వాతావరణం
– 8లో..
ఆకాశం పాక్షికంగా మేఘావృతమైఉంటుంది. చలిగాలులు వీస్తాయి. పొగమంచు కురుస్తుంది.
మద్దిపాడు మండలం పాత బూరేపల్లి లో గ్రావెల్ తవ్వకాలు
కందుకూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో 96 ఇరిగేషన్ చెరువులుండగా వాటిలో యథేచ్ఛగా మట్టిని తవ్వుకుంటున్నారు. గుడ్లూరు, కరేడు, కొండి కందుకూరుల్లో పచ్చ తమ్ముళ్లు మట్టి కొట్టుకొని పోతున్నారు. ఒక్క పెదపవని నుంచే రోజుకు 200కు పైగా ట్రాక్టర్ల మట్టిని దోపిడీ చేశారంటే ఏ రేంజ్లో మట్టి వ్యాపారం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు చెబుతున్నారు. లింగసముద్రం మండలంలో జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ నళినీ పద్మ కొనుగోలు చేసిన 7 ఎకరాల భూమి ఉంది. నాలుగు జేసీబీలతో ఆ భూమిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకంగా 20 ట్రాక్టర్లు పెట్టి మట్టిని తవ్వేసి తోలుకొని పోతున్నారు. రోజుకు 200 ట్రాక్టర్ల మట్టిని తరలించినట్లు సమాచారం. మట్టి తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన నళిని పద్మ బంధువులపై మట్టి మాఫియా దాడికి దిగింది. దాంతో సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారుల ఒత్తిడితో కాసేపు మట్టి తవ్వకాలను ఆపినట్లు నటించిన మాఫియా అధికారులు వెళ్లిపోయిన వెంటనే యథాతధంగా తిరిగి మట్టిని తవ్వేసి అమ్ముకుంటున్నారు. అధికారం అండదండలున్నాయి, మీరేమీ చేసుకోలేరని మాఫియా నాయకులు చెబుతుండడం గమనార్హం.
ఆదాయం బీకే త్రషర్స్కు..రోగాలు ప్రజలకు
గత అక్టోబర్లో సింగరాయకొండలోని బీకే త్రషర్స్ పొగాకు గోడౌన్లో జరిగిన అగ్నిప్రమాదంలో వచ్చిన వ్యర్థాలను తరలించడంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
వాతావరణం


