breaking news
Medak District Latest News
-
రోడ్డెక్కిన జొన్న రైతులు
రామాయంపేట(మెదక్): పూర్తిస్థాయిలో జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రామాయంపేటలో మరోసారి రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం జొన్నలను రోడ్డుపై పోసి బైఠాయించారు. తూకం వేయించి లారీల్లో మార్క్ఫెడ్ గో దాంలకు తరలించిన జొన్నలు నాణ్యతగా లేవనే సాకుతో వాపస్ పంపించారని ఆరోపించారు. అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సుమారు ఐదు వేల క్వింటాళ్లకు పైగా జొన్నల స్టాక్ నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, సీపీఎం నాయకుడు నీలం బాబు రైతులను పరామర్శించారు. ఈసందర్భంగా పద్మారెడ్డి వ్యవ సాయశాఖ మంత్రి తుమ్మలతో ఫోన్లో మాట్లాడి రైతుల బాధలను ఏకరువు పెట్టారు. పూర్తిస్థాయిలో జొన్నలు కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంట మార్పిడి చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతోనే రైతులు జొన్న సాగు చేశారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ధీమా
ప్రమాద బీమా.. మెదక్ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా కల్పిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షన్దారులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల అకౌంట్ల కనుగుణంగా రూ.కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు వ్యక్తిగత ప్రమాద మరణ బీమా కవరేజీ కల్పించారు. జిల్లాలో 7,500 రెగ్యులర్ ఉద్యోగులు, 3,300 పెన్షన్దారులు ఉండగా, సుమారు 5 వేల మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. అయితే సాధారణంగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సామాజిక భద్రత పథకాలు తక్కువగా వర్తిస్తుంటాయి. అందుకే ప్రభుత్వం వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. వారు విధి నిర్వహణలో మృతిచెందినా, వైకల్యం పొందినా వారికి ఎలాంటి పరిహారాలు అందేవి కావు. అలాగే వారి స్థానంలో కారుణ్య నియామకాలు కూడా లేవు. ప్రస్తుతం ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తుండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల ప్రతిపాదనలు ఉద్యోగుల జీతాలకు సంబంధించిన ఖాతాలు ఉండటంతో సంబంధిత బ్యాంకులు ఉచిత ప్రమాద బీమా కల్పించడానికి సంసిద్ధత తెలిపాయి. కేటగిరీలు, వేతనాల ఆధారంగా యాక్సిడెంటల్ మరణాలు, వైకల్యానికి పరిహారాలను ప్రతిపాదించాయి. రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు ప్రమాద మరణ బీమా, అంతే మొత్తాన్ని శాశ్వత వైకల్యానికి పరిహారంగా ఇవ్వనున్నాయి. రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు పాక్షిక వైకల్యానికి అందిస్తుండగా, ఇతర కేటగిరీల తాత్కాలిక సిబ్బందికి రూ. 30 లక్షల నుంచి రూ.1 కోటి వరకు మరణ, వైకల్య కవరేజీలను ఎస్బీఐ ఖరారు చేసింది. ఇలా ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా పరిహారం చెల్లించనున్నాయి. బీమాతో ఆర్థిక భద్రత రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా వర్తింప చేయడం హర్షనీయం. ఇది ఆర్థిక భద్రత స్కీంగా ఉపయోగపడుతుంది. వృద్ధాప్య ంలో సాధారణంగా పింఛన్దారులు, కుటుంబీకుల ఆదరణ కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటారు. ఈ ప్రమాద బీమా వారిలో ఒక ధీమాను కల్పిస్తుంది. – మహేందర్రెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం రూ. కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు చెల్లింపు రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షన్దారులకు వర్తింపు ప్రమాద మరణ ం.. శాశ ్వత వైకల్యానికి చెల్లింపు -
భర్త, అత్త వేధింపులతో గర్భిణి ఆత్మహత్య
అల్లాదుర్గం( మెదక్): అత్తింటి వేధింపులు భరించలేక ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని గడిపెద్దాపురం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ కథనం ప్రకారం... వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం మోత్తుకపల్లి గ్రామానికి చెందిన సుష్మిత (23)కు, గడి పెద్దాపూర్ గ్రామానికి చెందిన గాజుల అభిలాష్తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అయితే సుష్మితను భర్త అభిలాష్ ,అత్త శశిరేఖ అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. దీంతో భర్త, అత్తతో నిత్యం గొడవలు జరిగేవి. తీవ్ర మానసిక ఆందోళనకు గురైన సుష్మిత గురువారం ఇంట్లోనే ఉరివేసుకుంది. సుష్మిత మృతికి భర్తతోపాటు అత్త కారణమని మృతురాలి తల్లి జానాబాయ్ ఆరోపిస్తూ శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఒక్క ఓటూ మిస్ కావొద్దు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి మెదక్జోన్: ఓటరు జాబితాలో నుంచి అర్హుల ఓటు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ‘సర్’ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను నేరుగా కలిసే అవకాశం లభించిందన్నారు. ప్రతి ఓటరును కలిసి ఓటు నమోదును నిర్ధారించడాన్ని పార్టీ కార్యకర్తలు బాధ్యతగా భావించాలన్నారు. ఈ విషయంపై కార్యకర్తలు, నాయకులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే బీఎల్ఓలను సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, శేరి సుభాశ్రెడ్డితో పాటు రాష్ట్ర నాయకులు దేవేందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్గౌడ్, బట్టి జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్ బట్టి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు, రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
మెదక్జోన్: మెదక్ పట్టణంతో పాటు మెదక్, హవేళిఘణాపూర్, చిన్నశంకరంపేట మండలాల్లో శని, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏడీఈ మోహన్బాబు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు గాను కరెంట్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడంతో పాటు స్తంభాలను సరిచేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. రామాయంపేట(మెదక్): మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్తో పాటు ఇంటి స్థలం కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల జిల్లా ఫోరం డిమాండ్ చేసింది. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన సమావేశంలో రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాలకు చెందిన ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి, తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈనెల 29న గద్వాల జోగులాంబ జిల్లాలో జరిగే సమావేశంలో పెద్దసంఖ్యలో ఉద్యమకారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గుండా ఎల్లం, నిజాంపేట మండల మాజీ ఎంపీపీ సిద్దరాంలు, నాయకులు పోలీస్ దేవేందర్, నర్సారెడ్డి, రాంరెడ్డి, మెంగర్తి సుధాకర్, భిక్షపతి, కిష్టారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అల్లాదుర్గం(మెదక్): కబ్జాకు గురైన ఆర్టీసీ బస్టాండ్ స్థలంపై విచారణ జరిపిస్తామని మెదక్ రీజినల్ మేనేజర్ విజయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం అల్లాదుర్గం ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించారు. స్థానిక నాయకుడు ప్రయాణికుల కోసం వేయించిన బోరుతో పాటు స్థలం సైతం కబ్జా చేశాడని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. బస్టాండ్లో మహిళా ప్రయాణికులు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ట్లు చెప్పారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్కు కేటాయించిన స్థలంపై విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు. స్థలం చూపిస్తే నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని సర్పంచ్ తెలిపారు. అల్లాదుర్గం ప్రాంతంలో ఆర్డీనరీ బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. ఖేడ్ డిపో నుంచి జోగిపేట వరకు ఆర్డీనరీ సర్వీస్ నడపాలని కోరారు. నర్సాపూర్ రూరల్: బీజేపీ ఎండోమెంట్ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా నర్సాపూర్కు చెందిన కవితారెడ్డిని నియమించారు. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర ఎండోమెంట్ కమిటీ శుక్రవారం నిమామకపత్రం అందజేసింది. ఈసందర్భంగా కవితారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అధినాయకత్వం నాపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి.. దేవాలయాల పరిరక్షణకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. తుది గడువు జూలై 5 జహీరాబాద్: కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. జూన్ 15వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు మాత్రమే ఇందుకు అర్హులని పేర్కొ న్నారు. అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవ సాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని వివరించారు. దరఖాస్తుతో పా టు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీలను రైతు భరోసా దరఖాస్తు ఫారం జత చేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు జూలై 5వ తేదీ చివరి గడువని పేర్కొన్నారు. -
మాది పేదల ప్రభుత్వం
తూప్రాన్: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ పరిధిలోని 10వ వార్డు బ్రాహ్మణపల్లిలో నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి పేదలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షానే నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో నాచారం దేవాలయ చైర్మన్ రవీందర్ గుప్తా, నాయకులు బుచ్చిరెడ్డి శ్రీకాంత్రెడ్డి, మల్లేశ్, నారాయణగుప్త, కృష్ణ, భగవాన్రెడ్డి, వేణు, సత్యనారాయణ, భిక్షపతి, రవి, లక్ష్మణ్, సిద్ధగౌడ్, శ్రీధర్గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
నిండు జీవితానికి రెండు చుక్కలు
● సర్వం సిద్ధం చేసిన వైద్యారోగ్యశాఖ మెదక్ కలెక్టరేట్: జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఆదివారం పోలియో చుక్కల పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మిగిలిపోయిన చిన్నారులకు 29, 30వ తేదీన సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి డీఎంహెచ్ఓ జ్ఞానేశ్వర్ ఇప్పటికే సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల లోపు వయసు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లాలో 75,496 మంది పిల్లలు జిల్లాలో 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు మొత్తం 75,496 మంది ఉన్నారు. వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు జిల్లావ్యాప్తంగా 457 బూత్లలో 872 మొబైల్ టీంలు, ట్రాన్సిస్ట్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బూత్లలో 1,828 మంది ఏఎన్ఎంలు, ఆశలు, డాక్టర్లు పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. నిర్లక్ష్యం వద్దు పిల్లలు భయకరమైన పోలియో వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా పి ల్లలకు పోలియో చుక్కలను వేయించాలి. పోలియో వ్యాధి రహిత దేశంగా తయారు చేసేందుకే ప్రభుత్వం ప్రతి ఏటా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు తమ పరిధిలోని ప్రతి కుటుంబాన్ని సందర్శించి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. పోలియో చుక్కలు వేయించుకోకుండా జిల్లాలో ఏ ఒక్క చిన్నారి తప్పిపోవద్దు. జిల్లాలో 125 హైరిస్క్ ఏరియాలు ఉండగా, అందులో 657 మంది పిల్లలను గుర్తించాం. వైద్యారోగ్య శాఖతో పాటు విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారుల సమన్వ యం చేశాం. అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. – జ్ఞానేశ్వర్, డీఎంహెచ్ఓ -
కల్లు తేలేస్తుండ్రు
జిల్లాలో ఏరులై పారుతున్న కల్తీ కల్లు● మత్తులో చిత్తవుతున్న బతుకులు ● మానేసిన వారిలో వింత ప్రవర్తన ● చోద్యం చూస్తున్న ఆబ్కారీ శాఖమెదక్జోన్: మెతుకుసీమలో కల్తీ కల్లు ఏరులై పారుతోంది. కొందరు స్వచ్ఛమైన కల్లు మాటున గరళం అమ్ముతున్నారు. రసాయనాలు, నిషేధిత మత్తు పదార్థాలు కలిపి అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. జిల్లాలో 492 గ్రామాలుండగా, పట్టణం నుంచి పల్లె వరకు 500 పైగా కల్లు దుకాణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అనుమతి లేనివి సైతం ఉన్నట్లు తెలిసింది. రోజంతా కష్టం చేసే పల్లె ప్రజలు సాయంత్రం ఇంటికి రాగానే కల్లు తాగి సేదతీరుతారు. అదే కాలకూట విషంగా మారుతోంది. కల్లులో క్లోరోఫాం, డైజోఫాం లాంటి నిషేధిత మత్తు పదార్థాలు కలుపుతున్నారు. అది సేవించిన ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆ కల్లుకు అలవాటు పడిన జనం తాగకుండా ఉండలేక పోతున్నారు. వారికి ఏదైనా జబ్బు చేసి ఆస్పత్రికి తీసుకెళ్తే వింతగా ప్రవర్తిస్తూ వైద్యానికి సహకరించడం లేదు. ముఖ్యంగా జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న పరిసర గ్రామాలకు మెదక్ పట్టణానికి చెందిన కొందరు యువకులు నిత్యం వెళ్లి కల్లు సేవిస్తుంటారు. కంట్రోల్ చేయకుంటే ప్రమాదం కల్తీ కల్లుకు అలవాటు పడిన వారిని మాన్పించకుంటే భవిష్యత్తులో వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారిలో నరాలు దెబ్బతినడం, ఫిట్స్ రావటం, పక్షవాతం, బ్రెయిన్ స్టోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వారిని వెంటనే సైకియాట్రిస్ట్కు చూపించి, వారి సూచన మేరకు మందులు వాడాలని సూచిస్తున్నారు. నెలనెలా మామూళ్లు! ఇంత జరుగుతున్నా ఆబ్కారీ శాఖ చోద్యం చూస్తోంది. పేరుకే తనిఖీలు నిర్వహిస్తూ కల్లు దుకాణదారుల నుంచి మామూళ్లు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నర్సింహారెడ్డిని వివరణ కోరగా.. తాను ఇటీవలే జిల్లాకు బదిలీపై వచ్చానని, కల్తీ కల్లుపై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.మచ్చుకు కొన్ని.. గతేడాది పాపన్నపేటకు చెందిన ఓ విద్యార్థి ఎన్సీసీ క్యాంపునకు సంగారెడ్డి వెళ్లాడు. క్యాంపులో వింతగా ప్రవర్తించటంతో డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అయితే ఆ విద్యార్థికి కల్లు తాగే అలవాటు ఉందని, మానేయడంతోనే ఇలా ప్రవర్తిస్తున్నట్లు తేలింది. ఇదే మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కల్లు మానేయటంతో మానసికంగా దెబ్బతిని ఊరు వదిలి వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు రాజస్థాన్లో మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. -
రుణాలు సద్వినియోగం చేసుకోండి: మెప్మా
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని వీధి వ్యాపారు లు అభివృద్ధి చెందాలని మెప్మా పీడీ హన్మంతరెడ్డి సూచించారు. గురువారం పట్టణంలో వీధి విక్రయదారుల స్వానిధి మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకుల వారీగా పెండింగ్ రుణాలపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వం వీధి విక్రయదారులను గుర్తించడంతో పాటు వారి అభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తుందని తెలిపారు. ఉత్తమంగా వ్యాపారం చేసే వారిని గుర్తించి సన్మానిస్తామన్నారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, ఫుడ్ సేప్టీ అధికారి స్వాదీప్, ఎల్డీఎం బాపూజీ, మున్సిపల్ కమిషనర్ నవీన్, బ్యాంకు అధికారులు తదతరులు పాల్గొన్నారు. చిలప్చెడ్(నర్సాపూర్): రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి, సేంద్రియ సాగు చేయాలని కేవీకే హెడ్అండ్ సైంటిస్ట్ డాక్టర్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ అన్నారు. గురువారం మండలంలోని బండపోత్గల్లో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరువులతో భూమి ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించి పచ్చి రొట్ట, జీవన ఎరువులతో సాగు చేయాలన్నారు. వరి కొయ్యలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నాలని సూచించారు. సూక్ష్మ పోషకాలు సమపాలల్లో వాడుతూ భూమి ఆరోగ్యాన్ని కాపాడి అధిక దిగుబడులు పొందాలన్నారు. యూరియా వినియోగం తగ్గించి నానో యూరియా, నానో డీఏపీ వాడాలని చెప్పారు. ఆయన వెంట కేవీకే శాస్త్రవేత్త ప్రతాప్రెడ్డి, ఏఓ రాజశేఖర్గౌడ్, నాయకులు ప్రవీణ్రెడ్డి రైతులు తదితరులు ఉన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం పార్ట్ టైం ఉపాధ్యాయుల నియమించనున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని మెదక్, తూప్రా న్, రామాయంపేట, కొల్చారం మండల కేంద్రాల్లోని గురుకుల పాఠశాలలు, జూనియర్, మెదక్ డిగ్రీ కళాశాలలో మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూలై 4వ తేదీ వరకు తమ ఒరి జినల్, జిరాక్స్ పత్రాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు. జూలై 6న ఉదయం 10 గంటలకు మెదక్లోని టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ బాలికల కళాశాలలో డెమో, ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. పూర్తి సమాచారం కోసం జిల్లా సమన్వయకర్త అనురాధ (9059526124)ను సంప్రదించాలని సూచించారు. మెదక్జోన్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, ఇందులో భాగంగా పీఆర్సీని ప్రకటించి వెంటనే అమలు చేయాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మెదక్లో మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలన్నారు. హెల్త్కార్డులకు సంబంధించిన విధివిధానాలు వెంటనే ప్రకటించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వకుండా వారి జీతాల నుంచి 1.5 శాతం తీసుకోవడం సరికాదన్నారు. మోడల్ స్కూల్, కేజీబీవీ, రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశంలో తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్లం, సిద్దూ, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఫుట్పాత్ల మాటేమిటి?
● మెదక్ పట్టణంలో పాదచారులకు ఇక్కట్లే ● తరచూ ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ ● పట్టించుకోని అధికారులు ‘ఫుట్పాత్లపై నడవడం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు’ అని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈమేరకు జిల్లా యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెదక్ పట్టణంలో ప్రజలకు కాలిబాటలు కరువయ్యాయి. ఫుట్పాత్లను ఆక్రమించి యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తుండటంతో పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. – మెదక్జోన్ మెదక్ మున్సిపాలిటీ ఏడు దశాబ్దాల క్రితం ఏర్పాటైంది. రోజు రోజుకు పట్టణ విస్తీర్ణం పెరుగుతుండటంతో జిల్లా కేంద్రానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. ముఖ్యంగా రైతులు పంట ఉత్పత్తులు విక్రయించడానికి, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి.. ఇతర ఏ పనులు ఉన్నా పట్టణానికి పరుగు తీస్తున్నారు. కాగా, ప్రజల అవసరాల నిమిత్తం రోడ్లను వెడల్పు చేసి, పాదచారుల నడక కోసం ఇరువైపులా ప్రత్యేకంగా ఫుట్పాత్లు నిర్మించారు. అయితే వాటిని వ్యాపారస్తులు 80 శాతం మేర ఆక్రమించారు. వాటిపైనే వస్తువులు పెట్టి విక్రయాలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ చౌరస్తా నుంచి మొదలుకొని కొత్త బస్టాండ్ వరకు 3 కిలోమీటర్ల మేర పట్టణ నడిబొడ్డు నుంచి ప్రధాన రహదారి ఉంది. ఈ రోడ్డు 100 ఫీట్లు ఉండటంతో మధ్యలో డివైడర్ నిర్మించారు. రోడ్డుకు ఇరువైపులా పాదచారుల కోసం ఫుట్పాత్ నిర్మించారు. దానిని ఆక్రమణదారులు కబ్జా చేసి వ్యాపారులు సాగిస్తున్నారు. పాదచారులకు నడిచేందుకు దారి లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాగే తరచూ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంత జరుగుతున్నా, అటు మున్సిపల్ అధికారులు.. ఇటు పోలీసులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. డ్రైనేజీలపై నిర్మాణాలు పట్టణంలోని ప్రధాన రహదారులను ఆనుకొని ఉన్న డ్రైనేజీలను కొందరు ఆక్రమించి వాటిపై నిర్మాణాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఫుట్పాత్లపై డబ్బాలు వేసి వ్యాపారం సాగిస్తున్నారు. గతంలో కొన్నింటిని తొలగించినప్పటికీ, మళ్లీ యథేచ్ఛగా కబ్జా చేసి వ్యాపారం చేస్తున్నారు. -
ఒక్క ఓటూ తొలగిపోవద్దు
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ మెదక్జోన్: అర్హుల ఓటు ఒక్కటి కూడా తొలగిపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. గురువారం రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావుతో కలిసి మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ బీఎల్ఓలకు ఏజెంట్ ఫాంలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఓటరు వివరాల సేకరణ ప్రారంభం కావటంతో బీజేపీ నేతలు ఓటు చోరీ చేసే అవకాశం ఉందన్నారు. అర్హుల ఓటు తొలగించకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఓలతో పాటు కార్యకర్తలపై ఉందన్నారు. ఏ ఒక్క ఓటు తొలగించినా, ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పూర్తిగా పోతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం ఇంటింటికీ సిబ్బంది వస్తున్నారని, వారికి పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. అదేవిధంగా ప్రజలకు సర్పై అవగాహన కల్పించి పాల్గొనేలా చూడాలన్నారు. ప్రజలు ఎన్యూమరేషన్ పత్రాలను నింపే సమయంలో సహకరించాలన్నారు. కార్యక్రమంలో మెదక్, రామాయంపేట, హవేళిఘణాపూర్ మండలాలకు చెందిన బీఎల్ఓలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. -
పల్లెల ప్రగతికి కృషి
మిరుదొడ్డి(దుబ్బాక): పల్లెల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంతో పాటు, అందెలో ఎంపీ, ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన రూ.66 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా సక్షేమ పథకాలను కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటేనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. కాగా మిరుదొడ్డిలోని అరుంధతి కల్యాణ మండపంలో తాగునీటి బోరు బావి తవ్వకంతో పాటు, కిచెన్ షెడ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ ఎంపీకి అంబేడ్కర్ చైతన్య సంఘం సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, జిల్లా నాయకులు ఎల్ముల దేవరాజు, భిక్షపతి, జిల్లా టెలికం బోర్డు మెంబర్ మొగుళ్ళ మల్లేశం, ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలనుసద్వినియోగం చేసుకోవాలి ఎంపీ రఘునందన్ రావు -
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం
హవేళిఘణాపూర్(మెదక్): తాత్కాలిక ఆనందం కో సం డ్రగ్స్ బారిన పడి బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ‘నషాముక్త్ అభియాన్– మిషన్ పరివర్తన్’ కార్యక్రమంలో భాగంగా గురువారం మెదక్ మండలం మంభోజిపల్లి గీతా పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కొంతమంది యువత డ్రగ్స్తో పాటు పలు రకాల వ్యసనాలకు లోనవుతున్నారని అన్నారు. ఈ అలవాట్లు కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాపాయానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయన్నారు. అనంతరం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. డ్రగ్స్రహిత సమాజ నిర్మాణానికి మద్దతుగా నిర్వహించిన మానవహారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, డీఈఓ రాజు, మెదక్రూరల్ సీఐ కృష్ణమూర్తి, గీతా హైస్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు, ప్రధానోపాధ్యాయులు మాధవి, ఉపాధ్యాయులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
కిడ్నీ బాధితులకు ఊరట
మరో రెండు డయాలసిస్ కేంద్రాలు మంజూరు● రామాయంపేట, కౌడిపల్లిలో ఏర్పాటు ● పేదలకు తప్పనున్న ఆర్థిక భారం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. రామాయంపేట, కౌడిపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు కొత్తగా డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేసింది. ఈప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం రూ. వేలు ఖర్చు చేస్తూ వారానికి రెండు, మూడు సార్లు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. త్వరలో వారికి ఈ బాధ తప్పనుంది. – రామాయంపేట(మెదక్) మెదక్లో 10, నర్సాపూర్, తూప్రాన్లో 5 చొప్పున ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఈఏడాది మూడు కేంద్రాల్లో 130 మందికి పైగా బాధితులు డయాలసిస్ సేవలు పొందారు. తాజాగా రామాయంపేట, కౌడిపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు కొత్తగా ఐదు బెడ్ల చొప్పున ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేసింది. అయితే ఇందుకు సంబంధించి ఇంకా జిల్లా అధికారులకు సర్క్యులర్ అందలేదు. ఈసెంటర్లు ప్రారంభమైతే ఒక్కో కేంద్రంలో ఒకేసారి ఐదుగురు వ్యాధిగ్రస్తులు రక్తశుద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కౌడిపల్లిలో పాత ఆస్పత్రి భవనం, రామాయంపేటలో కొత్తగా నిర్మించిన ఆస్పత్రి భవనం మొదటి అంతస్తులో దీనిని ఏర్పాటు చేయ నున్నారు. కాగా, మెదక్లో 65, తూప్రాన్ పరిధిలో 40, నర్సాపూర్లో 24 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో కొందరికి క్రియాటిన్ అధికంగా ఉండటంతో వారానికి కనీసం రెండు, మూడు సార్లు డయాలసిస్ అవసరం ఉంటుంది. జిల్లాలోని మూడు కేంద్రాల్లో గుర్తించిన రోగులకు నెలలో కనీసం 1,200 సార్లు డయాలసిస్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఉద్యమకారులకు సముచిత న్యాయం
దుబ్బాక: తెలంగాణ ఉద్యమకారులకు సముచిత న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ కోదండరాం అన్నా రు. గురువారం దుబ్బాక పట్టణంలో పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పల్లెల నుంచి పట్నం వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు బైరి రమేశ్, ర్యాకం శ్రీరాములు, కాల్వ నరేష్, ఆస స్వామి, కాల్వ లింగం తదితరులు ఉన్నారు. చేనేత పరిశ్రమను కాపాడుకుందాం దుబ్బాక పట్టణంలోని చేనేత సహకార సంఘాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డితో కలిసి కోదండరాం సందర్శించారు. ఈ సందర్భంగా మగ్గాలను పరిశీలించి కార్మికుల వెతలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానన్నారు. దేశంలోనే దుబ్బాక గొల్లభామ చీరలు చాలా ప్రసిద్ధి అని, ఇలాంటి గొప్ప సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే దుబ్బాక పట్టణంలోని 14, 15 వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లోనూ కోదండరాం పాల్గొన్నారు. చేనేత కార్మికులకు అండగా నిలుస్తాం ఎమ్మెల్సీ కోదండరాం -
టీచర్ల సమస్యలు పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పద్మారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాలన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టినట్లు తెలిపా రు. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలన్నారు. ఎన్ఈపీ– 2020ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఉపాధ్యాయులకు 2023 నుంచి పీఆర్సీ అమలు చేయాలన్నారు. కొత్త పెన్షన్ విదానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. పెండింగ్లో 5 డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏఓ యూనస్కు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్రెడ్డి, కోశాధికారి అజయ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యు డు భీమ్లా నాయక్, కార్యదర్శులు నగేశ్, ఏసయ్య, పోచయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పద్మారావు -
రెవెన్యూ లీలలు!
అక్రమాలకు నిలయంగా తహసీల్ కార్యాలయంఅల్లాదుర్గం(మెదక్): రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నాయి. రూ.లక్షల జీతాలు తీసుకుంటూ లంచాలకు అలవాటు పడిన కొందరు అధికారులు నిరుపేదల రక్తం తాగుతున్నారు. మాముళ్లు ఇస్తే క్షణాల్లో పట్టా చేస్తున్నారు.. ఇవ్వకుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, విచారణ చేయడం లేదు. ఆర్డీఓను వివరణ అడిగితే సమాధానం దాటవేత వేస్తున్నారు. ఇది అల్లాదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో నిత్యం జరుగుతున్న తంతు.. ● అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లికి చెందిన తలారి శంకరయ్య తన అన్న కొడుకు మొగులయ్యకు 5 గుంటల భూమిని దాన పత్రం కింద ఇచ్చేందుకు స్లాట్ బుక్ చేశాడు. మంగళవారం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. తహసీల్దార్ కార్యాలయానికి వెళితే అన్న కొడుకు కాబట్టి దానపత్రం కింద రిజిస్ట్రేషన్ చేయడం చెల్లదని తహసీల్దార్ తిప్పి పంపారు. ● ఇటీవల ఓ మహిళ తన అల్లుడికి సేల్డీడ్ కింద స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్కు వెళితే దానపత్రం కింద చేసుకోవాలని చెప్పి పంపారు. అలాగే తండ్రి కూతురికి సేల్డీడ్ కింద రిజిస్ట్రేషన్కు స్లాట్ బుక్ చేస్తే చెల్లదని చెబుతున్నారు. ఇలా ఎన్నో సాకులు చెబుతూ తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పి పంపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ఇదే కార్యాలయంలో బతికున్న వ్యక్తి మృతిచెందినట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తే మాత్రం వెంటనే రిజిస్ట్రేషన్ చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాల వారిని సముదాయించి రాజీ చేసి తిరిగి బతికున్న వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. తప్పుడు రికార్డులు సృష్టించి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ● గడిపెద్దాపూర్లో మహిళ మృతి చెందితే కొడుకులు ఉన్నా, సాదాబైనామాపై ఎవరూ లేకున్నా.. మరొకరి పేరుపై క్షణాల్లో రిజిస్ట్రేషన్ చేశారు. – ఈ సంఘటనలపై బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే ఆర్డీఓ స్థాయి అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టడంతో చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. ● ఈ విషయంపై తహసీల్దార్ మల్లయ్యను వివరణ కోరగా బూత్ లెవల్ కమిటీ సమావేశం ఉండటంతో రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్పడం గమనార్హం. మూముళ్లు ఇస్తే క్షణాల్లో పట్టా.. లేకుంటే అడ్డంకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం -
క్రీడలతో శారీరక దృఢత్వం
ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్మెదక్జోన్: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పొందవచ్చని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ బారినపడిన వారిని బాధితులుగానే చూస్తున్నామని, పునరావాస కేంద్రాల ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకువస్తామన్నారు. అలాంటి వారిని క్రీడల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో వన్డే క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో ప్రథమ విజేతగా నిలిచిన రాయల్ వారియర్స్ జట్టుకు రూ.5,000 నగదు, ద్వితీయ విజేతగా రాయల్ ఆవుసులపల్లి జట్టుకు రూ.2,500 నగదు బహుమతి, ట్రోఫీలను అందజేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, డ్రగ్స్ విక్రయం, వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అంతకుముందు యువతతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ సీఐ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మత్తుతో జీవితాలు చిత్తు
డీఎస్పీ ప్రసన్నకుమార్ పాపన్నపేట(మెదక్): మత్తు పదార్థాల వాడకం జీవితాలను నాశనం చేస్తుందని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. బుధవారం పాపన్నపేట ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కొంత మంది విద్యార్థులు, యువకులు స్నేహితుల నుంచి మత్తు పదార్థాల వాడకం నేర్చుకుంటున్నారని అన్నారు. ఒకప్పుడు పట్టణాల్లో ఉన్న డ్రగ్స్ సంస్కృతి ఇప్పుడు పల్లెలకు పాకిందన్నారు. కొన్ని పాఠశాలలు, కళాశాలలను సైతం తాకిందన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు విద్యార్థుల ప్రవర్తన సరళిపై దృష్టి సారించాలన్నారు. మత్తు పదార్థాలను అరికట్టడంలో యువకులు చైతన్యవంతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ కృష్ణమూర్తి, ఎస్సై శ్రీనివాస్గౌడ్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
28న పల్స్ పోలియో
డీఎంహెచ్ఓమెదక్జోన్: పల్స్ పోలియోను విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి జ్ఞానేశ్వర్ అధికారులకు ఆదేశించారు. బుధవారం మాత, శిశు ఆస్పత్రిలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. ఇందులో ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి విధిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లావ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారులు 75,496 మంది ఉన్నారని, ఇందుకోసం 457 పోలియో చుక్కల బూత్లతో పాటు, మొబైల్ టీంలు కలిపి మొత్తం 872 ఏర్పాటు చేశామన్నారు. 1,828 మంది ఏఎన్ఎంలతో పాటు ఆశవర్కర్లు, డాక్టర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. సమావేశంలో మెడికల్ అధికారులు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
7వ జోన్ డీఐజీ చౌహాన్ జహీరాబాద్: రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీస్ చెక్పోస్టులను పకడ్బందీగా నిర్వహిస్తూ అక్రమ రవాణాకు వీలు లేకుండా చూడాలని 7వ జోన్ డీఐజీ ఎల్.ఎస్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు. బుధవారం ఆయన జహీరాబాద్లోని డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణం రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా పక్క రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందన్నారు. అలాగే అధిక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. బ్లాక్ స్పాట్ల వద్ద సీసీ కెమెరాల నిఘాను కట్టుదిట్టం చేయాలన్నారు. నేరాలను నియంత్రించడానికి ఎప్పటికప్పుడు సబ్ డివిజన్ అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ కేసుల చేధనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, సీఐ శివలింగం, ఆయా పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్.. ఉన్నారా..?
మెదక్ కలెక్టరేట్: తప్పుల్లేని ఓటరు జాబితా లక్ష్యంగా కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లాలో 88.77 శాతం ఓటరు మ్యాపింగ్ పూర్తి కాగా, ఓటరు జాబితా సవరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు బీఎల్ఓలకు శిక్షణ సైతం ఇచ్చారు. వారు జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని 21 మండలాల్లో జూలై 24 వరకు పర్యటించి ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం మొత్తం 666 మంది పనిచేయను న్నారు. ఇందులో 586 మంది బీఎల్ఓలు (బూత్ లెవల్ అధికారులు), 16 మంది ఏఈఆర్టీలు, 64 మంది బీఎల్ఓ సూపర్వైజర్లు ఉన్నారు. పౌరులంతా భాగస్వాములు కావాలి తప్పుల్లేని ఓటరు జాబితా తయారీలో పౌరులంతా భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలో 2కే రన్ను ప్రారంభించి మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా ఖచ్చితత్వంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమం నేటి నుంచి జిల్లాలో ప్రారంభమవుతుందని, ఇందులో ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఓటరు జాబితాలో నమోదు చేసుకున్న వారు తమ పేర్లను వెబ్సైట్లో తనిఖీ చేసుకోవచ్చని సూచించారు. అవసరమైతే సవరణలు, మా ర్పులు, చేర్పుల కోసం బూత్ లెవెల్ అధికారుల ను సంప్రదించాలన్నారు. అనంతరం జిల్లాను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సెల్ఫీ పాయింట్లో కలెక్టర్, అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. బీఎల్ఓల ఇంటింటి సర్వే జిల్లాలో 666 మంది నియామకం -
బీఆర్ఎస్ పాలనలో అప్పుల పాలు
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రామాయంపేట(మెదక్): బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో రాష్ట్రం అప్పులపాలైందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆరోపించారు. బుధవారం మండలంలోని కాట్రియాలలో ఇందిరమ్మ ఇళ్లు, పర్వతాపూర్లో పాఠశాల ప్రహారీ పనులు ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులను వెచ్చిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇళ్లు మంజూరు చేస్తామని మోసగించిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే తన సొంత నిధులతో రెండు గ్రామాల్లో బోరు మోటార్లను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్లు కొత్త స్రవంతి, తార్యానాయక్, ఉప సర్పంచ్లు బాబూనాయక్, ఈశ్వర్, పార్టీ మండలశాఖ అధ్యక్షుడు మహేందర్రెడ్డి, కౌన్సిలర్ నాగరాజు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రామకిష్టయ్య, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నగేశ్, జిల్లా నాయకులు నాగులు, రమేశ్చారి, ఎల్లం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే..
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ నర్సాపూర్ రూరల్: నీట్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ విమర్శించారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ ప్రారంభించిన ‘ఛాత్రోన్ కి గూంజ్’ ఉద్యమానికి మద్దతుగా బుధవారం నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, తరచూ లీక్ అవుతున్న ప్రశ్నాపత్నాలు, ఉద్యోగ నియామకాల ప్రక్రియలో జాప్యం, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయలేని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిజ్వాన్, నాయకులు విజయ్ కుమార్, అశోక్గౌడ్, సుధీర్ కుమార్, పాషా, అజ్మత్, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాల నా యకులు పాల్గొన్నారు. సమాచారం లేకుండానే ర్యాలీ కిందిస్థాయి నాయకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ర్యాలీ నిర్వహించడంపై కొంత మంది కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్గాంధీ ప్రారంభించిన ఉద్యమానికి మద్దతుగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు నిలబడతాడన్న సంగతి మరిచి ఒంటెద్దు పోకడతో తు తూ మంత్రంగా ర్యాలీ నిర్వహించడం సరికాదన్నారు. -
ఆత్మలకూ..
గురువారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2026ఆపన్నులకు అందించే చేయూత పింఛన్లు పక్కదారి పడుతున్నాయి. లబ్ధిదారులు చనిపోయి ఏళ్లు గడుస్తున్నా, వారికి ప్రతీనెలా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న (లైవ్ అథెంటికేషన్)తో అసలు విషయం బయటకు రాగా, ఇప్పటివరకు 1,843 మంది మృతుల పేరుపై పింఛన్లు వస్తునట్లు గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. – మెదక్జోన్ జిల్లాలో 10 రకాల చేయూత పింఛన్లు కలిపి మొత్తం 1,08,402 ఉన్నాయి. వీటిలో 59,841 మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల ద్వారా వారి అకౌంట్లలో ప్రతి నెల డబ్బులు జమ చేస్తున్నారు. అలాగే పోస్టాఫీస్ ద్వారా 48,561 మందికి పంపిణీ చేస్తున్నారు. వీరి కోసం ప్రతీ నెలా ప్రభుత్వం రూ. 24.82 కోట్లు అందజేస్తుంది. అయితే ఈనెల 1 నుంచి 30 వరకు ప్రతి పింఛన్దారుడి ఫేస్ రికగ్నేషన్ (ఎఫ్ఆర్ఎస్) తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించటంతో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నారు. బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్ పొందుతున్న 59,841 లబ్ధిదారుల్లో 1,843 మంది చనిపోయి ఏళ్లు గడుస్తున్నా, ప్రతి నెల పింఛన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. గడిచిన 8 ఏళ్లలో వీరికి సుమారు రూ.35.66 కోట్ల పైచిలుకు చెల్లించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు లబ్ధిదారుల మరణాన్ని తెలుసుకొని పింఛన్ నిలిపి వేయాల్సిన పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ పరిధిలో పనిచేసే వార్డు అధికారులు చూసీ చూడనట్లు వదిలేయటంతోనే ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుల కుటుంబీకులతో లాలూచీ పడి వదిలేశారా..? అన్న సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ‘పేట’లోనే అత్యధికం మృతుల చేయూత పింఛన్లు అందుకుంటున్న వారిలో మొదటి స్థానంలో పాపన్నపేట మండలం ఉంది. ఇక్కడ ఏకంగా 278 మందికి చనిపోయిన వారి పేర్లపై పింఛన్ అందజేస్తున్నారు. తర్వాతి స్థానాల్లో వెల్దుర్తి మండలంలో 228, నిజాంపేటలో 220, హవేళిఘణాపూర్ 190, మెదక్ మున్సిపాలిటీ 146, టేక్మాల్ 143, శివ్వంపేట 122 మంది మృతుల పేరిట పింఛన్ పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని మండలాల్లో పదుల సంఖ్యలో మృతులకు ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. అర్హులకెప్పుడో..? చేయూత పింఛన్ల కోసం అర్హులైన ఎంతో మంది ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 10,840 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,240 మంది ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్, ప్రజావాణి ద్వారా 9,600 మంది దరఖాస్తు చేసుకొని పింఛన్ల నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో 1,843 మంది మృతులకు పింఛన్లు ఫేస్ రికగ్నేషన్తో వెలుగుచూసిన అక్రమాలు ఈ సంఖ్య పెరిగే అవకాశం రూ.35.66 కోట్లు పక్కదారి -
నగల కోసమే అమ్మమ్మ హత్య
రామాయంపేట(మెదక్): నగల కోసం సొంత అమ్మమ్మను హత్య చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మంగళవారం స్థానిక సీఐ సైదా కేసు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన దోమకొండ సాయవ్వ(63)కు కుమారునితోపాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందరి వివాహాలు అయ్యాయి. కుమారుడు తన భార్యాపిల్లలతో కలిసి వేరే ఇంట్లో ఉంటుండగా, సాయవ్వ ఒక్కరే తన పాత ఇంట్లో ఉంటోంది. ఈనెల 17న రాత్రి ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు సైతం కనిపించలేదు. దీనికి తోడు ఆమె మెడపై కమిలిపోయిన గుర్తులు ఉండటంతో అంత్యక్రియల అనంతరం ఈనెల 21న ఆమె కుమారుడు శ్యామ్, తన తల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులను విచారించగా, హత్యోదంతం వెలుగుచూసింది. మృతురాలి చిన్న కూతురు లక్ష్మి కుమారుడు మొగిలి విశాల్(21), అతని స్నేహితుడు బీరగొండ ప్రశాంత్ (21)తో కలిసి 17న రాత్రి 11 గంటలకు పథకం ప్రకారం తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. కల్లులో మత్తుమాత్రలు కలిపి ఆమెకు తాగించగా, ఆమె స్ఫృహ తప్పింది. అనంతరం ప్రశాంత్ సాయవ్వ కాళ్లు పట్టుకోగా, మనవడు విశాల్ ఆమె గొంతు నులిమి హతమార్చాడు. చనిపోయిందని నిర్ధారణ చేసుకున్న ఇద్దరూ ఆమె చేతికి ఉన్న బంగారు ఉంగరం, చెవి కమ్మలు, రూ. 7వేల నగదు తీసుకొని పారిపోయారు. ఈనెల 22న నిందితులిద్దరిని రామాయంపేటలో పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను రిమాండ్కు తరలించారు. మనవడు, అతడి స్నేహితుడి అరెస్టు కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు -
చేపలు పట్టేందుకు వెళ్లి..
చెరువులో మునిగి వ్యక్తి మృతి శివ్వంపేట(నర్సాపూర్): చేపలు పట్టేందుకు చెరువులోకి దిగిన వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన శివ్వంపేటలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ సాయిలు తెలిపిన వివరాల ప్రకారం... బిక్యా పంచాయతీ తుక్యాతండాకు చెందిన కోల విఠల్(38) సోమవారం సాయంత్రం చేపలు పట్టేందుకు స్థానిక పెద్దచెరువు వద్దకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం చెరువు వద్ద వెతుకుతుండగా మృతదేహం కనిపించింది. చేపలు పడుతుండగా వల కాళ్లకు చుట్టుకొని నీటమునిగి మృతిచెందాడని తెలిపారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రేపటి నుంచి అమలు వర్గల్(గజ్వేల్): విశేషమైన భక్తజనాదరణ కలిగిన నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో ఆలయ వేళలు మారుతున్నాయి. భక్తులకు నిరీక్షణ లేకుండా ఇక రోజంతా శ్రీవారి దర్శనభాగ్యం లభించనుంది. అదేవిధంగా పూజాకార్యక్రమ వేళలోనూ మార్పులు చేశారు. భక్తుల దర్శనం కోసం ఆలయం ప్రతిరోజు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు తెరిచిఉంటుంది. శని, ఆదివారాల్లో ఎలాంటి విరామం లేకుండా ఉదయం 5.30 నుంచి రాత్రి 8.30 వరకు తెరిచి ఉంటుంది. పూజా కార్యక్రమాల్లోనూ మార్పు చేశారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం గురువారం నుంచి నూతన వేళలు అమలులోకి వస్తాయని ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
వైభవంగా ఎల్లమ్మకు బోనాలు
పెద్దశంకరంపేట(మెదక్): రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం గ్రామ పురవీధులగుండా రేణుకా ఎల్లమ్మకు మహిళలు భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తరలివెళ్లి బోనాలను సమర్పించారు. యువకుల నృత్యాలు, భాజాభజంత్రీల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయం : ఎస్పీ మెదక్జోన్: డ్రగ్స్రహిత సమాజమే ధ్యేయంగా యువత ముందుకు సాగాలని ఎస్పీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలకు చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలో వన్–డే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలను ఆయన ప్రారంభించారు. మాదక ద్రవ్యాలు యువత జీవితాలు, కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్కు బానిసైతే ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు, కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయన్నారు. డ్రగ్స్కు నో చెప్పి, క్రీడలకు ఎస్ చెప్పాలని కోరారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్సింగ్, డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ టౌన్ సీఐ మహేశ్, వివిధ కళాశాలల విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. విత్తన మేళాతో మేలు జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తూప్రాన్: ప్రభుత్వం సూచించిన వరి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్ సూచించారు. మంగళవారం పట్టణంలోని రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళాకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రభుత్వం అందిస్తున్న ఏడు రకాల విత్తనాలను సాగు చేసి క్వింటాళ్లకు రూ.500 బోనాస్ను పొందాలని సూచించారు. కన్జూమర్ ఫోరం అధ్యక్షురాలు గాయత్రి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, నర్సాపూర్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు సంధ్యారాణి, టెక్నికల్ వ్యవసాయ అధికారి యాదగిరి, మండల వ్యవసాయ అధికారి గంగుమల్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. రీసర్వేకు సహకరించండి జిల్లా భూసర్వే రికార్డుల అధికారి కిషన్ నర్సాపూర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీసర్వే కోసం భూ యజమానులు సహకరించాలని జిల్లా భూసర్వే రికార్డుల అధికారి కిషన్ కోరారు. మంగళవారం మండలంలోని అద్మాపూర్లో ’భూభారతి’ కార్యక్రమంలో భాగంగా భూముల రీసర్వేపై తహసీల్దార్ శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కిషన్ మాట్లాడారు. రీసర్వే ద్వారా భూముల హద్దులతో పాటు ప్రతి ఒక్కరి భూమి విస్తీర్ణం స్పష్టంగా నమోదవుతుందని, దీనివల్ల గట్ల పంచాయతీలు లేకుండా పటిష్టమైన రికార్డులు తయారవుతాయని చెప్పారు. నర్సాపూర్ మండలంలోని నియమతల్లిగూడ, ఎల్లాపూర్ గ్రామాల్లో ఇప్పటికే ఈ పనులు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామసభలో డివిజనల్ సర్వే అధికారి రామ్రెడ్డి, మండల సర్వే అధికారి అభిలాష్, ఆర్ఐ సిద్దిరాం రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అంగన్వాడీపై ఫోకస్
మెదక్జోన్: అంగన్వాడీ కేంద్రాల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనునట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ అయితే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందటంతో పాటు ఆటపాటలతో కూడిన విద్య పిల్లలకు అందనుంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,076 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటి పరిధిలో అల్లాదుర్గం, మెదక్, నర్సాపూర్, రామాయంపేట లలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. కాగా జిల్లాలో 5,600 మంది గర్భిణులు, 3,749 మంది బాలింతలుండగా, సున్నా నుంచి మూడేళ్ల వయస్సుగల చిన్నారులు 29,181 మంది ఉన్నారు. 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులు 24,347 మంది ఉన్నారు. కాగా బాలింతలు, గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల్లో నిత్యం ఒక్కోగుడ్డు, 200 మి.లీ పాలు, భోజనం అందిస్తారు. అలాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల చిన్నారులకు నెలకు 16 గుడ్లు, రెండున్నర కిలోల బాలామృతంను ఇళ్లకు పంపిస్తారు. 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లోనే రోజుకో గుడ్డు, పాలు, భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. ఖాళీల కొరత.. అందని పౌష్టికాహారం! జిల్లాలో 1,076 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటిలో 1,001 మంది టీచర్లు విధులు నిర్వహిస్తుండగా, 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 1,076 సహాయకుల పోస్టులకు 733 మంది విఽ దులు నిర్వహిస్తున్నారు. కాగా 343 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం టీచర్లు, ఆ యాలు 418 పోస్టులు ఖాళీలు ఉండటంతో ఆ కేంద్రాలకు దగ్గరలో ఉన్నటువంటి ఇతర అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో వాటిపై సరైన నిర్వహణ లేకపోవటంతో లబ్దిదారులకు పౌష్టికాహారం అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో ఖాళీల భర్తీరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయబోతుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఖాళీలు భర్తీ అయితే బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందనుంది. అంగన్వాడీ కేంద్రంరిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడో? పోస్టుల భర్తీకి కసరత్తు వారంలో విడుదల కానున్న నోటిఫికేషన్ జిల్లా వ్యాప్తంగా 75 టీచర్లు, 343 సహాయకుల ఖాళీలు భర్తీతో లబ్ధిదారులకందనున్న పౌష్టికాహారంఅంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకుల పోస్టులు 418 ఖాళీ ఉండగా వాటిలో సింహాభాగం రిటైర్మెంట్ అయిన వారే ఉన్నారు. రిటైర్మెంట్ టీచర్లకు రూ. 2 లక్షలు, సహాయకులకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం బెనిఫిట్ ఇవ్వాల్సి ఉండగా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఎప్పుడిస్తారని నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. -
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
తూప్రాన్: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను కలెక్టర్ ప్రారంభించి, ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉండేలా నిల్వలు ఉంచాలని అధికారులను ఆదేశించారు. రెతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు, ధ్రువీకరించిన డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలు సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ బావయ్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి దేవ్కుమార్, సర్పంచ్ అనూష భాస్కర్ యాదవ్, ఏఎంసీ చైర్ పర్సన్ కీర్తన విఠల్ రెడ్డి, ఏడీఏ టెక్నికల్ వినయ్, ఏడీఏ నర్సాపూర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. ముగింపు దశలో ధాన్యం కొనుగోళ్లు మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని 531 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ముగిశాయని, మరో రెండు కేంద్రాలు మాత్రమే మిగిలినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 531 కేంద్రాల్లో ఇప్పటి వరకు 95, 313 మంది రైతుల నుంచి 4,21,083 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. అలాగే 90,221 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.928.85 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. జిల్లాలో మరో రెండు కేంద్రాల్లో కొంతమేర ధాన్యం మిగిలి ఉందని, త్వరలోనే పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అత్యధికంగా ధాన్యం దిగుబడి రావడంతో కొనుగోళ్లు ఆలస్యం జరిగిందన్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
పూరి గుడిసెల్లేని జిల్లానే లక్ష్యం
● 2వ విడతలో వారికే ప్రాధాన్యం ● జిల్లా వ్యాప్తంగా 2,500 ఇళ్ల గుర్తింపు ● పాత ఇంటికీ రూ.2 లక్షల సహాయంమెదక్జోన్: ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రెండో విడతలో పాత, పూరిగుడిసెల వారికి సహాయం అందించనున్నారు. రెండో విడత ఇందిరమ్మ పథకంలో భాగంగా జిల్లాకు ఆరువేల ఇళ్లు మంజూరు కాగా వాటిలో మొదటి ప్రధాన్యత పూరిగుడిసెలు ఉన్న వారికి ఇస్తున్నారు. గతంలో నిర్మించుకున్న పాత ఇళ్లకు కూడా రూ.2 లక్షల సాయం అందించనున్నారు. కొనసాగుతున్న సర్వే రెండో విడతలో భాగంగా పూరిగుడిసెల్లో నివాసం ఉంటున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,500 పూరిగుడిసెలు ఉన్నట్లు అధికారులు సర్వేలో గుర్తించారు. జిల్లాకు ఆరు వేల ఇళ్లు మంజూరు కాగా వాటిలో పూరి గుడిసెలు పోనూ మిగతా 3,500 ఇందిరమ్మ ఇళ్లను గతంలో నిర్మించుకొన్న వారికి ఎంపిక చేస్తున్నారు. ఇందులో పూరిగుడిసెల్లో నివాసం ఉండేవారికి రూ.లక్ష రుణం ఇప్పించి ఇల్లు నిర్మించుకునే విధంగా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. పాత ఇళ్లకు రూ.2 లక్షలు గతంలో ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించుకుని గోడలపై రేకులు వేసుకున్న లబ్ధిదారులకు సైతం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రభుత్వం ఇచ్చే సహాయంతో గోడలపై రేకులు తొలగించి వాటిపై స్లాబు వేసుకునేందుకు ఇది చక్కటి అవకాశం. -
పాఠశాలల్లో గంట పాటు క్రీడలు
చేగుంట(తూప్రాన్): పాఠశాలల్లో ఒక గంట పాటు క్రీడల్లో శిక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా చేగుంటలో ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని డీఈఓ రాజు, సర్పంచ్ స్రవంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ... క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు పోటీతత్వం అలవడుతుందని, అందుకోసం పాఠశాలల్లో క్రీడల పట్ల విద్యార్థులకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ నీరజ, పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు నాగరాజు, యోగాకోచ్ గణేశ్రవికుమార్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు, పీడీలు శారద, శంకర్, పీఈటీలు నరేశ్, గిరిజ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు లక్ష్మణ్, మనోహర్రావు, వెంకటేశ్, విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని డీఈఓ రాజు అన్నారు. మంగళవారం మండలంలోని శేరీల ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ సెక్షన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. చిన్నారులకు ప్రీప్రైమరీ విద్య ఎంతో కీలకమన్నారు. చిన్న వయస్సులోనే విద్యపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రీ ప్రైమరీ సెక్షన్ ప్రారంభించడాన్ని తల్లిదండ్రులు స్వాగతించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. అనంతరం ఎంఈఓ బుచ్చనాయక్ మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం మండలంలో నాలుగు పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక సెక్షన్ మంజూరయిందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, కాంప్లెక్స్ హెచ్ఎం సాంబయ్య, పాఠశాల హెచ్ఎం ప్రణీద్కుమార్, ఏఏపీసీ చైర్మన్ రేణుక తదితరులు పాల్గొన్నారు.జిల్లా విద్యాధికారి రాజు -
తడారుతున్న నారుమళ్లు
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026చినుకు రాలదు..చింత వీడదుమెదక్ అర్బన్: వానాకాలం సాగు.. రైతన్న మెడ మీద కత్తిలా మారింది. కార్తెలు గడుస్తున్నా.. వరుణుడు కరుణించడం లేదు. పొలాలు బీళ్లులా మారాయి. వరి నారు మళ్లు తడారుతున్నాయి. రైతన్న కళ్లు చెమ్మబారుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 36 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మెతుకు సీమ పంటలకు ప్రాణం పోసే.. ఘనపురం ప్రాజెక్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఎల్నినో ప్రభావం ఒక వైపు..ఆకాశన్నంటిన ఎరువుల ధరలు మరోవైపు అన్నదాతల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈయేడు ఖరీఫ్లో 3,67.668 ఎకరాలు సాగవుతుంది అనుకుంటే.. ప్రతికూల పరిస్థితుల్లో అది ఎంత వరకు సాధ్యమవుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండుతున్న ఎండలు.. రోహిణి.. మృగసిర కార్తెలు కదిలి పోయినా చినుకు జాడ లేదు. మరో వైపు ఎండలు మండుతున్నాయి.జిల్లాలో సగటున 81 మి.మీ వర్ష పాతం కురువాల్సి ఉండగా, ఇప్పటి వరకు 51.7 మి.మీ. మాత్రమే నమోదు అయ్యింది. వాతావరణ నివేదిక ప్రకారం సుమారు 36 మి.మీ లోటు ఉంది.అత్యధికంగా నార్సింగి మండలంలో జూన్ నెలలో 80.4 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 20.4 మి.మీ మాత్రమే నమోదయ్యింది.ఇలా జిల్లాలో ఎక్కడా కూడ ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు.ఖరీఫ్ పై ఆశతో జిల్లాలో ఇప్పటికే రైతులు ,రోహిణి కార్తెలో వరి తుకాలు పోశారు.అయితే వర్షాలు పడక పోవడంతో ,వరి మొక్కలను రక్షించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. బోర్లు ఉన్న రైతులు మాత్రం ఎలాగోలా తుకాలు కాపాడుకుంటున్నారు. ఇక మెతుకు సీమ పంటలకు ప్రాణం పోసే ఘనపురం ప్రాజెక్టు కింద, సింగూరు మరమ్మతుల నేపథ్యంలో క్రాప్ హాలిడే ప్రకటించారు. దీంతో సుమారు 30 వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆకాశాన్నింటిన ఎరువుల ధరలు ‘గోటి చుట్టు మీద రోకటి పోటులా’ ఒక వైపు వర్షాభావం మరో వైపు ఎరువుల ధరా భారం అన్నదాతను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జూన్ నెల మొదటి వారం నుంచి 15 రోజుల్లో ఎరువుల ధరలు రెండు సార్లు పెరిగాయి. ఒక్కో సంచిపై రూ.650 వరకు పెరగడం.. ఫర్టిలైజర్ డీలర్లు పాత ఎరువులనే, కొత్త ధరలకు అమ్ముతున్నా..గత్యంతరం లేక రైతులు అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నారు. వానాకాలం సాగు.. ప్రశ్నార్థకం జిల్లాలో 36 శాతం లోటు వర్షపాతం ఇటు క్రాప్ హాలిడే.. అటు ఎల్నినో జిల్లాలో 3,67,668 ఎకరాల సాగు అంచనా -
ప్రభుత్వాస్పత్రులకు సుస్తీఉమ్మడి జిన్నారం మండలంలో ప్రభుత్వాస్పత్రులు నిర్మించినా, ప్రారంభానికినోచుకోలేదు. వివరాలు 8లో u
వానాకాలం పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్న వేళ విత్తన మేళా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. మంగళవారం నుంచి వారం పాటు జిల్లాలోని 47 రైతు వేదికల్లో కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఎల్నినో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పంటల మార్పిడితో పాటు 7 రకాల వరి విత్తనాలకు మాత్రమే బోనస్ వస్తోందంటూ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. – మెదక్జోన్విత్తన మేళాకు● జిల్లాలోని 47 రైతు వేదికల్లో ఏర్పాట్లు ● అందుబాటులో విత్తనాలుజిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 3.67 లక్షల పైచిలుకు ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో సింహభాగం వరి మాత్రమే సాగు చేస్తుండగా, ఈ ఏడాది ఎల్నినో మప్పు పొంచి ఉంది. ఈనేపథ్యంలో వరికి బదులు, ఆరుతడి పంటలు సాగు చేయాలని, అలాగే సన్నాలకు బోనస్ పొందాలంటే ప్రభుత్వం సూచించిన బీపీటీ– 5204, ఆర్ఎన్ఆర్–15048, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరాం, కేఎన్ఎం–1638, డబ్ల్యూజీఎల్–44, కేఎన్ఎం–7715 రకాల విత్తనాలు మాత్రమే సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించనున్నారు. అలాగే నాణ్యమైన విత్తనాలను డీలర్లతో రైతు వేదికల్లో అందుబాటులో ఉంచి విక్రయించేందుకు చర్యలు చేపట్టింది. 7 రకాల సన్నాలకే బోనస్ ఈఏడాది ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ 1 నుంచి వానాకాలం సీజన్ ప్రారంభం కాగా, గడిచిన 23 రోజుల్లో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 81.0 మి.మీ వర్షం పడాల్సి ఉంది. అయితే కేవలం 51.7 మి.మీ మాత్రమే నమోదైంది. ఈ లెక్కన ఇప్పటివరకు 29.3 మి.మీ లోటు వర్షపాతం నమోదు అయింది. ఈనేపథ్యంలో వరికి బదులుగా ఇతర ఆరుతడి పంటలైన పప్పు దినుసులు, నూనె గింజలు, పలు రకాల కూరగాయలు సాగు చేయాలని, అందుకు సంబంధించిన విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచనున్నారు. అయితే ఇప్పటికే 40 శాతం మంది రైతులు బోరుబావుల ఆధారంగా తుకాలు పోశారు. ప్రస్తుతం 7 రకాల సన్నాలకు మాత్రమే బోనస్ వస్తోందని అధికారులు చెబుతుండటతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తుకాలు పోయకముందు చెప్పాల్సిందని వాపోతున్నారు. నేటి నుంచి రైతులకు అవగాహన ఏర్పాట్లు పూర్తి చేశాం జిల్లాలోని 47 రైతు వేదికల్లో నేటి నుంచి జరిగే విత్తన మేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. వరికి బదులు ఆరుతడి పంటలు, 7 రకాల సన్నాలకు బోనస్ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తాం. – దేవ్కుమార్, డీఏఓ -
జొన్న కొనరు.. కష్టాలు కనరు
రామాయంపేట(మెదక్): జొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వారం రోజుల క్రితం కొనుగోలు కేంద్రం మూతపడినా ఇంకా ఐదు వేల క్వింటాళ్ల వరకు అందులోనే ఉండిపోయాయి. సిద్దిపేట జిల్లాలో ఉన్న మార్క్ఫెడ్ గోదాంకు మూడు లారీల్లో తరలిన జొన్న బస్తాలు నాణ్యత సరిగా లేవనే సాకుతో అధికారులు వాపస్ పంపించారు. సదరు లారీల అద్దె, వెయిటింగ్ చార్జీలు ఇవ్వాలని లారీల యజమానులు డిమాండ్ చేస్తుండటం, మరోవైపు వాపస్ వచ్చిన జొన్నలను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. వాపస్ వచ్చిన జొన్నలు కాకుండా తూకం పూర్తయి గోదాంలకు తరలించడానికి మరో మూడు వేల క్వింటాళ్ల మేర కేంద్రంలో సిద్ధంగా ఉన్నాయి. కాగా, జొన్న సంచులు లారీలో లోడు చేసే వరకు సంబంధిత రైతులదే పూర్తి బాధ్యత అని అధికారులు స్పష్టం చేయడంతో చేసేదేమిలేక బస్తాల కాపలా ఉంటున్నారు. ఈమేరకు సోమవారం రైతులు కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఎంపీకి మొరపెట్టుకున్న రైతులు ఆదివారం రామాయంపేటకు వచ్చిన మెదక్ ఎంపీ రఘునందన్రావుతో రైతులు ఈవిషయమై మొరపెట్టుకున్నారు. దీంతో ఎంపీ పౌర సరఫరాలశాఖ రాష్ట్ర అధికారి, జిల్లా అధికారులతో మాట్లాడారు. బాధిత రైతులకు న్యాయం చేస్తామని ఎంపీతో చెప్పిన అధికారులు, ఆదిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో వాపస్ వచ్చిన జొన్నలను ఎక్కడ అమ్మాలని, ప్రైవేట్ వ్యాపారులు సైతం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొనుగోలు కేంద్రంమూతపడిన అందులోనే స్టాక్ నాణ్యత సరిగా లేదనే నెపంతో వాపస్ ఆందోళనలో అన్నదాతలు -
సత్వర పరిష్కారం చూపండి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలు వెంట వెంటనే పరిష్కరించాలని డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్ అధికారులకు సూచించారు. సోమ వారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ భారతి 40, ఇందిరమ్మ ఇళ్లు 23, పెన్షన్ 4, ఇతర సమస్యలపై 33 కలిపి మొత్తం 100 వినతులు అందజేశారు. ఈసందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. అర్జీలను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ను వెంటనే నిలిపివేయాలి మెదక్ కలెక్టరేట్: ‘సర్’ పేరిట అనేక కారణా లు చూపుతూ అర్హులైన వారి ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతుందని, దీనిని తాము అడ్డుకుంటామని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఖాలేఖ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వెంటనే సర్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. -
20 రోజుల క్రితం తెచ్చాను
20 రోజుల క్రితమే 41 క్వింటాళ్ల జొన్నలను కేంద్రానికి తెచ్చాను. తూకం పూర్తయింది. కాగా కేంద్రం మూతపడి వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు లారీలో లోడ్ చేయలేదు. గోదాంలకు వెళ్లే వరకు సంబంధిత రైతులదే బాధ్యత ఉంటుందని అధికారులు అంటున్నారు. ఏం చేయాల్లో అర్థ కాని పరిస్ధితి నెలకొంది. – గొల్ల కిషన్, రైతు, దంతేపల్లినాణ్యత లేదంటున్నారు తాను 55 క్వింటాళ్ల జొన్నలను తూకం వేయించి లారీలో లోడ్ చేయించాను. వాటిని శుభ్రపరిచి ఎలాంటి మట్టి లేకుండా జాలీ పట్టించి క్లీన్ చేయించిన తర్వాతే తూకం వేయించాను. ఇప్పుడు నాణ్యత సరిగా లేదని వాపస్ పంపించారు. వాటిని ఏం చేసుకోవాలె. – కంలియా నాయక్, కాట్రియాల తండా -
తరుగు పేరుతో నిలువు దోపిడీ
అల్లాదుర్గం(మెదక్): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఐకేపీ అధికారులు, సిబ్బందికి చేతివాటంగా తయారయ్యాయి. తూకం వేయగానే రైతులకు కొనుగోలు రసీదు ఇవ్వాలి. కానీ తెల్ల కాగితంపై రాసి ఇచ్చారు. రైస్ మిల్లుకు ధాన్యం పంపిన తర్వాత తూకంలో మోసం చేయడంతో అలాదుర్గంలో సోమవారం రైతులు ఐకేపీ సిబ్బందిని నిలదీశారు. ధాన్యం కొనుగోలు అక్రమాల్లో కిందిస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పెద్దఎత్తున ముడుపులు ముట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు రైతుల ధాన్యం మ్యాచర్ రాకుంటే 42 కిలోలకు బదులు 44 కిలోల తూకం వేసి 42 కిలోలకే డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. మ్యాచర్ వచ్చిన ధాన్యం, రానివి ఒకే లారీలో పంపడంతో మిల్లర్లు మ్యాచర్ లేదని 44 కిలోల 600కు తూకం చేసుకున్నారని రైతులు వాపోయారు. ఒక్కో లారీకి రైతుల నుంచి రూ. 20 వేల పైనే దోపిడీకి పాల్పడినట్లు ఆరోపించారు. కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ చేపడితే అక్రమాలు బయటపడతాయని చెబుతున్నారు. -
సత్వరమే పరిష్కరించండి
మెదక్జోన్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు లను జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చి వినతిపత్రాలు అందజేశారు. ఈ విషయంపై ఎస్పీ నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా పోలీస్స్టేషన్ల అధికారులతో మా ట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారం చూపాలంటూ ఆదేశించారు. చిరుధాన్యాల సాగు మేలు నర్సాపూర్ రూరల్: చిరు ధాన్యాలు సాగు చేసి మంచి లాభాలు సాధించాలని తునికి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నల్క ర్ రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని అహ్మద్నగర్లో తునికి కృషి విజ్ఞాన కేంద్రం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా శాస్త్రవేత్తలు డాక్టర్ నల్కర్, డాక్టర్ ప్రతాప్రెడ్డి, డాక్టర్ హరిప్రసన్న మాట్లాడుతూ రసాయన వాడకంతో ఇప్పటికే భూములు భూసారం కోల్పోయాయని తెలిపారు. భూమిలో సేంద్రియ కార్బన్ పెంపొందించడం కోసం చేపట్టాల్సిన పద్దతులను రైతులకు వివరించారు. పంటలు సాగు చేసే ముందు మట్టి నమూనా సేకరణ, భూసార పరీక్షలు తప్పనిసరిని సూచించారు. జీవన ఎరువుల వాడకంపై వివ రించారు. కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. కార్మికులను పర్మినెంట్ చేయాలి మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు పీఆర్సీలో నిర్ణయించిన కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కార్మికులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీఓ 60 ప్రకటించినప్పటికీ జీఓలో పేర్కొన్న కేటగిరీల వారీ వేతనాలను మున్సిపల్ కార్మికులకు చెల్లించక పోవడం అన్యాయం అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. అలాగే మున్సిపల్ కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్లో అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోశ్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. నాణ్యతలో రాజీ పడొద్దు కౌడిపల్లి(నర్సాపూర్): సీసీ రోడ్డు పనుల నాణ్య తలో రాజీ పడొద్దని పీఆర్ డిప్యూటీ ఈఈ అమరేశ్వర్ అన్నారు. సోమవారం ఉపాధి హా మీ పథకంలో భాగంగా సీసీ రోడ్డుకు రూ. 14 లక్షలు మంజూరు కాగా, కౌడిపల్లి రామాల యం కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించి మాట్లాడారు. గ్రామా భివృద్ధిలో రోడ్లు ఎంతో ముఖ్యమని, పనుల్లో రాజీ పడొద్దని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రం కృష్ణాగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో మూడేళ్లు శిక్షణ పొందేందుకు లా పట్టభద్రులైనా ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి హమీద్ సోమవారం తెలిపారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు జూలై 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
గ్లోబెల్స్ ప్రచారం మానుకోండి
మెదక్జోన్: మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్రావు నిరంతరం కృషి చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గడిచిన రెండున్నరేళ్లలో ఎమ్మెల్యే రూ. వెయ్యి కోట్లకుపైగా ని ధులు తెచ్చారని తెలిపారు. అలాంటి నాయ కుడిని మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి విమర్శించడం సరికాదన్నారు. కేటీఆర్ చేసే గ్లోబల్ ప్రచారానికి పద్మారెడ్డి వంతుపాడటం ఎంతవరకు సమంజసమన్నారు. గతేడాది వర్షాకాలంలో భారీ వరదలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే పట్టించుకోలేదంటూ అబద్దాలు మాట్లాడుతున్నారని వాపోయారు. బీఆర్ఎస్ నేతలు ప్రజల సానుభూతి కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు, కొత్త పథకాలను అమలు చేస్తుందన్నారు. మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్, నాయకులు కానుగ భూపతిరాజ్, గంగాధర్, హఫిజొద్దీన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
టూరిజం హబ్గా తీర్చిదిద్దుతాం
ఆ శాఖ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్మెదక్ కలెక్టరేట్: జిల్లాను టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పటిష్ట ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట్ర టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ అన్నారు. సోమవారం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి రూ.2.5 కోట్లు కేటాయించామన్నారు. అవి టెండర్ స్టేజీలో ఉన్నాయన్నారు. ఖిల్లాకు తక్షణ అవసరాల కింద రూ. 57 లక్షలు మంజూరు చేశామన్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో అరైవ్– అలైవ్, కంటి పరీక్షల క్యాంపులు, హెల్మెట్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. -
అర్హుల ఓట్లు తొలగిపోవద్దు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో అర్హులైన పౌరులందరూ ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు అందరూ సహకరించాలన్నారు. ఈనెల 25 నుంచి జూలై 24 వరకు ‘సర్’ కార్యక్రమం జరుగుతుందన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ కేంద్రానికి ఒక బూత్ ప్రతినిధిని నియమించి వివరాలు అందించాలన్నారు. ఓటర్లు తమ వివరాలను అన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. సందేహాలుంటే టోల్ ఫ్రీ 9553866388 నంబర్కు కాల్ చేయాలన్నారు. జూలై 31, 2026న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయ నున్నట్లు చెప్పారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
ఏడుపాయల చైర్మన్ ఎవరికో?
పాపన్నపేట(మెదక్): పెద్దాయన గ్రీన్ సిగ్నల్తో పాపన్నపేటలో నామినేటెడ్ పదవుల పందేరం మొదలయ్యింది. ఈ మేరకు నాయకులు ఆదివారం మండల పరిఽధిలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఊరికో పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల, పాపన్నపేట ఏఎంసీ, మెదక్ డివిజన్ ఆత్మ కమిటీలకు పాలకవర్గాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా, ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్సీకి కేటాయించడంతో అర్కెలకు చెందిన చిట్యాల వినోద పేరు దాదాపు ఖరారు అయ్యింది. ఇక ఏడుపాయల చైర్మన్ పదవికి ఆరుగురి మధ్య పోటీ నెలకొంది. దీంతో చివరి నిర్ణయం మైనంపల్లి హన్మంతరావుకు వదిలి పెట్టాలని నిర్ణయించారు. ఇక ఆత్మ కమిటీలో పాపన్నపేట మండలంలోని 6 గురు ఆశవహులకు పదవి లభించే అవకాశముంది. అనుకున్నట్లు జరిగితే జూలైలో నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. 40 గ్రామాలు.. 30 పోస్టులు ఏడుపాయల పాలకమండలిలో 15 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎక్స్ అఫీషియోతో పాటు కొల్చారం మండలానికి రెండు, మెదక్ మండలానికి రెండు డైరక్టర్ పోస్టులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక మిగిలేవి చైర్మన్తో కలుపుకొని 10 డైరెక్టర్ పోస్టులు, మార్కెట్ కమిటీలో 18 డైరక్టర్ పోస్టులుండగా, నలుగురు నామినేటెడ్ పోను 14 మందిని పాలకవర్గంలోకి తీసుకోవచ్చు. ఇక మెదక్ ఆత్మ కమిటీలో 25 మంది సభ్యులుండగా, పాపన్న పేట మండలానికి 6 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. దీంతో మొత్తం మీద 30 మందికి నామినేటెడ్ పోస్టులు దక్కే ఛాన్స్ ఉంది. పదవుల పందేరానికిమొదలైన కసరత్తు జూలైలో భర్తీకి చర్యలు పెద్దాయన గ్రీన్ సిగ్నల్!రేసులో ఆరుగురు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల చైర్మన్ పదవిని ఆరుగురు నాయకులు ఆశిస్తున్నారు. కొత్తపల్లికి చెందిన మాజీ జెడ్పీటీసీ లింగన్న గారి మల్లప్ప, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ నాయక్, కిసాన్ సెల్ మండల శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, కొడుపాక మాజీ సర్పంచ్ పంతుల భూమన్న రేసులో ఉన్నారు. వీరితో పాటు యూత్ కాంగ్రెస్ విభాగం నుంచి కుర్తివాడ మాజీ ఎంపీటీసీ రాము చైర్మన్ అవకాశం ఇవ్వాలని కోరారు. -
వాట్సాప్లో పాఠశాల సేవలు
నారాయణఖేడ్: సర్టిఫికెట్లు, ఇతర సేవల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాలలు, ప్రభు త్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే రోజులు ముగిసిపోయాయి. సాంకేతికతను సామాన్యుడి ము ంగిట్లోకి తెస్తూ రాష్ట్ర విద్యాశాఖ డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. మీసేవ సహకారంతో వాట్సాప్ ద్వారా సేవలు అందించనున్నారు. విద్యార్థులకు తమకు అవసరమైన సేవలను ఇక ఒక్క క్లిక్తో ఆన్లైన్లోనే పొందనున్నారు. ఈ సౌకర్యంతో వేలాది మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు ఈ విద్యాసంవత్సరం నుంచే సేవలను అమలులోకి తెస్తామని ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగానే అమలు చేసింది. నాలుగు రోజుల క్రితం అధికారికంగా ప్రారంభించింది. కేవలం ఒక వాట్సాప్ సందేశంతో విద్యార్థులు తమ విద్యా పురోగతిని తెలుసుకోవడమే కాకుండా అవసరమైన ధ్రువపత్రాలను డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,265 ఉండగా, ఇందులో సుమారు 92 లక్షల మది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 10 మోడల్ స్కూల్స్లో 6,495 మంది, 22 కేజీబీవీల్లో 4,975, 11 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 6,596, 4 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 761, 7 గిరిజన సొసైటీ పరిధిలోని గురుకులాల్లో 3,387, 11 బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో 5,456, 12 మైనార్టీ గురుకులాల్లో 4,916, 4 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో 931 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. అందనున్న సేవలు.. విద్యార్థులకు ప్రస్తుతం కొన్ని రకాల సేవలు తక్షణం అందుతుండగా, మిగిత సేవలను అతి త్వరలో అందుబాటులోకి తసుకురానున్నారు. టెన్త్ మార్కుల మెమోలు, బోనాఫైడ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, విద్యార్థులు ప్రొగ్రెస్ కార్డులు, హాల్టికెట్ డౌన్లోడ్, ఫలితాల సమాచారం, మోమోల్లో మార్పుల కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రెండో దశలో యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ వివరాలు, విద్యార్థుల హాజరు శాతం, ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు, మధ్యాహ్న భోజనం వివరాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు, క్రీడలు, సహ పాఠ్య కార్యక్రమాల సమాచారం, రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ కార్యక్రమ వివరాలు, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ వివరాలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను సేకరించి ఇప్పటికే యాక్టివేట్ చేశారు. పాలపిట్ట డిజిటల్ మస్కట్ విద్యాశాఖ, మీసేవ సహకారంతో వాట్సాప్ ఆధారిత పాఠశాల సేవలు పొందేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర పక్షి పాలపిట్టను డిజిటల్ మస్కట్గా ఎంపిక చేసింది. యానిమేషన్ రూపంలో ఉండే ఈ పాలపిట్ట విద్యార్థులకు సంక్లిష్టమైన సమాచారాన్ని సులభతరమైన వీడియోల ద్వారా వివరించనుంది. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతిని ఎప్పటికప్పుడు గమనించేందుకు ఈ వాట్సాప్ సేవలు వారధిలా పనిచేయనున్నాయి. -
ఇదేం పాలకా..!
బడిని చూడాలిక.. సమస్యలు తీర్చాలిక ● సౌకర్యాలు కల్పిస్తేనే నాణ్యమైన విద్య ● ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే స్వగ్రామాల్లోని బడుల్లో అన్నీ సమస్యలే.. టీచర్ల కొరత... గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. 196 మంది విద్యార్థులుండగా బాలురు 94, బాలికలు 102 మంది ఉన్నారు. ఇంగ్లిష్, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు కొరత ఉంది. అలాగే ఫర్నిచర్ సమస్య ఉంది. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం లేదు. కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు మరింత విజ్ఞానం అందించాల్సిన అవసరం ఉంది. -
నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలి
మెదక్ కలెక్టరేట్: నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించి, ఫిట్మెంట్ అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిర్లక్ష్యం చేస్తే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అలాగే మెరుగైన ఫిట్మెంట్ అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి అందరికీ పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలన్నారు. మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు వెంటనే జీపీఎఫ్ ఖాతాలు తెరిపించి పాత పెన్షన్లోకి తీసుకోవాలన్నారు. అదే విధంగా 317 బాధితులందరికీ న్యాయం చేయాలన్నారు. ఇదిలా ఉండగా ఉద్యోగులందరి ఆరోగ్య భద్రతకు హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈసందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పద్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు రవీందర్రెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం చేస్తే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి -
అన్నదాతకు భరోసా
వానాకాలం సాగు పనులు ఊపందుకునే వేళ రైతాంగానికి ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఈనెల 30న ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. విత్తనాలు వేసే సమయానికి పెట్టుబడి సాయం అందనుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీజన్లో ఎన్ని ఎకరాల వరకు అందజేస్తారనేది తెలియాల్సి ఉంది. – మెదక్జోన్ జిల్లాలో 4 లక్షల పైచిలుకు వ్యవసాయ భూములుండగా, ఈ వానాకాలంలో 3.95 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. యాసంగి కొనుగోళ్లు చివరి దశకు చేరుకోగా, ఖరీఫ్ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈక్రమంలో ఈనెల 30న రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మధిరలో ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది. గతంలో లాగా నిధుల జమ నెలల తరబడి సాగ దీయకుండా, కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఎకరానికి రూ. 6 వేల చొప్పున అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు చేరేలా ప్రణాళికను రూపొందించింది. దీని వల్ల సకాలంలో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునే వీలు కలుగుతుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరనుంది. గతేడాది వానాకాలం సీజన్లో 3,68,072 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేయగా, సుమారు రూ. 220 కోట్లను పెట్టుబడి సాయంగా అందించారు. యాసంగిలో రెండెకరాలకే.. యాసంగి సీజన్లో జిల్లాలో 3,05,273 ఎకరాల్లో 2.67 లక్షల పైచిలుకు మంది రైతులు పంటలు పండించారు. మొత్తం 3.68 వేల ఎకరాలకు రూ. 220 కోట్ల మేర రైతు భరోసా నిధులు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం రెండు విడతల్లో ఒక్కో రైతుకు రెండెకరాల వరకు రూ.166 కోట్లను పెట్టుబడి సాయంగా అందించింది. ఈ లెక్కన ఇంకా రూ. 54 కోట్లు రెండెకరాలకు పైగా ఉన్నా రైతులకు సాయం అందలేదు. ఈ సీజన్లోనైనా పూర్తిస్థాయిలో అందజేస్తారా..? లేక యాసంగి లాగే కొంత మందికే ఇస్తారా అని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.30న ఖరీఫ్ పెట్టుబడి సాయం సీఎం ప్రకటనతో రైతుల్లో ఆశలు మొదలైన సాగు పనులు -
ప్రశాంతంగా నీట్
నీట్ రీ–ఎగ్జామ్ ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 481 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 423 మంది హాజరయ్యారు. మరో 58 మంది గైర్హాజరయ్యారు. ఇందులో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో పరీక్షకు అనుమతించలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగారు. ఉదయం 11 గంటల నుంచి 1.30 గంటల వరకు అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి పంపించారు. పరీక్షకు వచ్చిన అభ్యర్థుల్లో 90 శాతం బాలికలే కనిపించారు. పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఇతర అధికారులు పర్యవేక్షించారు. – మెదక్ కలెక్టరేట్ -
సమస్యల కూత!
జిల్లాలోనే పెద్దదైన అక్కన్నపేట రైల్వేస్టేషన్లో కనీస సౌకర్యాలు కరువై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా.. ఆదాయం సమకూరుతుంది. అయినప్పటికీ ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కల్పనలో మాత్రం రైల్వే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. – రామాయంపేట(మెదక్) అక్కన్నపేట రైల్వేస్టేషన్ సమస్యలకు నిలయంగా మారింది. స్టేషన్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. ముఖ్యంగా తాగునీటి పరిష్కారం విషయమై ఆశాఖ అధికారులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్లో కనీసం మూత్రశాలలు కూడా లేకపోవడంతో మహిళా ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదాయపరంగా ఉన్నత స్థానంలో ఉన్న ఈస్టేషన్లో కనీస వసతులు కరువయ్యాయి. అలాగే స్టేషన్లో కోతులు, కుక్కలు, పందుల బెదడ తీవ్రంగా ఉంది. కోతులు ప్రయాణికులపై దాడులు చేస్తూ వారి బ్యాగులు ఎత్తుకెళ్తుండటంతో భయాందోళన చెందుతున్నారు. పలువురు ప్రయాణికులు గాయపడిన సంఘటనలు ఉన్నాయి. స్టేషన్ చెత్తా చెదారంతో నిండిపోవటంతో పందుల బెడద తీవ్రంగా ఉంది. తాగునీటి ఎద్దడి తీవ్రం రైల్వేస్టేషన్లో నెలకొన్న నీటి ఎద్దడిని పరిష్కరించాలని ప్రయాణికులు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. రెండు, మూడు రోజులకోసారి ట్యాంకర్లో నీరు తెస్తున్నారు. అయినప్పటికీ అవి ఏ మూలకు సరిపోవడం లేదు. రైలు ఆగిన సమయంలో ప్రయాణికులు తాగు నీటి కోసం కుళాయిల వద్దకు పరుగులు పెడుతున్నా నీరులేక వెనుదిరుగుతున్నారు. ఇప్పటికై నా ఆశాఖ అధికారులు స్టేషన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కన్నపేట రైల్వేస్టేషన్లో వసతుల లేమి పట్టించుకోని అధికారులు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు -
రేకుల గదిలోనే తర‘గతి’
మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్రావు స్వగ్రామం బొప్పాపూర్లో ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. అందులో 1 నుంచి 7వ తరగతి వరకు విద్యను అందిస్తుండగా మొత్తంగా 49 మంది విద్యార్థులున్నారు. క్లాస్లకు సరిపడా తరగతి గదులున్నప్పటికీ మూడో తరగతి రేకుల గదిలో కొనసాగుతోంది. దీంతో ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో విద్యార్థులు వేడితో ఇబ్బంది పడుతున్నారు. అలాగే వర్షం కూరిస్తే రేకుల పై పడటంతో శబ్ధం వస్తుంటే క్లాస్ వినడం ఇబ్బందిగా మారుతోంది. అలాగే ఈ పాఠశాలలలో ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. విద్యార్థులకు చల్లటి తాగునీటిని తాగేందుకు వాటర్ కూలర్ను అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే 49 మంది విద్యార్థులకు రెండు మూత్రశాలలే ఉన్నాయి. -
మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా మల్లిక
రామాయంపేట(మెదక్): బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షు రాలిగా మల్లిక నియామకం అయ్యారు. ఈ మేరకు ఆదివారం పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ రఘునందన్రావు ఆమెను సన్మానించారు. తన నియామకానికి సహకరించిన వారికి మల్లిక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆలయాలు ప్రశాంతతకు నిలయాలు వెల్దుర్తి(తూప్రాన్): ఆలయాలు మానసిక ప్ర శాంతతకు నిలయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మన్నెవార్ జలాల్పూర్ కాళీమాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా నాయకులతో కలిసి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆలయాల పునరుద్ధరణకు కృషి చేయడం ఎంతో శుభ సూచకమని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. మహిళలకు చేయూత చిన్నశంకరంపేట(మెదక్): మహిళలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సొంత భవనాల్లో సమావేశాలు జరుపుకోవచ్చన్నారు. అనంతరం అంబాజిపేటలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం కొర్విపల్లిలో పోచమ్మతల్లికి బోనం సమర్పించారు కార్యక్రమంలో సర్పంచ్లు చంద్రశేఖర్, సబితాగౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మోహన్నాయక్, రమణ, గోపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మల్లన్న ఆలయంలో భక్తుల సందడి ‘జయశంకర్ స్ఫూర్తిని కొనసాగిద్దాం’మిరుదొడ్డి(దుబ్బాక): ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మలి దశ ఉద్యమానికి సిద్ధాంత కర్తగా నిలిచిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రైతు రక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు అందె ప్రవీణ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అందె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి జయశంకర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ సార్ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి సంక్షేమ అవకాశాల కల్పన కోసం అధికార పాలనా యంత్రాంగం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ పర్శరాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు, నాయకులు రాజ్కుమార్, రాజేందర్, పోచయ్య, లక్ష్మీనారాయణ, రాంరెడ్డి, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు అరకొరే..
దుబ్బాక శాసన సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి స్వగ్రామం పోతారంలో ప్రాథమిక పాఠశాల ఉంది. 28 మంది విద్యార్థులుండగా అందులో బాలురు 14, బాలికలు 14 మంది ఉన్నారు. మూడో తరగతిలో ఒక్క విద్యార్థి లేకపోవడం గమనార్హం. ఈ గ్రామం నుంచి ఎక్కువగా దుబ్బాకలోని ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులు వెళ్తున్నారు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులే ఉన్నారు. పాఠశాలలో సౌకర్యాలు ఉన్నప్పటికీ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలి. అలాగే గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించాలి. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి. -
ప్రతి ఎకరాకు ఇవ్వాలి
సాగు చేసిన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలి. నాకు 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏటా రెండు పంటలు పండిస్తాను. గత యాసంగిలో కేవలం 2 ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయం ఇచ్చారు. అది కూడా కోతల సమయంలో అందజేశారు. ఈసీజన్లోనైనా పూర్తిస్థాయిలో అందజేయాలి. – భూపాల్రెడ్డి, రైతు, మెదక్ ఎలాంటి సమాచారం లేదు వానాకాలం సీజన్కు సంబంధించి ఈనెల 30న రైతు భరోసా నిధులు అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ముందుగా ఎకరం వరకు వేస్తామని సీఎం ప్రకటించిన విషయం పత్రికల్లో మాత్రమే చూశాం. అధికారికంగా మాకు ఎలాంటి సమాచారం అందలేదు. – దేవ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి -
ఆరోగ్యానికి యోగా
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై యోగాసనాలు వేశారు. నవ శక్తులన్నింటినీ ఏకం చేసి ఏకాగ్రత సాధించడం ఒక్క యోగాకే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే పోలీస్ పరేడ్గ్రౌండ్లో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సిబ్బంది యోగాసనాలు వేశారు. – మెదక్జోన్ -
‘ట్రామా కేర్’ మంజూరు చేయిస్తా
రామాయంపేట(మెదక్): రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్రావు హామీ ఇచ్చారు. ఆదివారం ఆస్పత్రి వద్ద కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ను ప్రారంభించి మాట్లాడారు. ఆస్పత్రిలో డెంటల్ డాక్టర్ ఉన్నా పరికరాలు లేకపోవడంతో రోగులకు వైద్య సేవలు అందడం లేదన్నారు. డెంటల్ చైర్తో పాటు ఎక్స్రే తీయడానికి వీలుగా సీఆర్ మిషన్, ఆర్వో ప్లాంట్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ రహదారిపై ఉన్న ఆస్పత్రికి ట్రామా సెంటర్తో పాటు గైనకాలజిస్ట్ నియామకానికి కృషి చేస్తానన్నారు. కాగా కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అంతకుముందు ఎంపీ రోగులను పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ శివదయాల్, సూపరింటెండెంట్లు డాక్టర్ లింబాద్రి, హేంరాజ్సింగ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మల్లిక, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్ శంకర్గౌడ్, పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు నవీన్గౌడ్, పట్టణశాఖ అధ్యక్షుడు అవినాశ్రెడ్డి, సర్పంచ్లు యాదగిరిగౌడ్, బాల్రా జు తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
నేడే ‘నీట్’
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగంమెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగే నీట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 481 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కేంద్రంలోని అనుమతి ఉంటుంది. అనంతరం అనుమతించరు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఎన్టీఏ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కోసం ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి. అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. అడ్మిట్ కార్డులో పేర్కొన్న సమయం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటల కంటే ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఇన్విజిలేటర్ సమక్షంలో ఓఎంఆర్ షీట్, హాజరు పట్టికపై సంతకాలు చేయాలి. పరీక్షా కేంద్రంలో ఎన్టీఏ అందించే బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. సొంతంగా పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు తీసుకురావద్దు. పరీక్ష కేంద్రంలోనే ఇస్తారు. ఓఎంఆర్ షీట్పై అనవసర గుర్తులు చేయవద్దు. బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ లేదా కమ్యూనికేషన్ పరికరాలను తీసుకురావద్దు. పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు తల్లిదండ్రులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి: ఎస్పీమెదక్జోన్: నీట్ యూజీ పరీక్షకు అందరూ సహకరించి ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఎస్పీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పరిసరాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 163 బీఎన్ఎస్ఎస్ అమల్లో ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు కొనసాగే పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రం సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తామని చెప్పారు. -
రోడ్డెక్కిన జొన్న రైతులు
రామాయంపేట(మెదక్): జొన్నల కొనుగోలు విషయమై అధికారులు ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు శనివారం రోడ్డెక్కారు. నిబంధనల పేరిట లారీలను గత ఐదు రోజులుగా ఖాళీ చేయించడం లేదని ఆరోపించారు. ఈమేరకు స్థానిక అధికారులతో తమ గోడు వెళ్లబోసుకున్న రైతులు పట్టణంలోని మెదక్ రోడ్డుపై బైఠాయించారు. ఈసందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రం నుంచి మూడు లారీల్లో జొన్నలు గజ్వేల్, దౌల్తాబాద్ గోదాంలకు తరలించగా, నాణ్యతగా లేవనే సాకుతో అక్కడి గోదాం అధికారులు లారీలను ఖాళీ చేయించడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈవిషయమై రైతులకు న్యాయం చేస్తానని డీఏఓ హామీ ఇచ్చారు. రైతుల రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ బాల్రాజు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
రైతులకు కాంగ్రెస్ వెన్నుపోటు
మెదక్జోన్: రైతులకు సీఎం రేవంత్రెడ్డి వెన్నుపోటు పొడిచారని, కోటా మేరకే ధాన్యం సేకరిస్తామనటం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు వరి సాగు చేస్తారని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులు పండించిన ధాన్యం కొనాల్సింది పోయి, మాతో కాదనటం సిగ్గు చేటన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు, బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం నీళ్లు, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. సమావేశంలో నేతలు లావణ్యరెడ్డి, బట్టి జగపతి, కృష్ణారెడ్డి, ఆంజనేయులు, అంజాగౌడ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి -
వ్రత శోభితం.. నాచగిరి పుణ్యక్షేత్రం
రెయిన్గన్తో పంటకు నీరుటేక్మాల్(మెదక్): 10 రోజుల క్రితం కురిసిన కొద్దిపాటి వర్షానికి రైతులంతా పత్తి విత్తనాలు విత్తారు. అప్పటి నుంచి వర్షం లేకపోవడంతో కొన్ని విత్తనాలు మొలకెత్తినా, మరికొన్ని మొలకెత్తలేదు. అదను దాటుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో పలువురు రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. టేక్మాల్ మండలంలోని పల్వంచలో పదెకరాలకు పైగా పత్తిసాగు చేస్తున్న రైతులు నరేశ్, ప్రవీణ్ తమ పంటను కాపాడుకునేందుకు రెయిన్గన్తో నీరు అందిస్తున్నారు.సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం శనివారం సత్యదేవునివ్రత శోభతో అలరారింది. క్షేత్రానికి హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాలు, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హల్దీనది వాగులో పుణ్యస్నానాలాచరించారు. భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలు, అభిషేకాలు, కల్యాణాలు, సేవలు జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈఓ రంగాచారి జాగ్రత్తలు తీసుకున్నారు. – వర్గల్(గజ్వేల్) -
హామీలు విస్మరించారు: కె.లక్ష్మణ్
కొమురవెల్లి(సిద్దిపేట): ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ విమ ర్శించారు. శనివారం బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కొమురవెల్లి రైల్వేస్టేషన్ను ఆయన పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన పన్నెండేళ్ల పాలనలో దేశంలో సమగ్ర అభివృద్ధి సాధించాడని తెలిపారు. రాష్ట్రంలో రైల్వే లైన్ల అభివృద్ధికి రూ.5500 కోట్లు ఇచ్చిన ఘనత మోదీకే దక్కిందని అన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
హవేళిఘణాపూర్(మెదక్): మండలంలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ గీత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, అటెండర్, నైట్ వాచ్మెన్, స్వీపర్, స్కావెంజర్ల ఎంపిక కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు గల మహిళలు చిన్నశంకరంపేటలో కొనసాగుతున్న కేజీబీవీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నేడు ‘పేట’లో కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ రామాయంపేట(మెదక్): పట్టణంలోని ప్రభు త్వ ఆస్పత్రిలో ఆదివారం కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ప్రక్రియను మెదక్ ఎంపీ రఘునందన్రావు ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ శంకర్గౌడ్ విజ్ఞప్తి చేశారు. 3,903 కేసుల పరిష్కారం మెదక్జోన్: రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు. శనివా రం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని మెదక్, నర్సాపూర్, అల్లాదు ర్గం కోర్టుల పరిధిలో 3,903 కేసులు పరిష్కారం అయ్యాయని చెప్పారు. చిన్నపాటి గొడవలతో కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగి విలువైన సమయం, డబ్బు వృథా చేసుకోవటం కన్నా ఇరువర్గాల కక్షిదారులు రాజీపడటం ఉత్తమం అన్నారు. కార్యక్రమంలో న్యామూర్తులు సుభవల్లి, సంతోష్ కుమార్, సౌజన్య, సాయిప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పన్నుల వసూలు భేష్ మెదక్ కలెక్టరేట్: పన్నుల వసూళ్లలో అధికారులు, సిబ్బంది పనితీరు భేష్ అని, మరింత ఉత్సాహంతో పనిచేసి పట్టణాభివృద్ధికి కృషి చేయాలని మెదక్ మున్సిపల్ కమిషనర్ నవీన్ అన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 3 నెలల్లోనే ఇప్పటివరకు రూ. 3 లక్షలు ఆస్తి, ఇతర పన్నులు సిబ్బంది వసూలు చేశారు. ఈసందర్భంగా శనివారం వారికి అభినందన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో గతంలో కంటే అధిక మొత్తంలో పన్నులు వసూలు కావడం అభినందనీయ మని అన్నారు. పట్టణ పరిధిలోని ప్రజలంతా సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించా రు. అధికారులు పన్నుల కోసం వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని కోరారు. అత్యధికంగా ధాన్యం సేకరణమెదక్ కలెక్టరేట్: గతంలో కంటే ఈ ఏడాది జిల్లాలో అత్యధికంగా సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ఇప్పటివరకు 4,18,244 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 86,130 మంది రైతుల ఖాతాల్లో రూ.892.62 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. 528 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి కాగా, మరో 5 కేంద్రాల్లో కొంతమేర ధాన్యం మిగిలినట్లు పేర్కొన్నారు. 30 పాఠశాలలకు ట్యాబ్లు మెదక్ కలెక్టరేట్: దృశ్య మాధ్యమంలో పిల్లలకు బోధన మరింత మెరుగ్గా ఉంటుందని డీఈఓ రాజు అన్నారు. శనివారం మేఘశాల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలలకు ట్యాబ్లను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6 నుంచి 8వ తరగతి వరకు పాఠ్యాంశాలు ఉన్న ట్యాబ్లను ఒక్కో పాఠశాలకు రెండు చొప్పున అందజేశారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ట్యాబ్ల ద్వారా విద్యార్థుల్లో పఠనాభివృద్ధి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ సుదర్శనమూర్తి, మేఘశాల సంస్థ ప్రతినిధులు ప్రశాంత్, లావణ్య, టీచర్లు పాల్గొన్నారు. -
అటవీ జాగా.. వేసెయ్ పాగా!
అటవీ భూముల ఆక్రమణకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. జిల్లాలో ఇప్పటివరకు 5,599 ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురికాగా, తాజాగా మరో 6 చోట్ల ఆక్రమించారు. పుష్కరకాలంగా ఆక్రమణదారులపై 316 కేసులు నమోదు అయినట్లు అటవీశాఖ రికార్డులుచెబుతున్నాయి. ఖద్దర్ నేతల అండతేనే కబ్జాదారులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 58 వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. కొంతకాలంగా 5,599 ఎకరాల అటవీ భూములను కబ్జాకోరులు ఆక్రమించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అంతకన్నా ఎక్కువే ఉన్నట్లు సమాచారం. వానాకాలం వచ్చిందంటే చాలు అడవుల్లోని చెట్లను విచక్షణ రహితంగా నరికేసి భూమి చదును చేసి ఆక్రమిస్తున్నారు. తాజాగా రెండు నెలల్లో మరో 6 చోట్ల సుమారు 20 ఎకరాలకు పైగా ఆక్రమించారు. గడిచిన 12 ఏళ్లలో ఇప్పటివరకు 316 కేసులు నమోదు చేసినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఖద్దర్ నేతల అండతోనే.. అడవులను ఆక్రమించే కబ్జా కోరులకు ఖద్దర్ నేతల అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దర్జాగా కబ్జా చేస్తున్నారు. సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తే అధికార పార్టీకి చెందిన నేతలు అధికారులకు ఫోన్లు చేసి ఎలాంటి కేసులు నమోదు చేయవద్దంటూ హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. ఇదే పరిస్థితి కొనసాగితే కొంత కాలానికి అడవులు పూర్తిగా అంతరించి పోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉన్న భూమికి 33 శాతం మేర ఉండాల్సిన అడవులు, ప్రస్తుతం 21 శాతానికే పరిమితం అయ్యాయి. ఉండాల్సిన దాని కంటే 12 శాతం తక్కువగా ఉండటంతో వాతావరణం అనేక మార్పులు చోటు చేసుకొని పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలో 58 వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉండగా, మెదక్, కౌడిపల్లి, పెద్దశంకరంపేట, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ రేంజ్లుగా విభజించారు. కాగా నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో 112 మంది బీట్ ఆఫీసర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 36 మంది మాత్రమే ఉన్నారు. అంటే 60 శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయి. ఒక్కో బీట్ ఆఫీసర్కు 2 నుంచి 3 బీట్లు అప్పగించడంతో అడవుల సంరక్షణపై పర్యవేక్షణ కరువైంది.జిల్లాలో ఇప్పటివరకు 5,599 ఎకరాల కబ్జా తాజాగా మరో ఆరు చోట్ల ఆక్రమణ పుష్కరకాలంగా 316 కేసుల నమోదు పర్యావరణానికి ముప్పుఅడవుల జోలికొస్తే చర్యలు ఫారెస్ట్ భూములను ఆక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. ముఖ్య ంగా అడవులను ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఎక్కువగా కబ్జాలు జరుగుతున్నాయి. తాజాగా ఆరు చోట్ల కబ్జా చేస్తే కేసులు నమోదు చేశాం. – జోజి, డీఎఫ్ఓ -
మొత్తం పంటను కొనాలి
మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి పాపన్నపేట(మెదక్): రైతులు పండించిన పూర్తి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎం రేవంత్రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం 25 శాతం కొనుగోలు చేసినా, మిగితా ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కొనుగోలు చేయాలన్నారు. కేవలం 7 రకాలకే బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. అన్ని సన్న రకాలకు బోనస్ ఇవ్వాలన్నారు. సకాలంలో వరి పంటను కొనక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ఖేడ్కు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడి నారాయణఖేడ్: ఖేడ్కు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ మంజూరు కానుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్కుమార్రెడ్డిలను హైదరాబాద్లో కలిసినట్లు తెలిపారు. ఖేడ్కు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ఆవశ్యకతను వివరిస్తూ నిధులను మంజూరు చేయాలని కోరగా మంత్రి లక్ష్మణ్ సానుకూలంగా స్పందిచినట్లు వివరించారు. -
ప్రజలను ఇబ్బంది పెడితే సహించం
గజ్వేల్: కాంగ్రెస్ తమకు మిత్రపక్షమైనా, ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం గజ్వేల్లో ఉమ్మడి మెదక్ జిల్లా కౌన్సిల్ సభ్యులకు నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణా శిబిరానికి హాజరై మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చుకోవాలని డిమాండ్ చేశారు. విలీన ప్రక్రియను పూర్తిచేసి, కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణకు సహకరించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కొన్ని మాత్రమే కాంగ్రెస్ నెరవేర్చగలిగిందన్నారు. రైతులకిచ్చిన మాటలను సైతం నిలుపుకోవాలన్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల బడాబాబుల ప్రయోజనాల కోసం పేదల గుడిసెలను కూల్చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేదిశగా లెఫ్ట్ పార్టీలతో కలిసి త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ‘సర్’ పేరుతో తెలంగాణలోని 84 లక్షల ఓట్లను తొలగించడానికి కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ సీనియర్ నాయకులు వీర్ల ప్రకాశ్రావు, భట్టు దయానందరెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల కార్యదర్శులు మంద పవన్, ఖాళీక్, జలాలుద్ధీన్, నాయకులు రాజేశం, శిలింగు కృష్ణ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ నిర్లక్ష్యం వీడాలి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశిరావు -
కాంగ్రెస్ హయాంలో రైతులకు తిప్పలు
వెల్దుర్తి(తూప్రాన్): ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. శుక్రవారం మండలంలోని మెల్లూరులో పర్యటించారు. రూ. 10 లక్షలతో నిర్మించిన స్కూల్ ప్రహరీని ప్రారంభించి ఆవరణలో మొక్కలు నాటారు. మధ్యాహ్నం భోజనం పరిశీలించి స్వయంగా విద్యార్థులకు వడ్డించారు. అనంతరం పిట్టలవాడలో సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే బస్వాపూర్లో ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను మొత్తం కొనుగోలు చేస్తామని మాట మార్చిందన్నారు. కనీసం రైతుబీమా ప్రీమియం కట్టలేని స్థితిలో ఉండడం విచారకరమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రంగారెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు. కొల్చారం(నర్సాపూర్): విద్యార్థులు క్రమశిక్షణతో చదవడం ద్వారా ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని డీఈఓ రాజు అన్నారు. శుక్రవారం మండలంలోని పోతంశెట్టిపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈసందర్భంగా విద్యాప్రగతి, మౌలిక వసతులు, బోధన, అభ్యాస కార్యక్రమాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశా రు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ ఉమారాణి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. కౌడిపల్లి(నర్సాపూర్): చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు ఇష్టంతో శ్రద్ధగా చదవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. శుక్రవారం కౌడిపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్లేది విద్య మాత్రమే చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం లలితాదేవి, ఉపసర్పంచ్ శ్వేత, ఆప్ చైర్మన్ రాధిక, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ జగన్, ఉపాధ్యాయులు నరేందర్, శర్మ, విద్యార్థులు పాల్గొన్నారు. వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో హిందీ గెస్ట్ టీచర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్ఓ ఫాతిమా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఈడీతో పాటు బోధనలో అనుభవం కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా హిందీలో సమర్థవంతంగా మాట్లాడడం, రాయడం, చదవడం రావాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 26వ తేదీ లోపు సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
దరఖాస్తుల వెల్లువ
మెదక్ అర్బన్: ప్రీ ప్రైమరీ బోధకుల పోస్టులకు జిల్లాలో తీవ్ర పోటీ నెలకొంది. ఈనెల 5న 90 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా.. బోధకు లకు 1,117 మంది, ఆయా పోస్టులకు 591 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన బోధకుల పోస్టుకు 12 మంది, ఆయాకు ఆరుగురు పోటీ పడుతున్నారు. బోధకులకు రూ. 8 వేలు, ఆయాలకు రూ.6 వేలు జీతం ఇవ్వనున్నారు. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులకు నియామకపత్రాలు ఇవ్వనున్నారు. పెరగనున్న నమోదు శాతం సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు ప్రభుత్వం గతేడాది జిల్లాలో 30 ప్రీ ప్రైమరీ స్కూల్ ్సను ప్రారంభించింది. అంతకుముందు అంగన్వాడీలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ బడులకు అనుసంధానం కాకపోవడంతో చాలా మంది చిన్నారులు అంగన్వాడీ పూర్తి చేయగానే ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లేవారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రీ ప్రైమరీ ప్రారంభించారు. ఈ ఏడాది జిల్లాలో మరో 90 స్కూల్ ్స ప్రారంభించారు. 90 మంది బోధకులు, 90 ఆయా పోస్టులను మంజూరు చేశారు. ఇంటర్తో పాటు ఉపాధ్యాయ శిక్షణ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కాగా, బోధకు ల పోస్టులకు జిల్లాలో అత్యధికంగా రామాయంపేటలో 121, అత్యల్పంగా మా సాయిపేటలో 10 దరఖాస్తులు వచ్చాయి. రామాంతపూర్, స్టేషన్ మాసాయి పేట పాఠశాలల్లో బోధకుల పోస్టులకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం విశేషం. ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి అయిందని, మరో రెండు రోజుల్లో వీరికి నియామకపత్రాలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రీ ప్రైమరీ బోధకుల పోస్టులకు తీవ్ర పోటీ -
టన్నుకొచ్చిన వడ్లు
యాసంగిలో రైతుల పంట పండింది● ఎకరాకు 37 క్వింటాళ్ల పైనే దిగుబడి ● రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ ● ఇప్పటివరకు 4.13 లక్షల ఎంటీల కొనుగోలుయాసంగిలో వరి సాగు చేసిన రైతుల పంట పండింది. ఆశించిన దానికంటే అధికంగా దిగుబడి వచ్చింది. అదే సమయంలో జిల్లా యంత్రాంగం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 4.13 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించింది. మరో 2 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో 3,05,723 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో 50,555 ఎకరాల్లో సన్నాలు, 2,55,168 ఎకరాల్లో దొడ్డు రకం పంటలు పండించారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి దొడ్డు రకం వరి ఎకరాకు 37 క్వింటాళ్లకు పైగా దిగుబడి రాగా, సన్నాలు సైతం 25 క్వింటాళ్లకు పైగా వచ్చింది. అదే సమయంలో ధాన్యం సేకరణ సైతం గణనీయంగా పెరిగింది. ఈ యాసంగిలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల లోపే ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేసి, 533 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికే 4.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మరో 2 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన అధికారుల అంచనాకు మించి సుమారు 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా వచ్చింది. సాగు తగ్గినా.. పెరిగిన దిగుబడి గతేడాది వానాకాలంతో పోలిస్తే ఈ యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ దిగుబడి మాత్రం పెరిగింది. వానాకాలంలో 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 3.77 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. యాసంగిలో 3.5 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే ఇప్పటివరకు 4.13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. అంటే వానాకాలం కన్నా యాసంగిలో 10 వేల ఎకరాల సాగు తగ్గినా, 38 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది అధికంగా వడ్లు సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు.సంవత్సరం వానాకాలం యాసంగి 2023 3,93,615 3,25,570 2024 3,28,718 2,84,849 2025 2,92,263 3,19,144 2026 3,77,914 4,13,237జిల్లాలో ధాన్యం సేకరణ ఇలా..పంట బాగా వచ్చింది యాసంగిలో నాకున్న మూడున్నర ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగు చేశా. ఇటీవల కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయగా 130 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన ఎకరాకు 37 క్వింటాళ్లకు పైగానే వచ్చింది. ఈసారి నూటికి 90 శాతం మంది రైతులకు పంట దిగుబడి బాగా వచ్చింది. – ఆంజనేయులు, చందాపూర్, చిన్నశంకరంపేట -
సేంద్రియ సాగు చేపట్టాలి
ఎంపీ రఘునందన్రావు కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు పాత పద్ధతిలో సేంద్రియ, ప్రకృతి సాగు చేయాలని ఎంపీ రఘునందన్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని తునికి వద్ద గల కేవీకేలో ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన రైతు సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సేంద్రియ, ప్రకృతి సాగుతో ఆహారం, ఆరోగ్యం బాగుంటుందన్నారు. తెలంగాణలో భూసార పరీక్షలు నిర్వహించి సాయిల్ హెల్త్కార్డు ఇచ్చేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 2014లో వరికి మద్దతు ధర రూ.1450 ఉంటే నేడు రూ.2385 ధర కల్పించి కేంద్రం ఆదుకుంటుందన్నారు. సాగుతో పాటు కోళ్లు, పశువులు, గేదెలు పెంచాలని కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, డీఏఓ దేవ్కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు రాకేశ్, ఏడీఏ పుణ్యవతి, నర్సాపూర్ మున్సిపల్ వైస్చైర్మన్ బుచ్చేశ్యాదవ్, నాయకులు గడ్డం శ్రీనివాస్, సత్యనారాయణ, సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నీట్కు సర్వం సిద్ధం
మెదక్ కలెక్టరేట్: ఈనెల 21న జరిగే నీట్ (యూజీ) పరీక్ష కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శుక్రవారం పరీక్ష నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 481 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం జాతీయస్థాయి ఐఐటీలో సీటు సాధించిన హవేళిఘణాపూర్ మండలం పోచంరాల్ తండాకు చెందిన విద్యార్థి బడావత్ రాఘవేందర్ శుక్రవారం తన కుటుంబీకులతో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈసందర్భంగా కలెక్టర్ అభినందించారు. జిల్లాలో ఈనెల 21న నిర్వహించనున్న నీట్ పరీక్షకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రం పరిసరాల్లో ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయని వివరించారు. అభ్యర్థులు హాల్టికెట్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు మాత్రమే వెంట తీసుకురావాలని సూచించారు. పరీక్షకు అవసరమైన పెన్నులు సెంటర్లో అందజేస్తారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఒకే పరీక్ష కేంద్రం హాజరుకానున్న 481 మంది అభ్యర్థులు -
సహకారం.. ఇక వినూత్నం
సరికొత్త బాటలో పీఏసీఎస్లు● నాణ్యమైన విత్తన ఉత్పత్తి, అమ్మకాలే లక్ష్యం ● ప్రణాళిక రూపొందించిన వ్యవసాయ విశ్వవిద్యాలయం సాక్షి, సిద్దిపేట: వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్) ఇక సరికొత్త బాటలో పయనించనున్నాయి. సభ్యులకు రుణాలివ్వడం, వాటిని రాబట్టడం, కొనుగోలు కేంద్రాలు నిర్వహించడం, ఫర్టిలైజర్, బయట నుంచి తెచ్చిన విత్తనాలు అమ్మడం మాత్రమే ఇప్పటివరకు చేశాయి. ఇక పీఏసీఎస్ పరిధిలో సభ్యులచే విత్తనాభివృద్ధి చేయించి వారి బ్రాండ్ మీదనే నాణ్యమైన వరి విత్తనాలు విక్రయించనున్నారు. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా నాబార్డు సహకారంతో సీడ్ ప్రొడక్షన్కు నడుం బిగించింది. 7 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా దాదాపు 7 లక్షలకు పైగా ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు. కావాల్సినంత సీడ్ ఉత్పత్తి లేకపోవడంతో రైతులు విత్తనాల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో సన్న వడ్లు సాగు చేయాలని రైతులకు సూచిస్తుండటంతో.. విత్తనాల కోసం ఇబ్బందులు తప్పేలా లేదు. అలాగే నాణ్యత లేని విత్తనాలతో దిగుబడి తక్కువగా రావడం వంటివి జరుగుతున్నాయి. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సర్టిఫైడ్ చేసిన విత్తనాలు కాకుండా ఎక్కువ ప్రైవేట్ కంపెనీలు ట్రూత్ఫుల్ లెబుల్ సీడ్(టీ/ఎల్) వరి విత్తనాలు విక్రయిస్తున్నారు. దీంతో దిగుబడి తక్కువ రావడం ఇతరత్రా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామాలే సీడ్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించింది. 8 పీఏసీఎస్లలో విత్తనాభివృద్ధి పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా జిల్లాకు మూడు చొప్పున రాష్ట్రంలో 93 పీఏసీఎస్లలో సీడ్ ఉత్పత్తిని ఈ ఖరీఫ్ నుంచి ప్రారంభించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 పీఏసీఎస్లుండగా అందులో సిద్దిపేట–3, మెదక్–3, సంగారెడ్డి–2 పీఏసీఎస్లను ఎంపిక చేశారు. ఒక్కో పీఏఏసీఎస్ పరిధిలో 5 నుంచి 10 ఎకరాల వరకు సీడ్ ఉత్పత్తి్ చేయనున్నారు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు పలు సొసైటీలకు సీడ్ ప్రొడక్షన్న్పై అవగాహన కల్పిస్తున్నారు. సొంత బ్రాండ్తో.. సీడ్ ఉత్పత్తి అయిన తర్వాత రైతుల నుంచి పీఏసీఎస్ కొనుగోలు చేస్తుంది. వాటిని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సర్టిఫైడ్ చేయించనున్నారు. బ్యాడ్జ్ నంబర్తో కూడిన ట్యాగ్లైన్ పొందనున్నారు. సొంత బ్రాండ్తో ఆ పీఏసీఎస్ పరిధిలోని రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించనున్నారు. ఇలా చేయడం ద్వారా సోసైటీకి లాభంతో పాటు నాణ్యమైన విత్తనాలు అంది పంట దిగుబడి పెరుగుతోంది. -
‘వల’చి.. వంచించి
● ఇద్దరు యువతులతోప్రేమ వ్యవహారం ● రూ.12 లక్షలు, బంగారు నగలు స్వాహా టేక్మాల్(మెదక్): ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీలు సృష్టించి.. ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి ఇద్దరు యువతుల నుంచి బంగారం, నగదు కాజేసిన ఓ మోసగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈఘటన టేక్మాల్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి దుర్గేశ్ తాను రిత్విక్రెడ్డి అని, ట్రైనీ ఐపీఎస్ అధికారినని అదే గ్రామానికి చెందిన కొండి స్వాతితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకున్నాడు. శిక్షణ పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అర్జెంట్గా డబ్బులు కావాలని, తన మిత్రుడు దుర్గేశ్కు ఇవ్వాలని కోరాడు. దీంతో అతడి మాటలు నమ్మిన యువతి ఫోన్పే, నగదు రూపంలో విడతల వారీగా రూ.5 లక్షలు, 10 గ్రాముల బంగారు చెవి కమ్మలను దుర్గేశ్కు అందజేసింది. డబ్బులు తీసుకొని ఏడాది పూర్తయినా, ఎలాంటి స్పందన రాకపోవడంతో స్వాతి మోసపోయినట్లు గ్రహించింది. అలాగే మండలంలోని ఎక్లాస్పూర్కు చెందిన మరో 17 ఏళ్ల యువతికి సాత్విక్రెడ్డిగా నకిలీ ఐడీతో దుర్గేశ్ పరిచయం చేసుకున్నాడు. తాను ఎంబీబీఎస్ పట్టభద్రుడినని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని, తన చదువు పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం చేయాలని కోరాడు. అలాగే డైమండ్ రింగ్ పంపుతానని దానికి డబ్బులు కావాలని యువతిని నమ్మించాడు. తన మిత్రుడు దుర్గేశ్ వస్తాడని, అతడికి డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. ఆ యువతి నుంచి రూ.7 లక్షల నగదు, తులం బంగారు ఉంగరాన్ని తీసుకున్నాడు. ఇతరుల పేరును వాడుకొని తనను మిత్రుడని చెప్పి బంగారం, నగదు కాజేశాడు. మోసపోయిన ఇద్దరు యువతులు టేక్మాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్స్టా ఫేక్ ఐడీతో బురిడీ -
ఆరుతడి పంటలతో ప్రయోజనం
శివ్వంపేట(నర్సాపూర్): వాతావరణ శాఖ సూచనల మేర ఈసారి వర్షపాతం తక్కువ నమోదు కారణంగా రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపాలని మండల వ్యవసాయ అధికారి లావణ్య అన్నారు. గురువారం శివ్వంపేట రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలన్నారు. అందుకు సంబంధించి రైతు ఫోన్ నంబర్ వ్యవసాయ సిబ్బంది ద్వారా అప్డేట్ చేసుకోవాలన్నారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్టర్ తప్పకుండా చేసుకోవాలని దీని ద్వారానే ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీలు పొందే ఆస్కారం ఉందన్నారు. కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
తడి పొడి చెత్తపై అవగాహన అవసరం
ఎంపీడీఓ ఆనంద్ హవేళిఘణాపూర్(మెదక్): ప్రజలు తమ ఇంటి ముందుకు వచ్చిన ట్రాక్టర్కు తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని ఎండీపీఓ ఆనంద్ సూచించారు. గురువారం హవేళిఘణాపూర్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దకు వచ్చే పంచాయతీ సిబ్బందికి ఇవ్వాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అందరు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ సయ్యద్, పంచాయతీ సెక్రటరీ రమేశ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ పరమేశ్వరి మెదక్ కలెక్టరేట్: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు డిపో అభివృద్ధికి కృషి చేస్తానని ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ పరమేశ్వరి తెలిపారు. గురువారం మెదక్ ఆర్టీసీ డిపోమేనేజర్గా బాధ్యతలు చేపట్టి విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ పని చేసిన డిపో మేనేజర్ సురేఖ హైదరాబాద్లోని ఫలక్నూమా డిపోకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి పరమేశ్వరీ వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమన్నారు. డిపో అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. జోగ్యకుంట కబ్జా తూప్రాన్: మట్టితో కుంటను పూడ్చివేసి కబ్జా చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని మండలంలోని నర్సంపల్లి గ్రామస్తులు ఇరిగేషన్ డీఈఈ కరుణకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం కుంటను ఆమె పరిశీలించారు. గ్రామ సమీపంలోని సర్వే నంబరు 249లోని జోగ్య కుంటను గ్రామానికి చెందిన పొలం యాజమాని రఘుపాల్రెడ్డి, కౌలుదారు ధరావత్ శ్రీను అనే ఇద్దరు జేసీబీతో పూడ్చివేశారు. గమనించిన సర్పంచ్ ధరావత్ భాస్కర్, గ్రామస్తులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఇరిగేషన్ డీఈఈ కరుణ విచారణ చేపట్టారు. కుంట కబ్జాకు కారకులైన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం వెల్దుర్తి(తూప్రాన్): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదల సొంతింటి కల సాకారమవుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రాజిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని భస్వా పూర్, మెల్లూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, మెల్లూర్లో సీసీరోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. నేటి నుంచి ఉత్సవాలు నర్సాపూర్: నర్సాపూర్లోని రేణుకఎల్లమ్మ మాత ఆలయాన్ని 15వ వార్షికోత్సవాలకు సిద్ధం చేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉద యం గణపతిపూజ, పుణ్యావాచనం, రేణుక ఎల్లమ్మదేవి జమదగ్ని స్వామి కల్యాణోత్సవం తదితర కార్యక్రమాలు ఆలయ పూజారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో చేశారు. 20న చండీ హవనం, సామూహిక కుంకుమార్చన, పూర్ణాహుతి తదితర పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే జరిమానా నర్సాపూర్ రూరల్: మైనర్లు డ్రైవింగ్ చేస్తే రూ.2వేలు జరిమానా విధిస్తామని మండలంలోని చిన్నచింతకుంట గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామసభలో తీర్మానించారు. గురువారం చిన్న చింతకుంట గ్రామ సభ ప్యాట సరిత అధ్యక్షతన కొనసాగింది. ఈ సందర్భంగా సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు అభివృద్ధిపై పలు తీర్మానాలు చేయడంతో పాటు చర్చించుకున్నారు. మైనర్ బాల బాలికలను పనిలో పెట్టకుండా చదివించేలా చూసుకోవాలన్నారు. -
అంగన్వాడీలో ఆటపాటలతో విద్య
కౌడిపల్లి(నర్సాపూర్): అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో విద్య, పౌష్ఠికాహారం అందిస్తున్నామని ఐసీడీఎస్ మండల సూపర్వైజర్ లక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని కొట్టాల్లో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లలకు యూనిఫాం అందజేశారు. అలాగే, వన మహోత్సవంలో భాగంగా అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సుమలత, ఉపసర్పచ్ రమేష్, అంగన్వాడీ టీచర్ రాజేశ్వరీ, తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి
శివ్వంపేట(నర్సాపూర్): ఆధ్మాత్మిక చింతనతో మనశ్శాంతి కలుగుతోందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధి కాలేరాం తండాలో నూతనంగా నిర్మించిన సేవాలాల్ మహరాజ్ ఆలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన తండాల్లో మాలధారణతో పాటు సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయ నిర్మాణాలతో భక్తిభావాలు పెరగడం సంతోషకర విషయమన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, నాయకులు హరికృష్ణ, చంద్రగౌడ్, మన్సూర్, యాదగౌడ్, రాంమోహన్రెడ్డి, వేమారెడ్డి, రాజశేఖర్గౌడ్, తండావాసులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి -
అటవీ భూముల కబ్జా
హవేళిఘణాపూర్(మెదక్): అటవీ భూములను కొందరు అక్రమంగా కబ్జా చేసి సాగు భూములుగా మారుస్తున్నా, అటవీశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రాజ్పేటతో పాటు అటవీ ప్రాంతాలు ఉన్న గ్రామాల పరిసరాల్లో ఈ భూఆక్రమణలు సర్వసాధారణంగా మారాయి. కబ్జాదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోకపోవడంతో, వారు యథేచ్ఛగా అటవీ భూములను చదును చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమై సాగు సమయం వచ్చిందంటే చాలు... అటవీ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు పక్కనే ఉన్న అటవీ భూమిని ఆక్రమించడం అలవాటుగా మార్చుకున్నారు. తాజాగా గాజిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో సుమారు ఒక ఎకరం వరకు అటవీ భూమిని సాగు భూమిగా మార్చేందుకు దుండగులు చదును చేశారు. ఈ విషయంలో అటవీశాఖ అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం వల్లే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, అటవీ భూముల కబ్జాకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ● సాగు భూములుగా మారుస్తున్న వైనం ● అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం -
పంచాయతీరాజ్ పనుల ఆకస్మిక తనిఖీ
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని వివిధ గ్రామాల్లో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పీఆర్అండ్ఆర్డీ జాయింట్ డైరెక్టర్, మెదక్, జగిత్యాల జిల్లాల ప్రత్యేక అధికారి విజయరావ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, నిధులు, ఖర్చు వివరాల లావాదేవీలను ఆన్లైన్ పరిశీలించారు. అనంతరం కౌడిపల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణం పనులు పరిశీలించారు. దీంతో పాటు దేవులపల్లి, రాయిలాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు, సీసీరోడ్డు, ఉపాధిహామీ పనులు, కూలీల సంఖ్య ఇతర అంశాలను తనిఖీ చేసి పనుల పురోగతిపై ఆరాతీశారు. పారిశుద్ధ్యం పనులు, తడి పొడి చెత్త సేకరణ పనులను తెలుసుకున్నారు. తనిఖీలకు సంబంధించి పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్కు అందచేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ యాదయ్య, డీఎల్పీఓ సురేష్బాబు, డిప్యూటీ సీఈఓ స్వప్న, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ రామారావ్, ఏపీఓ పుణ్యదాస్, స్థానిక పంచాయతీ కార్యదర్శి నగేష్ పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
అల్లాదుర్గం(మెదక్): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పెద్దశంకరంపేట పారెస్టు రేంజ్ ఆఫీసర్ హేమచందన అన్నారు. గురువారం అల్లాదుర్గం మండల పరిధిలోని ముస్లాపూర్ పీఎంశ్రీ పాఠశాల విద్యార్థులకు ‘పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత’ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అడవులను కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. మొక్కలు నాటి వాటిని రక్షించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రమేశ్, అటవీ సిబ్బంది శ్రీనివాస్, అజార్బేగ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
పెద్దశంకరంపేట(మెదక్): మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని పెద్దశంకరంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హేమచందన అన్నారు. గురువారం పెద్దశంకరంపేట అటవీశాఖ కార్యాలయం వద్ద అఽధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వనమహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెట్లు పెంచితేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. మొక్కలను నాటడంతో పాటు వాటిని పెంచే బాధ్యత కూడా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జంగం రేణుక, సెక్షన్ ఆఫీసర్లు రమేష్, అంజార్, శ్రీను, గ్రామ కార్యదర్శి రాజు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. అభివృద్ధిలో ముందుకు సాగాలి పెద్దశంకరంపేట(మెదక్): గ్రామాలు అభివృద్ధిలో ముందుకు సాగాలని డీఎల్పీఓ యాదయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామకార్యదర్శులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టాలని, నాలుగు రకాల చెత్తసేకరణ, నర్సరీల నిర్వహణ, పన్నుల వసూలు, తడి,పొడి చెత్త సేకరణ అంశాలపై చర్చించారు. అనంతరం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్, ఎంపీఓ జాకీర్హుస్సేన్, సర్పంచ్ జంగం రేణుక, మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, గ్రామకార్యదర్శి రాజు, ఏపీఓ సంతోష్ తదితరులున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని డీఎల్పీఓ యాదయ్య, ఎంపీడీఓ క్రాంతికుమార్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మల్కాపూర్ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులతో కలిసి సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, ఉచిత పుస్తకాలను అందిస్తారని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు సూచించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణంలోని 6 వార్డు అంగన్వాడీ కేంద్రంలో గురువారం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. వార్డు కౌన్సిలర్ హరిత, అంగన్వాడీ టీచర్ మమత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడంపై చాలా సంతోషంగా ఉందన్నారు. పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని భవిష్యత్తులో మంచిగా ఎదగాలని ఆకాంక్షించారు. శివ్వంపేట(నర్సాపూర్): తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలని ఎంఈఓ బుచ్చనాయక్ కోరారు. గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని తిమ్మాపూర్ పాఠశాలలో బడిబాట, సమూహిక అక్షరాభ్యాసం, వన మహోత్సవం నిర్వహించారు. విద్యార్థులు కావాల్సిన సదుపాయాలు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
బూత్స్థాయి అధికారులకు సూచనలు
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి మెదక్ ఆర్డీఓ రమాదేవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె బూత్స్థాయి అధికారులతో సమావేశమై, విధులకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో నిజాంపేట తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ రమ్యశ్రీ, ఆర్ఐ ప్రీతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానమాల, స్థానిక రెవెన్యూ సిబ్బంది, బూత్స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
రాజకీయాల్లో టీఆర్ఎస్ క్రియాశీలకం
పాపన్నపేట(మెదక్): భవిష్యత్ రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని జిల్లా, నియోజకవర్గ ఇన్చార్జిలు చంద్రశేఖర్, భట్టి అజయ్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రం పాపన్నటపేటలో పార్టీ జెండా ఎగుర వేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు తమ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. విద్య, వైద్యం ప్రాధాన్యం అంశాలుగా గుర్తిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఇన్చార్జి గణేష్, అపర్ణ, రాజేశ్వరి, మెదక్ నాయకులు రమేష్ గౌడ్, నందకిఫోర్, మండల నాయకులు కృష్ణాగౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సకల వసతులు బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి ఉపేందర్ మెదక్ కలెక్టరేట్: ప్రభు ్వం సంక్షేమ హాస్టళ్లలో సకల వసతులు కల్పిస్తుందని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి ఉపేందర్ తెలిపారు. గురువారం ఆయన లేకరులతో మాట్లాడారు. హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం, దుస్తులు, నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు, కాస్మోటిక్ చార్జీలు అందించాలని వార్డెన్లకు సూచించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు అవసరమైన కాస్మోటిక్ వస్తువులు, దినసరి అవసరాల సామగ్రి వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, విద్యా పురోగతికి ప్రాధాన్యం ఇవ్వాలని, సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి విద్యార్థికి పూర్తిస్థాయిలో అందేలా అధికారులు, వార్డెన్లు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. డాక్టర్ శివకు బెస్ట్ సర్వీస్ అవార్డు చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ ధనావత్ శివకు బెస్ట్ సర్వీస్ అవార్డు– 2026కు ఎంపికయ్యారు. యాదాద్రి భవనగిరి జిల్లాకు చెందిన మాతృదేవోభవ పితృదేవ సొసైటీ ఈ అవార్డును ప్రకటించింది. ఈ నెల 21న మాతృదేవోభవ పితృదేవ సొసైటీ 7వ వార్షికోత్సవం సందర్భంగా అవార్డును అందించనున్నారు. శివ మాట్లాడుతూ.. తన సేవలకు అందిన గౌరవమని.. ఇక ముందు మరింత బాధ్యతతో తన సేవలను కొనసాగిస్తానని తెలిపారు. -
బొందలగడ్డ కబ్జాను అడ్డుకోండి
చిలప్చెడ్(నర్సాపూర్): తరతరాలుగా శ్మశాన వాటికగా వాడుకుంటున్న భూమిని కొందరు వ్యక్తులు తమదంటూ కబ్జాకు యత్నిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సోమక్కపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని రహీంగూడ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా శ్మశాన వాటికగా ఉన్న స్థలంపై ప్రస్తుతం వివాదం నెలకొంది. గతంలో గ్రామానికి చెందిన గోపాల్రావు అనే వ్యక్తి సర్వే నంబర్ 8లో చెరువుకు ఆనుకుని ఉన్న తన భూమిని శ్మశాన వాటిక కోసం గ్రామస్తులకు దానమిచ్చాడు. ఆ తర్వాత అతని కుటుంబం రహీంగూడను వదిలి శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. బోరుబావి తవ్వకంతో మొదలైన వివాదం ప్రస్తుతం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో తాగునీటి కోసం శ్మశాన స్థలంలో బోరు వేయించారు. దీంతో అసలు వివాదం తెరపైకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆ భూమి తమదేనంటూ అడ్డుపడింది. 20 ఏళ్లుగా ఆ భూమి తమ ఆధీనంలో ఉందని, దానికి సంబంధించిన పట్టా దార్ పాస్బుక్కు కూడా తమ వద్దే ఉందని వారు వాదిస్తున్నారు. అక్రమంగా పట్టా చేయించుకున్నారు.. ఈ వ్యవహారంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానమిచ్చిన గోపాల్రావు కుమారుడైన లక్ష్మణ్రావు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు వ్యక్తులు అన్యాయంగా ఆ బొందలగడ్డను పట్టా భూమిగా మార్పించుకున్నారని ఆరోపించారు. రికార్డుల్లో ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఆ భూమి ఎప్పుడూ వారి ఆధీనంలో లేదని, దశాబ్దాలుగా అక్కడ సమాధులు ఉన్నాయని స్పష్టం చేశారు.విచారణ జరుపుతాం గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన తహసీల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ.. ఈ భూవివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. రికార్డులను పరిశీలించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. – తహసీల్దార్ రెవెన్యూ, పోలీస్స్టేషన్ల్లో ఫిర్యాదులు దానమిచ్చిన స్థలంపై కొందరి కన్ను.. ఆరు కిలోమీటర్ల పాదయాత్రతో నిరసన -
వావ్.. వనయోజన పార్కు
● నేడు వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం ● ఆకట్టుకుంటున్న వన్యప్రాణుల చిత్రాలురామాయంపేట(మెదక్): మండలం అక్కన్నపేట అటవీ ప్రాంతంలో నిర్మించిన నగర వన యోజన పార్కును గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్చువల్గా ప్రారంభించనున్నారు. పట్టణానికి ఐదు కిలోమీటర్లు దూరంలో 765 జాతీయ రహదారిని ఆనుకొని నిర్మించారు. దీని నిర్మాణానికిగాను రూ.రెండు కోట్లు మంజూరయ్యాయి. చాలావరకు పనులు పూర్తికాగా, చిన్న చిన్న పనులు కొనసాగుతున్నాయి. పట్టణ ప్రజలతోపాటు జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులు ఈ పార్కులో సేద తీరే అవకాశం ఉంటుంది. పార్కు నిర్మాణానికిగాను అటవీప్రాంతంలో వంద ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించారు. ప్రధాన గేట్ పైభాగంలో ఏర్పాటు చేసిన చిరుత, నెమళ్ల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. గోడలపై ఇరువైపులా చిరుత, ఎలుగుబంట్లు, ఇతర వన్యప్రాణుల చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. వాచ్టవర్, మెయిన్గేట్, హర్బల్, బొటానికల్ గార్డెన్ల నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవం తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని రేంజ్ అధికారి విద్యాసాగర్ తెలిపారు. ప్రారంభోత్సవం రోజున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, జిల్లా అటవీ అధికారి జోజి, కలెక్టర్ ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు రానున్నారు.పార్కు ప్రధాన గేట్ -
హుస్నాబాద్ అంటే కేసీఆర్కు నమ్మకం
హుస్నాబాద్: ‘కేసీఆర్కు హుస్నాబాద్ అంటే చాలా నమ్మకం. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు’ అని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే ఆర్డీఓ కార్యాలయం, మహాసముద్రం గండి, మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి, జాతీయ రహదారి, గౌరవెల్లి ప్రాజెక్టును 90 శాతానికి పైగా పూర్తి చేసి హుస్నాబాద్ను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. రాష్ట్రంలో 3,400 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టించి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి ధర్నాలు చేయించిందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వని స్పెషల్ ప్యాకేజీని గౌరవెల్లి నిర్వాసితులకు ఇచ్చామన్నారు. ట్రయల్ రన్ చేసి ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు గడిచినా 30 గజాల కాలువ తవ్వలేదన్నారు. పాలమూరు పులి బిడ్డ అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డికి పాలమూరు ప్రాజెక్టుపై అవగాహన రావడానికి రెండున్నర ఏళ్లు పట్టిందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు అర్థం కావడానికి ఇంకా ఎన్ని ఏళ్లు పడుతుందోనని అన్నారు. పోలింగ్ ఏజెంట్లు బాధ్యత తీసుకోవాలి ఎస్ఐఆర్ అనేది ఏదో భూతం కాదని 20 ఏళ్లకోసారి వస్తుందని హరీశ్రావు అన్నారు. డబుల్ ఓట్లు, చనిపోయిన ఓటర్లను తొలగించి అసలైన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం తయారు చేస్తోందన్నారు. ఎన్నికల అధికారులకు ఎంత బాధ్యత ఉంటుందో పోలింగ్ బూత్ ఏజెంట్లుగా అంతే బాధ్యత ఉండాలన్నారు. నెల రోజుల పాటు స్థానిక అధికారులతో కలిసి పని చేయాలన్నారు. రూ.2 వేల కోట్లు దగా.. ధాన్యం కొనుగోళ్లలో రైతుల నుంచి 3 నుంచి 5 కిలోల వరకు కోత విధించారని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. కోత విధిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తామని చెప్పిన లక్ష్మణ్.. రాజీనామా అవసరం లేదని దగాపడ్డ వ్యత్యాసాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కుమ్మక్కు వల్లనే మిల్లర్లు రూ. 2 వేల కోట్ల వరకు దగా చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వేలో బడుగు బలహీన వర్గాల జనాభా 51 శాతం వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్వహించిన కుల గణనలో బీసీ జనాభా 46 శాతం వచ్చిందన్నారు. 5 శాతం జనాభా మాయమైందని దీనికి మంత్రి పొన్నం జవాబు చెప్పాలన్నారు. సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి జీవీ రామకృష్ణారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఎన్నికలైనా శంఖారావాన్ని పూరించేది ఇక్కడి నుంచే ఓట్లు గల్లంతు కాకుండా మాజీ మంత్రి హరీశ్రావు -
వార్షికోత్సవాలకు రండి
గవర్నర్కు బీజేపీ నేతల ఆహ్వానం నర్సాపూర్: నర్సాపూర్లోని శ్రీరేణుక ఎల్లమ్మ మాత ఆలయ వార్షికోత్సవానికి రావాలని గవర్నర్ శివప్రసాద్ శుక్లకు స్థానిక బీజేపీ నాయకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్గౌడ్, పార్టీ అధికార ప్రతినిధి పెద్దరమేష్గౌడ్, కోశాధికారి ఆంజనేయులుగౌడ్ తదితరులు బుధవారం గవర్నర్ను కలిశారు.ఈనెల 19, 20 తేదీల్లో జరగనున్న ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. కాగా గవర్నర్ సానుకూలంగా స్పందించారని వారు చెప్పారు. పక్కాగా సర్ సర్వేనర్సాపూర్ ఆర్డీఓ రామకృష్ణ కౌడిపల్లి(నర్సాపూర్): సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సర్వేను బీఎల్ఓలు పక్కాగా చేయాల ని నర్సాపూర్ ఆర్డీఓ రామకృష్ణ అన్నారు. బుధవారం కౌడిపల్లి రైతువేదికలో నిర్వహించిన బీఎల్ఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి జూలై 24వ తేదీ వరకు సర్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి మరణించిన వారిని, శాశ్వతంగా వలస వెల్లిన వారిని, డూప్లికేట్ ఓటర్లను తొలగించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ జహీర్ తదితరులు పాల్గొన్నారు. అటవీ భూములు స్వాధీనంశివ్వంపేట(నర్సాపూర్): అటవీ భూములు ఆక్రమించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అటవీ డిప్యూటీ రేంజి అధికారి సిద్దిరాంసింగ్, సెక్షన్ అధికారి శ్రీధర్కుమార్ అన్నారు. మండల పరిధిలోని దొంతి బీట్ పరిధి జగ్యతండాలో అటవీ భూములు ఆక్రమించుకునేందుకు దున్నకం చేపట్టగా బుధవారం సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. రిజర్వు ఫారెస్ట్ భూముల్లోకి వెళ్లకుండా కందకం తవ్వకం చేపట్టినట్లు వారు చెప్పారు. కార్యక్రమంలో బీట్ అధికారులు కుమార్, శిరీష, హరిత, రజనీ తదితరులు ఉన్నారు. బడిబస్సులు భద్రత పాటించాలిఎస్పీ శ్రీనివాస్రావు మెదక్జోన్: ప్రైవేట్ పాఠశాల, కళాశాలలకు సంబంధించిన బస్సులు భద్రత ప్రమాణాలను పాటించాలని ఎస్పీ శ్రీనివాస్రావు సూచించారు. బుధవారం పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా పాఠశాలల బస్సులను ఫిట్నెస్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలను ఉల్లంఘిస్తే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. రేపు ‘గోమాత వైభవం’బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు రాక ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని వీఎస్ఎస్ కన్వెన్షన్ హాలులో ఈ నెల 19న గోమాత వైభవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిద్దిపేట ఉత్సవ కమిటీ నిర్వాహకులు వైద్య కృష్ణమాచార్యులు, మాంకాల నవీన్కుమార్, గంప శ్రీనులు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రావిచెట్టు హనుమాన్ ఆలయ ట్రస్ట్ భవనంలో వారు విలేకరులతో మాట్లాడారు. గోమాత వైభవం కార్యక్రమం ధర్మవర్థిని ట్రస్ట్, సిద్దిపేట ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరై, గోమాత విశిష్టను తెలుపనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు, కలెక్టర్, జిల్లా న్యాయవాది, సీపీ, తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. -
అల్పాహారం మరింత ఆలస్యం..!
మెదక్జోన్: అల్పాహారం పథకానికి ఆదిలోనే బాలారిష్టాలు మొదలయ్యాయి. ఈ పథకం కొన్ని జిల్లాలో ఇప్పటికే ప్రారంభం కాగా, మెదక్ జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. రెండు, మూడు నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో విద్యార్థులను ఆకర్షించడమే కాకుండా.. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకం రూపొందించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 903 ప్రభుత్వ పాఠశాలల్లో 73 వేల మంది, అలాగే.. 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 6,500 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టి చదువు చెప్పాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సంగారెడ్డి, హన్మకొండ, సూర్యాపేట సహా ఎనిమిది జిల్లాల్లో మొదటి విడతలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో మాత్రం మూడో విడతలో భాగంగా ఆగస్టు లేదా సెప్టెంబరులో అమలు చేయనున్నట్లు తెలిసింది. అక్షయపాత్ర ఫౌండేషన్కు ఈ బాధ్యతలను అప్పగించారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభం మెదక్జిల్లాకు మాత్రం అందని మార్గదర్శకాలు మూడో విడతలో అమలయ్యే అవకాశం -
లక్ష్యం.. 31.95 లక్షల మొక్కలు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో గురువారం నుంచి వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 31.95 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవాన్ని వర్చువల్ పద్ధతిలో ఒకేసారి ప్రారంభించనున్నారు. మండల కేంద్రాల్లో ఎంపీడీఓలు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామాల్లో సర్పంచ్లు కార్యదర్శులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. కాగా, ఈ ఏడాది జిల్లాలో వన మహోత్సవ లక్ష్యాన్ని తగ్గించారు. గత ఏడాది లక్ష్యం 37,10,100 లక్షలు ఉండగా, ఈసారి 31.95 లక్షల లక్ష్యాన్ని నిర్దేశించారు.వన మహోత్సవానికి సిద్ధంగా ఉన్న మొక్కలుఅధికారులు లక్ష్యాన్ని పూర్తి చేయాలి జిల్లాలోని అన్ని శాఖలకు వనమహోత్సవంలో నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాలి. అప్పుడే వన మహోత్సవం విజయవంతమవుతుంది. అన్ని గ్రామాలు, మండలాల్లో అధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి. – జోజి, జిల్లా అటవీశాఖ అధికారిశాఖల వారీగా లక్ష్యాలు వ్యవసాయశాఖ 30,000 డీఆర్డీఓ 18,70,000 విద్యాశాఖ 5000 అటవీశాఖ 6,50,000 ఉద్యాన వనశాఖ 60,000 పరిశ్రమలశాఖ 25,000 నీటి పారుదల శాఖ 22,000 మైనింగ్ శాఖ 23,000 పోలీస్శాఖ 10,000 ఎకై ్సజ్శాఖ 40,000 సీ్త్ర, శిశు సంక్షేమశాఖ 10,000 వీటితోపాటు జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు 4,50,000జిల్లాలో నేటి నుంచి వన మహోత్సవం వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం శాఖల వారీగా లక్ష్యాలు నిర్దేశం గత ఏడాది కంటే తగ్గిన లక్ష్యం -
అంగుళం భూమికీ హక్కు కల్పిస్తాం
పెద్ద శంకరంపేట(మెదక్): భూభారతితో రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని జూకల్లో నిర్వహించిన భూభారతి– భూముల రీ సర్వే గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ లోపాల కారణంగా రాష్ట్రంలో అనేక మంది రైతులు తమ భూముల హక్కులను కోల్పోయారని విమర్శించారు. భూ కబ్జాలకు ఆ వ్యవస్థే కారణమైందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ‘భూ భారతి– భూముల రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే ఈ రీ సర్వే ద్వారా ప్రతి భూమికి స్పష్టమైన డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వస్తాయని, సరిహద్దు వివాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన 14 ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, జిల్లా సర్వే ఏడీ కిషన్, తహసీల్దార్ నారాయణ, సీఐ రేణుకారెడ్డి, సర్పంచ్ ఏసమ్మ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారా గౌడ్, నాయకులు సురేందర్ రెడ్డి, సుభాష్గౌడ్, సురేష్గౌడ్, భాస్కర్ పాల్గొన్నారు. భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ
● ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం ● ఎమ్మెల్యే సునీతారెడ్డివెల్దుర్తి(తూప్రాన్): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. బుధవారం మాసాయిపేట మండలం రామంతాపూర్ తండాలో గ్రామ పంచాయతీ నూతనం భవనం, ప్రాథమిక పాఠశాల ప్రహరీగోడ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు. మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో కేవలం గ్రామసభలకు మాత్రమే పరిమితం అయిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పంచాయతీ భవనానికి భూమి దానం చేసిన ఉప సర్పంచ్ రాజుని ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్ఞానజ్యోతి, ఏఈ పవన్, సర్పంచ్ చందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాధుసూదన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
పాఠశాలలో అడ్మిషన్లు పెరగాలి
నర్సాపూర్ రూరల్: ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరగాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగేళ్లు లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చుకోవాలని, నాలుగేళ్లు పైబడిన వారిని ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులతో పాటు నాణ్యమైన విద్య, ఉచిత భోజనం, పుస్తకాలు, రెండు జతల బట్టలు ఇస్తారన్నారు. స్థానిక అధికారులతో పాటు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు విరివిగా చేరెందుకు కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి హేమా భార్గవి, డిఆర్డిఓ పీడీ శ్రీనివాస్ రావు, ఆర్డీఓ రామకష్ణ తాహసిల్దార్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ గుడ్డి పద్మ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
ఫీజుల దోపిడీని అరికట్టాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ రాష్ట్ర ఖేల్ కో కన్వీనర్ బండారి ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల కొరత, విద్యార్థులకు అవసరమైన సదుపాయాల లేమి వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. అయినా ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో సంతోష్, ఆదర్శ్, అర్జున్, సాయికుమార్, చంద్రశేఖర్ తేజ, వంశీ, శివదత్త, రెడ్డి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా -
సెల్ టవరెక్కి రైతు హల్చల్
రామాయంపేట(మెదక్): తన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారనే ఆవేదనతో ఓ రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని అక్కన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన రైతు పోలీస్ శ్రీనివాస్కు చెందిన ఎకరంన్నర భూమిని గతంలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టా మార్పు చేయించుకున్నాడు. ఆ భూమి కోసం బాఽధిత రైతు కొంత కాలంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగడంతోపాటు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రెండు రోజుల క్రితం గ్రామస్తులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఎస్ఐ బాల్రాజు గ్రామానికి వచ్చి ఇరువర్గాలను విచారిస్తున్న క్రమంలో గొడవ జరిగింది. దీంతో మనోవేదనకు గురైన బాధిత రైతు శ్రీనివాస్ సెల్ టవర్ ఎక్కాడు. సుమారు రెండు గంటలపాటు టవర్ పైనే ఉన్నాడు. తహసీల్దార్ రజని, సీఐ సైదా, ఎస్ఐ బాల్రాజు సంఘటనా స్థలానికి చేరుకొని అతనికి నచ్చజెప్పగా కిందకు దిగాడు. అనంతరం తహసీల్దార్ గ్రామస్తులతో కలిసి సదరు భూమివద్దకు వెళ్లి పరిశీలించారు.తన భూమిని ఆక్రమించారని ఆవేదన -
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ రాజు అన్నారు. సోమవారం కూచన్పల్లి జెడ్పీ హైస్కూ ల్లో విద్యార్థులకు నూతన అడ్మిషన్లు ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న విద్య, మౌలిక వసతులను గుర్తించి విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరడం అభినందనీయమన్నారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు చదువుపై ఆసక్తి చూపించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. దాని ద్వారా విద్యార్థులు భవిష్యత్లో బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, మల్లారెడ్డి, సందీప్, కృష్ణ, రాజేందర్, శశికుమార్రెడ్డి, కొండల్రెడ్డి, కృష్ణవేణి, గంగమణి, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు.డీఈఓ రాజు -
18న వన మహోత్సవం
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 18న వన మహోత్సవాన్ని సీఎం రేవంత్రెడ్డి వక్చువల్గా ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో వన మహోత్సవ లక్ష్యం 31.95 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపారు. అన్నిశాఖల అధికారులు తమ శాఖలకు కేటాయించిన లక్ష్యాలకనుగుణంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వన మహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి పరిరక్షించాలని పిలుపునిచ్చారు. జిల్లాను మరింత పచ్చదనంతో నింపేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అంతకుముందు జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రతిమాసింగ్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. అటవీ భూముల ఆక్రమణపై ఉక్కుపాదం శివ్వంపేట(నర్సాపూర్): అటవీ భూములను ఆక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అటవీ డిప్యూటీ రేంజ్ అధికారి సిద్దిరాంసింగ్ హెచ్చరించారు. మండల పరిధిలోని రుప్లతండాలో ఓ రైతు అటవీ భూమి ఆక్రమించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. సదరు రైతుకు సాగు కోసం ఇచ్చిన అటవీ భూమి పొ జిషన్ ఒకచోట ఉంటే, అదనంగా మరోచోట మూడెకరాల అటవీ భూమిని చదును చేయడంతో సోమవారం అటవీ శాఖ సిబ్బంది హద్దులను తొలగించారు. అటవీ సెక్షన్ అధికారులు కలీమొద్దీన్, శ్రీధర్కుమార్, సాయిరాం, బీట్ అధికారులు మౌనిక, శిరీష, వెంకటేశ్, గౌస్, హరిత, రజని, కుమార్, రమ్య తదితరులు ఉన్నారు. -
నస్కల్లో ఎకై ్సజ్ అధికారుల విచారణ
రామాయంపేట(మెదక్): ‘మద్యం అమ్మకాలకు బహి రంగ వేలం’ శీర్షికన ఈనెల 13న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎకై ్సజ్ అధికారులు స్పందించారు. ఈమేరకు ఎస్ఐ విజయ్ సిద్దార్థ ఆధ్వర్యంలో పోలీసులు నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. గ్రామంలో మద్యం అమ్మకాల కోసం జరిగిన బహిరంగ వేలంలో పాల్గొన్న పలువురిని విచారించారు. మద్యం అమ్మకాలు కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు గ్రామంలో మద్యం విక్రయిస్తున్న బెల్ట్షాపుపై దాడులు నిర్వహించి, లిక్కర్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లాగౌడ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదులు వెంటనే పరిష్కరించండి మెదక్జోన్: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున బాధితులు తరలిరాగా, వారి నుంచి ఎస్పీ నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వారితో నేరుగా మా ట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో వ్యక్తిగత, సామాజిక, భూ వివాదాలు, మోసాలు, వేధింపులు ఇతర సమస్యలకు సంబంధించిన అర్జీలు ఉన్నారు. ఈసందర్భంగా ఆయా పోలీస్స్టేషన్ల అధికారులతో ఎస్పీ మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. డంప్యార్డ్ను తరలించండి నర్సాపూర్ రూరల్: డంప్యార్డ్ను తరలించాలని మండలంలోని పెద్ద చింతకుంట సర్పంచ్ శివకుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సోమవారం మున్సిపల్ కమిషనర్ సాయికుమార్తో పాటు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దివ్యను వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నర్సాపూర్ శివారులో గల సర్వే నంబర్ 135లో మున్సిపాలిటీ చెత్తను వేయడంతో పెద్ద చింతకుంటలోని చెరువులు కలుషితం అవుతున్నట్లు తెలిపారు. అలాగే పంచాయతీ పరిధిలోని పాప్యా, సీతారాం గిరిజన తండాల ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వార్డుకు ప్రాధాన్యం మెదక్ కలెక్టరేట్: ప్రతీ వార్డుకు సమ ప్రాధాన్యం ఇస్తూ రూ.2.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు తెలిపారు. సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. మెదక్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి ఫలాలు ప్రతి వార్డుకు, ప్రతి కుటుంబానికి చేరేలా నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహ దారులు, మురికి కాల్వలు, తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు కీలక పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్ పాల్గొన్నారు. నీటి సరఫరాకు అంతరాయం నర్సాపూర్: భగీరథ నీటి సరఫరాకు మంగళవారం నుంచి మూడు రోజులు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. చెక్రియాల్ వద్ద పైపులైన్కు లీకేజీ ఏర్పడిందని, మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు. -
మొలకెత్తని విత్తనాలు మొలక కోసం నానబెట్టిన వరి విత్తనాలు సరిగ్గా మొలకెత్తలేదని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు 8లో u
మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026మోగిన బడి గంటలుమెదక్జోన్: వేసవి సెలవుల తర్వాత బడి గంటలు మోగాయి. సోమవారం పుస్తకాల సంచులు భుజాలకు వేసుకొని సరికొత్త ఉత్సాహంతో విద్యార్థులు బడి బాట పట్టారు. తొలిరోజు ఉపాధ్యాయులు పూలతో స్వాగతం పలికారు. వారందరికీ పుస్తకాలు పంపిణీ చేశారు. సెలవుల్లో వెలవెలబోయిన పాఠశాలలు విద్యార్థుల రాకతో కొత్తకళను సంతరించుకున్నాయి. 2026–27 విద్యా సంవత్సరం అధికారికంగా ప్రారంభం కావడంతో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ పాఠశాలలో సందడి నెలకొంది. అయితే అమావాస్య కావటంతో తల్లిదండ్రులు పిల్లలను బడులకు పంపలేదు. అలాగే ప్రైవేట్ పాఠశాలలు చాలా వరకు తెరుచుకోలేదు. ఫలితంగా మొదటి రోజు 40 శాతం విద్యార్థులు మాత్రమే బడులకు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 900 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో 63 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే విద్యార్థుల యూనిఫాంలు ఇంకా అందలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు తొలిరోజు ‘అమావాస్య’ ఎఫెక్ట్ 40 శాతం మాత్రమే హాజరు -
విత్తన ఎంపికే కీలకం
ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకొని విత్తనాలు వేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే, పంట బాగుండాలన్నా.. అధిక దిగుబడులు రావాలన్నా.. తెగుళ్లు తట్టుకోవాలన్నా విత్తన ఎంపికే కీలకం అంటున్నారు వ్యవసాయ అధికారులు. విత్తనాలు కొనుగోలు సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలనిసూచిస్తున్నారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 3.67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో సింహభాగం 3.16 లక్షల ఎకరాల్లో వరి పండించనున్నారు. రెండో స్థానంలో పత్తి 36 వేల ఎకరాలు, 3 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు కానున్నాయి. మిగితా 12 వేల ఎకరాల్లో కందులు, పెసలు, ఆముదం, కూరగాయల పంటలు సాగు చేయనున్నారు. అయితే ఎప్పటిలాగే ఈసారి సైతం రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతుండగా, ప్రభుత్వం గుర్తించిన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచింది.పత్తి విత్తనాలు విత్తుతున్న రైతులుసరైనవి ఎంపిక చేసుకోండి ప్రభుత్వం సూచించిన విత్తనాలలో సరైన వాటిని రైతులు ఎంపిక చేసుకోవాలి. నీటి వసతిని బట్టి విత్తనాలు ఎంచుకోవాలి. ముఖ్యంగా సన్నాలకు బోనస్ రావాలంటే ప్రభుత్వం చూపించిన వైరెటీలను పండించాలి. – దేవ్కుమార్, డీఏఓపత్తిలో 4 రకాలు జిల్లాలో వరి సాగు తర్వాత వర్షాధారంగా సాగు చేసే రెండో పంట పత్తి. జిల్లాలో టేక్మాల్, పెద్దశంకరంపేట, రేగోడ్, అల్లాదుర్గం మండలాల్లోని నల్లరేగడి భూముల్లో పంట పండిస్తారు. పత్తి సాగు కోసం 4 రకాల విత్తనాలు నాణ్యమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. క్రిస్టాల్, మైకో, రాశి, నూజీవీడు రకాలు ఉన్నా యి. హెర్బీసైడ్ టాలరెంట్ (హెచ్టీ) అనే రకం పత్తి విత్తనాన్ని నిషేధించింది.వరిలో 17 రకాలు వరిలో 17 రకాల విత్తనాలను అధికారులు నాణ్యమైనవిగా గుర్తించారు. వాటిలో 15 రకాలు సన్నవి కాగా, 2 రకాలు మాత్రమే దొడ్డువి ఉన్నాయి. బోరుబావుల్లో ఉన్న నీటితో పాటు వర్షాలు సకాలంలో కురిసి జూలైలో చెరువుల నిండితే 150 రోజుల్లో చేతికందే పంటలు సాగు చేయవచ్చు. అలాగే అతితక్కువ నీరుంటే 110– 120 రోజుల్లో చేతికందే పంటలు, అదే మధ్యస్తంగా నీరుంటే 120 –135 రోజుల్లో చేతికందే పంటలను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ఎన్ఆర్ (15048) తెలంగాణ సోనా, బీపీటీ 5204 సెగ్మెంట్, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరాం, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 962, జేజీఎల్ 1798.. ఈ ఎనిమిది రకాల విత్తనాల్లో మూడు రకాల వైరెటీలు ఉన్నాయి. అలాగే దొడ్డు వరి రకానికి చెందినవి ఎంటీయూ 1010, కేఎన్ఎం 118 కూనారం సోనా అనే రకాలు మాత్రమే నాణ్యమైనవిగా గుర్తించారు. రూ. 500 బోనస్ రావాలంటే ప్రభుత్వం ప్రతిపాదించిన సన్నాలను మాత్రమే సాగు చేయాల్సి ఉంటుంది. నాణ్యమైన వాటితోనే అధిక దిగుబడులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు ఖరీఫ్కు సమాయత్తమవుతున్న రైతులుమొక్కజొన్న డీహెచ్ఎం–206 (తెలంగాణ మొక్కజొన్న) గంగా కావేరీ హైబ్రీడ్, పయనీర్ (సిన్జెంటా) -
ఉప్పులింగాపూర్లో శిశు విక్రయం
వెల్దుర్తి(తూప్రాన్): భర్త మరణించిన అనంతరం మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని గర్భం దాల్చిన మహిళ, పుట్టిన శిశువును విక్రయించింది. ఈ ఘటన మండలంలోని ఉప్పులింగాపూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఎరుకలి పోచమ్మ, పెద్ద సాయిలు దంపతులకు ముగ్గురు కూతుర్లు. చిన్న కూతురు మమతను కౌడిపల్లి మండలానికి చెందిన చిన్నతో 2014లో వివాహం జరిపించారు. వీరికి 6వ తరగతి చదువుతున్న కూతురు ఉంది. 2024లో భర్త చిన్న మృతి చెందాడు. దీంతో అత్తగారింట్లోనే ఉన్న మమత వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని గర్భం దాల్చింది. దీంతో అత్తింటివారు మమతను పుట్టింటికి పంపించారు. ఈ క్రమంలో పురిటి నొప్పులతో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా ఏప్రిల్ 17న మగబిడ్డకు జన్మనిచ్చింది. మధ్యవర్తుల ద్వారా విక్రయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక వారం వ్యవధిలో మమతకు వరుసకు మామ అయ్యే వెల్దుర్తికి చెందిన దుర్గయ్య, తూప్రాన్ మండలం వెంకట రత్నాపూర్కు చెందిన మల్లయ్య మధ్యవర్తులుగా ఉండి నవజాత శిశువును విక్రయించారు. సమాచారం అందుకున్న జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి శంకర్గౌడ్, పోలీసుల సాయంతో విచారణ చేపట్టారు. పోషించే స్థోమత లేకపోవడంతో బంధువు దుర్గయ్య సూచనతో తన బిడ్డను వేరే వ్యక్తులకు ఇచ్చినట్లు మమత చెప్పింది. మల్లయ్య ద్వారా విక్రయించిన శిశువు జాడ కనుక్కొని తదుపరి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకోనున్నట్లు శంకర్గౌడ్ తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి -
బ్లాక్ మార్కెట్ను అదుపు చేయాలి
నర్సాపూర్: ఎరువుల బ్లాక్ మార్కెట్ను అదుపు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు విత్తనాలు, ఎరువులు సరిపడా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు. పలువురు డీలర్లు రసాయన ఎరువుల స్టాక్ లేదని బుకాయిస్తూ వాటిని అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని వాపోయారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ కురవైందని విమర్శించారు. రైతులు యూరియాను యాప్లో కొనుగోలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని వరిగుంతం, కూకుట్లపల్లి, చిన్నచింతకుంట తదితర కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధాన్యం కొనలేదని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని సైతం తూకం వేసి తీసుకోవాలని ఆమె కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు శేఖర్, నయిమోద్దీన్, విఠల్, మహేందర్రెడ్డి, గౌరిశంకర్ తదితరులు ఉన్నారు.ఎమ్మెల్యే సునీతారెడ్డి -
రైతులకు సాగు నీరందించండి
మెదక్ కలెక్టరేట్: మెదక్ మండలంలోని రాయిన్పల్లి ప్రాజెక్ట్ మరమ్మతులు వెంటనే చేపట్టి రైతులకు సాగు నీరందించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 2,500 ఎకరాల సాగుకు జీవనాడి అయిన రాయిన్పల్లి ప్రాజెక్ట్ మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. ప్రాజెక్టు హై లెవల్ కాల్వ ద్వారా తిమ్మానగర్, మక్తా భూపతిపూర్, గుట్టకిందిపల్లి, శివాయిపల్లి, మల్కాపూర్ తండా, వెంకటాపూర్, కొంటూర్ గ్రామాల రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి సాగు చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ఈ కాల్వ ద్వారా మెదక్ పట్టణ పరిధిలోని గోసముద్రం, పిట్లంబేస్, బంగ్లా చెరువులు కూడా నిండుతాయన్నారు. వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైనందున వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో లావణ్యరెడ్డి, మల్లికార్జున్గౌడ్, బట్టి జగపతి, కృష్ణారెడ్డి, అంజగౌడ్, కిష్టయ్య, ఆంజనేయులు, కౌన్సిలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి -
కొత్త ఉత్సాహంతో అడుగుపెట్టాలి
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు ప్రభుత్వ పాఠశాలలు నిలయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. నేడు పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా కొత్త ఉత్సాహంతో విద్యార్థులు తరగతి గదుల్లోకి అడుగు పెట్టాలన్నారు. క్రమశిక్షణతో చదువుకొని ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవాలన్నారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. మొదటి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ విద్యా సంవత్సరం విజయంతో నిండిపోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రాణదాతకు ప్రశంసలు రామాయంపేట(మెదక్): ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఏలేటి రాజశేఖర్రెడ్డి ఆది వారం హైదరాబాద్లోని రాజ్భవన్లో రక్తదానం చేశారు. ఈసందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్షా శిబిరాన్ని సందర్శించి రాజశేఖర్రెడ్డిని ప్రశంసించి సన్మానించారు. రెండోసారి పెరిగిన ఎరువుల ధరలు పాపన్నపేట(మెదక్): పది రోజుల్లో ఎరువుల ధరలు రెండు సార్లు పెరగడంతో అన్నదాతల ఆందోళన చెందుతున్నారు. చేతిలో పైసలు లేక, అడ్వాన్స్గా ఎరువులు కొనలేక ఆగమవుతున్నారు. ఈనెల 4న ఒక్కో సంచిపై సుమారు రూ.200 నుంచి రూ.400 వరకు పెరిగాయి. పది రోజులు కాక ముందే ఈనెల 13న మరోసారి ధరలు పెరిగాయి. ఇక ఫర్టిలైజర్ షాపు యజమానులు, అధీకృత డీలర్లు పాత ఎమ్మార్పీ సంచులను కొత్త ధరలకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఖరీఫ్కు సంబంధించి 59,870 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్ తెలిపారు. కాగా, డీఏపీ, యూరియా ఎరువుల ధరలు పెరగకపోవడం కొంత ఉపశమనం. సమస్యలపై పోరాటం మెదక్ కలెక్టరేట్: జిల్లాలో విత్తన, ఎరువుల కొ రత లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో రాబోయే 3 నెలల పాటు సమస్యలపై సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో విద్యా, వైద్యం, పింఛన్లు, అటవీ భూములు తదితర సమస్యలపై సర్వే చేసి పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తామన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఎరువుల యాప్ ఓపెన్ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నర్సమ్మ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యుడు గౌరయ్య తదితరులు పాల్గొన్నారు. మాలల హక్కుల సాధనకు కృషి వెల్దుర్తి(తూప్రాన్): జాతీయ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండలంలోని అందుగులపల్లికి చెందిన ప్రభాకర్ను నియమించారు. ఈమేరకు ఆదివారం సంఘం జిల్లా అధ్యక్షుడు సంజీవ్, ఉపాధ్యక్షుడు ఆనంద్, యూత్ అధ్యక్షుడు నరేశ్ నియామకపత్రం అందజేశారు. ఈసందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. మాలల హక్కుల సాధన కోసం తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. -
రైతన్నకు దిక్సూచి
● వాతావరణ సమాచార యాప్లను రూపొందించిన కేంద్రం ● ముందస్తు పిడుగులు, వర్ష సమాచారం రైతులకు చేరవేత ● అందుబాటులో మేఘ్దూత్, కిసాన్ సువిధ, రెయిన్ అలారం, దామిని యాప్లుసదాశివపేట రూరల్(సంగారెడ్డి): ప్రతీ ఏటా అకాల వర్షాలు అతివృష్టి, అనావృష్టితో రైతుల పంటలకు తీవ్ర నష్టం జరుగుతుంది. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని దిక్కుతోచని పరిస్థితి. వరుణుడి కోసం ఎదురుచూస్తూ పంటల సాగును చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రైతులకు చల్లని కబురు తీసుకొచ్చింది. సకాలంలో రైతులకు వాతావరణ సూచనలు, వర్షాలు, పిడుగుల సమాచారాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖలు ఐఎండీ, ఐకార్ సహకారంతో పలు రకాల యాప్లను రూపొందించింది. ఇందులోభాగంగా మేఘ్దూత్, కిసాన్ సువిధ, రెయిన్ అలారం, దామిని యాప్లను రూపొందించి, రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ల ద్వారా రైతులు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. ఇందులో కొన్ని యాప్లు ముందస్తు సమాచారాన్ని కూడా అందిస్తున్నాయి. మేఘ్దూత్లో ముందస్తు సమాచారం మేఘ్దూత్ యాప్లో రానున్న నాలుగు రోజుల వాతావరణ సమాచారాన్ని రైతులు ముందే తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్లో వారం క్రితం నాటి సమాచారంతోపాటుగా ప్రస్తుత సమయంలో ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం సమాచారాన్ని పొందవచ్చు. ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు కూడా ఈ యాప్ ద్వారా ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వర్ష సూచనలను నిరంతరం తెలుసుకునేందుకు రెయిన్ అలారం, కిసాన్ సువిధ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. వాతావరణంతోపాటుగా మార్కెట్ ధరలు, పంటల భీమా సమాచారం, విత్తనాలు,ఎరువులు,నీటి నిర్వహణపై పలు సూచనలు ఈ యాప్లో రైతులకు అందుబాటులో ఉన్నాయి. అన్ని భాషలతోపాటుగా తెలుగు భాషలోనూ రైతులకు యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్లను రైతులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చు. పిడుగుల సమాచారం ఉరుములు, మెరుపులు, పిడుగులకు సంబంధించిన సమాచారాన్ని దామిని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పిడుగులు ఎక్కడ పడే అవకాశం ఉందో ఈ యాప్ రైతులకు సూచిస్తూ ప్రాణాలను కాపాడుతుంది. పిడుగు పడే సమయంలో రైతులు తగు జాగ్రత్తలను తీసుకుని రక్షణ పొందవచ్చు.సద్వినియోగం చేసుకోవాలి రైతుల ఉపయోగార్థం ప్రభుత్వం రూపొందించిన మేఘ్ధూత్, కిసాన్ సువిధ, రెయిన్ అలారం, దామిని యాప్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ యాప్లతో పంటల సాగులో రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా రైతులకు ప్రాణ రక్షణకు దోహదపడుతుంది. – వెంకటలక్ష్మి, ఏడీఏ, సంగారెడ్డి -
ట్రేడ్.. మోసమే ట్రెండ్!
జిల్లాలోని కొందరు మిల్లర్లు మున్సిపాలిటీల ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. రైస్మిల్లుల్లో ధాన్యం క్రయ విక్రయాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి కాగా, తీసుకోకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. బల్దియాలకు ప్రధాన ఆదాయం లైసెన్స్ల ద్వారానే వస్తుండగా, ఈ విషయమై కమిషనర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. – రామాయంపేట(మెదక్) 2020 కంటే ముందు లైసెన్స్ రుసుం వసూలు మాన్యువల్గా ఉండేది. వ్యాపార రకాన్ని బట్టి వార్షిక రుసుం వసూలు చేసేవారు. ఎంత పెద్ద వ్యాపారమైన రూ. నాలుగైదు వేలకు మించి ఉండేది కాదు. ప్రస్తుతం మున్సిపల్శాఖ ట్రేడ్ లైసెన్స్ల జారీ, ఫీజు వసూలు విధానాన్ని ప్రక్షాళన చేసింది. పరిశ్రమలు, రైస్మిల్లులకు పరిమాణాన్ని బట్టి చదరపు అడుగుకు రూ. నాలుగు నుంచి రూ. ఆరు వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మారిన నిబంధనల మేరకు కనీసం రూ. 50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. స్వీయ ధ్రువీకరణ కింద సదరు వ్యాపారి స్వయంగా రైస్మిల్లు విస్తీర్ణం, ముందు భాగంలో రోడ్డు వెడల్పు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయగానే ఎంత ఫీజు చెల్లించాలనే విషయం సూచిస్తుంది. ఫీజు చెల్లించగానే లైసెన్స్ జారీ అవుతుంది. సదరు వ్యాపారి ఇచ్చిన సమాచారం వాస్తవమా..? కాదా అనే విషయాన్ని తర్వాత మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. తప్పుగా తేలితే అసలు రుసుం కంటే 25 శాతం అధికంగా జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. కాగా, లైసెన్స్ ఫీజులు చెల్లించకపోవడంతో ఒక్కో మున్సిపాలిటీకి రూ. లక్షల మేర బకాయలు పేరుకుపోయాయి. వాటికీ సీఎంఆర్ కేటాయింపు! ఆన్లైన్ విధానం అమలు తర్వాత జిల్లాలోని 15 రైస్ మిల్లులకు గానూ కేవలం రెండు మాత్రమే ట్రేడ్ లైసెన్స్లు తీసుకున్నాయి. ఈవిషయమై నాలుగు మున్సిపాలిటీల పరిధిలో అధికారులు, సిబ్బందికి సైతం సరైన అవగాహన లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా ధాన్యం, బియ్యం వ్యాపారం చేయవద్దనే నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోని రైస్మిల్లులకు సైతం అధికారులు సీఎంఆర్ ఇవ్వడం గమనార్హం.మున్సిపాలిటీ రైస్ మిల్లులు లైసెన్స్ ఉన్నవి మెదక్ 2 1 తూప్రాన్ 5 - నర్సాపూర్ 2 - రామాయంపేట 6 1 ట్రేడ్ లైసెన్స్లు తీసుకోకుండానే వ్యాపారాలు 15 రైస్ మిల్లుల్లో రెండింటికే లైసెన్స్ బల్దియాల ఆదాయానికి భారీగా గండిచర్యలు తప్పవు రైస్ మిల్లులతో పాటు ఇతర వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి. తీసుకోని వారు వ్యాపారాలు చేసుకోవడానికి వీలు లేదు. లైసెన్స్ లేని వ్యాపార సంస్థలను గుర్తించి త్వరలో నోటీసులు జారీ చేస్తాం. – రవీందర్, మున్సిపల్ కమిషనర్, రామాయంపేట -
బుడిబడి అడుగులు
నేటి నుంచి మోగనున్న బడి గంట ● తెరుచుకోనున్న పాఠశాలలు ● కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం ● మెరుగవుతున్న వసతులుబాల్యం బుడిబుడి అడుగులతో బడి బాట పట్టనుంది. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు ఆటాపాటలకు గుడ్బై చెప్పి తరగతులకు హాజరుకానున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా, జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. – మెదక్ అర్బన్ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో సర్కారు బడులు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూ నిఫాం, అల్పాహారం, మధ్యా హ్న భోజనం, ట్రాన్స్ఫోర్టు అలవెన్స్ తదితర చర్యలతో విద్యార్థుల నమోదు శాతం గతేడాది దాదాపు స్థిరంగా నిలిచింది. 2024–25లో 74,200 ఉన్న నమోదు శాతం, 2025–26కు వచ్చే సరికి 73,436కు చేరింది. అయితే సుమారు 600 మంది విద్యార్థులకు ఆధార్ నమోదు సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కలిస్తే దాదాపు అంతకు ముందు సంవత్సరంతో అడ్మిషన్లు సమానమవుతాయి. అయితే ఇప్పటికీ 115 పాఠశాలల్లో 15 లోపు పిల్లలు ఉన్నారు. విద్యార్థులు లేక 30 స్కూల్స్ మూతబడ్డాయి. అందులో నమోదు శాతం పెంచాలని, ఇప్పటికే హెచ్ఎంలకు టార్గెట్ ఇచ్చారు. కాగా 5వ తరగతి నుంచి ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్తుండటంతో సంఖ్య తగ్గుతుంది.ప్రవేశాల పెంపునకు చర్యలు‘నాణ్యమైన విద్య.. మా బాధ్యత’ అంటూ ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం చేపట్టారు. మారుతున్న కాలానుగుణంగా ప్రాథమిక, ఉన్నత విద్యాస్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియంతో పాటు అధునాతనమై కంప్యూటర్ ఆధారిత ఏఐ విద్య అందిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఈసారి 90 ప్రీ ప్రైమరీ పాఠశాలలు కొత్తగా ప్రారంభిస్తున్నారు. 28 పీఎం శ్రీ పాఠశాలలకు ఏటా రూ.లక్షల నిధులు వస్తున్నాయి. ఇందులో అధునాతన ల్యాబ్లు, లైబ్రరీలు, కంప్యూటర్ విద్య అందిస్తున్నారు. మెదక్ కేజీబీవీలో 8వ తరగతి నుంచే ఐఐటీ, జేఈఈ, చిప్పల్తుర్తిలో నీట్, అల్లాదుర్గంలో క్లాట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని 267 పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణానికి రూ.7.76 కోట్లు మంజూరయ్యాయి. ముఖ్యంగా మోడల్, పీఎంశ్రీ స్కూళ్లలో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుంది.జిల్లాలో ఇలా.. పాఠశాలలు సంఖ్య విద్యార్థులు ప్రభుత్వ, లోకల్బాడీ 874 63,250టీఆర్ఈఐఎస్ 2 1,162మోడల్ స్కూల్స్ 7 4,969కేజీబీవీ 19 3,955యూఆర్ఎస్ 01 100నాన్న సైకిల్పై తీసుకెళ్లేవారు మెదక్జోన్: మాది రంగారెడ్డి జిల్లా కోకాపేట మండలం రాజేంద్రనగర్ గ్రామం. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. నిత్యం నన్ను సైకిల్పై బడికి తీసుకెళ్లేవారు. మేము ఏడుగురు సంతానంలో నేను మొదటి వ్యక్తిని. నా చదువంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే కొనసాగింది. అప్పట్లో స్కూల్లో మధ్యాహ్నం ఉప్మా పెట్టే వారు. ఎంతో ఇష్టంగా తినేవాళ్లం. – రాజు, ఇన్చార్జి డీఈఓచురుకై న విద్యార్థిని మెదక్జోన్: మాది సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం మిర్యాల గ్రామం. నేను చిన్నప్పుడు బడికి సంతోషంగా వెళ్లేది. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మేము ఐదుగురం సంతానం. నేను అందరికంటే చిన్నవాడిని. అన్నయ్యలతో పాటు మా నాన్నవెంట కలిసి బడికి వెళ్లేవాడిని. నా చదువంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే కొనసాగింది. చదువులో చురుకై న విద్యార్థిని. క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చేది. – నగేశ్, అదనపు కలెక్టర్ -
కరెంట్ కష్టాలు తీరేదెన్నడో?
వీరహనుమాన్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సబ్స్టేషన్మెదక్ పట్టణం పిల్లికొటాల్ సమీపంలోని పుష్పాలవాగు పక్కన ఉన్న 33 కేవీ సబ్స్టేషన్ నుంచి పట్టణంలోని ఆటోనగర్, నర్సాపూర్ ఎక్స్రోడ్డు, వెంకట్రావునగర్ కాలనీ, పిల్లికొటాల్, డబుల్బెడ్రూంలు, నవాబుపేట వ్యవసాయ పంపుసెట్లు, పట్టణానికి తాగునీరు అందించే పంప్హౌస్కు విద్యుత్ సరఫరా అయ్యేది. కాగా, గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు సబ్స్టేషన్ మునిగిపోవటంతో ఆరు ఫీడర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో గల రాజ్పల్లి సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దానిపై ఓవర్లోడ్ పడటంతో తరచూ ట్రిప్ అవుతోంది. అలాగే ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీంతో పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రూ. 3 కోట్లు మంజూరు వీరహనుమాన్ కాలనీలో నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 3 కోట్లు మంజూరు చేసింది. టెండర్ పనులను ఆన్లైన్ ద్వారా దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. మూడు నెలల్లో పనులు పూర్తి కావాల్సి ఉండగా, నేటికీ పూర్తి కాలేదు. శాఖల మధ్య సమన్వయ లోపం విద్యుత్, ఫారెస్ట్ శాఖల మధ్య సమన్వయ లోపం ప్రజలకు శాపంగా మారింది. రోడ్డు పక్కన గల విద్యుత్ తీగల కింద మొక్కలు నాటడంతో అవి పెరిగి వైర్లకు తాకుతున్నాయి. ఫలితంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. అధికారులు ముందు చూపు లేకుండా లక్ష్యం పూర్తి చేయాలని మొక్కలు నాటడంతో సమస్య ఉత్ప న్నం అవుతుంది. ఏడాదిగా సా..గుతున్న సబ్స్టేషన్ నిర్మాణం రాజ్పల్లి నుంచి కరెంట్ సరఫరా ఓవర్లోడ్తో తరచూ ట్రిప్ ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు మెదక్ పట్టణ ప్రజలను కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు పిల్లికొటాల్ సబ్స్టేషన్ మునిగిపోయింది. దీంతో నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ పది నెలలుగా నిర్మాణ పనులు చేస్తున్నా, నేటికీ అతీగతీలేదు. రాజ్పల్లి సబ్స్టేషన్ నుంచి కరెంట్ సరఫరా చేస్తున్నా.. ఓవర్లోడ్తో తరచూ ట్రిప్ అవుతోంది. ఫలితంగా పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. – మెదక్జోన్ రెండు, మూడు రోజుల్లో పూర్తి కొత్త నిర్మిస్తున్న సబ్స్టేషన్పై ఆరు ఫీడర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు నాలుగు పూర్తి చేశాం. మరో రెండు ఫీడర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటితో పాటు మూడు కిలోమీటర్ల మేర విద్యుత్ స్తంభాలు నాటాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తాం. – మోహన్బాబు, మెదక్ ట్రాన్స్కో ఏడీ -
ధాన్యం.. దైన్యం
మొలకొచ్చిన వడ్లను ఆరబెడుతున్న రైతుఆరుగాలం కష్టపడి వరి పండించిన రైతులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. లారీల కొరత.. ధాన్యం తరలింపులో కాలయాపనతో వడ్లు కల్లాల్లోనే మూలుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి తూకం వేసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొన్నిచోట్ల బస్తాల కిందకు నీరు చేరడంతో రంగుమారి మొలకలు వచ్చాయి. మెదక్, హవేళిఘణాపూర్ మండలాలకు సంబంధించిన ధాన్యం మంభోజిపల్లి ఎన్డీఎస్ఎల్ గోదాంకు తరలిస్తున్నారు. అక్కడ అన్లోడింగ్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రోడ్డుకు ఇరువైపులా లారీలు నిలిచిపోయాయి. హమాలీల సంఖ్య పెంచి అన్లోడింగ్ త్వరగా అయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. – హవేళిఘణాపూర్(మెదక్) -
సర్పంచ్లకు వేతనాలు
● జిల్లాకు రూ. 1.61 కోట్లు విడుదల ● నేరుగా వారి ఖాతాల్లో జమరామాయంపేట(మెదక్): ఐదు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్న సర్పంచ్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు ఎన్నికల్లో గెలుపొందినప్పటి నుంచి ఇప్పటివరకు గౌరవ వేతనాలు విడుదల కాలేదు. ఈక్రమంలో తాజాగా ప్రభుత్వం రూ.1.61 కోట్లు విడుదల చేసింది. జిల్లాలోని 492 మంది సర్పంచ్లకు మంజూరైన వేతనాలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. వీరిలో తొమ్మిది మంది ఇతర సంస్థల నుంచి వేతనాలు పొందుతుండటంతో వారి ఖాతాల్లో డబ్బులు పడినా, అధికారులు హోల్డ్లో పెట్టారు. సదరు సర్పంచ్లు క్లియర్ చేసుకొని లేఖ అందజేస్తే వారి ఖాతాల్లో సైతం డబ్బులు జమవుతాయని తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని సర్పంచ్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గత డిసెంబర్లో ఎన్నికలు రెండేళ్లకు పైగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు గతేడాది డిసెంబర్లో ఎన్నికలు జరిగి, నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. గెలిచి ఆరు నెలలు కావొస్తున్నా వారికి నెలవారీగా ఇచ్చే గౌరవ వేతనం కోసం సర్పంచ్లు ఎంతగానో ఎదురు చూశారు. ఎట్టకేలకు ప్రభుత్వం వారి నిధులు విడుదల చేసింది. ఐదు నెలల పది రోజులకు సంబంధించిన డబ్బులను వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.ప్రతినెలా అందించాలని వినతి సర్పంచ్లకు వేతనాలు చెల్లించడంలో కొంత ఆలస్యమవుతోంది. వీరికి ప్రతి నెలా ఒకటో తేదీన విడుదలయ్యేలా చూడాలని గత పాలకవర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఆరు నెలలు, ఏడాదికోసారి గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. దీంతో కొందరు సర్పంచ్లు ఇబ్బందులు పడుతున్నారు. -
గాలివాన బీభత్సం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 11.4 సెం.మీల వర్షపాతం రికార్డు అయింది. దీంతో వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉమ్మడి జిల్లాలో వివిధ చోట్ల నమోదైన వర్షపాతం వివరాలను పరిశీలిస్తే.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచలో 4.7 సెం.మీలు, పుల్కల్ 3.4 సెం.మీలు, మునిపల్లిలో 3.2 సెం.మీలు, రామచంద్రాపూరం బీహెచ్ఈఎల్లో 3.0 సెం.మీలు, సదాశివపేటలో 2.3 సెం.మీలు, రాయికోడ్, న్యాల్కల్ మండలాల్లో 1.5 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో వర్షపాతం రికార్డు అయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. భారీ వర్షాలకు పలుచోట్లు ధాన్యం తడిపోయింది. చెట్లు విరిగి రోడ్లపై పడటంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నేలవాలిన వృక్షాలు రామాయంపేట(మెదక్)/పెద్దశంకరంపేట: మండలంలోని తొనిగండ్లలో శనివారం కురిసిన భారీ వర్షం కురిసింది. భారీ వృక్షాలు నేలవాలాయి. విద్యుత్ తీగులు తెగిపోయాయి. ఇద్దరి ఇళ్లపైన ఉన్న రేకులు ఎగిరిపోయాయి. సర్పంచ్ శివుకుమారి పాలకవర్గంతో కలిసి గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగింపజేశారు. అలాగే పెద్దశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలువురి ఇళ్ల రేకులు గాలివానకు ఎగిరిపోయాయి. ఉత్తులూర్ వద్ద రహదారిపై చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారిపై కూలిన చెట్టు ఉత్తులూర్లో గోడపై పడిన చెట్టు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో వాన కొండాపూర్లో కుండపోత రాష్ట్రంలోనే అత్యధికంగా 11.4 సెం.మీ రికార్డు పలుచోట్ల తడిసిన ధాన్యం -
ఏం చేద్దాం..?
భూముల రీ సర్వే రికార్డుల అమలుపై లోతైన పరిశీలన● పైలెట్ ప్రాజెక్టు కింద షాద్నగర్లో రీ సర్వే పూర్తి ● ఎల్పీఎంలు, కో రిలేషన్ స్టేట్మెంట్లు, గూగుల్ ఇమేజ్ నక్షాలు సిద్ధం ● రికార్డులు అప్పగించి మూడు నెలలైనా తేలని నిర్ణయం ● ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్న అధికారులుసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భూముల రీ సర్వేలో భాగంగా పైలెట్ ప్రాజెక్టు వట్పల్లి మండలం షాద్నగర్లో చేపట్టిన రీ సర్వే విధానాన్ని అమలు చేసే అంశంపై రెవెన్యూశాఖ ఎటూ తేల్చడం లేదు. ఈ ప్రక్రియ పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా దీని అమలుపై ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతోంది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, రెవెన్యూ శాఖల అధికారులు ఈ గ్రామ పరిధిలో ఉన్న 593 ఎకరాల భూమిని రీ సర్వే పూర్తి చేశారు. శాటిలైట్ ఇమేజ్లు, డ్రోన్లు వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించి అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన ల్యాండ్ పార్సిల్ మ్యాపు (ఎల్పీఎం)లు తయారు చేశారు. ఆయా భూములకు సంబంధించి పాత సర్వే నంబర్లు, కొత్త సర్వే నంబర్లకు సంబంధించిన కోరిలేషన్ స్టేట్మెంట్లను కూడా సిద్ధం చేశారు. గూగుల్ ఇమేజ్తో కూడిన నక్షాలు.. ఇలా అన్ని రకాల రికార్డులు తయారు చేసి రెవెన్యూశాఖకు అప్పగించారు. ఈ రికార్డులను భూభారతి పోర్టల్లో నమోదు చేసి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి మూడు నెలలుగా ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో దాదాపు సర్కార్ నిర్ణయం కోసం అధికారులు వేచి చూస్తున్నారు. అయితే ఈ రీ సర్వే రికార్డులను అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశంపై రెవెన్యూశాఖ లోతైన పరిశీలన చేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్ని రైతుల నుంచి స్పందన ఎలా ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ను తెచ్చిన విషయం విదితమే. రైతులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గ్రామాలను ఎంపిక చేసి భూముల రీ సర్వే చేసింది. సంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్తో పాటు, కోస్గి (నారాయణపేట జిల్లా), ఆమనగల్లు (రంగారెడ్డి), కూసుమంచి (ఖమ్మం), భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లోని ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ అధికారులు కలిసి గ్రామంలోని భూములన్నింటినీ రీ సర్వే చేశారు.రైతుల నుంచి అభిప్రాయం రీ సర్వే సంబంధించి గ్రామంలో పట్టాదారుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని అధికారులు కోరారు. కొందరు రైతులు ఈ రీ సర్వేపై అభ్యంతరాలు తెలిపారు. ఈ అభ్యంతరాలను నివృత్తి చేశామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నా రు. కాగా.. రీ సర్వేకు సంబంధించి రికార్డులు ఏప్రిల్ 2 నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇంకా అమలు విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. -
త్వరలో ఆర్టీసీలో ఎన్నికలు
రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్ సంగారెడ్డి టౌన్: త్వరలో ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకున్నామని, దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కమిటీ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమై సంబంధించిన అన్ని సాంకేతిక ,ఆర్థిక పరిపాలనపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్ పాల్గొన్నారు. వర్షాల వేళ.. జాగ్రత్త రామాయంపేట(మెదక్): ఇటీవల బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ రవీందర్ పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన శనివారం కౌన్సిలర్ శంకర్గౌడ్తో కలిసి ఎనిమిదో వార్డులో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాక్షికంగా శిథిలమైన మురుగు కాలువలు, రహదారులను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న గృహాలను పరిశీలించి, వాటిని తొలగించడానికి త్వరలో నోటీసులు జారీ చేస్తామన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మురుగు కాలువల్లో చెత్త వేయవద్దని సూచించారు. వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇంజనీరింగ్, వార్డు అధికారులను ఆదేశించారు. అంజన్న సన్నిధిలో భక్తజన సందడి శివ్వంపేట(నర్సాపూర్): చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులు అభిషేకం అనంతరం సత్యనారాయణస్వామి మండపంలో సామూహిక వ్రతాలు ఆచరించారు. మండల పరిధిలోని ఉసిరికపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కృష్ణారావు భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయం వద్ద నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి భక్తులు వస్తు, ధన రూపంలో సహాయం అందించాలని ఈఓ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఆంజనేయశర్మ కోరారు. చెట్లు తెంచిన తంటా పవర్ వర్సెస్ ఫారెస్ట్శాఖ హవేళిఘణాపూర్(మెదక్): చెట్ల కొమ్మలను తొలగించే విషయం విద్యుత్, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణకు దారి తీసింది. మండల పరిధిలోని జక్కన్నపేట– బూర్గుపల్లికి సరఫరా అయ్యే విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను శనివారం విద్యుత్శాఖ అధికారులు నరికివేస్తుండగా, తమ అనుమతి లేకుండా ఎలా తొలగిస్తారంటూ అటవీశాఖ అధికారులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది. దీనిపై ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 415 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తిమెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇప్పటివరకు 415 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 90,669 రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 73,429 మంది రైతుల ఖాతాల్లో రూ.786 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. -
ప్రకృతిని కాపాడుకుందాం
నర్సాపూర్: ప్రకృతిని కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని స్వాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మేఘన పిలుపునిచ్చారు. శనివారం సంస్థ ప్రతినిధులు, వాకింగ్ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అడవిలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరివేత కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడినప్పుడే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించగలమన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తక్కువ చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చెష్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈకేవైసీ తప్పనిసరి
మెదక్ కలెక్టరేట్: రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు ఈనెల 30తో ముగియనుంది. ప్రతి లబ్ధిదారుడు ఈకేవైసీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల అధికారులు చేపడుతున్నారు. జిల్లాలోని 21 మండలాలు ఉండగా 520 రేషన్ షాపులు ఉన్నాయి. 2,39,217 రేషన్కార్డులుండగా, 7,81,429 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు 5,88,188 మంది మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్నట్లు తెలిసింది. మరో 1,93,241 మంది ఇంకా బయోమెట్రిక్ చేసుకోవాల్సి ఉంది. చేసుకోకపోతే రేషన్ బియ్యం పంపిణీ నిలిపివేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. గ్యాస్ లబ్ధిదారులు సైతం.. జిల్లాలోని గ్యాస్ గృహ వినియోగదారులు ఈనెలాఖరులోగా ఈకేవైసీ చేసుకోవాలని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. లేదంటే సబ్సిడీ నిలిచిపోతుందన్నారు. జిల్లాలో మొత్తం 52,047 మంది ఉజ్వల గ్యాస్ వినియోగదారులు ఉండగా, ఇంకా 5,168 ఇంకా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. అలాగే జిల్లాలోని రిటైల్ పెట్రోల్ బంక్ల డీలర్లు హైస్పీడ్ డీజిల్ను ప్రతి వాహనానికి 200 లీటర్లకు మించి విక్రయించొద్దని హెచ్చరించారు. రిటైల్ డీలర్ల నుంచి అధిక మొత్తంలో డీజిల్ కొనుగోలు చేసిన కొంత మంది ఇతరులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఫలితంగా రైతులకు, వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. అక్రమ విక్రయాలను అరికట్టేందుకు డీలర్లంతా సహకరించాలన్నారు.నెలాఖరుతో ముగియనున్న గడువు -
అందుబాటులో యూరియా
ఓపెన్ అయిన బుకింగ్ యాప్చిన్నశంకరంపేట(మెదక్): వానాకాలం సీజన్కు అవసరమైన యూరియా రైతులకు అందుబాటులో ఉందని వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించారు. తాజాగా ఫర్టిలైజర్ యాప్ సైతం ఓపెన్ అయిందని, జిల్లాలో 6,490 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని తెలిపారు. ఇప్పటికే 11 మండలాల్లో యూరియా యాప్ ఓపెన్ కాగా, మరో 10 మండలాల్లో శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు తెలిసింది. మెదక్ మండలంలో 217.62 మెట్రిక్ టన్నులు, పాపన్నపేట 287.55, రామాయంపేట 29.25, చిన్నశంకరంపేట 94.59, హవేళిఘణాపూర్ 20.25, నర్సాపూర్ 193.14, కౌడిపల్లి 293.17, కొల్చారం 79.38, శివ్వంపేట 86.62, చిలప్చెడ్ 28.98, మనోహరాబాద్ 20.25, తూప్రాన్ 99.85, చేగుంట 28.98, పెద్దశంకరంపేట 102.24, అల్లాదుర్గం 310.81, రేగోడ్ 76.72, టేక్మాల్ 620.37 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. కాగా నార్సింగి, మాసాయిపేట, నిజాంపేట, వెల్దుర్తి మండలాల్లో ఇప్పటివరకు యూరియా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం రైతులు నారుపోసే దశలో ఉన్నారని, నాట్లు వేసిన నెలకు యూరియా అవసరం పడుతుంది. రైతులు ముందే కొనుగోలు చేసి స్టాక్ చేసుకోవద్దని అధికారులు చెప్పారు. ఎల్లవేళలా యూరియా అందుబాటులో ఉంటుందని గ్రహించాలన్నారు. ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోని రైతులు వెంటనే రైతు వేదికల్లో అందుబాటులో ఉన్న ఏఈఓల వద్ద చేసుకోవాలన్నారు. రైతులు యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలని సూచించారు. -
బీజేపీ కనుసన్నల్లో ఎస్ఐఆర్
నర్సాపూర్: కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో జరగాల్సిన ఎస్ఐఆర్ ప్రక్రియ, బీజేపీ కనుసన్నల్లో జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నియోజకవర్గంలోని బీఎల్ఏల అవగాహన కార్యక్రమం నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి సంస్థగా కొనసాగేదని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కనుసన్నల్లోనే కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ బీఎల్ఏలు చురుకుగా పని చేయాలని, అర్హుల ఓట్లు తొలగించకుండా పర్యవేక్షించాలని సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓటర్ల పేర్లు తొలగించారని వివరించారు. అర్హుల పేర్లు తొలగిస్తే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశ్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, ఆయా మండల పార్టీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని చౌరస్తాలో ప్రధాని దిష్టబొమ్మను దహనం చేశారు. మోదీ పరిపాలనలో ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడ్డాయని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్ ఆరోపించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం -
కొనుగోళ్లు వేగవంతం
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని చల్మెడ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సహకార అధికారి పద్మ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల ద్వారా త్వరితగతిన రైస్మిల్కు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆలస్యం చేయకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలని కేంద్రం ఇన్చార్జి స్వామికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెద్దశంకరంపేట(మెదక్)/చిన్నశంకరంపేట: మండల పరిధిలోని పలు ఫీడర్ల పరిధిలో వానాకాలం మెయింటనెన్స్ ప్లాన్లో భాగంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్యాంసుందర్ తెలిపారు. బూర్గుపల్లి, జంబికుంట, రామోజీపల్లి, పెద్దశంకరంపేట ఫీడర్ల పరిధిలో విద్యుత్ కోత ఉంటుందన్నారు. అలాగే చిన్నశంకరంపేట మండలంలోని విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో మరమ్మతుల కారణంగా శని, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో ఏఈ దినకర్ తెలిపారు. నర్సాపూర్: ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ల వినియోగం తగ్గించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నోడల్ ఆఫీసర్ కుమార్ పాటక్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్లాస్టిక్ నియంత్రణ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వ్యాపా రులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 120 మైక్రాన్స్ కలి గిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడాలని, అంతకన్న తక్కువ మైక్రాన్స్ కలిగిన బ్యాగులు వాడొద్దని హితవు పలికారు. అనంతరం ప్లాస్టి క్తో పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించారు. కమిషనర్ సాయికుమార్ మాట్లాడుతూ.. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు ఎవరూ వాడొద్దని, వాడి తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. సమావేశంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని చందంపేట శివారులోని ఓ రసాయన పరిశ్రమను డీఎల్పీఓ సురేశ్బాబు శుక్రవారం పరిశీలించారు. వ్యర్థాలను తరలించేందకు చేపట్టిన చర్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 100 కేజీలకు ఎక్కువగా నిత్యం వ్యర్థ పదార్థాలను బయటకు తరలించే పరిశ్రమలు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా నిర్మిస్తున్న బ్లాక్లకు అవసరమైన అనుమతులను తీసుకోవడంతో పాటు జీపీకి సెస్ చెల్లించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీఓ దామోదర్, సర్పంచ్ ప్రవీణ్కుమార్ ఉన్నారు. అలాగే మండలంలోని ప్యాటగడ్డ పంచాయతీ పరిధిలో మురికి కాలువలను పరిశీలించి సర్పంచ్ లావణ్యకు పలు సూచనలు చేశారు. కౌడిపల్లి(నర్సాపూర్): ప్రధానిగా నరేంద్ర మోదీ పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో మండలంలోని తునికి కేవీకేలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణ నిర్వహిస్తామని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్గౌడ్ తెలిపారు. శుక్రవారం కేవీకేలో ఏర్పాట్లను పరిశీలించి శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందర్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరవుతారని తెలిపారు. -
ఆ ఆట.. మృత్యు వేట!
ఇద్దరు పిల్లలను సాగర్లో తోసేసి తానూ ఆత్మహత్మఅభం, శుభం తెలీని ఆ చిన్నారులు నాన్న ఆడిస్తానంటే నమ్మి వెళ్లారు. బిర్యానీ తీసుకొస్తే సంతోషంగా తిన్నారు.. తమతో పాటే ప్రాజెక్టు నీటిలో సంతోషంగా ఆడిస్తుంటే కేరింతలు కొడుతూ మైమరిచి ఆడారు. ఆట సంబురం తీరిందనుకొనేలోపే తండ్రే కాలయముడిలా మారి కన్న బిడ్డలను నీటిలో తోసేసి తానూ తనువు చాలించాడు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన కృష్ణ తన ఇద్దరు పిల్లలను కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో తోసేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కలచి వేసింది. నారాయణఖేడ్: నిజాంపేట మండల కేంద్రానికి చెందిన గూల కృష్ణ (34) ఎల్లారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన సవితతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రక్షిత్ (8), అణన్య (6) ఇద్దరు సంతానం. నిజాంపేటలో చేపలు పట్టే జీవనం సాగించేవాడు. స్థానికంగా ఉపాధి ఇబ్బంది కరంగా మారడంతో కొన్ని నెలల క్రితం పటాన్చెరుకు వలస వెళ్లాడు. కృష్ణ పేయింటర్గా పనిచేస్తుండగా.. సవిత ఇడ్లీ సెంటర్లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. గొడవలతో పుట్టింటికి.. మద్యానికి బానిసైన కృష్ణకు బయట అప్పులు చేసిన విషయాన్ని పలుమార్లు భార్య ప్రశ్నించింది. ఎక్కడెక్కడ అప్పులు చేశావంటూ అడగడంతో తాను తనకోసం అప్పులు చేసుకున్నాను, నా బాధ నేను పడతానంటూ భార్యతో గొడవ పడేవాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల జరిగే గొడవలతో సవిత తన ఇద్దరు పిల్లలను తీసుకొని దేవునిపల్లిలోని పుట్టింటికి వెళ్లింది. తాను బాగుంటానని చెప్పి భార్య, పిల్లలను నెల క్రితం తీసుకొని పటాన్చెరుకు వచ్చాడు. జాగ్రత్త.. బైబై నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో పిల్లలను ఆడిస్తూ సెల్ఫీ ఫొటోలు తీశాడు కృష్ణ. అనంతరం వాటిని అన్నారం గ్రామానికి చెందిన బావమరిది ఫోన్కు సెండ్ చేశాడు. జాగ్రత్త, బాయ్ బాయ్.. మంచిగ ఉండండి అంటూ చివరి వాయిస్ మెస్సేజ్ పెట్టాడు. దీంతో కంగారు పడిన బావమరిది తిరిగి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. విషయం కుటుంబీకులకు తెలపడం వారు చేరుకొని రాత్రి గాలించినా మృతదేహాలు లభ్యం కాలేదు. శుక్రవారం ఉదయం మృతదేహాలను వెలికి తీశారు. చెప్పా పెట్టకుండా వెళ్లి.. తరచూ ఇంట్లో గొడవలు జరిగే సమయాల్లో పిల్లలను తీసుకొని వెళ్లి రాత్రి 11లోపు ఇంటికి చేరుకునే వాడు. గురువారం ఉదయం 9.40గంటల ప్రాంతంలో పిల్లలను తీసుకొని వెళ్లి సాయంత్రం అయినా ఇంటికి చేరుకోలేదు. భార్య ఫోన్ చేస్తే స్పందించలేదు. నిజాంపేటకు వచ్చిన కృష్ణ.. బైక్ తీసుకొని నిజాంసాగర్కు చేరుకున్నాడు. పిల్లలకు ఆహారం కొనిచ్చి తినిపించాడు. కొద్దిసేపు నీటిలో ఆడించాడు. చేపలు పట్టేందుకు వాడే తెప్పపై పిల్లలను కూర్చోబెట్టుకొని నీరు ఎక్కువగా ఉండే ప్రాంతంలోకి వెళ్లి ఆడించి వారిని నీటిలో తోసేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలిలో కుటుంబీకుల రోదనలు కృష్ణ చదువులో మంచి టాపర్గా ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు. ఒక్క మార్కు తేడాతో కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయాడని పేర్కొన్నారు. నిజాంపేట్లో బాగానే ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో పటాన్చెరువు వెళ్లాకనే కలహాలు ప్రారంభం అయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అభం శుభం తెలీని పిల్లలను పొట్టన పెట్టుకున్న తండ్రి ఆర్థిక ఇబ్బందులతోకుటుంబ కలహాలు జాగ్రత్త బైబై అంటూ చివరి మెస్సేజ్ నిజాంపేటలో విషాదం -
మద్యం అమ్మకాలకు బహిరంగ వేలం
● నిబంధనలకు విరుద్ధం ● రూ.8.30 లక్షలకు కై వసం చేసుకున్న వ్యక్తి రామాయంపేట(మెదక్): నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలకు నిజాంపేట మండలం నస్కల్ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం బహిరంగ వేలం నిర్విహించారు. వేలం పాటలో పాల్గొన్న 15 మంది ముందుగా రూ. ఐదు వేల చొప్పున డిపాజిట్ చేశారు. అందరి కంటే ఎక్కువగా రూ. 8.30 లక్షలకు పాట పాడిన అదే గ్రామానికి చెందిన వ్యక్తి టెండర్ కై వసం చేసుకున్నాడు. కాగా, ఇంతకుముందు గ్రామంలో పది మంది వరకు బెల్ట్షాపులు నిర్వహించేవారు. దీంతో పంచాయతీకి ఎలాంటి ఆదాయం సమకూరడం లేదనే ఉద్దేశంతో గ్రామస్తులు సమావేశమై ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టెండర్ తీసుకున్న వ్యక్తి కాకుండా ఇతరులు ఎవరైనా మద్యం అమ్మితే రూ. 50 వేల జరిమానాతో పాటు ఇతర చర్యలు తీసుకుంటామని గ్రామ పెద్దలు హెచ్చరించినట్లు తెలిసింది. ఈవిషయమై తమకు సమాచారం లేదని సర్పంచ్ పేర్కొన్నారు. ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ నరేందర్ను సంప్రదించగా, మద్యం అమ్మకాలకు వేలం పాట నిర్వహించడం నిబంధనలకు విరుద్దమన్నారు. ఈవిషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
పంటల మార్పిడి తప్పనిసరి
ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఏఓ దేవ్కుమార్ మెదక్ కలెక్టరేట్: వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైందని, రైతులు తప్పనిసరిగా పంటల మార్పిడి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ సూచించారు. శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆరుతడి పంటల సాగుతో అనేక ప్రయోజనాలు లభిస్తాయని, భూసారం పెరగడంతో పాటు పెట్టుబడులు తగ్గి అధిక లాభాలు పొందవచ్చునని తెలిపారు. జిల్లాలో సరిపడా ఎరువులు ఉన్నాయని, నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సాధ్యమైనంత వరకు వరికి బదులు మొక్కజొన్న, జొన్న, కందులు వంటి ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. ఆయిల్పాం సాగుకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్లో అనేక నకిలీ విత్తనాలు వస్తున్నాయి. ఎలా గుర్తించాలి? – చంద్రయ్య, లింగంపల్లి, పెద్దశంకరంపేట డీఏఓ: ప్రభుత్వ లైసెన్స్ పొందిన ఫర్టిలైజర్ షాపుల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలి. గ్రామాల్లోకి వచ్చి తెల్లటి బస్తాల్లో విక్రయిస్తుంటారు. వాటిని కొనుగోలు చేయొద్దు. అనుమానం కలిగితే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. మాకు చదువురాదు. యాప్లో యూరియా బుక్ చేసుకోవడం కష్టంగా ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పండి. – చెన్నయ్య, బొడ్మట్పల్లి, టేక్మాల్ డీఏఓ: ఫర్టిలైజర్ డీలర్ల వద్ద వలంటీర్లు, రైతు వేదికల వద్ద అధికారులు ఉంటారు. వారి సాయం తీసుకోవచ్చు. కొన్ని రోజులు ఇబ్బందులు ఏర్పడుతాయి. మున్ముందు మీరే చేసుకుంటారు. నానో యూరియా వాడాలని చెబుతున్నారు. వాటి గురించి అవగాహన లేక ఇబ్బంది పడుతున్నాం. – నరేందర్రెడ్డి, పాపన్నపేట డీఏఓ: ఎకరా వరికి ఒక యూరియా బస్తా బదులు 250 మిల్లిలీటర్ల నానో యూరియా సరిపోతుంది. దీని వాడకంపై ఇప్పటికే అన్ని గ్రా మాల్లో అవగాహన రైతులకు అవగాహన కల్పించాం. అవసరమైతే మరోసారి వివరిస్తాం. జీలుగ విత్తనాలు ఎప్పుడు వేసుకోవాలి? – జోడు రవీందర్, పెద్దశంకరంపేట డీఏఓ: వరి నాటు వేసుకునే 45 రోజుల ముందు జీలుగ విత్తనాలు వేసుకోవాలని. ఏపుగా పెరిగిన తర్వాత కలియ దున్నాలి. జిల్లాలో ఎల్నినో ప్రభావం ఉంటుందా? ఎలాంటి పంటలు వేసుకోవాలి? – భిక్షపతి, చిట్టోజిపల్లి, చేగుంట డీఏఓ: జిల్లాలో ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం వరి వేయకుండా ఆరుతడి పంటలు వేసుకుంటే నష్టం ఉండదు. పీఏసీఎస్లో అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. – రాజు, ఎదుల్లాపూర్, శివ్వంపేట డీఏఓ: అధిక ధరలకు ఎరువులు ఎవరు విక్రయిస్తే సహించేది లేదు. బ్యాగులపై ఉన్న ధరలు పరిశీలించండి. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటల గురించి తెలపండి. – ప్రభుదాస్, దేవులపల్లి, కౌడిపల్లి డీఏఓ: రెగ్యులర్గా వరి వేయడంతో భూసారంతో పాటు పంట దిగుబడి తగ్గుతుంది. కాబట్టి మొక్కజొన్న, పత్తి, జొన్న, కందులు, పెసర్లు వంటివి సాగు చేసుకోవచ్చు. మొక్కజొన్నకు అధికంగా కత్తెర పురుగు ఆశిస్తుంది. ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి. – ధరప్ప, అచ్చన్నపల్లి, టేక్మాల్ డీఏఓ: స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించండి. ఆయన సూచనల మేరకు మందులు వాడితే సరిపోతుంది. యూరియా యాప్ ఓపెన్ కావడం లేదు, ఒకసారి అయితే, మరోసారి బుక్ కావడం లేదు. – యాదగిరి, శివ్వంపేట. డీఏఓ: ప్రస్తుతం యూరియా యాప్ ఓపెన్లో ఉంది. అయితే ఒకసారి బుక్ చేసిన తర్వాత తిరిగి 12 రోజులకు మాత్రమే బుక్ అవుతుంది. పీఏసీఎస్లో విత్తనాలు అందుబాటులో లేవు. వానాకాలం వరి విత్తనాలు నాటుకోవాలి. – నరేందర్రెడ్డి, ఉసిరికపల్లి, శివ్వంపేట డీఏఓ: జిల్లాలో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పీఏసీఎస్ కుడా వస్తాయి. ప్రస్తుతం కూనారం సన్నాలు 1638, 777, తెలంగాణ సోన, జైశ్రీరాం, బీపీటీ వంటి విత్తనాలు వేసుకోవచ్చు. ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాం జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ ‘సాక్షి’ ఫోన్ ఇన్కు అనుహ్య స్పందన -
మెరుగైన సేవలు అందించండి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ కలెక్టరేట్: పెండింగ్ కేసుల దర్యాప్తు ముమ్మరం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మెదక్ పట్టణ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించి, దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కేసుల విచారణలో నిర్లక్ష్యం లేకుండా సమయపాలనతో విధులు నిర్వర్తించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసి నేర నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలన్నారు. ఎస్పీ వెంట టౌన్ సీఐ మహేశ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్రెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
త్వరలోనే కొత్త పింఛన్లు
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ దుబ్బాక: త్వరలోనే అర్హులైన పేదలందరికీ కొత్త పింఛన్లు అందించనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. గురువారం భూంపల్లి– అక్బర్పేట మండలం నగరం రామలింగేశ్వర ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని 594 మంది లబ్ధిదారులకు రూ.5.94 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ హైమావతితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు. జిల్లాలో పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామని 10 వేల ఇళ్లు మంజూరు కాగా 80 శాతం గ్రౌండింగ్ అయ్యాయన్నారు. జిల్లాలో కొత్తగా 45 వేల రేషన్ కార్డులు అందించామన్నారు. స్కూల్ పిల్లలకు కొత్తగా బ్రేక్ఫాస్ట్ పథకంతో పాటు ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్నభోజనం అందించనున్నామన్నారు. రైతులు ఏమాత్రం అధైర్యపడవద్దని ధాన్యం చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. కోర్టు భవన నిర్మాణ స్థలం పరిశీలన దుబ్బాక పట్టణంలో కొత్తగా కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి వివేక్ పరిశీలించారు.ఈ సందర్భంగా పాత ఆస్పత్రి ఆవరణలోనే కోర్టు భవనం నిర్మించాలని కాంగ్రెస్ నాయకులు మంత్రికి విన్న వించారు. -
కోఆప్షన్ ఎన్నిక ఎప్పుడో?
నర్సాపూర్: మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ మరుగున పడింది. గడువు దాటినా పాలకమండలి ఆ ఊసే ఎత్తడం లేదు. నాలుగు కోఆప్షన్ పదవుల కోసం ఏప్రిల్లో మున్సిపల్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నిర్ణయించారు. దీంతో పట్టణానికి చెందిన ఆయా రాజకీయ పార్టీల నాయకులతో పాటు స్వచ్ఛందంగా కోఆప్షన్ పదవిని ఆశిస్తున్న వారు మొత్తం 36 మంది దరఖాస్తు చేశారు. అయినా ఇప్పటివరకు ఎన్నిక నిర్వహించలేదు. ఇదిలా ఉండగా చట్టం ప్రకారం దరఖాస్తు చేసే చివరి తేదీ నుంచి 15 రోజుల్లో పాలకమండలి కోఆప్షన్ సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుందని తెలిసింది. అయితే గడువు ముగిసి 45 రోజులు కావొస్తున్నా ఇంకా కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం పాలకమండలి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. నింబధనల మేరకు కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియను పాలకమండలి చేపట్టకపోయినా, జిల్లా అధికార యంత్రం ఎంపిక ప్రక్రియ చేపట్టే విధంగా చర్యలు తీసుకోకపోవడం విచారకరమని పలువురు అభ్యర్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసిన వారిలో నలుగురిని ఎంపిక చేయాలని కోరుతున్నారు. అయితే గత పాలకమండలి హయాంలో సైతం కోఆప్షన్ సభ్యులను ఎంపిక చేయకుండానే ఐదేళ్ల పరిపాలన కాలం ముగిసిపోయింది. అప్పట్లో కోఆప్షన్ పదవిని ఆశించిన పలువురు నాయకుల ఆశలు ఆవిరయ్యాయి. ఈసారైనా సకాలంలో నిర్ణయం తీసుకొని కోఆప్షన్ ఎన్నిక నిర్వహించాలని ఆశావహులు కోరుతున్నారు. ఇదే విషయమై మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి వివరణ కోరగా, పలు కారణాలతో కోఆప్షన్ సభ్యుల ఎంపిక చేయలేకపోయామని తెలిపారు. వీలైనంత త్వరలోనే పాలకమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసి 45 రోజులు పట్టించుకోని పాలకమండలి -
సేంద్రియ సాగుకు ప్రాధాన్యమివ్వాలి
కలెక్టర్ ప్రతిమాసింగ్శివ్వంపేట(నర్సాపూర్): సేంద్రియ సాగుకు రైతులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం మండలంలోని ఉసిరికపల్లిలో సేంద్రియ సాగు చేస్తున్న రైతు బాలేశ్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. రైతు తయారు చేస్తున్న జీవామృతం, ఘన జీవామృతం, వర్మీ కంపోస్ట్, సేంద్రియ కషాయాలు తదితర సహజ ఎరువుల తయారీ విధానాలను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలన్నారు. నేల సారవంతం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందన్నా రు. వ్యవసాయ అధికారులు రైతులకు సాంకేతిక సూచనలు అందిస్తూ సేంద్రియ సాగును విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదే శించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్, ఏఓ లావణ్య, సిబ్బంది ఉన్నారు. ఖిల్లాకు దేశస్థాయిలో గుర్తింపు తేవాలి మెదక్ కలెక్టరేట్: ఖిల్లాను దేశస్థాయిలో గుర్తింపు సాధించేలా పర్యాటకంగా అభివృద్ధి పర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. గురువారం ఖిల్లాను సందర్శించి చారిత్రక అంశాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ.. రాష్ట్ర టూరిజం సెక్రటరీ వాణిప్రసాద్ సహకారంతో మెదక్ ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచి రాష్ట్ర, దేశస్థాయిలో గుర్తింపు తీసుకొస్తామన్నారు. లేజర్ లైటింగ్ ఏర్పాటు చేసి, భవిష్యత్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనువైన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్చైర్మన్ నరేష్గౌడ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేసుల దర్యాప్తులో వేగం పెంచండి: ఎస్పీ
మెదక్జోన్: పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నెలవారీ క్రైం రివ్యూ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు. జిల్లావ్యాప్తంగా నమోదైన నేరాలు, వాటి దర్యాప్తు పురోగతి, మిస్సింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, గ్రేవ్, నాన్గ్రేవ్ కేసులు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ చర్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. సమావేశంలో డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్గౌడ్, సుభాశ్ చంద్రబోస్, సీఐలు రాజశేఖర్రెడ్డి, రేణుకారెడ్డి, సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేగుంట(తూప్రాన్): సర్వ శిక్షా అభియాన్లో పనిచేస్తున్న సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చేగుంటలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించిందన్నారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు సైతం అందించాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్దూ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొల్చారం(నర్సాపూర్): మండలంలోని పైతర, రంగంపేట, చిన్నఘనాపూర్, అంసాన్పల్లి విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్టు విద్యుత్శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, వేలాడుతున్న తీగలను సరిచేసేందుకు కరెంట్ నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు. డిగ్రీలో ప్రవేశం కోసం దరఖాస్తుల ఆహ్వానం హుస్నాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి తెలిపారు. దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. జూన్ 15వ తేదీ లోగా వివిధ డిగ్రీ కోర్సులలో ప్రవేశం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. -
ఎరువు దోపిడీ
ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు● ఒక్కో బస్తాపై రూ.200 వరకు అదనంగా వసూలు ● పాత స్టాక్ను పెరిగిన ధరలతో విక్రయాలు ● ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే షురూ ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే అన్నదాతలను దోపిడీ చేయడం షురూవైంది. కొందరు వ్యాపారులు, డీలర్లు ఎరువులను ఎమ్మార్పీ (గరిష్ట చిల్లర ధర) కంటే ఎక్కువ ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో బస్తాపై ఎమ్మార్పీ కంటే సుమారు రూ. 200 వరకు అధికంగా వసూలు చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ప్రధానంగా పత్తి సాగు చేసే రైతులు విత్తనాలతో పాటు పంటకు బలాన్ని ఇచ్చే 20:20 ఎరువును కూడా వేస్తుంటారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని 20: 20 ఎరువుల బస్తాను డీలర్లు కొందరు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ ఎరువును 1,500 బస్తా చొప్పున అమ్మాలి. కానీ ఒక్కో బస్తాపై రూ.1700 వరకు విక్రయిస్తున్నారు. ఎవరైనా రైతులు ఇదేమని ప్రశ్నిస్తే అసలు స్టాక్ లేదంటూ బుకాయిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక డీలర్లు చెప్పిన ధరకే ఎరువును కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. స్టాక్ లేదంటూ.. దాటవేత ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న డీలర్లు రైతులకు బిల్లులు ఇవ్వడం లేదు. ఎవరైన రైతులు ఎరువులకు సంబంధించిన బిల్లులు అడిగితే అసలు స్టాకే లేదంటూ బుకాయిస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక బిల్లులు లేకుండా డీలర్లు చెప్పిన ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ధరలు పెరుగుతున్నాయంటూ.. కొందరు వ్యాపారులు వారం రోజుల్లో ఎరువుల ధరలు పెరుగుతాయంటూ కూడా రైతులను మభ్య పెడుతున్నారు. అయితే కొన్ని ఎరువుల ధరలు పెరిగాయి. నిబంధనల ప్రకారం పాత స్టాక్ను బస్తాపై ఉన్న ఎమ్మార్పీ రేటుకే విక్రయించాలి. అంతకంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వీలు లేదు. అయితే చాలా మంది డీలర్ల వద్ద పాత స్టాక్ ఉంది. ఈ స్టాక్ మొత్తాన్ని పాత ధరలకే విక్రయించాలి. కానీ ఈ పాత స్టాక్ను కొందరు డీలర్లు పెరిగిన కొత్త స్టాక్ ధరలకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయించే డీలర్లు, వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. కొన్ని చోట్ల వ్యాపారులు పాత స్టాక్ను కొత్త ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలి. – టి.పృథ్విరాజ్, రైతు సంఘం నాయకుడు -
కొనుగోళ్లు
తుది దశకు● 332 కేంద్రాలు మూసివేత ● రైతులకు రూ.725 కోట్ల చెల్లింపులు ● నాలుగు రోజుల్లో పూర్తి కానున్న ప్రక్రియఇప్పటివరకు 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణజిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు 3.89 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించగా, మరో 15 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉంది. 533 కొనుగోలు కేంద్రాలకు గానూ, 332 సెంటర్లను మూసివేశారు. మరో నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా యాసంగిలో 2.75 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో 40 వేల ఎకరాల్లో సన్నాలు సాగు చేయగా, మిగితా 2.35 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు పండించారు. 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేసిన అధికారులు, 533 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ రెండో వారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. 100 కేంద్రాల ద్వారా సన్న ధాన్యం, మరో 433 సెంటర్ల నుంచి డొడ్డు రకం వడ్లు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు 86,672 మంది రైతుల నుంచి 3,89,364 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మరో 15 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, జిల్లాలో ఇప్పటివరకు 332 కేంద్రాల్లో కాంటాలు పూర్తి కాగా వాటిని మూసి వేశారు. మరో 201 సెంటర్లలో కొనుగోళ్లు సాగుతున్నాయి. అవి కూడా నాలుగైదు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు రూ.925 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.725 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ లెక్కన ఇంకా రూ. 200 కోట్లు చెల్లించాల్సి ఉంది. యాసంగి సీజన్లో 3.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తామని అధికారులు ముందుగా ప్రకటించారు. కానీ వారి అంచనా తారుమారై 4 లక్షల మెట్రిక్ టన్నులు దాటే అవకాశం ఉంది. సన్నాలకు నో బోనస్ జిల్లాలో ఈసారి 38 వేల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం రైతులు పండించారు. మద్దతు ధర రూ. 2,389 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం సన్నాలకు సంబంధించి క్వింటాల్కు రూ. 500 బోనస్ ఊసే ఎత్తడం లేదు. అంతేకాకుండా 2024 యాసంగిలో 62,742 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యానికి సంబంధించి సైతం బోనస్ డబ్బులు ఇప్పటివరకు రైతులకు చెల్లించలేదు. వానాకాలానికి సంబంధించి మాత్రమే సన్నాలకు బోనస్ చెల్లించి యాసంగిలో చెల్లించటం లేదని రైతులు వాపోతున్నారు. -
మల్లన్నా.. పాలన ఏదీ?
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో పరిపాలన గందరగోళంగా మారుతోంది. ఆలయ అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవాల్సిన కార్యనిర్వహణాధికారులు (ఈఓ) తరచూ మారుతుండటం, పైగా ఇన్చార్జులుగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణం. ఏడాదిన్నరలోనే నలుగురు ఈఓలు మారడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు ఆలయ పరిపాలనపై దేవాదాయ శాఖ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. –సాక్షి, సిద్దిపేట కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారి లేకపోవడంతో పర్యవేక్షణ కరువవుతోంది. 1967 నుంచి ఇప్పటి వరకు 70 ఈఓలు కొనసాగగా అందులో 25 మంది ఇన్చార్జులుగా వ్యవహరించారు. ఇన్చార్జి కావడంతో వారంలో కేవలం రెండు నుంచి మూడు రోజులు మాత్రమే సమయం కేటాయిస్తున్నారు. దీంతో దేవాలయంలో జరిగే అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. అలాగే దేవాలయ బ్రహ్మోత్సవాలలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. దర్శనం పాస్లు సైతం విక్రయిస్తుండటం గమనార్హం. పదవీ విరమణలు ఇక్కడే.. కొమురవెల్లిలో ఇన్చార్జి ఈఓగా విధులు నిర్వర్తించిన బాలాజీ డిసెంబర్ 31, 2024న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత అన్నపూర్ణ ఇన్చార్జి ఈఓగా పని చేస్తూ ఆగస్టు 31, 2025న పదవీ విరమణ పొందారు. వెంకటేశ్ సైతం ఫిబ్రవరి 28, 2026న పదవీ విరమణ ఇక్కడే చేశారు. ఇలా పదవీ విరమణ పొందే వారిని ఈఓలుగా, ఇన్చార్జి ఈఓలుగా నియమిస్తున్నారు. ఏడాదిన్నరలోనే నలుగురు ఈఓలు మారగా ఐదో ఈఓ సైతం ఇన్చార్జినే నియమించారు. ప్రస్తుతం పని చేస్తున్న సుధాకర్రెడ్డి రెగ్యులర్ ఈఓ కీసర గుట్టలో పని చేస్తూ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఈఓగా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇలా ఇన్చార్జిలు రెండు నుంచి నాలుగు నెలల పాటు చేయడంతో పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దృష్టిసారించని ఇన్చార్జులు అభివృద్ధి పనులపై కొరవడిన పర్యవేక్షణ కనీస సౌకర్యాలు సైతం కరువు వేలాది మంది భక్తులకు తప్పని తిప్పలుపూర్తి స్థాయి ఈఓలు లేకపోవడంతో అభివృద్ధి పనులపై దృష్టి సారించడం లేదు. ఎనిమిదేళ్ల క్రితం బండ్ల గుట్టపై 50 గదుల నిర్మాణం చేపట్టారు. అది ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. దేవాదాయ శాఖ అధికారులు సైతం ఎవరూ పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా పూర్తి స్థాయిలో అధికారి ఉండి పర్యవేక్షిస్తే ఎప్పుడో పూర్తి అయ్యేదని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. గదుల కొరతతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దేవాలయానికి సమీపంలో దాసరి గుట్టపైన కాటేజీల నిర్మాణం కోసం రూ.6కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఆ పనులు సైతం అర్ధంతరంగా నిలిచిపోయాయి. క్యూ కాంప్లెక్స్ పనులు సైతం పూర్తి కాలేదు. అదే విధంగా ఆలయంలో పనిచేసే ఉద్యోగులపై సరైన మానిటరింగ్ లేకపోవడంతో సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉన్నత అధికారులు స్పందించి పూర్తి స్థాయి ఈఓను నియమించి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు. -
చకచకా.. యంగ్ ఇండియా
● కొనసాగుతున్న స్కూల్ నిర్మాణ పనులు ● అంతర్జాతీయ హంగులతో గదులు రామాయంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కూల్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో జిల్లాలోని రామాయంపేటలో 25 ఎకరాలు.. రూ.200 కోట్లకు పైగా భారీ నిధులు వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గడువులోగా నిర్మాణం పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ పనులు స్పీడప్ చేశారు. గుట్టలను తొలచి.. చదును చేసి జాతీయ రహదారిని అనుకొని ఉన్న స్థలంలో చదును కోసం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేశారు. గుట్టలను తొలచి.. బండరాళ్లను తొలగించి నిర్మాణ పనులు ప్రారంభించారు. స్థలం చదును కోసమే సుమారు నెలరోజులు శ్రమించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పాఠశాలలో నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు అన్నివర్గాలకు చెందిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించనున్నారు. మొత్తం 25 వందలకు పైగా విద్యార్థులను ఈ స్కూల్లో చేర్చుకుంటారు. వీరికి విద్యాబుద్ధులతో పాటు ఆటలు, కంప్యూటర్ శిక్షణ కోసం మొత్తం 180 మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని నియమిస్తారని తెలిసింది. స్కూల్ తరగతులతో పాటు హాస్టళ్లు, కంప్యూటర్ల గదులు, ఆడిటోరియం, అవుట్డోర్, ఇండోర్ గేమ్స్, క్రీడా మైదానాలు, గ్రంథాలయాలకు సంబంధించి వేర్వేరుగా భవనాలు నిర్మించనున్నారు. డిజిటల్ తరగతులు అన్ని తరగతి గదుల్లో విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధన అందించనున్నారు. ఈ మేరకు తరగతి గదుల్లో డిజిటల్ స్మార్ట్ బోర్డులు, అధునాతన సైన్స్ ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్లు, డిజటల్ లైబర్రీని నెలకొల్పుతారు. అలాగే అల్ట్రా మోడ్రన్ డార్మెటరీలు నిర్మిస్తున్నారు. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కోసం ప్రత్యేకంగా జీ ప్లస్ వన్ పద్ధతిలో భవనాలు నిర్మిస్తున్నారు.జిల్లాలోని రామాయంపేటకు మొదటి విడతలోనే ఇంట్రిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించాను. ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులు సైతం కేటాయించింది. గడువులోగా పాఠశాల నిర్మాణం పూర్తి చేయించేలా కృషి చేస్తా. – మైనంపల్లి రోహిత్, మెదక్ ఎమ్మెల్యే -
ఒకటినే వేతనం!
● మల్టీపర్పస్ వర్కర్లకు మంచి రోజులు ● సీఎం ప్రకటనపై కార్మికుల హర్షం ● జిల్లావ్యాప్తంగా 1,692 మందికి మేలు మెదక్జోన్: మల్టీపర్పస్ వర్కర్లకు మంచి రోజులొచ్చాయి. వారికి ప్రభుత్వ ఉద్యోగుల మా దిరిగానే ప్రతీ నెల 1వ తేదీనే వేతనం చేతికందనుంది. ఇదే విషయం సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు నెలలకోసారి జీతా లు రావడంతో కుటుంబాలు గడవక పడరాని పాట్లు పడ్డారు. జిల్లావ్యాప్తంగా 492 పంచాయతీలు ఉండగా, 1,692 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. ప్రతి 500 మంది జనాభాకు ఒకరు చొప్పున గత ప్రభుత్వం వీరిని నియమించింది. ప్రస్తుతం ఒక్కో కార్మికుడికి ప్రతి నెలా రూ. 9,500 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. కాగా, వీరు చెత్తను సేకరించటం, మురికి కాలువలను శుభ్రం చేయటం, తాగునీటి మోటార్లు నడిపించి నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయటం, గ్రామాల్లోని పాఠశాలలతో పాటు రోడ్లను శుభ్రం చేయటం, రోడ్ల వెంట నాటిన మొక్కలు ఎండిపోకుండా నీరు పట్టడం.. నిత్యం వీరు నిర్వహించే విధులు. గడియ తీరిక లేకుండా పనులు చేస్తున్నా వీరికి నెలకు రూ.9,500 వేతనం చెల్లిస్తున్నారు. అంటే రోజుకు రూ.316 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా రెండు, మూడు నెలలకోసారి అందజేస్తున్నారు. దీంతో పండుగలు, ఇతర శుభకార్యాలకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కార్మికులకు ప్రతీనెల వేతనాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించటంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ నిధుల నుంచే చెల్లింపు కార్మికులకు ప్రతీ నెల ఒకటిన వారి అకౌంట్లలో వేతనాలు జమ చేయాలని ప్రభుత్వం నుంచి గతంలో ఆదేశాలు రావడంతో అధికారులు మల్టీపర్పస్ వర్కర్ల బ్యాంకు ఖాతాలను తీసుకొని ఆన్లైన్ చేశారు. అయితే వివిధ కారణాలు చూపుతూ ఆర్థికశాఖ కార్మికుల అకౌంట్లలో జీతం వేయటం కుదరదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతో పంచాయతీ నిధుల్లో జమ అయిన డబ్బులను డ్రా చేసి కార్మికులకు ఇచ్చే బాధ్యత కార్యదర్శులకు అప్పగించినట్లు సమాచారం. కాగా, మే నెలకు సంబంధించి విధులు నిర్వర్తించిన కార్మికుల వివరాలను పంచాయతీరాజ్శాఖకు ఆర్థికశాఖ అధికారులు పంపించారు. దీంతో ఈనెల నుంచే కార్మికులకు ప్రతీ నెల వేతనాలు రానున్నాయి. వచ్చే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతీ నెల 1వ తేదీన వేతనాలు చెల్లిస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
దేశ్పాండే మృతితో విషాదం
చిన్నశంకరంపేట(మెదక్): తెలంగాణ ఉద్యమకారుడు మురళీధర్ దేశ్పాండే బుధవారం బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. దీంతో నార్సింగి మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పట్లో రామాయంపేట నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన ఆయన సంజయ్ విచార్ మంచ్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఓటమితో నార్సింగి నుంచి తన నివాసం హైదారాబాద్కు మార్చారు. మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ముక్తి మోర్చాను ఏర్పాటు చేసి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ ఆవిర్భావంతో తన పార్టీని అందులో విలీనం చేసి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తర్వాత కేసీఆర్తో విభేదించి బయటకు వచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతం పోరాటం చేస్తూ ముందుకు సాగారు. ఆయన అంత్యక్రియలు హైద రాబాద్లో గురువారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
మహిళా పథం
ప్రగతిరథం..● రూ.21.96కోట్లతో 61 బస్సులు ● ఉమ్మడి మెదక్ జిల్లాలో మహిళా సమాఖ్యలకు అందజేత సాక్షి, సిద్దిపేట: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా శక్తి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మహిళా సమాఖ్యలకు హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి రూ.21.96కోట్లతో 61 బస్సులు అందజేశారు. మెదక్కు 20, సిద్దిపేటకు 23, సంగారెడ్డికి 25 బస్సులున్నాయి. ఒక్కో బస్సు రూ. 36లక్షల వ్యయంతో కొనుగోలు చేశారు. ఇందులో ప్రభుత్వం కార్పస్ఫండ్ కింద రూ.30లక్షలు మంజూరు చేయగా మిగిలిన రూ.6లక్షలు మండల సమాఖ్య నుంచి చెల్లించారు. 61 బస్సుల కోసం సమాఖ్య వాటాగా రూ.3.66కోట్లు చెల్లించగా, కార్పస్ ఫండ్ కింద ప్రభుత్వం రూ.18.30కోట్లు అందజేసింది. మండల సమాఖ్యల నుంచి వచ్చే బస్సుల్లో సింహభాగం పల్లె వెలుగులు, కొన్ని ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. వ్యాపార రంగాల్లోనూ.. పొదుపు నుంచి మహిళలు వ్యాపార రంగాల్లో సైతం రాణిస్తున్నారు. చిన్నతరహా పరిశ్రమల స్థాపనతో ఉపాధి పొందుతున్నారు. అతివలకు రెట్టింపు ఆదా యం పెంచేందుకు మహిళా శక్తి క్యాంటీన్, పెరటికోళ్ల పెంపకం, పాడి గేదెలు ఇలా వివిధ రంగాల్లో పురోగతిచెందుతున్నారు. వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. నెలకు రూ.69వేల బస్సు అద్దెను ఆర్టీసీ యాజమాన్యం చెల్లించనుంది. దీంతో మహిళా సమాఖ్యకు మరింత ఆదాయం పెరగనుంది. నూతనంగా ఏర్పాటైన మండలాల్లో సైతం మండల సమాఖ్యలు ఏర్పాటు చేయాలని, వాటికి బస్సులు అందజేయాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు. -
రహదారి భద్రత అందరి బాధ్యత
అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ వెల్దుర్తి(తూప్రాన్): రహదారి భద్రత అందరి బాధ్యతని అదనపు డీజీపీ సంజయ్కుమార్ జైన్ అన్నారు. మాసాయిపేట మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో దేశ రక్షణలో కంటే రోడ్డు ప్రమాదాల బారినపడి మృత్యువాత పడిన వారే ఎక్కువగా ఉంటున్నారని వాపోయారు. రహదారుల భద్రత ప్రతి పౌరుడి బాధ్యతన్నారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. పచ్చదనం, పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. తడి, పొడి చెత్త నిర్వహణ పక్కాగా జరగాలని సూచించారు. ఈసందర్భంగా పంచాయతీ కార్యాలయం నుంచి ఉన్నత పాఠశాల ఆవరణ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులు హెల్మెట్తో పాటు సీటుబెల్ట్ తప్పకుండా ధరించాలని పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇందుకు సంబంధించిన తీర్మాన ప్రతిని పాలకవర్గ సభ్యులు అధికారులకు అందజేశారు. అలాగే మండల కేంద్రంలో పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, సర్పంచ్ కిష్టారెడ్డి, డీపీఓ యాదయ్య, జిల్లా రవా ణ అధికారి శ్రీకాంత్ చక్రవర్తి, తూప్రాన్ ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, రామాయంపేట సర్కిల్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
చెత్త రహిత పట్టణంగా ‘పేట’
రామాయంపేట(మెదక్): ప్రజల సహకారంతో రామాయంపేటను చెత్త రహిత పట్టణంగా రూపు దిద్దుతామని మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటి, ఆరు, ఏడో వార్డులో నిర్వహించిన వార్డు సభల్లో పాల్గొని ఆమె పాల్గొని మాట్లాడారు. పట్టణవాసులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేయాలని సూచించారు. తాగు నీటి సరఫరా, వీధి లైట్లు ప్లాస్టిక్ నివారణ, తడి, పొడి చెత్తను వేరు చేసే విషయమై కమిషనర్ రవీందర్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, సందీప్, రవి, శంకర్గౌడ్, రంజిత్, శ్యామల, కోఆప్షన్ సభ్యు లు యాదగిరి, గౌస్ పాషా, మున్సిపల్ మేనేజర్ రఘువరన్ తదితరులు పాల్గొన్నారు. తూప్రాన్: ఆర్డీఓగా బవయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు విధులు నిర్వర్తించిన ఆర్డీఓ జయచంద్రారెడ్డిని ప్రభుత్వం పదోన్నతిపై ఎన్నికల సంఘంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసందర్భంగా బవయ్య మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. -
నత్తే నయం
జోరు తగ్గిన సింగూరు రివీట్మెంట్ మరమ్మతులుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగు నీరు అందించే సింగూరు ప్రాజెక్టు ఆనకట్ట రివీట్మెంట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు ప్రారంభించి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా వేగం పుంజుకోవడం లేదు. ఒకవైపు వర్షాకాలం ప్రారంభమైనా పనుల్లో పురోగతి కనిపించకపోవడం లేదు. వర్షాలు ఊపందుకుని ప్రాజెక్టు నిండితే పనులు చేయడానికి అసలే వీలు పడదు. ఈ ఆరు నెలల్లో కనీసం పది శాతం పనులైనా పూర్తికాకపోవడంతో ఈ ప్రాజెక్టు మరమ్మతు పనులు ఎలా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు రివీట్మెంట్ పూర్తిగా దెబ్బతిన్నదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిన విషయం విదితమే. దీన్ని వెంటనే మరమ్మతు చేయకపోతే ప్రాజెక్టు తెగిపోయి ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని ఈ అథారిటీ హెచ్చరించింది. ఈ హెచ్చరికల మేరకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రివీట్మెంట్ పనులను దాదాపు ఆరు నెలల క్రితం ప్రారంభించింది. ఆనకట్టకు చివరివైపు నుంచి రివీట్మెంట్ పనులు ప్రారంభించారు. ఈ పనులు ఆశించిన మేరకు వేగంగా సాగకపోవడం విమర్శలకు దారితీస్తోంది. బిల్లులు రావడం లేదని.. పనులు వేగం పుంజుకోకపోవడానికి బిల్లులు చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేసిన పనులకు ఆ మేరకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టరు పనుల వేగాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చే ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నుంచి వెంటవెంటనే బిల్లులు మంజూరైతే వీలైనంత త్వరగా ఈ పనులు చేసేందుకు వీలుంటుంది. కానీ, ఇలాంటి అత్యవసర పనులకు కూడా బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతుండటంతో కాంట్రాక్టరు పనులు పూర్తి చేయడంలో ఉత్సాహం చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.16.5 కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన పనులు సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనుల్లో జాప్యం ముంచుకొచ్చిన వానాకాలంరూ.ఐదు కోట్లలోపే పనులు రివీట్మెంట్ పనులకు సుమారు రూ.16.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. అయితే ఇప్పటివరకు సుమారు రూ.5 కోట్ల మేరకు కూడా పనులు పూర్తికాలేదని సమాచారం. ఇంకా సుమారు రూ.11.5 కోట్ల మేరకు పనులు జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు వర్షాలు ప్రారంభం కావడంతో ఈ పనులకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ పనులు చివరి దశకు చేరుకుని ఉంటే వర్షాలు ఊపందుకుని ప్రాజెక్టు నింపేందుకు వీలు కలిగేఅవకాశముండేది. కానీ, ఆశించిన మేరకు పనులు జరగకపోవడంతో ఈ వర్షాకాలంలో ప్రాజెక్టును నింపడం ప్రశ్నార్థకంగా తయారైంది. -
మోదీ 12 ఏళ్ల పాలనకు పూజలు
సారూ.. ఈ బాలలు మరి నర్సాపూర్: ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరాయంగా 12 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని హనుమాన్ ఆలయంలో బుధవారం పూజలు నిర్వహించారు. ప్రధాని పేరుపై అర్చన చేయించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధి, పారదర్శక పాలన, దేశ భద్రత, పేదల సంక్షేమం కోసం మోదీ చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడ్డా యని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అల్లాదుర్గం(మెదక్): బడీడు పిల్లలు చాలా మంది బడి బయటే ఉంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు విద్యా శాఖ చేపట్టిన ‘బడిబాట’ మొక్కుబడిగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి, విద్యార్థుల తల్లిదండ్రులతో మా ట్లాడి పిల్లలు బడిలో చేరేలా చూడాలి. అయితే చాలా చోట్ల ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించినట్లు ఫొటో దిగి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. బుధవారం బడిబాటకు ఉపాధ్యాయులు వచ్చిన సమయంలోనే రోడ్లపై విద్యార్థులు ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటూ కనిపించారు. టీచర్లకు వీరు కనిపించక పోవడం గమనార్హం. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
చేగుంట(తూప్రాన్): రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర రైతు సంఘం కోషాధికారి మూడ్ శోభన్ అన్నారు. మంగళవారం తెలంగాణ రైతు సంఘం మూడో మహాసభను వడియారంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ఇంకా పూర్తి కాలేదన్నారు. రైతు భరోసా నిధులను పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందించడం లేదని ఆరోపించారు. నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడంలోనూ విఫలమైందన్నారు. రైతులను పట్టించుకోకుంటే గత బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ను ఇంటికి పంపడం ఖాయమన్నారు. అలాగే పెంచిన ఎరువుల ధరలను కేంద్రం తగ్గించా లని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మీనర్సయ్య, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, ఉపసర్పంచ్ రఫీ, నాయకులు భాస్క ర్, దివాకర్, సాయి, లచ్చాగౌడ్, రైతులు పాల్గొన్నారు. -
అడ్డంగా నరికేస్తున్నారు!
జిల్లాలో జోరుగా కలప అక్రమ దందా● యథేచ్ఛగా రవాణా ● ‘వాల్టా’కు తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు జిల్లాలో కలప అక్రమ దందా జోరుగా సాగుతోంది. అక్రమార్కులు అమాయక రైతులను మభ్యపెడుతూ వారి పంట చేలల్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లను నరికివేస్తూ లారీల్లో తరలిస్తున్నారు. ‘వాల్టా’ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న వారిపై అటవీశాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వారం రోజులుగా హవేళిఘణాపూర్, నిజాంపేట మండలాల్లో ఇష్టారాజ్యంగా చెట్లను నరికివేస్తూ సా మిల్లులు, ఇతర ఫ్యాక్టరీలకు కలపను అక్రమంగా తరలిస్తున్నారు. జిల్లాలోని రామాయంపేట అటవీ రేంజ్ పరిధిలో ఇటీవల నాలుగైదు వాల్టా కేసులు సైతం నమోదయ్యాయి. కాగా, మెదక్ పరిసర ప్రాంతాల నుంచి ఆదివారం, ఇతర సెలవు దినాల్లో లారీల్లో రామాయంపేట మీదుగా అక్రమ కలప రవాణా సాగుతోంది. ఇదేంటని పలువురు అడిగితే సుబాబుల్, యూకలిప్టస్ కలప రవాణాకు ఎలాంటి అనుమతులు అక్కర లేదని, కేవలం సంబంధిత భూ యజమాని అంగీకారపత్రం ఉంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అనుమతులు శూన్యం గ్రామాల్లో రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో తమ పంట చేలల్లోని చెట్లను తొలగించడం కో సం కలప వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు సంబంధిత అధికారుల పేరు చెబుతూ ముందస్తు అనుమతులు తీసుకోవాలని, దీనికి వారికి కొంత డబ్బు ఇవ్వాలని రైతులను మభ్యపెడుతున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేస్తున్నారు. ఉదయం సమయంలో చెట్లను నరికి కలపను ఒక చోట చేర్చుతున్నారు. సెలవు దినాల్లో రాత్రి సమయంలో లారీల్లో తరలిస్తున్నారు. జిల్లా పరిధిలో నిత్యం ఎక్కడో ఒక చోట చెట్లను నరుకుతూ లారీల్లో తరలిస్తున్నారు. అటవీశాతం పెంచాలని ప్రభుత్వం కృషి చేస్తుంటే.. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు అక్రమార్కులు ఉన్న చెట్లను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. వాల్టాకు తూట్లు పొడిచి కలప అక్రమ రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. – రామాయంపేట(మెదక్)ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఎవరైనా చెట్లను నరికివేసి అక్రమ కలప రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని కేసులు సైతం నమోదయ్యాయి. అక్రమ కలప రవాణాను అడ్డుకోవడానికి తమ సిబ్బంది రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. – జోజి, జిల్లా అటవీ అధికారి -
సత్వర న్యాయం అందించాలి
ఎస్పీ శ్రీనివాసరావు హవేళిఘణాపూర్(మెదక్): నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మెదక్రూరల్ పోలీస్స్టేషన్లో వార్షిక తనిఖీలో భాగంగా పలు రికార్డులు పరిశీలించారు. కేసుల గురించి ఆరా తీశారు. అలాగే స్టేషన్ డైరీలు, పెండింగ్ కేసుల పురోగతి, సిబ్బంది పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్లో రికార్డులు పెండింగ్లో ఉండకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. నిష్పక్షపాత విధుల ద్వారానే ప్రజల విశ్వాసాన్ని పొందవచ్చని అన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గాను ప్రతీ రోజు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు జార్జ్, సందీప్రెడ్డి, ఎస్ఐ లింగం, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
ధాన్యం సేకరణ వేగవంతం చేయండి
మెదక్జోన్: ఽదాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం పార్టీ నేతలతో కలిసి కలెక్టర్ ప్రతిమాసింగ్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నశంకరంపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగడం లేదని తెలిపారు. వర్షాకాలంలో సకాలంలో విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. సబ్స్టేషన్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి వ్యవసాయానికి సక్రమంగా కరెంట్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నకిలీ విత్తనాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట చిన్నశంకరంపేట పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, నాయకులు కిష్టయ్య, నారాయణ, ఆంజనేయులు, సాంబశివరావు ఉన్నారు. శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రంలో కొలువైన బగలాముఖీ శక్తి పీఠంలో మంగళవారం వేద పండితుడు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ప్రముఖ గాయని ఉషా దంపతులు బగలాముఖి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. శక్తిపీఠం విశిష్టత గురించి వెంకటేశ్వరశర్మ వివరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మెదక్ కలెక్టరేట్: జిల్లాలో 95 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 84,531 మంది రైతుల నుంచి 3,85,122 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. ధాన్యం విక్రయించిన 66,900 మంది రైతులకు సుమారు రూ.708 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అలాగే 311 కొనుగోలు కేంద్రాలు మూసివేసినట్లు చెప్పారు. రైతులు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తూప్రాన్: ఆర్డీఓ జయచంద్రారెడ్డికి పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి కల్పించింది. డిప్యూటీ కలెక్టర్ బావయ్యను తూప్రాన్ ఆర్డీఓగా నియమించారు. అలాగే ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దార్ గోవర్దన్ కార్మిక శాఖకు బదిలీ అయ్యారు. మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, హామీని విస్మరించి మోసం చేసిందని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన దివ్యాంగుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో 2 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించించి, ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. దీనికి నిరసనగా బుధవారం హైదరాబాద్లోని సెర్ప్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం సా యత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిపోయింది. పూర్తిస్ధాయిలో ధాన్యం తరలించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని తూకం వేసి వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. -
చెల్లించాల్సిన రాయల్టీ ఎంత?
ఏళ్ల తరబడి క్వారీల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పడింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ సర్వే) విధానంతో తవ్విన ఖనిజం, చెల్లించాల్సిన రాయల్టీని ఇట్టే బహిర్గతం చేస్తోంది. ఫలితంగా సర్కారుకు పైసా తగ్గకుండా ఆదాయం వసూలవుతోంది. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 41 క్వారీలు ఉండగా, వాటిలో స్టోన్, మెటల్, కంకర క్రషర్లు ఉన్నాయి. అందులో 28 క్రషర్లు కొనసాగుతుండగా, మిగితా 13 క్వారీలు వివిధ కారణాలతో మూతపడ్డాయి. కొన్ని పన్నులు చెల్లించక నిలిపి వేస్తే, మరికొన్ని క్వారీలు మెటల్ లేక నిలిపివేశారని మైనింగ్ అధికారులు చెబుతున్నారు. కాగా, ఏళ్ల తరబడి కొనసాగిన ఈ క్వారీల్లో ‘తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత’ అన్నట్లుగా వ్యవహారం నడిచింది. వారు ఎంత తవ్వినా ‘చూపిందే లెక్క.. కట్టిందే పైకం’. దీంతో ఇంతకాలం అడ్డూ అదుపూ లేకుండా తప్పుడు లెక్కలు చూపిన క్వారీ ల కాంట్రాక్టర్లు రూ. కోట్లు గడించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘ఈటీఎస్’ ద్వారా పైసా మిస్ కాకుండా ఇట్టే చెప్పేస్తోంది. రెండు నెలల్లో డబుల్ 2025 నుంచి జిల్లాలో నడుస్తున్న క్వారీల ద్వారా రూ. 5.87 కోట్ల డిమాండ్ ఉండగా, కేవలం రూ. 2.62 కోట్ల ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి వచ్చింది. ఈ లెక్కన రూ. 3.25 కోట్లు తక్కువగా వచ్చింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నుంచి సదరు కాంట్రాక్టర్లకు లీజుకు కేటాయించిన స్థలాలను డీజీపీఎస్ (డిజిటల్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్)తో ఈటీఎస్ ద్వారా సర్వే చేశారు. ఖనిజం విలువ ఎంత? అందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ (ఫీజు) ఎంత అనే వివరాలు ఇట్టే తెలిసిపోయింది. ఈనూతన విధానంతో ఏప్రిల్, మేలో రూ. 4.42 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఏడాదంతా రూ. 2.62 కోట్లు వస్తే, కేవలం రెండు నెలల్లో రెండింతల లాభం సర్కారుకు సమకూరింది. టెండర్లలోనూ పారదర్శకత గతంలో క్వారీని లీజుకు ఇవ్వాలంటే ముందుగా ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికే కేటాయించేవారు. అందులోనూ నేతలు సిఫారసు చేసిన వారికి పక్కాగా టెండర్ దక్కేది. ప్రస్తుత నూతన విధానంలో క్వారీల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటికి సంబంధించి ఓపెన్ టెండర్ నిర్వహించి ఎవరు ఎక్కువకు కోడ్ చేస్తే వారికే క్వారీని అప్పగించనున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి ఆశించిన మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ‘ఈటీఎస్’తో ఇట్టే బహిర్గతం క్వారీల్లో అక్రమాలకు చెక్ రెండు నెలల్లోనే ప్రభుత్వానికి రూ.4.42 కోట్ల ఆదాయం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈటీఎస్ విధానంతో అక్రమాలకు వందశాతం చెక్ పడింది. దీని ద్వారా సదరు కాంట్రాక్టర్లు ఎంత మేర తవ్వారు.. దానికి చెల్లించాల్సిన రాయల్టీ ఇట్టే తెలిసిపోతుంది. – నాగరాజు, ఏడీ మైనింగ్ మెదక్ -
ప్రభుత్వ బడుల్లోనే ఉజ్వల భవిష్యత్
కలెక్టర్ ప్రతిమాసింగ్మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ విద్యకు నిలయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన 91 పాఠశాలల హెచ్ఎంలతో పాటు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యారంగంలో జిల్లా ఉన్నత స్థానంలో ఉండాలని సూచించారు. సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే విద్య ద్వారానే సాధ్యం అన్నారు. విద్యార్థులు ట్రిపుల్ఐటీలే కాకుండా దేశంలోని ఎయిమ్స్ వంటి ఉత్తమమైన వైద్య కళాశాలలో ప్రవేశాలు పొందడానికి ప్రయత్నించాలన్నారు. అనంతరం జిల్లాలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన 91 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, 560కి పైగా మార్కులు పొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రంతో పాటు బహుమతులు అందజేసి సత్కరించారు. అంతకుముందు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫలితాల మెరుగు కోసం (2026– 27) జిల్లా వార్షిక ప్రణాళికా వర్క్షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ పలు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, ఏఎంఓ సుదర్శనమూర్తి, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి రాజు, నవీన్, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎమ్మార్పీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వాగ్వాదాలు.. నిలదీతలు..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును సమీక్షించేందుకు మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్ష వాగ్వాదాలు..నిలదీతల మధ్య సాగింది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాల అమలును వివరించగా..రైతుల సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. వి శ్వసనీయ సమాచారం ప్రకారం.. ధాన్యం సేకరణలో సర్కారు నిర్లక్ష్యం..జొన్నల కొనుగోళ్లలో రైతులు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, మాణిక్రావు, సునీతారెడ్డి ప్రస్తావించారు. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా కూడా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, దీంతో అన్నదాతలు పడరానిపా ట్లు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి వివేక్ స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీలు రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ తమాషాలు చేస్తోందని వివేక్ వ్యాఖ్యానించడం పట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. తక్షణం ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన వైఫల్యాలను మంత్రి వివేక్తోపాటు, ఎమ్మెల్యే సంజీవరెడ్డి గుర్తుచేశారు. ధాన్యం, జొన్నల కొనుగోళ్లలో వైఫల్యాలను ప్రస్తావించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్న మంత్రి వివేక్ ఎమ్మెల్యేల కోటా కోసం పట్టు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో ఎమ్మెల్యేల కోటా అంశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశంలో లేవనెత్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న మాదిరిగానే తమకు కూడా ఇళ్ల కోటాను కేటాయించాలని, తాము కూడా ప్రజల ఆశీర్వాదం ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాదిరిగానే ఈ ఇళ్లను తమకు కూడా కోటా నిర్ధారించాలని డిమాండ్ చేశారు. -
నాణ్యమైన సరుకులు అందించండి
మెదక్ కలెక్టరేట్: పాఠశాలలు, కళాశాలలకు నాణ్యమైన కూరగాయలు, ఇతర సరుకులు అందించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి నిర్వహణ టెండర్లు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెండర్లు పొందిన వారు నాణ్యమైన కూరగాయలు, చికెన్, మటన్, ఇతర సరుకులు అందించాలని సూచించారు. అలాగే శానిటేషన్ ప్రక్రియ సైతం సక్రమంగా నిర్వహించాలన్నారు. టెండర్లు పారదర్శకంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఆర్సీఓ వీరేశం, డీసీఓ హరిబాబు, ప్రిన్సిపాల్స్, కమిటీల సభ్యులు, టెండర్దారులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడిస్తారు..?
సూరారం గ్రామసభలో మహిళల నిలదీత చిన్నశంకరంపేట(మెదక్): అర్హులైనప్పటికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంలేదని, ఇదేమని అడిగితే తమకు ఓటు వేశారా అంటు కొందరు నాయకులు అంటున్నారని చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామసభలో మహిళలు భగ్గుమన్నారు. సోమవారం సూరారం సర్పంచ్ నాగరాజు అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన పలువురు మహిళలు తాము ఇళ్లులేక అద్దె ఇంట్లో ఉంటున్నామని కొందరు, శిథిలమైన పాత ఇళ్లలో బిక్కుబిక్కుమంటున్నా కనికరించడంలేదని మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన తమకెప్పుడు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చుతామని సర్దిచెప్పారు. ఎస్సీ కాలనిలో నీటి సమస్య ఉందని కొందరు సభ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎంపీఓ వినోద్, గ్రామ కార్యదర్శి నాంపల్లి, ఉపసర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నిజాంపేట(మెదక్): నిజాంపేట పరిధిలోని తిప్పన్నగుల్ల గ్రామంలో సోమవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు తడి, పొడి, హానికర, శానిటరీ చెత్తను వేర్వేరుగా ఎలా విభజించాలో అధికారులు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. వీటితో పాటు ఎస్ఐఆర్, వర్షాకాల సన్నద్ధత, ఉపాధి హామీ పథకం వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్ మంగలిపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు. 50 సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తాం టేక్మాల్(మెదక్): ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు దాదాయిపల్లి సర్పంచ్ నరసింహరావు దేశ్పాండే అన్నారు. సోమవారం మండలంలోని దాదాయపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో పలు అభివృద్ధి పనులపై తీర్మానాలు చేశారు. తాగునీటి వ్యవస్థ, మురుగు కాల్వల నిర్మాణం, పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటి పలు అంశాలపై సభలో చర్చించారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు దాదాయపల్లి, మల్కాపూర్ గ్రామాలకు కలిపి 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో టేక్మాల్ ఎస్సై అరవింద్ కుమార్, పంచాయతీ కార్యదర్శి పరమేశ్వరి, ఏపీఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత పాటించాలి రేగోడ్(మెదక్): ప్రతీఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సర్పంచ్ పర్వీన్ సుల్తాన ప్రజలను కోరారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దూరంగా ఉంటాయని సూచించారు. గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ పోచయ్య, ఉప సర్పంచ్ ధనలక్ష్మి, కో ఆప్షన్ మాజీ సభ్యుడు చోటుమియా, మాజీ ఎంపీటీసీ నరేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అరుణ్కుమార్ పాల్గొన్నారు. తడి, పొడి చెత్తపై అవగాహన చిలప్చెడ్(నర్సాపూర్): గ్రామాలలో వందశాతం పారిశుద్ధ్యం సాధించే విధంగా, గ్రామ ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించామని ఎంఈఓ మునీరుద్దీన్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని చండూర్ గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా సర్పంచ్ శేషాద్రి అధ్యక్షతన ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఏఈఓ వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో నాలుగు రకాల చెత్త బుట్టలను వినియోగించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుపతి, పంచాయతీ పాలకవర్గ సభ్యు లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తూప్రాన్లో... తూప్రాన్: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సి పల్ కౌన్సిలర్ జైపాల్ రాథోడ్ అన్నారు. వర్షాకాలం సీజన్లో వ్యాధుల పట్ల ప్రజలు ముందు జాగ్రత్త తీసుకోవాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికి అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ మహేష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ప్రత్యూష, వర్క్ ఇన్స్పెక్టర్ వేదాంత, అంగన్వాడీ టీచర్ పద్మ, తదితరులు పాల్గొన్నారు. -
జాతర ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
చేగుంట(తూప్రాన్): మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన జాతర ఉత్సవాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. చందాయిపేట గ్రామంలోని దుర్గమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. కర్నాల్పల్లి గ్రామంలో బీరప్ప విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని పూజలను నిర్వహించారు. గ్రామ దేవతల ఆశీర్వాదాలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమాల్లో సర్పంచ్ మహేశ్వరీ, ఉత్వకమిటీ సభ్యులు సాయిబాబా, నగేష్, యాదగిరి, అంజనేయులు, శోభన్, రమేశ్, బూదయ్య, మల్లయ్య పాల్గొన్నారు. వెంకటాపూర్లో బీరప్ప జాతర ఉత్సవాలు రామాయంపేట(మెదక్): మండలంలోని వెంకటాపూర్ (ఆర్)లో సోమవారం బీరప్ప జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాదవ సంఘం సభ్యులతోపాటు గ్రామ సర్పంచ్ ఉమ, ఉప సర్పంచ్ అనురాధ, వార్డు సభ్యులు నాగరాణి, రేవతి తదితరులు బోనాలు ఎత్తుకొని గ్రామం నుంచి ఆలయం వద్దకు వెళ్లారు. -
ప్రజల సహకారం అవసరం
రామాయంపేట(మెదక్): మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో పట్టణాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ జి.లావణ్య పేర్కొన్నారు. సోమవారం నాలుగు, ఎనిమిది, తొమ్మిదో వార్డులో నిర్వహించిన వార్డు సభల్లో పాల్గొన్న ఆమె మాట్లాడారు. అభివృద్ధి విషయమై ప్రజల సహకారం ఎంతైనా అవసరమన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేసి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని చైర్మన్ సూచించారు. బీఆర్ఎస్ నిరసన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకుడు అహ్మద్ చెవిలో పూవు పెట్టుకొని సమావేశంలో నిరసన తెలిపారు. గత ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను చాలా వరకు అమలు చేయలేదని, దీంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన విమర్శించారు. అహ్మద్ మాట్లాడుతున్న క్రమంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు అడ్డుతగిలారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం కొనసాగింది. వార్డుల్లో నెలకొన్న సమస్యల విషయమై స్థానికులు చైర్మన్, కమిషనర్కు వినతిపత్రాలు అందజేశారు. తహసీల్దార్ రజనీ, మున్సిపల్ కమిషనర్ రవీందర్, కౌన్సిలర్లు నాగరాజు, రంజిత్, రవి, శంకర్గౌడ్, పుట్టి సందీప్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ లావణ్య -
సమస్యల పరిష్కారానికే వార్డు సభలు
మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి నర్సాపూర్: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వార్డు సభలను నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి చెప్పారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సోమవారం పట్టణంలోని పలు వార్డు సభలు నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆయా వార్డు సభలలో మున్సిపల్ కమిషనర్ సాయికుమార్, వైస్ చైర్మన్ బుచ్చేష్యాదవ్, మేనేజర్ మధుసూదన్, కౌన్సిలర్లు రాజమణి, సమీనాబేగం, రాజు, సుధీర్గౌడ్, ప్యాక్స్ చైర్మన్ రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. కోతులు పట్టే పనులు ప్రారంభం పట్టణంలో కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టినట్టు చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చెష్యాదవ్లు చెప్పారు. సోమవారం కోతులు పట్టే పనులను వారు ప్రారంభించారు. -
జిల్లాలో మృగశిర సందడి
పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో మృగశిర కార్తె సందడి నెలకొంది. సోమవారం మండల కేంద్రంలోని చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా కొరమీను కిలో ధర రూ.650, ఇతర బొచ్చ, రౌట తదితర చేపలు రూ.200లకు విక్రయించారు. పండుగ సందర్భంగా గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్తెలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు దేవుడిని వేడుకున్నారు. చేపలకు డిమాండ్ చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో చేపలకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో నిత్యం రూ.100 పలికే తెల్లచేపలు రూ.200 వరకు పలికాయి, చెరువుల వద్ద రూ.150 వరకు ఇచ్చారు. ఇక కొర్రమీను చేపల కోసం డిమాండ్ ఉన్నప్పటికి స్థానికంగా కొర్రమీను చేపలు కన్పించలేదని స్థానికులు చెప్పారు. జోరుగా చేపల విక్రయాలు చిలప్చెడ్(నర్సాపూర్): మండల పరిధిలోని ఆయా గ్రామాలలో మృగశిర కార్తె పురస్కరించుకుని సోమ వారం జోరుగా చేపల విక్రయాలు కొనసాగాయి. మాములు రోజులలో రౌట, బంగారుతీగ, బొచ్చె, గ్యాస్కట్ లాంటి చేపలు కిలోకు రూ.120 నుండి 150 వరకు ఉండగా, మృగశిర రోజు మాత్రం రూ.180 నుంచి 250 వరకు, కొర్రమీను కిలోకు రూ. 300 నుండి 350 వరకు ఉండగా, రూ.500 వరకు ధరలు పెంచిన అమ్మకాలు బాగానే జరిగాయని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. పాపన్నపేటలో... పాపన్నపేట(మెదక్)/కౌడిపల్లి(నర్సాపూర్): మృగశిర కార్తెను పురస్కరించుకొని కొర్రమీను ధఽర కొండెక్కింది. మామూలు చేపల ధరలు సైతం అమాంతంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో రూ.350 పలికే కొర్ర మీను రూ.450 వరకు విక్రయించారు. అలాగే రొహుట, బొచ్చ, గ్యాస్కట్ తదితర తెల్ల రకం చేపలు రూ.125 నుంచి రూ.250 వరకు అమ్మారు. పాపన్నపేట, నార్సింగి, పొడిచన్పల్లి తదితర గ్రామాల్లో చేపల వ్యాపారం జోరుగా సాగింది. అలాగే.. కౌడిపల్లి మండలంలో కూడా కొర్ర మీనురూ 600 నుంచి రూ 800 కిలో కాగా, తెల్లచేపలు రౌట, బొచ్చ, బంగారుతీగ రూ 200 నుంచి రూ 300 కిలో విక్రయించారు. -
సర్కారు బడుల్లోనే చేర్పించండి
పీఎంశ్రీ పాఠశాల ఉపాధ్యాయుల బడిబాట వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రం వెల్దుర్తిలోని పలు కాలనీల్లో సోమవారం పీఎంశ్రీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్న 9 మంది విద్యార్థులను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న వసతులు, విద్యాబోధనపై రూపొందించిన కరపత్రాలను తల్లిదండ్రులకు అందజేసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోకే పంపాలని కోరారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన బోధన, విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సౌకర్యాలతో పాటు విద్యార్థుల ప్రతిభను వెలికితీసే అనేక కార్యక్రమాలు ప్రతియేటా చేపడుతున్నట్లు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు అర్చన, జయసుధ, శైలజ, రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న బడిబాట పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. సోమవారం స్థానిక పీఎంశ్రీ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆయా గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థులకు డిజిటల్ విద్య, ఉచిత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ఉపాధ్యాయులు సిద్దిరాములు, నాగవేణి తదితరులు సూచించారు. బడీడు పిల్లను బడిలో చేర్పించాలి చిన్నశంకరంపేట(మెదక్): బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని కోరుతూ ఇంటింటి తిరిగి ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తున్నట్లు చిన్నశంకరంపేట ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి అన్నారు. తమ పాఠశాలలో 200 మంది విద్యార్థులను చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పా రు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు స్కూల్ డ్రెస్తో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అందించనున్నట్లు వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి వృథా ఖర్చు చేయకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ‘ఉపాధి’పని ప్రదేశం వద్ద ప్రచారం అల్లాదుర్గం(మెదక్): ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన, సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, తమ పాఠశాలలో చేర్పిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని ఉపాధ్యాయులు బడిబాటలో అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం అల్లాదుర్గం బాలికల జెడ్పీ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు రాంపూర్ గ్రామంలో బడిబాట నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధి పనులకు వెళ్లడంతో, ఉపాధ్యాయులు, సర్పంచ్ గోపాల్రెడ్డితో కలిసి పని ప్రదేశం వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కొరారు. పాఠశాలలో చేర్పిస్తే పైసా కట్టనవసరం లేదని, డ్రెస్సులు, పుస్తకాలు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, కంప్యూటర్ విద్య ఇలా ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. -
దరఖాస్తులకు ఆహ్వానం
చిలప్చెడ్(నర్సాపూర్): మండల పరిధిలోని చిట్కుల్ శివారులో గల కేజీబీవీలో ఇంటర్మీడియెట్ బైపీసీ గ్రూపు సబ్జెక్టులను బోధించేందుకు అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని కేజీబీవీ ప్రత్యేకాధికారి అంజలి కోరారు. సోమవారం ఆమె మాట్లాడుతూ గత యేడాది తమ విద్యాలయానికి ఇంటర్మీడియెట్ బైపీసీ మంజూరైన విషయం విదితమే. బైపీసీ విద్యార్థులకు ఆంగ్లం, తెలుగుతో పాటు, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు బోధించేందుకు, సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు, బీఈడీ పూర్తయితే టెట్ అర్హత ఉన్న, ఆసక్తి గల మహిళలు, తమ విద్యార్హత పత్రాలు తీసుకువచ్చి చిట్కుల్ కేజీబీవీలో సంప్రదించాలని కోరారు. ఈ నెల 15 తేదీన పాఠశాల నోటీస్బోర్డుపై మెరిట్ లిస్ట్ ప్రదర్శిస్తామన్నారు. చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో నైట్ వాచ్ ఉమెన్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హాస్టల్ కేర్ టేకర్ మాధురి తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు మహిళా అభ్యర్థులు ఈ నెల 13 వరకు దరఖాస్తులు అందించాలని కోరారు. ఎంపికై న అభ్యర్థికి రూ.8,710 వేతనం ఉంటుందని ఆమె తెలిపారు. నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల కేంద్రంలోని జనగణనపై సోమవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ శ్రీనివాస్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు సిబ్బంది జనగణనలో ఉన్న గృహగణన వివరాలు సేకరించిన వాటి తుది జాబితాను ఆన్లైన్లో ఏవిధంగా పొందుపరచాలో వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, సీనియర్ అసిస్టెంట్ రమేష్, రామ్మోహన్శర్మ పాల్గొన్నారు. జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు కృష్ణాగౌడ్ మెదక్ కలెక్టరేట్: కౌడిపల్లిలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుందని, వెంటనే దాన్ని సొంత భవనంలోకి మార్చాలని జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ కోరారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కౌడిపల్లి మండల కేంద్రంలో గ్రంథాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నట్లు తెలిపారు. దీంతో గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, పాఠకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. మండల కార్యాలయం ఆవరణలో గ్రంథాలయం కోసం సొంత భవనం నిర్మించి అలాగే వదిలేశారని తెలిపారు. ఇప్పటికై నా గ్రంథాలయాన్ని ఆ భవనంలోకి తరలించాలని కోరారు. ఆయన వెంట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, దేవేందర్ తదితరులు ఉన్నారు. వ్యవసాయాధికారి కృష్ణ పెద్దశంకరంపేట(మెదక్): ఎరువులు, విత్తనాలను ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని తహసీల్దార్ నారాయణ, ఏఓ కృష్ణ సూచించారు. సోమ వారం స్థానిక రైతువేదికలో ఫర్టిలైజర్ దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని, స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ విక్రయాలు జరపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈఓలు వినీత్, అఖిల్ తదితరులున్నారు. కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రమైన కౌడిపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సోమవారం ప్రిన్సిపాల్ వెంకటసుబ్బయ్య, లెక్చరర్లు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాబోధన జరుగుతుందని చెప్పారు. కళాశాల ప్రారంభం కాగానే విద్యార్థుల సౌకర్యం కోసం పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు సురేందర్రెడ్డి, మాణికాంతరావు, చంద్రయ్య, గిరిధర్రావు, దుర్గయ్య, శ్రీనివాస్గౌడ్, ప్రసన్నలక్ష్మి, మధురశ్రీ, లైబ్రేరియన్ మాధవి తదితరులు పాల్గొన్నారు.


