Medak District Latest News
-
నిర్లక్ష్యం వీడి ధాన్యం కొనండి
ఎమ్మెల్యే సునీతారెడ్డికౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. మంగళవారం రైతులతో కలిసి కౌడిపల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రాల వద్ద లారీలు రాక, తూకం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఎక్కడ చూసిన ధాన్యం కుప్పలే దర్శనమిస్తున్నాయని తెలిపారు. పంటల సాగుకు రైతుభరోసా రాక, సకాలంలో యూరి యా దొరకక రైతులు అవస్థలు పడ్డారన్నారు. చివరికి పంటను అమ్ముకోవడానికి తిప్పలు తప్పడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనగోలు చేయడంతో పాటు పెట్టబడి సాయం సకాలంలో ఇచ్చామన్నారు. రాస్తారోకోతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోగా, వివరమించాలని సీఐ జాన్రెడ్డి కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సార రామాగౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సతీశ్, నవీన్ రమేశ్, మహిపాల్రెడ్డి, సుమలత, కాంతారావు, నవీన్గుప్తా, దుర్గారెడ్డి, శ్యాంసుందర్రావు, ప్రవీణ్కుమార్, పురుషోత్తం, సాయాగౌడ్, మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● హాజరుకానున్న 5,194 మంది విద్యార్థులు ● 21 పరీక్ష కేంద్రాల ఏర్పాటు మెదక్ కలెక్టరేట్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 5,194 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 21 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 21 మంది డిపార్ట్మెంట్ అధికారులు, ముగ్గురు కస్టోడియన్లు, ముగ్గురు సిట్టింగ్ స్క్వాడ్స్, ప్లయింగ్ స్క్వాడ్ టీం బృందాన్ని నియమించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్ నోడల్ అధికారిణి మాధవి తెలిపారు. విద్యార్థులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో కనీస వసతులు కల్పించామని వివరించారు. పరీక్షలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ రమాదేవి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా కార్యాలయంలోని పలు విభాగాలను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం బీఎల్ఓలతో మాట్లా డా రు. ఓటరు జాబితాకు సంబంధించిన మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, తప్పులు దొర్లకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. తూకం పూర్తయిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట డిప్యూటీ తహసీల్దార్ రమ్య శ్రీ, ఆర్ఎస్ ప్రీతి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. చేగుంట(తూప్రాన్): రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న భూభారతి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులను సైతం పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలన్నీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ శివప్రసాద్, ఆర్ఐ భరత్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): ఉపాధి హామీ కూలీలు పని చోట తాగునీరు, టెంటు ఇతర వసలులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ పద్మ డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని మద్దుల్వాయి శివారులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లా డుతూ.. ఎండలు మండుతున్న దృష్ట్యా కూలీలకు తాగునీటి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల పంచాయతీ సెక్రటరీలు ఎలాంటి వసతులు కల్పించడం లేదని ఆరోపించారు. ఆమె వెంట సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, నాయకులు సత్యనారాయణ, రాజు, నర్సింలు, మల్లేశం తదితరులు ఉన్నారు. నిబంధనల్లో చేర్చిన ఇంటర్బోర్డునారాయణఖేడ్: ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ప్రవేశాలు పొందే విద్యార్థులు తప్పనిసరిగా యాంటీ డ్రగ్ అఫిడవిట్ను సమర్పించాల్సి ఉంటుందని ఇంటర్మీడియెట్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థినిలకు భద్రతా కల్పించేందుకు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కళాశాల విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటి నివారణకు కట్టుదిట్టమైన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యువత, కళాశాల విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు పోలీసు, ఎకై ్సజ్, విద్యాసంస్థలు కలిసి పని చేస్తున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఈగల్ టీంను సైతం ఏర్పాటు చేశా యి. కళాశాలలు, హోటళ్ల ప్రాంతాల్లోనూ తనిఖీలు జరుపుతున్నారు. పాఠశాల లు, కళాశాలల్లో డ్రగ్స్ ప్రమాదాలపై సెమినా ర్లు, యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం ఆధారంగా నిఘా, సమాచార సేకరణ, సీసీ టీవీల నిఘా పెంచడం, మాదకద్రవ్యాలతో పట్టు బడితే ఎన్డీపీఎస్ యాక్టు కింద కేసులు కూడా నమోదు చేస్తున్నారు. -
సకాలంలో లారీలు పంపించాలి
చిన్నశంకరంపేట(మెదక్): ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సకాలంలో లారీలను అందించకుంటే కాంట్రాక్టర్పై చర్యలు తప్పవని విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం నార్సింగి మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా లారీల సప్లై కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి సకాలంలో లారీలను అందించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఇన్స్పెక్టర్ నర్సింహులు, తహసీల్దార్ గ్రేసిబాయి, ఆర్ఐ శ్రీధర్, ఐకేపీ ఏపీఎం సృజన్రెడ్డి ఉన్నారు. -
పేదల బియ్యం పక్క దారి!
ఆగని అక్రమ రవాణ● గుట్టుగా సరిహద్దులు దాటుతున్న వైనం ● మహారాష్ట్ర, గుజరాత్కు తరలింపు ● కొందరు డీలర్లు, అధికారుల కుమ్మక్కు 5 నెలల్లో పట్టుబడిన రేషన్ బియ్యం: 3,864 క్వింటాళ్లు పట్టుబడిన వాహనాలు 16నమోదైన కేసులు 17పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతోంది. తిలాపాపం తలా పిడికెడు అన్న చందానా ఇందులో అందరికీ వాటాలు ఉండడంతో, సన్న బియ్యం సరిహద్దులు దాటుతోంది. దీని వెనుక ఎవరున్నారనేది అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. – రామాయంపేట(మెదక్) రేషన్ బియ్యం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఈ అక్రమ దందాకు కొందరు డీలర్లు, సంబంధితశాఖ అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్, టాస్క్ఫోర్స్ బృందం ఐదు నెలల వ్యవధిలో 3,864 క్వింటాళ్ల మేర రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంది. వీటిలో చాలా భాగం జాతీయ రహదారిపై పట్టుబడినవే కావడం గమనార్హం. ఎక్కువ శాతం బియ్యం మహారాష్ట్ర, గుజరాత్, కోళ్ల ఫారాలకు తరలుతున్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగదారులకు మూడు నెలలకు సంబంధించి రేషన్ కోటాను ఒకేసారి ఇవ్వడంతో కొంత మంది అమ్ముకుంటున్నారు. జిల్లాతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాలకు చెందిన దళారులు 10– 15 రూపాయలకు కిలో చొప్పున రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. అనంతరం వారు రూ.20 నుంచి రూ. 25 వరకు అమ్ముకుంటున్నా రు. ఇది లాభసాటి బేరం కావడంతో గ్రామాల్లో ద్విచక్ర వాహనాలపై ఇంటింటికీ తిరుగుతూ బియ్యం కొంటున్నారు. ప్రత్యేక నిఘా పెట్టిన విజిలెన్స్ ఇటీవల రేషన్ బియ్యం అక్రమ రవాణా పెరిగిపోవడంతో అడ్డుకట్ట వేసేందుకు పౌర సరఫరాలశాఖ విజిలెన్స్, టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. జాతీయ రహదారిపై అక్రమ రవాణాపై నిఘా పెట్టారు. గతంలో తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద హైవేపై భారీ ట్రక్లో తరలుతున్న 422 క్వింటాళ్లు, అలాగే.. రామాయంపేట వద్ద జాతీయ రహదారిపై లారీలో తరలుతున్న 300 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్ అధికారులు పట్టుకున్నారు. పలు రైస్ మిల్లులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.కఠిన చర్యలు తీసుకుంటున్నాం రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ తరలకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. తమకు ఏమాత్రం సమాచారం వచ్చినా వెంటనే దాడులు చేసి పట్టుకుంటున్నాం. మహారాష్ట్రకు కొందరు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది. బియ్యం అక్రమ రవాణా విషయమై తమకు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – నిత్యానందగౌడ్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి -
ధాన్యం సేకరణ వేగవంతం చేయండి
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత వేగవంతంగా చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మండలాల వారీగా ధా న్యం సేకరణ గురించి అడిగి తెలుసుకు న్నారు. హమాలీలు, లారీల లభ్యత గురించి తహసీల్దార్లతో చర్చించారు. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత వేగంగా జరగాలని సూచించారు. అన్లోడింగ్ ప్రక్రియలో హమాలీలు, లారీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. లారీలు అందుబాటులో లేకుంటే డీసీఎంలు, ట్రాక్టర్లను కూడా అనుమతించాలన్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడడానికి టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలన్నారు. మిల్లర్లు అన్లోడింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి లారీలను అందుబాటులో తెచ్చుకోవాలన్నారు. అనంతరం ఆయిల్పామ్ సాగుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులకు నాణ్యమైన మొక్కలు, ఎరువులు, సాంకేతిక సూచనలు అందించేలా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. అనంతరం బక్రిద్ ఏర్పాట్లపై ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కలెక్టర్ సూ చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతుందని ఎస్పీ వెల్లడించారు. రైస్మిల్లర్లు సహకరించాలితూప్రాన్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైస్మిల్లర్లు సహకరించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మున్సిపాలిటీ పరి ధిలోని ఓ రైస్మిల్లును మంగళవారం సందర్శించారు. కొనుగొలు కేంద్రాల ద్వారా రైస్మిల్లుకు వస్తున్న ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లులో వడ్ల మిల్లింగ్ ప్రక్రియ, నిల్వ సౌకర్యాలు, నాణ్యత ప్రమాణాలు తదితర విషయాలను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఆర్ఐ ప్రేంకుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం మండలంలోని ఘనపూర్ పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపును ప్రారంభించారు.జెడ్పీ సీఈఓ ఎల్లయ్య -
భాగస్వాములు కావాలి
జనగణనలో● మెదక్లో మారథన్ ర్యాలీ ● కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని జనగణనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. సోమవారం మెదక్లో జనగణనపై నిర్వహించిన మారథన్ ర్యాలీలో అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్ పర్సన్ రాధికతోపాటు ఆమె పాల్గొన్నారు. జనగణన ట్యాబ్లు ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్లో హెచ్పీవీ వ్యాక్సీన్, ఇంటర్ అడ్వాన్స్ సంప్లమెంటరీ పరీక్షలు, సీఎస్ఆర్ నిధులు, ఉపాధిహామీ, జనగణన, నేషనల్ అప్రెంటీస్ ట్రైనింగ్ స్కీమ్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణనలో ప్రజలందరి భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లాలో గృహగణన ప్రక్రియ ప్రారంభమైందని, దానిని సక్రమంగా చేయాలన్నారు. జిల్లాలోని 14 నుంచి 15 మధ్య వయస్సు గల బాలికలందరికి హెచ్పీవీ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈనెల 13 నుంచి 21 వరకు జరిగే ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం పలు పరిశ్రమల యాజమానులతో మాట్లాడుతూ సమాజ హితం కోసం సీఎస్ఆర్ నిధులు అందించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో 17 పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు. అలాగే ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్ విద్యార్థులు నేషనల్ అప్రెంటిషిప్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వందరోజుల పని కల్పించి ఉపాధి కల్పించాలన్నారు. అంతకు ముందు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్పాల్గొని ప్రజల నుంచి 67 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమాల్లో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని మాధవి, మెడికల్ సూపరిండెంట్ సునీత దేవి తదితరులు పాల్గొన్నారు. -
లాభాల్లో 10శాతం వాటా
పాపన్నపేట(మెదక్): కొత్తపల్లి రైతుసేవా సహకార సంఘం ఆర్జిస్తున్న లాభాల్లో 10 శాతం డివిడెంట్ను సభ్యులైన రైతులకు అందజేస్తున్నట్లు చైర్మన్ త్యార్ల రమేశ్ తెలిపారు. హైకోర్టు తీర్పు మేరకు సోమవారం పాలకవర్గం పదవీ బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ సొసైటీలో లేనివిధంగా లాభాల్లో రైతుల షేర్లను బట్టి 10 శాతం డివిడెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. సాధారణ సభ, పాలక మండలి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే, సొంతనిధులతో నిర్వహణ చేపట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. త్వరలో సొసైటీకి చెందిన బంకులో సీఎన్జీ గ్యాస్ సేవలు కూడా అందించడానికి కృషిచేస్తున్నామని చెప్పారు. సొసైటీ భవనానికి మూడెకరాల స్థలాన్ని దానమిచ్చిన నత్తడి వీరప్ప కుటుంబ సభ్యులకు పాలకవర్గంలో డైరక్టర్ పదవి కల్పించేందుకు తీర్మానం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కిసాన్సెల్ అఽధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, ఏడుపాయల మాజీ చైర్మన్లు వెంకటేశ్వర్రెడ్డి, పార్శి నర్సింహులు, మాజీ సర్పంచ్ పంతుల భూమన్న, ఇంద్రసేనారెడ్డి, డెరెక్టర్లు భీమప్ప, శోభారాణి, మహిపాల్, సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ, పోషరాజు, సంతోష, దుర్గమ్మ, జాఫర్,నర్సింహులు, శ్రీకాంతర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలయ్య, సీఈఓ వెంకటేశ్వర్రెడ్డి, సిబ్బంది రవి, వెంకటేశం, రైతులు పాల్గొన్నారు. కొత్తపల్లి రైతుసేవా సహకార సంఘం చైర్మన్ రమేశ్ -
నేరుగా సంప్రదించండి
ఎస్పీ శ్రీనివాసరావు మెదక్జోన్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. అనంతరం ఆయా పోలీస్స్టేషన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను వివరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఏదైనా సమస్య వస్తే నేరుగా పోలీసులను సంప్రదించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంతో అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరుగుతోందని ఎస్పీ తెలిపారు. కౌడిపల్లి(నర్సాపూర్): ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో బ్యాక్లాగ్ ఖాళీల అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందుకు 1250 మంది విద్యార్థులు హాజరయినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్సీఓ రాజేశం, జిల్లా ఇన్చార్జి హరిబాబు తెలిపారు. సోమవారం కౌడిపల్లి మండలం తునికి ఎంజేపీ బీసీగురుకుల పాఠశాలలో 6,7,8,9వ తరగతిలో బ్యాక్లాగ్ ఖాళీల అడ్మిషన్ల కోసం ఇటీవల ప్రవేశపరీక్ష రాశారు. మెరిట్ సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో 14బాలురు, 15బాలిక ఎంజేసీ బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా ప్రవేశ పరీక్షలో 1417 మంది విద్యార్థులు మెరిట్ సాధించినట్లు చెప్పారు. ఆయా గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయుల సమక్షంలో కౌన్సిలింగ్కు 1250 మంది విద్యార్థులు హాజరు కావడంతో సీట్లు కేటాయించినట్లు చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ మెదక్జోన్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చెప్పిన పలు సూచనలు ప్రతి భారతీయుడు పాటించాలని కోరారు. పెట్రోల్, డీజిల్, వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, విదేశీ పర్యటనలను తగ్గించడం, స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయటం లాంటి సూచనలను పాటించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్, జిల్లా నేతలు సత్యనారాయణ, నాగరాజు, నల్లాల విజయ్, తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ అధ్యక్షురాలు బాలమణి డిమాండ్ రామాయంపేట(మెదక్): వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు అస్వస్థతకు గురవుతున్నారని, వారితో ఉదయం ఐదు నుంచి 11 గంటల లోపే పనులు చేయించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె కార్మికులతో కలిసి మున్సిపల్ చైర్మన్ లావణ్యను కలిసి మాట్లాడారు. ఎండ పెరుగుతున్న క్రమంలో పారిశుద్ధ్య కార్మికులు తమ విధుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. గత నెలకు సంబంధించిన వేతనాలు చెల్లించలేదన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నవనీత, కౌన్సిలర్లు, కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
సాఫీగా ధాన్యం కొనుగోలు
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కొల్చారం(నర్సాపూర్): రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు, గన్నీ బ్యాగుల సరఫరా, కేంద్రాలకు కేటాయించిన లారీలు వస్తున్నాయా? లేదా? అని ఆరా తీశారు. రైతులు నమోదు చేసుకున్న ఓపీ ఎంఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక్కడి కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన 13 లారీల ధాన్యాన్ని, స్థానికంగా ఉన్న రైస్ మిల్లుకు తరలించామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో ధాన్యంతో వస్తే ఎప్పటికప్పుడు అన్లోడింగ్ చేయాలని మిల్లు యజమానులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పీఏసీఎస్ చైర్మన్ మనోహర్, సీఈఓ కృష్ణ, రైతులు ఉన్నారు. -
కలెక్టర్పై కుట్రలా?
● మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే విమర్శలు ● కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేతల ధ్వజం రామాయంపేట(మెదక్): నిజాయితీపరురాలైన కలెక్టర్ ప్రతిమాసింగ్ను కొందరు అప్రతిష్టపాలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్ నేతలు సుప్రభాతరావు, అహ్మద్, మద్దెల రమేశ్ విమర్శించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాలకుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుక కలెక్టర్పై నిందలు వేయడం తగన్నారు. దీని వెనుక రైసుమిల్లు మాఫియా, రియల్ ఎస్టేట్, ఇసుక మాఫియా ఉందని వారు ఆరోపించారు. జిల్లా ప్రజలు కలెక్టర్కు అండగా ఉన్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, వెంటనే అన్ని మండలాల్లో సాండ్ బజార్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు యాదగిరి, హస్నొద్దీన్, వెంకటేశ్, వినయ్, తదితరులు పాల్గొన్నారు. నంగునూరు(సిద్దిపేట): పాలిసెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, రాజగోపాలపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లోమా, వ్యవసాయ వెటర్నరీ కోర్సులో ప్రవేశాల కోసం బుధవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 1.30 వరకు పరీక్ష జరుగుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,037 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్లో కలిపి మొత్తం 11 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. నిమిషం నిబందన అమలులో ఉందని, ఓఎంఆర్ షీట్కు రెండు వైపులా విద్యార్థుల వివరాలు నమోదు చేయాల్సి ఉన్నందున గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. -
రోడ్డెక్కిన రైతన్నలు
హవేళిఘణాపూర్(మెదక్): కాంటాలు పూర్తయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం రైతులు రోడ్డెక్కారు. దీంతో మెదక్– బోధన్ రోడ్డుపై కొద్దిసేపు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రమైన హవేళిఘణాపూర్లో వారం రోజులుగా వరి ధాన్యం తూకం వేశారు. కానీ లారీలు రాక ధాన్యం తరలింపు నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించింద ని ఆరోపించారు. ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేయాలని రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అధికారులు కాంటాలు పూర్తయిన ధాన్యం త రలించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వచ్చి రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.వారం రోజులుగా నిలిచిన ధాన్యం తరలింపు -
రైతు గోస పట్టదా..?
కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా మెదక్ కలెక్టరేట్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల గోసను సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తూ ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా గోనె సంచులు అందించాలన్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పద్మ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గౌరయ్య , అజయ్, పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బండి రాజీనామా చేయాలి
ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ నర్సాపూర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయిభగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సాయిభగీరథ్పై పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయకపోవడం విచారకరమన్నారు. వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని, అప్పుడే కేసు విచారణ సక్రమంగా కొనసాగేందుకు అవకాశం ఉందన్నారు. హోం శాఖ సీఎం రేవంత్రెడ్డి వద్దే ఉందని, మహిళలకు రక్షణ కరువైనా స్పందించడం లేదన్నారు. బాలిక స్టేట్మెంట్ను వెంటనే మెజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేయించాలని డిమాండ్ చేశారు. అర్హులందరికి ఇళ్లు మంజూరు చేయాలి శివ్వంపేట(నర్సాపూర్): అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రతాలు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, హౌసింగ్ డీఈ ప్రభు, ఏఈ రాజ్కుమార్, సర్పంచ్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, నాయకులు చంద్రగౌడ్, పవన్గుప్తా, మహిపాల్రెడ్డి, మహేందర్రెడ్డి, లక్ష్మీనర్సయ్య, రాజశేఖర్గౌడ్ ఉన్నారు. అంతకు ముందు జెడ్పీ ఉన్నత బాలుర పాఠశాలలో సమ్మర్ క్యాంపు, కోమటికుంట సుందరీకరణ పనులు, పట్టణంలోని 12వ వార్డులో జనగణన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కమిషనర్ సాయికుమార్, ఎంఈఓ తారాసింగ్, హెడ్మాష్టర్ సామ్యానాయక్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
ఎక్కడి ధాన్యం అక్కడే..!
కొనుగోలు కేంద్రాలు దాటని వైనం‘వారం రోజులుగా లారీలు రాలేవు. ఎక్కడి ధాన్యం అక్కడే కేంద్రాల్లో నిలిచి పోయింది. రాత్రింబవళ్లు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నాం. వానలు పడితే మా కష్టం నీళ్ల పాలవుతుంది అంటూ.. హవేలిఘనాపూర్ రైతులు సోమవారం మెదక్–బోధన్ రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఇలా వారం రోజుల నుంచి ఏదో ఒక గ్రామంలో అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు’ మెదక్ అర్బన్: యాసంగి ధాన్యం కొనుగోళ్లు అన్నదాతలకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట మిల్లులను చేరడం ప్రహసనంగా మారింది. మెదక్ జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలను చేరే అవకాశం ఉండగా, ఇప్పటి వరకు 90,685 మెట్రిక్ టన్నుల ధాన్యం తూకం చేశారు. అయితే ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా జరగడానికి ప్రధాన కారణం ట్రాన్స్పోర్టు.. హమాలీల కొరతగా భావిస్తున్నారు. అలాగే మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్ చేయడానికి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ట్రాన్స్పోర్ట్, హమాలీ వెతలు ధాన్యం ట్రాన్స్పోర్టు వ్యాపారం, గుత్తేదార్లకు సిరులు కురిపిస్తుండటంతో పోటీపడి టెండర్లు కై వసం చేసుకుంటున్నారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్, మెదక్ క్లస్టర్లు ఉన్నాయి. టెండర్లో పాల్గొనే వారు సొంతంగా 30, లీజ్కు 30 లారీలు సమకూర్చే ఽశక్తి కలిగి ఉండాలి. అయితే వీరు కాగితాలోల సామర్థ్యాన్ని చూపుతూ.. టెండర్లు కై వసం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మెదక్ టెండర్ ప్రస్తుతం బాలాజీ వీరభద్ర రోడ్ లైన్స్ పేరిట మూడేళ్లుగా, అంతకు ముందు ఇదే టెండర్దారు బాలాజీ రోడ్లైన్స్ పేరిట 2021 నుంచి రెండున్నర ఏళ్లుగా ట్రాన్స్పోర్టు నడుపుతున్నారు. ఇక నర్సాపూర్ టెండర్ హైదరాబాద్ మెదక్ ట్రాన్స్పోర్టు పేరిట సుమారు పదేళ్లుగా టెండర్ కై వసం చేసుకుంటున్నట్లు సమాచారం. వాస్తవంగా వీరు టెండర్లో చూపిన లారీలు ,క్షేత్రస్థాయిలో ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రవాణ చార్జీల కింద 8 కి.మీటర్ల లోపు టన్నుకు రూ.417లు, 8 నుంచి 20 కి.మీ వరకు అదనంగా రూ.3లు, 80 కి.మీ వరకు టన్నుకు రూ.450 చెల్లిస్లారు. సన్న వడ్లకు డిమాండ్ బాగా ఉండటంతో మిల్లు యజమానులు సొంత వాహనలను కొనుగోలు కేంద్రాలకు పంపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ డబ్బులు ట్రాన్స్పోర్టర్లకు మిగిలిపోతున్నాయి. ఇలా గుత్తేదారులు లాభ పడుతున్నా. సరైన సేవలు అందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సకాలంలో రాని బిహారీలు స్థానికులెవరూ హమాలీ పని చేయడానికి ముందుకు రాకపోవడంతో, బిహారీ హమాలీలపైనే కొనుగోలు కేంద్రాలు ఆధారపడుతున్నాయి. ఈసారి సకాలంలో బిహారీలు రాకపోవడంతో, ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోలేదని తెలుస్తుంది. జిల్లాలో సుమారు వంద మిల్లులకు ఽసీఎంఆర్ ధాన్యం ఇస్తున్నారు. ఇందులో గత వర్షాకాలం ధాన్యం మిల్లుల్లో నిల్వ ఉండటంతో, కొత్తగా వెళతున్న ధాన్యం.. సకాలంలో అన్లోడ్ కావడం లేదు. దీంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి.అన్లోడ్ ఆలస్యం అవుతుంది మిల్లుల్లో అన్లోడ్ ఆలస్యం అవుతుండటతో ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది. అలాగే హమాలీల కొరత కూడా ఒక కారణంగా మారింది. కొనుగోళ్లు వేగవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. –జగదీశ్, డీఎం రవాణాలేమి.. హమాలీ వెతలు ఐదేళ్ల నుంచీ ఒక్కరే ట్రాన్స్పోర్టర్లు రోజుకో చోట రోడ్డెక్కుతున్న రైతులు మొత్తం 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యం ఇప్పటి వరకు కేవలం 90,685 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు -
పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట
ప్రధాని మోదీ ● వర్చువల్గా స్మార్ట్ సిటీ పనులకు శంకుస్థాపన ● సభకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంతం భవిష్యత్తులో పారిశ్రామిక పట్టణంగా అవతరించనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా నిర్వహించిన సభలో జహీరాబాద్ స్మార్ట్ సిటీ పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్లోని నిమ్జ్ ప్రాజెక్టులో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ ప్రాంతం నిర్మాణం వెనుక ఇదే లక్ష్యం ఉందన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ వికసితానికి కేంద్ర, రాష్ట్రం ప్రభుత్వాల వాటా ఉందన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. నాణ్యవంతమైన విద్యుత్ సరఫరా, అత్యాధునిక హైసిటీ నెట్వర్క్ కూడా ఉండనుందన్నారు. దేశవ్యాప్తంగా ఉండే పరిశ్రమల అవసరాల కోసం కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ తయారుకానున్నాయని తెలిపారు. ఇలాంటి సదుపాయాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.వేలకోట్లు అవసరమవుతాయని చెప్పారు. తెలంగాణతోపాటు హైదరాబాద్ ప్రాంతంలోని వేలాది యువకులకు జహీరాబాద్ ప్రాంతం జాబ్ హబ్గా తయారుకానుందని వివరించారు. నిమ్జ్లో తయారయ్యే వాహనాలు, యంత్రాలతోపాటు ఇక్కడ ఉండే ఆహారశుద్ధి ఉద్యోగులకు, తెలంగాణలోని కార్మికులు, రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి చేకూరనుందన్నారు. ఝరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలో స్మార్ట్సిటీ ఏర్పాటు కానుంది. ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం మొదటి విడత కింద 3,245 ఎకరాల మేర భూసేకరణ జరిగింది. ఝరాసంగం మండలంలోని మూడు గ్రామాలు,న్యాల్కల్ మండలంలోని 17 గ్రామాల పరిధిలో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.2,369 కోట్ల నిధులతో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ కలిసి పారిశ్రామిక అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి. కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసమే జహీరాబాద్లో రూ.1,695 కోట్లు ఖర్చు చేయనున్నారు. -
ధాన్యం కొనాలని ఆందోళన
చిన్నశంకరంపేట(మెదక్): కొనుగోలు కేంద్రానికి 15 రోజులుగా ఒక్క లారీ రాలేదని మండలంలోని సూరారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కొనుగోలు కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు వెంటనే లారీలు పంపించాలని డిమాండ్ చేశారు. 15 రోజులుగా లారీలు రాకపోవడంతో ధాన్యం ఎండకు ఎండి, వానకు తడిసే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకుంటే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే మండలంలోని అంబాజిపేట కొనుగోలు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఒక్కలారీ కూడా వెళ్లలేదని తెలిపారు. ధాన్యం కుప్పలుగా పేరుకుపోయినా, కాంటా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. -
వడ్లు ఎప్పుడు కొంటరు?
● రైతులను పట్టించుకోవడం లేదు ● ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్రావు ఫైర్చేగుంట(తూప్రాన్): రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఆదివారం మండలంలోని కర్నాల్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటివరకు కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించలేదన్నారు. మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేటతో పాటు మరికొన్ని జిల్లాల్లో మక్కలు, శనిగలు, సన్ఫ్లవర్ అమ్మిన రైతులకు ఇప్పటివరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదన్నారు. కాంగ్రెస్ నాయకులే కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపే దుస్థితి ఏర్పడిందని వాపోయారు. సీఎం నిత్యం ఢిల్లీకి వెళ్లి అధిష్టానికి కప్పం కట్టి రావడం తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. జిల్లాలో ఒక్క మంత్రి అయినా కొనుగోలు కేంద్రాలను పరిశీలించి జిల్లా అధికారులతో సమీక్ష జరిపారా..? అని ప్రశ్నించారు. కోట్ల రూపాయల విలువైన దొడ్డు బియ్యం గోదాములు, రేషన్ షాపుల్లో పాడైపోతుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల వడగండ్లతో నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, నాయకులు ఉన్నారు. -
ముమ్మరంగాధాన్యం సేకరణ: కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా సాగుతుందని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 17,254 మంది రైతుల నుంచి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. వారి ఖాతాల్లో రూ.86 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రోజువారీగా కేంద్రాల్లో నిల్వలు, మిల్లులకు తరలించిన వివరాల నివేదికలను సమర్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. నేటి నుంచి సమ్మర్ క్యాంపు నర్సాపూర్: నేటి నుంచి తమ పాఠశాలలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నామని పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం సామ్యానాయక్ తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించడానికి ఈనెల 25 వరకు క్యాంపు కొనసాగుతుందని చెప్పారు. పట్టణంలోని విద్యార్థులు క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 12న ఎస్సీ కార్పొరేషన్ ఇంటర్వ్యూలు పెద్దశంకరంపేట(మెదక్): ఈనెల 12న (మంగళవారం) ఎస్సీ కార్పొరేషన్లో వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ క్రాంతికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం 11 గంటలకు అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. కుస్తీమే సవాల్ పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని మక్తలక్ష్మాపూర్లో మానిక్ ప్రభు జాతర వైభవంగా కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ఆవరణలో కుస్తీ పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మల్లయోధులు పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. నేడు ఎంజేపీలో కౌన్సెలింగ్ కౌడిపల్లి(నర్సాపూర్): ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9వ తరగతిలో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష రాసి సీట్లు పొందిన విద్యార్థులకు సోమవారం తునికి ఎంజేపీ బీసీ గురుకులంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ఆర్సీఓ రాజేశం, జిల్లా కన్వీనర్ హరిబాబు తెలిపారు. ఆయా తరగతుల్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు సమాచారం ఇచ్చామన్నారు. మెరిట్ సాధించిన విద్యార్థులు ఒరిజనల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు. కౌన్సెలింగ్ ద్వారా బాలురు, బాలికలకు ఉమ్మడి మెదక్ జిల్లాలలోని ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలల్లో ఖాళీల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తామన్నారు. కార్పొరేట్ల కోసమే లేబర్కోడ్స్ మెదక్ కలెక్టరేట్: సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో లేబర్కోడ్ ప్రతులను దహనం చేశారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం కార్మిక, శ్రామికవర్గంపై యుద్ధం మొదలుపెట్టిందని మండిపడ్డారు. లేబర్ కోడ్స్ శ్రామికుల మెడకు బిగించిన ఉరితాళ్లని ఆరోపించారు. ఎన్నికల వేళ మాయమాటలతో ప్రజలను వంచించిన పాలకులు, గద్దెనెక్కిన వెంటనే కార్పొరేట్ శక్తుల పాదాల చెంత కార్మిక హక్కులను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ, ప్రజాసంఘాల నాయకులు మల్లేశం, అజయ్, దుర్గ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలి
మెదక్ కలెక్టరేట్: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్లం, సిద్దు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్లోని తపస్ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు పాత పెన్షన్ విధానం అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం నిరాకరించడం సరికాదన్నారు. హైకోర్టు సానుకూల తీర్పునిస్తూ, మూడు నెలల్లో దీనిని అమలు చేయాలని ఆదేశించింది. అయితే దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయడమేనన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల కు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, సభ్యులు నర్సింలు, మెదక్, నార్సింగి మండలల అధ్యక్షులు నరేందర్, స్వామి పాల్గొన్నారు. -
బస్సులు లేక జనం తిప్పలు
నారాయణఖేడ్: అసలే పెళ్లిళ్ల సీజన్ కావడం, ఆర్టీసీలో చాలావరకు బస్సులను హైదరాబాద్లో జరిగిన ప్రధాని మోదీ సభకు తరలించడంతో బస్సులకోసం ప్రయాణికులు ఆదివారం ఇబ్బందులు పడ్డారు. ఖేడ్ ఆర్టీసీ డిపో నుంచి ప్రధాన హైదరాబాద్ రూట్లో నిత్యం అరగంటకు ఒక బస్సు చొప్పున 33 సర్వీసులు నడుస్తుంటాయి. సాధారణంగా ఖేడ్ నుంచి హైదరాబాద్ రూట్లో వెళ్లే ప్రయాణికులు అత్యధికంగా ఉంటారు. డిపో నుంచి 35 సర్వీసులను ప్రధాని మోదీ సభకు తరలించారు. దీంతో 9 బస్సు సర్వీసులు మాత్రమే హైదరాబాద్ రూట్లో నడిపారు. దీంతో బస్టాండ్ జనాలతో కిక్కిరిసి పోయింది. -
నేటి నుంచి విద్యా వారోత్సవాలు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో నేటి నుంచి విద్యా వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా అధికారులు ఈనెల 17 వరకు వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మొదటి రోజు పాఠశాలల్లో పూర్తయిన పనులను ప్రారంభించడంతో పాటు సమ్మర్ క్యాంపుల ప్రారంభిస్తారు. రెండోరోజు పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు రీమిడియల్ క్యాంపులు చేపడుతారు. వీటిని ఏడీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. సబ్జెక్టులపై నిపుణులతో బోధన ఉంటుంది. హాజరు తీరుపై అవగాహన, విద్యార్థుల ప్రగతిపై సమీక్ష చేపడుతారు. అలాగే మధ్యాహ్న భోజనం తీరును పరిశీలిస్తారు. ఇక మూడో రోజు ఆయా పాఠశాలల పరిధిలోని ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తారు. పలు రకాల కిట్ల పంపిణీ చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ.25 వేలు మంజూరు చేసింది. 4వ రోజు బడిబాట విద్యావారోత్సవాల్లో భాగంగా ఈనెల 14న పెద్ద ఎత్తున బడిబాట ర్యాలీలు నిర్వహిస్తారు. ఉపాఽ ద్యాయులు, అధికారులు ఇంటింటికీ తిరిగి బడీడు పిల్లలను బడిలో చేర్పిస్తారు. అలాగే తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తారు. 5వ రోజు గ్రంథాలయ దినోత్సవం నిర్వహిస్తారు. ఉత్తమ పాఠకులను గుర్తించి ప్రోత్సహిస్తారు. అలాగే పుస్తక దాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. 6వ రోజు విద్యార్థులకు చిత్రలేఖనం, హస్తకళల పోటీలు నిర్వహిస్తారు. కోలాటం, ఒగ్గుకథ వంటి సాంప్రదాయ కళల ప్రదర్శనలు చేపడుతారు. 7వ రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం నిర్వహిస్తారు. పదో తరగతి, ఇంటర్, క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరిస్తారు. ఇదే విషయమై డీఈఓ రాజు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈనెల 17 వరకు ప్రత్యేక కార్యక్రమాలు -
హమాలీల సంఖ్య పెంచండి
చిన్నశంకరంపేట/రామాయంపేట (మెదక్): ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. ఆదివారం నార్సింగి మండల కేంద్రంలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రైస్ మిల్లుల వద్ద పేరుకుపోయిన ధాన్యం లారీలను పరిశీలించారు. రోజుకు ఎన్ని లారీలను అన్లోడింగ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే హమాలీల సంఖ్య పెంచుకోవాలన్నారు. లారీలను త్వరగా కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 75 మెట్రిక్ ట న్నుల ధాన్యం సేకరించడంతో పాటు రైతుల ఖాతా ల్లో డబ్బులు కూడా జమ చేశామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఆర్ఐ శ్రీధర్, సిబ్బంది ఉన్నారు. అనంతరం రామాయంపేట మండలంలోని దామరచెరువు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. వర్షాలు కురిసే అవకాశం ఉండటంలో వెంట వెంట ధాన్యం తూకం వేసి తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట సహకార సంఘం సీఈఓ నర్సింలు, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి
చిలప్చెడ్(నర్సాపూర్): ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు ఏ.మల్లేశం అన్నారు. శుక్రవారం మండల పరిధి బండపోతుగల్ గ్రామంలో ధాన్యం నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరితో పాటు, మొక్కజొన్న, జొన్నల కోతలు ప్రారంభం అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. పలు గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినా, ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదన్నారు. దీంతో రైతులు దళారులను ఆశ్రయించి, నష్టాలకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కనీసం తాగునీటిని సైతం ఏర్పాటు చేయకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. తూకంలో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు సమస్యలపై ఈ నెల11న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు డి.మల్లేశం, శేఖర్, నర్సింలు, రైతులు పాల్గొన్నారు. ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం వహించొద్దు వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించే విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, రైస్మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని రైతులను అడిగి తెలుసుకొని సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం మండలంలోని మంగళపర్తి, హస్తాల్పూర్ శివారులోని సర్వే నం.401, 283లకు సంబంధించిన అటవీ, రెవెన్యూ సరిహద్దు వివాదంపై తహసీల్దార్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు. కొన్నిచోట్ల హమాలీల కొరత ఉండడం వల్ల ఆలస్యం జరుగుతుందని, ఆయా కేంద్రాల్లో రెండు, మూడు రోజుల్లో కొనుగోలు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, గిర్దావర్ నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభం రామాయంపేట(మెదక్): స్థానిక సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఽగొల్పర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కౌన్సిలర్లు నాగరాజు, పుట్టి సందీప్, గౌస్, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల యాదగిరి, డీసీసీ కార్యదర్శి గణేశ్, నాయకులు డాకి స్వామి, మోబిన్, పాల్గొన్నారు. సీపీఎం నాయకుడు మల్లేశం -
ఘనంగా రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ
టేక్మాల్(మెదక్): మండలంలోని కోరంపల్లి గౌడసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 108 వైరాగ్య శిఖామణి అవదూతగిరి మహరాజ్, దత్తగిరి మహరాజ్ కరకములచే యంత్ర, ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిర్వాహకులు భక్తులకు అన్నదానం నిర్వహించారు. వైభవంగా పెద్దమ్మతల్లి ఉత్సవాలు చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని శాలిపేటలో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఆల య వార్షికోత్సవ ఉత్సవాలకు ఎమ్మె ల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. ఈ మేరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతో గ్రామాల్లో ప్రశాంతం వాతావరణం వెల్లివిరిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ క్యాతమ్మ, ఉపసర్పంచ్ కిష్టయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
నర్సింగ్ హోంల పరిశీలన
నర్సాపూర్: నర్సాపూర్లోని పలు ప్రైవేటు నర్సింగ్హోంలను శుక్రవారం రెడ్డిపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రఘువరన్, శివ్వంపేట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయిసౌమ్యలు పరిశీలించినట్లు తెలిపారు. నర్సింగ్హోంలలో డెలివరీలు నిర్వహించేందుకు వసతులు పరిశీలించామని..నిబంధనల మేరకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు. అందుకు సంబంధించిన రికార్డులు పరిశీలించి సక్రమంగా నిర్వహించాలని సూచించినట్లు చెప్పారు. వారి వెంట పలువురు సిబ్బంది ఉన్నారు. ఆంజనేయస్వామికి ఛెప్పన్బోగ్ నైవేద్యం కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికిలో శుక్రవారం ఆంజనేయస్వామికి హనుమాన్ మాలధరించిన భక్తులు ఛెప్పన్బోగ్ మహా నైవేద్యం సమర్పించారు. గ్రామ పూజారి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి చందన అలంకరణ చేశారు. అనంతరం పండ్లు, స్వీట్లు, పులిహోర, పాయాసం తదితర ఛెప్పన్బోగ్ మహానైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి, ఉపసర్పంచ్ ప్రవీన్గౌడ్, మాజీ ఉపసర్పంచ్ శేఖర్, హనుమాన్ దీక్ష భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 250 క్వింటాళ్ల బియ్యం పట్టివేత తూప్రాన్: పేదలకు పంపిణీ చేయాల్సిన 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు టోల్ప్లాజా వద్ద శుక్రవారం పట్టుకున్నట్లు ఎస్ఐ గంగరాజు తెలిపారు. వివరాలు ఇలా.. కర్ణాటక నుంచి చత్తీస్గఢ్కు లారీలో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం అందిందన్నారు. తూప్రాన్ పట్టణ సమీపంలో 44వ జాతీయ రహదారిపై టోల్ప్లాజా వద్ద తనిఖీల్లో 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం గుర్తించామని తెలిపారు. లారీలోని బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. వైభవంగా బోనాలు పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిఽధి మక్తలక్ష్మాపూర్లో మానిక్ప్రభు జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం గ్రామ పురవీధుల గుండా మహిళలు భక్తిశ్రద్ధలతో తరలివెళ్లి స్వామి వారికి బోనాలను సమర్పించారు. శివసత్తుల నృత్యాలు, యువకుల కేరింతల మధ్య బోనాలను ఊరేగించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. జీలుగతో 30 శాతం యూరియా చేగుంట(తూప్రాన్): జీలుగ వేసుకుంటే పంటలకు 30శాతం యూరియా లభిస్తుందని సైంటిస్టు సుజాత పేర్కొన్నారు. మండలంలోని కసాన్పల్లి ఇబ్రహీంపూర్, వడియారం వల్లభాపూర్ గ్రామాల్లో రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవ ఎరువుగా జీలుగను వేసుకొని దుక్కిలో దున్నేస్తే పంటలకు ఎరువు అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ హరిప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. -
ప్రాణాలకు ప్రమాదం..
రోడ్లపై ధాన్యం.. నిజాంపేట (మెదక్): అన్నదాతలు పండించిన పంటను ఆరబోసేందుకు కల్లాలు లేక రోడ్లపై ఆరబోస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధి నార్లాపూర్ గ్రామ శివారు నుంచి కల్వకుంట కమాన్ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారిపై వడ్ల కుప్పలతో నిండిపోయింది. ధాన్యం ఆరబోయడమే కాకుండా, ధాన్యం కుప్పల రక్షణ కోసం వాటి పక్కన పెద్ద పెద్ద రాళ్లను పెడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు ఈ రాళ్లను, వడ్ల కుప్పలను గమనించక ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గత ఏడాది ఇదే రహదారిపై వడ్ల కుప్పను ఢీకొని ఒక వ్యక్తి మరణించిన ఉదంతం ఉన్నప్పటికీ, అటు రైతులు, ఇటు అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. మండలంలోని వెంకటాపూర్ (కె) గ్రామంలో రోడ్డుపైనే ధాన్యం తూకం వేయడం వల్ల గన్నీ సంచులు కూడా అడ్డంగా పడి ఉంటున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వెంకటాపూర్ (కె) గ్రామంలో బస్టాండ్ వద్ద కుడివైపు ఆరబోసుకున్న ధాన్యం.. ఎడమ వైపు నుంచి పోయడం వల్ల రాత్రి పూట ముందు ఉన్న ధాన్యం కుప్పలు కనిపించకుండా పోతున్నాయి. అంతేకాకుండా రోడ్లపైనే గన్నీ సంచులను ఉంచడంతో రాత్రి పూట తిరిగే వాహనదారులకు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రహదారులపై ధాన్యం ఆరబోయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇబ్బందుల్లో వాహనదారులు తరచూ ప్రమాదాలు పట్టించుకోని అధికారులు -
సబ్సిడీ పథకాలతో ప్రయోజనం
టేక్మాల్(మెదక్): ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మేజర్ పంచాయతీ సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రం టేక్మాల్ పశువైద్యశాల డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో దూడలకు నట్టల నివారణ మందులను, సబ్సిడీ పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో రైతులు పశుసంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లేగదూడలకు పాలు తాగించడం, డివార్మింగ్ చేయడం వాటి పోషణ, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో వెల్పుగొండ పశువైద్యాధికారిణి డాక్టర్ సౌమ్య, ఉపసర్పంచ్ శంకరయ్య, జూనియర్ పశువైద్యాధికారులు హనుమంతు, అమరావతి, గోపాల మిత్రలు దీపక్, రవి, దేవరాజ్, ఆనంద్, కృష్ణ, శ్యామల గ్రామ రైతులు పాల్గొన్నారు. -
జనగణనపై ప్రజలకు అవగాహన
చేగుంట(తూప్రాన్): మండల పరిధి చందాయిపేట గ్రామంలో మొదటి దశ జనగణన విషయంలో తహసీల్దార్ శివప్రసాద్ స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ నెల 11 నుంచి ప్రారంభమవుతుందని మొదటి విడతలో జనగణన పత్రంలో వివరించిన అంశాలను మాత్రమే ప్రజలు తెలియజేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆధార్, ఓటీపీ లాంటి విషయాలను అడగటం లేదని.. కేవలం ఎన్యుమరేటర్లు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానం చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వరీ, ఉపసర్పంచ్ నగేష్, ఏఎస్ఓ భూమేశ్, ఫీల్డ్ ట్రైనర్ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు. -
వేం నరేందర్రెడ్డిని కలిసిన కీర్తన
తూప్రాన్: తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్గా నియామకమైన యంజాల కీర్తన శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. పాలకవర్గం రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, రైతుల కోసం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యంజాల కీర్తన, విఠల్రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, డైరెక్టర్లు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియ వ్యవసాయంపై అవగాహన
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని మానెపల్లి, శెట్టిపల్లి కలాన్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేంద్రియ వ్యవసాయం, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్, మామిడి లాంటి పంటల సాగు వల్ల కలిగే లాభాలను శాస్త్రవేత్తలు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడడం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతిని పంట దిగుబడులు తగ్గిపోతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి సేంద్రియ ఎరువులైన పశువులు, కోళ్లు, జీవాల ఎరువు అధికంగా వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ విజయలక్ష్మి, శమహదేవప్ప, పుష్పవల్లి సర్పంచ్లు శేఖర్, సోమప్ప, ఏఈఓలు ఉత్తమ్ కుమార్, చంద్రవేణి పాల్గొన్నారు. అధికారులు సిఫారసు చేసిన మందులనే వాడాలి కొల్చారం(నర్సాపూర్): రైతులు పంటల సాగులో వ్యవసాయశాఖ అధికారులు సిఫారసు చేసిన మందులను మాత్రమే వాడాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సైదానాయక్, రాకేశ్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధి తుమ్మలపల్లి గ్రామంలో రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా అక్కడి రైతులకు పంటలు సాగుపై అవగాహన కల్పించారు. ఎవరికివారు పురుగుల మందులు వాడడం, పంటలకు తీవ్రనష్టం తెచ్చిపెడుతుందన్నారు. అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారుల సూచనల మేరకే మందులు వాడాలన్నారు. నాణ్యమైన విత్తనాల ఎంపికతో మేలు కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు అధిక దిగుబడి కోసం శాస్త్రవేత్తలు సూచించిన విత్తనాలను సాగు చేయాలని పీజేటీఏయూ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏవీ రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం మండలంలోని కంచన్పల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు పంటలసాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు, డ్రిప్, స్పింక్లర్ పద్ధతిలో పంటలు సాగుచేయాలన్నారు. దీంతో నీరు, ఖర్చు తగ్గుతుందని అధిక ఆదాయం వస్తుందన్నారు. అనంతరం ఏఓ స్వప్న మాట్లాడుతూ.. వరికోతలు అయ్యాక కొయ్యలు కాల్చవద్దని కలియదున్నాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ స్వప్న, శాస్త్రవేత్తలు ప్రేమ్, ఉమేష్, శ్రీకాంత్, సుమంత్కుమార్ పాల్గొన్నారు. -
సొంతింటి కల కాంగ్రెస్తోనే సాకారం
రేగోడ్(మెదక్): పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారం అవుతోందని పీసీసీ సభ్యుడు కిషన్ అన్నారు. మండల పరిధి తిమ్మాపూర్ గ్రామంలో లబ్ధిదారు సాయమ్మ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును సర్పంచ్ నిర్మలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం పేదలకు వరమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేందర్ సింగ్, దర్శన్, భాగయ్య, మధు, దుర్గయ్య, సంగమేశ్వర్, కృష్ణ, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పశువులకు గర్భధారణ చికిత్సలు
పాపన్నపేట(మెదక్): మండల పరిధి నాగ్సాన్పల్లిలో శుక్రవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో 94 గేదెలు, 48 ఆవులకు గర్భధారణ చికిత్సలు చేసినట్లు పశువైద్యాఽధికారులు సౌమ్య, ప్రవీణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవికాలంలో పశువులను ఎండలో తిప్పకుండా నీడలో ఉంచాలని అన్నారు. ఎప్పటికప్పుడు తగినంత నీరు అందించాలని సూచించారు. పశువులకు గర్భధారణ, ఎదకు రాని పశువులకు అందించాల్సిన చికిత్సల గురించి అవగాహన కల్పించారు. సరైన సమయంలో టీకాలు వేయించాలని కోరారు. 37 దూడలకు నట్టల మందు వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ దండెం సుశీల, ఉపసర్పంచ్ సిరాజ్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ ఎం.సతీష్ కుమార్, గోపాల మిత్ర సూపర్వైజర్ శ్రీనివాస్రెడ్డి, షర్పొద్దీన్ పాల్గొన్నారు. పశువాధ్యులపై అవగాహన రేగోడ్(మెదక్): ఉచిత పశువైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక పశువైద్యాధికారి వీరేశం కోరారు. మండలంలోని జగిర్యాల గ్రామంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని సర్పంచ్ వీరమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీరేశం మాట్లాడుతూ.. పశువులకు సంబంధించి గర్భకోశ వ్యాధులు, పొడవు వాపు, సీజనల్ టీకాలు, దుడ్డేల సంరక్షణ గురించి అవగాహన కల్పించారు. అనంతరం పశువులకు టీకాలు వేశారు. పశువైద్యశిబిరాలతో లబ్ధి కొల్చారం(నర్సాపూర్): పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రంగంపేట పశువైద్యాధికారిని ప్రియాంక అన్నారు. శుక్రవారం ఆమె ప్రియాంక మాట్లాడుతూ.. పశు పోషకులు వేసవిలో పశువులకు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శిబిరంలో 10 పశువులకు ఉచిత కృత్రిమ గర్భధారణ, 28 దూడలకు నట్టాల నివారణకు మందులు తాగించామన్నారు. 20 పాడి గేదెల్లో గర్భకోశ వ్యాధులను గుర్తించి చికిత్స చేసినట్లు తెలిపారు. గర్భకోశ వ్యాధులు నివారించుకోవాలి కౌడిపల్లి(నర్సాపూర్): పశువుల్లో గర్భకోశ వ్యాధులు నివారించుకోవాలని మండల పశువైద్యాధికారి ఫర్హిన్ ఫాతిమా తెలిపారు. శుక్రవారం కౌడిపల్లిలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. పశువులకు వ్యాధి సోకగానే చికిత్సలు చేయించాలన్నారు. పశుపోషణపై అవగాహన చిన్నశంకరంపేట(మెదక్): వేసవికాలంలో పశుపోషణపై మండల వెటర్నరీ డాక్టర్ గీతామాలిక అవగాహన కల్పించారు. శుక్రవారం మండలంలోని కామారం గ్రామంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు చూడి పరీక్షలు నిర్వహించి అవసరమైన టీకాలు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, ఉపసర్పంచ్ సుధాకర్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
వీఓఏల సమస్యలు పరిష్కరించండి
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వం ఐకేపీ వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కార్యదర్శి ఏసు డిమాండ్ చేశారు. శుక్రవారం కౌడిపల్లిలో ఐకేపీ కార్యాలయం వద్ద మండల సమాఖ్య అధ్యక్షురాలు పుణ్యమ్మకు సమ్మె నోటీసు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీఓఏలకు కనీస వేతనం రూ.20 వేలు చెల్లించి ఉద్యోగ భద్రత, హెచ్ఆర్ పాలసీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ రూ. 20లక్షలు వర్తింపచేయాలని కోరారు. గ్రేడింగ్ విధానం తీసివేసి జీఓ 58ని సవరించాలన్నారు. ప్రతి గ్రామ సంఘానికి ట్యాబ్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. ఈ నెల 18లోపు ప్రభుత్వం వీఓఏల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శశిరేఖ, రాజు, సామేల్, స్వాతి, లావణ్య, జ్యోతి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి యేసు -
ఒక్కో బస్తాపై రూ.175 నుంచి రూ.400 వరకు పెంపు
● పెరగనున్న పెట్టుబడి వ్యయం ● జిల్లా రైతులపై రూ.4 కోట్లపైచిలుకు భారంఎరువుల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో బస్తాపై రూ.175 నుంచి రూ. 400 వరకు పెరిగింది. కొత్త ధరలను ఇప్పటికే సదరు కంపెనీలు డీలర్లకు పంపించినట్లు తెలిసింది. దీంతో జిల్లాలోని లక్షలాది మంది రైతులపై అదనపు భారం పడనుంది. ఓ వైపు చీడపీడలు.. మరోవైపు అనుకూలించని వాతావరణంతో సతమతమవుతున్న కర్షకులకు ఎరువుల ధరల పెంపు గుదిబండగా మారనుంది. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలంలో 3.95 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ తెలిపింది. ఇందుకోసం అన్నిరకాల ఎరువులు 62,215 మెట్రిక్ టన్నుల అవసరం అవుతాయని అంచనా వేసింది. కాగా జిల్లాలో యూరియా, డీఏపీ, పొటాషియం, కాంప్లెక్, సింగిల్ సూపర్ పాస్పేట్ (ఎస్ఎస్పీ) పొటాష్ ఎరువులను రైతులు ఎక్కువగా వాడుతారు. కాగా వీటిలో యూరియా, డీఏపీ తప్ప మిగితా ఎరువుల ధరలన్నీ పెరిగాయి. దీంతో జిల్లా రైతాంగంపై సుమారు రూ.4 కోట్ల పైచిలుకు అదనపు భారం పడనుంది. మూలిగే నక్కపై తాటి పండు ఎరువుల ధరలను అమాంతం పెంచటంతో అన్నదాతల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు పంట చేతికందే సమయంలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన పంటలకు నేటికీ పరిహారం అందలేదు. కాగా ఈ ఖరీఫ్లోనైనా పంటలు పండించి గతేడాది నష్టాన్ని కొంతమేర పూడ్చుకుందామనుకునే రైతులకు పెరిగిన ఎరువుల ధరలు మరింత భారం కానున్నాయి. పాత నిల్వలకు కొత్త ధరలు! పెరిగిన ఎరువుల ధరలు రైతుకు పుండుపై కారం చల్లినట్లు అవుతుంటే, డీలర్లు, విక్రయదారులకు మాత్రం కాసులు కురిపించే విధంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. పాత నిల్వలను దాచేసి పెరిగిన ధరను క్రోడీకరించి రైతులకు అంటగడుతున్నట్లు తెలిసింది. పెరిగిన కొత్త ధరలకే విక్రయాలు జరుపుతున్నారని, పాత నిల్వలు లేవని చెబుతున్నట్లు సమాచారం.పెరిగిన ధరలు ఇలా.. ఎరువు రకం బస్తా పాత ధర కొత్తదికాంప్లెక్స్ (20–20–13) రూ.1,500 రూ.1,800 కాంప్లెక్స్ (16–20–13) రూ.1,400 రూ.1,750 అమ్మోనియా రూ.1,000 రూ.1,400 పొటాష్ రూ.1,800 రూ.1,975 -
నర్సారెడ్డిపై పీసీసీ చీఫ్కు ఫిర్యాదు
తూప్రాన్: వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామక ంలో కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి తూంకుంట నర్సారెడ్డి అవినీతికి పాల్పడినట్లు మండల కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బుధవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని విస్మరించి ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారికి కమిటీలో పదవులు కల్పించారని వివరించారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలతో విసిగిపోయి తాము సామూహిక రాజీనామాలకు సిద్ధ పడుతున్నట్లు చెప్పారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని పీసీసీ చీఫ్ సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి శశిభూషణ్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అప్సర్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగరాజు, మండల ఉపాధ్యక్షుడు సురేశ్, ఎన్ఎస్యూఐ నాయకులు అజయ్ తదితరులు ఉన్నారు. -
రైతుల ఇబ్బందులపై మంత్రి సీరియస్
కోహెడరూరల్(హుస్నాబాద్): ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని, క్షేత్ర స్థాయిలో సమస్యలను వెంటనే ఎందుకు పరిష్కరించడంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని బస్వాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు లేకపోవడం, కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తక్షణమే స్పందించిన మంత్రి అక్కడికక్కడే కలెక్టర్ హైమవతికి ఫోన్ చేసి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రైతులు గంటల తరబడి వేచి చూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం సన్న రకానికి ఇచ్చే రూ.500 బోనస్, సాధారణ రకానికి కనీస మద్దతు ధర రైతులకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సీజన్లో పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయడామే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించవద్దని మంత్రి పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరిగినా.. రైతులకు సౌకర్యాలకల్పనలో లోపాలున్నా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సంబంధిత అధికారులను హెచ్చరించారు. -
వైద్యశాఖలో 18 వేల ఉద్యోగాలు భర్తీ
నారాయణఖేడ్: మల్టీపర్పస్ ఏఎన్ఎం, నర్సింగ్ అధికారుల పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు వైద్య, ఆరోగ్య శాఖలో 18 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖేడ్లో రూ. కోటితో నిర్మించిన బాలసదనం భవనాన్ని ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిలతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్య, మహిళా సాధికారితకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు భవనాలను నిర్మించి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తామని చెప్పారు. బాలసదనం బాలికలతో మంత్రి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆర్వోప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ఖేడ్లో బాలసదనం ఏర్పాటు చేసినా స్వంత భవనం లేక పడుతున్న ఇబ్బందులు పక్కా భవనం నిర్మాణంతో తీరనుందన్నారు. మహిళా, శిశు సంక్షేమం, విద్య, వైద్యంకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్రీప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను ప్రొత్సహిస్తున్నట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కార్, డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి పాల్గొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ త్వరలో మల్టీపర్పస్ ఏఎన్ఎం ఫలితాలు -
● కుస్తీమే సవాల్
బొడ్మట్పల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. కొబ్బరికాయ కుస్తీ మొదలుకొని కడియం కుస్తీ వరకు పోటీలు ఆకట్టుకున్నాయి. పోటీలలో ఇద్దరిపై మహారాష్ట్ర ఉద్గిర్కు చెందిన ధీరజ్ గెలుపొందడంతో గ్రామస్తుడు సంగయ్య సహకారంతో చేయించిన ఆరు తులాల వెండి కడియాన్ని విజేతకు బహుమతిగా అందించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. – టేక్మాల్(మెదక్)తలపడుతున్న మల్లయోధులు -
బ్యాంకుల్లో భద్రతపై దృష్టి పెట్టండి
మెదక్జోన్: బ్యాంకుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని బ్యాంకు అధికారులు, గోల్డ్లోన్ సంస్థల మేనేజర్లతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ అల్లారం సిస్టమ్స్, మెటల్ డిటెక్టర్లు అమర్చాలన్నారు. బ్యాంకుల్లో భద్రతా లోపాలను గుర్తించేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను తప్పనిసరిగా నియమించుకోవాలని ఆదేశించారు. పనిచేయని సీసీటీవీలను ఎప్పటికప్పుడు బాగు చేయించి, అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలని వివరించారు. సైబర్ నేరాలపై కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్గౌడ్, సీఐలు సందీప్రెడ్డి, కృష్ణమూర్తి, బ్యాంక్ మేనేజర్ల్ పాల్గొన్నారు.ఎస్పీ శ్రీనివాస్రావు -
సేంద్రియ వ్యవసాయమే మేలు
నర్సాపూర్ రూరల్: రసాయన ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించి, సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి రైతులకు సూచించారు. బుధవారం నర్సాపూర్ మార్కెట్ కమిటీలో నిర్వహించిన రైతు వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు నిరంతరం వరి పంటలు సాగు చేస్తూ, మోతాదుకు మించి యూరియా వాడుతున్నారని తెలిపారు. దీంతో భూసారం పూర్తిగా కోల్పోతుందన్నారు. పంట మార్పిడితో పాటు సేంద్రియ ఎరువులను వాడితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉందన్నారు. బ్యాంకులు, సహకార సంఘాలు అందించే రుణాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి రైతు మట్టి పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, ఆయా బ్యాంకుల మేనేజర్లు, రైతులు పాల్గొన్నారు.రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి -
నిబంధనలు తప్పనిసరి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో పనిచేస్తున్న ఔట్ సో ర్సింగ్ ఏజెన్సీలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్రమంగా జీతాలు ఇవ్వడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి ఇతర సౌకర్యాలు తప్పకుండా అందించాలన్నారు. సౌకర్యాలు కల్పించని ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టి వేరే ఏజెన్సీలకు అందిస్తామన్నారు. వారి పనితీరును ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా ఉపాధి కల్పన అధికారి రామరాజు, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి హేమభార్గవి, లేబర్ ఆఫీసర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.రైతు సంక్షేమ ప్రభుత్వం రామాయంపేట(మెదక్): రైతుల సంక్షేమ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించి అధికారులు రైతులకు తగిన సూచనలు, సలాహాలు ఇవ్వాలన్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్ పర్స న్ నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, రవి నాయక్, స్వప్న, ప్రవీణ్, శ్యామల, యార్డు కార్యదర్శి ఈశ్వర్, పీఏసీఎస్ సీఈఓ నర్సింలు, వ్యవసాయ అధికారులు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు స్వామి పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది రానీయొద్దు తూప్రాన్: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇ బ్బందులకు రానీయొద్దని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో కేంద్రాల నిర్వాహకులు, రైస్మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వడ్ల కొనుగోలులో తూకం సుమారు బ్యాగుకు 40 కిలోల 600 గ్రాములు ఉండేటట్లు చూడాలని ఆదేశించారు. తూకం జరిగిన ధాన్యాన్ని ట్యాబ్లో నమోదు చేయాలన్నారు. ధాన్యం త్వరగా ఖాళీ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని రైస్మిల్లర్లకు సూచించారు. కష్టజీవుల ఆట పాట చిన్నశంకరంపేట(మెదక్): ఉపాధి హామీ డబ్బు లు కూలీల ఖాతాల్లో జమయ్యాయి. ఇంకేముం ది సంతోషంతో తలా ఇన్ని డబ్బులు పోగుచేసుకొని పని ప్రదేశంలో విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆట పాటలతో కూలీలు సందడి చేశారు. చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట గ్రామంలో బుధవారం జరిగిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఇందిరానగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు జాతీయ స్థాయి గోల్ షాట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు గోల్ షాట్బాల్ సెక్రటరీ మహేష్ బుధవారం తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 9 నుంచి 11వరకు జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో క్రీడాకారులు అక్షయ, అర్చన, కృపారాణి పాల్గొంటారన్నారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులను పీడీ సుజాత తదితరులు అభినందనలు తెలిపారు. -
భూ భారతిలో యూజర్ బాదుడు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/నిజాంపేట (మెదక్): భూభారతిలో కొత్తగా యూజర్ చార్జీల బాదుడు షురూవైంది. గతంలో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్కు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే యూజర్ చార్జీలు వసూలు చేసేవారు కాదు. అయితే బుధవారం నుంచి ప్రతీ స్లాట్ బుకింగ్పై రూ.500 చొప్పున యూజర్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ చార్జీలు చెల్లిస్తేనే స్లాట్ బుక్ అవుతోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ప్రభుత్వం యూజర్ చార్జీలు వసూలు చేయడమేమిటని రైతులు వాపోతున్నారు. ఇప్పటివరకు వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్లాట్ బుకింగ్ సమయంలో ఆ భూమి రిజిస్ట్రేషన్ విలువను బట్టి స్టాంప్ డ్యూటీ, మ్యూటేషన్ చార్జీలు, పట్టాదారు పాసుపుస్తకం (కొరియర్ చార్జీలతో కలిపి) ధర, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, హరిత నిధి కింద ఆయా మొత్తాలను వసూలు చేసేవారు. ఈ చార్జీలతో పాటు యూజర్ చార్జీల పేరుతో రూ.500 అదనంగా రశీదు జనరేట్ అవుతోంది. నిత్యం పది నుంచి 25 రిజిస్ట్రేషన్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన వాటితో కలిపి మొత్తం 75 మండలాలున్నాయి. ఒక్కో మండలంలో ప్రతీ రోజు సగటున పది నుంచి 25 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఈ లెక్కన ప్రతీ స్లాట్పై అదనంగా రూ.500 చొప్పున అదనపు చార్జీలు వసూలు చేయడంతో భూములు కొనుగోలు చేసే రైతులపై సుమారు రూ.3.75 లక్షల నుంచి రూ.9.37 లక్షల వరకు అదనపు భారం పడుతోంది.చార్జీల వసూలు తగదు నేను రెండురోజుల క్రితం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఎలాంటి ఈ యూజర్ చార్జీలు వసూలు చేయలేదు. మంగళవారం నాటికి స్లాట్ బుక్ చేసుకున్నా. కానీ తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ డౌన్ ఉందని చెప్పడంతో బుధ వారం కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లాను. అక్కడ సిబ్బంది మీసేవ కేంద్రానికి వెళ్లి రూ.500 చార్జీలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. మీసేవ కేంద్రానికి వెళ్లి చూసుకుంటే అందులో కొత్తగా యూజర్ చార్జీలు వేశారు. ముందు చెప్పకుండా రైతులపై భారం మోపడం సరికాదు. – రెడ్డి స్వామి, రైతు, నిజాంపేట, మెదక్ జిల్లా -
బాలల హక్కులను పరిరక్షించాలి
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీత ఉమ్మడి జిల్లా అధికారులతో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతమెదక్ కలెక్టరేట్: బాలల హక్కులను కాలరాస్తే సహించేది లేదని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీత హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాలల హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా కమిటీ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. చిన్నారులు మన సమాజానికి భవిష్యత్ అని, వారి శారీరక, మానసిక, భావోద్వేగ వికాసానికి అనుకూల వాతావరణం కల్పించడం అత్యవసరమన్నారు. మెదక్లోని మాతా శిశు కేంద్ర ఆస్పత్రిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని డాక్టర్ సునీతాదేవి చెప్పగా, వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అలాగే సిద్దిపేటలోని కేజీబీవీలో నెలకొన్న మరుగుదొడ్ల సమస్యను ఎందుకు పరిష్కరించలేదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, వారికి అందాల్సిన పరిహారం గురించి మీరేం చేస్తున్నారని ఉమ్మడి జిల్లా కార్మిక అధికారిని ప్రశ్నించారు. కాగితాల్లో చూసి చెప్పడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో బాలల రక్షణ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేలా సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యు లు వందనాగౌడ్, చందన, సరిత, అపర్ణ, అగర్వాల్, వచన్ కుమార్ సిద్దిపేట డీఆర్ఓ నాగరాజమ్మ. మెదక్ ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సిద్దిపేట అదనపు ఏసీసీ నర్సింలు, ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
బాలల హక్కులను పరిరక్షించాలి
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీత నర్సాపూర్/శివ్వంపేట/మెదక్ కలెక్టరేట్: బాలల సంరక్షణ కేంద్రాల పనితీరు మరింత మెరుగుపర్చాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీత సూచించారు. మంగళవారం కమిషన్ సభ్యులు వందనగౌడ్, చందన, అపర్ణ, వచన్ కుమార్లతో కలిసి పట్టణంలోని భవిత, వికాసం కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. శారీరక వైకల్యం కలిగిన చిన్నారిని చూసి ఆమె చలించారు. అధికారులతో మాట్లాడి చిన్నారికి ఆపరేషన్ చేయించాలని సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ నగేశ్తో పాటు పలువురు ఆయా శాఖల అధికారులు ఉన్నారు. అనంతరం శివ్వంపేట మండల పరిధిలోని మగ్ధుంపూర్ బేతాని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రం టిక్యా దేవమ్మగూడం తండా అంగన్వాడీ కేంద్రం, ఉసిరికపల్లిలోని ఇటుక బట్టిలను సందర్శించారు. చివరగా మెదక్ జిల్లా కేంద్రంలోని బాలసదన్ను సందర్శించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉన్నత విద్యా విధానం అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. -
ఆయిల్పామ్తో అధిక లాభాలు
మెదక్ కలెక్టరేట్: ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో ఉద్యానవన పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక రకాల సబ్సిడీలు ప్రకటిస్తుందన్నారు. ఆర్థిక, ఆధునిక సాంకేతిక రంగంలో నూతన పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచే దిశగా ముందుకు సాగుతుందన్నారు. ఆయిల్పామ్ సాగుతో పాటు ఆర్గానిక్ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కోరారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎప్పుడూ ఒకే రకమైన పంటలు సాగు చేయకుండా పంటల మార్పిడి చేయాలన్నారు. పండ్లు, కూరగాయలు, పూల సాగుతో పాటు ఆయిల్పామ్ పంటలు పండించడం ద్వారా అధిక లాభాలను అర్జించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్సింగ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు -
బండ్ల ఊరేగింపు భళా
బండ్ల ఊరేగింపులో భక్తులుబొడ్మట్పల్లి గుట్టపై వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రుడి జాతర వైభవంగా కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఉత్సవాల్లో భాగంగా బుధవారం కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్ తెలిపారు. – టేక్మాల్(మెదక్) -
మెదక్ డీఆర్వోగా అంబదాస్ రాజేశ్వర్
మెదక్ కలెక్టరేట్: మెదక్ డీఆర్వోగా అంబదాస్ రాజేశ్వ ర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సివిల్ సప్లై శాఖలో డిప్యూటీ కలెక్టర్గా డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. ఈమేరకు డీఆర్వోగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంబదాస్ 2003లో మెదక్ ఆర్డీఓగా పనిచేశారు. చిన్నశంకరంపేట(మెదక్): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం వెంట వెంటనే లారీల నుంచి దించుకునేలా హమాలీల సంఖ్యను పెంచుకోవాలని డీఎం జగదీశ్వర్, డీఎస్ఓ నిత్యానంద్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం నార్సింగి మండల కేంద్రంలోని రైస్మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రైస్ మిల్లుల వద్ద ధాన్యం లారీలు పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లారీలు నిలిచిపోతే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. వారి వెంట నార్సింగి తహసీల్దార్ గ్రేసిబాయి ఉన్నారు. నర్సాపూర్: ఉద్యాన పంటలు సాగు చేసి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. రైతు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంపుదల– ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ రామకృష్ణ, ఉద్యానవన ఏడీఏ అనిత, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వ్యవసాయాధికారి దీపిక తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం స్కూల్ ఆఫ్ సైన్స్ యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం ఈనెల 17న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 14వ తేదీలోగా విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చని స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా సూచించారు. ఇతర వివరాల కు హెల్ప్లైన్ 8884984000 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
నిధులు రాక.. పనులు కదలక!
మున్సిపాలిటీల్లో నిలిచిన ప్రగతి తూప్రాన్: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఆరు నెలలు దాటినా ముందుకు సాగకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిధులు మంజూరు చేసింది. వీటితో అంతర్గత రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు మున్సిపల్ ఎన్నికల ముందు హడావుడిగా ఆయా వార్డుల్లో రోడ్లను తవ్వారు. డ్రైనేజీ పనులు చేపట్టారు. ఇందులో కొన్ని నిర్మాణాలు పూర్తి కాగా, మరికొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. రాజకీయ లబ్ధి కోసమేనా! రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా మున్సిపాలిటీల్లో పనులు చేపట్టిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. తూప్రాన్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కై వసం చేసుకోవడంతో పనులు మధ్యలోనే నిలిపివేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మున్సిపాలిటీకి మంజూరైన రూ.15 కోట్ల నిధులలో రూ.8 కోట్ల వరకు టెండర్లు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని పనులకు టెండర్లు పూర్తి అయినప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో సదరు కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపివేశారు.ఫలితంగా ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం అధికారులు స్పందించి అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. త్వరలోనే ప్రారంభిస్తాంమున్సిపాలిటీకి ప్రభుత్వం పట్టణ అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 16 వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభించాం. సదరు కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించడంలో జాప్యం నెలకొంది. త్వరలోనే పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటాం. – గణేశ్రెడ్డి, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ -
గట్టి భద్రతా ఏర్పాట్లు చేసుకోండి
తూప్రాన్: జ్యువెలరీ షాపుల యజమానులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా దొంగతనాలను అరికట్టవచ్చని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో బంగారం షాపుల యజమానులు, పాన్ బ్రోకర్లు, గోల్డ్ వ్యాపారులు, బ్యాంకు అధికారులకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల చోటుచేసుకుంటున్న దొంగతనాలు, దోపిడీలు, మోసాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక భద్రతా చర్యలు అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాలు హై క్వాలిటీతో ఏర్పాటు చేసి, నిరంతర రికార్డింగ్, బ్యాకప్ ఉండేలా చూడాలన్నారు. అలాగే అలారం సిస్టమ్, సేఫ్టీ లాకర్స్ వినియోగం పెంచాలన్నారు. ముఖ్యంగా దుకాణాల్లోకి వచ్చే కస్టమర్ల వివరాలను నమోదు చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ రంగకృష్ణ, ఇతర పోలీస్ అధికారుల పాల్గొన్నారు. బంగారం వ్యాపారులకు ఏఎస్పీ సూచన -
మళ్లీ ఎల్ఆర్ఎస్
జూలై 31వ తేదీ వరకు అవకాశంఎల్ఆర్ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం) కు ప్రభుత్వం మరోసారి పచ్చజెండా ఊపింది. ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం జూలై 31 వరకు గడువు విధించింది. గతేడాది 2025 జూన్లో సైతం అవకాశం ఇవ్వగా, కొంతమంది మాత్రమే ముందుకు వచ్చారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని నోటీసులు జారీ చేసిన వారిలో 10,050 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. – మెదక్జోన్ జిల్లాలో మెదక్, నార్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 14,818 మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఏడాదిన్నర కిత్రం ప్రభుత్వం క్రమబద్ధీకరణకు నెలరోజుల పాటు గడువు ఇచ్చింది. లబ్ధిదారుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సక్రమంగా ఉంటేనే క్రమబద్ధీకరించాలని మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. దీంతో అధికారులు నాలుగు బల్దియాల పరిధిలో సక్రమంగా లేని 1,382 దరఖాస్తులను తిరస్కరించారు. మిగితా 13,436 సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు. కానీ వారిలో కేవలం 4,768 మంది మాత్రమే ముందుకొచ్చి రూ.13.7 కోట్లు ఫీజుల రూపంలో చెల్లించారు. ఇంకా 8,668 మంది ఫీజు కట్టాల్సి ఉంది. కాగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం అనుమానంగా కన్పిస్తోంది. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు చేసి ఇప్పటి ఆరేళ్లు కావొస్తుండటంతో ప్లాట్లు చేతులు మారాయి. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ పలువురు ప్లాట్లను అర్థిక అవసరాల నిమిత్తం విక్రయించుకున్నారు. ఇలా కొన్ని ప్లాట్లు ఐదుగురు నుంచి ఆరుగురికి చేతులు మారాయి. దీంతో దరఖాస్తు చేసిన వ్యక్తి ప్రస్తుతం ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తికి తెలియదు. దీంతో ఎల్ఆర్ఎస్ సమాచారం అందరికీ చేరడం లేదు. దరఖాస్తు చేసే సమయంలో ఫోన్ నంబర్లను సైతం అప్లోడ్ చేశారు. అలాగే కొందరి ఫోన్ నంబర్లు పని చేయకపోవడంతో ఫీజు చెల్లింపు సమాచారం చేరడం లేదు. జిల్లాలోని 4 బల్దియాల్లో 14,818 దరఖాస్తులు ఫీజు చెల్లించింది 4,768 మంది మాత్రమే మరోసారి 25 శాతం రాయితీ ముందుకొచ్చే వారెందరో? అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మూడు నెలల పాటు అవకాశం ఇచ్చింది. చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనునట్లు బల్దియా అధికారులు ప్రకటించారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. మరి ఈసారి ఎంతమంది ముందుకొచ్చి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తారో వేచి చూడాలి. -
పాత వారికే సహకారం
● కొత్త కమిటీలను ఎన్నుకునే వరకు వీరే.. ● సహకార శాఖ ఉత్తర్వులు నేడు బాధ్యతలు స్వీకరించనున్న పాత పాలకవర్గాలుచిన్నశంకరంపేట(మెదక్): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మళ్లీ పాత పాలకవర్గాలే కొనసాగనున్నాయి. వారినే యథావిధిగా కొ నసాగించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈనేపథ్యంలో పాలకవర్గా లు బాధ్యతలు చేపట్టాలని ప్రభు త్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సహకార సంఘాలకు నామినేటేడ్ లేదా ఎన్నికల ద్వారా కొత్త కమిటీలను ఎన్నుకునే వరకు పాత కమిటీలనే కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. జిల్లాలో 35 సొసైటీలు జిల్లాలోని 35 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు మరో ఫార్మర్ సొసైటీ బాధ్యతలను పాత పాలకవర్గాలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని పీఏసీఎస్ చైర్మన్లు బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సహకార శాఖ అధికారి కార్యాలయలంలో పీఏసీఎస్ సీఈఓల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పాత పాలకవర్గాలకు బాధ్యతలు అప్పగించాలని డీసీఓ కరుణాకర్ సూచించారు. గత నవంబర్ నుంచి.. సొసైటీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో మెదట ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. కొత్త కమిటీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఇంకో 3 నెలలకు పైగా వారే కొనసాగారు. ఆరు సంవత్సరాల పాటు ఉన్న పాత పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేస్తూ 2025 నవంబర్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాత పాలకవర్గాలు హై కో ర్టును ఆశ్రయించాయి. తాజాగా హైకోర్టు పాత పాలకవర్గాలను కొత్త కమిటీలు నియామకం అయ్యే వరకు కొనసాగించాలని తీర్పునిచ్చింది. ఆరు నెలల పాటు మాజీలుగా ఉన్న వారు కో ర్టు తీర్పుతో తాజాగా పాత పదవుల్లోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ప్రత్యామ్నాయ పంటలు మేలు
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో వరి ఎక్కువగా సాగు చేస్తున్నారని, ఒకే పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలైన కూరగాయలు, పూలు ఇతర పంటలను రైతులు సాగు చేయాలన్నారు. మెదక్ జిల్లా హైదరాబాద్కు దగ్గరగా ఉన్నందున మార్కెట్ చేసుకోవడానికి సులభంగా ఉంటుందని చెప్పారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని సూచించారు. అనంతరం డీఏఓ దేవ్కుమార్ మాట్లాడుతూ.. ప్రతి రైతు మట్టి పరీక్షలు చేయించాలన్నారు. దీంతో ఎరువుల వినయోగం, ఖర్చు తగ్గుతుందన్నారు. విత్తనాల ఎంపిక కీలకమని, మొలకశాతం పరీక్షించి పంట సాగు చేయాలని పేర్కొన్నారు. అనంతరం రైతులకు భూసార పరీక్షల సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీజేటీఏయూ శాస్త్రవేత్తలు అనీత, కార్తీక్, ఏడీఏ పుణ్యవతి, ఏఓ స్వప్న, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్ చంద్రం కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సరిహద్దు సమస్యలు పరిష్కరించాలి మెదక్ కలెక్టరేట్: రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లో వివిధశాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో లోడింగ్, ఆన్లోడింగ్ పక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే వేసవిలో తాగు నీటి సమస్య రాకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఆరా తీశారు. సాదా బైనామాల సమస్యలు పరిశీలించాలని, జనగణన ప్రక్రియలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
తక్షణ పరిష్కారం చూపండి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించి, ఫిర్యాదుదారులకు సమాచారం ఇవ్వాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో వస్తారని, వారు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలించి తక్షణ సాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణికి మొ త్తం 45 దరఖాస్తులు రాగా, ఇందులో భూ భారతి 15, పెన్షన్లు 15, ఇతర సమస్యలపై మరో 15 దరఖాస్తులు వచ్చాయి. అలాగే జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయాల్లోనూ డివిజన్ స్థాయి ప్రజావాణి నిర్వహించినా, ప్రజల నుంచి ఆదరణ కనిపించలేదు. మెదక్లో 9, తూప్రాన్ 2, నర్సాపూర్ 2 వినతులు వచ్చినట్లు అధికారులు చెప్పారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
నేరుగా సంప్రదించాలి
మెదక్జోన్: ప్రజావాణి ఫిర్యాదులపై సత్వర పరిష్కారం చూపాలని ఎస్పీ శ్రీనివాసరావు పో లీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం నేరుగా సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ పోలీస్శాఖ అందుబాటులో ఉంటుందన్నారు. ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా సంప్రదించాలని సూచించారు. ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. ఆరుతడి పంటలు వేయాలినర్సాపూర్ రూరల్: రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని నర్సాపూర్ వ్యవసాయశాఖ ఏడీ సంధ్యారాణి సూచించారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం మండలంలోని లింగాపూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు ఏటా పంట మార్పిడి చేయడంతో పాటు సేంద్రియ ఎరువులతో ఆరుతడి పంటలు సాగు చేసుకొని, మంచి దిగుబడులు సాధించాలన్నారు. నాణ్యమైన విత్తనాలు, సౌర విద్యుత్, వ్యవసాయ యాంత్రీకరణ వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ దుర్గా ప్రసాద్, లింగాపూర్ క్లస్టర్ రైతులు పాల్గొన్నారు. బీజేపీ శ్రేణుల సంబరాలు నర్సాపూర్: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పట్టణంలో సోమవారం ఆపార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సురేశ్, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్, నాయకులు చంద్రయ్య, రాణి, పద్మ తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యం మెదక్ కలెక్టరేట్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికే మొదటి ప్రాధాన్యం ఇస్తుందని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్ అన్నారు. సోమవారం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పట్టణంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనందిస్తుందని తెలిపారు. అందులో భాగంగానే రైతు భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్, పంటల రుణమాఫీ వంటి పథకాలు అమలు చేసిందన్నారు. రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని రైతు వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురికి సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. 6న జాబ్ మేళా -
అటకెక్కిన ‘ఆలన’
● రోగులకు దక్కని వైద్య సేవలు ● మూణ్నాళ్ల ముచ్చటగా మారిన పథకం ● తుప్పు పడుతున్న వాహనాలురామాయంపేట(మెదక్): ఆలన.. నిరాధరణకు గురై మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులకు ఇంటి వద్దే వైద్యసేవలు అందించడానికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బృహత్తర పథకం. జిల్లాలోనే మొట్టమెదటిగా తూప్రాన్ డివిజన్ నుంచి శ్రీకారం చుట్టారు. కొన్నాళ్లు సాఫీగానే సాగిన పథకం ఉన్నట్టుండి రద్దు అయింది. అప్పటి నుంచి నిరుపేద వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. తొలి ప్రాజెక్టుకు ఆటంకాలు ఆలన పథకానికి సంబంధించి గత ప్రభుత్వం మొదటి విడతగా 12 జిల్లాలను ఎంపిక చేసింది. ఇందులో మెదక్ జిల్లా ఒకటి. ఈపథకం కింద జిల్లాలో నార్సింగి, తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాలను చేర్చారు. వీటి పరిధిలో వైద్య సిబ్బంది సర్వే నిర్వహించి నిరాశ్రయులైన 660 మంది వ్యాధిగ్రస్తులు గుర్తించారు. వారికి వైద్య సేవలు అందించడానికి గాను జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్ ఏరియాలకు ఒక్కో వాహనం చొప్పున కేటాయించారు. డాక్టర్, ఇతర సిబ్బందిని సైతం నియమించారు. తూప్రాన్లో వాహనాన్ని అప్పటి డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కొన్నాళ్ల పాటు ఈ పథకం సాఫీగానే సాగగా, ఇంటి వద్దే ఉంటున్న నిరుపేదలైన వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందాయి.నిధుల కొరతదగ్గరి వారి ఆదరణకు నోచుకోక నిరాశ్రయులైన వ్యాధిగ్రస్తులను ఈ పథకం కింద గుర్తించి కొన్నినెలల పాటు వైద్యసేవలు అందించారు. ప్రతి రోజు కనీసం 15 మంది రోగుల ఇళ్లకు వైద్య సిబ్బంది నేరుగా వెళ్లి వారికి మందులతో పాటు వైద్య సేవలు అందించారు. రాను రాను ఈ పథకానికి ఆదరణ తగ్గింది. నిధులు మంజూరు కాకపోవడం, జిల్లాలో తగినంత సిబ్బంది లేకపోవడంతో పథకాన్ని నిలిపివేశారు. ఇందుకోసం కేటాయించిన వాహనాలను అలాగే వదిలేయడంతో తప్పుపట్టి చెడిపోయాయి. ఇదే విషయమై తూప్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్చార్జి సూపరింటెండెంట్ అమర్సింగ్ను వివరణ కోరగా.. ఆలన పథకం రద్దు అయిందని తెలిపారు. ప్రభుత్వం పునరుద్ధరిస్తే సేవలు కొనసాగిస్తామన్నారు. -
లారీలు రాక.. ధాన్యం కదలక
హవేళిఘణాపూర్(మెదక్): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు రోజు కేంద్రాలను తనిఖీ చేస్తూ నిర్వాహకులకు చెబుతున్నారు. కానీ కాంటా పూర్తయిన తర్వాత బస్తాలను మిల్లులకు తరలించడానికి లారీలు పంపించడంతో శ్రద్ధ చూపడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోంది. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో కొన్ని చోట్ల హమాలీలు ధాన్యం కాంటా వేసినా లారీలు రాక రైతులు ఎదురుచూస్తున్నారు. మరికొన్ని చోట్ల హమాలీలు లేక కాంటా సాగడం లేదు. అకాల వర్షాలు భయపెడుతుండటంతో రైతులు ఏం చేయాలో తోచక అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. సకాలంలో అధికారులు స్పందించి సరైన సమయంలో ధాన్యం తరలించేలా చూడాలని వేడుకుంటున్నారు. -
మండే ఎండ.. జాగ్రత్తే అండ
తూప్రాన్: జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక వేడి, ఉక్కపోతకు జిల్లావాసులు అల్లాడిపోతున్నారు. రోజూ 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతు న్నారు. ముఖ్యంగా చిన్నారులతో పాటు వృద్ధులపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రతకు శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. రోజూ సుమారు 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలని చెబుతున్నారు. ఇవి తప్పనిసరి వేసవిలో డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. కనుక అధికంగా కొబ్బరి బొండం తాగడం శ్రేయస్కరం. వీటితో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీతో పాటు కళ్లజోడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. మహిళలు గొడుగులు తప్పనిసరిగా ఉపయోగించాలి. కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఆహార నియమాలు నాన్వెజ్ కంటే పప్పు, కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. దోస, కీరదోస తింటే మంచిది. వేపుడు కూరలకు స్వస్తి పలికి, పులుసులకు ప్రాధాన్యం ఇవ్వాలి. సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కాహాల్కు దూరంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి ఎండలో ఎక్కువగా తిరిగితే వడదెబ్బ సోకుతుంది. తలనొప్పి, జ్వరం, వాంతులు, కండరాల నొప్పులు ఎక్కువ గా ఉంటాయి. ఎండ ప్రభావం మెదడుపై పడి శరీరంలోని ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయి. దీంతో కోమాలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి. – అమర్సింగ్, సీహెచ్సీ సూపరింటెండెంట్ -
లాస్లో ‘ఆర్టీసీ’
ఉమ్మడి జిల్లాలో రూ.32 కోట్ల మేర నష్టాలు ● రెండు డిపోల పరిధిలో అత్యధికం ● అధికారుల దిద్దు‘బాట’మెదక్ కలెక్టరేట్: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ సంస్థ లాస్లో నడుస్తోంది. గత ఫిబ్రవరి వరకు రూ.32 కోట్ల మేర నష్టాల్లో ఉంది. సంగారెడ్డి, నారాయణ్ఖేడ్ డిపోల పరిధిలో నష్టం అత్యధికంగా ఉంది. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఏడాదికి రూ. 300 కో ట్లు కేంద్ర ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నప్పటికీ గట్టెక్కడం లేదు. ప్రతి కిలోమీటర్కు రూ.62 రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ. 57.52 మాత్రమే వస్తున్నాయి. అలాగే డ్రైవర్లు, కండక్టర్లు సరిపోను లేకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పడుతోంది. ఫలితంగా వారు సెలవులు పెడుతున్నారు. దీంతో కొన్ని రూట్లలో బస్సులను నడపడం లేదు. ఆదా యం వచ్చే మార్గాలపైన అధికారులు దృష్టి పెట్టడం లేదు. దీంతో సంస్థకు నష్టాలు వస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆర్టీసీ సంస్థ లాస్లో నడుస్తుంది. ఉమ్మడి జిల్లాలో మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట కలిపి మొత్తం 9 డిపోలు ఉన్నాయి. సమ్మర్ టూర్లు.. తీర్థయాత్రలు ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వేసవిలో ప్రయాణికులకు ఆహ్లాదం, ఆధ్యాత్మికత కోసం టూర్లకు వెళ్తుంటారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సైతం సమ్మర్ టూర్లో మెదక్ జిల్లాలోని ఏడుపాయల, ఖిల్లా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్ఐ చర్చి, పోచారం అభయారణ్యం లాంటి ప్రదేశాలు చూపించాలని భావిస్తున్నారు. అలాగే భక్తుల కోసం ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది సైతం ఈ ప్రణాళిక కొనసాగింది. ఈ ఏడాది సైతం అరుణాచలం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, వేములవాడ, రామప్ప ఆలయం తదితర ఆలయాలకు సమ్మర్లో ప్రత్యేక ప్యాకేజీలతో సిద్ధం చేస్తున్నారు. -
వారంలో ఒకరోజు పర్యటిస్తా: మంత్రి
జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సిపాలిటీకి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సంగారెడ్డిలోని మంత్రి స్వగృహంలో కలిశారు. వారితో మంత్రి కొద్దిసేపు మాట్లాడారు. నెలలో ఒక వారం పర్యటించేలా ప్రణాళికను తయారు చేసుకుంటానని చెప్పారు. పట్టణంలో 500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్ని నిర్మించారని మున్సిపల్ కమిషనర్ రవీందర్ను మంత్రి ప్రశ్నించగా.. 230 ఆన్లైన్ అయ్యాయని, మరో 140 ఆన్లైన్ సమస్యలు ఉన్నాయని కమిషనర్ వివరించారు. అజ్జమర్రి–జోగిపేట బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించాలని, ఈ పనులు పూర్తయినట్లయితే సుమారుగా 23 గ్రామాల ప్రజలు జోగిపేటకు వివిధ పనుల నిమిత్తం వచ్చే అవకాశం ఉంటుందని దీనివల్ల వ్యాపారాలు పెరిగి, స్థానిక వ్యాపారులకు జీవనోపాధి లభించనుందని మంత్రి తెలిపారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ రికార్డు స్థాయిలో జరిగింది. ప్రభుత్వం వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ సన్న బియాన్ని లబ్ధిదారులకు విజయవంతంగా అందించింది. గతంలో నెల వారీ పంపిణీలో ఎన్నడూ 88శాతానికి మించని రేషన్ ఈ సారి ఒకే నెలలో మూడు నెలల కోటాను 90.84శాతం పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. మళ్లీ రేషన్ బియాన్ని జూలైలోనే పంపిణీ చేయనున్నారు. – సాక్షి, సిద్దిపేట -
పకడ్బందీగా రైతు వారోత్సవాలు
మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి జిల్లాలో నిర్వహించే వ్యవసాయ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ వారోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు షెడ్యూల్ వారీగా వ్యవ సాయ అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. జనగణనకు సంబంధించి సమర్థ నిర్వహణకు తగు సూచనలు సలహాలు అ ందించారు. డివిజన్ స్థాయిలో జరిగే ప్రజావాణికి తప్పనిసరిగా హాజరై, ప్రజల వినతులను స్వీకరించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి, ప్రతి వినతికి ప్రత్యేక ధ్రువీకరణ నంబర్ కేటాయించాలన్నారు. ఫిర్యాదులను 30 రోజుల్లోపు పరిష్కరించి, తీసుకున్న చర్యల నివేదికలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిని ఆన్లైన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
‘నీట్’గా రాశారు
తనిఖీలు నిర్వహి స్తున్న సిబ్బందిమెదక్జోన్: వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్ష కొనసాగింది. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అభ్యర్థులను మధ్యాహ్నం 1.30 గంటల వరకు లోనికి అనుమతించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 479 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 465 మంది హాజరయ్యారు. ఇందులో ముగ్గురు బాలికలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి రావటంతో లోనికి అనుమతించలేదు. మరో 11 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో ఏకై క పరీక్ష కేంద్రం కావటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్ నగేశ్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. -
సమష్టి కృషితోనే 22 అవార్డులు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, పారిశుద్ధ్య కార్మికుల సమష్టి కృషితోనే, సిద్దిపేట మున్సిపాలిటీకి 22 అవార్డులు వచ్చాయని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నర్సాపూర్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సరిత, రాములు ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, దుస్తుల పంపిణీ, పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణం పచ్చదనం, పరిశుభ్రంగా ఉండటానికి పారిశుద్ధ్య కార్మికుల కృషి వెలకట్టలేనిదన్నారు. బెల్లె సరిత ఉద్యోగం సాధించిన తర్వాత తన మొదటి జీతంతో మంచి పని చేయాలనే సంకల్పం గొప్పదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ చంద్రం, రాములు, ఎల్లయ్య, నర్సింహులు, సతీశ్, శ్రీహరి పాల్గొన్నారు.ఎమ్మెల్యే హరీశ్రావు -
ఏటా ఇవే తిప్పలు
పండించిన పంటను ఇబ్బందులు లేకు ండా అమ్ముకునేందుకు వీలు కల్పించాలి. వరి కోసిన నాటి నుంచి కామారెడ్డి జిల్లా లింగంపేట కొనుగోలు కేంద్రానికి వెళ్లి బతిమిలాడి లారీలు తీసుకురావాల్సి వస్తోంది. ఏటా ఇదే పునరావృతం అవుతోంది. ఇప్పటికై నా ఇబ్బందులు తీర్చాలి. – మల్లయ్య, రైతు, కొత్తపల్లి సమస్యను పరిష్కరించాలి జిల్లా సరిహద్దు కొత్తపల్లి శివారులో ఉన్న భూములు సాగు చేసుకోవడం తప్పా. కష్టపడి పండించిన పంటను అమ్ముకునే వీలు కల్పించని అధికారులు ఏం చేస్తున్నారు. ఎన్నోమార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – సాయిలు, కొత్తపల్లి -
కాంటా వేయరు.. వడ్లు కొనరు
‘తాము జిల్లా సరిహద్దులో ఉన్న భూములు సాగు చేసుకోవడం తప్పా..? ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఏటా నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఏ అధికారి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు’ అని మండలపరిధిలోని కొత్తపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండల పరిధిలో కొత్తపల్లికి చెందిన దాదాపు 400 ఎకరాల భూమి కామారెడ్డి పొల్కంపేట రెవెన్యూ పరిధిలో ఉంది. గతంలో ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో రైతులు ఏదో చోట అమ్ముకునేవారు. జిల్లా సరిహద్దులో ఉన్న వడ్లు తూకం వేస్తే 30 లారీల వరకు ధాన్యం తరలించాల్సి ఉంటుంది. దీంతో ఈ ధాన్యాన్ని తూకం చేయమని కామారెడ్డి అధికారులు చెబుతున్నారు. ఎక్కడ పండించారో అక్కడే తూకం వేసుకోవాలని సూచిస్తున్నారు. మెదక్లో అమ్ముకుందామంటే మీ స్వగ్రామం ఎక్కడో అక్కడే తూకం వేసుకోవాలని చెబుతున్నారు. దీంతో రైతులు ఏమీ తోచక ఆందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా జిల్లాలు ఏర్పడి ఆన్లైన్ కావడంతో ఏటా ధాన్యం అమ్ముకునే సమయానికి అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పోల్కంపేట, లింగంపేట కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను బతిమిలాడితే ప్రస్తుతం అరకొరగా ధాన్యం తూకం వేస్తున్నారని చెబుతున్నారు.సరిహద్దు సంకటం కామారెడ్డి జిల్లా పొల్కంపేట శివారు రైతుల ఆవేదన పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు -
ఆలయ అభివృద్ధికి కృషి
టేక్మాల్(మెదక్): భద్రకాళీ సమేత వీరభద్రుడి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని బొడ్మట్పల్లి గుట్టపై వెలసిన వీరభద్రుడి కల్యాణోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్, సర్పంచ్ అవినాష్, వైస్ చైర్మన్ ఈశ్వరప్పతో పాటు పలువురు సన్మానించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వీరభద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించారు. కాగా బోడ్మట్పల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి టాపర్గా నిలిచిన విద్యార్థిని వైష్ణవిని మంత్రి దామోదర సన్మానించి అభినందించారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలి కొల్చారం(నర్సాపూర్): రైతుల నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని తుక్కాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని, ధాన్యం రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా లోడింగ్, అన్ లోడింగ్ వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ రవీందర్, సీఈఓ నవీన్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, యువత అధ్యక్షుడు సంతోశ్రావు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీకొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. ఆదివారం వేకువజామున నుంచే పుష్కరణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు గంగరేణి చెట్టు వద్ద పట్నా లు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 7న మామిడి ఫలాల వేలంములుగు(గజ్వేల్): ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఈ నెల 7వ తేదీన మామిడి ఫలాలవేలం నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనేవారు పాటకు ముందుగానే రూ.5వేల నగదు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. వేలంలో నెగ్గిన వారు మొత్తంలో సగం డబ్బులను నగదుగా చెల్లించాలని, లేకుంటే అతని పాటను రద్దు చేసి రెండో వ్యక్తికి అనుమతిస్తా మని చెప్పారు. వేలంలో నెగ్గిన వారు మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాతనే పంట కోసేందుకు అనుమతిస్తామని చెప్పారు. మామిడి వేలం కాలపరిమితి జూన్ నెల 15 వరకు ముగుస్తుందన్నారు. -
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
గజ్వేల్: భగవన్నామ స్మరణతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహరావు పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని భగవాన్ శ్రీసత్యసాయిబాబా మందిరం ఆవరణలో ఆదివారం రాత్రి ‘సనాతన సారధి’ అనే అంశంపై మాట్లాడారు. భగవంతుడిని స్మరించడం వల్ల మానసికశాంతి లభిస్తుందని, ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న కార్యక్రమాలను పూర్తి చేసేవరకు ఆపవద్దన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహరావు -
చెరువులపై నజర్!
● సంరక్షణకు చర్యలు ప్రత్యేక కమిటీలు ● ఎఫ్టీఎల్ గుర్తింపునకు డిజిటల్ సర్వే ● జిల్లాలో మొదటి దశలో 606 చెరువుల గుర్తింపుచెరువుల సంరక్షణకు అధికారులు నడుం బిగించారు. నీటి మట్టం గుర్తించి హద్దుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. డిజిటల్ సర్వే నిర్వహించేందుకు రంగంలోకి దిగారు. జిల్లాలో ఇప్పటికే చెరువుల ఎప్టీఎల్ హద్దులను గుర్తించేందుకు మొదటి దశలో 606 నీటి వనరులను గుర్తించారు. ఒక్కో మండలంలో 30 చెరువుల వరకు సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంతో చెరువుల ఎఫ్టీఎల్ కబ్జాలకు తెరపడనుంది. – చిన్నశంకరంపేట(మెదక్) పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొందిన చిన్నశంకరంపేట, చేగుంట, మనోహరాబాద్, తూప్రాన్, నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు మెదక్, రామాయంపేట, చేగుంటతో పాటు పలు పట్టణాల్లో అక్రమంగా చెరువులు కబ్జా చేసి భవన నిర్మాణాలు చేపడుతున్న సంఘటనలు ఉన్నాయి. ముందుగా ఎఫ్టీఎల్ ప్రాంతంలో మట్టి నింపి తర్వాత నిర్మాణాలు చేపట్టిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈక్రమంలోనే అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం డిజిటల్ సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.పక్కాగా హద్దులు జిల్లాలో మొదటి దశలో గుర్తించిన 606 చెరువులకు డిజిటల్ సర్వే నిర్వహించేందుకు అధికారులతో కూడిన కమిటీలను నియమించారు. ఇందులో తహసీల్దార్, రెవెన్యూ సర్వేయర్, ఇరిగేషన్ ఏఈ, అటవీశాఖ అధికారులతో కూడిన కమిటీ చెరువులను పరిశీలిస్తుంది. ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న చెరువు నక్షతో పాటు గూగుల్ మ్యాప్ ఆధారంగా డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఎఫ్టీఎల్ను గురించి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే శాశ్వతంగా చెరిగిపోకుండా హద్దులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు.కబ్జాలను అరికట్టేందుకే.. చిన్ననీటి వనరులను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నాం. మండలస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా సర్వే చేసి ఎఫ్టీఎల్ హద్దులను ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా చెరువుల కబ్జాలను అరికడతాం. వర్షాకాలంలో చెరువులకు నీరు చేరే లోపే మొదటి దశలో 606 చెరువుల ఎఫ్టీఎల్ గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. – శ్రీనివాస్రావు, ఈఈ ఇరిగేషన్, మెదక్ -
జలం.. పాతాళం
మెదక్జోన్: జిల్లాలో భూగర్భజలాలు మరింత లోతుకు వెళ్లాయి. ఎండత తీవ్రత పెరగడంతో అంతే వేగంగా భూగర్భ జలమట్టం తగ్గిపోతోంది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఏకంగా 2.12 మీటర్ల లోతుకు పడిపోయాయి. మొత్తంగా 13.98 మీటర్లకు చేరగా, నార్సింగి మండలంలో ప్రమాదకరంగా 24.9 మీటర్ల లోతుకు నీటిమట్టం చేరుకుంది. రెండో స్థానంలో చిలప్చెడ్ మండలంలో 21.20 మీటర్లకు చేరుకుంది. మిగితా మండలాల్లో నిలకడగా ఉండగా, ఈ రెండు మండలాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ రెండు మండలాల్లో ౖపైపెనే.. జిల్లాలో వ్యవసాయ సాగు పనులు ముగిసినప్పటికీ భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. మార్చిలో 11.86 మీటర్ల లోతులో ఉండగా, నెలరోజుల వ్యవధిలో 2.12కు పడి పోయాయి. ఫిబ్రవరిలో 10.67 మీటర్లు ఉంది. అంటే రెండు నెలల్లోనే 3.31 మీటర్లకు నీటి మట్టం పడిపోయింది. సాధారణం కంటే ఎక్కువ గానే నీటి వనరులు పడిపోతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా హవేళిఘణాపూ ర్ మండలంలో 10.47 మీటర్లలో ౖపైపెనే ఉండగా, మనోహరాబాద్ మండలంలో సైతం 10.8 మీటర్లలోతులోనే ఉండటం గమనార్హం. గతేడాదితో పోలిస్తే నయం గతేడాదితో పోలిస్తే భూగర్భజలాలు కాస్త బెటర్గా ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్లో 15.85 మీటర్లలోతులో నీటిమట్టం ఉండగా, ప్రస్తుతం 13.98 మీటర్లలో ఉంది. ఈలెక్కన గతేడాది కంటే 1.87 మీటర్ల పైనే భూగర్భజలాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.జిల్లాలో చెప్పుకోదగిన సాగు నీటి వనరులు లేకపోవటంతో 90 శాతం మంది రైతులు బోరు బావులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాగా, వానాకాలంలో నీరంతా వృథాగా పోతుంది. ఆ నీటిని ఒడిసిపడితే భూగర్భజలాలు స్థిరంగా ఉంటాయని పలువురు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా ఇంకుడు గుంతలు, ప్రతి రైతు తన పొలంలో విధిగా పాంపండ్స్ నిర్మాణాలు విరివిగా చేపడితే భూగర్భజలాలు వేసవిలోనూ సమృద్ధిగా ఉంటాయి.వర్షం నీటిని ఒడిసిపడితేనే.. వేగంగా పడిపోతున్న భూగర్భజలం జిల్లావ్యాప్తంగా 13.98 మీటర్ల లోతులో నీటిమట్టం -
చెరువు.. పట్టింపు కరువు!
గతేడాది ఆగస్టు చివరి వారంలో కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా 179 చెరువులు, కుంటలు దెబ్బతిన్నాయి. నీటి కాల్వలు, చెక్డ్యాంలు కొట్టుకుపోయాయి. ఈక్రమంలో రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి రూ. 2.7 కోట్లతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. పర్మనెంట్ మరమ్మతుల కోసం ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. నెలరోజుల్లో వర్షాలు ప్రారంభం కానుండటంతో ఎప్పుడు మరమ్మతులు ఎప్పుడు చేస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు 2 వేల పైచిలుకు ఉన్నాయి. గతేడాది ఆగస్టు చివరివారంలో కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. ఫలితంగా 179 చెరువులు, కుంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో 139 నీటి వనరులకు చిన్నా, చితక నష్టం జరిగింది. దీంతో రూ. 2.7 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులతో వాటికి మరమ్మతులు చేశారు. మరో 40 పెద్ద చెరువులు, కాల్వలకు పర్మనెంట్ మరమ్మతులు చేస్తే తప్ప నీటిని ఆపలేమని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. ఇందుకోసం రూ.40 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే కేవలం ఆరు చెక్ డ్యాంలకు మాత్రమే రూ. 2.76 కోట్లు మంజూరు చేశారు. ఈ లెక్కన ఇంకా 34 నీటి వనరులకు రూ. 37.24 కోట్లు విడుదల కావాల్సి ఉంది. బీళ్లుగా మారిన పొలాలు హవేళిఘణాపూర్ మండలం రాయినిపల్లి శివారులో రాయినిపల్లి ప్రాజెక్టు ఉంది. దీని ఆయకట్టు కింద రాయినిపల్లి, పాతూర్, తిమ్మానగర్, మక్తభూపతిపూర్, శివ్వాపల్లి, వెంకటాపూర్, మల్కాపూర్ గ్రామాల పరిధిలో అధికారికంగా 1,100 ఎకరాలకు సాగు నీరందుతోంది. అనధికారికంగా మరో 500 ఎకరాలకు నీరు అందిస్తోంది. కాగా వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చిన వరదలకు కాలువలు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో ఇరిగేషన్ అధికారులు యాసంగిలో తాత్కాలిక మరమ్మతులు చేసి 25 శాతం పంటలకు మాత్రమే సాగు నీరు అందించారు. మిగితా 75 శాతం పొలాలు బీళ్లుగానే ఉన్నాయి. తెగిన కాల్వలకు పర్మనెంట్గా మరమ్మతులు చేయాలంటే రూ.2.33 కోట్లు అవసరం ఉంటుందని ప్రతిపాదనలు పంపగా, ఇప్పటివరకు పైసా మంజూరు కాలేదు. వెంటనే మరమ్మతులు చేయకుంటే వర్షాకాలంలోనూ పొలాలు బీళ్లుగానే ఉంటాయి. ఇది ఒక్క రాయినిపల్లి ఆయకట్టే కాదూ జిల్లాలో అనేక నీటి వనరుల పరిస్థితి ఇలానే ఉంది.కాలువకు తాత్కాలిక మరమ్మతులు అధ్వానంగా రాయినిపల్లి ప్రాజెక్టు కాలువప్రతిపాదనలు పంపాం గతేడాది కురిసిన భారీ వర్షాలకు 40 చెరువులు తెగిపోయాయి. వాటికి పర్మనెంట్ మరమ్మతుల కోసం రూ. 40 కోట్ల ప్రతిపాదనలు పంపించాం. కేవలం 6 చెక్డ్యాంల మరమ్మతుల కోసం రూ. 2.75 కోట్లు మంజూరయ్యాయి. వాటికి టెండర్ పెట్టాం. మిగితా వాటికి నిధులు మంజూరు కావాల్సి ఉంది. – శ్రీనివాసరావు, ఈఈ ఇరిగేషన్ మరమ్మతులకు నోచుకోని నీటి వనరులు, కాల్వలు రూ.40 కోట్లతో ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో విడుదల కాని నిధులు సమీపిస్తున్న వానాకాలం -
నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట
టాస్క్ఫోర్స్ బృందాలతో నిత్యం తనిఖీలు ● కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేపడతామని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, సీడ్ కార్పొరేషన్ల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. నకిలీ విత్తనాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ప్రస్తుతం 334 రిటైల్ విత్తన దుకాణాలు, 41 విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, 334 లైసెన్స్ కలిగిన విత్తన హోల్డర్లు ఉన్నారని తెలిపారు. రానున్న వానాకాలానికి అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఏఓ దేవకుమార్, మెదక్, నర్సాపూర్, ఆర్డీఓలు, డీఎస్పీలు, తహసీల్దార్లు, సీడ్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ అకుల్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతం వరకు కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నట్లు తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు సమగ్ర కార్యాచరణను వివరించారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. ఆస్పత్రి నిర్వాహకురాలికి నోటీసులు తూప్రాన్: అర్హత లేకుండా వైద్యం చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకురాలికి డిప్యూటీ డీఎంహెచ్ఓ జ్ఞానేశ్వర్ శనివారం నోటీసులు జారీ చేశారు. 15 రోజుల వ్యవధిలో వైద్య చికిత్సలు చేసేందుకు కలిగిన అర్హత ధ్రువపత్రాలు జిల్లా వైద్యాధికారికి సమర్పించాలని సూచించారు. లేని పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ కేంద్రంలో గత కొన్నేళ్లుగా ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా శ్రీ భవాని ప్రథమ చికిత్స కేంద్రం పేరుతో సలీల వైద్యం చేస్తున్నారు. ఈ విషయంలో ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించి వైద్యం చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. -
రైతులను ఆదుకోవడంలో విఫలం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావురామాయంపేట(మెదక్): రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, మెదక్ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. శనివారం రామా యంపేటకు వచ్చిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులకు నష్టం వస్తుందన్నారు. రైస్ మిల్లర్లు, దళారులు, కొంతమంది అధికారులు కుమ్ముక్కయి రైతులను మోసం చేస్తున్నారని, ఈ దోపిడీని అరి కట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడాది ఆగస్టులో, ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకంలో చేరకపోవడంతో రైతులు నష్టపోతున్నారని, ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాములు, సీనియర్ నాయకులు విజయకుమార్, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు సత్యం, మున్సిపల్ కౌన్సిలర్ శంకర్గౌడ్, మండల శాఖ అధ్యక్షుడు నవీన్గౌడ్, పట్టణాధ్యక్షుడు అవినాశ్రెడ్డి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామాయంపేట నియోజకవర్గ కేంద్రాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా జేఏసీ ప్రతినిధి పోచమ్మల అశ్విని వినతిపత్రం అందజేశారు. -
మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం
సిద్దిపేటకమాన్: మధ్యవర్తిత్వంతో ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి సురేపల్లి నందా తెలిపారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్లో 30మంది న్యాయవాదులకు 40గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి నందా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 684 మంది అడ్వకేట్లకు ఇప్పటి వరకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మీడియేషన్ ద్వారా ఆస్తి వివాదాలు తదితర కేసుల్లో సత్వరం న్యాయం అందుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేసులను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మెంబర్ పంచాక్షరి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, న్యాయమూర్తులు జయప్రసాద్, సంతోష్కుమార్, సాధన, తరణి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
పథకాలపై అవగాహన అవసరం
నర్సాపూర్: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ నగేశ్ సిబ్బందికి సూచించారు. శనివారం పట్టణంలోని వైపర్ కాలేజీలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద అర్హులకు ఆర్థిక సహాయం అంజేచేస్తున్నామని తెలిపారు. అర్హులకు రేషన్కార్డులు అందజేశామన్నారు. అనంతరం ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. పలువురు అనాథ పిల్లలకు పుట్టిన రోజు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, ఆర్డీఓ రామకృష్ణ, డీఎస్పీ నరేందర్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, సీఐ జాన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
కేసుల విచారణలో వేగం పెంచండి
చిన్నశంకరంపేట(మెదక్): పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఎస్పీ శ్రీనివాస్రావు సిబ్బందిని ఆదేశించారు. శనివారం నార్సింగి పోలీస్స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్లో నమోదైన కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు అంకితభావంతో పనిచేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. నేరానికి పాల్పడినవారు ఎంతటివారైన చట్టపరమైన శిక్ష పడేలా దర్యాప్తు చేపట్టాలన్నారు. రౌడీషీటర్లు, కేడీ లు, అనుమానితులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు. పోలీసులు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని, తరుచు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న నేరుగా సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఐ సృజన, సీఐ వెంకటరాజంగౌడ్ ఉన్నారు.ఎస్పీ శ్రీనివాస్రావు -
దరఖాస్తుల ఆహ్వానం
కౌడిపల్లి(నర్సాపూర్): ఎంజేపీ (మహాత్మా జ్యోతిబాపూలే) బీసీ గురుకుల కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ హరిబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు ఈనెల 12వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులతో పాటు ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ వృత్తి విద్య కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. జి ల్లాలో మూడు బాలుర, మూడు బాలికల కళాశాలలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. టెన్త్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం సీటు కేటాయిస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంటల సాగుపై అవగాహన కౌడిపల్లి(నర్సాపూర్): నేల బాగుంటేనే మంచి దిగుబడి వస్తుందని పీజేటీఏయూ శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని భుజిరంపేటలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో పాల్గొని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు అధికంగా వాడటంతో నేల ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు. నేల ఆరోగ్యం కోసం పచ్చిరొట్ట జీలుగు, జనుముతో పాటు జీవన ఎరువులు వాడాలన్నారు. మోతాగుకు మంచి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడొద్దని చెప్పారు. అనంతరం డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. వరికి బదులుగా పెసర, మినుము, కంది, వేరుశనగ తదితర పంటలు సాగు చేయాలన్నారు. పంటల మార్పిడితో మంచి ఫలితాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఉసర్పంచ్ గోపాల్, ఏఓ స్వప్న, ఏఈఓ గౌతమి, రైతులు పాల్గొన్నారు. ఇబ్బందులు తలెత్తొద్దు వెల్దూర్తి(తూప్రాన్): కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి సిబ్బందికి సూచించారు. శనివారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. తేమ శాతం అనుకూలంగా ఉంటే వెంటనే ధాన్యం తూకం వేసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది, రైతులు ఉన్నారు. ‘నీట్’కు భారీ బందోబస్తుమెదక్జోన్: నీట్ పరీక్షకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. కేంద్రం నుంచి 500 మీటర్ల పరిధిలోని జిరాక్స్ కేంద్రాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.బండెనక బండి కట్టి..అల్లాదుర్గం(మెదక్): మండలంలోని గడిపెద్దాపూర్లో మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉత్సవాల్లో భాగంగా శనివారం జాతర ప్రధాన ఘట్టమైన ఎడ్లబండ్ల ప్రదక్షిణ ఆకట్టుకుంది. ఆయా గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అందంగా అలంకరించిన తమ ఎడ్లబండ్లతో మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ బండ్ల ప్రదక్షిణ చేయించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అల్లాదుర్గం ఎస్ఐ శంకర్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఇక ‘మధురమ్మ’ జ్ఞాపకమే
నంగునూరు(సిద్దిపేట): చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గ్రామస్తులతో ఉన్న వందేళ్ల అనుబంధం నేడు దూరమైంది. శతాధిక వృద్ధురాలు మధురమ్మ(103) శనివారం తెల్లవారు జామున తిమ్మాయిపల్లిలో మృతి చెందారు. గ్రామానికి చెందిన చల్లారం మధురమ్మ భర్త మరణించడంతో ఎన్నో కష్టాలకు ఓర్చి ఇద్దరు కుమారులు, కూతురిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. కాలక్రమంలో ఇద్ద రు కుమారులు మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. మనువళ్లు, మనువరాళ్లు, మునిమనవళ్ల మధ్య వందవ పుట్టిన రోజు జరుపుకొన్న మధురమ్మ మృతి చెందడంపై గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. వంద సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉన్న మధురమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచారని వారు కొనియాడారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలో పాల్గొన్నారు. -
కొలువుదీరిన కొత్త పాలకవర్గం
తూప్రాన్: తూప్రాన్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం శనివారం కొలువుదీరింది. చైర్పర్సన్గా మనోహరాబాద్ మండలం ధర్మారాజుపల్లికి చెందిన యంజాల కీర్తన, వైస్ చైర్మన్గా మామిండ్ల కృష్ణ, డైరెక్టర్లుగా పలువురు బాధ్యతలు చేపట్టారు. కాగా 2017లో తూప్రాన్ మార్కెట్ కమిటీ ఏర్పడింది. అప్పటి నుంచి పాలకవర్గం ఏర్పడలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు వరించాయి. దీంతో తూప్రాన్ ఉమ్మడి మండలంలో కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఈసందర్భంగా పాలకవర్గ సభ్యులు సీఎం రేవంత్రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్రెడ్డి, పురం రవి, మాజీ ఎంపీపీ నవనీత, సుధాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. -
కష్టాల గుది‘బండ’
మెదక్ కలెక్టరేట్: కొత్త కనెక్షన్ ఇవ్వక.. పాత సిలిండర్ సకాలంలో అందక జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కనీసం 4 రోజులు పడుతుందని వాపోతున్నారు. ఒక సిలిండర్ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. మరో దాని కోసం దరఖాస్తు చేసుకున్నా డీలర్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 16 ఏజెన్సీలు జిల్లాలో మొత్తం 16 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, 3,85,201 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ వినియోగ కనెక్షన్లు 3,85,201 కాగా, కమర్షియల్ కనెక్షన్లు 828 ఉన్నాయి. సింగిల్ సిలిండర్ వినియోగదారులు 1,55,375, డబుల్ సిలిండర్ కస్టమర్లు 75,525 మంది ఉన్నారు. గతంలో బుక్ చేసిన ఒక్క రోజులోనే గ్యాస్ సిలిండర్కు ఇంటికి చేరేది. ప్రస్తుతం సుమారు 8 రోజులైన పడుతుంది. దీంతో ఒక్క సిలిండర్ ఉన్న వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాలు, వ్యాపారాలు కోసం పట్టణాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొత్త కనెక్షన్లు, అదనపు సిలిండర్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వం స్పందించి వెంటనే కొత్త కనెక్షన్లు ఇచ్చే లా చర్యలు తీసుకోవాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. ఇదిలాఉండగా పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.కొరత తీరగానే ఇస్తాం ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా కొత్త కనెక్షన్లు, అదనపు సిలిండర్లు ఇవ్వడం లేదు. అందులో డొమెస్టిక్తో పాటు కమ ర్షియల్ సిలిండర్లు ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న కొరత తీరగానే మళ్లీ కొత్త కనెక్షన్లు ఇస్తాం. – నిత్యానంద్, జిల్లా సివిల్ సప్లై అధికారిగ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం ఇబ్బంది పడుతున్న వినియోగదారులు కొత్త కనెక్షన్లు ఇవ్వని ఏజెన్సీలు -
ముందస్తు.. అంతంతే
మున్సిపాలిటీల్లో ముందస్తు ఆస్తి పన్ను వసూలును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి 30వ వరకు ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ప్రకటించింది. అయితే పట్టణవాసుల నుంచి స్పందన కరువైంది. కేవలం 14 శాతం మాత్రమే వసూలైంది. – మెదక్జోన్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట నాలుగు బల్దియాలు ఉండగా, వాటి పరిధిలో 2026–27 సంవత్సరానికి గానూ రూ.30.56 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. కాగా ఎర్లీబర్డ్ పథకం ద్వారా చెల్లించిన వారికి పన్ను మొత్తంలో 5 శాతం రాయితీ ఇస్తామని అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. అయినా నెలరోజుల్లో కేవలం రూ.4.25 కోట్లు మాత్రమే వసూ లైంది. ఇంకా రూ.26.31 కోట్లు వసూలు కావాల్సి ఉంది. కాగా ముందస్తుగా చెల్లించిన వారికి రాయితీ సుమారు రూ.18 లక్షల పైచిలుకు వర్తించింది. రూ. కోట్లలో పాత బకాయిలు 2026–27 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని నాలుగు బల్దియాల్లో రూ. 30.56 కోట్లు పన్నుల రూపంలో ఆయా మున్సిపాలిటీలకు చెల్లించాల్సి ఉంది. అందులో రూ. 4.25 కోట్లు ముందస్తు పథకం ద్వారా వసూలు చేశారు. ఇవి కాకుండా పాతబకాయిలు భారీగా పేరుకుపోయినట్లు తెలుస్తోంది. జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీ మెదక్లో పాత బకాయిలు రూ. 12 కోట్ల వరకు ఉన్నాయని, వాటిలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఆర్డీఓ, తహసీల్దార్, డీఎఫ్ఓ, ఆర్అండ్బీ, ఇరిగేషన్, బీఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లోనే రూ. 10.50 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. మిగితా రూ.1.50 కోట్లు బడా రాజకీయ నాయకులకు సంబంధించిన బకాయిలు ఉన్నట్లు సమాచారం. మిగితా మూడు బల్దియాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.చెల్లింపులు ఇలా.. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 13,219 ఇళ్లు, షాపులు ఉన్నాయి. ఎర్లీబర్డ్ పథకానికి 2,927 మంది ముందుకొచ్చి రూ.1.61 కోట్లు ముందస్తుగా పన్నులు చెల్లించారు. అలాగే తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 6,922 ఇళ్లు ఉండగా, 894 మంది రూ. 97 లక్షలు చెల్లించారు. నర్సాపూర్లో 5,049 ఇళ్లు ఉండగా 1,210 మంది ముందుకొచ్చి రూ.1.50 కోట్లు చెల్లించారు. రామాయంపేట బల్దియాలో 5,668 ఇళ్లు, షాపులకు గానూ 829 మంది రూ. 16 లక్షలు మాత్రమే చెల్లించారు. మొత్తంగా నెలరోజుల వ్యవధిలో ఎర్లీబర్డ్ పథకం ద్వారా 14 శాతం మాత్రమే వసూలైంది.బల్దియాల్లో ‘ఎర్లీబర్డ్’కు స్పందన కరువు రూ.30.56 కోట్లకు రూ.4.25 కోట్లు మాత్రమే వసూలు పేరుకుపోయిన బకాయిలుజిల్లాలో ఇలా.. మున్సిపాలిటీ బకాయిలు(రూ.లో) వసూలు(రూ.లో) మెదక్ 19.20 కోట్లు 1.61 కోట్లు రామాయంపేట 2.01 కోట్లు 16 లక్షలు నర్సాపూర్ 5.84 కోట్లు 1.51 కోట్లు తూప్రాన్ 3.51 కోట్లు 97 లక్షలు -
వెనుకబడినారు
జిల్లాలోనే అత్యధికంగా 21 మంది ఫెయిల్పాపన్నపేట(మెదక్): ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్లు ఉంది పాపన్నపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఫలితాల తీరు. గతంలో శతశాతం ఫలితాలు సాధించిన పాఠశాల.. ఈసారి 82 శాతం సాధించింది. జిల్లాలో అత్యధిక మంది విద్యార్థులు ఫెయిలైన పాఠశాలగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ స్కూల్ పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికై ంది. దీంతో ఏటా రూ. లక్షల నిధులు పాఠశాల అభివృద్ధికి మంజూరవుతుంటాయి. అంతకుముందే ఇది సక్సెస్ స్కూల్, అయినా పదో తరగతిలో ఆశించిన ఫలితాలు రాలేదు. పాఠశాలలో 440 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ 21 మంది టీచర్లు పని చేస్తుంటారు. పదో తరగతిలో ఈసారి 120 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 99 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 21మంది ఫెయి లయ్యారు. అందులో 14 మంది ఇంగ్లీష్లో, 8 మంది గణితం, సైన్స్లో ఆరుగురు, సోషల్లో ఇద్దరు ఫెయిలయ్యారు. అయితే ఇక్కడ ఇంగ్లీష్ బోధించడానికి ముగ్గురు, గణితం నలుగురు, సైన్స్లో ఐదుగురు, సోషల్కు ముగ్గురు టీచర్లు ఉన్నారు. అయినా ఫలితాలు అధ్వానంగా వచ్చాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పర్యవేక్షణ లోపం, టీచర్ల బాధ్యతారాహిత్యంతో ఫలితాలు అధ్వానంగా వచ్చాయని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై హెచ్ఎం మహేశ్వర్ను వివరణ కోరగా.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఫలితాలు తక్కువగా రావడం విచారకరమన్నారు. లోపా లను సమీక్షించుకొని భవిష్యత్లో మంచి ఫలితాల సాధనకు కృషి చేస్తామన్నారు. -
పకడ్బందీగా నీట్
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: ఈనెల 3వ తేదీన నిర్వహించనున్న నీట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 479 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, అభ్యర్థులు హాల్టికెట్లోని నిబంధనలను పూర్తిగా అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా పరీక్ష రాసేందుకు రావాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద 163 బీఎన్ఎస్ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. అలాగే పరీక్ష మొత్తం సీసీ కెమెరాల నిఘాలో నడుస్తుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అర్హత లేకున్నా వైద్యంతూప్రాన్: ఎలాంటి అర్హతలు లేకుండా గర్భిణులు, మహిళలకు వైద్యం అందిస్తున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఇటీవల జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. అయినా నిర్వాహకురాలు యథేచ్ఛగా ఇంట్లో వైద్యం అందిస్తున్నారు. శుక్రవారం ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేసి పట్టుకున్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ జ్ఞానేశ్వర్ కథనం ప్రకారం.. పట్టణ కేంద్రంలో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా శ్రీ భవాని ప్రథమ చికిత్సాలయం పేరుతో మహిళ వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. గత నెల 14న ఆస్పత్రిని తనిఖీ చేసి సీజ్ చేసినట్లు చెప్పారు. ఆస్పత్రి వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతుందన్నారు. అయినా ఆస్పత్రి నిర్వాహకురాలు సలీల తన ఇంటినే ఆస్పత్రిగా మార్చుకొని వైద్య చికిత్స చేస్తున్నట్లు గుర్తించామన్నారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. -
బస్సు ఎందుకు ఆపరు?
అల్లాదుర్గం(మెదక్): స్టేజీల వద్ద బస్సులు అపడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్, కండక్టర్తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈసంఘటన మండల పరిధిలోని చిల్వెరలో శుక్రవారం చోటు చేసుకుంది. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు నారాయణఖేడ్ వెళ్తుంది. మార్గమధ్యలో చిల్వెరలో ప్రయాణికులు దిగాల్సి ఉండగా, స్టేజీ లేదు ఆపమని సిబ్బంది చెప్పారు. ఆర్డీనరీ బస్సులు లేవు, ఉన్న ఎక్స్ప్రెస్ ఆపకుంటే ఎలా ఇళ్లకు చేరుకోవాలని ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. దీంతో నాలుగు బస్సులు రోడ్డుపైనే నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. బస్సులు నిలపకుంటే మహాలక్ష్మి పథకం ఎందుకని మహిళలు ప్రశ్నించారు. -
ప్రాణం తీసిన రుణ భారం
చిన్నశంకరంపేట(మెదక్): రుణభారంతో ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి ఉరేసుకొని తనువు చాలించాడు. నార్సింగి ఎస్ఐ సృజన కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణానికి చెందిన బోడ చంద్రశేఖర్ (45) ప్రైవేట్ కళాశాల లెక్చరర్గా పనిచేశాడు. ఇతడికి రెండుసార్లు పెళ్లి జరిగినా, ఇద్దరు భార్యలు కుటుంబ కలహాలతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇల్లును విక్రయించి డబ్బులు చెల్లించాడు. అప్పులు పెరగడంతో క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు తీసుకున్నాడు. సమయానికి ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితితో గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆరునెలల క్రితం రుణబాధలు భరించలేకపోతున్నానని ఇంట్లో లేఖ రాసి పెట్టి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు గతంలో కామారెడ్డి పోలీస్లకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తాజాగా శుక్రవారం వల్లూర్ జాతీయ రహదారి పక్కన పంటపొలాల్లో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఆధార్కార్డు ఆధారంగా కామారెడ్డిలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మోతాదుకు మించితే ముప్పే
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు పంటల సాగులో సమతుల్య ఎరువులు వాడాలని పీజేటీఏయూ శాస్త్రవేత్త డాక్టర్ మహాదేవప్ప తెలిపారు. శుక్రవారం మండలంలోని జాజితండాలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోతాగుకు మంచి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడొద్దని సూచించారు. యూరియా, డీఏపీ అధికంగా వాడటం వల్ల భూసారం తగ్గుతుందన్నారు. భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య జీవన, పచ్చిరొట్ట ఎరువులు వాడాలన్నారు. శాస్త్రవేత్తలు సూచించిన విత్తనాలతో పంటలను సాగుచేయాలని చెప్పారు. ఆయిల్పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని ఆయిల్పామ్ ఫీల్డ్ కోఆర్డినేటర్ శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వం సబ్పిడీపై మొక్కలు డ్రిప్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఓ స్వప్న, ఏఈఓ నరేందర్, నాయకులు హరిలాల్, రైతులు పాల్గొన్నారు. -
హైవేలపై అండర్పాస్లు
జాతీయ రహదారులపై వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని రెండు హైవేలపై అండర్పాస్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈక్రమంలోనే అధికారులు సర్వే నిర్వహించారు. ఏ ప్రాంతంలో అండర్పాస్లు నిర్మించాలనే విషయమై వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు కేంద్ర అటవీశాఖకు రిపోర్టులు పంపించారు. – రామాయంపేట(మెదక్) గతేడాది జాతీయ రహదారి 44పై నార్సింగి మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా మృతిచెందింది. ఈసంఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆశాఖలో కదలిక తెచ్చింది. అలాగే నాలుగేళ్ల కాలంలో దుప్పులు, ఇతర జంతువులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ రహదారులపై అండర్పాసుల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈమేరకు కేంద్ర అటవీశాఖతో పాటు రోడ్డు, భవనాలశాఖ అధికారులు, స్థానిక అటవీ అధికారులు సర్వే నిర్వహించారు. ఏ ప్రాంతంలో అండర్పాస్లు నిర్మించాలనే విషయమై వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర అటవీశాఖకు నివేదించారు. ఆరుచోట్ల నిర్మాణం జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారి మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, మాసాయిపేట, నార్సింగి, రామాయంపేట మండలాల మీదుగా 55 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రహదారిలో ఐదు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. మెదక్, ఎల్కతుర్తి మధ్య నిర్మించిన (765 డీజీ) జాతీయ రహదారిపై రామాయంపేట మండలం అక్కన్నపేట, లక్ష్మాపూర్ మధ్య ఐదు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. 44వ జాతీయ రహదారిపై వల్లూరు వద్ద ఒకటి, రామాయంపేట ప్రాంతంలో 2 అండర్పాసుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. 765 డీజీ రహదారిపై అక్కన్నపేట, లక్ష్మాపూర్ అటవీ ప్రాంతంలో, హవేళిఘణాపుర్ మండలం పాతూర్ అటవీప్రాంతం రాజేశుని గుట్ట వద్ద ఒక్కొక్కటి చొప్పున మొత్తం 3 అండర్ పాసుల నిర్మాణానికి గాను స్థలాలను ఎంపిక చేశారు.వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా చర్యలు క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాల గుర్తింపుప్రతిపాదనలు పంపాం -
అన్నివర్గాలను ఆదుకుంటాం
మెదక్జోన్: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాలను కాపాడుకుంటుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మేడే సందర్భంగా శుక్రవారం ఆర్టీసీ బస్డిపో వద్ద కార్మిక జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఇటీవల ఆర్టీసీ కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం సమ్మె ప్రారంభించిన వెంటనే కార్మిక సంఘ నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులు నెలరోజులకు పైగా సమ్మె చేసినా, కనీసం ఆ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అనంతరం ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాధాకిషన్రావు మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు డిపో ప్రాంగణంలో ఐసీడీఎస్శాఖ ఏర్పాటు చేసిన చిన్నారుల రక్షణ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరేశ్గౌడ్, నేతలు భూపతిరాజు, అరుణార్తి వెంకటరమణ, రాములు, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ రాష్ట్ర నేత -
రైతు సంక్షేమానికి కృషి
పెద్దశంకరంపేట(మెదక్): రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొప్పోల్ ఉమాసంగమేశ్వర దేవాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం శకుంతల, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మధు, సర్పంచ్ పోచమ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ బాధ్యతల స్వీకరణనర్సాపూర్: నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్గా సాయికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన శ్రీరాంచరన్రెడ్డి గత నెలలో బదిలీ కావడంతో జిన్నారం మున్సిపల్ కమిషనర్ తిరుపతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా గ్రూపు–1 అధికారి సాయికుమార్ను ప్రభుత్వం ఇటీవల నియమించింది. కాంగ్రెస్ ఖాతాలో కో ఆప్షన్రామాయంపేట(మెదక్): కో ఆప్షన్ ఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. నాలుగు పదవులకు నిర్వహించిన ఎన్నిక ఏకగ్రీవం అయింది. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్పర్సన్ నవనీత పాల్గొన్నారు. సభ్యులుగా చింతల రాధాభవాని, దేమె యాదగిరి, మహ్మద్గౌస్, ఆసియా సుల్తానా ఎన్నికై నట్లు మున్సిపల్ కమిషన్ గణేశ్రెడ్డి ప్రకటించారు. అనంతరం వారు ప్రమాణస్వీకారం చేశారు. ఈసందర్భంగా వారికి ఎమ్మెల్యే ఎన్నికపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రఘువరణ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇవేం మెడికల్ బిల్లులు? మెదక్జోన్: మెడికల్ బోర్డు మంజూరు చేసిన బిల్లులను పునర్ పరిశీలించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తపస్ జిల్లా అధ్యక్షుడు ఎల్లం డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం యూనియన్ నేతలతో కలిసి అదనపు కలెక్టర్ నగేశ్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులు మెడికల్ బిల్లులకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 10 శాతం కూడా విడుదల చేయలేదని వాపోయారు. అనేక మందికి తక్కువ బిల్లులు మంజూరు అయ్యాయన్నారు. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకొని, మళ్లీ బిల్లులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో తపస్ నేతలు సిద్దూ, చల్లా లక్ష్మణ్, సురేందర్, రవి, ఆంజనేయులు, ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ మెదక్జోన్: శాంతి భద్రతల పరిరక్షణలో భా గంగా ఈనెల 31 వరకు జిల్లాలో పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకో, నిరసన, ర్యాలీ, పబ్లిక్ మీటింగ్లు నిర్వహించడం నిషేధమన్నారు. ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక చర్యలు, అశాంతికి ప్రయత్నాలు చేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ఇక ఇంటికే పౌష్టికాహారం
నేటి నుంచి అంగన్వాడీలకు వేసవి సెలవులు● టేక్ హోం రేషన్ విధానం అమలు ● చిన్నారుల ఆరోగ్య స్థితుగతులపైన టీచర్ల పర్యవేక్షణ ఎండలు మండుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల హాజరు శాతం తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం లబ్ధిదారులకు అంగన్వాడీ సరుకులను ఇంటికే పంపించాలని నిర్ణయించింది. నేటి నుంచి ఈనెల 31 వరకు ఈ విధానాన్ని అమలు చేయనుంది. జూన్ 1 నుంచి యథావిధిగా కేంద్రాలను ప్రారంభించనుంది. – రామాయంపేట(మెదక్) రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. కేంద్రాల్లో చాలా చోట్ల ఫ్యాన్లు లేకపోవడం, ఉన్నవి కూడా సరిగా పనిచేయకపోవడంతో ఉక్కబోతతో అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంఖ్య తగ్గింది. కొన్ని రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేంద్రాలు నిర్వహించారు. ఈక్రమంలో మే 1 నుంచి 31 వరకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించింది. చిన్నారులు, బాలింతలు, గర్భిణుల్లో పోషకాహార లోపం తలెత్తకుండా సెలవు రోజుల్లో టేక్ హోం రేషన్ (టీహెచ్ఆర్) కింద ఇళ్ల వద్దకే సరుకులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు టీచర్లు చేయాల్సిన పనుల విషయమై దిశానిర్దేశం చేసింది. -
‘శత శాతం’ భవతి
మెదక్ అర్బన్: ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో శతశాతం ఫలితాలు సాధించిన సర్కారు బడుల సంఖ్య పెరిగింది. మొత్తం 126 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించగా, అందులో 101 ప్రభుత్వ, 25 ప్రైవేట్ పాఠశాలలు ఉండటం గమనార్హం. మూడు మండలాలు శత శాతం ఫలితాలు సాధించి సత్తా చాటాయి. కాగా జిల్లావ్యాప్తంగా ఫలితాలను నిరుడితో పోలిస్తే కేవలం 0.24 శాతం తక్కువతో ఏకంగా 22వ స్థానానికి పడిపోయింది. అయితే శాతం ఫలితాల్లో మెరుగ్గా ఉండటం ఊరట కలిగించే అంశం. శత శాతం పాఠశాలలు ఇవే.. జిల్లాలో 225 పాఠశాలలుండగా 4 బీసీ వెల్ఫేర్, 9 కేజీబీవీ, 4 మోడల్, 1 రెసిడెన్షియల్, 1 మినీ రెసిడెన్షియల్, 2, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, 3 ట్రైబల్ వెల్ఫేర్, 77 జెడ్పీ పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. అయితే అల్లాదుర్గం, నిజాంపేట, వెల్దుర్తి మండలాలు వంద శా తం ఫలితాలు సాధించగా, నర్సాపూర్ మండలం 86.91 శాతంతో చివరన నిలిచింది. గతేడాది 60 జెడ్పీ పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించగా, ఈసారి 77కు పెరగడం శుభ పరిణామం. గతేడాది 28 ప్రైవేట్ పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించగా, ఈసారి 25కు తగ్గాయి. కాగా మేనేజ్మెంట్ల వారీగా చూస్తే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 99.28 శాతం ఫలితాలతో టాప్లో ఉండగా, ఆశ్రమ పాఠశాలలు 72.73 శాతంతో చివరన నిలిచాయి. మొత్తం మీద జిల్లాలో 11,232 మంది పరీక్షలు రాయగా, 10,853 మంది పాసయ్యారు. -
రూ.240 కోట్లు మంజూరు చేయండి
ఖేడ్ అభివృద్ధి కోసం సీఎస్కు ఎమ్మెల్యే వినతి నారాయణఖేడ్: ఖేడ్ అభివృద్ధి కోసం రూ.240 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎస్ కె.రామకృష్ణారావు తమ బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు గురువారం నారాయణఖేడ్కు వచ్చారు. స్థానిక ఆర్అండ్బీ శాఖ అతిథిగృహం వద్ద ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి ఆయనకు ఘనస్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అనంతరం అతిథిగృహంలో ఆయనతో ఎమ్మెల్యే సమావేశమై మనూరు మండలం రాయిపల్లి వద్ద మంజీరా నదిపై ఉన్న వంతెన బ్రిడ్జి కండ్యాంగా మార్చేందుకు రూ.125 కోట్లు, ఖేడ్ పట్టణంకు రింగు రోడ్డుకు రూ.70 కోట్లు, ఖేడ్లో ఏటీసీ కేంద్రానికి రూ.45 కోట్లు మంజూరు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. వివాహ వేడుకల్లో ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ రామకృష్ణారావును కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పలు అభివృద్ధి పనులపై చర్చించారు. -
చట్టానికి లోబడి దత్తత చేసుకోండి
నర్సాపూర్: చట్టానికి లోబడి పిల్లలను దత్తత చేసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్లు శివకుమారి, మెహత సూచించారు. ఈమేరకు పట్టణంలోని బస్టాండ్లో గురువారం ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లలను మామూలుగా దత్తత తీసుకుంటే రాబోయే రోజుల్లో చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. చట్ట ప్రకారం దత్తత తీసుకోవడం అన్ని విధాలా మంచిదన్నారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులతో బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. అలాగే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఊయలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ మొజం హుస్సేన్, ఏరియా ఆస్పత్రి డాక్టర్ విష్ణువర్దన్, ఎస్ఐ రంజిత్రెడ్డి, మెడికల్ ఆఫీసర్ రఘువరన్, ఎంఈఓ తారాసింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చెశ్, పలువురు సర్పంచ్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
ఇన్చార్జి డీఈఓగా రాజు
మెదక్ కలెక్టరేట్: జిల్లా విద్యాశాఖ అధికారిగా కామారెడ్డి డీఈఓ రాజుకు అదనపు బా ధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు మెదక్ డీఈఓగా పనిచేసిన విజయ రిటైర్డ్ కాగా, ఆమె స్థానంలో రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం డీఈఓగా రాజు బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. బాలల సంరక్షణ ఎగ్జిబిషన్ సందర్శన మెదక్ కలెక్టరేట్: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లాలో బాలల సంరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం అభినందనీయమని సీ్త్ర, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వల్లేటి ప్రేమ్చంద్ కొనియాడారు. పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో కొనసాగుతున్న బాలల సంరక్షణ ఎగ్జిబిషన్ను గురువారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు న్యాయపరమైన హక్కులు, ఆరోగ్యం, విద్య, భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు వారి అభివృద్ధికి అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ హేమాభార్గవి, అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగిరం చేయండి: మంత్రి కోహెడరూరల్(హుస్నాబాద్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు జరిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం కోహెడలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మండలానికి మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
డీఈఓ సేవలు అభినందనీయం
టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్మెదక్జోన్: విధి నిర్వహణలో డీఈఓ విజయ సేవలు అభినందనీయమని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్ కొనియాడారు. గురువారం పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ అభినందన సభలో ఆయన మాట్లాడారు. 2023లో డీఈఓగా బాధ్యతలు స్వీకరించి విద్యాశాఖలో క్రియాశీల అధికారిగా బాధ్యతాయుతంగా వ్యవహరించారని అన్నారు. ఉత్తమ అధికారిగా ప్రశంసలు సైతం పొందారన్నారు. ఈ ఏడాది వెస్లీ కళాశాలలో నిర్వహించిన విజ్ఞాన సదస్సు దిగ్విజయం కావడంలో ఆమె సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విశేష కృషి చేశారన్నారు. కార్యక్రమంలో అధికారులు సుదర్శనమూర్తి, రాజిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నేతలు పద్మారావు, శివయ్య, సంతోష్, సామ్యనాయక్, శ్రీనివాస్, రాజు, అశోక్, కేజీబీవీ ప్రిన్సిపాల్ కవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● మంత్రి దామోదర రాజనర్సింహ ● డాకూర్లో ఆరోగ్య శిబిరం ప్రారంభ ర వట్పల్లి(అందోల్): ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అందోల్ మండల పరిధిలోని డాకూర్లో గురువారం ధర్మశాస్త్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సహారా ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు క్యాన్సర్, డయాలసిస్, గుండె సంబంధ చికిత్సలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. డాకూర్ గ్రామ ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు వైద్య చికిత్సల కోసం దగ్గర్లో ఉన్న జోగిపేట ప్రభుత్వాస్పత్రి, సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు ఉచితంగా అందిస్తున్నామని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందోల్ను హెల్త్ హబ్గా అభివృద్ధి తీర్చిదిద్దుతున్నామని దీనిలో భాగంగానే అందోల్ శివారులో 150 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపులో పాల్గొన్న సహారా ఆస్పత్రి వైద్యలు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో సంగారెడ్డి డీఎంహెచ్ఓ వసంత్ కుమార్, డాకూరు గ్రామ సర్పంచ్ వసంత్రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ నరేందర్రెడ్డి, లయన్స్క్లబ్ అధ్యక్షుడు మధుసూధన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేశ్గౌడ్తోపాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
బాలల భద్రత.. డ్రగ్స్ నివారణ
● జిల్లా గ్రంథాలయంలో గైడెన్స్ హబ్ ● రేపటి వరకు కౌన్సెలింగ్ కార్యక్రమం మెదక్ కలెక్టరేట్: బాలల భద్రత, రక్షణ, డ్రగ్స్ నివారణే లక్ష్యంగా జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో అడోలెసెంట్ సపోర్ట్, గైడెన్స్ హబ్ను ఏర్పాటు చేశారు. యువతకు మార్గదర్శకత్వం, మానసిక మద్దతు అందించేందుకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, మహిళాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హబ్ ద్వారా ఈనెల 2 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. యువతకు భద్రతతో కూడిన, గోప్యమైన, సమర్థవంతమైన కౌన్సిలింగ్ అందించడం ద్వారా వారు సరైన నిర్ణయాలు తీసుకునేలా చేయడం. యువతలో పెరుగుతున్న ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు, డిజిటల్ ప్రభావం, చెడు అలవాట్లకు గురయ్యే ప్రమాదాల నుంచి రక్షించడం. సరైన మార్గదర్శకత్వం చేసి సమస్యలను గుర్తించి పరిష్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రధాన సేవలు సెల్ఫోన్ వినియోగం, డిజిటల్ అలవాట్లపై మార్గదర్శనం చేయడం, భావోద్వేగ సంబంధాల సమస్యలపై కౌన్సెలింగ్. డ్రగ్స్, ధూమపానం, ఒత్తిడి నివారణ, కెరీర్పై మార్గదర్శనం, జీవన నైపుణ్యాలు నేర్పించడం, బాలల భద్రత, రక్షణపై సహాయం అందిస్తున్నారు. విద్యార్థుల నుంచి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిపై కౌన్సెలింగ్ సెషన్ షెడ్యూల్ ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే రిఫరల్ సిస్టం ద్వారా చైతన్య పరుస్తున్నారు. ఈ విషయమై డీడబ్ల్యూఓ హేమభార్గవి మాట్లాడుతూ.. ఈ హబ్ ద్వారా కౌన్సెలింగ్ పొందిన విద్యార్థుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నిపుణుల మార్గదర్శకత్వంలో ఈనెల 2వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుందని చెప్పారు. యువత, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. -
భారమైతే ఊయలలో వేయండి
మెదక్ కలెక్టరేట్: పసిబిడ్డలు వద్దనుకునే వారు ఊయలలో వేయాలని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్ సూచించారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఊయలను ఏర్పాటు చేయగా, ప్రారంభించి మాట్లాడారు. ఎవరికై నా చిన్న పిల్లలు భారం అనుకుంటే ముళ్ల పొదలు, చెత్త బుట్టలలో వేయకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన ఊయలలో వదిలి వేయాలన్నారు. ఆ పిల్లల సంరక్షణ బాధ్యతను అధికారులు తీసుకుంటారని తెలిపారు. ఊయలలో వేయలేని వారు మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి అప్పగించాలన్నారు. లేదంటే 1098కు సమాచారమిస్తే అధికారులు వచ్చి పిల్లలను తీసుకెళ్తారని వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అనీష్ ఫాతిమా, ఆర్ఎంఓ రేవతి, హెచ్ఓడీ, గైనకాలజిస్ట్ రాజేశ్వరీ, మెదక్ సీడీపీఓ వెంకటరమణ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శ్రీదేవి, మాధవి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్దే మళ్లీ అధికారం
ప్రజాగాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న జోగిపేట(అందోల్): తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రజాగాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న జోస్యం చెప్పారు. బోధన్లో ఒక కార్యక్రమానికి హాజరుకావడానికి వెళ్తూ జోగిపేటలో కొద్దిసేపు ఆగారు. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా కేసీఆర్ను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో పాలన ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా సాగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటి పాలకులు ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని ఆ తర్వాత ప్రజలకిచ్చిన మాట మరిచారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని, కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని క్రాంతి కిరణ్కు సూచించారు. పట్టణ మాజీ బీఆర్ఎస్ అధ్యక్షుడు చాపల వెంకటేశం, బీఆర్ఎస్ నాయకులు ప్రదీప్గౌడ్, నర్సింహులు, రమణ, పింటూ తదితరులు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. -
ఈవ్టీజింగ్పై ఉక్కుపాదం
ఎస్పీ శ్రీనివాసరావుమెదక్జోన్: ఈవ్టీజింగ్పై ఉక్కుపాదం మోపా మని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్లో అమ్మాయిలను ఏడిపించే 8 మంది ఆకతాయిలపై కేసులు పెట్టడంతో పాటు, మరో 56 మందికి కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. 40 అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. మహిళల, బాలికల భద్రత కోసం షీటీమ్స్ కట్టుదిట్టంగా పనిచేస్తుందని, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా మహిళలను వేధించినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే డయల్ 100. షీటీమ్ వాట్సాప్ నంబర్ 8712657963కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే బాల్య విహహాలపై 1098 చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. అంగన్వాడీల పనితీరు భేష్ నర్సాపూర్ రూరల్: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఆదర్శంగా ఉందని రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వల్లేటి ప్రేమ్చంద్ అన్నారు. గురువారం మండలంలోని సఖి కేంద్రంతో పాటు రెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. సఖి కేంద్రాన్ని ఆశ్రయించే బాధితులకు అత్యుత్తమ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. రిజిస్టర్ను తనిఖీ చేసి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు పోషక విలువలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి హేమాభార్గవి, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దు నర్సాపూర్ రూరల్: దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మూసాపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ సిద్దిరాంరెడ్డి, సర్పంచ్ గడ్డం మమత, డీసీసీ జిల్లా కార్యదర్శి రవీందర్, కొత్త నారాయణగౌడ్, మోహన్ దాస్, సాయి చరణ్ గ్రామస్తులు పాల్గొన్నారు. నో స్టాక్ చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్లో మూడు రోజులుగా ఇంధన నిల్వలు నిండుకున్నాయి. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో యాజమాన్యం నో స్టాక్ బోర్డును ఏర్పాటు చేసింది. అధికారులు ఇంధనానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. దీంతో వాహనదారులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ‘అంకితభావంతోనే మంచి ఫలితాలు’ మెదక్ కలెక్టరేట్: ఉపాధ్యాయుల అంకితభావం, నిరంతర సహకారం వల్లే మైనార్టీ రెసిడెన్షియల్ విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించారని రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ సెక్రటరీ నయీమ్ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలో సమ్మర్ క్యాంపు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆటల పోటీలలో ప్రతిభ కనబర్చిన బాలికలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ ప్రోత్సాహం, చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థుల అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. అనంతరం మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధికను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సురేఖ, కౌన్సిలర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విజిలెన్స్ టీం సభ్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
మత్తుకు బానిస కావొద్దు
రామాయంపేట(మెదక్): యువతను లక్ష్యంగా చేసుకొని మత్తు పదార్ధాల వ్యాప్తి పెరిగిపోతుందని అదనపు ఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని వివేకానంద విద్యాలయంలో సైబర్ నేరాలు, డ్రగ్స్పై జరిగిన అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆధునిక సాంకేతిక యుగంలో రోజు రోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతుందన్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, ఈ మెయిల్స్, లింకులను నమ్మవద్దని హితవు పలికారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ వంటివి గోప్యంగా ఉంచుకోవాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలన్నారు. డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితాల పైనే కాకుండా సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నా రు. ఆయన వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ వెంకట్ రాజాగౌడ్, ఎస్ఐ బాల్రాజు, కరస్పాండెంట్ రాంకుమార్ తదితరులు ఉన్నారు. -
సమస్యల పరిష్కారానికి కమిటీలు
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. అక్కన్నపేట మండల కేంద్రంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అలాగే మండలస్థాయి అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తేమ శాతం సరైన విధంగా ఉండి కూడా కొనుగోలు చేయలేకపోతే సమస్యలు వస్తాయన్నారు. కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ సౌజన్య, ఆత్మ కమిటీ చైర్మన్ ఐల్లయ్య, ఎంపీడీఓ బానోతు జయరాం, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగాలి ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ -
కేంద్రాల్లో వసతుల్లేవు
తూకాలు ప్రారంభం కావు ● మండుటెండల్లో అన్నదాతల అవస్థలు ● రోజుల తరబడి ఎదురుచూపులు ● జిల్లాలో 525 కొనుగోలు కేంద్రాలు మెదక్ అర్బన్: నిలువ నీడ, తాగు నీరు లేక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విలవిలలాడుతున్నారు. కమీషన్ కాసుల వేటలో నిర్వాహకులు అన్నదాతల సమస్యలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా చోట్ల కేంద్రాలు ప్రారంభించిన్పటికీ, హమాలీలు లేక 405 కేంద్రాల్లో తూకాలు ప్రారంభం కాలేదు. కేవలం 120 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం సేకరిస్తున్నారు. గత 20 రోజులుగా రైతులు ధాన్యం ఆరబోసి.. రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. కమీషన్ ఖర్చు చేయొచ్చు యాసంగికి సంబంధించి జిల్లాలో 4.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం జిల్లాలో 525 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. వరి కోతలు ప్రారంభించి 20 రోజులు కావొస్తున్నా, హమాలీల కొరతతో ఇప్పటివరకు కేవలం 120 కేంద్రాల్లో తూకాలు ప్రారంభం అయ్యాయి. కొనుగోలు కేంద్రాల యాజమాన్యాలకు క్వింటాల్కు రూ.32 చొప్పున కమీషన్ చెల్లిస్తారు. ఇందులో 40 శాతం కేంద్రం నిర్వాహణకు వినియోగించుకోవచ్చు. రైతులకు తాగు నీరు, నీడ కోసం టెంట్లు తదితర సౌకర్యాలు కల్పించాలి. కానీ చాలా చోట్ల ఇవేవి కనిపించడం లేదు. మండుటెండల్లో రైతన్నలు పడరాని కష్టాలు పడుతున్నారు. పాపన్నపేటలో 20 రోజులుగా రైతులు, కేంద్రం వద్ద తమ ధాన్యాన్ని ఆరబోసి, అక్కడే పడిగాపులు కాస్తున్నారు. 40 శాతం కమీషన్లో నిర్వాహకుల దినసరి వేతనం, రికార్డుల కొనుగోలు, ఇతర ఖర్చులు మిగిలించుకుంటున్నారు. కానీ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. అలాగే సన్న వడ్లకు డిమాండ్ ఉండటంతో నిర్వాహకులు తమకు కమీషన్లు ఇచ్చే మిల్లర్లకే వాటిని పంపుతున్నారు. కాగా కమీషన్ల ద్వారా సుమారు రూ.12.10 కోట్ల ఆదాయం వస్తుంది. తాగడానికి నీళ్లు లేవు పొలం కోసి దాదాపు 20 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ప్రతి రోజు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న. మ ండుటెండల్లో చెమటలు గక్కుతున్నాం. కనీసం తాగేందుకు సుక్క నీరు లేదు. పగలంతా ఎండ బోయడం, వాన మొగులు కాగానే కుప్ప చేయడంతోనే సరిపోతుంది. – ఆకుల సాయిలు, రైతు, పాపన్నపేట సౌకర్యాలు కల్పిస్తాం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పిస్తాం. ఇప్పుడిప్పుడే కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయి. వచ్చే కమీషన్లో 40 శాతం వరకు నిర్వహణకు ఖర్చు చే యొచ్చు. అవసరమైతే రైతుల కోసం ఎక్కువ కూడా ఖర్చు చేస్తాం. – శ్రీనివాస్, డీఆర్డీఓ -
డీఈఓ సేవలు అమోఘం
మెదక్ కలెక్టరేట్: విద్యారంగానికి డీఈఓ విజయ చేసిన సేవలు అమోఘమని జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మధుమోహన్ కొనియాడారు. గురువారం డీఈఓ ఉద్యోగ విరమణ పొందనున్న నేపథ్యంలో బుధవారం ప ట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో గెజిటెడ్ హెచ్ఎంల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆమె హయాంలోనే జిల్లా కేంద్రానికి పదో తరగతి మూల్యాంకన కేంద్రం మంజూరు కావడం అభినందించదగిన విషయమన్నారు. తక్కువ సమయంలోనే అందరి మన్ననలను పొందారన్నారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల విభాగం అధికారి కరుణాకర్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, గెజిటెడ్ హెచ్ఎంల సంఘం రాష్ట్ర బాధ్యులు సత్యనారాయణ, వెంకటస్వామి, ప్రతాప్రెడ్డి, ఎంఈఓలు, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 96.63 శాతం ఉత్తీర్ణత
● రాష్ట్రస్థాయిలో 22వ స్థానానికి పరిమితం ● బాలురతో పోలిస్తే బాలికలదే పైచేయిపదో తరగతి ఫలితాలు మళ్లీ నిరాశ పరిచాయి. 96.63 శాతం ఉత్తీర్ణణతో రాష్ట్రస్థాయిలో జిల్లా 22వ స్థానానికి పరిమితం అయింది. కాగా గతేడాదితో పోలిస్తే వెనుకబాటుకు గురి కాగా, బాలురతో పోలిస్తే బాలికలుపైచేయి సాధించారు. – మెదక్జోన్ జిల్లాలో ఈఏడాది మొత్తం 11,232 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అందులో బాలురు 5,572, బాలికలు 5,660 మంది ఉన్నారు. వీరిలో బాలురు 5,331 మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 5,522 మంది పాసయ్యారు. ఈ లెక్కన బాలురు 95.67 శాతం,బాలికలు 97.56 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. ఈ పాఠశాలలు టాప్ జిల్లావ్యాప్తంగా 12 రకాల పాఠశాలలు ఉండగా, వాటిలో బీసీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో ముందంజలో ఉన్నారు. బీసీ వెల్ఫేర్లో 99.28 శాతం, రెసిడెన్షియల్ విద్యార్థులు 99.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 98.89 శాతం ఉత్తీర్ణత సాధించి మూడో స్థానంలో నిలిచారు. అలాగే సోషల్ వెల్ఫేర్ 98.71, మోడల్ స్కూల్ 98.36, మైనార్టీ రెసిడెన్షియల్ 97.80, కేజీబీవీ 96.81, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 96.31, ట్రైబల్ వెల్ఫేర్ 95.10, ఎయిటెడ్ 88.24, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 84.49, ఆశ్రమ స్కూల్స్ 72.73 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 100% ఉత్తీర్ణత సాధించిన స్కూల్స్ పదో తరగతి పరీక్షలో బీసీ వెల్ఫేర్కు చెందిన 4 పాఠశాలలు, కేజీబీవీ 9, మోడల్ స్కూళ్లు 4, ప్రైవేట్ 25, రెసిడెన్షియల్ 1, మైనార్టీ రెసిడెన్షియల్ 1, ట్రైబల్ వెల్ఫేర్ 3, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 77, సోషల్ వెల్ఫేర్ 2 పాఠశాలల చొప్పున మొత్తం 126 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఇలా.. సంవత్సరం ఉత్తీర్ణత 2021 100 % 2022 93.45% 2023 90.84% 2024 92.9 % 2025 96.87% 2026 96.63 % ఫలితమివ్వని ప్రత్యేక క్లాస్లు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించినా, ఆశించిన ఫలితాలు రాలేదు. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక క్లాస్లు ఏర్పాటుచేశారు. జనవరి నుంచి మార్చి వరకు ఉదయం, సాయంత్రం గంట చొప్పున రోజుకు రెండు గంటల పాటు అదనపు తరగతులు నిర్వహించారు. ప్రభుత్వం అందించిన అభ్యాసదీపకలను విద్యార్థులకు అందించారు. అందులోని మెలకువలను ప్రతిరోజు నేర్పించారు. అలాగే ఫిబ్రవరి 1 నుంచి మార్చి 13 వరకు సాయంత్రం వేళ నెలన్నర పాటు నిత్యం సాయంత్రం వేళ స్నాక్స్ ఇచ్చారు. -
పకడ్బందీగా ‘జనగణన’
నిజాంపేట(మెదక్): జనగణన పకడ్బందీగా జరగాలని అదనపు కలెక్టర్ నగేశ్ సిబ్బందికి సూచించారు. బుధవారం మండల కేంద్రంలో జనగణన తీరును పరిశీలించారు. జనగణను పూర్తిస్థాయిలో నిర్వహించి ప్రజల నుంచి పూర్తి సమాచారం రాబట్టలన్నారు. జనగణనలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని సూచించారు. అనంతరం పీఎసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూకం సరిగా వేయాలని, సజావుగా ధాన్యం కొనుగోలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, ఆ ర్ఐ ప్రీతి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కో ఆప్షన్కు 36 నామినేషన్లు నర్సాపూర్: మున్సిపాలిటీలో కో ఆప్షన్ పదవులకు 36 నామినేషన్లు దాఖలైనట్లు ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ తిరుపతి తెలిపారు. నామినేషన్ దాఖలుకు బుధవారంతో గడువు ముగిసిందన్నారు. కాగా ప్రభుత్వం మైనార్టీలకు రెండు కో ఆప్షన్ పదవులు, ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగి ఉన్న వ్యక్తులకు రెండు వంతున పదవులు కేటాయించింది. మైనార్టీ వర్గానికి చెందిన అభ్యర్థుల నుంచి 17 నామినేషన్లు, ఇతర రిజర్వేషన్లకు సంబంధించిన వ్యక్తుల నుంచి 19 నామినేషన్లు వచ్చాయని చెప్పారు. కాగా గురువారం నామినేషన్లను స్క్రూటినీ చేస్తారని, వచ్చే నెల రెండు వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తుల ఆహ్వానం మెదక్జోన్: జిల్లా కోర్టులో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్ 1, స్టేనో టైపిస్ట్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. మే 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా జూనియర్ అసిస్టెంట్కు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, స్టేనో టైపిస్ట్కు డిగ్రీతో పాటు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా కోర్టు వెబ్సైట్, నోటీస్ బోర్డులో చూసుకోవచ్చన్నారు. మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులు రామాయంపేట(మెదక్): అద్దె భవనంలో కొనసాగుతున్న మహిళా డిగ్రీ కళాశాల కం హాస్టల్ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 4.19 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలో ఏకై క కళాశాల ఇదే కావడంతో పాటు గతేడాది కురిసిన భారీ వర్షాలతో కళాశాల, హాస్టల్ భవనాల చుట్టూ వరద పోటెత్తింది. దీంతో అతి కష్టం మీద విద్యార్థినులను అక్కడి నుంచి తరలించారు. దీంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న భవనంలో కనీస సదుపాయాలు సైతం కరువయ్యాయి. ఈ విషయమై ఎమ్మెల్యే రోహిత్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన నిధులు మంజూరు చేయించారని కళాశాల ప్రిన్సిపాల్ శిరీష తెలిపారు. స్థల సేకరణ నిమిత్తం తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆక్రమణదారులకు నోటీసులు మెదక్జోన్: ‘చెరువులు చెరబడుతుండ్రు’ అని బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. కబ్జా చేసిన బఫర్జోన్ను పరిశీలించారు. చెరువులో పోసిన మట్టితో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన కలపను మూడు రోజుల్లో తొలగించాలని ఆదేశించారు. లేనిచో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈమేరకు అక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. చదువుల్లో రాణించాలి గజ్వేల్రూరల్: విద్యార్థులు చదువుల్లో రాణించినపుడే గుర్తింపు లభిస్తుందని సీపీడీసీ సభ్యులు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సభ్యులు లక్ష్మణ్, నరేష్, గోపాల్రెడ్డి, సుభాష్చంద్రబోస్ తదితరులు మాట్లాడారు. -
కిశోర బాలికల ‘సంఘ’టితం
రామాయంపేట(మెదక్): కిశోర బాలికల్లో సాధికారి త, ఆరోగ్య పరిరక్షణ, భద్రత, నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈవేసవి సెలవుల్లో 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలకు శిక్షణ ఇవ్వడానికి స్నేహ సంఘాలను ఏర్పాటు చేస్తుంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లో సంఘాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తుంది. అధికారుల పర్యవేక్షణ జిల్లాలోని 492 పంచాయతీల పరిధిలో స్నేహ సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 422 గ్రూపులు ఏర్పాటు చేశారు. వీటిలో 4,220 మంది కిశోర బాలికలు సభ్యులుగా చేరారు. ఈ వేసవి సెలవుల్లో బాలికలు విద్య, నైపుణ్యాల అభివృద్ధి విషయమై శ్రద్ధ చూపడం, ఆరోగ్య పరిరక్షణ, బాల్య వివాహాలు, కూలీ పనులకు దూరంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. జిల్లా పరిధిలోని గ్రామీణాభివృద్ధి శాఖ, సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఎంపిక చేసిన కిశోర బాలికలకు 12 అంశాలపై వీఓఏలు, సీసీలు, మహిళా సంఘాల ప్రతినిధులు ప్రతి నెల రెండో, నాలుగో ఆదివారం శిక్షణ ఇవ్వనున్నారు. అన్ని గ్రామాల్లో ఏర్పాటు జిల్లాలో అన్ని గ్రామాల్లో స్నేహ సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా కిశోర బాలికలకు ప్రతి నెల రెండు, నాలుగో ఆదివారాలు ప్రత్యే కంగా శిక్షణ అందించనున్నాం. ముఖ్యంగా ఆరోగ్యం, చదువు, ఇతర అంశాలపై వారికి అవగాహన కల్పిస్తాం. వారు సమాజంలో తలెత్తుకొని బతికే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శిక్షణలో నేర్పించేవి ఇవే.. సాధికారతకు ‘స్నేహ’ హస్తం -
సహజ ఎరువులకు ప్రాధాన్యం
కేవీకే శాస్త్రవేత్త రవికుమార్టేక్మాల్(మెదక్): రైతులు అధిక దిగుబడులు పొందాలంటే సహజ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలని తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సుపోషణ– భూ సంరక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని బొడ్మట్పల్లిలో జొన్న పంటను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన పంటల సంరక్షణ, అధిక దిగుబడి సాధించడానికి రైతులు చేపట్టాల్సిన చర్యలు, నూతన యాజమాన్య పద్ధతులు, భూ సారవంతం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎప్పుడూ ఒకే పంట వేయకుండా పంట మార్పిడి చేస్తే ఎక్కువ దిగుబడులు పొందవచ్చన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలతో పంటలు సాగు చేయాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి రాంప్రసాద్, టెక్నికల్ ఏడీఏ వినయ్కుమార్, టెక్నికల్ ఏఓ వందన, పలువురు రైతులు ఉన్నారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ఎమ్మెల్యే సునీతారెడ్డికొల్చారం(నర్సాపూర్): ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని రంగంపేట, దుంపలకుంట చౌరస్తాలో చలివేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ సరైన వసతులు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ధాన్యం నింపేందుకు గన్ని బ్యాగులు సరిపోను లేవన్నారు. ధాన్యం రవాణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు. ప్రధానంగా ధాన్యం లోడింగ్ చేసిన తర్వాత, లారీ ఏ రైస్మిల్కు వెళ్తుందన్న విషయమై రైతులకు చివరి వరకు తెలియడం లేదన్నారు. నిబంధనల పేరిట అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లా అధికారులు ఈ విషయంలో వెంటనే స్పందించి, సజావుగా కొనుగోళ్లు, రవాణ జరిగేలా చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో మండల టాపర్గా నిలిచిన రంగంపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని స్పందనను అభినందించారు. ఆమె వెంట తుక్కాపూర్, పైతర సర్పంచ్లు ఆంజనేయులు, రవితేజరెడ్డి, నాయకులు మల్లేశం, రాజా సంతోష్ కుమార్ ఉన్నారు. -
స్వీయ గణన నమోదు చేసుకోవాలి
మెదక్ కలెక్టరేట్: ప్రజలంతా సెల్ప్ ఎన్యుమరేషన్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా జనగణన డిజిటల్ నమోదు ప్రారంభమైన సందర్భంగా మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో స్వయంగా తన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకోవడం వల్ల ప్రజల సమయం ఆదా అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. మే 11వ తేదీ నుంచి ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఆ సమయంలో ముందుగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన వారు నమోదు సమయంలో పొందిన ఐడీ నంబర్ తెలియచేయాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన ప్రతి ఒక్కరూ ఐడీ నంబర్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు. జిల్లా ప్రజలు అందరూ బాధ్యతతో పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
రవాణా సౌకర్యాలతోనే అభివృద్ధి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి చేగుంట(తూప్రాన్): రవాణా సౌకర్యాలతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని జైత్రం తండాలో రూ1.93 లక్షల నిధులతో బీఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో దుబ్బాక నియోజవర్గంలో అనేక గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధరావత్ సుభాష్నాయక్, బి.కొండాపూర్ సర్పంచ్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అండర్పాస్ వంతెన నిర్మాణానికి కృషి
ఎంపీ రఘునందన్రావుచిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రం నుంచి శాలిపేట గ్రామానికి వెళ్లే రహదారిపై రైల్వేట్రాక్ వద్ద అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం కృషిచేస్తానని ఎంపీ రఘునందన్రావు అన్నారు. నార్సింగి సర్పంచ్ సుజాతగౌడ్తోపాటు మరో ఎనిమిది గ్రామాల సర్పంచ్ల కోరిక మేరకు వంతెన నిర్మాణానికి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. ఆయన రైల్వే డీఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి ప్రతిపాదిత వంతెన గురించి వివరించారు. దానికి ఆయన ఒకటి రెండు రోజుల్లో రైల్వే టెక్నికల్ టీమ్ను పంపించి బ్రిడ్జి నిర్మాణానికి నివేదిక రూపొందిస్తామని చెప్పారు. జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి గురించి, లైట్ల ఏర్పాటుపై నేషనల్ హైవే అథారిటీ అధికారితో ఫోన్లో మాట్లాడారు. తక్షణం లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంపీ వెంట నార్సింగి సర్పంచ్ సుజాతగౌడ్, శాలిపేట, మడూర్ సర్పంచ్లు నారాయణ, దివ్యగౌడ్, ఉప సర్పంచ్లు రాజేందర్రెడ్డి, కిష్టయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబు, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్, బీజేపీ నాయకులు సత్యపాల్రెడ్డి, లింగారెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు వెన్నెముక సేవాదళ్
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక దాని అనుబంధ విభాగమైన సేవాదళ్ అని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మంగళవారం సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమర్థ శిక్షణ శిబిరానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్తో కలసి ఆమె హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కార్యకర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. అనంతరం మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ...రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి, పార్టీ సంస్థాగత బలో పేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ శిక్షణ శిబిరంలో చర్చించడం మంచి పరిణామమన్నారు. ప్రభు త్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులతోపాటు, పలువురు సీనియర్ నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా సేవాదళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
చెరువులు చెరబడుతుండ్రు
యథేచ్ఛగా కబ్జా ● అడ్డూఅదుపులేని అక్రమార్కుల దందా ● తాజాగా పిట్ల చెరువు సైతం మాయం! ● చోద్యం చూస్తున్న అధికారులు భూముల ధరలకు రెక్కలు రావడం.. రోజురోజుకు పట్టణ విస్తీర్ణం పెరుగుతుండటంతో చెరువులు సైతం కబ్జాకు గురవుతున్నాయి. కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోని చెరువులనే మాయం చేస్తున్నా.. సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. అధికారుల అండతోనే చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – మెదక్జోన్ జిల్లా కేంద్రంలో మల్లెంచెరువు, బంగ్లా, పిట్లం, గోసముద్రం, నాయకుని చెరువులు ఉన్నాయి. ఈ ఐదు చెరువులను నిజాంపాలనలో గొలుసుకట్టుగా తవ్వారు. ఒప్పుడు వీటిద్వారా వందలాది ఆయకట్టు భూములకు నీరందడమేకాక భూగర్భజలాలు పెరిగి తాగునీటి సమస్య తీర్చాయి. కాగా పట్టణ విస్తీర్ణం పెరగుతుండటంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో అక్రమార్కుల కన్ను చెరువులపై పడింది. ఇప్పటికే మల్లెం చెరువు, బంగ్లా చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకోగా తాజాగా పిట్లం చెరువుపై అక్రమార్కులు వల విసిరారు. చెరువు శిఖాన్ని పూడుస్తూ ఆక్రమించే పనిలో నిమగ్నమవడం గమనార్హం. కొనసాగుతున్న ఆక్రమణలు జిల్లా కేంద్రంలో ఐదు చెరువులు ఉండగా వాటిలో ఇప్పటికే రెండు చెరువులను అక్రమార్కులు ఆక్రమించి రూపురేఖలే మార్చారు. తాజాగా మరో చెరువును ఆక్రమిస్తున్నారు. వీటిలో ప్రధానంగా మల్లెం చెరువు చాలా వరకు కబ్జాకోరల్లో చిక్కుకుంది. ఈ చెరువు శిఖం భూమి 31 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 10 ఎకరాలకు వరకు ఆక్రమించి అందులో ఇళ్లు నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మల్లెం చెరువు ఇళ్ల నిర్మాణానికి నిలయంగా మారింది. అధికారులు మాత్రం 5.20 ఎకరాలు ఆక్రమణకు గురైందని చెబుతున్నారు. అలాగే బంగ్లా చెరువులోని బఫర్జోన్లో కొన్ని నెలల క్రితం ఓ వ్యక్తి తన పట్టా భూమి అంటూ బఫర్జోన్ను ఆక్రమించి ప్రహరీ నిర్మించారు. దానిని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ సర్వే చేయగా సదరు వ్యక్తి నిర్మించిన ప్రహరీ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని నిర్ధారించి తొలగించారు. అలాగే పట్టణ నడిబొడ్డున గల పిట్లం చెరువు శిఖం భూమి 105 ఎకరాలు ఉండగా, దాని ఆయకట్టు 300 ఎకరాల పైచిలుకు ఉంది. కొన్నేళ్లక్రితం ఓ వ్యక్తి బఫర్జోన్ను ఆక్రమించారు. దీంతో సదరు వ్యక్తికి ఇరిగేషన్ అధికారులు నోటీస్లు ఇచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరోవ్యక్తి ఏకంగా శిఖంభూమిలో మట్టిపోస్తూ చెరువును కబ్జా చేస్తున్నారు. దీంతో పక్కనే ఉన్నా సదరు కలప మిషన్ వ్యక్తి సైతం కొంత బఫర్జోన్ పరిధిని ఆక్రమించి తన అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇలా ఒకరిని చూసీ మరొకరు ఆక్రమించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అంతే కాకుండా పట్టణ నడి మధ్యలోనుంచి వెళ్తున్న మహబూబ్నగర్(ఎంఎన్) కెనాల్ కట్టకు సంబంధించిని బఫర్జోన్ పరిధిని ఆక్రమించి కొందరు భవనాలను నిర్మించారు. ఇలా జిల్లా కేంద్రంలో నీటి వనరులను పోటీపడి ఆక్రమిస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. చర్యలు చేపడతాం చెరువులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పట్టణంలో ఇప్పటికే కొన్ని చెరువులను ఆక్రమించగా ఆక్రమార్కుల నుంచి విడిపించాం. తాజాగా జరిగిన ఆక్రమణలు మా దృష్టికి రాలేదు. పరిశీలించి శాఖాపరమైనా చర్యలు తీసుకుంటాం. – నాగరాజు, ఇరిగేషన్ డీఈ మెదక్ -
సరిపడా ఇంధన నిల్వలు
● వినియోగదారులు సంయమనం పాటించాలి ● మెదక్ ఆర్డీఓ రమాదేవి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో సరిపడా ఇంధన నిల్వలున్నాయని, వినియోగదారులు ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని ఆర్డీఓ రమాదేవి కోరారు. మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ పంపును మంగళవారం సందర్శించారు. అదే సమయంలో 12,000 లీటర్ల ఆయిల్ ట్యాంకర్ (8000–పెట్రోల్, 4000–డీజిల్) బంకుకు చేరుకుంది. ప్రస్తుతం పెట్రోల్ 29,232 లీటర్లు, డీజిల్ 26,667 లీటర్లు నిల్వ ఉన్నాయని తెలిపారు. అనంతరం మెదక్ మండలం రాజ్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ పరిశీలించారు. గన్నీ సంచుల వివరాలు, తాగునీటి సౌకర్యం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇప్పటివరకు 1,200 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని సిబ్బంది తెలిపారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. ఆమె వెంట మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్బాబు ఉన్నారు. కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీఓ హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండల పరిధిలోని రాజ్పల్లిలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ రమాదేవి మంగళవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న గన్నీబ్యాగులు, మౌలిక వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. -
కో ఆప్షన్లో కుటిలం!
మెదక్ అర్బన్: బల్దియా కో ఆప్షన్ ఎన్నికలో అధికార కాంగ్రెస్ కుటిల ఎత్తుల ముందు బీఆర్ఎస్ చిన్నబోయింది. ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ వేసిన మాయో పాయ పాచికలకు బోర్లాపడింది. నమ్ముకున్న వారే బీఆర్ఎస్ను నట్టేట ముంచడంతో యుద్ధం చేయకుండానే ఆపార్టీ అస్త్రసన్యాసం చేసేసింది. సోమవారం జరిగిన బల్దియా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు నిలువుటద్దంలా నిలిచాయి. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన ఏడుగురు కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ లాగేసుకోవడంతో నాలుగు కో ఆప్షన్ పదవులు హస్తగతమయ్యాయి. కో ఆప్షన్ పదవి కోసం గులాబీ దళం నుంచి నామినేషన్ వేసిన ఓ అభ్యర్థి.. ఏకంగా ప్రత్యర్థులతో మిలాఖత్ కావడంతో దిక్కుతోచని స్థితిలో బీఆర్ఎస్ మిగతా ముగ్గురిని గైర్హాజరు చేయించి ఊరట చెందింది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతుండగా.. మరోవైపు కో ఆప్షన్ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగల్చడంతో పార్టీ వర్గాలు ఆవేదనకు లోనయ్యాయి. అడుగు దూరం నుంచి.. మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా 15 కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుని, అధికారానికి అడుగు దూరంలో నిలిచిన బీఆర్ఎస్.. తదనంతర పరిణామాల్లో ఆమడ దూరానికి పరిమితమైంది. 14 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. రోజు రోజుకు తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు ఆరంభించింది. రెండు నెలల్లోపే గులాబీ తమ్ముళ్లు..పార్టీకి గుడ్బై చెప్పి, హస్తం గూటికి చేరిపోయారు. ఒక్కొక్కరుగా ఏడుగురూ పార్టీని వీడారు. కనీసం కో ఆప్షన్ బరిలోకి దిగి ఉనికి చాటుకోవాలని నాలుగు పదవులకు బీఆర్ఎస్ నలుగురితో నామినేషన్ వేయించింది. కాగా, ఎన్నికకు ముందే జయరాజ్ అనే అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో జరుగుతున్న పరిణామాలతో పార్టీ నాయకత్వం ఖుదేలయ్యింది. గైర్హాజరు అస్త్రం ఈ నెల 27న జరిగిన కో ఆప్షన్ ఎన్నికకు కాంగ్రెస్..బీఆర్ఎస్ రెండు పార్టీలు గైర్హాజరు అస్త్రాన్ని ఎంచుకున్నాయి. కాగా, ఒక పార్టీ విజయాన్ని..మరో పార్టీ పరువును నిలుపుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఏడుగురు కౌన్సిలర్లు ఎన్నికకు గైర్హాజర్ అయ్యారు. అప్పటికే కాంగ్రెస్కు బీఎస్పీ అభ్యర్థితో కలసి 15 సభ్యులు ఉండగా, ఎమ్మెల్యే ఓటు ఉండటంతో మెజార్టీపై నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, బీఆర్ఎస్ నుంచి కో ఆప్షన్కు నామినేషన్ వేసిన ఒక అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఎలాగూ గెలిచే అవకాశం లేదు కాబట్టి మిగిలిన ముగ్గురు అభ్యర్థులు కూడా ఎన్నికకు గైర్హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన కొర్వి రాములు, రాగి వనజ, తాహెర్ అలీ, అనూష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలో మిగిలిన 8 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎన్నిక ప్రక్రియకు హాజరయ్యారు. -
ధర్మి చెరువును సందర్శించిన పీసీబీ
జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని ధర్మి చెరువును గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు మంగళవారం ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు సందర్శించారు. ఇటీవల గడ్డపోతారం అయ్యమ్మ చెరువు అలుగు తొలగించడంతో కాజిపల్లి ధర్మి చెరువులోకి రసాయన వ్యర్థాలు చేరుకున్నాయని అధికారులకు ఫిర్యాదులు చేశారు. చెరువును సందర్శించేందుకు వచ్చిన ఇరిగేషన్ డీఈ రామస్వామి, ఏఈ చక్రవర్తి, పీసీబీ ఏఈ రవీందర్తో కలిసి సంయుక్తంగా సందర్శనకు వచ్చారు. గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం లేకుండా అలుగును తొలగించడమేంటని ప్రశ్నించే క్రమంలో అధికారులు మధ్యలోనే వెళ్లియారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పీసీబీ అధికారులు చెరువులోని శాంపిళ్లను సేకరించారు. నివేదిక అనంతరం బాధ్యులైన పరిశ్రమలపై చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఇంద్రసేన, మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు, మాజీ కో ఆప్షన్ సభ్యులు వాహబ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం
మెదక్ కలెక్టరేట్: బాల్య వివాహాలు నివారిద్దామని, ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దామని అదనపు కలెక్టర్ నగేశ్ పిలుపునిచ్చారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం సాయంత్రం మెదక్ లోని రాందాస్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, చట్టాలు, హక్కులు కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బాల్యవివాహాలను నివారిద్దామంటూ ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, డీఎఫ్ఓ జోజి, డీటీఓ వెంకటస్వామి, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్, డీఈఓ విజయ, మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం: డీఆర్డీఓ నర్సాపూర్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని డీఆర్డీఓ శ్రీనివాస్రావు చెప్పారు. మంగళవారం స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్థానిక పిల్లల పార్కులో విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని, చిన్న వయస్సులో వివాహాలు చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వివరించారు. సీఐ జాన్రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ రంజిత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, ఇన్చార్జి ఎంపీడీఓ మౌజం హుస్సేన్, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రఘువరన్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శివకుమారి, సంతోషిమాత, మెహత తదితరులు పాల్గొన్నారు. -
రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి
కొల్చారం(నర్సాపూర్): పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని సంగారెడ్డి జిల్లా కంది వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధన సిబ్బంది రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’కార్యక్రమంలో భాగంగా పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవన ఎరువులతోపాటు పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి పంట రకాలపై రైతులకు వివరించారు.యూరియా వాడకాన్ని తగ్గించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల బోధన సిబ్బంది లక్ష్మణరావు, నీమ, కేవీకే శాస్త్రవేత్త రవికుమార్, సర్పంచ్ స్వర్ణలత, ఉప సర్పంచ సురేష్, ఏఓ శ్వేతా కుమారి, ఏఈఓ రాజశేఖర్ గౌడ్, వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. బాలికల సంరక్షణ అందరి బాధ్యతజిల్లా పంచాయతీ అధికారి యాదయ్య టేక్మాల్(మెదక్): బాలికల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో ఎంపీడీఓ రియాజొద్దిన్ అధ్యక్షతన బాలికల సంరక్షణ, మహిళాభివృద్ధి వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు బస్టాండ్ ప్రాంగణంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీపీఓ మాట్లాడుతూ చిన్న వయస్సులో తీసుకునే తప్పుడు నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపుతాయన్నారు. బాల్య వివాహలు చేసుకోవద్దని, అరికట్టాల్సిన బాధ్యత అందరు తీసుకోవాలన్నారు. బాలికలు లక్ష్యంతో చదువుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తులసీరాం, వైద్యాధికారిణి డాక్టర్ హర్షిత, మేజర్ పంచాయతీ సర్పంచ్ సుధాకర్, హెడ్కానిస్టేబుల్ దేవ్దాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మరమేష్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, నాయకులు పాపయ్య, భాస్కర్, సాయిబాబ, బాలకృష్ణ, ఆయా శాఖ ల అధికారులు, ఐకేపీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, బాలికలు తదితరులు పాల్గొన్నారు. 492 గ్రామాల్లో మే డే ఉత్సవాలుసీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం మెదక్ కలెక్టరేట్: సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడి కార్మిక హక్కులు కాపాడుకుందామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం మెదక్లోని కేవల్ కిషన్ భవన్ వద్ద మేడే కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 1వ తేదీన జిల్లాలోని 492 గ్రామాలలో మేడే ఉత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా కార్మికులు, కార్మిక చట్టాలను, 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారని ఆయన గుర్తు చేశారు. మే 1 నుంచి 7వ తేదీ వరకు మే డే వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏడు రోజులపాటు కార్మిక నాయకుల అమరవీరుల స్తూపాలను మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేడే వారోత్సవాలను గ్రామ స్థాయిలో ఉన్న కార్మిక వర్గం అంగన్వాడి, ఆశా, గ్రామ పంచాయతీ కార్మికులు, హమాలీ, మధ్యాహ్న భోజనం కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలునిచ్చారు. -
కొత్త కార్యవర్గాలను ఎన్నుకోండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీని బూ త్స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కార్యవర్గాలు ఏర్పాటు చేయాలన్నారు. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో సోమ వారం మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల క్రియాశీలక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలువురు నాయకులతో మీనాక్షి నటరాజన్ వన్ టూ వన్గా సమావేశమయ్యారు. పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న విషయాలను అడిగినట్లు తెలిసింది. అనంతరం మీనాక్షి మాట్లాడుతూ...బూత్, గ్రామ, మండల, బ్లాక్ జిల్లా కాంగ్రెస్ కమిటీల్లో మూడేళ్లు పూర్తయిన ప్రతీ ఒక్కరిని మార్చాలన్నారు. ప్రస్తుతం ఎన్నుకునే ఈ కమిటీ రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగుతారని, అందుకే ఈ కార్యవర్గం ఎన్నికల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆయా కార్యవర్గాలను ఎన్నుకుని వివరాలను పీసీసీకి పంపాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చేలా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి ప్రీతం, అహ్మదుల్లా, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి (సంగారెడ్డి), ఆంక్షారెడ్డి (సిద్దిపేట), ఆంజనేయులుగౌడ్ (మెదక్) తదితరులు పాల్గొన్నారు. -
వామ్మో! 4 గంటలా?
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు వ్యవసాయ కూలీలకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. ఈ విధానంతో కూలీలు ఉపాధి పనులకు వెళ్లేందుకు నిరాసక్తత చూపుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో అసలుకే వెళ్లకపోగా, మరికొన్ని గ్రామాల్లో కూలీల హాజరు శాతం సగానికి సగం పడిపోతోంది. పనిచేసే ప్రదేశంలో ఏకంగా 4 గంటల పాటు గడపాల్సి రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జహీరాబాద్: పనుల్లో పారదర్శకత కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎంఎంఎస్) విధానాన్ని ప్రభుత్వం ఈనెల నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా హాజరు తప్పనిసరి చేసింది. రోజుకు రెండుసార్లు కూలీల ఫొటోలను జియో–ట్యాగ్డ్, టైమ్–స్టాంప్ ఫొటోలను వర్క్సైట్ సూపర్వైజర్ అప్లోడ్ చేయాలి. ఒక్కో లబ్ధిదారుడికి ఈకేవైసీ చేస్తారు. దీన్ని ఆధార్కార్డుతో అనుసంధానం చేస్తారు. కూలీలు ఉదయం పని ప్రదేశం వద్దకు రాగానే ఫొటోను తీసుకోవాలి. ఉపాధి పనులు పూర్తి చేసుకున్నాక వచ్చిన సమయం నుంచి నాలుగు గంటలు లెక్క కట్టి రెండో ఫొటోను తీయాల్సి ఉంటుంది. నాలుగు గంటలకు ఒక నిమిషం తక్కువ ఉన్నా ఫొటోను యాప్ అనుమతించదు. వ్యక్తిగత లబ్ధిదారుల పనులకు కాకుండా మిగిలిన అన్ని పనులకు దీన్ని వర్తింపజేశారు. నెట్వర్క్లేని చోట ఆఫ్లైన్లో హాజరు నమోదు చేసి, నెట్వర్క్రాగానే అప్లోడ్ చేయవచ్చు. నెట్వర్క్ సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురైతే జిల్లా ప్రో గ్రాం కో ఆర్డినేటర్(డీపీసీ) మాన్యువల్ హాజరును ఆమోదించే అవకాశం కూడా ఉంది. ఇలా వచ్చి అలా వెళ్లడం కుదరదు గతంలో కూలీలు ఇలా వచ్చి గంటసేపు పనులు చేసుకుని తిరిగి వెళ్లిపోయేవారు. కొద్దిసేపు ఉపాధి పనులు చేసుకుని వెళ్లాక, ఉదయం 11 నుంచి 12 గంటలకు వ్యవసాయ పనులకు వెళ్లేవారు. ఎన్ఎంఎంఎస్ విధానంతో కూలీ పనులకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఉపాధికూలీల హాజరు శాతం 30% వరకు మాత్రమే ఉంటోంది. పనులు చేశాక గ్రూప్ఫొటో ఉపాధి పనులకు వెళ్లే కూలీలకు ఉదయం పూట వ్యక్తిగత ఫొటో తీస్తారు. నాలుగు గంటలు గడిచాక కూలీలందరినీ కలిపి గ్రూప్ఫొటో తీస్తారు. ఒక బృందంలో పదిమంది వరకు కూలీలు ఉంటారు. ఉదయం 8 గంటలకు పనులకు వెళ్లేవారు మధ్యాహ్నం 12 గంటల వరకు పని ప్రదేశంలోనే ఉండాలి. అనంతరం గ్రూప్ఫొటో దిగి వెళ్లాలి. ఒకరి స్థానంలో బదులు ఉండదు ఈ విధానంలో ఒకరికి బదులు మరొకరు పనిచేసే అవకాశం ఉండదు. ఇంతకుముందు జాబ్కార్డు కలిగి ఉన్న వారిలో ఒకరికి బదులు మరొకరు వచ్చినా హాజరు పడేది. భార్య బదులు భర్త, భర్త బదులు భార్య లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చినా హాజరు వేసేవారు. ఎన్ఎంఎంఎస్ విధానంలో ఇది అసలే కుదరదు. -
బదిలీలకు పీటముడి!
టీచర్ల బదిలీలకు జనగణన అడ్డంకిగా మారింది. దాదాపు 80 శాతం మంది ఆ విధుల్లోనే ఉన్నారు. మొదటి దశ మే 11 నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో, 2027 మార్చి వరకు విధుల్లో ఉన్న వారిని బదిలీ చేయొద్దని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. దీంతో టీచర్లలో అయోమయం నెలకొంది. ముఖ్యంగా జిల్లాలు దాటి వచ్చిన మహిళా గెజిటెడ్ హెచ్ఎంలు దూరభారంతో సతమతమవుతున్నారు. కాగా జిల్లాలో 3,551 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. – మెదక్ అర్బన్ టీచర్లకు జనగణన పీటముడిగా మారింది. నిబంధనల ప్రకారం మొదటిసారి ఇళ్ల గణాంకాల్లో పాల్గొన్నవారే, రెండోసారి వ్యక్తిగత వివరాల సేకరణ చేయాల్సి ఉంటుంది. దీంతో మేలో బదిలీలు జరిపితే సుదూర ప్రాంతాలకు వెళ్తే వారు తిరిగి రావడం కష్టం కావడంతో బదిలీలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా టీచర్లు రెండేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన వారు బదిలీకి అర్హులు. గెజిటెడ్ హెచ్ఎంలు అయితే ఐదేళ్లు, ఇతర టీచర్లు 8 ఏళ్లు ఒకేచోట పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. గతంలో 2018 జూలైలో ఒకసారి, 2024 జూన్లో మరోసారి బదిలీలు జరిగాయి. అయితే 2026 జూలైలో ట్రాన్స్ఫర్లు చేపడితే 2018లో బదిలీపై వచ్చిన వారికి 8 ఏళ్లు నిండుతాయని, తద్వారా ఎక్కువ మందికి బదిలీ అవకాశం దక్కుతుందని టీచర్లు అంటున్నారు. జూలై 31ని కటాఫ్గా నిర్ణయించి, ప్రమోషన్లు, బదిలీలు నిర్వహించాలని కోరుతున్నాయి. కాగా గెజిటెడ్ హెచ్ఎం కేడర్ మల్టీజోన్ పోస్ట్ కావడంతో 2023లో ప్రమోషన్లు ఇచ్చినప్పుడు, ఖమ్మం, హనుమకొండ, కొత్తగూడెం, భద్రాద్రి, వరంగల్ తదితర జిల్లాల నుంచి హెచ్ఎంలు ప్రమోషన్పై మెదక్ జిల్లాకు వచ్చారు. ఇందులో మహిళలు చాలా మంది ఉన్నారు. కుటుంబాలకు దూరమై ఇక్కడ విధులు నిర్వర్తించడం కష్టంగా మారిందని వాపోతున్నారు. టీచర్లకు అడ్డంకిగా మారిన జనగణన -
బంకుల్లో బారులు
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026జిల్లాలో మళ్లీ పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. కొందరు ముందు జాగ్రత్తగా డబ్బాల్లో నింపుకొన్నారు. వరికోతల వేళ డీజిల్ కొరత ఏర్పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చర్లపల్లి ఐఓసీ నుంచి జిల్లాకు డీజిల్ సరఫరా అవుతుంది. అక్కడ నిల్వలు లేకపోవడంతో సమస్య ఏర్పడింది. ఈ విషయమై కలెక్టర్ డీలర్లలో గూగుల్మీట్ నిర్వహించారు. మంగళవారం సాయంత్రంలోగా సమస్య తీరుతుందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. – నర్సాపూర్/ మెదక్కలెక్టరేట్ -
పేదల సొంతింటి కల సాకారం
పెద్దశంకరంపేట(మెదక్): పేదల సొంతింటి కల కాంగ్రెస్తోనే సాధ్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని రామోజిపల్లిలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు సొంత గూడును కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ జయశీల, నాయకులు నారాగౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, సంగమేశ్వర్, రమేశ్బాబు, మాజీ ఎంపీపీ రాజు, అనంతరావు, రాంచందర్, సాయిలు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉద్యమంలో కళాకారుల పాత్ర గొప్పది చిన్నశంకరంపేట(మెదక్): తెలంగాణ ఉద్యమంలో కళాకారులు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల అన్నారు. సోమవారం మండల కేంద్రం మీదు గా మెదక్ వెళ్తూ కొద్ది సేపు ఇక్కడ ఆగారు. ఈసందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తె లంగాణ ఉద్యమంలో తమ ఆట, పాట ద్వారా ప్రజలను కళాకారులు జాగృతం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్నాయక్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రం,కాంగ్రెస్ నాయకులు రాజ్కుమార్, సాయిలు, స్వామి, సత్యం తదితరులు పాల్గొన్నారు. ‘నీట్’కు ఏర్పాట్లు చేయండి మెదక్ కలెక్టరేట్: మే 3వ తేదీన జరిగే యూజీసీ– నీట్ పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, నిరంతర విద్యుత్, శానిటేషన్, తరగతి గదుల శుభ్రత, బెంచీలు, బస్ సదుపాయం వంటి మౌలిక సదుపాయాలన్నీ ఈనెల 30 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, నీట్ కో ఆర్డినేటర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. పైరవీలకు తావు లేదు మెదక్జోన్: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్ర జావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో నేరుగా మాట్లాడారు. తక్షణమే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేప ట్టాలని, సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలకు తావు లేదన్నారు. నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీస్శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. -
మత్తుతో భవిష్యత్ అంధకారం
మెదక్ కలెక్టరేట్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్కు పునాది వేసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బాలల భద్రత– రక్షణ, మాదకద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారాన్ని పురస్కరించుకొని సోమవారం బాలల హక్కుల దర్శని ఎగ్జిబిషన్ను ప్రారంభించి మాట్లాడారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలల భద్రత, మత్తు పదార్థాల నివారణలో జిల్లాను అగ్రగామిగా నిలపాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై నిత్యం పర్యవేక్షణ కలిగి ఉండాలన్నారు. అనంతరం పోలీస్శాఖ ఆధ్వర్యంలో బాలికలకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి హేమాభార్గవి, ఆర్టీసీ డీఎం సురేఖ, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్డీఓ రమాదేవి, సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రకాశ్రావు ఆధ్వర్యంలో పీఎం ఇంటర్న్షిప్ వాల్పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి హవేళిఘణాపూర్(మెదక్): ధాన్యం కొనుగోలును అధికారులు పర్యవేక్షించి వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచామని, తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లను గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, సివిల్ సప్లై మేనేజర్ జగదీశ్ ఉన్నారు. -
అర్జీలపై తక్షణ చర్యలు తీసుకోండి
● అదనపు కలెక్టర్ నగేశ్ ● ప్రజావాణికి 80 వినతులుమెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలపై అధికారులు తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అధికారి బాధ్యతగా దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై ప్రజావాణిలో 80 అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా, అల్లాదుర్గం మండలం చిల్వెర గ్రామానికి చెందిన పలువురు యువకులు గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని, తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో విద్యార్థులకు కరాటే కోచ్ను నియమించకుండా నిధులు దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. -
హస్తానికే ‘కో ఆప్షన్’
● ఏకగ్రీవంగా ఎన్నిక ● గైర్హాజరైన బీఆర్ఎస్ కౌన్సిలర్లుమెదక్ కలెక్టరేట్: కో ఆప్షన్ స్థానాలు ఊహించినట్లుగానే హస్తం ఖాతాలో చేరాయి. సోమవారం నిర్వహించిన ఎన్నికలో కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన కొర్వి రాములు, రాగి వనజ, తాహెర్అలీ, అనూష ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నారు. మెజార్టీ కౌన్సిల్ సభ్యులు ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా బీఆర్ఎస్కు చెందిన కొంతమంది కౌన్సిలర్లు ఇటీవలే కాంగ్రెస్లో చేరగా, మరికొందరు సమావేశానికి గైర్హాజరయ్యారు. నామినేషన్ వేసిన సభ్యులు సైతం హాజరుకాకపోవడం గమనార్హం. ఈసందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు నూతనంగా ఎన్నికై న వారిని సన్మానించి అభినందించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రెండు కొత్త వాటర్ ట్యాంకర్లను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్ల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే రోహిత్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వడగండ్లు.. కడగండ్లు
చేగుంట(తూప్రాన్): ఆరుగాలం శ్రమ అకాల వర్షానికి కరిగిపోయింది. వడగండ్ల వాన కడగండ్లు మిగిల్చింది. పంట చేతికొచ్చే వేళ అన్నదాతల ఆశలు గాలి వానకు నెలకొరిగాయి. వారం క్రితం మండలంలోని మక్కరాజీపేట, కర్నాల్పల్లి, గొల్లపల్లి, రాంపూర్, కరీంనగర్తో పాటు వల్లభాపూర్ గ్రామాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి పైరు నేలవాలింది. వరి కంకుల నుంచి గింజలు రాలిపోయాయి. పంట నష్టపోయిన వారిలో సగం మంది కౌలు రైతులే ఉండటం గమనార్హం. ఎకరాకు రూ. 20 వేలకు పైగా పెట్టుబడి పెట్టి పంటలు వేసుకుంటే వడగండ్ల వాన తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు 5 వందల ఎకరాల వరకు పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు. అపార నష్టం మిగిల్చిన అకాల వర్షాలు ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు -
దుర్గమ్మా.. దీవించమ్మా
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జనసంద్రంగా మారింది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం పోసి, బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు చేపట్టారు. సత్రాలు దొరకక భక్తులు చెట్ల కింద టెంట్లు వేసుకొని విందు చేసుకున్నారు. సకాలంలో బిల్లులు అందించాలి ఫుట్బాల్ పోటీల్లో రాణించాలిగజ్వేల్రూరల్: రాష్ట్రస్థాయిలో జరుగుతున్న ఫుట్బాల్ పోటీల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్ అన్నారు. రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఆదివారం గజ్వేల్లో జెర్సీలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27 నుంచి 29 వరకు మంచిర్యాల జిల్లా రామకిష్టాపూర్ టాగోర్ ఫుట్బాల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి జూనియర్స్ గర్ల్స్ ఫుట్బాల్ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు అద్భుతంగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్ఐఎస్ కోచ్ నరసింహ, జీఎఫ్సీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహనీయులను మరవొద్దు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): ఆర్థిక, స్వేచ్ఛా సమా నత్వం కోసం పోరాడిన మహనీయులను మరవొద్దని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ నెల 30న దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో నిర్వహించే మహనీయుల ఉత్సవ సభ కరపత్రాలను ఆదివారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహనీయులను గుర్తు చేసుకోవడం శుభపరిణామమన్నారు. మహనీయులు కలలుగన్న ఆశయాలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవడానికి చీకోడ్లో చేపట్టిన బృహత్ కార్యక్రమానికి కవులు, కళాకారులు, మేధావులు, కార్మిక కర్షకులు అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఆస యాదగిరి, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
కుప్పకూలుతున్న బతుకులు
రామాయంపేట(మెదక్): ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఆరబెట్టుకునేందుకు అన్నదాత లు నానా అవస్థలు పడుతున్నారు. తేమ శాతం ఎక్కువగా లేకుండా చేసుకోవడానికి ధాన్యం ఆరబోతకు రహదారులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆరబోసిన ధాన్యం కుప్పలు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గతేడాది జిల్లాలోని పలు రహదార్లపై ఆరబోసిన ధాన్యం కుప్పలను ఢీకొని కనీసం నలుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. సమస్యను అధిగమించేందుకు.. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డు కలిగిన సన్న, చిన్న కారు రైతులు తమ సొంత పొలాల్లో కల్లాల నిర్మాణం చేపట్టేందుకు గతంలో అవకాశం కల్పించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా, బీసీ, ఓసీ రైతులకు 90 శాతం రాయితీపై కల్లాల నిర్మాణం చేపట్టేలా ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 1,600 మంది రైతులు కల్లాలు నిర్మించుకున్నారు. 250 మంది రైతులు నిర్మాణాలు ప్రారంభించినా, సకాలంలో నిధులు మ ంజూరు కాకపోవడంతో మధ్యలోనే నిలిపివేశారు. ఆ తర్వాత ఈ పథకం రద్దు కాగా, ఆశించిన స్థాయిలో అమలుకు నోచుకోలేదు.రామాయంపేట–మెదక్ రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కల్లాలు లేక రైతుల అవస్థలు రహదారులపై ధాన్యం ఆరబోత రాత్రివేళ చోటుచేసుకుంటున్న ప్రమాదాలురైతులకు నోటీసులు ప్రస్తుతం వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో రైతులు తమ పంట ఉత్పత్తులను రహదారులపై ఆరబెట్టుకుంటున్నారు. ఎల్లవేళలా రద్దీగా ఉండే జాతీయ రహదారిపై సైతం ధాన్యం ఆరబోస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని హైవే అధికారులు, పోలీసులు చెబుతున్నారు. రహదారులపై ధాన్యం ఆరబోస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈమేరకు రోడ్డుపై ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే కొత్తగా కల్లాల నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కల్లాలు మంజూరు చేయాలి వడ్లు ఆరబోసుకోవడానికి వీలుగా తమకు వంద శాతం సబ్సిడీపై కల్లాలు మంజూరు చేయాలి. ఈ సదుపాయం లేకపోవడంతో ధాన్యాన్ని రహదారుల, బో రు బావుల వద్ద ఆరబోసుకుంటున్నాం. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. – లాల్యనాయక్, చౌకత్పల్లి తండా -
క్రీడా సంరంభమే
వచ్చే నెలలో వేసవి శిక్షణ శిబిరాలు ● జిల్లావ్యాప్తంగా 10 క్యాంపులు ● 25 రకాల క్రీడలువేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రభుత్వం ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా వచ్చే నెల నుంచి వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన, క్రీడలశాఖ సమాయత్తం అవుతోంది. ఇందుకోసం ఆయా మండలాల్లోని క్రీడాకారుల నుంచి మరో రెండు మూడు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించనుంది. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 21 మండలాలు, 4 మున్సిపాలిటీలు ఉండగా.. 10 వేసవి క్యాంపులు ఏర్పాటు నిర్వహించేందుకు అనుమతులు వచ్చాయి. మే 1 నుంచి నెలాఖరు వరకు ఈ శిబిరాలను నిర్వహించనున్నారు. ఇందులో సుమారు 25 రకాల క్రీడలు నిర్వహించుకునే వీలు ఉండగా, ఒక్కో క్రీడా నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 6 వేల చొప్పున పదింటికి రూ. 60 వేలు మంజూరు చేసింది. అర్బన్లో నిర్వహించే క్రీడలకు ఫీజు జిల్లావ్యాప్తంగా 25 రకాల వేసవి శిక్షణ శిబిరాలు (కీడలను) నిర్వహించనుండగా, వాటిలో అర్బన్ ప్రాంతంలో సగం, గ్రామీణ ప్రాంతాల్లో మరో సగం చొప్పున నిర్వహించాల్సి ఉంది. కాగా ఇందులో అర్బన్ ప్రాంతాల్లో క్రీడాకారుల నుంచి ఒక్కో క్రీడకు ఒక్కో రకమైనా ఫీజు చెల్లించాల్సి ఉంది. అదే రూరల్ ఏరియాలో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఫీజు లేకుండానే ఉచితంగా పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అర్బన్ క్రీడల్లో ముఖ్యంగా అథ్లెంటిక్స్ క్రీడాకారుడు రూ. 400 చొప్పున చెల్లించాలి, బాస్కెట్బాల్కు రూ.400, బ్యాడ్మింటన్ రూ. 1,000, క్రికెట్, టేబుల్ టెన్నిస్ రూ.700, స్కేటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్లకు రూ.600 చొప్పున ఫీజు నిర్ణయించారు. వాడుకలో ఉన్న వాటికి ప్రాధాన్యం వేసవి శిక్షణ శిబిరంలో సుమారు 25 రకాల క్రీడలు ఉండగా, వాటిలో అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆయా ప్రాంతాల్లోని క్రీడాకారులు ఎక్కువగా ఏ క్రీడకు మొగ్గు చూపితే దానినే ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. క్రీడా నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక్కోదానికి ముందుగా రూ. 1000 ఇస్తారు. వాటితో క్రీడా మైదానం చదును, క్రీడాకారులకు తాగునీరు, తదితర అవసరాలకు ఉపయోగిస్తారు. క్రీడలు ముగిశాక ఒక్కో శిక్షణ శిబిరానికి రెమ్యూనరేషన్ కింద ఒక్కోదానికి రూ. 5 వేల చొప్పున పదింటికి మొత్తం రూ. 60 వేలు ఖర్చు చేయనున్నారు.దరఖాస్తుల స్వీకరణవేసవి శిక్షణ శిబిరాలను మరో నాలుగైదు రోజుల్లో ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయా మండలాల పరిధిలోని పీఈటీలు, పీడీలతో పాటు గతంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు వీటిని ఏర్పాటు చేసే అర్హత ఉంటుంది. కాగా అలాంటి వారి నుంచి ఒకటి, రెండు రోజుల్లో సంబంధిత అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిసింది.సద్వినియోగం చేసుకోండి మేలో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియో గం చేసుకోవాలి. జిల్లావ్యాప్తంగా అర్బన్లో 5, రూరల్లో 5 చొప్పున మొత్తం 10 క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఒక్కో క్యాంపునకు రూ. 6 వేల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. – రమేశ్, డీవైఎస్ఓ -
మహిళా బిల్లును అడ్డుకోవడం సిగ్గుచేటు
రామాయంపేట(మెదక్): కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును అడ్డుకోవడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 33 శాతం రిజర్వేషన్ అమలైతే చాలా మంది మహిళలు రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుందన్నారు. కుటుంబ పరిపాలన చేసుకుంటూ రాష్ట్రాలను దోచుకుంటుందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామాయంపేటను అసెంబ్లీ సెంగ్మెంట్ చేయడానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యం, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు, మండలశాఖ అధ్యక్షుడు నవీన్గౌడ్, కౌన్సిలర్ శంకర్గౌడ్, సర్పంచ్ యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి దిలీప్, కిసాన్ మోర్చా మండలశాఖ అధ్యక్షుడు సంగయ్య, నాయకులు రమణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ -
విద్యతో ఏదైనా సాధ్యమే
● అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో మంత్రి వివేక్ ● హాజరైన ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీమంత్రి చంద్రశేఖర్ న్యాల్కల్(జహీరాబాద్): క్రమశిక్షణ, పట్టుదలతోపాటు చదువుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిరూపించారని మంత్రి వివేక్ అన్నారు. మండల పరిధిలోని రాంతీర్థ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ...నాడు అంబేడ్కర్కు జరిగిన వివక్షతవల్ల చదువుకు దూరమై ఉంటే నేడు రాజ్యాంగం నిర్మాతగా ఉండే వారు కాదన్నారు. అంతంతమాత్రంగానే ఉన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు నాడు ఆర్బీఐ స్థాపనలో కూడా ఆయన కృషి ఎంతో ఉందని కొనియాడారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించడంతోపాటు దళితులు, కార్మికుల హక్కులు, అంటరానితనం కోసం పోరాటం చేశారని మంత్రి గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన అంబేడ్కర్ చూపిన మార్గంలో అందరూ నడుచుకోవాలని కోరారు. రాంతీర్థ్ నుంచి హద్నూర్ వరకు రోడ్డు బాగు చేయించాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు నర్సింహులు మంత్రి దృష్టికి తీసుకురాగా..అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. ఎంపీ సురేశ్ కుమార్షెట్కార్ మాట్లాడుతూ..అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశంలోని 140 కోట్లమంది నడుచుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది ఎంపీలం సోనియాగాంధీ వద్దకు వెళ్లినప్పుడు అందులో వివేక్ పాత్ర ఎంతో కీలకమైందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీమంత్రి చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్, జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ యూనూస్, జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్గౌడ్, సీనియర్ నాయకులు చంద్రప్ప, గౌని శివకుమార్, సిద్దిలింగయ్యస్వామి, వివిధ గ్రామాల సర్పంచ్లు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బంధం చెరువు మరమ్మతులకు మోక్షం
వర్గల్(గజ్వేల్): ‘సాక్షి’ కథనానికి స్పందన లభించింది. అయిదేళ్ల నిరీక్షణకు తెరపడింది. భారీ జలాశయం ‘బంధం’ చెరువు మరమ్మతులకు మోక్షం లభించింది. రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. కొండపోచమ్మ సాగర్ జలాలను హల్దీవాగులోకి తరలించే కీలక ఫీడర్ చానల్గా ప్రాధాన్యత కలిగిన చౌదరిపల్లి ‘బంధం’ చెరువు దుస్థితి వెల్లడిస్తూ ఈ నెల 21న ‘బంధం..బలహీనం’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ మేరకు స్పందించిన అధికారులు ఆదివారం చెరువు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. చెరువులో నీళ్లు అడుగంటిపోగా, కట్టవైపు మరమ్మతు పనులకు అవరోధం కలగకుండా మిగతా నీరు వెళ్లిపోయేలా ‘ట్రెంచ్’ (కాలువ) తవ్వారు. కట్టమీద చెట్ల తొలగింపు పనులు వేగవంతం చేశారు. -
సమన్వయంతో పనిచేయండి
మెదక్ కలెక్టరేట్: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నేటి నుంచి మే 2వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే బాలల భద్రత రక్షణ సంక్షేమ వారం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివా రం క్యాంపు కార్యాలయం నుంచి వివిధశాఖల అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందుకు గాను ఆర్డీఓలు, ఎంపీడీఓలు, పోలీస్, మండల ప్రత్యేక అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓలు రమాదేవి, రామకృష్ణ, జయచంద్రారెడ్డి, జిల్లా సంక్షేమాధికారిణి హేమభార్గవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఘనంగా వాసవీ మాత జయంతి ఆర్యవైశ్యుల కులదేవతగా వాసవీ మాతకు ప్రత్యేక స్థానం ఉందని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో వాసవీ మాత జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాటాడుతూ.. వాసవీమాత జయంతిని అధికారికంగా జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీవైఎస్ఓ రమేశ్, డీపీఆర్ఓ రామచంద్రరాజు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి అశోక్, ఉత్సవ కమిటీ చైర్మన్ నాగరాజు, నాయకులు చంద్రపాల్, మ్యాడం బాలకృష్ణ, అశోక్, వనజ, సుష్మ, పద్మ పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
ఉపాధి పనులకు రండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధిహామీ కూలీల హాజరు శాతం గణనీయంగా పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఆశాఖ అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఉపాధిహామీ పథకంలో చేపట్టిన ఈ పనులకు ఎక్కువమందిని తీసుకురావాలని క్షేత్రస్థాయిలో పనిచేసే మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓలు, మండలస్థాయిలో పనిచేసే ఉపాధిహామీ ఏపీఎంలను ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు గ్రామాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వంటి క్షేత్రస్థాయి సిబ్బందితో టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. చిన్న గ్రామమైతే కనీసం 100 మంది కూలీలు, పెద్ద గ్రామ పంచాయతీల్లో 200లకు మించి కూలీల హాజరు సంఖ్య ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. కీలక మార్పుల నేపథ్యంలో.. నిరుపేద వ్యవసాయ కూలీల వలసలను నివారించేందుకు స్థానికంగా పని కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం పేరును వీబీజీరాంజీగా మార్చుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఇందులోభాగంగా కీలక మార్పులు చేసింది. మరో రెండు, మూడు నెలల్లో కీలక మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో కూలీల సంఖ్యను వీలైనంత ఎక్కువగా పెంచి పనులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎండల తీవ్రత, వ్యవసాయ పనులు.. కూలీల హాజరు తక్కువగా ఉండటానికి ప్రధానంగా ఎండల తీవ్రతే కారణం. గత పక్షం రోజులు ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ పనులు చేస్తున్న కూలీలు అల్లాడిపోతున్నారు. దీంతో కూలీల సంఖ్య తక్కువ నమోదవుతోంది. మరోవైపు వ్యవసాయ పనుల్లో కూలీలు నిమగ్నమయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట వంటి ప్రాంతాల్లో జొన్న పంట కోతలు కొనసాగుతున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వరి కోత దశకు చేరుకుంటోంది. దీంతో కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో హాజరు అనుకున్నంత మేరకు నమోదు కావడం లేదు.జిల్లాల వారీగా టార్గెట్లు ఇలా.. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3.75 లక్షలమంది ఉపాధిహామీ కూలీలున్నారు. వీరికి 2.09 లక్షల జాబ్కార్డులున్నాయి. ఇందులో 1.85 లక్షలమంది కూలీలు మాత్రమే పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతీరోజు సుమారు 27,450 మంది కూలీలు ఈ పనులకు హాజరవుతున్నారు. ఈ సంఖ్యను ప్రతీరోజు 40 వేలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. సిద్దిపేట జిల్లాలో 3.84 లక్షలమంది కూలీలుండగా, 1.95 లక్షల జాబ్కార్డులున్నాయి. వీరిలో 1.86 లక్షలమంది కూలీలు ఉపాధిహామీ పనులు చేస్తారు. ఇందులో ప్రస్తుతం రోజుకు 32,790 మంది కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారు. ఈ సంఖ్యను 47,500లకు పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మెదక్ జిల్లాకు సంబంధించి 3.24 లక్షల మంది కూలీలుండగా, 1.63 లక్షల జాబ్కార్డులున్నాయి. ఇందులో 1.89 లక్షలమంది ఉపాధిహామీ పనులు చేస్తారు. ప్రస్తుతం రోజుకు 33,110 మంది కూలీలు పనులకు వస్తే..ఈ సంఖ్యను 42,800లకు పెంచాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.ఈజీఎస్ కూలీల హాజరు పెంచేందుకు టార్గెట్లు గ్రామాల వారీగా మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్షలు వీబీజీరాంజీగా పేరు మార్పు నేపథ్యంలో కీలక నిర్ణయాలు -
కార్మిక చట్టాలను కాపాడుకుందాం
మెదక్ కలెక్టరేట్: మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలని, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు ఉద్యమం చేపడతామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. శనివారం మెదక్ కేవల్ కిషన్ భవనంలో జిల్లా అధ్యక్షురాలు బాలమణి అధ్యక్షతన నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకున్న పనిగంటలను పెంచాలని కేంద్రం నిర్ణయించిందని ఆరోపించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను తొలగించడం సిగ్గుచేటు అన్నారు. మే 1 నుంచి 7 వరకు మే డే వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య, కార్యదర్శి మల్లేశం, కోశాధికారి నర్సమ్మ, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు -
ముడుపులు!
మిల్లింగ్ చార్జీల చెల్లింపులోనూ సివిల్ సప్లై అధికారులు ముడుపులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లకోసారి వచ్చే మొక్కుబడి చార్జీల్లో మూడు శాతం కమీషన్ను అసోసియేషన్ ద్వారా వసూలు చేస్తున్నారన్నా ఆరోపణలున్నాయి. ఇటీవల రూ.27.55 కోట్ల మిల్లింగ్ చార్జీలు విడుదల కాగా, అందులో బకాయిదారులకు సంబంధించి రూ.7.01 కోట్లు నిలిపివేశారు. కాగా వాటిని పొందేందుకు మిల్లర్లు పైరవీలు చేస్తున్నారు. – మెదక్ అర్బన్ జిల్లాలో సుమారు 204 మిల్లులకు సీఎంఆర్ ధాన్యం కేటాయించారు. ఇందుకు గాను మిల్లింగ్ చార్జీల కింద క్వింటాల్ ధాన్యానికి బాయిల్డ్ మిల్లుకు రూ.20, రా మిల్లులకు రూ.10 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. కాగా గత ఏడేళ్లుగా మిల్లింగ్ చార్జీలు రాలేదు. ఇటీవల జిల్లాకు 2019– 2024 సంవత్సరాలకు సంబంధించి వరకు రూ. 27.55 కోట్లు మంజూరయ్యాయి. వాటిలో క్లీన్చీట్ ఉన్న 114 మిల్లులకు రూ. 20.54 కో ట్లు చెల్లించారు. బకాయిలు, గ్యారంటీ ఇచ్చిన 90 మిల్లులకు సంబంధించి రూ.7.01 కోట్ల చెల్లింపులు నిలుపుదల చేశారు. కాగా కొంతమంది ఇతర మిల్లులకు గ్యారంటీ ఇవ్వడంతో వారికి రావాల్సిన మిల్లింగ్ చార్జీలు నిలిపివేసినట్లు సమాచారం. మిల్లింగ్ చార్జీలచెల్లింపులోనూ కమీషన్ జిల్లాలో పదిహేనేళ్ల కాలంలో మిల్లర్లు సుమారు రూ.228.40 కోట్లు బకాయిపడ్డారు. ఇందులో కొంత మంది మిల్లర్లపై ఆర్ఆర్యాక్ట్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కొంత మంది కోర్టులను ఆశ్రయించారు. కానీ ఇప్పటివరకు వసూళ్లలో పెద్ద మార్పు కనిపించడం లేదని తెలుస్తోంది. మిల్లింగ్ చార్జీల నుంచి కొంతమేర నిలుపుదల చేసినా, అవి ఏ మూలకు సరిపోవు. కాగా తోటి మిల్లర్లకు గ్యారంటీగా సంతకం పెట్టిన వారి మిల్లింగ్ చార్జీలు నిలుపుదల చేయడంతో వారు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై డీఎం జగదీశ్ను వివరణ కోరగా, బకాయిలు వసూలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. -
నియోజకవర్గానికో ‘ఏటీసీ’
నర్సాపూర్ రూరల్: ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభిస్తామని మంత్రి వివేక్ తెలిపారు. శనివారం మండలంలోని నారాయణపూర్లో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే స్కిల్స్ అవసరం అన్నారు. అందుకే ఏటీసీ సెంటర్లు ఏర్పాటుచేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరిని బడిలో చేర్పించి చదివించాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్గుప్తా, సర్పంచ్ దేవిసింగ్, ఎంఈఓ తారాసింగ్, హెచ్ఎం రవి తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు నర్సాపూర్: తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని మంత్రి వివేక్ చెప్పారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలో నగరాభివృద్ధి పథకం కింద రూ. 15 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసిందని, వాటికి వడ్డీలు చెల్లించడం తమకు భారంగా తయారైందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం కావొద్దని మాజీ సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అమలు చేసి అండగా నిలిచారని అన్నారు. పట్టణంలో పెండింగ్లో ఉన్న పలు పనులను నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరారు. -
పేదలు ఆత్మగౌరవంతో బతకాలి: మంత్రి దామోదర
రేగోడ్(మెదక్): పేదలు సొంతింటిలో ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాల్లో ఆయన పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం రేగోడ్లోని లబ్ధిదారుడు మహేశ్ నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కిషన్, డీఎస్పీ ప్రసన్నకుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దిగంబర్రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ పాటిల్, ఉపాధ్యక్షుడు భాస్కర్, కో అప్షన్ మా జీ సభ్యుడు చోటుమియా, వట్పల్లి ఏఎంసీ డైరెక్టర్ శ్రీధర్గుప్తా తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా జనగణన వెల్దుర్తి(తూప్రాన్): జనగణన పకడ్బందీగా చేపట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా అదనపు సెన్సెస్ అధికారి జోజి అన్నారు. శనివారం మండల కేంద్రంలో జనగణన టెస్టింగ్ ప్రక్రియను ఆకస్మికంగా సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. రెండు దశల్లో చేపట్టనున్న జనగణన ప్రక్రియలో మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన, మౌలిక వసతులు వంటి వాటిపై సాగుతుందన్నారు. పూర్తిగా డిజిటల్ విధానంలో చేపడుతున్న క్రమంలో ఎ న్యూమరేటర్లు, సూపర్వైజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రజలు ఇచ్చే సమాచారాన్ని ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సెన్సెస్ ఫీల్డ్ ట్రైనర్ నవీన్, తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీహరి, ఏఎస్ఓ సందీప్రెడ్డి, సెక్షన్ ఆఫీసర్లు అజీజ్, కలీం పాల్గొన్నారు. త్వరలోనే ఆర్వోబీ పనులు చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని రైల్వేగేట్ను శనివారం రైల్వే డిప్యూటీ ఇంజనీర్ నూరొద్దీన్ హబీబ్ సందర్శించారు. ఈసందర్భంగా రైల్వే గేటు వద్ద నిర్మించే ఆర్వోబీ గురించి కాంట్రాక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే రైల్వే గేటును మూసివేసి ఆర్వోబీ పనులు నిర్వహిస్తామన్నారు. వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ దారులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట ఇంజనీర్లు సమీర్, జగదీశ్తో పాటు రైల్వే సిబ్బంది, బీజేపీ నాయకులు ఉన్నారు. రేపు కో ఆప్షన్ ఎన్నికల సమావేశం మెదక్ కలెక్టరేట్: ఈనెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు మెదక్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలపై ప్రత్యేక సమావేశం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పురపాలక సంఘ సాధారణ సర్వసభ్య సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశాలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు హాజరు కానున్నట్లు చెప్పారు. మల్లికార్జునుడికి హైకోర్జు జడ్జి పూజలు కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని రాష్ట్ర హైకోర్టు జడ్జి నంద శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసా దం, శేషవస్త్రాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, చేర్యాల న్యాయమూర్తి తరుణి, సీఐ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కిచెన్ గార్డెన్లు తప్పనిసరి
రామాయంపేట(మెదక్): అంగన్వాడీల్లో కిచెన్ గార్డెన్లు తప్పనిసరని, ఏర్పాటు చేయని టీచర్లపై చర్యలు తీసుకుంటామని మెదక్ ఎంపీ రఘునందన్రావు హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ఐసీడీఎస్ సెక్టార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీల్లో సాధ్యమైనంత మేర ప్లాస్టిక్ను నిషేధించాలని సూచించారు. చిన్నారులను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు. ఈసందర్భంగా ఎంపీ అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేఽశారు. ఎంపీ వెళ్లిపోయిన అనంతరం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. చిన్నారులకు గ్యాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేసి మోడల్స్ బహుకరించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, సంఘం మండలశాఖ అధ్యక్షుడు ప్రభాకర్, సీడీపీఓ స్వరూప, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి
దుబ్బాక: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక ఐసీడీఎస్ కార్యాలయంలో ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు లేవని వెంటనే స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీల, వైస్ చైర్పర్సన్ సులోచన, కౌన్సిలర్లు, సీడీపీఓ ఎల్లయ్య, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
ధాన్యానికి గిట్టుబాటు ధర
రామాయంపేట(మెదక్): రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సూచించారు. మండలంలోని దామరచెరువులో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యాపారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గీతాంజలి, ఉపసర్పంచ్ పిట్ల నరేశ్, మాజీ సర్పంచ్ శివప్రసాదరావు, రామాయంపేట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
రోడ్డెక్కిన ప్రగతి చక్రాలు
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగియడంతో శనివారం ఉదయం ప్రగతి చక్రాలు రోడ్డెక్కాయి. చర్చలు సఫలం కావడంతో కార్మికులు మెదక్ ఎదుట టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మేడి రాధాకిషన్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నిర్ణయం తీసుకోవడం హర్షనీయం అన్నారు. సమ్మె విజయవంతానికి సహకరించిన అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. – మెదక్ కలెక్టరేట్ -
స్వీయ గణనలో పాల్గొనండి
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: జనాభా లెక్కలు ఎవరికి వారు స్వయంగా చేసుకునేలా ప్రభుత్వం యాప్ తీసుకొచ్చిందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకోసారి నిర్వహించే జాతీయ జనగణన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈనేపథ్యంలో ప్రజలు ఈసారి అందుబాటులోకి వచ్చిన డిజిటల్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆన్లైన్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ఈ సౌకర్యం ద్వారా ప్రజలు తమ ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం వంటి అంశాలను ఆన్లైన్లో సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు. వెబ్ పోర్టల్ను https://se.censes.gov.in ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. -
మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె
మెదక్ కలెక్టరేట్/నర్సాపూర్: ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగింది. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ డిపోల పరిధిలో సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఆత్మబలిదానం చేసుకున్న డ్రైవర్ శంకర్గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మెదక్లో కార్మికులు రాందాస్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. వీరికి బీఆర్ఎస్ నేత, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్, సీఐటీయూ తదితర సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల న్యాయ పోరాటానికి అండగా నిలబడతామన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్లో కార్మికులు ధర్నా నిర్వహించారు. వీరికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ పలువురు నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం కార్మికులు విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక సిబ్బందిని పూలు ఇచ్చి వేడుకున్నారు. ‘మీ కాళ్లు మొక్కుతాం.. మీరు డ్యూటీలు చేస్తూ మా కడుపులు కొట్టొద్దని’ బతిమిలాడారు. అనంతరం ఎస్ఐ రంజిత్రెడ్డి కార్మికులను అక్కడి నుంచి పంపించి వేశారు.మెదక్: డ్రైవర్ శంకర్గౌడ్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కార్మికులు నిరసన తెలిపిన కార్మికులు మద్దతు తెలిపిన పార్టీలు, సంఘాల నాయకులు -
అభివృద్ధిలో భాగస్వాములు కండి
చిన్నశంకరంపేట(మెదక్)/చేగుంట(తూప్రాన్): గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వామ్యులు కావాలని డీపీఓ యాదయ్య సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో రెండో విడత వార్డు సభ్యులు శిక్షణ ముగింపులో పాల్గొన్న ఆయన వార్డు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ అభివృద్ధికి సహకరించాలని, నిధులు సద్వినియోగం అయ్యోలా క్రియాశీలకంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, ఏపీఓ వినోద్, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం చేగుంట పంచాయతీలో సర్పంచ్ స్రవంతితో పాటు పాలకవర్గ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామంలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి సమస్యలను నివారించేందుకు ప్రత్యేకంగా బోరు బావులను తవ్వించుకోవచ్చని తెలిపారు.డీపీఓ యాదయ్య -
నేడు నర్సాపూర్లో మంత్రి పర్యటన
నర్సాపూర్: జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ శనివారం నర్సాపూర్లో పర్యటిస్తారని తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి తెలిపారు. నగరాభివృద్ధి నిధులతో పట్టణంలోని 15 వార్డుల్లో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పట్టణంలోని ఆరో వార్డులో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం, మండలంలోని నారాయణపూర్లో ‘బడిబాట’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారని వారు వివరించారు. -
గిరిజనులకు వరం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పథకం ప్రారంభించింది. వివరాలు 8లో u
శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026బదిలీలకు సై!మేలో పూర్తి కానున్న ప్రక్రియ మూడేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు స్థానచలనం అనువైన చోట పనిచేసేందుకు పైరవీలుప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు రాష్ట్ర సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మే 1వ తేదీ నుంచి 31 వరకు ఈ బదిలీల ప్రక్రియకొనసాగనుంది. మూడేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి స్థానచలనం కలగనుంది. అదే సమయంలో 4 ఏళ్లు పని చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ చేయనున్నారు. దీంతో అనువైన చోటుకు వెళ్లేందుకు పైరవీలు షురూ చేశారు. కాగా ఇందులో ఆరు శాఖలకు మాత్రం బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. – మెదక్జోన్ జిల్లాలో సుమారు 7 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా 2024లో నెల రోజులపాటు ఉద్యోగులకు బదిలీల ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వం.. రెండేళ్ల అనంతరం మళ్లీ అవకాశం ఇచ్చింది. కాగా ఇందులో మూడేళ్లు ఒకేచోట విధులు నిర్వహించిన ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకునేందుకు అర్హులుగా నిర్ణయించింది. నాలుగేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా బదిలీపై వెళ్లాల్సిందే. కాగా రాష్ట్రస్థాయి మల్టీజోనల్, జోనల్ స్థాయితో పాటు జిల్లా పరిధిలోనూ ఈ బదిలీల ప్రక్రియ జరగనుండటంతో అనుకూలమైన పోస్టింగ్ల కోసం ఉద్యోగులు అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది. 3 వేల పైచిలుకు.. జిల్లాలోని అన్నిశాఖల పరిధిలో పనిచేసే ఉద్యోగులు 7 వేల పైచిలుకు ఉండగా, వారిలో బదిలీ నుంచి మినహాయించిన ఆరు శాఖల ఉద్యోగులు పోనూ మిగితా 4,220 మంది ఉద్యోగులకు బదిలీకి అవకాశం ఉంది. వీరిలో మూడేళ్ల పాటు ఒకేచోట పనిచేసిన వారు సుమారు 3 వేల పైచిలుకు మంది ఉంటారని, ఇందులో 1,200 మంది నాలుగేళ్ల సర్వీసు నిండిన వారు ఉన్నట్లు తెలిసింది. వారికి ప్రత్యేక సడలింపు ఏదేనిశాఖలో గరిష్టంగా 40 శాతం మించకుండా బదిలీలు చేయాలి. అలాగే దివ్యాంగులు, స్పౌజ్, మరో ఏడాదిలో రిటైర్డ్ అయ్యే ఉద్యోగులతో పాటు అనారోగ్యంతో బాధపడే వారికి ఈ బదిలీల నుంచి ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు.ఆరు శాఖలకు మినహాయింపు జిల్లాలో అన్నిశాఖలు కలిపి 35 నుంచి 40 వరకు ఉండగా, వాటిలో ప్రత్యేకించి ఆరు శాఖలకు ఈ బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇందులో విద్యాశాఖ, రెవెన్యూ, కమర్షియల్, ఎక్సైజ్, రవాణా, ఫారెస్ట్ ఉన్నా యి. కాగా విద్యా, రెవెన్యూశాఖల ఉద్యోగులకు త్వరలో జరగబోయే జనగణన కారణంగా ఎన్యూమరేటర్లుగా గుర్తించి శిక్షణ ఇస్తున్నారు. అలాగే కమర్షియల్, ఎకై ్సజ్, రవాణశాఖలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేవి కావటంతో వాటిని మినహాయించారు. ఇక అటవీశాఖ ప్రత్యేక జీఓ ప్రకారమే బదలా యింపులు ఉంటాయని, ఈ సాధారణ బదిలీలతో ఈ శాఖకు సంబంధం ఉండదని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
సిద్దిపేటజోన్: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఐదు సార్లు వడగళ్ల వాన, ఒకసారి తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు నేటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. పంట నివేదిక ఆధారంగా పరిహారం చెల్లించాలన్నారు. గురువారం కురిసిన అకాల వర్షాలకు వివిధ పంటలు దెబ్బతిన్నాయని, అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్, నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులతో హరీశ్రావు ఫోన్లో మాట్లాడారు. సిద్దిపేట అర్బన్ మండల పరిధిలో అధి కంగా పంట నష్టం వాటిల్లిందన్నారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారని, వారిని ఆదుకోవాలన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు -
రీసర్వేతో భూ సమస్యల పరిష్కారం
పెద్దశంకరంపేట(మెదక్): భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కమలాపూర్లో భూముల రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 1929లో భూముల సర్వే జరిగిందని, ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో పకడ్బందీగా సాగుతుందన్నారు. అనంతరం జిల్లా సర్వే ఏడీ కిషన్ మాట్లాడుతూ.. జిల్లాలో 25 మ్యాపులు లేని గ్రామాలను ముందుగా గుర్తించి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతీ కమతానికి శాటిలైట్ ద్వారా సర్వే చేపట్టి భూధార్ నంబర్ కేటాయిస్తామన్నారు. అలాగే ప్రభుత్వ, గ్రామకంఠం, శిఖం భూములు గుర్తిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభుదాస్, ఎంపీడీఓ క్రాంతికుమార్, సర్వే ఇన్స్పెక్టర్ అజీమ్, సర్పంచ్ సుజాత, నాయకులు మధు, నారాగౌడ్, మురళి, రాజేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి


