breaking news
Medak District Latest News
-
పిల్లల భద్రతపై చర్యలు తీసుకోవాలి
మెదక్ కలెక్టరేట్: పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా మైనార్టీ పాఠశాలను పరిశీలించి మధ్యాహ్న భోజనం, వసతి సౌకర్యాలను ఆరా తీశారు. అనంతరం గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను పరిశీలించారు. అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని పెంపొందించే దిశలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
‘మైనంపల్లి’వి గొప్పలే.. చేతల్లేవ్
● తన హయాంలో మంజూరైన పనులకు శంకుస్థాపనలు ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలుపద్మారెడ్డి ఫైర్ రామాయంపేట(మెదక్): తమ హయాంలో మంజూరైన నిధులతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శంకుస్థాపనలు చేస్తూ, తానే నిధులు మంజూరు చేయించానని గొప్పలు చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిని మరిచిన ఎమ్మెల్యే ప్రతిపక్షాలను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. తమ హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 30 కోట్లు మంజూరయ్యాయని, ఈ మేరకు టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయిందని తెలిపారు. వాటికే ఎమ్మెల్యే మళ్లీ శంకుస్థాపన చేశారని విమర్శించారు. వాటికి సంబంధించిన జీఓ కాపీలను చూపించారు. మెదక్లో మెడికల్ కాలేజీ తమ హయాంలో మంజూరు చేయించగా, తానే చేయించినట్లు ఎమ్మెల్యే తప్పుడు ప్రకటనలు చేయడం తగదని హితవు పలికారు. రహదారుల నిర్మాణానికి గత ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. రామాయంపేట, మెదక్లో వందలాది డబుల్ బెడ్రూం ఇళ్లను నిరుపేదలకు పంచామన్నారు. ప్రజలు తరతరాలుగా మర్చిపోని విధంగా కేసీఆర్ అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట, చిన్నశంకరంపేట కెనాల్స్, రామాయంపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను రద్దు చేయించారని ఆరోపించారు. సమావేశంలో సహకార సంఘం అధ్యక్షుడు బాదె చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు జలందర్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో నాణ్యమైన విద్య
కలెక్టర్ రాహుల్రాజ్తూప్రాన్/నర్సాపూర్: ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నా రు. శుక్రవారం పట్టణంలో పలు గురుకులాలు, కళాశాలను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, తరగతి గదులు, స్టోర్ రూంలను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా..? అని ఆరా తీశారు. బియ్యం నిల్వ లు, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. కాల పరిమితి ముగిసిన వాటిని ఎట్టి పరిస్థితు ల్లోనూ వినియోగించకూడదని నిర్వాహకులను హెచ్చరించారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండ పాఠశాల సముదాయాన్ని, పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం నర్సాపూర్లో మండలంలోని గురు కుల పాఠశాలలు, కాలేజీలను తనిఖీ చేశారు. సమస్యలు తెలుసుకొని, సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యత లేని బియ్యం వస్తే ఎంఈఓలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మెదక్జోన్/మెదక్మున్సిపాలిటీ: మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపాలని, అందుకోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సమాజానికి చీడ పురుగులా మారిన నిరోధానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మాదకద్రవ్యాల నిరోధానికి పోలీస్శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదకరమైన మలుపుల వద్ద సైన్ బోర్డులు రేడియం స్టికర్స్ను ఏర్పాటు చేయాలన్నారు. -
ముసురుకుంటున్నాయ్..
● జ్వరాలతో జనం విలవిల ● జిల్లాలో నాలుగు డెంగీ కేసులు నమోదుమెదక్జోన్: వ్యాధులు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే జిల్లాలో నాలుగు డెంగీ కేసులు నమోదయ్యాయి. వేలాది మంది జ్వరాలతో మంచం పట్టారు. గ్రామాలు చెత్తతో పేరుకుపోయి దుర్వాసనతో కంపుకొడుతున్నాయి. ఈగలు, దోమలకు నిలయంగా మారి వ్యాధులు విజృంభిస్తున్నాయి. అయి నా అధికారులు, పాలకులు పట్టించుకోకపోవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 7,389 మందికి జ్వరాలు జిల్లాలో జూన్ నుంచి ఇప్పటివరకు నాలుగు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3 కేసులు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో నమోదు కాగా, మరొకటి హవేళిఘనాపూర్ మండలం బూర్గుపల్లి గిరిజన తండాలో నమోదైంది. అక్కడ ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవటంతో దోమలకు నిలయంగా మారిందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే ముందస్తు చర్యల్లో భాగంగా జ్వర సర్వే కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 7,389 మందికి జ్వరాలు రాగా, వారికి చికిత్స అందిస్తున్నారు. జ్వర పీడితులు ఎక్కువగా ఉన్న గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. పలువురి నుంచి రక్త నమూనాలు సేకరించి డెంగీ, మలేరియా లాంటి పరీక్షలుచేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె బాట! జిల్లావ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,697 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గత నాలుగు మాసాల నుంచి వేతనాలు రావటం లేదు. నెలల తరబడి వేతనాలు రాకపోవటంతో కుటుంబాలు గడవటం లేదని, వేతనం ఇస్తే తప్ప పనులు చేయమని ఇటీవల పలు మండలాల్లో కార్మికులు ఎంపీడీఓలకు వినతిపత్రాలు అందించారు. ఇప్పటికే చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పోయలేమని కార్యదర్శులు చేతులెత్తేశారు. దీంతో గ్రామాల్లో చెత్త సేకరణ నిలిచిపోయింది. ఇక కార్మికులు సైతం పనులు మానేస్తే పల్లెలు మరింత అధ్వానంగా మారే పరిస్థితి నెలకొంటుందని పలువురు వాపోతున్నారు.నిరంతరం వైద్య పరీక్షలు వానాకాలంలో సీజనల్ వ్యాధుల కట్టడికి నిరంతరం కృషి చేస్తున్నాం. ఆశావర్కర్లు గ్రామాల్లో జ్వర సర్వే చేసి ఏఎన్ఎంలకు సమాచారం ఇస్తున్నారు. వారు జ్వర పీడితులకు మందులు అందజేస్తున్నారు. అనుమానితులకు రక్త పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 4 డెంగీ కేసులు నమోదు కాగా, వారికి చికిత్స అందించాం. – శ్రీరాం, డీఎంహెచ్ఓ -
ప్రయాణికులకు బస్సులు కరువు
చేగుంట(తూప్రాన్): ప్రయాణికులకు సరిపడా బస్సులు లేవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఇబ్రహీంపూర్ శివారులో ఆర్టీసీ బస్సులో సౌకర్యాలను పరిశీలించారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేగుంట– దుబ్బాక రూట్లో ఒకే బస్సు నడుస్తుందని పలువురు వివరించారు. అనంతరం బస్సు డ్రైవర్ కండక్టర్తో మాట్లాడి బస్సులపై ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రయాణికులకు సరిపడా బస్సులను నడిపించడం లేదని ఆరోపించారు. ఉన్న బస్సుల్లో సౌకర్యాలు లేవని తెలిపారు. అధికారులు వెంటనే చేగుంట– దుబ్బాక రూట్లో ప్రయాణికులకు సరిపడా బస్సులు నడిపించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు నారాయణరెడ్డి, జిల్లా నాయకులు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి -
వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలిప్పించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగా జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ (సీఐజీ)లను ఏర్పాటు చేయాలని మెప్మాకు ఆదేశాలు ఇచ్చింది. ఈమేరక
● వీధి వ్యాపారులతో పొదుపు సంఘాలు ● మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు సన్నాహాలు ● మెప్మాకు ప్రభుత్వం ఆదేశం ● బ్యాంకుల నుంచి రుణ సదుపాయంజిల్లా వివరాలు.. మున్సిపాలిటీ వీధి ఏర్పాటు చేసే వ్యాపారులు సంఘాలు మెదక్ 4,096 25 నర్సాపూర్ 1,222 15 తూప్రాన్ 1,562 14 రామాయంపేట 1,320 20 మెదక్లో వీధి వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్లుజిల్లావ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీల్లో 74 వరకు సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రతి గ్రూపులో ఐదు నుంచి పది మంది సభ్యులు ఉండేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో మొదటి విడతగా మొత్తం 8,200 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. వీరితో ఏర్పాటు చేసే గ్రూపుల్లో ఎంపిక చేసిన సంఘాల్లోని సభ్యులకు ముందుగా శిక్షణ ఇవ్వనున్నారు. వారు బ్యాంకు ఖాతాలు తెరిచిన వెంటనే సంఘాల పొదుపు ప్రక్రియను పరిశీలించి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించనున్నారు. ఆరునెలల తర్వాత సంఘాలకు మొదటి విడతగా రూ. లక్ష, తర్వాత రూ. 3 నుంచి రూ. 5 లక్షలు, సకాలంలో చెల్లిస్తే రూ. 10 నుంచి రూ. 15 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే వీధి వ్యాపారులు ప్రత్యేకంగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా పీఎం స్వానిధి పథకం కింద దుకాణాలు నిర్మించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రమైన మెదక్లో పోస్టాఫీస్ పక్కనే 25 రేకుల షెడ్డులు నిర్మించారు. త్వరలో వీటిని వీధి వ్యాపారులకు కేటాయించనున్నారు. మిగితా మూడు మున్సిపాలిటీల్లో సైతం వీటిని నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. సభ్యులకు బీమా సదుపాయం పొదుపు సంఘంలో సభ్యులుగా చేరిన వ్యాపారులకు రూ. 2 లక్షల బీమా సదుపాయం కల్పించనున్నారు. ప్రమాదవశాత్తు సభ్యులు మృతిచెందితే వారికి బీమా వర్తిస్తుంది. ఈ మేరకు వీధి వ్యాపారులకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో గుర్తింపు కార్డులు అందజేశారు. దుకాణాలు కేటాయించిన అనంతరం వారితో పట్టణ వ్యాపారుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ చైర్మన్గా మున్సిపల్ కమిషనర్ ఉంటారని సమాచారం. -
కొలువుదీరిన నాచగిరి పాలకవర్గం
● చైర్మన్గా రవీందర్గుప్తా ఏకగ్రీవం ● ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లాలో సుప్రసిద్ధమైన నాచారం గుట్ట లక్ష్మీ నృసింహ క్షేత్రంలో శుక్రవారం నూతన ధర్మకర్తల మండలి కొలువుదీరింది. నాచగిరి ఆలయ ముఖమండపంలో ధర్మకర్తల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ధర్మకర్తలుగా జగ్గయ్యగారి శేఖర్గుప్తా, దేశపతి ఉషశ్రీ, గాల కిష్టయ్య, కర్రె పద్మ, జగ్గన్నగారి సురేందర్రెడ్డి, జే.ఎస్ తిరుమల్రావు, రుద్ర శ్రీహరి, కొత్తపల్లి శ్రీనివాస్, చందా నాగరాజుగుప్తతోపాటు, ఎక్స్అఫీషి యో మెంబర్గా జగన్నాథాచార్యులుతో ఆలయ సహాయ కమిషనర్ విజయరామారావు, ఇన్స్పెక్టర్ విజయలక్ష్మిలు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల ఏకగ్రీవ ఆమోదంతో పల్లెర్ల రవీందర్గుప్తా చైర్మన్గా ఎన్నికయ్యారు. నూతన చైర్మన్ను మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అభినందిస్తూ సన్మానించారు. చైర్మన్, పాలకమండలి ధర్మకర్తలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్రెడ్డి, విజయమోహన్, శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి తదితరులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా శనివారం నాచగిరి ఆలయ పాలకమండలి సమావేశం, సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. -
ఖర్గేకు సన్మానం
నర్సాపూర్: హైదరాబాద్లో శుక్రవారం జరిగిన ‘ కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ సన్మానించారు. పెండింగ్ వేతనాలు చెల్లించండి శివ్వంపేట(నర్సాపూర్): పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కార్మికులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. సమర్థవంతంగావిధులు నిర్వర్తించాలి కొల్చారం(నర్సాపూర్): ఎన్నికల విధులను సమర్థవంతగా నిర్వర్తించాలని ఆర్డీఓ మహిపా ల్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఎల్ఓలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎలాంటి ఒత్తిడికి లోనూ కావొద్దన్నారు. బూత్స్థాయి అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ కార్డును పరిశీంచాలన్నారు. అంతకుముందు మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల పత్రాలపై బీఎల్ఓలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్చారి, మాస్టర్ ట్రైనర్లు లక్ష్మీనారాయణ, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య మెదక్ కలెక్టరేట్: దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో నేల రాలిన తొలి అమరుడని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో బీసీ సామాజిక ఉద్యమ నాయకుడు దొడ్డి కొమురయ్య, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వర్ధంతిని వేర్వేరుగా నిర్వహించారు. ఈసందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ నగేష్, ఇతరశాఖల అధికారులు ఉన్నారు. ఉత్తమ పంచాయతీల ఎంపికపై అవగాహన పెద్దశంకరంపేట(మెదక్): జాతీయ ఉత్తమ పంచాయతీల ఎంపిక, అవార్డులపై శుక్రవారం మెదక్ డీఎల్పీఓ సురేష్బాబు ఆయా శాఖల అధికారులు, గ్రామ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ ఉత్తమ పంచాయతీల ఎంపికపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ షాకీర్అలీ, ఎంఈఓ వెంకటేశం, ఏఓ కృష్ణ, ఏఎస్ఐ చంద్రమోహన్, ఏపీఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే!
ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. సాంకేతిక సమస్యలు, రైతులు ముందుకు రాకపోవడంతో ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు కేవలం 24 శాతమే పూర్తి కావడం గమనార్హం. – మెదక్ కలెక్టరేట్ కేంద్ర ప్రభుత్వం రైతులకు 11 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ఆధార్కార్డు తరహా కార్డు అందించడంతో పాటు పక్కా వివరాలు అందుబాటులో ఉంటాయని భావించింది. అయితే జిల్లాలో ఆశించిన మేర ప్రక్రియ ముందుకుసాగడం లేదు. జిల్లాలో సాధారణ పట్టాలు కలిగిన రైతులు 2.96 లక్షలకు పైగా ఉండగా, ఇప్పటివరకు కేవలం 24 శాతమే నమోదు చేసుకున్నారు. కొన్ని రెవెన్యూ గ్రామాలు, ప్రత్యేక యాప్లో కనిపించకపోవడం, రైతులకు రెండు, మూడు గ్రామాల్లో భూములుంటే ఒక చోట నమోదు చేశాక.. మిగితావి అయినట్లుగా చూపుతుండటం, వివరాలు కనిపించకపోవడం వంటి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. గ్రామాల్లోకి వెళ్తున్న అధికారులు ప్రస్తుతం రైతుల వివరాల నమోదుకు ఏఈఓలకు అవకాశం కల్పించారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ప్రత్యేకంగా నమోదు కార్యక్ర మాన్ని చేపడుతున్నారు. అయితే వర్షాకాలం పంటల సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగు పనులకు వెళ్తున్నారు. దీంతో ఎక్కువ మంది నమోదు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఆధార్ సంఖ్యతో అనుసంధానం ఉన్న సెల్ఫోన్తో రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరో వైపు ఒక్కొక్కరి వివరాలు నమోదు చేసే సమయంలో మూడుసార్లు ఓటీపీ వస్తుంది. అయితే రెండోసారి ఓటీపీ సరిగా రావడం లేదు. అంతటా ఒకేసారి నమోదు చేస్తుండటంతో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో నమోదులో జాప్యం జరుగుతున్నట్లు సంబంధిత అధికారులుచెబుతున్నారు. అనేక ప్రయోజనాలు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుంది. పీఎం కిసాన్ సన్మాన్ నిధి, పీఎం సించాయి యోజన, పీఎం కిసాన్ మాన్–ధన్ యోజన, పీఎం ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు, ఉద్యానశాఖకు 60 శాతం సబ్సిడీ.. తదితర పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలు పొందాలంటే విశిష్ట గుర్తింపు తప్పనిసరి అని స్పష్టం చేసింది. జిల్లాలో ఇప్పటివరకు 24 శాతమే పూర్తి వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు ముందుకు రాని రైతులు తప్పనిసరి అంటున్న అధికారులుక్యాంపులు ఏర్పాటు చేశాం ఫార్మర్ రిజిస్ట్రీ కోసం వ్యవసాయ అధికారులు గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే రైతుల వివరాల నమోదుకు ముందుకు రావడం లేదు. దీనికి తోడు రైతుల ఆధార్కార్డుకు ఫోన్ నంబర్ లింకు లేకపోవడం, లింకు ఉన్న ఫోన్ అందుబాటులో లేకపోవడం, ఓటీపీల కోసం గ్రామాల్లో ఫోన్ సిగ్నల్స్ అందకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగానే నమోదు ప్రక్రియ ఆలస్యమవుతోంది. – విన్సెంట్ వినయ్కుమార్, డీఏఓ -
రైతు మురిసె
మత్స్యకార మణిహారం..నీ కోసం.. నేనున్నానని..కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన ప్రసాద్ సూరి ‘సాక్షి’తో పంచుకున్న ముచ్చట్లు.. – వివరాలు ఫ్యామిలీ యువర్స్లోవాన కురిసె..జీవితంలోని సంక్షోభ సమయాల్లో తన తల్లి తనకు అండగా నిలబడిందని బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ చెప్పారు. – వివరాలు 2లోమొన్నటి వరకు ఆందోళనలో ఉన్న రైతులకు ఇటీవల కురుస్తున్న వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే బోరు బావుల కింద వరి నాట్లు ప్రారంభం కాగా, వేలాది ఎకరాల్లో సాగు చేసిన పత్తితో పాటు ఆరుతడి పంటలకు వర్షాలు జీవం పోశాయి. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 3.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అందులో సింహభాగం 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగు కానుంది. మిగితా 45 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నాయి. కాగా మేలో కురిసిన ముందస్తు వర్షాలకు రైతులు దుక్కులు దున్ని పత్తి, కూరగాయలతో పాటు ఇతర ఆరుతడి పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో జూన్లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. 112.7 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 81.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఈ లెక్కన 31.2 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. అయితే గత వారం రోజులుగా పుష్కలంగా వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని కౌడిపల్లి, కొల్చారం, హవేళిఘనాపూర్, శివ్వంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట తదితర మండలాల్లో బోరుబావుల కింద రైతులు జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. కాగా వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటల్లోకి నీరు చేరిన తర్వాతే ఆయకట్టు భూముల్లో నాట్లు వేయనున్నారు. పెరిగిన భూగర్భజలాలు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూగర్భజలాలు పెరిగాయి. మేలో 15.37 మిల్లీమీటర్లు ఉండగా, జూన్లో 14.22 మిల్లీ మీటర్లకు చేరుకుంది. ఈ లెక్కన 1.15 మిల్లీమీటర్ల మేర పెరగటంతో బోరుబావుల్లో నీటి ఊటలు పెరిగాయి. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం జూన్ చివరి వారం నుంచి వర్షాలు కురువటంతోనే భూగర్భజలాలు పెరిగాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఊపందుకున్న వ్యవసాయ పనులు పత్తి, ఆరుతడి పంటలకు జీవంహల్దీవాగుపై 12 చెక్డ్యాంలు జిల్లాలోని హల్దీ ప్రాజెక్టు తూప్రాన్, వెల్దుర్తి, మాసాయిపేట, కొల్చారం, చిన్నశంకరంపేట, మెదక్, హవేళిఘనాపూర్ మండలాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ వాగుపై 12 చెక్ డ్యాంలు నిర్మించారు. ఏటా వేసవిలో కొండపోచమ్మసాగర్ నుంచి ఇందులోకి నీరు వదులుతారు. ఒక్కసారి నీరు వదిలితే 50 వేల ఎకరాల మేర వరి పంట పండుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలోని 7 మండలాల్లో రైతులు వరి నాట్లు జోరుగా వేస్తున్నారు. -
శాఖలవారీగా నివేదికలు ఇవ్వండి
డీఎల్పీఓ సాయిబాబకౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రగతి నివేదికలను శాఖలవారీగా ఇవ్వాలని డీఎల్పీఓ సాయిబాబ తెలిపారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి, జీవన ప్రమాణాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత, జీవనోపాధి, ఉపాధిహామీ పనులు, విద్యుత్ సరఫరా, రక్షిత తాగునీటి పథకం.. తదితర వివరాలను అందించాలని సూచించారు. అధికారులు ఇచ్చిన నివేదికలను పంచాయతీ కార్యదర్శులు నేషనల్ పంచాయతీ అవార్డుల కోసం ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్ల, విద్యుత్శాఖ ఏఈ సాయికుమార్, పీఆర్ ఏఈ మారుతి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఖమర్సుల్తానా, లక్ష్మి, ఏపీఓ పుణ్యదాస్ పాల్గొన్నారు. -
‘పంటల బీమాఅమలు చేయాలి’
నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా అమలు చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు యాదాగౌడ్, జిల్లా సలహాదారుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు రక్షణగా ఉంటుందన్నారు. పంటల బీమా లేకపోవడంతో రైతులు పలు విధాలుగా నష్టాలు చవిచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి రైతులను ఆదుకునేందుకు బీమా అమలు చేయాలని కోరారు. రైతులకు సరిపడా ఎరువులు చిన్నశంకరంపేట(మెదక్): వర్షాకాలం పంటలకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి విన్సెంట్ వినయ్కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని గవ్వలపల్లిలో ఆగ్రోస్ సెంటర్, పీఏసీఎస్, ఫ ర్టిలైజర్ దుకాణాల్లో ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 4 వేల మెట్రిక్ టన్నుల ఎరువు లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో ఈ–పాస్ విధానంలోనే రైతులు ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. ఆయన వెంట ఏఓ ప్రవీణ్కుమార్ ఉన్నారు. ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు రామాయంపేట(మెదక్): ఆయిల్పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఏడీఏ రాజ్నారాయణ అన్నారు. గురువారం తన కార్యాలయంలో రైతుల వద్ద నుంచి దరఖా స్తులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు. పంట ఉత్పత్తులను నేరుగా కంపెనీలే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చట్టం రూపొందించిందన్నారు. సబ్సిడీలు సైతం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు సాయికృష్ణ, సందీప్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు నమోదు చేసుకోవాలి: ఆర్డీఓ శివ్వంపేట(నర్సాపూర్): 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆర్డీఓ మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం శివ్వంపేటలోని రైతు వేదికలో బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి 18 సంవత్సరాలు నిండిన వారి పేర్లు నమోదు చేసుకుని వారికి ఓటుహక్కు కల్పించేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. తహసీల్దార్ కమలాద్రి, ఉప తహసీల్దార్ షఫీయోద్ధీన్, ఆర్ఐ కిషన్, బీఎల్ఓలు ఉన్నారు. అండగా ఉంటాం.. రామాయంపేట(మెదక్): కామారెడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మండలంలోని అక్కన్నపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మీనారాయణ కుటుంబాన్ని గురువారం పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి పరామర్శించారు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులకు కొంత ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్, సహకార సంఘం చైర్మన్ చంద్రం, సీనియర్ నాయకుడు పుట్టి యాదగిరి, యూత్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్, మాజీ జెడ్పీటీసీ సంపత్, అబ్ధుల్ అజీజ్, శ్రీకాంత్సాగర్ పాల్గొన్నారు. -
శుక్రవారం
4-7-2025కార్మికుల ఆస్పత్రికి సుస్తీ డిస్పెన్సరీలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. – 4లోపగలు కూలీ.. రాత్రి చోరీ చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ సదానందం వెల్లడించారు. – 4లోSimultaneously Printed at Hyderabad | Bangalore | chennai | Delhi | Mumbai | Anantapur | Guntur | Kadapa | Khammam | Karimnagar | Kurnool | Mahaboobnagar | Mangalagiri | Nalgonda | Nellore | Nizamabad | Ongole | rajamahendravaram | Srikakulam | Tadepalli Gudem | Tirupathi | Vijayawada | Visakhapatnam | Warangal -
సాంకేతికతతో కేసుల పరిష్కారం
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుచిలప్చెడ్(నర్సాపూర్)/కౌడిపల్లి/నర్సాపూర్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం చిలప్చెడ్ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలపై నిరంతరం అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణను అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీలైనంత ఎక్కువగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా దృష్టి సారించాలన్నారు. అలాగే కౌడిపల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేసి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం నర్సాపూర్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఫిర్యాదులు అందగానే వెంటనే స్పందించి బాధితులకు అండగా ఉండాలని చెప్పారు. సీసీ కెమెరాలు బిగించి, సక్రమంగా మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తూ ప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సందీప్రెడ్డి, ఎస్ఐ నర్సింహులు పాల్గొన్నారు. -
317 జీఓ బాధితులకు న్యాయం చేయాలి
చేగుంట(తూప్రాన్): జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలని తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు. గురు వారం మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం రద్దు, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె కా లం వేతనం అందించాలన్నారు. మోడల్ పాఠశాలల ఉపాధ్యాయులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై తపస్ సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో చేగుంట మండల తపస్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్, కృష్ణమూర్తి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో హోంవర్క్ చేయించాలి
డీఈఓ రాధాకిషన్ చిలప్చెడ్(నర్సాపూర్): సరైన సమయంలో సిలబస్ పూర్తి చేయడంతో పాటు, తప్పనిసరిగా విద్యార్థులతో హోంవర్క్ చేయించాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు చిట్కుల్ కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి లెక్కల పాఠ్యాంశాన్ని విన్నారు. విద్యార్థులతో మాట్లాడి, వారి హోంవర్క్ను పరిశీలించారు. ఐదో తరగతి విద్యార్థులతో ఎక్కాలు చదివించి దినచర్య గురించి అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీలో నూతనంగా ప్రారంభమైన ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థులతో చర్చించారు. బోధన, వసతులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. విద్యార్థులు మరింత అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించాలన్నారు. మండల విద్యాధికారి విఠల్, కాంప్లెక్స్ హెచ్ఎం రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడుల్లో సోలార్ కిచెన్ షెడ్లు
కలెక్టర్ రాహుల్రాజ్ పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో సోలార్ కిచెన్ షెడ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం పెద్దశంకరంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పీహెచ్సీని తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి మాట్లాడారు. రాబోయే రోజుల్లో వంట గ్యాస్తో పాటు సోలార్ కిచెన్ షెడ్లలో వంట వండేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. దీంతో కట్టెల పొయ్యి బాధలు ఉండవని, నిర్వాహకులకు వేతనాలు, బిల్లులు వెంటవెంటనే వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యత పాటిస్తూ మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయాలన్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్లో చేరే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి ఎస్సెస్సీ విద్యార్థులకు గణిత పాఠాలు బోధించారు. అలాగే పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుశాతం, రోగులకు అందిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ షాకీర్అలీ, ఎంఈఓ వెంకటేశం, వైద్యాధికారి షరీఫొద్దీన్, హెచ్ఎం విఠల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సింగూరులోకి వరద
1,560 క్యూసెక్కుల ఇన్ఫ్లో సింగూరు జలాశయంపుల్కల్(అందోల్): మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సింగూరు డ్యామ్లోకి వరద చేరుతోంది. బుధవారం 1,560 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరిందని ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరంతా మంజీరా నది ద్వారా, మునిపల్లి మండలం దుబ్బవాగు ద్వారా డ్యాంలోకి నీరు చేరుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 19.219 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు టీఎంసీల నీరు చేరిందని అదికారులు తెలిపారు. డ్యామ్ ఎగువ భాగం మహారాష్ట్రలోని లాతూర్లో కురుస్తున్న వర్షం డ్యామ్లోకి చేరుతుందని అధికారులు తెలిపారు. -
స్నేహితుడి ఆచూకీ కోసం..
పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం ఒడిశా నుంచి పటాన్చెరుకు వచ్చారు 28 సంవత్సరాల దీపక్. తన స్నేహితులతో కలిసి ఇస్నాపూర్లోని ఓ గదిని అద్దెకుంటున్నాడు. మూగ్గురు మూడు కంపెనీల్లో పనిచేసుకుంటున్నారు. మూడు నెలల క్రితమే దీపక్ ఈ సిగాచీ పరిశ్రమలో చేరారు. సోమవారం ఉదయమే పనికి వెళ్లిన దీపక్ ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఒక్కడే ఇక్కడ ఉండటంతో ఆయనకు సంబంధించిన కుటుంబసభ్యులు ఎవరూ ఇక్కడ లేరు. దీపక్తో పాటు అద్దె గదిలో ఉంటున్న తన స్నేహితులు సునాముద్దీన్, బవుజీలు ఇతర స్నేహితులు ఇప్పుడు దీపక్ ఆచూకీ కోసం పరిశ్రమ వద్దకు వచ్చి అధికారుల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అడిగితే అధికారుల నుంచి స్పందన లేదని సునాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అంగన్వాడీలబలోపేతానికి చర్యలు
వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల బలోపేతానికి చర్యలు తీసుకుంటుందని ఐసీడీఎస్ పీడీ హైమావతి అన్నారు. బుధవారం మండలంలోని శేరీల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి రిజిస్టర్ను తనిఖీ చేశారు. చిన్నారుల వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగిన బరువు ఉన్నారా..? అని పరిశీలించారు. అనంతరం శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ భవనాన్ని పరిశీలించారు. మరమ్మతులు చేపట్టినా ఫలితం ఉండదని, భవనాన్ని పూర్తిగా తొలగించి నూతన భవనం నిర్మించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఆమె వెంట టీచర్ దేవలత, సిబ్బంది ఉన్నారు. గ్రామాలు పరిశుభ్రంగాఉండాలి: డీపీఓ కౌడిపల్లి(నర్సాపూర్): వర్షాకాలం గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని డీపీఓ యాదయ్య తెలిపారు. బుధవారం కౌడిపల్లి పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. ప్రతి గ్రామం సంపూర్ణ పారిశుద్ధ్యంగా ఉండేలా చూడాలన్నారు. మురికి నీరు, చెత్త లేకుండా చూడాలని, రక్షిత తాగునీటి పథకంలో పైపులైన్ లీకేజీలు ఉంటే సరిచేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, కారోబార్ ఎల్లం ఉన్నారు. మోడల్ ఇందిరమ్మఇల్లు బాగుంది కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ. 5 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం, పంచాయతీ రాజ్ డివిజన్ కార్యాలయ భవానాన్ని అదనపు కలెక్టర్ నగేష్ బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం బాగుందన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. గ్రంథాలయానికి సొంత భవనం కేటాయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్ఐ శ్రీహరి, పీఆర్ ఏఈ మారుతి తదితరులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కల సాకారం కొల్చారం/నర్సాపూర్ రూరల్: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. బుధవారం కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఎలాంటి అపోహకు గురికావొద్దని సూచించారు. అలాగే నర్సాపూర్ మండలంలోని ఇబ్రహీంబాద్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాజిరెడ్డి భూమి పూజ చేశారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో యాదగౌడ్, రామగౌడ్, నరేష్, బీమ్, రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సర్కార్ బడికే సై..
బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు చేసిన ప్రచారం ఫలించింది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 834 మంది పిల్లలు అధికంగా చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. – మెదక్జోన్జిల్లావ్యాప్తంగా 926 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక, యూపీఎస్, ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. కాగా వీటిలో గత సంవత్సరం బడిబాటలో భాగంగా 4,908 పిల్లలు చేరగా, ఈ ఏడాది 5,742 మంది పిల్లలు కొత్తగా చేరారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 74,529లకు చేరింది. కాగా ఏటా జూన్లో 15 రోజుల పాటు బడిబాట కార్యక్రమం నిర్వహించేది. ఈసారి మాత్రం ముందస్తుగా ఉపాధ్యాయులు మే నెలలోనే నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వారి కృషి ఫలితంగా ఈ సారి విద్యార్థుల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. టీచర్ల పిల్లలు సైతం.. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే 25 మంది ఉపాధ్యాయులు వారి పిల్లలను స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి మార్పుకు నాంధి పలికారు. వీరిని ఆదర్శంగా తీసుకున్న పేద, మధ్య తరగతి వారు సైతం వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లోకి పంపుతున్నారు. ప్రభుత్వ టీచర్లు వారి పిల్లలను సర్కారు బడుల్లోనే చదివించాలనే నిబంధన తీసుకొస్తే పేద, మధ్య తరగతి వారంతా వారి పిల్లలను ప్రైవేట్కు పంపకుండా సర్కార్ బడులకే పంపిస్తారని పలువురు పేర్కొంటున్నారు.సత్ఫలితాలిచ్చిన బడిబాట గతేడాది కంటే పెరిగిన విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 5,742 మంది చేరిక -
అభివృద్ధి నిరంతర ప్రక్రియ
మెదక్జోన్: అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో రూ. 3.65 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి కోసం రూ. 30 కోట్లు మంజూరు చేశామన్నారు. అలాగే రూ. 3.65 కోట్లతో శభాష్నగర్, వెంకట్రావ్నగర్ కాలనీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తుచేశారు. వచ్చే నాలుగేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామన్నారు. అంతకుముందు మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘ సభ్యులకు రూ. 3.53 కోట్ల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు -
టెన్త్, ఇంటర్పై ప్రత్యేక దృష్టి
ఫలితాల్లో ఈసారి మొదటి స్థానం దక్కాలి ● ఆ దిశగా విద్యాబోధన సాగాలి ● ఎన్రోల్మెంట్ పెంచాలి ● కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: ఈసారి పది, ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లాకు మొదటి స్థానం రావాలని, ఆ దిశగా విద్యాబోధన సాగాలని కలెక్టర్ రాహుల్రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి మెదక్ సమీకృత కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నమోదు సంఖ్య పెంచాలన్నారు. అలాగే డ్రాపౌట్ సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల నమోదును పెంచుతూ డ్రాపౌట్స్ కారణాలను గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని అందించడం, డ్రాపౌట్స్పై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాలు మరింత మెరుగుపడే దిశగా కృషి చేయాలన్నారు. కష్టమైన సబ్జెక్టులపై, విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. పది పాసైన విద్యార్థులను ఇంటర్లో చేరేలా, ఇంటర్ పాసైన వారిని డిగ్రీలో తప్పనిసరిగా చేరేలా కృషి చేయాలన్నారు. ఇందుకోసం పటిష్ట కార్యాచరణ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు, సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థికి చదువు ప్రాముఖ్యత తెలియజెప్పాలన్నారు. గ్రామీణ పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందించాలన్నారు. సమావేశంలో డీఈఓ రాధాకిషన్, ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి, నోడల్ అధికారులు ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఇరిగేషన్ అదనపు ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్రప్రసాద్ కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. -
అయినవారి కోసం కుటుంబసభ్యుల పడిగాపులు
మూడు రోజులుగా నరకయాతన ● ‘సిగాచీ’ పేలుడు మిగిల్చిన పెనువిషాదంఅయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిగాచీ పరిశ్రమ ఎదుట బాధిత కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపు దక్కక.. అంతిమ సంస్కారాలు సాగక దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కనిపించిన వారినంతా.. ‘అయ్యా.. మా వాళ్లు ఏరీ? అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ పేలుడు ఘటన మిగిల్చిన విషాదం మూడు రోజులుగా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తే.. ఉపాధి దేవుడెరుగు.. ఉసురు పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతుండటం అందరినీ కలిచివేస్తోంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డిక్యాంపులో బిక్కుమంటూ.. బాధిత కుటుంబాల కోసం అధికారులు పాశమైలారం ఐలా కార్యాలయం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అక్కడి హెల్ప్డెస్క్లో రక్త నమూనాలను ఇచ్చి తమ వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్నారు. అధికారుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఆవేదనతో వేచి చూస్తున్నారు. ఆచూకీ తెలియగానే సమాచారం ఇస్తామని అధికారులు దాటవేస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.కుటుంసభ్యులు మరణిస్తే వేదన అంతా ఇంతా కాదు.. మరణించాడని తెలిసి చివరి చూపు కోసం.. అంతిమ సంస్కారాలైనా చేసుకుందామంటే మృతదేహం లభించకపోతే.. ఆ శోకం రెట్టింపవుతుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదనే సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు.. తమ వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. హెల్ప్డెస్క్కు వెళ్లి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ఉంచిన పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అధికారులను సంప్రదిస్తున్నారు. గంటలు కాదు.. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. -
‘సాంస్కృతిక’సలహాదారుగా అంజన్న
దుబ్బాకటౌన్: రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారు కమిటీ సభ్యుడిగా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, ఓయూ జేఏసీ చైర్మన్ దరువు అంజన్న నియామకమాయ్యరు. నేల కూలిన భారీ వృక్షం తప్పిన ప్రమాదం తూప్రాన్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న భారీ వృక్షం బుధవారం నేలకూలింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా పార్కింగ్ చేసిన బైక్లు, ఆటో, రిక్షాలు దెబ్బతిన్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు చేపట్టి చెట్టును తొలగించారు. -
రెండు రోజుల్లో అంగీకార పత్రాలు ఇవ్వాలి
అదనపు కలెక్టర్ నగేష్ మెదక్ కలెక్టరేట్: రైస్ మిల్లర్లు రెండు రోజుల్లో గ్యారెంటీ, అంగీకార పత్రాలను అందజేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లో రెవెన్యూ, పౌర సరఫరాలు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో రబీ కొనుగోలు ప్రక్రియ సంబంధించి బ్యాంక్ గ్యారంటీలు, సీఎంఆర్ డెలివరీపై అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి జిల్లాలో 36 రైస్ మిల్లులను గుర్తించామని తెలిపారు. ఆ మిల్లులకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీ రెండు రోజుల్లోగా అందించాలన్నారు. గడువులోగా సీఎంఆర్ డెలివరీ పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించారు. మిల్లులవారీగా కేటాయించిన ధాన్యం ఇప్పటివరకు అప్పగించిన బియ్యం వివరాలను తెలుసుకున్నారు. డెలివరీ ప్రక్రియను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, డీఎం సివిల్ సప్లై జగదీష్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
విద్యుత్శాఖలో అక్రమ బదిలీలు
● నిబంధనలకు విరుద్ధంగా జారీ ● రద్దు చేయాలని ఫిర్యాదు మెదక్ కలెక్టరేట్: విద్యుత్శాఖ ఎస్ఈ నిబంధనలకు విరుద్ధంగా జారీచేసిన బదిలీ ఆర్డర్లను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ విద్యుత్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్శాఖ ఎస్ఈ శంకర్ 30న తన రిటైర్మెంట్ రోజు రాత్రి 9 గంటలకు బదిలీల ఆదేశాలు ఇచ్చారన్నారు. ఉన్నతాధికారులు ఈ అక్రమ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే సీఎండీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సత్యనారాయణ, అశోక్, శేఖర్, కిరణ్, నాగరాజు, ప్రతాప్రెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరవింద్
ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ కౌడిపల్లి(నర్సాపూర్): రక్షిత మంచినీటి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉండాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరవింద్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పీర్లతండాలో మంచినీటి సరఫరా, ఇంటింటికి నల్లా కనెక్షన్లపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, తండాల్లో ప్రతి ఇంటికి నల్లాకనెక్షన్ ఉంది.. లేనిది సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మిషన్ భగీరథ పథకంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. కొత్తగా నిర్మించిన ఇళ్లతో పాటు నల్లా కనెక్షన్లు లేని ఇళ్లను గుర్తించి అవసరమైన కనెక్షన్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు తెలిపారు. నిధులు మంజూరు కాగానే నల్లాలేని ఇంటికి నల్లాకనెక్షన్ ఇస్తామని తెలిపారు. -
జిల్లాలో 30,30(ఎ) యాక్ట్ అమలు
జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని (జులై 1న నుంచి 31 వరకు) జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన లు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దన్నారు. అలాగే ప్రజాధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు సహకరించాలని కోరారు. భరోసా సిబ్బంది కృషి అభినందనీయం మెదక్ మున్సిపాలిటీ: ఫోక్సో కేసులు నిందితుడికి శిక్ష పడేలా విశేష కృషి చేసిన భరోసా సిబ్బందిని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. ఆరేళ్ల బాలికపై జరిగిన లైంగికదాడి కేసులో శిక్షపడేలా కృషి చేసిన భరోసా సిబ్బందికి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ చారుసిన్హా ప్రశంసా పత్రం అందజేశారు. ఈ తీర్పు భరోసా కేంద్రం యొక్క న్యాయ, మానసిక, సాంకేతిక సేవలపై అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. భవిష్యత్తులోనూ బాధితులకు న్యాయం, మానసిక బలాన్ని అందించేందుకు భరోసా కేంద్రం కృషి చేస్తూనే ఉంటుందన్నారు. -
సమ్మెలో కార్మికులు భాగస్వాములు కావాలి
శివ్వంపేట(నర్సాపూర్): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు భాగస్వాములు కావాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఆశా సిబ్బందితో కలిసి మహేందర్రెడ్డి పీహెచ్సీ వైద్యురాలు సాయిసౌమ్యకు సమ్మె నోటీసు అందజేశారు. గతంలో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్రం హరిస్తోందని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్తోపాటు ఇతర సమస్యలు సాధించుకునేందుకు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. కౌడిపల్లి సీహెచ్సీలో డాక్టర్స్డే కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రం కౌడిపల్లిలోని సీహెచ్సీ(పీహెచ్సీ) డాక్టర్స్ డేను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటలక్ష్మి, పీహెచ్సీ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ ఫెర్నాజ్లను వైద్యసిబ్బంది ఘనంగా సన్మానించి కేక్ కట్చేసి డాక్టర్స్డేను నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్సీ, పీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మొక్కలను సిద్ధం చేయాలి పెద్దశంకరంపేట(మెదక్): వనమహోత్సవానికి అన్ని గ్రామాల్లో మొక్కలను సిద్ధం చేయాలని ఇన్చార్జి ఎంపీడీఓ షాకీర్అలీ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని శివాయిపల్లిలో నర్సరీని పరిశీలించారు. గ్రామాల వారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటాలని గ్రామ కార్యదర్శి సవితకు సూచించారు. నూతన నర్సరీకి సంబంధించి బ్యాగ్ ఫిల్లింగ్ పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ సంతోష్కుమార్, ఫీల్డ్అసిస్టెంట్ మల్లేశం తదితరులున్నారు. ఎల్లమ్మ ఆలయం పూజలు కొల్చారం(నర్సాపూర్): మండల కేంద్రంలో కొలువైన రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో మంగళవారం అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఉదయం అభిషేకం, అలంకరణ పూజా కార్యక్రమాలతో పాటు మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ సన్నిధిలో అన్న ప్రసాదం నిర్వహించారు. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం నంగునూరు(సిద్దిపేట): ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఈఏపీసెట్ కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్కు మొదటి రోజు 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం విద్యార్థులకు ఐడీ, పాస్వర్డ్ అందజేశామని, ఐడీ పొందిన విద్యార్థులు కళాశాలలో చేరేందుకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని ప్రిన్సిపాల్ గోవర్ధన్ తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు అభినవ్ పాల్గొన్నారు. అవగాహన అవసరం మిరుదొడ్డి(దుబ్బాక): అంతర పంటలతో మ రింత ఆర్థికాభివృద్ధి సాధించాలంటే కంది సా గుపై అవగాహన ఉండాలని మండల వ్యవసా య అధికారి సత్యాణ్వేష్ సూచించారు. జాతీ య ఆహార భద్రత మిషన్ పప్పు దినుసులు 2025 పథకంలో భాగంగా రైతు వేదికలో రైతులకు కంది విత్తనాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. రెండు రోజుల్లో కాలేజీకి రోడ్డు హుస్నాబాద్రూరల్: పాలిటెక్నిక్ కాలేజీ రోడ్డు ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆ దేశించారు.‘కాలేజీకి రోడ్డు నిర్మించరూ..?’ అనే శీర్షికన సోమవారం సాక్షిలో వచ్చిన కథనానికి కలెక్టర్ స్పందించి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను పనుల వివరాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి రో డ్డు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు ప డుతున్న విషయం తెలిసిందే. దీంతో డీఈ మ హేశ్ మంగళవారం పనులు ప్రారంభించారు. -
పర్యావరణ పరిరక్షణౖపై చిత్రలేఖనం పోటీలు
హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో లయన్న్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అంశంపై చిత్రలేఖనం పోటీలు మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో 9వ తరగతి విద్యార్థిని ప్రసన్నకుమారి ప్రథమ బహుమతి, పదవ తరగతి విద్యార్థిని అక్షయ ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరికి ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజేశం, శశి, శేఖర్ పాల్గొన్నారు. నర్సాపూర్లో.. నర్సాపూర్: లయన్స్క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహ బంధు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు క్లబ్ అధ్యక్షుడు రాఘవేందర్రావు తెలిపారు. విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని వైద్యులకు సన్మానం, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, జోన్ చైర్మన్ బుచ్చెష్, అశోక్, వెంకటస్వామి పాల్గొన్నారు. -
జెండా పండుగను విజయవంతం చేయాలి
శివ్వంపేట(నర్సాపూర్): ఈ నెల 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి సైదుల్, జిల్లా అధ్యక్షుడు యాదగిరి అన్నారు. మంగళవారం శివ్వంపేటలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కోసం దిమ్మె నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 30 సంవత్సరాలు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం వల్ల వర్గీకరణ సాధించుకున్నట్లు చెప్పారు. గ్రామస్ధాయి నుంచి ఎమ్మార్పీఎస్ జెండా పండుగలో అన్ని వర్గాల వారిని ఆహ్వానించి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పోచయ్య, లింగం, నర్సింలు, భిక్షపతి, సురేష్, తదితరులు ఉన్నారు. -
● విత్తన, ఎరువుల దుకాణాలపై కొరడా ● వ్యవసాయ, పోలీస్ అధికారుల తనిఖీలు ● నాసిరకం, కాలం చెల్లినవాటిని అమ్మితే చర్యలు ● అప్రమత్తంగా ఉండాలని సూచన
వర్షకాలం సీజన్ ప్రారంభమవడంతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. నకిలీ విత్తనాలతో నష్టపోకుండా చూడాలని వ్యవసాయ, పోలీసు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. అప్పమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలిన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. చిలప్చెడ్(నర్సాపూర్): మండలంలో పీఏసీఎస్, నాబార్డ్ పరిధిలో ఒక్కొక్కటి, అలాగే ఆగ్రో రైతుసేవా కేంద్రంతోపాటు మరో మూడు ప్రైవేట్ ఎరువుల దుకాణాలు ఉన్నాయి. అన్ని దుకాణాలలో అధికారులు నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నారు. రికార్డులు పరిశీలించి, నకిలీ విత్తనాలమ్మితే దుకాణం సీజ్చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎరువులు, విత్తనాలను అధిక ధరలకు అమ్మినా నేరమని, అలాంటి దుకాణ యజమానుల వివరాలు తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి ఎరువులు, విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. కొనుగోలు చేసిన విత్తనాలు ఇతర దుకాణాలలో ఏ ధరలకు దొరుకుతున్నాయో ఆరా తీయాలి. అవసరమైతే వ్యవసాయాధికారుల సల హాలు తీసుకోవాలి. ముఖ్యంగా కొనుగోలు చేసిన రశీదులు తప్పనిసరిగా జాగ్రత్త చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు.చిలప్చెడ్లోని ఓ ఎరువుల దుకాణంలో సోదాలు నిర్వహిస్తున్న ఏఓ, ఎస్ఐ -
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
మెదక్జోన్: రోజురోజుకు ఆర్థికంగా చితికిపోతున్న స్వర్ణకారులను ఆదుకునేందుకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు పూనా రవిచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వర్ణకారులు వృత్తిపై ఆధారపడి ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దౌర్భాగ్య దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మెదక్లో మీడియాతో మాట్లాడారు. స్వర్ణకారుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్లిప్త ధోరణితో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. ఇటీవల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికై నా సానుకూలంగా స్పందించి స్వర్ణకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఏలేశ్వర బ్రహ్మచారి, కార్యదర్శి ఇటిక్యాల వేణు, కోశాధికారి ఎస్. కాశీనాతం, నాయకులు బ్రహ్మం,డి. మహేష్, సి.హెచ్.నరేష్, ఎం. నవీన్, రాజు తదితరులున్నారు. స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవిచారి -
ట్రేడ్ లైసెస్సుల ప్రక్రియ వేగవంతం
దుబ్బాక: మున్సిపాల్టీలో వాణిజ్య, వ్యాపార సముదాయాలకు జారీచేసే ట్రేడ్ లైసెన్స్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రుషికేష్ వాత్సవ్ ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ల జారీ ప్రక్రియ, భువన్ యాప్ ద్వారా ఇంటి పన్నులు చెల్లించే వివరాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణను కమిషనర్ రమేశ్ కుమార్తో కలిసి పరిశీలించారు. అనంతర ఆయన మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్సుల దరఖాస్తులపై అవగాహన కల్పించాలన్నారు. భువన్యాప్లో భవనాలు, వాణిజ్య, వ్యాపారాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, అనిల్రెడ్డి, నర్సయ్య తదితరులు ఉన్నారు. సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రుషికేష్ శ్రీవాత్సవ్ -
పాశమైలారంలో భారీ పేలుడు.. మరుభూమిగా ఘటనా స్థలం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి కోసం వస్తే ఏకంగా ఉసురే తీసేసింది సిగాచీ పరిశ్రమ. సోమవారం ఈ కంపెనీలో జరిగిన విస్ఫోటనం బతుకుదెరువుకోసం వలస వచ్చిన వారి జీవితాలను బుగ్గిపాలు చేసింది. పేలుడు ధాటికి దూరంగా ఎగిరిపడ్డ కార్మికుల మృతదేహాలతో..చిధ్రమైన శరీరభాగాలతో, కూలిన శిథిలాలతో సిగాచీ మరుభూమిని తలపించింది. తమ వారి ఆచూకీ కోసం బాధితుల ఆక్రందనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతిల్లింది. ఈ పారిశ్రామికవాడలో కార్మికుల కుటుంబాలు కోల్పోతున్నా పరిశ్రమ యాజమాన్యానికి మాత్రం సాధారణమేనని తరచూ జరిగే ప్రమాదాలు నిరూపిస్తూనే ఉన్నాయి. అనుభవాలు, ప్రమాద పాఠాల నుంచి యాజమాన్యాలు, ప్రభుత్వాలు గుణపాఠం నేర్వవని మరోసారి ఈ ప్రమాదంతో రుజువైంది. సోమవారం ఉదయం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.పారిశ్రామిక వాడలో విషాదంఉదయమే తమ ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగినట్లు సమాచారం తెలుసుకున్న బాధిత కార్మికుల కుటుంబసభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. కుటుంబసభ్యుల ఆచూకీ లభించకపోవడంతో కార్మికుల కుటుంబసభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. తమ వారు ఏమయ్యారో తెలియకపోవడంతో వారు అధికారుల చుట్టూ తిరిగారు. అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. దీంతో పాశమైలారం పారిశ్రామికవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. కాలినగాయాలతో బాధపడుతున్న తమ ఆత్మీయులను చూసి బోరున విలపించారు. కళ్లముందే విగత జీవులుగా మారిన తమ వారిని చూసి కన్నీరు మున్నీరుగా రోదించారు. తమ వారి జాడ ఎక్కడైనా లభిస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.ఎటు చూసినా హాహాకారాలు..వారంతా రోజు మాదిరిగానే విధుల్లోకి వచ్చారు. తమ తోటి కార్మికులు, ఉద్యోగులకు శుభోదయం చెప్పుకున్నారు. అప్పుడప్పుడే ఎవరికివారు తాము పని చేసే స్థలాల్లో నిమగ్నమవుతున్నారు. ఒక్కసారిగా మృత్యువు పేలుడు రూపంలో కబళించింది. ఉన్నపళంగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పొగ పూర్తిగా కమ్ముకోవడంతో చుట్టూ చీకటి. అగ్నికీలలకు దేహాలు ఆహుతైపోయాయి. శరీరభాగాలకు మంటలు అంటుకున్నాయి. మరికొందరి శరీరాలు మాడి మసైపోయాయి. ఎటు చూసినా హాహాకారాలు. ప్రమాదం నుంచి బయటపడేందుకు ఆర్తనాదాలు.. సిగాచీ పరిశ్రమల్లో రియాక్టర్ పేలిన ఘటనకు సంబంధించి భీతావహ వాతావరణం ఇది. ఎక్కడపడితే అక్కడ కార్మికుల శవాలు. కాలి బూడిదై.. మసైపోయిన శరీర భాగాలు. ఇలా పేలుడు జరిగిన ప్రదేశం పూర్తిగా మరుభూమిని తలపించింది.ఉపాధి కోసం వచ్చి అనంత లోకాలకు..వారంతా పొట్ట చేతబట్టుకుని వచ్చిన నిరుపేద కుటుంబాలే. ఉపాధి కోసం వందల కిలోమీటర్లు నుంచి వచ్చిన కార్మికులే అధికం. బిహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి భార్యాబిడ్డలతో వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. చాలీ చాలని జీతాలున్నప్పటికీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కార్మికుల కుటుంబాల్లో ఈ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పొట్ట చేతబట్టుకుని వచ్చిన తమ వారిని మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉపాధి కోసం వస్తే ఉసురే పోయిందని విలపిస్తున్నారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా తమ వారి ఆచూకీ లభించకపోవడంతో వారు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. -
అప్పుడే మేల్కొనుంటే..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గతేడాది మార్చిలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్లో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు సైతం శిథిలమయ్యాయి. ఈ ఘటనలో అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా 30 మంది క్షతగాత్రులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భారీ ఘటనతోనైనా సంబంధిత అధికారులు మేల్కొని ఉంటే..ఇప్పుడు ఇలా సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు ఘటన పునరావృతం అయ్యేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదం జరిగినప్పుడు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి..ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే దానిపై కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ కనీసం నిబంధనలు పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. కీలకపని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్ లేక.. పరిశ్రమల్లో కీలక పని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్తో పనిచేయించాలి. ముఖ్యంగా రియాక్టర్లు, బాయిలర్లు, బ్లోయర్లు, ఇలా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సంబంధిత అంశాల్లో అన్ని అర్హతలున్నవారికి విధులను అప్పగించాలి. కానీ, తక్కువ వేతనాలకు పనిచేస్తారనే కారణంగా ఇలాంటి కీలక ప్రదేశాల్లో అన్స్కిల్డ్ కార్మికులతో పనులు చేయించడంతో ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న పరిశ్రమల యాజమాన్యాలు ఇలా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ల తనిఖీలు ఏవీ.. పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలను పాటించేలా ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ, ఈ తనిఖీలు జిల్లాలో మొక్కుబడిగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి ప్రతినెలా ఠంఛనుగా మామూళ్లు పొందుతున్న ఈ శాఖ అధికారులు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించకపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమ ప్రమాదానికి కొద్దిరోజుల ముందే ఇదే హత్నూర మండలంలో కోవాలెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. సంబంధిత అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది. ప్రమాదం జరిగాక హడావుడి సంబంధిత అధికారులు ఇలా ప్రమాదం జరిగాక హడావుడి చేస్తున్నారే తప్ప ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఎస్బీఆర్గానిక్స్ భారీ పేలుడు ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో అంతకుమించి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. నాడు ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు మృతి.. ఇదే తరహాలో ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో ఘటన.. -
అర్జీలను తక్షణం పరిష్కరించాలి
ఆకలితో అలమటిస్తున్నా.. పక్షవాతంతో బాధపడుతున్నా.. తన బాగోగులు చూస్తారన్న ఆశతో ఉన్న అర ఎకరం ఇద్దరు కొడుకుల పేర రాశాను. కాని వారు నా ఆలనా పాలన చూడటం లేదు. అన్నం పెట్టకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నాను. తన భూమి తనకు ఇప్పించి ఆదుకోవాలని చేగుంట మండల కేంద్రానికి చెందిన పోచమ్మల లింగమ్మ కలెక్టర్ను వేడుకుంది.మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలపై 97 దరఖాస్తులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు. ● ఇద్దరు కొడుకులకు సమానంగా ఇల్లు పంచి ఇచ్చాను. కాని పెద్ద కొడుకు, చిన్న కొడుకుకు వాటా ఇవ్వడం లేదు. అలాగే నా బాగోగులు చూడటం లేదు. అడిగిన వారిపై దాడికి పాల్పడుతున్నాడు. న్యాయం చేయాలని కోరుతూ అల్లాదుర్గం మండలం చిల్వర గ్రామానికి చెందిన వంజరి నర్సింలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ● పెద్ద కూతురు భర్త చనిపోగా, ఇంట్లో ఉంచుకొని ఆసరా కల్పించాను. ఆలనా పాలనా చూస్తుందనుకున్నాను. కాని అక్రమంగా నా రెండు ఎకరాల భూ మి రాయించుకొని ఆగం చేస్తుంది. వెన్నుపూస విరిగి తీవ్ర అనారోగ్యంతో ఉన్న నన్ను పట్టించుకోవడం లేదని శివ్వంపేట మండలం పిలుట్లకు చెందిన పెద్ద గంగమ్మ ప్రజావాణిలో కలెక్టర్ను కోరింది. ● తాతల తరం నుంచి కాస్తులో ఉన్న భూమిని ఆక్రమించుకుంటూ తమను బెదిరిస్తున్నారని హవేళిఘణాపూర్ మండలం తొగిట గ్రామానికి చెందిన బాధితులు వాపోయారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం
పటాన్చెరు టౌన్: యాజమాన్యం నిర్లక్ష్యం..ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు తూతూ మంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి ఫార్మా పరిశ్రమలో పేలుడు ఘటన చోటుచేసుకుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన ప్రతీ కార్మికుడి కుటుంబానికి రూ.కోటి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, క్షతగాత్రలకు మెరుగైన వైద్యంతోపాటు రూ.50లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గ పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలుడు జరిగిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి ఎమ్మెల్యే గూడెం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా డీఐజి ఇక్బాల్, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 30 ఏళ్లుగా పరిశ్రమ నడిపిస్తున్న సిగాచి యాజమాన్యం ఎన్నడూ కార్మికుల భద్రత కోసం చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో కూడా ఇదే పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో మృతి చెందారని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన పరిశ్రమల తనిఖీల విభాగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల భద్రతను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి..ఘటనకు కారకులైన యాజమాన్యం, నిర్లక్ష్యం వహించిన పరిశ్రమ విభాగం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.50 లక్షలపరిహారం ఇవ్వాలి ఒకరికి ఉద్యోగం కల్పించాలి అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం -
పోలీసుల ఓవరాక్షన్
కార్మిక కుటుంబాల పట్ల దురుసు ప్రవర్తన పటాన్చెరు: ‘నా భర్త ఎక్కడ’అంటూ కొందరు మహిళలు గుండలవిసేలా విలపించారు. ఓ మహిళ మాట్లాడుతూ తన భర్త పేరు ఆస్పత్రిలో చేరిన వారి జాబితాలో లేదు. చనిపోయిన వారి జాబితాలో కూడా లేదని చెబుతున్నారు. మరి ఎక్కడున్నారు..? చెప్పాలి అంటూ బాధితులు తమ వారి ఆచూకీ కోసం కలియదిరుగుతుంటే లోపలికి రాకూడదంటూ పోలీసులు వారి పట్ల అమానవీయంగా దురుసుగా వ్యవహరించారు. అనిత, సంజీవ్లాల్ అనే మహిళలు పోలీసులతో వాదిస్తూ పోలీసులపై రాయి ఎత్తి పట్టి తిట్టిపోశారు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన మావాళ్లు ఇంటికి తిరిగి రాలేదు. పొద్దున్నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా..అని ఓ మహిళ వాపోయింది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన విస్ఫోటనంలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబీకుల పరిస్థితి ఇది. -
చేతకాని సర్కారుకు బుద్ధి చెప్పాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డికౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాల్లో చెత్తను తొలగించడం చేతకాని ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చెత్త ట్రాక్టర్లు నడపకపోవడం, మురికి కాలువలు శుభ్రం చేయకపోవడం, వీధి దీపాలు వెలగకపోవడం, పారిశుద్ధ్యం లోపించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతి ద్వారా పల్లెలు శుభ్రంగా ఉండగా, నేడు కనీసం ట్రాక్టర్లలో డీజిల్ పోయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. డీజిల్ పోయలేమని పంచాయతీ కార్యదర్శులు అంటే మెమోలు ఇస్తున్నారని వాపోయారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు మేమెందుకు డబ్బులు ఇస్తామని మంత్రి సీతక్క చెప్పడం ఆమె అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ పాలనపై 18 నెలలకే ప్రజలకు విరక్తి వచ్చిందన్నారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్లకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సార రామాగౌడ్, మాజీ ఎంపీపీ రాజు, ఉపాధ్యక్షుడు నవీన్గుప్త, నాయకులు మహిపాల్రెడ్డి, ప్రవీణ్కుమార్, కాంతారావు పాల్గొన్నారు. అనంతరం మహ్మద్నగర్ గేట్ వద్ద సబ్స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. -
తనిఖీకి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల తనిఖీ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ కోసం డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను వినియోగించుకోవాలన్నారు. అవసరమైన చోట అదనపు పోస్టులను మంజూరు చేయాలన్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ కోసం వినియోగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. టైలరింగ్లో ఉచిత శిక్షణ సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు 9490129839 నంబర్లో సంప్రదించాలని సూచించారు. జాబ్ మేళాతో నిరుద్యోగులకు మేలు నర్సాపూర్: నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సుమారు 60 కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొన్నారని చెప్పారు. నిరుద్యోగ యువత నుంచి స్పందన బాగున్నందున అవసరాన్ని బట్టి మళ్లీ జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, నాయకులు రిజ్వాన్, మల్లేష్, మహేష్రెడ్డి, సురేష్, సాగర్, చిన్న అంజిగౌడ్, నగేష్, రషీద్, ఎన్ఎస్యూఐ జిల్లా అద్యక్షుడు హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. గోశాలకు గ్రాసం అందజేత శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని దొంతి గోశాలకు పలువురు దాతలు అదివారం పశుగ్రాసం అందజేశారు. గోశాలలో గ్రాసం కొరతతో ఆవులు డొక్కలు చిక్కి.. బొక్కలు తేలాయని శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అందుకు గాను పలువురు దాతులు ముందుకు వచ్చారు. నర్సాపూర్కు చెందిన నరేష్యాదవ్, ఓంకార్ యాదవ్ కుటుంబ సభ్యులు ఎండు, పచ్చి పశుగ్రాసం గోశాల నిర్వాహకులకు అందజేశారు. ముత్యాలమ్మకుబండ్ల ఊరేగింపు మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలోని నవాబుపేట వీధిలో గ్రామ దేవతలైన గట్టమ్మ, ముత్యాలమ్మ ఆలయాల చుట్టూ ఆదివారం భక్తులు బండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఏటా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు బండ్లు, బోనాల ఊరేగింపు నిర్వహించడం అనవాయితీ. నవాబుపేట, ఫత్తేనగర్, కోలిగడ్డ, గోల్కోండ వీధి, దాయర.. తదితర వీధులకు చెందిన భక్తులు బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. -
ఆర్ఆర్తో ట్రాఫిక్ సమస్యలు దూరం
నారాయణఖేడ్: రింగురోడ్డుతో ట్రాఫిక్ సమస్యలు దూరమవుతాయని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రింగురోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలోని రహదారిని విస్తరించడంతో పాటు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. పట్టణం చుట్టూ రోడ్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు పట్టణం విస్తీర్ణం కూడా పెరిగనుందన్నారు. పేదల సంక్షేమానికి కృషి ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషిచేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. క్యాంపు కార్యా లయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రా మాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
అడుగుకో గుంత.. తప్పని చింత
రామాయంపేట(మెదక్): అది అత్యంత ప్రాధాన్యత గత అంతర్ జిల్లా లింకు రోడ్డు. మెదక్– కామారెడ్డి జిల్లాలలోని పల్లెలను కలుపుతూ వెలుతున్న ఈ రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. ఫలితంగా రెండు జిల్లాల పరిధిలోని గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేవలం 11 కిలోమీటర్ల పరిధిలో రోడ్డుపై 135 గుంతలు ప్రమాదకరంగా మారాయి. రెండుసార్లు రద్దయిన టెండర్లు మండలంలోని లక్ష్మాపూర్, కాట్రియాల, దంతేపల్లి, పలు గిరిజన తండాలను కలుపుతూ కామారెడ్డి జిల్లాకు ఈరోడ్డు అనుసంధానమైంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వాహనదారులు ఈ దారిలో ప్రయాణాలు సాగిస్తారు. కామారెడ్డి జిల్లాకు చెందినవారు మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, జోగిపేట, తదితర ప్రాంతాలకు వెళ్లడానికి ఇదే దగ్గరి రహదారి. రామాయంపేట మీదుగా వెళితే దూరం పెరుగుతుంది. దంతేపల్లి, కాట్రియాల, పర్వతాపూర్, లక్ష్మాపూర్, పలు గిరిజన తండాలకు చెందిన ప్రజలు కామారెడ్డి, నిజామాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈరోడ్డు మార్గం ద్వారానే వెలుతారు. ఇంతటి ప్రాధాన్యం గల ఈ రహదారి శిథిలమై మూడేళ్లు గడుస్తున్నా, అదికారులు, ప్రజాప్రతినిధులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రామాయంపేట– మెదక్ రోడ్డును కలుపుతూ మండలంలోని లక్ష్మాపూర్, దంతేపల్లి, మీదుగా కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం ఆరేపల్లి వరకు 11 కిలోమీటర్ల మేర తారు రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది. ఈ రహదారి బాగు కోసం గత ప్రభుత్వంలో రూ. రెండున్నర కోట్లు మంజూరు కాగా, పనులు నిర్వహించడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా టెండర్ రద్దయింది. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు మరమ్మతుకు రూ. 4.24 కోట్లు మంజూరు కాగా, టెండర్ పిలిచారు. ఈసారి కూడా ఎవరూ ముందుకు రాలేదు. పూర్తిగా గుంతలమయంగా మారిన రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డును పూర్తిస్థాయిలో మరమ్మతు చేయించాలని పలువురు కోరుతున్నారు. మరమ్మతులకు నోచుకోనిఅంతర్ జిల్లా లింక్ రోడ్డు 11 కిలో మీటర్ల ప్రయాణం నరకప్రాయం ఇబ్బంది పడుతున్న వాహనదారులు -
వన మహోత్సవానికి సన్నద్ధం
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లావ్యాప్తంగా శాఖల వారీగా ఎక్కడెక్కడ, ఏ రకాల మొక్కలు నాటాలనే విషయమై ఇప్పటికే అధికారులు అంచనాకు వచ్చారు. – మెదక్జోన్జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 492 గ్రామాలుండగా, 471 నర్సరీలు కొనసాగుతున్నాయి. వీటిలో 52.57 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది 37.10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిలో సింహభాగం డీఆర్డీఓ శాఖ పరిధిలో 25.66 లక్షలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 7.20 లక్షల మొక్కలు నాటనున్నారు. మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో 90 వేల చొప్పున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అటవీ జాతి మొక్కలే అధికం ఈ సంవత్సరం నాటే మొక్కల్లో అటవీ జాతికి చెందిన మొక్కలనే అధికంగా నాటనున్నారు. ఇందులో ప్రధానంగా గుల్మహర్, రేణి, సీతాఫల్, నలిమినార, రావి, మర్రి, మద్ది, వేట, టేకు, తదితర అటవీ జాతికి చెందిన మొక్కలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగితావి ఇళ్లలో పెంచుకునేందుకు కొన్నిరకాల పూల మొక్కలను సైతం సిద్ధంగాఉంచారు.శాఖల వారీగా లక్ష్యం డీఆర్డీఓ 25,66,000 అటవీ 7,20,000 వ్యవసాయ 30,000 ఉద్యాన 25,000 పరిశ్రమలు 15,000 ఇరిగేషన్ 10,000 మైనింగ్ 15,000 ఎకై ్సజ్ 40,000 డీడబ్ల్యూఓ 6,000 ఇతరశాఖలు 23,000 మెదక్ మున్సిపాలిటీ 90,000 నర్సాపూర్ 90,000 రామాయంపేట 30,000 తూప్రాన్ 50,000జిల్లాలో 24 శాతం మేర అడవులు జిల్లాలో అన్నిరకాల భూములు 6 లక్షల వరకు ఉండగా, భూ భాగానికి 33 శాతం అడవులు ఉండాలి, కానీ జిల్లాలో కేవలం 24 శాతం మేరకు మాత్రమే అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ లెక్కన ఇంకా 9 శాతం మేర అడవులు తక్కువగా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభం అయి నెల రోజులు కావొస్తున్నా జిల్లాలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. కాగా వానలు సమృద్ధిగా కురిసిన వెంటనే మొక్కలు నాటడం ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 37.10 లక్షల మొక్కలు లక్ష్యం శాఖల వారీగా కేటాయింపు సమృద్ధిగా వర్షాలు కురవగానేప్రారంభం -
15 నెలల పాలనలో కలెక్టర్ మార్క్
మెదక్ కలెక్టరేట్: అన్నిరంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పాలనలో కలెక్టర్ రాహుల్రాజ్ ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. ప్రభు త్వ లక్ష్యం నెరవేరాలి.. సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదకు అందాలి అనే లక్ష్యంతో 15 నెలల కాలంలో 255 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూనే.. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలుచేస్తున్నారు. ప్లాస్టిక్ను అరికడుతూ.. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నారు. వసతి గృహాల్లో బస చేస్తున్నారు. పంట పొలాల్లో రైతులను నేరుగా కలిసి వ్యవసాయ స్థితిగతులు తెలుసుకుంటున్నారు. వైద్యారోగ్య శాఖను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. తడి, పొడి చెత్తపై పెద్దఎత్తున అవగాహన కల్పి స్తున్నారు. ఈ– ఆఫీస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 1,700 ఫైల్స్ను ఆన్లైన్ ద్వారా పరిష్కరించారు. ప్రభుత్వ పాలనపై ఢిల్లీలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రసంగించి జిల్లా కీర్తిని చాటారు. పోలీస్, ఎకై ్సజ్ అధికారులను సమ న్వయం చేస్తూ జిల్లాలో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల నివారణకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. -
రేపు ఖేడ్లో ప్రజావేదిక
నారాయణఖేడ్: ఖేడ్ మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 30వ తేదీన ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. 2024 ఏప్రిల్ 1 నుంచి ఈఏడాది మార్చి 31 వరకు ఖేడ్ మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై ఈనెల 17 నుంచి గ్రామాల్లో 15వ విడత సామాజిక తనిఖీ ప్రారంభమైందన్నారు. తనిఖీపై తుది నివేదిక ఇవ్వడానికి ప్రజావేదికను నిర్వహిస్తున్నట్లు వివరించారు. మతోన్మాదుల కుట్రలు తిప్పికొట్టాలి: సీపీఎం సంగారెడ్డి ఎడ్యుకేషన్: భారత రాజ్యాంగ ప్రవేశిక నుంచి సోషలిజం, సెక్యులర్ పదా లను తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రకటించిన వైఖరి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండా రవికుమార్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో నాయకత్వ రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. భారతదేశం మత రాజ్యం కాకూడదని, అభివృద్ధి చెందిన దేశాల సరసన పోటీ పడాలని రాజ్యాంగ స్ఫూర్తి వెల్లడిస్తుందన్నారు. దేశాన్ని మత రాజ్యంగా మార్చాలని మతోన్మాద శక్తులు చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజలందరూ తమకు నచ్చిన మతాన్ని ఆచరిస్తూనే లౌకిక భావనతో పరమత సహనాన్ని కోరుకుంటున్నారన్నారు. ప్రజల మధ్య అనైక్యతను సృష్టించి మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకోవడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు, రాంచందర్, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, రేవంత్, నాగేశ్వర్ రావు, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
జూలై 15 వరకు విత్తుకోవచ్చు
ఏడీఏ రాంప్రసాద్టేక్మాల్(మెదక్): వర్షాభావ పరిస్థితులతో రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని జూలై 15 వరకు విత్తనాలు విత్తుకోవచ్చని పెద్దశంకరంపేట ఏడీఏ రాంప్రసాద్ తెలిపారు. శనివారం మండలంలోని బొడ్మట్పల్లిలో పత్తి పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తుగా కురిసిన వర్షాలకు విత్తనాలు మొలకెత్తాయని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు లేక రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, విత్తుకునేందుకు ఇంకా సమయం మించిపోలేదన్నారు. నేల పూర్తిగా తడిసిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని సూచించారు. రైతులు పంటల మార్పిడి చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చని అన్నారు. పంటల సాగు లో వ్యవసాయాధికారుల సలహాలు, సూచ నలు తీసుకొని సహజ ఎరువులను వాడుతూ యాజమాన్య పద్దతులు పాటించాలని వివరించారు. -
ఫైర్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
రామాయంపేట(మెదక్): తూప్రాన్, మేడ్చల్లో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని అగ్నిమాపక శాఖ రీజినల్ ఫైర్ ఆఫీసర్ సుధాకర్రావు తెలిపారు. శనివారం ఆయన స్థానిక ఫైర్స్టేషన్ను తనిఖీ చేసి జిల్లా అధికారి వెంకటేశ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన పరిధిలో 19 జిల్లాల్లో సుమారుగా 70 అగ్నిమాపక కేంద్రాలున్నాయన్నారు. ఒక్కో కేంద్రంలో 16 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల విషయమై తమ సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. కొత్తగా మహదేవ్పూర్, కేసముద్రం పట్ట ణాలకు అగ్నిమాపక కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. మేడ్చల్ నుంచి నిజామాబాద్ వరకు జాతీ య రహదారిపై ఎక్కడా ఫైర్స్టేషన్ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయ న్నారు. అంతకుముందు ఫైర్ పరికరాలను పరిశీలించి పనితీరును తెలుసుకున్నారు.రీజినల్ ఫైర్ ఆఫీసర్ సుధాకర్రావు -
వల్లూర్లో ముదిరిన చేపల వివాదం
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం వల్లూర్లో ఏడాదిగా చెరువులో చేపలు పట్టుకునే విషయంలో గ్రామస్తులు, ముదిరాజ్లకు వివాదం నడుస్తోంది. వల్లూర్ చెరువులో చేపలు పట్టేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను డీసీఎంలో ముదిరాజ్లు తీసుకురావడంతో గ్రామస్తులు అడ్డుకొని పోలీస్లకు అప్పగించారు. గతంలో పంచాయతీ వద్ద నిర్వహించిన గ్రామసభలో అధికారులు ఇరువర్గాలతో చర్చించారు. చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యశాఖ సభ్యత్వం ఉన్నవారు మాత్రమే అర్హులని తేల్చిచెప్పారు. దీనికి గ్రామస్తులు కట్టుబడి ఉంటామన్నారు. అయితే ఇతరులు వస్తే మాత్రం అడ్డుకుంటామని చెప్పారు. కాగా శనివారం డీసీఎంలో వలలతో ఇతర ప్రాంతానికి చెందిన మత్స్యకారులను చేపలు పట్టేందుకు రావడంతో గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్, ఎస్ఐ అహ్మద్ మోహినొద్దీన్ ఇరువర్గాలను సముదాయించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 16 మంది ముదిరాజ్లను బైండోవర్ చేశారు. మరోవర్గానికి చెందిన వారిని సోమవారం బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు.16 మంది ముదిరాజ్ల బైండోవర్ -
పిల్లల చదువు బాధ్యత పెద్దలదే
సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా మెదక్జోన్: బడీడు పిల్లలను చదివించే బాధ్యత పెద్దలదేనని సీనియర్ సివిల్ జడ్జి రుబీనాఫాతిమా అన్నారు. శనివారం పట్టణంలోని న్యూ హైస్కూల్లో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని మాట్లాడారు. పిల్లలకు చదువుకునే హక్కు ఉందని, అది తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టాలపై విద్యార్థులకు వివరించారు. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచితంగా విద్య అందించాలని చట్టం చెబుతోందన్నారు. పిల్లలకు శారీరక, మానసిక, ఆర్థిక బాధలు రాకుండా చూడాలని, చైల్డ్ లేబర్ వంటి సమస్యలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉంటున్నాయని అన్నారు. చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులను అరికట్టడానికి, బాధితులకు న్యాయం కల్పించడానికి ప్రత్యేకంగా పోక్సో చట్టం కట్టుదిట్టంగా అమలులో ఉందని చెప్పారు. -
మున్సిపాలిటీల అభివృద్ధికి చర్యలు
కలెక్టర్ రాహుల్రాజ్నర్సాపూర్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం కార్యక్రమాలతో పాటు పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం ఉదయం మున్సిపల్ అధికారులతో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో సానిటేషన్, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపేందుకు సిద్ధం చేసినట్లు చెప్పారు. పట్టణ ప్రజలు బాధ్యతగా మెలిగి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తమ సిబ్బందితో భాగస్వాములు కావాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ సిబ్బందికి అందజేయాలని వ్యాపారులకు సూచించారు. పట్టణంలోని ప్రతి ఇంటి వద్దకు చెత్త సేకరించే వాహనం వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. నిలువ ఉన్న నీటిని ఇంటి యజమానులతో కలిసి కలెక్టర్ పారబోశారు. నర్సాపూర్ను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరు సహకరించాలన్నారు. అనంతరం కోమటికుంటను పరిశీలించారు. కుంట పరిసరాల్లో చెత్త పారవేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదే శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, నిబంధనల మేరకు పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరన్రెడ్డి, మేనేజర్ మధుసూదన్, ఆర్ఐ ఫైజల్, ఇతర అధికారులు ఉన్నారు. -
అంగన్వాడీల్లో ఫేస్ రికగ్నైజేషన్
● జూలై 1 నుంచి అమలుకు చర్యలు ● కేంద్ర మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ మెదక్ కలెక్టరేట్: సంక్షేమ పథకాల్లో ఎక్కడా అవినీతి చోటుచేసుకోకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతి శాఖలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా లబ్ధిదారుల గుర్తింపునకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే సరుకులు తీసుకునే చిన్నారులకు ‘ఎఫ్ఆర్ఎస్’ ద్వారా సరుకులు అందిస్తున్నారు. అయితే ఆరునెలల క్రితమే ఈ విధానం ప్రారంభమైనప్పటికీ ఆధార్కార్డు, సాంకేతిక సమస్యల కారణంగా వందశాతం అమలుకు నోచుకోలేదు. కాగా జూలై 1వ తేదీ నుంచి వందశాతం అమలు చేసేందుకు కేంద్ర సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం అందజేసిన సెల్ఫోన్లలో పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ పకడ్బందీగా అమలు చేయనున్నారు. అందుకనుగుణంగా యాప్ను ఆధునీకరించారు. త్వరలో కొత్త సెల్ఫోన్లు! ప్రస్తుతం అంగన్వాడీల్లో వినియోగిస్తున్న సెల్ఫోన్ల సామర్థ్యం తక్కువగా ఉండటంతో టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. వాటి స్థానంలో అధునాతనమైన కొత్త ఫోన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. వాటిని త్వరలోనే అందజేయనున్నారు.ప్రస్తుతం చిన్నారులకే.. అంగన్వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజేషన్ ప్రక్రియ మూడేళ్లలోపు చిన్నారులకు మాత్రమే కొనసాగుతుంది. పౌష్టికాహారం, బాలామృతం, గుడ్ల పంపిణీలో పారదర్శకత కోసమే దీనిని అమలు చేస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారుల కోసం ఇంటికి ఇచ్చే పోషకాహారాన్ని తల్లి ఫొటోను సెల్ఫోన్లో స్కాన్ చేస్తారు. తల్లులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. – హైమావతి, డీడబ్ల్యూఓ0జిల్లా వివరాలు అంగన్వాడీ కేంద్రాలు 1,076 చిన్నారులు 50,997 గర్భిణులు 5,599బాలింతలు 4,507 -
నేడు జాబ్మేళా
నర్సాపూర్: పట్టణంలోని సాయికృష్ణ ఫంక్షన్హాల్లో ఆదివారం జాబ్మేళా ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు సేవ చేయాలన్న ఉద్దేశంతో జాబ్మేళా ఏర్పాటు చేసేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చించామన్నారు. సుమారు 60 కంపెనీల ప్రతినిధులు జాబ్మేళాకు వస్తారని, 1,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని సూచించారు. మొక్కలు నాటి సంరక్షించండి సంగారెడ్డిటౌన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి దేవిలాల్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని ఓ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీశాఖ అధికారి వేణుగోపాల్, పాఠశాల సిబ్బంది వేణు పాల్గొన్నారు. బేస్లైన్ టెస్టులు నిర్వహించాలి జహీరాబాద్ టౌన్: విద్యార్థుల్లో అభ్యసన సా మర్థ్యాలను పరిక్షించేందుకు బేస్లైన్ టెస్టులు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం మండలంలోని హుగ్గెల్లి జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలా బోధించాలి.. వారు ఏమి నేర్చుకోవాలనే దాని గురించి ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్, టీచింగ్ డైరీ, యూనిట్ ప్లాన్ రా యాలని సూచించారు. ఐఎఫ్పీ ప్యానె ల్లను వాడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాథమిక పాఠశాల కిచెన్, టాయిలెట్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ మాణయ్య ఉన్నారు. పింఛన్ల మంజూరుకు చర్యలు నర్సాపూర్: అర్హులకు పింఛన్లు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని జూనియర్ సివిల్ జడ్జి హేమలత చెప్పారు. శని వారం ఆమె పట్టణంలోని విజన్ వృద్ధాశ్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వృద్ధులను అప్యాయంగా పలకరించారు. ఏమైనా ఇబ్బందులుంటే చెప్పాలని కోరారు. దీంతో పలువురు తమకు పింఛన్ రావడం లేదని, ఇప్పించాలని కోరారు. అర్హులకు పింఛన్లు మంజూరు చేయించేందుకు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వృద్ధులను ప్రేమానురాగాలతో చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. విద్యుత్ స్తంభాలనుపునరుద్ధరించాలి హవేళిఘణాపూర్(మెదక్): కొన్ని రోజుల క్రితం ఈదురుగాలులతో కిందపడిపోయిన విద్యుత్ స్తంభాలను సరి చేసి రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా చేసే విధంగా చూడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని స్కూల్ తండా శివారులో పడిపోయిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. విద్యుత్ అధికారులు స్పందించి సకాలంలో చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేకల సాయిలు, మాజీ సర్పంచ్ యశోద, వార్డు సభ్యులు రవి, సాయి లు, యామిరెడ్డి, దాస్, గణేష్ పాల్గొన్నారు. -
సోలార్ ప్లాంట్లతో మహిళా సాధికారత
నర్సాపూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాల ప్రతినిధులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గ్రామీ ణ పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు తెలిపారు. పలుశాఖల అధికారులతో కలిసి నర్సాపూర్లోని దేవాదాయశాఖకు చెందిన భూములను శనివారం పరిశీలించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు సబ్స్టేషన్కు పవర్ సరఫరా, తదతర అంశాల గురించి ఆరా తీశారు. స్థానికంగా ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ను నాలుగు గ్రామాల మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారని చెప్పారు. కాగా రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆయన వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు, నాబార్డు ఏజీఎం రామారావు, కన్సల్టెంట్ రామకృష్ణ, తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ సంస్థ అధికారి రవీందర్ చౌహాన్, ఏడీఈ రమణారెడ్డి, దేవాదాయ ఈఓ శ్రీనివాస్, ఏపీఎం గౌరిశంకర్, ఏపీఓ అంజిరెడ్డి, సర్వేయర్ అభిలాష్ తదితరులు ఉన్నారు.సెర్ప్ చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు -
ఖేడ్లో నవోదయ ఏర్పాటుకు కృషి
ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ఖేడ్లో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామని ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1983–84లో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల మిత్ర సోషల్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కళావేదికను శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆందోల్ నవోదయ విద్యాలయం కోసం మంత్రి దామోదర, తన నియోజకవర్గంలో ఏర్పాటుకు ఎంపీ రఘునందన్రావు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. అయినా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. తామూ ఈ పాఠశాలలోనే చదువుకున్నామని, పాఠశాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను సమీకరిస్తామన్నారు. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రాంతీయ ఆస్పత్రిలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధి సంస్థ సమావేశం నిర్వహించారు. రూ.40 లక్షలతో అవసరమైన పరికరాలున్న కొత్త అంబులెన్స్ను సమకూరుస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. వెద్యుల సమస్యలు పరిష్కరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. కోటి మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ సంగారెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జీతం.. మహాప్రభో..
● కాంట్రాక్టు వైద్యులకు మూడు నెలలుగా వేతనాలు కరువు ● జిల్లావ్యాప్తంగా 15 మంది ఎదురుచూపు మెదక్జోన్: కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తించే వైద్యులకు మూడు నెలలుగా వేతనాలు అందలేదు. అలాగే విధుల్లో చేరి ఏడాది గడిచినా రెన్యూవల్ చేయలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో వైద్యుల కొరత ఏర్పడింది. దీంతో గతే డాది ఏప్రిల్లో 15 మంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిన విధుల్లోకి తీసుకున్నారు. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కాగా వీరికి ఈ ఏడాది మార్చి వరకు మాత్రమే వేతనాలు అందాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన జీతం రాలేదు. అంతేకాకుండా కాంట్రాక్టు పద్ధతిన నియమించిన ఉద్యోగులను ఏడాదికోసారి రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. అయితే గడువు దాటిపోయి మూడు నెలలు అవుతున్నా పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టు కాల పరిమితి ఏడాది మాత్రమే కావటంతో రెన్యూవల్ చేస్తేనే వీరు చేసిన పనిదినాలకు వేతనాలు అడిగే హక్కు ఉంటుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మూడు నెలల పెండింగ్ వేతనాలు ఇప్పి ంచటంతో పాటు కాంట్రాక్టు రెన్యూవల్ చేయాలని వారు కోరుతున్నారు. -
వన మహోత్సవ లక్ష్యం సాధించాలి
డీఆర్డీఓ శ్రీనివాసరావుచిలప్చెడ్(నర్సాపూర్): వన మహోత్సవ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలని డీఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జగ్గంపేటలో ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న పౌల్ట్రీ షెడ్డుతో పాటు నర్సరీని, రహీంగూడలో జరుగుతున్న పంట కాలువ పనులను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్లో నిర్వహించే వన మహోత్సవంలో మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో తప్పనిసరిగా 5 వేల మొక్కలు నాటాలన్నారు. అర్హులైన ప్రతి ఉపాధి కూలీకి పని కల్పించాలన్నారు. ఉపాధి పనులలో ప్రతీ రోజు తప్పనిసరిగా రెండుసార్లు హాజరు తీసుకోవాలని ఆదేశించారు. కూలీలకు త్వరగా డబ్బులు ఖాతాలో జమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సాయిబాబా, ఎంపీడీఓ ఆనంద్, ఏపీఓ శ్యాం, ఇన్చార్జి ఎంపీఓ తిరుపతి, ఈసీ భగవాన్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిలప్చెడ్ ఐకేపీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న పదాధికారులకు నిర్వహిస్తున్న శిక్షణను పరిశీలించారు. స్వశక్తి సంఘాలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగడంతో పాటు మరికొందరికి ఉపాధి చూపించాలని వివరించారు. -
అంగన్వాడీలకు గూడు
జిల్లాకు 42 భవనాలు మంజూరురామాయంపేట(మెదక్): అంగన్వాడీ కేంద్రాల బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లాకు 42 కొత్త భవనాలను మంజూరు చేసింది. త్వరలో నిర్మాణాలు ప్రారంభించేలా సన్నాహాలు చేస్తుంది. రేకుల షెడ్డులు, కనీస వసతులు కరువైన గదుల్లో కొనసాగిన కేంద్రాలకు త్వరలో మంచి రోజులు రానున్నాయి. జిల్లాలో 1,076 అంగన్వాడీ కేంద్రాలు జిల్లావ్యాప్తంగా మొత్తం 1,076 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో కేవలం 369 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలుండగా, మరో 404 ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో కొనసాగుతున్నాయి. 303 కేంద్రాలను మాత్రం అద్దె భవనాల్లో నెట్టుకొస్తున్నారు. కిరాయి చాలా తక్కువగా ఇస్తుండటంతో కేంద్రాలకు ఇవ్వడానికి యజమానులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. రేకులషెడ్లు, పాక్షికంగా శిథిలమైన పురాతన భవనాలను అద్దెకు తీసుకొని కేంద్రాలు నడుపుతున్నారు. వీటిలో మూత్రశాలలతో పాటు కొన్నింటిలో విద్యుత్ సరఫరా సైతం లేదు. కనీస వసతులు సైతం కరువయ్యాయి. ఈ క్రమంలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేయగా, ఎట్టకేలకు 42 కేంద్రాలకు కొత్త భవనాలు మంజూరయ్యాయి. త్వరలో వీటి నిర్మాణాలు ప్రారంభించనున్నారు. కొంతమేర ఇబ్బందులు తీరుతాయి జిల్లాలో 42 అంగన్వాడీలకు సొంత భవనాలు మంజూరయ్యాయి. ఈమేరకు ప్రభుత్వం నుంచి తమకు ఉత్తర్వులు అందాయి. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే కొంతమేర ఇబ్బందులు తీరుతాయి. మిగితా వాటికి సైతం సొంత భవనాల మంజూరు కోసం ప్రయత్నిస్తున్నాం. – హైమావతి, డీడబ్ల్యూఓ -
అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలి
కలెక్టర్ రాహుల్రాజ్ పెద్దశంకరంపేట(మెదక్): నిరుపేదలకు ప్రభుత్వ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నా మని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కమలాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 9 వేల ఇళ్లు మంజూరు చేశామని, ఇందులో 4,500 వరకు గ్రౌండింగ్ అయ్యాయన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ప్రభుత్వం అందిస్తున్న ఏఐ, డిజిటల్ తరగతులను వినియోగించుకోవాలని సూచించారు. బడీడు పిల్లలు వందశాతం పాఠశాలలకు వెళ్తుండటంపై గ్రామస్తులను అభినందించారు. అలాగే అధికారులు ప్రతీ శుక్రవారం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. మలేరియా, డెంగీ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓపెన్ ప్లాట్లు, జనావాసాల మధ్య నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అనంతరం ప్రజలకు నీటి నిల్వపై అవగాహన కల్పించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్చార్జి ఎంపీడీఓ షాకీర్అలీ, ఎంపీఓ జాకీర్ హుస్సేన్, మాజీ సర్పంచ్లు రాములు, శ్రీనివాస్గౌడ్, గ్రామ కార్యదర్శి రాజుగౌడ్, హౌసింగ్ ఏఈ ప్రియ తదితరులు ఉన్నారు. -
గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ నగేష్ నర్సాపూర్ రూరల్: ప్రభుత్వం విధించిన గడువులోగా రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేష్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో 37 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అసైన్డ్ భూములు, సాదా బైనామాలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చినట్లు వివరించారు. అనంతరం సిబ్బందితో భూభారతిపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ సిద్ధిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నా
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రామాయంపేట(మెదక్)/చిన్నశంకరంపేట: అభివృద్ధిలో రామాయంపేటను ముందుకు తీసుకెళ్తానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హామీ ఇచ్చారు. శుక్రవారం పట్టణంలో 83 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసి మాట్లాడారు. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత రూ. 19 కోట్ల మేర కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు చెప్పారు. రామాయంపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజనికుమారి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, సీనియర్ నాయకులు సరాపు యాదగిరి, రమేశ్రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అలాగే నార్సింగి మండల కేంద్రంలో శేరిపల్లి, జప్తిశివనూర్, సంకాపూర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి మెదక్ కలెక్టరేట్: అన్నిశాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే పనులపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. వార్డుల్లో ఇంకా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు తరలిన క్రీడాకారులు
రామాయంపేట(మెదక్): శనివారం నుంచి నిజామాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొనడానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 18 మంది క్రీడాకారులు శుక్రవారం తరలివెళ్లారు. మూడు రోజుల పాటు పోటీలు కొనసాగనున్నాయి. క్రీడాకారులకు బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి పంజా విజయకుమార్ టీ షర్టులు అందజేశారు. వారి వెంట కోచ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఏడుపాయల హుండీ ఆదాయం రూ. 48.48 లక్షలు పాపన్నపేట(మెదక్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో హుండీలను శుక్రవారం లెక్కించగా రూ. 48,48,340 ఆదాయం వచ్చింది. ఆలయ ప్రత్యేక అధికా రిణి అంజలిదేవి, ఈఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది, వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు, గోకుల్షెడ్డులో కానుకలు లెక్కించారు. వెండి, బంగారం మినహా 60 రోజుల్లో భక్తుల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. పశువులకు టీకాలు తప్పనిసరి చిలప్చెడ్(నర్సాపూర్): వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా పశువులు, జీవాలకు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య సూచించారు. మండలంలోని ఫైజాబాద్లో శుక్రవారం పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి పశువుల్లో గర్భకోశ వ్యాధులు రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఏడీ జనార్దన్రావు, మండల పశువైద్యాధికారి వినోద్కుమార్, అల్లాదుర్గం మండల పశువైద్యాధికారి ఆంజనేయులు, సిబ్బంది, రైతు లు పాల్గొన్నారు. ఫీజు బకాయిలు వెంటనే చెల్లించండి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో గత మూడేళ్లుగా బెస్ట్ అవైలబుల్ పథకం కింద విద్యార్థులకు చెల్లించాల్సిన దాదాపు రూ. 1.70 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో బెస్ట్ అవైలబుల్ పథకం కింద డే స్కాలర్, రెసిడెన్షియల్లో విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. వారి ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మానసికంగా వేధిస్తున్నాయని వాపోయారు. కార్యక్రమంలో డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని 132/33 కేవీ సబ్స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఇన్చార్జి ఏఈ యాసిన్ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాల ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. -
డొక్కలు చిక్కి.. బొక్కలు తేలి
దొంతి వేణుగోపాలస్వామి ఆలయం వద్ద గోశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటి సంరక్షణను పట్టించుకునే నాథులు కరువయ్యారు. గోశాలలో గ్రాసం లేకపోవడంతో కేవలం నీటితోనే ఆలమంద సరిపెట్టుకుంటుంది. ఆరు రోజులుగా గోవులను మేత కోసం బయటకు తీసుకువెళ్లకపోవడంతో బక్కచిక్కి బొక్కలు తేలాయి. దీనికి తోడు గోశాల పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దాతలు ముందుకు వచ్చి గ్రాసం అందించడంతో పాటు గోశాల పరిరక్షణకు కృషి చేయాలని పలువురు వేడుకుంటున్నారు. పశువైద్య సిబ్బంది గోవులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. – శివ్వంపేట(నర్సాపూర్) -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: సైబర్ నేరాలు, మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో నెలవారీ క్రైం రివ్యూ నిర్వహించి, కేసుల గురించి ఆరా తీశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో సైబర్ మోసాల వల్ల జరిగే నష్టాలే అధికంగా ఉన్నాయన్నారు. యువత డ్రగ్స్కు బానిస కాకుండా కళాబృందాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రేవ్ కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం చేయొద్దని సూచించారు. సీసీ కెమెరాల పనితీరు, ఏర్పాటులో సమాజం నుంచి సహకారం తీసుకోవాలన్నారు. రౌడీషీటర్లపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని అధికారులను ఆదేశించారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
వరుస చోరీలు.. ప్రజలు బెంబేలు
నర్సాపూర్లో తాజాగా ఓ సిమెంట్ దుకాణంలో చోరీ నర్సాపూర్: నర్సాపూర్లో ఇటీవల జరుగుతున్న వరుస చోరీలు పట్టణ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పట్టణంలో వరుసగా ఐదోరోజు కూడా మూడు చోట్ల చోరీలు జరిగాయి. పట్టణంలోని చౌరస్తా సమీపంలోని యాదాగౌడ్కు చెందిన శ్రీనివాస స్టీల్ అండ్ సిమెంటు దుకాణంలో బుధవారం రాత్రి దొంగలు చొరబడి కౌంటర్లో ఉన్న రూ.6 వేలు ఎత్తుకెళ్లారు. ఇక మెయిన్రోడ్డుపై ఉన్న హైదర్బేగ్ కాంప్లెక్స్లోని లైఫ్ కేర్ మెడికల్ హాల్ తాళం ధ్వంసం చేసి లోపలికి వెళ్లి దుకాణంలో ఉన్న రూ.4 వేలు పట్టుకుపోయారు. అదే కాంప్లెక్స్లో ఉన్న ఓ క్లినిక్ లోపలికి చొరబడి కౌంటర్లో ఉన్న రూ.3,900లను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు ఆయా దుకాణాల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి చోరీలు జరిగిన ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉండగా పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో రాత్రివేళల్లో పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని, చోరీ ముఠాలను వెంటనే పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. త్వరలో పట్టుకుంటాం: సీఐ జాన్రెడ్డి చోరీలకు పాల్పడుతున్న దొంగలను త్వరలోనే పట్టుకుంటాం. తమ సిబ్బంది రాత్రివేళల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలి. చోరీ ఘటనల్లో ఆధారాలు సేకరించాం. పాత రికార్డులతో సరి చూస్తున్నాం, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఆయన వివరించారు. -
మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి
సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ వసంతసేన కౌడిపల్లి(నర్సాపూర్): మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ వసంతసేన తెలిపారు. గురువారం కౌడిపల్లి ఐకేపీ కార్యాలయంలో నూతనంగా ఎంపికై న పదాధికారుల శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఇందిర మహిళ శక్తి కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయాలని కోరారు. సంఘంలోని మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ప్రతి నెల సంఘం సమావేశం నిర్వహించుకుని రుణాల చెల్లింపుపై సమీక్షించాలని చెప్పారు. నెలసరి లెక్కలు, రిజిస్టర్లు, సంఘం లావాదేవిలు సక్రమంగా నిర్వహించుకోవాలని తెలిపారు. మహిళల అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. అనంతరం సీఆర్పీలు శోభారాణి, అనురాధ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎం సంగమేశ్వర్, మండల మహిళ సమాఖ్య అధ్యక్షురాలు పుణ్యమ్మ, కార్యదర్శి లత, కోశాధికారి రాధిక, సీసీలు దుర్గయ్య, శ్రీకాంత్, రమేష్, లక్ష్మి, పురుషోత్తం, నర్సింలు పాల్గొన్నారు. -
ఎకో మిత్రం.. ఆహ్వానం
మెదక్ కలెక్టరేట్: విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, జీవనశైలిని అభివృద్ధి పర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం జాతీయ విద్యార్థుల పర్యావరణ (ఎన్ఎన్పీసీ) క్విజ్ పోటీని ‘హరిత్–ది వే ఆఫ్ లైఫ్’అనే నినాదంతో కేంద్ర విద్యాశాఖ, పర్యావరణ శాఖలు నిర్వహించనున్నాయి. సమాజంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి, తగ్గిపోతున్న వన సంపదను పెంచడంతో పాటు విద్యార్థులు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఈనెల 24న కలెక్టర్ రాహుల్రాజ్ ఆవిష్కరించారు. జూలై 1 నుంచి రిజిస్ట్రేషన్ ఈ క్విజ్ పోటీలో పాల్గొనేందుకు విద్యార్థులు, యువకులు జూలై 1 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఆన్లైన్ ’ఈకో మిత్రమ్’ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. విద్యార్థుల ఆన్లైన్ నమోదుకు ఎలాంటి ఫీజు ఉండదు. మొక్క నాటుతున్న, నీరు సేవ్ చేస్తున్న, వ్యర్థాలను వేరు చేస్తున్న సెల్ఫీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీకి కేంద్ర విద్యా, పర్యావరణ మంత్రిత్వ శాఖల సహాయ సహకారం ఉంది. ఫలితాలు ఆగస్టు 30న ప్రకటిస్తారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు.. విద్యార్థుల్లో పర్యావరణంపై చైతన్యం కలిగించడమే లక్ష్యంగా ఈ పోటీలు కొనసాగనున్నాయి. జిల్లాకు చెందిన 1వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, పరిశోధన విద్యార్థులు, ఇతర సామాన్య పౌరులు కూడా పాల్గొనవచ్చు. వీరిని గ్రూపుల వారీగా విభజిస్తారు. పోటీలో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి ఈ–సర్టిఫికెట్ లభిస్తుంది. విద్యా సంస్థలకూ ప్రత్యేక గుర్తింపు ఇవ్వబడుతుంది. హిందీ, ఇంగ్లీష్, మరిన్ని భాషలలో క్విజ్ పోటీ ఉంటుంది. పర్యావరణంపై విద్యార్థులకు క్విజ్ పోటీలు జూలై 1 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రతిభ గల వారికి ఈ–సర్టిఫికెట్ ఐదు విభాగాలలో పోటీ ఈ ఏడాది మరింత ఎక్కువ మంది విద్యార్థులను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తాం. పోటీలో విద్యార్థులు మొక్కలు నాటడం, చెత్త వేరు చేయడం, నీటి సంరక్షణ వంటి అంశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రాజిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి -
స్పోర్ట్స్ స్కూల్కు 14 మంది ఎంపిక
మెదక్ కలెక్టరేట్: రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్కు 14 మంది ఎంపికై నట్లు యువజన క్రీడలశాఖ జిల్లా అధికారి దామోదర్రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల మండలస్థాయిలో నిర్వహించిన పోటీల్లో 35 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. వారికి అవుట్డోర్ స్టేడియంలో గురువారం పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా నుంచి 8 మంది బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారని చెప్పారు. విద్యార్థులకు 1, 2వ తేదీలలో ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట్ లో రాష్ట్ర స్థాయిలో ఎంపికలు నిర్వహిస్తారని చెప్పారు. -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
మెదక్జోన్: డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత ఉద్యమించాలని, మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి యువత రేపటి భావిభారత పౌరులని, డ్రగ్స్కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలన్నారు. మత్తు పదార్థాలు సేవించడం వల్ల విచక్షణ కోల్పోయి అనేక నేరాలు చేస్తున్నారని, ఇలాంటి కేసులు పెద్ద మొత్తంలో నమోదు అవుతున్నాయని తెలిపారు. అంతకుముందు రాందాస్ చౌరస్తాలో డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్అండ్బీ ఈఈ సర్దార్సింగ్, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ కౌడిపల్లి(నర్సాపూర్): ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం కౌడిపల్లి మండలం దేవులపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల తో పాటు పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. అనంతరం సీహెచ్సీని తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి విడతలో జిల్లాలో 9 వేల ఇళ్లు మంజూరు చేయగా, 3,500 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. అలాగే వర్షాకాలం నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. సీహెచ్సీ, పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. కలెక్టర్ వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు. పోస్టర్ ఆవిష్కరణ మెదక్ కలెక్టరేట్: విద్యార్థులలో ఆలోచనశక్తిని పెంపొందించి కొత్త ఆవిష్కరణల కోసం ఇన్స్పైర్ చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో డీఈఓ రాధాకిషన్, సైన్స్ అధికారి రాజిరెడ్డి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తితో కలిసి ఇన్స్పైర్ మనక్ పోస్టర్ను ఆవిష్కరించారు. విద్యార్థులు సెప్టెంబర్ 15వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని, ఎంపికై న విద్యార్థికి రూ.10 వేలు నజరాన ఇస్తామన్నారు. తల్లిదండ్రులు పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలి కలెక్టర్ రాహుల్రాజ్ -
కేజీబీవీలకు మంచి రోజులు!
కేజీబీవీ మంజూరైన నిధులు ( రూ.లక్షల్లో) రేగోడ్ 21.690 అల్లాదుర్గం 3.856 చేగుంట 3.856 చిప్పల్తుర్తి 7.712 చిట్కుల్ 23.136 కొల్చారం 2.410 మెదక్ 26.992 పాపన్నపేట 3.856 రామాయంపేట 2.410 పెద్దశంకరంపేట 28.438 చిన్నశంకరంపేట 3.856 శివ్వంపేట 26.992 టేక్మాల్ 3.856 తూప్రాన్ 3.856 వెల్ధుర్తి 2.410జిల్లాలోని 15 స్కూళ్లలో మరమ్మతులు ● మొదటి విడతగా రూ.1.65 కోట్లు మంజూరు ● అన్నీ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలకు మంచి రోజులొచ్చాయి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ. 1.65 కోట్లు మంజూరు చేసింది. దీంతో విద్యార్థినులకు మౌలిక వసతులు సమకూరనున్నాయి. –రామాయంపేట(మెదక్) జిల్లాలో 15 కస్తూర్బా పాఠశాలలుండగా, వీటిలో తొమ్మిది పాఠశాలల్లో ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఈస్కూళ్లలో గత ఐదారేళ్లుగా సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా నిధులు మంజూరు కాలేదు. తాజాగా ఈ స్కూళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి గాను ప్రభుత్వం మొదటి విడతగా రూ. కోటి 65 లక్షలు మంజూరు చేసింది. చేపట్టనున్న పనులు ఇవే.. జిల్లాలోని 15 స్కూళ్లలో చిన్నా, పెద్ద మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. వీటితో విద్యుత్ పరంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించనున్నారు. పలు స్కూళ్లలో విద్యార్థులకు వేడినీరు అందించే సోలార్ యంత్రాలు చెడిపోగా, ఈ నిధులతో వాటికి మరమ్మతులు చేయించనున్నారు. అలాగే నీటి సరఫరా పైపులైన్లతో పాటు పాక్షికంగా శిథిలమైన వాటర్ ట్యాంకులు రిపేర్ చేయనున్నారు. వంట గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్ల మరమ్మతులకు ఈ నిధులు కేటాయించనున్నారు. పాఠశాల ఆవరణలో పారిశుధ్య నిర్వహణతో పాటు సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించనున్నారు. అలాగే ఇతర అత్యవసర పనులకు, మైనర్ రిపేర్లకు, డ్రైనేజీ, ప్రహరీ నిర్మాణాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. 7 పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ తరగతులు ప్రారంభించడంతో గతంలో నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్లకు అదనంగా మరికొన్ని నిర్మించనున్నారు. విద్యార్థినుల బాధలు తీరినట్లే.. జిల్లావ్యాప్తంగా అన్ని కేజీబీవీ ల్లో మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. వీటితో దాదాపుగా అన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇక విద్యార్థినుల బాధలు తీరినట్లే. త్వరలో పనులు ప్రారంభించనున్నారు. – రాధాకిషన్, జిల్లా విద్యాధికారి -
క్షేత్రస్థాయిలో భూ భారతి దరఖాస్తుల పరిశీలన
మెదక్ ఆర్డీఓ రమాదేవి చిన్నశంకరంపేట(మెదక్): భూ భారతి దరఖాస్తుల పరిష్కారం కోసం అవసరమైతే క్షేత్రస్థాయిలో సర్వేయర్తో కలిసి పరిశీలించాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి ఆదేశించారు. గురువారం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అధికారులతో భూ భారతి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు అందించిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ మన్నన్, ఉప తహసీల్దార్ ప్రభుదాస్, ఆర్ఐ రాజు పాల్గొన్నారు. పకడ్బందీగా వంద రోజుల ప్రణాళిక మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్రెడ్డి నర్సాపూర్: మున్సిపల్ కమిషనర్గా శ్రీరాంచరణ్రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తానని చెప్పారు. పట్టణ అభివృద్ధికి, ప్రభుత్వ పథకాలు అర్హులందరికి అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఇందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. కాగా, కమిషనర్ను మున్సిపల్ మేనేజర్ మధుసూదన్, ఇతర సిబ్బంది శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కూలీలకు పని కల్పించడమే లక్ష్యం డీఆర్డీఏ ఏపీడీ రంగాచారి కొల్చారం(నర్సాపూర్): కూలీలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించడమే లక్ష్యంగా గ్రామ క్షేత్ర సహాయకులు పనిచేయాలని, పనుల్లో పారదర్శకత తప్పనిసరని డీఆర్డీఏ ఏపీడీ రంగాచారి అన్నారు. బుధవారం ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా అధ్యక్షతన మండల పరిషత్ సమావేశ మందిరంలో 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. మండంలోని 21 గ్రామపంచాయతీల్లో 2024 జూన్ నుంచి 2025 జూన్ వరకు పంచాయతీరాజ్, ఎన్ఆర్ఈజీఎస్, అటవీశాఖల ద్వారా రూ.4 కోట్ల 65 లక్షల పనులు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. పనులు జరిగే సమయంలో క్షేత్ర సహాయకులు మాస్టర్స్లో దిద్దుబాటు చర్యలు చేపట్టామని, ఇందుకుగాను రూ.3వేలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీఓ కష్ణవేణి, ఏపీఓ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి పెద్దపీట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ కొల్చారం(నర్సాపూర్): పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని ఎనగండ్ల గ్రామంలో శక్తి కేంద్రం ఇన్చార్జి శివప్రసాద్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు హరీష్, ఉపాధ్యక్షుడు వెంకటయాదవ్, కార్యదర్శి నాగరాజు, మాజీ ఉపాధ్యక్షులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నేడు డీసెట్ ధ్రువపత్రాల పరిశీలన హవేళిఘణాపూర్(మెదక్): గతంలో డీసెట్ అర్హ త సాధించి ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని వారి కోసం శుక్రవారం ధ్రువపత్రాలను పరిశీలించేందుకు అవకాశం కల్పించినట్లు డైట్ ప్రిన్సిపాల్, డీఈవో రాధాకిషన్ తెలిపారు. అభ్యర్థులు ఒర్జినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు చేరుకొని ధ్రువపత్రాలను పరిశీలించుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎంపిక కోసం 28 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని, జూలై 1న ఆప్షన్లకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఉంటుందని, ఫేజ్–1లో సీటు పొంది వివిధ కళాశాలలో ప్రవేశం పొందిన వారు సైడ్లింగ్ ఆప్షన్ వినియోగించుకోవచ్చని సూచించారు. -
భూ సమస్యలకు మోక్షం!
మెదక్జోన్: ఏళ్ల తరబడి భూ సమస్యలతో సతమతం అవుతున్న అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్టు 15లోపు గ్రామ సభల్లో స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తామని పేర్కొంది. ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది. జిల్లావ్యాప్తంగా 21 మండలాలు ఉండగా, 4 లక్షల పైచిలుకు వ్యవసాయ సాగు భూములు ఉన్నాయి. కాగా భూ సమస్యల పరిష్కారం కోసం తెచ్చిన నూతన భూ భారతి చట్టంలో భాగంగా ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఇందులోభాగంగా జిల్లాలో 37,817 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్ల దరఖాస్తులు 8,386 రాగా, అసైన్మెంట్ భూములకు సంబంధించి 7,001, సాదాబైనామాల దరఖాస్తులు 6,500 వచ్చాయి. మిగతా 15,930 దరఖాస్తులు ఇతర సమస్యలపై వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిని ఆగస్టు 15వ తేదీ వరకు పరిష్కరించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావటంతో జిల్లా అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ప్రతీ దరఖాస్తును ఆన్లైన్లో పొందుపరుస్తున్నా రు. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కొనసాగుతున్న సర్వేయర్ల శిక్షణ జిల్లావ్యాప్తంగా 219 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో మొదటి విడతగా 116 మంది సర్వేయర్లకు మే 26 నుంచి శిక్షణ ప్రారంభించారు. ఇది జూలై 26 వరకు కొనసాగనుంది. అనంతరం వీరికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిసింది. ఇక 2వ విడతలో 113 సర్వేయర్లకు ఎప్పటి నుంచి శిక్షణ ఇస్తారనేది ఇంకా షెడ్యూలు రాలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమిస్తామని ప్రభుత్వం పేర్కొంది. గతంలో పనిచేసిన వీఆర్ఓలు, వీఆర్ఏలు దరఖాస్తు చేసుకుంటే గ్రామ రెవెన్యూ అధికారులుగా నియమిస్తామని ప్రకటించటంతో జిల్లా వ్యాప్తంగా 104 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరికి గత నెలలో పరీక్ష నిర్వహించగా కేవలం 47 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. కానీ, వీరికి ఇప్పటివరకు ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆగస్టు 15లోపు పరిష్కరించేందుకు సన్నాహాలు కొనసాగుతున్న దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ జిల్లావ్యాప్తంగా 37 వేలకు పైగా అర్జీలు ఇది నిరంతర ప్రక్రియ భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులకు త్వరలో పరిష్కారం చూపుతాం. –నగేష్, అదనపు కలెక్టర్ -
సింగూరుపైనే ఆశలు
పాపన్నపేట(మెదక్): కార్తెలు కరిగిపోతున్నా వరుణుడు కరుణించడం లేదు. మరో పది రోజుల్లో అన్నదాతలు వరి నాట్లకు సమాయత్తమవుతున్నారు. ఘనపురం ఆనకట్టపై ఆశలు పెంచుకున్న రైతాంగం.. సింగూరు నీటి కోసం ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం సాగు నీటి ప్రణాళిక సిద్ధం చేయలేదు. మరోవైపు ఘనపురం కాల్వల ఆధునీకరణ పనులు పూర్తి కాలేదు. దీంతో కర్షకులకు ఖరీఫ్ సాగు ముళ్లబాటలా మారింది. మరో 10 రోజుల్లో వరి నాట్లు మెతుకుసీమ రైతన్నల ఆశల వారధి ఘనపురం సుమారు 30 వేల ఎకరాల పంటలకు ప్రాణం పోస్తుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా, పూడికకు గురికావడంతో ప్రస్తుతం 0.135 టీఎంసీలకు పడిపోయింది. దీంతో సింగూరు ప్రాజెక్టు నీటి విడుదల పైనే ఘనపురం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. చాలామంది రైతులు వర్షాలను నమ్ముకుని ఇప్పటికే వరి తుకాలు పోశారు. అయితే ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ప్రస్తుతం ఆరుద్ర కార్తె కొనసాగుతుంది. మరో 10 రోజుల్లో వరి నాట్లు వేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఘనపురం ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు ఏ మూలకు సరిపోదు. కనుక సింగూరు నీరు వదలాలని రైతులు కోరుతున్నారు. ప్రాజెక్టులో 19.2 టీఎంసీలు.. ఇటీవల ఎగువన కురిసిన వర్షాలతో సింగూరులో కొంతమేర నీరు చేరింది. ప్రస్తుతం 19.2 టీఎంసీల (521 మీటర్లు) నీరు నిల్వ ఉంది. మిషన్ భగీరథకు నీరు వదలాలంటే, ప్రాజెక్టులో కనీసం 520 మీటర్ల నీరు నిల్వ ఉండాలి. దీనిని బట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఖరీఫ్ సాగుకు ఘనపురం ప్రాజెక్టుకు నీరు విడిచే అవకాశాలు తక్కువే అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం తప్పని పరిస్థితి అనుకుంటేనే నీరు విడిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ వర్షాలు పడకపోతే, ఘనపురం రైతులకు గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాల్వల ఆధునీకరణకు గ్రహణం ఘనపురం ప్రాజెక్టు కింద ఉన్న మహబూబ్నహర్, ఫతేనహర్ కెనాల్ల ఆధునీకరణ పనులు ప్రారంభమై మూడేళ్లు దాటినా ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో చివరి ఆయకట్టుకు సాగు నీరు అందడం లేదు. బిల్లులు సకాలంలో రాక, పనులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఆధునీకరణ కోసం రూ. 37.6 కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.21.5 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ.16.1 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. కరుణించని వరుణుడు కరుగుతున్న కార్తెలు ‘ఘనపూర్’కు కావాల్సింది 3 టీఎంసీలు.. ఎదురుచూస్తున్న రైతులు సాగు నీరు వదలాలి.. వాన దేవున్ని నమ్ముకుని వరి తుకాలు పోశాం. కానీ ఇప్పటి వరకు పెద్ద వానలు పడలేదు. దీంతో వేసిన తుకాలే వాడుముఖం పట్టాయి. వాటిని కాపాడుకోవడానికే తిప్పలు పడుతున్నం. మరో 10 రోజుల్లో వరి నాట్లు వేయాల్సి ఉంది. సింగూరు నుంచి నీరు వదలాలి. –కుమ్మరి పోచయ్య, రైతు, పాపన్నపేట -
పంచాయతీ పోరు
మూడు నెలల్లో ఎన్నికల నిర్వహణ ● ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ● ఇప్పటికే సిద్ధమైన ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్సులు ● రిజర్వేషన్లు తేలకపోవడంతో నిలిచిన ఎన్నికల ప్రక్రియ ● కోర్టు తాజా ఆదేశాలతో వేడెక్కనున్న పల్లె రాజకీయంసాక్షిప్రతినిధి, సంగారెడ్డి/మెదక్జోన్: పల్లె రాజకీయ మళ్లీ వేడెక్కనుంది. మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల సందడి షురూ కానుంది. సర్పంచులుగా, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు మళ్లీ మద్దతు కోసం మంతనాలు ప్రారంభించనున్నారు. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చాకే ఆశావహులు ప్రత్యక్ష కార్యచరణకు దిగాలని యోచిస్తున్నారు. ఈ రిజర్వేషన్ తమ అనుకూలంగా వస్తే..అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటినుంచి మద్దతు కోసం కార్యాచరణ ప్రారంభిస్తే ఖర్చులు తడిసి మోపెడవుతాయని..తీరా రిజర్వేషన్ అనుకూలంగా రాకపోతే ఖర్చులన్నీ వృథా అవుతాయనే ఆలోచనలో చోటా మోటా నాయకులు ఉన్నారు. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం 2024 జనవరి 31తోనే ముగిసిన విషయం విదితమే. అప్పట్నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోవడంతో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణకు కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సగం ఏర్పాట్లు పూర్తి.. ఈ ఎన్నికలను ఆరు నెలల క్రితమే నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం జనవరిలో చకచకా ఎన్నికల ఏర్పాట్లు చేసింది. ఓటరు జాబితాలను కూడా సిద్ధం చేసింది. ఈవీఎంలు కాకుండా, బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్ ప్రక్రియను నిర్వహించాల్సి ఉండటంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను జిల్లాకు తెప్పించారు. అలాగే బ్యాలెట్ పేపర్లు కూడా ముద్రించారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కూడా గుర్తించారు. స్టేజ్–1, స్టేజ్–2 ఇలా వివిధ స్థాయిల్లో పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన ఆయా స్థాయిల్లోని అధికారులను, సిబ్బంది జాబితాను రూపొందించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన దాదాపు అన్ని ప్రక్రియలు ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు తీరా రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో పోలింగ్ ప్రక్రియ జరగలేదు. ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో అధికార యంత్రాంగం మళ్లీ ఈ ఎన్నికల ఏర్పాట్లపై నిమగ్నం కానుంది.ముఖ్యనేతలకు ప్రతిష్ఠాత్మకమే..గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతాయి. అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల నేతలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. తమ అనుచరులనే సర్పంచులుగా గెలిపించుకుంటేనే ఆయా గ్రామాల్లో నియోజకవర్గస్థాయి నాయకులకు పట్టు ఉంటుంది. దీంతో అన్ని పార్టీల నాయకులు తమకు అనుకూలమైన వ్యక్తులను బరిలోకి దింపేందుకు ఇప్పట్నుంచి అన్వేషణ ప్రారంభించనున్నారు. -
జిల్లాను అగ్రగామిగా నిలపాలి
మెదక్ కలెక్టరేట్: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025కు జిల్లాను దేశంలో అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అన్ని మండలాల ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఎంఎస్, ఏపీఓ, అన్ని పంచాయతీ కార్యదర్శులకు ఎస్ఎస్జీ–2025 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు బాగుండాలని కోరారు. ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా.. సరైన పారి శుద్ధ్య నిర్వహణకు ప్రతీ గ్రామానికి 20 చొప్పున ఇంకుడు గుంతలను నిర్మించాలన్నారు. ఎస్ఎస్జి(జి) పారామీటర్స్ అన్నీ సరిగా ఉండాలని.. ప్రతి పౌరుని ద్వారా ఫీడ్బ్యాక్ ఇచ్చేలా కృషి చేసి జిల్లా ప్రతిష్టను జాతీయస్థాయిలో నిలపాలని కలెక్టర్ కోరారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అంతకు ముందు గ్రామాల అభివృద్ధికి సంబంధించి గ్రామ స్థాయిలో మొత్తం 147 అంశాలపై శిక్షణ ద్వారా అవగాహన కల్పించారు. షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబల్ స్కీంలో ప్రైవేటు స్కూల్ ప్రవేశం కోసం లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఇందులో 1వ తరగతిలో 59 మంది, 5వ తరగతిలో 61 మంది విద్యార్థిని విద్యార్థులను లక్కీ డీప్ ద్వారా ఎంపిక చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీపీఓ యాదయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీరామ్, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం నిజాంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి చేయాలని లబ్ధిదారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఈ మేరకు బుధవారం నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను, అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 9 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2500 వరకు ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఒ రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ ప్రీతి, కార్యదర్శులు ఆరిఫ్ హుస్సేన్, యాదవలక్ష్మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ పోస్టర్ ఆవిష్కరణ -
నిబద్ధతతో పనిచేస్తే రివార్డులు
రామాయంపేట/నిజాంపేట/చేగుంట/చిన్నశంకరంపేట: విధి నిర్వహణలో అలసత్వం తగదని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లాలోని రామాయంపేట, నిజాంపేట, చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగి పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెట్రోలింగ్, సీసీ కెమెరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకితభావంతో విధులను నిర్వర్తించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండి నేరాల నియంత్రణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఇటీవల చోరీలు పెరగడంతో నిఘా పెంచాలన్నారు. నిబద్ధతతో పనిచేసేవారిని ప్రోత్సహించి రివార్డులు అందజేస్తామని చెప్పారు. ఏమైనా సమస్యలుంటే ప్రతి శుక్రవారం తనకు నేరుగా సంప్రదించాలని కోరారు. ఆయన వెంట డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ వెంకట రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగు పర్చుకోవాలి మెదక్ మున్సిపాలిటీ: ఉన్నత విద్య అభ్యసించిన వారే పోలీసు ఉద్యోగంలోకి వస్తున్నారు..ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఙానాన్ని మెరుగుపర్చుకొని సైబర్ నేరాలను అరికట్టాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్టేషన్ల వారీగా కేటాయించిన సైబర్ వారియర్లతో సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో నూతన సాంకేతిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. సైబర్ బాధితుల పట్ల త్వరితగతిన స్పందించి సైబర్ పోర్టల్లో ఫిర్యాదును నమోదు చేయాలని ఆదేశించారు. డబ్బులను త్వరితగతిన ఆపే విధంగా కృషి చేయాలన్నారు. సాంకేతికత పూర్తి నైపుణ్యాన్ని కలిగి ఉండాలని, నేరస్తులకు తగు శిక్షలు పడే విధంగా కృషి చేయాలన్నారు. అప్పుడే ఇలాంటి నేరాలు తగ్గుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మధుసూదన్గౌడ్, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశం పలు పోలీస్టేషన్ల ఆకస్మిక తనిఖీ -
దుర్గమ్మ సన్నిధిలో శంభీపూర్
పాపన్నపేట(మెదక్): మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బుధవారం ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు శంకరశర్మ, పార్థివశర్మ, సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అర్చన, ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, అజయ్, కిరణ్, భువన్ చంద్ర, అరుణ్ తదితరులు ఉన్నారు. శక్తిపీఠంలో మహామంత్ర హోమం పాల్గొన్న ఎమ్మెల్యే సునీతారెడ్డి శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేటలో కొలువైన బగలాముఖీ శక్తిపీఠంలో బుధవారం అమావాస్య సందర్భంగా విశేష పూజ మహోత్సవాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బగలాముఖీ ఉపాసకులు, వేదపండితుడు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో మహామంత్ర హవనము, హరిద్వార్చన, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ భూ దాత పబ్బ రమేశ్గుప్తా, నాయకులు కల్లూరి హరికృష్ణ, పబ్బ మహేశ్గుప్తా, మన్సూర్, చంద్రగౌడ్, శ్రీనివాస్గౌడ్, యాదగౌడ్, హన్మంత్రెడ్డి, మహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. ఉనికి కోసమే బీఆర్ఎస్ ఆరాటం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ నర్సాపూర్: తమ రాజకీయ ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని వ్యవస్థలను గత పాలకులు నాశనం చేశారని విమర్శించారు. హరీశ్రావు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతారెడ్డి నాలుగు పర్యా యాలు ఎమ్మెల్యేగా గెలిచినా, తన స్వగ్రామం గోమారంలో ఆశించిన అభివృధ్ది చేయలేదన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పంచాయితీలకు సకాలంలో నిధులు విడుదల చేయలేదన్నారు. అప్పులభారంతో పలువురు సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నా రు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో నర్సాపూర్ వెనకబడిందన్నారు. నిరూపించేందుకు చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నాయకులు రిజ్వాన్, మల్లేష్, చిన్న ఆంజిగౌడ్, హబీబ్ఖాన్, శ్రీనివాస్గుప్తా, శ్రీనివాస్గౌడ్, లలిత, హర్షవర్దన్, నగేష్, రవీందర్గౌడ్, మణిదీప్, రషీద్ పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాల బలోపేతం ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్ కౌడిపల్లి(నర్సాపూర్): ఇందిరా మహిళ శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభివృద్ధికి కృషి చేస్తుందని ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్ అన్నారు. బుధవారం మండలంలోని ఐకేపీ కార్యాలయంలో నూతనంగా ఎంపికై న గ్రామ సంఘాల పదాధికారులకు శిక్షణ ఇచ్చా రు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు రుణాలతో పాటు పొదుపు చెల్లించాలన్నారు. ప్రతి నెల సంఘం సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సీఆర్పీలు శోభారాణి, అనురాధ, మండల సమాఖ్య అధ్యక్షురాలు పుణ్యమ్మ, కార్యదర్శి రాధిక, సీసీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
మెదక్ కలెక్టరేట్: ప్రజలకు జవాబుదారీగా ఉంటూ మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమ వారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై 119 వినతులు అందజేశారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తులు ఒక్కటి కూడా పెండింగ్ ఉండకూడదన్నారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిల్లెట్ ఫుడ్ క్యాంటీన్ను పరిశీలించారు. జంక్ ఫుడ్తో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ఈసందర్భంగా మహిళా శక్తి ద్వారా ఆర్థిక సాయంతో మిల్లెట్ ఫుడ్ క్యాంటీన్ ఏర్పాటు చేసిన అనితను అభినందించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే ఇలాంటి ఆహారం అందించడం అభినందనీయమని కొనియాడారు. అనితను స్ఫూర్తిగా తీసుకొని మిగితా సంఘాల సభ్యులు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్ల య్య, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు, డీపీఓ యాదయ్యతో పాటు జిల్లాలోని వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి అర్జీలు పెండింగ్ ఉండొద్దు అధికారులకు కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశం -
ఆర్వోబీ నిర్మాణానికి రూ. 45 కోట్లు
చేగుంట(తూప్రాన్): మెదక్– చేగుంట రోడ్డులో రైల్వేగేటు వద్ద ఆర్వోబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 45 కోట్లు మంజూరు చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలిపారు. సోమవారం చేగుంట ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో విలేకరులతో మాట్లాడారు. దుబ్బాక ఉపఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు రెడ్డిపల్లి చౌరాస్తా వద్ద ఫ్లై ఓవర్ నిర్మించి ప్రమాదాలను నివారించినట్లు చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో చేగుంట రైల్వేగేటు వద్ద ఆర్వోబీ నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్వోబీ నిర్మాణానికి రాష్ట్ర వాటా నిధులను కేటాయించాలని కేంద్రం కోరగా, ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి లేఖ రాశారన్నారు. రాష్ట్ర వాటా లేకున్నా వందశాతం కేంద్రం నిధులను మంజూరు చేయించినట్లు వివరించారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, రెండు వారాల్లో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. 18 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించి రైల్వేగేటు వద్ద ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు నాగవేందర్రెడ్డి, భూపాల్, సంతోష్రెడ్డి, గణేష్, రవికుమార్, రఘువీర్రావు, నాగభూషణం, సాయిబాబా, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
మాదకద్రవ్యాలతో ఆరోగ్యానికి ముప్పు
హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులు మాదకద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. సోమవారం మెదక్ మండల పరిధిలోని రాజ్పల్లిలో మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలతో అనేక మంది అనారోగ్యం బారినపడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. అందుకోసం ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించి ప్రాణాలు కాపాడునే విధంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతీ విద్యార్థి మొక్కలు నాటి, వాటిని కాపాడే విధంగా చూడాలన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి హైమావతి, ఎంపీడీఓ రఘు, హెచ్ఎం శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
కేంద్ర పథకాలపై రచ్చబండ
రామాయంపేట(మెదక్): కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు అన్నారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ కృషితో దేశ కీర్తి ప్రతిష్టలు పెరిగాయని కొనియాడారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల శ్రేయస్సు కోసం ప్రధాని పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు శీలం అవినాశ్రెడ్డి, నాయకులు చింతల శేఖర్, శంకర్గౌడ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. నేడు రైతులతో సీఎం ముఖాముఖి మెదక్ కలెక్టరేట్: సీఎం రేవంత్రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో మాట్లాడుతారని అన్నారు. కార్యక్రమాన్ని పండగల నిర్వహించేందుకు ప్రతి రైతు వేదిక వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం భూ భారతి రెవెన్యూ సదస్సులపై అధికారులతో చర్చించారు. సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు పటిష్ట కార్యాచరణతో మందుకుసాగాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓలు రమాదేవి, జయచంద్రారెడ్డి, మహిపాల్రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. సమ్మె నోటీసులు అందజేత నర్సాపూర్: జూలై 9వ తేదీన చేపట్టే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని పలు శాఖల ఉద్యోగులు సోమవారం ఆయాశాఖల అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. ఐసీడీఎస్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ హఫీజాబేగంకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ అధికారికి కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక మెదక్ కలెక్టరేట్: జిల్లాలో మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పర్యటించనున్నట్లు డీఎల్పీఆర్ఓ రాంచంద్రరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ భూములు, అట్రాసిటీ కేసులపై సమీక్ష ఉంటుందని తెలిపారు. అనంతరం ఏడుపాయ ల దుర్గమ్మను దర్శించుకోనున్నట్లు చెప్పారు. జిల్లాలోని దళిత, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, జిల్లా అధికారులు సమీక్ష సమావేశానికి హాజరుకావాలని కోరారు. పేదల సొంతింటి కల సాకారండీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ నర్సాపూర్ రూరల్/శివ్వంపేట: ఇందిరమ్మ ఇంటితో పేదల సొంతింటి కల నెరవేరుతుందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని ఎల్లాపూర్, మాడాపూర్లో నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డితో కలసి కాంగ్రెస్ జెండాలను ఆవిష్కరించి, ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల మద్ద తుతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు కావాలని కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో కో ఆపరేటివ్ చైర్మన్ రాజు యాదవ్, మాజీ జెడ్సీటీసీ గుప్తా, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, నాయకులు సురేష్ నాయక్, ఉదయ్, వినోద, అజ్మత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే శివ్వంపేట మండల పరిధిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే సునీతారెడ్డికి సమాచారం లేకుండా భూమి పూజ ఎలా చేస్తారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. భోజ్య తండాలో తనకు ఇల్లు మంజూరు కాలేదని కాంగ్రెస్ నా యకుల కాన్వాయ్ని ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. -
మీనమేషాలు
మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వానాకాలం ప్రారంభం అయినప్పటికీ ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో మత్స్యకారులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా, ఆదిశగా ప్రయత్నాలు కనిపించడం లేదు. – మెదక్జోన్ఉచిత చేప పిల్లల పంపిణీపై నీలినీడలు ● ఏటా మార్చి, ఏప్రిల్లోనే టెండర్ల ప్రక్రియ ● ఈ ఏడాది ఊసేలేని వైనం! ● ఆందోళనలో మత్స్యకారులుజిల్లావ్యాప్తంగా 311 మత్స్యకార్మిక సంఘాలు ఉండగా, వాటిలో 16,820 మంది సభ్యులు ఉన్నారు. కాగా జిల్లాలో చేపలను పెంచేందుకు 1,728 చెరువులు అనుకూలమైనవి ఉన్నాయని అధికారులు గుర్తించారు. గతేడాది కురిసిన వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఈసారి ముందస్తుగానే రుతుపవనాలు పలకరించినా చేప పిల్లల టెండర్ల ఊసే లేకుండా పోయింది. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ నీలి విప్లవాన్ని సాధించే దిశగా మొదలుపెట్టిన చేప పిల్లల పంపిణీ ఈసారి కూడా సరైన సమయంలో పంపిణీ చేసే పరిస్థితి లేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండగా గతేడాది పలుమార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఇందుకు ప్రధాన కారణం గతంలో టెండర్ దక్కించుకొని చేప పిల్లలను వదిలిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడమేనని తెలిసింది. చివరికి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్కు అధికారులు నచ్చజెప్పగా, అతడు టెండర్ దక్కించుకున్నాడు. 16,820 మందికి ఉపాధి జిల్లాలో 16,820 మంది మత్స్య కార్మికులు కేవలం చేపల వేట ద్వారానే జీవనం సాగిస్తున్నారు. గతేడాది సైతం నామమాత్రంగా చేప పిల్లలను వదిలిన అధికారులు, ఈ ఏడాది ఇప్పటివరకు ఎలాంటి టెండర్లు పిలవకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. ఉచిత చేప పిల్లలను చెరువు, కుంటల్లో వదలకుంటే తమకు జీవనోసాధి ఎలా అంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డిమాండ్ కోట్లలో.. వదిలింది లక్షల్లో గతేడాది 1,654 చెరువుల్లో 5.10 కోట్ల ఉచిత చేప పిల్లలను వదలాల్సి ఉండగా, కేవలం 64 లక్షల పిల్లలను మాత్రమే వదిలి సదరు కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నాడు. దీంతో చేసేదిలేక మత్స్యకారులు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్ వ్యక్తుల నుంచి చేప పిల్లలను కొనుగోలు చేసి నీటి వనరుల్లో పోశారు. ఈ ఏడాది సంబంధిత అధికారులు ఈ పథకానికి సంబంధించి ఇంకా ఊసే ఎత్తకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.ఎలాంటి ఆదేశాలు రాలేదు ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఏటా మార్చి, ఏప్రిల్లోనే టెండర్లు పిలుస్తారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పక్రియ సాగిస్తాం. – మల్లేశం, మత్స్యశాఖ ఏడీ● -
పల్లెలన్నీ చెత్తతో నిండిపోయాయి
● పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ పోసే దిక్కు లేదు ● ప్రభుత్వంపై GÐðl$ÃÌôæÅ çßæÈ-ÔŒæ-Æ>Ð]l# OòœÆŠḥæనర్సాపూర్ రూరల్: గ్రామాలు స్వచ్ఛతగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీలకు చెత్త తరలించేందుకు ట్రాక్టర్లు ఇస్తే, ప్రస్తుత ప్రభుత్వంలో కనీసం డీజిల్ పోసే దిక్కు లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సోమవారం మండలంలోని చిప్పల్తుర్తి గ్రామ పంచాయతీని సందర్శించి పారిశుద్ధ్య కార్మి కులతో పాటు పంచాయతీ కార్యదర్శితో మా ట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో చెత్త తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తే అంటురోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. మూడు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా మాజీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాబ్యా నాయక్ ఉన్నారు. అరెస్టులపై కాదు.. గ్రామాలపై దృష్టి పెట్టు అరెస్టులపై కాదు.. గ్రామాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటి పైపులైన్లకు మరమ్మతులు చేయించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ అన్న మార్పు ఇదేనా అని ఎద్దేవా చేశారు. 10 నుంచి 20 శాతం పర్సంటేజీలు తీసుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారని మండిపడ్డారు. సీఎం నెలకు ఒకసారి కూడా సచివాలయానికి పోవడం లేదని, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరగడమే సరిపోతుందన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటే ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. కార్యదర్శికి మెమో ఇవ్వడం సరికాదు: ఎమ్మెల్యే గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై వివరాలు అడిగితే చిప్పల్తుర్తి పంచాయతీ కార్యదర్శి శ్రుతిజకు కలెక్టర్ మెమో జారీ చేయడం సరికాదని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులు చెప్పారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు తాము అండగా ఉంటామని చెప్పారు. -
హడావుడే.. ఆచరణేది?
● నామమాత్రంగా 100 రోజుల ప్రణాళిక ● ఆర్భాటాలకే పరిమితమైన అధికారులు ● ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు వర్షాకాలంలో పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టింది. ఈనెల 2 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మాత్రం నామమాత్రంగా ప్రణాళిక కొనసాగుతోంది. కేవలం ఫొటోలు, ఆర్భాటాలకే అధికారులు పరిమితం అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – రామాయంపేట(మెదక్)పట్టణంలో ఇళ్ల మధ్య నిలిచిన మురుగు నీరురామాయంపేట పట్టణంలోని కొన్ని వార్డుల్లో ఇళ్ల మధ్య, ఖాళీ స్థలాల్లో నిలిచిన మురుగు నీటితో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దోమలు విపరీతంగా పెరిగిపోగా, నివారణకు ఫాగింగ్ కూడా సక్రమంగా చేపట్టడం లేదు. ఉన్న రెండు ఫాగింగ్ యంత్రాల్లో ఒకటి చెడిపోవడంతో సమస్య తలెత్తింది. మున్సిపాలిటీ పరిధిలో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి దోమల నివారణ మందు మురుగు కాలువల్లో పిచికారీ చేయించాలి. ఇందుకోసం వార్డుల వారీగా అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు మాత్రం బ్యానర్ల ఎదుట ఫొటోలు తీసుకొని అధికారులకు పంపిస్తున్నారు. 100 రోజుల ప్రణాళిక ఈనెల 2వ తేదీన ప్రారంభం కాగా, సెప్టెంబర్ 10 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా తడి, పొడి చెత్త విషయమై స్థానికులకు అవగాహన కల్పించడంతో పాటు మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఎక్కువ సమస్యలు ఉన్న వార్డుల్లో ముందుగా ప్రణాళిక అమలు చేయాలనే ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కార్యక్రమం ప్రారంభమై ఇప్పటికీ 20 రోజులు అవుతున్నా, కేవలం నాలుగు వార్డుల్లో మాత్రమే పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. -
నిరాకరిస్తున్న బ్యాంకులు
వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయం, దాని అనుబంధ రుణాలకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. కానీ రైతులకు ప్రకటించిన దాంట్లో 70 శాతం మేరకే రుణాలు ఇస్తున్నారు. దీంతో రైతులు చేసేదిలేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పుల పాలవుతున్నారు. జిల్లాలో 19 రకాల బ్యాంకులు ఉండగా, వాటికి అనుబంధంగా 99 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి బ్యాంకు రైతులకు పంట రుణాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ కొన్ని బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ● -
నాణ్యమైన భోజనం అందించాలి
అల్లాదుర్గం(మెదక్): విద్యార్థులకు మెనూ ప్రకారం, నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని అదేశించారు. ఆదివారం అల్లాదుర్గంలోని ఎస్సీ బాలుర వసతి గృహం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. బాత్రూంలు అధ్వానంగా ఉండటంతో వెంటనే నిధులు మంజూరు చేస్తానని, పనులు ప్రారంభించాలని వార్డెన్కు సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రోగుల వివరాలు తెలుసుకున్నారు. సీజన్ల్ వ్యాధులకు సంబంధించి మందులు అందుబాటులో ఉన్నాయా..? అని డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. వానాకాలం సీజనల్లో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అల్లాదుర్గం కేజీబీవీలో సిబ్బంది, విద్యార్థినులు లేకపోవడంతో వెనుదిరిగారు. అర్హులందరికీ రైతుభరోసా టేక్మాల్(మెదక్): అర్హుందరికీ రైతు భరోసా డబ్బు లు జమ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆదివారం మండలంలోని ఎల్లంపల్లి తండాలో పత్తి పంటను పరిశీలించారు. జిల్లాలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో 2,54,504 మంది రైతుల ఖాతాల్లో రూ. 207.14 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
లక్ష్యం చేరని రుణం!
మొండిచేయి చూపుతున్న బ్యాంకర్లువడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు ● ఈ సారైనా లక్ష్యం చేరుకునేనా?జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ఏటేటా కేటాయింపులు పెంచుతూ ప్రణాళిక ఖరారు చేస్తున్నా.. రుణ పంపిణీ మాత్రం 70 శాతం మించడం లేదు. ఫలితంగా రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. జిల్లాలో 2025– 26 వార్షిక రుణ ప్రణాళిక రూ. 6,517.51 కోట్లుగా ఖరారు చేశారు. – మెదక్జోన్ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల వ్యవసాయ సాగు భూములు ఉండగా, 2.96 లక్షల మంది రైతులు ఉన్నారు. కాగా ఏటా రైతులకు పంట రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చి వార్షిక రుణ ప్రణాళికను ప్రకటిస్తున్నాయి. అయితే అందులో 70 శాతం రుణాలను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 2024– 25లో వార్షిక రుణ ప్రణాళిక వివిధ రంగాలకు రూ. 5,857 కోట్లు కేటాయించారు. కానీ ఇచ్చింది మాత్రం రూ. 4,366.84 కోట్లు మాత్రమే. ఇందులో వ్యవసాయం, అనుబంధ రుణాలు రూ. 3,647.75 కోట్లు కాగా, ఇచ్చింది మాత్రం రూ. 2,857.75 కోట్లు. అలాగే పంట రుణాల లక్ష్యం రూ. 2,267.25 కోట్లు కాగా, ఇచ్చింది రూ. 1,603.80 కోట్లు. అంటే కేవలం 70 శాతం రుణాలు మాత్రమే ఇచ్చి చేతులు దుపులుకున్నారు. గతం కంటే ఎక్కువగా.. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం ఏటా 10 శాతం పెంచుతూ వార్షిక రుణ ప్రణాళికను తయారు చేస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది 2025–26 రుణ ప్రణాళిక రూ. 6,517.51 కోట్లుగా ఖరారు చేశారు. గతేడాదితో పోలిస్తే రూ. 660.51 కోట్లు అదనంగా కేటాయించారు. ఇందులో పంట రుణాలు రూ. 1,977.46 కోట్లు కాగా, వ్యవసాయ అనుబంధ రుణాలు రూ. 3,971.05 కోట్లు, ప్రాధాన్యత రంగానికి రూ. 5,481.60 కోట్ల చొప్పున కేటాయించారు.చర్యలు తీసుకుంటాం జిల్లాలో వార్షిక రుణాలు లక్ష్యం మేర ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. బ్యాంకుల వారీగా కేటాయించిన రుణాలు అందించే విధ ంగా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తాం. ఈ విషయంపై ప్రతి మూడు నెలలకోసారి కలెక్టర్ సమక్షంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తాం. – నర్సింహమూర్తి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మెదక్ -
కొనసాగుతున్న నిరసన
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు 138వ రోజుకు చేరుకున్నాయి. నల్లవల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో స్థానిక మహిళలు పాల్గొని సంఘీభావం తెలిపారు. పచ్చని అడవిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుచేస్తే పర్యావరణానికి విఘాతం కలుగుతుందని, స్థానిక ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. డంపింగ్యార్డ్ నిర్మాణ పనులు నిలిపేవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా ఫుట్బాల్ పోటీలు
రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులు వీరే..మెదక్జోన్: ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్బాల్ ఎంపిక పోటీలను జిల్లా కేంద్రంలోని సాయి స్టేడియంలో ఆదివారం నిర్వహించారు. రాష్ట్రస్థాయి పుట్బాల్ జట్టుకు 18 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఫుట్బాల్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాకారుల ఎంపిక పోటీలలో ఉమ్మడి జిల్లా నుంచి 95 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు నిజామాబాద్లో ఈనెల 27 నుంచి జూలై 1వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి నగేష్, సత్యనారాయణ, మెదక్ ఫుట్బాల్ అకాడమి కార్యదర్శి వినయ్ పాల్గొన్నారు. -
నూనె గింజల ఉత్పత్తికి ఊతం
కొత్త పథకానికి శ్రీకారం● ఈ ఖరీఫ్ నుంచే ఎన్ఎంఈఓ అమలు ● రైతులకు ఉచితంగా కొత్త విత్తన రకాల సరఫరా ● లబ్ధిదారుల ఎంపికకు వ్యవసాయశాఖ సన్నాహాలు పంటల వారీగా ఎంపిక చేసిన జిల్లాలు సోయాబీన్ : సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ పొద్దుతిరుగుడు : సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, భద్రాద్రి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి వేరుశనగ : నల్లగొండ, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ, మహబూబ్నగర్, వికారాబాద్, నారాయణపేట కుసుమ : సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ నువ్వులు : జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వంట నూనె గింజల పంటల విస్తీర్ణం ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభు త్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్ఎంఈఓ (నేషనల్ మిషన్ ఆన్ ఈడబుల్ ఆయిల్) పథకం కింద సోయా, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, కుసుమ పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతులు సాంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పేలా..అధిక దిగుబడులు ఇచ్చే కొత్త రకాల విత్తనాలను ఉచితంగా సరఫరా చేయనుంది. అలాగే సంబంధిత వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాంకేతిక సహాయాన్ని అందించనుంది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఈ పథకాన్ని అమలు చేయనుంది. 2030 వరకు ఈ పథకాన్ని కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపుకు సన్నాహాలు చేస్తున్నారు. అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల సరఫరా.. ఈ పథకం కింద ఎంపికై న రైతులకు ఉచితంగా నూనె గింజల విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేయనుంది. ఒక్కో రైతుకు రెండున్నర ఎకరాలు (ఒక హెక్టారు)కు పరిమితి విధించారు. ఉదాహరణకు సోయా సాగు చేస్తున్న రైతులు 1994లో విడుదల చేసిన జే.ఎస్.–335 వైరెటీనే ఎక్కువగా విత్తుకుంటున్నారు. ఈ వైరెటీతో ఆశించిన దిగుబడి రావడం లేదు. వీటి స్థానంలో 2021లో రిలీజైన డీఎస్బీ–34, ఎంఏసీఎస్–1460 వైరెటీ సోయా విత్తనాలను సరఫరా చేస్తారు. అలాగే రైతు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. పంటలను ఎప్పటికప్పుడు పరిశీలించి, తగిన సూచనలు చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాంకేతిక సహాయాన్ని అందిస్తారు. పాత వైరెటీలతో 60 శాతం తక్కువ దిగుబడి కొత్తగా వచ్చిన నూనెగింజల విత్తన రకాలకు, ప్రస్తుతం రైతులు వాడుతున్న విత్తనాలకు వచ్చే దిగుబడిలో 60 శాతం తక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సోయా పంటనే ఉదాహరణగా తీసుకుంటే కొత్త వైరెటీలు (2021లో రిలీజైన డీఎస్బీ–34, ఎంఏసీఎస్–1460 వైరెటీ) తో ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు మొగ్గు చూపేలా.. ప్రస్తుతం రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ రైతులు నూనెగింజల సాగు వైపు మొగ్గు చూపేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మరోవైపు దేశంలో నూనెగింజల ఉత్తత్తి చాలా తక్కువగా ఉంది. వివిధ దేశాల నుంచి నూనెగింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కొల్చారం(నర్సాపూర్): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మండలంలోని సంగాయిపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. కొందరు తమ పేరు జాబితాలో వచ్చినప్పటికీ మంజూరు పత్రాలు ఇవ్వలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఇబ్బంది ఏర్పడిందని, సర్వే జరిపి నిజమైన అర్హులందరికీ మంజూరు పత్రాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణ పనుల సమయంలో లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు పనిచేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. బడి బయట ఉన్న వారు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసా, ఎంపీడీఓ కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి సదాశివుడు, హెచ్ఎం దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
అర్హులందరికీ రేషన్ బియ్యం పంపిణీ
నర్సాపూర్: రేషన్కార్డులు కలిగి ఉన్న లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని డీఎస్ఓ నిత్యానంద ఆదేశించారు. శనివారం పట్టణంలోని ఎంఎల్ఎస్ పాయింట్ గోదాంతో పాటు పలు రేషన్ దుకాణాలను తనిఖీ చేసి బియ్యం నాణ్యత, రికార్డులను పరిశీలించారు. స్టాక్ అయిపోతే తన దృష్టికి తెస్తే బియ్యం సరఫరా చేస్తామన్నారు. నాణ్యతగా లేకపోతే, మార్పు చేయించి నాణ్యమైన బియ్యం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆయ న వెంట రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్కుమార్, పలువురు డీలర్లు, గోదాం సిబ్బంది ఉన్నారు. అరుణాచలానికి ప్రత్యేక బస్సు చిన్నశంకరంపేట(మెదక్): మెదక్ ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలం గిరి ప్రదక్షణకు ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శనివారం నార్సింగి మండలం శేరిపల్లిలో వారు మాట్లాడుతూ.. ఈనెల 24న సాయంత్రం 6 గంటలకు మెదక్ డిపో నుంచి బస్సు బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కంచి మీదుగా అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరి ప్రదక్షణ అనంతరం బస్సు తిరిగి మెదక్ బయలుదేరుతుందన్నారు. ఒక్కరికి రూ. 4 వేలు టికెట్ కాగా, హాఫ్ టికెట్ రూ. 2,600 ఉందన్నారు. మెదక్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒకే గ్రామం నుంచి టీంగా వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక బస్సును అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 7382830420, 9494825746 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. దరఖాస్తులతో బారులు శివ్వంపేట(నర్సాపూర్): గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ముగిసినప్పటికీ శనివారం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు ఇచ్చేందుకు రైతులు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు క్యూలైన్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించినట్లు తహసీల్దార్ కమలాద్రి, ఉప తహసీల్దార్ షఫీయోద్దీన్, ఆర్ఐ కిషన్ తెలిపారు. శనివారం 188 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. రైతు భరోసా రూ. 201 కోట్లు జమ మెదక్ కలెక్టరేట్: రైతు భరోసా కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,53,020 మంది రైతుల ఖాతాల్లో రూ. 201 కోట్లు నేరుగా జమ అయినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఎకరానికి ఏడాదికి రూ. 12,000 పంట పెట్టుబడి సాయం (రెండు విడతల్లో) ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు.గోదాంలో స్టాక్ రిజిస్టర్ను పరిశీలిస్తున్న డీఎస్ఓ నిత్యానంద -
ప్రధాని మోదీ రైతు పక్షపాతి
మెదక్జోన్: ప్రధాని నరేంద్ర మోదీ రైతు పక్షపాతి అని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత క్వింటాల్ ధాన్యానికి రూ. 2,300 మద్ద తు ధర వస్తుందన్నారు. అంతకుముందు కేవలం రూ. 1,300 మాత్రమే లభించేదన్నారు. పెట్టుబడి సాయం కోసం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఒక్కో రైతుకు ఏడాదికి రూ. 6 వేల చొప్పున ఖాతాల్లో జమచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో నేటికీ 20 శాతం మంది రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు అంజయ్య, వె ంకట్రెడ్డి, ఎంఎల్ఎన్రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి -
అధిక మోతాదుకు చెల్లు
ఖేడ్లో మట్టి పరీక్ష కేంద్రం ఏర్పాటు ● ఉమ్మడి జిల్లాలో రెండో కేంద్రం ● ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు ప్రయోజనంనారాయణఖేడ్: ఎరువులు, రసాయన మందుల విచ్చలవిడి వాడకం ద్వారా నష్టపోతున్న రైతన్నలకు ఉపయోగపడేలా ఉమ్మడి జిల్లాకు మరో మట్టి నమూనా కేంద్రం మజూరైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనే మట్టి నమూనా పరీక్షా కేంద్రం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఏ ప్రాంతం రైతులైనా తమ మట్టి నమూనాలను ఇక్కడే పరీక్షించుకోవాల్సి వస్తుంది. కాగా, ప్రభుత్వం తాజాగా నారాయణఖేడ్కు మట్టి పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను రూ.1.95కోట్లను విడుదల చేసింది. రూ.1కోటి ద్వారా భవన నిర్మాణం పనులు చేపట్టగా, రూ.95క్షలతో పరికరాలు, గాజు సామగ్రి, రసాయనాలు, ఫర్నీచర్, మౌలిక సదుపాయాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు వినియోగించనున్నారు. ఈ కేంద్రం పరిధిలో జిల్లాతోపాటు మెదక్ జిల్లా పరిధిలోని మండలాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలతోపాటు, మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట, రేగోడ్, టేక్మాల్ తదితర మండలాల రైతులకు అనువుగా ఉండనుంది. ఖేడ్ పట్టణ శివారులోని జూకల్ శివారులో స్థలాన్ని ఇదివరకే ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ స్థలంలో భవన నిర్మాణం పనులు చేపట్టనున్నారు. ఈ కేంద్రంలో ఒక ఏడీఏ, ఏవో, ఏఈవోలు, ల్యాబ్ టెక్నీషియన్స్ను నియమించనున్నారు. భారీగా ఎరువుల వినియోగం రాష్ట్రంలో భారీ స్థాయిలో ఎరువుల వినియోగం జరుగుతుందని, ప్రధానంగా యూరియా వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎరువుల, రసాయనాల మంత్రిత్వ శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. యూరియా వినియోగం ఎక్కువవుతోందని, దాని ప్రభావం సాగు భూములపై చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక పురుగు మందుల వినియోగం మోతాదుకు మించి ఉందని వెల్లడించింది. మట్టి పరీక్షల ద్వారా ఈ సమస్యలను అధిగమించే అవకాశం ఉంది. ఇవీ ప్రయోజనాలు.. మట్టి పరీక్ష అనేది మట్టిలోని పోషక పదార్థాల స్థాయిలు, పీహెచ్ విలువ, ఉప్పు సమతుల్యత, సూక్ష్మపదార్థాల ఉనికి తెలుసుకోవడం వ్యవసాయంలో చాలా కీలకమైన అంశం. మట్టి పరీక్ష పంటకు సరిపోయే ఎరువుల ఎంపికకు సహాయ పడుతుంది. మట్టిలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయా, ఏవి కొరతగా ఉన్నాయో తెలుసుకుని అందుకు అవసరమైన ఎరువులను సరిగ్గా వినియోగించుకునే వీలుంది. అనవసర ఎరువుల వినియోగం తగ్గించుకోవచ్చు. ఫలితంగా అవసరానికి మించి ఎరువుల వాడకం వల్ల కలిగే హానిని నివారించుకునే వీలుంది. సమతుల్య పోషకాల నిచ్చెన వల్ల పంట ఆరోగ్యంగా పెరిగి దిగుబడి వస్తుంది. అవసరమైన వాటినే వినియోగించడం వల్ల ఖర్చూ తగ్గుతుంది. మట్టిలో మార్పులను గమనించి భవిష్యత్తులో తగిన పంటలు వేసే అవకాశం కలుగుతుంది. అధిక రసాయనాల వాడకాన్ని నియంత్రించి నేల, నీటి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కొత్త భూమిలో పంట సాగు ప్రారంభించే ముందు, ప్రతీ రెండు మూడేళ్లకు ఒకసారి, పంట దిగుబడులు తగ్గిన సందర్భాలు, భూమి మార్పు జరిగిన సందర్భాల్లో మట్టి నమూనా పరీక్షలు నిర్వహించుకోవాలి. -
‘కూత’ వేటు దూరంలో..
● తుది దశకు కొమురవెల్లిరైల్వే స్టేషన్ పనులు ● దసరాకు ప్రారంభిస్తామనికేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటనకొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న భక్తులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రతి యేటా మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ నుంచి భక్తులు వస్తుంటారు. కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న రైల్వే లైన్లో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ వద్ద రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయా లని చాలా కాలంగా డిమాండ్ ఉంది. దీంతో రైల్వేశాఖ స్పందించి స్టేషన్ మంజూరు చేయగా.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్తో కలసి 2024 ఫిబ్రవరి 15న భూమి పూజచేసి పనులను ప్రారంభించారు. స్టేషన్, ప్లాట్ఫాం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. దసరాకు కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభిస్తామని ఇటీవల కిషన్రెడ్డి ప్రకటించారు. -
‘ఈ–పాస్’తోనే ఎరువుల విక్రయాలు
మెదక్మున్సిపాలిటీ: ఫర్టిలైజర్ దుకాణదారులంతా ఈ–పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ సూచించారు. శనివారం మెదక్ రైతు వేదికలో ఇండియన్ పొటాష్ లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులు సుమారు 150 ఫర్టిలైజర్ షాపు యజమానులకు ఉచితంగా ఈ–పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువుల విక్రయాల్లో పారదర్శకత పాటించేందుకు 2018 నుంచి మిషన్లను వినియోగంలోకి తెచ్చినట్లు తెలిపారు. ఈపద్ధతితో ఎరువులు నేరుగా రైతుకు చేరుతాయన్నారు. బ్లాక్ దందాకు చెక్ పెట్టవచ్చన్నారు. ఐపీఎల్ డిప్యూటీ మేనేజర్ మురళి మాట్లాడుతూ.. ప్రభుత్వ సబ్సిడీలను రైతులకు అందించాలన్న లక్ష్యంతో ఈ–పాస్ విధానాన్ని ప్రోత్సహించేలా తమ కంపెనీ, ఉచితంగా మిషన్లు పంపిణీ చేసిందన్నారు. మెదక్, రామాయంపేట డివిజన్లలోని సుమారు 150 షాపులకు అందచేశామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ విజయనిర్మల, టెక్నికల్ ఫర్టిలైజర్ అధికారి హర్ష, మండల వ్యవసాయ అధికారులు నాగమాధురి, బాల్రెడ్డి, హరిప్రసాద్, శ్రీనివాస్, రామలింగారెడ్డి, రాజ్నారాయణ, ఫర్టిలైజర్ షాపు యజమానులు పాల్గొన్నారు.జిల్లా వ్యవసాయాధికారి వినయ్ -
ట్రాక్ తప్పకుండా..
రైల్వే ప్రభావిత చెరువులకు మరమ్మతులు● జిల్లాలో 37 చెరువు, కుంటల గుర్తింపు ● కట్టల బలోపేతానికిరూ. 2 కోట్లు విడుదలమరమ్మతులు చేస్తున్నాం జిల్లాలో 37 రైల్వే ప్రభావిత ట్యాంకులను గుర్తించాం. అందులో 30 ట్యాంకుల కట్టల బలోపేతానికి రూ. 2 కోట్లు మంజూరు కాగా, 27 నీటి వనరులకు మరమ్మతులు చేస్తున్నాం. అలాగే గతేడాది దెబ్బతిన్న 26 చెరువు, కుంటల పనలు పూర్తి చేశాం. – శ్రీనివాస్రావు, మెదక్ ఇరిగేషన్ ఈఈరైలు మార్గంలో ట్రాక్ను ప్రభావితం చేసే చెరువులు, కుంటల బలోపేతానికి రైల్వే, ఇరిగేషన్ శాఖల అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఈ ఏడాది 30 నీటి వనరులకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ. 2 కోట్లు మంజూరు కాగా, ముమ్మరంగా మరమ్మతులు చేపడుతున్నారు. ఇప్పటివరకు 27 చెరువు, కుంటల పనులు కొనసాగుతుండగా, మరో 3 నీటి వనరులు టెండర్ దశలో ఉన్నాయి. నిర్మాణాల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఇరిగేషన్ ఉన్నతాధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. – మెదక్జోన్ జిల్లాలోని పలు మండలాల పరిధిలో రైల్వేట్రాక్ పైభాగంలో 37 చెరువులు, కుంటలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వర్షాకాలంలో ఇవి ప్రమాదవశాత్తు తెగిపోతే దిగువ భాగంలో ఉన్న రైల్వేట్రాక్ (పట్టాలు) కొట్టుకుపోయి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో ముందుగానే గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది 37 నీటి వనరులను గుర్తించి, అందులో 30 చెరువు, కుంటల కట్టలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ. 2 కోట్లు మంజూరు కాగా, ఇరిగేషన్ అధికారులు టెండర్ పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. 27 చెరువు, కుంటల పనులు కొనసాగుతుండగా, మరో 3 నీటి వనరులు టెండర్ దశలో ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. నిర్మాణాల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఇరిగేషన్ ఉన్నతాధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. గతేడాది దెబ్బతిన్న చెరువులకు సైతం.. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 27 చెరువు, కుంటలు దెబ్బతిన్నాయి. కాగా అప్పట్లో ఇరిగేషన్ అధికారులు వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో హవేళిఘణాపూర్ పెద్ద చెరువు తూము దెబ్బతిని, ఆయకట్టు వెనకాల సాగు చేసిన పంటలు కొంతమేర కొట్టుకుపోయాయి. ఆ చెరువులకు సైతం రూ. 40 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేశారు. కలెక్టర్ ఫండ్ నుంచి సైతం రూ. 25 లక్షలు మంజూరయ్యాయి. -
8,229 దరఖాస్తులు
తూప్రాన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు శనివారంతో ముగిసినట్లు ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లో భూ సమస్యలపై 8,229 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇందులో మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం, పేరు సవరణ, పెండింగ్ మ్యుటేషన్, ఫౌతి (విరాసత్), డిజిటల్ సంతకం పెండింగ్, సాదాబైనామా, పీఓటీ, కుటుంబ తగాదాలతో పాటు ఇతర భూ సమస్యలకు దరఖాస్తులు వచ్చాయని వివరించారు. వాటిని పరిశీలించి భూ సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. సాదాబైనామా, పీఓటీ దరఖాస్తులను ప్రభుత్వం ఇచ్చే సూచనల మేరకు పరిష్కరిస్తామన్నారు. దరఖాస్తుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు, గ్రామ ప్రజల సహకారంతోనే రెవెన్యూ సదస్సులు సజావుగా, ప్రశాంతంగా ముగిసినట్లు తెలిపారు.ఆర్డీఓ జయచంద్రారెడ్డి -
సీసీ సస్పెన్షన్
● డ్వాక్రా రుణాల గోల్మాల్పై వేటు ● బ్యాంకు అధికారులపై చర్యలు కరువుపాపన్నపేట(మెదక్): ‘సంఘాల నిధులు స్వాహా’ శీర్షికన గత నెల 15న సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన డీఆర్డీఏ అధికారులు నెల రోజులకు పైగా విచారణ జరిపారు. మహిళా సంఘాలకు సంబంధించి రూ. 39,92,141 నిధులను వీఓఏ పద్మ స్వాహా చేసినట్లు తేల్చారు. ఈ మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించిన సీసీ సాయిలును సస్పెండ్ చేస్తూ డీఆర్డీఓ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ గోల్మాల్లో బ్యాంకు అధికారుల పాత్ర సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పాపన్నపేట మండలం పొడిచన్పల్లిలో జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో 39 డ్వాక్రా గ్రూపులు ఉండగా, వీరికి యూకో బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తున్నారు. ఇందులో గ్రామ సంఘం నిధులతో పాటు, బ్యాంకు ద్వారా రెండు రకాల రుణాలు పొందవచ్చు. అయితే గ్రామ సంఘం నుంచి తీసుకునే రుణాలకు అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి సంతకాలతో తీర్మానం చేయాలి. ఇవి మొదట గ్రూపు అకౌంట్లో జమ చేసి తర్వాత సభ్యులకు పంపిణీ చేయాలి. కానీ వారి సంతకాలను ఫోర్జరీ చేసి సభ్యులకు తెలియకుండా గ్రామ వీఓఏ పద్మ సుమారు రూ. 26.50 లక్షలు సొంత అకౌంట్లోకి మళ్లించుకున్నట్లు డీపీఎం ప్రకాశ్ తెలిపారు. అయితే ఇందులో అప్పటి బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్లు తెలిసింది. అలాగే బ్యాంకు నుంచి మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చే రుణాలు సైతం సభ్యుల అకౌంట్లలోకి వెళ్లకుండా, నేరుగా వీఓఏ అకౌంట్లో జమ అయినట్లు తెలిసింది. ఇవి సుమారు రూ.13.40 లక్షల వరకు ఉన్నట్లు తేలింది. అయితే వీఓఏ ఈ విషయాలు బయట పడకుండా దొంగ రసీదులు, తీర్మానాలు, సంతకాల ఫోర్జరీ చేసి, అధికారులకు అనుమానం రాకుండా రికార్డులు నిర్వహించినట్లు సమాచారం. సీసీ నిర్లక్ష్యంతో అవినీతి భాగోతం సకాలంలో బయట పడలేదని భావించిన అధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా మహిళా సభ్యుల వ్యక్తిగత అకౌంట్లోకి వేయాల్సిన రుణాలను అప్పటి బ్యాంకు అధికారి వీఓఏతో కుమ్మకై ఆమె సొంత అకౌంట్లోకి మళ్లించారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయమై బ్యాంకు అధికారులు సైతం శాఖాపరమైన విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే సుమారు 35 రోజుల దాటినా వారి విచారణ కొలిక్కి రాకపోవడం గమనార్హం. వీఓఏ మాత్రం తాను సీసీతో పాటు ఏపీఎంలకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపించారు. -
‘తాగునీటి సమస్య రానివ్వం’
మెదక్జోన్: మెదక్ మున్సిపాలిటీకి సరఫరా అయ్యే మిషన్ భగీరథ పైపు పగిలిపోవటంతో ఇతర నీటి వనరులను ఉపయోగించి ప్రజలకు తాగునీటిని అందిస్తున్నామని అదనపు కలెక్టర్ నగేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణానికి ర్యాలమడుగు శివారు నుంచి తాగునీరు నీరు సరఫరా అవుతుందని, అది పగిలిపోవటంతో మరమ్మతులు జరుగుతున్నా యని తెలిపారు. కాగా ప్రజలకు నీటి ఎద్దడి రానివ్వకుండా పట్టణంలోని పంపు సెట్లను ఉపయోగిస్తూ పట్టణ ప్రజలకు నీరుి సరఫరా చేస్తున్నామని చెప్పారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని చెప్పారు. బస్సుల కోసం ఆందోళననర్సాపూర్ రూరల్: రద్దు చేసిన బస్సులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నత్నయ్యపల్లి, కాగజ్ మద్దూర్, కొండాపూర్ గ్రామస్తులు శుక్రవారం నర్సాపూర్–హైదరాబాద్ 765డీ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. గతంలో గంటకు ఒక బస్సు నడిపేవారని, ప్రస్తుతం ఒక బస్సు కూడా నడపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలను ఆశ్రయించి ప్రమాదాలకు గురవుతున్నట్లు వాపోయారు. అనంతరం డిపో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ధర్నాకు బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్ గౌడ్, మండల అధ్యక్షుడు నగేశ్, రాజు మద్దతు తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన అవసరం మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ పెద్దశంకరంపేట(మెదక్): ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, సిబ్బందితో కలిసి సైబర్నేరాల పోస్టర్ను ఆవిష్కరించారు. పోలీస్స్టేషన్కు వివిధ సమస్యలపై వచ్చే ప్రజలకు భరోసా కల్పించాలని, జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకుండా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్రెడ్డి, అల్లాదుర్గం ఎస్ఐ శంకర్, ఏఎస్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు. 49 మంది గిరిజన విద్యార్థుల ఎంపిక మెదక్ కలెక్టరేట్: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ద్వారా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అవకాశాలు మెండుగా ఉన్నాయని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. జిల్లాలో 3, 5, 8వ తరగతుల్లో చేరేందుకు మొత్తం 78 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. శుక్రవారం కలెక్టరేట్లో లక్కీడ్రా ద్వారా 49 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ తదితరులు పాల్గొన్నారు. -
కష్టపడి చ దివితేనే భవిష్యత్తు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డిపాపన్నపేట(మెదక్)/నర్సాపూర్ రూరల్: కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం మండలంలోని జక్కపల్లి మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేద, మధ్య తరగతి పిల్లల కోసం మోడల్ స్కూల్స్, గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు. పాఠశాలలో తాగునీటి సమస్య, ఆర్ఓ ప్లాంట్, బస్సుల సౌకర్యం వంటి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శేఖర్, సత్యంగౌడ్, భిక్షపతి, జితేందర్రెడ్డి, ఆంజనేయగౌడ్, శ్రీనివాస్రెడ్డి, జగన్, హుస్సేన్, ప్రసాద్, ప్రిన్సిపాల్ ఫర్హాన తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
సీజనల్.. పరేషాన్!
జిల్లాలో 21 మండలాల పరిధిలో 693 గ్రామాలు ఉండగా, 7.67 లక్షల జనాభా ఉన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 19, అర్బన్ హెల్త్సెంటర్ 1, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 2, ఏరియా ఆస్పత్రి 1, జిల్లా కేంద్ర ఆస్పత్రి 1, ఎంసీహెచ్ 1, చొప్పున మొత్తం 25 ఆస్పత్రులు ఉన్నాయి. కాగా వానాకాలం సీజన్లో వచ్చే వ్యాధులను ముందస్తుగా గుర్తించి ప్రాణనష్టం జరగకుండా వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈనెల 1 నుంచి ముందస్తు జర్వ సర్వేను ప్రారంభించారు. జిల్లాలో ఒక్కో ఆశవర్కర్ 20 ఇళ్లను సర్వే చేసి ఎప్పటికప్పుడు సంబంధిత ఏఎన్ఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. జ్వర పీడితులను గుర్తించి వారికి చికిత్స ప్రారంభించటంతో పాటు వారి పేరు, ఊరు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం డ్రైడే, ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి దోమల నివారణ, పారిశుద్ధ్య చర్యల గురించి వివరిస్తున్నారు. కాగా గతేడాది వానాకాలం సీజన్ మొత్తంలో 16 వేల మంది జ్వర పీడితులు ఉంటే, కేవలం ఈ 20 రోజుల్లోనే 9,231 మంది జ్వర పీడితులను గుర్తించటం గమనార్హం.పెద్దశంకరంపేటలో జ్వర సర్వే నిర్వహిస్తున్న సిబ్బందివర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈనెల 1 నుంచి జిల్లాలోముందస్తు జ్వర సర్వేను ప్రారంభించారు. కేవలం 20 రోజుల వ్యవధిలో 9 వేల పైచిలుకు జ్వర పీడితులను గుర్తించారు. వారికి వెంటనే వైద్య చికిత్స ప్రారంభించారు. అలాగే వ్యాధులు బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. – మెదక్జోన్పరిశుభ్రతే ప్రధానం ఈ ఏడాది సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడటం వైద్యారోగ్యశాఖ అధికారులకు కత్తిమీద సాములాంటిదనే చెప్పాలి. గత 16 నెలలుగా పాలకవర్గాలు లేక పల్లెలో పాలన గాడితప్పింది. పంచాయతీ కార్యదర్శలు చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పోయలేమంటూ చేతులెత్తేశారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఈక్రమంలో జిల్లా అధికారులు గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
జిల్లాలో 25 వేల దరఖాస్తులు: కలెక్టర్
చిన్నశంకరంపేట(మెదక్): గ్రామసభల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, రెండు నెలల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మడూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 25 వేల దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించలేని సమయంలో వారికి లిఖిత పూర్వకంగా సమా ధానం ఇస్తామన్నారు. శనివారం సైతం మ డూర్లో గ్రామ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జెడ్పీ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. యూనిఫాం, పుస్తకాలు అందాయా అని ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. యోగాతో మానసిక ఒత్తిడి దూరం మెదక్జోన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నిర్వహించే యోగా వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా చక్కటి ఔషదం అన్నారు. -
అధికారులకు ప్రజల గోస పట్టదా?
● నాలుగు రోజులుగా నీరు రాకుంటేపట్టించుకోరా? ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డిమెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణంలో గత 4 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల తాగునీటి గోస అధికారులకు పట్టదా? రేపటిలోగా సమస్య పరిష్కరించకుంటే పెద్దఎత్తున ధర్నా చేపడుతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేష్ను కలిసి వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. పైప్లైన్ మరమ్మతు పనులు 4 రోజులుగా పూర్తి చేయకపోవడంపై అధికారుల సమన్వయ లోపం కనిపిస్తుందన్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా ప్రజలకు నీరు అందించలేకపోతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ము న్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. -
గీత దాటితే వేటు తప్పదు
డీఈఓ రాధాకిషన్హవేళిఘణాపూర్(మెదక్)/కౌడిపల్లి(నర్సాపూర్): ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఈఓ రాధాకిషన్ హెచ్చరించారు. శుక్రవారం మండల వనరుల కేంద్రంలో వారితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఫీజుల వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. పాఠ్య పుస్తకాలు అమ్మాలంటే విధిగా అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే కౌడిపల్లి మండలంలోని వెల్మకన్న ఉన్నత పాఠశాలలో టచ్ఫర్ చేంజ్ ట్రస్ట్, పెగా సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు రూ. 12 లక్షలతో వాటర్ ప్లాంట్, బాల బాలికల కోసం వేర్వేరుగా నిర్మించిన టాయిలెట్స్తో పాటు బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్బీఐ కార్పొరేట్ రెస్పాన్స్ స్కీం ఆధ్వర్యంలో నిర్మించిన టాయిలెట్స్ను ప్రారంభించారు. -
పంచాయతా.. పరిషత్తా?
‘స్థానిక’ ఎన్నికలపై జోరుగా చర్చ ● పల్లెల్లో మొదలైన పోరు సందడి ● స్థానిక సంస్థలకు నిలిచిన ఆర్థికసంఘం నిధులు ● పలు చోట్ల అభివృద్ధి పనులకు బ్రేక్ ● ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,531 జీపీలు, ఎంపీటీసీలు 690, జెడ్పీటీసీలు 72ఉమ్మడి మెదక్ జిల్లాలో 19,62,458 మంది పల్లె ఓటర్లుండగా 1,531 గ్రామ పంచాయతీలు, 690 ఎంపీటీసీలు, 72 జెడ్పీటీసీలు ఉన్నాయి. గతేడాది జూలై 4వ తేదీతో మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు(ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడు (జెడ్పీటీసీ) పదవీకాలం, గతేడాది ఫిబ్రవరి 2తో సర్పంచ్ల పదవీకాలం ముగిశాయి. అప్పటి నుంచి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్లు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తే అధికార పార్టీకి లాభం అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి కావడంతో ప్రభుత్వ పాలన రెఫరండంగా భావించే అవకాశం ఉంది. ఆశల్లో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లు రాష్ట్రపతి దగ్గరనే ఇంకా పెండింగ్లో ఉంది. బిల్లు ఆమోదం తర్వాతనే నిర్వహిస్తారా? పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారో.. వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు స్థానిక పదవుల పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది లేకపోవడంతో కొంత వెనుకబడి ఉంది. దీంతో ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి పదవులు దక్కితే పార్టీ కొంత బలపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందు జరుగుతాయా.. లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా? అని పల్లెల్లో జోరుగా చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల ప్రకటనతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం వేగం పెంచింది. రైతు భరోసా కింద ఎకరానికి రూ. 6వేలు చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెలలో జరుగుతాయని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఆశావహులు సైతం పోటీకి రెడీ అవుతున్నారు. సాక్షి, సిద్దిపేట: నిలిచిన ఆర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. అదే పాలక వర్గాలుంటే ప్రతీ ఏడాది కేంద్రం నుంచి ప్రత్యేక నిధులను కేటాయించేవారు. ఆర్థిక సంఘం నుంచి నిధులు రాకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
OòܺƊḥæ¯ólÆ>ËOò³ A{ç³Ð]l$™èl¢…V> E…yéÍ
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: ఆశ, అత్యాశలే సైబర్ నేరగాళ్ల ఆయుధాలని, తక్కువ సమయంలో ఎక్కువ లాభం అంటే మోసమని గ్రహించి అవగాహనతో వ్యవహరించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెప్పి అకౌంట్ వివరాలు అడిగితే చెప్పకూడదన్నారు. బ్యాంకు అధికారులు ఎప్పుడు సమాచారాన్ని కాల్ చేసి అడగరని తెలిపారు. సైబర్ నేరగాళ్లు నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్, యాప్ సృష్టించి ఎక్కువ లాభాలు చూపించి మోసం చేస్తారని, అలాంటివి నమ్మి మోసపోవద్దని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైం డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్టౌన్ సీఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
శివ్వంపేట(నర్సాపూర్)/పెద్దశంకరంపేట(మెదక్): భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. మండల పరిధిలోని నవాబుపేటలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. 30 ఏళ్లుగా గ్రామంలో పొలాలు సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాదార్ పాస్ పుస్తకాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని రైతులు విన్నవించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ, రెవెన్యూ భూములకు సంబంధించి తలెత్తిన సమస్యను ఇరుశాఖలతో కమిటీ ఏర్పాటు చేసి త్వరలోనే అర్హులైన రైతులందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం చాకరిమెట్ల ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ మహిపాల్రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, సిబ్బంది ఉన్నారు. అనంతరం పెద్దశంకరంపేట మండలం కట్టెల వెంకటాపూర్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రైతులు భూ సమస్యలపై అందించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
ఆ ఐదున్నర కిలోమీటర్లు
(765 డీజీ) ఎన్హెచ్ విస్తరణకు ఆటంకాలుత్వరలో అనుమతులు మెదక్, రామాయంపేట మధ్య అటవీ ప్రాంతంలో ఆ శాఖ అనుమతులు రాకపోవడంతో జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈవిషయమై అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లా. త్వరలో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అక్కన్నపేట వద్ద ఇద్దరు రైతులు కోర్టులో కేసు వేయడంతో ఆటంకం ఏర్పడింది. – రఘునందన్రావు, ఎంపీ, మెదక్రామాయంపేట(మెదక్): మూడు జిల్లా కేంద్రాలను కలుపుతూ కేంద్రం మంజూరు చేసిన జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు, కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. దీంతో మెదక్– రామాయంపేట మధ్య అటవీ ప్రాంతంలో నాలుగున్నర కిలోమీటర్లు, అక్కన్నపేట రైల్వేస్టేషన్ వద్ద కిలోమీటర్ మేర రహదారి విస్తరణ పనులు గత మూడేళ్లుగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రెండుసార్లు ప్రతిపాదనలు మెదక్, సిద్దిపేట, వరంగల్ జిల్లా కేంద్రాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గతంలో నిధులు మంజూరు చేసింది. మెదక్ నుంచి సిద్దిపేట వరకు ఒక బిట్టు, సిద్దిపేట నుంచి వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వరకు మరో బిట్టుగా జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మెదక్, సిద్దిపేట మధ్య రూ. 882 కోట్లు మంజూరు కాగా, అటవీ ప్రాంతంలో అక్కన్నపేట వద్ద మినహా మిగితా చోట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నా యి. మెదక్, రామాయంపేట మధ్య నాలుగున్నర కిలోమీటర్ల మేర అటవీ విస్తరించి ఉంది. అనుమతుల కోసం జాతీయ రహదారుల శాఖ అధికారులు అటవీశాఖ కేంద్ర విభాగానికి ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు అధికారులు రోడ్డు విస్తరణలో కోల్పోయే చెట్ల వివరాల కొలతలు సేకరించారు. వారి సూచనల మేరకు అటవీ ప్రాంతం గుండా రహదారికి ఇరువైపులా రోడ్డు విస్తరణ పరిధి తగ్గిస్తూ ఎన్హెచ్ అధికారులు రెండోసారి ప్రతిపాదనలు పంపారు. అయితే రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అనుమతులు రాకపోవడంతో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. అక్కన్నపేట వద్ద రైల్వేలైన్ కింది భాగంలో బ్రిడ్జి నిర్మాణంతో పాటు సుమారు కిలోమీటర్ మేర భూమి లోపలి భాగం నుంచి రోడ్డు నిర్మించాల్సి ఉంది. రైల్వేశాఖ నుంచి అనుమతులు వచ్చినా గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు కోర్టులో కేసు వేయడంతో పనులు నిలిచిపోయాయి.అటవీ ప్రాంతంలో నిలిచిన రోడ్డు విస్తరణ అడ్డంకిగా మారిన అటవీశాఖఅనుమతులు మూడేళ్లుగా నిలిచిన పనులుబైపాస్ రోడ్డు సర్వే పూర్తి రామాయంపేట బైపాస్ రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులు ఏడాదిగా సర్వే పనులు అడ్డుకున్నారు. బైపాస్ రోడ్డు కాకుండా ప్రస్తుతం ఉన్న మార్గంలోనే రహదారి నిర్మించాలని పట్టుపట్టారు. దీంతో పలుమార్లు ఎంపీ రఘునందన్రావు వారిని సముదాయించి, అందరికీ న్యాయమైన నష్టపరిహారం ఇప్పిస్తామని నచ్చజెప్పి సమస్య పరిష్కరించారు. -
మోదీతోనే దేశంలో సుపరిపాలన
నర్సాపూర్: ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో దేశంలో సుపరిపాలన అందుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలోని పిల్లల పార్కులో నిర్వహించిన రచ్చబండలో పాల్గొని మాట్లాడారు. మోదీ 11 ఏళ్ల పాలనలో పేదలు, రైతుల సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేశారని కొనియాడారు. అలాగే పర్యావరణవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ను పురస్కరించుకొని ఈనెల 23 నుంచి జూలై 6వ తేదీ వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్గౌడ్, నాయకులు రమేష్గౌడ్, చంద్రయ్య, రాంరెడ్డి, నారాయణరెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కాటేజీలు మంజూరు చేయండి మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి పాపన్నపేట(మెదక్): తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయలకు 30 కాటేజీలు మంజూరు చేయాలని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డికి వినతిపత్రం ఇచ్చినట్లు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఏడుపాయలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారని తెలిపారు. 2008లో అప్పటి మంత్రి గీతారెడ్డి రూ. 1.50 కోట్లు మంజూరు చేసి కాటేజీలు ఏర్పాటు చేశారని చెప్పా రు. ప్రస్తుతం భక్తులకు సరిపడా సత్రాలు లేక ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఇప్పటికై నా కాటేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం రామాయంపేట(మెదక్): రామాయంపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ శిరీష సూచించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం కళాశాలలో బీకాం, బీజెడ్సీ, ఎంజెడ్సీ, ఎంఎస్సీఎస్, ఎంపీసీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు ఈనెల 23వ తేదీలోగా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు ధైర్యంగాముందుకు సాగాలి చిలప్చెడ్(నర్సాపూర్): మహిళలు ధైర్యంగా ముందుకు సాగుతూ, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా మహిళా సాధికారిత టీం మిషన్ సమన్వయకర్త సంతోషి అన్నారు. మండల పరిధిలోని గౌతాపూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి బేటీ బచావో, బేటీ పడావో దశాబ్ది ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, సైబర్ క్రైం, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ, ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. మహిళల సంరక్షణకు తమ బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మహిళా సాధికారిత సిబ్బంది కవిత, నాగమణి, పాఠశాల హెచ్ఎం కృష్ణ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల సాకారం
నర్సాపూర్: మాది పేదల ప్రభుత్వమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. గురువారం నర్సాపూర్లోని పలు వార్డులకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటితో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో పేదలకు ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డికి ప్రొటోకాల్పై ఉన్న ధ్యాస పేదలకు సేవ చేయడంలో లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో భూ ఆక్రమణలు జరిగాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఇళ్లు రాని వారు ఆందోళన చెందొద్దని, ఇంకా మూడు పర్యాయాలు కేటాయిస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రాజుయాదవ్, నాయకులు మల్లేష్, చిన్న ఆంజిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
90 శాతం రెవెన్యూ సదస్సులు పూర్తి
కలెక్టర్ రాహుల్రాజ్టేక్మాల్(మెదక్): భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లాలో నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులు 90 శాతం పూర్తయినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం మండలంలోని ఎల్లంపల్లిలో రెవెన్యూ సదస్సును పరిశీలించి మాట్లాడారు. ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా తహసీల్దార్ నేతృత్వంలో బృందాలు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తుందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల వివరాలతో సరిపోల్చుకొని, క్షేత్రస్థాయి విచారణను పకడ్బందీగా జరపాలన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకొని వారి సామర్థ్యాలను పరిక్షించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ తులసీరామ్, ఆర్ఐ సాయిశ్రీకాంత్, ఎంపీఓ రియాజొద్దీన్, కార్యదర్శి గొల్లసత్యం, నాయకులు కిష్టయ్య, రాజేశ్వర్గౌడ్, సాయిబాబ ఉన్నారు. -
ఆయిల్పామ్ సాగుతో లాభాలు
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిన్నశంకరంపేట(మెదక్): రైతులు ఆయిల్పామ్ సాగును సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో రైతు కిష్టయ్య వ్యవసాయ పొ లంలో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారం అందిస్తున్న ఆయిల్పామ్ సాగుకు రైతులు మొగ్గుచూపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి ప్రతాప్సింగ్, ఏఓ ప్రవీణ్, ఏఈఓ మధులిక, ఫీల్డ్ ఆఫీసర్ సుజాత, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట మెదక్జోన్: వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. గురువారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 12 ఐసోలేషన్ పడకలతో కూడిన వార్డును ప్రారంభించి మాట్లాడారు. కోవిడ్ సంబంధిత కేసులను ఎదుర్కొవడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీతాదేవి, ప్రొఫెసర్ లోకేష్తో పాటు ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
బారులు తీరి.. అర్జీలు ఇచ్చిరాయిలాపూర్లో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు రైతులు పోటెత్తారు. బారులు తీరి దరఖాస్తులు అందజేశారు. తాము 50 ఏళ్లుగా కాస్తులో ఉన్నా, పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని తహసీల్దార్ రజనికుమారికి వినతిపత్రం అందజేశారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మెదక్ వచ్చినప్పుడు గ్రామ శివారులోని 881 సర్వే నంబర్లో పట్టాలిచ్చారని గుర్తుచేశారు. పాస్ పుస్తకాల కోసం పలుమార్లు దరఖాస్తు చేసినా రాలేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై తహసీల్దార్ మాట్లాడుతూ.. బాధిత రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. – రామాయంపేట(మెదక్) -
వైద్య విద్య.. మెరుగుపడేనా?
మెదక్జోన్: ప్రభుత్వ వైద్య కళాశాల ఏడాదిగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. నూతన భవన నిర్మాణానికి ఏడాది క్రితం నిధులు మంజూరైనా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ఇదిలాఉండగా ప్రయోగశాలలు, క్లినికల్ పారామీటర్లు లేవని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఇటీవల ఆక్షేపించిన విషయం తెలిసిందే. నూతన భవన నిర్మాణం ఎప్పుడో..? గతేడాది జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు అయింది. దీంతో అద్దె భవనంలో తాత్కాలికంగా తరగతులు కొనసాగిస్తున్నారు. కళాశాల పక్కనే గల చిన్నపాటి గదుల్లో బాలురు ఒక వైపు, బాలికలు మరో పక్కన హాస్టళ్లలో ఉంటున్నారు. వసతి గృహాలను ఆనుకొని పిచ్చిమొక్కలు, గడ్డి, చెట్లు ఏపుగా పెరిగాయి. నిత్యం పాములు, విష పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా నూతన భవన నిర్మాణం కోసం ఏడాది క్రితం రూ. 180 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ. 150 కోట్లు భవన నిర్మాణానికి కాగా, మరో రూ. 30 కోట్లు మౌలిక వసతుల కోసం కేటాయించింది. విశాలమైన ప్రయోగశాలలు, ల్యాబ్లు, తరగతి గదులు, బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు తదితర భవన నిర్మాణాల కోసం 20 ఎకరాల స్థలం అవసరం అవుతుందని భావించారు. అందుకనుగుణంగా జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ ఆస్పత్రి పక్కన 11 ఎకరాల స్థలాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు మెడికల్ కళాశాలకు అప్పగించారు. ఈ స్థలంలో మూడు, లేదా నాలుగు అంతస్తుల భవనం నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. నిర్మాణం కోసం త్వరలో టెండర్ పిలుస్తామని సంబంధిత అధికారి తెలిపారు. ఏడాదిగా అద్దె భవనంలో కొనసాగింపు నిధులు మంజూరైనాప్రారంభం కాని పనులు అరకొర వసతులతో విద్యార్థుల అవస్థలు మరో 50 మంది విద్యార్థులు గతేడాది జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కాగా, 50 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది సైతం విద్యార్థులను చేర్చుకోవాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆగస్టులో మరో 50 మంది విద్యార్థులు రానున్నారు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న అద్దె భవనంలో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. -
ప్రతి దరఖాస్తు ఆన్లైన్ చేయాలి
మనోహరాబాద్(తూప్రాన్): భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. బుధవారం మండలంలోని దండుపల్లిలో చేపట్టిన రెవెన్యూ సదస్సును సందర్శించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పీఓటి, సాదా బైనామాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. మనోహరాబాద్, దండుపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 39 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో డీటీ కౌషిక, ఆర్ఐ దీక్షిత్, సంపత్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్ -
భూ భారతితో సమస్యలు పరిష్కారం
సదాశివపేటరూరల్(సంగారెడ్డి): ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారమవుతాయని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వెల్టూర్, నందికంది గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. భూము లపై పూర్తి హక్కులను కల్పిచేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తోందన్నారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నందికందిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి, నాయబ్ తహసీల్దార్ బాలరాజ్, ఆర్ఐ గంగాధర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణ, మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సిద్దన్న, నాయకులు పాల్గొన్నారు.టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి -
మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుమెదక్ మున్సిపాలిటీ: విద్యా సంస్థలకు సమీపంలో ఎక్కడా పొగాకు విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. విద్యా సంస్థలకు చుట్టుపక్కల దొంగచాటుగా పొగాకు, అనధికారంగా మద్యం, డ్రగ్స్ విక్రయించే వారిపై విద్యాసంస్థల యాజమాన్యాలు నిఘా ఏర్పాటు చేసుకొని పోలీస్లకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే విద్యార్థులకు డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. విద్యాసంస్థల ప్రవేశ సరిహద్దు గోడకు పొగాకు రహిత విద్య సంస్థ అనే సంకేతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు ఇవీ..
● 15 ఏళ్లు నిండిన వాహనాలను రవాణాకు ఉపయోగించకూడదు. స్కూల్ బస్సు పూర్తి కండిషన్లోఉండాలి. ● విద్యాసంస్థ పేరు, ఫోన్ నంబర్, పూర్తి అడ్రస్ బస్సు ఎడమ వైపు, ముందుభాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి. ● బస్సు నడిపే డ్రైవర్ వయసు 60 ఏళ్లకు మించకూడదు. బీపీ, షుగర్, కంటి జబ్బులు ఉండకూడదు. ● అతడికి పాఠశాల యాజమాన్యం ప్రతి 3 నెలలకోసారి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ● డ్రైవర్కు కనీసం 5 సంవత్సరాల అనుభవంతో పాటు సీనియర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ● ఏటా బస్సు ఫిట్నెస్ తప్పకుండా చేయించాలి. ఆర్టీఏ అధికారులు బస్సును పూర్తిగా చెక్ చేసి సర్టిఫికెట్ ఇచ్చాకే విద్యార్థులను తరలించాలి. ● ప్రతీ బస్సుల్లో ఒక అటెండర్ తప్పకుండా ఉండాలి. ప్రమాదావశాత్తుమంటలు చెలరేగితే ఆర్పే యంత్రం ఉంచాలి. ● సీట్ల పరిమితికి మించి విద్యార్థులను తరలించకూడదు. ● రోడ్డు భద్రతపై ఆర్టీఏ, పోలీస్శాఖలు ఏడాదికోసారి విద్యార్థులకు అవగాహన కల్పించాలి. -
లక్ష్యం మేర రుణాలు ఇవ్వాలి
మెదక్జోన్: బ్యాంకర్లు ఈ వార్షిక సంవత్సరానికి కేటాయించిన రూ. 6,517.51 కోట్ల రుణాలను రైతులతో పాటు ఇతర రంగాలకు అందించి లక్ష్యా న్ని చేరుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో కలిసి రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకర్లు నిర్దేశించిన రుణాలను అందిస్తేనే రైతులతో పాటు ఇతర రుణ గ్రహితలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా స్వయం ఉపాధి రంగాలలో లక్ష్యాలను నిర్దేశించుకొని రుణాలు అందించాలన్నారు. గతేడాది వార్షిక రుణ ప్రణాళిక రూ. 5,857 కోట్ల రుణాల లక్ష్యం ఉండగా, ఇచ్చింది మాత్రం రూ. 4,366.84 కోట్లేనని తెలిపారు. ఈసారి అలా కాకుండా నిర్దేశించిన రుణాలు వందశాతం అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, ఎల్డీఎం నరసింహమూర్తి, నాబార్డ్ డీడీఎం కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూముల పరిశీలన హవేళిఘణాపూర్(మెదక్)/మెదక్ కలెక్టరేట్: హవేళిఘణాపూర్ శివారులో ఉన్న ప్రభుత్వ భూములను కలెక్టర్ రాహుల్రాజ్ బుధవారం పరిశీలించారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, జిల్లా ఎలక్ట్రిసిటీ స్టోర్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ తదితర నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ పరిశీలించి పూర్తి వివరాలను మ్యాప్ను తయారు చేసి అందజేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాకు నూతన నర్సింగ్ కాలేజ్ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
కార్మికశాఖ సహాయ అధికారి ఘెరావ్
నారాయణఖేడ్: ఖేడ్ కార్మికశాఖ సహాయ అధికారి గిరిరాజును బుధవారం వివిధ గ్రామాల బాధితులు నిలదీశారు. కార్మికశాఖ కార్డులు కలిగి ఉన్న మహిళా కార్మికుల మొదటి, రెండవ కాన్పులకు ప్రభుత్వం రూ. 30 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని, దరఖాస్తు చేసుకొని ఏడాది దాటినా ప్రక్రియ ప్రారంభించకపోగా, నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారంటూ వాగ్వాదానికి దిగా రు. కొత్తగా కార్డులు కావాల్సిన వారికి సైతం ముడుపులు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. బాధితులకు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. తడి, పొడి చెత్తపైఅవగాహన అవసరం జోగిపేట(అందోల్): తడి, పొడి చెత్త వినియోగంపై విద్యార్థులకు అవగాహన అవసరమని మున్సిపల్ కమిషనర్ తిరుపతి అ న్నారు. బుధవారం జోగిపేటలోని ఓ పాఠశాలలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా వ్యర్థాల నిర్వహణ, ఎరువుల తయారీపై వ్యా సరచన పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మంచి ప్రకృతిని అందించాలన్నారు. -
ఇక డుమ్మాలకు చెక్
సాక్షి, సిద్దిపేట: జిల్లా ప్రజా పరిషత్లు, మండల పరిషత్ కార్యాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ హాజరును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జిల్లా ప్రజా పరిషత్లు,73 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ సంబంధిత మెషీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ల పాలక వర్గాల గడువు గతేడాది జూలై 4వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్లు జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారులుగా, మండల పరిషత్ ప్రత్యేక అధికారులుగా పలువురు జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు. మండల పరిషత్లలో పలువురు అధికారులు సమయ పాలన పాటించడం లేదని గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ మెషీన్లు బిగించి సమయ పాలన పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఆఫ్లైన్ గతంలో పలు కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు ఆఫ్లైన్లో ఉండేది. అది సక్రమంగా పనిచేయకపోవడంతో పరికరాలు మూలన పడ్డాయి. దీంతో చాలామంది కార్యాలయ సిబ్బంది విధుల పట్ల జాప్యం వహించడం, తరచుగా డుమ్మా కొట్టడం, ఇంటికి వెళ్లడం, విధులకు రాకపోయినా వచ్చినట్లు నమోదు చేసుకుంటున్నారు. పలువురు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలకు మెరుగైన సేవలు అందడం లేదు. వీటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఆన్లైన్ బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.సిద్దిపేట జిల్లా పరిషత్లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ మెషీన్లో హాజరు నమోదు చేసుకుంటున్న సిబ్బంది జిల్లా మండల పరిషత్లు సిద్దిపేట 26 సంగారెడ్డి 26 మెదక్ 21 ఉద్యోగుల నుంచి ఆధార్ నంబర్,హోదా వివరాల సేకరణ ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జిల్లా పరిషత్లు, 73 మండల పరిషత్లుఉద్యోగుల వివరాల సేకరణ బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ మెషీన్లో ఉద్యోగులను గుర్తించేందుకు వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగుల హోదా, ఆధార్ నంబర్, ఉద్యోగుల క్రమసంఖ్య తదితర వివరాలను బయోమెట్రిక్లో నమోదు చేస్తున్నారు. బయోమెట్రిక్ హాజరుతో ఉద్యోగులు ఏ సమయానికి వస్తున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? ఎంతమంది సిబ్బంది హాజరయ్యారు? అనే విషయాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంకు తెలియనుంది. -
విద్యాభివృద్ధికి పరిశ్రమల చేయూత
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి జిన్నారం(పటాన్చెరు): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పరిశ్రమలు పెద్దపీట వేస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం గుమ్మడిదల మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. గుమ్మడిదలలో హానర్ ల్యాబ్ పరిశ్రమ సహకారంతో సీసీ రోడ్లు, అంతర్గత మురికి కాలువలు, అన్నారం మోల్డ్ టెక్ పరిశ్రమ సహకారంతో నిర్మించిన జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, వావిలాలలో నిర్మించిన భవనాలను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి పరిశ్రమలు సహకారం అభినందనీయమన్నారు. ఈసందర్బంగా విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చెర్మన్ ప్రభాకర్, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటపాటల అంగన్వాడీ బోధన
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: చిన్నారులకు సులభంగా అర్థమయ్యేలా అంగన్వాడీలో ఆటపాటల ద్వారా బోధన అందించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని శాసీ్త్రనగర్ అంగన్వాడీ కేంద్రంలో అమ్మమాట –అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొని చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్వాడీ చిన్నారులకు సైతం ఏకరూప దుస్తులు, ప్రతీ బుధవారం ఎగ్ బిర్యాని అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ సుజాత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖేడ్ మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సును ఆర్డీఓ అశోకచక్రవర్తితో కలిసి ప్రారంభించారు. గత ప్రభుత్వం వేల ఎకరాల ప్రభుత్వ భూమిని నాయకులకు పట్టాలుగా మార్పిడి చేసిందన్నారు. అలాగే ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఎనిమిది ట్రాక్టర్ల ఉచిత ఇసుకను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ర్యాలమడుగు సబ్స్టేషన్కు ప్రత్యేక ఫీడర్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. -
బడి బస్.. ఫిట్లెస్!
చిరు వ్యాపారులకు చేయూత చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు మెప్మా రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలను అందజేస్తోంది. వివరాలు 8లో uగురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది. రోడ్లపై బడి బస్సులు రయ్ రయ్మని విద్యార్థులతో తిరిగేస్తున్నాయి. అయితే వాటిలో ఎన్ని బస్సులు నిబంధనలు పాటిస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా ఫిట్నెస్ చేయించుకోని బస్సులు ఉన్నాయనే విషయం ఆందోళన కలిగిస్తోంది. ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు, ఇప్పటికే 15 బస్సులను సీజ్ చేశారు. – మెదక్జోన్/తూప్రాన్ జిల్లావ్యాప్తంగా 105 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 45 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో హాస్టళ్లలో ఉంటూ 20 వేల మంది చదువుకుంటుండగా, మరో 25 వేల మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు నిత్యం ఇంటి నుంచి బస్సులు, ఇతర వాహనాల్లో బడులకు వెళ్తున్నారు. వీరికోసం వివిధ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు 313 బస్సులను వినియోగిస్తున్నాయి. ఏటా బస్సుల ఫిట్నెస్ తప్పనిసరిగా చూడాల్సిన బాధ్యత ఆర్టీఏ అధికారులపై ఉంటుంది. దీంతో వారు 99 బస్సులు కాలం చెల్లినవిగా గుర్తించి, వాటిలో పిల్లలను తరలించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఫిట్నెస్ లేనివి మరో 15 బస్సులను సీజ్ చేశారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే వాటిని సరిచేసుకోవాల్సిన యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించాయి. దీంతో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసు కుంటున్నారు. బడి బస్సు రోడ్డెక్కాలంటే 32 నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందులో ఫిట్నెస్, టైర్లు, సాంకేతిక సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేస్తారు. చర్యలు తప్పవు పాఠశాల బస్సులను నిబంధనల ప్రకారం నడపాలి. జిల్లావ్యాప్తంగా 313 బస్సులు ఉండగా, ఇప్పటివరకు 15 బస్సులను సీజ్ చేశాం. అలాగే 99 బస్సులు కాలం చెల్లినవిగా గుర్తించాం. ఫిట్నెస్ చేయని పాఠశాలల వాహనాలను వెంటనే చేయించాలి. లేనిచో చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. – వెంకటస్వామి, ఆర్టీఏ, మెదక్న్యూస్రీల్జిల్లాలో 99 కాలం చెల్లిన బస్సులు ఇప్పటివరకు 15 సీజ్.. ముమ్మరంగా కొనసాగుతున్న తనిఖీలు -
ధరణిలో అనేక అవకతవకలు
నర్సాపూర్ రూరల్: భూ సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని రెడ్డిపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణిలో అనేక అవకతవకలు జరగడంతో అనేక మంది రైతులు తమ భూ ములను కోల్పోయారని విమర్శించారు. పేద రైతులను మోసం చేసి కొంతమంది భూస్వాములు ధరణిలో భూములను సొంతం చేసుకున్నారని ఆరోపించారు. గతంలో అక్రమాలకు గురైన భూములను సరిచేసేందుకే మా ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిందన్నారు. భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, రెడ్డిపల్లి మాజీ ఉప సర్పంచ్ అశోక్గౌడ్, శివప్రసాద్గౌడ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
చిల్లి గవ్వలేదు.. ఇల్లు కట్టేదెట్టా?
కొల్చారం(నర్సాపూర్): కట్టెల పొరకను నాటి..దాని చుట్టూ దాపుగా చీరలను కట్టుకుని నివాసముంటున్న ఈ ఫొటోలో కన్పిస్తున్న మహిళ పేరు అల్లం లక్ష్మమ్మ. మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ఈమె పేరులో లక్ష్మి ఉన్నా బతుకులో మాత్రం దుర్భిణీతో వెదికినా లక్ష్మి కానరావడం లేదు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం ద్వారా మంజూరు పత్రాన్ని అందుకుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి వివిధ విడతల్లో, మొత్తంగా ఐదు విడతల్లో డబ్బులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొదటి విడతగా పూర్తిస్థాయి బేస్మెంట్ నిర్మించిన తర్వాత రూ.1 లక్ష చెల్లించేలా నిబంధన. అయితే ప్రస్తుతం లక్ష్మమ్మ కాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉండటం, పనిచేయని పరిస్థితుల్లో చేతుల్లో చిల్లి గవ్వ లేదు. అప్పు పుట్టని పరిస్థితి. పెట్టుబడి లేకుండా ఇంటిని ఎలా నిర్మించాలని ఆవేదన చెందుతుంది. ప్రభుత్వమే ముందుకు వచ్చి ఉండేందుకు ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరుతుంది. -
బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025
ముందు మురిపించిన వానలు పక్షం రోజులుగా ముఖం చాటేశాయి. మే నెలలో కురిసిన అకాల వర్షాలకు దుక్కులు దున్నిన రైతులు వర్షాధార పంటలను సాగు చేశారు. తీరా వర్షాకాలం ప్రారంభమయ్యాక విత్తనం విత్తాక చినుకు పడకపోవటంతో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. మెదక్జోన్: మెదక్ జిల్లాలో మే నెలలో అకాల వర్షాలు దంచికొట్టాయి. యాసంగి ధాన్యాన్ని అమ్ముకోనివ్వకుండా నిత్యం వర్షంతో ధాన్యం తడిసిముద్దయింది. ఫలితంగా నానా తంటాలు పడి ధాన్యం అమ్ముకున్నారు. వానలకు భూములు తడవటంతో రైతులు దుక్కులు దున్ని వర్షాధార పంటలైన పత్తి, కూరగాయలసాగు, కంది, పెసర లాంటి ఆరుతడి పంటలతో పాటు పచ్చిరొట్ట విత్తనాలను సైతం సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3.50 లక్షల ఎకరాలలో వివిద రకాల పంటలను సాగుచేస్తుండగా ఇందులో అత్యధికంగా వరిసాగు కాగా రెండవ అత్యధికంగా పత్తి పంట సాగు చేస్తున్నార. వరిసాగు 3.5 లక్షల ఎకరాలలో సాగవుతుండగా పత్తి పంట 37 వేల ఎకరాలలో సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. కాగా ఇప్పటివరకు కేవలం 10 వేల ఎకరాలకు పైగా పత్తిసాగు చేసినట్లు సమాచారం. పత్తితోపాటు కూరగాయలు, కందులు, పెసర్లు, పచ్చిరొట్ట విత్తనాల సాగు సైతం మరో వెయ్యి ఎకరాల వరకుసాగైనట్లు సబంధిత అధికారులు చెబుతున్నారు. నాలుగు మండలాల్లో అత్యధికం..! జిల్లాలో రేగోడు, టేక్మాల్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గ్ మండలాల్లో అత్యధికంగా పత్తిసాగు చేస్తారు. ఈ పంటను పూర్తిగా వర్షాధారంగా సాగు చేస్తారు. ఆ మండలాల్లో సాగు నీరు అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రతీఏటా వానాకాలంలో పత్తిపంటను సాగు చేస్తారు. కాగా పత్తిసాగు చేశాక కనీసం 10 రోజులకొకసారైనా వర్షం కురిస్తేనే విత్తిన విత్తు మొలకెత్తుతుంది. లేకపోతే ఎండ వేడిమికి విత్తు మొలకెత్తక పోగా భూమిలో విత్తిన విత్తును చెదలతో పాటు ఇతర చీమలు తినేసే అవకాశముంటుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని వర్షం వచ్చిన వాతావరణం కనిపించినా ఆ తర్వాత గాలి మొదలై మేఘాలు కాస్తా తేలిపోతున్నాయి. మరో వారం పాటు ఇలాగే వర్షం కురవకుంటే వర్షాధారంగా సాగు చేసిన ఆరు తడి పంటలను మళ్లీ సాగు చేయాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విన్సెంట్ వినయ్కుమార్ న్యూస్రీల్ నమోదు ప్రక్రియలో లోపాలను గుర్తించాలి కలెక్టర్ రాహుల్రాజ్ యోగా డే పోస్టర్ ఆవిష్కరణ ముందస్తుగా కురిసిన వర్షాలు ఇప్పటికే వర్షాధార పంటలను విత్తుకున్న రైతులు పక్షం రోజులుగా ముఖం చాటేసిన వర్షాలు ఆందోళనలో రైతులు -
సర్కార్ బడిలో టీచర్ కొడుకు
పాపన్నపేట(మెదక్)/తూప్రాన్: చాలామంది ప్రభుత్వ టీచర్లు తమ పిల్లలను ప్రైవేట్ బడికి పంపుతూ గ్రామస్తుల పిల్లలను మాత్రం సర్కార్ బడికి పంపాల్సిందిగా కోరుతారనే ప్రచారం ఉంది. అయితే ఆదర్శాలను ఆచరిస్తూ మిగతావారికి స్ఫూర్తి కలిగించాలని చెబుతుంటారు పెద్దలు. అలాంటి పనినే చేశాడో టీచర్. అందరూ ప్రైవేటు స్కూళ్ల మోజులో పడి తమ పిల్లల్ని అందుల్లో చేర్పిస్తుంటే ఓ టీచర్ మాత్రం సర్కారు బడిపై నమ్మకముంచి తన కుమారుడిని అందులోనే చేర్పించాడు. పాపన్నపేట మండలం పొడిచన్పల్లిలో మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పొడిచన్పల్లి గ్రామానికి చెందిన శ్రవణ్కుమార్ నాగ్సాన్పల్లి ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పని చేస్తున్నాడు. మెదక్లో నివాసం ఉంటున్నాడు. తన కొడుకు కల్యాణ్వర్ధన్ను తను పనిచేస్తున్న పాఠశాలలోనే చేర్పించి స్కూలుకు వచ్చేటప్పుడు తన వెంట తీసుకొస్తున్నాడు. టీచర్లు తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పిస్తే, సామాన్యులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని ఎంఇఓ ప్రతాప్రెడ్డి అన్నారు. గ్రామస్తులు కూడా టీచర్ శ్రవణ్ కుమార్ను అభినందించారు. వెల్దుర్తి మండలం కొప్పులపల్లి ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహేశ్గౌడ్ కూడా తన కుమారుడు అభిషేక్గౌడ్ను తూప్రాన్లోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలలో 8వ తరగతిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. దీంతో మహేశ్ గౌడ్ను కూడా ఎంఈఓ సత్యనారాయణతోపాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. -
ఉపాధి పథకాలకు వంద శాతం సబ్సిడీ
పీడీ శ్రీనివాస్రావు శివ్వంపేట(నర్సాపూర్): జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అందిస్తున్న పథకాలను సన్న, చిన్నకారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పెద్దగొట్టిముక్లల్లో ఉపాధి హామీ నిధులతో నిర్మించతలపెట్టిన పశువుల షెడ్డు, ఫిష్ పాండ్, ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. కూలీలతో చర్చించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు వంద శాతం సబ్సిడీపై పశువుల షెడ్డు, షిష్ పాండ్లు నిర్మించుకోవచ్చని తెలిపారు. జాబ్కార్డు కలిగి, ఏడాదిలో ఇరవై రోజులు ఉపాధి కూలి పనులు చేసిన సన్న, చిన్నకారు రైతులు ఈ పథకాలకు అర్హులన్నారు. పాడి ౖరైతులకు పశువుల షెడ్డుకు 90 వేలు, మత్స్యకారుల సహకార సంఘానికి చేపల చెరువులు నిర్మించుకునేందుకు రూ.10 లక్షలు నిధులతో ఫిష్ పాండ్లు నిర్మిస్తామన్నారు. -
క్రమశిక్షణ చాలా ముఖ్యం
● మనం చేసే పనులను బట్టి విలువ పెరుగుతుంది ● జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ/హవేళిఘణాపూర్(మెదక్): మనం చేసే పనులను బట్టి విలువ పెరుగుతుందని, యూనిఫాం వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పోలీ సు ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని అర్మర్డ్ రిజర్వ్ సిబ్బంది, హోంగార్డు సిబ్బందికి జిల్లా దర్బార్ నిర్వహించారు. అనంతరం మెదక్రూరల్, హవేళిఘణాపూర్ పోలీస్స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఉన్న వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. చిన్న పొరపాట్లతో జీవితం నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఎవరు కూడా చెప్పకుండా గైర్హాజరు కావొద్దని సూచించారు. ప్రతీ శుక్రవారం మీకోసం ప్రతీ శుక్రవారం సిబ్బంది కోసం కేటాయిస్తానని ఎస్పీ చెప్పారు. క్లిష్ట పరిస్థితులలో కూడా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని, ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు. పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులకు అండగా ఉండాలని, వారి సమస్యలు పరిష్కరించే దిశగా పని చేయాలని ఎస్పీ శ్రీని వాస్రావు అన్నారు. బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలని సూచించారు. -
అందరికా.. కొందరికా?
ఖాతాల్లోకి రైతు భరోసా ● మొదటి విడతగా మూడెకరాల లోపు వారికి జమ ● ఉమ్మడి జిల్లాలో 8.38లక్షల ఎకరాలకు రూ.502 కోట్లు ● గత యాసంగిలో 2.27లక్షల మంది దూరం ● ఈ సారైనా పూర్తి స్థాయిలో అందేనా? ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’ కొందరికా? లేక అందరికా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 17,18,981 ఎకరాలకు రూ.859 కోట్లకుపైగా రైతు బంధును అందించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగిలో 4ఎకరాలలోపు వారికే రైతు భరోసా జమ చేసింది. దీంతో 40శాతం మంది రైతులు పెట్టుబడి సాయానికి దూరమయ్యారు. ఈసారి వానాకాలంలోనైనా అందరికీ జమ చేయాలని రైతులు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేటప్రస్తుతం అందిన రైతు భరోసా ఇలా.. జిల్లా రైతులు ఎకరాలు రూ.కోట్లల్లో సిద్దిపేట 2,54,711 3,02,418 181,45,13,296 మెదక్ 2,25,764 2,24,319 134,59,15,589 సంగారెడ్డి 2,65,400 3,11,292 186,77,56,219గత యాసంగిలో రైతు భరోసా ఇలా.. జిల్లా రైతులు ఎకరాలు రూ.కోట్లల్లోసిద్దిపేట 2,62,238 3,33,238 199,94,28,372 మెదక్ 2,26,970 2,34,500 140,70,00,000 సంగారెడ్డి 2,67,236 3,33,416 200,05,00,000 -
సీఏం రేవంత్రెడ్డి చిత్ర పటానికి పాలభిషేకం
కల్హేర్(నారాయణఖేడ్): రైతు భరోసా డబ్బులు జమచేయడంతో కల్హేర్లో మంగళవారం కాంగ్రెస్ నాయకులు సీఏం రేవంత్రెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి చిత్ర పటాలకు పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోచయ్య, నాయకులు దేవదాస్, రవీందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. పదోన్నతితో మరింత బాధ్యతఅదనపు ఎస్పీ సంజీవరావు సంగారెడ్డి జోన్: పదోన్నతితో విధి నిర్వహణలో మరింత బాధ్యత పెరుగుతుందని జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించిన చైతన్య సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది సైబరాబాద్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కల్యాణి, అధికారులు అశోక్, వెంకటేశం, సిబ్బంది తదితరులు ఉన్నారు. నిరంతర విద్యుత్ సేవలు అందిస్తాం: ఎస్ఇ శంకర్ పాపన్నపేట(మెదక్): జిల్లాలో వినియోగదారులకు నిరంతర విద్యుత్ సేవలు అందిస్తామని విద్యుత్ శాఖ ఎస్ఇ శంకర్ తెలిపారు. పాపన్నపేటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో 125 విద్యుత్ సబ్ స్టేషన్లున్నాయన్నారు. అభివృద్ధి పనుల కోసం జిల్లాకు రూ.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.జిల్లాలో విద్యుత్ పరికరాలు సత్వరం అందించేందుకు ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. లైన్మెన్లు నిరంతర సేవలు అందించేందుకు వారికి సెల్ఫోన్లు అందజేసినట్లు చెప్పారు. ప్రతీరోజు 587 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 2021 నుంచి 2024 వరకు 13,440 వ్యవసాయ బోర్లకు రూ.77.88 కోట్లతో విద్యుత్ కనెక్షన్లు అందించామన్నారు.మహిళా సంఘాల సేవలు భేష్సంగారెడ్డి టౌన్: జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల శిక్షణలో జిల్లాలోని సంఘాలకు విశేష గుర్తింపు ఉంటుందని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జెండర్ అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ ఖాన్ పేటలో మంగళవారం రాజస్థాన్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా స్థిరపడేందుకు వివిధ పథకాలతో లబ్ధి పొందుతున్నారని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలు ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండి సామాజిక అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పలు ప్రదేశాలలో పర్యటించారు. కార్యక్రమంలో రాష్ట్ర సామాజిక సంఘ సేవకురాలు దేవి, డీఆర్డీఏ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ న్యాయవాదులకు ఉచిత శిక్షణ మెదక్ కలెక్టరేట్: న్యాయశాస్త్ర పట్టభద్రులైన జిల్లాకు చెందిన ఎస్సీ యువతీ, యువకులకు ప్రభుత్వం స్టయిఫండ్తో పాటు ఉచిత శిక్షణ ఇస్తామని ఎస్సీ కార్పొరేషన్ అధికారి విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అభ్యర్థులకు స్థానికంగా ఉండే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్ద జూనియర్ చేరే అవకాశం కల్పిస్తామన్నారు. మూడేళ్లపాటు శిక్షణ సమయంలో స్టయిఫండ్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. -
అర్హత లేని వైద్యం!
అదను దాటుతోంది సాగులో అదను దాటితే దిగుబడులపై ప్రభావం చూపుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వివరాలు 8లో uజొన్నల డబ్బులేవీ..? జొన్నలు విక్రయించినా ఇంకా డబ్బులు రాలేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వివరాలు 9లో uమంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025రామాయంపేట(మెదక్): వైద్యుడంటే ప్రాణాలు కాపాడే నారాయణుడిగా భావిస్తారు. అందుకే అంతా వైద్యో నారాయణో హరి అంటారు. అలాంటి వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు కొందరు నకిలీలు. ఎలాంటి అర్హత లేకున్నా మిడి మిడి జ్ఞానంతో వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా రామాయంపేటలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో కంపౌండర్గా పనిచేసిన అనుభవంతో ఓ వ్యక్తి పట్టణం నడిబొడ్డున ఎలాంటి విద్యార్హత లేకున్నా గణపతి క్లినిక్ను ప్రారంభించాడు. రోగులు అతడి వద్దకు క్యూ కట్టారు. ఇటీవల ఓ మహిళకు వైద్యం వికటించి ప్రాణాలమీదికొచ్చింది. దీంతో ఆమెను మరో ఆస్పత్రికి తరలించి వైద్య ఖర్చులు భరించి బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేయడంతో క్లినిక్ను మూసి పారిపోయాడు. ఇటీవల జిల్లా పరిధిలో 10 మంది నకిలీ వైద్యులకు వైద్యశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆస్పత్రుల నిర్వహ ణ అమాయక ప్రజలే లక్ష్యంగా జిల్లాలో నకిలీ వైద్యులు చలామణి అవుతున్నారు. అర్హత లేకున్నా వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలమీదికి తెస్తున్నారు. అయితే వైద్యం వికటించి రోగి ప్రాణాల మీదకు వస్తే తప్ప నకిలీల బండారం బయటపడటం లేదు. అలాంటి ఆస్పత్రులపై ఫిర్యాదులు వస్తే తప్ప సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. వైద్యశాఖ అనుమతులు లేకుండానే జిల్లాలో కనీసం 30 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు అక్రమంగా కొనసాగుతున్నాయని సమాచారం. రాజకీయ ప్రోద్బలంతో వైద్యశాఖ అధికారులు వీరిపై చర్యలకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎంపీల ఇష్టారాజ్యం జిల్లా పరిధిలో సుమారు 2,500 పైగా ఆర్ఎంపీలు గ్రామాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలను నడుపుతున్నారు. వారి వద్దకు వస్తున్న రోగులకు వైద్య సలహాలు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా, సైలెన్ పెట్టడం,మందుల చీటి రాయడం వంటివి చేస్తున్నారు. ప్రిస్కిప్షన్ రాయడం చట్టప్రకారం నేరం. అలాగే తమ పేర్లకు ముందు డాక్టర్ అని రాసుకోకూడదు. కానీ కొందరు యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తున్నారు. న్యూస్రీల్ప్రాణాలతో చెలగాటం పుట్టగొడుగుల్లా.. నకిలీ వైద్యులు జిల్లావ్యాప్తంగా 10 మందికి నోటీసులునకిలీలపై కఠిన చర్యలు ఎలాంటి అర్హత లేకపోయినా వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవలే జిల్లా పరిధిలో కొందరికి నోటీసులు జారీ చేశాం.నిబంధనల మేరకు ఆర్ఎంపీలు సైలెన్ పెట్టొద్దు. మందులకు సంబంధించి ప్రిస్కిప్షన్ రాయొద్దు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నకిలీలపై చర్యలు తీసుకుంటాం. – శ్రీరాం, డీఎంహెచ్ఓ -
పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు
ఎస్పీ శ్రీనివాస్రావుపెద్దశంకరంపేట(మెదక్)/అల్లాదుర్గం/రేగోడ్: జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ డాక్టర్ శ్రీనివాస్రావు తెలిపారు. సోమవారం పెద్దశంకరంపేట పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్ సిబ్బందికి పలు సూచనలిచ్చారు. జాతీయ రహదారి కావడంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దొంగతనాల నివారణకు గస్తీని పెంచాలని, రహదారి నిబంధనలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం అల్లాదుర్గం, రేగోడ్ పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. పాత కేసుల వివరాలు, రికార్డులు పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలన్నారు. వాహనాలు తనిఖీ చేస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్ఐలు ప్రవీణ్రెడ్డి, శంకర్, సందీప్రెడ్డి సిబ్బంది ఉన్నారు.సమస్యలపై నేరుగా సంప్రదించండి మెదక్ మున్సిపాలిటీ: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నేరుగా వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలపై సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. చట్టప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. -
ప్రైవేట్ పాఠశాలలదోపిడీని అరికట్టాలి
నిజాంపేట(మెదక్): ప్రైవేట్ పాఠశాలల దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జగన్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కనీస వసతులు లేని ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా స్కూళ్లు నడుస్తున్నాయని అన్నారు. పుస్తకాల పేరిట వ్యాపారం చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఫిట్నెస్ లేని బస్సులను అధికారులు వెంటనే సీజ్ చేయాలన్నారు. అనుమతి లేకుండా నోట్బుక్స్ విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికతో మేలు వెల్దుర్తి (తూప్రాన్): ఒకే దేశం.. ఒకే ఎన్నికతో ఆర్థిక భారం తగ్గి, తద్వారా దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని బస్వాపూర్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశ ప్రజలంతా ఒకే దేశం, ఒకే ఎన్నిక కార్యక్రమానికి మద్దతు తెలిపాలని సూచించారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జరిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు బాలకిషన్, వెంకటేశం, నవీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పంట మార్పిడితో అధిక దిగుబడి రామాయంపేట(మెదక్): పంట మార్పిడితో చీడ పీడల ఉధృతి తగ్గి పంట దిగుబడి పెరుగుతుందని ఏడీఏ రాజ్నారాయణ అన్నారు. సోమవారం రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందజేసి మాట్లాడారు. మోతాదుకు మించి రసాయన ఎరువుల వినియోగంతో నేలలో భూసారం తగ్గి పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. ఆగ్రో రైతు సేవా కేంద్రంతో పాటు సహకార సంఘం కార్యాలయంలో జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ స్కూళ్ల గుర్తింపురద్దు చేయాలి: ఎస్ఎఫ్ఐ మెదక్ కలెక్టరేట్: అక్రమంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మెదక్లో ఆయన మాట్లాడుతూ.. ఈ విషయమై ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, బెల్టులు, బ్యాగులు అమ్ముతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భూ సమస్యలు పరిష్కరిస్తాం మెదక్ ఆర్డీఓ రమాదేవి పాపన్నపేట(మెదక్): అసైన్మెంట్ భూముల సమస్యల పరిష్కారానికి రైతులు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి సూచించారు. సోమవారం మండలంలోని కొత్తపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరై మాట్లాడారు. పీఓటి, సాదాబైనామా, అసైన్మెంట్ భూముల విషయంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అందుకనుగుణంగా రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూ రికార్డులకు సంబంధించిన ఆధారాలను జత పర్చాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో సతీష్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అన్నదాతకు ‘భరోసా’
సకాలంలో పెట్టుబడి సాయం విడుదల చేసిన ప్రభుత్వం ● జిల్లాలో కొత్తగా 6,558 మంది రైతులువానాకాలం సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారండబ్బులు విడుదల చేసింది. ఈనెలాఖరులోగా అందరి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిిపింది. గత యాసంగిలో ఆలస్యంగా రైతు భరోసా ఇవ్వడంతో పెట్టుబడి కోసం అన్నదాతలు ఇబ్బంది పడ్డారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 2,96,983 మంది రైతులు ఉండగా, సుమారు 4 లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. వాటిలో ఏటా 3.90 లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నారు. కాగా ఈ వానాకాలం సీజన్లో 3.50 లక్షల ఎక రాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. గత యాసంగి సీజన్లో 2,65,629 మంది రైతులకు ప్రభుత్వం రూ. 213.63 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. గత రబీతో పోల్చుకుంటే జిల్లాలో 6,558 మంది రైతులకు కొత్తగా పట్టాలు వచ్చాయని, వారికి సైతం ఈ సీజన్లో రైతు భరోసా అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో వెంచర్లు, గుట్టలు, సాగుకు యోగ్యం కాని భూములకు సైతం రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించారని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఎన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం ఇెస్తే బాగుంటుందని గతంలో జిల్లావ్యాప్తంగా రైతులతో సమావేశాలు నిర్వహించింది. దీంతో మెజార్టీ రైతులు 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం ఇవ్వాలని పేర్కొన్నారు. పట్టాలు ఉన్నప్పటికీ సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించి వాటికి పెట్టుబడి సాయం నిలిపివేసింది. అలాంటి భూములు జిల్లావ్యాప్తంగా 6,870 ఎకరాలు ఉన్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 2.72 లక్షల మంది రైతులకు సాయం ఈ వానాకాలం సీజన్లో 2,72,187 మంది రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందనుంది. గత రబీసీజన్లో 2,65,629 మంది రైతులకు గానూ రూ. 213.63 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. కాగా అప్పటితో పోలిస్తే కొత్తగా 6,558 మంది రైతులకు పాస్ పుస్తకాలు వచ్చాయి. దీంతో ఈ సంఖ్య 2.72 లక్షలకు చేరుకుంది. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా 2,96,983 మంది రైతులు ఉండగా, రైతు భరోసా అందేది మాత్రం 2,72,187 మందికి మాత్రమే. మిగితా 24,796 మందికి భరోసా లేదు. వీరిలో చాలా మంది భూ స్వాములతో పాటు సాగుకు యోగ్యం కాని భూములు గల రైతులు ఉన్నట్లు తెలిసింది. -
పంటల సాగులో మెలకువలు అవసరం
నర్సాపూర్ రూరల్/కౌడిపల్లి: రైతుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం మండలంలోని అవంచ, లింగాపూర్ రైతు వేదికలలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని శాస్త్రవేత్తలు చెప్పే విషయాలను విని పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్, ఏఓ దీపిక, ఏఈఓలు చంద్రవేణి, దుర్గాప్రసాద్, రైతులు పాల్గొన్నారు. అలాగే కౌడిపల్లి మండలంలోని తునికి రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా రైతులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి ప్రసంగాన్ని విన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ -
ప్రజావాణి అర్జీలను పరిష్కరించండి
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖలలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి మొత్తం 85 అర్జీలు రాగా, అత్యధికంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్రావుతో పాటు జిల్లాలోని ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం పీఎం దర్తి అభజన్ భాగీధారి అభయాన్ పథకంపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహంచారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పథకానికి జిల్లాలోని 10 మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆధార్, రేషన్ కార్డ్, కుల సర్టిఫికెట్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఆయుష్మాన్ భవ తదితర ఫథకాలు పొందలేని వారిని గుర్తించనున్నట్లు వివరించారు. వీరికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. అధికారులు ఈ పథకంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. -
రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాం
పాపన్నపేట(మెదక్): రైతు సంక్షేమమే ఊపిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. సోమవారం మండలంలోని పొడిచన్పల్లి రైతు వేదికలో సీఎం రేవంత్రెడ్డి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలతో 57 రైతు వేదికల్లో సుస్థిర వ్యవసాయంపై సలహాలు అందిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ.. సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో రైతు వేదికల్లో వీడియో కాన్పరెన్స్ సౌకర్యం కల్పించామన్నారు. జిల్లాలో రైతు భరోసా కింద 2.26 లక్షల మందికి రూ.140 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. మిగిలిన 35 వేల మంది రైతులకు రాబోయే 9 రోజుల్లో జమ చేస్తామన్నారు. అలాగే సన్న వడ్లకు రూ. 500 బోనస్ వస్తుందన్నారు. కార్యక్రమంలో డీఏఓ వినయ్, ఉద్యావన అధికారి ప్రతాప్సింగ్, ఏఓ నాగమాధురి, ప్రభాకర్రెడ్డి, శ్రీకాంత్, గోవింద్, రైతులు పాల్గొన్నారు.మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తూప్రాన్: ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. సోమవారం బడిబాటలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచాలని, అప్పుడే ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. అక్షరాస్యతలో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నామని, మొదటి స్థానానికి తేవడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక అమలవుతుందని తెలిపారు. అనంతరం క్విజ్ పోటీల్లో ప్రతిభ కనిబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, ఎంఈఓ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్, నాయకులు భూమన్నగారి జానకిరామ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు పోచయ్య తదితరులు పాల్గొన్నారు. -
బస్సులు నడపాలని ఆందోళన
నర్సాపూర్: పాఠశాలలు ప్రారంభమైనా ఆర్టీసీ అధికారులు జక్కపల్లి మార్గంలో బస్సులు నడపడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మూడు బస్సులు సరిపోవడం లేదని, గత విద్యా సంవత్సరం మరో బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరగా, నడుపుతామని హామీ ఇచ్చి విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎస్ఐ జగన్నాథం ఆర్టీసీ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం ఎస్సై డిపో ఇన్చార్జితో చర్చించారు. మంగళవారం నుంచి బస్సులు నడుపుతామని తెలిపారు. రాస్తారోకోతో హైదరాబాద్, మెదక్ మార్గంలో రోడ్డుపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
హత్నూర(సంగారెడ్డి): అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నస్తీపూర్ సాదులనగర్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. బడుగు, బలహీనవర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ సురేందర్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి హకీం, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కృష్ణ, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రాజేందర్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, విఠల్రెడ్డి, వెంకటేశం, సత్యం, సతీష్, కృష్ణతో పాటు మండలంలోని ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
జనారణ్యంలోకి జాతీయ పక్షి
చిన్నశంకరంపేట(మెదక్): వనంలో ఉండాల్సిన జాతీయ పక్షి నెమలి జనారణ్యంలోకి వచ్చింది. శనివారం రాత్రి నార్సింగి మండల కేంద్రంలోని రైతు వెంకట్రెడ్డి పశువుల పాకలోకి వచ్చి అరవడంతో గమనించిన రైతు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు వల్లూర్ అటవీశాఖ అధికారులను పిలిపించి నెమలిని అప్పగించగా.. వారు వల్లూర్ అడవిలో వదిలిలారు. దివ్యాంగులకు మరింత ప్రోత్సాహం మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం దివ్యాంగులకు మరింత ప్రోత్సాహం అందజేస్తుందని డీడ బ్ల్యూఓ హైమావతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మితో పాటు రూ. లక్ష వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. గతంలో ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉండేది కాదన్నారు. ఇక నుంచి పెళ్లి చేసుకున్న జంటలో ఇద్దరూ దివ్యాంగులైనా, ఒకరు అయినా కల్యాణలక్ష్మితో పాటు రూ. లక్ష మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలన్నారు. వధువు 18, వరుడు 21 ఏళ్లు నిండి ఉండాలని పేర్కొన్నారు.నూతన పోస్టాఫీస్ భవనాన్ని నిర్మించండి జోగిపేట(అందోల్): నూతన పోస్టాఫీస్ భవనం నిర్మించాలని జోగిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ గంగ జోగినాథ్ కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని పోస్టాఫీస్ భవనం నిర్మి ంచి చాలా ఏళ్లు కావడంతో శిథిలావస్థకు చేరిందన్నారు. నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. నూతన భవన నిర్మాణం కోసం సంబంధిత మంత్రికి సిఫారసు చేయించి నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ సంగారెడ్డి టౌన్: నిరుద్యోగులకు సీసీ కెమెరా సర్వీసింగ్పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ డైరెక్టర్ వంగ రాజేంద్రప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో చెప్పారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని 18 నుంచి 45 ఏళ్ల పురుషులకు ఈనెల 24వ తేదీ నుంచి 13 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 9490103390, 9490129839 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. శిక్షణ కాలంలో పూర్తిగా ఉచిత భోజనంతో పాటు వసతి కల్పిస్తామన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను అందజేస్తామని పేర్కొన్నారు. ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు వెల్దుర్తి(తూప్రాన్): రైతులు ఆయిల్పామ్ సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర ఆయిల్పామ్ టెక్నికల్ అడ్వైజర్ రంగనాయకులు అన్నారు. ఆదివారం మండలంలోని ఎలుకపల్లి శివారులో రైతు సత్యనారాయణగౌడ్ వ్యవసాయ క్షేత్రంలోని తోటలను పరిశీలించి మాట్లాడారు. ఆయిల్పామ్ సాగుతో నీటి ఆదాతో పాటు అంతర్గత పంటలు సాగు చేసుకొని అధిక లాభాలు పొందవచ్చన్నారు. దేశవ్యాప్తంగా 259 లక్షల టన్నుల ఆయిల్పామ్ వాడకం జరుగుతుంటే, కేవలం 97 లక్షల టన్నుల ఉత్పాదన మాత్రమే జరుగుతుందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుకు అత్యధికంగా సబ్సిడీ ఇస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ కృష్ణారావు, డిప్యూటీ మేనేజర్ అశోక్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
పెద్దశంకరంపేట(మెదక్): సీఎం రేవంత్రెడ్డి పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, బిల్లులు త్వరితగతిన అందజేస్తామన్నారు. ఉచిత ఇసుక ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి మహిళా సంఘాల ద్వారా రూ. 1 లక్ష వరకు రుణం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవాని, నాయకులు సురేందర్రెడ్డి, మధు, నారాగౌడ్, ఆర్ఎన్.సంతోష్, దాచ సంగమేశ్వర్, రాజేందర్గౌడ్, రాములు, శ్రీను, గంగారెడ్డి, అంజిరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ షాకీర్అలీ పాల్గొన్నారు.నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
సరికొత్త హంగులతో పోలీస్స్టేషన్
పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి కలెక్టర్ రాహుల్రాజ్ కొల్చారం(నర్సాపూర్): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంస్థాగత ప్రసవాలను పెంచేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషిచేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, స్టాక్ రిజిస్టర్, మందుల నిల్వలు, ఓపీ రిజిస్టర్ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సాధారణ ప్రసవాలు, ఆరోగ్య మహిళా కార్యక్రమం గురించి ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖచ్చితంగా డెలివరీల సంఖ్య పెంచాలన్నారు. రిస్క్ ఉన్న కేసులను జిల్లా, ఏరియా ఆస్పత్రులకు పంపాలని సూచించారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా చేపట్టాలన్నారు. జ్వర బాధితులకు టెస్ట్ల సంఖ్యను పెంచాలన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పండగ వాతావరణంలో నిర్వహించాలి హవేళిఘణాపూర్(మెదక్): రైతునేస్తం కార్యక్రమాన్ని సోమవారం పండగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం హవేళిఘణాపూర్ రైతు వేదికలో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రేవంత్రెడ్డి జిల్లాలోని 57 రైతు వేదికల్లో రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడుతారని తెలిపారు. జిన్నారం(పటాన్చెరు): సీఎస్ఆర్ నిధులతో అత్యాధునిక వసతులతో మోడల్ పోలీస్స్టేషన్ నిర్మించడం అభినందనీయమని మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ అన్నారు. ఆదివారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో నూతన పోలీస్స్టేషన్ భవన నిర్మాణానికి ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, హెటిరో పరిశ్రమ ప్లాంట్ డైరెక్టర్ మోహన్రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే అత్యాధునిక పోలీస్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హెటిరో పరిశ్రమ సహకారంతో రూ. 3.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీ ప్రభాకర్, సీఐ రవీందర్రెడ్డి, నరేష్, లాలునాయక్, కమిషనర్ మధుసూదన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొలన్ బాల్రెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్రెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, హన్మంత్రెడ్డి, ఆనంద్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.ఐజీ సత్యనారాయణ -
ప్రైవేట్ బడి.. ఆరా తప్పనిసరి!
ఆకట్టుకునే ప్రచారాలు నమ్మి మోసపోవద్దు ● పాఠశాల గురించి తెలుసుకున్నాకే చిన్నారులను చేర్పించాలి ● రిజిస్ట్రేషన్ గుర్తింపుపై ఆరా తీయాలి ● అర్హులైన టీచర్లు ఉన్నారో లేదో పరిశీలించాలి ● నిపుణుల సూచనలుసదాశివపేట(సంగారెడ్డి): విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ఇంటింటా ప్రచారాలు నిర్వహించారు. ప్రస్తుతం బడులు ప్రారంభించినా ఆపడం లేదు. అయితే పాఠశాల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే చిన్నారులను చేర్పించాలని నిపుణులు సూచిస్తు న్నారు, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పాఠశాలలు జిల్లాలో ఇప్పటికే 454 పైగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలుండగా ఈ విద్యాసంవత్సరంలో మరో 15 వరకు కొత్తగా ఏర్పాటైనట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నియోజవర్గంతోపాటు జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, పటాన్చెరు, జిల్లాలోని 12 మున్సిపాలిటీల, 26 మండలాల పరిధిలోనూ ఏటా కొత్త పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిలో చాలా వాటికి అనుమతులు లేవని సమాచారం. విద్యాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఆయా విద్యాసంస్థలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. ఫీజుల రూపంలో పిల్లల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు ముందుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజులో రాయితీ ఉంటుందని మభ్యపెట్టి ముందుగా అడ్మిషన్లు చేశారు. వాస్తవానికి విద్యాశాఖ అనుమతి తీసుకున్న తర్వాతే విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తిస్థాయి అనుమతి తీసుకోవాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యాకమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి అనుమతులు కావాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా ప్రైవేటు విద్యాసంస్థలు ఇలాంటి అనుమతులేవీ తీసుకోకుండానే తమ సంస్థల్లో విద్యార్థులను చేర్పించుకుని అనుమతులు లభించకపోతే పిల్లల్ని నట్టేట ముంచుతున్నాయి. గుర్తింపు తప్పనిసరి గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలి. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యాసంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేట్ విద్యార్థులుగా పరిగణిస్తుంది. ఇలాంటి విషయల్లో తల్లిదండ్రుల జాగురత అవసరం. అనుమతులు లేకుంటే ఫిర్యాదు చేయండి ప్రైవేట్ యాజమాన్యం ప్రారంభించే ప్రతీ పాఠశాల కూ ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలుంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. అటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటాం. కొత్తగా పాఠశాలలు ప్రారంభిస్తే పూర్తి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే అడ్మిషన్లు చేపట్టాలి. –వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి -
పాలన చేతకాకే కక్ష సాధింపు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి రామాయంపేట(మెదక్): సీఎం రేవంత్రెడ్డికి పరిపాలన చేతకాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అద్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. ఇటీవల మృతిచెందిన పార్టీ కార్యకర్త నర్సింలు కుటుంబానికి శనివారం రూ. 2 లక్షల బీమా చెక్కును అందజేసి మాట్లాడారు. రైతు భరోసా, సన్నరకం ధాన్యానికి బోనస్ విషయంలో ప్రభుత్వం రైతులను మోసగించిందని మండిపడ్డారు. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ కేటీఆర్కు రెండుసార్లు నోటీసులు జారీ చేశారన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవాచేశారు. ఆర్థిక వ్యవస్థపై రేవంత్రెడ్డికి పట్టులేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. రైతుల శ్రేయస్సు గురించి ఎంతమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు ముంబైలో మృతిచెందిన రాము కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆమె వెంట సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్, పార్టీ నిజాంపేట మండలశాఖ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, యూత్ విభాగం అధ్యక్షుడు జలంధర్ తదితరులు పాల్గొన్నారు. -
వేగవంతంగా బియ్యం పంపిణీ
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ మున్సిపాలిటీ: మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మెదక్ మున్సిపాలిటీలోని 1వ వార్డు ఔరంగాబాద్ రేషన్షాపును పరిశీలించి మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీని వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 2,16,716 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా నెలకు సుమారు 4,522 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మూడు నెలల కోటా కలిపి మొత్తం 13,922 మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ఇందులో 8,800 మెట్రిక్ టన్నులను ఇప్పటికే 520 రేషన్ దుకాణాలకు తరలించినట్లు చెప్పారు. ఈనెల 30 బియ్యం పంపిణీ కొనసాగుతుందన్నారు. పేదల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయ డం గొప్ప విషయమని కొనియాడారు. సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘రైతు నేస్తం’ ఏర్పాట్ల పరిశీలన హవేళిఘణాపూర్(మెదక్): ఈనెల 16న మండల కేంద్రంలోని రైతువేదికలో జరిగే రైతు నేస్తం కార్యక్రమ ఏర్పాట్లను శనివారం కలెక్టర్ రాహుల్రాజ్ పరిశీలించారు. ఈసందర్భంగా వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్రెడ్డి రైతులతో మాట్లాడుతారని తెలిపారు. అన్ని రైతు నేస్తం కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, ప్రజాప్రతినిధులు, రైతులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ తదితరులు ఉన్నారు.