breaking news
Medak District Latest News
-
మంత్రిని కలిసిన నూతన సర్పంచ్లు
టేక్మాల్(మెదక్): మండలంలో నూతనంగా గె లిచిన సర్పంచ్లు శుక్రవారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సంగారెడ్డిలోని తన నివాసంలో కలిశారు. ఈసందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం సర్పంచ్లు మంత్రిని సన్మానించారు. శివ్వంపేట(నర్సాపూర్): గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే బీఆర్ఎస్ బలపరిచిన ఆభ్యర్థులను గెలిపించాలని నర్సా పూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ కృషితోనే గిరిజన తండాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయన్నారు. ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, నాయకులు హరికృష్ణ, కృష్ణాకర్రావు, యాదగౌడ్, మహేందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, నాగేశ్వర్రావు, ప్రవీణ్ గౌడ్, కల్లూరి వెంకటేష్, మల్లారెడ్డి, కృష్ణారెడ్డి, రాజేందర్నాయక్, నరేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని డైట్ కళాశాల పక్కన సెంటర్ ఆఫ్ ఎక్సలె న్సీలో భాగంగా రూ. 11 కోట్లతో కొత్త భవనం నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రస్థాయి అధికారుల బృందం శుక్రవారం స్థల పరిశీలన చేసింది. భవన నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రా ష్ట్ర చీఫ్ ఇంజనీర్ షఫీమియా, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి, డివిజనల్ ఇంజినీర్ నర్సింహాచారి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాధాకిషన్, రవీందర్ ఉన్నారు. నర్సాపూర్: ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 15న పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని ఆర్డీఓ, జిల్లా డిప్యూటీ ఎలక్షన్ ఆఫీసర్ మహిపాల్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడో విడతలో జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఓటు కల్గిన గ్రామంలో ఓటు వేయొచ్చన్నారు. కాగా ఈనెల 15న ఆయా మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేయాలని, అదే రోజు బ్యాలెట్ పొంది ఓటు వేసి ఎన్నికల అధికారులకు అందజేయాలని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డుతో పాటు ఎన్నికల విధుల ఆర్డర్ కాపీ చూపాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా డివిజన్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. నర్సాపూర్: మున్సిపాలిటీ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్శాఖ ఏడీఈ రమణారెడ్డి, ఏఈ రాంమూర్తి తెలిపారు. సబ్స్టేషన్లో నిర్వహణ పనులు చేపడుతున్నామని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. -
చలికాలం.. జరభద్రం
● జాగ్రత్త చర్యలు తప్పనిసరి ● ‘సాక్షి’తో డీఎంహెచ్ఓ శ్రీరామ్ మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో గత కొన్ని రోజులుగా రాత్రి వేళ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు దృష్టి సారించాల్సి ఉంది. పిల్లలు, వృద్ధులు ఆరోగ్యసూత్రాలు పాటించాలని, చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ సూచించారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. వాకింగ్ అలవాటు చేసుకోవాలి చలికాలంలో ఎక్కువగా జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కాలంలో శరీరంలో సరైన రక్త ప్రసరణ జరుగక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు నిత్యం వాకింగ్, రన్నింగ్ అలవాటు చేసుకోవాలి. సీజనల్ పండ్లు తినడం వల్ల ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. వైద్యులను సంప్రదించాలి పిల్లలు, వృద్ధులు అధికంగా నిమోనియా బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే చల్లని వాతావరణానికి దూరంగా ఉండాలి. అలాగే మంచుకురిసే సమయంలో బయటకు వెళ్లొద్దు. వ్యాధి బారిన పడకుండా పిల్లలకు టీకాలు వేయించాలి. వృద్ధులు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. శరీరంలో రక్త ప్రసరణ తగ్గి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఎప్పటికప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలపై తక్షణం చికిత్స చేయించుకోవాలి. తద్వారా చలికాలంలో అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కినట్లేనని తెలిపారు. ఎలా అధిగమించాలి చలికాలంలో ఏళ్లనాటి ఒళ్లు నొప్పులు తిరిగి వస్తుంటాయి. అనేక మంది కీళ్ల నొప్పులతో సతమతం అవుతుంటారు. మోకాళ్ల నొప్పి తగ్గించుకునేందుకు ఎక్కువగా జిగురు పదార్థాలు తీసుకోవాలి. భుజం రాకుండా చేతులు అటు, ఇటుగా తిప్పాలి. వారం రోజులుగా జలుబు, పొడి దగ్గు సమస్యలతో బాధ పడుతూ జిల్లా ఆస్పత్రికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఓపీకి వస్తున్న వారిలో రోజుకు అధిక సంఖ్యలో ఈ రకమైన బాధితులు వస్తున్నట్లు తెలిసింది. చలిని తట్టుకునేందుకు ఉన్ని దుస్తులు వినియోగించాలి. చల్లని పదార్థాలకు దూరంగా ఉంటూ కాస్త వేడిగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. వేడినిచ్చే ఆకుకూరలు, సజ్జలు, జొన్నలను ఆహారంగా తీసుకోవడం ఉత్తమం. పిల్లల్లో దగ్గు, జ్వరం సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
సమన్వయంతోనే విజయవంతం
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్/హవేళిఘణాపూర్(మెదక్): అన్నిశాఖల సమన్వయంతో మొదటి విడత ఎన్నికలు సజావుగా ముగిశాయని, రెండు, మూడో విడత ఎన్నికలను కూడా అదే రీతిలో జరిగేలా పని చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓ, తహసీల్దార్, పోలింగ్ అధికారులతో గూగుల్ మీట్ ని ర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా విద్యాశాఖ నుంచి పెద్ద ఎత్తున పా ల్గొన్న టీచర్లకు జిల్లా పంచాయతీ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ అయిపోగానే కౌంటింగ్ ప్రక్రియ జాగ్రత్తగా జరగాలని తెలిపారు. వేగవంతంగా జరిగేందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా వెంటనే అయిపోవాలన్నారు. అనంతరం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో రెండో విడత ఎన్నికలు జరిగేలా అధికారులు చూడాలని కలెక్టర్ కోరారు. -
పటిష్ట బందోబస్తు: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి విడత ఎన్నికలకు ఎలాంటి ఘటనలు తవులేకుండా నిష్పక్షపాతంగా జరగడంలో పోలీసు అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. ఈనెల 14న రెండో విడత ఎన్నికలకు అన్నిరకాల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మెదక్ కలెక్టరేట్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) జనవరి, ఫిబ్రవరి– 2026కు సంబంధించి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విజయ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 19లోగా సంబంధిత ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి సమాచారం కోసం కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
రెండో విడతకు రెడీ
రేపు 8 మండలాల పరిధిలో ఎన్నికలు● 142 సర్పంచ్, 1,036 వార్డుల స్థానాలకు పోలింగ్ ● ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో రెండో విడతకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 8 మండలాల పరిధిలోని 142 సర్పంచ్లతో పాటు 1,036 వార్డులకు ఈనెల 14న పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ సైతం పూర్తయింది. – మెదక్జోన్ జిల్లాలో రెండో విడతలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలాలతో పాటు దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, నార్సింగి, మెదక్ నియోజకవర్గ పరిధిలోని రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ కలిపి మొత్తం 8 మండలాల పరిధిలోని 149 సర్పంచ్, 1,290 వార్డులకు ఎన్నిక లు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే 7 పంచాయతీలతో పాటు 254 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 142 సర్పంచ్, 1,036 వార్డు స్థానాలకు ఈనెల 14న రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. విధుల్లో 3,126 మంది సిబ్బంది రెండో విడత ఎన్నికలకు 3,126 మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా ప్రిసైడింగ్ అధికారులు 1,246 మంది, ఏపీఓలు 1,457, రిటర్నింగ్ (ఆర్ఓలు) 143 మందితో పాటు అదనంగా మరో 280 మంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. సమస్యాత్మక జీపీల్లో వెబ్కాస్టింగ్ 8 మండలాల పరిధిలోని 147 గ్రామాల్లో ఈనెల 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా వీటిలో 34 గ్రామాలను సమస్యాత్మకంగా గుర్తించిన పోలీ స్ ఉన్నతాధికారులు, ఆ గ్రామాల్లో పోలిగ్ ముగిసే వరకు వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఆ గ్రామాల్లోని పోలింగ్స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కలెక్టరేట్లో ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. రెండో విడతలో జరుగనున్న గ్రామా ల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అదనపు ఎస్పీ, ఎస్పీలు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవే క్షిస్తూ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నిఘా పెట్టనున్నారు. -
సంకుల సమరమే
వెల్దుర్తి(తూప్రాన్): గత అనుభవాలు, క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే పంచాయతీ ఎన్నికల పోరు, సం‘కుల’ సమరంగా మా రింది. పల్లెల్లో కులాలు, వర్గాల ప్రాతిపదికనే సమీకరణలు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. మెజారిటీ పంచాయతీల్లో ఇదే పరిస్థితి ఉండగా, కులాలవారీగా సమావేశాలు, విందులు జోరందుకున్నాయి. పార్టీల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండగా, అభ్యర్థి కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయి. గెలిచాక ఏదో ఒక పార్టీ వంచన చేరే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికల గుర్తులతో అభ్యర్తులు ప్రజలను కలుస్తూ తనకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. పార్టీల ప్రభావం అంతంతే.. అసెంబ్లీ ఎన్నికలు పార్టీ కేంద్రంగా జరిగితే పంచాయతీ ఎన్నికలు ప్రధానంగా అభ్యర్థి కేంద్రంగా జరగుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇదే. పచ్చని పల్లెల్లో రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో పార్టీలకు సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పార్టీలకు సంబంధం లేని గుర్తులనే కేటాయిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి చూస్తే గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండానే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లోనైతే పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కులాల వారీగా అభ్యర్థులు సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు ఖరారైన వెంటనే ఆయా గ్రామాల్లో కులాలవారీగా పెద్దలు రంగంలోకి దిగారు. ఎక్కువ మంది సంఘ సభ్యులున్నచోట తమ అభ్యర్థిని బరిలో నిలిపారు. పోటీ అధికంగా ఉన్న చోట ఆశావహుల నడుమ రాజీ కుదుర్చి ఒక్కరే బరిలో ఉండేలా చూసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రానివారికి రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో అవకా శం వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వగా కొందరూ పోటీకి దూరంగా ఉన్నారు. మరికొందరు మాత్రం బరిలో నిలిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాకుండా జనరల్ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కొన్నిచోట్ల సంఘ పెద్దలు తమ కులానికి చెందిన అభ్యర్థి విజయం కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. పార్టీల ప్రభావం అంతంతే.. అభ్యర్థి కేంద్రంగానే ఎన్నికలు -
అందరికీ ఆరోగ్య సేవలు అందాలి
జూనియర్ సివిల్ జడ్జి తేజశ్రీమెదక్ కలెక్టరేట్: ప్రతి మనిషికి ఆరోగ్య సేవలు అందాలని, అందుకు వైద్యులు కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జి తేజశ్రీ అన్నారు. శుక్రవారం మెదక్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ప్రతి మనిషికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని, డబ్బు లేకపోవడం వల్ల ఎ వరూ చికిత్సకు దూరం కావొద్దన్నారు. ప్రతి కుటుంబం అవసరమైన సమయానికి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం పొందే హక్కు కలిగి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికీ సమానమైన ఆరోగ్య హక్కు లభించేలా అందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీతాదేవి, ప్యానల్ లాయర్ కరుణాకర్, అసిస్టెంట్ ల్యాడ్స్ నాగరాజు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
పగలు ప్రచారం.. రాత్రి మంత్రాంగం
ప్రతిష్టాత్మకం● పల్లెల్లో సర్పంచ్ అభ్యర్థుల ఆపసోపాలు ● గెలుపుకోసం విశ్వ ప్రయత్నాలు ● జోరుగా మలి, చివరి విడత ప్రచారం నారాయణఖేడ్: తొలి విడత ఎన్నికల పర్వం ముగియడంతో మలి, చివరి దశ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు, పార్టీల నాయకులు ప్రచార పర్వంలో దూసుకు పోతున్నారు. తమకు కేటాయించిన గుర్తులను చూపుతూ ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఉదయం ప్రచారం.. రాత్రిళ్లు మంతనాలు సాగిస్తున్నారు. ఎలాగైనా తాము గెలవాలన్న లక్ష్యంతో ఉన్న అవకాశాలను వాడుకుంటున్నారు. రెబల్స్ బెడద ఉన్న చోట ప్రత్యర్థి వర్గం నుంచి తమకు ఓట్లు వచ్చేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమ పార్టీలో ఉంటూ రెబల్స్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వ్యక్తికి మద్దతు ఇస్తున్న వారిని ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎవరు చెబితే వింటారో అంటూ ఆలోచిస్తూ ఆయా వ్యక్తులు, పార్టీల నాయకులతో మాట్లాడించి మద్దతు కూడగడుతున్నారు. ఈ ఒక్కసారి తమకు మద్దతు ఇవ్వాలని.. అందుకు ప్రతిఫలంగా ఏం కావాలో చెప్పాలంటూ అడుగుతున్నారు. చాలా చోట్ల ఆర్థిక హామీలతోనే అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. దీంతో చాలా పంచాయతీల్లో ఉదయం ఒక పార్టీలో ఉన్న నాయకులు, ఓటర్లు సాయంత్రానికి పార్టీ మారుతున్నారు. కొందరు కుటుంబాలను, కులాలను కూడా చూపుతూ తమ మద్దతు తెలపాలని వేడుకుంటున్నారు. జోరుగా దావత్లు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు ఉదయం వ్యవసాయ క్షేత్రాలు, కూలీ పనులకు వెళ్లి సాయంత్రానికి వస్తుండడంతో ఉదయం, సాయంత్రం ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. తమ వెంట తిరిగే కార్యకర్తలు, అభిమానులకు మధ్యాహ్నం సమయంలో చికెన్ రైస్, లేదా చికెన్ బిర్యానీలు తినిపిస్తున్నారు. రాత్రి సమయాల్లో దావత్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చీప్లిక్కర్ తాగేవారు కూ డా బ్రాండెడ్ మందు అడుగుతున్నారని కొందరు అ భ్యర్థులు గుసగుసలాడుతున్నారు. పంచాయతీ పోరును వివిధ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత పంచాయతీ పాలకవర్గాల్లో బీఆర్ఎస్ మద్దతుతోనే ఎక్కువ మంది సర్పంచ్లుగా గెలుపొందారు. ప్రస్తుతం పరిస్థితు లు మారాయి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు, పెద్ద నాయకులు పంచాయతీ పోరుపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లెల్లో ప్రజాప్రతినిధులు ఉంటే పార్టీకి పట్టు ఉంటుందని, మరోసారి ఎన్నికల్లో విజయం సులువు అవుతుందని తెలుపుతూ ప్రతీ చోట కాంగ్రెస్ విజయం సాధించాలని సూచిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన నా యకులు సైతం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మొత్తమ్మీద అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పల్లెపోరు వేడెక్కుతోంది. -
ఓటెత్తిన పల్లెలు
మెదక్జోన్: పల్లె ఓటరు ఓటెత్తారు. గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారిగా ఓటు హక్కు వచ్చిన యువత ఉత్సాహంగా ఓటేశారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, టేక్మా ల్, రేగోడ్, పాపన్నపేట, హవేళిఘణాపూర్ మండలాల్లో పోలింగ్ జరిగింది. ఏకగ్రీవం అయిన సర్పంచ్ స్థానాలు 16 మినహాయిస్తే 144 సర్పంచ్ పదవులకు పోలింగ్ జరిగింది. అలాగే ఏకగ్రీవం అయిన 333 వార్డు సభ్యుల స్థానాలను మినహాయించి 1,069 వార్డు సభ్యులకు పోలింగ్ నిర్వహించారు. టేక్మాల్ మండలంలోని అసద్మహ్మద్పల్లి స ర్పంచ్ స్థానం ఏకగ్రీవం అయినప్పటికీ, వార్డు సభ్యులకు, అలాగే హవేళిఘణాపూర్ మండలంలోని గాజిరెడ్డిపల్లి సర్పంచ్ సైతం ఏకగ్రీవం అయినప్పటికీ వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తంగా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రారంభంలో మందకొడిగా.. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తొలి రెండు గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. ఉదయం 10 గంటల నుంచి ఊపందుకుంది. 11 గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా జిల్లా నుంచి హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వెళ్లిన వారు సైతం వచ్చి ఓటు వేశారు. చాలా మంది ఓటర్లను సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ సొంత వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేయించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ ఎన్నికల సరళిని పరిశీలించారు. పలుచోట్ల ఆలస్యంగా కౌంటింగ్ పోలింగ్ ముగిసిన తర్వాత భోజన విరామం అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ఏజెంట్లు సకాలంలో రాకపోవడంతో కొన్ని గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్లను వేరు చేసి 25 బ్యాలెట్ పేపర్లకు ఒక కట్ట కట్టారు. ఆ తర్వాత ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించారు. ముందుగా వార్డు సభ్యుల ఫలితాలను ప్రకటించారు. ఆ తర్వాత సర్పంచ్ పదవుల ఫలితాలను ప్రకటించారు. ఓట్లు తక్కువగా ఉన్న చిన్న గ్రామ పంచాయతీల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ఫలితాలు వచ్చాయి. మండల కేంద్రాలు, పెద్ద గ్రామ పంచాయతీల్లో రాత్రి వరకు ఫలితాలు వచ్చాయి. మండలాల వారీగా ఓటర్లు ఆరు మండలాల పరిధిలో మొత్తం 1,63,148 ఓటర్లు ఉండగా, వాటిలో 1,44,323 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అల్లాదుర్గం మండలంలో 23,555 ఓట్లు ఉండగా, 20,784 ఓటు హక్కు వినియోగించుకున్నారు. హవేళిఘణాపూర్ మండలంలో 29,646 ఓట్లు ఉండగా, 26,328 మంది ఓటు వేశారు. పాపన్నపేటలో 36,213 మంది ఓటర్లు ఉండగా 32,176 మంది, రేగోడ్లో 18,747 ఓటర్లు ఉండగా 17,085 మంది, పెద్దశంకరంపేటలో 28,254 మంది ఓటర్లు ఉండగా, 24,543 మంది, టేక్మాల్లో 26,733 మంది ఓటర్లు ఉండగా 23,407 మంది ఓటు వేశారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ 88.46 శాతం నమోదు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లేసిన పల్లె వాసులు -
మందు.. విందు!
రామాయంపేట(మెదక్): సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎలాగైనా ఓటరును ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇందులో భాగంగా విందులకు తెరలేపారు. మొదటి విడత ఎన్నికలు గురు వారం పూర్తి కాగా, రెండో, మూడో విడత ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడకుండా కులాలవారీగా విందులు ఇస్తున్నారు.ఇందుకోసం ఏకంగా హోటళ్లలో ఖాతాలు తెరిచారు. పెద్ద పంచాయతీలు, పరిశ్రమలు ఉన్న పంచాయతీల్లో ఎన్నికలు మరీ హాట్గా మారాయి. ముందు జాగ్రత్తగా అభ్యర్థులు పెద్ద మొత్తంలో మద్యం నిల్వ చేసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించారు. జిల్లా పరిధిలో పలు చోట్ల సివిల్ పోలీసులతో పాటు ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించి ఇప్పటికే రూ. 25 లక్షల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గెలుపే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థులు ఇంటింటికీ క్వార్టర్, హాఫ్ మద్యం బాటిళ్లు పంపిణీ చేస్తున్నారు. ఇంట్లో నాలుగైదు కంటే ఎక్కువ ఓట్లు ఉంటే ఫుల్బాటిల్తో పాటు చికెన్ అందజేస్తున్నారు. ఒక వర్గం వారు క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తే.. మరో వర్గం వారు రెండు క్వార్టర్లు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి యత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు రోజు మందు బాటిల్తో పాటు చికెన్, కొంత నగదు ఇచ్చేలా అభ్యర్థులు పథకం రూపొందించినట్లు తెలిసింది. ఇంటింటికీ మద్యం బాటిళ్ల పంపిణీ రసవత్తరంగా పంచాయతీ ఎన్నికలు ఖర్చుకు వెనుకాడని అభ్యర్థులు -
పల్లెకు పైసలెట్ల వస్తాయంటే..!
● సొంత వనరులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు ● ఆయా నిధులతోనే మౌలిక వసతుల కల్పన ● మూడు రకాలుగా సమకూరనున్న ఆదాయం జహీరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో కొత్త పాలక మండలి ఏర్పడనుంది. ఈ క్రమంలో గ్రామాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు నిధుల అవసరం ఎంతో ఉంటుంది. ఇందు కోసం గ్రామ పంచాయతీలు ముఖ్యంగా సొంత వనరులను సమకూర్చుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు పొందుతాయి. కర్మాగారాల నుంచి సీఎస్ఆర్ నిధులు కూడా కేటాయింపులు జరుగుతాయి. పంచాయతీలు విధించే పన్నులు, రుసుముల ద్వారా ఆదాయం పొందుతాయి. ఇంటి, నల్లా, వృత్తి, వ్యాపార పన్నులు, వారపు సంతలు, మార్కెట్ల నిర్వహణ, పంచాయతీకి చెందిన భవనాలు, ఖాళీ స్థలాల వంటి ఆస్తులు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. కేంద్ర ప్రభుత్వ నిధులు ఐదు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు బదిలీ అవుతాయి. ఇవి పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు, కూలీల వేతనాలకు నిధులు అందుతాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామ పారిశుద్ధ్య, ఘన వ్యర్థాల నిర్వహణకు నిధులు కేటాయిస్తారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవుతాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి.. రాష్ట్ర ప్రభుత్వం స్టాంపు డ్యూటీ వాటా చెల్లిస్తుంది. భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే స్టాంపు డ్యూటీలో కొంత వాటాను పంచాయతీలకు అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అభివృద్ధి, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం సాధారణ గ్రాంట్లు విడుదల అవుతాయి. ప్రత్యేక అవసరాల కోసం ముఖ్యమంత్రి హామీల అమలుకు, ఇతర కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. గ్రామ పంచాయతీ ఖర్చులను మూడు రకాలుగా పరిశీలించవచ్చు. కార్యాలయ నిర్వహణ, పాలనా వ్యయాలు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పచ్చదనం నిర్వహణ, సా మాజిక కార్యక్రమాలకు నిధులు వ్యయం చేస్తారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా పంచాయతీకి కేటా యించిన బడ్జెట్, ఖర్చుల వివరాలు, ఆడిట్ నివేదికను సులభంగా పరిశీలించవచ్చు. ఇది గ్రామాభివృద్ధిలో జవాబుదారీ తనాన్ని పెంచుతుంది. -
పంచాయతీలో పై చేయి
మెదక్జోన్: హోరాహోరీగా సాగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నారు. బీఆర్ఎస్ తక్కువ సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ రెండు పార్టీల అభ్యర్థు లు పోటాపోటీగా ప్రచారం చేశారు. వారం రోజు ల పాటు ప్రచారాన్ని హోరెత్తించారు. పెద్ద మొత్తంలో ఎన్నికల్లో ఖర్చు చేశారు. మద్యం, మాంసం, విందులు ఇచ్చారు. కీలకమైన కులసంఘాలు, యువతను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. 95 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం తొలి విడతలో జిల్లాలోని అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, టేక్మాల్, రేగోడ్, పాపన్నపేట, హవేళిఘణాపూర్ మండలాల్లో ఎన్నికలు నిర్వహి ంచారు. 144 పంచాయతీలు, 1,069 వార్డు స్థానాలకు గురు వారం ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 95 సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. 8 స్థానాల్లో స్వతంత్రులు.. కమలం పార్టీ మద్దతుదారులు ఈ ఎన్నికల్లో ఖాతా తెరవలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ పంచాయతీ ఎన్నికలకు వచ్చే సరికి ఆ స్థాయి లో సత్తా చాటలేకపోయింది. మరోవైపు ఏ పార్టీ మద్దతు లేకుండా సొంతంగా బరిలోకి దిగిన స్వతంత్రులు 8 చోట్ల విజయం సాధించడం గమనార్హం. ఆయా గ్రామాల్లో అభ్యర్థికి ఉన్న మంచి పేరుతో విజయం సాధించినట్లయింది. ఈ గ్రామాల ప్రజ లు పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిని గెలిపించడం గమనార్హం. రాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. చిన్న గ్రామ పంచాయతీల్లో సాయంత్రం 7 గంటల లోపు ఫలితాలు వచ్చాయి. కానీ మండల కేంద్రా లు, ఓటర్లు ఎక్కువగా ఉన్న పెద్ద గ్రామ పంచాయతీల్లో రాత్రి 10 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా గట్టి పోటీ ఇచ్చిన గులాబీ పార్టీ మద్దతుదారులు పలు చోట్ల సత్తా చాటిన స్వతంత్రులు ఖాతా తెరవని కమలం ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకొంది. అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 41 సర్పంచ్ స్థానా ల్లో గులాబీ పార్టీ మద్దతుదారులు విజయం సా ధించారు. కాంగ్రెస్తో పోలిస్తే బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచిన సర్పంచ్ స్థానాలు తక్కువే అయినప్పటికీ.. గట్టిపోటీని ఇవ్వడంతో గ్రామా ల్లో ఆ పార్టీకి ఆదరణను అంతగా తగ్గలేదని నిరూపించింది. మొదటి విడత ప్రశాంతం: కలెక్టర్మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ వెబ్ కాస్టింగ్ను గురువారం కలెక్టర్ రాహుల్రాజ్ పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కలెక్టరేట్తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి నేరుగా వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆరు మండలాల్లో మొత్తం 33 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించి, పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించామని చెప్పారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీపీఓ యాదయ్య, ఈడీఎం సందీప్, డీఎల్పీఆర్ఓ రామచంద్ర రాజు పాల్గొన్నారు. -
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ దగా
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి వెల్దుర్తి(తూప్రాన్): కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో గద్దెనెక్కి హామీల అమలును పూర్తిగా విస్మరించిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. గురువారం ఉమ్మడి వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యు లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అందాయని వివరించారు. ప్రజా సమస్యలపై నిత్యం ఆలోచించే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రమేశ్గౌడ్, నాయకులు నర్సింలు, సోమప్ప, వెంకటేశం, చల్ల పద్మ, శేఖర్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతులు తప్పనిసరి
మెదక్మున్సిపాలిటీ: పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానందం నిర్వాహకులకు సూచించారు. బుధవారం పట్టణంలోని ఓ పెట్రోల్బంక్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన కొలతలు, నాణ్యత, ధరల ప్రదర్శన, భద్రతా ప్రమాణాలు, వినియోగదారులకు కల్పించాల్సిన కనీస మౌలిక వసతులను పరిశీలించారు. తనిఖీలో ఇంధన కొలతల్లో తేడాలు, ఫిల్టర్ పేపర్ టెస్ట్లో అనుమానాస్పద ఫలితాలు, తాగునీరు, టాయిలెట్స్, ఫస్ట్ ఎయిడ్, టైర్లకు ఉచిత గాలి వంటి సదుపాయాల కల్పనలో పలు లోపాలు బయటపడ్డాయి. వినియోగదారులను మోసం చేసే విధంగా వ్యవహరించడంపై తీవ్రంగా ఖండించారు. బంక్పై ప్రాథమిక కేసు నమోదు చేసి, సంబంధిత చట్టాల కింద వివరణ కోరినట్లు తెలిపారు. అవసరమైతే సీజ్ చేయడం సహా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. డీఎస్ఓ నిత్యానందం -
13న నవోదయ ప్రవేశ పరీక్ష
● 1,197 మంది విద్యార్థుల హాజరు ● పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: డీఈఓ మెదక్ కలెక్టరేట్: సిద్దిపేట జిల్లాలో వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ విజయ తెలిపారు. బుధవారం డీఈఓ కార్యాలయంలో పరీక్ష ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షకు జిల్లాలో ఆరు కేంద్రాలు ఎంపిక చేశామని తెలిపారు. ఈనెల 13వ తేదీ శనివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు జిల్లాలో మొత్తం 1,197 మంది విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రా వద్ద బందోబస్తు ఉంటుందన్నారు. సిద్ధార్థ మోడల్ హైస్కూల్, మెదక్ (ఏ, బీ సెంటర్లు) ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, గీత హై స్కూల్ (మెదక్), జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్ (నర్సాపూర్), మంజీరా విద్యా లయం (ఏ సెంటర్) రామాయంపేటలో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు
జూనియర్ సివిల్ జడ్జి హేమలత నర్సాపూర్ రూరల్: మానవ హక్కులకు భంగం కలిగిస్తే బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తప్పవని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి హేమలత అన్నారు. బుధవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవా న్ని పురస్కరించుకొని కోర్టు ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజలు భారత రాజ్యా ంగాన్ని సద్వినియోగం చేసుకొని, అందులో పొందుపరచిన హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేస్తే చట్ట ప్రకారం ఇరు కుటుంబాలపై చర్యలు ఉంటాయన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ సహకరిస్తే మంచి సమాజం నిర్మాణం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సహాయ న్యాయవాది సుధాకర్, కౌన్సిల్ న్యాయవాది స్వరూపరాణి, లోక్ అదాలత్ బెంచ్ సభ్యులు మధుశ్రీ శర్మ, న్యాయవాదులు నాగరాజు, సాయిరాం, రవినాయక్, సూపరింటెండెంట్ సూర్య ప్రకాశ్, లీగల్ సర్వీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడే తొలి పోరు
మెదక్జోన్: గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా మండల కేంద్రాల నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బంది బుధవారమే పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. బ్యాలెట్ పేపర్లు, బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని తీసుకొని కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల్లో పా ల్గొనే అధికారులకు బ్యాలెట్ పేపర్లను దగ్గరుండి అదనపు కలెక్టర్ నగేశ్ అందజేశారు. తేలనున్న భవితవ్యం గ్రామ సర్పంచ్ పదవులకు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం గురువారం తేలనుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ పోలింగ్ జరిగే గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అమలు చేయనుండగా, సమస్యాత్మక గ్రా మాల్లో సీసీ కెమెరాల నిఘాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 690 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. 144 సర్పంచ్, 1,069 వార్డు స్థానాలు మొదటి విడతలో అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, హవేళిఘణాపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట మండలాల పరిధిలో 160 గ్రామాలు, 1,402 వార్డు స్థానాలు ఉండగా.. ఇందులో 16 సర్పంచ్, 333 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగితా 144 సర్పంచ్, 1,069 వార్డు స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ 2 గంటల నుంచి కౌంటింగ్.. అనంతరం ఫలితాల ప్రకటన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది -
నమ్మండి.. ఓటు వేయండి
నర్సాపూర్ రూరల్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు గ్రామస్తులకు వరాల జల్లు కురిపిస్తున్నారు. పోటాపోటీగా హామీలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. బాండ్ పేపర్లు, మేనిఫెస్టోతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్ల అవసరాలను తీరుస్తూ గెలిస్తే పథకాలు ఇప్పిస్తామని ఆశచూపుతూ ఓటు వేయాలని కోరుతున్నారు. గ్రామాల్లో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కరిస్తామంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం కావడంతో వలస వెళ్లిన వారికి ఫోన్లు చేసి గ్రామానికి వచ్చి తమకు ఓటు వేయాలని అభ ్యర్థిస్తున్నారు. రవాణా ఖర్చులతో పాటు ఇతర ఖర్చులు ఇస్తామంటూ బుజ్జగిస్తున్నారు. ఉదయం వేళల్లో ఇంటింటికి తిరుగుతున్న అభ్యర్థులు, సాయంత్రం కాగానే ఓటర్లను ఆకట్టుకునేందుకు మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు. కా గా నర్సాపూర్ డివిజన్ పరిధిలో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. వరాల జల్లు కురిపిస్తున్న సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా హామీలు బాండ్ పేపర్లు, మేనిఫెస్టోతో ప్రచారం -
ఏమవుతుందో ఏమో..?
● అభ్యర్థుల్లో టెన్షన్ ● నేడు తేలనున్న భవితవ్యం దుబ్బాక/వర్గల్: పంచాయతీ ఎన్నికల పర్వం తుదిఅంకానికి చేరుకోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం కొనసాగించిన అభ్యర్థులు బుధవారం ఓటరు దేవుని ప్రసన్నం కోసం చిట్టచివరి ప్రయత్నం వదలలేదు. గుట్టు చప్పుడు కాకుండా కొన్ని గ్రామాల్లో ఓటర్లకు తాయిళాలు, నగదు, మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల కుటుంబాల్లో తీవ్ర అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటం.. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కానుండటంతో పోటీలో ఉన్న అభ్యర్థుల గుండెల్లో గుబులు నెలకొంది. ఇన్ని రోజులు సర్వశక్తులు ఒడ్డి ప్రచారాలు.. ప్రలోభాలు చేపట్టాం.. ఇప్పుడు ఏం జరుగుతుందో? తీర్పు ఎలా ఉంటుందో? నన్న తీవ్ర ఉత్కంఠ వారిలో నెలకొంది. గెలవకుంటే ఎట్లా..? ‘ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టాం.. అమ్ముకున్నాం.. అప్పులు తెచ్చి ఎన్నికల్లో నిలబడ్డాం ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో..’ అంటూ పోటీలో ఉన్న అభ్యర్థులు తీవ్ర కలవరం చెందుతున్నారు. గెలవకుంటే ఎలా అన్న సందిగ్ధం వారిలో నెలకొంది. ఏదేమైనా ఈ పంచాయతీ ఎన్నికలు పోటీలో ఉన్న అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో కొన్ని గంటల్లో తేలనుంది. -
ప్రశాంతంగా నిర్వహించాలి
పాపన్నపేట(మెదక్): మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఎన్నికల విధులకు వచ్చిన పోలీసులతో మాట్లాడారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. రూట్ మొబైల్, పోలింగ్స్టేషన్ భద్రత, సెక్టార్ మొబైల్, స్ట్రైకింగ్ ఫోర్స్ వంటి విభాగాలకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం టపాకాయ లు కాల్చడం, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం నిషేధమన్నారు. కార్యక్రమంలో సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్సై శ్రీనివాస్గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. చేగుంట(తూప్రాన్): మండలంలోని పొలంపల్లి శివారులో ఏర్పాటు చేసిన రైల్వే అండర్ బ్రిడ్జి బురదమయంగా మారింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పొలంపల్లి నుంచి జాతీయ రహదారి వరకు మట్టిరోడ్డు ఉంది. గతంలో రోడ్డుపై నుంచి రైలు పట్టాలు ఉండగా, ప్రమాదాల నివారణ కోసం రైల్వే అధికారులు అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు బ్రిడ్జి కింద నీరు చేరగా, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో వెళ్లలే దు. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలిరామాయంపేట(మెదక్): ఇటీవల పెరిగిన చలిగాలి ప్రభావం వరినారుపై పడుతుందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ అన్నా రు. బుధవారం సాయంత్రం పట్టణ శివారులో వరినారు మడులను పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు. చలితో వరినారులో జింక్ లోపం తలెత్తుతుందన్నారు. సూక్మ పోషకాల నివారణ కోసం ఫార్ములా ఫోర్ లేదా ఫార్ములా సిక్స్ ద్రావణాన్ని నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఆరోగ్యకరమైన వరినారు కోసం రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగా రాత్రివేళల్లో మడుల్లో నీరు తొలగించి ఉద యాన్నే బోరు నుంచి వచ్చే వేచ్చని నీరు పారించాలన్నారు. అగ్గితెగులు నివారణకు కార్బెండజిమ్, మాంకోజెబ్ మిశ్రమాన్ని లీటర్కు రెండు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయా లని వివరించారు. ఆయన వెంట వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్నారాయణ, రైతు లు ఉన్నారు. రేగోడ్(మెదక్): సరైన వసతులు లేవంటూ పోలింగ్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేసిన సంఘటన మండల కేంద్రంలోని రేగోడ్లో బుధవారం రాత్రి జరిగింది. ఏర్పాట్ల విషయమై ఎంపీడీఓను అడిగితే.. డ్యూటీ చేయడానికి వచ్చారా..? ఎంజాయ్ చేయడానికి వచ్చారా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని వాపోయారు. వసతు లు లేకుంటే మహిళలు ఎలా ఉండాలని ప్రశ్నించారు. ఈ విషయమై ఎంపీడీఓ సీతారావమ్మ వద్ద ప్రస్తావించగా, సిబ్బంది ఎక్కువగా ఉండటం వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యాయని, వసతులు కల్పించామని చెప్పారు. -
పకడ్బందీగా ఏర్పాట్లు
పాపన్నపేట(మెదక్): పంచాయతీ ఎన్నికలు జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలో మొదటి విడత ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. బ్యాలెట్ బాక్స్ల పనితీరు, వాటిని సీల్ చేసే విధానం, మాక్ పోలింగ్ తదితర విషయాలను ఎన్నికల అధికారులతో డె మో చేయించారు. పీఓ, ఏపీఓల హాజరు శాతాన్ని పరిశీలించారు. సిబ్బందికి అల్పాహారం, భోజన వసతి తదితర సౌకర్యాలపై ఆరాతీశారు. 24 గంటల పాటు విద్యుత్ సదుపాయం ఉండేలా చర్య లు తీసుకోవాలన్నారు. పోలింగ్ ఏజెంట్లకు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. 411 మంది సర్పంచ్, 2,426 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. ఆరు మండలాల్లో 1,292 పోలింగ్ కేంద్రాలు, 1,421 పీఓలు, 1,529 ఓపీఓలు, 155 మంది రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు చెప్పారు. అనంతరం పాపన్నపేటలో ని ఎన్నికల బూత్లను పరిశీలించారు. -
విస్మరిస్తే.. బహిష్కరించండి
చిన్నశంకరంపేట(మెదక్): OÆð‡™èl$Ë$ ç³…yìl…^ól ç³…rË™ø ´ër$ VýSyìlz° OòÜ™èl… ´÷ÌS… Ð]l§ýlª¯ól Mö¯]l$-VøË$ ^ólõÜ »ê«§ýlÅ™èl ™èl¯]l§ýl° _¯]l²-Ôèæ…MýS-Æý‡…õ³r Ð]l$…yýl-ÌS…ÌZ° Rêgêç³NÆŠ‡ ™èl…yé çÜÆý‡µ…^Œl A¿ýæÅǦ «§ýlÆý‡-Ð陌æ çÜÓ Æý‡*ç³ A¯é²Æý‡$. º$«§ýlÐéÆý‡… ç³Ë$ A…Ô>Ë™ø MýS*yìl¯]l »ê…yŠæ õ³ç³ÆŠḥ™ø {ç³^éÆý‡… ^ólÔ>Æý‡$. ™é¯]l$ VðSÍõÜ¢ {V>Ð]l$…ÌZ {糆 ¯ðlÌS E_™èl OÐðl§ýlÅ Õ¼-Æý‡…, E_™èl Ôèæç܈ _MìS™èlÞË$ ^ólƇ$$…-^èl-¯]l$-¯]l²r$Ï ™ðlÍ-´ëÆý‡$. Byýl-¼yýlz ç³#yìl™ól Æý‡*. 5,111 íœMŠSÞyŠæ yìl´ë-hsŒæ ^ólÝ뢯]l-¯é²Æý‡$. ™èl…yéÌZ °Æý‡Óíßæ…^ól ç³…yýl$-VýSÌS HÆ>µ-rÏMýS$ Æý‡*. 11 ÐólË$, {糆 C…sìæMìS E_™èl ÝùÌêÆŠ‡-OÌñæsŒæ, Ķæ¬Ð]l-™èlMýS$ E´ë«¨ AÐ]l-M>-Ô>Ë$.. ™èl¨™èlÆý‡ àÒ$Ë$ CçÜ*¢ »ê …yŠæ õ³ç³ÆŠ‡ Ñyýl$-§ýlÌS ^ólÔ>Æý‡$. àÒ$-ÌS¯]l$ AÐ]l$Ë$ ^ólĶæ$-MýS $…sôæ ™èl¯]l¯]l$ {V>Ð]l$ ºíßæ-çÙP-Æý‡×æ ^ólĶæ$-Ð]l^èla° BÐðl$ õ³ÆöP-¯é²Æý‡$. టూత్ పేస్ట్ మీకు.. ఓటు నాకు చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం శేరిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారు భాగ్యలక్ష్మి బుధవారం వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. తనకు టూత్ పేస్ట్ గు ర్తును అధికారులు కేటాయించారు. ఇంకేము ంది.. ఎన్నికల ప్రచారంలో టూత్ పేస్ట్లు వెంట తీసుకువెళ్లి ఓటర్లకు పంపిణీ చేశారు. టూత్ పేస్ట్ మీకు.. ఓటు మాకు అంటు వినూత్నంగా ప్రచారం చేశారు. ఖర్చు కూడా తక్కువే కావడంతో ఇంటికో టూత్పేస్ట్ను అందిస్తూ ముందుకు సాగారు. టూత్ పేస్ట్ అందించి ఓటు అడుగుతున్న సర్పంచ్ అభ్యర్థి భాగ్యలక్ష్మి -
ప్రచారానికి తెర ప్రలోభాలకు ఎర!
మెదక్జోన్: పంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రచారం పరిసమాప్తం కావడంతో ఓటర్లను ప్రలోభాలకు తెరలేపారు. వారం రోజులపాటు అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. జిల్లాలో మొదటి విడతలో అల్లాదుర్గ్, రేగోడు, టేక్మాల్, హవేళిఘనాపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట మండలాల పరిధిలోని 160 సర్పంచ్, 1,402 వార్డు సభ్యులకు ఎన్నికలు జరపాల్సి ఉండగా, ఇందులో 16 సర్పంచ్, 333 వార్డు సభ్యుల స్థానాలకు ఏకగ్రీవమైంది. 144 సర్పంచ్, 1,069 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ప్రచారం ముగియటంతో అభ్యర్థులు ఓటర్లకు అనేక రకాల ప్రలోభాలను ఎరవేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ. 500 నుంచి రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇక నామినేషన్ల ప్రారంభం నుంచి గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులు బాండ్ల రూపంలో సొంత మేనిస్టోలను విడుదల చేశారు. కాగా, జిల్లా వ్యాప్తంగా 92 గ్రామ పంచాయతీల్లో కేవలం 500 ఓట్లలోపు ఉన్న గ్రామాలున్నాయి. ఇక్కడ గంట వ్యవధిలోనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
పాపన్నపేట(మెదక్): మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులకు పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రజలను కోరా రు. సోమవారం మండలంలోని నాగ్సాన్పల్లి, కొడుపాక, శేరిపల్లి, బాచారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందఽర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన అధ్వానంగా ఉందని వాపోయా రు. ఈసందర్భంగా పలువురు నాయకు లు బీఆర్ఎస్లో చేరగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంగప్ప, వెంకట్రాములు, చారి, శ్రీనివాస్గౌడ్, దత్తు, బాలయ్య, దావిద్ తదితరులు పాల్గొన్నారు. పనులు వెంటనే ప్రారంభించండి తూప్రాన్: డివిజన్ పరిధిలోని చేగుంట–మెదక్ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. సోమవారం తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రిడ్జి నిర్మాణంలో చెట్లు, విద్యుత్ లైన్ల తొలగింపు, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు, ట్రాఫిక్ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై చర్చించారు. కాగా రైల్వే ఉన్నతాధికారులు సైతం పనుల్లో వేగం పెంచి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ రంగాకృష్ణ, మిషన్ భగీరథ ఈఈ సంపత్కుమార్, రైల్వే జీఎస్ సమీర్కుమార్, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. ఓటర్లు సహకరించాలి మెదక్ మున్సిపాలిటీ: స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలో శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఓటరు సహకరించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరా వు విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా సోమవారం ఓటర్లకు ముఖ్య సూచనలు జారీ చేశారు. తెలియని వ్యక్తులకు ఓటర్ స్లిప్ ఇవ్వకూడదన్నారు. పోలింగ్ కేంద్రంలో క్యూలో నిలబడి సిబ్బంది సూచనలు పాటిస్తూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్నారు. అనంతరం ఇటీవల జిల్లా లో పోగొట్టుకున్న రూ. 15,34,000 విలువ గల 110 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసి సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆ అధికారులపై చర్యలు తీసుకోండి టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్ మెదక్జోన్: రాష్ట్ర ఆర్థికశాఖలో అవినీతికి తెరలేపిన అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షు డు నరేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను ప్రతి నెల రూ. 700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. నవంబర్ నెలకు సంబంధించి ఆర్థికశాఖ రూ.707.30 కోట్లు విడుదల చేయగా, ఆ డబ్బులను కాంట్రాక్టర్లకు ఇచ్చి ఉద్యోగులకు కేవలం రూ. 200 కోట్లు మాత్రమే చెల్లించారని మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దలు స్పందించి రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన సొమ్మును వెంటనే విడుదల చేసి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మద్యం బాటిళ్లు సీజ్ వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని కుకునూర్లో బెల్ట్షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా వెల్దుర్తిలోని ఓ మద్యం దుకాణం నుంచి 36 బీరు బాటిళ్లను బైక్పై యశ్వంతరావుపేటకు తరలిస్తుండగా పట్టుకుకొని ఇరువు రిపై కేసు నమోదు చేశారు. -
యువత జోరు
‘స్థానిక’ంగా సత్తా చాటేందుకు పోరు ● ‘పంచాయతీ’ బరిలో విద్యావంతులే అధికంనర్సాపూర్ రూరల్: "ç³ÌñæÏ-ÌS¯]l$ °Æý‡Ï„ýSÅ… ^ólÄñæ¬ §ýl$ª. {V>Ð]l*-ÌZϯól Ð]l$¯]l-§ólÔèæ B™èlà E…¨. E¯]l²™èl ѧýlÅ ™ø ç³rt×ê-ÌS¯]l$ B{ÔèæÆ‡$$çÜ$¢-¯é²Æý‡$. AÐ]l-M>Ôèæ… Ð]l_-a-¯]l-糚yýl$ {V>Ð]l$ õÜÐ]l¯]l$ Ð]l§ýl-ÌŸ§ýl$ª' A¯]l² Ð]l$à™èlÃ-V>…-«© Ð]l*rÌS¯]l$ A„ýSÆ>ÌS °f… ^ólçÜ$¢-¯é²Æý‡$ Ð]l$…yýl-ÌS…ÌZ° ѧéÅ-Ð]l…-™èl$Ë$. Kr$ ÐólĶæ$-yé-°MìS ™èlç³µ, ´ùsîæMìS Ķæ¬Ð]l™èl Ð]l¬…§ýl$-Mö-_a¯]l §éQ-ÌêË$ ™èlMýS$PÐ]l. AƇ$$™ól VýS™é-°MìS À¯]l²…V> DÝëÇ Ð]l¬…§ýl$-Mö-^éaÆý‡$. yìl{XË$ ç³NÇ¢ ^ólíܯ]l ÐéÆý‡$ Mö…§ýl-OÆð‡™ól.. BĶæ* {Oò³ÐólsŒæ çÜ…çܦÌZÏ E§øÅVýS… ^ólçÜ$¢¯]l² Ð]l$Ç-Mö…™èl Ð]l$…¨ çÜÆý‡µ…-^ŒlV> G°²MýSÌS ºÇÌZ °Í-^éÆý‡$. Cç³µ-sìæMóS ¯]lÆ>Þç³NÆŠḥ Ð]l$…yýl-ÌS…ÌZ çÜ$Ð]l*Æý‡$ 20 Ð]l$…¨MìS Oò³V> ѧéÅ-Ð]l…-™èl$Ë$ {ç³^éÆý‡…ÌZ §ýl*çÜ$-MðS-â¶æ$¢-¯é²Æý‡$.● నర్సాపూర్ మండలం మంతుర్ గ్రామానికి చెందిన మల్దొడ్డి వెంకన్న బీటెక్ మెకానికల్ పూర్తి చేశాడు. విదేశాలకు వెళ్లాలని అనుకున్న క్రమంలో ఓ ప్రైవేట్ కంపెనీలో కన్సల్టెంట్గా ఉద్యోగం లభించింది. అయితే అందులో సంతృప్తి లేకపోవడంతో గత ఎన్నికల్లో తన భార్యను సర్పంచ్గా పోటీ చేయించి గ్రామానికి సేవ చేశారు. ప్రస్తుతం జనరల్కు రిజర్వ్ కావడంతో నామినేషన్ వేసి బరిలో నిలిచారు. ● జక్కపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బీటెక్ కంప్యూటర్ పూర్తి చేసిన దుప్తల భారత్ నామినేషన్ వేశారు. తండ్రి మృతితో ఉద్యోగంలో చేరకుండా రాజకీయాల్లోకి వచ్చాడు. తల్లిదండ్రులు ఇద్దరు గతంలో చిప్పల్తుర్తి సర్పంచ్గా సేవలందించడంతో వారిని స్ఫూర్తిగా తీసుకున్నాడు. సర్పంచ్గా గెలుపొంది గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెబుతున్నాడు. ● ఇబ్రహీంబాద్ సర్పంచ్ అభ్యర్థిగా ఎంఏ ఎకనామిక్స్ చదివిన దాడిగా నరేశ్ బరిలో నిలిచారు. ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని అంటున్నాడు. యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని చెబుతున్నాడు. ● అహ్మద్నగర్ సర్పంచ్ అభ్యర్థిగా బీటెక్ పూర్తి చేసిన వెంకట్రెడ్డి పోటీ చేస్తున్నారు. గ్రామం ప్రగతికి నోచుకోలేదని, సర్పంచ్గా గెలిచి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మరి పోటీ చేస్తున్నాడు.● మాడాపూర్ ఎస్టీ మహిళకు రిజర్వుడు కావడంతో డిప్లొమా, జనరల్ నర్సింగ్ పూర్తి చేసిన రమావత్ సునీత పోటీ చేస్తున్నారు. తండా పెద్దలు, తన భర్త ప్రోత్సాహంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచారు.● బ్రాహ్మణపల్లి స్థానానికి బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసిన కొల్చల్మ ఆనంద్ పోటీ చేస్తున్నారు. గతంలో తన తల్లి ఎంపీటీసీగా గెలిచినప్పటికీ, నిధులు లేక గ్రామాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, సర్పంచ్కు నిధులు ఉండడంతో గెలుపొంది అభివృద్ధి చేస్తానని చెబుతున్నాడు. ● తుజాల్పూర్ బరిలో డిగ్రీ పూర్తి చేసిన కొర్ర జ్యోతి నిలిచారు. గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. -
కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు
మెదక్ కలెక్టరేట్: కార్మికులు సృష్టించిన సంపద, ఖనిజాలను కార్పొరేట్ సంస్థలు దోచుకుంటున్నా యని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్సేన్ ఆరోపించారు. సోమవారం పట్టణంలో రెండో రోజు జరిగిన సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు హాజరై మాట్లాడారు. కార్పొరేట్లకు వ్యతిరేకంగా దేశ కార్మిక వర్గాన్ని ఐక్యం చేయటమే లక్ష్యంగా దిక్కరణ, ప్రతిఘటన అనే నినాదంతో సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నా రు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితులను ఎదుర్కొవాలంటే.. ఖచ్చితమైన ప్రణాళిక అ వసరమన్నారు. పెట్టుబడిదారి వ్యవస్థ ఇటీవల దూకుడు పెంచిందన్నారు. లేబర్ కోడ్ల విషయంలో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి. దీనికి కారణం కూడా కార్మిక ఐక్యతయే కారణమని వివరించారు. ఇలాంటి పోరాటాలు మరిన్ని జరగాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలో ఒక రోజు సమ్మెతో 12 గంటల పని విధానాన్ని తిప్పికొట్టారని గుర్తు చేశారు. పోరాటాలు, ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు తగిన విధంగా చర్చలు జరపాలను సూచించారు. అంతకు ముందు సీఐటీయూ జెండాను ఆవిష్కరించి కార్మిక మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలు హేమలత, జాతీయ కోశాధికారి సాయిబాబు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, వీరయ్య, రాష్ట్ర కార్యదర్శులు వెంకటేష్, శ్రీకాంత్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఏకం కావాలి సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ -
గ్రామాల స్వరూపం మారుస్తాం
పాపన్నపేట(మెదక్): కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే, గ్రామాల స్వరూపాలను మార్చేస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. నిరుపేదలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం, బతుకమ్మ చీరలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, గోవింద్ నాయక్, సర్పంచ్ అభ్యర్థులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధిపెద్దశంకరంపేట(మెదక్): అవినీతి రహిత పాలనే కాంగ్రెస్ లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట పట్టణ సర్పంచ్ అభ్యర్థి చంద్రమురళి తరుఫున ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. గతంలో పంచాయ తీలో నకిలీ రశీదు లు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని విమర్శించారు. త్వరలో 30 పడకల ఆస్పత్రి మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సురేందర్రెడ్డి, మధు, నారాగౌడ్, వేణుగోపాల్గౌడ్, సుభాశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు
టేక్మాల్(మెదక్): పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ను ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది, సర్వీస్ ఓటర్లు ఉపయోగించుకోవాలన్నారు. ఈనెల 11న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో విధులు నిర్వర్తించే సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రియాజొద్దీన్, తహసీల్దార్ తులసీరాం, సీనియర్ అసిస్టెంట్ మాదవచారి, ఈఓ రాకేశ్ తదితరులు ఉన్నారు. నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మెదక్ కలెక్టరేట్: ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆర్అండ్బీ అధికారులతో కలిసి సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలు పా టిస్తూ కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్అండ్బీ ఈఈ వేణు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పిరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్ర శాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
బస్వాపూర్ను అగ్రగామిగా నిలుపుతా
వెల్దుర్తి(తూప్రాన్): తన స్వగ్రామం బస్వాపూర్ను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినొద్దీన్ అన్నారు. సర్పంచ్గా తన భార్య నజ్మాసుల్తానాను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి స్వగ్రామానికి రాగా, ప్రజలు పెద్దఎత్తున టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టినప్పటి నుంచి విద్యాభ్యాసం, ఎమ్మెల్యేగా ఎదిగే వరకు గ్రామస్తులతో విడదీయరాని బంధం ఉందన్నారు. కులమతాలకతీతంగా సర్పంచ్ ఏకగ్రీవానికి కృషి చేసిన ప్రజలకు శక్తివంచన మేర సహకారం అందిస్తానన్నారు. తన ఉన్నతిలో సహకరించిన ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతోనే తన భా ర్యను సర్పంచ్గా బరిలో ఉంచినట్లు తెలిపారు.కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినొద్దీన్ -
వంచన ముందు ఓడాడు!
పీపడ్పల్లి సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యవివరాలు సేకరిస్తున్న ఎస్ఐ,క్లూస్టీంరాయికోడ్(అందోల్): కొడుకు సర్పంచ్ బరిలో దిగితే ఆ మాతృమూర్తి మురిసిపోయింది. ఊరికి రా‘రాజు’అవుతాడని కలలు కన్నది. అయితే.. ఎన్నికల్లో అన్నీ ప్రతికూల పరిస్థితులు ఎదురవడం.. నమ్మిన వారే నట్టేట ముంచడం.. చేతిలో ఉన్న డబ్బు చూస్తుండగానే కర్పూరంలా కరిగిపోవడం.. ఆఖరుకు తల్లి ధైర్యం చెప్పినా కోలుకోలేని నిస్సహాయస్థితి దాపురించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. రాయికల్ మండలంలోని పీపడ్పల్లికి చెందిన రాజు (35) చురుకై న కాంగ్రెస్ కార్యకర్త. ఆ పార్టీ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచాడు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న క్రమంలో ఎన్నికల ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. నమ్ముకున్న పార్టీ నాయకులు ఒక్కొక్కరు పక్కకు జారుకుంటున్నారు. బరిలో దింపిన సీనియర్లే తనకు సహకరించడం లేదని సన్నిహితులు, కుటుంబ సభ్యుల వద్ద రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. తోటి నాయకుల సహకారం లభించడం లేదు. బిడ్డా.. పొలం అమ్ముకో.. ఇక తాను ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేనని తల్లికి చెప్పాడు. ఒక్కగానొక్క కొడుకు పడుతున్న బాధలు భరించలేని ఆ తల్లి.. ‘ఎకరం పొలం అమ్ముకో బిడ్డా.. ధైర్యంగా ఉండు’అని చెప్పింది. అన్ని వైపుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండడంతో రాజు ధైర్యం కోల్పోయాడు. అయ్యప్ప మాల ధరించిన అతను .. ఉపవాస దీక్షతో పాటు ప్రచారం చేస్తుండటంతో సరైన నిద్ర లేదు. దీంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో స్నేహితులు రాయికోడ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అనంతరం ఎప్పటిలాగానే శంషొద్దీన్పూర్ గ్రామ శివారులోని అయ్యప్ప సన్నిధానానికి చేరుకున్నాడు. అక్కడే తోటి స్వాములతో కలసి నిద్రించాడు. వేకువజామున ఐదు గంటలకు కాలకృత్యాలకని వెళ్లి సన్నిధానానికి కొంతదూరంలోని చెట్టుకు మెడలోని మాల టవల్తో ఉరివేసుకున్నాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో తోటి స్వాములు వెతకగా అప్పటికే ఉరివేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలం వద్ద ,మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్టీం వివరాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య శ్వేత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకిరణ్ తెలిపారు. సహకరించని తోటి నాయకులు చూస్తుండగానే కర్పూరంలా కరిగిన డబ్బు తల్లి ధైర్యం చెప్పినా ఆగని దారుణం మృతుడు అయ్యప్ప మాలధారుడు రాయికల్ మండలంలో కలకలం మృధుస్వభావి అయిన రాజు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లికి ఒక్కడే కుమారుడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మృతుడి తల్లి, భార్య బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు -
రెండేళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాపన్నపేట(మెదక్): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పిలుపునిచ్చారు. ఆదివారం పాపన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండేళ్లలో కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత పాలకులు నియోజకవర్గం అభివృద్ధి విషయమై ఎంతమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్న ఘనత తమకే దక్కిందన్నారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేవిధంగా కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్లో చేరగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవింద్నాయక్, ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. -
పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
కలెక్టర్ రాహుల్రాజ్ హవేళిఘణాపూర్(మెదక్): పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పా ట్లు చేస్తున్నామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మొదటి విడత జరిగే ఎన్నికల కోసం సిద్ధం చేసిన ఎన్నికల సామగ్రిని ఆదివారం పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీ ఓ శ్రేయంత్, ఎంపీఓ వెంకటేశం, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. అనంతరం మెదక్ మండల పరిధిలోని మంభోజిపల్లి చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును తనిఖీ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా మద్యం, ఇతర వస్తువులను వాహనాల్లో తరలించే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. -
హామీల అమలులో విఫలం
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర(సంగారెడ్డి): హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. ఆదివారం హత్నూర మండలం సికిందల్లాపూర్, మంగాపూర్, నస్తీపూర్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపి ంచి కాంగ్రెస్ సర్కారుకు బుద్ధ్ది చెప్పాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. -
వేడెక్కిన పంచాయతీ
పంచాయతీ ఎన్నికలపై పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. మెజార్టీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. మొదటి విడత ఎన్నికల పోలింగ్కు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కృషి చేస్తున్నారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో ఆరు మండలాల పరిధిలో 144 గ్రామాలకు ఈనెల 11న ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ వచ్చే ఫలితాలే రెండు, మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్తున్నాయి. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించాలని ఏకంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్య నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో పల్లెపోరు సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. అలాగే గడువు దగ్గర పడుతుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా శాయశక్తులు ఒడ్డుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ మెతుకుసీమలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉండగా, మెదక్, తూప్రాన్, నర్సాపూర్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో నర్సాపూర్ డివిజన్లో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నియోజకవర్గంలో తమ పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ మెజార్టీ స్థానా లపై గురిపెట్టింది. ఈ క్రమంలోనే రెండు పార్టీలు అప్రమత్తమై ఎత్తుగడలతో ముందుకుసాగుతున్నాయి. ఇప్పటికే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి సైతం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నా రు. అలాగే పెద్దశంకరంపేట మండలం నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోనిది కాగా ఆ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఇటీవల జూకల్, రామోజీపల్లి, వీరోజిపల్లి, మల్కాపూర్, గొట్టిముక్కల తదితర గ్రామా ల్లో విస్తృతంగా పర్యటించారు. అధికార పార్టీ అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపిస్తే పల్లెలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావుతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే రోహిత్రావు ఆదివారం పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్, శానాయిపల్లి, పొడ్చంపల్లి, నాగ్సాన్పల్లి, కొ డపాక, గాజులగూడెం ఎనకపల్లి తదితర గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఎన్నికల్లో గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. మెదక్ ఎంపీ రఘునందన్రావు శనివారం మెదక్లో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, ముఖ్య నేతల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పల్లెల అభివృద్ధి కోసం విడుదలయ్యే నిధు ల్లో పెద్ద మొత్తం కేంద్ర ప్రభుత్వానివేనని, గ్రా మాల్లో బీజేపీ అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపిస్తే పార్లమెంట్ సభ్యుడిగా పల్లెల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి మొదటి విడత ఎన్నికల ఫలితాలు మూడు రోజుల తర్వాత బయటపడే అవకాశముండగా, జిల్లాలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి విడత పోలింగ్ సమీపించడంతో అప్రమత్తం అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం -
యాసంగి సాగుకు విరామం
పాపన్నపేట(మెదక్): సింగూరుకు మరమ్మతుల నేపథ్యంలో ప్రాజెక్టు ఆయకట్టు కింద యాసంగి పంటకు క్రాప్ హాలిడే ప్రకటించాలని రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ నిర్ణయించింది. సుమారు రూ. 13 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు మరమ్మతులు చేయనున్నారు. కాల్వలకు సైతం లైనింగ్ పనులు చేపట్టనున్నారు. పంటల విరామంతో సింగూరు కింద 35 వేల ఎకరాలు, ఘనపురం కింద 21,625 వేల ఎకరాల్లో పంట వేసే అవకాశం లేదు. ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలతో వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. దీంతో యాసంగిపై ఆశలు పెట్టుకున్న రైతులు నిరాశకు లోనవుతున్నారు. 8.17 టీఎంసీలకు తగ్గింపు సింగూరు జలాశయానికి ఎగువ మట్టికట్టలకు రక్షణగా రాళ్లతో ఏర్పాటు చేసిన రివిట్మెంట్తో పాటు మట్టి కట్టలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని, వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే, తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్ఆర్పీ) హెచ్చరించింది. ఈ మేరకు ప్రాజెక్టులో ఉన్న నీటి మట్టాన్ని 517.5 మీటర్లకుకు, నిల్వలను 8.17 టీఎంసీలకు తగ్గించాలని కమిటీ సూచించింది. తాగునీటికి ఢోకా లేదు సింగూరు ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ ద్వారా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని 1,800 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. ఇందుకు ప్రతి నెలా 0.45 టీఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు తెలిపారు. ఈ లెక్కన ప్రాజెక్టులో 3 టీఎంసీల నీరు ఉన్నా, వేసవి కాలం వరకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ప్రాజెక్టులో కనీసం 7 టీఎంసీలు ఉన్నా, హైదరాబాద్కు నీరందించవచ్చన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 16.8 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, రోజుకు 0.3 టీఎంసీల చొప్పున దిగువకు విడుదల చేయాలని కమిటీ సూచించినట్లు సమాచారం. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచండి యాసంగికి పంట విరామం ఇచ్చినందున, ఘనపురం ఆన కట్ట ఎత్తు పెంచాలని రైతులు కోరుతున్నారు. 2014లో ఆనకట్త ఎత్తు పెంచేందుకు అప్పటి సీఎం కేసిఆర్ రూ. 43.64 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్న ఎత్తును మరో 1.725 మీటర్లు పెంచాలని భావించారు. కాగా కొంత వరకు పనులు జరిగాయి. భూసేకరణ కోసం మరో రూ. 8.10 కోట్లు చెల్లించాల్సి ఉంది. వెంటనే నిధులు మంజూరు చేసి ఎత్తు పెంచాలని రైతులు కోరుతున్నారు. రూ.13 కోట్ల అంచనాతో సింగూరుకు మరమ్మతులు కాల్వలకు సైతం లైనింగ్ ప్రాజెక్టు కింద పంటలకు క్రాప్ హాలిడే నీటి పారుదలశాఖ నిర్ణయం -
ఎరుపెక్కిన మెతుకుసీమ
మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్: సీఐటీయూ రాష్ట్ర మహాసభలు ఆదివారం మెదక్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూల ల నుంచి భారీ ఎత్తున కార్మికులు తరలివచ్చారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రా ములు, అఖిల భారత ఉపాధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ.. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని విధులు నిర్వరించే ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిన విధులు నిర్వహించే లక్షలాది మందికి కార్మిక చట్టం ప్రకారం వేతనాలు అందటం లేదన్నారు. కార్మిక చట్టం (వెజ్బోర్డు) ప్రకారం ప్రతి కార్మికుడిని పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో యాజమాన్యాలు తప్పు చేస్తే వెజ్బోర్డు ఆధారంగా వారిని జైలుకు పంపే అధికారం కార్మిక చట్టాల్లో ఉండేదని, ప్రస్తుతం వాటిని తొలగించి కార్మికులు హక్కుల కోసం ప్రశ్నిస్తే శిక్షించే విధంగా నూతన కార్మిక చట్టాలను తెచ్చారని వాపోయారు. కార్మికులు రోజుకు 8 గంటల కన్నా ఎక్కువగా పనిచేయరాదనే నిబంధన ఉండేదని, ప్రస్తుతం నూతన చట్టాల్లో దాన్ని తొలగించారన్నారు. వీటిని సాధించుకోవటానికి అంతా ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ కోషాధికారి సాయిబాబ, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య, రమణ, జిల్లా నేతలు మల్లేశం, బాలమణి తదితరులు పాల్గొన్నారు. అట్టహాసంగా ప్రారంభమైన సీఐటీయూ రాష్ట్ర మహాసభలు -
ఎన్నికల వేళ మొరం దందా
రామాయంపేట(మెదక్): ఒక వైపు పంచాయతీ ఎన్నికలు కొనసాగుతుండగా, ఇదే అదనుగా అక్ర మార్కులు చెలరేగిపోతున్నారు. అధికారుల దృష్టి ఎన్నికల నిర్వహణపై ఉన్న తరుణంలో గ్రామాల్లో పెద్దఎత్తున మొరం అక్రమ రవాణా కొనసాగుతోంది. మెదక్, హవేళిఘణాపూర్, రామాయంపేట, నార్సింగి తదితర మండలాల్లో ప్రతిరోజూ అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. ఇష్టారాజ్యంగా చేపట్టిన మొరం తవ్వకాలతో చెరువులు, రహదారుల పక్కన పెద్ద, పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. చిన్నపాటి వర్షం పడిన ఈగుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. రామాయంపేటలోని జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 1421 సర్వే నంబర్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములుండగా, వీటిలో తవ్వకాలు నిత్యకృత్యం అయ్యాయి. ఎలాంటి ముందస్తూ అనుమతులు లేకపోగా, కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతుంది. ఎన్నికల నిర్వహణలో తీరిక లేకుండా ఉన్న అధికారులు అటువైపు దృష్టి సారించడంలేదు. -
8 పంచాయతీలు ఏకగ్రీవం
వెల్దుర్తి(తూప్రాన్)/కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని రెండు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. చెర్లపల్లి ఎస్టీ(మహిళ)కు కేటాయించగా సర్పంచ్ స్థానానికి అరుణతో పాటు 8 వార్డుల్లో ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్లు వేశారు. శంశిరెడ్డిపల్లి తండా అన్ రిజర్వ్డ్ (జనరల్) కాగా సర్పంచ్ పదవికి బానోత్ గణేశ్తో పాటు 6 వార్డులకు గాను ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయా పాలకవర్గాలు ఏకగ్రీవం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. మూడో విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 17న మండలంలో నిర్వహించే పోలింగ్ రోజున అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే కౌడిపల్లి మండలంలో ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కా వడంతో కన్నారం, మర్రిచెట్టు తండా, పీర్యాతండా, ధర్మసాగర్ గేట్, హరిచంద్ తండా, కుషన్గడ్డ పంచాయతీలకు ఒకటి చొప్పున నామినేషన్లు వచ్చాయి. అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఓ పాపన్నపేట(మెదక్): సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ శ్రీరాం సూచించారు. శుక్రవారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులను పరామర్శించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. శీతాకాలం వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం మ ందులు, స్టాక్ రికార్డులు, అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. ఆయన వెంట అధికారు లు హరిప్రసాద్, నవ్య, అన్వర్, చందర్, రాజశ్రీ, శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. -
మొసళ్లను పట్టుకుంటాం: డీఎఫ్ఓ
చేగుంట(తూప్రాన్): మండలంలోని వడియారం ఊర చెరువులో మొసళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అటవీ అధికారి జోజీ అన్నారు. శుక్రవారం చెరువును సందర్శించి మాట్లాడారు. చెరువు విస్తీర్ణం, నీటి పరిమాణాన్ని అంచనా వేసి 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. సింగూరు డ్యాంకు చెందిన సిబ్బంది సహకారంతో చెరువులోని మొసళ్లను పట్టుకునేందుకు సత్వర చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మొసళ్లు ఎక్కువ కాలం చెరువులో ఉంటే చేపలను తినేస్తాయని, త్వరగా పట్టుకునేందుకు చొరవ చూపించాలని డీఎఫ్ఓను జాలర్లు కోరారు. సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎఫ్ఆర్వో అంబర్సింగ్, సెక్షన్ ఆఫీసర్ కిరణ్కుమార్, బీట్ ఆఫీసర్ రవికిరణ్ తదితరులు ఉన్నారు. -
పల్లెల్లో స్మార్ట్ ప్రచారం
రామాయంపేట(మెదక్): ఒకప్పటి ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఎన్నికలంటే వారం, పది రోజుల ముందు నుంచే మైక్ ద్వారా ప్రచారాలు, గోడలపై రాతలు కొనసాగేవి. అభ్యర్థుల తరఫున పోల్ చిటీలు ఇంటింటికి పంచేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. నేడు పల్లె పోరులో సామాజిక మాధ్యమాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా గ్రామాల వారీగా పదుల సంఖ్యలో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం లభిస్తుండటంతో అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. నిమిషాల వ్యవధిలోనే ఓటర్లకు చేరువవుతున్నారు. సెల్ఫోన్లే ప్రచార సాధనాలు నేడు సెల్ఫోన్లే ప్రచార సాధనాలుగా మారాయి. మండల పరిధిలోని ఒక గ్రామంలో ఒక పార్టీ నుంచి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయగా, సదరు పార్టీ నాయకుడు పోటీలో ఉన్న ఒక అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. దీంతో సదరు అభ్యర్థి తమ నాయకుడితో ఫోన్ మాట్లాడిన విషయాలను రికార్డు చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో జిల్లాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆయా పార్టీల సోషల్ మీడియా ఇన్చార్జిలు ఓటర్లకు సంబంధించి ఫోన్ నంబర్లు సేకరించి నేరుగా వారితో సంప్రదింపులు చేస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ పేరిట పాటలు రూపొందించుకొని గ్రామాల వారీగా గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ప్రగతి ధర్మారంలో సర్పంచ్ అభ్యర్థి ఒకరు తనను గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి పనుల విషయమై ఏకంగా బాండ్ రాయించి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు. ఇది చర్చనీయాంశంగా మారింది. పనిలో పనిగా అభ్యర్థులు తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు, చేయబోయే అభివృద్ధి పనులకు సంబంధించి ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేయించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. సోషల్ ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థుల జోరు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి యత్నాలు -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
కొల్చారం(నర్సాపూర్): ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరిచారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో నిబంధనలు అమల్లో ఉంటాయని, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో అనవసర గొడవలు, అవాంఛనీయ చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చ ర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ వెంట ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్రెడ్డి, ఎస్ఐ మోహినొద్దీన్, సిబ్బంది ఉన్నారు. బ్యాలెట్ పత్రాల పరిశీలన హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను శుక్రవారం మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు. మండలంలోని 30 గ్రామాలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రచురణ సరిగా ఉన్నాయో పరిశీలించాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ సింధూరేణుక, పంచాయతీ కార్యదర్శులు కవిత, నవనీత, చైతన్య, శారదలు ఉన్నారు. 31 నుంచి అఖిల భారత మహాసభలు: సీఐటీయూ మెదక్ కలెక్టరేట్: ఈనెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్ వద్ద సీఐటీయూ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మహాసభలకు దేశ నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈనెల7, 8, 9 తేదీల్లో మెదక్లో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, అడివయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, మల్లేశం జిల్లా కోశాధికారి నర్సమ్మ, నాయకులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలకు బీజం ముగిసిన వైజ్ఞానిక ప్రదర్శన మెదక్జోన్: విద్యార్థులు విజ్ఞానశాస్త్రాన్ని ఒంట బట్టించుకుని కొత్త ఆవిష్కరణలకు బీజం వేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇన్స్ఫెయిర్, సైన్స్ఫెయిర్ శుక్రవారంతో ముగిసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి కొత్త కొత్త ఆవిష్కరణలను రూపొందించాలన్నారు. ఈసారి విజేతలుగా నిలవని విద్యార్థులందరూ వచ్చే సంవత్సరం ఇదే కార్యక్రమానికి మరింత మెరుగ్గా ప్రాజెక్టులు తీసుకొని రావాలని తెలిపారు. సైన్స్ఫెయిర్కు 400 పైచిలుకు ఎగ్జిబిట్లు రాగా, సుమారు 50 మంది విజేతలుగా నిలిచారు. వారందరికీ ఆయన సర్టిఫికెట్లు ప్ర దానం చేశారు. ఇందులో రాష్ట్రస్థాయికి 5 ప్రా జెక్టులు ఎంపికై నట్లు జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు. -
గడువులోగా సీఎంఆర్ అందించాలి
మెదక్ కలెక్టరేట్: సీఎంఆర్ అందించే విషయంలో కొంతమంది మిల్లర్లు అలసత్వం వహిస్తున్నారని, వెంటనే టార్గెట్ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో డీఎస్ఓ నిత్యానంద్, సివిల్ సప్లై డీఎం జగదీశ్తో కలిసి రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ముందుగా మిల్లుల వారీగా కేటాయించిన ధాన్యం, ఇప్పటివరకు అప్పగించిన బియ్యం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యా సంగి 2024– 25 కోసం అందించాల్సిన సీఎంఆర్ బ్యాలెన్స్ బకాయిలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. బకాయిలు ఉన్న మిల్లర్లు తమకు కేటాయించిన రోజువారీ టార్గెట్లను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రోజు వారీ లక్ష్యాలను పూర్తి చేయకుంటే డిఫాల్టర్లుగా పరిగణిస్తామన్నారు. అలాగే వారికి కేటాయించిన ధాన్యాన్ని ఇతర మిల్లులకు బదిలీ చేస్తామన్నారు. సీఎంఆర్ డెలివరికి 2026 ఫిబ్రవరి 28 వరకు అవకాశం ఉందన్నారు. మిల్లర్లు గడువులోగా టార్గెట్ పూర్తి చేసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మిల్లర్లతో అదనపు కలెక్టర్ నగేశ్ -
ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు
నర్సాపూర్/కౌడిపల్లి/కొల్చారం/శివ్వంపేట: పంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకురాలు భారతి లక్పతినాయక్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట మండల కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణను పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. నిర్ణీత గడువు లోగా నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లను జారీ చేయాలని చెప్పారు. అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుపై అవగాహన కల్పించాలని, వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. కొత్త బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే ఎన్నికల వ్యయ లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆమె సంబంధిత ఆర్డీఓలు, ఇతర అధికారులు సిబ్బంది ఉన్నారు.అబ్జర్వర్ భారతి లక్పతినాయక్ -
అన్నా.. ప్లీజ్
ఒక్కసారి ప్రచారానికి రండి‘అన్నా.. మా గ్రామానికి ఒక్కసారి వచ్చి నా తరఫున ప్రచారం చేయండి. నేనే సర్పంచ్గా గెలుస్తా’ అంటూ అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల ఇన్చార్జిలు, ముఖ్య నేతలను వేడుకుంటున్నారు. అయితే ఒకే పార్టీ బలపరిచిన ఇద్దరు, ముగ్గురు పోటీలో ఉన్న చోట ఎవరికి ప్రచారం చేయాలి, ఎవరిని విస్మరించాలని నేతలు తలలు పట్టుకుంటున్నారు. గెలిచిన వ్యక్తే మనోడు అనే నిర్ణయానికి వచ్చారు. అనుకూలంగా ఉన్న చోట ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 492 గ్రామాలు ఉండగా, మొదటి విడతలో ఆరు మండలాల పరిధిలో 144 గ్రామాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇక రెండవ విడతలోని 8 మండలాల పరిధిలో 183 గ్రామాలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ శనివారంతో ముగియనుంది. మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం రాత్రి వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేనప్పటికీ, బరిలో నిలిచిన అభ్యర్థులు పార్టీల పరంగానే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి సమయం ఎక్కువగా లేకపోవటంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను మా గ్రామానికి ఒక్కసారి వచ్చి ప్రచారం చేయండి.. భారీ మెజార్టీతో గెలుస్తానంటూ వేడుకుంటున్నారు. అలా గే కొన్ని గ్రామాల్లో ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు ఇద్దరు ఎన్నికల బరిలో నిలవడంతో ఆ గ్రామానికి నేతలు వెళ్లడంలేదు. ఒకరి తరఫున ప్రచారం చేస్తే మరోవ్యక్తి దూరమవుతాడనే భా వనతో ఉన్నారు. గెలిచిన వ్యక్తే మనోడు అనే విధంగా పలు పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారు.బుజ్జగింపులు.. బెదిరింపులు ఒకేపార్టీ బలపరిచిన ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో నామినేషన్లు వేసిన గ్రామాలు జిల్లాలో వందల సంఖ్యలో ఉన్నాయి. వారిని బుజ్జగించేందుకు రాష్ట్రస్థాయి నేతలు రంగంలోకి దిగారు. ఒక్కరు మాత్రమే బరిలో ఉండాలని, అప్పుడే ఎదుటి వ్యక్తిపై విజయం సాధిస్తామని నచ్చచెబుతున్నారు. మరికొందరికి వచ్చే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసొస్తే టికెట్ ఇస్తామంటూ హామీ ఇస్తున్నారు. అయినా.. వినని వారిని బెదిరిస్తున్నారు. నా మాట వినకుంటే రాజకీయంగా ఏ అవకాశం రానివ్వకుండా చేస్తానంటూ హెచ్చరిస్తున్నారు. -
బెల్ట్ తీస్తా.. కోతులను అరికడతా
రామాయంపేట(మెదక్)/చిన్నశంకరంపేట: తనను గెలిపిస్తే గ్రామంలో బెల్ట్షాపులు మూయించడంతో పాటు కోతుల బెదడ నివారిస్తానని మండలంలో ని ప్రగతి ధర్మారం సర్పంచ్ అభ్యర్థి ము స్కుల శ్రీకాంత్రెడ్డి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈమేరకు బాండ్ పేపర్పై వివరాలు రాసి గాంధీ విగ్రహం వద్ద యువకులతో కలిసి విడుదల చేశారు. గ్రామంలో ఇష్టారాజ్యంగా వెలిసిన బెల్ట్షాపులతో తరచూ గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి కల్ప నకు కృషి చేస్తానన్నారు. అలాగే చిన్నశంకరంపేటలో కోతుల బెడద లేకుండా చేస్తానని సర్పంచ్ అభ్యర్థి ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ తెలిపారు. 25 హామీలతో ప్రజలను ఆకర్షించేందుకు ‘చందన్న మే నిఫెస్టో’ పేరుతో కరపత్రం విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా ప్రజలు నిత్యం సతమతం అవు తున్న కోతులు, ఊర కుక్కల బెడదను నివారించడంతో పాటు డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, ఆలయాల అభివృద్ధి, వందశాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అనాధ పిల్లలకు రూ. 10 వేల డిపాజిట్, పూరి గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీల వర్షం కురిపించారు.ఓటర్లకు సర్పంచ్ అభ్యర్థుల హామీలు -
డీసీసీ చీఫ్లకు పరీక్ష!
గ్రామ పంచాయతీల్లో వంద శాతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలిచేలా కృషి చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల సమావేశంలో ఈ ఆరు నెలలు డీసీసీ చీఫ్ల పనితీరుపై నివేదిక తీసుకుని దాని ప్రకారం ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలో పార్టీ నిర్ణయం తీసుకోనుందని సీఎం రేవంత్రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుల నియామకం తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. డీసీసీ అ ధ్యక్షులకు తమ సత్తాను చాటుకునేందుకు ఇదే సరైన సమయం. ఒకే గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారు ఒక్కరే పోటీ చేసేలా.. మిగతా వారిని బుజ్జగించి ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులను గెలిపించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. నేతలు సహకరించేనా? ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు, ఒకరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి ఎంపీ ఉన్నారు. హుస్నాబాద్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మూడు మండలాలు మాత్రమే సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నాయి. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జులు ఉన్నారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో ఇన్చార్జులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంది. కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఇన్చార్జులు డీసీసీ అధ్యక్షురాలిని ప్రచారానికి ఆహ్వానిస్తారా? సహకరిస్తారా..? అని పార్టీ జిల్లా నేతల్లో చర్చ సాగుతోంది. డీసీసీ చీఫ్ ఆంక్షారెడ్డి సొంత నియోజకవర్గంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో ఇప్పటికే ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి పరీక్షను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎదుర్కొంటున్నారు. నవంబర్ 22న ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలిగాతూంకుంట ఆంక్షారెడ్డి, మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఆంజనేయులు గౌడ్లను నియమించగా సంగారెడ్డి జిల్లాలోపెండింగ్లో పెట్టారు. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు ఆరు నెలల పాటు పనితీరును పరిశీలిస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందోనని డీసీసీ చీఫ్లలో టెన్షన్ పట్టుకుంది. – సాక్షి, సిద్దిపేట ప్రణాళికతో ముందుకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపొందేలా ప్రణాళికతో డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ నెల 11న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాలు, దుబ్బాక ని యోజకవర్గంలో రాయపోలు, దౌల్తాబాద్ మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రత్యేకంగా మేజర్ గ్రామ పంచాయతీలలో ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓటు చోరీ సంతకాల సేకరణ క్యాంపెయిన్ సైతం ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలా అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నాలు ముమ్మ రం చేశారు. ఓటర్ల నుంచి ఎలాంటి తీర్పు ఉంటుందో అని డీసీసీ చీఫ్లు ఆందోళన చెందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.‘స్థానిక’ంగా సత్తా చాటే సమయం పనితీరుపై అధిష్టానం నజర్ ఆరు నెలలు ప్రొబేషనరీ కాలం నియోజకవర్గాల ఇన్చార్జులు సహకరించేనా? ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఆంక్షారెడ్డి -
నాణ్యమైన నారు అందించాలి
డీఏఓ దేవ్కుమార్ తూప్రాన్: రైతులకు నాణ్యమైన, ఆరోగ్యవంతమైన కూరగాయలు, మొక్కలను అందించాలని జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్, ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ప్రతాప్సింగ్ అన్నారు. గురువారం మండలంలో కూరగాయల నర్సరీలను సందర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కూరగాయల మొక్కల నర్సరీలను తెలంగాణ నర్సరీ చట్టం నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నమోదు చేసుకోవడం ప్రతి నర్సరీ యజమాని బాధ్యత అన్నారు. నాణ్యమైన నారు మాత్రమే రైతులకు అందించడం ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి గంగుమల్లు, అధికారులు రైతులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
డీఎంహెచ్ఓ శ్రీరాంమనోహరాబాద్(తూప్రాన్): విధుల్లో నిర్లక్ష్యం వ హిస్తే సహించేది లేదని డీఎంహెచ్ఓ శ్రీరాం హెచ్చరించారు. గురువారం మండలంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు, మందులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యం ఎలా అందుతుందని ఆరా తీశారు. అనంతరం వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై తగు సూచనలు చేశారు. ఆశవర్కర్లు ఎన్నికలు పూర్తయ్యే వ రకు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ప్రోగాం ఆఫీసర్ హరిప్రసాద్, డీపీఓ కోట, పీహెచ్సీ వైద్యులు జోష్నాదేవి ఉన్నారు. -
గుర్తుంచుకునేదెలా?
తూప్రాన్: పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తులే కీలకం. అయితే ఈసారి ఎన్నికల్లో గుర్తులు తికమక పెట్టనున్నాయి. ఒకేలా ఉండే గుర్తులను కేటాయించటంతో గ్రామీణులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. కొందరు అభ్యర్థుల విజయ అవకాశాలు దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్లోకి వెళ్లిన ఓటరు, ముందుగా బ్యాలెట్ పేపర్ తీసుకొని తనకు కావాల్సిన అభ్యర్థి గుర్తును వెదుక్కుంటాడు. గుర్తులు తికమకపెడితే తాననుకున్న అభ్యర్థికే ఓటు వెస్తున్నానని అనుకొని మరొకరికి వేసే ప్రమాదం ఉంది. గత ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు ఓ అభ్యర్థికి, మరొకరికి ట్రక్కు గుర్తు కేటాయించారు. అది ఓటర్లకు సరిగ్గా తెలియకపోవడం వల్లే తాము ఓడిపోయామని కొందరు చెప్పుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ఉండే గుర్తులను ప్రజలకు పెద్దగా ప్రచారం చేయనక్కర్లేదు. పార్టీలకు అతీతరంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కేటాయించే గుర్తులు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో కీలకమైన గుర్తులు అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. పలు గుర్తులు ఒకే నమూనాలో ఉండడమే ఇందుకు కారణం. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులివే.. బుట్ట, ఉంగరం, కత్తెర, కుట్టు మిషన్, బ్యాట్, పలక, టేబుల్, బ్యాటరీ, బ్రెష్, క్యారేట్, ల్యాంపు, టీవీ, చేతికర్ర, షటిల్ కాక్, దువ్వె న, మంచం, కప్పు సాసర్, కొవ్వొత్తి బ్యాలెట్ పేపర్లో ముద్రించారు. వార్డు సభ్యులకు.. విద్యుత్ స్తంభం, గ్యాస్ స్టవ్, హార్మోనియం, టోపీ, ఇసీ్త్ర పెట్టే, తపాలా పెట్టె, ఫోర్క్, చెంచా, జగ్గు, గౌన్, స్టూలు, బీరువా, ప్రేషర్ కుక్కర్, ఐస్క్రీమ్ గుర్తులను కేటాయించారు. -
16 సర్పంచ్.. 332 వార్డులు
● ఏకగ్రీవం అయిన స్థానాలు ● మొదటి విడత అభ్యర్థులతుది జాబితా విడుదల మెదక్ కలెక్టరేట్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న 160 గ్రామ పంచాయతీలకు 16 సర్పంచ్ స్థానాలు, 1,402 వార్డులకు 332 ఏకగ్రీవం అయినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మొదటి విడత ఎన్నికలకు ఆరు మండలాలను ఎంపిక చేయగా, అందులో అత్యధికంగా పాపన్నపేట 6, పెద్దశంకరంపేట 5, టేక్మాల్ 4, హవేళిఘణాపూర్ 1 చొప్పున సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. 14 గ్రామాల్లో సర్పంచ్, వార్డులు పూర్తిగా ఏకగ్రీవం అయినట్లు వివరించారు. ఆయా గ్రామాల్లో ఉప సర్పంచ్కు గురువారం ఎన్నికలు నిర్వహించి ఏకగ్రీవమైన అభ్యర్థులతో పాటు గెలుపొందిన ఉప సర్పంచ్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్లు తెలిపారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవమైనవి కాకుండా, మిగిలిన 144 సర్పంచ్, 1,072 వార్డు స్థానాలకు ఈనెల 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. నిబంధనలు పాటించాల్సిందే కౌడిపల్లి(నర్సాపూర్): ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ సూచించారు. గురువారం కౌడిపల్లి మండల కేంద్రంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం చేసుకోవాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బు, మద్యం లేక ఇతర మార్గాలను ఎన్నుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను విత్డ్రా చేయాలని, పోటీలో ఉండవద్దని ఒత్తిడి చేసిన, భయబ్రాంతులకు గురిచేసిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
రూ. 50 వేలు దాటితే సీజ్
తూప్రాన్: ఎన్నికల నియమావళి ప్రకారం రూ. 50 వేలు దాటితే నగదు స్వాధీనం చేసుకుంటామని డిప్యూటీ ఎన్నికల అధికారి, ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా గురువారం ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్లు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు, పర్యవేక్షణ విధానాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, పోలింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్ర త్తలు, తదితర విధానాలపై అవగాహన కల్పించారు. ప్రతి అధికారి తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. -
జాతీయస్థాయికి ఎదగాలి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుమెదక్ మున్సిపాలిటీ: క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. రైసింగ్ డే వేడుకల్లో భాగంగా రెండు రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీల తుది మ్యాచ్లు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వ హించారు. రామాయంపేట్, మెదక్ సర్కిల్ జట్ల మధ్య జరిగిన వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠను రేపింది. ఈ పోటీలో మెదక్ సర్కిల్ అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి స్థానం, రామాయంపేట సర్కిల్ ద్వితీయ స్థానం సాధించాయి. కబడ్డీలో అల్లాదుర్గం సర్కిల్ మొదటి స్థానం, రామాయంపేట సర్కిల్ రెండవ స్థానం కై వసం చేసుకున్నాయి. మ్యూజికల్ చైర్ పోటీలో భూలి మొదటి స్థానం, లావణ్య ద్వితీయ స్థానం సాధించి మంచి ప్రతిభను ప్రదర్శించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆసక్తి, క్రమశిక్షణతో భవిష్యత్తులో జాతీయస్థాయి పోటీల్లో కూడా పాల్గొనే స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగానాయక్, ఆర్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మకత
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్జోన్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నా రు. గురువారం జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పుస్తకాలు చదవటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఎంచుకున్న ఎగ్జిబిట్లు ఈ కాలానికి, మన దేశానికి అవసరమైనవిగా ఉన్నాయన్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్న ఏఐని ఉపయోగించుకొని ఎలాంటి సమాచారం అయినా పొందగలిగే అవకాశం ఉందన్నారు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే అకాడమీ, ఫిజిక్స్ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని పాఠశాల విద్యార్థులందరికీ కోర్స్ మెటీరియల్ పొందే అవకాశం కల్పించామన్నారు. అనంతరం డీఈఓ విజయ మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కోర్స్ ఎంచుకొని జీవితంలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఇందుకోసం ఉన్న సౌకర్యాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలన్నారు. సైన్స్ ఫెయిర్కు సంబంధించి 425 ఎగ్జిబిట్లు రాగా, ఇన్స్ఫెయిర్కు 50 ప్రాజెక్టులను ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు సతీశ్రావుతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
తగ్గేదేలే..!
ఖర్చు ఎంతైనా.. సర్పంచ్గా గెలవాల్సిందే.. ● బాండ్ పేపర్లపై హామీలు ● ఆలయాల నిర్మాణాలకు చందాలు ● పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అభ్యర్థులు పల్లెల్లో పంచాయతీ పోరు హీటెక్కుతోంది. గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. రాజకీయ జీవితంలో సర్పంచ్ పదవి మొదటి అడుగు కావడంతో ఈ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తున్నారు. ఈ పోటీలో గెలుపు తప్ప ఓటమి ఉండకూడదని హామీలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఏకంగా బాండ్ పేపర్లపై హామీలు రాసి ఇస్తుండగా, మరికొందరు ఆలయాల నిర్మాణాలు, గ్రామాభివృద్ధి కోసం నిధులు ఇస్తూ ఏకగ్రీవం చేయాలని కోరుతున్నారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 21 మండలాలు ఉండగా, 492 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా మొదటి విడత అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించడంతో ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు. ఇటీవల హవేళిఘణాపూర్ మండలం రాజ్పేట తండాకు చెందిన ఓ వ్యక్తి తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ. 2 వేలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జరిగే పండుగలకు రూ. 20 వేలతో పాటు మరో 15 హామీలకు సంబంధించి ఏకంగా బాండ్ పేపర్ను రాసిచ్చారు. ఆ గ్రామ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేయటంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేవిధంగా చిన్నశంకరంపేట మండలంలోని మరో రెండు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు బాండ్ పేపర్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఒకరిని మించి మరొకరు.. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచి తీరాలనే పట్టుదలతో అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. చిన్న పంచాయతీల్లో రూ. 5 నుంచి రూ. 10 లక్షల ఖర్చుకు సిద్ధం అవుతుండగా, మేజర్ పంచాయతీల్లో రూ. 10 నుంచి రూ. 20 లక్షల ఖర్చుకు సైతం వెనుకాడటం లేదు. ము ఖ్యంగా గ్రామాల్లో నిర్మించే ఆలయాల నిర్మాణాల కోసం పోటీ పడి చందాలు ఇస్తున్నారు. యూత్ కోసం శివాజీ విగ్రహాల ఏర్పాటు, క్రీడా సామగ్రి హామీలు ఇస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇప్పటికే మొదటి విడతలో ఏకగ్రీవమైన 16 పంచాయతీల్లో సైతం కొన్ని గ్రామాల్లో ఆలయాల నిర్మాణాలకు నిధులు సమకూర్చటంతో పాటు గ్రామాభివృద్ధి, కుల సంఘాల వారీగా డబ్బులు ఎరచూపినట్లు తెలిసింది. జిల్లాలోని 71 గిరిజన తండాల్లో 100 శాతం గిరిజనులే ఉండటంతో వాటిని వారికే రిజర్వ్డ్ చేశారు. వాటిలో కొన్ని జీపీల్లో ఏకగ్రీవం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి తనని సర్పంచ్గా ఎన్నుకుంటే, వచ్చేసారి నిన్ను ఎన్నుకుంటామంటూ గిరిజనులు ఏకగ్రీవం అవుతున్నా రు. అంతే కాకుండా సర్పంచ్ అయిన వ్యక్తి తండాల్లో సేవాలాల్ ఆలయ నిర్మాణంతో పాటు ఇతర సాంప్రదాయ పండుగలకు ఖర్చు పెట్టాలనే ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో అభ్యర్థులు ప్రజలకు దండం పెట్టి ఓట్లడుగుతున్నారు. మీ అందరి సూచన మేరకు గ్రామాభివృద్ధి చేస్తానంటూ ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇటీవల అల్లాదుర్గం మండలానికి చెందిన ఓ సర్పంచ్ అభ్యర్థి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కాళ్లు మొక్కుతూ వేడుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
కలెక్షన్ ఫుల్!
నర్సాపూర్: ఏ ఎన్నికల్లో పోటీ చేయాలన్న గ్రామ పంచాయతీలకు పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి బకాయి ఉండరాదన్న నియమం ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సైతం ఆ నిబంధన వర్తించటంతో పోటీ చేసే అభ్యర్థులు తమ ఇంటి పన్ను, నల్లా బిల్లులు చెల్లించి కార్యదర్శుల నుంచి నోడ్యూ సర్టిఫికెట్ పొంది తమ నామినేషన్ పత్రాలకు జత చేయాల్సి ఉంటుంది. కాగా ఎలాగైనా పోటీ చేసే అ భ్యర్థులు పన్నులు చెల్లించాల్సి ఉండడంతో స్థానిక మండల ప్రజాపరిషత్ అధికారులు బుధవారం నామినేషన్లు స్వీకరణలో భాగంగా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ఆ పక్కనే పంచాయతీ కార్యదర్శు లు ఇంటి, నల్లా పన్నులు వసూలు చేశారు. కాగా ఆయా పంచాయతీల నుంచి రూ. 33,500 వసూలు అయినట్లు అధికారులు చెప్పారు. -
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
రూ. 20 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత వెల్దుర్తి(తూప్రాన్): ఏసీబీకి మరో అవినీతి రెవెన్యూ అధికారి చిక్కారు. మండలంలోని శేరీల గ్రామానికి చెందిన ఓ యువ రైతు ఎకరం 10 గుంటల భూమిని సర్వే చేయాలని రెవెన్యూ కార్యాలయంలో సర్వేయర్ శ్రీనివాస్ను కలిశాడు. దీంతో రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను చిన్న రైతునని, అంత పెద్దమొత్తంలో డబ్బులు ఇవ్వలేనిని విన్నవించినా ససేమిరా అన్నాడు. దీంతో గత నెల 26న రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. బుధవారం వెల్దుర్తి గ్రామ శివారులోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో బాధితుడి వద్ద నుంచి లైసెన్స్డ్ సర్వేయర్ (అప్రెంటీస్) గౌరి శరత్కుమార్గౌడ్ డబ్బులు తీసుకొని సర్వేయర్ శ్రీనివాస్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరిని విచారించి, అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు నేరుగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ప్రజలకు సూచించారు. -
నగదు పట్టివేత
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని మంభోజిపల్లి చెక్పోస్ట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 3.30 లక్షలను పట్టుకున్నట్లు మెదక్ రూరల్ ఎస్ఐ లింగం తెలిపారు. పాపన్నపేట మండలం అబ్లాపూర్కు చెందిన కుమ్మరి అనిల్ ఎన్నికల సమయంలో డబ్బులు తరలిస్తుండగా పట్టుకున్నామన్నా రు. ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బు, మద్యం తరలిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మెదక్జోన్: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యా ఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశా రు. బుధవారం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం హోదాలో హిందూ దేవుళ్లను కించ పరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రంజిత్రెడ్డి, కల్కి నాగరాజు, సంగీత, లోకేష్, స తీష్, నాయిని ప్రసాద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: ఈనెల 7, 8, 9 తేదీల్లో జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం పిలుపునిచ్చారు. బుధవారం మెదక్లో సీఐటీయూ ఆధ్వర్యంలో 2 కే రన్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసభల్లో అన్నిరంగాల కా ర్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామన్నారు. ఇప్పటికే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. కార్మికుల హక్కులు, చట్టాలకు ప్రశ్నించే హక్కు లేకుండా ఉక్కుపాదం మోపిందని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు మల్లేశం, పట్టణ కార్యదర్శి సంతోష్, నాయకులు బాలనర్సు, సాయిలు, రాజు, నరేష్, ఆకాష్, సత్యం తదితరులు పాల్గొన్నారు. శివ్వంపేట(నర్సాపూర్): దివ్యాంగులను ఎవ రైన హేళన చేస్తే చట్ట ప్రకారం శిక్ష పడుతుందని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి హేమలత అన్నారు. బుధవారం సాయంత్రం మండల పరిధి మగ్థుంపూర్లోని బేతాని సంరక్షణ ఆశ్రమంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా న్యాయమూర్తి దివ్యాంగులతో కలిసి కేక్ చేసి మాట్లాడారు. వైకల్యం వారి శరీరానికి మాత్రమేనని మేధస్సుకు కాదన్నారు. ఆశ్రమంలో ఉన్న మానసిక వికలాంగులకు ఆధార్ కార్డులతో పెన్షన్ మంజూరుకు నర్సాపూర్ లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది స్వరూపరాణి, ఆశ్రమ నిర్వాహకులు సెబాస్టర్, వీరబాబు, విన్సెంట్, కార్మాల్, కోర్టు కానిస్టేబుల్ ఆనంద్, శంకర్రెడ్డి, తదితరులు ఉన్నారు. -
భవిత కేంద్రాలతో భరోసా
డీఈఓ విజయపిల్లలతో మాట్లాడుతున్న డీఈఓ విజయ నర్సాపూర్ రూరల్: మానసిక అంగవైకల్యం ఉన్న పిల్లల కోసమే ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసిందని డీఈఓ విజయ అన్నారు. బుధవారం నర్సాపూర్ భవిత కేంద్రంలో ప్రపంచ మానసిక అంగ వైకల్య దినోత్సవం సందర్భంగా ఎంఈఓ తారాసింగ్ అధ్యక్షతన ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మానసిక అంగవైకల్యం ఉన్న పిల్లల కోసం భవిత కేంద్రాల్లో ఆట పాటలతో కూడిన విద్య, ఫిజియోథెరపీతో పాటు వారికి కావాల్సిన వైద్య సహాయం అందిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు భవిత కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు. -
వైజ్ఞానిక పండగకు వేళాయె
మెదక్జోన్: నేటి నుంచి పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో నిర్వహించే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం అదనపు కలెక్టర్ నగేశ్ ఏర్పాట్లను పర్యవేక్షించి మాట్లాడారు. గురు, శుక్రవారం వైజ్ఞానిక ప్రదర్శన కొనసాగతుందన్నారు. కాగా ఆన్లైన్ ద్వారా ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు మాత్రమే హాజరు కానున్నారని తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు హాజరుకావాలని సూచించారు. వీటిలో ప్రధానంగా అభివృద్ధి, స్వయం సంవృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాలైన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్– గణితంపై ఎగ్జిబిట్ల తయారీ అంశాలు ఉంటాయన్నారు. జూనియర్ విభాగంలో 6, 7, 8 తరగతులతో పాటు సీనియర్ విభాగంలో 9, 10వ తరగతులను పరిగణిస్తారు. ఇప్పటివరకు సుమారు 400 ఎగ్జిబిట్స్, గత సంవత్సరం జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 54 మంది ఇన్స్పైర్ అవార్డ్కు ఎంపికై న విద్యార్థుల ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచుతామన్నారు. వెజ్ఞానిక ప్రదర్శనలో మొదటి స్థానం పొందిన వారు రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారని తెలిపారు. నేటి నుంచి వెస్లీ ఉన్నత ´ëuý‡-Ô>-ÌSÌZ OòܯŒ Þ òœÆ‡¬ÆŠḥæ -
క్రీడలతో శారీరక దారుఢ్యం
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: శారీరక దారుఢ్యానికి క్రీడలు దోహదపడతాయని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. హోంగార్డు రైసింగ్ డేను పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడా రు. సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందించడంలో క్రీడలు విశేషంగా దోహదం చేస్తాయని తెలిపారు. వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు ఈనెల 6న జరగనున్న రైసింగ్ డే పరేడ్ కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగానాయక్, ఆర్ఐలు రామకృష్ణ, శైలేందర్, ఆర్ఎస్ఐలు, హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి వెస్లీ ఉన్నత ´ëuý‡-Ô>-ÌSÌZ OòܯŒ Þ òœÆ‡¬ÆŠḥæ -
మంచోళ్లనే ఎన్నుకోండి
హుస్నాబాద్: ‘మన గ్రామాల్లో వెలుగులు నింపే ఎన్నికలివి.. పంచాయతీ ఎన్నికల్లో మంచివాళ్లను ఎన్నుకోండి. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి అభివృద్ధికి బాటలు వేసే వాళ్లను ఎన్నుకుందాం.. అభివృద్ధికి అడ్డుపడెటోళ్లను, కాళ్లల్లో కట్టెలు పెట్టెటోళ్లను ఎన్నుకుంటే ము నిగేది మనమే’ అని మఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో బుధవారం విజయోత్సవ సభ నిర్వహించారు. సభ కు మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హుస్నాబాద్ను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. తాము హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. రూ. 262.78 కోట్లతో శంకుస్థాపనలు హుస్నాబాద్ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు సభా ప్రాంగణంలోనే సీఎం శంకుస్థాపన లు చేశారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు సీఎం చేతుల మీదుగా 70 సైకిళ్లు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్ను ప్రారంభించారు. హుస్నాబాద్ నుంచి హైదరాబాద్కు ఎక్స్ప్రెస్ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అన్ని పాఠశాలల్లోనూ మౌలిక వసతులు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలు పాడిపరిశ్రమంలో అభివృద్ధి చెందేలా ఒక మంచి పథకానికి శ్రీకారం చుడుతామన్నారు. సభలో మంత్రి పొన్నం మాట్లాడుతూ నాలుగు జిల్లాలకు కేంద్రబిందువుగా మారిన హుస్నాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించాలని సీఎంకు విన్నవించారు. పట్టణంలో వరద నీటి సమస్య తలెత్తకుండా అండర్ డ్రైనేజే సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగా, బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాలువల నిర్మాణాలు నిర్మించుకుంటున్నామన్నారు. వచ్చే సీజన్లో ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీటిని అందిస్తామన్నారు. నాడు కరెంట్ తీస్తే.. నేడు జీరో బిల్లు ఇస్తుండ్రు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ చార్జీలు పెంచి కరెంట్ను తీసేసిన అధికారులే నేడు జోరో బిల్లు ఇస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. సన్న బి య్యం తీసుకున్న వాళ్లంతా కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్లను ఎన్నుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమలకు అనుగుణంగా హుస్నాబాద్లో రూ.65 కోట్లతో ఏటీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఖజానా ఖాళీ చేసిండ్రు.. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఖజానాను ఖాళీ చే సి కుటుంబమంతా ఆస్తులను పెంచుకున్నారని మంత్రి వివేక్ అన్నారు. ప్రజాసంక్షేమానికే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాళ్లల్లో కట్టెలు పెట్టెటోళ్లను ఎన్నుకుంటే మునిగేది మనమే హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ -
సజావుగా నామినేషన్లు ప్రక్రియ
అబ్జర్వర్ భారతీ లక్పతినాయక్ మెదక్ కలెక్టరేట్/చిన్నశంకరంపేట/రామాయంపేట: జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ప్రక్రియ సజావుగా జరుగుతుందని జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ భారతీ లక్పతినాయక్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆ మె మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం స్క్రూటిని ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ.. బ్యాలెట్ బాక్సులు, పత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈనెల 6న పోలింగ్ సిబ్బంది శిక్షణ, పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందన్నారు. అంతర్ జిల్లాల చెక్పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య,డీపీఓ యాదయ్య, అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామాయంపేటలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని భారతీ లక్పతినాయక్ పరిశీలించారు. అలాగే నార్సింగి మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. -
సమయం లేదు మిత్రమా!
● వారంలోపే ప్రచార సమయం ● అభ్యర్థుల ఉరుకులు పరుగులు సర్పంచ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ముగియడం, గుర్తులు సైతం కేటాయించడంతో ఇక గ్రామాల్లో సందడి నెలకొననుంది. కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఇక ప్రచార పర్వం ముమ్మరం కానుంది. కాగా ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉన్న పంచాయతీల్లో పోటీ రసవత్తరంగా మారనుంది. – మెదక్జోన్ ఉపసంహరణలు, గుర్తుల కేటాయింపు పూర్తి కావడంతో బుధవారం నుంచి ప్రచారం ప్రారంభ ం కానుంది. పోలింగ్ నాటికి సరిగ్గా వారం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులతో కరపత్రాలు, వాల్పోస్టర్లు ముద్రించుకొని ఓటర్ల వద్దకు వెళ్లేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రచారంలో దూసుకెళ్లాలని చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలు ఉండగా, మొదటి విడతలో ఆరు మండలాల పరిధిలో 160 పంచాయతీలను ఎంచుకున్నారు. మొత్తం 678 మంది నామినేషన్లు వేయగా, ఈనెల 11న మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 2వ విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. 149 గ్రామ పంచాయతీలకు 1,007 నామినేషన్లు దాఖలు చేయగా, 1,290 వార్డు స్థానాలకు 3,430 నామినేషన్లు వేశారు. ఈలెక్కన ఒక్కో సర్పంచ్ స్థానానికి ఆరుగురు చొప్పున నామినేషన్లు వేశారు. అలాగే 3వ విడతలో 183 పంచాయతీ లకు నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభం కాగా, ఈనెల 5 వరకు ప్రక్రియ కొనసాగనుంది. గుర్తుంచుకునేలా.. సర్పంచ్, వార్డు సభ్యుడికి వేర్వేరు గుర్తులు ఉండనున్నాయి. ముఖ్యంగా సర్పంచ్ల బ్యాలెట్ పేపర్ పింకు కలర్లో ఉండగా, వార్డు సభ్యుల బ్యాలెట్ తెలుపు రంగులో ఉంటుంది. సర్పంచ్లకు సంబంధించి 30, వార్డు సభ్యులకు 20 గుర్తులను కేటా యించారు. ఇందులో పాదరక్షలు, రింగ్, బెండకాయ, బెలూన్, బిస్కెట్, చెత్త డబ్బా, టూత్ పేస్ట్, కత్తెర, బ్లాక్బోర్డు, వజ్రం, జల్లెడ, టేబుల్, మంచం, పలక, పడవ తదితర గుర్తులను సర్పంచ్లకు కేటా యించారు. అయితే వార్డు సభ్యులకు అవసరమైన ఖర్చులు సైతం సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులపైనే పడుతుంది. ఒక్కో వార్డుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు తప్పేలా లేదని పోటీలో ఉన్న అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. గుంపులు, గుంపులుగా తి ప్పుకోకుంటే తాము ఎక్కడ వెనుకబడ్డా మోనన్న ప్రచారం మొదలవుతుందన్న బెంగ అభ్యర్థులను పట్టి పీడిస్తోంది. దీంతో వెంట వచ్చే వారికి కూలీ, దావత్ ఇస్తామంటూ నచ్చచెబుతూ వెంట తిప్పుకుంటున్నారు. గ్రామాలకు పెద్ద నాయకులు ప్రచారానికి వచ్చిన సందర్భాల్లో ఎక్కువ మందిని సమీకరించటంతో ఎక్కువ ఖర్చు అవుతుంది. కాగా పోటీల్లో ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
కోడ్ అతిక్రమిస్తే కొరడా
● ఎస్పీ డీవీ శ్రీనివాస రావు హెచ్చరిక ● ఎన్నికల నియమావళి పాటించాలి ● సమస్యాత్మక ప్రాంత ప్రజలతో భేటీ టేక్మాల్(మెదక్)/పాపన్నపేట(మెదక్): ఎన్నికల కోడ్ను అతిక్రమిస్తే ఉపేక్షించేదిలేదని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో మంగళవారం టేక్మాల్ మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన శాబాద్ తండా, సీఎం తండా, ఎల్లుపేట్, ఎల్పుగొండ, కమ్మరికత, సూరంపల్లికి చెందిన ప్రజలకు శాబాద్తండాలో, అలాగే.. పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లిలో వేర్వేరుగా సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని సూచించారు. ఎలాంటి విభేదాలు, వర్గపోరు సృష్టించకూడదన్నారు. ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో గొడవలకు కారణమైన వారిని ఇప్పటికే బైండోవర్ చేశామని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరిగి ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించవద్దని చెప్పారు.ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతలకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, టేక్మాల్ ఎస్ఐ అరవింద్కుమార్, అలాగే.. పాపన్నపేట రూరల్ సీఐ జార్జ్, ఎస్బీ సీఐ సందీప్ రెడ్డి, సీసీఎస్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలే లక్ష్యం
● కలెక్టర్ రాహుల్రాజ్ ● ముసాయిదా విత్తన బిల్లుపై అభిప్రాయ సేకరణ మెదక్ కలెక్టరేట్: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యంగా.. వారు పెట్టిన పెట్టుబడి తగ్గ ఆదాయం లభించేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుందని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముసాయిదా విత్తన బిల్లు 2025 బిల్లుపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ముసాయిదా విత్తన చట్టం 2025పై అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ చట్టం 1985 లకు కొత్తగా ప్రవేశపెట్టబడిన ముసాయిదా విత్తన చట్టం 2025 కు గల తేడాలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, ఈఈ ఇరిగేషన్ శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి తప్పనిసరి కొల్చారం(నర్సాపూర్): ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. మంగళవారం మండలంలో నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ క్రమంలో అధికారులతో సమావేశమై నిబంధనలపై వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడో విడత ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్, చిలప్చెడ్, కొల్చారం, వెల్దుర్తి, శివ్వంపేట, కౌడిపల్లి, మాసాయిపేట మండలాల్లో నామినేషన్ స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కలెక్టర్ వెంట నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, రిటర్నింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
మూడో విడతకు సన్నద్ధం
అదనపు కలెక్టర్ నగేష్ కౌడిపల్లి(నర్సాపూర్): మూడో విడత ఏడు మండలాల్లో జరిగే సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ కౌంటర్లు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలో నర్సాపూర్ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో మూడో విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిందన్నారు. ఈనెల 3వ తేదీ నుంచి 5వరకు నామినేషన్లు గడువు ఉందన్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు చివరిరోజు వరకు వేచిచూడకుండా మొదటి రోజు నుంచి నామినేషన్లు వేయడం వల్ల ఇబ్బందులు ఉండవని చెప్పారు. నామినేషన్ కౌంటర్ల వద్ద హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశామన్నారు. కౌడిపల్లి మండలంలో 35పంచాయతీలు, 280వార్డులకుగాను నామినేషన్ల స్వీకరణకు ఏడు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ రామారావ్, ఎంఈఓ బాలరాజు, తదితరులు పాల్గొన్నారు. కేటగిరి, సంతకాలు తప్పనిసరి చిలప్చెడ్(నర్సాపూర్): అభ్యర్థులు అందజేసిన నామినేషన్ పత్రాలలో కేటగిరి, సంతకాలను తప్పనిసరిగా పరిశీలించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మంగళవారం చిలప్చెడ్ ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కౌంటర్లను పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, తహసీల్దార్ సహదేవ్, తదితరులు పాల్గొన్నారు. -
పోటాపోటీ చేరికలు
పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ నాయకులకు గులాబీ కండువా కప్పుతున్న మాజీ మంత్రి హరీశ్రావుసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: చేరికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులకు కండువాలు కప్పుతున్నాయి. ఆయా గ్రామాల్లో మంచి పట్టున్న నాయకులకు గాలం వేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నిక సమయంలో జరిగే చేరికలకు ఏమాత్రం తీసి పోని విధంగా ఇప్పుడు కూడా భారీ స్థాయిలో చేరికలు కొనసాగుతుండటంతో పంచాయతీ పోరు ఆసక్తిగా, రసవత్తరంగా మారుతోంది. గులాబీ గూటికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులపై ప్రతిపక్ష బీఆర్ఎస్ గురి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో గులాబీ పార్టీ తన పట్టును నిలుపుకున్న విషయం విదితమే. 11 అసెంబ్లీ స్థానాల్లో ఏడు చోట్ల విజయం సాధించిన గులాబీ పార్టీ ఇప్పుడు పంచాయతీ పోరును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గ్రామాల్లో పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకుంది. నర్సాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ జెడ్పీటీసీ మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఇదే నియోజకవర్గంలో పలువురు బీజేపీ నాయకులు సైతం హరీశ్రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు భవానీతో పాటు, ఆపార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆదివారం కాంగ్రెస్ను వీడి గులాబీ పార్టీలో చేరారు. వీరికి హరీశ్రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, జహీరాబాద్ మండలాల్లో పలు గ్రామాల్లో కాంగ్రెస్ కీలక నాయకులు ఈ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గులాబీ కండువా కప్పుకున్నారు. ఇలా పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలో చేర్చుకుని ఈ ఎన్నికల్లో సత్తాచాటేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. కాంగ్రెస్లోకి సైతం.. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా చేరికలపై దృష్టి సారించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల్లోకి కీలక నేతలకు కాంగ్రెస్ కండువాలు కప్పుతోంది. రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నామని, సర్పంచ్గా గెలిచాక పనులు చేసుకోవాలన్నా.. నిధులు తెచ్చుకోవాలన్నా.. తమ వద్దకే రావాల్సి ఉంటుందని చెబుతూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన కీలక నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది. పెద్ద శంకరంపేటకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఇటీవల మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అలాగే తూప్రాన్ మండలంలోని వెంకటాయపాల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం కొహీర్ మండలం కొత్తూరు, తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ మాజీ సర్పంచులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా రెండు పార్టీలు చేరికలపై దృష్టి సారించడంతో గ్రామ పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల తరహాలో పోకడ రసవత్తరంగా పంచాయతీ పోరు -
ఎత్తులు.. పైఎత్తులు
● 14 చోట్ల ఏగ్రీవమయ్యే అవకాశాలు ● గ్రామాభివృద్ధి పనులకు అభ్యర్థుల హామీలు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముంచుకొస్తుండటతో.. ఎన్నికల ఏకగ్రీవానికి ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థులను చిత్తు చేయడానికి రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. ఆరు మండలాల్లో సుమారు 14 మంది సర్పంచ్లు ఏకగ్రీవమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంత మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మరి కొంత మంది ఆ దిశగా పావులు కదుపుతున్నారు. పార్టీల అండదండలు.. కుల సంఘాల ప్రభావం.. గ్రామాభివృద్ధికి నజరానాలు.. రాజకీయ పద్మవ్యూహాలు.. వెరసి ఏకగ్రీవానికి దారితీస్తున్నాయి. – మెదక్ అర్బన్ జిల్లాలోని పాపన్నపేట, హవేలి ఘనపూర్, అల్లాదుర్గ్, శంకరంపేట, రేగోడ్, టేక్మాల్ మండలాల్లో ఈ నెల 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం నవంబర్ 25న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. 27 నుంచి 29 వరకు నామినేషన్ల దాఖలు, 30న నామినేషన్ పత్రాల పరిశీలన, డిసెంబర్ 3న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహారణకు అవకాశం ఉంది. ఆరు మండలాల్లో 160 గ్రామపంచాయతీలు ఉండగా, 678 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఏకగ్రీవం దిశగా.. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీల్లో సుమారు 14 మంది సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టేక్మాల్ మండలం చల్లపల్లి,హసన్ మహ్మద్పల్లి. సాలోజిపల్లి, శంరంపేట(ఏ) మండలం సంగారెడ్డిపేట, మాడ్శెట్పల్లి, గట్టుమీది తండా, దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జమ్లానాయక్ తండా,కొత్తపేట,పాపన్నపేట మండలంలో నామాపూర్,యూసుఫ్పేట,అమ్రియా తండా, లక్ష్మీనగర్, కొంపల్లి, రేగోడ్ మండలంలో కొండాపూర్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏకగ్రీవ సర్పంచ్లలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నట్లు సమాచారం. ఏకగ్రీవ యత్నాలు చేస్తున్న వ్యక్తులు పార్టీ పరంగా నాయకుల పరపతిని ఉపయోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్రామాభివృద్ధి, సామాజిక కార్యక్రమాలకు డబ్బులు వెచ్చిస్తామని హామీలు ఇచ్చి, గ్రామస్థుల ఏకాభిప్రాయాన్ని సాధిస్తున్నారు. అయితే పంచాయతీ వార్డ్ మెంబర్లు సైతం ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి. -
క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్లు తీసుకోవాలి
అబ్జర్వర్ భారతి నాయక్ చేగుంట(తూప్రాన్): అన్ని పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్లు స్వీకరించాలని ఎన్నికల అబ్జర్వర్ భారతి నాయక్ పేర్కొన్నారు. మంగళవారం చేగుంటలోని నామినేషన్ కౌంటర్లను ఆమె సందర్శించారు. నామినేషన్లు తీసుకుంటున్న తీరును ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరి నామినేషన్ పత్రాన్ని ముందుగానే సరి చూసుకోవాలని, తప్పులు లేకుండా అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నట్లు నిర్థారించుకున్న తర్వాత నామినేషన్ స్వీకరించాలని పేర్కొన్నారు. అభ్యర్థుల నామినేషన్ల నమోదు నంబర్లు సైతం రికార్డుల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నామినేషన్ పత్రాలను తీసుకోవాలని సూచనలు చేశారు. ఆమె వెంట తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్గౌడ్, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య వెల్దుర్తి(తూప్రాన్): పంచాయతీ ఎన్నికలో ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. మాసాయిపేట, వెల్దుర్తి మండల కేంద్రాల్లో బుధవారం నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను వారు వేర్వేరుగా పరిశీలించారు.ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల ఎన్నికల అధికారులు ఉమాదేవి, విఘ్నేశ్వర్, తహసీల్దార్లు శ్రీనివాస్, జ్ఙానజ్యోతి, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత్రావు జహీరాబాద్ టౌన్: వేసెక్టమి ఆపరేషన్లకు పురుషులు ముందుకురావాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత్రావు అన్నారు. జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన వేసెక్టమి క్యాంపును సందర్శించారు. ఆపరేషన్ చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురుషులకు కోత, కుట్టు లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి ముప్పు ఉండదని, ఐదు నిమిషాల్లో ఆపరేషన్ పూర్తవుతుందని చెప్పారు. దాంపత్య జీవితానికి ఎలాంటి ఆటంకం కలగదని, అపోహలు నమ్మకుండా వేసెక్టమి ఆపరేషన్లు చేసుకునేందుకు ముందుకురావాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ లక్ష్మిశైలజ, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మనోహర్రెడ్డి, డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ మహిపాల్ నర్సాపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బ్యాంకు కొత్త ఖాతా అవసరమేనని, అయితే.. నామినేషన్ వేసే సమయానికి ఖాతా తెరవక పోయినా నామినేషన్లను అమోదిస్తామని నర్సాపూర్ ఆర్డీఓ, జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి మహిపాల్ చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు జిల్లాలోని ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో కరెంటు అకౌంట్ తెరిచి ఆ నంబరును ఎన్నికల అధికారులకు ఇవ్వాలన్నారు. పలు రకాల కారణాలతో నామినేషన్ వేసే సమయానికి ఖాతా తెరువక పోయినా నామినేషన్ను ఆమోదిస్తామన్నారు. అభ్యర్థులు కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసి ఎన్నికల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల అధికారులకు ఎన్నికల ఫలితాలు వచ్చిన 45 రోజుల్లోపు అందజేయాల్సి ఉంటుందని వివరించారు. లేకుంటే ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని ఆయన హెచ్చరించారు. సీఐటీయూ సహాయ కార్యదర్శి సంతోష్ మెదక్ కలెక్టరేట్: ఈనెల 7, 8, 9వ తేదీల్లో మెదక్లో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంస్థ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్ తెలిపారు. మంగళవారం మెదక్లో కరప్రతాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు లేబర్కోడ్లు తెచ్చి కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ మహాసభల్లో కార్మికుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జిల్లాలోని కార్మికులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోఆశ వర్కర్లు పాల్గొన్నారు. -
పల్లెపోరుపై నిఘా
మెదక్జోన్: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ గట్టినిఘా పెట్టింది. మొదటి విడత నామినేషన్లు ముగిసి, 2వ విడత నామినేషన్లు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. పోలీసుల అనుమతి లేనిదే ఎలాంటి కార్యక్రమం నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు తప్పనిసరి అని ఇప్పటికే అన్ని పార్టీల నేతలకు అవగాహన కల్పించారు. జిల్లాలో 38 లైసెన్స్ తుపాకులు ఉండగా వాటిని డిపాజిట్ చేసుకున్నారు. గతంలో జరగిన ఎన్నికల్లో గొడవలు సృష్టించిన వ్యక్తులను, పాత నేరస్తులను, మాజీ నక్సలైట్లను, రౌడీషీటర్లతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 231 మందిని ఆయా మండలాల తహసీల్దార్ల వద్ద బైండోవర్ చేశారు. ఈ సంఖ్యా మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. బెల్టుషాపులపై దాడులు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో బెల్టుషాపులపై గట్టినిఘా పెట్టిన పోలీసులు ఇప్పటి వరకు 113 కేసులు నమోదు చేశారు. రూ. 6.62 లక్షల విలువ చేసే 943 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా స్టాటిక్ సర్వేలైన్టీం నిరంతరంగా తిరుగుతోంది. అందులో ఎన్నికల అధికారులతో పాటు పోలీస్ అధికారులు ఉన్నారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం రూ.50 వేలు మించి తరలించారాదు. ఒక వేళ తరలిస్తే అందుకు సంబంధించి సరైనా ఆదారాలు చూపించాల్సి ఉంటుంది. చూపించకుంటే నగదును స్వాదీనం చేసుని వాటిని కలెక్టరేట్లో డిపాజిట్ చేస్తున్నారు. అతి సమస్యాత్మక జీపీలు జిల్లా వ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. వాటిలో 45 గ్రామాలు అతి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. వీటివద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కలెక్టరేట్కు అనుసంధానం చేశారు. అలాగే సర్వేలైన్స్టీం, వెబ్కాస్టింగ్ నిరంతరంగా నిఘా పెట్టడంతో పాటు ఆయా గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి. ఎన్నికల నియమావళిని విస్మరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. అలాంటి వారిపై శాఖపరమైనా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రావు, ఎస్పీ లైసెన్స్ తుపాకులు స్వాధీనం 231మంది బైండోవర్ 45 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు 113 మందిపై కేసులు నమోదు నిరంతర పర్యవేక్షణలో స్టాటిక్ సర్వేలైన్ టీం -
సర్పంచ్కి సగటున నలుగురు
● వార్డు మెంబర్కు ఇద్దరు ● మొదటి విడత నామినేషన్ల పరిశీలన పూర్తి మెదక్ అర్బన్: మొదటి విడత పంచాయతీ పోరులో సర్పంచ్ పదవికి సగటున నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు మెంబర్లకు వచ్చేసరికి, ఒక్క వార్డుకు ఇద్దరి చొప్పుప నామినేషన్లు వేశారు. జిల్లాలో మొదటి విడతగా అల్లాదుర్గం, హవేళిఘణాపూర్, పాపన్నపేట, రేగోడ్, శంకరంపేట(ఏ), టేక్మాల్ మండలాలకు ఈనెల 11న ఎన్నికలు జరుగనున్నాయి. కాగా ఆరు మండలాల్లో 160 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,400 వార్డులు ఉన్నాయి. అయితే నామినేషన్ల పరిశీలన ముగిసే నాటికి 160 సర్పంచ్లకు గాను 678, 1,400 వార్డులకు 2,821 నామినేషన్లు దాఖలు అయ్యాయి. పరిశీలనలో 2 వార్డు మెంబర్ నామినేషన్లు తిరస్కరించారు. అత్యధికంగా పాపన్నపపేట మండలంలో 40 పంచాయతీలు ఉండగా 184, అల్లాదుర్గ్లో 16 పంచాయతీలకు 77 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 3 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉండటంతో, ఒకే పార్టీలోని అభ్యర్థులను ఉపసంహరింపజేయడానికి పార్టీ నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. » -
ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్జోన్/చిన్నశంకరంపేట/హవేళిఘణాపూర్/మెదక్ కలెక్టరేట్/చేగుంట(తూప్రాన్): నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. సోమవారం మెదక్, చిన్నశంకరంపేట, చేగుంట, హవేళిఘణాపూర్ మండల్లాలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ ప్రక్రియను సజా వుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ వేసే అభ్యర్థులు నూతన బ్యాంకు అకౌంట్ తప్పనిసరి అని అన్నారు. పాత అకౌంట్లు చెల్లుబాటుకావని గుర్తించాలన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు నూతన అకౌంట్లు తెరిచేలా ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో ఐడీఓసీలో స్టేజ్– 2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సూచలిచ్చారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మీ పాత్ర అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీపీఓ యాదయ్య, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. » -
అప్రమత్తంగా ఉండాలి
నర్సాపూర్: ప్రాణాంతక వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి హేమలత అన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మా ట్లాడారు. మంచి ఆహారం, శారీరక వ్యాయామం, యోగాసనాలు అలవర్చుకొని ఆరోగ్య వ ంతంగా ఉండాలని హితవుపలికారు. మెరుగైన వైద్యం సకాలంలో అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యు లు నిరుపమ, రాము, పలువురు న్యాయవాదులు స్వరూపరాణి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ మున్సిపాలిటీ: శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈనెల 31 వరకు జిల్లావ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమయంలో పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. శాంతి భద్ర తల నిర్వహణకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెదక్జోన్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం అకాడమిక్ ఆడిట్ నిర్వహించారు. గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నికత్ అంజుమ్, జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ లచ్చయ్యల నేతృత్వం కొనసాగింది. రికార్డులను తనిఖీ చేసి, కళాశాలకు సంబంధించిన అడ్మిషన్న్లు, ఫలితాలు, విద్యార్థుల బోధన తీరుతెన్నులు, గ్రంథాలయం, క్రీడా విభాగం, టాయిలెట్స్ స్టూడెంట్స్ స్టడీ ప్రాజెక్టు, సాంకేతిక బోధనలు సైన్స్ లేబోరేటరీ, కంప్యూటర్ ల్యాబ్స్, క్లాస్రూమ్స్, పారిశుద్ధ్యం మొదలైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమగ్ర నివేదికను విద్యాశాఖకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హుస్సేన్, వైస్ ప్రిన్సి పాల్ సింహారెడ్డి, అకాడమిక్ కో–ఆర్డినేటర్ శరత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ను సోమవారం డీఈఓ విజయ సందర్శించారు. ప్రార్థన ముగిసిన వెంటనే విద్యార్థులకు నీతి కథలు చెప్పగా, ఆస క్తిగా విన్నారు. అనంతరం ఉపాధ్యాయుల వి వరాలు, రిజిస్టర్ను పరిశీలించారు. కార్యక్ర మంలో ఉపాధ్యాయులు కరుణాకర్, రాజేశం, రాజశేఖర్, అశోక్ ఉన్నారు. ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం: సీఐటీయూ జహీరాబాద్ టౌన్: ఐక్యతతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. మండలంలోని బూచినెల్లి పారిశ్రామిక వాడలో గల సీఐఈ పరిశ్రమలో సోమవారం వేతన ఒప్పదం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం సీఐటీయూతోనే సాధ్యమన్నారు. కార్మికుల పక్షాన ఉంటూ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. 4 లేబర్ కోడ్ల రద్దు కోసం ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నాయకులు మహిపాల్, రాజిరెడ్డి, సందీప్రెడ్డి, నర్సయ్య, నరేష్, నారాయణ, రవి పాల్గొన్నారు. -
మెదక్ను సుందరంగా తీర్చిదిద్దుతా
ఎమ్మెల్యే రోహిత్రావుమెదక్ మున్సిపాలిటీ: మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. సోమవారం పట్టణంలోని 7, 8, 20 వార్డులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనన్నారు. ఇటీవల పట్టణాభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ. 55 కోట్లు వచ్చాయని, పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీలేదని, ని యో జకవర్గ అభివృద్ధియే తన ఆకాంక్ష అన్నారు. రెండేళ్ల తమ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గానికి రూ. కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తెచ్చి మెదక్ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి మధుసూదన్రావు, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్, మమత, శ్రీధర్ యాదవ్, దొంతి ముత్యంగౌడ్, లింగం అంజాద్, గంగాధర్, శివరామకృష్ణ, పురం వెంకటనారాయణ, హరిత నర్సింగ్రావు, బట్టి సులోచన, గోదల జ్యోతి, స్వరూప, దయాసాగర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. » -
కాంగిరేసులో కిరికిరి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సర్పంచ్ పదవుల కోసం అధికార కాంగ్రెస్లో పోటాపోటీ నెలకొంది. ఒక్కో గ్రామంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు నాయకులు బరిలోకి దిగుతుండటం ముఖ్య నాయకులకు తలనొప్పిగా తయారైంది. తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉంటే గ్రామంలోని పార్టీ ఓటు బ్యాంకు చీలిపోయి.. ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి గెలిచే అవకాశాలుంటాయి. దీంతో ఎలాగైన తిరుగుబాటు అభ్యర్థులు లేకుండా చూసుకునేందుకు తంటాలు పడుతున్నారు. పార్టీకి చెందిన ఒక్కరే నామినేషన్ వేసేలా చూసుకుంటున్నారు. ఈ బాధ్యతలను హస్తం పార్టీ గ్రామ, మండల నాయకులు తీసుకున్నారు. గ్రామంలో కాంగ్రెస్ కేడర్ అంతా కూర్చొని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలని సూచిస్తున్నారు. ఈ మేరకు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి సమన్వయం చేసే ప్రయత్నాలు చేస్తుండటం పలు గ్రామాల్లో పరిపాటైపోయింది. ఎవరైనా నామినేషన్ వేసేందుకు సిద్ధమైతే వారిని బుజ్జగిస్తున్నారు. ఈ బుజ్జగింపులకు లొంగకుండా తొలివిడత పోలింగ్ జరిగే గ్రామాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరించుకునేలా సంబంధిత కుల సంఘాల పెద్ద లు, సన్నిహితులతో మాట్లాడి ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైన ఎంపీటీసీ పదవులకు అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ వినని పక్షంలో ఉప సర్పంచ్ పదవి ఇస్తామని, అవసరమైతే వార్డు సభ్యునిగానైనా బరిలోకి దిగాలని సూచిస్తున్నారు. గులాబీ ముఖ్య నేతల సమన్వయం కాంగ్రెస్తో పోలిస్తే బీఆర్ఎస్కు సర్పంచ్ల పదవులకు తిరుగుబాటు అభ్యర్థుల తలనొప్పి కాస్త తక్కువేనని చెప్పవచ్చు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతోంది. గ్రామంలో పట్టున్న వారిని, పైగా ఆర్థికంగా బలంగా ఉన్న వారిని బరిలోకి దించుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులకు దీటుగా అభ్యర్థులను బరిలోకి దించుతోంది. ఈ విషయంలో మండల స్థాయి నాయకులతో పాటు, అవసరమైన చోట్ల గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి సర్పంచ్ అభ్యర్థుల విషయంలో గ్రామ కేడర్తో చర్చిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గులాబీ పార్టీ ఓటు బ్యాంకు చీలిపోకుండా జాగ్రత్త వహిస్తున్నారు. కమలంలో యువ ఉత్సాహం బలమైన అభ్యర్థులను బరిలో దింపుతున్న బీఆర్ఎస్ దీటైన అభ్యర్థుల కోసం బీజేపీ అన్వేషణ పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మూడు ప్రధాన పార్టీలు మరోవైపు బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ గ్రామాల్లో అన్వేషిస్తోంది. గ్రామాల్లో యువత చాలా మట్టుకు కమలం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. యువ ఓటర్లలో ఈ పార్టీకి మంచి పట్టుంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు దీటుగా తమ పార్టీ నాయకులను సర్పంచ్ పదవికి పోటీలో నిలుపుతోంది. ఆ పార్టీకి చెందిన మండల నాయకులు, గ్రామస్థాయి నేతలు ఈ బాధ్యతలు తీసుకుంటున్నారు. మొత్తం మీద రాజకీయ పార్టీల గుర్తులకు అతీతంగా జరిగే ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండటంతో గ్రామ పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. -
సమన్వయంతో పనిచేయండి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డికొల్చారం(నర్సాపూర్): సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు కోసం సమన్వయంతో పనిచేసి మెజార్టీ సర్పంచ్ స్థానాలు గెలుపొందాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించారు. సోమ వారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్ లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమన్నారు. అభ్యర్థి గెలుపునకు ప్రతి ఒక్క ఓటు అమూల్యమని, ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ15 రోజులు పార్టీ నాయకులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన విధానాన్ని, ప్రతి ఓటర్ వద్దకు తీసుకెళ్లి ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఎవరు అభ్యర్థిగా నిలబడిన సమన్వయంతో గెలిపించుకోవాలని, అప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, సీనియర్ నాయకుడు ఉమన్నగారి దేవేందర్రెడ్డి, మండల యువత అధ్యక్షుడు సంతోశ్రావు, మంజుల, మేఘమాల, నాయకులు ఇంద్రసేనారెడ్డి, బాగారెడ్డి, యాదయ్య, గోదావరి, రవితేజరెడ్డి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక దొరకక.. ఇళ్లు కట్టలేక!
● మెదక్లో ప్రారంభం కాని శాండ్బజార్ ● ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు మెదక్ నియోజకవర్గంలో శాండ్బజార్ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇసుక ఇస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు పదేపదే చెబుతున్నారు. కానీ కేవలం అది ప్రకటనలకే పరిమితం అయింది. నర్సాపూర్ నుంచి ఇసుకను నియోజకవర్గంలోని మారుమూల గ్రామానికి తీసుకురావాలంటే 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఒక్క ట్రాక్టర్ కిరాయి ఆ దూరానికి రూ. 8 వేల పైచిలుకు ఉంటుంది. శాండ్బజార్లో టన్ను ఇసుకకు రూ. 1,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క ట్రాక్టర్లో 4 టన్నుల ఇసుక మాత్రమే వస్తుండగా, రూ. 12,800 ఖర్చు అవుతుంది. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 40 టన్నుల ఇసుక అవసరం కాగా, ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షల్లో ఇసుకకే రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ పరిధిలో వారం క్రితం కరీంనగర్ నుంచి కొంత ఇసుకను తెచ్చి నిల్వ చేశారు. ఎప్పుడు ప్రారంభిస్తారని లబ్ధిదారులు అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని ఓ అధికారి అంటుంటే, మరో అధికారి ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు సమయం ఇవ్వటం లేదని చెబుతున్నారు. ఇప్పటికై నా ఇసుకను సకాలంలో అందిస్తే ఇళ్ల నిర్మాణాలు చేపడతామని పేర్కొంటున్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 9,209 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో ఇప్పటివరకు 4,327 మాత్రమే ప్రారంభించారు. మిగితా 4,882 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభించలేదు. ఇందుకు ప్రధాన కారణం ఇసుక అందుబాటులో లేకపోవటమేనని తెలుస్తోంది. – మెదక్జోన్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉండగా, రెండుచోట్ల శాండ్బజార్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. కానీ ఒక్క నర్సాపూర్లో మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో ఆ నియోజకవర్గానికి సమీపంలో ఉన్న మండలాల లబ్ధిదారులు మాత్రమే ఇసుక కొనుగోలు చేస్తున్నారు. మిగితా వారు అవస్థలు పడుతున్నారు. కాగా నిర్మాణాలు ప్రారంభించకుంటే మంజూరు చేసిన ఇళ్లు రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.ప్రకటనలకే పరిమితం -
సరిహద్దులు కట్టుదిట్టం
● పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిఘా ● మద్యం, డబ్బు తరలింపుపై దృష్టి ● తనిఖీలు ముమ్మరం చేసిన పోలీస్శాఖ జహీరాబాద్: పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా పోలీస్శాఖ రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. కర్ణాటక నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే 65వ జాతీయ రహదారిపై చిరాగ్పల్లి వద్ద, బీదర్ రహదారిపై హుసెళ్లి వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. డీఎస్పీ సైదా ఆధ్వర్యంలో సీఐ శివలింగం పర్యవేక్షణలో ఆయా పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది చెక్పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు జరుపుతున్నారు. జిల్లాలో ఈనెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అక్రమాలు జరగకుండా బందోబస్తు ఏర్పా టు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక్కో చెక్పోస్టులో పోలీసులతో పాటు ఆయాశాఖల సిబ్బందిని నియమించారు. అంతేకాకుండా ఆయా మండలాల్లోని ఎస్ఐలు తమ పరిధిలోని గ్రామాల్లో సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్లతో పాటు అక్రమాలపై నిఘా పెట్టారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రూ. 50 వేల కంటే ఎక్కువ నగదును కలిగి ఉన్నా, అనుమతులు లేకుండా వస్తువులను తరలించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వాహనాల్లో వచ్చేవారు తగిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచిస్తున్నారు. కర్ణాటకలో కొనుగోలు చేసి రాష్ట్రంలోకి తరలిస్తే బిల్లులు, పన్నులు చెల్లించిన పత్రాలు ఉండాలని పేర్కొంటున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. -
పల్లెపోరు.. విందుల జోరు!
గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి ● ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ● ముగిసిన మొదటి విడత నామినేషన్లుపంచాయతీ ఎన్నికలకు మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో పల్లెల్లో విందుల సందడి మొదలైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో చలికాలంలో పల్లె పోరు హాట్హాట్గా మారింది. – మెదక్జోన్ పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం కావడంతో వలస వెళ్లిన వారికి అభ్యర్థులు ఫోన్లు చేస్తూ గ్రామానికి వచ్చి ఓటు వేయాలని వేడుకుంటున్నారు. అందుకు అవసరమైన రవాణా ఖర్చుల కు డబ్బులు పంపుతున్నారు. ఉదయం నుంచి ఇంటింటికీ తిరుగుతూ మద్దతు కూడగడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఆత్మీయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఉదయం ప్రజలు పనులకు వెళ్తుండగా, సాయంత్రం సమయంలో ఓటు వేయాలని వేడు కుంటున్నారు. సాయంత్రం అయిందంటే మందు, విందు ఏర్పాటుచేస్తున్నారు. కాగా గతంలో సర్పంచ్, ఎంపీటీసీ ఇతర పదవులు నిర్వహించిన వారు మళ్లీ సర్పంచ్గా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతుండగా, కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ధోరణిలో ప్రజలున్నారు. కొన్నిచోట్ల ఒకే పార్టీకి చెందిన వారు ఇద్దరు బరిలో నిలుస్తున్నారు. ఒకరిని పోటీ నుంచి తప్పించేందుకు నేతలు యత్నిస్తున్నారు. ఎత్తుకు పైఎత్తు.. సాధారణంగా గ్రామాల్లో చాలా వరకు ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు వ్యక్తులు మాత్రమే పోటీపడతారు. ఎదుటి వ్యక్తి బలంగా ఉన్న చోట అతడిని ఓడించేందుకు మూడో వ్యక్తిని బరిలో దింపుతు న్నారు. ఒకవర్గం ఓట్లను చీల్చి ఆ ఇద్దరిని ఓడించేందుకు ఎత్తుగడ వేస్తునట్లు తెలిసింది. ఎన్ని జిమ్మికులు చేసైనా గెలవటమే ఏకై క లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు పార్టీల కన్నా పోటీలో నిలబడిన వ్యక్తులకే ప్రాధాన్యం ఇస్తూ మద్దతు పలుకుతున్నారు. ఇందులో భాగంగా కుల సంఘాలతో పాటు వర్గాలన్నీ ఒక్కటవుతున్నాయి. మంచి వ్యక్తిని ఎన్నుకునేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. నమ్మిన దేవుళ్లపై ఒట్టేసి ప్రమాణాలు చేస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. దీంతో పల్లెలన్నీ ఎన్నికల బిజీతో సందడిగా మారాయి. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
పాపన్నపేట(మెదక్): రాష్ట్రస్థాయి కబడ్డీ సబ్ జూనియర్ పోటీలకు జిల్లా నుంచి 28 మంది క్రీడాకారులు ఎంపికై నట్లు కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి రమేశ్ తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఎంపిక పోటీల్లో బాలిక ల విభాగం నుంచి 70 మంది, బాలుర విభా గం నుంచి 75 మంది పాల్గొనగా, ఒక్కో విభా గం నుంచి 14 మంది చొప్పున మొత్తం 28 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. ఎంపికైన క్రీడాకారులకు ఈనెల 2 నుంచి పోటీలు జరుగుతాయని చెప్పారు. బాలురకు మహబూబ్నగర్, బాలికలకు నల్గొండలో పోటీలు జరుగుతాయని తెలిపారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం చేగుంట(తూప్రాన్): మండలంలోని బోనాల్ ఫీ డర్ లైన్ మరమ్మతుల కారణంగా సోమవారం కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రామాయంపేట ఏడీఎ ఆదయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గొల్లపల్లి కన్యారం, రాంపూర్, చిన్నశివునూర్ గ్రామాలు తండాల పరిధిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ అంతరాయానికి ఆయా గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు. రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు: ఎమ్మెల్యే చేగుంట(తూప్రాన్): వడియారం బైపాస్ నుంచి చేగుంట మీదుగా రెడ్డిపల్లి చౌరస్తా వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.7 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆదివారం చేగుంట సర్పంచ్ అభ్యర్థి దుంపల రమ్య నామినేషన్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలను సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వడియారం మాజీ ఎంపీటీసీ లక్ష్మి అనారోగ్యానికి గురి కాగా పరామర్శించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, జిల్లా నాయకులు రాజిరెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, అలీ, సత్యనారాయణ పలు గ్రా మాల నాయకులు పాల్గొన్నారు. 7 నుంచి సీఐటీయూ మహాసభలు మెదక్ కలెక్టరేట్: ఈనెల7, 8, 9 తేదీల్లో జిల్లా కేంద్రంలో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో వాల్పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతుందన్నారు. 4 లేబర్కోడ్లు తెచ్చి కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు. కనీస వేతనం రూ. 26,000 అమలు చేయడం లేదన్నారు. అనంతరం సీఐటీయూ కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ.. పనిభారం పెంచుతూ శ్రమను దోచుకుంటుందని ఆరోపించారు. కార్మికుల సమస్యలను చర్చించడానికే మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీజేపీలో చేరికలు నర్సాపూర్ రూరల్: మండలంలోని కాగజ్మద్దూర్కు చెందిన వీరాంజనేయులుగౌడ్, సంతో ష, అమరేందర్గౌడ్తో పాటు పలువురు ఆది వారం మెదక్ ఎంపీ రఘునందన్రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈసందర్భంగా ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకుడు అరవింద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మూడు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం టేక్మాల్(మెదక్): మండలంలో మూడు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మండలంలోని సాలోజిపల్లి సర్పంచ్గా ఇర్షద్, హసన్మహ్మద్పల్లి చందునాయక్, చల్లపల్లి ఎల్లపల్లి సంగీత నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం జరిగిన పరిశీలనలో మూడు గ్రామాల నుంచి ఒకే నామినేషన్ రావడంతో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు ఎంపీడీఓ రియాజొద్దీన్ తెలిపారు. -
సమన్వయంతో పనిచేయండి
తూప్రాన్/మనోహరాబాద్/పాపన్నపేట(మెదక్): జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ను పారదర్శకంగా నిర్వహించేందకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతినాయక్ అన్నారు. ఆదివారం తూప్రాన్, మనోహరాబాద్, పాపన్నపేట మండలాల్లో రెండో విడతలో భాగంగా జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులకు అందించే మార్గదర్శకాలపై సూచనలిచ్చారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అందరూ సమన్యయం చేసుకొని ఎన్నికలు శాంతియుతంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. -
హుస్నాబాద్ను కోనసీమగా తీర్చిదిద్దుతా
హుస్నాబాద్: నియోజకవర్గాన్ని, ఆదర్శవంతంగా, మరో కోనసీమగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సభాస్థలిలో విలేకరులతో మా ట్లాడారు. 3న సీఎం రేవంత్రెడ్డితో పాటు సహచర మంత్రులను హుస్నాబాద్కు ఆహ్వానించినట్లు తెలిపారు. హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణం, ఏటీసీ, రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్, హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు 4 లేన్ల రహదారి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే కోహెడలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఆర్టీఏ కార్యాలయ భవనం, ఇందిరా మహిళా శక్తి బజార్, ఉమ్మాపూర్లో అర్బన్ పార్క్ ఏర్పాటు, మహిళా సంఘాలకు బస్సులు, హైదరాబాద్ నుంచి హుస్నాబాద్కు ఎక్స్ప్రెస్ బస్సును ప్రారంభిస్తారని పొన్నం తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ 3న సీఎం రేవంత్ రాక రూ. 480.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడి -
మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి
పెద్దశంకరంపేట(మెదక్): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. ఆదివారం మండలానికి చెందిన మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణతో పాటు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే జైలుకు పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. తాము కేసీఆర్ వారసులమని, బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, డీసీఎంస్ మాజీ చైర్మన్ శివకుమార్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, సురేశ్గౌడ్, జంగం రేణుక, భవాని, శంకర్గౌడ్, సుభాశ్, లింగయ్య, జంగం రాఘవులు, దశరత్, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
కలెక్టర్ రాహుల్రాజ్ తూప్రాన్/చిన్నశంకరంపేట(మెదక్): రెండో విడత నామినేషన్ ప్రక్రియ ఎనిమిది మండలాల్లో కొనసాగుతుందని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. ఆదివారం తూప్రాన్ డివిజన్ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్, నార్సింగి మండలాల్లో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ వేసే అభ్యర్థులు నూతన బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నియమావళి అందరూ పాటించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఎంపీడీఓ శాలిక, సిబ్బంది ఉన్నారు. అనంతరం నార్సింగి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండో విడత నామినేషన్ల ప్రక్రియను జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి పరిశీలించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు వేలం వేసినట్లు సమాచారం అందితే ఎన్నిక రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈసందర్భంగా ఎంపీడీఓ ప్రీతిరెడ్డి, తహసీల్దార్ గ్రేసిబాయికి పలు సూచనలు చేశారు. -
ఏకగ్రీవం దిశగా అడుగులు
● తండాలు, గ్రామాల్లో సమావేశాలు ● సర్పంచ్ పదవులకు వేలం పాట రామాయంపేట(మెదక్): పంచాయతీల్లో సర్పంచ్లు, వార్డు సభ్యు ల ఏకగ్రీవం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈమేరకు గ్రామాల్లో పేరు న్న నాయకులు ఆశావహులను బుజ్జగించే పనిలో నిమగ్నం అయ్యారు. ముఖ్యంగా పంచాయతీలుగా ఏర్పాటైన గిరిజన తండాల్లో ఎక్కువ శాతం ద్విముఖ పోటీ జరిగే ఆస్కారం ఉంది. జిల్లా పరిధిలోని రామాయంపేట, నిజాంపేట, నార్సింగి, చిన్నశంకరంపేట, తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, మెదక్ మండలాల్లో ఆదివారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. -
రెండో విడతకు సన్నద్ధం
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ రామాయంపేట(మెదక్): పంచాయతీ సమరంలో భాగంగా ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈమేరకు తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ మండలాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండో విడతలో మొత్తం 149 పంచాయతీలు, 1,290 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. మండలాల పరి ధిలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర గంటలవరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ ప్రక్రియ సాగనుంది. వచ్చిన నామినేషన్లను వచ్చేనెల 3న పరిశీలించి అ దేరోజు ప్రకటిస్తారు. నాలుగున అప్పీళ్లకు అవకాశం ఉంటుంది. ఆరున ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల ఫైనల్ లిస్టు ప్రకటిస్తారు. నామినేషన్ల కోసం సర్పంచ్ అభ్యర్థులకు ఇతరులకు రూ. రెండు వేలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. వెయ్యి, వార్డు సభ్యులు ఇతరులకు రూ. ఐదు వందలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 250 చెల్లించాలి. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నామినేషన్ల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. పల్లెపోరుపై నిఘా నారాయణఖేడ్: జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఫ్లయింగ్ సర్వైలైన్స్ టీం (ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వైలైన్స్ (ఎస్ఎస్టీ) టీంలు తమ విధుల్లో నిమగ్నమయ్యాయి. ఈ బృందాలు నగదు రవాణా, మద్యం తరలింపు, ఓటర్లకు మద్యం, నగదు పంపిణీ వంటివి అడ్డుకోవడంతోపాటు ఓటర్లను ప్రలోభపెట్టకుండా చర్యలు తీసుకోనున్నారు. 50 వేల లోపే నగదు తరలింపు ఎన్నికల సంఘం నిర్ణయించిన మేరకు రూ.50 వేల కంటే అధికంగా డబ్బును తరలించకూడదు, అలా తరలిస్తే అధికారులు డబ్బును సీజ్ చేస్తారు. ఒకవేళ రూ.50వేల కంటే అధికంగా నగదు తీసుకెళితే రశీదులు, సరైన ఆధా రాలు అధికారులకు చూపించాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో చీరలు, మద్యం, ఇ తర ఒకే రకమైన వస్తువులు తీసుకెళ్లినా వాటి ఆధారాలు చూపించని పక్షంలో వాటిని సీజ్ చేస్తారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ తనిఖీలు మండలానికి ఒకటి చొప్పున ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులను నియమించారు. ఎన్నికల నియమావళికి సంబంధించిన ఫిర్యాదులపై వీరు స్పందిస్తారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై నిఘా పెట్టేందుకు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను నియమించారు. ఈ బృందంలో డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి, నగులు పోలీసులు, వీడియోగ్రాఫర్ ఉండి వాహనాల రాకపోకలపై నిఘా పెడతారు. జిల్లా సరిహద్దులోని కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసు సిబ్బంది మరింత నిఘాతో వ్యవహరిస్తున్నారు. ఎస్హెచ్ఓలు తమ పరిధిలోగల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను సమీక్షించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. హిస్టరీ షీట్లు, గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన వారిని ప్రశాంత ఎన్నికల దృష్ట్యా ముందస్తు బైండోవర్లు చేయనున్నారు. కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఫార్వర్డ్ మెసేజ్ చేసినా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించినా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకాచం చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో 1,450 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. -
షరా మామూలే!
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తెరుచుకోని ఎమర్జెన్సీ డోర్లు ● భద్రత నిబంధనలు గాలికొదిలేసిన యాజమాన్యాలు ● విజిలెన్స్ తనిఖీల్లో వెలుగులోకి లోపాలుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతాలోపాలు షారా మామూలైపోయాయి. కర్నూలు వద్ద గత నెలలో జరిగిన ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడిన విషయం విధితమే. ఈ ఘటన తర్వాత రవాణాశాఖ అధికారులు తనిఖీల పేరుతో కాస్త హడావుడి చేశారు. ఈ ఘటన కాస్త మరచిపోయినట్లు కాగానే ప్రస్తుతం ట్రావెల్స్ బస్సులు ఎప్పటిలాగే భద్రతా ప్రమాణాలను గాలికొదిలేశాయి. చాలా బస్సుల్లో వెనుక వైపు ఉన్న అత్యవసర ద్వారాన్ని పూర్తిగా మూసి వేసి.. దాని వద్ద ఒక సీటును బిగించి నడుపుతున్నారు. కొన్ని బస్సులకు ఈ అత్యవసర ద్వారం ఉన్నప్పటికీ, అది ఎంత తెరిచినా తెరుచుకోవడం లేదు. సాధారణ పరిస్థితుల్లోనే ఈ ద్వారం తెరుచుకోకపోతే, ప్రమాదం జరిగినప్పుడు పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైంది. కాసులకు కక్కుర్తి పడిన కొన్ని యాజమాన్యాలు కొన్ని బస్సుల్లో సీటింగ్ కెపాసిటీ కంటే రెండు, మూడు సీట్లు అధికంగా బిగించినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో సీట్ల మధ్య దూరం తగ్గి ఇరుకుగా తయారైంది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు ఉంచే పరికరాల వినియోగంపై బస్సు సిబ్బందికి కనీస అవగాహన కూడా లేదని తనిఖీ అధికారులు గమనించారు. రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల జిల్లాలోని ముంబై హైవేపై ఆకస్మిక తనిఖీలు చేశారు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చేపట్టిన ఈ తనిఖీల్లో ఈ ట్రావెల్స్ బస్సుల్లోని భద్రతా లోపాలు మరోమారు వెలుగులోకి వచ్చాయి. ఇలా భద్రతా లోపాలతో నడుపుతున్న బస్సులు ఒక్కరోజే తొమ్మిదింటిని గుర్తించారు. వీటిపై కేసులు నమోదు చేసి రూ. 1.90 లక్షల జరిమానా విధించారు. ప్రతి పది బస్సులను తనిఖీలు చేస్తే భద్రతా ప్రమాణాలున్న బస్సులు కనీసం రెండు, మూడు కూడా ఉండటం లేదు. దీంతో ఈ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించే వారి భద్రత ఎప్పటిలాగే గాలిలో దీపాలైపోయాయి. అత్యధిక బస్సులు ఇక్కడి నుంచే ప్రారంభంఏపీలోని విజయవాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు వంటి ప్రాంతాలతో పాటు, మహారాష్ట్రలోని షిర్డీ వంటి క్షేత్రాలు నిత్యం వందలాది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వెళుతుంటాయి. ఇందులో సగానికి పైగా బస్సులు జిల్లాలోని పటాన్చెరు, ఇస్నాపూర్ ప్రాంతం నుంచే ప్రారంభమవుతాయి. కొన్ని సంగారెడ్డి నుంచి నడుపుతుంటారు. సదాశివపేట, సంగారెడ్డి, ఇస్నాపూర్, పటాన్చెరు, బీరంగూడ, రామచంద్రాపురం ఇలా ముంబై హైవేపై పికప్ పాయింట్లు ఉంటున్నాయి. అయితే ఈ బస్సులను రవాణాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేస్తున్న ఈ శాఖ అధికారులు కొన్ని రోజులకే ఈ తనిఖీలను పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ట్రావెల్స్ బస్సుల ఇష్టారాజ్యం కొనసాగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కోతుల సమస్య పరిష్కరించే వారికే ఓటు..
వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రం వెల్దుర్తిలో గత కొన్నేళ్లుగా కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాగా పంచాయ తీ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో కో తులు, కుక్కల బెడద తొలగించిన అభ్యర్థులకే తాము మద్దతు ఇస్తామని సోషల్ మీడియా ద్వారా యువకులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలకులు, నాయకులు పట్టించుకోలేదని, ప్రస్తుతం ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు మందు, విందు, ఓటర్లను మభ్యపెట్టడానికి డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు ముందే వానరాలు, గ్రామ సింహాల బెడద తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీలు, ఇండిపెండెంట్ అనే తేడా లేకుండా సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చిన వారినే గెలిపిస్తామని చెబుతున్నారు. -
ఆ జీపీలు.. హాట్ గురూ!
● రూ. లక్షలు ఖర్చు పెట్టేందుకు సై అంటున్న సర్పంచ్ అభ్యర్థులు ● జిల్లాలో 24 పంచాయతీల్లో విస్తరించి ఉన్న కంపెనీలు ‘పారిశ్రామిక’ గ్రామాల్లో పల్లెపోరు ఆసక్తికరం మెదక్జోన్: పారిశ్రామిక ప్రాంతాలు ఉన్న గ్రామాల్లో పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. ఆ గ్రామాల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు పెద్దమొత్తంలో ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాగైనా గెలిచి తీ రాలని వ్యూహ రచన చేస్తున్నారు. జిల్లాలో నాలుగు మండలాల పరిధిలో 24 గ్రామాల్లో 207 పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. వీటిలో అత్యధికంగా మనోహరాబాద్ మండలంలో ఉండగా, అతి తక్కు వగా శివ్వంపేట మండలంలో ఉన్నాయి. శివ్వంపేట మండలంలోని నవాబుపేట, శభాష్పల్లి, దొంతి, మనోహరాబాద్లోని కాళ్లకల్, ముత్తిరెడ్డిపల్లి, కూచారం, రంగాయిపల్లి, కొండాపూర్, దండుపల్లి, చిన్నశంకరంపేట మండలంలో శంకరంపేట, చందంపేట, రుద్రారం, కామారం, అంబాజిపేట, మీర్జాపల్లి, ఖాజాపూర్, చేగుంట మండల కేంద్రం, రామంతాపూర్, చిన్నశివునూర్, కర్ణాన్పల్లి, వడియారం, పొల్లంపల్లి, రుక్మాపూర్లో కంపెనీలు ఉండగా, నాలుగు మండలాల పరిధిలో మొత్తం 263 కంపెనీలు వెలిశాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో పరిశ్రమలు వెలిసిన గ్రామ సర్పంచ్లు రూ. కోట్లు సంపాదించారని సమాచారం. ఈ పరిశ్రమలు వెలిసిన పల్లెల్లో పనిచేసిన తాజా మాజీలు గతంలో ప్రైవేట్ ఉద్యోగాలతో పాటు నెలజీతానికి షాపుల్లో విధులు నిర్వర్తించారు. వీరి జీతం అప్పట్లో ఐదెంకల లోపే. కానీ వారు సర్పంచ్లుగా గెలుపొందిన తర్వాత రూ. కోట్లు సంపాదించారని పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. గ్రామ శివారులో ఒక్క పరిశ్రమకు అనుమతి ఇస్తే రూ. లక్షలు పుచ్చుకుంటారని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా వీరి పరిధిలో గల కంపెనీల నుంచి ప్రతి నెల కొంత ప్రజాప్రతినిధులకు ముట్టజెప్పాల్సిందేనని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అందుకే పరిశ్రమలు గల గ్రామాల్లో సర్పంచ్గా బరిలో నిలిచే ఆశావహులు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. -
రెబెల్స్ బెడద
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025మెదక్ అర్బన్: గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టానికి తెరపడగా.. బుజ్జగింపుల ఎర మొదలైంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగాల్సి ఉన్నప్పటికీ, పార్టీల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్లో పలు చోట్ల రెబెల్స్ ప్రభావం కనిపిస్తుండగా, బీఆర్ఎస్లో అక్కడక్కడ రెబెల్స్ నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే పార్టీ నుంచి ఒక్కరి కన్నా ఎక్కువ అభ్యర్థులు నామినేషన్ వేసిన చోట, పార్టీ అధినేతలు రంగంలోకి దిగి బుజ్జగింపులకు దిగుతున్నారు. మాట వినకపోతే తమ వంతు సహకారం అందదని, భవిష్యత్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఓ నాయకుడు బహిరంగ సమావేశంలో హెచ్చరించారు. అయినా కాంగ్రెస్లో రెబల్స్ బెడద తప్పేలా కనిపించడం లేదు. అలాగే బీఆర్ఎస్లో సైతం అక్కడక్కడ ఒకే స్థానానికి ఇద్దరేసి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఒకే పార్టీలో ఉన్న పోటీదారుల నామినేషన్లను ఉపసంహరించుకునేలా పార్టీ నాయకులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తదుపరి రాజకీయ అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల స్థానిక నాయకులు, వివిధ రకాల ఆశలు చూపుతున్నట్లు సమాచారం. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3 వరకు అవకాశం ఉన్నందున, రెబెల్స్ను పోటీ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నా యని ప్రధాన అభ్యర్థులు ఆశపడుతున్నారు. మొదటి విడతలో 160 పంచాయతీలు జిల్లాలోని పాపన్నపేట, హవేళిఘణాపూర్, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పెద్దశంకరంపేట మండలాల్లో మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 160 పంచాయతీలు, 1,402 వార్డులకు డిసెంబర్ 11న ఎన్నికలు జరుగనున్నాయి. కాగా ఇప్పటికే నామినేషన్ల గట్టం ముగియగా, డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ ఉంటుంది.ప్రధాన పార్టీలకు తప్పని తిప్పలు -
పదవులు వేలం వేస్తే చర్యలు
కలెక్టర్ రాహుల్రాజ్ రామాయంపేట/నిజాంపేట(మెదక్): సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం వేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ హెచ్చరించారు. శనివారం ఆయన రామాయంపేట, నిజాంపేట ఎంపీపీ కార్యాలయాల్లో నామినేషన్ ఏర్పాట్లను పర్యవేక్షించి మాట్లాడారు. పోటీలో ఉన్న అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి భయబ్రాంతులకు గురి చేయడం నేరమన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు నూతన బ్యాంకు అకౌంట్లలోనే నమోదు చేయించాల్సి ఉంటుందన్నారు. రిజర్వేషన్ల పరిధిలో పోటీ చేసే అభ్యర్థులకు కులధ్రువ పత్రాలు త్వరగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆయ న వెంట మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజని, మండలాల ఎన్నికల అధికారులు సజీలుద్దీన్, వెంకట్ నర్సింహారెడ్డి ఉన్నారు. ఓటర్లు.. ఇది మీకోసమే.. మెదక్ కలెక్టరేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సమస్యలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చే శారు. ఇందులో ఒక అధికారి 24 గంటలు అందుబాటులో ఉండి పర్యవేక్షిస్తుంటారు. ప్రజలు చేసే ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు చేరవేస్తారు. ప్రజలు 9391942254 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. అభ్యర్థులు ఓటర్లను మభ్యపెట్టడం, తాయిలాలు, డబ్బుల పంపిణీ తదితర వాటిపై కంట్రోల్రూంకు ఫిర్యాదు చేస్తే అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. నాలుగు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం పెద్దశంకరంపేట(మెదక్): మండలంలోని నా లుగు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మాడ్చెట్పల్లిలో గాజు కుమార్, సంగారెడ్డిపేట బాలమణి, ఇసుకపాయల తండా దేవసోత్ కవిత, గట్టుకిందితండా మనోవత్ రాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా గ్రామాల సర్పంచ్ స్థానాలకు ఒకే నామినేషన్ రావడంతో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రజావాణి తాత్కాలిక వాయిదా మెదక్ కలెక్టరేట్: పంచాయతీ ఎన్నికలు ము గిసే వరకు ప్రజావాణిని తాత్కాలికంగా వా యిదా వేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెల్ప్డె స్క్ ద్వారా మాత్రమే ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హెల్ప్డెస్క్ ద్వారా సహకరించాలి చిన్నశంకరంపేట(మెదక్): ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సిబ్బంది కృషి చేయాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. శనివారం నార్సింగి మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందిలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి సందేహం వచ్చిన హెల్ప్డెస్క్ ద్వారా వారికి సహకరించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా సిబ్బంది కృషి చేయాలన్నా రు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రీతిరెడ్డి, తహసీల్దార్ గ్రేసిభాయి పాల్గొన్నారు. అలాగే చిన్నశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు. పకడ్బందీగా ఎన్నికలు పెద్దశంకరంపేట(మెదక్): జిల్లాలో పకడ్బందీ గా పంచాయతీ ఎన్నికల నిర్వహణ చేపడుతున్నట్లు జిల్లా వ్యయ పరిశీలకుడు జుల్ఫీ అన్నా రు. శనివారం పెద్దశంకరంపేటలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా ల ద్వారా ఎన్నికల ఖర్చు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఆదివారం పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తలు చేపట్టాలన్నారు. మొ దటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసిందన్నారు. అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివా స్, ఎంపీడీఓ షాకీర్అలీ, ఎస్ఐ ప్రవీణ్రెడ్డి, ఎంపీఓ క్రాంతికుమార్ పాల్గొన్నారు. -
చారిత్రక మలుపు.. దీక్షా దివస్
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డిమెదక్ మున్సిపాలిటీ: తెలంగాణ మలివిడత ఉద్యమంలో చారిత్రక ఘట్టం దీక్షా దివస్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమరుల స్థూపానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జునగౌడ్, జిల్లా నాయకులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించి నాయకులు కార్యకర్తలతో తిలకించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో కేసీఆర్ చేసిన త్యాగం, కృషి ఏనాడూ మరువలేనిదన్నారు. శ్రీకేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడోశ్రీ అన్న ధృఢ సంకల్పంతో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ప్రజా ఉద్యమానికి నూతన దిశను చూపిందని గుర్తుచేశారు. కేసీఆర్ సారథ్యంలో సబ్బండ వర్గాలన్నీ ఏకమై ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి అండగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
చివరి రోజు అట్టహాసంగా
అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గంలో శనివారం సర్పంచ్లు, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ నామినేషన్లను అట్టహాసంగా వేశారు. భారీగా ప్రజలను సమీకరించి ర్యాలీగా డప్పు చప్పు ళ్లతో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బంద్బస్తు ఏర్పాటు చేశారు. చట్టాలపై అవగాహన నారాయణఖేడ్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి శ్రీధర్ మంథా ని అన్నారు. నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. చట్టాలపై అవగాహన కల్పించారు. -
ఎన్నికల్లో సమష్టిగా పనిచేయండి
కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాల్లో ఐకమత్యంతో ఉండి అధిక స్థానాలు గెలవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శనివారం కౌడిపల్లిలో మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సర్పంచ్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఎన్నికల్లో దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కి ప్రజలను రైతులు, మహిళలు మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రామాగౌడ్, మాజీ ఎంపీపీ రాజు, నాయకులు చంద్రాగౌడ్ దుర్గారెడ్డి, నవీన్, అమర్సింగ్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
కష్టపడ్డ వారికి పదవులు
మెదక్జోన్: కాంగ్రెస్లో కష్టపడిన వారికి ఖచ్చితంగా మంచి అవకాశాలు లభిస్తాయని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి అన్నారు. శుక్రవారం టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అగ్రనేతలు రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి, మహేశ్కుమార్గౌడ్ యువతను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడాలన్నారు. త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ కార్యదర్శి భవ్యసింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువజన సంఘాల బలోపేతానకి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో యువత జాతీయ కార్యవర్గ సభ్యుడు మహేందర్రెడ్డి, నాయకులు సంతోశ్, తరుణ్, రామ చందర్రెడ్డి, యూత్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి -
సమన్వయంతో పనిచేయండి
హవేళిఘణాపూర్(మెదక్)/మెదక్ కలెక్టరేట్: అధికారులు సర్పంచ్ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా జరపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం హవేళిఘణాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్లు రెండో రోజు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా సాగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం చేసుకోవాలన్నారు. మొదటి విడత నామినేషన్లకు శనివారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సింధూరేణుక, ఎంపీడీఓ శ్రేయంత్, రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లాలోని ఎంపీడీఓలు, ఆర్ఓ, ఏఆర్ఓలతో గూగుల్ మీట్ నిర్వహించారు. నామినేషన్ దాఖలు చేసే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా కొత్త బ్యాంక్ అకౌంట్ అందజేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి నామినేషన్ను క్షుణ్ణంగా పరిశీలించి టీ–పోల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. రెండో ఫేజ్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
రెండో రోజు 338 నామినేషన్లు
మెదక్ కలెక్టరేట్: మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం రెండో కొనసాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 338 నామినేషన్లు దాఖలు అయినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సర్పంచ్ స్థానాలకు 152, వార్డ్ మెంబర్లకు 186 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు. అత్యధికంగా హవేళిఘణాపూర్ మండలంలో రెండో రోజు 114, అత్యల్పంగా అల్లాదుర్గ్లో 25 నామిషన్లు దాఖలు అయినట్లు వివరించారు.మండలం సర్పంచ్ వార్డు సభ్యులు అల్లాదుర్గం 14 11 హవేళిఘణాపూర్ 49 65 పాపన్నపేట 25 22 రేగోడ్ 18 11 పెద్దశంకరంపేట 17 40 టేక్మాల్ 29 37 -
డిపాజిట్ దక్కితేనే పరువు!
జహీరాబాద్: ఎన్నికల్లో ప్రధానంగా డిపాజిట్ అనే అంశం తరచూ చర్చకు వస్తుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల నేతలు డిపాజిట్ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుంటారు. డిపాజిట్ దక్కించుకుని అయినా పరువు కాపాడుకో అనే విషయాన్ని ఎదుటి పార్టీల అభ్యర్థులపై సె టైర్లు వేస్తూ ఉంటారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం డిపాజిట్ అనే పదానికి ప్రాముఖ్యత ఉంది. డిపాజిట్ కూడా రాకున్నా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాడంటూ ప్రత్యర్థులు వ్యంగ్యస్త్రాలు సంధిస్తుంటారు. కొందరు ఎన్నికల్లో డిపాజిట్ దక్కదని తెలిసినా ఎదుటి వ్యక్తిని ఓడించి ప్రతీకారం తీర్చుకునేందుకు అయినా పోటీకి దిగుతుంటారు. ఎన్నికల్లో గెలువకున్నా కనీసం డిపాజిట్ను అయినా దక్కించుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతుంటారు. డిపాజిట్ కథ గురించి తెలుసుకుంటే.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రిటర్నింగ్ అధకారికి నగదు రూపంలో కొంత డబ్బు డిపాజిట్ పెట్టాల్సి ఉంటుంది. డిపాజిట్కు సంబంధించిన రశీదును పొందిన తర్వాత నామినేషన్ పత్రానికి జత చేయాలి. లేని పక్షంలో నామినేషన్ పత్రాన్ని తిరస్కరిస్తారు. సర్పంచ్గా పోటీచేసే జనరల్ అభ్యర్థులు రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,000 వంతున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వార్డు సభ్యులుగా పోటీచేసే జనరల్ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.500 డిపాజిట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.1/6వ వంతు ఓట్లు రాకుంటే డిపాజిట్ గల్లంతే...ఎన్నికలు జరిగిన తర్వాత పోటీ చేసిన అభ్యర్థులకు పోలై, చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు రావాలి. అంతకన్నా తక్కువ వస్తే అతను డిపాజిట్ కోల్పోయినట్లు గుర్తిస్తారు. ఉదాహరణకు 500 ఓట్లు పోలై అన్ని చెల్లుబాటు అయ్యాయనుకుంటే పోటీచేసిన వారికి ఒక్కొక్కరికి 1/6వ వంతు అంటే 80 ఓట్లు రావాల్సి ఉంటుంది. అప్పుడు అతడికి డిపాజిట్ దక్కినట్లు. లేకపోతే డిపాజిట్ దక్కనట్లు అర్థం. 1/6వ వంతు లేదా అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోటీ చేసిన సమయంలో డిపాజిట్ చేసిన డబ్బులను తిరిగి ఇస్తారు. 1/6వ వంతు కన్నా తక్కువ వచ్చిన వారి డిపాజిట్ డబ్బులను ఇవ్వకుండా వాటిని పంచాయతీ డెవలప్మెంట్ ఫండ్లో జమ చేస్తారు. -
లీడర్.. కేడర్
పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగాపార్టీలు సమాయత్తం అవుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే ఆశావహులు, కార్యకర్తలతో నేతలు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో మంచి పేరుతో పాటు ఆర్థిక బలం ఉన్న వారిని పోటీలో నిలపాలని ప్యూహ రచన చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. – మెదక్జోన్జోరుగా చేరికలు స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీల్లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల రామాయంపేటకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంత మంది బీఆర్ఎస్ కా ర్యకర్తలు ఈనెల 30న చిన్నశంకరంపేట మండల కేంద్రంలో జరిగే సమావేశంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. అలాగే అధికా ర కాంగ్రెస్తో పాటు బీజేపీ నుంచి కొందరు ముఖ్య నేతలు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.స్థానిక ఎన్నికలపై పార్టీల నజర్● కార్యకర్తలతో జోరుగా సమావేశాలు ● గెలుపే లక్ష్యంగా వ్యూహాలుజిల్లాలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొదటి విడతలో ఆరు మండలాల్లో ఎన్నికల నిర్వహణకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈక్రమంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నేతలు ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జిలు, రాష్ట్ర నేతలు ఎన్నికల బరిలో నిలిచే ఆశావహులతో పా టు ముఖ్య కార్యకర్తలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నుంచి ఒక్కరు మాత్రమే పోటీ చేయాలని, గ్రూపులుగా ఏర్పడి నష్టం చేయొ ద్దని దిశా నిర్దేశం చేస్తున్నారు. సర్పంచ్గా అవకాశం దక్కని వారికి పరిషత్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. సంక్షేమ పథకాలపై హస్తం ధీమా రెండేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్, సన్న వడ్లకు బోనస్, 200 యూ నిట్ల ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు.. ఇలా సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారు కాంగ్రెస్ను ఆదరిస్తారని ధీమాగా ఉన్నారు. వీటిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని అభ్యర్థులకు, కార్యకర్తలకు సూచిస్తున్నారు. అమలు కాని హామీలపై కారు గురి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. మహిళలకు రూ. 2,500, ఆసరా పింఛన్ పెంపు, పూర్తిస్థాయిలో కాని రుణమాఫీ, పేదింటి వధువు పెళ్లికి తులం బంగారంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయలేదని, ఈ మోసాన్ని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పోటీకి సై అంటున్న కమలం కాంగ్రెస్, బీఆర్ఎస్లు రెండు ప్రజలను మోసం చేశాయని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. పంచాయతీల అభివృద్ధితో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి ఎన్నికల్లో ఓట్లు అడగాలని కార్యకర్తలకు వివరిస్తున్నారు. మెజార్టీ సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్నికల ‘కిక్కు’
● డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం ● పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వ్యాపారుల్లో జోష్ ● వచ్చే నెల 17 వరకు లిక్కర్కు ఫుల్ డిమాండ్మెదక్ అర్బన్: కొత్త లిక్కర్ షాపులకు.. స్థానిక ఎన్నికల కిక్కు కలిసొచ్చింది. చివరి లక్కీ డ్రాప్స్ అమ్మకాల వేటలో పాత వారు.. డక్కెన్ ఓపెన్తో భారీ బోణి కొట్టాలని కొత్త యజమానులు ఆశపడుతున్నారు. ఈనెల 25న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, డిసెంబర్ 17 వరకు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. వీరికి ఈనెల 30నే మద్యం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 49 వైన్ షాపులు జిల్లాలో 49 వైన్ షాపులకు గత నెల 27న లక్కీ డ్రా నిర్వహించారు. డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్షాపులు ప్రారంభం కానున్నాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నో టిఫికేషన్ వెలువడింది. కాగా జిల్లాలో మొత్తం 492 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 17 వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుండగా, మద్యం విచ్చలవిడిగా ప్రవహించే అవకాశం ఉంది. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాల వరకు నిత్యం పండగే ఉంటుంది. లిక్కర్ కిక్.. గుడ్ లక్ జిల్లాలో లిక్కర్ షాపులు దక్కించుకోవడానికి సిండికేట్ వ్యాపారులు గత నెల 23 వరకు వందల కొద్ది దరఖాస్తు చేశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున లక్షలాది రూపాయలు వెచ్చించారు. కొన్ని సిండికేట్లకు ఒక్క షాపు కూడా దక్కకపోగా, మరికొంత మందికి కేవలం ఒకటి, రెండు షాపులు లాటరీలో తగిలాయి. కాగా షాపులు దక్కించుకున్న వారికి ఆదిలోనే ఎన్నికలు తగలడంతో ఆనందం వ్యక్తమవుతుంది. సాధారణంగా మధ్య తరగతి షాపుల్లో నెలకు సుమారు రూ. 2.5 కోట్ల వరకు లిక్కర్ అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ ఎన్నికల వేళ సుమారు రూ. 5 నుంచి రూ. 6 కోట్ల వరకు విక్రయాలు జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభం కానున్న నేపథ్యంలో యజమానులు ఇప్పటికే షాపులు కిరాయి తీసుకున్నారు. కౌంటర్లు, షోకేజ్లు, బాటిల్ కూలర్లు సిద్ధం చేసుకొని ఎదురు చూస్తున్నారు. కాగా పాత యజమానులు కూడా, ఈ మూడు రోజుల్లో పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి, ఎన్నికల వేళ బ్లాక్లో అమ్ముకోవడానికి సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఎకై ్సజ్ అధికారులు దృష్టిసారిస్తే అక్రమ మద్యం అమ్మకాలు అరికట్టే అవకాశం ఉంటుంది. -
మెజార్టీ స్థానాలు గెలవాలి
నర్సాపూర్/కౌడిపల్లి(నర్సాపూర్): స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పా టు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సమష్టిగా ఉంటూ మండలంలో మె జార్టీ స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. పార్టీ తరఫున పోటీ చేసే ప్రతి ఒక్కరికి తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, మాజీ జెడ్పీటీసీ బబియానాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని తునికి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు శుక్రవారం హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి -
‘స్థానికం’లో సత్తా చాటాలి
నర్సాపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి ఎక్కువ స్థానాలు గెలుపొందాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ సూచించారు. శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా స్థానిక ఎన్నికలు, పార్టీ బలోపేతం చర్చించారు. ఈసందర్భంగా ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. పీసీసీ చీఫ్ను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తదితరులు ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాలపై నిఘా కౌడిపల్లి(నర్సాపూర్): సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ కౌంటర్లు, కౌడిపల్లి, తునికి, వెంకట్రావుపేట, తిమ్మాపూర్, వెల్మకన్న తదితర సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిమ్మాపూర్లో పోలింగ్ కేంద్రం శిథిల పాఠశాల భవనంలో ఉందని, నూతన పాఠశాల భవనంలోకి మార్చే అవకాశాన్ని పరిశీలించాలని తహసీల్దార్ కృష్ణకు సూచించారు. ఆయన వెంట సీఐ జాన్రెడ్డి, ఎస్ఐ మురళి, ఎంపీఓ రామారావు, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్రెడ్డి ఉన్నారు. వరి కొయ్యలు కాల్చొద్దు చిన్నశంకరంపేట(మెదక్): పంట పొలాల్లో వరి కొయ్యలు కాల్చొద్దని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అంబాజిపేటలో వరి కోతలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి కొయ్యలు కాల్చడం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువని గ్రహించాలన్నారు. భూసారం దెబ్బతిని మిత్ర పురుగులు సైతం మృతి చెందుతాయన్నారు. వరి కొయ్యలను దుక్కిలోనే దున్నడం ద్వారా ఎరువుగా మారి పంటకు బలం చేకూరుతుందని వివరించారు. ఆయన వెంట ఏఓ ప్రవీణ్కుమార్, ఏఈఓ విజృంభణ ఉన్నారు. టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ప్రణీద్కుమార్ రామాయంపేట(మెదక్): తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) జిల్లా అధ్యక్షుడిగా ప్రణీద్కుమార్ రెండోసారి ఎన్నికయ్యారు. రామాయంపేటలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా నర్సింగరావు, గౌరవాధ్యక్షుడుగా ఐలయ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా మోహన్శర్మ, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శిగా విఠోభా, ఉపాధ్యక్షులుగా అబ్ధుల్ రశీద్, వెంకటేశ్, దేవరాజ్, రమేశ్, పరమేశ్, ప్రవీణ్, కార్యదర్శులుగా వినయ్, ప్రమోద్, హరీశ్, జా కీర్, చిరంజీవిని ఎన్నుకున్నారు. వీరితో పాటు సంఘం రాష్ట్ర కౌన్సిలర్లుగా ఐలయ్య, వెంకన్న, అజయ్, పవన్కుమార్, శ్రీనివాస్, వెంకట్రెడ్డిని ఎన్నుకున్నారు. నేడు దివ్యాంగులకు క్రీడా పోటీలు మెదక్ కలెక్టరేట్: దివ్యాంగులకు శనివారం ఆ టల పోటీలు నిర్వహించనున్నట్లు డీడబ్ల్యూఓ హేమాభార్గవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అవుట్ డోర్ స్టేడియంలో ఆటల పోటీలు ఉంటాయని తెలిపారు. పరుగు పందెం, షాట్పుట్, చెస్, క్యారమ్స్, జవేలిస్ త్రో తదితర పోటీలు ఉంటాయన్నారు. -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
రామాయంపేట(మెదక్): 132/33 కేవీ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా శనివారం రామాయంపేట, నిజాంపేట మండలాల్లో విద్యు త్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్శాఖ ఏడీఈ ఆదయ్య పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా, లైన్కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, కరెంటు తీగల మార్పు వంటివి చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో రామాయంపేట పట్టణం, డబుల్బెడ్రూం కాలనీ, కాట్రియాల, లక్ష్మాపూర్, ఝాన్సిలింగాపూర్, నిజాంపేట మండలంలోని బచ్చురాజ్పల్లి, నిజాంపేట సబ్స్టేషన్ల పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. సకాలంలో వైద్య సేవలందించాలి మనోహరాబాద్(తూప్రాన్): 108 సిబ్బంది క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందించేలా కృషి చేయాలని జిల్లా 108 కో–ఆర్డినేటర్ రవికుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. బాధితులకు అందుబాటులో ఉండి వైద్యం అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట వైద్యులు సమత, 108 సిబ్బంది శివ, రమేష్ తదితరులు ఉన్నారు. -
గెలుపు గుర్రాల వేట
స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్చిన్నశంకరంపేట(మెదక్): స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాల వైపు అధికార పార్టీ దృష్టి సారించింది. మెదక్ నియోజవర్గంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే సర్పంచ్ అభ్యర్థుల వివరాలను సేకరించిన కాంగ్రెస్ నాయకులు గెలుపు అవకాశం ఉన్నవారి వైపు మొగ్గు చూపుతున్నారు. బలమైన అభ్యర్థి ప్రత్యర్థి పార్టీలో ఉంటే తమ పార్టీలోకి వచ్చేలా పావులు కదుపుతున్నారు. ఇందుకు కాంగ్రెస్లోని ఓ ముఖ్య నాయకుడికి బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా ఇప్పటికే చిన్నశంకరంపేట, మెదక్, హవేళిఘణా పూర్, రామాయంపేట, నిజాంపేట మండలాల్లోని ముఖ్యమైన గ్రామాల్లో గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులను అన్వేషిస్తున్నారు. చిన్నశంకరంపేట మ ండల కేంద్రంలో ఇండిపెండెంట్గా బరిలో దిగేందుకు సిద్ధమైన ఓ అభ్యర్థిని అధికార పార్టీలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే రామాయంపేట మండలంలోని అక్కన్నపేట, జాన్సిలింగాపూర్, ధర్మారం గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. మెదక్ మండలంలోనూ పలువురు నాయకులు అధికార పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా మండల కేంద్రాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఓ ముఖ్య నాయకుడు తెలిపారు.‘మైనంపల్లి’ ప్రత్యేక ఫోకస్ రామాయంపేట(మెదక్): పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకుల జంపింగ్ కార్యక్రమం ఊపందుకుంది. ఈమేరకు బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు సీనియర్ నా యకులు ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సిద్దరాంరెడ్డి, ప్రముఖ ఆయు ర్వేద వైద్యుడు, ఝాన్సిలింగాపూర్ మాజీ సర్ప ంచ్ మానెగల్ల రామకిష్టయ్య శుక్రవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పార్టీలోకి ఆహ్వానించారు. రెండు గ్రామాల్లో ఇద్దరు పేరున్న నా యకులు కాంగ్రెస్లో చేరడంతో ఆపార్టీకి లాభం చేకూరుతుందని పలువురు చర్చించుకు ంటున్నారు. వీరితోపాటు మరికొందరు నాయకులను సైతం కాంగ్రెస్లో చేర్చుకోవడానికి మైనంపల్లి ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం. -
విజయమే లక్ష్యంగా పనిచేయాలి
హత్నూర( సంగారెడ్డి): పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి కార్యకర్తలకు సూచించారు. గురువారం హత్నూర మండలం మంగాపూర్లో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. పా ర్టీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం మరింత పెరగాలని, విభేదాలు పక్కన పెట్టి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ అభ్యర్థుల విషయమై గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తల సమక్షంలోనే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సునీతా రెడ్డి సూచించారు. సమావేశంలో కార్మిక సంక్షేమ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు, మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.కార్యకర్తలకు ఎమ్మెల్యే సునీతారెడ్డి ఉద్బోధ -
నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి
అబ్జర్వర్ భారతి లక్పతినాయక్పాపన్నపేట(మెదక్)/రేగోడ్/పెద్దశంకరంపేట/హవేళిఘణాపూర్/అల్లాదుర్గం: గ్రామ పంచాయతీ నా మినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ అన్నారు. గురువారం పాపన్నపేట, పెద్దశంకరంపేట, హవేళిఘణాపూర్, అల్లాదుర్గం, రేగోడ్ లో పర్యటించారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా, అవసరమైన ధ్రువపత్రాలు అన్నీ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫారం పూర్తి చేసే క్రమంలో అభ్యర్థులకు సహకరించాలని సూచించారు. హవేళిఘణాపూర్లో ఎస్పీ శ్రీనివాసరావు నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు గురించి అ డిగి తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, అధికారులు సిబ్బంది ఉన్నారు. -
నాణ్యమైన విత్తనాలే విక్రయించాలి
డీఏఓ దేవ్కుమార్కౌడిపల్లి(నర్సాపూర్): రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలని డీఏఓ దేవ్కుమార్ డీలర్లను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలో కౌడిపల్లి, నర్సాపూర్ డివిజన్ పరిధిలోని ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి కోసం అధికారులు, డీలర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి సాధ్యమని చెప్పారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 3.17 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానుండగా, అత్యఽధికంగా వరి 2.95 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. దీనికి గాను 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని గుర్తించినట్లు చెప్పారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు అందోళన చెందవద్దన్నారు. ఈపాస్ మిషన్ల ద్వారానే ఎరువులు అమ్మాలని, అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఏడీఏలు వినయ్, పుణ్యవతి, సంధ్యారాణి, ఏఓలు, డీలర్లు పాల్గొన్నారు. -
వసూల్ రాజాలు
రోడ్ కింగ్లు.. ఆర్టీఏలో అవినీతి చీడ!మెదక్ ఆర్టీఏ కార్యాలయంమెదక్ ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుంది. రోడ్కింగ్లుగా చెలామణి అవుతున్న బాస్లు.. వసూల్ రాజాలుగా మారారు. ఒక్కో సేవకు, ఒక్కో రేటు నిర్ణయించి వాటా లేసి పంచుకుంటున్నారు. కార్యాలయ పరిధిలో పని చేసే ఇద్దరు ఏజెంట్లు బ్రోకర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా అధికారులకు అందజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే ఈ అవినీతి దందా మరకలు ప్రత్యక్షంగా తమకు అంటకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. – మెదక్ అర్బన్ జిల్లాలోని 21 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల వాహనదారులకు సేవలందించేందుకు మెదక్ పట్టణంలో ఆర్టీఏ కార్యాలయం ఉంది. సామాన్యుడి జీవితంలో వాహనాలు భాగం కావడంతో ప్రతి రోజు కార్యాలయం కిటకిటలాడుతోంది. వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, యాజమాన్య మార్పిడి తదితర సేవలకు సంబంధిత రుజుపత్రాలతో చలాన్లు కట్టి దరఖాస్తు చేస్తే, వాటి ని పరిశీలించి సేవలు అందించాలి. కానీ ‘శంఖులో పోస్తేనే తీర్థం అన్నట్లు.. బ్రోకర్ల ద్వారా వస్తే నే’ పని చేస్తున్నారు. లేకుంటే ఏదో ఒక పేపర్ లేదంటూ తిరస్కరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో చేసేది లేక వినియోగదారులు బ్రోకర్లను సంప్రదిస్తున్నారు. వారు కమీషన్లు వసూలు చేసి, కోడ్ నంబర్తో దరఖాస్తును పంపిస్తున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని జరిగిపోతుంది. వారి రూటే సప‘రేటు’ ఆర్టీఏ కార్యాలయంలో ఒక్కో సేవకు ఒక్కో రేటు నిర్ణయించి వాహనదారులను నిలువు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వివిధ రకాల వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ కోసం అదనంగా రూ. 550, నుంచి రూ. 1,200 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. లైసెన్స్ రెన్యువల్ రూ. 300, ఎక్స్పైరీ లెసెన్స్ రూ. 800 వరకు అధికారులకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ వాహనాల రిజిస్ట్రేషన్లకు రూ. 350 నుంచి రూ. 6 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. వాహనాల ఫిట్నెస్కు ఆటోకు రూ. 600, ట్రాక్టర్, ట్రాలీ రూ. 1,200, బస్ కెపాసిటీని బట్టి రూ. 5 వేల వరకు, హెవీ మోటర్ వెహికిల్, జేసీబీ, క్రేన్, హార్వెస్టర్ రూ. 3 వేల వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈవిషయమై ఏటీఓను వివరణ కోరడానికి పలుమార్లు సంప్రదించగా, అందుబాటులోకి రాలేదు. ఏఓను వివరణ కోరగా ఈ విషయంలో ఏటీఓను సంప్రదించాల్సిందిగా సూచించారు. -
తొలిరోజు 59 నామినేషన్లు
వడ్డీలేని రుణాలు.. మాకేవి?పట్టణాల్లోని మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయకపోవడంతో నిరాశ చెందుతున్నారు. వివరాలు 8లో uసర్పంచ్కు 55, వార్డు స్థానాలకు 4 దాఖలుమెదక్కలెక్టరేట్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటిరోజు 55 సర్పంచ్, 4 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం రాత్రి నామినేషన్ల వివరాలు వెల్లడించారు. అల్లాదుర్గం మండలంలో సర్పంచ్కు 5, రేగోడ్లో 7, పెద్దశంకరంపేటలో 8, టేక్మాల్లో సర్పంచ్ 5, వార్డు సభ్యులు 1, పాపన్నపేట మండలంలో సర్పంచ్ 15, హవేళిఘణాపూర్లో సర్పంచ్ 16, వార్డు సభ్యులు 3 చొప్పున నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల వర కు సమయం ఉందని తెలిపారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పా టిస్తూ నిర్ణీత సమయంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు అన్ని రిటర్నింగ్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికలు ప్రక్రియ పర్యవేక్షణకు నోడల్ అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలన్నారు. ఫిర్యాదులకు 24 గంటలు పని చేసే విధంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం 9391942254 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. -
బీసీలకు తగ్గాయ్!
గతంతో పోలిస్తే తగ్గిన స్థానాలు‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈఏడాది సెప్టెంబర్లో ప్రభుత్వం గెజిట్ విడుదల చేయగా, రేగోడ్ మండలం ప్యారారం పంచాయతీ బీసీకి రిజర్వ్డ్ అయింది. హైకోర్టు అభ్యంతరం చెప్పడంతో పాత రిజర్వేషన్ అమలు చేయగా, ప్రస్తుతం అన్రిజర్వ్డ్ (యూఆర్) కేటాయించారు. ప్రస్తుతం ఆ గ్రామంలోని ఓసీలు పోటీకి సిద్ధం అయ్యారు. ఇలాంటి గ్రామాలు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నాయి’. మెదక్జోన్: జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 71 గ్రామాలు వందశాతం (ఎస్టీ) గిరిజనులు ఉండటంతో వాటిని ఎస్టీలకే కేటా యించగా, మిగితా 421 గ్రామాలను వివిధ వ ర్గాలకు రిజర్వేషన్ల వారీగా కేటాయించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకారం 176 సీట్లు లభించాయి. హైకోర్టు అభ్యంతరం చెప్పటంతో పాత రిజర్వేషన్ ప్రకారం ప్రస్తుతం బీసీలకు దక్కిన రిజర్వేషన్లను అన్ రిజర్వ్డ్కు కేటాయించారు. దీంతో జిల్లాలో జనరల్ సీట్ల సంఖ్య ఏకంగా 215కు పెరిగింది. 2011 జనాభా ప్రాతిపదికన పాత పద్ధతిని అవలంభిస్తూ బీసీలకు 25.65 శాతం రిజర్వేషన్ ప్రకారం ప్రస్తుతం 108 సీట్లు మాత్రమే వర్తించాయి. కాగా 2019లో జరిగిన ఎన్నికల్లోనూ బీసీలకు 29 శాతం రిజర్వేషన్ కేటాయించగా, 120 సీట్లు దక్కాయి. గతంతో పోలిస్తే బీసీలకు ప్రస్తుతం 3.35 శాతం రిజర్వేషన్ తగ్గటంతో 12 స్థానాలు తగ్గాయి. పార్టీపరంగా ప్రాధాన్యం ఏదీ? స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల 50 శాతం మించరాదని హైకోర్టు పేర్కొనడంతో యూ టర్న్ తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కోర్టులు అడ్డుచెప్పినా తామూ పార్టీపరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పారు. కాగా మొదటి విడత నామినేషన్ల పర్వం ప్రారంభం అయినప్పటికీ బీసీల ప్రస్తావన ఎక్కడా రావ డం లేదు. గ్రామాలకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం ఆయావర్గాల వారు నామినేషన్లు వేస్తున్నారు. ఆ స్థానాల్లో పోటీకి బీసీలు నిరాకరణ బీసీలకు 25.65 శాతం రిజర్వేషన్ ప్రకారం 108 స్థానాలు, ఎస్సీలకు 77 శాతం కేటాయించారు. మిగితా 215 స్థానాలను అన్రిజర్వ్డ్(యూఆర్)కు కేటాయించటంతో జనరల్ స్థానాల్లో ఓసీలే పోటీకి సిద్ధమయ్యారు. ఆ స్థానాల్లో బీసీ లు పోటీచేసేందుకు జంకుతున్నారు. ఎందుకంటే వారు మొదటి నుంచి ఆర్థికంగా, రాజకీయంగా ఆరితేరిన వారు ఉండటంతో గెలవటం సాధ్యం కాదనే భావన బీసీల్లో ఉంది. ఒక్కరమే పోటీలో నిలుద్దాం చిన్నశంకరంపేట(మెదక్): ‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు మనం ఒక్కటవుదాం.. ఒక్కరమే పోటీలో నిలుద్దాం’ అంటూ పల్లెల్లో కుల సంఘాలు ఐక్యతారాగం వినిపిస్తున్నాయి. మన కులం నుంచి ఒకరిని మాత్రమే పోటీలో నిలిపి గెలిపించుకుందాం అంటూ కొత్త నినా దం ఎత్తుకున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బలమైన వర్గంగా ఉన్న ముదిరాజ్ లు పోటీదారులను గుర్తించి ఒక్కతాటిపైకి తీసు కొచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం జరిపిన చర్చలలో 9 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో ఉంటామని ముందుకు రాగా, గురువారం ఉదయం నుంచి జరిగిన సమావేశంలో ఆ సంఖ్య ముగ్గరికి వచ్చి ంది. నామినేషన్లు వేసేందుకు మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉందని, అప్పటిలోగా ఒకరిని మాత్రమే పోటీలో నిలుపుతామని ముదిరాజ్ సంఘం పెద్దలు తెలిపారు. ఇప్పటికే చిన్నశంకరంపేట మేజర్ పంచాయతీలోని కుర్మ పల్లిలో యాదవ సంఘం సభ్యులు ఒక్కతాటిపైకి వచ్చారు. 12వ వార్డుకు చెందిన పుల్ల ఎల్లం భార్య కనకవ్వను పోటీలో దించేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ వా ర్డులో ఒక వర్గం ఓట్లు 80 శాతం కావడంతో ఇతరులు పోటీకి రారని భావిస్తున్నారు. 4వ వార్డులో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు, రెండు రోజులుగా చర్చలు జరిపి జాకీర్ అనే యువకుడిని బరిలో నిలిపేందుకు తీర్మానించారు. -
ఎన్నికల నియమావళి పక్కాగా అమలు
కలెక్టర్ రాహుల్రాజ్ రేగోడ్(మెదక్)/అల్లాదుర్గం/టేక్మాల్/పెద్దశంకరంపేట: ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, పెద్దశంకరంపేటలో నామినేషన్ల ప్రక్రియ ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో 160 సర్పంచ్, 1,402 వార్డు స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, పై అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమాదేవి, సిబ్బంది ఉన్నారు. అందుబాటులో ‘టీ– పోల్’ మెదక్ కలెక్టరేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం టీ–పోల్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని ఓటర్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. గురువారం నుంచి యాప్ ప్రజలకు అందుబాటులో ఉంది. ఇందులో ప్రధానంగా పౌరులు తమ పోలింగ్స్టేషన్ వివరాలు తెలుసుకోవడంతో పాటు ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్నికల కమీషన్ తెలిపింది. దీంతో పాటు యాప్ ద్వారా ఫిర్యాదులు కూడా చేయడంతో పాటు ట్రాక్ చేయవచ్చని పేర్కొంది. -
కొత్త బ్యాంకు అకౌంట్ తప్పనిసరి: ఆర్డీఓ
తూప్రాన్: సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నూతన బ్యాంకు అకౌంట్ లే దా పోస్టాఫీస్ అకౌంట్ను తమ నా మినేషన్ పత్రంతో పాటు సమర్పించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి సూచించారు. గురు వారం ఆయన మాట్లాడుతూ.. తూప్రాన్ డివిజన్ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీలు, వార్డు స్థానాలకు ఈనెల 30 నుంచి నామినేషన్లను ఆయా ఎంపీడీఓ కా ర్యాలయంలో స్వీకరిస్తారని తెలిపారు. వెల్దుర్తి, మాసాయిపేట మండలాలు మూడో విడతలో ఉన్న నేపథ్యంలో ఈ ఆదివారం ఆ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదని తెలిపారు. నామినేషన్ వేయడానికి ఆది, సోమ, మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించండి మెదక్కలెక్టరేట్: తమకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు గురువారం డీపీఓ యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము ఎన్నికల విధుల్లో ఉన్నందున ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఫోరం జిల్లా అధ్యక్షుడు జంగం నగేశ్కుమార్, ప్రచార కార్యదర్శి ముత్యాల నర్సింలు, ప్రభాకర్, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి మెదక్జోన్: న్యాయవాదుల కోసం రక్షణ చట్టం అమలు చేయాలని సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కోర్టులో న్యాయవాదులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా పోటీలో ఉన్న తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో న్యాయవాదులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి సంక్షేమం, ఆర్థిక భద్రత కోసం నెలకు రూ. 5 నుంచి రూ. 10 వేల వరకు స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈవిషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాములు, సీనియర్ న్యాయవాది పోచయ్య, సుభాశ్గౌడ్, రవీందర్, జనార్దన్రెడ్డి, రాఘవులు, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్య: డీఈఓ మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందుతుందని డీఈఓ విజయ అన్నారు. గురువారం మెదక్ పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈసందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి పఠనా సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలను అందించనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన బోధన అందిస్తున్నామన్నారు. జిల్లాలో విద్యా ప్రమాణా లు పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులతో మా ట్లాడారు. సెల్ఫోన్ వాడకం, టీవి చూడటం తగ్గించి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. -
బ్రోకర్ల రాజ్యం.. వసూళ్ల కేంద్రం
మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్, పెద్దశంకరంపేట మండలాల్లో సుమారు 30 వరకు బ్రోకర్ కార్యాలయాలు ఉన్నాయి. వీరి నుంచి ఆర్టీఏ అధికారుల వాటాలు వసూలు చేయడానికి మెదక్లో ఇద్దరు ఏజెంట్లు ఉన్నారు. వారి ద్వారా రోజు వారీగా ఇద్దరు అధికారులకు గుట్టుచప్పడు కాకుండా, నిర్ణయించిన ప్రదేశాల్లో మామూళ్లు ముడుతుంటాయి. కార్యాలయంలో పని చేసే ఇద్దరు అధికారులు కొంత మిగిలించుకొని, మిగితావి వంతుల వారీగా వివిధస్థాయి అధికారులకు పంపకాలు చేస్తున్నట్లు సమాచారం. టూవీలర్కు లెర్నింగ్, పర్మనెంట్ లైసెన్స్ కోసం సుమారు రూ. 1,550 చలాన్ కట్టాలి, కానీ బ్రోకర్ రూ. 3,200 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే టూ, ఫోర్వీలర్ కలిపి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే రూ. 2,025 చలాన్ కట్టాలి. కానీ రూ. 4,200 వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో నుంచి రూ. 300 వరకు బ్రోకర్ తీసుకొని, మిగితావి ఏజెంట్లకు, వారి ద్వారా అధికారులకు ముడుతున్నట్లు సమాచారం. -
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి
డీఈఓ విజయచేగుంట(తూప్రాన్): విద్యార్థులు తల్లిదండ్రులతో సమానంగా గురువులను గౌరవించి, బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని డీఈఓ విజయ అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని పీఎంశ్రీ ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రా జ్యంగ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంంగం ప్రపంచానికే ఆదర్శమన్నారు. రాజ్యాగంలోని అంశాలైన హక్కు లు విధులను ప్రతి ఒక్క విద్యార్థి అర్థం చేసుకొని పాటించాలని సూచించారు. రాజ్యాంగం రచించిన కమిటీ సభ్యుల వివరాలను సేకరించి ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేసిన సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు లక్ష్మణ్, నర్సింలు, ప్రసాద్రెడ్డిని అభినందించారు. విద్యార్థులు బాగా చదివేందుకు ఉపాధ్యాయులు మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడితే తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంఓ సుదర్శనమూర్తి, ఎంఈఓ నీరజ, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్, ఉపాధ్యాయులు రఘుపతి, సుధాకర్రెడ్డి, రాధ, సరస్వతి, రమ, వెంకటేశ్, మనోహర్రావు, సుధా కర్తో పాటు పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సం‘గ్రామమే’
మెదక్ కలెక్టరేట్: పంచాయతీ ఎన్నికల తొలి ఘ ట్టానికి వేళయింది. గురువారం ఎన్నికల మొ దటి విడత నోటిఫికేషన్ విడుదలతో పాటు నా మినేషన్ స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మూడు రోజుల పాటు ఆయా గ్రామాలకు కేటాయించిన కేంద్రాల్లో అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరణ , 30 వరకు పరిశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు, 2న పరిష్కారం, 3న ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. 147 మంది రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరణకు 147 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు. రిటర్నింగ్ అధికారుల కేంద్రాల్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. నామినేషన్లో ఖచ్చితంగా తేదీ, సమయం, క్రమసంఖ్య నమోదు చేయాల్సి ఉంది. అభ్యర్థి సంతకం, ధ్రువీకరణ ప్రతిపాదన చేసిన వ్యక్తి సంతకం తప్పనిసరి. కాగా జిల్లాలో మొదటి విడతలో 160 గ్రామ పంచాయతీలు, 1,402 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈమేరకు ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆర్ఓలకు శిక్షణ ఇప్పటికే ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చారు. జోనల్, మండల ఆఫీసర్లు, ఎంసీసీ నోడల్ ఆఫీసర్లు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీంలను నియమించి శిక్షణ పూర్తిచేశారు. అన్ని ఆర్ఓ కార్యాలయాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. కాగా మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్న మండల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ బుధవారం పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ, ఇతర వివరాలు తెలిపే బో ర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ -
రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిద్దాం
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్కలెక్టరేట్/పాపన్నపేట/టేక్మాల్: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ రా జ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రాజ్యాంగంలో పొ ందుపరిచిన అంశాలకు అనుగుణంగా నడుచుకుంటామని అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, కలెక్టరేట్ ఏఓ యూనస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమి షనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా అఽ దికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని ఆదేశించారు. నేటి నుంచి జిల్లాలో జరుగనున్న ఎన్నికల ప్రక్రియను అధికారులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు జరిగే ప్రతీ ప్రక్రియ పైన సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పాపన్నపేట, టేక్మాల్ మండలాల్లోని మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
చెరకు రైతులకు తీపి కబురు
● కొత్త యాజమాన్యం చేతుల్లోకి ‘ట్రైడెంట్’ ● జనవరిలో క్రషింగ్కు కసరత్తు జహీరాబాద్: జహీరాబాద్లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లినట్లు సమాచారం. అయితే.. ఈ విషయమై యాజమాన్యం మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. మహారాష్ట్రకు చెందిన ఓ బడా సంస్థ కర్మాగారాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో క్రషింగ్ను చేపట్టేందుకు వీలుగా కొత్త యా జమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్మాగారంలో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ విషయాన్ని కార్మిక వర్గాలు సైతం ధృవీకరించాయి. కర్మాగారంలో క్రషింగ్ నిర్వహించేందుకు యాజమాన్యం చేతులెత్తేయడంతో మూడేళ్లుగా మూత పడింది. దీంతో జహీరాబాద్ జోన్ పరిధిలో ఉన్న సుమారు 8లక్షల టన్నుల చెరకు పంట రాష్ట్రంలోని గణపతి, కొత్తకోట, మాగి తదితర కర్మాగారాలకు తరలించారు. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సైతం రైతులు చెరకు ఉత్పత్తులను తరలించుకుని విక్రయాలు చేసుకోక తప్పలేదు. 2020–21 సీజన్లో ట్రైడెంట్ యాజమాన్యంలో క్రషింగ్ చేపట్టక పోవడంతో మూతపడింది. 2022–23 సీజన్కు గాను కర్మాగారంలో క్రషింగ్ నిర్వహించారు. అప్పట్లో 2.55లక్షల టన్నుల చెరకు ను కర్మాగారం క్రషింగ్ జరిపింది. అనంతరం యా జమాన్యం రైతులకు బిల్లులు వాయిదాల రూపంలో చెల్లిస్తూ పోయింది. అయినా రూ.9 కోట్ల బిల్లులు రైతులకు బకాయి పడింది. అధికార యంత్రాంగం కర్మాగారాన్ని వేలం వేసి రైతులకు చెల్లించేందుకు సిద్ధపడింది. దీంతో వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఎట్టకేలకు యాజమాన్యం బకాయి లు చెల్లిస్తూ వచ్చింది. ఇంకా రూ. 9 లక్షల మేర రైతుల బిల్లులు బకాయి ఉన్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో క్రషింగ్ కర్మాగారంలో ఉన్న యంత్రాలను యాజమాన్యం తరలించే ప్రయత్నం చేయడంతో తాము అభ్యంతరం చెప్పి నిలిపివేసినట్లు జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్ వెల్లడించారు. ప్రస్తుతం మహారాష్ట్రకు చెందిన సంస్థ కర్మాగారాన్ని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. కర్మాగారంలో మరమ్మతులు పనులు ప్రారంభం అయ్యాయని, జనవరిలో క్రషింగ్ను మొదలు పెట్టే విధంగా కొత్త యాజమాన్యం కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు. వచ్చే సీజన్లో పూర్తి స్థాయిలో క్రషింగ్ నిర్వహిస్తామన్నారు. -
ఎన్నికలకు పైసలెట్ల..?
‘పంచాయతీ’పై ‘రియల్’ ప్రభావం ● భూములు, ప్లాట్ల ధరలు పడిపోవడంతో ఆశావహుల్లో నిరాశ ● అమ్మకాల్లేక నిలిచిపోయిన ఆర్థిక లావాదేవీలుగజ్వేల్: రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలడం పంచాయతీ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు జరిగితే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉండేవి. కొంతకాలం నుంచి పరిస్థితి భిన్నంగా మారింది. ఈక్రమంలోనే ఆశావహుల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన డబ్బులు కోసం వెంపర్లాడుతున్నారు. ఆశావహులంద రూ ఎన్నికల బరిపై దృష్టి పెట్టారు. ఎన్నికల్లో ఖర్చు కీలకం. కనుక ఏమీ చేయాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతున్నారు. ఎవరూ ఎక్కువ ఖర్చు పెడితే..వారు గ్రామాల్లో పట్టునిలుపుకుంటారనే పరిస్థితి రావడంతో ఇది పోటీదారులకు ఛాలెంజ్గా మారింది. జోరుగా నడిచిన కాలంలో.. ‘రియల్’ వ్యాపారం జోరుగా నడిచిన కాలంలో ప్రధాన రహదారుల వెంబడి ఉండే గ్రామాల్లో ఒకటి, రెండు గుంటలు అమ్ముకుంటే చాలు.. ఎన్నికల ఖర్చు సమకూరుతుందనే ధీమాలో ఉండేవారు. కానీ ఆ పరిస్థితి ముచ్చుకై నా కనిపించడం లేదు. ఒకవేళ అమ్ముకుందామనుకున్నా.. ధరలు పడిపోవడం వల్ల ఎవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒక వేళ కొనుగోలు చేస్తామని ఎవరైనా వచ్చినా...అత్తెసరు ధరకు కొంటామని తెగేసి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరైతే ఎలాగైనా సర్పంచ్ ఎన్నికై గ్రామంలో పట్టు సాధించాలనే సంకల్పంతో.. వాస్తవ ధరకు 50 శాతం తగ్గినా అమ్మడానికి వెనుకాడటం లేదు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో సర్పంచ్ ఎన్నికకు సిద్ధమైన ఓ పార్టీ నాయకుడు అతి తక్కువ ధరకు భూమిని అమ్ముకొని డబ్బులు సిద్ధం చేసుకున్నారు. సన్నిహితులు, స్నేహితులు ఎంత వారించినా ముందుకుసాగుతున్నాడు.తాకట్టు రుణాల వైపు పరుగు డబ్బులను ఇన్స్టంట్గా పొందడానికి సర్పంచ్ పోటీదారులు వేరే దారిలేక... తాకట్టు రుణాలవైపు పరుగు తీస్తున్నారు. బంగారం మొదలుకొని ఇళ్లు, పొలాలు, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లతో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల బ్యాంకుల్లో రద్దీ పెరిగింది. గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రధాన బ్యాంకులో రోజువారీగా 5 గోల్డ్ లోన్లు చేయడమే గగనంగా ఉండేది. నేడు సీను మారిపోయింది. సర్పంచ్ ఔత్సాహికుల వల్ల నిత్యం 20కి పైగా గోల్డ్ లోన్లు తీసుకుంటున్నారు. బంగారం నిల్వలు లేని వ్యక్తులు ఇళ్లు, పొలాలు, ప్లాట్లు వడ్డీ వ్యాపారులకు అడ్డగోలు వడ్డీ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రెండ్రోజులుగా వ్యవహారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తుండటం చర్చనీ యాంశంగా మారుతోంది. -
మీనమేషాలు !
చేప పిల్లలు చెరువులకు చేరేదెప్పుడో? ● మించిపోతున్న సమయం ● హెచరీల్లో కానరాని ఉత్పత్తి ● లక్ష్యం 5 కోట్లు.. పంపిణీ కోటి మాత్రమే..కొల్చారం(నర్సాపూర్): ఉచిత చేప పిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆగస్టు నుంచి పంపిణీ చేయాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో మత్స్యకారుల్లో నిరాశ నెలకొంది. ఈసారి సకాలంలో కురిసిన వర్షాలతో జిల్లాలో చెరువులు నిండుకుండలా మారాయి. అయితే సమ యం మించిపోతుండటంతో మత్స్యకారులు ఇతర ప్రాంతాల్లో చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువు ల్లో వదులుతున్నారు. గతంలో జిల్లాలోని ఘనపురం, హల్దీ ప్రాజెక్టుల్లో చేపల పెంపకం చేపట్టారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా 15.36 ఎకరాలను కేటాయిస్తూ 6 ఎకో హేచరీలు ఏర్పాటుచేసి వాటిలో చేప విత్తన ఉత్పత్తి చేశారు. ఏప్రిల్, మే నెలల్లోనే జిల్లాలో నీటి వనరుల నుంచి తల్లి పిల్లల ను సేకరించి స్పాన్ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించే వారు. గతంలో 5 కోట్ల చేప పిల్లలను పెంచారు. నాణ్యమైన విత్తన ఉత్పత్తిలో లక్ష్యంగా కట్ల, రోగు, మగాల, బంగారు తీగ వంటి పెంపకం చేపట్టారు. ఈసారి హేచరీల్లో చేప పిల్లల పెంపకం చేపట్టకపోవడంతో ఉత్పత్తి లేకుండాపోయింది. గతంలో జిల్లా కు సరిపోను 11 ఇతర జిల్లాలకు సరఫరా చేశారు. పక్క రాష్ట్రం నుంచి దిగుమతి ఈసారి జిల్లాలోని 1,614 చెరువుల్లో 5 కోట్ల చేపల పెంపకం చేపట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు నుంచే చేప పిల్లల పంపిణీ చేపట్టాల్సి ఉన్నా, ఉత్పత్తిలేకపోవడంతో ఏపీలోని కైకలూరు నుంచి చేప పిల్లలు దిగిమతి చేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు జిల్లాకు చేరింది కోటి చేప పిల్లలు మాత్రమే. దీంతో కొంతమంది మత్స్యకారులు స్వయంగా డబ్బులు వెచ్చించి ప్రైవేట్ హేచరీల నుంచి చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో వదులుతున్నారు. 2 లక్షల చేపలు కొనుగోలు చేశాం ప్రభుత్వం నుంచి ఉచితంగా అందాల్సిన చేప పిల్లల పంపిణీ ఇప్పటికే ఆలస్యం అయింది. జిల్లా కేంద్రానికి వెళ్తే అందుబాటులో లేవంటున్నారు. దీంతో ఇటీవలే సొంత డబ్బులు వెచ్చించి 2 లక్షల చేప పిల్లలు కొనుగోలు చేసి రెండు చెరువుల్లో వదిలాం. – యాదగిరి, మత్స్యకారుడు, రంగంపేట త్వరలో లక్ష్యం చేరుకుంటాం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హేచరీలు దెబ్బతినడంతో చేప పిల్లల పెంపకం చేపట్టలేకపోయాం. మత్స్యకారుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఏపీ నుంచి రోజువారీగా బొత్స, మీరుగం, రౌట, బంగారు తీగ చేప పిల్లల దిగుమతి చేసుకొని అందజేస్తున్నాం. అనుకున్న లక్ష్యాన్ని త్వరలో చేరుకుంటాం. ఈ విషయంలో మత్స్యకారులు నిరుత్సాహ పడొద్దు. – మల్లేశం, జిల్లా మత్స్యశాఖ అధికారిజిల్లాలో ఇలా.. నీటి వనరులు 1,614 మత్స్య సంఘాలు 272 సభ్యులు 17,500 హేచరీలు 06 -
అతివలే కీలకం
స్థానిక ఎన్నికల్లో మహిళలదే నిర్ణయాధికారంసర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పురుషులతో పోలిస్తే జిల్లాలో మహిళా ఓటర్లు 20 వేల పైచిలుకు అధికంగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అలాగే గంపగుత్త ఓట్ల కోసం కులసంఘాల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. – మెదక్జోన్ జిల్లాలో 21 మండలాలు, 492 పంచాయతీలు, 4,220 వార్డులు ఉండగా, 5,23,327 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,71,787 మంది మహిళలు కాగా, 2,51,532 మంది పురుష ఓట ర్లు.. మరో 8 మంది ఇతరులు ఉన్నారు. కాగా పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 20,255 అదనంగా ఉన్నారు. దీంతో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నమయ్యారు. జిల్లాలో 21 మండలాలు ఉండగా, అన్ని మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మెదక్, నర్సాపూర్, నిజాంపేట, చిన్నశంకరంపేట, శివ్వంపేట, టేక్మాల్, వెల్దుర్తి, అల్లాదుర్గం, చేగుంట, కొల్చారం, రామాయంపేట మండలాల్లో పురుషుల ఓట్లతో పోలిస్తే మహిళా ఓటర్లు ఒక్కో మండలంలో వెయ్యికిపైగా ఎక్కువగా ఉన్నారు. హవేళిఘణాపూర్ మండలంలో 2 వేల పైచిలుకు అధికంగా ఉన్నారు. మరో తొమ్మిది మండలాల్లో సైతం పురు షుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతల గెలుపోటముల్లో మహిళా ఓటే కీలకం కానుంది. ఆశావహులు గంపగుత్త ఓట్ల కోసం కుల సంఘాలను ప్రసన్నం చేసుకుంటున్నారు. గంపగుత్తగా ఓట్లు వేస్తే వంటపాత్రలు, టెంట్హౌస్ సామగ్రి, కుల దేవాలయం నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నారు. ప్రజలు పగలంతా పొలాల పనులకు వెళ్లటంతో ఉదయం, సాయంత్రం వేళ ఓటర్లను కలుస్తున్నారు. మొదటి విడత ఎన్నికలకు కేవలం 15 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఆ మండలాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. -
మనది బలమైన రాజ్యాంగం: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: ప్రపంచంలోనే అత్యంత బలమైన రాజ్యాంగం మనదేనని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాజ్యా ంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహి ంచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజ ల హక్కులను రక్షిస్తూ, చట్టాన్ని సమానంగా అమలు చేయడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని మరింత పెంచాలని సిబ్బందికి సూ చించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు సుభాశ్ చంద్రబోస్, రంగానాయక్, సీఐలు కృష్ణమూర్తి, సందీప్రెడ్డి, శైలేందర్, రామకృష్ణ, ఏఓ మణి, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. -
రుణపరిమితి రూ.20 లక్షలకు పెంచాలి
నర్సాపూర్ రూరల్/మనోహరాబాద్(తూప్రాన్): మహిళా సంఘాలకు ప్రస్తుతం అందజేస్తున్న రూ.5 లక్షల వడ్డీ లేని రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంచాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నర్సాపూర్ మండలం లింగాపూర్ రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మండలంలోని లింగాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. తర్వాత మనోహరాబాద్ మండలంలోని గౌతోజీగూడెంలో ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ.. నర్సాపూర్ నియోజకవర్గంలోని 3,986 మంది మహిళల తోడ్పాటుకు రూ.2.86 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించడం శుభపరిణామమన్నారు. పెండింగ్లో ఉన్న వడ్డీ లేని రుణాలను సైతం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్, సఖి కేంద్రాలతోపాటు ప్రభుత్వ చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సుచించారు. కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ..మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులోభాగంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు రూ.500కోట్ల రుణాలను బ్యాంకు లింక్ ద్వారా అందించామని తెలిపారు. రూ.90 కోట్లు ఇందిరా మహిళా శక్తి యూనిట్లకు ఖర్చు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, అదనపు పీడీ సరస్వతి, ఆర్డీవో మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ ప్రభాకర్, సెక్రెటరీ అనిత, శ్రీనివాస్గుప్తా, శ్రీధర్గుప్తా, నయుం, మాజీ సర్పంచ్ అశోక్ ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు
శివ్వంపేట(నర్సాపూర్): పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం శివ్వంపేటలో బగలాముఖీ శక్తిపీఠంలో యాగశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఆయన ఎదుటే కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పీసీసీ కాన్వాయ్ శివ్వంపేట శివారుకు రాగానే పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలికి బగలాముఖీ ఆలయానికి వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవీన్గుప్తా ఆధ్వర్యంలో గ్రామంలో స్వాగత కార్యక్రమం చేపట్టారు. అక్కడ కాన్వాయ్ ముందు ఇరు వర్గాలు తోసుకుంటూ దాడులకు పాల్పడటంతో తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ మధుకర్రెడ్డి వారిని చెదరగొట్టారు. పీసీసీ, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఎదుటే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు చోటుచేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. -
లాభమా.. నష్టమా..!
పటాన్చెరు/రామచంద్రాపురం(పటాన్చెరు): పటాన్చెరు నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ విలీన ప్రక్రియతో లాభమా.. నష్టమా అనే విషయమై బేరీజు వేసుకుంటున్నారు. ప్రగతి పరుగులు పెడుతోందని కొందరు వాదిస్తుండగా.. తమకు మాత్రం తీవ్ర నష్టం చేకూరుస్తోందని రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఏ సమస్య వచ్చినా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళితే.. వెంటనే పరిష్కారమయ్యేదని, అదే జీహెచ్ఎంసీ అయితే అధికారులు దొరకడమే గగనమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా విలీనంపై అనేక భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 7000 జనాభా ఉన్న అమీన్పూర్లో నరేగూడెం, బీరంగూడ, బంధన్ కొమ్ము, ఇసుక బావి, మధిర గ్రామాలుగా ఉండేవి. పంచాయతీ పాలనలో ఉన్న అమీన్పూర్ అనూహ్యంగా అమీన్పూర్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. 40 వేల ఓటర్లతో అమీన్పూర్ మున్సిపాలిటీగా 2019లో అవతరించింది. మున్సిపల్ చైర్మన్గా తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో 24 మంది కౌన్సిల్ సభ్యులతో మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటైంది. పాలకవర్గం కాలపరిమితి కూడా ముగిసింది. తెల్లాపూర్ మున్సిపల్.. గతంలో తెల్లాపూర్, ఉస్మాన్నగర్, కొల్లూరు, ఈదుల నాగులపల్లి, వెలిమెల గ్రామాలను కలుపుతూ 2018లో తెల్లాపూర్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. సుమారు లక్ష 70 వేల జనాభా ఉంటుంది. మున్సిపల్ చైర్పర్సన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి ఆధ్వర్యంలో 17 మంది కౌన్సిల్ సభ్యులతో మున్సిపల్ ఏర్పడింది. తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం పై చర్చ -
యాగమండపం ప్రారంభోత్సవం
పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేసునీతారెడ్డి శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేటలో కొలువైన బగలాముఖీ శక్తిపీఠం ఆవరణలో నూతనంగా నిర్మించిన యాగమండపాన్ని మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. వేద పండితుడు, బగలాముఖీ ఉపాసకులు శాస్త్రుల లక్ష్మీ వెంకటేశ్వర శర్మ దంపతులు వారి సొంత నిధులతో నిర్మించిన యాగమండపాన్ని వేద పండితుడు గంగవరం నారాయణశర్మ ఆధ్వర్యంలో పూజా మహోత్సవా లు నిర్వహించి ప్రారంభోత్సవం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బగలాముఖీని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ భూదాత స్వరూప రమేశ్గుప్తా, స్వాతి మహేష్గుప్తా, రమాదేవి తిరుపతిరెడ్డి దంపతులు భక్తులకు ఎలాంటి ఇబ్బదులు రాకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నదానం నిర్వహించారు. పాల్గొన్న ప్రముఖులు.. యాగమండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, మైనంపల్లి హన్మంత్రావు, మాజీ ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్, సంగీత గాయకుడు రామాచారి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
లోకల్.. దంగల్
షెడ్యూల్ విడుదల మెదక్జోన్: స్థానిక సంస్థల(సర్పంచ్, వార్డుసభ్యుల) ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ డిసెంబర్ 17 వరకు అమల్లో ఉంటుంది. మెదక్ జిల్లాలో 21 మండలాల పరిధిలో 492 గ్రామాలు, 4,220 వార్డులు ఉండగా 5,23,327 మంది ఓటర్లున్నారు. ఇందులో2,51,532 మంది పురుషులు ఉండగా 2,71,787 మంది మహిళా ఓటర్లు, 8 మంది ఇతరులు ఉన్నారు. ఈ ఎన్నికలు మూడు విడతల్లో జరుగనుండగా అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి ఎన్నికల సామగ్రిని జిల్లా కేంద్రం నుంచి మొదటి విడత ఎన్నికలు జరిగే ఆయా మండలాలకు తరలించారు. కాగా, ఇప్పటికే ఎన్నికలు నిర్వహించే రిటర్నింగ్ అధికారులు(ఆర్ఓ) అసిస్టెంట్ రిటర్నింగ్ (ఏఆర్ఓ) అధికారులతోపాటు ఇతర అధికారులకు ఇప్పటికే పలుదఫాలుగా శిక్షణ ఇచ్చారు. ఈనెల 30నుంచి డిసెంబర్ 2వ తేదీవరకు నామినేషన్లు, డిసెంబర్ 3న, స్క్రూట్నీ, అదేరోజున అభ్యర్థుల జాబితా డిసెంబర్ 4న, ఫిర్యాదులు, 6న నామినేషన్ల ఉపసంహరణ అదేరోజున బరిలోనిలిచే అభ్యర్థుల జాబితా, డిసెంబర్ 14 పోలింగ్ అదేరోజున ఫలితాలు వెలువరిస్తారని ఈసీ వెల్లడించింది. డిసెంబర్ 3నుంచి 5 వరకు నామినేషన్లు, 6న పరిశీలన, 7న ఫిర్యాదులు, 9న విత్డ్రాలు అదేరోజున తుదిజాబితా వెల్లడి, 17న పోలింగ్ అదేరోజున కౌంటింగ్ ఉంటాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. జిల్లాలో 21 మండలాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో మొదటి విగతలో 6 మండలాల్లో జరుగనున్నాయి ఇందులో అల్లాదుర్గ్, రేగొడు, టేక్మాల్, హవేళిఘనాపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట మండలాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండవ విడతల్లో 8 మండలాల్లో భాగంగా తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ మండలాలకు మూడవ విడతలో 7 మండలాల పరిధిలోని గ్రామాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అందులో భాగంగా నర్సాపూర్, చిలిపిచెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, మాసాయిపేట, వెల్దూర్తి మండలాలకు ఎన్నికలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణఇదీ షెడ్యూల్ గురువారం నుంచి ఈనెల 29 వరకు మూడు రోజుల పాటు నామినేషన్లు 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 1న, ఫిర్యాదులు, డిశంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజున సాయంత్రం అభ్యర్థుల తుదిజాబితా వెల్లడి, డిసెంబర్ 11న ఎన్నికలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు అదేరోజున ఓట్లలెక్కింపు ఫలితాల విడుదల ఉంటాయని ఎన్నికల కమిషన్ పేర్కొంది.అధికారులకు సెలవులు రద్దు: కలెక్టర్ మెదక్ కలెక్టరేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఎన్నికలు ముగిసే వరకు అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి డీఎల్పీఓలు, ఎంపీడీలు, ఎంపీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పకడ్బందీగా, ప్రశాంత వాతావరణం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఏ దశలోనూ అలసత్వానికి తావు ఇవ్వకూడదన్నారు. నిఘా బృందాలను నియమించి, పకడ్బందీగా కోడ్ అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలన్నారు. వీడియో కాన్ఫరెన్న్స్లో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆ పార్టీలను సమాధి చేస్తాం: గంగారాం
రామాయంపేట(మెదక్): బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్న పార్టీలను రాజకీయంగా సమాధి చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మెట్టు గంగారాం, జిల్లా కోశాధికారి దామోదర్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు పోచమ్మల గణేశ్ హెచ్చరించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై బీసీలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారన్నారు. 46 జీవోను విడుదల చేసిన ప్రభుత్వం తమకు తీరని అన్యాయం తలపెట్టిందని మండిపడ్డారు. జనాభాలో 65% ఉన్న తమకు 42% రిజర్వేషన్లు ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఇకనైనా బీసీ సోదరులంతా కళ్లు తెరువాలని, తమకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సంఘం పట్టణాధ్యక్షుడు పచ్చంటి రాము పాల్గొన్నారు. -
దర్యాప్తు వేగవంతం చేయాలి
● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్లాన్ ● సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించాలి ● ఎస్పీ డీవీ శ్రీనివాసరావుమెదక్ మున్సిపాలిటీ: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని, లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక కార్యాచరణ ఉండాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో వేగవంతమైన దర్యాప్తు జరగా లని, బాధితులకు న్యాయం అందించడంలో ఏ ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. అత్యాచార, పొక్సో కేసులలో నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి, దోషులను కోర్టు ముందు నిలపాలని ఆదేశించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసి అమలు చేయాలన్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు పెండింగ్లో ఉన్న కేసులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. మైనర్లు వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదన్నారు. అవసరమైతే లైసెన్సులు రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పట్ల అప్రమత్తంగా, నిబద్ధతతో ఎలాంటి గొడవలకు తావు లేకుండా జరిగేటట్లు సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు. స్పెషల్ లోక్ఆదాలత్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని ప్రశంసాపత్రం అందజేసి ఎస్పీ అభినందించారు. సమావేశఃలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐలు జార్జి రేణుకారెడ్డి, మహేష్, కృష్ణ మూర్తి, సందీప్ రెడ్డి, రంగా కృష్ణ, ఎస్ఐ పాల్గొన్నారు. -
అయ్యప్ప ఆలయంలో పీసీసీ చీఫ్ పూజలు
నర్సాపూర్: నర్సాపూర్లో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగుతున్న శ్రీ ఆదిపరాశక్తి అయ్యప్పస్వామి ఆలయాన్ని మంగళవారం పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం యాగశాల వద్ద పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ అశోక్గౌడ్ ఆధ్వర్యంలో పూజారులు, అయ్యప్ప దీక్షాపరులు మహేశ్కుమార్గౌడ్తోపాటు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మదన్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డిలను ఘనంగా సన్మానించారు. -
అక్రమాలకు పాల్పడితే చర్యలే
కలెక్టర్ రాహుల్రాజ్ హెచ్చరికనర్సాపూర్: జిల్లాలో ఇసుకను అక్రమంగా తవ్వి తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్రాజ్ హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ ఇసుక బజార్ను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇందిరమ్మ లబ్ధిదారులకు, ప్రభుత్వ ప్రాజె క్టులు, నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా స్థానిక ఇసుక బజార్లో స్టాకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రవాణా పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారానే అనుమతించాలని, టిప్పర్ల కదలికలు, ఇతర వివరాలు ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తూ ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్లు ఉన్నారు. ఇసుక బజార్ రికార్డులను స్థానిక ఏఎంసీ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కొనుగోళ్లను కలెక్టర్ పరిశీలించారు. -
కోర్టు ఉత్తర్వుల్ని కూడా పట్టించుకోరా?
నిధులు రికవరీపై కోనాపూర్ పీఏసీఎస్ డైరెక్టర్ రామాయంపేట(మెదక్): మండలంలోని కోనా పూర్ సహకార సంఘంలో దుర్వినియోగమైన రూ.1.67 కోట్ల నిధుల రికవరీ విషయమై అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామచందర్గౌడ్, సంఘం డైరెక్టర్ మహిపాల్రెడ్డి, మాజీ డైరెక్టర్ మామిడి సిద్దరాంలు ఆరోపించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... నిధుల రికవరీ విషయమై హైకోర్టు ఉత్తర్వులు జారీచేసి తొమ్మిది నెలలు గడిచినా ఆ శాఖ అధికారులు ఏమీపట్టనట్లు వ్యవహరించడం తగదన్నారు. నిరుపేద రైతుల బకాయిలను బలవంతంగా వసూలు చేస్తున్న అధికారులు పెద్దల నుంచి వసూలు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇకనై నా అధికారులు స్పందించకపోతే రాష్ట్ర సహకా ర అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
● రుణాలు సద్వినియోగం చేసుకోవాలి ● ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిన్నశంకరంపేట(మెదక్): మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కోరారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో అదనపు కలెక్టర్ నగేశ్తో కలిసి మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పదివేల మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.30 కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళ, రైతు పక్షపాతిగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ అరుణప్రభాకర్, గోపాల్రెడ్డి, మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి, జనార్దన్, సుధాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పాపన్నపేట(మెదక్): మంగళవారం మండల పరిధిలోని పొడిచన్పల్లి రైతు వేదికలో స్వయం సమాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. -
149 ఈవీ చార్జింగ్ స్టేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యుత్ వాహనాల (ఈవీ)కు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లను జిల్లాలో విస్తృతంగా ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 149 చోట్ల వీటిని నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. ప్రధానంగా ముంబై హైవేతో పాటు, నాందేడ్–అకోలా హైవేలపై ఈ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పీఎం ఈ–డ్రైవ్ పథకంలో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. సంగారెడ్డి, పటాన్చెరు, కొల్లూరు వంటి ప్రాంతాల్లో కూడా వీటిని నెలకొల్పడం ద్వారా వాహనదారులకు ఎంతో సౌకర్యం ఉంటుందని భావిస్తున్నారు. 65వ జాతీయ రహదారి జిల్లాలో రామచంద్రాపురం నుంచి మొగుడంపల్లి మండలం మాడ్గి వరకు ఉంటుంది. సుమారు 104 కి.మీల పొడవున్న ఈ ముంబై హైవేపై నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. వీటిలో విద్యుత్ వాహనాలు కూడా ఉంటాయి. ఈ హైవేపై ఈవీ స్టేషన్లు ఏర్పాటు చేస్తే దూర ప్రయాణాలు చేసే విద్యుత్ వాహనదారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే కంది మండల కేంద్రం కల్హేర్ మండలం మాసన్పల్లి చౌరస్తా సుమారు 95 కి.మీల మేరకు 161 జాతీయ రహదారిపై కూడా వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ రహదారిపైనా వీటిని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. ప్రధానంగా ఈ రెండు జాతీయ రహదారులపై వీటిని ఏర్పాటు చేయడం ద్వారా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వాహనదారులు తమ వాహనాలను చార్జింగ్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది. పెరుగుతున్న ఈవీల సంఖ్యకు తగ్గట్టుగా.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. గతంతో పోల్చితే ఈ వాహనాల ధరలు ఇప్పుడిప్పుడే కొంత మేరకు దిగి వస్తున్నాయి. ప్రారంభంలో అధిక ధరలు ఉండటంతో ఈ వాహనాలను కొనుగోలు చేయాలంటే కొంత ఆర్థిక భారం పడేది. ఇప్పుడు వీటి ధరలు దిగివస్తుండటంతో ఎక్కువ మంది ఈవీ వాహనాలను కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. -
సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు
మెదక్జోన్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్పంచ్ రిజర్వేషన్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. గత మూడు రోజులుగా జిల్లా యంత్రాంగం కసరత్తు చేపట్టి సోమవారం మధ్యాహ్నానికి పూర్తి చేసింది. జిల్లావ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలకు గానూ పాత రిజర్వేషన్ల ప్రకారం 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు 108 స్థానాలు కేటాయించగా, అందులో మహిళలకు 49 సీట్లు, జనరల్కు 59 కేటాయించారు. ఎస్టీలకు మొత్తం 92 స్థానాలను కేటాయించగా, వాటిలో 71 గ్రామాలు వందశాతం గిరిజన పంచాయతీలే ఉన్నాయి. వాటిలో 29 మహిళలకు, 42 స్థానాలను జనరల్కు కేటాయించారు. అలాగే మరో 21 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. అందులో 10 సీట్లను మహిళలకు, 11 స్థానాలను జనరల్ కేటగిరికి ఇచ్చారు. అలాగే ఎస్సీలకు 77 స్థానాలు కేటాయించగా, వాటిలో 33 సీట్లు మహిళలకు, 44 సీట్లను జనరల్కు రిజర్వ్ చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 4,220 వార్డులు ఉండగా, వాటిలో ఎస్టీలకు మొత్తం 704 స్థానాలను కేటా యించారు. 100 శాతం ఎస్టీలు ఉన్న 71 గ్రామాల్లో 526 వార్డులను వారికే రిజర్వ్ చేశారు. అందులో 263 మహిళలకు, 263 జనరల్కు కేటాయించారు. అంతేకాకుండా మరో 21 పంచాయతీల్లో ఇతరవర్గాల ప్రజలు ఉన్న వాటిలో 178 వార్డు సభ్యులను కేటాయించగా, వాటిలో 55 మహిళలకు, 123 జనరల్కు కేటాయించారు. అలాగే ఎస్సీలకు 658 సభ్యులను కేటాయించగా, వాటిలో 235 మహిళలకు, 423 జనరల్ బీసీలకు కేటాయించారు. 998 సభ్యులకు గానూ 410 మహిళలకు, 588 జనరల్కు ఇచ్చారు. అలాగే అన్ రిజర్వ్డ్కు 1,860 సభ్యులను కేటాయించగా, వాటిలో 849 మహిళలకు, 1,011 జనరల్కు కేటాయించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు బీసీలకు 22.66 శాతమే జిల్లాలో 492 గ్రామ పంచాయతీలకు గానూ బీసీలకు 108 సీట్లను కేటాయించారు. ఈ లెక్కన బీసీలకు 22.66 శాతం సీట్లు మాత్రమే కేటాయించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే ఎస్టీలకు 92 సీట్లను కేటాయించటంతో 18 శాతం, ఎస్సీలకు 77 సీట్లతో లెక్కిస్తే 15.65 శాతం కాగా, అన్రిజర్వ్డ్కు 215 స్థానాలను లెక్కిస్తే 43.69 శాతం కేటాయించారు. కాగా స్థానిక రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని హైకోర్టు చెప్పటంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ఖరారు చేశారు. బీసీలకు గణనీయంగా సీట్లు తగ్గటంతో అన్రిజర్వ్డ్ రిజర్వేషన్ ఖరారు చేసిన స్థానంలో పార్టీ పరంగా బీసీలు మాత్రమే పోటీచేసే విధంగా చర్యలు తీసుకుంటామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఉదాహరణకు ఓ గ్రామంలో 10 ఏళ్ల నుంచి అన్ రిజర్వ్డ్ (యూఆర్) కాలేదు. ప్రస్తుతం ఆ ఊరు అన్రిజర్వ్డ్ అయింది. ఆ గ్రామంలో ఉన్న ఓసీలు ఖచ్చితంగా బరిలో ఉంటారు. అలాంటి గ్రామంలో బీసీలే పోటీ చేయాలనే ప్రతిపాదన కాంగ్రెస్ తీసుకువస్తే పార్టీకే తీరని నష్టం జరుగుతుందని నేతలు చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో వేచి చూడాల్సిందే. -
సొసైటీలో అక్రమాలపై విచారణ
చందంపేట పీఏసీఎస్ సీఈఓపై ఫిర్యాదుల వెల్లువచిన్నశంకరంపేట(మెదక్): చందంపేట పీఏసీఎస్ లో అక్రమాలపై సోమవారం విచారణ జరిగింది. డీసీఓ కార్యాలయ అసిస్టెంట్ రిజిస్టర్ తుకారాం వద్దకు చందంపేట, రుద్రారం, ధరిపల్లి గ్రామాలకు చెందిన రైతులు వచ్చి పెద్దసంఖ్యలో ఫిర్యాదు చేశారు. పంట రుణం చెల్లింపు కోసం సీఈఓ పాషా రూ. 50 వేలు వసూలు చేశారని రైతు సిద్దిరామ్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఏటా సక్రమంగా వడ్డీ చెల్లించినప్పటికీ అధికంగా డబ్బులు తీసుకున్నారని వాపోయారు. రూ. 73 వేలు తీసుకొని రూ. 63 వేలు మా త్రమే రుణ ఖాతాలో జమ చేశారని అదే గ్రామానికి చెందిన మరో రైతు పోచయ్య తెలిపారు. రుణమాఫీ జరిగినా, డబ్బులు వసూలు చేశారని రై తు ప్రవీణ్కుమార్, డైరెక్టర్ రామ్రెడ్డి పేర్కొన్నారు. సొసైటీ కార్యాలయంలో విధులు నిర్వర్తించిన విజయ్కుమార్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కాగా, వేతనం ఇవ్వకుండానే డబ్బులు కాజేసి సొంతానికి వాడుకున్నారని చెప్పారు. రుద్రారం గ్రామానికి చెందిన మరో ఇద్దరు రైతులు సైతం ఫిర్యాదు చేశారు. రైతుల చెప్పిన వివరాలను రికార్డు చేసుకొని డీసీఓకు నివేదిక ఇవ్వనున్నట్లు విచారణ అధికారి తెలిపారు.అవినీతి సీఈఓ మాకొద్దు.. సీఈఓ పాషా అవినీతి, అక్రమాలకు పాల్పడి నిధులు గోల్మాల్ చేశారని డైరెక్టర్లు రామకృష్ణ, రాంరెడ్డి, వెంకటేశం తెలిపారు. సొసైటీ పాలకవర్గానికి తెలియకుండా తీర్మానం పుస్తకంలో నోట్ పెట్టి రూ. 2.50 లక్షల నిధులు డ్రా చేసి సొంత అవసరాలకు వాడుకున్నాడని ఫిర్యాదు చేశారు. సొసైటీలో రైతుల షేర్ అమౌంట్ను కూడా ఇష్టానుసారం డ్రా చేసి వాడినట్లు చెప్పా రు. ఇలాంటి అవినీతి సీఈఓ మాకొద్దంటూ తెలిపారు. ఇదే సమయంలో పలువురు రైతులు సీఈఓ పాషాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించారు. మాజీ ఎంపీటీసీ శివకుమార్, రాజశేఖర్రెడ్డి తదితరులు సీఈఓపై ఫిర్యాదు చేశారు. -
సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
మంగళవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2025కౌడిపల్లి(నర్సాపూర్): యాసంగి పంటలు సాగు చేసే రైతులు విత్తనాలు నాటడం మొదలు, పంట కోతకు వచ్చేవరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ తెలిపారు. సోమవారం తునికి కేవీకేలో ఎస్సీ సబ్ప్లాన్లో భాగంగా రాయిలాపూర్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎంపిక చేసిన 40 మంది రైతులకు కేఎన్ఎం 1638 రకం వరి విత్తనాలతో పాటు రెండు మునగ మొక్కలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సస్యరక్షణ చర్యలు చేపట్టడంతోనే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. యాసంగిలో వరిసాగుకు కేఎన్ఎం 1638, కేఎన్ఎం 118, జేజీఎల్ 24423 అనుకూల మని చెప్పారు. కార్యక్రమంలో సబ్ప్లాన్ ఇన్చార్జి శాస్త్రవేత్త శ్రీనివాస్, డాక్టర్ ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. -
సమస్యలను నిర్భయంగా చెప్పాలి
మెదక్ మున్సిపాలిటీ: చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడం మా ప్రధాన బాధ్యతని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫి ర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల ను ంచి ప్రజలు తమ తమ సమస్యలపై 12 ఫిర్యాదులు అందించగా, వాటిని స్వీకరించిన ఎస్పీ సత్వర న్యాయం కోసం సంబంధిత పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం ఉందని, ఎవరి జోక్యం లేకుండా నిర్భయంగా తమ సమస్య లను వెల్లడించాలని సూచించారు. ఇప్పటికే ప్రజావాణిలో పరిష్కారమైన అనేక కేసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. పారదర్శకంగా దర్యాప్తు చేయాలి కొల్చారం(నర్సాపూర్): పోలీస్స్టేషన్లో నమోదయ్యే ప్రతి కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని ఎస్పీ ఆదేశించారు. సోమవారం కొ ల్చారం పోలీస్స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు లేకుండా చూడడంతో పాటు ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఎన్నికల నిర్వహణలో మీరే కీలకం
● ప్రతి అంశంపై అవగాహన అవసరం ● అధికారులతో కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: సర్పంచ్ ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని, సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నోడల్, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా చదివి ప్రతీ అంశంపై అవగాహన కలి గి ఉండాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా విధులు నిర్వర్తించాల ని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, పోలింగ్కు సంబంధించిన సామగ్రి సమకూర్చడం వంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించాల్సి ఉంటుందన్నా రు. బ్యాలెట్ బాక్స్లు, నామినేషన్ ప్రక్రియ, పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం కార్మికశాఖ కార్యాలయంలో కార్మిక బీమా పెంపు పోస్టర్ను ఆవిష్కరించారు. కార్మికుల బీమా పెంపు సదస్సు లు వచ్చే నెల 8 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. కార్మికులు బీమా పెంపు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఈఓ విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఆయాశాఖల అధికారులు, జిల్లా ఇన్చార్జి సహాయ కార్మిక అధికారి సత్యేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం అల్లాదుర్గం(మెదక్): మహిళల అభ్యున్నతే ప్ర భుత్వ లక్ష్యమని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నా రు. సోమవారం అల్లాదుర్గం ఐబీ చౌరస్తాలో టేక్మా ల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా గ్రూపులలో ఉన్న మహిళలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి, మళ్లీ అధిక మొత్తంలో రుణాలు తీసుకొని అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మి, తహసీల్దార్ మల్లయ్య, ఎంపీడీఓ వేద ప్రకాశ్రెడ్డి, ఏపీఎం రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. -
నూతన విత్తన బిల్లుతో మేలు
● రైతుల హక్కులను పరిరక్షించేందుకే చట్టం ● రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాహుల్మెదక్ కలెక్టరేట్: రైతుల ప్రయోజనాలే కీలకమని, వారి హక్కులను పరిరక్షించేందుకే విత్తన చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాహుల్ అన్నారు. సోమ వారం కలెక్టరేట్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్య వసా య విశ్వవిద్యాలయం, జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వ ర్యంలో నూతన విత్తన చట్టం ముసాయిదా కమిటీ అవగాహన, అభిప్రాయ సేకరణ కార్య క్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా ప్రస్తుత వ్యవసాయ సాగు పరిస్థితులకనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నూతన విత్తన చట్టం తీసుకొచ్చిందన్నారు. రైతుల హక్కులను పూర్తిగా పరిరక్షించాలనే లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధనల స్థానం బసంత్పూర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్, జిల్లా అసిస్టెంట్ డీఏఓ వినయ్ కుమార్, ఆయా మండలాల వ్యవసాయ అధికారులు వందన, యాదగిరి, హర్ష, నాగమాధురి, ఆయా విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. -
హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు
పెద్దశంకరంపేట(మెదక్): 161వ జాతీయ రహదారిపై జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సూచనల మేరకు డిసెంబర్ నెలాఖరులోగా సేఫ్టీ నిబంధనలు ఏర్పాటు చేయనున్నట్లు నేషనల్ హైవే పీడీ మాధవి సోమవారం తెలిపారు. ఇటీవల ఎంపీ ప్రమాదాల నివారణకు హైవే అథారిటీకి పలు సూచనలిచ్చారు. దీంతో అధికారులు స్పందించి జాతీయ రహదారిపై సోలార్ బ్రింకర్లు, ఎంబీసీబీలు, రబ్బర్ స్ట్రిబ్స్, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ నుంచి వచ్చిన జీఓ కాపీలను ఎంపీకి అందజేశారు. నేడు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బుల జమ మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని మహిళా సంఘాల సభ్యుల ఖాతాల్లో మంగళవారం రూ. 8.80 కోట్ల వడ్డీ డబ్బులు జమ చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మహిళా సాధికారతపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 1,37,438 స్వయం సహాయక బృందాల్లో అర్హులైన మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 8.80 కోట్ల వడ్డీని బ్యాంకు లింకేజీపై మహిళల అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. ఈ కా ర్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ను కలిసిన డీఈఓ మెదక్ కలెక్టరేట్: ఇటీవల నూతనంగా డీఈఓగా బాధ్యతలు చేపట్టిన విజయ సోమవారం అదనపు కలెక్టర్ నగేశ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమె వెంట జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సమగ్ర శిక్ష అధికారులు నవీన్, రాజు ఉన్నారు. వేగంగా ధాన్యం కొనుగోళ్లు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతేడాది ఈ సమయానికి 27,938 మంది రైతుల నుంచి 1,33,664 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 117.58 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 49,027 మంది రైతుల నుంచి 2.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రూ. 323.04 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. అలాగే 5,008 మంది రైతులకు సన్నధాన్యం బోనస్ రూ. 11.56 కోట్లు చెల్లించినట్లు వివరించారు. ‘బీసీలు ఎక్కడ పోటీ చేయాలి’ చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని రు ద్రారం పంచాయతీలో వార్డులకు బీసీ రిజర్వేషన్లు కల్పించలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 1 నుంచి 5 వార్డులలో బీసీ జనాభా అధికంగా ఉంటారని, 5 నుంచి 10 వార్డులలో ఎస్సీ జనాభా ఉంటారని తెలిపారు. పంచాయతీ రిజర్వేషన్లో మాత్రం సర్పంచ్ జనరల్ మహిళకు రిజర్వు కాగా, 1 నుంచి 5 వరకు బీసీ జనాభా ఉండే వార్డులను ఎస్సీలకు కేటాయించారని వాపోయారు. అలాగే 5 నుంచి 10వ వార్డు వరకు ఎస్సీల జనాభా ఉంటారని, ఇక్కడ మాత్రం అన్ రిజర్వుడ్ కేటాయించారన్నారు. ఇలాగైతే బీసీలు ఎక్కడ పోటీ చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయం ఎంపీడీఓ వద్ద ప్రస్తావిస్తే తమకేమి తెలియదని దాటవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే మార్పు చేయకపోతే తాము ఎన్నికలను బహిష్కరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
రూ. 2,200 కోట్ల రుణాలు
● అధిక వడ్డీతో స్వర్ణనిధి స్కీమ్ ● డిపాజిట్ చేసిన వారికిరూ. 5 లక్షల ఇన్సూరెన్స్ ● డీసీసీబీ డీజీఎం చంద్రశేఖర్రెడ్డినారాయణఖేడ్: ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ. 2,,200కోట్ల రుణాలు అందేశామని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. నారాయణఖేడ్లోని డీ సీసీబీ శాఖను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఖాతాదారులతో స్వర్ణనిధి డిపాజిట్ స్కీమ్కు సంబంధించి కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ.. పంటరుణాలు రూ.650కోట్లు, మహిళా సంఘాలకు రూ. 490కోట్లు, బంగారు ఆభరణాలపై రూ.480కోట్లు, గృహ నిర్మాణ రుణాలు రూ. 130కోట్లు అందజేసినట్లు చెప్పారు. రుణాలు పొందిన వారు బకాయిలు సకాలంలో చెల్లించి అధిక వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని కోరారు. ఖేడ్ బ్రాంచిలో 104కోట్లు అన్నిరకాల రుణాలు ఇవ్వగా.. డిపాజిట్ రూపేణా రూ. 31 కోట్లు సేకరించినట్లు చెప్పారు. 10 నిమిషాల్లో ఖాతా, రుణం కూడా.. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా అత్యుత్తమ సేవలు అందిస్తూ అన్ని కమర్షియల్ బ్యాంకులంటే అధిక వడ్డీని అందిస్తున్నామని డీజీఎం చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. తమ ఖాతాదారులకు ఏటీఎం సదుపాయాలు కల్పిస్తూ డెబిట్ కార్డులు అందిస్తున్నామని, ఫోన్పే, గూగుల్పే తదితర అన్ని సదుపాయాలు పొందవచ్చని అన్నారు. కొత్త ఖాతాదారులకు 10 నిమిషాల్లోనే ఖాతా తెరచి ఇస్తామన్నారు. బంగారు ఆభరణాలు, తులం బంగారంపై రూ.74 వేల వరకు రుణాన్ని పదినిమిషాల్లోనే అందజేస్తామన్నారు. బ్యాంకుల్లో లాకర్ సదుపా యాలు ఉన్నాయన్నారు. ఈనెలాఖరుతో స్వర్ణనిధి 444 రోజుల ఫిక్స్ డిపాజిట్ నూతన పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు. ఇందులో డిపాజిట్ చేస్తే 7.75శాతం, సీనియర్ సిటిజన్స్కు 8.25శాతం వడ్డీ అందజేస్తామన్నారు. -
నిబంధనల మేరకే నిర్మించుకోండి
నర్సాపూర్ రూరల్/శివ్వంపేట: నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరికి బిల్లులు వస్తాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఖాజీపేటలో శిలమంతుల మాధవి నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కొంతమంది ఇందిరమ్మ లబ్ధిదారులు నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకోకపోవడంతో బిల్లులు రావడంలో జాప్యం జరుగుతు ందన్నారు. కాగా కొంతమంది లబ్ధిదారులు బేస్మెంట్, లెంటల్ లెవెల్ బిల్లులు రావడం లేదని ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. సర్వర్ సమస్య కారణంగా బిల్లులు రావడం లేదని, కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకుడు సుధాకర్రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం శివ్వంపేట మండల పరిధిలోని గోమారంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. కేవలం మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులకు మా త్రమే చీరలు పంపిణీ చేయడం సరికాదన్నారు. అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, నాయకులు మాధవరెడ్డి, సంతోష్రెడ్డి, చంద్రగౌడ్, హన్మంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం
‘సాక్షి’తో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ నర్సాపూర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. రెండోసారి డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో మెజార్టీ గ్రామ పంచాయతీలను కై వసం చేసుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ప్రజల కోసం పని చేయడమే తమ పార్టీ విధానమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ముందుకు సాగుతున్నానని, పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను అధిష్టానం గుర్తించి ప్రోత్సహిస్తుందన్నారు. అందులో భాగంగానే తనకు డీసీసీ అధ్యక్ష పదవి దక్కిందన్నారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయనని, నాయకులందరి సహకారంతో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ టూ డీసీసీ నర్సాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన ఎస్. ఆంజనేయులుగౌడ్ మండలంలో ఎన్ఎస్యూఐ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి విద్యార్థుల సమస్యలపై ఉద్యమించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పని చేశారు. ఆపై మండలంలోని ఖాజీపేట ఎంపీటీసీగా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై పార్టీకి సేవలందించారు. కాగా 2023 ఎన్నికల సమయంలో ఇన్చార్జి డీసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. తాజాగా శనివారం రెగ్యులర్గా నియమించడంతో ఆయన రెండోసారి అధ్యక్షుడయ్యారు. -
మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రామాయంపేట(మెదక్)/పాపన్నపేట/నిజాంపేట: గత ప్రభుత్వ హయాంలో మహిళలకు నాసిరకమైన చీరలు పంపిణీ చేశారని, తమ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. ఆదివారం స్థానిక ఐకేపీ కార్యాలయంలో చీరలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మహిళలకు ఇచ్చిన చీరలు పంట చేల వద్ద కట్టడానికి సైతం పనికి రాలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఓట్ల వచ్చినప్పడే ప్రజల వద్దకు వస్తారని విమర్శించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, మాజీ సర్పంచ్లు మహేందర్రెడ్డి, శివప్రసాదరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్రెడ్డి, ఏపీఎం ఇంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే పాపన్నపేటలో స్వయం సహాయక గ్రూపు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మహిళళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గోవింద్నాయక్, జిల్లా కిసాన్సెల్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, నాయకులు ప్రశాంత్రెడ్డి, అఽధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, గౌస్, నర్సింలు, నరేందర్గౌడ్, చోటు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళలకు చీరలు పంపీణీ చేపట్టారు. -
సలుపుతున్న రాచపుండు!
● ముందుస్తుగా వ్యాధిని గుర్తించక మృత్యువాత ● చివరి దశలోనే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు మెదక్జోన్: జిల్లాలో కేన్సర్ మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 614 మంది బాధితులు ఉండగా, వీరిలో 115 మంది నోటి కేన్సర్తో బాధపడుతున్నారు. 156 మంది రొమ్ము, 177 మంది సర్వేకల్, 166 బ్లడ్ కేన్సర్తో పోరాటం చేస్తున్నారు. ఇందులో చివరిదశలో కొన ఊపిరితో 157 మంది బాధపడుతున్నారు. ఈ మహమ్మారితో ఏటా జిల్లాలో పదుల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. అయితే వ్యాధిని ముందస్తుగా గుర్తించకపోవడం.. జిల్లాలో కేన్సర్ ఆస్పత్రి లేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. ఆస్పత్రి నిర్మాణానికి అడుగులు జిల్లా కేంద్రంలో కేన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి నిధులు సమకూర్చే బాధ్యత తనదని, ఇందుకోసం వెయ్యి గజాల స్థలం కేటాయించాలని ఎంపీ రఘునందన్రావు ఇటీవల జిల్లాలో జరిగిన దిశ సమావేశంలో కలెక్టర్ను కోరారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ఉమ్మడి జిల్లాలోని బీడీఎల్, ఐఎస్ఎల్ ఫ్యాక్టరీల నుంచి సీఎస్ఆర్ నిధులతో పాటు ఎంపీ నిధులను సైతం కేటాయించనున్నట్లు సమాచారం. కాగా పట్టణానికి కిలోమీటర్ దూరంలో గల బోధన్– మెదక్ ప్రధాన రహదారి హవేళిఘణాపూర్ శివారులో గతంలో లెప్రసీ (కుష్టు) నివారణ ఆస్పత్రి నిర్మించారు. ప్రస్తుతం ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఇది ప్రధాన రహదారికి ఆనుకొని ఉండటంతో ఇక్కడ కేన్సర్ ఆస్పత్రి నిర్మిస్తే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘చిన్నశంకరంపేట మండలం జంగారాయికి చెందిన సిద్దిరెడ్డి 20 రోజుల క్రితం ఆకలి మందగించిందని, ఆయాసంగా ఉందని వైద్యులను సంప్రదించాడు. అతడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు కేన్సర్ నాల్గవ దశలో ఉందని, కిమోథెరపీ తప్ప తాము ఏం చేయలేమని మందులు రాసి ఇచ్చారు. అతడు ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన వారంలోనే మృత్యువాత పడ్డాడు. ముందస్తుగా వ్యాధిని గుర్తించినట్లు అయితే మందులతో కొన్నాళ్ల బతికేవాడని వైద్యులు చెబుతున్నారు’. -
తిందామంటే
● ఆకాశన్నంటిన కూరగాయల ధరలు ● సామాన్య ప్రజలువిలవిల నిజాంపేట సంతలో కూరగాయల విక్రయాలురామాయంపేట(మెదక్): జిల్లాలో కూరగాయల ధరలు కొండెక్కడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఏ కూరగాయ ధర చూసినా భగ్గుమంటుంది. దీంతో కొనలేం.. తినలేం అన్నట్లుగా పరిస్థితి మారింది. వరుస వర్షాలు, మొంథా తుపాన్తో భారీగా కూరగాయల పంటలకు న ష్టం జరిగింది. దిగుబడి సైతం బాగా తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఖర్చులు పెరిగాయి. ఏ కూరగాయ చూసినా కిలో రూ. 80 నుంచి రూ. 100 వరకు పలుకుతోంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలో చొప్పున కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం అర, పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. గత నెలలో పచ్చి మిర్చి ధర కిలోకు రూ. 50 వరకు ఉండగా, ప్రస్తుతం రూ. 80కి చేరింది. పెరిగిన ధరలను ఆసరా చేసుకుంటున్న దళారులు గిరిజనుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ వినియోగదారులకు అధిక ధరలకు అంటగడుతున్నారు. కొండెక్కిన కోడిగుడ్డు నిరుపేదలకు సైతం అందుబాటులో ఉండే కోడిగుడ్డు ధరలు అమాంతం పెరిగాయి. 15 రోజుల క్రి తం కోడి గుడ్డు ధర రూ. 5 పలుకగా, ప్రస్తుతం ఏడున్నర రూపాయలకు అమ్ముతున్నారు. రిటైల్ దుకాణాల్లో వర్తకులు రూ. ఎనిమిది వరకు విక్రయిస్తున్నారు. ఇటీవల కోళ్లకు సంబంధించిన వ్యాధులు పెరగడంతో గుడ్ల ఉత్పత్తి తగ్గింది. దీనికి చలి సైతం తోడైంది. దీంతో కోళ్ల సంఖ్య తగ్గింది. హోల్సేల్ మార్కెట్లో వంద గుడ్ల ధర 15 రోజుల క్రితం రూ. 620 ఉండగా, ప్రస్తుతం రూ. 675కు పెరిగింది. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రతతో అక్కడ కోడిగుడ్ల ఎగుమతి పెరగడం ధరల పెరుగుదలకు మరో కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. -
పరిశీలించి.. సూచనలిచ్చి
చిన్నశంకరంపేట(మెదక్): మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పంచాయతీ వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను కలెక్టర్ రాహుల్రాజ్ ఆదివారం పరిశీలించారు. ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ ప్రక్రియ నిర్వహిస్తుండగా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో వచ్చిన రిజర్వేషన్కు రొటేషన్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 50 శాతం మహిళ రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ముందుగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎంపిక చేయడంతో పాటు 22 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించి, మిగితా స్థానాలు ఆన్ రిజర్వుడుగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. -
హెల్ప్డెస్క్ ద్వారా ప్రజావాణి
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం జరి గే ప్రజావాణి హెల్ప్డెస్క్ ద్వారా నిర్వహించ నున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా అధికారులంతా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నందున హెల్ప్డెస్క్ ద్వారా ప్రజల దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవే శపెడుతున్న పథకాలలో మహిళలకు మొదట ప్రాధాన్యం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేట రైతువేదికలో ఎస్హెచ్జీ సంఘాల సభ్యు లకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. త్వరలో మండలంలో సంఘం సభ్యులకు ఆర్టీసీ అద్దె బస్సు నిర్వహణతో పాటు స్థలం కేటాయిస్తే పెట్రోల్ బంక్ను మంజూరు చేయిస్తానని తెలిపారు. అనంతరం స్థానిక లైబ్రరీని సందర్శించారు. నిరుద్యోగుల కోసం రూ. లక్ష కేటాయించి పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఇన్చార్జి తహసీల్దార్ కిషోర్, ఎంపీడీఓ షాకీర్అలీ, ఏపీ ఎం శకుంతల, నాయకులు మధు, నారాగౌడ్, ఆర్ఎన్.సంతోష్, మురళిపంతులు తదితరులు పాల్గొన్నారు. మనోహరాబాద్(తూప్రాన్): రైల్వే అండర్పాస్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ ఇన్చార్జి (ఎస్సీసీ)కి కూచారం నేచర్ ఐకాన్ యూత్ సభ్యులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. కూచారం శివారులోని డిల్లాయి వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న రైల్వే అండర్పాస్ నిర్మాణ పనులను పరిశీలించడానికి వచ్చిన సికింద్రాబాద్ రైల్వే అధికారులను మండలంలోని కూచారం గ్రామానికి చెందిన నేచర్ ఐకాన్ యూత్ సభ్యులు కలిశారు. చిరు వర్షాలకే అండర్ పాస్లోకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోతున్నాయని తెలిపారు. నీరు నిల్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మెదక్ మున్సిపాలిటీ: ఫేక్ ట్రేడింగ్, జాబ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. ఆది వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. చిన్న పొరపాట్లు కూడా పెద్ద ఆర్థిక నష్టాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి డబ్బు దోచుకునే నకిలీ ట్రేడింగ్ యాప్లు, వెబ్సైట్లు విస్తరిస్తున్నాయని తెలిపారు. గుర్తు తెలియని లింకులు, యాప్లు డౌన్లోడ్ చేయవద్దన్నారు. బ్యాంక్ ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు ఎవరికి చెప్పొద్దన్నారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్లైన్్కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. మెదక్ కలెక్టరేట్: తెలంగాణ ఎయిడ్స్ కౌన్సిలర్ కంట్రోల్ యూనియన్ (టీఏసీసీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాముని రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజేశ్వర్ ప్రస్తుతం మెదక్ జిల్లా జనరల్ ప్రభుత్వాసుపత్రిలో ఎయిడ్స్ కౌన్సిలర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో టీఏసీసీయూ జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కమిటీలో పనిచేశారు. రాజేశ్వర్ ఎన్నిక పట్ల ఆదివారం టీజీఓ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
‘సాయి’ మార్గం అనుసరణీయం
మెదక్ కలెక్టరేట్: సత్య సాయిబాబా చూపిన సేవ, ధర్మమార్గం ఎల్లవేళలా అనుసరణీయమని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించిన సత్యసాయిబాబా శత జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మానవ సేవే పరమావదిగా సేవా కార్యక్రమాలు చేపట్టి విశిష్ట స్థానం సంపాదించారని తెలిపారు. ప్రేమ, ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. పేదలకు సత్యసాయి సేవా ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్య సేవలు, విద్యా సంస్థలు నిర్వహణ అందించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ రమేష్, సత్య సాయిబాబా సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు సిరిగే ప్రభాకర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చీరల పంపిణీ త్వరగా పూర్తి చేయాలి చేగుంట(తూప్రాన్): ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో చీరల పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పంపిణీ పూర్తి చేయాలని, చీరల కొరత ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ చిన్నారెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, ఏపీఎం దుర్గాప్రసాద్ మహిళ సంఘాల సభ్యు లు పాల్గొన్నారు.మెదక్మున్సిపాలిటీ: సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలు ఆమోఘమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సత్య సాయి శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ద్వారా వేలాది మందికి ఉచిత చికిత్స అందించడం గొప్పవిషయమని కొనియాడారు. ఆరోగ్యం, విద్య, సేవ రంగాల్లో ఆయన స్థాపించిన సంస్థలు దేశవ్యాప్తంగా లక్ష లాది మందికి ఆశాకిరణాలుగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్


