లిఫ్టు పనులు వేగిరం చేయండి
చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ కుడి కాలువలో పేరుకుపోయిన తుంగ, గడ్డిని వెంటనే తొలగించాలని, చంద్లాపూర్ లిఫ్టు పనులు త్వరగా పూర్తి చేసి మూడు నెలల్లో లిఫ్టు ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని రంగనాయక సాగర్ వద్దగల ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి మల్లన్న సాగర్ నీటి విడుదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు ఆందోళన చెందుతున్నారని, మల్లన్నసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 13న రంగనాయక సాగర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయాలన్నారు. ఇర్కోడ్ లిఫ్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గోపులాపూర్, కస్తూరిపల్లి గ్రామాల వద్ద నిర్మించే చెక్డ్యామ్ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. అల్లీపూర్ వద్ద లిఫ్టు ఏర్పాటు చేయాలన్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి అల్లీపూర్ కర్నాల కుంటకు నీళ్లు వచ్చేలా లిఫ్టు ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
కెనాల్లోని తుంగ, గడ్డి తొలగించాలి
మాజీ మంత్రి హరీశ్రావు
ఇరిగేషన్ అధికారులతో సమీక్ష


