యుద్ధం ప్రభావంతో ఉప్పు ధరలు తక్కువగా ఉన్నాయి. గత 15 రోజుల్లో 76 కేజీ ల బస్తాకు సుమారు రూ.80ల వరకు ధరలు పడిపోయాయి. యుద్ధం త్వరగా ముగిసి ధరలు పెరిగితే తప్ప ఉప్పు రైతు ఆర్థికంగా నష్టపోవాల్సిన దుస్థితి ఉంది.
– పురిణి శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెం
ఉప్పు రైతుకు కష్టకాలం
ప్రస్తుతం 76కేజీల నాణ్యమైన ఉప్పు ధర రూ. 200ఉండగా తక్కువ రకం ఉప్పు ధర రూ.170 ఉంది. యుద్ధం కారణంగా హోటళ్లు మూతపడటంతో ఉప్పుకు డిమాండ్ గణనీయంగా తగ్గింది. గతంలో రోజుకు 5 పైగా లారీల్లో ఉప్పు రవాణా జరుగుతుండగా ప్రస్తుతం ఒక్క లారీ కూడా రవాణా కాని పరిస్థితి ఉండటంతో ఉప్పు రైతు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది.
– నాటారు వెంకటేష్, ఉప్పు రైతు, ఊళ్లపాలెం


