సర్వేయర్ కొలత వేయగా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కొందరు టీడీపీ నాయకులు రూ.కోట్ల విలువచేసే ఆ భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో సర్వే చేసి సంక్రాంతి మండపానికి కేటాయించిన భూమిలో సొసైటీ పేరుతో అక్కడ ఇంకా స్థలం ఉందని చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. కూటమి నాయకుల కబ్జా పర్వానికి అధికారులు పరోక్షంగా వత్తాసు పలకడం ఎంత వరకు సబబని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సదరు ఆక్రమణలపై ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా.. సంక్రాంతి మండపం వద్ద సొసైటీకి చెందిన భూమి కొంత ఉందని కొందరు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. స్వామివారికి చెందిన భూమిని కొందరు చదును చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని అంగీకరించారు. అధికారులతో సమీక్షించి ఆలయానికి చెందిన భూమిని ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెన్నకేశవస్వామి ఆలయ భూమిపై కూటమి నాయకుల కన్ను సంక్రాంతి మండపం ఫెన్సింగ్ లోపల భూమి దర్జాగా చదును చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న ఆలయ అధికారులు -
జిల్లా హామీ అమలు చేశాకే పవన్ మార్కాపురంలో అడుగు పెట్టాలి
● వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి పెద్దదోర్నాల: మార్కాపురాన్ని జిల్లా చేస్తామన్న హామీని అమలు చేసిన తర్వాతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చిమ ప్రకాశంలో అడుగు పెట్టాలని వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పవన్ మార్కాపురం పర్యటన నేపథ్యంలో బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మార్కాపురాన్ని జిల్లా చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆ హామీ ఊసే లేదని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్వ స్థితిలోనే ఉన్నాయని, ప్రాజెక్టుకు నీరు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టకుండా ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి మార్కాపురం: ఈనెల 4వ తేదీన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ మార్కాపురంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం ఆమె మార్కాపురం సబ్కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ త్రివినాగ్తో కలిసి డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ కింద 18 మండలాల ప్రజలకు తాగునీరు అందించే పథకానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. హెలీప్యాడ్, సభావేదిక వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమీవేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జనసేన ఇన్చార్జి ఇమ్మడి కాశినాఽథ్, డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు, తహసీల్దార్ చిరంజీవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా చిట్యాల హనుమంతునిపాడు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఐటీ విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా చిట్యాల విజయ్భాస్కర్రెడ్డి ఎంపికయ్యారు. హనుమంతునిపాడు మండలం పెద్దగోళ్లపల్లి గ్రామానికి చెందిన విజయభాస్కర్రెడ్డిని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 7న బోయలపల్లెలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు యర్రగొండపాలెం: మండలంలోని బోయలపల్లె గ్రామంలో వెలసిన ఆత్మానంద అవధూత స్వాముల వారి ఆలయ 56వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ రాష్ట్ర స్థాయి పాలపండ్ల ఎడ్ల (6 పండ్ల సైజులోపు) పందేలు నిర్వహించనున్నట్లు ఆ స్వామి సేవా సంఘం బుధవారం తెలిపింది. ఈ పందేల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు 1 నుంచి 5 బహుమతులు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.20 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు అందిస్తారని చెప్పారు. ఈ పందేల్లో పాల్గొనే ఎడ్ల యజమానులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాల కోసం సంఘ అధ్యక్షుడు మన్నెం ఆంజనేయులు, సెల్ నంబర్: 94415 86783కు సంప్రదించాలన్నారు. -
హ్యాపీ బర్త్డే రత్నం మేడమ్
కుటుంబ సభ్యులతో బత్తుల రత్నం ● ఘనంగా శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుక ఒంగోలు సిటీ: ఒంగోలు నగరంలో శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకను బుధవారం కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని మామిడిపాలేనికి చెందిన రిటైర్డ్ టీచర్ బత్తుల రత్నం 103 ఏళ్లు పూర్తి చేసుకొని 104వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వేడుక నిర్వహించారు. 1977లో ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైరైన రత్నం 48 ఏళ్ల నుంచి పెన్షన్ పొందుతుండటం విశేషం. -
భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వండి..
● సబ్కలెక్టర్కు రైతుల వినతి మర్రిపూడి: ఎన్హెచ్544జీ (గ్రీన్ఫీల్డ్ హైవే)కు అవసరమైన 6.51 ఎకరాల భూములు కోల్పోయిన ఏడుగురు రైతులకు సుమారు రూ.65 లక్షలు పరిహారం చెల్లించాలని మండలంలోని దుగ్గిరెడ్డిపాలెం గ్రామస్తులు రోడ్ పనులను పరిశీలించేందుకు మర్రిపూడి వచ్చిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వరకుమార్కు మంగళవారం విన్నవించారు. దాదాపు ఏడాది గడుస్తున్నా పరిహారం ఇవ్వకుండా అధికారులు రేపు, మాపు అని కాలయాపన చేస్తున్నారని దుగ్గిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బూదాల ఆశీర్వాదం, దుద్దుకుంట కోటయ్య, ఆకుల పెదగంగిరెడ్డి, ఆకుల సుగుణమ్మ, ఆకుల గంగిరెడ్డి, గురుగూరి ఆదెమ్మ, బీ ఆదిలక్ష్మిలు డిప్యూటీ కలెక్టర్ ముందు వాపోయారు. ఈ భూమి ద్వారా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, అసైన్మెంట్ భూమిని గతంలో అధికారులు ఎలాంటి విచారణ జరపకుండా ఏడబ్ల్యూ ల్యాండ్ అని రాసి పంపారని, విచారించి మాకు తగు న్యాయం చేయండి సార్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు సమస్యను విన్నవిస్తున్న దుగ్గిరెడ్డిపాలెం గ్రామస్తులు అంటూ డిప్యూటీ కలెక్టర్కు గ్రామస్తులు విన్నవించారు. గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు ఆటంకం పెట్టరాదని, రైతుల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, మీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట తహశీల్దార్ జనార్దన్ డీటీ రాజు, వీఆర్వోలు ఉన్నారు. -
క్షయ పరీక్షలు చేయించుకోవాలి
ఒంగోలు టౌన్: 60 ఏళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా క్షయ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు సూచించారు. టీబీ ముక్తి భారత్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక 49వ డివిజన్లో టీబీ ముక్త్ భారత్ అవగాహన ర్యాలీలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 1,12,817 మందిని పరీక్షలు చేయగా వారిలో 5,432 మంది అనుమానితులుగా గుర్తించారని తెలిపారు. వారిలో 137 మందికి క్షయవ్యాధి పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి అవసరమైన మందులను అందించారన్నారు. ప్రజలందరూ టీబీ వ్యాధి పట్ల అవగాహన కల్పించుకోవాలని, కుటుంబంలో ఎవరికై నా రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉన్నట్లయితే వెంటనే క్షయ నివారణ మందులను మింగించి క్షయ వ్యాధి నుంచి విముక్తం కావాలన్నారు. తూర్పునాయడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా క్షయ అధికారి డాక్టర్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. తడిసిన పొగాకునూ కొనుగోలు చేయండి ●● కలెక్టర్ తమీమ్ అన్సారియాకు బర్లీ పొగాకు రైతుల వినతి మద్దిపాడు: మూడు రకాల పొగాకు గ్రేడులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, వర్షానికి తడిసి నల్లబడిన పొగాకును కూడా కొనుగోలు చేస్తేనే తాము తక్కువ నష్టాలతో బయట పడతామని బర్లీ పొగాకు రైతులు కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. మండలంలోని గార్లపాడు పునరావాస కాలనీ సమీపంలోని బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. పొగాకు కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆమె రైతులతో పొగాకు పంట ఎన్ని ఎకరాల్లో వేశారు? పంట దిగుబడి ఎంత వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న విషయాలు అడిగారు. ఈక్రమంలో నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన రైతులు పలువురు నాల్గవ గ్రేడు ఏర్పాటు చేయించాలని కలెక్టర్ను కోరగా విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. కార్యక్రమంలో ఆమె వెంట మార్క్ఫెడ్ డీఎం హరికృష్ణ, తహశీల్దార్ ఆదిలక్ష్మి, ఎంపీడీఓ డీఎస్వీ ప్రసాద్, ఏఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు వన్టౌన్: కౌలు రైతులకు నిర్దేశించిన లక్ష్యం మేరకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో వీడియో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ్యుటేషన్ కరెక్షన్, ట్రాన్సాక్షన్స్, హౌసింగ్ ఫర్ ఆల్లో భాగంగా ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్, నూతన ఇంటి పట్టాల కోసం దరఖాస్తుల పరిశీలన, జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారం రెగ్యులరైజేషన్, రీ సర్వే ప్రక్రియ, రేషన్ షాపుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో 46,015 మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు మంజూరు లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 11,579 మంది కౌలు రైతులకు కార్డులు జారీ చేసినట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి అవసరమైన స్థల సేకరణ చేపట్టాలన్నారు. కోర్టు కేసులను ఆన్లైన్లో చూసుకునేలా రెవెన్యూ కేసులు కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జీఓ ఎంఎస్ 30 ప్రకారం రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 22ఏ డాటెడ్ ల్యాండ్, భూమి అప్పగింత, అసైన్మెంట్ ల్యాండ్లకు సంబంధించి వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఎస్డీసీలు వరకుమార్, శ్రీధర్, జాన్సన్, జిల్లా వ్యవసాయ అధికారులు శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ పెరుగు శ్రీనివాస ప్రసాద్, డీఎస్ఓ పద్మశ్రీ,, సివిల్ సప్లైస్ డీఎం వరలక్ష్మి, జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా, రెవెన్యూ డివిజినల్ అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు. -
అధికార జలగలు !
దోపిడీకి నోటీసులు.. ఒంగోలు నగరపాలక సంస్థ వడ్డీ వ్యాపారుల కంటే దారుణంగా తయారైంది. చిరు వ్యాపారం చేసుకునే కూరగాయల నిర్వాహకులపై బకాయిలను వడ్డీల రూపంలో మోయలేని భారాన్ని మోపుతున్నారు. నగర పాలక సంస్థ ఇచ్చిన నోటీసులు చూసి వ్యాపారుల కళ్లు బైర్లు కమ్మాయి. చెల్లించాల్సింది రూ.5.78 కోట్లు అయితే వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీ కలిపి రూ.7.08 కోట్లు వేశారు. మొత్తంగా రూ.12.86 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అధికారులిచ్చిన నోటీసులు చూసి వారు బెంబేలెత్తిపోతున్నారు. ఇదేంటి అని అడిగిన వారి దుకాణాలను సీజ్ చేస్తున్నారు. అధికారులు చిరు వ్యాపారులను జలగల్లా పీక్కుతింటున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షిప్రతినిధి, ఒంగోలు: నగరంలో కొత్త కూరగాయల మార్కెట్ వ్యాపారులు అధికారులు, పాలకుల మధ్య నలిగిపోయి..చిక్కి శల్యమవుతున్నారు. ఒక పక్క బాడుగల పేరుతో వేధింపులు...మరోపక్క దుకాణాలు పెట్టుకోనీయకుండా బెదిరింపులు అక్కడి వ్యాపారులకు నిత్యకృత్యమయ్యాయి. కొత్త కూరగాయల మార్కెట్ ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు దోచుకునేందుకు సొంత ఆదాయ వనరుగా మారిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ (ఏఎంసీ) కోసం కాంప్లెక్స్ నిర్మించారు. ఒంగోలు నడిబొడ్డులో కాంప్లెక్స్ నిర్మాణం కావటంతో అప్పటి పాలకులు ఏఎంసీకి కాకుండా కూరగాయల మార్కెట్ అయితే నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందని భావించి ఏఎంసీని పాత గుంటూరు రోడ్డుకు తరలించి ఆ కాంప్లెక్స్ను ఒంగోలు మున్సిపాలిటీకి అప్పగించారు. దాంతో 2008లో పాత కూరగాయల మార్కెట్ నుంచి వ్యాపారులను ఇక్కడకు మార్చారు. అప్పట్లో మున్సిపాలిటీ అధికారులు అద్దెలు ఖరారు చేసి వసూలు చేయటం ప్రారంభించారు. 2008 నుంచి 2019 నవంబర్ వరకు వ్యాపారులు అందరూ పూర్తిగా బకాయిలు లేకుండా అద్దెలు చెల్లించారు. కరోనా నుంచి కష్టాలు ప్రారంభం: కరోనా సమయం నుంచి కొత్త కూరగాయల మార్కెట్ వ్యాపారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. 2019 డిసెంబర్ నుంచి షాపులను నగరపాలక సంస్థ అధికారులు అప్పటి వరకు ఉన్న అద్దెకు 33.33 శాతం పెంచి షాపులను వ్యాపారులకు రెన్యువల్ చేయాల్సి ఉంది. ఇంతలో కరోనా వచ్చింది. 2020 మార్చి నుంచి కరోనాతో లాక్డౌన్ ప్రకటించారు. దాంతో మార్కెట్ మూత పడింది. అయితే మార్కెట్లో కాకుండా రంగారాయుడు చెరువు పక్కనే ఉన్న పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా షెడ్లు వేసి ఆ వ్యాపారుల చేతనే ఇక్కడ కూరగాయలను ప్రజల అవసరాలు తీర్చేందుకు అమ్మకాలు జరిపించారు. ఈ విధంగా రెండేళ్ల పాటు చేయించారు. అయితే కరోనా సమయంలో ఉన్న అద్దె బకాయిలను మాఫీ చేయమని వ్యాపారులు పాలకులను, అధికారులను అడుగుతూ వచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి మాఫీ చేయిస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. అద్దె మాత్రం మాఫీ చేయలేదు. కానీ కరోనా సమయం నుంచి నగర పాలక సంస్థ అధికారులు 193 షాపులకు అద్దెల లెక్కలు వేసుకుంటూ వస్తూనే ఉన్నారు. రూ.5.78 కోట్లు అసలు.. వడ్డీ రూ.7.08 కోట్లు..! ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో మొత్తం షాపులు 193 ఉన్నాయి. వాటిలో రిటైల్ షాపులు 123, హోల్ సేల్ షాపులు 70 ఉన్నాయి. 2019 డిసెంబరు నుంచి 2022 నవంబర్ వరకు మాత్రమే. 2022 డిసెంబర్ నుంచి రెన్యూవల్ చేయాల్సి ఉంది. అప్పటి వరకూ కట్టాల్సిన అద్దె బకాయిలు రూ.5.78 కోట్లు. వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీ, ఐజీఎస్టీలు వేసి రూ.7.08 కోట్లు ఉందంటూ నోటీసులు జారీ చేశారు. దీని ప్రకారం మొత్తం రూ.12.86 కోట్లు చెల్లిచాల్సి వస్తుంది. ఈ బకాయిలు రిటైల్, హోల్సేల్ వ్యాపారుల పాలిట శాపాలుగా మారాయి. చివరకు మోయలేనంతగా తయారై కట్టలేని స్థితికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే 2025 నవంబర్తో మూడేళ్లకు గడువు ముగుస్తుంది కూడా. ఇప్పటి వరకు కట్టాల్సిన రూ.12.86 కోట్లతో పాటు అదనంగా మళ్లీ 33.33 శాతం అద్దె పెంచాలి. పెరిగిన అద్దెతో పాటు వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీలు కలుపుకొని మరో రూ.15 కోట్ల వరకు కట్టాల్సిన పరిస్థితి. అంటే మొత్తం కలుపుకుంటే రూ.27.86 కోట్లు బకాయిలు చెల్లించాలని అధికార వర్గాలు చెబుతున్నాయి. కార్పొరేషన్ అధికారులు ఇస్తున్న నోటీసులు చూసిన చిరువ్యాపారులు కళ్లు తేలేస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారులే నయం అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2.50 శాతం మాత్రమే వడ్డీ... కానీ 50 శాతంపైగా వసూలు... వాస్తవానికి కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం అద్దె బకాయిలపై కేవలం 2.50 శాతం మాత్రమే వడ్డీ, అపరాధ రుసుం కట్టాలి. ఆ నిబంధనలు గాలికి వదిలేసిన నగర పాలక సంస్థ అధికారులు ఇష్టం వచ్చినట్లు వడ్డీ, అపరాధ రుసుం విధిస్తూ నోటీసులు పంపారు. ఇచ్చిన ఆ నోటీసులు కూడా మున్సిపల్ కార్యాలయంలో రికార్డు ఏమీ ఉండదు. కంప్యూటర్లో ఒక ప్రింట్ తీసుకొని ఇచ్చి మరీ డబ్బులు వసూలు చేసుకుపోయారు. గతంలో వాటికి లెక్కా..పక్కా లేదు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ, అపరాధ రుసుం కలుపుకొని కట్టాల్సింది 193 షాపులకు కలిపి రూ.5.78 కోట్లు అయితే (2022 నవంబర్ వరకు) దానికి అదనంగా వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీలు కలుపుకొని రూ.7.08 కోట్లు కట్టాలని నోటీసులు షాపులకు అతికించారు. వ్యాపారులకు చేతికి కూడా ఇవ్వటం లేదు. ఇదొక అడ్డగోలు వ్యవహారంలా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై కొందరు వ్యాపారులు కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. సొంత ఖర్చులకు డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొత్త కూరగాయల మార్కెట్ కార్పొరేషన్ అధికారులకు గుర్తుకు వస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. బకాయిల పేరుతో పలు మార్లు కార్పొరేషన్ అధికారులు డబ్బులు వసూలు /చేశారు. అలా ఇప్పటి వరకు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు కట్టించుకున్నట్టు తెలుస్తోంది. ఏ ఒక్కరికీ రసీదులు ఇచ్చిన పాపాన పోలేదు. వసూలు చేసిన అధికారులు ఒకరిద్దరు చనిపోగా, కొందరు బదిలీపై వెళ్లారు. కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. కానీ కూరగాయల మార్కెట్ వ్యాపారులు కట్టిన అద్దె డబ్బులకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. కొంత మంది అధికారులు సంవత్సరాల తరబడి కార్పొరేషన్లోనే పనిచేస్తూ వ్యాపారులపై పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతు 2019వ సంవత్సరం నుంచి నేటికీ అదే జరుగుతుందంటే వ్యాపారుల బాధలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందినకాడికి దోచుకుంటూ..? కూరగాయల మార్కెట్ను వేధిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు గుదిబండలా మారిన బకాయిలు అద్దె బకాయిలు మొత్తం రూ.5.78 కోట్లు వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీతో రూ.7.08 కోట్లు మొత్తం రూ.12.86 కోట్లు చెల్లించాలంటూ కార్పొరేషన్ అధికారుల ఒత్తిడి నిబంధనల ప్రకారం 2.50 శాతం వడ్డీ మాత్రమే అడ్డగోలుగా 50 శాతానికి పైగా వడ్డించి వసూలు కరోనా సమయంలో మార్కెట్ లేకపోయినా అద్దె కట్టాల్సిందే అంటూ వేధింపులు ముఖం చాటేస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు -
ఎండీఎం మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా మద్దిపాడు: పాఠశాలలో మెనూ ప్రకారం చిన్నారులకు భోజనం అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మంగళవారం ఆమె మండలంలోని గార్లపాడు ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ప్రతి రోజు రుచికరంగా ఉంటుందా, సన్న బియ్యం వండుతున్నారా, భోజనం ఎలా ఉందంటూ ప్రలు ప్రశ్నలు వేసి వారి వద్ద సమాధానాలు రాబట్టారు. అనంతరం కలెక్టర్ చిన్నారులతో సహపంక్తి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతివారం ఎంపీడీఓ, తహశీల్దార్లు మధ్యాహ్న భోజనం తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈమని శ్రీనివాసరావుతో మాట్లాడుతూ విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గార్లపాడు రేషన్ షాపును సందర్శించి సరఫరా చేసిన స్టాకు, మిగిలిన స్టాకును పరిశీలించారు. రేషన్ పంపిణీ కచ్చితంగా జరగాలని, ఎక్కడా అవకతవకలకు పాల్పడకుండా చూడాలని తహశీల్దార్ ఆదిలక్ష్మిని ఆదేశించారు. కార్యక్రమంలో వారి వెంట ఇన్చార్జి ఎంపీడీఓ డీఎస్వీ ప్రసాద్, ఎంఈఓలు ఎంవీఆర్ ఆంజనేయులు, ఎం.శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ దేవరపల్లి గంగిరెడ్డి, పలువురు ఆధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మత్తులో మందుబాబు
మార్కాపురం: మద్యం మత్తు ఎక్కువై రోడ్డుపై డివైడర్ల మధ్య ఓ వ్యక్తి పడిపోయిన ఘటన మార్కాపురంలో మంగళవారం జరిగింది. పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన ప్రముఖ రచయిత్రి మొల్ల విగ్రహం వద్ద మద్యం ఎక్కువై ఓ వ్యక్తి అడ్డంగా పడిపోయాడు. సుమారు గంటన్నర సేపు మద్యం మత్తులో ఉండి అలాగే పడుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మార్కాపురం పట్టణంలో మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. రచయిత్రి మొల్ల విగ్రహం వద్ద మందుబాబులు ఇలా తరచుగా పడుకోవడం విమర్శలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం షాపులు ఏర్పాటు చేయడం, బెల్టుషాపులతో తమ సంసారాలు నాశనమైపోతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మద్యం, గంజాయి
పొందూరులో విచ్చలవిడిగా మద్యం సమస్యపై మంత్రి స్వామికి ఫిర్యాదు చేస్తున్న పొందూరు మహిళలుటంగుటూరు: ‘సార్.. మా ఊరిలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కొందరు వీధుల్లోనే మద్యం తాగి అసభ్యకరంగా ప్రవరిస్తున్నారు. గడప దాటి బయటకు రావాలంటే భయమేస్తోంద’ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డీబీవీ స్వామి ఎదుట పొందూరు గ్రామ మహిళలు వాపోయారు. మంగళవారం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొందూరు వెళ్లిన మంత్రికి మహిళలతోపాటు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వివరాలు.. పొందూరులో నలుగురు వ్యక్తులు అక్రమ మద్యం, గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్నారు. వీరి నుంచి గ్రామ టీడీపీ నాయకుడైన ఎంపీటీసీ సోదరుడు నెలకు రూ.30 వేలు తీసుకుని పోలీసులు దాడి చేయకుండా కాపాడుకుంటూ వస్తున్నాడని టీడీపీ నాయకుడు తగరం కోటేశ్వరరావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లైసెన్స్డ్ దుకాణాల నుంచి మద్యం తీసుకొచ్చి బెల్ట్ షాప్లో విక్రయిస్తూ ఒక్కో క్వార్టర్పై రూ.50 అధికంగా వసూలు చేస్తున్నారని, గంజాయి ప్యాకెట్లు బహిరంగంగానే అమ్ముతున్నారని వివరించారు. తాగుబోతులు రచ్చ రచ్చ చేస్తుండటంతో బయటకు రావాలంటేనే భయంగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పొందూరు మద్యం, గంజాయి విక్రయాల గురించి ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, వారికి నెల నెలా క్రమం తప్పకుండా ముడుపులు అందుతుండటం వల్లే గ్రామంవైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు. ఆగమేఘాలపై ముగ్గురు అరెస్టు నలుగురు వ్యక్తులు మద్యం విక్రయిస్తున్నారని మంత్రికి మహిళలు ఫిర్యాదు చేయగా టంగుటూరు పోలీసులు రంగంలోకి దిగారు. సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్సై నాగమళ్లీశ్వరరావు తమ సిబ్బందితో కలిసి గ్రామానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను బైండోవర్ చేశామని, పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు. మంత్రి స్వామికి గ్రామస్తులు, మహిళల ఫిర్యాదు ఎకై ్సజ్ శాఖ అధికారుల తీరుపై ఆరోపణలు -
విధి ‘ఆట’కు బాలుడు బలి
కురిచేడు: చెట్టుకొమ్మ విరిగిపడి ప్రమాదవశాత్తు ఒక బాలుడు మృతి చెంది, మరో విద్యార్థికి గాయాలైన సంఘటన మంగళవారం కురిచేడు మండలంలోని పడమర నాయుడుపాలె గ్రామ పంచాయతీ పరిధిలోని వీవై కాలనీలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు కాలనీకి చెందిన బాలురు బొజ్జారిత్విక్, బొజ్జా మల్లికార్జున, బొజ్జా మహీందర్, మేకల లక్ష్మి నారాయణ మంగళవారం మధ్యాహ్నం ఆడుకునేందుకు వేపచెట్టు ఎక్కారు. చెట్టుకొమ్మ విరిగి కింద అసంపూర్తిగా నిర్మించిన ఇంటి గోడ పోర్టికోపై పడి అదికూడా కలిసి కిందపడ్డాయి. ఆ చెట్టుకొమ్మపై ఉన్న నలుగురు కిందపడిపోయారు. వారిలో బొజ్జా మహీందర్(13) పోర్టికో కాంక్రీట్ బీమ్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురిలో బొజ్జా రిత్విక్కు తలకు, కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయి. రిత్విక్ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. మిగతా వారు ఐదో తరగతి తరువాత విద్యాభ్యాసం మానేశారు. మిగిలిన ఇద్దరు పిల్లలకు గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రుడిని ద్విచక్ర వాహనంపై కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో వినుకొండ తరలించారు. మహిళా పోలీస్ కె.రజిత ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై ఎం.శివ తన సిబ్బందితో కలిసి బాలుడి మృతదేహాన్ని, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి తల్లిదండ్రులు, ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. ఆడుకునేందుకు చెట్టు ఎక్కిన నలుగురు బాలురు కొమ్మ విరగడంతో ఒకరు మృతి, మరో విద్యార్థికి గాయాలు -
పోయిన నగలు పట్టించిన ఫోన్ పే!
యర్రగొండపాలెం: ఓ వ్యక్తి పోగొట్టుకున్న నగలను ఫోన్ పే సాయంతో పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నగలనుఎస్సై పి.చౌడయ్య మంగళవారం బాధితుడికి అందజేశారు. వివరాలు.. మండలంలోని అయ్యంబొట్లపల్లికి చెందిన పెద్దపోగు కోటయ్య మే 31వ తేదీన బ్యాంకులో రుణం తీసుకునేందుకు తన బంగారు ఆభరణాలు తీసుకుని యర్రగొండపాలెం వచ్చాడు. స్థానిక ఆర్అండ్బీ బంగ్లా వద్ద షోడా తాగి బ్యాంకు వద్దకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక నగలు కనిపించలేదు. వెంటనే కోటయ్య షోడా బండి వద్దకు వెళ్లి విచారించగా.. మరి కొంత మంది వచ్చి షోడా తాగి వెళ్లారని, వారు ఫోన్పే చేశారని చెప్పాడు. షోడా బండి వ్యాపారి ఇచ్చిన సమాచారం ఆధారంగా కోటయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ రోజు షోడా తాగి ఫోన్ పే చేసిన ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నగలను గుర్తించి అప్పగించిన ఎస్సైకి బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. -
8 కేజీల గంజాయి పట్టివేత
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో 8 కేజీల గంజాయిని సీజ్ చేసి, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు. వివరాలు.. ఒంగోలులో ఎకై ్సజ్ పోలీసులతోపాటు ఈఎస్టీఎఫ్ సిబ్బంది మంగళవారం విస్తృతంగా తినిఖీలు నిర్వహించారు. ఏబీఎం కాలేజీ గ్రౌండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేయగా 8 కేజీల గంజాయి లభ్యమైంది. నిందితుడిని చిత్తూరు జిల్లా నగరి గ్రామానికి చెందిన ఎస్.మణిగా గుర్తించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సీఐ ఎ.లీనా, సబ్ ఇన్స్పెక్టర్ సీహెచ్ గీత, ఈఎస్టీఎఫ్ ఎస్సై రవి ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. బెల్టుషాపులను కట్టడి చేయాలి ● తహసీల్దార్కు టీడీపీ నాయకుడి ఫిర్యాదు కంభం: మార్కాపురం డివిజన్లోని అన్ని గ్రామాల్లో యథేచ్ఛగా నిర్వహిస్తున్న మద్యం బెల్టు షాపులను కట్టడి చేయాలని కందులాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నరాల చెన్నారెడ్డి మంగళవారం తహసీల్దార్ వి.కిరణ్కు ఫిర్యాదు చేశారు. ఎకై ్సజ్ అధికారులు అవినీతికి పాల్పడుతూ బెల్టు షాపుల గురించి పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కంభం ఎకై ్సజ్ పరిధిలోని కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల్లో ఊరూరా బెల్టుషాపులు నిర్వహిస్తూ అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని వివరించారు. ఎకై ్సజ్ ఉన్నతాధికారులు స్పందించి బెల్టు షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించాలి ఒంగోలు వన్టౌన్: జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా విభిన్న ప్రతిభావంతల ఏడీ సీహెచ్ సువార్తకు మంగళవారం విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో దివ్యాంగ సంఘాల నాయకులు ఎస్కే కాలేషా, ఎం. సులోచనారాణి, ఎస్డీ అమీర్ హంజా, పసుమర్తి రాజేష్, ముల్లా మదర్వలి పాల్గొన్నారు. -
ధర సన్నగిల్లి!
నిమ్మకు నల్లి..ఐదెకరాల తోటను వదిలేశా నేను ఐదు ఎకరాల్లో నిమ్మ తోట సాగు చేశా. ధర పడిపోవడంతో కాయలు కోయలేదు. కేజీ రెండు రూపాయలకు కూడా వ్యాపారులు తీసుకోవడం లేదు. కోత కూలి ఖర్చు కూడా రాదనే ఉద్దేశంతో చెట్ల మీదే కాయలు వదిలేశా. ఈ ఏడాది నిమ్మ రైతులు భారీగా నష్టపోయారు. నిమ్మ రైతుల గురించి పట్టించుకునే నాథుడు లేడు. – మీనుగు కాశయ్యఅవులవారిపల్లి కాయలు ఏరి రోడ్డున పోయిస్తున్నా ఈ ఏడాది ఆది నుంచే నిమ్మకు ధర లేదు. తొలి కోత సమయంలో కేజీ రూ.50 పలికింది. కొన్నాళ్లకే పండు కాయలు కేజీ రూ.2, పచ్చి కాయలు కేజీ రూ.6కు మించి వ్యాపారులు కొనడం లేదు. కమీషన్ వ్యాపారులు తేవద్దని చెబుతుండటంతో తోటలో వదిలేసిన కాయలు రాలిపోతున్నాయి. అవి కుళ్లడంతో నల్లి తెగులు సోకి తోట మొత్తం దెబ్బతింటోంది. రాలిన కాయలు ఏరి రోడ్ల పక్కన పడేస్తున్నాం. నాణ్యమైన కాయలను కూడా వ్యాపారులు చెప్పిన ధరకు ఇవ్వక తప్పడం లేదు. – గాయం రమణారెడ్డి, హాజీపురం హనుమంతునిపాడు: లాభాలు ఆశించి సాగు చేసిన నిమ్మ తోటలు రైతన్నలకు నష్టాలను రుచి చూపుతున్నాయి. నిమ్మ ధరలు భారీగా పతనం కావడం, మరోవైపు తెగుళ్లు చుట్టుముట్టడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గతేడాది కాస్తోకూస్తో లాభాలు గడించిన రైతులు ప్రస్తుత పరిస్థితులు తలుచుకుని కుమిలిపోతున్నారు. అధిక మొత్తంలో కౌలు చెల్లించి సాగు చేపట్టిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మద్దతు ధర లేక, కూలి ఖర్చులు భరించి కాయలను మార్కెట్కు తరలించలేక చెట్ల మీదనే వదిలేస్తున్న దుస్థితి. వ్యయప్రయాసలకోర్చి కాయలను మార్కెట్కు తరలించిన రైతులు.. గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రోడ్ల పక్కన పడేస్తున్న దృశ్యాలు కనిగిరి, హనుమంతునిపాడు మండలాల్లో తరచూ కనిపిస్తున్నాయి. జిల్లాలో అధికారిక గణాంకాల ప్రకారం 2,874 హెక్టార్లకు పైగా నిమ్మ తోటలు సాగులో ఉన్నాయి. ఒక్క హనుమంతునిపాడు మండలంలోనే ముదురు, లేత తోటలు సుమారు 2 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. హనుమంతునిపాడు ప్రాంతంలో పండించిన నిమ్మకాయలు హైదరాబాద్, ముంబై, కలకత్తా, చైన్నె తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. కర్ణాటక, మహారాష్ట్రలో నిమ్మ దిగుబడి అధికంగా రావడంతో ఇక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. అదే సమయంలో వ్యాపారులు, దళారులు కుమ్మక్కవడంతో కేజీ నిమ్మకాయల ధర రూ.2 నుంచి రూ.3 కూడా పలకడం లేదు. కనీసం పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని నిమ్మ రైతులు కోరుతున్నారు. కిలో ధర రూ.2 ప్రస్తుతం పండు నిమ్మ కాయలు కేజీ రూ.2 నుంచి రూ.3కు మించి పలకడం లేదు. కాయలు మార్కెట్కు తేవద్దని చెబుతున్న కమీషన్ వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ససేమిరా అంటున్నారు. పచ్చి కాయలు కేజీ రూ.6 నుంచి రూ.7కు మించి కొనుగోలు చేయడం లేదు. దీంతో కోత కూలి, ఆటోల బాడుగ కూడా రావడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల పంటలకు నష్ట పరిహారం చెల్లిస్తున్న ప్రభుత్వం పండ్ల తోటల రైతులనూ పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆశలు నల్లిపేస్తోంది! నిమ్మ ధరలు పతనం కావడంతో చెట్లమీద వదిలేసిన కాయలు పండి రాలిపోతున్నాయి. చెట్లపై, పాదుల్లోనే కుళ్లిపోతుండటంతో నల్లి తెగులు ప్రబలి తోటలు దారుణంగా దెబ్బతింటున్నాయి. వేరు కుళ్లు, పేనుబంక, మంగు, ఎండు తెగులు, వైరస్ సోకిన తోటలను కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడుతున్నారు. తెగుళ్ల కారణంగా కాయల నాణ్యత దెబ్బతినడంతో ధర పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేడింగ్ అనంతరం భారీ పరిమాణంలో నాణ్యత లేని కాయలను రోడ్డు పక్కన పడుస్తున్నారు. ఇదిలా ఉండగా తెగుళ్ల నివారణ చర్యల గురించి రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. ఉద్యానశాఖ అధికారులు నిమ్మ తోటలవైపు కన్నెత్తి చూడటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పాతాళంలోకి పడిపోయిన నిమ్మ ధరలు కేజీ కాయలు రూ.2 నుంచి రూ.3 కాయలు వద్దని రైతులకు చెబుతున్న వ్యాపారులు నిమ్మ తోటలను దారుణంగా దెబ్బతీస్తున్న నల్లి తెగులు ఆకు, కాయ రాలిపోతుండటంతో రైతుల్లో ఆందోళన పత్తా లేని ఉద్యానశాఖ అధికారులు -
ముగ్గురు నిందితులు అరెస్ట్
బాలికపై లైంగిక దాడి కేసు..● వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ గిద్దలూరు రూరల్: సభ్య సమాజం తలదించుకునేలా 12 ఏళ్ల బాలికతో మద్యం తాగించి, ఆపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. మంగళవారం గిద్దలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ప్రధాన నిందితుడు చంద్రశేఖర్నాయుడు స్వగ్రామం కడప జిల్లా కలశపాడు మండలం చెన్నుపల్లె కాగా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద భోజనం హోటల్ నిర్వహిస్తున్నాడు. కలశపాడు మండలం మహానందిపల్లెకు చెందిన కేతుకుమారి భర్తతో మనస్పర్థలు వచ్చి దూరంగా ఉంటూ గిద్దలూరులోని ఓ హోటల్లో పనిచేసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేతుకుమారికి చంద్రశేఖర్నాయుడితో పరిచయం ఏర్పడి అప్పడప్పుడూ అతడి హోటల్ వద్దకు వెళ్తుండేది. జూన్ 26వ తేదీన తనకు ఒక బాలిక కావాలని చంద్రశేఖర్నాయుడు కోరగా కుమారి గిద్దలూరులో నివాసం ఉంటున్న దూరపు బంధువు అయిన మహిళ వద్దకు బైక్పై వెళ్లారు. ఆమె కుమార్తెను తనతో బజారుకు పంపాలని చెప్పి, బైక్పై తాటిచర్ల మోటు వద్ద గల హోటల్కు తీసుకెళ్లారు. హోటల్లో పనిచేసే బాలుడు బీరు తీసుకొచ్చి కూల్డ్రింక్లో కలిపి బాలికతో తాగించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికపై చంద్రశేఖర్నాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన కుమార్తె ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో వెదుకులాడింది. మరుసటి రోజు తెల్లవారుజామున తాటిచెర్ల మోటు వద్దకు వెళ్లిన ఆమె తన కుమార్తె పరిస్థితిని చూసి చంద్రశేఖర్నాయుడు చొక్కా పట్టుకుని ఘర్షణ పడింది. తనకు రాజకీయపలుకుబడి ఉందని, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని ప్రధాన నిందితుడు బెదిరించాడు. దీంతో బాలిక తల్లి జూన్ 27వ తేదిన కొమరోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన చంద్రశేఖర్నాయుడు, అతడికి సహకరించిన కుమారి, బాలుడుపై పోక్సో కేసు నమోదు చేశారు. కొమరోలులోని డ్రీమ్స్ రెస్టారెంట్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, కొమరోలు ఎస్సై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఒక్క సమస్య.. ఏడు అర్జీలు..!
● మీ కోసం కార్యక్రమాలలో కలెక్టర్కు ఏడు సార్లు అర్జీలిచ్చినా పరిష్కారం కాని సమస్య ఒంగోలు సబర్బన్: ఒకే ఒక్క సమస్యపై జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలలో ఇప్పటి వరకూ ఏడు సార్లు అర్జీలిచ్చినా పట్టించుకోలేదని పొదిలికి చెందిన బాధితుడు వాపోయాడు. సోమవారం ఒంగోలులోని కలెక్టరేట్లో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆధ్వర్యంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఏడోసారి అర్జీ అందజేశాడు. ఆ వివరాల్లోకెళ్తే.. పొదిలి మున్సిపాలిటీ పరిధిలోని దర్శి రహదారిలో రోడ్డు మార్జిన్లో ఉన్న ప్రభుత్వ స్థలంలో తన పొలానికి అడ్డంగా యోగయ్య అనే వ్యక్తి తాత్కాలికంగా షెడ్డు నిర్మించాడని పొదిలికి చెందిన దాసరి రవిచంద్ర అనే బాధితుడు ఏడాదికిపైగా క్షేత్రస్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. తన పొలంలోని వర్షం నీరు బయటకు పోవడానికి వీల్లేకుండా అక్రమంగా నిర్మాణం చేపట్టాడని స్థానిక అధికారులకు అనేక సార్లు అర్జీలు అందించారు. వారెవరూ పట్టించుకోకపోవడంతో ఒంగోలులో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించే మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలలో ఇప్పటికే ఆరు సార్లు దాసరి రవిచంద్ర అర్జీలు అందజేశాడు. షెడ్డు అడ్డంగా ఉండటంతో పొలంలోని నీరు బయటకు పోయే వీల్లేక పొలం కోతకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై 2024 ఫిబ్రవరి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపాడు. సోమవారం మరోసారి ఒంగోలులో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి వచ్చాడు. అడ్డగోలుగా యోగయ్య నిర్మించిన షెడ్డును తొలగించాలని ఏడోసారి కలెక్టర్కు అర్జీ అందజేశాడు. ప్రభుత్వ స్థలంలో తడికలు, రేకులతో యోగయ్య నిర్మించిన పెడ్డులో పగటి పూట కుటుంబంతో నివాసం ఉంటూ రాత్రి అయ్యేసరికి తోళ్లమడుగులోని తన సొంతింటికి వెళుతున్నాడని అర్జీలో తెలిపాడు. గతంలో మండల సర్వేయర్ కూడా పరిశీలించి ప్రభుత్వానికి చెందిన రోడ్డు స్థలంలోనే యోగయ్య షెడ్డు నిర్మించాడని తహసీల్దార్కు నివేదిక కూడా ఇచ్చారని, కానీ, ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపాడు. జేసీని కలిసినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పొదిలి తహసీల్దార్, నగర పంచాయతీ కమిషనర్, పోలీసులు వచ్చి చూసి వెళ్తున్నారుగానీ, తాత్కాలిక షెడ్డును తొలగించే ప్రయత్నం మాత్రం చేయడం లేదని వాపోయాడు. తన సమస్య పరిష్కారం కాకుండా ఉండటానికి అదికారులే ప్రధాన కారణమంటూ ఆరోపించాడు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అదే పనిగా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాకుండా ఉంటే ఇంకెవరికి మొరపెట్టుకోవాలో చెప్పాలంటూ రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అర్జీదారులు సంతృప్తి చెందాలి : కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు బాధితులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీ కోసం సమావేశపు హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలపై సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, ఎస్డీసీలు కుమార్, శ్రీధర్, జాన్సన్, పార్థసారధి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
నాణ్యత..!
ఎగిరిపోయినప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు యుద్ధ విమానాలు, సహాయక విమానాలు ఆగేందుకు వీలుగా కలికవాయ–కనుమళ్ల మధ్య జాతీయ రహదారిపై నిర్మించిన రన్వే నాణ్యతా లోపాలతో ప్రారంభం కాకుండానే ధ్వంసమైంది. మలుపులతో ఉన్న రన్వే ప్రారంభానికి ఎయిర్ఫోర్స్ అభ్యంతరం పెట్టింది. లోపాలు సరిచేసి దాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు మళ్లీ రూ.43 కోట్లు మంజూరు చేసి అదనంగా స్థల సేకరణకు చర్యలు చేపట్టారు. రన్వేకు అదనంగా రూ.43 కోట్లు మంజూరు రన్వేను వినియోగంలోకి తేవటానికి గత సంవత్సరం రూ.38 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ఈ సంవత్సరం పెరిగిన ధరలతో రూ.43 కోట్ల అంచనా వ్యయంతో మళ్లీ ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం నిధులు మంజూరయ్యాయని త్వరలో రన్వే నిర్మాణానికి సంబంధించి అదనపు స్థల సేకరణతో పాటు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. రన్వే పూర్తి చేయటానికి రోడ్డుకు ఇరువైపులా 6 మీటర్ల చొప్పున స్థల సేకరణ చేయాల్సి ఉందని వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ కే శ్రీధర్రెడ్డి తెలిపారు.రన్వేల నిర్మాణం ఇలా.. జాతీయ రహదారిపై రోడ్డు మధ్య నుంచి రెండు వైపులా 33 మీటర్ల చొప్పున అంటే మొత్తం 66 మీటర్ల వెడల్పున సిమెంటు రోడ్డు నిర్మించారు. రోడ్డుకు ఇరువైపులా మూడు మీటర్ల చొప్పున స్థలాన్ని వదిలిపెట్టి ఆ స్థలాన్ని డ్రైనేజితో పాటు ఇతర అవసరాలకు ఉపయోగిస్తారు. సిమెంటు రోడ్డు నిర్మించే 3.60 కిలోమీటర్ల వరకు రోడ్డు మధ్యలో శాశ్వత డివైడర్ను నిర్మించకుండా తాత్కాలిక డివైడర్ను ఏర్పాటు చేశారు. ఈ రన్వే పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 2022లో వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జే పంగులూరు మండలం కొరిశపాడు–రేణంగివరం వద్ద రన్వే నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభమైంది. సింగరాయకొండ: ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా జాతీయ రహదారిపై అత్యవసర పరిస్థితుల్లో విమానాలు ఆగేందుకు వీలుగా ఎయిర్పాడ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రన్వేల నిర్మాణం చేపట్టింది. ఈ పథకం కింద దేశంలో 13 రన్వేలు నిర్మిస్తుండగా రాష్ట్రానికి కేటాయించిన రెండు రన్వేలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిర్మించారు. ఒక్కొక్కటి రూ.85 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ రన్వేల వలన ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు, దేశ, రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులు జిల్లా పర్యటన సమయంలో విమానాలు, హెలికాప్టర్లు ల్యాండ్ అవడానికి అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రానికి రెండు రన్వేలు కేటాయించగా ఒకటి కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండల పరిధిలో జాతీయ రహదారిపై కలికవాయ నుంచి కనుమళ్ల మధ్య సుమారు 3.60 కిలోమీటర్ల దూరం, మరొకటి అద్దంకి నియోజకవర్గం జే పంగులూరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై సుమారు 4 కిలోమీటర్ల దూరం కొరిశపాడు నుంచి రేణంగివరం మధ్య నిర్మించారు. ఈ రెండింటినీ ప్రముఖ నిర్మాణ సంస్థ కేఎంసీ చేపట్టింది. పటిష్టంగా రన్వే నిర్మాణం: రన్వే నిర్మాణానికి నిధులు మంజూరు కావటంతో త్వరలో పనులు ప్రారంభిస్తామని, వేగవంతం చేస్తామని హైవే అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోడ్డులో దెబ్బతిన్న ప్రాంతాన్ని తొలగించి మళ్లీ నిర్మిస్తారు. అలాగే ప్రధాన రహదారికి ఇరువైపులా ఐరన్తో ఫెన్సింగ్ వేస్తారు. రోడ్డుకు ఇరువైపులా మూడు మీటర్ల వెడల్పుతో సర్వీసు రోడ్డు నిర్మిస్తారు. మండల కేంద్రం నుంచి వాహనాలు రన్వేపైకి రావాలంటే కందుకూరు ఫ్లైఓవర్, కలికవాయ ఫ్లైఓవర్ వద్ద మాత్రమే మారేందుకు అవకాశం ఉంటుంది. కలికవాయ, కందుకూరు ఫ్లైఓవర్ల మధ్య ఎక్కడా వాహనాలకు దారి ఇచ్చే అవకాశం ఉండదు. సర్వీసు రోడ్డు నిర్మాణం తరువాత ఇరువైపులా డ్రైనేజీ నిర్మిస్తారు. ఈ క్రమంలో రోడ్డు మలుపులను సరిచేస్తారు. అంతేకాక రన్వే మధ్యలో వాహనాలకు ఇబ్బంది లేకుండా రోడ్డు మధ్యలో పూర్తి స్థాయిలో సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. నిధుల మంజూరుతో రన్వే వినియోగంలోకి వచ్చేటట్లు సిద్ధం చేస్తామని త్వరలో స్థల సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని హైవే అధికారులు వివరించారు. రూ.85 కోట్లతో జాతీయ రహదారిపై అత్యవసర విమానాల ల్యాండింగ్కు రన్వే నిర్మాణం నాసిరకంగా రన్వే పనులు నాణ్యతా లోపాలతో ప్రారంభం కాకుండానే ధ్వంసం రన్వేలో మలుపులతో ఎయిర్ఫోర్స్ అభ్యంతరం లోపాలు సరిచేసేందుకు మళ్లీ రూ.43 కోట్లు మంజూరు అదనంగా స్థల సేకరణకు చర్యలు -
తల్లికి వందనం ఈ–కేవైసీ పూర్తి చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియాఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో భాగంగా పెండింగ్ ఈ–కేవైసీ మంగళవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం ప్రకాశం భవనం నుంచి ఎంపీడీవోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సత్వరమే పెండింగ్ ఈ–కేవైసీ పూర్తి చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది బదిలీ అయ్యే జూలై 5వ తేదీ లోపు సిటిజన్ ఈ–కేవైసీ కూడా పూర్తి చేయాలని చెప్పారు. గ్రామాల్లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జూలై 8న 10 వేల ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ... ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యవసాయ అనుబంధ పనులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి చేపట్టాలని కలెక్టర్ చెప్పారు. ఫారం పాండ్స్, ఫిషింగ్ పాండ్స్, కంపోస్టు పిట్స్ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డ్వామా ఆధ్వర్యంలో 8వ తేదీ జిల్లాలో 750 ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉందన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో చిరంజీవి, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, పాల్గొన్నారు. కార్మికుల రోజువారీ వేతనాల సవరణ ఒంగోలు వన్టౌన్: కార్మికుల రోజువారీ వేతనాలను కలెక్టర్ సవరణ చేసినట్లు ఒంగోలు ఉపకార్మిక కమిషనర్ ఎ.గాయత్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్యం లేని కార్మికులకు రూ.694, కొంత వరకూ నైపుణ్యం ఉన్న కార్మికులకు రూ.791, నైపుణ్యం ఉన్న కార్మికులకు రూ.899, పూర్తి స్థాయిలో నైపుణ్యం ఉన్న కార్మికులకు రూ.1042గా వేతనాలు సవరించినట్లు వెల్లడించారు. సవరించిన వేతనాలు ఏప్రిల్ 1, 2025 నుంచి వర్తిస్తాయన్నారు. -
బాబు మోసకారి..
ఒంగోలు సిటీ: ఎన్నికల ముందు ఎన్నో ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని చంద్రబాబు మోసం చేసి వెన్నుపోటు పొడిచాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డితో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్ని వంచించిన ఘనత చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు. ఏడాది కాలంగా సాగిన వంచన పాలనపై ‘‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’’ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు. సూపర్ సిక్స్ కార్యక్రమాలు అమలు చేయకుండానే అన్నీ ఇచ్చేశామని చెప్పడం దుర్మార్గమన్నారు. సంవత్సరానికి మూడు సిలిండర్లు, పింఛన్లు 40 శాతం మందికి కూడా అందలేదన్నారు. నీకు రూ.15 వేలు..రూ.15 వేలు, రూ.18 వేలు, రూ.18 వేలు అంటూ మహిళల్ని దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని, అంతవరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు సిల్క్ డెవలప్మెంట్లో పెట్టేశామని చెబుతున్నారని విమర్శించారు. బాబు మోసాలను ప్రజలకు తెలియజేసేందుకు ‘‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’’ పేరుతో వైఎస్సార్ సీపీ ప్రజల వద్దకు వెళుతోందన్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో చేపట్టే కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో చంద్రబాబు మోసాలను ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. కష్టాల్లో ఉన్న పొగాకు రైతుకు అండగా నిలిచేందుకు జగన్ పొదిలికి వచ్చారన్నారు. ఇందుకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నామన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది అక్రమంగా జొరబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లపై రాళ్లతో దాడి చేశారన్నారు. అమరావతి పేరుతో ఆందోళన చేసిన వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్పీని కలసి వినతి పత్రాన్ని ఇస్తామని, అవసరమైతే హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తామని హెచ్చరించారు. పార్టీ కేడర్పై అన్యాయంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పార్టీ లాయర్లతో అన్ని సిద్ధం చేశామన్నారు. లిక్కర్ కేసును సృష్టించి ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై అన్యాయంగా కేసుపెట్టారన్నారు. ఆయన్ను అరెస్టు చేయడం హేయమన్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా రూ.లక్షన్నర కోట్లు అప్పు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. 2027లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. మాటతప్పిన కూటమి నేతలను నిలదీయండి : బూచేపల్లి ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్తో పాటు ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆరోపించారు. సూపర్ సిక్స్ ఇచ్చేశామని, అదేమని అడిగితే నాలుక మందం అంటూ బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ‘‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారంటీ’’ అంటూ ఎన్నికల్లో పోటీ చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలన చూసి ‘‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’’ అంటూ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. హామీలు తుంగలోకి తొక్కి, ఏ హామీలు నెరవేర్చారని గడపగడపకూ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నారని టీడీపీ ప్రజాప్రతినిధులను నిలదీశారు. తల్లికి వందనం పథకం చాలా మంది లబ్ధిదారులకు అందలేదన్నారు. చంద్రబాబు మోసాలను గుర్తుంచుకుని మీ గడప ముందుకు వచ్చిన వారిని నిలదీయండని ఆయన కోరారు. పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై లేని లిక్కర్ కేసు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, మాజీ మంత్రి కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, మాజీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్ని వంచించిన ఘనత చంద్రబాబుది హామీలు అమలు చేయాలని అడుగుతున్న వారిపై తప్పుడు కేసులు ‘‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’’ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి మాట తప్పిన పాలకులను నిలదీయండి: బూచేపల్లి -
చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఒంగోలు సిటీ: ఎన్నికల ముందు చంద్రబాబు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి, జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు జిల్లా కార్యాలయంలో సోమవారం జిల్లా విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు అధికారం కోసం అలవికాని హామీలిచ్చి ‘‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారంటీ’’ అని ప్రజలను నమ్మించాడన్నారు. అధికారంలోకి వచ్చాక మ్యానిఫెస్టోను గాలికొదిలేశాడన్నారు. కుల, మత, వర్గ, విభేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు పదవులన్నీ అనుభవించి, అధికారం దూరమైన వెంటనే వారు అవకాశవాద రాజకీయాలు చేసి పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారన్నారు. మళ్లీ ఇప్పుడు పార్టీలోకి వస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, అలాంటివాళ్లు పార్టీకి అవసరం లేదని, పార్టీ తీసుకోదని, వారిని పార్టీలో ఎవరూ సమర్ధించరన్నారు. ● జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ఎలాంటి సంఘటనలు జరగకపోయినా అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏమీ జరగకపోయినా ఇంత మందిపై కేసులు బనాయించడం అన్యాయమని, అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. ● యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోను తూచ తప్పకుండా అమలు చేశారన్నారు. ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి చంద్రబాబు అలవికాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. నీ కార్యకర్తలను ఇంటింటికీ పంపి ఒక సంవత్సరంలో ఇంత అమౌంట్ వస్తుందని చెప్పావు. చంద్రబాబు మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు ప్రజలకు ఇవ్వలేదు కనుక నీమీద ఎందుకు కేసు పెట్టకూడదు అని ప్రశ్నించారు. ● ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ అడ్డగోలుగా హామీలిచ్చి మీరు ఎలా ప్రశ్నిస్తారో ప్రశ్నించండి చూద్దాం అని చంద్రబాబు అంటాడన్నారు. ఇది ప్రజాస్వామ్యం అనీ, ఇక్కడ ఎవరైనా ప్రశ్నించవచ్చన్నారు. చంద్రబాబు మీ నియంతృత్వ పోకడలు చెల్లవని, ప్రజల పక్షాన ప్రశ్నిస్తామన్నారు. గడప గడపకు వెళ్లి చంద్రబాబును ప్రశ్నించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ● మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోని తీసుకొని వెళ్లి గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తాము, చంద్రబాబు మీ మ్యానిఫెస్టోని తీసుకొని వెళ్లి ప్రజలకు వివరించగలరా అని ప్రశ్నించారు. ● మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని విమర్శించారు. ఎవరైతే హామీలను అమలు చేయాలని అడుగుతారో వారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. రైతులకు అండగా ఉండేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి పర్యటనకు ప్రజలు బాగా వచ్చారని, దాంతో మా పై రాళ్లు వేసి, మామీద కేసులు పెట్టారన్నారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన అణగదొక్కలేవనీ, ప్రజల గొంతు నొక్కలేవన్నారు. ● మాజీ ఎమ్మెల్యే మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ● ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న పిచ్చిచేష్టల వల్ల టీడీపీ నాయకుల్లోనే వ్యతిరేకత మొదలైందన్నారు. వారి నాయకుల్లోనే ఈ సారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వస్తే తమ పరిస్థితి ఏంటని అంతర్మథనం చెందుతున్నారన్నారు. ● కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టి.జే.ఆర్ సుధాకరబాబు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు మాదిగ, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశంమాట్లాడుతున్న కారుమూరి నాగేశ్వరరావు, పక్కన పార్టీ నాయకులు -
9న సమ్మెను జయప్రదం చేయండి
● అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ ఒంగోలు సిటీ: ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలో ఉన్న అంగన్వాడీలు పాల్గొని జయప్రదం చేయాలని అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ సోమవారం కోరారు. ఆమేరకు ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలోని యూడీసీకి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ కార్మికులకు నష్టం చేసే కార్మిక చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఐసీడీఎస్ను బలోపేతం చేయాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కేవీ సుబ్బమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు కస్తూరి, పద్మావతి పాల్గొన్నారు. -
కష్టాలు!
ట్రాన్స్ఫార్మర్పశ్చిమ ప్రాంతంలో పొలంలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ (ఫైల్)సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వాతావరణ పరిస్థితుల వల్ల కానీ, ఓల్టేజి హెచ్చుతగ్గుల వల్ల కానీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందా... ఇక వినియోగదారులకు అవస్థలు ప్రారంభమైనట్లే. చిన్న ఈదురుగాలులు కొడితేనే కాలిపోవడం సర్వసాధారణమైంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు అర్బన్ ప్రాంతాల్లో అయితే 12 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల్లోగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు అమర్చాలి. అప్పుడే రైతులు వంటలు దెబ్బతినకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ రవాణా ఖర్చు కూడా విద్యుత్ శాఖ భరించాల్సి ఉంది. అయితే నిర్ణీత సమయం ప్రకారం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్న దాఖలాల్లేవు. పైగా రవాణా ఖర్చులను కూడా రైతులపైనే వేస్తున్నారు. డిపార్టుమెంట్ వాహనంలోనే తరలిస్తూ వేలాది రూపాయలను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే కొత్తది మార్చేందుకు ఐదారు రోజులు పడుతోంది. పట్టణాల్లో అయితే మూడు రోజులకు తక్కువ పట్టడం లేదు. వ్యవసాయ విద్యుత్ అస్తవ్యస్తం... వ్యవసాయ విద్యుత్ అస్తవ్యస్తంగా ఉంది. త్రీఫేజ్ విద్యుత్ ఇచ్చినట్లే ఇచ్చి తరచూ నిలిపేస్తున్నారు. ఇలా నిలిపేస్తుండటంతో 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండటం లేదు. తొమ్మిది గంటలు ఇస్తున్నామని చెబుతున్నా రెండు, మూడుసార్లు నిలిపేస్తుండటంతో రైతులు అవస్థ పడుతున్నారు. గృహాలకు ఇచ్చే విద్యుత్కు కూడా ప్రతిరోజూ గంటల తరబడి అనధికార కోతలు విధిస్తున్నారు. గాలులు వీచినా, వర్షాలు కురుస్తాయనుకున్న సమయంలో విద్యుత్ కోతలు మరింత అధికం. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఆఫీసులకు ఫోన్ చేసి విసిగిపోవాల్సిందే. ఒక వైపు అడపాదడపా వానజల్లులు కురుస్తున్నా.. వాతావరణం మాత్రం అగ్ని గుండాన్ని తలపిస్తోంది. ఈ సమయంలో అనధికార విద్యుత్ కోతలు పగలూ రాత్రీ తేడా లేకుండా ఉండటంతో జనం ఇళ్లలో ఉండలేకపోతున్న పరిస్థితి. ఇదే సందర్భంలో విద్యుత్ బిల్లులు మాత్రం గతంతో పోల్చుకుంటే రెండింతలు, మూడింతలు పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. సమయపాలన లేకుండా నిర్వహణ, ఇతర కారణాలు చెబుతూ కోత విధిస్తున్నారు. కొన్నిచోట్ల రోజులో నాలుగైదు గంటల చొప్పున సరఫరా ఉండటం లేదని విద్యుత్ వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ వినియోగం ఇలా... జిల్లాలో రోజువారీ విద్యుత్ వినియోగ లక్ష్యం 8.150 మిలియన్ యూనిట్లు.. అయితే ఇచ్చిన లక్ష్యం కంటే తక్కువగానే కాలుతోంది. జూన్ నెల 22వ తేదీ 7.700 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించారు. జూన్ నెల 23వ తేదీ 7.791 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగించారు. కోటా కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం ఉన్నప్పుడు కోతలు విధిస్తున్నారంటే అర్థం ఉంది. అలాంటిది కోటా కంటే తక్కువగానే విద్యుత్ వినియోగం ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం ఐదారు గంటల పాటు అనధికార కోతలు విధిస్తున్నారు. జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలోనే ప్రతి రోజూ రెండు, మూడు గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారంటే విద్యుత్ శాఖ గాడి తప్పిందనే చెప్పాలి. అధికారుల చేతిలో ఏమీ లేదు. పైనుంచి ఏవిధమైన ఆదేశాలు వస్తే ఆ విధంగా చేయాల్సిందే తప్ప సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయిలో జిల్లా విద్యుత్ శాఖ అధికారులు లేరు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే గగనమే మార్పిడి భారం వినియోగదారులపైనే గ్రామీణ ప్రాంతాల్లో ఐదారు రోజులకు పైగానే పడుతున్న వైనం పట్టణ ప్రాంతాల్లో కూడా మూడు రోజులు దాటాల్సిందే అడ్డగోలుగా అనధికారిక కోతలు వ్యవసాయానికి తొమ్మిది గంటలు సరఫరా కాక అవస్థలు స్మార్ట్ షాక్...వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్లను చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులకొట్టాలని పిలువునిచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అవే స్మార్ట్ మీటర్లు బిగించటం ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు, పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్లు బిగించటం పూర్తి కావస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు జిల్లాలో 16,109 స్మార్ట్ మీటర్లు బిగించాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 13,961 మీటర్లు బిగించారు. కమర్షియల్ స్మార్ట్ మీటర్లు జిల్లా వ్యాప్తంగా 84,751 బిగించాలని లక్ష్యంకాగా ఇప్పటి వరకు 70,208 బిగించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒంగోలు నగర పాలక సంస్థతో పాటు ‘‘అమృత్’’ మంచినీటి పథకాలు ఎక్కడైతే మంజూరు చేశారో ఆయా నగరాలు, పట్టణాల్లో కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఒంగోలు నగరంలో కూడా స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలుపెట్టారు. సమస్యలుంటే మా దృష్టికి తెండి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఒకటి, రెండు రోజుల్లో మారుస్తున్నాం. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. రెండు, మూడు నెలల గ్యాప్ తరువాత రైతులు వ్యవసాయ మోటార్లు స్టార్ట్ చేస్తున్నారు. కొంత గ్యాప్ తరువాత మోటార్లు వేసినప్పుడు సహజంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. అందుకే దాదాపు 500 ట్రాన్స్ఫార్మర్లు రిపేర్లు చేసి సిద్ధంగా ఉంచాం. రైతులకు కానీ, పట్టణాల్లో కానీ వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఇవ్వటానికి ఎలాంటి సమస్యలు లేవు. అలాంటి సమస్యలు ఉన్నా, విద్యుత్ సిబ్బంది ఇబ్బందులు పెట్టినా నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు. – కట్టా వెంకటేశ్వర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఏపీసీపీడీసీఎల్ -
సర్పంచ్ కుటుంబ సభ్యులకు బూచేపల్లి, తాటిపర్తి పరామర్శ
పెద్దదోర్నాల: అక్రమ కేసులతో అరెస్టయిన చిన్న గుడిపాడు సర్పంచ్ వల్లభనేని మల్లికార్జున (పవన్) కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు. ఆదివారం మండలంలో పర్యటించిన వారు చిన్నగుడిపాడులోని పవన్ స్వగృహంలో అతని బంధువులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. టీడీపీ ప్రభుత్వ అధికారం ఉందన్న గర్వంతో తప్పుడు కేసులు బనాయిస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన నిరంతరం పోరాడుతోందని తెలిపారు. ప్రజాదరణ కలిగిన వల్లభనేని మల్లికార్జునను ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలనే ఇటువంటి కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. దీంతో పాటు ఇటీవల శరస్త్ర చికిత్సలు చేయించుకున్న గాదె బ్రహ్మారెడ్డిని తన నివాస గృహంలో పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట పార్టీ మండల కన్వీనర్ గంటా రమణారెడ్డితో పాటు మండల నాయకులు, స్థానిక నాయకులు ఉన్నారు. -
రైతు కంట కన్నీటి ఝరి..
తిరస్కరణలతో సరి..కనిగిరిరూరల్: కూటమి పాలనలో పొగాకు రైతులు కుదేలయ్యారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో కంపెనీల ప్రతినిధులు, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కనిగిరి టుబాకో బోర్డు పరిధిలో పొగాకు సాగు విస్తీర్ణం 4,952 హెక్టార్లు ఉండగా.. 5 క్లస్టర్ల పరిధిలో 74 గ్రామాల్లో 1,245 బ్యార్నీలు ఉన్నాయి. ఈ ఏడాది పొగాకు ఉత్పత్తి 8.5 మిలియన్ కేజీలు వచ్చింది. కనిగిరి టుబాకో బోర్డులో మార్చి 19 నుంచి పొగాకు వేలం కేంద్రం ప్రారంభమైంది. ఇప్పటికి పది రౌండ్లు వేలం అయినా కేవలం 3.18 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేశారు. ప్రతి బ్యార్నీ నుంచి 12 బేళ్ల వరకు అనుమతి ఉన్నా ఇప్పటి వరకు నాలుగు, ఐదుసార్లు వేలానికి వెళ్లిన పొగాకు రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది. కేవలం గ్రేడ్1 (ఎఫ్1,ఎఫ్2,ఎఫ్3) రకాల పొగాకును మాత్రమే కొనుగోలు చేసి.. మిగతా రకం బేళ్లను తిరస్కరిస్తున్నారు. దీంతో ప్రతిసారి వేలం కేంద్రానికి వెళ్లడం ఒకటి రెండు బేళ్లు మాత్రమే కొనుగోలు జరగడంతో.. మిగతా వాటిని తీసుకుని ఉసూరుమంటూ తిరిగి ఇంటికి వెళ్లే దుస్థితి ఏర్పడింది. గత ఏడాది కనిగిరి టుబాకో బోర్డు పరిధిలో 7.58 మిలియన్ కేజీల ఉత్పత్తి వచ్చింది. దాదాపు రైతు దగ్గర ఉన్న పొగాకు మొత్తాన్ని బోర్డు అధికారులు, ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత ప్రభుత్వంలో గరిష్ట ధర కేజీ రూ.350 నుంచి రూ.360 వరకు, కనిష్ట ధర రూ.280 నుంచి రూ.270 వరకు కొనుగోలు చేశారు. కనిష్ట ధర దిగజారినా.. కనిగిరి బోర్డులో ఈఏడాది ప్రారంభ వేలంలో కేజీ పొగాకు కనిష్ట ధర రూ.180 వరకు పలికినా..వారం రోజులుగా కనిష్ట ధర కేజీ రూ.150కి పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు గరిష్ట ధర రూ.280 మాత్రమే ఉంది. అంతేగాక మీడియం, లోగ్రేడ్ పొగాకు బేళ్లను కొనుగోలు చేయకపోతుండటంతో ఇళ్లల్లో పేరుకుపోయిన పొగాకు బేళ్లను చూసుకుంటూ తెచ్చిన పెట్టుబడి అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో పొగాకు రైతు లోలోన కుములుతున్నాడు. బయ్యర్లతో అధికారుల కుమ్మక్కు? కనిగిరి టుబాకో బోర్డు అధికారులు, బయ్యర్ల తీరును నిరసిస్తూ ఇప్పటికి అనేక దఫాలు రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. బయ్యర్లతో ఆక్షన్ సూపరింటెండెంట్ కుమ్మక్కయి రైతులను అన్యాయం చేస్తున్నాడని, వారికి నచ్చిన రైతులకు న్యాయం చేసి.. మిగతా వారికి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు చేశారు. రెండు రోజుల క్రితం పామూరు మండలం వెంకట్రావుపాలెంకు చెందిన పెద్ద రైతు .. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు అన్యాయం చేయవద్దని అడిగినందుకు తాగి వచ్చావా..? అంటూ ఆక్షన్ సూపరింటెండెంట్ దురుసు వ్యాఖ్యలు చేశారు. దీనిపై రైతులు నిరసన తెలిపారు. ఆర్ఎంకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం, కంపెనీలు, అధికారులు అందరూ కలిసి పొగాకు రైతును పూర్తిగా అన్యాయం చేస్తున్నారని రైతు సంఘ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. భారీ ఎత్తున బేళ్లు తిరస్కరిస్తుండటం, కనిష్ట ధరలు నానాటికీ దిగజారడాన్ని నిరశిస్తూ సోమవారం కూడా మరోమారు ధర్నా చేపట్టనున్నట్లు రైతు సంఘ నాయకులు తెలిపారు. కనిగిరి బోర్డు పరిధిలో 8.5 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి పది రౌండ్లు పూర్తవుతున్నా 3.18 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు దిగజారిన కనిష్ట ధరలు ఇళ్లలో నుంచి కదలని బేళ్లు స్పందించని అధికారులు, బయ్యర్లు నేడు వేలం కేంద్రం వద్ద ధర్నాకు సిద్ధమవుతున్న రైతులుపొగాకు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం పొగాకు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈ ఏడాది రైతులకు మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం పొగాకు రైతులను విస్మరించడంతో బయ్యర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. పొగాకు రైతుకు గిట్టుబాటు ధర లేక.. బేళ్లన్నీ అమ్ముడుపోక ఇబ్బంది పడుతున్నారు. నామ్కే వాస్తే ఒకటి రెండు బేళ్లను మీడియంను కొనుగోలు చేసి.. సరాసరి ధర రూ.240 అంటూ బోర్డు అధికారులు ప్రకటిస్తున్నారు. దీని వల్ల పొగాకు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. – సూరసాని మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి పొగాకు రైతును ప్రభుత్వం ఆదుకోవాలి పొగాకు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రైతు పండించిన పంటను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. రైతు తెచ్చిన పొగాకు బేళ్లన్నీ కొనుగోలు చేయాలి. లోగ్రేడ్ పొగాకును నోబిడ్ పేరుతో తిరస్కరించడం సరైంది కాదు. అధికారులు బయ్యర్లతో కుమ్మకై ్క రైతులకు అన్యాయం చేస్తున్నారు. పొగాకు రైతుకు కనీస మద్దతు ధర కల్పించాలి. – గుజ్జుల బాలిరెడ్డి, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు -
అడ్డగోలు కోతలపై జనాగ్రహం
సింగరాయకొండ: మండల కేంద్రంలో పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ కోతలు విధించడంతో ఆగ్రహించిన బాలయోగినగర్, అంబేద్కర్ నగర్ కాలనీవాసులు ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. కొద్ది రోజులుగా విద్యుత్కు తీవ్ర అంతరాయం కలుగుతోందని, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అర్థం కావటం లేదన్నారు. చిన్న గాలివాన వచ్చినా విద్యుత్ నిలిపేస్తున్నారని ఆరోపించారు. అసలే వాతావరణ ప్రభావంతో ఎండతీవ్రత బాగా ఉందని, రాత్రి అయినా వేడి తగ్గటం లేదని, మరో పక్క విద్యుత్ సక్రమంగా ఉండకపోవటంతో ఎలా బతకాలని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి తరచూ విద్యుత్కు అంతరాయం కలుగుతోందని, ఇప్పుడు రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సబ్స్టేషన్కు అధికారులను నిలదీద్దామని వచ్చామని, ఇక్కడ సిబ్బంది ఎవరూ లేరని విద్యుత్ శాఖ ఏఈ సాంబశివరావుకు ఫోన్ చేస్తే జాతీయ రహదారిపై లారీ యూనియన్ ఆఫీసు సమీపంలో విద్యుత్ తీగలు తెగాయని మరమ్మతు చేస్తున్నామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సమస్య ఉంటే ఇప్పుడు తీరిగ్గా రాత్రి పూట మరమ్మతులు చేయటం ఏమిటని, దీనిని బట్టి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం అర్థమవుతోందని ఆరోపించారు. విద్యుత్ అధికారుల వైఖరికి నిరసనగా సబ్స్టేషన్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద కొవ్వొత్తులతో గ్రామస్తుల నిరసన -
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచాలి
● యూటీఎఫ్ గౌరవ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు ఒంగోలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచాలని యూటీఎఫ్ శ్రేణులకు యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం ఆదివారం ఒంగోలులో జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హై అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూటీఎఫ్ గౌరవ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ సమాజంలో నాణ్యమైన, సమానమైన విద్య అందాలంటే ప్రభుత్వ విద్యావిధానం బలపడాలన్నారు. బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో 40 మంది విద్యార్థులు దాటితే 3వ పోస్టు ఇవ్వాలని, 2 సంవత్సరాలు ఒక ఉపాధ్యాయుడు ఒకేచోట పనిచేసేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హై మాట్లాడుతూ యూటీఎఫ్ కార్యకర్తలు అదనంగా పనిచేసి పాఠశాలలను సమాజానికి దగ్గరకు చేర్చాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరినీ బోధనేతర పనులు తగ్గించి ఎన్రోల్మెంట్ పెంచే వాతావరణాన్ని కల్పించాలన్నారు. జిల్లాలో రిలీవర్ లేక చాలా మంది ఉపాధ్యాయులు బదిలీ అయినా పాత స్థానాల్లోనే పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని బదిలీ, ప్రమోషన్ తీసుకున్న ఉపాధ్యాయులందరినీ కొత్త స్థానాల్లో పనిచేసేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ గౌరవ అధ్యక్షుడు రవి, సహాధ్యక్షురాలు ఉమామహేశ్వరి, కోశాధికారి చిన్నస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజసులోచన, తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల ఘోష
దర్శి(కురిచేడు): విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుకుల పాఠశాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా విద్యార్థులు భోజనం సక్రమంగా అందక గోడలు దూకి బయటకు వెళ్లి తినాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది దర్శి అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పరిస్థితి. ఈ పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో పర్యవేక్షణ లేకపోవడంతో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. . అమలు కాని మెనూ.. గురుకుల పాఠశాలలో మెనూ ఎప్పుడో మరిచిపోయారు. ఇష్టం వచ్చినట్లు విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు పాఠశాల గోడలు దూకి బయటకు వెళ్లి తిని వచ్చే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మొత్తం 600 మంది విద్యార్థులకు కేవలం 12 లీటర్ల పాలనే వినియోగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వారంలో రెండు రోజులు చికెన్ ఇవ్వాల్సి ఉండగా..నెలలో ఒకటి రెండు రోజు మాత్రమే తూతూమంత్రంగా పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. 70 కిలోల వరకు చికెన్ తీసుకురావాల్సి ఉండగా 35 కిలోలు తీసుకువచ్చి సరిపెడుతున్నారు. రోజూ ఇవ్వాల్సిన గుడ్లను వారంలో రెండు మూడు రోజులు మాత్రమే ఇస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం వండిన వంటలను రాత్రికి పెడుతున్నారని పలువురు విద్యార్థులు వాపోయారు. పట్టించుకునేదెవరు..? గురుకుల పాఠశాల పర్యవేక్షణ కోసం పాఠశాల ఆవరణలోనే ప్రిన్సిపాల్ కోసం ఒక భవనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రిన్సిపాల్ అందులోనే నివాసం ఉండి విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సి ఉంది. కానీ ఇక్కడ ఇన్చార్జి ప్రిన్సిపాల్గా ఉన్న వ్యక్తి సింగరాయకొండలో నివాసముంటూ ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటలకు వెళ్లిపోతుండటంతో పాఠశాలలో ఏం జరుగుతుందో పర్యవేక్షించే వారే కరువయ్యారు. దీంతో విద్యార్థులు పాఠశాలను వీడి బయటకు వెళ్లిపోతున్నారు. పాఠశాల గేటు పక్కన ఖాళీ మద్యం సీసాలు, తినుబండారాల ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. ఆటస్థలంలో విష సర్పాలు సంచరిస్తున్నా, పాఠశాల ఆవరణలోని కంపచెట్లను తొలగించి శుభ్రం చేయించకపోవడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాల ప్రహరీ కూలినా మరమ్మతులు చేయకపోవడంతో రాత్రిళ్లు పాఠశాల ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల కనీస పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గురుకుల పాఠశాలపై దృష్టి సారించి విద్యార్థుల ఇక్కట్లు తీర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దర్శి గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఇక్కట్లు మెనూ అమలు చేయకుండా పిల్లలను పస్తులు పెడుతున్న వైనం 600 మంది పిల్లలకు 12 లీటర్ల పాలు ఆకలి తట్టుకోలేక గోడ దూకి బయటకు వెళుతున్న విద్యార్థులు ప్రిన్సిపాల్ వైఖరిపై సర్వత్రా విమర్శలు -
జగనన్న పాలనలో మహిళలకే అగ్రపీఠం
యర్రగొండపాలెం: వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మహిళలకు అగ్రపీఠం వేశారని, వారికి ప్రాధాన్యత ఇచ్చి ఎంతో గౌరవించారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎంపికై న ఉడుముల అరుణ శ్రీనివాసరెడ్డిని ఆయన శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాల్లో మహిళల పాత్ర ముఖ్యమైందన్నారు. వారు ప్రతి విషయంలో చొరవచూపి ముందుకు కొనసాగుతుంటారని, అటువంటి మహిళలకు జగనన్న తన కేబినేట్లో ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. మంత్రివర్గంతో పాటు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులను సైతం ఎక్కువ భాగం మహిళలకే కేటాయించి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు పూర్తిగా మహిళల పేరుతోనే మంజూరు చేసి వారి గౌరవాన్ని ఇతోధికంగా పెంచారన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఎక్కడా గౌరవం లేకుండా పోయిందని, కీచక పర్వం పెచ్చరిల్లి పోతుందని విమర్శించారు. మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, దాడులు ఎక్కువ అయ్యాయని, బాలికలను సైతం వదలకుండా అన్ని విధాలుగా వారిపై దాడులు జరుగుతున్నా సీఎం చంద్రబాబు, పవన్కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ రెడ్బుక్ అమలు అంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడన్నారు. ప్రస్తుత పాలనలో మహిళలు తమ గళాన్ని వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై మహిళలు ఉద్యమించి పరిష్కరించుకోవాలని, అందుకు పార్టీతో పాటు తన అండదండలు ఉంటాయన్నారు. మహిళా విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎంపికై న అరుణమ్మ పదవులతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలు అందిస్తూ వచ్చారని కొనియాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పరుచుకునేందుకు, ప్రజల సమస్యలను పరిష్కరించుకోవటానికి మహిళలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి వర్గంలో, పార్టీ పదవుల్లో ప్రాధాన్యం కూటమి ప్రభుత్వంలో కీచక పర్వం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
నిరుద్యోగులకు శాపం
కూటమి పాపం.. ఒంగోలు వన్టౌన్: నిరుద్యోగులను సీఎం చంద్రబాబు నిలువునా మోసం చేశారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు, మోసపూరిత మాటలతో మభ్యపెట్టారు. తమకు ఓట్లేసి గెలిపిస్తే భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అప్పటి వరకూ నిరుద్యోగ భృతిగా నెలకు రూ.3 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. నమ్మి ఓట్లేసిన వారిని అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారు. కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా, నిరుద్యోగ భృతి చెల్లించకపోగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందిన వారందరినీ తొలగించారు. రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులతో వేల మందిని నిరుద్యోగులుగా మార్చారు. వారి కుటుంబాలను రోడ్డున పడేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మొత్తం ఇలాంటి కుట్రలు, కుతంత్రాలతోనే సాగడం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. సూపర్ 6.. నిరుద్యోగ భృతికి మంగళం... ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాల గురించి కూటమి పార్టీల నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాటిలో ఒకటైన నిరుద్యోగ భృతి పథకం కింద ఉద్యోగాలు కల్పించేంత వరకూ నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.3 వేలు చెల్లిస్తామని చెప్పారు. అధికారం చేపట్టగానే అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. ఏడాది దాటినా నిరుద్యోగ భృతి గురించి సీఎం చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నాయకులెవరూ మాట్లాడటం లేదు. ఏడాది నుంచి ఎదురుచూసిన నిరుద్యోగులు ఇక నిరుద్యోగ భృతి లేనట్టేనంటూ పాలకుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తమను మరోసారి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వీరంతా నిరుద్యోగ భృతి కోసం ఏడాది నుంచి ఎదురుచూశారు. ప్రభుత్వం మాత్రం ఆ ఊసే ఎత్తకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు... కొత్త ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి లేకపోగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊడబీకింది. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని చెప్పి వారందరినీ పూర్తిగా తొలగించి ఉపాధి లేకుండా చేసింది. నూతన మద్యం పాలసీతో ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న ఉద్యోగులను రోడ్డున పడేసింది. రేషన్ షాపుల్లోనే బియ్యం, సరుకులు విధానం ద్వారా ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్ల పొట్టకొట్టింది. చివరకు పారిశుధ్య కార్మికులు, ఫ్యామిలీ ఫిజీషయన్లు, రేషన్ డీలర్లపై సైతం కక్ష సాధింపులు, వేధింపులకు పాల్పడుతూ ఉన్న ఉద్యోగాలు తొలగించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నియమించిన వారిని తొలగించాలనే కుట్రలతో పాటు కూటమి పార్టీల శ్రేణులకు దోచిపెట్టాలనే దురుద్దేశంతో అన్ని వ్యవస్థలనూ అతలాకుతలం చేస్తోంది. రాజకీయ కారణాలతో అవకాశం ఉన్న ప్రతి శాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను తీసివేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ నిరుద్యోగులతో చంద్రబాబు చెలగాటం ఈసారీ అదే తీరు ఏడాది పాలనలో కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా కల్పించని ప్రభుత్వం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు కూడా తొలగింపు నిరుద్యోగ భృతి పేరుతో నిలువునా మోసం జిల్లాలో 5 లక్షల మందికిపైగా బాధితులు 2014–19లోనూ జాబు రావాలంటే బాబు రావాలంటూ మోసం...సీఎం చంద్రబాబునాయుడు 2014–19లోనూ నిరుద్యోగులు, ఉద్యోగుల పట్ల ఇదేవిధంగా వ్యవహరించారు. ఆనాడు కూడా ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున హామీలిచ్చారు. 600కుపైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత నిరుద్యోగులను, ప్రజలను దారుణంగా మోసం చేశారు. జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చేంత వరకూ రూ.2 వేల నిరుద్యోగ భృతి అని అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా కల్లబొల్లి మాటలతో కాలం వెల్లదీశారు. మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు 2019 ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పారు. అయినప్పటికీ 2024లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో నిరుద్యోగులతో చంద్రబాబు మరోసారి చలగాటమాడారు. నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకుండా మోసం చేస్తున్నారు. నిరుద్యోగులంతా ఆందోళనలో ఉన్నారు సీఎం చంద్రబాబు గతంలో కూడా నిరుద్యోగులను మోసం చేశారు. 2014–19 పాలనలో నిరుద్యోగ భృతిగా రూ.2 వేలు చెల్లిస్తామని చెప్పారు. నాలుగున్నరేళ్లు పట్టించుకోలేదు. 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అతి కొద్దిమందికి మాత్రమే చెల్లించారు. ప్రస్తుతం రూ.3 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మళ్లీ పట్టించుకోవడం లేదు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఏడాది పాలనలో జిల్లాలో ఒక్క కొత్త ఉద్యోగం కూడా కల్పించలేదు. నిరుద్యోగ భృతి కూడా లేదు. ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అమలు చేయలేని అబద్ధపు హామీలు, మోసపూరిత మాటలతో చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారు. – ఎండీ ఇమ్రాన్ఖాన్, కార్పొరేటర్, ఒంగోలు -
మోదీ పాలనలో తీవ్ర నిర్బంధం
● సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ ఒంగోలు టౌన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశంలో తీవ్ర నిర్బంధం కొనసాగుతోందని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ విమర్శించారు. ఎమర్జన్సీ విధించి 50 ఏళ్లయిన సందర్భంగా ఎమర్జన్సీ నాడు–నేడు అనే అంశంపై స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు అధ్యక్షత వహించగా, రాంభూపాల్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే వారిని, మోదీని విమర్శించే వారిని ఉపా చట్టం కింద అరెస్టు చేసి ఆరు నెలలకుపైగా బెయిల్ రాకుండా నిర్బందిస్తున్నారని ఆరోపించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడితే దేశ ద్రోహం ముద్రలు వేసి దాడులు చేస్తున్నారని విమర్శించారు. న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రభిర్, స్టాన్ స్వామి ఉదంతాలను ఉదాహరించారు. రాజ్యాంగ హక్కులను కాలరాయడంతో పాటుగా రాజ్యాంగాన్నే మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో భిన్నమతాల సామరస్యానికి భిన్నంగా మత నియంతృత్వం కొనసాగాలని మోదీ కోరుకుంటున్నారని చెప్పారు. దేశ ప్రజలు స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సదస్సులో సీపీఎం నాయకులు కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, వై.సిద్దయ్య, ఏవీ పుల్లారావు పాల్గొన్నారు. -
ఆరుగురు జూదరుల అరెస్టు
మద్దిపాడు: మండలంలోని ఏడుగుండ్లపాడు, ఇనమనమెళ్లూరు గ్రామాల మధ్య కోడిపందేలు నిర్వహిస్తున్న వారిని ఆదివారం మద్దిపాడు పోలీసులు, యాంటీ గూండా స్క్వాడ్ సిబ్బంది పట్టుకున్నారు. పక్కాగా అందిన సమాచారంతో కోడిపందేల శిబిరంపై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.11,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. శిబిరం వద్ద ఉన్న 11 మోటార్ సైకిళ్లు, 11 సెల్ఫోన్లు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకుని మద్దిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన వారిని సోమవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్ఐ శివరామయ్య తెలిపారు. కోడి పందేల శిబిరంపై దాడి పామూరు: మండలంలోని వేర్వేరు గ్రామాల్లో కోడిపందేలు ఆడుతున్న, పేకాట ఆడుతున్న మొత్తం 22 మందిని ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.30,380 నగదు, 8 కోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై టి.కిషోర్బాబు తెలిపారు. మండలంలోని బుక్కాపురం సమీపంలోని పొలాల్లో కోడిపందాలు ఆడుతున్న 14 మందిని అరెస్ట్చేసి వారి వద్ద నుంచి 8 కోళ్లు, రూ.20,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రావిగుంటపల్లె సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్చేసి వారి వద్ద నుంచి రూ.10,680 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వారిపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిషోర్బాబు తెలిపారు. 22 మంది జూదరుల అరెస్టు 8 కోళ్లు, రూ.30,830 నగదు స్వాఽధీనం -
ఆవుల మందపై పెద్ద పులి దాడి
యర్రగొండపాలెం: మండలంలోని పాలుట్లలో పెద్ద పులి మరో సారి పశువులపై దాడి చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పెద్దపులి గిరిజన గూడెంలోకి జొరబడింది. పశువుల కొష్టంలోకి వెళ్లిన పెద్ద పులి అక్కడ ఉన్న రెండు ఆవులను తీవ్రంగా గాయపరచడంతో ఆ రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. జీవనాధారమైన ఆవులు మృతి చెందడంతో ఆ ఆవుల యజమాని కొడావత్ నానికే నాయక్ బోరున విలపించాడు. ఈ నెల 12న పెద్ద పులి పాలుట్లలోని పశువుల కొష్టంలోకి వెళ్లి దాదాపు రూ.70వేల విలువ చేసే రెండు ఎద్దులను హతమార్చింది. ఒకే నెలలో రెండు పర్యాయాలు పెద్దపులి పాలుట్లలో సంచరించి 4 పశువులను పొట్టన పెట్టుకోవడంతో ఆ గిరిజన గూడెం వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని పెద్దపులి బారి నుంచి కాపాడాలని గిరిజనులు కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్–1100ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలి పారు. ఈ మేరకు ఆమె ఆదివారం విడుదల చేసి న ప్రకటనలో కాల్ సెంటర్–1100 ద్వారా ప్రజ లు సమస్యలను ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోనవచ్చన్నారు. అర్జీదారులు ఆ నంబర్కు డయల్ చేసి, తమ సమస్యను విన్నవిస్తే ఆన్లైన్లోనే ఫిర్యాదు రిజిస్టర్ చేిసుకుంటుందని వివరించారు. ఆ సమస్యను సంబంధిత అధికారికి పంపి తద్వారా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు. జిల్లాలోని ప్రజలంతా కాల్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెండు ఆవులు మృతి భయాందోళనలో గిరిజనులు -
మహిళలకు రాత్రివేళ డ్యూటీలు దుర్మార్గం
ఒంగోలు టౌన్: మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని, ఇది కార్మిక హక్కులపై దాడి చేయడమేనని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు అన్నారు. జూలై 9వ తేదీ దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో ఆదివారం స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటిని సాధించేందుకు సమ్మెలు చేసే అవకాశాన్ని కోల్పోతారని చెప్పారు. యూనియన్లు పెట్టుకునే హక్కుతో పాటు సమ్మె హక్కులను కూడా కోల్పోతారన్నారు. ఒకరోజు సమ్మె చేస్తే 8 రోజుల వేతనాన్ని కట్ చేయడం లాంటి క్రూర నిబంధనలను తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 8 గంటల పనిదినానికి తూట్లు పొడుస్తూ 10 గంటల పనిదినాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఓటీని 140 గంటలకు పెంచడం కార్మికుల మీద పాలకులు చేస్తున్న దాడిగా భావించాల్సి ఉంటుందన్నారు. ఒకవైపు కార్మికుల హక్కులను తుంగలో తొక్కుతూ.. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ మాట్లాడుతూ దేశంలోని అన్ని కార్మిక సంఘాలు విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు గత నాలుగేళ్లుగా పోరాటాలు చేస్తున్నాయని తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం దుర్మార్గమన్నారు. స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా పనిభారాన్ని పెంచుతున్నారని విమర్శించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత కల్పించకుండా స్కీం వర్కర్లచే పనులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం ఉల్లంఘిస్తున్నారని వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళా సంఘాలు, విద్యార్థి, యువజనులు లేబర్ కోడ్కు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఎంఎస్ సాయి, వెంకటరావు, శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసులు, పారా శ్రీనివాసులు, జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జూలై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు -
పారిశుధ్యంపై కేంద్ర బృందం తనిఖీలు
చీమకుర్తి రూరల్: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ–2025 కార్యక్రమంలో భాగంగా మండలంలోని గుండువారిలక్ష్మీపురం గ్రామంలో శనివారం కేంద్ర బృంద సభ్యులైన జి.రవివర్మ, పుదీర్, సందీప్ పర్యటించారు. పారిశుధ్యం నిర్వహణ, మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలనడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎంపీడీఓ వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పారిశుధ్యం నిర్వహణపై సర్వే నిర్వహించి ఆయా పంచాయతీలకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టి.శాంతిప్రియ, ఖాజావలి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పురుగుమందు తాగి వృద్ధుడి ఆత్మహత్య గిద్దలూరు రూరల్: పురుగుమందు తాగి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పట్టణంలోని నల్లబండ బజారు శివారు మేకల నరవ ప్రాంతంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచర్ల మండలం పుల్లలచెరువు గ్రామానికి చెందిన నల్లబోతుల రంగయ్య (64) నాలుగు రోజుల క్రితం ఇంటి వద్ద తన పెద్ద కుమారుడితో ఘర్షణ పడి గిద్దలూరు వెళ్లాడు. అక్కడ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విగతజీవిగా పడి ఉన్న రంగయ్యను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రంగయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య గతంలోనే మరణించింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు టంగుటూరు: గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన సంఘటన మండలంలోని వల్లూరు గ్రామ పొలాల్లో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లూరు జాతీయ రహదారి సమీప పొలాల్లో గుర్తుతెలియని పురుషుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి 35 నుంచి 50 ఏళ్లు ఉండొచ్చు. ఒంటిపై బ్రౌన్ రంగు కలిగి ఉన్న ఫుల్ హాండ్స్ షర్ట్, నల్ల కాటన్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. షర్ట్ కాలర్ వద్ద ఒంగోలులోని కమల్ టైలర్స్ లేబుల్ ఉంది. గుర్తుపట్టిన వెంటనే టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు 91211 02137 నంబర్ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. రైలు కిందపడి వృద్ధుడి దుర్మరణం టంగుటూరు: ప్రమాదవశాత్తు రైలు కిందపడి వృద్ధుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన స్థానిక రైల్వేస్టేషన్లో శనివారం ఉదయం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జరుగుమల్లి గ్రామానికి చెందిన పిలిమి సుబ్బారెడ్డి (69) తన భార్య కమలమ్మతో కలిసి కావలిలో వైద్య చికిత్స కోసం బయల్దేరాడు. రైల్వేస్టేషన్లో రైలు ఎక్కేందుకు ప్లాట్ఫాం మారే ప్రయత్నం చేశారు. గూడ్స్ రైలు కింద నుంచి దూరి అవతలి ప్లాట్ఫాంకు వెళ్లే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా రైలు కదలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకు న్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చెరుకొని ప్రమాదానికి కారణాలు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. -
కేంద్ర న్యాయశాఖలో కరవది విద్యార్థినికి ఇంటర్న్షిప్ అవకాశం
ఒంగోలు సిటీ: ఒంగోలు మండలంలోని కరవది గ్రామానికి చెందిన సత్యాల అంజనప్రియకు కేంద్ర న్యాయశాఖలో ఇంటర్న్షిప్కు అవకాశం దక్కింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో 5వ సంవత్సరం న్యాయ విద్య అభ్యసిస్తున్న అంజనప్రియ భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వశాఖకు చెందిన న్యాయ వ్యవహారాల విభాగం నిర్వహించిన జూలై–2025 ఇంటర్న్షిప్ ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. ఈ ఇంటర్న్షిప్ న్యాయమంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయమైన మెయిన్ సెక్రటేరియట్, శాస్త్రి భవన్, న్యూఢిల్లీలో జూలై 1 నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థినికి ఈ ఇంటర్న్షిప్ ద్వారా న్యాయ విధానాలపై ఆచరణాత్మక అవగాహన, అనుభవం పొందే అవకాశం లభించనుంది. దేశం మొత్తం మీద 50 మందినే ఎంపిక చేస్తారు. అసాధారణ రీతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నేరుగా పనిచేసే అరుదైన అవకాశం వస్తుందని, అలాంటి అవకాశం కరవది విద్యార్థినికి రావడం విశేషమని పలువురు అభినందించారు. -
ఇంగ్లిష్ బోధించేందుకు దరఖాస్తు చేసుకోవాలి
నాగులుప్పలపాడు: మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో ఏపీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ బోధించేందుకు బీఈడీ, పీజీ అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కె.మాధవి తెలిపారు. పూర్తి వివరాలకు 87126 25043 నంబర్ను సంప్రదించాలని సూచించారు. విమానాల ల్యాండింగ్కు భూసేకరణ సింగరాయకొండ: విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని, ఇందుకోసం అవసరమైన భూసేకరణ చేపట్టాల్సి ఉందని, త్వరలో ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ జారీ అవుతుందని వెలుగొండ ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ కలెక్టర్ ఎం.శ్రీధర్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఆయన డిప్యూటీ తహసీల్దార్ టి.ప్రసాద్, సర్వేయర్ బ్రహ్మంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భూసేకరణకు సంబంధించి వారం రోజుల్లో విధివిధానాలు వస్తాయని, మార్కింగ్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ఇరువైపులా స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. అధికారులు మాట్లాడుతూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అభివృద్ధి పనులు త్వరలో చేపడతామని, ఇందుకోసం నిధులు కూడా మంజూరయ్యాయన్నారు. గతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ను ఎక్కడా వంకర లేకుండా నిర్మించాల్సి ఉండగా కొంతమేర వంకరగా నిర్మించడంతో రన్వేకు పనికిరాదని ఎయిర్ఫోర్స్ అధికారులు నిర్ణయించారని, ఇప్పుడు రన్వే వంకర సరి చేసేందుకు రోడ్డుకు ఇరువైపులా 6 మీటర్ల చొప్పున స్థల సేకరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అప్పుడు రన్వేను నిబంధనల ప్రకారం నిర్మిస్తామని వివరించారు. మార్కాపురం మీదుగా ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు మార్కాపురం: నాందేడ్ నుంచి తిరుపతి వరకూ మార్కాపురం మీదుగా ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును జూలై 4, 11, 18, 25 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మార్కాపురం పట్టణానికి చెందిన గుంటూరు డీఆర్ఈసీసీ మెంబర్ ఆర్కేజే నరసింహం తెలిపారు. ఈ రైలు నాందేడ్లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, నడికుడి, పిడుగురాళ్ల మీదుగా వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుతుందని వివరించారు. ఈ రైలు మార్కాపురం రోడ్ స్టేషన్కు వచ్చేసరికి తెల్లవారుజామున 3 గంటలు అవుతుందని, అదేరోజు మధ్యాహ్నం తిరుపతి చేరుతుందని తెలిపారు. మళ్లీ తిరిగి అదే రైలు మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి రాత్రి 9.30 గంటలకు మార్కాపురం చేరుతుందని చెప్పారు. ప్రస్తుతానికి ప్రతి శుక్రవారం తిరుపతి వెళ్లేందుకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని తిరుపతివెళ్లే వారు వినియోగించుకోవాలని కోరారు. ఇందులో ఏసీ టూటైర్, త్రీటైర్, స్లీపర్, జనరల్ బోగీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రకాశం వాసి దుర్మరణం
మదనపల్లె రూరల్: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ప్రకాశం జిల్లా వాసి దుర్మరణం చెందిన ఘటన శనివారం కర్ణాటక సరిహద్దులోని రాయల్పాడు సమీపంలో జరిగింది. ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లె పంచాయతీ ముర్గాని గ్రామానికి చెందిన ఎరుకులయ్య కుమారుడు పెద్దిరెడ్డి గారి పేరారెడ్డి (32) ద్విచక్ర వాహనంపై మదనపల్లె మీదుగా బెంగళూరు వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యంలోని కర్ణాటక సరిహద్దు రాయల్పాడు వద్ద ఎదురుగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పేరారెడ్డిని స్థానికుల సాయంతో రాయల్పాడు పోలీసులు మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. మృతుడి జేబులోని ఆధార్కార్డు, సెల్ఫోన్లోని నంబర్ల ఆధారంగా ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాయల్పాడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
కారు, ఆటో ఢీ
కొనకనమిట్ల: దైవ దర్శనానికి వెళ్తున్న కారు, ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం చెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఒంగోలు–గిద్దలూరు రహదారి మండలంలోని చినారికట్ల జంక్షన్ సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని ఓబులరెడ్డిపల్లికి చెందిన చెన్నయ్య తన ఆటోలో కాట్రగుంట, వెంగలపల్లి, గొట్లగట్టుకు చెందిన ప్రయాణిలను ఎక్కించుకుని పొదిలి వెళ్తున్నాడు. ఆటో చినారికట్ల జంక్షన్ సమీపంలోకి వచ్చే సరికి చీమకుర్తికి చెందిన శివ తన కారులో కుటుంబ సభ్యులతో కలిసి గిద్దలూరు దగ్గర ఉన్న నెమలిగుండ్ల రంగనాయకస్వామి గుడికి దైవదర్శనం కోసం వెళ్తున్నారు. ఆ క్రమంలో అదుపు తప్పిన కారు, ఆటో ఢీకొన్నాయి. ఆటో రోడ్డు మార్జిన్ పక్కన ఉన్న రాళ్ల గుట్టపై పడటంతో ఆటోలో ఉన్న కాట్రగుంట గ్రామానికి చెందిన మూడమంచు బాలయ్య (55) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాట్రగుంట పంచాయతీ వెంగళపల్లి గ్రామానికి చెందిన మోరా నారాయణమ్మ (55) తీవ్రంగా గాయపడగా మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అదే ఆటోలో ఉన్న నారాయణమ్మ భర్త ఆదినారాయణ కూడా గాయపడి పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఆటో తోలుతున్న చెన్నయ్య తీవ్రంగా గాయపడి పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. మృతి చెందిన బాలయ్యకు భార్య కొండమ్మ, నలుగురు పిల్లలు ఉన్నారు. మృతురాలు నారాయణమ్మకు భర్త ఆదినారాయణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన మిగిలిన ప్రయాణికులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కారులో ఉన్న వారు కూడా గాయపడగా వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రభాకర్రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం బాలయ్య, నారాయణమ్మ మృతదేహాలను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాట్రగుంట పంచాయతీలో కాట్రగుంట, వెంగళపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందటంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు దుర్మరణం ఎనిమిది మందికి గాయాలు -
వేధింపుల బదిలీలు..!
నాగులుప్పలపాడు: కూటమి ప్రభుత్వం, పాలకుల తీరుకు తాము ఏమాత్రం తీసిపోము అన్నట్లుగా జిల్లా పంచాయతీ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అవినీతి, అక్రమాలపై ప్రశ్నించిన వారిని లక్ష్యంగా చేసుకుని వేధించే విషయంలో కూటమి పాలకులు తానా అంటుంటే.. జిల్లా పంచాయతీ అధికారులు తందానా అంటున్నారు. బదిలీల పేరుతో పంచాయతీ కార్యదర్శులపై అధికారులు కక్ష సాధింపులకు పాల్పడటమే అందుకు నిదర్శనంగా ఉంది. పంచాయతీ కార్యదర్శుల సంఘ నాయకులుగా ఉండి జిల్లా పంచాయతీ కార్యాలయంలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించిన కార్యదర్శులను అధికారులు టార్గెట్ చేశారు. నిబంధనల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని సుదూర ప్రాంతాలకు వారిని బదిలీ చేసి వేధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మరీ... ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న బదిలీలకు సంబంధించిన నియమాలను పరిశీలిస్తే.. ఐదేళ్ల పాటు ఒకేచోట పనిచేసిన వారిని తప్పనిసరిగా వేరేచోటకు బదిలీ చేయాలి. లేకుంటే ఉద్యోగి పనిచేస్తున్న మండలం, అతని సొంత మండలం ఒకటే అయితే బదిలీ చేయాలి. కానీ, పంచాయతీ కార్యదర్శుల బదిలీల విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు ఈ నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. ప్రస్తుతం జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్న తరహాలో పంచాయతీ అధికారులు కూడా తమ మాట వినని పంచాయతీ కార్యదర్శులపై బదిలీల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. బదిలీలను తమకు అనుకూలంగా మార్చుకుని అడ్డగోలుగా కార్యదర్శులను బదిలీ చేస్తున్నారు. సంఘంలో పనిచేసిన వారే లక్ష్యంగా... జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘంలో పనిచేసిన వారిపై మరింతగా అధికారులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అక్రమాలపై గొంతెత్తడంతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో జరిగిన బదిలీల్లో జిల్లా పంచాయతీ కార్యాలయంలో తిష్ట వేసుకుని కూర్చుని బదిలీల్లో అవకతవకలకు పాల్పడి లక్షల్లో డబ్బు వసూలు చేసిన ఉద్యోగులపై కోర్టులకు వెళ్లడంతో సంబంధిత కార్యదర్శులను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కురిచేడు, నాగులుప్పలపాడు, అద్దంకి, మార్కాపురం ప్రాంతాల్లో పనిచేస్తున్న సుమారు 20 మంది పంచాయతీ కార్యదర్శులను ఆయా మండలాలు వారి సొంత మండలాలు కానప్పటికీ, ప్రస్తుతం వారు పనిచేస్తున్న మండలాలకు వచ్చి ఐదేళ్లు పూర్తికానప్పటికీ జిల్లా స్థాయి అధికారుల తప్పిదాలను ఎత్తి చూపడంతో పాటు గతంలో జరిగిన అడ్డగోలు బదిలీలు, పదోన్నతులు, అక్రమాలపై ఆధారాలతో కోర్టులకు వెళ్లారనే కారణంతో ప్రస్తుతం సుదూర ప్రాంతాలకు బదిలీ చేసి వేధిస్తున్నారు. కోర్టు కేసులకు సంబంధించి కలెక్టర్తో పాటు జిల్లా పంచాయతీ అధికారి కూడా స్పందించాల్సి ఉండటాన్ని అవమానకరంగా భావించిన జిల్లా అధికారులు.. సంబంధిత పంచాయతీ కార్యదర్శులను ఆయా మండలాల నుంచి దూరంగా బదిలీ చేయాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. పంచాయతీ కార్యదర్శుల లాగిన్లు ఆపివేయడంతో ఖాళీగా కనిపిస్తున్న పంచాయతీ వివరాలు బదిలీల పేరుతో పంచాయతీ కార్యదర్శులపై కక్ష సాధింపులు సంఘ నాయకులుగా పనిచేస్తూ డీపీవోలో అక్రమాలపై ప్రశ్నించిన వారిపై వేధింపులు నిబంధనలకు నీళ్లొదిలి సుదూర ప్రాంతాలకు పంచాయతీ కార్యదర్శుల బదిలీలు అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు కూటమి పాలనలో ప్రశ్నించిన వారిని హింసిస్తున్నారనడానికి మరో నిదర్శనం బదిలీల్లో పారదర్శకత లేదు పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో ఉన్నతాధికారులు నిబంధనలు పాటించడం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న మండలాల్లో పనిచేయడానికి అర్హత ఉన్నప్పటికీ బలవంతంగా బదిలీలు చేపట్టడం చాలా బాధాకరం. ఇప్పటికే ఈ అంశంపై కోర్టులకు కూడా వెళ్లాం. చట్టపరంగా తమకు న్యాయం జరిగేంత వరకు మా హక్కుల కోసం పోరాడతాం. – మెరుగోలు బెన్హర్, పంచాయతీ సెక్రటరీల సంఘ జిల్లా అధ్యక్షుడు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎంపీడీఓలకు పంపించి... టార్గెట్ చేసిన పంచాయతీ కార్యదర్శులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయాలనే ఆదేశాలను సంబంధిత మండలాల ఎంపీడీలకు వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపించినట్లు సమాచారం. తాము చెప్పిన కార్యదర్శులను తక్షణమే ఆయా మండలాల నుంచి బదిలీ చేయాలని నేరుగా జిల్లా పంచాయతీ అధికారే రంగంలోకి దిగి ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జిల్లా పంచాయతీ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను తాము ప్రశ్నించిన పాపానికి తమను బదిలీ చేసినట్లు చూపించి ప్రస్తుతం తాము పనిచేస్తున్న గ్రామ పంచాయతీలలో లాగిన్లు కూడా ఆపివేశారని సంబంధిత కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఇంత అవినీతి జరిగిన విషయం ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా వారిపై విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదుదారులపై జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని పలువురు కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే తమ విధులకు ఆటంకం కలిగిస్తూ లాగిన్లు ఆపడంతో పాటు తమకు ఆయా మండలాల్లో జీతాలు పెట్టొద్దని కూడా డీపీవో ఆదేశాలు జారీ చేశారని ఎంపీడీవోల ద్వారా తెలుసుకున్న బాధిత పంచాయతీ కార్యదర్శులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్ఫోర్స్మెంట్ దాడులు
● జిల్లా వ్యాప్తంగా జేసీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ నేతృత్వంలో వివిధ విభాగాల అధికారులు శనివారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలోని అన్నీ ప్రభుత్వ శాఖలు కలిసికట్టుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, పౌరసరఫరాలు, ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రోలజీ, ఫైర్ డిపార్ట్మెంట్, రూరల్ వాటర్ సప్లయ్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్స్, రైస్ మిల్లులు, బాణసంచా గోడౌన్లు, వాటర్ ఆర్ఓ ప్లాంట్లు, హోటల్స్, బఫర్ గోడౌన్స్, సినిమా హాల్స్ తనిఖీ చేశారు. ఇప్పటి వరకు పెట్రోలు బంకులు 47, గ్యాస్ ఏజెన్సీలు–31, రేషన్ షాపులు–88, ఎంఎల్ఎస్ పాయింట్స్–10, రైస్ మిల్లులు–7, బాణసంచా గోడౌన్లు–5, వాటర్ ఆర్ఓ ప్లాంట్లు–26, ఆర్టీసీ బస్ స్టాండ్స్–5, సినిమా హాల్స్–9, హోటల్స్–2, బఫర్ గోడౌన్–1 తనిఖీ చేపట్టారు. మొత్తం 231 చోట్ల అధికారులు స్పెషల్ డ్రైవ్లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్తో పాటు మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, ఒంగోలు, కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారులు కె.లక్ష్మీప్రసన్న, జి.కేశవర్ధన్రెడ్డి, సహాయ సరఫరా అధికారి ఐ.పుల్లయ్య, జిలాలోని అందరు తహసీల్దార్లు, సివిల్ సప్లయీస్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ప్రత్యేక తనిఖీల్లో పాల్గొన్నారు. -
వేలం బహిష్కరించిన రైతులు
కనిగిరిరూరల్: అన్ని రకాల పొగాకు బేళ్లను కొనుగోలు చేయాలని, మార్కెఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని, నోబిడ్ లేకుండా తెచ్చిన బేళ్లన్నీ కొనుగోలు చేయాలని కోరుతూ శనివారం అలవలపాడు క్లస్టర్ పరిధిలోని రైతులు వేలం పాటను బహిష్కరించి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే అలవలపాడు క్లస్టర్ పరిధిలోని సుమారు 6 గ్రామాల రైతులు 644 పొగాకు బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. కనిష్ట ధర కేజీ రూ.150 ఇస్తున్నారని, బేళ్లను తిప్పి పంపకుండా అన్ని రకాల బేళ్లను పూర్తిగా సరైన ధర ఇచ్చి కొనుగోలు చేయాలని వేలం ప్రారంభంలో అధికారులను, బయ్యర్లను రైతులు కోరారు. దానికి వారు సమ్మతించలేదు. దీంతో రైతులు వేలాన్ని బహిష్కరించి గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు పిల్లి తిప్పారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయకుండా రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. రైతుల వద్ద గ్రేడ్ వన్ రకం మాత్రమే కొని మిగతా వాటిని ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాల వైఫల్యంపై తీవ్రంగా మండిపడ్డారు. బోర్డు సూపరింటెండెంట్ రైతుల పక్షాన లేకుండా వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బీ శ్రీను, ప్రతాప్, వెంకటేశ్వర్లు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కనిగిరి పొగాకు బోర్డు వద్దబైఠాయించి నిరసన -
ఎయిడెడ్ విద్యార్థులకు వసతులు కల్పించాలి
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 135 ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే వెంకట్రావు, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రతి తరగతికి చెందిన విద్యార్థులు కూర్చునేందుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సమానంగా బెంచీలు, తరగతి గదులకు ఫ్యాన్లు, ఐఎఫ్ఎల్ ప్యానల్ టీవీలు, విద్యార్థులకు మంచినీటి వసతి కల్పించి ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చే ఆట వస్తువులు, పాఠశాల గ్రాంట్ విడుదల చేసి ఎయిడెడ్ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. షూటింగ్ చాంపియన్షిప్లో జిల్లా విద్యార్ధుల ప్రతిభ ఒంగోలు టౌన్: ఈ నెల 21వ తేదీ నుంచి 30 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరుగుతున్న 25వ షూటింగ్ చాంపియన్షిప్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 9 మంది రైఫిల్, ఇద్దరు పిస్టల్ షూటింగ్ విభాగాల్లో విజయం సాధించారు. తదుపరి అహ్మదాబాద్, త్రివేండ్రంలలో ఆగస్టులో జరిగే సౌత్జోన్ ప్రీ నేషనల్స్కు అర్హత సాధించారు. షేక్ సదా ఫాతిమా, గంధం ఉషశ్రీ, రేష్మ, సాయి భ్రమర, కె.హనూష, లక్షణ్య, షేక్ అజ్మల్ హుసేన్, సిద్దా ఆదిత్య, నల్లూరి సాయి మనీష్, చక్కా శ్రీమంలుత్ రైఫిల్ విభాగంలో, సత్యేంద్ర పయ్యావుల, కోడూరి వెంకట సాయి పిస్టల్ విభాగంలో అర్హత సాధించారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్ లక్ష్యంగా షూటింగ్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన స్కూలు యాజమాన్యానికి కోచ్, స్టేట్ రైఫిల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కమ్మ ఖాదర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సర్పంచుల సంఘ కన్వీనర్గా రామారావు యాదవ్ ఒంగోలు సబర్బన్: జిల్లా సర్పంచుల సంఘ కన్వీనర్గా బట్టు రామారావు యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా సర్పంచుల సంఘం కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రాచారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న పది నెలల కాలంలో సర్పంచుల సమస్యలపై స్పందించి, వాటి పరిష్కారం దిశగా పని చేయాలని నూతన కన్వీనర్కు సూచించారు. ఈ సందర్భంగా నూతన కన్వీనర్ బట్టు రామారావు యాదవ్ మాట్లాడుతూ తనపై ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. గ్రీన్ అంబాసిడర్ వేతనాలు ప్రభుత్వమే భరించాలి: గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే గ్రీన్ అంబాసిడర్ వేతనాలు గతంలోలా ప్రభుత్వమే భరించాలని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి, నూతన కమిటీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు నూతన కమిటీ కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను మర్యాద పూర్వకంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిశారు. శానిటేషన్ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల వేతనాల విషయంలో స్పందించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు లాజర్, ఎస్.మోహన్రెడ్డి, ప్రసాద్, పీ.మల్లీశ్వరి, పోశం సుమలత, సీహెచ్.విజయ, వీణ తదితరులు పాల్గొన్నారు. -
అండర్ 16 జిల్లా క్రికెట్ జట్టు ఇదే
ఒంగోలు: అండర్ 16 జిల్లా క్రికెట్ జట్టు జాబితాను జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21న స్థానిక మంగమూరు డొంకలోని ఏసీఏ సబ్ సెంటర్ నెట్స్లో నిర్వహించిన ప్రాథమిక ఎంపికకు 80 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారన్నారు. వారిలో 29 మందితో ప్రాబబుల్స్ను ఎంపిక చేశామని, వారికి బాపట్ల జిల్లా రావినూతల క్రికెట్ స్టేడియంలో ప్రాబబుల్స్ మ్యాచ్లు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారితో తుది జట్టును ఎంపిక చేశామన్నారు. ఎంపికై న క్రీడాజట్టు జూలై 3 నుంచి మంగళగిరి పేరేచర్లలో జరిగే అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఎంపిక ప్రక్రియను అధ్యక్షుడు నవీన్కుమార్, సంయుక్త కార్యదర్శి బచ్చు శ్రీనివాసరావు, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు బలరాం, కోచ్లు చంద్రశేఖర్, బాబూరావు పర్యవేక్షించారు. జట్టు: పి.సుమిత్ సందేశ్ (కెప్టెన్), ఆర్.హేమంత్రాయల్ (ఉపాధ్యక్షుడు), సీహెచ్ భవిష్, ఎస్.అభినవ్, టి.శశాంక్, డి.మార్టిన్, కె.రామ్చరణ్, ఐ.కుషీశ్వర్ శర్మ, ఎం.పృధ్వీరాజ్, ఎం.దిండు గణేష్ రామ్, సీహెచ్ సుప్రీత్, ఎం.సిద్దార్థ, జి.అరవింద్, కె.వైభవ్, జె.దినేష్, డి.కెల్విన్, స్టాండ్ బైలుగా బి.వినయ్, జి.జస్వంత్, బి.నిశాంత్, వి.రిషిక్ చక్రవర్తి. -
న్యాయమైన సమస్యలు పరిష్కరించండి
ఒంగోలు సబర్బన్: గ్రామ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లు, కోర్కెలను తీర్చకపోతే సామూహిక సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లా కేంద్రం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం అసోసియేషన్ నాయకులు, పంచాయతీ కార్యదర్శులు మధ్యాహ్న భోజన విరామ సమయం నుంచి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఒకలా ఉంటే జిల్లాలోని పంచాయతీ అధికారుల తీరు మరీ దారుణంగా ఉందంటూ అసోసియేషన్ నాయకులు ధ్వజమెత్తారు. డీపీఓకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం.బెన్హర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ కమిషనర్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్లో చెత్త సేకరణ, క్లోరినేషన్ చేసేటప్పుడు పంచాయతీ కార్యదర్శులంతా ఉదయం 6 గంటలకే గ్రామ పంచాయతీలో దినపత్రికలు చేత పట్టుకొని ఫొటోలు దిగాలి అని చెప్పటం అత్యంత దారుణమన్నారు. పంచాయతీ కార్యదర్శులకు సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వడం లేదని, అధిక భాగం నివాసానికి దూరంగా 50 నుంచి 100 కిలో మీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీలో అన్నిరకాల సర్వేలు, స్వర్ణ పంచాయతీ పనులు, ఇంటి పన్నుల వసూళ్లు, యాప్, గ్రామ సచివాలయ సర్వేలు, రెవెన్యూ పనులు, గ్రామసభలు, సమావేశాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల విధులు, ప్రొటోకాల్ విధులు, ఇలా చాలా రకాల పనులు పంచాయతీ కార్యదర్శులు మాత్రమే చేస్తున్నారని చెప్పారు. పంచాయతీ కార్యదర్శుల ప్రాథమిక విధులైన పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు సక్రమంగా నిర్వహించేందుకు సరైన సిబ్బంది లేరని, తగిన వనరులు కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులందరూ ఉద్యోగ నిర్వహణలో విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు పారిశుధ్య కార్మికులను నియమించకుండా కేవలం రూ.6 వేల గ్రామ పంచాయతీల గ్రాంట్ నుంచి పారిశుధ్య కార్మికులకు చెల్లించాలనే ఆదేశాలు ఇచ్చారన్నారు. గ్రామాల్లో రూ.6 వేలకు చెత్త సేకరణ చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితిలో పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. దీనివల్ల వారు పని భారం తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చకపోతే సామూహిక సెలవులోకి వెళతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కె.వెంకట్రావు, పి.నాగేశ్వరరావు, బి.మల్లిఖార్జున రావు, కే.జ్యోత్న, పరాశరం, విజయపాల్తో పాటు పలువురు పాల్గొన్నారు. లేకుంటే సామూహిక సెలవుకు వెనకాడం గ్రామాల్లో పనిచేయటానికి తగినంత సిబ్బందిని ఇవ్వాలి కలెక్టరేట్ ముందు పంచాయతీ కార్యదర్శుల ధర్నా -
లో గ్రేడ్ పొగాకును రూ.20 వేలకు కొనుగోలు చేయాలి
ఒంగోలు టౌన్: పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, అన్నీ రకాల లో గ్రేడ్ పొగాకును క్వింటాలుకు రూ.20 వేలకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో శనివారం రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జజ్జూరి జయంతి బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ వర్జీనియా పొగాకు రేటు రోజురోజుకూ పడిపోతుందని చెప్పారు. మేలు రకం పొగాకు మాత్రమే కొంటామని చెబుతున్న కంపెనీలు లో గ్రేడ్ పొగాకును తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లో గ్రేడ్ సాకుతో తక్కువ రేటుకు కొనుగోలు చేయాలన్న కుట్రతోనే పొగాకును తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు. దీని వలన బ్యార్నీకి రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు నష్టపోతున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పొగాకు బోర్డు, ప్రభుత్వరంగ సంస్థలు వేలంలో పాల్గొని లో గ్రేడ్ పొగాకును రూ.20 వేల కు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్కే బాబు, పెంట్యాల హనుమంతరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, తిరుపతి రెడ్డి, ముప్పరాజు బ్రహ్మయ్య, నెల్లూరు నరసింహరావు, పిల్లి తిప్పారెడ్డి, ఊసన వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓటు లేని వారు ఓటు నమోదు చేసుకోవాలి
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా ఓటు హక్కు లేని వారు తప్పనిసరిగా తమ ఓటు నమోదు చేసుకోవాలని ఒంగోలు ఆర్డీఓ కే.లక్ష్మీ ప్రసన్న చెప్పారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు లేని వారు ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారు వెంటనే ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కోరారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారి ఓట్లు తొలగిస్తామన్నారు. ఒంగోలు నియోజకవర్గ ఓటర్ల జాబితా ఎటువంటి తప్పులు లేకుండా సరిచేస్తామని, చనిపోయిన వారి ఓట్లను తొలిగించాలని అధికారులను కోరారు. పోలింగ్ బూత్లలో సౌకర్యాలు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. సలహాలు సూచనలను పార్టీల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గంలో ఆధార్ అనుసంధానం ఎంత శాతం జరిగిందని, ఆధార్ అనుసంధానం చేసుకోని వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయని అడిగారు. ఒంగోలు నగరంలో డోర్ నంబర్ల సమస్య ఉందని, నగరంలోని అన్ని డివిజన్లలో డోర్ నంబర్లు లేవని, కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి పెద్ద సమస్యగా ఉందని, వెంటనే ఒంగోలు నగరంలో డోర్ నంబర్లు వేయించాలని కోరారు. గత రాజకీయ పార్టీల సమావేశాల్లో ఒంగోలు నగరంలో డోర్ నంబర్లు వేయిస్తామని డీఆర్ఓతో పాటు ఇతర రెవెన్యూ, నగర పాలక సంస్థ అధికారులు హామీ ఇచ్చారని, ఆ పని ఎంతవరకు వచ్చిందో చెప్పాలన్నారు. చనిపోయిన వారి ఓట్లు వెంటనే తొలిగించాలని, నగరంలో కొన్ని పోలింగ్ స్టేషన్ల ప్రైవేటు స్కూల్స్లో ఉన్నాయని, ఆయా స్కూల్ యాజమాన్యాలు వాటిని తొలగించాలని కోరుతున్నాయని, ఎన్నికల కమిషన్ ఆలోచించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్కు రిపోర్ట్ చేయాలని దామరాజు క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కష్టజీవులకేది కనీస మర్యాద?
పొదిలి: రైతుల కష్టంపై వచ్చే ఆదాయంతో నిర్వహించే పొగాకు వేలం కేంద్రంలో ఆ కష్ట జీవులు కునుకు తీసేందుకు సరైన సౌకర్యం లేదు. పొదిలి వేలం కేంద్రానికి రోజూ 200 నుంచి 300 మంది రైతులు వస్తుంటారు. వేలానికి ముందు రోజు రాత్రే బేళ్లతో చేరుకునే రైతులు కునుకు తీసేందుకు ఆపసోపాలు పడాల్సిన దుస్థితి. నాపరాళ్ల అరుగులపై నడుం వాల్చేందుకు ఇష్టపడని రైతులు ఆరు బయట ఫ్లోరింగ్పై నిద్రకు ఉపక్రమిస్తున్నారు. కొందరు రైతులు కటిక నేలపై పడుకోలేక లాడ్జిలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది ఆ నాపరాళ్ల అరుగుల గదిని బీహార్ ముఠా కార్మికులకు అప్పగించడంతో స్థానిక రైతులు కునుకు తీసే అవకాశమే లేకుండా పోయింది. బోర్డు ఉన్నతాధికారులు, పాలకవర్గ సభ్యులు బస చేసేందుకు పరిపాలనా భవనంపై సర్వ హంగులతో అతిఽథి గృహం నిర్మించారు కానీ రైతులకు కనీస వసతి లేకుండా చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
క్రిటికల్ సర్జరీ.. కవలలు సురక్షితం
కంభం: నెలలు నిండక ముందే తీవ్ర రక్తస్రావంతో కంభంలోని సామాజిక ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన ఓ గర్భిణికి గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతిబాయి సర్జరీ చేసి కవల పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. గిద్దలూరు మండలం క్రిష్ణంశెట్టిపల్లి గ్రామానికి చెందిన జ్యోత్స్న అనే గర్భిణికి గురువారం అర్ధరాత్రి తర్వాత రక్తస్రావమవుతుండటంతో కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. ఆమె గర్భం దాల్చి 34 వారాలు నిండాయి. ప్రసవానికి ఇంకా ఆరు వారాల సమయం ఉంది. అయితే గురువారం రాత్రి ఒక్కసారిగా రక్తస్రావం కావడంతో ఆందోళన చెందిన ఆమె.. కుటుంబ సభ్యుల సహకారంతో ఆస్పత్రికి వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అనస్తీషియా వైద్యుడు శివనాయక్తో కలిసి గైనకాలజిస్టు సర్జరీ నిర్వహించారు. కవలలతోపాటు తల్లి క్షేమంగా ఉండటంతో వైద్యులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
పాత సామాను సొమ్ము స్వాహా..!
దర్శి (కురిచేడు): దర్శిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎస్.మాధవరావు వింతపోకడకు తెరలేపారు. ప్రభుత్వం సరఫరా చేసిన వస్తువులు మరమ్మతులకు గురైతే వాటిని ప్రభుత్వ అనుమతితో విక్రయించి వచ్చిన నగదుకు సంబంధించి ప్రభుత్వానికి లెక్కచెప్పాల్సి ఉంది. కానీ, గురుకులంలోని ఒక ఉద్యోగిని అడ్డం పెట్టుకుని గురుకుల పాఠశాలలో ఉన్న పాత ఇనుప సామగ్రి, మోటార్లు, పాత పెట్టెలు, పుస్తకాలు మొత్తం సుమారు 5 ఆటోల వరకు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అనుమతి లేకుండా మాధవరావు విక్రయించారు. వచ్చిన నగదును తన ఖాతాలో జమచేసుకుని స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీటి గురించి పాఠశాల అభివృద్ధి కమిటీకిగానీ, సొసైటీ పెద్దలకుగానీ తెలియజేయలేదని సమాచారం. పనికిరాని పాత సామగ్రినే కాకుండా పనికొచ్చే రెండు ట్రాలీలను కూడా విక్రయించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలకు వంట తయారు చేసేందుకు ఉపయోగించిన గిన్నెలను ట్రాలీపై ఉంచి నెట్టుకుని తీసుకెళ్లి అన్నం వడ్డించాలి. ఇందుకోసం పాఠశాలకు ట్రాలీలు సరఫరా చేశారు. వాటిలో రెండు ట్రాలీలను కూడా ఇన్చార్జి ప్రిన్సిపాల్ విక్రయించినట్లు సమాచారం. విద్యార్థులకు సీట్ల కేటాయింపు, తదితర విషయాల్లోనూ చేతివాటం... విద్యార్థులకు సీట్ల కేటాయింపులోనూ ఇన్చార్జి ప్రిన్సిపాల్ చేతివాటం ప్రదర్శించినట్లు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాడు–నేడు పనుల్లోనూ సరిగ్గా లెక్కలు చూపకుండా, పనిచేసిన వారికి కూలి ఇవ్వకుండా అటెండర్లు, తనకు అనుకూలమైన సిబ్బంది ఖాతాలకు నగదును ఇన్చార్జి ప్రిన్సిపాల్ బదిలీ చేసినట్లు కొందరు సిబ్బంది ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పెట్టాల్సిన చికెన్ కూడా సగం పెట్టి మిగతా సగానికి సంబంధించిన సొమ్ము స్వాహా చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. పాఠశాలలో విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యత లేకపోవడంతో తినలేక పడేస్తున్నారని, చద్దన్నం, రుచిలేని కూరలతో పెట్టడంతో కొంతమంది అనారోగ్యం పాలయ్యారని విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కొంతమంది విద్యార్థులను మచ్చిక చేసుకుని సొసైటీ వారు, జిల్లా ఉన్నతాధికారులు పరిశీలనకు వచ్చినప్పుడు వారితో ఎలా మాట్లాడాలో శిక్షణ ఇచ్చి తద్వారా పై అధికారుల వద్ద మార్కులు కొట్టేస్తున్నాడని సిబ్బంది, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో జరుగుతున్న అక్రమాలను విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న పాత్రికేయులు పాఠశాలను పరిశీలించేందుకు అనుమతి కోరగా, అవకతవకలు బయటపడతాయనే భయంతో నిరాకరించారు. పాఠశాలలో మరుగుదొడ్లను విద్యార్థులతో శుభ్రం చేయిస్తున్నారని తల్లిదండ్రులకు తెలియడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో అపరిశుభ్రత వలన అంటువ్యాధులు ప్రబలుతున్నా వైద్యపరీక్షలు చేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్పై గతంలో కలెక్టర్, డీసీఓకు కొందరు ఫిర్యాదు చేసినా అతని ప్రవర్తనలో మార్పురాలేదని, ఉన్నతాధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని సిబ్బంది తెలిపారు. సొసైటీ కార్యదర్శికి కూడా ఇటీవల ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇన్చార్జి ప్రిన్సిపాల్ అక్రమాలపై ఉన్నతాధికారులు విచారించి తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమ వద్ద ఉన్న ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తామని కొందరు సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవరావును వివరణ కోరేందుకు సాక్షి ఫోన్ చేయగా, ఆయన సమాధానం ఇవ్వలేదు. దర్శి గురుకుల విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపాల్ వింతపోకడ విద్యాలయంలోని పాత సామగ్రి విక్రయించగా వచ్చిన సొమ్ము కాజేసినట్లు ఆరోపణలు ముక్కున వేలేసుకుంటున్న సిబ్బంది -
బ్యాంకర్లు విరివిగా రుణాలివ్వాలి
ఒంగోలు సబర్బన్: రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహరించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని సమావేశం హాలులో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతులకు, అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, పీఎం సూర్యఘర్ యోజన పథకం లబ్ధిదారులకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.25,045.91 కోట్లుగా నిర్ణయించినట్లు చెప్పారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.20,591.18 కోట్లుగా నిర్ణయించగా, 2025 మార్చి 31వ తేదీ నాటికి రూ.25,444.91 కోట్ల రుణాలు అందజేశారన్నారు. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో పంట రుణాలకు సంబంధించి ఖరీఫ్లో రూ.4197.42 కోట్లు, రబీలో రూ.6040 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారన్నారు. జిల్లాలో పశు, మత్స్య సంపదను వృద్ధి చేసేలా రుణాలు అందజేయాలని కోరారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రమేష్, డీఆర్డీఏ, మెప్మా పీడీలు నారాయణ, శ్రీహరి, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాసులు, రవి కుమార్, శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున నాయక్, సీపీడీసీఎల్ ఎస్.ఈ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అన్ని జిల్లా బ్యాంకు కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి బ్యాంకుల రుణ లక్ష్యం రూ.25,045.91 కోట్లు బ్యాంకర్ల కమిటీ సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా -
దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు
ఒంగోలు సబర్బన్: టిడ్కో ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి పి.నారాయణ తెలిపారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన కార్యకలాపాలపై సమీక్షించేందుకు శుక్రవారం ఆయన ఒంగోలు వచ్చారు. ప్రకాశం భవనంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి సమీక్షించారు. అనంతరం సంబంధిత వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. టిడ్కో ఇళ్లను 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణమైనవిగా మూడు కేటగిరీలుగా చేపట్టినట్లు చెప్పారు. వీటిలో 365, 430 చదరపు అడుగుల ఇళ్లను ముందుగా పూర్తిచేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో మరో 15 రోజుల్లో ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు నిర్మాణ పనులు చేపడతారని ఆయన వెల్లడించారు. ఒంగోలులో రోడ్డు విస్తరణ వలన నష్టపోయే వారికి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని ప్రకటించారు. సమీక్షలో మార్కాపురం ఎమ్మెల్యే కె.నారాయణరెడ్డి, ఒంగోలు నగర మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్కు అభినందనలు ఒంగోలు సబర్బన్: కలెక్టర్గా ఏడాది కాలం పూర్తి చేసుకున్న ఏ.తమీమ్ అన్సారియాను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో కలిసిన రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావు ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఉద్యోగులకు అండగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు. కలెక్టర్ను అభినందించిన వారిలో ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావుతో పాటు జిల్లా కోశాధికారి ఊతకోలు శ్రీనివాసరావు, కలెక్టరేట్ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, ప్రశాంత్, ఏపీ జేఏసీ ఉమెన్ వింగ్ చైర్మన్ జయలక్ష్మి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ నాగలక్ష్మి, కలెక్టరేట్ సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. ఒంగోలులో రోడ్డు విస్తరణలో నష్టపోయే వారికి టీడీఆర్ బాండ్స్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ ఏడాది కాలం పూర్తి చేసుకున్నందుకు అభినందించిన రెవెన్యూ అసోసియేషన్ నాయకులు -
రైతు కడుపు మండి..
మద్దిపాడు/కొండపి: గతేడాది వరకూ పొగాకు రైతుకు స్వర్ణయుగం. నాలుగేళ్లుగా లాభాలు చవిచూశారు. బోర్డు నిర్దేశించిన దాని కంటే అదనంగా సాగు చేసినా మంచి ధరలే వచ్చాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి మార్క్ఫెడ్ను రంగంలోకి దించి వ్యాపారుల ఆధిపత్యానికి గండికొట్టింది. ఇక తప్పకపోవడంతో పోటీలు పడి మరీ పొగాకు కొనుగోలు చేశారు. గతేడాది పొగాకు చరిత్రలో రికార్డు ధర కేజీకి రూ.366 పలికింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019 ముందు చరిత్ర పునావృతమైంది. కంపెనీలు రైతులను దగా చేయడం మొదలెట్టేశాయి. సాగు సమయంలో మీరు ఎంతైనా చేయండి అంటూ నమ్మబలికి కొనుగోలు సమయానికి అసలు స్వరూపాన్ని చూపించాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఆర్భాట ప్రకటనలకే పరిమితమవుతోంది. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామంటూ మాయమాటలు చెబుతోంది. గురువారం వెల్లంపల్లి, కొండపి మండలాల్లో రైతుల నిరసనలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. వేలాన్ని బహిష్కరించి రైతులు రోడ్డెక్కారు. వెల్లంపల్లి వేలం కేంద్రం పరిధిలోని రైతులు జాతీయ రహదారిపై మద్దిపాడు వద్ద రాస్తారోకో నిర్వహించగా, కొండపి వేలం కేంద్రం పరిధిలోని రైతులు కొండపి–టంగుటూరు రహదారిపై ఆందోళనకు దిగారు. ఆ వివరాలిలా ఉన్నాయి... మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రానికి ముండ్లమూరు క్లస్టర్ రైతులు గురువారం బేళ్లను తీసుకొచ్చారు. ధర పూర్తిగా తగ్గించి కొనుగోలు చేయడంతో పాటు ఎక్కువ శాతం నోబిడ్ కావడంతో రైతులు తీవ్ర స్థాయిలో అసంతృప్తికి గురయ్యారు. కంపెనీలన్నీ కుమ్మకై ్క ధరలు పూర్తిగా దిగ్గోయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోకి రూ.220 ఇస్తామని చెప్పిన కంపెనీలు.. రూ.180కి తగ్గించడం, ఆ తర్వాత రూ.160కి కొనుగోలు చేస్తామని చెప్పడం, చివరకు రూ.125కి కొనుగోలు చేయడంతో రైతులు వేలాన్ని బహిష్కరించారు. జాతీయ రహదారిపైకి చేరుకుని రాస్తారోకో చేశారు. పొగాకు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై రెండువైపులా ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో మద్దిపాడు పోలీసులు చేరుకుని రైతులను పక్కకు తరలించేందుకు ప్రయత్నించారు. తమకు న్యాయం జరిగేంత వరకూ జాతీయ రహదారిపైనే ఉంటామని రైతులు స్పష్టం చేయడంతో బోర్డు అధికారులతో పోలీసులు మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో ధర్నా విరమించి వేలం కేంద్రానికి చేరుకున్నారు. ఆర్ఎం లక్ష్మణరావుతో పొగాకు రైతు సంఘ నాయకులు అబ్బూరి శేషగిరిరావు, రామసుబ్బారెడ్డి, పల్లకి సత్యన్నారాయణరెడ్డి, పొగాకు రైతులు మాట్లాడారు. కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి తిరిగి వేలాన్ని ప్రారంభించారు. కానీ, కంపెనీల తీరు మారకపోవడం, ఐదు బేళ్లకుగానూ ఒకటి కొనుగోలు చేస్తూ మిగిలినవి నోబిడ్ చేస్తుండడంతో రైతులు మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. వేలాన్ని నిలిపివేయాలని గట్టిగా కేకలు వేయడంతో కంపెనీల బయ్యర్లు పక్కకు వెళ్లిపోయారు. కంపెనీలకు బోర్డు అధికారులు మద్దతుగా నిలుస్తున్నారంటూ రైతులు వాగ్వాదానికి దిగారు. ఈరోజు కొనని కంపెనీలు రేపైనా కొంటాయా అంటూ ఆర్ఎం మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడిన ఆర్ఎం, వేలం సూపరింటెండెంట్ సత్య శ్రీనివాస్లు వేలాన్ని నిలిపివేసి శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయలేదని... కొండపి పొగాకు వేలం కేంద్రానికి క్లస్టర్ పరిధిలోని జువ్విగుంట, అయ్యవారిపాలెం, తంగెళ్ల, జాళ్లపాలెం, పీరాపురం గ్రామాల రైతులు గురువారం వేలానికి పొగాకు బేళ్లు తీసుకొచ్చారు. ఆరు రౌండ్లు వేలానికి బ్రైట్ రకం పొగాకు బేళ్లను తీసుకొచ్చిన రైతులు.. అవి అయిపోవడంతో ఏడో రౌండ్లో లో గ్రేడ్ పొగాకు తీసుకొచ్చారు. లో గ్రేడ్ పొగాకును కనిష్ట ధర కేజీ రూ.160కి కూడా కొనుగోలు చేయకపోగా, బేళ్లను వ్యాపారులు తిరస్కరించడంతో వేలాన్ని బహిష్కరించి రైతులు ఆందోళనకు దిగారు. లో గ్రేడ్ పొగాకు బేళ్లను కూడా కొనుగోలు చేయాలంటూ వేలం కేంద్రం ఎదురుగా కొండపి–టంగుటూరు రహదారిపై బైఠాయించారు. ఇరువైపులా కిలోమీటర్ మేరకు వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు చేరుకున్నారు. ధర్నా విరమించాలని రైతులను కోరగా ససేమేరా అన్నారు. వేలం నిర్వహణ అధికారి జి.సునీల్ కుమార్, సిబ్బంది కలిసి రైతులతో చర్చల జరిపి లో గ్రేడ్ పొగాకు కూడా కొనుగోలు చేసే విధంగా బయ్యర్లతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వ్యాపారులు సిండికేటై ధరలు దిగ్గోస్తున్నారని ఆరోపించారు. సాగుచేసిన పొగాకులో 40 శాతం వరకు బ్రైట్ గ్రేడ్ పొగాకు పండిందని, ఇప్పటివరకు దానినే వేలానికి తీసుకొచ్చామని తెలిపారు. ఏడో రౌండ్ వేలానికి తమ వద్ద ఉన్న లో గ్రేడ్ పొగాకు తీసుకొచ్చామని, కానీ, కేజీ కనిష్ట ధర రూ.160 కూడా ఇవ్వకుండా వ్యాపారులు సిండికేట్గా మారి కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అప్పుల్లో కూరుకుపోయామని ఆవేదన చెందారు. ఏడో రౌండ్లో అయినా గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశిస్తే.. వచ్చిన బేళ్లను వ్యాపారులు తిరస్కరిస్తున్నారని వాపోయారు. గత ప్రభుత్వం ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ను రంగంలోకి దించి రైతులను ఆదుకుందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి రైతుల బాధలు పట్టడం లేదని విమర్శించారు. ధరలు తగ్గించేస్తూ నిలువు దోపిడీ ఈ సీజన్లో కనిష్ట ధర రూ.125 ఇలా అయితే ఆత్మహత్యలే గతి వెల్లంపల్లి, కొండపి కేంద్రాల్లో వేలం బహిష్కరించి రాస్తారోకోలు మద్దిపాడులోని జాతీయ రహదారిపై పొగాకు దహనం కొండపి–టంగుటూరు రహదారిపై ఆందోళన బోర్డు అధికారులు, కంపెనీల తీరుపై నిరసన రెండు చోట్లా భారీగా నిలిచిపోయిన వాహనాలుఆత్మహత్యలు చూడాల్సి వస్తుంది... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి ప్రభుత్వ రంగ సంస్థలతో పొగాకు కొనుగోలు చేయించి రైతులను ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందని పలువురు రైతులు హెచ్చరించారు. పచ్చాకు కూలీలకు, డ్రైవర్లకు నగదు ఇవ్వలేదని, వారు తమ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఏడో రౌండ్ వరకు వేచి చూడాలని వారిని బతిమిలాడుకున్నామన్నారు. ఏడో రౌండ్లో కూడా గిట్టుబాటు ధర లభించకపోవడంతో కూలీలకు, డ్రైవర్లకు ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు. లేబర్ యాక్ట్ కింద కేసులు పెడతామని వారు బెదిరిస్తున్నారన్నారు. పాలకులు ఇలాంటి దారుణ పరిస్థితులు తమకు కలిపిస్తున్నాయని వాపోయారు. ఇప్పటికై నా వారు పొగాకు రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘ జిల్లా నాయకులు గుల్లపల్లి వెంకట్రావు, రమణారెడ్డి, వెంకటరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక
ఒంగోలు: ఫెన్సింగ్ రాష్ట్రస్థాయి పోటీలకు పలువురు క్రీడాకారులు ఎంపికయ్యారు. స్థానిక మినీ స్టేడియంలో గురువారం అండర్ 10, అండర్ 12 విభాగాల్లో ఎంపిక ప్రక్రియ జరిగింది. బి.వెంకట సౌమ్య, డి.షణ్ముక ప్రియ, ఉజ్జయిని అల్లం, సీహెచ్ జైత్ర, డి.చరణ్ సాయి ఫణీశ్వర్, టి.వెంకట అలితేష్ చౌదరి ఎంపికై నట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు, కోచ్ రాజు, జి.అనీల్లను ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కూనపరెడ్డి శివశంకర్ అభినందించారు. చెక్బౌన్స్ కేసులో జైలుశిక్ష ఒంగోలు: చెక్ బౌన్స్ కేసులో 6 నెలల జైలుశిక్ష విధిస్తూ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి షేక్ రోషన్ గురువారం తీర్పునిచ్చారు. కుటుంబ అవసరాల నిమిత్తం టి.ఎలిజబెత్ రాణి అనే మహిళ 2014లో తన వద్ద రూ.5 లక్షలు తీసుకున్నారని, బాకీ చెల్లింపు నిమిత్తం 2017లో రూ.6.20 లక్షలకు తనకు చెక్కు ఇచ్చినట్లు జె.రమేష్బాబు న్యాయస్థానంలో ఫిర్యాదుచేశారు. కేసు పూర్వాపరాలను విచారించిన న్యాయమూర్తి నిందితురాలు ఎలిజెబెత్ రాణిపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ ఆరు నెలల జైలుశిక్ష, రూ.7.10 లక్షల పరిహారం, జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చారు. 194 మద్యం బాటిళ్లు స్వాధీనం కంభం: మండలంలోని తురిమెళ్ల గ్రామంలోని బెల్టుషాపులపై గురువారం ఎకై ్సజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాడిలో రాజేంద్ర అనే వ్యక్తి వద్ద 194 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ కొండారెడ్డి తెలిపారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి సదరు వ్యక్తిని గిద్దలూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచామన్నారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సిబ్బంది రంగనాయకులు, శివాజీ, బాష, షంషీర్, రాజగోపాల్ పాల్గొన్నారు. -
కలెక్టర్ను అభినందించిన ఎన్జీఓ నాయకులు
ఒంగోలు సబర్బన్: జిల్లా కలెక్టర్గా ఏ.తమిమ్ అన్సారియా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో కలిసిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.శరత్బాబు, కార్యదర్శి ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కె.శరత్బాబు బంగారు బాల్యం కార్యక్రమానికి స్కొచ్ అవార్డ్ సాధించి దేశంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారని, భవిష్యత్లో కూడా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తారన్నారు. కార్యక్రమంలో ఒంగోలు పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి మంజేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు పి.రామాంజనేయులు, సంయుక్త కార్యదర్శి షేక్ మోమిన్, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి.మాధవి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కె.కోటేశ్వరమ్మ, ఒంగోలు పట్టణ ఉపాధ్యక్షులు షేక్ కరీముల్లా, వి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి కట్టడికి చర్యలు
ఒంగోలు టౌన్: గంజాయి కట్టడి విషయంలో నిర్లక్ష్యం వద్దని, గంజాయి అరికట్టేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో గురువారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న హత్య, పోక్సో, లైంగిక దాడులు, ఆర్థిక నేరాలు, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలతో పాటుగా పెండింగ్ కేసులు, ఎన్ఫోర్సుమెంట్ విషయాలపై సమీక్షించారు. పోలీస్స్టేషన్ల వారీగా కేసుల నమోదు, నిందితుల అరెస్టు, విచారణకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల సేవించడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలన్నారు. గంజాయి వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాలు ఎక్కువైపోతున్న క్రమంలో ప్రజలు సైబర్ నేరాల బారిన పడి నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో సైబర్ నేరాలపై అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. చోరీ కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు, సొత్తు రికవరీకి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. దొంగతనాలు, దోపీడీలపై గట్టి నిఘా వేయాలని, నైట్ బీట్స్ బలోపేతం చేయాలని, నిత్యం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా పాత నేరస్తులు, చెడు నలత కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ సైన్ బోర్డులు, బారికేడ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. యాక్సిడెంట్కు సంబందిచిన ఎఫ్ఏఆర్, ఐఏఆర్, డీఏఆర్ రిపోర్టులను నిర్ణీత కాలవ్యవధిలో ఎంఏసీటీ కోర్టుకు పంపించాలని, విస్తృతంగా ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించాలన్నారు. పోక్సో కేసులపై కాలేజీలు, పాఠశాలలో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని, పిల్లలకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ల గురించి అవగాహన కల్పించాలన్నారు. రానున్న లోక్అదాలత్లో వీలైనంత ఎక్కువ కేసులను రాజీ చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు. పోలీసు అధికారులు , సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరించాలని, అంకితభావంతో పనిచేయాలని చెప్పారు. సమర్ధవంతమైన సేవల ద్వారా పోలీసు శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. నేర సమీక్షలో డీఎస్పీలు నాగరాజు, లక్ష్మీ నారాయణ, రమణ కుమార్, డీసీఆర్బి సీఐ దేవ ప్రభాకర్, ఐటీకోర్ సీఐ సూర్యనారాయణ, ఎస్సీ ఎస్టీ సెల్ సీఐ దుర్గా ప్రసాద్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు
ఒంగోలు టౌన్: కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరక విధానాలపై పోరాటం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ వర్కర్స్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో గురువారం ఫెడరేషన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 9వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానలను అవలంబిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయిందని, కార్మికులకు 10 గంటల పనిదినాలను ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. మహిళల హక్కులకు భంగం కల్పిస్తూ రాత్రి వేళల్లో డ్యూటీలు వేయడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదని, దీన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని కోరారు. బ్రిటీష్ కాలం నుంచి అమలవుతున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ను అమల్లోకి తీసుకురావడం ద్వారా కార్మికుల శ్రమశక్తిని కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా చేస్తుందని విమర్శించారు. టి. విజయమ్మ, కె. పద్మ, అనిత, సుబ్బరాయుడు, ఆర్.శ్రీనివాసరావు, పోకల కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆగని పచ్చమూకల ఆగడాలు
మర్రిపూడి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో ఆ పార్టీ నేతల దౌర్జన్యాలు శృతిమించుతున్నాయి. గ్రామ కంఠ భూమిని తెలుగుదేశం సానుభూతిపరులు యథేచ్ఛగా ఆక్రమించి శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వెంకటకృష్ణాపురం సర్వే నంబర్ 15లో 9.92 ఎకరాల గ్రామకంఠం భూమి ఉంది. అందులో 0.51 సెంట్ల భూమిలో అదే గ్రామానికి చెందిన బొట్లగుంట సత్యన్నారాయణ, బొట్లగుంట వెంకట కృష్ణయ్య కుమారులు శ్రీను, తిరుపాలు కొన్ని దశాబ్దాలుగా గడ్డివాములు, పశువులు, గేదెలను మేపుకుంటూ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కొండూరి వెంకటేశ్వర్లు కుమారుడు శ్రీను గ్రామకంఠాన్ని ఆక్రమించి శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్నాడు. ఆ గ్రామ కంఠం భూమిపై టీడీపీ శ్రేణుల కన్ను పడిందని, ఆక్రమించేందుకు గుంటలు తీస్తున్న తురుణంలో ఈ నెల 16న గ్రామకంఠంస్వాహా అనే శీర్షికను సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. అయినా అధికారులు, పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరించారు. ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతగురువారం గ్రామ కంఠం భూమిలో శాశ్వత కట్టడాలు నిర్మించేందుకు పిల్లర్లు తీసి అడ్డబీములు సైతం వేస్తున్నారు. పిల్లర్లు, అడ్డబీములు పోసేందుకు గ్రామంలో కూలీలు ఎవరు రాకపోవడంతో పక్క ప్రాంతాల నుంచి కూలీలను పిలిపించారు. అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారన్న విషయం తెలుసుకున్న హక్కుదారులు అక్రమ కట్టడాలను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టుకోవడంతో మహిళ కింద పడిపోయింది. ఈ పరిస్థితుల్లో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా అధికారులెవ్వరూ ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తరాల నుంచి అనుభవిస్తున్న నా భూమిని కొండూరి వెంకటేశ్వర్లు, కొండూరి శ్రీనులు దౌర్జన్యంగా ఆక్రమించి అక్రమ కట్టడాలు కడుతున్నారని, విచారించి తగు న్యాయం చేయాలంటూ వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన బొట్లగుంట శ్రీను తహసీల్దార్ బి.జనార్ద్కు వినతిపత్రం అందజేశారు. గ్రామ కంఠాన్ని ఆక్రమించి శాశ్వత కట్టడాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని తహసీల్దార్కు బాధితుల ఫిర్యాదు అధికారం అండగా పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. ఆ మూకల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అన్నీ తెలిసినా అధికారులెవ్వరూ వారి దౌర్జన్యాలకు అడ్డుకోలేకపోతున్నారు. మండలంలోని వెంకటకృష్ణాపురంలో గ్రామకంఠం భూములే ఇందుకు ఉదాహరణ. గ్రామకంఠం భూములు ఆక్రమించి శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్నా అధికారులెవ్వరూ ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. -
సచివాలయ ఉద్యోగుల ఆందోళన
మార్కాపురం టౌన్: విధులకు హాజరైనా మున్సిపల్ కమిషనర్ జీతాలు కట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, న్యాయం చేయాలని పట్టణ పరిధిలోని వార్డు సచివాలయ ఉద్యోగులు గురువారం సబ్కలెక్టర్ త్రివినాగ్కు వినతిపత్రం అందచేశారు. విధులకు హాజరైనా జీతాలు కట్ చేయడం శోచనీయమన్నారు. ఇలా అయితే తామెలా ఉద్యోగాలు చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. వేతనాలు ఎందుకు కట్చేశారని కమిషనర్ను అడిగితే నో వర్క్..నో పే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం సమంజసం కాదని వారు సబ్కలెక్టర్కు తెలిపారు. సచివాలయ ఉద్యోగుల అరియర్స్, బిల్లులపై సంతకాలు చేసేందుకు బిల్లును బట్టి తమకు పర్సంటేజీలు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న గుమస్తా డిమాండ్ చేయడాన్ని సబ్కలెక్టర్ ఎదుట ఉద్యోగులు వాపోయారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మార్కాపురం మున్సిపల్ కమిషనర్ సిబ్బందిపై నిరంకుశధోరణితో వ్యవహరిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. మే నెలలో కొన్ని సచివాలయాల్లో పనిచేస్తున్న వీఆర్ఓలకు జీతాలు తగ్గించారన్నారు. విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. -
డ్రగ్స్ రహిత జిల్లాగా ప్రకాశం
ఒంగోలు టౌన్: డ్రగ్స్ రహితంగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దుకునేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్ నుంచి అద్దంకి బస్టాండు సెంటర్ వరకు భ్యారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 8 వేలమందికిపైగా విద్యార్థులు, యువకులు, వివిధ శాఖల ఉద్యోగులు హాజరయ్యారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసంగిస్తూ దేశానికి సంపద వంటి యువత డ్రగ్స్కు బానిసలుగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రతిన పూనాలన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని విద్యార్థులు, యువకులకు సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని చెప్పారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రసంగిస్తూ సరదాగా మత్తుపదార్థాలు వాడి ఆ తర్వాత వాటికి అలవాటైపోతున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఒకసారి డ్రగ్స్ వినియోగానికి అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని, చివరికి జైలుకు వెళ్లడం, ఉద్యోగావకాశాలు కోల్పోవడం దాకా పరిస్థితులు తీసుకెళ్తాయని చెప్పారు. పాస్ పోర్ట్లు, వీసాల వంటివి రావని, సమాజంలో గౌరవం కోల్పోతారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వాడకూడదని సూచించారు. రానున్న రోజుల్లో ప్రతి పాఠశాల, కళాశాలల్లో కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే దుష్ఫలితాలు వివరించేలా పెద్ద ఎత్తును అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారిని డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించడం జరుగుతుందన్నారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణ, గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం ఐజీ నేతృత్వంలో ప్రతి జిల్లాలో 30 మందితో ఈగిల్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటి వరకు 41 కేసులు నమోదు చేసి 220 మందిని గుర్తించి జైలుకు పంపించడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారి ప్రవర్తనలో మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్పై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972, స్థానిక పోలీసులు, డయల్ 112, పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఈఎస్ షేక్ ఆయేషా బేగం, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్, డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, నాగరాజు, రమణ కుమార్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగంపై కష్టనష్టాలను వివరిస్తూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం -
అబద్ధాలు చెప్పడం బాబుకు అలవాటు
ఒంగోలు సిటీ: అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటని, ఏడాదిలో ఏం చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది అని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జనాలను ఉద్ధరించానని చెప్పుకోవడానికి ఒక్క పథకం అయినా ఉందా అని ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెబితే బాగుండేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతుల కోసం జిల్లా పర్యటనకు వచ్చి ప్రభుత్వాన్ని నిద్ర లేపారని, దీంతో కేంద్రమంత్రి పీయూష్గోయల్, కేంద్ర మంత్రి కార్యదర్శులు ఒంగోలు పొగాకు బోర్డుకు దిగివచ్చి సమావేశాలు పెట్టి పొగాకు కొనుగోలు చేస్తామని చెప్పారన్నారు. కానీ ఇంత వరకు పొగాకు రైతులకు ఒనగూరిన ప్రయోజనం ఏంలేదన్నారు. లోగ్రేడ్ పొగాకును కేంద్ర ప్రభుత్వం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం వేసుకొని కొనుగోలు చేస్తామని చెప్పారని, కానీ ఇంత వరకు మార్కెట్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చిన్న చిన్న సంఘటనలను పెద్దవి చేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డికి వస్తున్న లక్షలాది ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక ఇటువంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. ఓ పక్క చంద్రబాబు, పవన్కల్యాణ్లు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ మరో పక్క మాపైనే నిందలు వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, పవన్కళ్యాణ్ మాట్లాడే భాషలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. గంజాయి విచ్చలవిడిగా రవాణా అవుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. గంజాయి మత్తులో బ్యాచ్ ఒక సీఐపై దాడి చేశారని, ఇళ్ల మీదకు వెళ్లి ఆడపిల్లలపై దాడి చేస్తున్నారని, ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. గంజాయి అమ్మినవాడిని పట్టుకుంటే ఎవరు సరఫరా చేస్తున్నారో తెలియదా.. పోలీసులు తలుచుకుంటే ఎంత పని అన్నారు. టీడీపీ వారే గంజాయి వ్యాపారం చేస్తున్నారని, అందుకే పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఇమ్రాన్ఖాన్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు -
సాయం చేసేవారిని గుర్తించాలి
ఒంగోలు సబర్బన్: పీ–4 సర్వేలో గుర్తించిన కుటుంబాలకు సాయం చేసేవారిని సంప్రదించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ప్రకాశం భవనం నుంచి మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కనిగిరి ఆర్డీవో కేశవర్దన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా హోదాతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్నవారంతా బంగారు కుటుంబాలను (పీ–4 సర్వేలో తేల్చిన కుటుంబాలు) దత్తత తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సదరు ఉద్యోగి, అధికారి బదిలీ అయినప్పటికీ ఆ హోదాలోకి వచ్చినవారు ఆయా కుటుంబాల యోగక్షేమాలను పర్యవేక్షించాల్సి ఉంటుందని తెలిపారు. వెట్టి చాకీరి నుంచి విముక్తి పొందిన కుటుంబాలను తాను దత్తత తీసుకుని ఈ పథకం కింద వారికి తాను మార్గదర్శిగా ఉండాలని నిర్ణయించుకున్నానని కలెక్టర్ వెల్లడించారు. మార్గదర్శిగా ఉండటంలోనూ, మార్గదర్శకులను గుర్తించడంలోనూ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 74 వేలకుపైగా బంగారు కుటుంబాలను ప్రాథమికంగా గుర్తించామన్నారు. వీరి అవసరాలను గుర్తించడంతోపాటు వాటిని సమకూర్చి ఆయా కుటుంబాలకు అండగా ఉండే మార్గదర్శకులను కూడా త్వరగా గుర్తించాలన్నారు. సహాయం చేసేందుకు ముందుకు వచ్చే ఎన్ఆర్ఐలు, ఇతర ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించాలన్నారు. ఎన్ని కుటుంబాలనైనా దత్తత తీసుకోవచ్చని, బంగారు కుటుంబం, మార్గదర్శకుల వివరాలను వెబ్సైట్లో ఏ విధంగా నమోదు చేయాలో జెడ్పీ సీఈవో చిరంజీవి వివరించారు. వీడియో కాన్ఫరెన్సులో డీఆర్ఓ బి.చినఓబులేసు, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, డీఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ ఎస్.శ్రీనివాస నాయక్, డీఎస్ఓ పద్మశ్రీ, ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, డీఆర్డీఏ పీడీ నారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకర్రావు, జిల్లా బీసీ సక్షేమ అధికారి నిర్మల జ్యోతి, గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పీ–4 పథకానికి ఎన్ఆర్ఐలు, ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించాలి మార్గదర్శకులను గుర్తించడంలో అధికారులు వేగం పెంచాలి అధికారులు కూడా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి కలెక్టర్ తమీమ్ అన్సారియా -
అరకొర వసతులతో కౌన్సెలింగ్
ిసంగరాయకొండ: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకు స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్కు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. అయితే వందల సంఖ్యలో వచ్చిన వారికి సరైన వసతులు కల్పించడంలో గురుకుల పాఠశాల యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యవైఖరి అవలంబించారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. వచ్చిన వారి కోసం చాలీచాలని షామియానా వేశారు. కనీసం కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో చెట్ల కింద పడిగాపులు కాయాల్సి వచ్చింది. పాఠశాలలో తరగతి గదులు ఖాళీగా ఉన్నా ఆ గదుల్లో వసతులు కల్పించకుండా ఎండకు వదిలేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బందులు పడిన విద్యార్థులు, తల్లిదండ్రులు -
కలల సాకారానికి చదువే మార్గం
పుల్లలచెరువు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. మండలంలోని నరజాములతండాలో గురువారం పర్యటించి పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉన్న మౌలిక వసుతులు, విద్యార్థులకు అందచేసిన కిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల నోట్పుస్తకాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అధునిక పద్ధతిలో బోధన చేయాలని సూచించారు. ప్రస్తుతం విద్యార్థుల భవిష్యత్కు చక్కటి అవకాశాలు ఉన్నాయని, కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు సులభ మార్గాలు ఉన్నాయని సూచించారు. ప్రతి విద్యార్థి కలలు కని, వాటిని నిజం చేసుకోవాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. ప్రతి రోజు విద్యార్థులను పాఠశాలలకు పంపేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. సబ్కలెక్టర్ వెంకట త్రివినాగ్, డీఎఫ్ఓ సందీప్కృపాకర్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, సర్పంచ్ బాలునాయక్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ -
కోలుకోని ధరలు!
మాటల్లో కొనుగోలు..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ధరల కోసం రైతులు ఆందోళన చేశారు. పొగాకు బేళ్లను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలికి వచ్చి పొగాకు రైతులను పరామర్శించారు. జగన్ పొదిలి పర్యటనకు వచ్చిన స్పందనను చూసి పాలక పక్షం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దింపుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయశాఖ మంత్రి మార్క్ఫెడ్ కేంద్రాలను ప్రారంభించేశాం రైతులకు మంచి ధర వస్తుందంటూ ప్రకటనలు చేశారు. నాలుగు రోజులుగా రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో అమ్మకాలు జరుగుతున్న తీరును ఒక్కసారి పరిశీలిస్తే ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. కనిష్ట ధరలు రోజు రోజుకూ పతనమవుతున్నాయి. జిల్లాలోని పలు వేలం కేంద్రాల్లో బుధవారం పొగాకు కొనుగోళ్లు కనిష్ట ధర కేవలం రూ.160 వద్ద పలికింది. గరిష్ట ధర ఏదో మొక్కుబడిగా 10–15 బేళ్లకు మాత్రం రూ.280 చూపిస్తున్నారు. దాదాపు 70 శాతం పొగాకు బేళ్లకు కనిష్ట ధరతోనే రైతులు సర్దుకోవాల్సి వచ్చింది. బుధవారం కొనుగోలు చేసిన బేళ్ల వివరాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. నల్లరేగడి నేలలకు సంబంధించిన వేలం కేంద్రాలు వెల్లంపల్లి–2, ఒంగోలు–1, 2, టంగుటూరు–1, కొండపికి మొత్తం 5,452 బేళ్లు రాగా వాటిలో నోబిడ్ పేరుతో 1558 బేళ్లను తిరస్కరించారు. కొనుగోలు చేసిన బేళ్లకు కనిష్ట ధర రూ.160, గరిష్ట ధర రూ.280 పలికింది. సరాసరి ధర రూ.233.24 పలికింది. అదే విధంగా తేలికరకం నేలలు కలిగిన వేలం కేంద్రాలైన పొదిలి–1, కనిగిరి, కందుకూరు–1,2, కలిగిరి, డీసీపల్లిలో 5,394 బేళ్లు రాగా వాటిలో 1437 బేళ్లను తిరస్కరించారు. మిగిలిన బేళ్లకు కనిష్ట ధర రూ.160, గరిష్ట ధర రూ.280, సరాసరి ధర రూ.232.08 పలికింది. 6 రౌండ్లు పూర్తయినా లభించని గిట్టుబాటు ధర కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం ఆరో రౌండ్ పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. గురువారం నుంచి 7వ రౌండ్ కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు వేలం కేంద్రంలో 6.24 మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగాయి. ఇప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర లభించక కూలీలకు, కౌలు ఇంత వరకు నగదు చెల్లించలేదని రైతులు వాపోతున్నారు. రైతుల దగ్గర ఉన్న లో గ్రేడు పొగాకును రూ.180 నుంచి రూ.160కి తగ్గించిన వ్యాపారులు ఆ ధరకు కూడా నామమాత్రంగా బేళ్లను కొనుగోలు చేసి ఎక్కువ భాగం తిప్పి పంపుతున్నారు. ఒకే రోజు పొగాకు కేజీకి రూ.20 తగ్గింపు టంగుటూరు: పొగాకు వేలం కేంద్రంలో ఒకే రోజు కనిష్ట ధర రూ.20 తగ్గించి కేజీ రూ.160కి వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో రైతులు విస్మయం వ్యక్తం చేశారు. అసలే ఈ ఏడాది నష్టాలు పాలవుతున్నామని, దీనికి తోడు రోజు రోజుకీ ధరలు దిగజారుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో 205 పొగాకు బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ వేలంలో మొత్తం 25 మంది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. పడిపోతున్న పొగాకు కనిష్ట ధరలు మార్క్ఫెడ్ను రంగంలోకి దించామంటూ హడావుడి ధరల పెరుగుదలలో కానరాని మార్పు కేజీ పొగాకు కనిష్ట ధర రూ.160 కి పతనం పెరుగుతున్న తిరస్కరణకు గురవుతున్న బేళ్ల సంఖ్య బుధవారం ఒక్కరోజే 3 వేల బేళ్లు వెనక్కి ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులు నాలుగు నెలలు దాటుతున్నా 52 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోళ్లుపెరుగుతున్న రిటన్ బేళ్ల సంఖ్య..పొదిలి వేలం కేంద్రంలో రోజు రోజుకూ రిటన్ బేళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక వైపు ధరలు లేక రైతులు దిగాలు పడుతుండగా మరో వైపు రిటన్ బేళ్లతో మరింత గుబులు పడుతున్నారు. బుధవారం వేలానికి 1197 బేళ్లు వచ్చాయి. వాటిలో 620 మాత్రమే కంపెనీల వారు కొనుగోలు చేశారు. పలు కారణాలతో 580 తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో 499 బేళ్లు నోబిడ్గా తిరస్కరించారు. 20 కంపెనీల ప్రతినిధులు వేలంలో పాల్గొన్నారు. కనిగిరి బోర్డులో బుధవారం సీతారంపురం (తురకపల్లి) క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులు 705 బేళ్లను యార్డుకు తెచ్చారు. అందులో 365 బేళ్లు కొనుగోలు చేయగా, 340 పొగాకు బేళ్లను తిరస్కరించారు. ఈ కేంద్రం పరిధిలో ఇప్పటి వరకూ 3.1 మిలియన్ కేజీల పొగాకును మాత్రమే కొనుగోలు చేశారు. కొండపి వేలం కేంద్రానికి వెన్నూరు చిన్న వెంకన్నపాలెం గ్రామాలకు చెందిన రైతులు 965 బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. అందులో 687 బేళ్లు కొనుగోలయ్యాయి. 278 బేళ్లను తిరస్కరించారు. వేలంలో 24 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే టంగుటూరు కేంద్రానికి వేలం కేంద్రానికి దావగూడూరు, చింతలపాలెం గ్రామాలకి చెందిన రైతులు వేలానికి 895 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 690 కొనుగోలు చేశారు. 205 పొగాకు బేళ్లు తిరస్కరించారు. -
వీఆర్ఏలపై అదనపు భారం తగదు
ఒంగోలు టౌన్: వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అదనపు భారంతో అల్లాడిస్తోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గెంటెనపల్లి శ్రీనివాసులు విమర్శించారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ తరహాలో టైం స్కేలు జీతాలు, డీఏని కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు వీఆర్ఏ సంఘం జిల్లా నాయకురాలు పి.జ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గంటెనపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక వీఆర్ఏలకు టైం స్కేలు జీతాలు, ప్రమోషన్స్, డీఏని జీతంతో కలపడం లాంటివి చేయకుండా అదనపు భారంతో వేధిస్తోందని మండిపడ్డారు. ఇసుక ర్యాంపులు, రైస్ మిల్లుల వద్ద డ్యూటీలు, సర్వే డ్యూటీలు వంటి అదనపు భారం వేయడంతో ఉద్యోగులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు భారం వేసినా టీఏలు, డీఏలు చెల్లించకపోవడం దారుణమన్నారు. లేబర్ కోడ్స్ మొత్తాన్ని రద్దు చేయాలని, వీఆర్ఏలకు నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. అనంతరం కలెక్టర్కు కలిసి వినతి పత్రం అందజేశారు. జులై 9వ తేదీ జరిగే సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. ఈ ధర్నాలో దానం, వి.యేసు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చలో తెనాలిని జయప్రదం చేయండి ఒంగోలు టౌన్: దళిత మైనారిటీ యువకుల మీద పోలీసుల అరాచకాన్ని ఖండిస్తూ ఈ నెల 28వ తేదీ తెనాలిలో నిర్వహించనున్న మానవ హక్కుల పరిరక్షణ సదస్సును జయప్రదం చేయాలని ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మంచి పుస్తకం వద్ద బుధవారం శ్రీచలో తెనాలిశ్రీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ తెనాలిలో నడిరోడ్డు మీద దళిత మైనారిటీ యువకులను పోలీసులు చిత్రహింసలు పెట్టడం ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగ హక్కులు, చట్టాలను తుంగలో తొక్కి దళిత మైనారిటీ యువకులపై బహిరంగ ప్రదేశంలో దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో మానవ హక్కులు కాపాడుకోవాలని కోరారు. పోలీసు చర్యలను మంత్రులు సమర్ధిస్తూ మాట్లాడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పోలీసుల బహిరంగ దాడిని సమర్దించిన హోం మంత్రి వంగలపూడి అనిత, ఎస్పీ సతీష్ కుమార్లపై జాతీయ మానవ హక్కుల వేదిక తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలన్నారు. చలో తెనాలి కార్యక్రమాన్ని హక్కుల సంఘాలు, దళిత మైనారిటీ సంఘాలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు భీమవరపు సుబ్బారావు, పెద్దన్న, తన్నీరు వెంకటస్వామి, పిన్నిక శ్రీనివాస్, ఆనాల వెంకటరావు, ఆంజనేయులు, గాలి సంగీతరావు, దాసి సుందరం, కె.పేరయ్య, టి.వెంకటస్వామి ,లింగ వెంకటేశ్వర్లు , నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. 29న జాబ్మేళా మార్కాపురం టౌన్: ఈనెల 29వ తేదీన ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో 10 బహుళజాతి కంపెనీలతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి రవితేజ యాదవ్ బుధవారం తెలిపారు. మార్కాపురం నియోజకవర్గంతోపాటు జిల్లాలోని 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న పదో తరగతి నుంచి పీజీ వరకూ చదువుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు ఎస్కే ఫిరోజ్గాంధీ 70139 50097 నంబరును సంప్రదించాలన్నారు. జూలై 9న దేశ వ్యాప్త సమ్మె ఒంగోలు సబర్బన్: కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చిన లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జూలై 9వ తేదీన మున్సిపల్ ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల్లో పని చేస్తున్న కార్మికులు సమ్మె చేస్తున్నట్లు సీఐటీయూ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఒంగోలు నగర్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ కె. వెంకటేశ్వరరావుకు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఒంగోలు నగర్ కార్యదర్శి టి.మహేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్ కార్మికులు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలని మున్సిపల్ కార్మికులందరికీ షరతులు లేకుండా తల్లికి వందనం పథకంతో సహా అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్, ఎన్ఎంఆర్, ఎం.ఆర్ బదిలీ కోవిడ్, క్లబ్ డ్రైవర్కు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు. డెత్, సిక్, ఆప్కాస్ ద్వారా రిటైర్మెంట్ చేసిన కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని, వయోపరిమితి 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు జి. నరసింహ, టి.విజయమ్మ, నాయకులు కె.సామ్రాజ్యం, ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.