సీనియర్ సహాయకులుగా పదోన్నతి
ఉత్తర్వులు అందజేసిన జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
26 మందికి
ఒంగోలు సిటీ: జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న 17 మంది జూనియర్ సహాయకులు, 9 మంది టైపిస్ట్లకు సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించి బుధవారం పదోన్నతి ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అందజేశారు. ఎల్ మధుకర్ను ఒంగోలు జెడ్పీ కార్యాలయంలో, బి.శ్రీనివాసరెడ్డిని చీరాల మండల పరిషత్ కార్యాలయం, కేవీ రమణారెడ్డిని పెద్దారవీడు మండల పరిషత్ కార్యాలయ,ం, అబ్ధుల్రహమాన్ మార్కాపురం మండల పరిషత్ కార్యాలయంలో, ఎన్.వెంకటేశ్వర్లును ఒంగోలు జెడ్పీ కార్యాలయంలో, పి.సురేష్చంద్రమూర్తి వేటపాలెం మండల పరిషత్ కార్యాలయం, కేకే జగన్మోహన్రెడ్డి తర్లుపాడు, ఇ.విశ్వప్రసాద్రెడ్డిని కొత్తపట్నం, ఎస్పీ.కృష్ణసూరిని నాగులుప్పలపాడు, కె.చంద్రశేఖరశర్మ ఒంగోలు జెడ్పీ, టి.వెంకటేశ్వరరెడ్డి దర్శి, సీహెచ్.శివలక్ష్మిదేవి దొనకొండ, పి.నమ్మాళ్వార్ ఒంగోలు జెడ్పీ కార్యాలయంలో, కె.శ్రీనివాసరావు కందుకూరు, ఏ .యాదగిరిబాబు యర్రగొండపాలెం, ఎన్.రమాదేవి కొనకనమిట్ల, ఎల్.ప్రహ్లాదరావు వలేటివారిపాలెం, ఎస్కే మస్తాన్బి పొన్నలూరు, జెడ్.సౌదామిని ఇంకొల్లు, వి.విజయలక్ష్మి అద్దంకి, సీహెచ్.పుల్లయ్య దోర్నాల, ఎం.సరళకుమారి కొండపి, సీహెచ్ ప్రేమ్చంద్ కారంచేడు, ఎం.శ్రీనివాసరావు ఒంగోలు జెడ్పీ కార్యాలయంలో, ఎం.ఉషాస్రవంతి ముండ్లమూరు, ఎస్.జగన్మోహన్రెడ్డి రాచర్ల మండల పరిషత్ కార్యాలయాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో సీఈఓ చిరంజీవి, డీవై సీఈఓ బాలమ్మ, ఏఓ చల్లా శ్రీనివాస్కుమార్, తదితరులు పాల్గొన్నారు.


