నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్రం విఫలం
గత బడ్జెట్లో జిల్లాను వెనకబడిన జిల్లాగా గుర్తించినట్లు ప్రకటించిన కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో అందుకు తగిన విధంగా నిధులు కేటాయించకపోవడం దారుణం. వెలుగొండ ప్రాజెక్టు, రామాయపట్నం పోర్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టులకు, ఆంధ్రకేసరి యూనివర్శిటీకి నిధులు తీసుకొని రావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. ఉపాధి హామీ పథకానికి నామ మాత్రంగా నిధులు కేటాయించడంతో జిల్లా నుంచి వలసలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా నుంచి ఏడాదికి లక్ష మంది వివిధ పనుల కోసం వలసలు వెళుతున్నారు.
– ఎంఎల్ నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి


