విద్యార్థుల దత్తత
చదువులో వెనుకబడిన విద్యార్థులను మా ఉపాధ్యాయులు దత్తత తీసుకున్నారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి చదువుపై తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. ప్రత్యేక క్లాసులు కూడా నిర్వహిస్తున్నాం. మా స్కూల్లో మొత్తం 255 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు రాణించేందుకు కృషి చేస్తున్నాం.
– చంద్రశేఖర్రెడ్డి,
హెచ్ఎం, జెడ్పీ బాయ్స్, మార్కాపురం
మార్కాపురం డివిజన్లో పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్టడీ అవర్ నిర్వహిస్తున్నాం. మొత్తం పాఠశాలలో విద్యార్ధి ఉండే సమయాన్ని నాలుగు సెషన్స్గా విభజించి పాఠాలు బోధిస్తున్నాం. వారిలో ఉన్న లోపాలను సవరించేందుకు పరీక్షలు పెడుతున్నాం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువుపై దృష్టిపెట్టాలి. – ఎం శ్రీనివాసులరెడ్డి,
ఉప విద్యాశాఖ అధికారి, మార్కాపురం డివిజన్
విద్యార్థుల దత్తత


