breaking news
Medak District Latest News
-
స్మార్ట్కు శ్రీకారం..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సంగారెడ్డి నుంచే శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కేంద్రంలో ఈనెల 15న బహిరంగ సభను నిర్వహించి.. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. సీఎం జిల్లాకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. బహిరంగసభ నిర్వహించాలని తలపెట్టిన అంబేద్కర్ స్టేడియాన్ని సోమవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ పరితోష్లు పరిశీలించారు. సభా వేధిక, సభకు హజరయ్యే వారికి కుర్చీలు, ఇతర సౌకర్యాలపై జగ్గారెడ్డి కలెక్టర్తో చర్చించారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు.. ఇలా భద్రత పరమైన ఏర్పాట్లను ఎస్పీ పరితోశ్పంకజ్ పరిశీలించారు. సీఎం హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్లో జిల్లాకు రానున్న నేపథ్యంలో తారా డిగ్రీ కాలేజీ హెలీప్యాడ్ను కూడా సందర్శించారు. జిల్లాకు వచ్చిన 4.46 లక్షల స్మార్ట్ కార్డులు.. ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభతరం చేసేందుకు ప్రభుత్వం కార్డుదారులకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్తో కూడిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా 1.06 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ కార్డులను అందించనున్నారు. ఏటీఎం కార్డు తరహలో ఉండే ఈ కార్డు ముందు భాగంలో కుటుంబ యజమాని ఫొటో, కార్డు నెంబర్తో పాటు, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ను స్కాన్ చేస్తే కార్డుదారుని కుటుంబసభ్యుల సమగ్ర వివరాలు వస్తాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 4.46 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఈ 4.46 స్మార్ట్ కార్డులు ఇప్పటికే సంగారెడ్డి జిల్లాకు చేరుకున్నాయి. భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు సీఎం సభకు భారీగా జన సమీకరణ చేయాలని ఇటు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వీలైనంత ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులను ఈ సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం కూడా ఈ సభకు జనసమీకరణ చేపట్టనున్నాయి. సంగారెడ్డితో పాటు, మెదక్, సిద్దిపేట జిల్లాలకు నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలను ఈ సభకు తరలించే అవకాశాలున్నాయి. ఈనెల 15న జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్రెడ్డి లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీకి ఏర్పాట్లు ఉమ్మడి జిల్లా నుంచి జన సమీకరణకు సమాయత్తం కలెక్టర్, ఎస్పీలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి అర్హులందరికీ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారందరికీ ప్రభుత్వం తెల్ల రేషన్కార్డులు పంపిణీ చేస్తోంది. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్రెడ్డిల పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం, మంత్రులకు ఘన స్వాగతం పలుకుతాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులైన వారికి రేషన్కార్డులు అందలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నాం. – జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ -
అమ్మవారికి తొట్టెల సమర్పణ
తూప్రాన్: పట్టణ కేంద్రంలో మహంకాళి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం పట్టణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. యువత డీజే సౌండ్స్, డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి ఘనంగా తొట్టెలను సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో జోగిని నిషాక్రాంతి బోనం ఎత్తుకొని చేసిన ప్రత్యేక నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం ఆగదు
మెదక్కలెక్టరేట్: కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తమ పోరాటం ఆగదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మెదక్లో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్కోడ్స్ ఎవరి ప్రయోజనాల కోసం అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కోడ్స్తో కేంద్ర ప్రభుత్వం పేదల కష్టాన్ని సంపన్నులకు దోచిపెడుతోందని ఆరోపించారు. కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు ఉద్యమం ఆపేది లేదని హెచ్చరించారు. అలాగే విద్యుత్రంగాన్ని ప్రైవేట్పరం చేసి, ఉచిత విద్యుత్ను రద్దుచేసి రైతులపై భారం వేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. విత్తన సవరణ చట్టం అమలు చేసి విదేశీ విత్తన సంస్థలకు లాభాలు తేవడమేనా దేశభక్తి అంటే అని నిలదీశారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోదీ ప్రభుత్వ విధానాలపై ఉద్యమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మల్లేశం, సంతోష్, గణేశ్రెడ్డి, యశోద, కవిత, దుర్గ, దేవయ్య, యాదగిరి, వెంకన్న, దాసు, స్వరూప, షౌకత్, సిద్దవ్వ, సాయిలు, ప్రమీల, దుర్గయ్య, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు ఊరుకోం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నేత అడివయ్య -
శాకాంబరీ దేవిగా కన్యకా పరమేశ్వరీ
నర్సాపూర్: పట్టణంలోని కన్యకా పరమేశ్వరీ మాత ఆలయంలో ఆషాఢం మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మాతకు ప్రత్యేక అలంకరణ చేశారు. శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పూజల్లో భక్తులు, పలువురు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో న్యాయమూర్తి శివ్వంపేట(నర్సాపూర్): ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహస్వామిని నర్సాపూర్ కోర్టు న్యాయమూర్తి హేమలత కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక సిబ్బంది న్యాయమూర్తికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వాదం అందజేశారు. ఈ మేరకు ఆలయ విశిష్టత గురించి న్యాయమూర్తికి వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్, పధాన అర్చకులు ధనుంజయ్శర్మ, విద్యాకర్చారి, జూనియర్ సహాయకులు నర్సింహారెడ్డి ఉన్నారు. కాంగ్రెస్లో చేరిక రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ నాయకులు వడ్డే శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, బాబు గౌడ్, వాజీద్లు పాల్గొన్నారు. -
ఘనంగా బండ్ల బోనాలు
నర్సాపూర్: నర్సాపూర్లో ఘనంగా ఘనంగా బండ్లు బోనాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పట్టణంలోని గ్రామ దేవతలు భూలక్ష్మమ్మ, దుర్గమ్మ, నల్లపోచమ్మకు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. బండ్లు, బోనాలతో తరలివచ్చి మొక్కులు చెల్లించారు. పలు సంఘాల ఆధ్వర్యంలో ఫలహారం బండ్లు ఏర్పాటుచేసి పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవులరాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినీరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీయాదవ్, రఘువీరారెడ్డిలతో పాటు ఆయా పార్టీల నాయకులు కౌన్సిలర్లు వేర్వేరుగా పాల్గొని పూజలు చేశారు. ఫలహారం బండ్ల వద్ద పూజలు చేస్తున్న ఎమ్మెల్యే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ , నాయకులు నల్లపోచమ్మ ఆలయం వద్ద బండ్లు బోనాల ఊరేగింపులో పాల్గొన్న భక్తులు -
ఐబీ భవనాన్ని కూల్చిన వారిపై చర్యలు
కంది(సంగారెడ్డి): మండల కేంద్రమైన కందిలో ఎలాంటి అనుమతులు పొందకుండా ఆర్ అండ్ బీ (ఐబీ) భవనాన్ని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ సదరు గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం గ్రామస్తులు కలసి ఆర్ అండ్ బీ భవనం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఆర్ అండ్ బీ అధికారుల నుంచి ఎలాంటి ఎన్ఓసీ తీసుకోకుండా భవనాన్ని ఎలా కూలుస్తారన్నారు. భవనాన్ని కూల్చివేసిన ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆర్ అండ్ బీ భవనంలో ఉన్న నాణ్యమైన టేకు కలప, ఇటుకలు, పునాది రాళ్లు, డోర్లు, కిటికీలు, రేకులు అన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ భవనాన్ని ఇష్టారాజ్యంగా కూల్చివేసిన వాహనాలు, ఆ వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు శంకర్గౌడ్, ఖాజాఖాన్, వడ్ల రవి, ఆనంద్రావు, కరీంఖాన్, జానీపాషా, ఆర్టీసీ నవాజ్, అర్జున్, సజ్జత్, బైండ్లనరసింహులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కంది గ్రామస్తుల డిమాండ్ -
బోనమెత్తిన మెతుకుసీమ
మెదక్ కలెక్టరేట్: మెతుకుసీమలో ఆషాఢ బోనాల సందడి నెలకొంది. గత కొన్ని వారాలుగా మెదక్ పట్టణంలోని పలు కులసంఘాలు గ్రామ దేవతలకు ఆషాఢ మాస బోనాలు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. దీంతో మెదక్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గత ఆదివారం ముదిరాజ్లు ఆరెకటిక సంఘాల ప్రజలు గ్రామ దేవతలైన మాత నల్లపోచమ్మ, ముత్యాలమ్మ, బోరంచమ్మ అమ్మవార్లకు బోనాలు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఆదివారం పట్టణంలోని విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం, పద్మశాలి సంఘాల ప్రజలు పట్టణంలోని మాత నల్లపోచమ్మ అమ్మవారికి, కాళీమాత అమ్మవార్లకు బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా డీజే సౌండ్లు, డప్పుచప్పుళ్ల మధ్య యువకుల కేరింతలతో బోనాల ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను నెత్తిన పెట్టుకుని అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బోనమెత్తిన ఎమ్మెల్యే రోహిత్రావు ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన స్వర్ణకార, పద్మశాలి సంఘాల బోనాల ఊరేగింపులో ఎమ్మెల్యే రోహిత్రావు పాల్గొని బోనమెత్తారు. అలాగే ఉత్సవాల్లో యువకులతో కలిసి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్, స్వర్ణకార సంఘం పట్టణధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బ్రహ్మచారి, వేణుచారి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మహేశ్చారి, కోశాధికారి రాజుచారి, యువజన అధ్యక్షుడు రవీందర్చారి, ప్రధాన కార్యదర్శి నరేశ్చారి, కోశాధికారి నవీన్చారి, పద్మశాలి సంఘాల జిల్లా అధ్యక్షుడు మేకల జయరాములు, పట్టణధ్యక్షుడు చెన్నా రామచందర్, కార్యదర్శి గుండు రమేశ్, కోశాధికారి బొద్దుల కృష్ణ, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు బొజ్జ పవన్, మహేశ్, భూపతిరాజు, బుడ్డ రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మెదక్లో బోనాల ఉత్సవాల్లో బోనం ఎత్తిన ఎమ్మెల్యే రోహిత్రావు స్వర్ణకార, పద్మశాలి సంఘాల బోనాల ఉత్సవాలు పట్టణంలో ఆధ్యాత్మిక సందడి -
శాకంబరీదేవిగా తునికి నల్లపోచమ్మదేవి
కౌడిపల్లి(నర్సాపూర్): ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా మండలంలోని తునికి నల్లపోచమ్మదేవి శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవాదాయశాఖ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్స్పెక్టర్, ఆలయ ఇన్చార్జి ఈఓ రంగారావ్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శివ్వప్ప, రాజేశ్ నల్లపోచమ్మదేవికి పంచామృతాలతో అభిషేకం చేసి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి ఒడిబియ్యం కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేశారు. పలువురు భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించి వాహనాలు పూజలు చేయించారు. ఆలయ జూనియర్ అసిస్టెంట్ వెంకట్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. -
ఘనాపురం..
రైతులకు జీవనాధారం...పంటలకు ప్రాణాధారమైన సాగునీరు వృథాగా పోతుంది. నీటిని చెరువుల్లోకి మళ్లించాల్సిన అధికారులు తమకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని చేతులెత్తేయగా పంటకాల్వల నుంచి దిగువకు వెళ్తున్న నీటిని చెరువుల్లో నింపి భద్రపరచాల్సి ఉంది. కానీ, సాగునీటి కాల్వల తూములు ధ్వంసం కావటంతో దిగువభాగంలోకి వృథాగా పోతున్నాయి. కొన్ని చెరువులకు మాత్రమే సరఫరా అవుతుండగా చివరాయ కట్టుగ్రామాలకు అంతంతమాత్రంగానే సరఫరా అవుతుండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మెదక్జోన్: వృథాగా పోతున్న ప్రాజెక్టు నీరు సంరక్షణ శూన్యం ‘వీబీజీ రామ్జీ’పథకంలో..! కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వీబీజీ రామ్జీ’పథకంలో చెరువులు, నీటి కాల్వలకు సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ పనులకు సంబంధించి నిధులు మంజూరు చేసి ఆదుకోవాలి. –సత్యనారాయణ, సర్పంచ్, జక్కన్నపేట ధ్వంసమైన పంటకాల్వల తూములు 15 రోజులుగా దిగువకు నీళ్లు మెతుకుసీమలో ఏకై క మధ్యతరహా ఘనాపురం ప్రాజెక్టు ఉంది. దీని సామర్థ్యం 0.367టీఎంసీలు మాత్రమే. ఇది పూర్తిగా సింగూర్ ప్రాజెక్టుపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఏటా విడతల వారీగా సింగూర్ నుంచి ఇందులోకి నీటిని వదులుతారు. కానీ, ఈ ఏడు సింగూర్ మరమ్మతుల నేపథ్యంలో అందులో నీటిని ముందుగానే వదిలేసి మరమ్మతులు చేస్తున్నారు. కాగా, గత కొన్ని రోజులుగా ఎగువ భాగాన కురుస్తున్నా వర్షాలకు ఘనాపూర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తటంతో పొంగిపొర్లుతోంది. ఆ నీరు కింది భాగంలోని ఎంఎన్, ఎఫ్ఎం కెనాళ్ల ద్వారా నీరు ప్రవహిస్తోంది. ఈ రెండు కెనాళ్లు మెదక్, హవేళిఘనాపూర్, పాపన్నపేట, కొల్చారం మండలాల్లో సుమారు 80 కిలోమీటర్ల మేర కాలువలు విస్తరించి ఉన్నాయి. 30 వేల ఎకరాలకు! ఈ రెండు కాల్వల ద్వారా అధికారికంగా 21,625 ఎకరాలకు సాగునీరందిస్తాయి. అనధికారికంగా మరో 5 వేల ఎకరాలు సాగవుతుంది. కాలువల నుంచి నీరు వదలగానే మెదక్, పాపన్నపేట, కొల్చారం, హవేళిఘనాపూర్ మండలాల పరిధిలోని 329 చెరువులను నింపి వాటిని భద్రపరిచి పంటపొలాలకు అవసరం ఉన్నప్పుడల్లా వినియోగించుకుంటారు. ఇది ప్రతి ఏటా జరిగే ప్రక్రియ. కాగా, గత కొన్ని రోజులుగా కాల్వల ద్వారా నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. దీంతో కొన్ని చెరువులు, కుంటలు నిండుతుండగా, మరికొంత నీరు వృథాగా పోతుంది. కాల్వల తూములు ధ్వంసం కావటంతో వాటికి మరమ్మతులు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఎలాంటి ఆదేశాలు రాలేదు..! ఎల్నినో కారణంగా ఘనాపూర్ ప్రాజెక్టు నుంచి దిగువ ఎంఎన్, ఎఫ్ఎం కెనాళ్లకు నీటిని వదలాలి అని తమకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఎగువ ప్రాంతంలో వర్షం కురవటంతో ప్రాజెక్టు నిండి కాల్వల ద్వారా ప్రవహిస్తోంది. ఈ కాల్వల తూములు ధ్వంసమయ్యాయి. వాటి మరమ్మతులకు ఎఫ్డీఆర్ నిధుల కోసం పంపించాం. అవి నేటికీ విడుదల కాలేదు. –హిమబిందు, ఇరిగేషన్ డీఈ, మెదక్ స్వయంగా రైతులే...! గతేడాది వరదలకు దెబ్బతిన్న తూములు, చెరువులను రైతులే బాగు చేయించుకున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచులు ముందుకొచ్చి వాటిని మరమ్మతులు చేయించారు. ఇందులోభాగంగా హవేళిఘనాపూర్ మండలం జక్కన్నపేట గ్రామం ఎంఎన్ కెనాల్ చివరాయకట్టులో ఉంది. జక్కన్నపేట చెరువు తూము గతేడాది ధ్వంసం కాగా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవటంతో ఆ గ్రామ సర్పంచ్ రూ.30 వేలు వెచ్చించి తూము సెంటర్ను కొనుగోలు చేసి అమర్చారు. ఇది ఒక్క జక్కన్నపేట పరిస్థితే కాదు అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. -
ఐసీడీఎస్ కార్యాలయం అస్తవ్యస్తం
పునర్విభజనలో అల్లాదుర్గంలో 2016లో ప్రభుత్వం ఐసీడీఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పెద్దశంకరంపేట మండలాలను కలుపుకుని ఈ కార్యాలయం ఏర్పాటైంది. ఇందులో 230 అంగన్వాడీ కేంద్రాలకు 9 సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఒక్కో సెక్టార్కు ఒక సూపర్వైజర్ను నియమించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 5 మంది సూపర్వైజర్లు మాత్రమే ఉన్నారు. 230 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించడం వీరికి ఇబ్బందిగా మారుతోంది. గ్రేడ్1 –2 పోస్టులు, గ్రేడ్ 2 –1 పోస్టు ఖాళీగా ఉన్నాయి. మరో సూపర్వైజర్ కరీంనగర్ జిల్లా చొప్పదండికి డిప్యూటేషన్పై వెళ్లారు. ఆమె స్థానంలో ఇక్కడికి ఎవరినీ డిప్యూటేషన్ వేయలేదు. అక్రమ డిప్యూటేషన్లు అల్లాదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సిబ్బంది కొరతతో అస్తవ్యస్తంగా మారితే, మరోవైపు అక్రమ డిప్యూటేషన్లు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. అల్లాదుర్గం సీడీపీఓగా లిఖిత, ఏసీడీపీఓగా సాధియాను ప్రభుత్వం నియమించింది. వీరు తమ పలుకుబడితో ఏళ్ల తరబడి హైదరాబాద్ డైరెక్టరేట్లో అక్రమంగా డిప్యూటేషన్ వేసుకుని అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. అల్లాదుర్గం సీడీపీఓగా మరొకరికి ఇక్కడికి డిప్యూటేషన్ వేశారు. ఏసీడీపీఓ డిప్యూటేషన్పై వెళ్లినా ఎవరినీ ఇక్కడ నియమించలేదు. కార్యాలయంలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పదేళ్లుగా మంజూరు చేయలేదు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. పదేళ్లుగా ఈ పోస్టుకు డిప్యూటేషన్పైనే విధులు నిర్వహించారు. డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్న వ్యక్తి బదిలీకావడంతో ఈ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. దీంతో ప్రతీ నెల నివేదికలు జిల్లా అధికారులు సమర్పించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కార్యాలయం నాలుగు భవనాలకు మార్పు ఐసీడీఎస్ కార్యాలయం నిర్వహణ అధికారులకు ఇబ్బందిగా మారింది. కొన్నేళ్లు ఎంపీపీ కార్యాలయంలో మరి కొన్నేళ్లు అద్దె భవనంలో, ప్రస్తుతం మహిళ మండలి భవనంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు భవనాల్లో కార్యాలయం మార్చారు. సొంత భవనం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో కార్యాలయ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రాజెక్టు సమావేశం జరిపేందుకు అధికారులు పడుతున్న బాధలు వర్ణానాతీతం. అల్లాదుర్గంలో ఐసీడీఎస్ కార్యాలయానికి సొంత భవనం నిర్మాణానికి నెల రోజుల్లో శంకుస్థాపన చేస్తానని మంత్రి మే 9న అల్లాదుర్గంలో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. మంత్రి హామీ ఇచ్చి మూడు నెలలు గడిచిన శంకుస్థాపన లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఐసీడీఎస్ కార్యాలయ భవనంతోపాటు సిబ్బందిని నియమించాలని, అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పదేళ్లుగా మంజూరు కాని పోస్టులు ఉన్నవారికి డిప్యూటేషన్ ఇదేం పాలనో అంటున్న ప్రజలు పునర్విభజనలో పదేళ్ల క్రితం ఐసీడీఎస్ కార్యాలయం మంజూరైంది. కార్యాలయం మంజూరైనా అందుకవసరమైన సిబ్బందిని మాత్రం ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. మరోవైపు ఉన్న సిబ్బందిని మరో చోటుకు డిప్యూటేషన్లు వేయడం, మరో చోటు నుంచి ఇక్కడికి డిప్యూటేషన్లు వేసి కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో సిబ్బందికి లేక అస్తవ్యస్తంగా మారింది. మొత్తంగా ఇదీ అల్లాదుర్గం ఐసీడీఎస్ కార్యాలయం దుస్థితి. అల్లాదుర్గం(మెదక్): -
గోమారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల ఘర్షణ
శివంపేట (నర్సాపూర్): మండల పరిధిలోని ఎమ్మెల్యే సునీతారెడ్డి స్వగ్రామైన గోమారంలో బోనాల ఉత్సవాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామాల్లో బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఇరు పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో గొడవ ప్రారంభమై ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకుంటూ దాడులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని గొడవలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అదుపులోకి రాలేదు. ఎస్సై మధుకర్రెడ్డి ఆధ్వర్యంలో అదనపు పోలీసు బలగాలు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పటాన్చెరు టౌన్: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బీజేపీ, ప్రభుత్వ కార్మిక, కర్షక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు సోమవారం దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ నర్సింహారెడ్డి తెలిపారు. పటాన్చెరు జీహెచ్ఎంసీ కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహానికి ఆదివారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ..మహాత్మాగాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమించి స్వాతంత్య్ర పోరాటాన్ని మరింత ఉధృతం చేశారన్నారు. అదే స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 10న జైల్ భరో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ తోషిబా కార్మిక సంఘం నాయకుడు సుధాకర్రాజు, ఏషియన్ పెయింట్స్ హమాలీ కార్మిక సంఘం కార్యదర్శి రతన్సింగ్, వినోద్నాయక్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, యూత్ కాంగ్రెస్ నాయకుడు అక్షిత్రాజు తదితరులు పాల్గొన్నారు. తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి నారాయణఖేడ్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి పేర్కొన్నారు. ఖేడ్లో ఆదివారం నిర్వహించిన సంఘం డివిజన్ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ...ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రధాన హామీ సీపీఎస్ రద్దును పూర్తిగా మర్చిపోయారన్నారు. పీఆర్సీని వెంటనే ప్రకటించి డీఏ బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించాలని కోరారు. ప్రీ ప్రైమరీ బడుల్లో కొత్త నియామకాలు పూర్తి చేయాలన్నారు. సంఘం రాష్ట్ర సేవ కో– కన్వీనర్ చంద్రశేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్, జిల్లా, డివిజన్ బాధ్యులు వినయ్, రాజయ్య, రాజశేఖర్, రతన్సింగ్, మశ్చందర్, మహేశ్, పద్మనాభం, రాజు, జగదీశ్వర్ పాల్గొన్నారు. పాడిపంటలతో సంతోషంగా ఉండాలి శివ్వంపేట(నర్సాపూర్): వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడిపంటలతో సంతోషంగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకున్నట్లు ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే సునీతారెడ్డి స్వగ్రామమైన గోమారంలో కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ దేవతలకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. -
హామీలను అమలు చేయాలి
నారాయణఖేడ్: కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అంజాగౌడ్ డిమాండ్ చేశారు. కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ల పరిష్కారం కోసం చేపడుతున్న యాత్రకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆయన మండల కేంద్రమైన నిజాంపేటలో ఆదివారం సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాత్రను విజయవంతం చేయాలని కోరారు. గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కమలాగౌడ్, ఉపాధ్యక్షుడు ప్రతాప్గౌడ్, జిల్లా, స్థానిక సంఘం బాధ్యులు శివకుమార్గౌడ్, శ్రీనివాస్గౌడ్, భాస్కర్గౌడ్, ఎల్లాగౌడ్, దుర్గాగౌడ్, వెంకటేశంగౌడ్ పాల్గొన్నారు. -
తప్పినట్టేనా!
ఎల్నినో ముప్పు విస్తారంగా కురుస్తున్న వర్షాలు ముమ్మరంగా పంటలసాగు ఇప్పటివరకు 2.50 లక్షల ఎకరాలసాగు ఇప్పటి వరకు 35% అధిక వర్షపాతం నమోదు గతేడాదితో పోల్చితే మెరుగ్గా భూగర్భజలాలు పత్తిపంట సాగు జిల్లా వ్యాప్తంగా ఈసారి అన్నిరకాల పంటలు మూడు లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగవుతాయని, అందులో సింహభాగం వరిపంట 2.50 లక్షల ఎకరాల్లో, పత్తితో పాటు ఇతర పంటలు 50 వేల ఎకరాలకు పైగా సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసి అందుకు సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచారు. కాగా, జూన్ 2వ వారంలో రాష్ట్రానికి ఎల్నినో ముప్పు ఉందని, దీర్ఘకాలిక పంటలకు బదులుగా స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని, వరికి బదులుగా ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా పప్పు ధాన్యాలు సాగు చేయటం మంచిదంటూ వందశాతం సబ్సిడీపై కంది విత్తనాలను రైతులకు ఉచితంగా సరఫరా చేశారు. రైతువేదికల్లో విత్తన మేళాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. 2.50 లక్షల ఎకరాల్లో సాగు! జిల్లాలో చెప్పు కోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేక పోవటంతో 90% రైతాంగం బోరుబావుల ఆధారంగానే పంటలను సాగుచేస్తారు. కాగా జూన్ మొదటి వారంలోనే బోరుబావుల వద్ద తుకాలు(నారుమళ్లు) పోశారు. ఆ నెలలో లోటువర్షపాతం నమోదు కావటంతో ఆందోళన చెందిన అన్నదాతలు ఆ తర్వాత మాసం జూలై నుంచి ఇప్పటివరకు విస్తారంగా వానలు కురవటంతో సాధారణ వర్షపాతాన్ని మించి ఎక్సెస్ వర్షపాతం నమోదైంది. దీంతో ఇప్పటివరకు 60 నుంచి 70% చెరువులు, కుంటలు నిండాయి. ఇప్పటివరకు 2,50,060 ఎకరాల్లో పంటలను సాగు చేశారు. ఇందులో సింహభాగం వరి 2.10 లక్షల ఎకరాలు సాగైంది. రెండో స్థానంలో పత్తి 38 వేల ఎకరాల్లో సాగు కాగా ఇతర పంటలు 2 వేల ఎకరాలకు పైచిలుకు సాగయ్యాయి. కాగా ఈ సంఖ్య మరో 30 వేల పై చిలుకు పెరగనుందని అధికారులు చెబుతుండగా అంతకుఎక్కువగానే సాగుకానున్నట్లు క్షేత్రస్థాయిలో తెలుస్తోంది. జిల్లాలో జూలై నాటికి భూగర్భజలాలు మొత్తంగా 13.73 మీటర్లలో లోతులో ఉన్నాయి. గతేడాది జూలైలో 14.16 మీటర్లలోతులో ఉండగా ఈ ఏడాది కాస్త మెరుగానే ఉన్నాయి. 35% అధికం! వాతావరణ శాఖ అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో జూన్ నెల నుంచి ఇప్పటివరకు 368.8 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 498.5 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ లెక్కన 129.8 మి.మీటర్ల వర్షం అధికంగా నమోదైంది. అంటే 35% వర్షం అధికంగా కురిసింది. దీంతో మెదక్ సీమకు పొంచి ఉన్న ఎల్నినో ముప్పు తప్పినట్టేనంటూ అన్నదాతలు సంతోషిస్తున్నారు. పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ పెద్దలు, వ్యవసాయశాఖ అధికారులు అందరూ ఎల్నినో ముప్పు పొంచి ఉందని, ఆశించిన మేర వానలు కురవవని రైతులు స్వల్పకాలిక పంటలను మాత్రమే సాగు చేయాలంటూ పదేపదే చెబుతున్నారు. కానీ ఒక్క జూన్లోనే లోటు వర్షపాతం నమోదు కాగా ఆ తర్వాత విస్తారంగా కురుస్తున్న వర్షాలకు లోటునుంచి అధికవర్షపాతం నమోదైంది. ఇక ఎల్నినో ముప్పుతప్పినట్టేనని రైతాంగం విరివిగా పంటలను సాగు చేస్తున్నారు. సాధారణ సాగుకు చేరువలో ఉన్నారు. మెదక్జోన్: -
పరిశ్రమ వ్యర్థ జలాలను అరికట్టండి
సంగారెడ్డి: చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు మంత్రి దామోదర రాజనర్సింహకు శనివారం సంగారెడ్డిలో వినతిపత్రం సమర్పించారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయన జలాలను సరిగ్గా శుద్ధి చేయకుండానే పైపుల ద్వారా మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారని వారు ఆరోపించారు. వర్షాలు కురిసే సమయాన్ని ఆసరాగా చేసుకుని వ్యర్థ జలాలను నదిలోకి వదులుతున్నారని దీనివల్ల మంజీరా నది కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నదిపై ఆధారపడిన రైతులు, మత్స్యకారులు, పశుపోషకులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. కాలుష్యం కారణంగా చేపలు, ఇతర జలచరాలు మృత్యువాత పడుతున్నాయని, ఈ నీటిని సాగుకు వినియోగిస్తే పంటలు దెబ్బతింటాయని వివరించారు. మంజీరా నది నీటిని తాగుకు వినియోగిస్తున్నందున అధికారులు వెంటనే స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యంపై విచారణ చేపట్టాలని కోరారు. నది నీటినమూనాలను సేకరించి శాసీ్త్రయ పరీక్షలు నిర్వహించాలని, కాలుష్యానికి కారణమైనవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులవినతిపై స్పందించిన మంత్రి దామోదర వ్యర్థ జలాల విడుదలపై క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠపురంలో మంత్రి దామోదర పూజలు సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపురంలో శనివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. మంత్రి దామోదరకు శివంపేట గ్రామస్తుల వినతి -
వడ్డెరల ఉపాధికి అనుమతులివ్వాలి
కొల్చారం(నర్సాపూర్): వడ్డెరల ఉపాధికి ప్రభుత్వం చట్టపరమైన అనుమతి ఇవ్వాలని మెదక్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు దండుగుల దుర్గ సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పోతంశెట్టిపల్లి చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు ఓర్స ఈశ్వర్ అధ్యక్షతన శనివారం జిల్లా వడ్డెరల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సాయిలు మాట్లాడుతూ తమ తాతల కాలం నుంచి తండ్రుల వరకు, ప్రస్తుతం తమ కుటుంబాలు కూడా రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం రాయి కొట్టే వృత్తికి అడ్డంకులు ఏర్పడటంతో వడ్డెర కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ప్రతీ మండలంలో అటవీశాఖ అధికారులు రాళ్లు కొట్టే తమ సంప్రదాయ వృత్తిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తమ వడ్డెరల సమస్యలను ప్రత్యేకంగా పరిగణించి జీవనోపాధి కోసం అడవుల్లో ఉన్న అనుమతించదగిన బండలపై రాయి కొట్టుకునేందుకు చట్టబద్ధమైన అనుమతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వడ్డెరలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్గా జైపాల్ను, తెలంగాణ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా గుంజ రేణుకను నియమించడం పట్ల వడ్డెర సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు సాయిలు -
సహకారంలో సందడి
సహకార సంఘాల్లో సందడి షురూవైంది. పీఏసీఎస్ (సహకార సంఘాలు) పాలకవర్గాలకు పదవులు ఆశిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సభ్యత్వాలు లేని నాయకులు ఆయా పీఏసీఎస్లలో కొత్తగా సభ్యత్వాలు తీసుకుంటున్నారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ● ఈ పదవులు రావాలంటే ఆయా సహకార సంఘాల్లో సభ్యత్వం తప్పనిసరి ● లేని వారు కొత్తగా సభ్యత్వం తీసుకుంటున్న ఆశావహులు ● డీసీసీబీ, డీసీఎంఎస్ పదవుల కోసమూ కొందరు నేతల ప్రయత్నాలు పీఏసీఎస్ చైర్మన్ డైరెక్టర్ పదవులపై కాంగ్రెస్ నేతల గురిసభ్యత్వం ఉంటేనే చైర్మన్, డైరెక్టర్ పదవులకు అర్హత కావడంతో లేనివారు కొత్తగా సభ్యత్వాలు చేసుకుంటున్నారు. అవసరమైతే ఆయా పీఏసీఎస్ల పరిధిలో వ్యవసాయ భూమి లేకపోతే..కొనుగోలు చేసి మరీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. పీఏసీఎస్ పరిధిలోని గ్రామాల్లో తప్పనిసరిగా భూమి ఉండాల్సి ఉండటంతో ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 105 పీఏసీఎస్లున్నాయి. ఇందులో సంగారెడ్డి జిల్లాలో 54 ఉండగా, మెదక్లో 36, సిద్దిపేట 15 సంఘాలున్నాయి. సిద్దిపేట జిల్లాలో కొన్ని సంఘాలు ఇతర జిల్లాల డీసీసీబీ పరిధిలో ఉన్నాయి. కేవలం 15 మాత్రమే ఉమ్మడి జిల్లా డీసీసీబీ పరిధిలో కొనసాగుతున్నాయి. ఒక్కో పీఏసీఎస్కు చైర్మన్తోపాటు, 13 మంది డైరెక్టర్ పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులను ప్రభుత్వం నామినేట్ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఈ పదవులపై గురి పెట్టారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న పీఏసీఎస్లకు సంబంధించిన ఈ పోస్టులకు నామినేట్ చేయాల్సిన వారి పేర్లను స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు ఆశాఖ మంత్రి వద్దకు పంపినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గ ఇన్చార్జిలు ఈ పదవులు ఎవరికి ఇవ్వాలనే పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇన్చార్జి మంత్రి ద్వారా ఈ ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. కాగా పీఏసీఎస్ల పాలకవర్గాల పదవీకాలం 2025 జనవరిలోనే ముగిసిన విషయం విదితమే. అప్పటి నుంచి అన్ని పీఏసీఎస్లకు సంబంధిత అధికారులు పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లను మార్క్ఫెడ్లో విలీనం చేయాలని ప్రభుత్వం చాలారోజుల క్రితమే నిర్ణయం తీసుకుంది. కానీ, ఇంతవరకు దానికి సంబంధించిన జీఓ రాలేదు. ఈ డీసీఎంఎస్ చైర్మన్, పాలకవర్గం పదవులను కూడా నామినేట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ పదవి రేసులో జహీరాబాద్కు చెందిన అధికార పార్టీ నాయకుడి పేరు వినిపిస్తోంది. అలాగే అందోల్ నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి కోసం ఆయన యూ.ఎస్. నుంచి తిరిగి వచ్చినట్లు అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద సహకార సంఘాల్లో నామినేటెడ్ సందడి అంతర్గతంగా కొనసాగుతోంది. మరోవైపు ఈ పదవుల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులు విచారణలో ఉన్నప్పటికీ అధికార పార్టీలో మాత్రం ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తుండటం ఆసక్తికరంగా మారింది. పర్సన్ ఇన్చార్జిలుగా ఉన్న సమయంలో కొత్త సభ్యత్వాలు తీసుకుంటే అవి చెల్లవని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. పర్సన్ ఇన్చార్జిలు కేవలం ఆయా సంఘాల కార్యకలాపాలు కొనసాగించేందుకు తాత్కాలికంగా ఉంటారని చెబుతున్నారు. ఈ పర్సన్ ఇన్చార్జిలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం సహకార చట్టంలో లేదని పేర్కొంటున్నారు. ప్రధానంగా సభ్యత్వాలు ఇచ్చే అధికారం పర్సన్ ఇన్చార్జిలకు ఉండదని అంటున్నారు. జిల్లా కేంద్రం సహకారం బ్యాంకు (డీసీసీబీ) పాలక వర్గం పదవులపైనా నేతలు గురి పెట్టారు. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నాయకులు డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు డీసీసీబీ చైర్మన్గా పని చేసిన చిట్టి దేవెందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. -
అలుగు పారుతోంది
కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే చెరువులు గుంటల్లోకి భారీస్థాయిలో వర్షపునీరు వచ్చి చేరుతోంది. చిన్న చెరువులు, కుంటలు ఇప్పటికే అలుగు పారుతున్నాయి. వరిగుంతం శివారులోని కుడి చెరువు వర్షపు నీటితో నిండి అలుగు పారుతుండటంతో చేపలు పడుతూ చిన్నారులు, పెద్దల సందడి చేస్తున్నారు. అలుగు పైనుంచి దూకి వస్తున్న నీటిలో నుండి చిన్న చేపలు వస్తుండటంతో వాటిని పట్టేందుకు చిన్నారులు నానా రకాలుగా పడుతున్న దృశ్యాలను శనివారం ‘సాక్షి’తన కెమెరాలో బంధించింది. కొల్చారం(నర్సాపూర్)చెరువు అలుగు వద్ద చేపలు పడుతున్న దృశ్యాలు -
అభివృద్ధికి నోచని మురికి వాడలు
జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మురికివాడలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి. దీంతో ప్రజలు అను నిత్యం అవస్థలు పడకతప్పడం లేదు. నిధులు కేటాయింపులు లేకపోవడం కూడా సమస్యకు కారణంగా ప్రజలు పేర్కొంటున్నారు. పట్టణంలోని బాగారెడ్డిపల్లి, రామ్నగర్, శాంతినగర్, డ్రైవర్స్కాలనీ, ఫరీద్కాలనీ, కాంతారెడ్డికాలనీ, బాగారెడ్డినగర్, ఆర్యనగర్, ఐడీఎస్ఎంటీ కాలనీ, వెంకటరమణకాలనీ, గడిహరిజనవాడ, పస్తాపూర్, అల్లీపూర్, హరిజనవాడలతో పాటు పలు కాలనీలు సమస్యలకు నిలయంగా మారాయి. ప్రధానంగా రోడ్ల నిర్మాణాలు లేక పోవడంతో వర్షాకాలంలో ప్రజలు రోడ్లపై నడవాలన్నా నానాఅవస్థలు పడక తప్పడం లేదు. కొత్త పాలక మండలి వస్తే సమస్యలు తీరుతాయని ఆశించిన ప్రజలకు చివరకు నిరాశే కలుగుతోంది. వర్షం కారణంగా రోడ్లన్నీ బురదమయంగా దర్శనమిస్తున్నాయి. బురదలో నుంచి రాకపోకలు సాగించాలన్నా ప్రజలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల అధ్వాన స్థితిపై ఆయా వార్డుల్లోని కౌన్సిలర్లు నిధులు కేటాయించాలంటూ అధికారులు, ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. తన వార్డు అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం లేదంటూ ఇటీవల 8వ వార్డు కౌన్సిలర్ సోని భర్త ఇర్మియా చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం స్పందించి నిధులను కేటాయించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. -
లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న న్యాయమూర్తి
శివ్వంపేట(నర్సాపూర్): ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహస్వామిని మెదక్ జిల్లా కోర్టు న్యాయమూర్తి నీలిమ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది న్యాయమూర్తికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆచరించారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వాదం చేశారు. ఆలయ ఈఓ శ్రీనివాస్ సన్మానించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ధనుంజయ్శర్మ, చండీకశర్మ, విద్యాకర్చారి, జూనియర్ సహాయకులు నర్సింహారెడ్డి, తదితరులున్నారు. డీఎస్పీ ప్రసన్నకుమార్ హవేళిఘణాపూర్(మెదక్): పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టిసారించి నేరాల నియంత్రణకు కృషి చేయాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ స్పష్టం చేశారు. ఆయన కార్యాలయంలో శనివారం సీఐ, ఎస్ఐలతో నేరాల కట్టడి, సైబర్ కేసులు, పెండింగ్లో ఉన్న కేసులు, నాన్బెయిలెబుల్ వారెంట్లు, డ్రగ్స్ నిర్మూలన వాటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. పోలీస్స్టేన్ల వారీగా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. సమావేశంలో మెదక్ రూరల్ సీఐ కృష్ణమూర్తి, ఎస్ఐలు పాల్గొన్నారు. పంటపొలాలకు వెళ్లే దారిని ఆక్రమణ చేస్తున్నారని గ్రామస్తుల ఆగ్రహం చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం జప్తిశివనూర్ జాతీయ రహదారిని అనుకుని ఉన్న మాజీమంత్రి షబ్బీర్ అలీ గెస్ట్హౌజ్ వద్ద నిర్మిస్తున్న ప్రహారీని గ్రామస్తులు ధ్వంసం చేశారు. పంటపొలాలకు వెళ్లేదారిని ఆక్రమించి గోడ నిర్మాణం చేపట్టడంతో గ్రామస్తులు ఆగ్రహంతో గోడను కూలకొట్టారు. జాతీయ రహదారి నుంచి చెరువుకట్టపై తాము పంటపొలాలకు వెళ్లేందుకు దారి ఉందని తెలిపారు. ఇంతకుముందు కూడా ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని చెప్పినా వినకుండా అడ్డుగోడ పెట్టారని చెప్పారు. దీంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రహారీని ధ్వంసం చేశారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు
స్పందించిన ఎమ్మెల్యే సునీతారెడ్డి శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ లేని విషయం గురించి శుక్రవారం ‘ఉగ్గబట్టుకుంటున్నారు’శీర్షికతో శుక్రవారం‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి స్పందించారు. కలెక్టర్, జిల్లా వైద్యాధికారికితో ఫోన్లో మాట్లాడారు. శివ్వంపేటలో పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్థల ఎంపిక చేయాలని సూచించారు. టాయిలెట్స్ నిర్మాణానికి సంబంధించి నిధులు సమకూర్చనున్నట్లు ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి పాపన్నపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను చెల్లించాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్ చేశారు. ఏడుపాయల దుర్గాభవానీమాతను శుక్రవారం దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలన్నారు. 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్ విధానాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఎంప్లాయ్ హెల్త్ స్కీంను రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమల్లోకి తేవాలని కోరారు. ఫ్లెక్సీల చించివేత, కేసులు నమోదు తూప్రాన్: మహంకాళి జాతర సందర్భంగా మరోసారి కాంగ్రెస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఒక వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా మరో వర్గం వాటిని చించివేసింది. ఈ వ్యవహారం చివరకు ఫిర్యాదులు, పోలీసు కేసుల వరకు వెళ్లింది. తూప్రాన్లో మహంకాళమ్మ ఆలయంలో ఆదివారం నుంచి జాతర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పట్టణంలో విస్తృతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఇక్కడే కాంగ్రెస్ వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హన్మంతరావుకు చెందిన ఒక వర్గం, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి వర్గం రెండు వర్గాలుగా అధిపాత్య పోరాటం కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా తమ ఫ్లెక్సీలను చించి వేశారంటూ మైనంపల్లి వర్గానికి చెందిన పట్టణ శాఖ అధ్యక్షుడు గరిగే నర్సింగ్రావు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఏర్పుల సాయికుమార్, తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగరాజు తెలిపారు. సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న జైలుభరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మండలంలోని కంబాలపల్లి,రేజింతల్ తదితర గ్రామాల్లో శుక్రవారం ఆటో ప్రచార జాత నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలన్నారు. జైలుభరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
పంద్రాగస్టు వేడుకకు ఏర్పాట్లు
మెదక్ కలెక్టరేట్: ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించేందుకు మైదానాన్ని, వేదికను సిద్ధం చేయాలని సూచించారు. వేడుకల సందర్భంగా ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రజలకు కూర్చునేందుకు కనీస ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన స్టాళ్లు, శకటాల ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. వేడుకల్లో ప్రసంగించేందుకు వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన ప్రగతి సందేశాన్ని తయారు చేయాలని జిల్లా ప్రణాళిక అధికారికి తెలిపారు. వేడుకలకు వచ్చే విద్యార్థులకు, ప్రజలకు కనీస వసతులు కల్పించాలన్నారు. జాతీయభావం పెంపొందించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందించేందుకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్కుమార్, సింగ్, డీఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు. అనంతరం రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ నెలవారి తనిఖీ నిర్వహించారు. అనంతరం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తోపాటు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జిల్లా అటవీ అధికారి జోజి జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ -
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
మెదక్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్హెచ్–44 జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్స్పాట్లను శుక్రవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా ఎన్హెచ్–44 నుంచి గ్రామాలకు వెళ్లే అనుసంధాన రహదారులు, డివైడర్ ఓపెనింగ్లు ఉన్న ప్రాంతాలపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులోభాగంగా బంగారమ్మ టెంపుల్, కుచారం గ్రామం వద్ద ఉన్న బ్లాక్స్పాట్లను పరిశీలించి, ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాలు అధికంగా ఉండటంతో భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయని, ముఖ్యంగా వాహనాలు యూటర్న్ తీసుకునే ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు ఎస్పీకి వివరించారు. ఈ సందర్భంగా ఎన్హెచ్ఎఐ రీజినల్ మేనేజర్ రంగారావుతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ చర్చించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐలు వెంకటరాజాగౌడ్, సందీప్రెడ్డి, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్గౌడ్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు -
జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలి
మెదక్జోన్: గద్దర్ తన జీవితాన్ని ప్రజలకోసమే అర్పించారని మెదక్ జిల్లాకు ఆయన పేరుపెట్టాలని, తెలంగాణ సాంస్కృతిక చైర్పర్సన్ డాక్టర్ గుమ్మడి వెన్నెల కోరారు. గద్దర్ మూడవ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న గద్దర్ విగ్రహస్థలంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...గద్దర్ జీవితాంతం పేద, బడుగు, బలహీన వర్గాల కోసమే త్యాగం చేశారని, ఆ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని పేర్కొన్నారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సాంస్కృతిక చైర్పర్సన్ డాక్టర్ గుమ్మడి వెన్నెల -
కట్ట మైసమ్మకు బోనాలు
రెడ్డిపల్లి గ్రామంలో బోనాల ఉరేగింపు అల్లాదుర్గం(మెదక్)/నర్సాపూర్: మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం కట్ట మైసమ్మకు బోనాలు తీశారు. మహిళలు బోనాల ఊరేగింపుతో శివసత్తుల నృత్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. బోనాలతో గ్రామంలో పండగ వాతావరణం చోటు చేసుకుంది. కాగా, ఈ నెల 9,10 తేదీల్లో నర్సాపూర్లో బోనాల పండుగ నిర్వహించనున్నారు. నర్సాపూర్లోని గ్రామదేవతలు ముత్యాలమ్మ, నల్లపోచమ్మ, భూ లక్ష్మమ్మ, దుర్గామాతలకు ఆదివారం, సోమవారం ప్రజలు ప్రత్యేక పూజలు చేసి బండ్ల ఊరేగింపుతోపాటు బోనాలు చేసి దేవతలకు మొక్కులు సమర్పించనున్నారు. -
ఆదర్శ పాఠశాలలు!
పాపన్నపేట(మెదక్): గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించాలన్న లక్ష్యంతో కేంద్రప్రభుత్వం 2013లో మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేసింది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యనందిస్తున్నారు. ఒక్కో పాఠశాలలో 820 విద్యార్థుల ప్రవేశానికి అవకాశముంది. 5 నుంచి 10 తరగతి వరకు 500, ఇంటర్మీడియెట్లో 320 విద్యార్థులు ప్రవేశం పొందవచ్చు. ప్రతీ స్కూల్లో 100 విద్యార్థినులకు హాస్టల్ వసతి ఉంది. జిల్లాలో పెద్దశంకరంపేట స్కూల్లో ఇంకా హాస్టల్ ప్రారంభం కాలేదు. అయితే కొన్నిచోట్ల పాఠశాలలు దూరంగా ఉండటం, రోజు రోజుకు గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు పెరుగుతుండటంతో మోడల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్న అభిప్రాయాలున్నాయి. ప్రాథమిక పాఠశాలలతో బలోపేతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్కు డిమాండ్ ఉంటుంది. కాంపిటేటివ్ పరీక్షలు, సివిల్స్ లాంటి ప్రవేశ పరీక్షలకు సీబీఎస్ఈ సిలబస్ తోడ్పడుతుందని విద్యావేత్తలు భావిస్తారు. అందుకే మోడల్ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్తోపాటు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే సీబీఎస్ఈ బోర్డు నుంచి ఎఫిలియేషన్ పొందాల్సి ఉందని సమాచారం. టేక్మాల్ మోడల్ స్కూల్ప్రీ ప్రైమరీతోపాటు..ప్రాథమిక విద్య అందుబాటులోకిఆదర్శ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నూతన చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇక మీదట సీబీఎస్ఈ స్కూళ్లుగా మార్చేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అలాగే 2027–28 నుంచి ప్రీ ప్రైమరీతోపాటు ప్రాథమిక పాఠశాలలు కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. తద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తోంది. మెదక్ జిల్లాలో ప్రస్తుతం 7 మోడల్ స్కూళ్లు ఉండగా, 5,740 విద్యార్థులు నమోదయ్యే అవకాశముంది. కాగా ప్రస్తుతం 4,545 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో 7 మోడల్ స్కూళ్లు..మొత్తం 4,545విద్యార్థులు సీబీఎస్ఈ సిలబస్ ధ్యేయంగా మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ స్టేట్ సిలబస్లో కూడా విద్యార్థులు రాణిస్తున్నారు. ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. గతేడాది ఎస్సెస్సీలో 4 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాం. చేగుంట పాఠశాల విద్యార్థిని అస్మితారాజ్ 576 మార్కులతో జిల్లాలో రెండోస్థానంలో నిలిచింది. అన్ని పాఠశాలల్లోలాగే మోడల్ స్కూళ్లలో కొంత మేర అడ్మిషన్లు తగ్గాయి. – చంద్రకళ, నోడల్ ప్రిన్సిపల్, చేగుంట -
కలిసి పనిచేస్తేనే అభివృద్ధి
వెల్దుర్తి(తూప్రాన్): అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండలస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మండలంలోని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజాసమస్యలపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ అధికారుల తీరుపై మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి దీపాలకు ప్రత్యేక లైన్ ఏర్పాటు, భూమికి అతి తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణ చర్యలు, విద్యుత్ పోల్ల ఏర్పాటుతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించడంలో లైన్మెన్లు, సిబ్బంది పట్టించుకోవడంలేదని వాపోయారు. మండల కేంద్రం వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేయాలని, గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లులు నుంచి మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో సర్పంచ్లు తీర్మానించి సంబంధిత కాపీని ఎమ్మెల్యేకు అందజేశారు. వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ మండల స్థాయి సమీక్షకు ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారని తెలుసుకున్న వెల్దుర్తి గ్రామానికి చెందిన యువకులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి బైఠాయించారు. మండల కేంద్రంలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నియోజకవర్గానికి తెలంగాణపబ్లిక్ స్కూల్ మంజూరుకాగా, మండల కేంద్రం వెల్దుర్తిలోని జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేయాలని తాను కలెక్టర్కు ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి -
చేనేతకు అండగా నిలవాలి
పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా నిలవాలని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజకుమార్ విజ్ఞప్తి చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం పెద్ద శంకరంపేటలో చేనేత కార్మికులు పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కండేయ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...చేనేత వృత్తిమీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న చేనేత కార్మికులందరికీ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందజేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిరిగా తెలంగాణలోనూ చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ప్రతీ ఒక్క చేనేత కార్మికుడికి ఆర్థికసాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మేకల జయరాములు, మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు మహంకాళి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి రాష్ట్ర సంఘం అధ్యక్షుడు రాజ్కుమార్ -
విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి
మెదక్జోన్: విద్యార్థులు మొబైల్ వ్యసనానికి దూరంగా ఉంటూ లక్ష్య సాధనకు కృషి చేయాలని అదనపు ఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో గురువారం నిర్వహించిన మొక్కల పెంపకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటిన ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. జీవితంలో విజయం సాధించేందుకు ప్రతిభతోపాటు క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, ఆత్మవిశ్వాసం అవసరమని పేర్కొన్నారు. విద్యార్థి దశలో అలవర్చుకునే మంచి అలవాట్లే భవిష్యత్తుకు బాటలు వేస్తాయని చెప్పారు. తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని, అందుకు అవసరమైన విద్య, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. మాదకద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, చదువు, భవిష్యత్తును దెబ్బతీస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేశం, ఎస్ఐలు నారాయణ, నరేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ -
ఎరువుల దుబారాకు యాప్ కళ్లెం
పాపన్నపేట(మెదక్): రాయితీ ఎరువుల వినియోగాన్ని క్రమబద్దీకరించేందుకు తీసుకొచ్చిన ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ యాప్’మెదక్ జిల్లాలో శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఇంతవరకు యూరియాకే పరిమితమైన యాప్ బుక్కింగ్ ఇక నుంచి అన్ని ఎరువులకు వర్తించనుంది. రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణానికనుగుణంగా ఎరువులు పంపిణీ చేయనున్నారు. ఈ సీజన్కు ముగిసిన కాంప్లెక్స్ వాడకం వానాకాలానికి సంబంధించి 3.67 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారని, అధికారులు అంచనా వేశారు. ఇందులో ఎక్కువ శాతం వరి పంట ఉంటుంది. ఇప్పటికే దాదాపు 2.05 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. దీంతో కాంప్లెక్స్ ఎరువుల వాడకం ఇక తక్కువగానే ఉంటుంది. వరి నారు ఎదగకపోతే కొంతమంది రైతులు, యూరియాతో కలిపి, కాంప్లెక్స్ ఎరువు కొద్ది మోతాదులో వేస్తుంటారు. యూరియా మాత్రం ఇప్పటికే యాప్ బుకింగ్ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు 70వేల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై అయ్యింది. మరో 10 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతుందని భావిస్తున్నారు. కొత్త యాప్ డౌన్లోడ్ ఇలా.. కొత్త యాప్ వినియోగంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఫర్టిలైజర్ యజమానులు సైతం రైతులకు సహరించాలని చెబుతున్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఎస్ఎఫ్ఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో భాషను ఎంచుకునే అవకాశముంటుంది. ఆధార్, మొబైల్ నంబర్, భూమి వివరాలు, సాగు చేస్తున్న పంట వివరాలు నమోదు చేసుకోవాలి. ఒకవేళ భూమి వివరాలు యాప్లో లేకుంటే రైతు నమోదు చేసుకునే అవకాశం ఉంది. అనంతరం ఎరువు రకం ఎంచుకోవాలి. ఏ షాప్లో కొనాలని అనుకుంటున్నారనే విషయం ఎంట్రీ చేయాలి. అప్పుడు సంబంధిత డీలర్ వద్ద రైతు నమోదు చేసిన వివరాలు పీఓఎస్ మెషీన్లో కనిపిస్తాయి. వాటి ఆధారంగా రైతులు తమకు కావాల్సిన ఎరువులను కొనుగోలు చేయవచ్చు. సాగు చేసిన పంటలకే ఎరువులు నేటి నుంచే యాప్ వినియోగంలోకి -
హరీశ్రావుపై ఆరోపణలు సరికాదు
నర్సాపూర్: పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ తన హోదాను విస్మరించి మాజీమంత్రి హరీశ్రావుపై ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే సునీతారెడ్డి హితవు పలికారు. గురువారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తారని, మాజీమంత్రి హరీశ్రావు తన వ్యక్తిగత పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్తే అక్కడ క్షుద్ర పూజలు చేశారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలను ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి మహిళలకు ఇస్తానన్న రెండున్నర వేల రూపాయలు, కల్యాణలక్ష్మి పథకం ద్వారా తులం బంగారం, యువతులకు స్కూటీ తదితర హామీల అమలు ఎక్కడని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఫల్యాలను, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఎదురుదాడి రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్తారన్నారు. జయశంకర్కు నివాళులు ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని సునీతారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు శేఖర్, నయీమోద్దీన్, భిక్షపతి, సత్యంగౌడ్, షేక్హుస్సేన్ తదితరులున్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి -
క్షుద్ర పూజల ఆరోపణ అర్థరహితం
ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్ టౌన్: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న క్షుద్రపూజల ఆరోపణలు అర్థరహితమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెస్స్(ఏఐ)యుగంలో శరవేగంతో ముందుకు వెళ్తున్న సమయంలో క్షుద్రపూజలు, చేతబడి, మూఢనమ్మకాల గురించి మాట్లాడం శోచనీయమన్నారు. ప్రభుత్వ కూలిపోవాలి, వర్షాలు అడ్డుకోవాలని హరీశ్రావు క్షుద్ర పూజలు చేశారని కాంగ్రెస్ నాయకులు అర్థంలేని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. బాధ్యత పదవుల్లో ఉన్న నాయకులు ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఆధారాలు లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
పెద్దశంకరంపేట(మెదక్): భూ భారతి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. పెద్దశంకరంపేటలో తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూ భారతి, రెవెన్యూ సదస్సులు, మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. కస్తూర్బాలో విద్యాబోధన పరిశీలన మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యాబోధన ఏవిధంగా చేస్తున్నారో పరిశీలించి, స్వయంగా విద్యార్థులకు ప్రశ్నలను వేసి జవాబులు అడిగారు. కస్తూర్బాకు సరఫరా చేసే కోడిగుడ్లు తక్కువ సైజ్ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలసిరిపై అవగాహన వీబీజీరాంజీ పథకం ద్వారా చేపడుతున్న జలసిరిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని బుజ్రాన్పల్లిలో ఇందిరమ్మ ఇంటి వద్ద ఏర్పాటు చేస్తున్న మ్యాజిక్ సోక్పిట్ను పరిశీలించారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా గ్రామస్థులతో కలిసి మొ క్కలను నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్ నారా యణ, ఎంపీడీఓ క్రాంతికుమార్, ఎంఈఓ శేఖర్, సర్పంచ్ జైపాల్గౌడ్, ప్రిన్సిపాల్ విజయ తదితరులున్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
యువతకు స్వయం ఉపాధి
మెదక్ కలెక్టరేట్: క్రిస్టియన్, మైనార్టీ సంక్షేమానికి నిరంతరం కృషి చేయడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిండమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబిత పేర్కొన్నారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఆమె గురువారం సీఎస్ఐ చర్చ్ను సందర్శించారు. అనంతరం కలెక్టరేట్ చేరుకుని ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మైనార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్రిస్టియన్ మైనార్టీలకు ఆర్థికాభివృద్ధి కోసం పథకాలు కేటాయించారన్నారు. ఇందుకోసం జూలై 3 నుంచి 31 వరకు 198 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఇందులో కుట్టు మెషీన్లు, ఎలక్ట్రిక్ స్కూటీలు, చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ దరఖాస్తుల స్క్రీనింగ్ జరుగుతుందని ఈ నెల 11న రాష్ట్ర కార్యాలయానికి అర్హుల జాబితా అందిస్తే వారికి స్కూటీలు, కుట్టు మెషీన్లు, రూ.50వేల రుణాలు అందజేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 200ల వరకు దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వారం రోజుల్లో వాటిని పరిశీలించి రుణాలు అందజేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతకుముందు డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్తో సమావేశమై మైనార్టీ సంక్షేమ పథకాల గురించి చర్చించారు. ఆమె వెంట జిల్లా మైనార్టీ ఇన్చార్జి అధికారి ఉపేందర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కమిటీ చైర్మన్ సూఫీ, ఫసీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ సబిత -
తిరుగుడుపల్లె
మిరుగుడుపల్లెను మింగిన పోచారం ప్రాజెక్టుమెదక్–కామారెడ్డి జిల్లాల సరిహద్దులోగల పోచారం ప్రాజెక్టును సుమారు 105 ఏళ్ల క్రితం నిర్మించారు. ఆ ప్రాజెక్టుపై భాగంలో మిరుగుడుపల్లె అనే గ్రామం ఉండేది. దాన్ని నిర్మించటంతో బ్యాక్వాటర్లో ఊరితోపాటు ఉపాధినిచ్చే భూములు కూడా అందులోనే మునిగిపోయాయి. దీంతో ఆ గ్రామస్థులు పొట్టచేతబట్టుకుని ప్రాజెక్టుకు కొంతదూరంలో రాళ్లుగుట్టల అంచున స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆ గ్రామం పోచమ్మరాల్ అయింది. దీంతో జీవనోపాధి కోసం దానికి కొంతదూరంలో పోడు భూములను సాగు చేసుకుంటూ 30 ఏళ్ల పాటు జీవనం సాగించాక ఆ భూములు మా శాఖకు చెందినవని అటవీ అధికారులు వాటిని లాగేసుకుని అందులో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ఇక చేసేదిలేక ప్రాజెక్టుకు కొద్దిదూరంలో గుట్టను ఆనుకున్న అసైన్డ్ భూములను కుటుంబానికి ఎకరం, రెండు ఎకరాల చొప్పున సాగు చేసుకుని జీవిస్తుండగా మెదక్–బోధన్ హైవే 765–డీ రోడ్డు వెడల్పులో భాగంగా మరికొన్ని భూములు కోల్పోయారు. ఉన్న కొద్దిభూమి ట్రస్టుకు.. అప్పటి మిరుగుడుపల్లి బాధితులు నేటి పోచమ్మరాల్ ప్రజలు ఎక్కడ భూమిని పట్టుకున్నా అది ఏదో విధంగా వారికి సొంతం కాకుండా పోతుంది. ఇకపోతే ప్రాజెక్టును ఆనుకుని గుట్టలు, రాళ్లు, రప్పలతో 30–40 ఎకరాలలో ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని ఆ గ్రామ అవసరాల కోసం ప్రజలు చాలాకాలంగా వాడుతున్నారు. కాగా, ఆ భూమిని సుమారు 40 ఏళ్ల క్రితం రెవెన్యూ అధికారులు హైదరాబాద్కు చెందిన ఓ ట్రస్టుకు 25 ఎకరాల భూమిని వారికి కేటాయించారు. దీంతో ఆ ట్రస్టుకు సంబంధించి వ్యక్తులు గతంలో ఆ భూమి చుట్టూ కంచె వేయగా పోచమ్మరాల్ గ్రామస్థులు కంచెను తొలగించి నిర్మాణాలను ఆపినట్లు తెలిసింది. కాగా, ఇటీవల మళ్లీ ఆ ట్రస్టు సభ్యులు కంచె వేసి అందులో పలు కార్యక్రమాలు చేయటంతో వాటిని అడ్డుకుని ఇటీవల కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చిన గ్రామస్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఆ భూములను మా గ్రామ అవసరాలకు మాత్రమే ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లో ట్రస్టుకు ఇవ్వొదంటూ డిమాండ్ చేస్తున్నారు. పోచమ్మరాల్ తండావందేళ్లకు పైబడి మిరుగుడు పల్లె ప్రజలను విధి వంచిస్తూనే ఉంది. ఊరితోపాటు జీవనోపాధినిచ్చే భూములను ఓ ప్రాజెక్టు నిర్మాణంలో పోగొట్టుకున్నారు. పొట్ట చేతబట్టుకుని మరోచోట పోడు భూములను 30 ఏళ్లపాటు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తే, అవి మా భూములంటూ అటవీఅధికారులు లాక్కున్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా మరికొంత భూమి జాతీయ రహదారికి పోయింది. ప్రాజెక్టును ఆనుకునున్న మరికొంత అసైన్డ్ భూమిని ఊరు అవసరాలకు వినియోగించుకుంటే రెవెన్యూ అధికారులు ఓ ట్రస్టుకు ధారాదత్తం చేయటంతో ఆ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఆ భూమిని గ్రామ అవసరాలకే కేటాయించాలని ఆ బాధిత పల్లెజనం ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. – మెదక్జోన్ పోడు భూములను లాక్కున్న అటవీఅధికారులు రోడ్డు వెడల్పులో కోల్పోయిన మరికొంత భూమి ఉన్న కొద్దిపాటి అసైన్డ్ భూమిని ఓ ట్రస్టుకు ధారాదత్తం చేసిన రెవెన్యూ శాఖ ఆందోళన చెందుతున్న పోచమ్మరాల్ గ్రామస్థులుఆ భూమి గ్రామ అవసరాలకే ఇవ్వాలి మిరుగుడుపల్లి బాధితులు వందేళ్లుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉన్న కొద్దిభూమి తాజాగా రోడ్డు వెడల్పులో పోయింది. కాగా ప్రాజెక్టు వద్ద ఉన్న భూమి గ్రామ అవసరాలకే ఇవ్వాలి. – రాజు, పోచమ్మరాల్, సర్పంచ్ఇదేం తలరాత! ప్రాజెక్టులో ఊరుమునిగి పోగా పొట్టచేత పట్టుకుని మా తాతలు, తండ్రులు వేరేచోట పోడు భూములు సాగు చేసుకుంటే వాటిని లాక్కోవటం, మరికొంత భూమి రోడ్డు వెడల్పులో పోవటం, ఉన్న కొద్దిపాటి భూములను ట్రస్టుకు అప్పగిస్తే మా బతుకు దెరువెలా.? – రూప్సింగ్, పోచమ్మరాల్ తండా -
జయశంకర్ ఆశయసాధనకు కృషి
కలెక్టర్ ప్రతిమాసింగ్ పెద్దశంకరంపేట(మెదక్): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం పెద్దశంకరంపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అందరికి ఆదర్శప్రాయులన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నారాయ ణ, ఎంపీడీఓ క్రాంతికుమార్, ఆర్ఐ.నాగరా జు, ఎంపీఓ జాకీర్హుస్సేన్ తదితరులున్నారు. రామాయంపేటలో... రామాయంపేట(మెదక్): తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పిలుపునిచ్చారు. ఆయన గురువారం రామాయంపేటలో మున్సిపల్ చైర్మన్ లావణ్యతో కలిసి జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జయశంకర్ తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తున్నానని, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే సిద్దిపేట, మెదక్ చౌరాస్తాల విస్తరణ, వివేకానంద, అంబేద్కర్ కొత్త విగ్రహాల ఏర్పాటుకోసం భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మెట్టు గంగారాం, స్వర్ణకార సంఘం జిల్లా అద్యక్షుడు రవి, జిల్లా నాయకులు సుంకోజ దామోదర్, జిల్లా విలేకరుల సంఘం అధ్యక్షుడు శంకర్ దయాల్చారి, ఇతర నాయకులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం చిలప్చెడ్(నర్సాపూర్): కార్మికులకు పని గంటలు పెరిగి, వారి హక్కులను హరించే విధంగా ఉన్న నాలుగు లేడర్ కోడ్స్ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం డిమాండ్ చేశారు. గురువారం ఆయన మండల పరిధిలో అజ్జమర్రి గ్రామంలో ఈ నెల10న సీఐటీయూ, రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే జైల్ భరోను కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలన్నారు. 2025 విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయడంతో పాటు, విత్తన చట్టం సైతం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మల్లేశం, శేఖర్, గ్రామస్థులు పాల్గొన్నారు. పోచారం డ్యామ్కు వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు హవేళిఘణాపూర్(మెదక్): ప్రస్తుతం పోచారం డ్యామ్ వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు పోచారం డ్యామ్ వద్దకు రావొద్దని హవేళిఘణాపూర్ పోలీసులు సూచించారు. కామారెడ్డి జిల్లాలో అధికంగా వర్షాలు పడుతున్నందున భారీ వరద ఉధృతి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు రానివ్వకుండా అధికారుల సూచనల మేరకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ వెల్లడించారు. ప్రజలు ప్రస్తుతం పోచారం డ్యామ్ పరిసరాలకు అనుమతి లేదన్నారు. -
తాను మరణించి..మరొకరికి పునర్జన్మనిచ్చి
పెద్దశంకరంపేట(మెదక్): నిత్యం ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో ముందుండే ఆర్ఎంపీ వైద్యుడు తోట రవీందర్ తన మరణానంతరం అవయవాలు దానం చేసి మరికొందరికి పునర్జన్మనిచ్చాడు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన తోట లక్ష్మణ్కు ఐదుగురు కుమారులు. వీరిలో రెండవ కుమారుడు తోట రవీందర్(40) ఈ నెల2 ఆదివారం గురుపాదగుట్ట వద్ద రెండు బైకులు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబసభ్యులు రవీందర్ అవయవాలు దానం చేసేందుకు ముందుకువచ్చారు. గుండె, కాలేయం, కిడ్నీలు, నేత్రాలు తదితర అవయవాలను దానం చేసి పలువురి జీవితాలను కాపాడిన ఆర్ఎంపీ వైద్యుడు రవీందర్ ఆత్మకుశాంతి చేకూరాలని పలువురు ప్రార్థించారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం సాయంత్రం పెద్దశంకరంపేటలో అంత్యక్రియలు నిర్వహించారు. -
ఉగ్గబట్టుకుంటున్నారు
శివ్వంపేట(నర్సాపూర్): ముఖ్యమైన కనీస అవసరమైన పబ్లిక్ టాయిలెట్లు లేక మండల కేంద్రంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూప్రాన్ నర్సాపూర్ హైవేనుఆనుకుని పీహెచ్సీ, బస్టాండ్, బ్యాంకు, గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి గ్రామంలో పబ్లిక్ టాయిలెట్స్ లేక ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు ఆస్పత్రి ప్రాంగణంలో కనీస అవసరమైన టాయిలెట్లు లేని పరిస్థితి నెలకొంది. వారంలో రెండు రోజులు గర్భవతులు, బాలింతలు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వస్తే వీరి అవసరం మేరకు టాయిలెట్స్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు ప్రయాణ ప్రాంగణం, ఇండియన్ బ్యాంక్ ఉన్నప్పటికీ అక్కడ కూడా ఎలాంటి టాయిలెట్స్ లేకపోవడం ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కనీస అవసరమైన టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టడంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలు లేవు. టాయిలెట్ల నిర్మాణానికి ఆరోగ్య కేంద్రంలో అనువైన ఖాళీ స్థలం ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు టాయిలెట్ అవసరం వస్తే మగవారైతే చెట్ల చాటుకు, మహిళలైతే పలు నివాసాల వారి వద్దకు వెళ్లి ప్రాధేయపడి అవసరం తీర్చుకోవలసిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్లు, మరుగుదొడ్లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టాయిలెట్లు లేక రోగులు, ప్రయాణికుల ఇక్కట్లు పీహెచ్సీలో టాయిలెట్ల నిర్మాణానికి స్థలమున్నా పట్టించుకోని అధికారులు -
100కు స్వస్తి..112కు శ్రీకారం
● అత్యవసర సేవలన్నీ ఇకమీదట 112 నంబర్కే ● పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, విపత్తు నివారణలకు డయల్ 112 పెద్దశంకరంపేట(మెదక్): రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలన్నీ ఇక ఒకే గొడుగు కిందికి వచ్చాయి. నూతనంగా 112 డయల్ నంబర్ను ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. ఈ నంబర్కు డయల్ చేసి అత్యవసర సేవలను పొందే అవకాశముంది. గతంలో అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్ చేసే వారు. పోలీస్(100), అగ్నిమాపక సేవలు(101), అంబులెన్స్ (108), మహిళల భద్రత(181), బాలల సంరక్షణకు (1098), విపత్తు నిర్వహణకు (1077) సేవలను ప్రజలు సంప్రదించేవారు. ఇక వీటన్నింటిని అనుసంధానిస్తూ కేవలం ఒకే 112 నంబర్ను ప్రారంభించారు. అత్యవసర సమయానికి 112 డయల్ చేయాలి జిల్లాలో 21 మండలాల పరిధిలో పోలీస్స్టేషన్లు, మెదక్, నర్సాపూర్,పెద్దశంకరంపేట, రామాయంపేట తదితర ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. బాధితులు పోలీస్,అగ్నిమాపక, అంబులెన్స్ సేవలను వినియోగించుకోవడానికి ఈ 112నంబర్కు డయల్ చేస్తే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి నేరుగా అత్యవసర సేవలను అందిస్తారు. ఇందులో సుమారు 18 రకాల సేవలను అందించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వన్ నేషన్–వన్ ఎమర్జెన్సీ నంబర్ అనే భావనతో రూపొందించిన ఏకీకృత సర్వీసును డీజీపీ సీ.వీ.ఆనంద్ ప్రారంభించారు. గతంలో ప్రజలు పోలీసు, అంబులెన్స్, అగ్నిమాపకం, విపత్తు నిర్వహణ, మహిళల రక్షణ వంటి అత్యవసర సేవలు వివిధ నంబర్లకు డయల్ చేసేవారు. దీనివల్ల ప్రజలకు నంబర్ల విషయంలో అయోమయంగా ఉండేది. దీని స్థానంలో ప్రజలకు ఒకే నంబర్ ద్వారా అత్యవసర సేవలు అందుబాటులోనికి వచ్చాయి. రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దోపిడీలు వేధింపులు, ప్రమాదకర సమయాల్లో ఈ నంబర్కు బాధితులు కాల్ చేస్తే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అత్యాధునిక కాల్ మానిటరింగ్ సిస్టంతో అనుసంధానం చేసి వారి లోకేషన్ ఆధారంగా అత్యవసర బృందాలకు సమాచారం అందిస్తారు. దీనివల్ల ప్రజలకు అత్యవసర సేవలు అందుబాటులోనికి రావడంతోపాటు సమయం ఆదా అవుతుంది. ఇప్పటికే పోలీస్ అధికారులు సోషల్మీడియా ద్వారా డయల్ 112 ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం చేపడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. -
స్కూళ్లకు ఫిట్నెస్ లేని బస్సులా?
అల్లాదుర్గం(మెదక్): ప్రైవేట్ స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా నడుపుతున్నా అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్సు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన అల్లాదుర్గం మండలం చిల్వెర గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి ప్రైవేట్ స్కూల్ బస్సులు చిల్వెర గ్రామం వరకు నడుపుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. స్కూల్ బస్సు టైర్ పగలడంతో బస్సు అధ్వానంగా ఉందనే విషయం గమనించినట్లు చెప్పారు. బస్సు టైర్లు అరిగిపోయి ఉన్నాయని బస్సు డోర్, కిటికీలు పగిలిపోయినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని స్కూల్ యాజమాన్యాన్ని ఫోన్లో ప్రశ్నిస్తే ప్రమాదమేమైనా జరిగిందా అని తమపై కోపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ బస్సులపై ఆర్టీఓ, పోలీస్ అధికారులు నిఘా పెట్టి, ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిరసనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు -
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు వినతి
వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రం వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు బుధవారం ఎమ్మెల్యే సునీతారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రానికి దూరంగా కాకుండా స్థానికంగానే పాఠశాల ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సునీతారెడ్డి వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. ప్రజల అవసరాలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అనుకూల నిర్ణయం వచ్చేలా ప్రయత్నిస్తానని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే హామీతో తల్లిదండ్రులు, యువకులు సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట (మెదక్): బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నార్సింగి మండల కేంద్రానికి చెందిన యెన్నం లింగారెడ్డి నియామకం చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ నియామకపత్రం అందించారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ..తనపై నమ్మకంతో రెండవసారి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించేందుకు సహకరించిన మెదక్ ఎంపీ రఘునందన్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ బలోపేతం చేసేందుకు తనశాయశక్తుల కృషిచేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యపాల్రెడ్డి అభినందించారు. తూప్రాన్: ఈ నెల ఆగస్టు 7న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభను జయప్రదం చేయాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జున్గౌడ్ పేర్కొన్నారు. మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్స్ను ఆవిష్కరించారు. బీసీలు అధిక సంఖ్యలో పాల్గొ ని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ నాయకులు బాయికాడి ఆంజనేయులు, నవీన్ పాల్గొన్నారు. ఎఫ్ఆర్ఎస్ నమోదులో టీచర్ల తిప్పలు పాపన్నపేట(మెదక్): ఎఫ్ఆర్ఎస్ యాప్ తప్పుల వల్ల.. బడి విడవగానే టీచర్లు ఇంటికి వెళ్లడంలో జాప్యం జరుగుతోంది. ఫొటో దిగుతున్నప్పుడు యాప్ మొండికేస్తుండటంతో నానా అవస్థలు పడాల్సి వస్తోందని పాపన్నపేట ఉన్నత పాఠశాల టీచర్లు వాపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం ఎఫ్ఆర్ఎస్లో అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బుధవారం సాయంత్రం బడి ముగియగానే, ఎఫ్ఆర్ఎస్ నమోదు కోసం, ఫొటో దిగాలని ప్రయత్నిస్తే యాప్ కట్ అవుతుందని, ఇంకొందరికి టూమెనీ లాగిన్స్ అని, మరి కొందరికి సర్వర్ ఎర్రర్ అంటూ రావడంతో టీచర్లు అసహనానికి లోనయ్యారు. దీంతో కొంతమంది టీచర్లు ఫొటోలు దిగకుండానే ఇళ్లకు వెళ్లిపోయారు. అధికారులు స్పందించి సాఫ్ట్వేర్ సరిచేయాలని కోరుతున్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తం
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుమెదక్జోన్: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో పెరుగుతున్నాయని, ప్రజలు డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. జాతీయ ‘సైబర్ జాగృత్ దివస్’సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్షా కా తిరంగా–సైబర్ స్వతంత్ర తెలంగాణ’కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిరోజూ సైబర్ నేరాల కారణంగా కోట్ల రూపాయలను ప్రజలు నష్టపోతున్నారన్నారు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ స్టాక్ మార్కెట్ పెట్టుబడి ప్రకటనలను చూసి మోసపోవద్దని సూచించారు. మోసగాళ్లు ముందుగా వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి, కొందరు వ్యక్తులు భారీగా లాభాలు పొందినట్లు నకిలీ స్క్రీన్ షాట్లు, సందేశాలను షేర్ చేస్తారని చెప్పారు. వాటిని నమ్మి పెట్టుబడులు పెడితే నష్టాలు తప్పవన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్సింగ్, డీఎస్పీలు సుభాష్ చంద్రబోస్, ప్రసన్నకుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎఫ్ఎఫ్ఎస్ ద్వారా ఎరువుల సబ్సిడీ
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం రూపొందించిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారానే సబ్సిడీ ఎరువుల విక్రయాలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఎరువుల విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్ఎఫ్ఎస్)యాప్ రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్ ఈనెల 6వ తేది నుంచి అమలులోకి వస్తుందన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో పారదర్శకంగా అందిస్తూ, ఎరువుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో యాప్ను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎరువుల కొనుగోలు, పంపిణీ, నిల్వలు, సబ్సిడీ, విక్రయాల పర్యవేక్షణ ప్రక్రియలన్నీ ఒకే వేదికపైకి రానున్నట్లు తెలిపారు. -
ఏదీ మంజీర ఝరి!
● సింగూరుకు రాని మంజీర వరద ● బోసిపోతున్న నిజాంసాగర్ ప్రాజెక్టు ● గతేడాది రికార్డుస్థాయిలో 210 టీఎంసీల నీరు విడుదల ఘనపురానికి ప్రాణాధారమైన సింగూరు వెలవెలబోతోంది. వర్షాకాలం ఆరంభమై రెండు నెలలు దాటినా ఎగువన వర్షాలు లేక కేవలం4.7 టీఎంసీలకు పరిమితమైంది. దీంతో మంజీర ఝరి కరువై.. ఘనపురం ఆనకట్ట, వాన నీళ్లతోనే పొంగిపొర్లుతోంది. ఇక నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి దీనంగా ఉంది. గతేడాది వర్షాకాలంలో మంజీర పరవళ్లు తొక్కడంతో సింగూరు నుంచి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 210 టీంఎసీల నీరు దిగువకు వదిలారు. పాపన్నపేట(మెదక్): మహారాష్ట్రలోని బాలాఘాట్లో జన్మించిన మంజీర నది మెతుకుసీమ వ్యవసాయానికి ఊపిరి పోస్తుంది. దీనిపై ఉమ్మడి మెదక్ జిల్లాలో సింగూరు, ఘనపురం ప్రాజెక్టులు కట్టారు. దిగువన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ వద్ద మరో ప్రాజెక్టు నిర్మించారు. అయితే మహారాష్ట్ర, బీదర్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో వర్షాలు లేక పోవడంతో మంజీర నదికి వరద రాలేదు. 29 టీఎంసీల సామర్థ్యం గల సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 4.7 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో 8 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోవచ్చు. గతేడాది ఆగస్టు మొదటివారంలో 18 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. వాననీళ్లతో ఘనపురం కళకళ ఎగువన కురిసిన వర్షాలతో ఘనపురం ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. 0.135 టీఎంసీల సామర్థ్యం గల ఈ ఆనకట్టపై నుంచి 1000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. వానాకాలం పంటల కోసం అధికారులు ఫతేనహర్ కెనాల్ ద్వారా 13 చెరువులు నింపారు. ఇక ఎంఎన్ కెనాల్ నక్కవాగు, హల్దీవాగు, స్థానిక గుట్ట జలాల ద్వారా నిండుగా ప్రవహిస్తుంది. బోసిపోయిన నిజాంసాగర్ మంజీర వరదలు లేక..సింగూరు నీరు రాక నిజాంసాగర్ ప్రాజెక్టు వెలవెలబోతుంది. దీని నిల్వనీటి సామర్థ్యం 17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.690 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎగువన పోచారం, హల్దీవాగులద్వారా నీటి ప్రవాహం వస్తుండటంతో , నిజాంసాగర్లోకి కొంతమేర నీరు చేరే అవకాశముంది. -
రూ.100 కోట్లతో 83 కి.మీల రోడ్ల అభివృద్ధి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గంలో 83 కి.మీల మేర రోడ్ల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరయ్యాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆర్ అండ్ బీ రోడ్లు 29 కి.మీలు, పంచాయతీరాజ్ రోడ్లు 54 కి.మీల అభివృద్ధికి ఈ నిధులు మంజూరయ్యా యని తెలిపారు. ఆర్అండ్బీకి సంబంధించి పెద్దాపూర్–అనంతసాగర్ (వయా తొగర్పల్లి)రోడ్డు, ముంబై హైవే నుంచి– బ్యాతోల్, ముంబై హైవే–ఇస్మాయిల్ఖాన్పేట రోడ్లను అభివృద్ధి చేస్తారన్నారు. పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి ఎన్.హెచ్ 65 నుంచి చిమ్నాపూర్తాండా, సంగారెడ్డి –మల్కాపూర్ ఎక్స్రోడ్డు, సంగారెడ్డి–తాళ్లపల్లి రోడ్డు పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని జగ్గారెడ్డి చెప్పారు. -
కొత్తరూపు
‘ఏడుపాయల’కురూ.500కోట్లతో మాస్టర్ ప్లాన్ఐదుశాఖల పరిధిలో..! ● ఎండోమెంట్ కమిషనర్తో చర్చించిన ఎమ్మెల్యే ● త్వరలో సీఎం దృష్టికి ఫైల్ ఏడుపాయల వనదుర్గామాత దేవస్థానంస్వయంభూగా వెలసిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయ రూపురేఖలు మారబోతున్నాయి. అందుకోసం రూ.500 కోట్లతో ఓ ఏజెన్సీ నిర్వాహకులతో స్థానిక ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించారు. ఈ విషయంపై ఇప్పటికే ఎండోమెంట్ కమిషనర్తో చర్చలు జరిపారు. ఈ ఫైల్ త్వరలో సీఎం దృష్టికి వెళ్లనుంది. మెదక్జోన్: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి శివారులోగల ఏడుపాయల వనదుర్గామాత ఆలయం రాతిగుహలో స్వయంభూగా వెలిసింది. ఇక్కడ మూడు రోజులపాటు మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. ప్రతీ ఏటా ప్రభుత్వం నుంచి రూ.2 కోట్ల నిధులు విడుదల చేసి రాష్ట్ర సర్కార్ తరఫున అమ్మవారికి ఎమ్మెల్యే పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి సుమారు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే దసరా పండగను పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. మాఘ అమావాస్య రోజున పుణ్య స్నానాలు ఆచరిస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిధిలో నిర్మించిన అద్దె రూములతోపాటు హరితహోటల్, ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన గదులు (రూములు) ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తులకు సరిపడా సౌకర్యాలు లేవు. మారనున్న రూపురేఖలు! ఈ మాస్టర్ ప్లాన్ అమలుతో ఏడుపాయల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఏమాత్రం పెద్ద వర్షం కురిసి ఎగువభాగంలోని ఘనాపూర్ ప్రాజెక్టు పొంగిపొర్లినా వరదనీటితో అమ్మవారి ఆలయం మునిగిపోతుంది. దీంతో భక్తుల కోసం రాజగోపురంలో అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. ఇది ప్రతీఏటా జరుగుతున్నతంతు. కాగా, మాస్టర్ప్లాన్లో భాగంగా రాజగోపురం నుంచి అమ్మవారి ఆలయం వరకు భారీ బ్రిడ్జిని నిర్మించి లిఫ్టు ఏర్పాటు చేయనున్నారు. అటు అమ్మవారి ఆలయం ముందు, ఇటు రాజగోపురం ముందు రెండు సైడ్లలో సుమారు 12 ఫీట్ల ఎత్తులో గోడను నిర్మించనున్నారు. దీంతో ఎగువభాగం నుంచి ఎంత పెద్ద వరద వచ్చినా, ఆలయంలోకి నీరు వెళ్లదు. దీంతో వరదలు వచ్చినా రాజగోపురం నుంచి భారీ స్థాయిలో ఏర్పాటు చేసే లిఫ్టు ద్వారా ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయానికి పక్కనే ఒడిబియ్యం, బోనాలకు, కుంకుమార్చన కోసం ప్రత్యేక గదులను నిర్మించనున్నారు. అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో రాజగోపురం సమీపంలో ప్రసాదాల కౌంటర్, ఆఫీస్గెస్ట్ హౌజ్, టాయిలెట్స్, వాష్రూముల నిర్మాణాలు, బట్టలు మార్చుకునే గదులు, అక్కడి నుంచి నదీ తీరం ఘనాపూర్ ప్రాజెక్టు వరకు గార్డెన్ నిర్మాణం, నదీ వైపున ఫెన్సింగ్ ఏర్పాటు, నదిపొడుగునా షవర్ల నిర్మాణాలు, అండర్గ్రౌడ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్ స్థలాలు... అలాగే భక్తులు ఉండేందుకు ఏడుపాయలకు వచ్చే పాతరోడ్డు నాగ్సాన్పల్లి వైపున రెండు పార్కింగ్ స్థలాలు అందులో ద్విచక్ర, ఫోర్వీల్స్లకు సంబంధించిన పార్కింగ్ ఏర్పాటు, కాటేజీలు, మినీలాడ్జిల నిర్మాణం, అదేవిధంగా కొల్చారం వైపు నుంచి వచ్చే రూటులోనూ 2 పార్కింగ్ స్థలాలు, కాటేజీలు, మినీ లాడ్జిలు నిర్మించనున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే రోహిత్రావు ప్రైవేట్ ఏజెన్సీతో మాస్టర్ప్లాన్ సిద్ధం చేయించారు. సదరు ఏజెన్సీ నిర్వాహకులు పలు దఫాలుగా విజిట్ చేసి డ్రోన్ల సహాయంతో పలు నమూనాలను డిజైన్ చేసి రూ.500 కోట్ల ప్రాజెక్టుతో దీనికి కొత్త రూపురేఖలు తీసుకురావాలని నిర్ధారించారు. ఈ మాస్టర్ ప్లాన్ను సదరు ఎండోమెంట్ కమిషనర్ చర్చించి ఓకే చేసినట్లు తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్ సైతం పలుశాఖల అధికారులతో చర్చించారు. రేపో మాపో ఆ ఫైల్ సీఎం దగ్గరకు వెళ్లనుంది. రూ.500 కోట్లతో తయారు చేసిన ఏడుపాయల మాస్టర్పా్ల్న్లో ఐదుశాఖల ఉన్నతాధికారుల నుంచి పలు సలహాలు తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో ఇరిగేషన్, పంచాయితీరాజ్, ఆర్ అండ్ బీ, పర్యాటక, ఎండోమెంట్కు చెందిన అధికారులు ఇందుకు తగు సలహాలు సూచనలు చేసినట్లు సమాచారం. ఏడుపాయల అభివృద్ధికోసం రూ.500 కోట్లతో తయారు చేయించిన మాస్టర్ప్లాన్ను త్వరలో సీఎం రేవంత్రెడ్డి వద్దకు తీసుకెళ్తాను. ఈ ఆలయాన్ని సీఎం గతంలో స్వయంగా దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. నిధుల మంజూరుతో ఆధ్యాత్మికతోపాటు, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందనుంది. –డాక్టర్ రోహిత్రావు, ఎమ్మెల్యే, మెదక్ -
వరద ఉధృతిని పరిశీలించిన అదనపు కలెక్టర్
హవేళిఘణాపూర్(మెదక్): జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం డ్యామ్ వరద ఉధృతిని అదనపు కలెక్టర్ నగేశ్ మంగళవారం పరిశీలించారు. అనంతరం వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున పోలీసు సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోచమ్మరాళ్ శివారులో గతేడాది కొట్టుకుపోగా, తాత్కాలికంగా నిర్మించిన రోడ్డును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డికి ఆహ్వాన పత్రిక నర్సాపూర్: ఈ నెల 10న నర్సాపూర్లో నిర్వహించనున్న తొట్టెల ఉత్సవాలకు రావాలని స్థానిక యువకులు స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ మంత్రి హరీశ్రావులను మంగళవారం ఆహ్వానించారు. పట్టణంలోని శ్రీ లక్ష్మినృసింహ్మస్వామి ఆలయ కమిటీ సభ్యులు మహేందర్గౌడ్, హేమంత్, శ్రీధర్, పూర్ణచందర్, శ్యామ్, ప్రదీప్, భాను తదితరులు వారిద్దరిని కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. -
చినుకు పడితే చెరువే
పాపన్నపేట(మెదక్): చినుకు పడితే చాలు మెదక్– బొడ్మట్పల్లి రోడ్డు చెరువును తలపిస్తోంది. పాపన్నపేట మండల ముఖద్వారం ఎల్లాపూర్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల కమాన్ వద్ద నీరు చేరడంతో ప్రయాణికులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తపల్లి అనంతుని వాగు బ్రిడ్జికి ఇరుప్రక్కల ఉన్న మట్టి రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఈ రోడ్డుపై పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలు లేక రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన రోడ్డు శిథిల మవుతోంది. మెదక్ –బొడ్మట్పల్లి రోడ్డుపై నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఎల్లాపూర్ వద్ద ఫతేనహర్ నుంచి వచ్చే నీటికి, వాన నీరు తోడైతే ఎల్లమ్మ గుడి సమీపంలో గల గుండు మోరి, పొర్లి రోడ్డుపై నీరు చేరుతోంది. ప్రభుత్వ పాఠశాల ప్రవేశ ద్వారంలో నీరు చేరడంతో చిన్నారులు,రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. శానాయపల్లి వద్ద ఉన్న రైస్ మిల్లు నుంచి, ఎల్లాపూర్ గ్రామం వరకు డ్రెయిన్ నిర్మిస్తే, వృథా నీరు మంజీర నదిలో కలిసే అవకాశం ఉంటుంది. అలాగే ఏడుపాయల కమాన్ ముందు ఉన్న చిన్నపాటి బ్రిడ్జి మూసుకుపోవడంతో, ఆర్చ్గేట్ ముఖద్వారం జలమయమై రోడ్డు కనిపించని దుస్థితి నెలకొంది. వర్షం పడితే, గుట్టపై నుంచి వచ్చే నీరు ఇక్కడ చేరుతుంది. బ్రిడ్జి ఎత్తు పెంచి, కాలువ నిర్మిస్తే, ఫతేనహర్ కెనాల్లోకి నీరు వెళ్తుంది. ఇక కొత్తపల్లి అనంతుని వాగుపై బ్రిడ్జి నిర్మించినప్పటికీ, ఇరుప్రక్కల రోడ్డు వేయలేదు. దీంతో మట్టి రోడ్డు గుంతల మయంగా మారి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు. మెదక్–బొడ్మట్పల్లి రోడ్డు దుస్థితి ఇబ్బందులు పడుతున్న వాహనదారులు -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
నిజాంపేట(మెదక్): వాహనదారులు రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని పలువరు వక్తలు పేర్కొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో రామాయంపేట సీఐ సైదానాయక్ ఆధ్వర్యంలో ఆటో, స్కూల్ బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..అతివేగం, మద్యం తాగి, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలోనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలు నిలపవచ్చని తెలిపారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు సహాయం చేసిన వారికి రహదారి రహవీర్ పథకంలో భాగంగా రూ.25 వేలు నగదు బహుమతిని ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ను లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో నిజాంపేట ఎస్ఐ శ్రీ రాజేశ్, హెడ్ కానిస్టేబుళ్లు మురళీధర్, సునీత, రైటర్ రాజు, కానిస్టేబుళ్లు అశోక్, ఆమని, మానస తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులో వక్తలు -
యూరియా యాప్ తొలగించాలి
చిన్నశంకరంపేట(మెదక్): రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్ను తొలగించాలని చిన్నశంకరంపేట మండలంలోని సర్పంచ్లు డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండల ప్రత్యేకాధికారి వెంకటయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఎంపీపీ సాధారణ సమావేశంలో ఏఓ ప్రవీణ్ కుమార్ వ్యవసాయ సాగు, యూరియా లభ్యతపై వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు నాగభూషణం, కృష్ణాగౌడ్, ప్రవీణ్కుమార్లు మాట్లాడుతూ...రైతులను ఇబ్బందులు పెడుత్ను యూరియా యాప్ను తొలగించి, నేరుగా రైతులకు యూరియా అందించాలన్నారు. ఇదే విషయంపై సర్పంచ్లు యాప్ను రద్దుచేసి నేరుగా యూరియా అందించాలని తీర్మానం చేశారు. చిన్నశంకరంపేట మండలంలోని గ్రామాలలో గుడిసెలులేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్వే నిర్వహించినట్లు ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. రెండవ విడతలో పూరిగుడిసెలలో నివాసం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయని వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ..అద్దె ఇంట్లో ఉంటున్నవారికి ఇందిరమ్మ ఇళ్లు అందించాలన్నారు. రహదారులపైకి వస్తున్న కేజ్ విల్ ట్రాక్టర్లపై చర్యలు చేపట్టాలని సర్పంచ్ గోపాల్రెడ్డి కోరారు. మట్టిమాఫియాపై చర్యలు చేపట్టాలని చిన్నశంకరంపేట సర్పంచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ దీప్లారాథోడ్, మిషన్భగీరథ, ఆరోగ్య, ఐసీడీఎస్ తదితర అధికారులు తమ శాఖల పరిధిలోని పనులను వివరించారు. సర్పంచ్లు మోహన్నాయక్, నాగరాజు, సంతోష, సిద్దిరాములు, నరేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ సమావేశంలో సర్పంచ్ల డిమాండ్ -
సీపీఎస్ రద్దు చేయాలి
పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్యనాయక్ కౌడిపల్లి(నర్సాపూర్): సీపీఎస్ విధానం రద్దుచేసి ఓపీఎస్ అమలు చేయాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్యనాయక్ డిమాండ్ చేశారు. మండలంలోని కౌడిపల్లి, రాయిలాపూర్, తునికి, ముట్రాజ్పల్లి, వెల్మకన్న, కన్నారం ఉన్నత పాఠశాలలో మంగళవారం పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సెప్టెంబర్1, 2026నాటికి సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. దీంతోపాటు పీఆర్సీ నివేదిక తెప్పించుకుని మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సెప్టెంబర్ 1న మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్, పరికి రమేశ్, చంద్రశేఖర్, నవాజ్, మహేందర్, ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ రాజేందర్ చిలప్చెడ్(నర్సాపూర్): విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ముఖ్య ఉద్దేశమని భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ రాజేందర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని చిట్కుల్ కేజీబీవీలో విద్యార్థులకు భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో రాత పరీక్షలు, ప్రాక్టికల్స్ నిర్వహించి, వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ అఖిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేకాధికారి అంజలి మాట్లాడుతూ...ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో క్రమశిక్షణతోపాటు, శారీరక, మానసిక ధృఢత్వం కలగడంతోపాటు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండటంతోపాటు, తోటి వారికి సైతం తోడ్పాటు అందిస్తారన్నారు. కార్యక్రమంలో స్కౌట్ అండ్ గైడ్స్ మాస్టర్ నాగరాజు, పాఠశాల గైడ్ కెప్టెన్ శారద, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. రామాయంపేట(మెదక్): రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందజేయాలని మెదక్ ఆర్డీవో రమాదేవి స్పష్టం చేశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిని మంగళవారం రమాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాడల్ స్కూల్ విద్యార్థులు పరిస్థితిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్గార్ రజని, ఆర్ఐలు, ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండల కేంద్రంలో రెండు రోజులుగా నెట్వర్క్ అంతరాయం ఏర్పడటంతో తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో నెట్వర్క్ సమస్య తలెత్తడంతో ఎయిర్టెల్ నిర్వాహకులపై స్థానికులు మండిపడుతున్నారు. ఇక తహసీల్దార్ కార్యాలయంలో ఇంటర్నెట్ సమస్యలేర్పడి రిజిస్ట్రేషన్లు ఇతర పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. -
వాడీవేడిగా సర్వసభ్య సమావేశం
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట మండల ప్రథమ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచ్లు తమ సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. శివాయిపల్లి,చీలాపల్లి, కమలాపూర్, ఆరేపల్లి, రామోజిపల్లి,గొట్టిముక్కుల,బూర్గుపల్లి తదితర గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలపై సర్పంచ్లు విద్యుత్శాఖ ఏఈ, లైన్మెన్లు,సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సంజీవరెడ్డి విద్యుత్ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో ఇంకుడుగుంతల నిర్మాణం, జలసిరి, చెత్తసేకరణపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచించారు. బుజ్రాన్పల్లి గ్రామానికి ఏడు నెలలుగా మిషన్భగీరథ రావడం లేదని సర్పంచ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కల్యాణలక్ష్మి,సీఎంఆర్ఎఫ్ల చెక్కుల పంపిణీ మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 23 మందికి కల్యాణలక్ష్మి, 63 మందికి సీఎంఆర్ఎఫ్ల చెక్కులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జగదీశ్,ఎంపీడీఓ క్రాంతికుమార్, తహసీల్దార్ నారాయణ, హౌసింగ్ డీఈ విజయ, నాయకులు నారా గౌడ్, మధు, మురళిపంతులు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్ తదితరులున్నారు. విద్యుత్ అధికారుల తీరుపై సర్పంచ్ల ఆగ్రహం -
ఉన్నత చదువు!
ఉచిత కోచింగ్..మెదక్జోన్: జిల్లావ్యాప్తంగా 19 కేజీబీవీలున్నాయి. వీటి ముఖ్య ఉద్దేశ్యం తల్లిదండ్రులు లేని అనాథ బాలికలను, లేదా తల్లి, లేక తండ్రిలేని బాలికలను, నిరుపేద విద్యార్థినులను వీటిల్లో చేర్పించి చదువులు చెప్పించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు బోధన, వసతి సౌకర్యం కల్పించనున్నారు. కాగా, జిల్లాలో 19 పాఠశాలలకు గానూ 11 కేజీబీవీల్లో కాలేజీవరకు, మరో 9 కేజీబీవీల్లో 10వ తరగతి వరకు ఉంది. వీటి ఏర్పాటుతో పేద విద్యార్థినుల భవిష్యత్తుకు బంగారు బాటలు పడనున్నాయి. ఉన్నత చదువుకు కోచింగ్..! నిరుపేద విద్యార్థినులకు ఉన్నత చదువులను అందించాలనే దూరదృష్టితో ప్రభుత్వం జిల్లాలోని మూడు కేజీబీవీలను ఎంపిక చేసింది. ఇందులో మెదక్, నర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి, అల్లాదుర్గ్ కేజీబీవీలకు ఎంపిక చేశారు. మెదక్ కేజీబీవీలో ఐఐటీ, జేఈఈ, నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తిలో గల కేజీబీవీలో నీట్, అల్లాదుర్గ్ కేజీబీవీలో క్లాట్(లా–కోర్స్)ల్లో చేరేందుకు ఎంట్రెన్స్ కోసం విద్యార్థినులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఒక్కో కేజీబీవీలో కోచింగ్ ఇచ్చేందుకు 4గురు ఫ్యాకల్టీల చొప్పున, మూడు కేజీబీవీల్లో మొత్తం 12 మంది బోధకుల(నిపుణులు)ను నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గతేడాది ఈ పాఠశాలలను ఏర్పాటు చేసినప్పటికీ ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహించారు. ఫ్యాకల్టీ నియామకం...! ఐఐటీ, జేఈఈ, నీట్, క్లాట్ల శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష రాసేందుకు ఉచితంగా శిక్షణ ఇచ్చే ఫ్యాకల్టీల కోసం సంబంధిత కస్తూర్భాగాంధీ విద్యాలయాల సిబ్బంది చర్యలు చేపట్టింది. కాగా, ప్రస్తుతం కేజీబీవీలో చదువుతున్న విద్యార్థినులకు ఓ పక్క రెగ్యులర్గా ఇంటర్ సిలబస్ బోధిస్తూనే ఉన్నత చదువుల కోసం ప్రత్యేకంగా శిక్షణనిచ్చేందుకు గానూ ఆయా సబ్జెక్టుల వారీగా బోధించే సిబ్బంది నియామకాల ఎంపికను కస్తూరా్భాగాంధీ సిబ్బందికే అప్పగించారు. త్వరలో వారిని నియమించ నున్నట్లు తెలిసింది. కాగా, ఈ కోచింగ్ తరగతులు వారంలో శని, ఆదివారాల్లో మాత్రమే సబ్జెక్టుకు గంట పాటు ఒక్కో సబ్జెక్టుకు వారంలో కేవలం 2 గంటలు మాత్రమే చెప్పనున్నారు. మొత్తం 12 మంది ఫ్యాకల్టీ అవసరం కాగా వారికి బోధించినందుకు గంటకు రూ.650 చొప్పున వారికి చెల్లించనున్నారు. మెదక్లోని కేజీబీవీ పాఠశాల టాపర్లకు ఉచిత ఫీజు! కాగా, ఇంటర్లో టాప్ మార్కులు సాధించిన విద్యార్థినులకు ఫీజ్ సైతం ప్రభుత్వమే భరించనుంది. ఐఐటీ, జేఈఈ, నీట్, క్లాట్ల శిక్షణకు సంబంధించి ఎంట్రెన్స్ రాసేందుకు సైతం అధికంగానే ఫీజు ఉంటుందని, సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన బుక్స్ ఇప్పటికే కొనుగోలు చేయగా, ఆన్లైన్ తరగుతులు సైతం కొనసాగుతుండగా, త్వరలోనే ఆఫ్లైన్ తరగతులు కొనసాగనున్నాయి. మా భూములు ఇవ్వడానికి సిద్ధమే నిరుపేద విద్యార్థినులకు ఉన్నత చదువులు చెప్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీలద్వారా ప్రత్యేక కోచింగ్లు ఇప్పిస్తోంది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఐఓఈ)ల్లో భాగంగా ఐఐటీ,జేఈఈ,నీట్, క్లాట్లో చేరేందుకు ప్రత్యేకంగా బోధకులను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేద విద్యార్థినులకు వరంగా కేజీబీవీలు జిల్లాలో ఐఓఈలకు మూడు విద్యాలయాల ఎంపిక ఐఐటీ,జేఈఈ,నీట్, క్లాట్ల శిక్షణ కోసం త్వరలో 12 మంది బోధకుల ఏర్పాటు త్వరలోనే నియమిస్తాం! ప్రత్యేకంగా మెదక్, అల్లాదుర్గ్, నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి కేజీబీవీలలో చదివే విద్యార్థినులకు ఐఐటీ, జేఈఈ, నీట్, క్లాట్ల (లా–కోర్స్)లు చదివేందుకు గానూ ఎంట్రెన్స్లు రాసేందుకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తాం. ఇందుకోసం ఇప్పటికే ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కాగా త్వరలోనే బోధకులను నియమించి శిక్షణ ఇప్పిస్తాం. –జగదీశ్వరీ, కేజీబీవీల కో –ఆర్డినేటర్, మెదక్ -
వర్షాలతో జలకళ
ఎనగండ్ల మామిడి చెరువులోకి వచ్చి చేరిన వర్షపు నీరు గత వారం రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలతో చెరువులు కుంటల్లోకి నీరు వచ్చి జలకళను సంతరించుకుంటున్నాయి. పగలంతా పొడి వాతావరణం రాత్రి చిరుజల్లులతో ప్రారంభమై భారీ వర్షంగా మారుతోంది. సోమవారం రాత్రి గంట పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో వరి పొలం అచ్చుకట్ల నుంచి నీరు పొంగిపొర్లింది. అటు పత్తి పంటలో వర్షపు నీరు నిలిచి కనిపించింది. వర్షాలు అంతంతగానే ఉంటాయన్న తరుణంలో రోజులో ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొల్చారం(నర్సాపూర్) -
సత్వర పరిష్కారం చూపండి
నారాయణఖేడ్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పట్ల అలసత్వం వహించకుండా సత్వర పరిష్కారం చూపాలని ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి అధికారులకు సూచించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 2022లో ఖేడ్ మండలానికి చెందిన 60 మంది గిరిజన యువతకు స్వయం ఉపాధి కోసం మంజూరైన రుణాలను వెంటనే గ్రౌండింగ్ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాజునాయక్ గిరిజన నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. తుర్కపల్లి తండాలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని, పరిష్కరించాలని తండా యువకులతో పాటు పలు గ్రామాల బాధితులు వినతులు అందించారు. వాటిని పరిశీలించి ఆయాశాఖల అధికారులకు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వివిధశాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ ఉమాహారతి -
ఆపరేటర్ల సేవలకు స్వస్తి
సంగారెడ్డి జోన్: భూ భారతి కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి స్థానంలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లపై ప్రణాళికలు రూపకల్పన చేస్తుంది. భూ భారతి నిర్వహణలో అవకతవకలు, భూ రిజిస్ట్రేషన్ల అక్రమాలు, అక్రమ వసూళ్ల నేపథ్యంలో వీరిని తొలగించాలని నిర్ణయించింది. జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు జిల్లావ్యాప్తంగా ఒక సబ్ కలెక్టర్, 3 రెవెన్యూ డివిజన్, 28 తహసీల్దార్ కార్యాలయాలు ఉన్నాయి. మండల కేంద్రాల్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో సాగులో ఉన్న భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్తో పాటు ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆయా కార్యాలయాల్లో 25 మంది ఆపరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి అమలు సమయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వీరిని నియమించగా, ఏళ్లుగా ఆపరేటర్లు ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరి సేవలకు స్వస్తి పలకనున్నారు. జిల్లా కేంద్రంలో ఈనెల 7న రిజిస్ట్రేషన్ కార్యకలాపాలపై శిక్షణ ఇచ్చి లాగిన్తో పాటు బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే మీసేవ ఆపరేటర్లను తొలగించి వారి స్థానంలో జీపీఓలకు బాధ్యతలు అప్పగించారు. కార్యాలయాల్లో వారిదే హవా తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో ఒకరోజు వ్యవధిలో సుమారు 20 వరకు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. భూ రిజిస్ట్రేషన్లు, ఆన్లైన్ పత్రాల పేరుతో ఇష్టారాజ్యాంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆపరేటర్లకు డబ్బులు ఇవ్వకుంటే సర్వర్ బిజీ, నెట్ రావడం లేదని ఇతర సాకులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సంబంధిత కార్యాలయ అధికారులు చెప్పినప్పటికీ వినకుండా పెడచెవిన పెట్టేవారు. ఆపరేటర్లు కింగ్లుగా మారారనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయాన్ని బట్టి రోజుకి రూ.1 వెయ్యి నుంచి రూ. 30 వేల వరకు దండుకుంటున్నారు. పారదర్శకత కోసమే.. తహసీల్దార్ కార్యాలయాల్లో అక్రమాలకు చెక్ పెట్టి పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రైవేట్ వ్యక్తుల సేవలను తొలగించనున్నారు. భూ రిజిస్ట్రేషన్లతో పాటు ఇతర కార్యకలాపాలు అక్రమ వసూళ్లు, అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయిం తీసుకున్నారు. కార్యాలయాల్లోని ఆపరేటర్లపై గత కొంతకాలంగా ప్రత్యేక అధికారులు విచారణ చేసి తొలగిస్తున్నట్లు సమాచారం. ప్రైవేట్ వ్యక్తుల జోక్యం లేకుండా పూర్తిగా ప్రభుత్వ అధికారులే త్వరలో సేవలు అందించనున్నారు. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు ఈ నెల 7న జిల్లా కేంద్రంలో శిక్షణ ఇప్పటికే మీసేవ ఆపరేటర్ల తొలగింపు -
తగు చర్యలు చేపడతాం
మెదక్జోన్: జిల్లాలో 21 మండలాల పరిధిలో 492 గ్రామాలు, 4 మున్సిపాలిటీలు ఉండగా.. నిత్యం ఏదో ఒక చోట పలువురు కుక్క కాటుకు గురై నిత్యం ఆస్పత్రుల పాలవుతున్నారు. అధికారిక లెక్కల ప్రకా రం ఈ ఏడాది ఇప్పటివరకు 980 పైచిలుకు మంది కుక్కల దాడిలో గాయపడ్డారు. ఈ లెక్కన నెలకు 140 మందికి పైగా వీటి బారిన పడుతు న్నారు. ఇంత జరుగుతున్నా కుక్కలను అరికట్టేందుకు అధికారులు, పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా బడికి వెళ్లిన విద్యార్థులు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో.. లేదోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నియంత్రణ అంతంతే! శునకాలను నియంత్రణకు జిల్లా కేంద్రంలో శస్త్రచికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే దీనిని అడపాదడపా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఒక్కో శునకానికి శస్త్ర చికిత్స చేయాలంటే రూ. 1,600 ఖర్చు వస్తుందని అధికారులు చెబుతున్నారు. అంత మొత్తం చెల్లించి నియంత్రణ చేయిస్తే మున్సిపాలిటీలు, పంచాయతీలపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో పాలకవర్గాలు పెద్దగా దృష్టి సారించలేక పోతున్నాయి. ఫలితంగా కుక్కల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. పట్టణంలోని పలు వార్డుల్లో సంచరిస్తున్న కుక్కలను ఓ ఏజెన్సీ ద్వారా పట్టి నియంత్రణ కోసం శస్త్ర చికిత్స చేస్తున్నాం. ఇది మున్సిపాలిటీకి ఆర్థిక భారంగా మారుతుంది. త్వరలో మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటాం. – నవీన్, మెదక్ మున్సిపల్ కమిషనర్ -
ఇంటర్ ప్రవేశాలకు మరో అవకాశం
న్యాల్కల్(జహీరాబాద్): ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు ప్రవేశ గడువును ఈనెల 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రకటించిన గడువు ఈనెల 31తో ముగియగా, మరోసారి పొడిగించింది. దీంతో ప్రవేశాల సంఖ్య పెరగనుంది. జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా, గురుకుల, ప్రైవేట్ కళాశాలలు 100కు పైగా ఉన్నాయి. గతేడాది ప్రభుత్వ కళాశాలల్లో 4,677 మంది విద్యార్థులు ప్రవేశం పొందగా, ఈ ఏడాది ఇప్పటివరకు 4,503 మంది ప్రవేశం పొందారు. గతేడాది కంటే ఈసారి కేవలం 174 మంది తక్కువగా చేరారు. ప్రస్తుతం ప్రవేశాల గడువు పెంచినందున మరిన్ని అడ్మిషన్లు అయ్యే అవకాశం ఉంది. అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని అధ్యాపకులు, సిబ్బంది కళాశాలల ప్రారంభానికి ముందే మేలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లిన వారు ప్రభుత్వ కళాశాలల్లో చదవడం ద్వారా కలిగే ప్రయోజనాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఉత్తమ ఫలితాలు తదితర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థులను అక్కడే తాత్కాలికంగా అడ్మిషన్ సైతం చేసుకున్నారు. ఇలా సుమారు 15 రోజుల పాటు విస్తృత ప్రచారం నిర్వహించడంతో ప్రవేశాలు పెరిగాయి. ఈక్రమంలో మరోసారి ప్రవేశాల గడువును ప్రభుత్వం పొడిగించింది. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 15 వరకు గడువు పొడిగింపు -
ప్రభుత్వాస్పత్రిని ప్రారంభించండి
రామచంద్రాపురం(పటాన్చెరు): పటాన్చెరులోని ప్రభుత్వ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి కోరారు. ఈమేరకు సోమవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రితో పాటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి ఆస్పత్రి అభివృద్ధిపై మంత్రిని కలిసి మాట్లాడినట్లు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరారు. రోగుల రద్ధీకి అనుగుణంగా వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా రాష్ట్రంలో 104 సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఈ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. శివ్వంపేట(నర్సాపూర్): భూ రీ సర్వేతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా సర్వే ఏడీ కిషన్, ఆర్డీఓ రామకృష్ణ అన్నారు. సో మవారం మండల పరిధిలోని లింగోజిగూడలో గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భూముల పంచాయతీలతో నిత్యం జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రతి గుంట భూమిని సమగ్రంగా సర్వే చేస్తామన్నారు. అందుకు సంబంధించి రికార్డులు పొందుపరిచి నకిలీ పట్టాదారులను రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. రీ సర్వేకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీఐఓఎస్ రాంరెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, ఏఎస్ఐ సాయిలు, సర్పంచ్ అమృత, సర్వేయర్ అరుణ్కుమార్, ఆర్ఐ నిరంజన్ తదితరులు ఉన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఐటీఐ సెంటర్లో సోమవారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించిందని జి ల్లా ఎంప్లాయీమెంట్ అధికారి రామరాజు తెలిపారు. హరేకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 72 పోస్టులకు జాబ్ మేళా నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో మొత్తం 115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అభ్యర్థుల అర్హతను బట్టి 45 మందిని ఎంపిక చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధికారులు శివప్రసాద్, సుధీర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. కొల్చారం(నర్సాపూర్): మండలంలోని తుక్కాపూర్లో సోమవారం పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించిన పప్పు చారులో పురుగులు కనిపించాయి. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదార్థాల మన్నికపై అంగన్వాడీ టీచర్ ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదంటూ ఆరోపించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మెదక్ కలెక్టరేట్: రైస్ మిల్లులపై కొన్ని రోజులుగా విజిలెన్స్ తనిఖీలు విస్తృతంగా సాగుతున్నాయి. తాజాగా సోమవారం పట్టణంలోని ఓ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మిల్లులో ఎలాంటి సమస్యలు లేవని గుర్తించారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ పండరి, ఎస్ఐ వెంకటేశం, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొన్నారు. -
చెట్ల కింద చదువులు
కల్హేర్(నారాయణఖేడ్): మండలంలోని కృష్ణాపూర్ పాఠశాలలో తరగతి గదుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పాఠశాలల బయట చెట్ల కింద, వరండాలో ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువులు చెబుతున్నారు. ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్, అంగన్వాడీ కేంద్రాన్ని ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 10 మాత్రమే గదులు ఉండగా, కంప్యూటర్, ల్యాబ్, హెచ్ఎం కార్యాలయలు ఇక్కడే కొనసాగిస్తున్నారు. ఎంపీపీఎస్లో 186 మంది, జెడ్పీహెచ్ఎస్లో 120 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో సరిపడా గదులు లేకపోవడంతో చెట్ల కింద చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం పడితే పాఠశాలల అవరణలో నీరు నిలిచి చెరువును తలపిస్తుంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు తరగతి గదులు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని ఎంఈఓ సురేష్ తెలిపారు. -
వానరాలకూ కు.ని
భూ ఆక్రమణను అడ్డుకోండి భూ ఆక్రమణను అడ్డుకోవాలని కోరుతూ కలెక్టరేట్లో ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. వివరాలు 9లో uరామాయంపేట(మెదక్): జిల్లాలో రోజు రోజకు పెరిగిపోతున్న కోతుల బెడద నివారణకు అధికారులు నడుం బిగించారు. ఈమేరకు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు రెండు రోజుల పాటు నిర్మల్ జిల్లా చించోలి వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోతుల పునరావాస, శస్త్ర చికిత్స కేంద్రాన్ని సందర్శించారు. దేశంలోనే ఈ కేంద్రం రెండోది కాగా, రాష్ట్రంలో మొట్ట మొదటిది. పలు జిల్లాల నుంచి ఇక్కడికి తరలించిన కోతులకు ఈ కేంద్రంలో శస్త్ర చికిత్స ద్వారా సంతాన నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈప్రక్రియలో భాగంగా జిల్లా నుంచి 980 కోతులను నిర్మల్ తరలించారు. వాటిలో ఇప్పటివరకు 300 వానరాలకు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఏడు నుంచి పది రోజుల వరకు ప్రత్యేక బోన్లలో ఉంచి ఆహారం అందించారు. అనంతరం అటవీ ప్రాంతాల్లో వదిలేస్తారు. కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జిల్లాలో ఇటీవల కోతుల బెడద తీవ్రమైంది. గ్రామాల్లో వేల సంఖ్యలో ఉన్న వాటి బెడదను అరికట్టడానికి గాను గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్రస్థాయిలో చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పంట చేలను ధ్వంసం చేయడం, ప్రజలపై దాడులకు పూనుకోవడం లాంటి సంఘటనలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కోతుల బెడద అరికట్టడానికి గాను జిల్లాలో ప్రజలు అధికారులకు వినతిప్రతాలు అందజేశారు. మరోవైపు ప్రజాప్రతినిధులు సైతం అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈమేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు పశు సంవర్ధకశాఖ జిల్లా అధికారి వెంకటయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం రెండు రోజుల క్రితం నిర్మల్ జిల్లాలో పునరావాస, శస్త్ర చికిత్స కేంద్రాన్ని సందర్శించింది. జిల్లాలో సైతం కేంద్రం ఏర్పాటుకు అయ్యే నిధులు, ఇతరత్ర సమాచారాన్ని వారు సేకరించారు. జిల్లా నుంచి నిర్మల్కు 980 కోతుల తరలింపు నివారణకునడుం బిగించిన అధికారులు ఇటీవల అక్కడి శస్త్ర చికిత్స కేంద్రం సందర్శన కలెక్టర్కు నివేదిస్తాం కలెక్టర్ ఆదేశాల మేరకు తాము ఇటీవల నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న కోతుల పునరావాస, శస్త్ర చికిత్స కేంద్రాన్ని సందర్శించాం. అక్కడ జిల్లా నుంచి పట్టుకెళ్లిన కోతులకు ఆపరేషన్లు నిర్వహించారు. కేంద్రానికి సంబంధించిన వివరాలను కలెక్టర్కు నివేదిస్తాం. – వెంకటయ్య, జిల్లా వెటర్నరీ అధికారి -
టూరిస్ట్ హబ్కు పటిష్ట ప్రణాళిక
మెదక్ కలెక్టరేట్: టూరిస్ట్ హబ్ కోసం పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆర్వీ కన్సల్టెంట్ ప్రతినిధి నందన, టూరిజం డీఈ శ్రీశైలం, ఈడీఎం సందీప్, డీపీఆర్ఓ రామచంద్రరాజు తదితరతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధ్యాత్మిక, చారిత్రక, పర్యావరణ ప్రదేశాలు ఉండడం జిల్లాకు ఒక వరమని అన్నారు. అధికారులు సమన్వయంతో జిల్లా టూరిస్ట్ హబ్ కోసం కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న తల్లి పాల వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. పిల్లల బలమైన భవిష్యత్కు తల్లిపాలే శ్రేష్టమని అన్నారు. అంతకుముందు ఈనెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. అలాగే ఈకో ఫాన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విదేశీ దురాక్రమణ కలుపు మొక్కల నిర్మూలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని వినతులు స్వీకరించారు. మొత్తం 57 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్తో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
రాజ్యాంగ విలువలు తెలుసుకోవాలి
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి పటాన్చెరు టౌన్: ప్రతీ భారతీయ పౌరుడు రాజ్యాంగాన్ని తెలుసుకొని, అందులోని విలువలను జీవితంలో ఆచరించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అన్నారు. ఆదివారం ముత్తంగి డివిజన్ పరిధిలోని విశ్వభారతి లా కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయశాఖ డీన్ ఆచార్య వెంకటేశ్వర్లు, లా కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ రవి అనంత, ప్రిన్సిపాల్ భవానీలతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం నిర్దేశించిన విలువలను ఆచరణలో పెట్టాలని సూ చించారు. చట్టం ఉద్దేశం, సమాజంలో న్యాయ పరిరక్షణలో దాని పాత్రను విద్యార్థులు అర్థం చేసుకుని బాధ్యతాయుతమైన న్యాయవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం ఓయూ న్యాయశాఖ డీన్ ఆచార్య వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. న్యాయ విద్యలో అకాడమిక్ పరిశోధనలు, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి కీలకమన్నారు. ఆన్లైన్ వివాద పరిష్కార వ్యవస్థలకు ప్రాధాన్యం పెరుగుతోందని, విద్యార్థులు ఈ రంగాల్లో నైపుణ్యం సాధించాలని సూచించారు. కళాశాల కరస్పాండెంట్ రవి అనంత మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రమ్యశ్రీ, గురుమూర్తి, తేజశ్రీ, అడ్మిన్ విభాగం మురళి, రాము, లా కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సర్.. జోరు!
మెదక్ కలెక్టరేట్: తప్పుల్లేని ఓటరు జాబితాయే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల కమిషన్ జూన్ 25 నుంచి చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (సర్) ప్రక్రియ జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాలో 91 శాతం డిజిటలైజేషన్ పూర్తయ్యింది. ఇంకా మిగిలిన ఓటర్లు, కొత్త వారి నమోదుకు మరో అవకాశం ఇస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెల 10 వరకు గడువు పొడిగించింది. జిల్లాలో సర్ కార్యక్రమంలో మొత్తం 666 మంది సిబ్బంది చేస్తున్నారు. ఇందులో 586 మంది బీఎల్ఓలు, 16 మంది ఏఈఆర్టీలు, 64 మంది బీఎల్ఓ సూపర్వైజర్లు ఉన్నారు. జిల్లాలో నకిలీ ఓట్ల తొలగింపు, కొత్త ఓట్లు చేర్చడంలో బూత్ లేవల్ అధికారులు కీలకంగా పనిచేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి రెండు ఓటరు నమోదు పత్రాలు అందజేసి, ఓటర్ల నుంచి రీకవరీ చేయడానికి గత నెలరోజులుగా విశేష కృషి చేస్తున్నారు. అనంతరం వాటిని డిజిటలైజేషన్ చేస్తున్నారు. అలాగే కొత్త వారికి అవకాశం కల్పించేందుకు పూర్తిస్థాయిలో సేవలందిస్తున్నారు. 17న ముసాయిదా ఓటరు జాబితా ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. సెప్టెంబర్ 16 వరకు ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 15 వరకు ఫిర్యాదుల పరిష్కారానిక చర్యలు తీసుకుంటారు. అక్టోబర్ 19వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. జిల్లాలో 91 శాతం డిజిటలైజేషన్ పూర్తి అదే స్థాయిలో ఓటర్ల నుంచి ఫారాల స్వీకరణ కీలకంగా పనిచేస్తున్న బీఎల్ఓలు సర్ కార్యక్రమాన్ని ఈనెల 10 వరకు ఎన్నికల కమిషన్ పొడిగించింది. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వందశాతం ‘సర్’ నమోదుకు బీఎల్ఓలు కృషి చేయాలి. అర్హులైన ప్రతీ ఓటరు తుది జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటాం. – ప్రతిమాసింగ్, కలెక్టర్ -
కొత్త సబ్స్టేషన్లు మంజూరు చేయండి
పాపన్నపేట(మెదక్): మండలంలో కొత్తగా రెండు విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని పాపన్నపేట, చీకోడ్లో 33/11 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ సమస్య పరిష్కారమవుతుందని వివరించారు. మండలంలో వ్యవసాయ భూములు ఎక్కువగా ఉండటం వల్ల నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. యువతకు ప్రధాని మోదీ పిలుపు వర్గల్(గజ్వేల్): యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకర, బాధ్యతాయుత జీవనశైలి అలవర్చుకోవడం ద్వారా ‘వికసిత్ భారత్–2047‘లక్ష్యాలు సిద్ధింపజేయాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని మై భారత్ ‘నషా ముక్త యువ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేశవ్యాప్తంగా యువతతో ప్రధానమంత్రి వర్చువల్గా సంభాషించారు. 100 రోజుల ‘క్యాంపస్ టు కమ్యూనిటీ ‘ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వేలాది విద్యార్థులు, 20,000 మంది పైగా మాస్టర్ వలంటీర్లు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడం, పునరావాస కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా కావేరి విద్యార్థులు మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వర్సిటీ వైస్చాన్సలర్ డాక్టర్ ప్రవీణ్రావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు, వివిధ విభాగాల డీన్లు డాక్టర్ జి.పుష్పలత, డాక్టర్ సునీతా మెహతా, డాక్టర్ శ్రీనివాస్, ప్లేస్మెంట్ – ఇంక్యుబేషన్ హెడ్ డాక్టర్ సతీశ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మామిడి మొక్కలకు కేరాఫ్ అడ్రస్ అనగానే ఉద్యానవన రైతులకు టక్కున గుర్తొచ్చేది సదాశివపేట మండలంలోని పెద్దాపూర్ నర్సరీలు. రాష్టంలోనే ఈ మామిడి మొక్కలు ప్రసిద్ధి చెందినవి. అయితే భీమవరం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కూలీలు ఇక్కడి నర్సరీల్లోని మామిడి మొక్కలకు అంట్లు కట్టడం కోసం వలస వచ్చారు. స్థానిక రైతులతో కలిసి వీరు ఉదయమే నర్సరీలకు చేరుకొని అప్రోచ్ గ్రాఫ్టింగ్ (తల్లి అంటు మొక్కలు) నిర్వహిస్తుండగా ఆదివారం ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కలు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, పెద్దాపూర్లో మాత్రం తల్లి చెట్ల నుంచి అంటుకట్టి పిల్ల మొక్కలను ఉత్పత్తి చేయడం నేటికీ కొనసాగుతుంది. ఆరోగ్యకరమైన, మంచి రుచికరమైన ఫలాలను అందించే మొక్కలను ఇక్కడ తయారు చేస్తున్నారు. కాగా, ఒక్కో మొక్కకు అంటు కడితే కూలీలకు రూ.200 చెల్లిస్తున్నారు. రోజుకు దాదాపు 500 మొక్కలకు అంట్లు కడుతూ రూ. వెయ్యి సంపాదిస్తూ జీవనోపాధిని పొందుతున్నామని కూలీలు చెబుతున్నారు. నారాయణఖేడ్: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచకు చెందిన కొంగరి దీపక్రెడ్డి ఉత్తమ ఇన్నోవేటర్ అవార్డును అందుకున్నారు. నీతి అయోగ్ సంస్థ వారు జూలై 31న రాష్ట్రపతి భవన్లో దేశవ్యాప్తంగా వివిధ ఆవిష్కరణలకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దీపక్ రెడ్డి రాముభవ్య ఇన్నోవేటర్స్ ద్వారా పొలాల్లో పేరుకుపోయిన రాళ్లను తొలగించి భూములను సాగులోకి తీసుకురావడానికి ఉపయోగపడే రుద్ర రాళ్లు ఏరే మిషన్ను రూపొందించారు. రాష్ట్రపతి ప్రదర్శనను తిలకించి దీపక్రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకొని అవార్డుకు ఎంపిక చేశారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, బోరంచ సర్పంచ్ బీరప్ప, నల్లపోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ దీపక్రెడ్డికి అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించారు. -
ఆ విద్యార్థులకు అండగా ఉంటా
సిద్దిపేటజోన్: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు సాధించి ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న నియోజకవర్గ విద్యార్థులు బాధపడొద్దని తన దృష్టికి తీసుకొస్తే వారిని సొంత పిల్లల లెక్క భావించి చదివించే బాధ్యత నేను తీసుకుంటానని మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్లో ఇటీవల నీట్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మెడికల్ కౌన్సెలింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిన హరీశ్రావు గత రెండు రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతుండటంతో రాలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన ఫోన్ ద్వారా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఒకప్పుడు వైద్య విద్య కోసం మన పిల్లలు చైనా, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు వెళ్లేవారని కానీ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల పిల్లలు మన రాష్ట్రానికే వస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదింటి విద్యా కుసుమం. అఖిల....తండ్రి రాజు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయాడు. తల్లి హోటల్లో పనిచేస్తుంది. ముగ్గురు పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఆదుకోవాలని మాజీమంత్రి హరీశ్రావును కుటుంబం ఆశ్రయించింది. స్పందించిన ఆయన డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేశారు. పిల్లల చదువుల బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా అఖిలను మెరిడియన్ విద్యా సంస్థలో చేర్పించారు. ఇంటర్ వరకు ఫీజులు భరించారు. ఈ క్రమంలో అఖిల నీట్ పరీక్ష రాసి 720 మార్కులకు గాను 453 సాధించింది. మెడిసిన్ సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హరీశ్రావు నీట్ ర్యాంక్ సాధించిన అఖిల, తల్లి రేణుకను ఇంటికి పిలిపించి భోజనం పెట్టి మెడిసిన్ చదువు కోసం అధైర్యపడొద్దని, ఐదేండ్ల విద్య,పుస్తకాల ఖర్చులు తానే స్వయంగా చెల్లిస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్ అయ్యే వరకు బాధ్యత తనదే అంటూ భరోసా ఇచ్చారు. -
ఈ రోడ్డుకు మోక్షమెప్పుడో..?
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలో మోడల్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల ఎస్టీ స్పోర్ట్స్ గురుకులం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తదితర ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. నిత్యం ఇక్కడికి రెండు ఆర్టీసీ బస్సులు విద్యార్థులను చేరవేస్తున్నాయి. అయితే ఈ పాఠశాలల వైపునకు వచ్చే తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమై మట్టి తేలింది. ఇటీవల వర్షాలకు బస్సు మట్టిలో కూరుకుపోగా, విద్యార్థులు ఆందోళన చెందారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు మోడల్ కాలనీలోనే మార్కెట్ కమిటీ గోదాం సైతం ఉండటంతో లోడుతో లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. దాదాపు రెండు కిలోమీటర్ల రోడ్డును బాగుచేస్తే విద్యార్థులకు సౌకర్యంగా మారనుంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును బాగు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సీఎంఆర్ రగడ..!
సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విషయంలో ప్రభుత్వ నిబంధనలను రైస్ మిల్లర్లు ఉల్లంఘించడం పరిపాటిగా మారింది. ఈసారి ఏకంగా 60 మంది మిల్లర్లు కూడబలుక్కుని సర్కార్కు వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కారు. ఇటు మిల్లులపై వరుసగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు కొనసాగుతున్నాయి. ఇది ఎక్కడి వరకు వెళ్తుందనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా బాయిల్డ్, రారైస్కు సంబంధించి సుమారు 126 రైస్మిల్లులు ఉన్నాయి. వీటిలో నిబంధనలు అతిక్రమించిన కొన్నింటిపై ఇప్పటికే కేసులు నమోదు కాగా, మరికొన్ని కోర్టు పరిధిలో కేసులు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే తాజాగా ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య మరో రగడ మొదలైంది. 2022 రబీ సీజన్కు సంబంధించిన ఽ1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరాడించేందుకు 72 రైస్ మిల్లులకు ధాన్యం ఇచ్చారు. ఇందులో 12 మంది మిల్లర్లు 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సకాలంలో ఇవ్వకపోవడంతో అధికారులు వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఇందుకు సంబంధించి ఆర్ఆర్యాక్ట్ను సైతం ప్రయోగించారు. ఇక పోతే మరో 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం 60 మిల్లర్ల వద్ద ఉండిపోయింది. నిబంధనల ప్రకారం ధాన్యం దింపుకున్న 10 నెలల్లో తిరిగి సీఎంఆర్ ఇవ్వాలి. కానీ మూడేళ్లు గడిచిపోయినా బియ్యం ఇవ్వకపోవడంతో సివిల్ సప్లయ్ అధికారులు ఆ ధాన్యాన్ని వేలం వేశారు. ఓ వ్యక్తి క్వింటాల్ ధాన్యానికి రూ.1,999 చొప్పున వేలం పాటలో దక్కించుకున్నాడు. కానీ అతడు సకాలంలో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్టర్కు పెనాల్టీ విధించారు. కాగా, ఆ ధాన్యం అలాగే 60 మంది మిల్లర్ల వద్ద ఉండిపోవడంతో సకాలంలో సీఎంఆర్ ఇవ్వనందుకు గానూ క్వింటాల్ ధాన్యానికి రూ. 2,236 చొప్పున 80 వేల మెట్రిక్ టన్ను ధాన్యానికి రూ. 178.88 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈనెల 7వ తేదీ వరకు గడువు ఇచ్చింది. వరుస దాడులు కొల్చారం రైస్మిల్లులో ఇటీ వల రూ. 7 కోట్ల ధాన్యం పక్కదారి పట్టిన విషయం వెలుగులోకి రావడంతో సీఎంఆర్ ధాన్యం స్వీకరించిన మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. ఇప్పటివరకు అల్లాదుర్గం, వెల్దుర్తి తదితర మండల కేంద్రాల్లోని పలు రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టుకు 60 మంది మిల్లర్లు 2022 రబీ సీజన్కు సంబంధించిన వివాదం క్వింటాల్కు రూ.2,236 చొప్పున ఇవ్వాలన్న ప్రభుత్వం అంత ఇచ్చుకోలేమని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైనం 80 వేల మెట్రిక్ టన్నుల ధా న్యానికి సంబంధించి 60 రైస్ మిల్లర్లు రూ. 178.88 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈనెల 7 వరకు గడువు ఉంది. ఆలోగా చెల్లించకపోతే 25 శాతం పెనాల్టీ విధిస్తాం. – జగదీశ్, సివిల్ సప్లయ్ డీఎం క్వింటాల్కు రూ. 1,800 కన్నా ఎక్కువగా ఇవ్వలేమని మిల్లర్లు పేర్కొంటున్నారు. అదే ధాన్యాన్ని టెండర్ వేస్తే సదరు కాంట్రాక్టర్ క్వింటాల్కు రూ. 1,999 చొప్పున వేలంలో దక్కించుకొని వెళ్లిపోయాడని వారి వాదన. ఆ ధరను తగ్గించాలని అప్పటివరకు ప్రభుత్వం తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని 60 మంది మిల్లర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టుకెళ్లారు. కాగా, ఇప్పటికే జిల్లాలో పలు రైస్ మిల్లుల యజమాన్యాలు అక్రమాలకు పాల్పడటంతో వారిపై క్రిమినల్ కేసులు పెట్టిన సంబంధిత అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, తాజాగా మరో 60 మంది మిల్లర్లు కోర్టుమెట్లు ఎక్కడం చర్చనీయాంశంగా మారింది. -
మెరుగైన వైద్యం అందించాలి
వెల్దుర్తి(తూప్రాన్): ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ అనిల్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు. వెల్దుర్తి, చేగుంట, మనోహరాబాద్, నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సూపర్వైజర్లు, ఎంఎల్హెచ్పీలు, టీబీ సూపర్వైజర్లు, ఆర్బీఎస్కే బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పురోగతి, మాతా–శిశు ఆరోగ్య సేవలు, క్షయ వ్యాధి నిర్మూలన చర్యలు, సాధారణ వైద్య సేవలు, క్షేత్రస్థాయి పనితీరు, ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల సాధనపై సమగ్రంగా చర్చించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వసతి, నివాస గృహాల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ శిరీష, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ రూరల్: రసాయన ఎరువులకు బదులు పీఎస్బీతో మంచి దిగుబడులు సాధించవచ్చని తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ రైతులకు సూచించారు. శనివారం మండలంలోని అవంచలో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా పీఎస్బీపై రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకంతో భూములు పాడవుతాయని వివరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న నిర్వహించే జైలు భరో కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేసిందన్నారు. కార్మికుల హక్కులను హరించే విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. 2025 విద్యుత్ సవరణ బిల్లు రద్దుతో పాటు విత్తన చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించి, రోజువారీ వేతనం రూ.600 ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, జిల్లా కోశాధికారి నర్సమ్మ, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. 5 నుంచి ఫుట్బాల్ పోటీలు జహీరాబాద్: ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు బాల బాలికలకు సుబ్రతో కప్ ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అండర్ 17 విభాగంలో బాలురు, బాలికలకు, అండర్–15 విభాగంలో బాలురకు మాత్రమే పోటీలు ఉంటాయన్నారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న జట్లు మాత్రమే పోటీలో పాల్గొంటాయన్నారు. ఒక పాఠశాల నుంచి ఒక టీం మాత్రమే హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 8125347198 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
స్నేహోత్సవం
స్నేహితులే మన ధైర్యం, ఆత్మవిశ్వాసం స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న విద్యార్థినీ, విద్యార్థులుడబ్బుతో కొనలేనిది కష్టసుఖాల్లో తోడుగా నిలిచే స్నేహితులు జీవితంలో గొప్ప సంపద. డబ్బుతో కొనలేని అమూల్యమైన బంధం. నిజమైన స్నేహం నమ్మకం, నిజాయితీ, పరస్పర గౌరవంపై నిలబడుతుంది. స్నేహాన్ని ఎప్పుడూ స్వార్థం కోసం కాకుండా ప్రేమ, ఆప్యాయతతో కొనసాగించాలి. –సుష్మ, డిగ్రీ విద్యార్థిని, సిద్దిపేట. మంచి స్నేహితులు మార్గదర్శకులు మంచి స్నేహితులు మన జీవితాన్ని సరైన దిశలో నడిపించే మార్గదర్శకులు. నమ్మకంగా ఉండి మన విజయాలను చూసి సంతోషించే స్నేహితుడు ఉంటే జీవితంలో ఎంతటి విజయాలనైనా అలవోకగా సాధించేందుకు వీలుంటుంది. –సంతోష్, డిగ్రీ, ఎంపీసీఎస్, సిద్దిపేట. -
యూడీఐడీ కార్డుల జారీ వేగవంతం
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో దివ్యాంగులకు సంబంధించి యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. శనివారం సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయా శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్లో యూడీఐడీ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 2025 మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 1523 యూడీఐడీ కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం 13 మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ శ్రీనివాసరావు, అదనపు డీఆర్డీఓ సరస్వతి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మెప్మా పీడీ హనుమంత్ రెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్ -
చట్టాలపై అవగాహన అవసరం
ఖేడ్ మున్సిఫ్ కోర్టు జడ్జి హిమబిందు కంగ్టి(నారాయణఖేడ్): విద్యార్థులు చట్టాలు తెలుసుకొని న్యాయ వ్యవస్థపై గౌరవంగా ఉండాలని నారాయణఖేడ్ మున్సిఫ్ కోర్టు జడ్జి హిమబిందు తెలిపారు. శనివారం కంగ్టిలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో లీగల్ సర్విస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. చిన్నతనం నుంచే విద్యార్థులకు చట్టాలు, న్యాయాల విషయంలో అవగాహన ఏర్పడితే పెద్దయ్యాక క్రమశిక్షణతో కూడిన జీవనం గడిపే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం గురుకులంలోని స్టోర్ రూంను పరిశీలించి విద్యార్థుల కోసం నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలు, పప్పులు తదితరాలు పరిశీలించారు. నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్కుమార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
మంచి స్నేహితులను ఎంచుకోవాలి
స్నేహం అంటే మన మనస్సులోని అన్ని రహస్యాలను పంచుకోగల బంధం. నిజమైన స్నేహితుడు సుఖంలోనూ, కష్టంలోనూ ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటాడు. నిజమైన స్నేహితులు మన శ్రేయస్సును కోరుకుంటే స్నేహం పేరుతో మనల్ని ముంచేవాళ్లు కూడా ఉంటారు. అందుకే స్నేహితుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి వారినే ఎంచుకోవాలి. – సిరివెన్నెల, బీజెడ్సీ, సిద్దిపేట. తోడు నీడగా ఉండాలి స్నేహితులు అంటే ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. స్నేహితులు జీవితాంతం కలిసిమెలిసి ఉంటారు. అలాంటి స్నేహితులు దొరకడం అదృష్టం. నిస్వార్థమైన స్నేహం కలకాలం నిలుస్తుంది. –అంజలి, డిగ్రీ విద్యారిన్థి, సిద్దిపేట. తేడాలను చూపనిదే స్నేహం కుల, మతం, భాష, సంపద అనే తేడాలను దాటి మనుషులను కలిపే గొప్ప బంధమే స్నేహం. జీవితంలో సంపదకంటే మంచి స్నేహితులు ఉండటం గొప్ప అదృష్టం. –మోహన్ బికాం, డిగ్రీ విద్యార్థి, సిద్దిపేట. -
భూ సమస్యలకు చెక్: కలెక్టర్
● పరిష్కారానికి కొత్త సాప్ట్వేర్ ● వారం రోజుల్లో అందుబాటులోకి పైలెట్ ప్రాజెక్ట్గా కొంటూరు ఎంపిక మెదక్ కలెక్టరేట్: భూ సమస్యల పరిష్కారానికి కొత్త సాప్ట్వేర్ రూపొందించామని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఎన్ఐసీ ఆధ్వర్యంలో రూపకల్పన చేస్తున్న నూతన సాఫ్ట్వేర్పై సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీప్రసన్న, ఎన్ఐసీ సైంటిస్ట్ సీసీ సంధ్య, ల్యాండ్ రికార్డ్స్ జిల్లా ఏడీ కిషన్, అదనపు కలెక్టర్ నగేశ్తో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ రీసర్వే జరిగిన గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి ఎన్ఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న నూతన సాప్ట్వేర్ను వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. మెదక్ మండలంలోని కొంటూరు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామన్నారు. అంతముందు మెదక్ మండలం కోంటూరు గ్రామాన్ని సర్వే డిపార్ట్మెంట్ అధికారులు సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. -
టీచర్లకు మధ్యాహ్న భోజనం
● అల్పాహారం సైతం అందజేత ● అమలుకు విద్యాశాఖ ఆదేశాలు ● కసరత్తు ప్రారంభించిన అధికారులు మెదక్ అర్బన్: టీచర్లకు టిఫిన్.. మధ్యాహ్న భోజనం వర్తింపజేస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే విద్యార్థులకు ఈ ఏడాది జూన్ 12 నుంచే అల్పాహారం ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ, రెండు నెలలు కావొస్తున్నా ఆచరణకు నోచుకోలేదు. నాణ్యమైన భోజనం, టిఫిన్, పాలు ఇస్తామని చెప్పారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లకు సైతం భోజనం, టిఫిన్కు అవకాశం కల్పిస్తే, వాటి నాణ్యత బాగుందన్న అభిప్రాయం సమాజంలోకి వెళ్తుందని, అందరూ సమానమనే భావన కూడా ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే పథకం ప్రారంభంపై స్పష్టత కరువైంది. జిల్లాలో 4,300 మంది టీచర్లు జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ తదితర స్కూళ్లు కలిపి మొత్తం 957 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు 4,044 టీచర్ పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 3,551 మంది పని చేస్తున్నారు. ఇతర పాఠశాలల్లో సిబ్బందితో కలిపి సుమారు 800 వరకు ఉండవచ్చు. అంటే మొత్తం మీద 4,300 మంది పని చేస్తున్నారు. వీరందరూ విద్యార్థులతో పాటు టిఫిన్, మధాహ్న భోజనం చేయాల్సి ఉంటుంది. రోజుకో రకం టిఫిన్లు ఇచ్చేలా మెనూ రూపొందించారు. ఇడ్లీ, బోండా, ఉప్మాతో పాటు కిచిడి, వెజ్ బిర్యానీ, పులిహోర, విజయ డెయిరీ పాలు, రాగి జావ ఇవ్వనున్నారు. అల్పాహారం ఎప్పుడో? ఈ విద్యా సంవత్సరం నుంచి బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ప్రభుత్వం ప్రకటించినా, ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న వంట ఏజెన్సీలతో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం అమలవుతుందా..? లేదా అనే సంశయంలో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రాల్లో హరేకృష్ణ ఛారిటీ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాటిని పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
పీఎం కిసాన్.. మరో ఐదేళ్లు
● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు ● జిల్లాలో 1,10,000 కుటుంబాలకు లబ్ధి రామాయంపేట(మెదక్): ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈమేరకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ పథకం కింద జిల్లాలో 1,10,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. వీరి ఖాతాల్లో రూ. 22 కోట్లు కేంద్ర జమ చేస్తుంది. 2019 ఫిబ్రవరి 1వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న రైతుల్లో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నారు. భార్య లేదా భర్త ఎవరో ఒకరు మరణిస్తే వారి స్థానంలో పథకాన్ని మార్చుకునే అవకాశం కల్పించారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6 వేల వంతున ఆర్థిక సహాయం అందుతోంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకమారు రూ. 2 వేల వంతున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకాన్ని 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 23 విడతలుగా డబ్బులు విడుదల అయ్యాయి. చివరిసారిగా 2026 జూన్ 20న పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఏవైనా సందేహాల కోస హెల్ప్లైన్ నంబర్ 155261 ద్వారా సంప్రదించవచ్చు. కాగా, రైతులు తమ వ్యవసాయ పెట్టుబడుల కోసం ఈ పథకం ఎంతోగానో ఉపయోగపడుతోంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసు కునేందుకు, సాగు అవసరాల కోసం సౌలభ్యంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని తీసుకున్న నిర్ణయం రైతులకు ఆనందాన్ని ఇచ్చింది. -
అందరూ ఒకేలా ఉండరు
ఆన్లైన్ ఫ్రెండ్షిప్తో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వ్యక్తులతో పరిచయాలేర్పడి నూతన విషయాలు నేర్చుకునే అవకాశముంది. దూరంలో ఉన్న స్నేహితులతో కూడా ఎప్పటికప్పుడు సులభంగా మాట్లాడుకునే వీలుంటుంది. అయితే అందరూ ఒకేలా ఉండరు. –రమ్య, డిగ్రీ, విద్యార్థిని, సిద్దిపేట. నిజమైన స్నేహమే నిలబడుతుంది నిజమైన స్నేహాన్ని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత. నమ్మకం, నిజాయితీ, గౌరవం ఉన్నచోట నిజమైన స్నేహం పది కాలాలపాటు నిలబడుతు ంది. అలాంటి నిజమైన స్నేహితుడు మన ఆనందాన్ని రెట్టింపు చేసి బాధను సగానికి తగ్గిస్తాడు. –గురుచరణ్, బీఎస్సీ, డిగ్రీ విద్యార్థి, సిద్దిపేట.బాధను మర్చిపోతాం స్నేహానికి అధిక ప్రాధా న్యతనిస్తాను. స్నేహితులు మనకు కావాల్సినవన్నీ ఇవ్వకపోవచ్చు కానీ ఎలాంటి సమయంలోనైనా మనతో నిలబడి మన విజయంలో పాలు పంచుకుంటారు. స్నేహం మనకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మంచి విలువను నేర్పిదిలా ఉండాలి. –మల్లికార్జునచారి, ఎంబీపీటీఎస్, డిగ్రీ విద్యార్థి, సిద్దిపేట. -
తక్షణమే మరమ్మతులు చేపట్టాలి
హవేళిఘణాపూర్(మెదక్): గతేడాది కురిసిన వర్షాలతో మెదక్ మండలం రాయిన్పల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ కెనాల్ పూర్తిగా దెబ్బతిందని, మరమ్మతులు చేపట్టకపోతే కూలిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రాజెక్టును పరిశీలించి మాట్లాడారు. నామమాత్రం పనులతో సరిపెట్టుకున్న అధికారులు శాశ్వత పనులు చేపట్టకపోవడం వల్ల చెరువు కింద సాగునీటికి ఆధారపడిన రైతులకు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టుకు శాశ్వత పనులు చేపట్టి రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిష్టయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, న్యాయవాది జీవన్రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, నాగులు, జంగం వీరస్వామి, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, బాలయ్య, కిష్టయ్య, సిద్దిరాములు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి -
ఐరన్ పరిశ్రమను తొలగించండి
తూప్రాన్: ప్రాణాంతక ఐరన్ పరిశ్రమను తొలగించాలని మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాల ప్రజలు డిమాండ్ చేశా రు. శుక్రవారం రంగాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పోస్టుకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్జి వంటేరు ప్రతాప్రెడ్డి సంఘీభావం తెలిపారు. ఐరన్ పరిశ్రమతో రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాలుష్య ప్రభావంతో వ్యవసాయ భూములు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారని, చెరువుల్లో చేపలు మృతి చెందు తున్నాయని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ కు పోస్టు కార్డులపై ‘ మా ప్రాణాలను– మా పిల్లల భవిష్యత్తును కాపాడండి’ అని లేఖలో పేర్కొంటూ సుమారు వె య్యికి పైగా పోస్టుకార్డులను పంపించారు. కార్యక్రమంలో రేణుకుమార్, వెంకట్గౌడ్, అర్జున్, శ్రీనివాస్గౌడ్, నాగభూషణం, నాయకులు, యువకులు పాల్గొన్నారు. పోస్టుకార్డులతో కలెక్టర్కు వినతుల వెల్లువ -
నెలాఖరు వరకు ఈ–కేవైసీ
రామాయంపేట(మెదక్): రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. ఈ–కేవైసీ గడువు జూలై 31తో ముగియాల్సి ఉండగా.. భారీ వర్షాలు, సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా లబ్ధిదారులు ఈనెల 31 వరకు ఈ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రేషన్ కార్డులో పేర్లు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పౌర సరఫరాల అధికారులు సూచిస్తున్నారు. అనర్హుల తొలగింపు! జిల్లావ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులలో బియ్యం తీసుకొని వారు, మృతిచెందిన వారిని జాబితా నుంచి తొలగించడం లేదు. దీంతో ప్రతీనెల వారి కోటా యథావిధిగా సరఫరా అవుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం కార్డులో ఉన్న లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకువెళ్లి ఈ–కేవైసీ చేసుకోవాలని సూచించింది. చిన్నారులు, వృద్ధుల ఇబ్బందులు ఈ–కేవైసీ నమోదులో జిల్లాలో ఉన్న చిన్నారులతో పాటు వృద్ధులు తమ వేలిముద్రలు పడక తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. వేలిముద్రలు అప్డేట్ చేయించుకునేందుకు ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో వేలిముద్రలు రాక రేషన్ కార్డులో తమ పేరు తొలగిపోతుందేమోనని భయందోళనకు గురయ్యారు. తాజాగా ప్రభుత్వం గడువు పెంచడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే చిన్నారుల ఈ–కేవైసీ వేలిముద్ర ద్వారా కాకుండా ఐరిస్ డివైస్ ద్వారా వేగంగా, సులభంగా పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రతీ డీలర్ తప్పనిసరిగా ఐరిస్ డివైస్ను వినియోగించి ఈప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నేటి నుంచి మూడు నెలల కోటా జిల్లావ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల్లో నేటి నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలలకు సంబంధించి బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు రేషన్ దుకాణాల్లో తమ పూర్తి వివరాలు అందించి ఉచితంగా ఈ–కేవైసీ చేయించుకోవచ్చు. పెంచిన గడువును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్ కార్డుదారులు 2,41,832 సభ్యులు 7,90,304 ఈ–కేవైసీ పూర్తి చేసిన వారు 6,42,020 చేయాల్సిన వారు 1,48,284 గడువు పొడిగించిన ప్రభుత్వం రేషన్కార్డుదారులకు ఊరట జిల్లాలో ఇప్పటివరకు 81.24% ప్రక్రియ పూర్తి -
హే రాంజీ..!
జహీరాబాద్ టౌన్: జీరాంజీ (ఉపాధి హామీ పథకం) పథకం కింద పనిచేస్తున్న ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు చెల్లికపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వేతన బకాయిలు విడుదల చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు నిరసనలు, పెన్ డౌన్, షట్ డౌన్ ఆందోళనలు చేపట్టారు. జీరాంజీ పథకంలో పనిచేస్తోన్న ఏపీఓ, ఈసీ, జేఈ,టీఏలు,కంప్యూటర్ ఆపరేటర్ ఇతర సిబ్బంది కలిపి రాష్ట్రవ్యాప్తంగా 3,700 వరకు ఉన్నారు. జిల్లాలో సుమారు 150మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదు. జిల్లాలోని జీరాంజీ ఉద్యోగులు డిమాండ్ పరిష్కారం కోసం జేఏసీ పిలుపు మేరకు పెన్డౌన్ ప్రకటించి ప్రతీ రోజు నిరసనలు తెలుపుతున్నారు. జూలై 27 నుంచి ప్రారంభమైన నిరసన కార్యక్రమాలు ప్రతీ రోజు ఓ విధంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ లోపు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో న్యాయమైన హక్కుల కోసం నోటీసు ఇచ్చి 16 నుంచి సమ్మెకు వెళ్తామని జేఏసీ నాయకులు చెప్పారు. ప్రధాన డిమాండ్లు ● 3 నెలల వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలి ● ఉద్యోగులకు పే–స్కేల్ అమలు చేయాలి ● క్యాడర్ను ఖరారు చేసి, సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పించాలి ● ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీల అవకాశం ఇవ్వాలి ● ప్రతీ నెల మొదటి తేది వేతనాలు చెల్లించాలి ● సెలవు దినాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ప్రయోజనాలు కల్పించాలి. ఉద్యోగులు పెన్ డౌన్, షట్ డౌన్ వేతనాల చెల్లింపులో జాప్యం మూడు నెలల నుంచి నిరీక్షణ ఆందోళనకు దిగిన ఉద్యోగులు -
నిరుపేదలకు మెరుగైన వైద్యం
మెదక్ కలెక్టరేట్: రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని అదనపు కలెక్టర్ నగేశ్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా అన్ని వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యుల అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద రోగులు ఎన్నో అవస్థలతో ఆస్పత్రికి వస్తారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించి ఆదుకోవాలని సూచించారు. ఆపదలో వచ్చే రోగులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. ఆస్పత్రి పరిసరాల పరిశుభ్రం చేయడంతో పాటు రోగులకు కనీస వసతులు కల్పించాలన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఆయన వెంట రేడియాలజిస్ట్ శారదా దేవి, ఆర్ఎంఓ శైలజ, శ్రీవిద్య , ప్రియాంక, నిర్మల, వంశీతో పాటు సిబ్బంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికడదాంమెదక్ కలెక్టరేట్: రోడ్డు ప్రమాదాల నివారణలో హైవే వెంట ఉన్న హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యం కీలక భాగస్వాములు కావాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్లో అందించే తక్షణ వైద్య సహాయం ప్రాణాలను కాపాడడంలో అత్యంత కీలకమని ఎస్పీ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 100, 112 లేదా 108కు సమాచారం అందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించేలా హోటళ్ల యాజమాన్యం చొరవ తీసుకోవాలని సూచించారు. హోటల్ సిబ్బందికి ప్రథమ చికిత్స, సీపీఆర్పై అవగాహన కల్పించి, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా శిక్షణ ఇవ్వాలని కోరారు. జిల్లాలో సుమారు 255 కిలోమీటర్ల మేర ఏడు జాతీయ రహదారులు ఉన్నాయని తెలిపారు. మహిళల రక్షణ, మాదకద్రవ్యాలు, అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో పోలీసులకు సహకరించడం ద్వారా అనేక విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. అంతకు ముందు జిల్లాలో షీటీం ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి ఎస్పీ వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్గౌడ్, హోటళ్ల యాజమానులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్ ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు -
ఒక్క ఎస్ఎంఎస్తో ఓటరు సమాచారం
మెదక్ కలెక్టరేట్: ఒక్క ఎస్ఎంఎస్తో ఓటరు నమోదు సమాచారం పొందవచ్చునని కలెక్టర్ ప్రతిమాసింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1950 నంబర్కు ఎస్ఎంఎస్ చేసి ఓటర్లు తమ ఓటు నమోదు సమాచారం తెలుసుకోవచ్చునని తెలిపారు. ఈనెల 3వ తేదీతో సర్ ప్రక్రియ ముగియనున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఎన్నికల గుర్తింపు కార్డు నంబర్ను టైప్ చేసి 1950 నంబర్కు ఎస్ఎంఎస్ పంపించి వివరాలు పొందవచ్చన్నారు. మూడు రోజులు వ్యవధి మాత్రమే ఉన్నందున అర్హులైన ఓటర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవసరమైతే సవరణలు, నమోదు ప్రక్రియలను సమయానికి పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఓటు హక్కు విలువను గుర్తించి తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. తూప్రాన్: విద్యుత్శాఖ డీఈగా దశరథ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన గరుత్మంతరాజు మేడ్చల్ జిల్లా హబ్సిగూడలోని విద్యుత్ శాఖ కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈసందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నూతనంగా పదోన్నతిపై ఇక్కడికి వచ్చి పదవీ బాధ్యతలు స్వీకరించిన దశరథ్ను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీ సర్వేను సక్రమంగా నిర్వహించి రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శాలిపేటలో భూభారతి సర్వేను నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్డీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూభారతి రీ సర్వే ద్వారా అందరి రైతుల పొలాల హద్దులు, ఇతర సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. సమావేశంలో సర్పంచ్ పోశెట్టి, మండల రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. చిలప్చెడ్(నర్సాపూర్): గ్రామాల్లో వందశాతం పారిశుద్ధ్యం సాధించాలంటే విద్యార్థులే కీలకపాత్ర పోషిస్తారని డీఎల్పీఓ సురేశ్బాబు అ న్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఫైజాబాద్ పంచాయతీని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి వారికి స్వచ్ఛత కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు స్వచ్ఛతపై తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రజలు చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి కార్మికులకు అంజేయాలని, వారు సేకరించిన చెత్తను డంపింగ్యార్డులో పారబోయాలన్నారు. అధికారులు, పాలకులు, ప్రజలతోనే గ్రామాల్లో వందశాతం పారిశుద్ధ్యం సాధ్యమవుతుంద న్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములు, ఎంపీఓ మునిరుద్దీన్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు. సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలసదన్లో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల సంరక్షణకు తోడ్పడాలని సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. న్యాయ పరమైన విషయంలో ఉచిత సాయం అందిస్తామని తెలిపారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు. -
వ్యాయామ విద్య అవసరం
హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులకు మానసిక వికాసం, వ్యాయామ విద్య ఎంతో కీలకమని జిల్లా యువజన క్రీడల అధికారి రమేశ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో వ్యాయామ ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి క్రీడలకు అత్యంత ప్రా ధాన్యతనిస్తూ జాతీయ స్థాయి ఖేల్ క్రీడలను రాష్ట్రంలో నిర్వహించడం గర్వకారణమన్నారు. విద్యలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా క్రీడా నైపుణ్యాభివృద్ధి, విషయ పరిజ్ఞా నాన్ని తెలుకునేందుకు వీలుంటుందని అన్నారు. సమావేశంలో జిల్లా రిసోర్స్ పర్సన్స్ నరేశ్, రవి, దేవానంద్, శ్వేతాకుమారి, శ్రీనివాస రావు, మధుసూదన్, శ్రీధర్రెడ్డి, మధు, చంద్రమోహన్, మాధవరెడ్డి పాల్గొన్నారు. టేక్మాల్(మెదక్): గత నాలుగు రోజలుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ఎక్లాస్పూర్ ప్రాథమిక పాఠశాల తరగతి గది వెనుక భాగం కూలిపోయింది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు, విద్యార్థులు గమనించి పాఠశాలలో చదువుకునే పరిస్థితి లేకపోవడంతో లోకల్ సెలవు తీసుకున్నారు. రాత్రి సమయంలో గోడ కూలడంతో ప్రమాదం తప్పిందని, పాఠశాల సమయంలో కూలితే ప్రమాదం సంభవించేదని స్థానికులు వాపోయారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నూతన భవనం నిర్మించడం లేదని ఆవే దన వ్యక్తం చేశారు. తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీఓ సత్యనారాయణ పాఠశాలను పరిశీలించారు. సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. చిన్నశంకరంపేట(మెదక్): ఉద్యోగ, ఉపాధ్యా య సమస్యలపై ఈనెల 1న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 317 జీఓ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేశ్, శ్రీహరి, శ్రీకాంత్రెడ్డి, లింగం, అంజనేయులు, నరేందర్, కవిత, చంద్రకాంత్, స్వప్న, నవీన్, చంద్రశేఖర్, మహేందర్ పాల్గొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి నారాయణఖేడ్: గ్రామాల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. గురు వారం మండలంలోని గోప్యానాయక్ తండాలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, రూ.15 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ, పలు తండాల్లో సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే మండంలోని హంగర్గా(కె) నుంచి లాల్సింగ్ తండా వరకు నిర్మించనున్న ఫార్మేషన్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మౌలిక వసతుల కల్పన, విద్యాసంస్థల అభివృద్ధి, రహదారుల నిర్మాణం, పంచాయతీ వ్యవస్థ బలోపేతం కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ వినోద్పాటిల్, బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ చౌహాన్, సర్పంచ్లు అనూషబాయి, మహాదేవి, శాంతకుమార్, ఉపసర్పంచ్ భాస్కర్, మనోహర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ
న్యాల్కల్(జహీరాబాద్): చాలా కాలం తర్వాత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయాల పోస్టుల భర్తీని చేపట్టడంతో జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 20 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉద్యోగాలకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన దాదాపు పూర్తి కావడంతో ఉద్యోగాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లాలో 1,504 అంగన్వాడీ కేంద్రాలుండగా, వాటిలో 1,432 మంది కార్యకర్తలు పని చేస్తున్నారు. 92 టీచర్, 154 మంది ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రాల పరిధిలో 10 వేల మంది గర్భిణులు, 9,800 మంది బాలింతలు, 98,500 మంది ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. వీరందరికీ వివిధ రకాల సేవలను అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందిస్తున్నారు. అయితే కేంద్రాల్లో నెలకొన్న ఖాళీల కారణంగా వీరంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసి ఈనెల 17 వరకు దరఖాస్తులు స్వీకరించింది. 254 పోస్టులు.. 2,773 దరఖాస్తులు జిల్లాలోని 5 ప్రాజెక్టుల పరిధిలో గల 92 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 154 ఆయా పోస్టులకు గాను 2,773 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీచర్ పోస్టులకు సంబంధించి 2,089 మంది, ఆయా పోస్టులకు 684 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే టీచర్ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో పోస్టుకు 20 మందికి పైగా పోటీ పడుతున్నారు. ఆయా పోస్టులకు సంబంధించి నలుగురికి పైగా పోటీ పడుతున్నారు. నారాయణఖేడ్ ప్రాజెక్టు పరిధిలో తీవ్ర పోటీ ఉంది. తమకు ఉద్యోగం వచ్చేలా చూడాలని అనుకూల నాయకులు, ప్రజాప్రతినిధుల వద్దకు క్యూ కడతున్నారు. అంగన్వాడీ పోస్టులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు -
శిక్షణతో మహిళలకు ఆర్థిక భరోసా
కొల్చారం(నర్సాపూర్): స్వయం ఉపాధి కింద శిక్షణలో నేర్చుకున్న కళా ఖండాలను ప్రదర్శనకు ఉంచి ఆర్థికంగా ఎదగాలని అదనపు డీఆర్డీఓ సరస్వతి సూచించారు. మండలంలోని చిన్నఘనపురం గ్రా మంలో మహిళా సమాఖ్య సభ్యులకు తంజావూర్ పెయింటింగ్పై 20 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన మహిళలకు ధ్రువ పత్రాలను అందజేశారు. అనంతరం మహిళలు రూపొందించిన పెయింటింగ్ ప్రదర్శనను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. తంజావూర్ పెయింటింగ్ను మరింత నాణ్యతగా తయారుచేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో జ్ఞాపికలుగా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, నాబార్డ్ ఏబీఎం కృష్ణ తేజ, మండల సమాఖ్య సిబ్బంది యాదగిరి, వెంకటేశం, విజయ తదితరులు పాల్గొన్నారు. అదనపు డీఆర్డీఓ సరస్వతి -
మెరుగైన వైద్యసేవలందించాలి
పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ గణేశ్వర్ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం పెద్దశంకరంపేట పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలు, ఓపీ సేవలు, సబ్సెంటర్ల నిర్వహణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, సిబ్బంది హాజరు శాతం, మందుల రికార్డులు పరిశీలించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ప్రజలు డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, వాటి నివారణకు గ్రామాల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు డ్రైడేపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కేజీబీవీని సందర్శించి వంట గది, స్టోర్రూం, ఆహార నిల్వలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. దీంతో పాటు ఓ ప్రైవేట్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆయన వెంట జిల్లా మలేరియా అధికారి శ్రీ చందర్, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ హరిప్రసాద్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నవ్య, వైద్యులు షరీఫొద్దీన్, సిబ్బంది యాదయ్య, వెంకటేశ్ తదితరులు ఉన్నారు. డీఎంహెచ్ఓ గణేశ్వర్ -
చెరువు కాదు.. బడి
ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో నిలిచిన నీరుసంగారెడ్డి క్రైమ్: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తరగతి గదిలోకి వెళ్లాలన్నా వర్షం నీటిలో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నీరు నిలిచి ఉండటంతో మధ్యాహ్న భోజనం సైతం చేయలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనార్యోగం బారిన పడుతున్నామని వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. -
అధికారుల సెలవులు రద్దు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులంతా అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. గురువారం కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో మాట్లాడారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో అధికారులకు సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజలకు అత్యవసర సమయంలో సేవలు అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం (9391942254) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకూడదని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు రోప్స్, డ్రోన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నా రు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ హాస్టల్స్, అంగన్వాడీ సెంటర్లకు రూప్ లీకేజీ ఉన్నట్లయితే ప్రత్యా మ్నాయ చర్యలపై దృష్టి సారించాలన్నారు. ధూప్సింగ్ తండా ప్రజలకు రాకపోకలు ఇబ్బంది కలకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ విక్రాంత్కుమార్సింగ్, డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు -
అన్ని వార్డుల్లో అభివృద్ధి జరగాలి
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మెదక్ కలెక్టరేట్: పట్టణంలోని అన్నివార్డుల ప్రజలు మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నారని, పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేపట్టాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. గురువారం మెదక్ మున్సిపల్ కౌన్సిల్ సాఽ దారణ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్పర్సన్ రాధిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ.. తమ వార్డులలో ప్రజలు కూడా పన్ను చెల్లిస్తున్నారని, అభివృద్ధి పనులు ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు. వైస్ చైర్మన్ నరేష్గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్రావుతో మాట్లాడి అన్ని వార్డుల్లో అభివృద్ధి పను లు చేపట్టేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు చైర్పర్సన్ రాధిక మాట్లా డుతూ.. ఎనిమల్ బర్త్ కంట్రోల్తో పట్టణంలో కుక్కల నివారణ చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నవీన్తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పీఎంశ్రీలకు బతుకమ్మ నిధులు
సాక్షి, సిద్దిపేట: పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పాఠశాలల్లో సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని ఒక్కో పాఠశాలకు రూ.10వేల చొప్పున ఉమ్మడి మెదక్ జిల్లాలో 108 పాఠశాలలకు రూ.10.80 లక్షలు మంజూరు చేసింది. బతుకమ్మ పండుగ చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యంపై విద్యార్థుల్లో అవగాహనను కల్పించాలి. బతుకమ్మకు సంబంధించిన జానపద పాటలు, తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించాలి. పర్యావరణహితంగా కార్యక్రమం చేపట్టాలి. గతేడాది పీఎం శ్రీ స్కూళ్లకు బతుకమ్మ వేడుకలకు నిధులను ఆలస్యంగా మంజూరు చేయడంతో కొన్ని పాఠశాలలల్లోనే నిర్వహించారు. మరికొన్ని పాఠశాలలో బతుకమ్మ వేడుకలను నిర్వహించకుండానే బిల్లులు పెట్టి డబ్బులను హెచ్ఎంలు డ్రా చేశారు. ఈసారి అందుకే ముందుగానే నిధులు విడుదల చేసింది. పాఠశాలలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని విద్యాశాఖ అదేశించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 108 పీఎంశ్రీ స్కూల్స్ గతేడాది పండుగ ముగిసిన తర్వాత... ఈసారి ముందుగానే నిధులు పాఠశాలల్లో వెల్లివిరియనున్న సంస్కృతీ, సంప్రదాయాలు జిల్లా పాఠశాలల రూ. సంఖ్య కేటాయింపు సిద్దిపేట 33 రూ.3.30లక్షలు సంగారెడ్డి 44 రూ.4.4లక్షలు మెదక్ 31 రూ. 3.10లక్షలు -
‘నిర్లక్ష్యం వహిస్తే చర్యలు’
కల్హేర్ (నారాయణఖేడ్): విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల ఆర్సీఓ నాగర్జునరావు హెచ్చరించారు. బుధవారం సిర్గాపూర్లోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, వసతులను పరిశీలించారు. అనంత రం విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్రావు, ప్రిన్సిపాల్ ప్రియాంక పాల్గొన్నారు. హత్నూర (సంగారెడ్డి): Ð]l$…yýlÌS MóS…{§ýl…ÌZ° ½ïÜ àçÜtÌŒæ¯]l$ º$«§ýl-ÐéÆý‡… Æ>{† yîlBÈzH ï³yîl gZņ BMýS-íÜÃ-MýS…V> ™èl°T ^ólÔ>Æý‡$. àçÜt-ÌŒæÌZ Ñ §éÅ-Æý‡$¦Ë$ †…r$¯]l² ¿Z-f-¯é°² ç³Ç-Ö-Í…-_, Ðé Ç çÜÐ]l$-çÜÅÌS¯]l$ AyìlW ™ðlË$çÜ$-MýS$-¯é²Æý‡$. ¿ýæÐ]l¯]l… Õ¤-ÌêÐ]l-çܦMýS$ ^ólÆý‡yýl…™ø Cº¾…-§ýl$Ë$ ç³yýl$-™èl$-¯]l²r$Ï Ñ§éÅ-Æý‡$¦Ë$ ™ðlÍ-´ëÆý‡$. A¯]l…-™èlÆý‡… ™éVýS$-±sìæ çÜÐ]l$-çÜÅOò³ BÆ> ¡Ô>Æý‡$. BÐðl$ Ððl…r BÆŠḥ yýlº*ÏÅG‹Ü DD Ñf-Ķæ$ÌS„ìSà E¯é²Æý‡$. -
ఓట్ల తొలగింపు
నర్సాపూర్లో 22 వేలు, మెదక్లో 18 వేలకు పైగా కోత40జిల్లాలో మెదక్, నర్సాపూర్ రెండు నియోజకవర్గాలు ఉండగా, వీటి పరిధిలో 4,53,140 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఏ ఒక్క ఓటరు మిస్ కాకుండా బీఎల్ఓలు ఇంటింటికీ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. కాగా, ఇప్పటివరకు 4,12,520 మంది ఓటర్లు మాత్రమే ఫారాలు నింపి బీఎల్ఓలకు అప్పగించారు. ఈ లెక్కన 40,620 మంది తిరిగి ఇవ్వలేదు. ఇందులో మెదక్ నియోజకవర్గంలో 2,20,427 మంది ఓటర్లు ఉండగా, ఎన్యూమరేషన్ ఫారాలు 2,01,515 మంది మాత్రమే తిరిగి అప్పగించారు. 18,437 మంది ఓటర్లు ఇవ్వలేదు. అలాగే నర్సాపూర్లో 2,32,713 మంది ఓటర్లు ఉండగా, 2,06,763 మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చారు. 22,273 మంది ఇవ్వలేదు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో కలిపి 40,620 మంది ఓట్లు (8.96) శాతం తొలగిపోయినట్లు లెక్క. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉండగా, ఇప్పటివరకు మెదక్లో 91.42 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాగా, నర్సాపూర్లో 88.85 శాతం పూర్తయింది. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 90.10 శాతం ప్రక్రియ పూర్తి చేశారు. మున్సిపాలిటీల్లోనే అధికం జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, వీటి పరిధిలో సుమారు 80 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వీరిలో చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చి పట్టణాల్లో స్థిరపడిన వారు అధికంగా ఉన్నారు. వీరికి సొంత గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లో సైతం ఓటు హక్కు ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల కోరిక మేరకు పట్టణాలు, మున్సిపాలిటీల నుంచి గ్రామాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అలాగే మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీలలో ఎన్నికలు జరిగిన సమయంలో అక్కడా ఓటు వేస్తున్నారు. ఇలాంటి ఓట్లు 10 నుంచి 12 శాతం వరకు కలిగి ఉన్నారని అధికారులు చెబుతున్నారు. కాగా, ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)తో వీరికి అడ్డుకట్ట పడనుంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియతో జిల్లాలో 40 వేల ఓట్లు తొలగిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా నర్సాపూర్ నియోజకవర్గంలో 22 వేలు, మెదక్లో 18 వేలకు పైగా ఓట్లకు కోత పడినట్లు తెలుస్తోంది. మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ‘సర్’ ప్రక్రియలో అధికారులు వేగం పెంచారు. ఇప్పటివరకు 90.10 శాతం డిజిటైలేజేషన్ పూర్తి చేశారు. – మెదక్జోన్ ఆగస్టు 3 తర్వాత నోటీసులు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఆగస్టు 3 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి బీఎల్ఓలకు ఎందుకు ఇవ్వలేదనే అంశంపై వారికి నోటీసులు అందజేయనున్నారు. ఆ ఓటర్లు గతంలో రెండు ఓట్లు కలిగి ఉన్నారా..? లేకా చనిపోయారా..? ఎందుకు తిరిగి ఇవ్వలేదనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రక్రియ కొనసాగనుంది. డిజిటలైజేషన్ ప్రక్రియ కాగానే పూర్తి వివరాలు తెలుసుకుంటామని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముమ్మరంగా సాగుతున్న ‘సర్’ ప్రక్రియ 90 శాతం డిజిటలైజేషన్ పూర్తి మరో ఐదు రోజులు మాత్రమే గడువు -
రీ సర్వేతో భూ సమస్యలకు చెల్లు
అల్లాదుర్గం(మెదక్): భూముల రీసర్వేతో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. బుధవారం మండలంలోని చేవెళ్ల గ్రామంలో రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. వందల ఏళ్లుగా భూముల సర్వే చేయలేదని, రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం రీ సర్వే చేపట్టిందన్నారు. రైతులు సర్వేకు పూర్తిగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సర్వే ఏడీ కిషన్, తహసీల్దార్ మల్లయ్య, సర్పంచ్లు మచ్చేందర్, వీరప్ప, ఏఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్జోన్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వ ర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, చెరువులు, నదుల్లోకి దిగవద్దని హెచ్చరించారు. వాహనదారులు కల్వర్టులు, వంతెనలు, వాగులను దాటేందుకు ప్రయత్నించవద్దన్నారు. చేపల వేట కోసం వెళ్లటం, సెల్ఫీలు, రీల్స్ కోసం వరద ప్రాంతాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. తడిసిన విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే విద్యుత్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. రెండు రోజులుగా డ్యాంలోకి ఇన్ఫ్లో చేరుతుందని అధికారులు తెలిపారు. మంగళవారం 637 క్యూసెక్కులు, బుధవారం 592 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరింది. ప్రస్తుతం డ్యాంలో 4.215 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తాగునీటి పథకాలైన మిషన్ భగీరథకు, జంట నగరాల తాగునీటికి రెండు ఫేజ్ల ద్వారా 1877 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. సంగారెడ్డి క్రైమ్: డీఆర్డీఓ ఆధ్వర్యంలో పట్టణంలో ఈనెల 30వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రవికిరణ్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బీఫార్మసీ, డీ ఫార్మసీని కనీస విద్యార్హతగా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు గురువారం ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్లు, ఆధార్ ధ్రువపత్రాలతో పట్టణ బైపాస్లోని డీఆర్డీఓ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08455–271010 నంబర్లో సంప్రదించాలని కోరారు. జోగిపేట(అందోల్): సింగూరు ప్రాజెక్టు నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులు సాగు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎంపీ బీబీ పాటిల్ బుధవారం కలెక్టర్కు ఫోన్ చేశారు. సింగూరు ప్రాంత రైతులు 23 ఏళ్లుగా ప్రాజెక్టు నీటి ద్వారానే పంటలు పండించుకుంటున్నారని, వారిని ఆదుకోవాలని కోరారు. వరి పండించుకునేందుకు నీళ్లు ఇస్తే 2027లో తాగడానికి నీరు ఉండదని కలెక్టర్ ఆయనకు తెలిపారు. 2, 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రాజెక్టులోకి నీరు వస్తుందని రైతులు ఆదుకునే ప్రయత్నం చేయాలని బీబీ పాటిల్ విజ్ఞప్తి చేశారు. కల్హేర్(నారాయణఖేడ్): ఎగువ ప్రాంతంలో రెండు రోజులుగా కురిసిన వర్షాలతో జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగులో వరద చేరుతుంది. బుధవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. వరద ప్రవహం, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వను పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1493 ఫీట్లు కాగా, ప్రస్తుతం 1483 ఫీట్ల నీటి నిల్వ ఉందని అధికారులు వివరించారు. అనంతరం కల్హేర్లో ఎస్సీ బాలుర హాస్టల్ను తనిఖీ చేశారు. విద్యార్థుల భోజన వసతి, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం, హాస్టల్లో స్లాబ్ నుంచి నీరు లీకేజీ కావడంతో పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయం భవనం కొత్తగా నిర్మించేందుకు చర్యలు తీసకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచ్లు శ్రీనివాస్రావు, గంగారం, నాయకులు పోచయ్య, ఎండీ. సర్దార్, మోహన్రెడ్డి, జయరాజ్ పాల్గొన్నారు. -
ఎల్నినోపై ముందస్తు ప్రణాళికే దీ?
కొల్చారం(నర్సాపూర్): ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ, ప్రభుత్వం ఆరుతడి పంటల దిశగా ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. బుధవారం చిన్నఘనాపూర్ సమీపంలోని ఘనపురం ప్రాజెక్టును సందర్శించి పొంగి పొర్లుతున్న మంజీరమ్మకు పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాలు కురవడం, మంజీరా పొంగిపొర్లడం, పంటలు సాగు చేసిన రైతులపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఇదే సమయంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇప్పటికే 70 శాతం వరకు రైతులు వరి నాట్లు వేశారన్నారు. ఇప్పుడు ఆరుతడి పంటలు వేయాలంటూ అవగాహన సదస్సులు, విత్తన మేళాలు నిర్వహించడం సరికాదన్నారు. యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఒక యూరియా బస్తాకు ఒక నానో యూరియా, రెండు డీఏపీ బస్తాల ఒక నానో డీఏపీ అంటగడుతూ రైతులపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సర్పంచ్లు రవితేజరెడ్డి, ఆంజనేయులు, స్వామి, మాజీ సీడీసీ చైర్మన్ నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి -
అప్రమత్తంగా ఉండాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వర్షాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితులు మినహా భారీ వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా ఉండా లని సూచించారు. రైతులు తమ వ్యవసాయ పరికరాలు, ఎరువులు, విత్తనాలను సురక్షిత ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సర్పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 90 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. రెండు రోజుల్లో వందశాతం పూర్తి చేస్తామన్నారు. మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉందని, వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. స మావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాద య్య, ఎంపీడీఓలు, ఆర్డీఓ రమాదేవి, సెక్షన్ సూపరింటెండెంట్ గఫార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
వన్యప్రాణులున్నాయి జాగ్రత్త
రామాయంపేట(మెదక్): జిల్లాలోని రెండు జాతీయ రహదారులపై అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణులు మృతి చెందాయి. దీంతో అటవీశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఈమేరకు మెదక్, రామాయంపేట అటవీ రేంజ్ అధికారులు విద్యాసాగర్, గణేశ్ తమ సిబ్బందితో బుధవారం మెదక్– ఎల్కతుర్తి 765 డీజీ జాతీయ రహదారిపై లక్ష్మాపూర్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్సులతో పాటు లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులను ఆపి నిదానంగా వెళ్లాలని సూచించారు. ‘మీ వేగానికి హద్దు.. వన్య ప్రాణికి రక్ష, అటవీ ప్రాంతంలో నెమ్మదిగా వెళ్లండి.. మూగ జీవులను రక్షించండి’ అనే నినాదాలతో కూడిన బ్యా నర్లను ప్రదర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందిన విషయాన్ని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారులు, సెక్షన్, బీట్ అఫీసర్లు పాల్గొన్నారు. వాహనదారులకు అటవీశాఖ అవగాహన -
దారులు ఛిద్రం.. నిత్య నరకం
రామాయంపేట(మెదక్): ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా పరిధిలోని పలు గ్రామా లు, తండాల రోడ్లు దెబ్బతిన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలకు వెళ్లే రహదారులు పాక్షికంగా శిథిలమయ్యాయి. రెండు రోజుల వ్యవధిలోనే రామాయంపేటలో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో పట్టణంలో ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిని కాలినడక కూడా కష్టతరంగా మారింది. రామాయంపేట– సిద్దిపేట ప్రధాన రఽహదారిపై పెద్ద పెద్ద గుంతలు తేలి ప్రమాదకరంగా మారింది. ఇటీవల గుంతల్లో నింపిన మట్టి, కంకర వర్షానికి కొట్టుకుపోయింది. రోడ్డుపై వదర నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిజాంపేట మండల పరిధిలోని పలు రోడ్లు దెబ్బతిన్నాయి. కొట్టుకుపోయిన మట్టి గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు పుష్పాలవాగు ఉప్పొంగింది. పర్వతాపూర్ గ్రామానికి వెళ్లే రహదారిలో కల్వర్టు కొట్టుకుపోగా, తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. తాజాగా కురిసిన భారీ వర్షాలకు మట్టి కొట్టుకుపోయింది. బ్రిడ్జి వద్ద రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉందని, వెంటనే మరమ్మతు చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అసంపూర్తిగా రూప్సింగ్ తండా బ్రిడ్జి గతేడాది కురిసిన భారీ వర్షాలకు హవేళిఘణాపూర్ మండలం రూప్సింగ్ తండాలో ఇద్దరు మృత్యువాత పడగా, పదుల సంఖ్యలో పశువులు మృతి చెందాయి. రహదారులు పూర్తిగా దెబ్బతిని 20 రోజుల పాటు తండాకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తి తెలగిపోయాయి. దీంతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ యుద్ధ ప్రాతిపదికన వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణంతో పాటు తండాకు తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్ ఇప్పటివరకు తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. బ్రిడ్జికి ఇరువైపులా మొరం నింపకపోవడంతో ఈ రోడ్లులో వాహనాలు వెళ్లడం లేదు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో రహదారి బురదమయం కాగా, కాలినడకన సైతం వెళ్లలేకపోతున్నామని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు ఇబ్బంది పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కృషి మేరకు గతంలో తండాకు తారు రోడ్డుతో పాటు బ్రిడ్జి మంజూరైంది. బిడ్జి ని ర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చినా చిన్న చిన్న పనులు చేయాల్సి ఉంది. తారు రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటివరకు ప్రారంభించలేదు. వెంటనే పనులు ప్రారంభించాలి. – అనూ, సర్పంచ్, రూప్సింగ్ తండా -
ఏసీబీ.. దూకుడేదీ?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తుంటే.. ఉమ్మడి జిల్లాలో మాత్రం సాధారణ కేసులకే పరిమితమవుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన కేసు గత రెండేళ్లుగా ఒక్కటంటే ఒక్కటి కూడా నమోదు కాకపోవడం గమనార్హం. కేవలం లంచం తీసుకుంటుండగా.. పట్టుబడుతున్న కేసు లే అడపాదడపా నమోదవుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ఏసీబీ నమోదు చేస్తున్న ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన కేసుల్లో కట్టల పాములు బయటకు వస్తున్నాయి. రూ. వందల కోట్లు విలువ చేసే స్థిర, చరాస్తులు, బ్యాంకు లాకర్లలో కిలోల కొద్ది బంగారం, ఖరీదైన వాహనాలు.. ఇలా కళ్లు బైర్లు కమ్మె స్థాయిలో అక్రమాస్తులు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా ఏసీబీ పనితీరు ఉంది. రూ. పది వేలు లంచం తీసుకుంటుంగా పంచాయతీ సెక్రటరీని పట్టుకోవడం, రూ.15 వేల లంచం తీసుకుంటుండగా.. మున్సిపాలిటీ బిల్లు కలెక్టర్ను ట్రాప్ చేయడం వంటి కేసులతో సరిపెడుతున్నారు. డివిజన్ స్థాయి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కేసులు మరో నాలుగు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఆరు కేసులు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏసీబీ ఉమ్మడి జిల్లాలో కేవలం ఆరు కేసులు నమోదు చేశారు. ఈ కేసులు నమోదైన వారిలో కొమురవెల్లి మండలంలో ఓ పంచాయతీ కార్యదర్శి, సదాశివపేట మున్సిపాలిటిలో బిల్లు కలెక్టర్ వంటి కింది స్థాయి సిబ్బంది ఉన్నారు. మిగిలిన నలుగురిలో కొల్లూరు ఎస్ఐ, విద్యుత్శాఖ నర్సాపూర్ ఏడీఈ, ఐడీఏ బొల్లారం ఏఈఈ, చేర్యాల తహసీల్దారులు ఉన్నారు. ఈ ఆరుగురిలో చేర్యాల తహసీల్దార్ మి నహా మిగిలిన వారంతా రూ.పది వేలు నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వారే. అక్రమాస్తుల కేసు లు నమోదు చేయాలంటే సరైన ఆధారాలు లభించాలని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా తమ శాఖ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే ఈ ఆదాయానికి మించి ఆస్తుల కేసులు నమోదు చేసేందుకు వీలవుతుందని చెబుతున్నారు. పెద్ద తిమింగలాలపై నజరేదీ? ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న కొందరు అవినీతి ఉన్నతాధికారుల అక్రమార్జన రూ.కోట్లలో ఉంటోంది. రూ.వందల కోట్లలో అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రూ.కోట్లు విలువైన వందల ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారులు కొందరు భారీగా అక్రమాస్తులను కూడ గట్టారు. ఎన్నికల నిబంధనల కారణంగానో, ఇతర సాధారణ బదిలీల్లో వీరిని ఇతర జిల్లాలకు బదిలీ చేసినా వారు తిరిగి ఉమ్మడి జిల్లాకే వచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు ముడుపులు ముట్టజెప్పి రెవెన్యూలో మరింత కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారు. ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయిలో అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలున్నాయి. విద్యుత్శాఖలోని కొందరు ఇంజనీరింగ్ అధికారుల అక్రమార్జన అంతా ఇంత కాదు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు రోజువారీ అక్రమార్జనే రూ.లక్ష వరకు ఉంటోంది. హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలతో మున్సిపల్ అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. దాదాపు ఐదేళ్లుగా ఒకేచోట పనిచేసి బదిలీ అయిన నీటిపారుదలశాఖలోని ఓ అధికారి చెరువులకు ఎన్ఓసీల జారీలో చేసిన వసూళ్లు రూ.కోట్లలో ఉంటుందనేది ఆశాఖవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసుశాఖలోనూ కొందరు అధికారులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఇటీవల రూ.వందల కోట్లు అక్రమాస్తులు బయటపడిన బీంరెడ్డి గతంలో పటాన్చెరు డీఎస్పీగా పనిచేసిన విషయం విధితమే. ఇలా జిల్లాలో అవినీతి తిమింగలాలను వదిలేసి.. చిన్నా.. చితక కేసులతో ఏసీబీ సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. రెండేళ్లుగా నమోదు కాని ఆదాయానికి మించి ఆస్తుల కేసు జిల్లాలో పలుశాఖల్లో భారీ అవినీతి తిమింగలాలు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కేసులకే పరిమితం -
ఆరుతడి పంటలే మేలు
చేగుంట(తూప్రాన్): ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ సూచించారు. బుధవారం చందాయిపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ వానాకాలం వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నందున రైతులు ఆరుతడి పంటలైన పప్పు, చిరు ధాన్యాలు, కూరగాయలు, నూనె గింజల పంటలను సాగు చేయాలన్నారు. ఆయిల్పాం పంటలను వేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. అనంతరం ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వరి, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, ఏఈఓ దివ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మోజామిల్, అంజనేయులు, విత్తన దుకాణ యజమానులు శ్రీకాంత్, రాజు, బాలకృష్ణ పలువురు రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్ -
గిరిజన బాలికలు చదువులో ముందుండాలి
కౌడిపల్లి(నర్సాపూర్): గిరిజన బాలికలు చదువులో ముందుండాలని గోర్సేన రాష్ట్ర అధ్యక్షుడు జగన్నాయక్ తెలిపారు. కౌడిపల్లిలోని ఎస్టీ బాలికల మినీ గురుకుల పాఠశాలలో గోర్సేన ఆధ్వర్యంలో మంగళవారం బోగ్బండార్ పూజాకార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బాలికలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు పాటించాలని క్రమశిక్షణతో పెద్దల పట్ల గౌరవం, మర్యాద ఉండాలన్నారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాములునాయక్, మండల అధ్యక్షుడు జవహర్నాయక్, నాయకులు కొర్రశ్రీను, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గోర్సేన రాష్ట్ర అధ్యక్షుడు జగన్నాయక్ -
వారం నుంచి కురుస్తోన్న వర్షాలు
లోటునుంచి సాధారణ వర్షపాతం నమోదు ముమ్మరంగా సాగుతున్న వ్యవసాయ పనులు ఇప్పటివరకు 1.47లక్షల ఎకరాల్లో సాగు జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలంలో 3.67 లక్షల ఎకరాలల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారుల అంచనా. ఇందులో 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని మిగతా 62 వేల ఎకరాలలో పత్తితోపాటు కూరగాయలు, వర్షాధార పంటలు సాగు కానున్నట్లు అధికారుల పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచారు. కానీ ఈ ఏడాది ఎల్నినో ముప్పు పొంచి ఉందని, దీర్ఘకాలిక పంటలైన వరికి బదులు స్వల్పకాలిక పంటలు సాగు చేసుకోవటం మేలని అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కానీ ఇప్పటికే వర్షాధార పంటలు పత్తి, కంది, మొక్కజొన్న తదితర కూరగాయల పంటలను సాగు చేయగా, బోరుబావుల ఆధారంగా నారుమళ్లు పోసిన రైతులు అడపాదడపా కురిసిన వర్షపు నీటికి తోడు బోరుబావుల నీటితో కొంతమేర నాట్లు కూడా వేసేశారు. కానీ జూన్లో లోటు వర్షపాతం నమోదవటంతో అన్నదాతలు ఆందోళన చెందుతుండగా, ఇటీవల కురుస్తున్న వర్షాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోటునుంచి సాధారణం వరకు..! ఎల్నినో ప్రభావంతో గత నెల లోటువర్షపాతం నమోదైంది. జూన్లో 112.4 మి.మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 83.8 మి. మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఈ లెక్కన కురవాల్సిన దాని కన్నా 28.6 మి.మీటర్ల వర్ష తక్కువగా నమోదైంది. దీంతో అధికారులు ఎల్నినో ముప్పు తప్పించుకునేందుకు ఆరుతడి పంటలనే సాగు చేయాలని విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో గత వారం రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. జూలైలో ఇప్పటివరకు 189.3 మి. మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 219.4 మి. మీటర్ల వర్షం కురిసింది. ఈ లెక్కన కురవాల్సిన దాని కన్నా 30.1 మి.మీటర్ల వర్షం అధికంగా కురిసింది. కాగా జూన్, జూలైల్లో 304.2 మీ.మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 301.7 మి. మీటర్ల వర్షం కురిసింది. అంటే 2.5 మి. మీటర్ల వర్షం మాత్రమే తక్కువ పడింది. కాగా 20 మి.మీటర్ల వరకు ఎక్కువ, తక్కువ నమోదైనా సాధారణ వర్షపాతం కిందకే వస్తోందని సంబంధిత వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు 1.47,185 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయాయ్యియని అధికారులు వెల్లడించారు. వారంరోజలుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు పట్టలేని ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే బోరుబావుల ఆధారంగా నారుమళ్లు పోసి రైతులు దుక్కులు దున్ని ఆకాశం వైపు వర్షాలకోసం ఎదురు చూశారు. అంతేకాకుండా వర్షాధారంగా సాగు చేసిన పంటలకు నీటితడులు లేక ఎండుముఖం పట్టిన నేపథ్యంలో వరుణుడు చూపిన కరుణతో పంటలకు ఊపిరి పోసినట్లైంది. ఫలితంగా వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. మెదక్జోన్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా 38.5 మి.మీటర్ల వర్ష పాతం నమోదు కాగా చేగుంట మండలంలో అత్యధికంగా 41.మి.మీటర్ల వర్షం కురిసింది. అలాగే పెద్దశంకరంపేటలో 27, మాసాయిపేటలో 21 మి.మీటర్ల వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పుష్పలవాగులోకి వరద తాకిడి మొదలైంది. వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ వానల నేపథ్యంలో అన్నదాతలు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. పొంగి పొర్లుతున్న ఘనాపూర్ ప్రాజెక్టు -
యువత వాయుసేనలో చేరాలి
పటాన్చెరు: భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో అధికారులు లేదా అగ్నివీరులుగా చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులకు మాస్టర్ వారెంట్ ఆఫీసర్ దీపక్ భరద్వాజ్ పిలుపునిచ్చారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం క్యాంపస్లో మంగళవారం నిర్వహించిన ‘భారత వైమానిక దళ నియామకం: అభివృద్ధి వాహనం–వృత్తి మార్గదర్శనం’కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూపీఎస్సీ, ఏఎఫ్క్యాట్, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీల ద్వారా పర్మినెంట్ లేదా షార్ట్ సర్వీస్ కమిషన్తో ఐఏఎఫ్ లో చేరే అవకాశాలను వివరించారు. ఫ్లయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో అర్హతలు, ఎంపిక విధానం, ఐఎఫ్ఎస్బీ పరీక్షల ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఆకర్షణీయమైన వేతనం, వైద్య సదుపాయాలు, నివాసం, బీమా, విద్య, సాహస కార్యకలాపాలు వంటి ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఐఏఎఫ్ మొబైల్ ఎగ్జిబిషన్, సిమ్యులేషన్ సౌకర్యం విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ వేణుకుమార్ నాతి అతిథులను సత్కరించగా, డాక్టర్ మహమ్మద్ అక్తర్ ఖాన్ వృత్తి అవగాహన కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.ఐఏఎఫ్ అధికారి దీపక్ భరద్వాజ్ -
జిల్లాలో కోతుల బెడద అరికట్టాలి
రామాయంపేట(మెదక్): జిల్లాలో కోతుల బెడదను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రతిమాసింగ్ స్పష్టం చేశారు. ఆమె మంగళవారం స్థానిక రైతువేదికలో జరిగిన విత్తన మేళాలో పాల్గొని మాట్లాడారు. అదిలాబాద్ జిల్లాలో అక్కడి అధికారులు కోతుల బెడదను అరికట్టేందుకు అవలంబించిన పద్ధతులను అధ్యయనం చేయడానికిగాను జిల్లా అధకారులు త్వరలో అదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారని ఆమె పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన ఆయిల్పామ్, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు పంటలు సాగుచేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధకారి దేవ్కుమార్, జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్సింగ్, మున్సిపల్ చైర్మన్ లావణ్య, వైస్ చైర్మన్ నవనీత, ఆత్మ పీడీ రుద్రమూర్తి, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ -
ఆగస్టు నుంచి పీహెచ్సీల్లో వైద్యపరీక్షలు
అల్లాదుర్గం(మెదక్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆగస్టు నుంచి అన్ని రకాల వైద్య పరీక్షలు తిరిగి ప్రారంభమవుతాయని జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) గణేశ్వర్ స్పష్టం చేశారు. అల్లాదుర్గం పీహెచ్సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ...పలు రకాల రక్త పరీక్షలు ప్రతీరోజు నిర్వహించి రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించనున్నామన్నారు. రక్త పరీక్షలు తీసుకెళ్లే వారి కాంట్రాక్టు పూర్తికావడంతో కొన్ని నెలల నుంచి ఆగిపోయినట్లు చెప్పారు. ప్రతీ ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డాక్టర్తోపాటు సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. గర్భిణీలు, బాలింతలకు ఆశావర్కర్లు, ఆరోగ్య సిబ్బందితో ఫోన్ చేయించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుని వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో డాక్టర్ సారిక, సీహెచ్ఓ సుదర్శన్, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. డీఎంహెచ్ఓ గణేశ్వర్ -
ఎస్ఐఆర్ను విజయవంతం చేయాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ వెల్దుర్తి(తూప్రాన్): సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను పార్టీలకతీతంగా విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రం వెల్దుర్తిలో నిర్వహించిన మండల ప్రభాస్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హుడైన ప్రతీ పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా బూత్స్థాయి అధికారుల వద్ద కొనసాగుతున్న సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఓటరు నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు వంటి అంశాలను బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దాసు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేశం, సర్పంచ్లు ఆదర్శ్, మల్లేశంగౌడ్, నాయకులు శేఖర్గౌడ్, నవీన్, బాబు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్ హవేళిఘణాపూర్(మెదక్): భూ భారతి రీ సర్వే ద్వారా రైతులకు మేలు జరిగి ఇబ్బందులు తీరనున్నాయని అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని శుక్లాల్పేట గ్రామంలో మంగళవారం భూ భారతి రీ సర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో రైతుల భూముల హద్దులకు సంబంధించి ఎన్నో సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి రీ సర్వేను నిర్వహించామన్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించి అందరికీ న్యాయం చేయాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నర్సాపూర్: కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసగా ఆగస్టు 10న చేపట్టిన జైల్ భరో కార్యక్రమానికి అందరూ తరలి వచ్చి జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు కోరారు. ఆయన పలువురు నాయకులతో కలిసి మంగళవారం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ప్రజలు, కార్మికులు, రైతుల వ్యతిరేక విధానాలను గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలన్నారు. ఆయన వెంట ఆయా సంఘాల నాయకులు అన్నపూర్ణ, సురేశ్,శివ,చందర్,నాగభూషణం,రెడ్యానాయక్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. మెదక్ ఆర్డీవో రమాదేవి రామాయంపేట(మెదక్): వ్యవసాయ భూ ముల రీ సర్వే కోసం గ్రామానికి వచ్చే అధికారులు, సిబ్బందికి సహకరించాలని మెదక్ ఆర్డీవో రమాదేవి సూచించారు. శివ్వాయపల్లిలో మంగళవారం భూ సర్వే గ్రామసభ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. రీ సర్వే కార్యక్రమానికి గ్రామస్థులు సహకరించాలన్నారు. సర్వే అధికారులు గ్రామంలో వ్యవసాయ భూములను పూర్తి స్థాయిలో రీ సర్వే చేస్తారని, ఏళ్ల తరబడి భూసంబంధిత గొడవలు ఈ సర్వేతో పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. సర్వే విభాగం ఏడీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి అక్రమాలకు ఏఐ చెక్
పనిచేయకుండా ఫొటోలు దిగి వెళ్తే అంతే.. ఇక నుంచి ఉపాధి పనుల్లో అక్రమాలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో చెక్ పడనుంది. ఏఐ వినియోగంతో పనులు చేయకుండా తప్పుడు బిల్లులు పెట్టడం, పనికి వచ్చినా పనిచేయకుండానే ఫొటోలు దిగి వెళ్లే వారి ఆటలు ఇక సాగవు. వీబీజీరాంజీ పథకంలో ఏఐ వినియోగాన్ని ఇప్పటికే తీసుకురావడంతో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట సిద్దిపేట జిల్లా చిన్నకోడూురు మండలంలో ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. పలుచోట్ల పనులు చేయకున్నా చేసినట్లుగా నమోదు, తప్పుడు బిల్లులు పెట్టడం, పనులు ఎక్కువగా నమోదు చేయడాన్ని తనిఖీ బృందం గుర్తించింది. రూ.90 వేలు రికవరీ చేయాలని, రూ.44వేలు జరిమానాను విధించారు. అలాగే ఉపాధి పనులు చేయకుండానే చేశామని ఫొటోలు దిగి వెళ్లే వారికి, బోగస్ పనులకు బ్రేక్లు పడుతున్నాయి. ఉపాధి పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ ఏడాది పనులపై సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. తప్పుగా నమోదు చేసిన తర్వాత తనిఖీల్లో గుర్తించడం కంటే వెంటనే గుర్తించేందుకు సాంకేతికను వినియోగిస్తున్నారు. జూలై 1 నుంచి వీబీజీరాంజీ పథకంలో అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బోగస్ పనులను నిరోధించి, నిజాయితీగా చేసిన కూలీలనే గుర్తించేలా ఏఐను ప్రవేశపెట్టారు. దీంతో ఉపాధి పనులు పారదర్శకంగా జరగనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 5.7లక్షల జాబ్ కార్డులుండగా 10.93లక్షల మంది కార్మికులున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫామ్పాండ్స్ను నిర్మిస్తున్నారు. గ్రామాల్లో కొందరు కూలీలు, మేస్త్రులు కలిసి చేసే తప్పులను అధికారులు గుర్తించారు. ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2గంటలకు వచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోవడం, మధ్యలో అసలు పనే ముట్టకపోవడం వంటి మోసాలు జరిగేవి. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన వ్యవస్థతో పని జరగకపోతే ఏఐ ఆటోరిజెక్ట్ చేస్తుంది. ప్రతీ ఒక్కరు నాలుగు గంటల పాటు పని చేయాలి. దీని ప్రకారం ఉదయం, మధ్యాహ్నం తీసిన ఫొటోలను క్లౌడ్ సర్వర్లోని ఏఐ సాఫ్ట్వేర్ సెక్షన్లలో పోల్చి చూస్తుంది. ఉదయం ఉన్న మట్టి కుప్ప లేదా కాల్వ మధ్యాహ్నం ఫొటోలో కూడా ఎలాంటి మార్పు లేకుండా ఉంటే పనిలో పురోగతి లేదని, అక్కడ పని జరగలేదని గుర్తించి ఆ రోజు హాజరును ఆటోమేటిక్గా నిలిపివేస్తుంది. జిల్లా జాబ్ కార్డులు కార్మికులు సిద్దిపేట 1.96 3.87 మెదక్ 1.64 3.27 సంగారెడ్డి 2.1 3.79 డిజిటల్ కొలతలు, ఏఐ రిపోర్టులకు భిన్నంగా ఎంబుక్ రాసే అధికారులపై నేరుగా విచారణ జరగనుంది. ఇస్రో భువన్ పోర్టల్ శాటిలైట్ చిత్రాలతోపాటు ప్రతీ జిల్లా అంబుడ్స్మెన్కు డ్రోన్ నిఘా వ్యవస్థను కేటాయించారు. సిబ్బంది కార్యాలయాల్లో కూర్చుని తప్పుడు బిల్లులు రాస్తే శాటిలైట్, డ్రోన్ డేటాలోని వాస్తవ కొలతలతో సరితూగదు. తేడా వస్తే సదరు సిబ్బంది ఐడీలు నిలిచిపోవడమే కాకుండా రికవరీకి క్రిమినల్ కేసులు నమోదవుతాయి. కూలీలు రాకపోయినా వారి పాత ఫొటోలను వేరే మొబైల్ స్క్రీన్పై చూపిస్తూ రీ ఫొటోలు తీసి మోసం చేసే ఫీల్డ్ ట్రిక్స్ను ఏఐ పట్టేస్తుంది. 4 గంటలు తప్పక పనిచేయాల్సిందే ఉపాధి కార్మికులు ప్రతీ ఒక్కరు నాలుగు గంటలు పని చేయాలి. ఆ నాలుగు గంటల పాటు చేసే పని పురోగతి ఉండాలి. ఉదయం రాగానే చేసే పని దగ్గర ఫొటో దిగాలి. తర్వాత చేసిన పని దగ్గర ఫొటో దిగాలి. అలాగే చేసిన పనికి సంబంధించిన ఫొటో సైతం తీసి అప్లోడ్ చేయాలి. వీబీజీరాంజీ సర్వర్ ద్వారా పనులను ఏఐ పరిశీలిస్తుంది. అన్ని సక్రమంగా ఉంటేనే హాజరు వేస్తుంది. –జయదేవ్ ఆర్యా, డీఆర్డీఏ, సిద్దిపేట -
నాణ్యమైన విద్య అందించాలి
టేక్మాల్(మెదక్): గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. నూతన విద్యావిధానంలో భాగంగా విద్యార్థుల్లో ప్రాథమిక చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న మూడు రోజుల ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా విద్యాధికారి రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5వ తరగతి పూర్తయ్యేలోపు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా వయస్సుకు తగిన స్థాయిలో చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను సాధించాలని తెలిపారు. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న వినూత్న బోధనా పద్ధతులను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థి కేంద్రిత బోధన, ఆటల ద్వారా అభ్యాసం, కార్యాచరణ ఆధారిత బోధన, నిరంతర మూల్యాంకనం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం పీఆర్టీయూ మండల పక్షాన డీఈఓను సన్మానించారు. కార్యక్రమంలో సీఎంఓ రాజు, మండల విద్యాధికారి సుజాత, స్థానిక హెచ్ఎం రాజేంద్రప్రసాద్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సతీష్ రావు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అమీరుద్దీన్, సహదేవ్, రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.జిల్లా విద్యాధికారి రాజు -
ప్రమాదాల నివారణకు చర్యలు
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పోలీసులను ఆదేశించారు. మంగళవారం కౌడిపల్లి పోలీస్స్టేషన్ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ నిర్వహణ, రికార్డులు, పెండింగ్ కేసులు, నేర నియంత్రణ చర్యలు, సిబ్బంది విధి నిర్వహణతో పాటు పరిసరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలన్నారు. పోలీసులు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. పెండింగ్ కేసులను వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్రెడ్డి, నర్సాపూర్ సీఐ రంగకృష్ణ, ఎస్ఐ అమరేందర్రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
సత్వర పరిష్కారం చూపండి
అదనపు కలెక్టర్ నగేశ్ మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను పరిశీలించి వెంట వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో జిల్లా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ భారతి 37, పెన్షన్లు 4, ఇందిరమ్మ ఇళ్ల కోసం 7, ఇతర 34 కలిపి మొత్తం 82 వినతులు వచ్చాయి. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను తక్షణమే పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి పాపన్నపేట(మెదక్): ఎస్ఐఆర్కు సమయం దగ్గర పడుతుండటంతో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ ఎస్ఐఆర్ జిల్లా సమన్వయకర్త శశిధర్రెడ్డి పిలునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అర్హులైన ఓటర్లు 100 శాతం నమోదు చేసుకునేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. అనునిత్యం బీఎల్ఓలతో మాట్లాడుతూ.. నమోదు కాని ఓటర్లు ఎవరైనా ఉంటే, వారి ఇంటికి వెళ్లి నమోదు చేయించాలన్నారు. ఆగస్టు 3తో గడు వు ముగుస్తుందని, 2002 ఓటర్ లిస్టు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్ గురుమూర్తిగౌడ్, మల్లన్న, డాక్టర్ రమేష్, శ్రీనివాస్, ఉస్మాన్, వెంకటేశం, భూమాగౌడ్, పంతుల కిషన్, నిజాం, మహేందర్, రవీందర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. రైతుల కోసమే విత్తన మేళా నర్సాపూర్: వర్షాలు తక్కువగా కురుస్తున్నందున వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి రైతులను కోరారు. సోమవారం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆరుతడి పంటలలో ప్రస్తుత వాతావరణానికి మొక్కజొన్న, జొన్న, కందులు, పెసర్లు, పశుగ్రాసం తదితర పంటలు సాగు చేయాలని సూచించారు. విత్తనాలు ఒకే చోట అందుబాటులో ఉంచడానికే విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్, మండల వ్యవసాయాధికారి దీపిక, ఏఈఓలు మోహన్, తేజస్విని, రాజశేకర్, లావణ్య, దుర్గాప్రసాద్ పలువురు విత్తన డీలర్లు పాల్గొన్నారు. 29, 30న అంగన్ వాడీ దరఖాస్తుల పరిశీలన మెదక్ కలెక్టరేట్/నర్సాపూర్: ఈనెల 29, 30 తేదీల్లో అంగన్వాడీ దరఖాస్తుల పరిశీలన ఉంటుందని మెదక్ సీడీపీఓ వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 29న కౌడిపల్లి, పాపన్నపేట మండలాల్లోని టీచర్ పోస్టు అభ్యర్థులకు, 30న హెల్ప్ర్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. అభ్యర్థులంతా ఒరిజినల్ పత్రాలతో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెదక్ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. అలాగే 29న నర్సాపూర్, శివ్వంపేట, చిలప్చెడ్ మండలాలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లు, 30న తూప్రాన్, మనోహరాబాద్, కౌడిపల్లి మండలాలకు చెందిన అభ్యర్థుల పరిశీలన ఉంటుందని సీడీపీఓ సీడీపీఓ హేమాభార్గవి తెలిపారు. -
విద్య, ఉద్యోగాల్లో అన్యాయం
మాలల కోఆర్డినేషన్ ఫోరం నాయకులు రామాయంపేట(మెదక్): విద్య, ఉద్యోగాల నియామకాల్లో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాలల కోఆర్డినేషన్ ఫోరం రాష్ట్ర నాయకులు శకుంతల, తిరుపతయ్య, శంకర్ ఆరోపించారు. మాలల జూయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించి రోస్టర్ పాయింట్లను 22 నుంచి 11కు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భర్తీ చేసిన ఉద్యోగాల్లో మాలలకు అన్యాయం జరిగిందని వాపోయారు. రోస్టర్ పాయింట్లు సవరించే వరకు ఉద్యోగ నియామకాలను, నోటిఫికేషన్ల జారీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 2011లో మాలల జనాభా 15 లక్షలకుపైగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కుట్రతో 2024లో జరిగిన సర్వేలో 14 లక్షలకు తగ్గించిందని ఆరోపించారు. సమావేశంలో మాలల కోఆర్డినేషన్ ఫోరం జిల్లా ఇన్చార్జి జెల్ల సుధాకర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సంజీవ్, మాజీ ఎంపీపీ ఎల్లం, జిల్లా మాజీ అధ్యక్షుడు మాసాయిపేట మల్లేశం, చంద్రం, సురేందర్, రమేశ్ పాల్గొన్నారు. -
శాకాంబరీదేవిగా శ్రీవిద్యాసరస్వతి
వర్గల్ క్షేత్రంలో వైభవంగా మూల మహోత్సవం వర్గల్(గజ్వేల్): అమ్మకు కూరగాయలే ఆభరణాలయ్యాయి. ఫలాలే పూలహారాలుగా ఒదిగిపోయాయి. ఆలయం పందిరితోటను తలపించింది. సోమవారం మూల నక్షత్ర మహోత్సవ వేళ కూరగాయలు, ఫలాలు ఆభరణాలుగా ధరించి వర్గల్ శ్రీవిద్యాసరస్వతి అమ్మవారు శాకంబరీదేవిగా దివ్యదర్శనమిచ్చారు. పీఠాధిపతి శ్రీమాధవానందస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున మూల మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్చకులు మూలవిరాట్టుకు విశేషాభిషేకం చేశారు. ఆషాఢానికి ప్రతీకగా ఫలాలు, కూరగాయలతో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు. లక్ష పుష్పార్చన, సప్తశతి పారాయణం, చండీహోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. -
మెడికల్ కళాశాల ఉన్నా వైద్యం శూన్యం
● జ్వరం, జలుబుకు మాత్రమే చికిత్స ● అత్యవసర పరిస్థితుల్లో గాంధీ, ఉస్మానియాకు రెఫర్ çÜÐ]l$çÜÅ ¡{Ð]l…V> E…sôæ¯ól Æð‡çœÆŠḥæతీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంటేనే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నాం. ఇక్కడ కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్లు లేరు. దీంతో అందుకు సంబంధించిన వ్యాధిగ్రస్తులు వస్తే వారిని రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల రెఫర్ చేసిన ఇద్దరు పేషెంట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటాం. – వనజ, ఇన్చార్జి ఆర్ఎంఓ, మెదక్ కొల్చారం మండలం వెంకటాపూర్కు చెందిన అంజయ్య ఇటీవల కుటుంబ కలహాలతో విషం తాగాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు వెంటనే గాంధీకి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబీకులు నానా అవస్థలు పడి అక్కడికి తీసుకెళ్లారు. ఇలా ఎలాంటి సమస్యతో సర్కారు దవాఖానకు వచ్చినా ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేస్తుండటంతో సామాన్య ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.ఈ చిత్రంలోని వృద్ధుడు నరేశ్. పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామం. ఈనెల 26 (ఆదివారం) ఇంట్లో జారి పడగా కాలు విరిగింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు సరైన కారణం చెప్పకుండానే హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. మెదక్జోన్: పేద, మధ్య తరగతి ప్రజలకు జబ్బు చేస్తే మొదటగా ప్రభుత్వ పెద్దాస్పత్రి వైపే చూ స్తారు. ఇక్కడ ఉచితంగా వైద్యం, మందులు, పెద్ద డాక్టర్లు ఉంటారనే నమ్మకంతో వస్తుంటారు. కానీ అలాంటి ఆస్పత్రిలో సరైన వైద్య సేవలు అందకపోవడం పేదలకు శాపంగా మారుతోంది. ప్రాణం మీదికి వచ్చిన రోగులు, అత్యవసర వైద్యం కోసం వస్తే గాంధీకి రెఫర్ చేస్తున్నారు. దగ్గు, జ్వరం లాంటి చిన్నపాటి సమస్యలకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరై రెండేళ్లు అవుతోంది. పెద్ద చదువులు చదివిన డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్పెషలిస్టులు వస్తారని, ఎలాంటి జబ్బు చేసినా స్థానికంగానే చికిత్స అందుతుందని ప్రజలు సంతోష పడ్డారు. కానీ గతంలో లాగే ప్రస్తుతం వైద్య సేవలు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయపాలన పాటించని వైద్యులు మెడికల్ కళాశాల వచ్చినప్పటి నుంచి వైద్యులు ఎప్పుడు విధులకు వస్తారో, ఎప్పుడు వెళ్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఉదయం 11 గంటల వరకు ఆస్పత్రికి రారని, మధ్యాహ్నం 2 గంటలు దాటితే అందుబాటులో ఉండరనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని రోగు లు వాపోతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటూ అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వైద్య సేవలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఆరుతడి పంటలే మేలు
కలెక్టర్ ప్రతిమాసింగ్కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సోమవారం కౌడిపల్లిలో వ్యవసాయ అధికారులు టమాట రైతు మహిపాల్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో తేనెటీగల పెంపకం, రైతువేదికలో విత్తన మేళా నిర్వహించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎల్నినోతో వర్షాలు తగ్గాయని, వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జల్లా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. కూరగాయల పంటలు సాగుతో మంచి ఆదాయం వస్తుందన్నారు. కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయం వస్తుందన్నారు. కార్యక్రమంలో డీఏఓ దేవ్కుమార్, ఉద్యానవన అధికారి ప్రతాప్సింగ్, డీఆర్డీఓ శ్రీనివాసరావు, రు ద్రమూర్తి, ఆర్డీఓ రామకష్ణ, డీఎల్పీఓ సురేశ్బాబు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏడీఏ పుణ్యవతి, ఏఓ స్వప్న, సర్పంచ్ కృష్ణాగౌడ్, రైతులు పాల్గొన్నారు. -
ధర్నాను విజయవంతం చేద్దాం: తపస్
వెల్దుర్తి(తూప్రాన్): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆగస్ట్ 1న నిర్వహించనున్న చలో హైదరాబాద్ ధర్నాను ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం మాసాయిపేట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయుల ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు, పీఆర్సీ అమలు, హెల్త్ కార్డుల జారీ, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించా లని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంఈ ఓ మధుసూదన్రావు, నాయకులు భద్రయ్య, ఝాన్సి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సారూ.. నా కొడుకులు అన్నం పెడ్తలేరు
ఎస్పీని ఆశ్రయించిన వృద్ధుడు మెదక్జోన్: తన పేరుపై ఉన్న భూమిని ఇద్దరు కొడుకులు పట్టా చేసుకొని తనకు తిండి పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఓ వృద్ధుడు ఎస్పీ శ్రీనివాసరావుని ఆశ్రయించాడు. స్పందించిన ఎస్పీ అతడికి అండగా నిలిచారు. వివరాలు ఇలా.. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన భద్రయ్యకు ఇద్దరు కొడుకులు. తన పేరుపై ఉన్న 36 గుంటల భూమిని పట్టా చేసుకుని అన్నం పెట్టడం లేదని సో మవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. వృద్ధాప్యంలో ఇబ్బంది పడుతున్న భద్రయ్య పరిస్థితి తెలుసుకున్న ఎస్పీ.. నర్సాపూర్ సీఐతో ఫోన్లో మాట్లాడి వృద్ధుడికి వెంటనే న్యాయం చేయాలని ఆదేశించారు. అంతకుముందు ప్రజావాణి లో ఫిర్యాదులు స్వీకరించారు. అలాగే ముగ్గురు ఏఎస్ఐలు రాంబాబు, జైపాల్రెడ్డి, కృష్ణమూర్తి ఎస్ఐలుగా పదోన్నతి లభించడంతో వారికి బాధ్యతలు అప్పగించారు. -
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
జిల్లా ల్యాండ్ సర్వే ఏడీ కిషన్చిలప్చెడ్(నర్సాపూర్): రీసర్వేతోనే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జిల్లా ల్యాండ్ సర్వే ఏడీ కిషన్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని రాందాస్గూడలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని రైతులకు భూముల రీ సర్వేపై అవగాహన కల్పించారు. ప్రతి 30 సంవత్సరాలకు ఓ సారి భూ సర్వే జరగాలని, తెలంగాణలో వంద సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు ఎలాంటి భూ గణన జరగలేదన్నారు. సక్రమంగా ఉన్నా భూ యజమానులకే హక్కులు ఇచ్చేందుకు ప్రభుత్వం భూముల రీసర్వే చేస్తుందన్నారు. ఆధునిక సాంకేతికతో సర్వే చేసి భూదార్ నంబర్ ఇస్తామన్నారు. జిల్లాలో 75 గ్రామాల్లో భూముల రీసర్వేకు అనుమతి లభించగా, రాందాస్గూడలో సుమారు 53 ఎకరాలు, మంగళపల్లిలో 52 ఎకరాల్లో రీ సర్వే చేస్తామన్నారు. గ్రామస్తులు పూర్తి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌరి, ల్యాండ్ సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ రాంరెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ ప్రశాంత్, సర్వేయర్ రవిప్రసాద్, పంచాయతీ కార్యదర్శి మోహన్, రైతులు పాల్గొన్నారు. -
భారీ వర్షం.. అతలాకుతలం
రామాయంపేట(మెదక్): చిన్నపాటి వర్షానికే రామాయంపేట మున్సిపాలిటీ అస్తవ్యస్తమవుతోంది. సోమవారం రాత్రి కురిసిన భారీ వానకు సిద్దిపేట రోడ్డు ప్రధాన రహదారిపై, అక్కలబస్తీలో రోడ్డుపై నీరు నిలిచి కాలనీవాసులు అవస్థలు పడ్డారు. అధికారులు తమ గురించి ఎంతమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంఘటనలతో పాఠం నేర్చుకోని మున్సిపల్ అధికారులు గుంతల్లో నామమాత్రంగా కంకరపోయించారు. భారీ వర్షంతో కంకర మొత్తం కొట్టుకుపోయి రోడ్డుపై పెద్ద గుంతలు తేలాయి. దీంతో గంటపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగి వాహనదారులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. -
అటకెక్కిన అండర్పాస్లు
● రోడ్డు ప్రమాదాలకు బలవుతున్న వన్యప్రాణులు ● ఏడాదిలో రెండు చిరుతల మృతి రామాయంపేట(మెదక్): అటవీ ప్రాంతాల పరిధిలోని రహదారులపై అండర్పాసుల నిర్మాణం విషయమై జరుగుతున్న జాప్యం వన్యప్రాణుల ప్రాణాల మీదికొస్తుంది. గతేడాది 44వ నంబర్ జాతీయ రహదారిపై నార్సింగి వద్ద అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. తాజాగా ఆదివారం మెదక్, ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ)పై గంగాపూర్ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో మరో చిరుత మృతి చెందింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. స్వయంగా అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. రోడ్డు ప్రమాదాల్లో వన్యప్రాణులు మృతి చెందుతుండటంతో గతంలో కేంద్ర అటవీశాఖ స్పందించి పలు సూచనలు చేసింది. ఇందులో భాగంగా జాతీయ రహదారులపై అటవీ ప్రాంతాల పరిధిలో అండర్పాసులు నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 55 కిలోమీటర్ల మేర హైవే.. జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారి మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, మాసాయిపేట, నార్సింగి, రామాయంపేట మండలాల మీదుగా 55 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రహదారిలో 4 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. ఈ రహదారిపై వల్లూరు, రామాయంపేట వద్ద, మెదక్, ఎల్కతుర్తి 765 డీజీ జాతీయ రహదారిపై గంగాపూర్, తొనిగండ్ల, అక్కన్నపేట వద్ద అండర్పాసులు నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు సర్వే నిర్వహించిన ఆశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయినా ఇప్పటివరకు మంజూరు కాలేదు. చిరుత కళేబరాన్ని పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు -
పర్యాటక ప్రాంతంగా బోరంచ
నారాయణఖేడ్: పర్యాటక ప్రాంతంగా బోరంచ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. నల్లపోచమ్మ, సంగమేశ్వర ఆలయాల సమీపంలో ఉన్న మంజీరా నదిలో భక్తుల సౌకర్యార్థం మాఘ స్నానాల కోసం మెట్ల నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. టూరిజంలో భాగంగా బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. బోరంచ, సంగమేశ్వర ఆలయాలను మరిన్ని నిధులతో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక అభివృద్ధితో ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డి, నాయకులు దిగంబర్రెడ్డి, బీరప్ప, సిద్దారెడ్డి, శేరి రాజు పాల్గొన్నారు. అనంతరం తుమ్నూర్, ముగ్దుంపూర్ గ్రామాల్లో రూ. 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, మురుగు కాల్వ నిర్మాణం పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
అధికారులు కావలెను!
మెదక్ కలెక్టరేట్: మెతుకుసీమ.. అధికారుల కొరతతో సతమతమవుతోంది. జిల్లా కేంద్రం ఏర్పడి సుమారు పదేళ్లు అవుతున్నా, కీలక శాఖల్లోని పోస్టులను ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయిలో జిల్లా అధికారులు లేకపోవడంతో సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొత్తవారు రావు.. ఉన్నవారు పనిచేయరు అన్న చందంగా పరిస్థితి మారింది. ఇన్చార్జిలే బాధ్యతలు జిల్లా అభివృద్ధికి అతి ముఖ్యమైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, విద్యా, వైద్య, సీ్త్ర శిశు సంక్షేమ, పౌర సంబంధాల శాఖ, జిల్లా యువజన క్రీడలు, పర్యాటక, ఇంటర్ విద్యాశాఖ, తూనికలు–కొలత లు, ఎంప్లాయీమెంట్, భూగర్భ జల, మత్స్య, మైనార్టీ సంక్షేమ, జిల్లా పశు సంవర్ధక శాఖ, ఇరిగేషన్ ఈఈ, సోలార్, మార్క్ఫేడ్ డీఎం,మార్కెటింగ్ ఏడీ, వయోజన విద్య, చేనేత సంక్షేమ శాఖలను ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. అదేబాటలో సంక్షేమ శాఖలు జిల్లాలో అతి కీలకమైన అంగన్వాడీ, సీ్త్రలు, శిశువులకు, వృద్ధులకు సేవలందించే డీడబ్ల్యూఓ పోస్టు సైతం ప్రస్తుతం ఇన్చార్జి అధికారితోనే కొనసాగుతోంది. నర్సాపూర్ సీడీపీఓ హేమాభార్గవికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో శిశు విక్రయాలు, బాల్య వివాహాలు పెరిగిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా మత్స్యశాఖ ఇన్చార్జి అధికారి మల్లేశం బదిలీకాగా రెగ్యులర్ అధికారిని నియమించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ అధికారి పూర్ణిమకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే రెండేళ్లుగా ఇంటర్ విద్యా శాఖ నోడల్ అధికారి పోస్టు సైతం ఇన్చార్జితోనే కొనసాగిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అవినితి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రాగానే బదిలీపై వెళ్లి పోయారు. దీంతో తూప్రాన్ వైద్యాధికారికి జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓగా బాధ్యతలు అప్పగించారు. సంతకాల కోసమే.. జిల్లా కేంద్రం ఏర్పడినప్పటి నుంచి సంగారెడ్డికి చెందిన ఎంప్లాయీమెంట్ అధికారి రామచంద్రరాజు ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అసలు మెదక్లో ఎంప్లాయీమెంట్ అధికారి ఉన్నట్లు జిల్లా ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టర్లకు మద్దతు పలుకుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్నార్నన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజావాణికి వచ్చి సంతకం చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 500లకు కంపెనీలున్నా.. గడిచిన పదేళ్లలో ఒక్క నిరుద్యోగికి ఉపాధి కల్పించినట్లు దాఖలాలు లేవు. మెదక్ కలెక్టరేట్జిల్లాలో భర్తీ కానీ కీలక పోస్టులు -
మట్టి డబ్బులు స్వాహా!
శివ్వంపేట(నర్సాపూర్): చెరువు మట్టి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులు గ్రామ పెద్దమనుషుల వద్ద ఉంచగా, వాటికి సంబంధించిన లెక్కలు తేలకపోవడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధి సికింద్లాపూర్లో మూడేళ్ల క్రితం చెరువు మట్టి అమ్మకం ద్వారా గ్రామానికి రూ.16 లక్షల ఆదాయం సమకూరింది. వాటిని గ్రామ అవసరాల కోసం ఖర్చు చేసేందుకు గ్రామానికి చెందిన పలువురు పెద్ద మనుషుల వద్ద ఉంచారు. ప్రస్తుతం ఆ డబ్బులను గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయాలని అడిగితే వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రజా అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులు సొంతానికి వాడుకోవడం ఎంతవరకు సమంజమని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బులు రికవరీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. మెదక్ కలెక్టరేట్: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి నుంచి జిల్లాలో విత్తన మేళాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 29 వరకు జిల్లాలోని 12 రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నా య పంటలను ప్రోత్సహించడం ఈ విత్తన మేళా ముఖ్య ఉద్దేశమన్నారు. తక్కువ నీరు– ఎక్కువ లాభం వచ్చే పంటలు సాగుచేయాలని రైతులకు సూచించారు. కంది, పెసర, మినుము, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లా లోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దుబ్బాకటౌన్: బుద్ధుడు, పూలే, అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ అందించిన సేవలకే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింహులుకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక గౌతమ బుద్ధ అవార్డు లభించిందని మహిళా కమిషన్ సభ్యురాలు శ్వేత తెలిపారు. జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ముత్యాల నర్సింహులుకు ఆదివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత, బీఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉప్పర మల్లేశం, జిల్లా అధ్యక్షుడు శంకర్ బోధి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...బుద్ధుడు బోధించిన కరుణ, సమానత్వం, అహింస, మానవత్వం వంటి విలువలను ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పించేందుకు ముత్యాల నర్సింహులు ఎన్నో ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి, పూలమాలలు వేసి, జ్ఞాపికను అందజేశారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ భవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పీఆర్సీ నివేదిక వెంటనే తెప్పించుకుని 40% ఫిట్మెంట్తో వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన నూతన పీఆర్సీని ఆర్థిక ఇబ్బందులు సాకుతో వాయిదా వేయడం సరికాదన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సంక్షేమ కార్యక్రమాలు రూ.వేల కోట్ల తో కొనసాగేవా అని ప్రశ్నించారు. ప్రభుత్వం 27 వేల పాఠశాలలను 4 వేల పాఠశాలలకు కుదించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. హామీలు నెరవేర్చక పొతే ఉపాధ్యాయులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
రైతు గుండె చెరువు
హత్నూర(సంగారెడ్డి): కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎల్నినో ప్రభావంతో చినుకు జాడ లేకుండా పోయింది. ఏటా ఈ సమయానికి పచ్చని పైర్లతో కనువిందు చేసే సాగు భూములు ఎడారిని తలపిస్తున్నాయి. వర్షాలు లేక చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. అయితే బోర్ల కింద మాత్రం రైతులు జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. అధికారులు వద్దంటున్నా.. రైతన్నలు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. మండలంలోని 38 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 250 వరకు చెరువు, కుంటలు ఉన్నాయి. వర్షాలు కురవకపోవడంతో ఏ ఒక్క చెరువు కుంటల్లో చుక్క నీరు చేరలేదు. అయినప్పటికీ రైతులు మాత్రం వరి నాట్లు వేస్తున్నారు. వరి నాట్లు వేసిన తర్వాత భూగర్భజలాలు అడుగంటి బోర్ల నుంచి నీరు రాకపోతే వేసిన పంటలు ఎండిపోయే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడులు సైతం నష్టపోయే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమ్ముకున్న కరువు వెలవెలబోతున్న నీటి వనరులు బోర్లను నమ్ముకుని వరి నాట్లు -
కరువును తరిమేట్టు
ఒడిసి పట్టు.. మెతుకుసీమపై ఎల్నినో ప్రభావం అధికంగానే ఉంది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా చెప్పుకోదగ్గ వర్షాలు లేక లోటు వర్షపాతమే నమోదు అయింది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని వీబీజీరామ్జీ పథకంలో విస్తృతంగా ఇంకుడు గుంతల నిర్మాణాలను యుద్ధ ప్రాంతిపదికన నిర్మించాలని ఆశాఖ అధికారులు ఊరూరా అవగాహన కల్పిస్తున్నారు. గతంలో ఈ పథకం ద్వారా వర్షాకాలంలో రకరకాల పనులు చేపట్టేవారు. కానీ తీవ్ర వర్షాభావ పరిసితుల నేపథ్యంలో రాబోయే మూడు నెలల వరకు భూగర్భజలాల పెంపే లక్ష్యంగా ఇంకుడు గుంతల నిర్మాణాలతో పాటు మొత్తం 5 రకా ల పనులు చేసేందుకు శ్రీకారం చుట్టారు. వర్షపునీరు వృథా కాకుండా.. జిల్లావ్యాప్తంగా 492 గ్రామాలు ఉండగా 1.63 లక్షల జాబ్కార్డులు ఉన్నాయి. వాటి పరిధిలో 3.26 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరందరికీ ఉపాధి కల్పించేందుకు ఈ ఏడాది 41 లక్షల పనిదినాలు కేటాయించారు. కాగా, ఎల్నినోను ఎదుర్కొనేందుకు రాబోయే మూడు నెలల పాటు జిల్లావ్యాప్తంగా 39,360 వ్యక్తిగతంగా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి. ఒక్కో గ్రామంలో 80 గుంతలకు తగ్గకుండా నిర్మించాలి. ఇందుకు గానూ ఒక్కోదానికి రూ. 6,690 ఇవ్వనున్నారు. అలాగే కమ్యూనిటీ ఇంకుడుగుంతలు వీటిని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాలి. ప్రతి గ్రామంలో రెండు చొప్పున ఒక్కో దానికి రూ.13,400 చొప్పున ఇవ్వనున్నారు. అలాగే రైతుల పంట పొలాల్లో పాంపండ్స్ నిర్మించుకోవాలి. వీటి సైజును బట్టి ఒక్కో దానికి రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.78 లక్షల వరకు ఇవ్వనున్నారు. గ్రామంలో రెండింటికి తగ్గకుండా జిల్లావ్యాప్తంగా 984 నిర్మించాలి. అలాగే బోర్వెల్ రీఛార్జ్ ఒక్కోదానికి రూ. 36 వేల చొప్పున ఇవ్వనున్నారు. పర్కోలేషన్ ట్యాంకు (చిన్నపాటి కుంటలు) వీటిని ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ ఏరియాల్లో నిర్మించాలి. ఇందుకు ఒక్కోదానికి రూ. 5 లక్షల వరకు ఇస్తారు. ఇవి గ్రామంలో రెండింటికి తగ్గకుండా నిర్మించాలి. వీటి ద్వారా వర్షపునీరు వృథాగా పోకుండా భూమిలోకి ఇంకి భూగర్భజలాలు అభివృద్ధి చెందుతాయి. వీబీజీ–రామ్జీలో భూగర్భజలాల పెంపునకు చర్యలు ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణం పాంపండ్స్, బోర్వెల్ రీఛార్జ్, పర్కోలేషన్ ట్యాంకులు సైతం.. భాగస్వాములు కావాలి ఎల్నినో ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘వీబీజీరామ్జీ’ ద్వారా ప్రవేశపెట్టిన జలసిరి పథకంలో అందరూ భాగస్వాములు కావాలి. వృథాగా పోయే వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించి భూగర్భజాలల పెంపునకు పాటుపడాలి. – శ్రీనివాస్రావు, డీఆర్డీఓ ఎల్నినో ముప్పును మూకుమ్మడిగా ఎదుర్కొనేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ నడుం బిగించింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అంగ్ అజీవికా మిషన్ (వీబీజీ–రామ్జీ) పథకం ద్వారా విరివిగా ఇంకుడు గుంతలు, పాంపండ్స్, బోర్వెల్ రీఛార్జ్, పర్కోలేషన్ ట్యాంకుల నిర్మాణాలతో భూగర్భజాలాలు పెంచేందుకు చర్యలు చేపట్టింది. జనం కదిలి ‘జలరిసి’ పెంచాలని అధికారులు పల్లెల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. – మెదక్జోన్ -
భక్తుల కల నెరవేర్చిన మోదీ
కొమురవెల్లి(సిద్దిపేట): ఎన్నో ఏళ్ల నుంచి మల్లన్న భక్తుల కలగా మిగిలిన కొమురవెల్లి రైల్వేస్టేషన్ ఆశను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ పేర్కొన్నారు. కొత్తపల్లి–మనోహరబాద్ రైల్వే లైన్లో నూతనంగా నిర్మించిన కొమురవెల్లి పుణ్య క్షేత్రం రైల్వే స్టేషన్ను వారు ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ.. గతంలో రైల్వే స్టేషన్ నిర్మించాలన్న, నూతన రైల్వే లైను ఏర్పాటు చేయాలన్న దశాబ్దాల సమయం పట్టేదని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయడం ఒక చారిత్రక ఘట్టమని, స్టేషన్ నిర్మాణం కోసం భూమి పూజచేసిన రెండేళ్లలోనే పూర్తిచేసి భక్తులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి కొమురవెల్లికి కేవలం రూ.20లతో చేరుకోవచ్చని ప్రస్తుతం డీజిల్తో నడుస్తున్న ఈ లైన్ను తర్వలోనే రూ.300 కోట్లతో విద్యుద్దీకరణ చేయనున్నట్లు వెల్లడించారు. మోదీ ప్రభుత్వ సమయం ముగిసేసరికి కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ రైల్వే పనులు పూర్తవుతాయన్నారు. అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పని చేయాలన్నారు. రాష్ట్రంలో రైల్వే లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ ఏర్పాటుకు మాజీ సీఎం కేసీఆర్ కృషి ఫలించిందన్నారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు గత ప్రభుత్వం 50% నిధులు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాజ్యసభ్యులు కె.లక్ష్మణ్, మెదక్ ఎంపీ రఘునందన్రావు, రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవత్సవ,రైల్వే అధికారులు, స్థానిక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు -
వద్దంటున్నా వరికే మొగ్గు!
● ‘ఎల్నినో’ను పట్టించుకోని రైతులు ● జిల్లాలో ఇప్పటికే 90 వేల ఎకరాల్లో నాట్లు ● నష్టం తప్పదంటున్న అధికారులు జిల్లావ్యాప్తంగా ఈఏడాది 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అందులో 3.15 లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి పంటలు సాగవుతాయని అంచనా. మిగితా 50 వేల ఎకరాల్లో పత్తి సాగుతో పాటు కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలు సాగు చేయనున్నారు. కానీ ఎల్నినో ముప్పుతో వానాకాలం ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా జిల్లాలో చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. ఇప్పటికే లోటు వర్షపాతం నమోదు అయింది. చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేక ఎడారులను తలపిస్తున్నాయి. భూగర్భజలాలు అడుగంటి బోరు బావుల్లో నీటి ఊటలు తగ్గాయి. అడపాదడపా కురిసిన వర్షాలతో వరి సాగును తగ్గించి కంది, పెసర, మినుములు, సో యా, ఆయిల్పాం, కూరగాయలు సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా మూడు విడతలుగా విభజించి పంటలు సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో ఇప్పటికే మొదట విడతగా రైతులకు ఉచితంగా కంది విత్తనాలను అందజేశారు. అయితే జిల్లాలో బోరుబావుల ఆధారంగా 90,819 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. వర్షాలు కురవకుంటే బోరు బావుల్లో నీటి ఊటలు తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రేపటి నుంచి రెండో విడత ఈనెలాఖరు వరకు చెప్పుకోదగిన వర్షాలు కురవకపోతే రెండో విడత ప్రణాళిక అమలు చేయనున్నారు. దీంతో ఈనెల 27, 28, 29 మూడు రోజుల పాటు రైతులకు మరోమారు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు అధికారుల సన్నద్ధమవుతున్నారు. ఆరుతడి. స్వల్పకాలిక పంటలనే సాగు చేయాలని విస్తృతంగా ప్రచారం చేయటంతో పాటు అందుకు సంబంధించిన విత్తనాలను రైతు వేదికల్లో అన్నదాతలకు అందుబాటులో ఉంచనున్నారు. కొల్చారం మండలంలోని చిన్నఘణాపూర్లో వరి సాగు ఎల్నినో ప్రభావంతో ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నా, జిల్లా రైతాంగం మాత్రం వరి వైపే మొగ్గు చూపుతోంది. ఇప్పటికే 90 వేల ఎకరాల్లో వరి నాట్లుపూర్తి చేశారు. అయితే, వర్షాలు పడకపోతే నష్టం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. – మెదక్జోన్ ఆరుతడి పంటలు మేలు ఎల్నినో ముప్పు ఉందని విస్తృతంగా అవగాహన కల్పించినా, కొందరు రైతులు మా మాట పెడచెవిన పెట్టి వరిసాగు చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని రకాల పంటలు 1,31,262 ఎకరాల్లో సాగు కాగా, అందులో 90,819 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటికై నా వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి. లేనిచో నష్టం చవిచూడాల్సి వస్తోంది. – దేవ్కుమార్, డీఏఓ -
రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం
చేగుంట(తూప్రాన్)/మెదక్ కలెక్టరేట్: రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మాసాయిపేట మండలం పోతన్శెట్టిపల్లిలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మ్యాపింగ్తో ప్రతి రైతుకు సంబంధించిన భూమి ఆక్రమణకు గురికాకుండా ఉంటుందని తెలిపారు. సర్వే నంబర్ల ప్రకారం హద్దులను నిర్ణయించి రికార్డులను తయారు చేస్తున్నట్లు చెప్పారు. రీ సర్వేలో చేసిన మ్యాపింగ్ ద్వారా రైతులకు సంబంధించిన భూ వివాదాలను పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం గ్రామ శివారులోని చెరువు శిఖం భూమిని పరిశీలించి చెరువు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సర్పంచ్ ప్రశాంత్, తూప్రాన్ ఆర్డీఓ బావయ్య, ల్యాండ్ సర్వే ఏడీఏ కిషన్, ఇన్చార్జి తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ ధన్సింగ్, సర్వేయర్లు అరుణ్, నర్సింలు తదితరులు ఉన్నారు. అనంతరం కలెక్టరేట్లో జలసిరిపై హైదరాబాద్ నుంచి మంత్రి సీతక్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జలసిరి కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ నగేశ్ -
రిమాండ్ ఖైదీ పరారీ
ిసద్దిపేటకమాన్: వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చిన ఖైదీ పరారైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. జిల్లా జైలులో ఉన్న పలు కేసుల్లోని ఏడుగురు ఖైదీలను ఏఆర్ ఎస్ఐ ఒడ్డన్న తొమ్మిది మంది సిబ్బందితో కలిసి సాధారణ వైద్య పరీక్షల కోసం పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసు వ్యానులో తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం నలుగురు ఖైదీలను ఆస్పత్రి బయట ఉన్న పోలీసు వ్యానులో ఎక్కించారు. ఇక్కడ పోలీసులు ఎస్కార్ట్గా ఉన్నారు. మరో ముగ్గురు ఖైదీలకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వ్యానులో ఉన్న ఖైదీల్లో పలు వాహనాల చోరీ కేసుల్లో అరైస్టె జైలులో ఉన్న జొన్నల సాయికుమార్(26) అనే ఖైదీ తన చేతికి ఉన్న హ్యాండ్ కప్స్, లీడింగ్ చైన్ను తొలగించుకుని వ్యాను అత్యవసర ద్వారం నుంచి దూకి పారిపోయాడు. స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. పారిపోయిన నిందితుడు వాహనాల చోరీ కేసులో నిందితుడుగా గుర్తించి ఈ నెల 15న చిన్నకోడూరు పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. కాగా ప్రభుత్వాసుపత్రి వద్దకు సిద్దిపేట ఏసీపీ రవీందర్రెడ్డి చేరుకుని ఆరా తీశారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో మొట్టమొదటి సారి ఖైదీ పరారు కావడం చర్చనీయాంశమైంది. -
రేపు కాంప్లెక్స్
నిన్న యూరియా.. ఇక ఎరువులన్నీ యాప్లోనే! పట్టా లేని రైతులకు కష్టాలే జిల్లాలో వివిధ సమస్యల్లో ఉండి, పట్టాలు లేని భూముల్లో పలువురు రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అటవీ భూముల ఆక్రమణ, శిఖం భూములు, ఎండోమెంట్, వర్క్స్ బోర్డు, సీలింగ్, వివాదస్పద భూములను కొంతమంది రైతులు ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నారు. పట్టాలు లేకపోవడంతో సంబంధిత రైతులకు యాప్ పద్ధతిన ఎరువులు దొరికే అవకాశం ఉండదు. దీంతో వీరికి యాప్ ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. జిల్లాలో సుమారు 12 వేల ఎకరాల వరకు ఇలాంటి భూములు ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్ మాట్లాడుతూ.. త్వరలో ఎరువులన్నీ యాప్ పద్ధతిన మాత్రమే విక్రయిస్తామన్నారు. ఇప్పటికే రెండు జిల్లాలో ఈ పద్ధతి అమలవుతోందని చెప్పారు. రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. మెదక్ అర్బన్: ‘యూరియా బ్యాగ్ తయా రీకి అయ్యే ఖర్చు రూ.1,947. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1680.50. రైతులకు అమ్మాల్సిన ధర రూ. 266.50. మామూలుగా నత్రజని ఉన్న కాంప్లెక్స్ వాడితే, అదనంగా ఎకరాకు యూరియా ఒకటి నుంచి ఒకటిన్నర బస్తా సరిపోతుంది. కానీ ధర తక్కువగా ఉండటంతో రైతులు 3 బస్తాల వరకు వాడుతున్నారు. అలాగే కాంప్లెక్స్ తయారీకి రూ.3171.30 ఖర్చు అనగా, కేంద్రం రూ.1021.30 సబ్సిడీ ఇస్తుంది. విక్రయ ధర రూ.2150. ఇది ఎకరాకు రెండు బ్యాగులు సరిపోతుంది. కానీ 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. దీంతో అటు వృథాతో పాటు ఇటు కేంద్రంపై సబ్సిడీ భారం తడిసి మోపెడవుతోంది. అందుకే ఎరువుల పంపిణీకి యాప్ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది’ ప్రయోగాత్మకంగా అమలు నిన్న యూరియా.. రేపు కాంప్లెక్స్ ఎరువులు యాప్ ద్వారా విక్రయాలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో యాప్ ద్వారా ఎరువుల సరఫరా ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈనెల 28 నుంచి మెదక్ జిల్లాలో యాప్ పద్ధతిన కాంప్లెక్స్ ఎరువులు సరఫరా చేస్తారని ప్రచారం జరుగుతుండగా, అధికారులు మాత్రం త్వరలోనే యాప్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 59,870 మెట్రిక్ టన్నులు అవసరం కాలం కలసి వస్తే అనుకున్న ప్రకారం 3,67,668 ఎకరాల్లో పంటలు సాగు అయితే మొత్తం 59,870 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయి. ఇందులో యూరియా 26,500, డీఏపీ 242, ఎంఓపీ 2317, కాంప్లెక్స్ 27,480, ఎస్ఎస్పీ 1153 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయి. కాగా యాప్ ద్వారా స రఫరా అయితే, వీటి వినియోగం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్, రంగారెడ్డిలో ప్రారంభం జిల్లాలో ఈనెల 28 నుంచి అమలు! -
పేదలకు ఉచిత న్యాయ సహాయం
అల్లాదుర్గం(మెదక్): పేదలకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి సుచరిత తెలిపారు. శనివారం అల్లాదుర్గం పంచాయతీ కార్యాలయంలో గృహహింస, వ్యవసాయ చట్టాలు, మహిళలపై దాడులు, కేజీబీవీలో బాలల హక్కులు, బాల్య వివాహా లు, పోక్సోపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలపై లైంగిక దాడులు, బాల్య వివాహాలు చేస్తే పోక్సో కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాలికలు ధైర్యంగా ఉండాలని, ఎవరైన వేధిస్తే భయపడకుండా పోలీసులకు చెబితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సౌమ్య, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్రవంతి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాపన్నపేట(మెదక్): జిల్లా విద్యాశాఖ అధికారి రాజు శనివారం ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు శంకరశర్మ ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. డీఈఓగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట అక్షయ పాత్ర మెదక్ ప్లాంట్ మేనేజర్ త్రిపాఠి, పవన్ కుమార్, రాకేశ్ కుమార్, భట్టు నాగరాజు, వికాస్ రాజు, బత్తిని రాజు ఉన్నారు. రామాయంపేట(మెదక్): రామాయంపేట ప్రా జెక్టు పరిధిలోని ఆరు మండలాలకు చెందిన అంగన్వాడీ సహాయకుల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుందని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి స్వరూప తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. చేగుంట మండలంలో 14, చిన్నశంకరంపేటలో 10, రామాయంపేట, నిజాంపేట మండలాల్లో 8, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కాగా 27న చేగుంట, 28న చిన్నశంకరంపేట, 29న రామాయంపేట, నిజాంపేట, 30న వెల్దుర్తి, మాసాయిపేట మండలాలకు చెందిన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తామన్నా రు. ఆన్లైన్ రసీదుతో పాటు సర్టిఫికెట్లను వెంట తీసుకొని రావాలని సూచించారు. టేక్మాల్(మెదక్): మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎస్పీ శ్రుతికీర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర విజిలెన్స్ బృందం శనివారం తనిఖీలు చేపట్టింది. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రికార్డులు, లైసెన్స్, ధరల పట్టి కలు, రైతులకు బిల్లుల జారీ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యమైన ఎరువులను నిర్ణీత ధరలకే రైతులకు విక్రయించాలని అధికారులు సూచించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఎరువుల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకుంటున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఏఓ కోటేశ్వర్, మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ పాల్గొన్నారు. -
బాలికలకు అండగా పోలీస్ అక్క
పెద్దశంకరంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, వారికి అండగా నిలిచేందుకు ‘పోలీస్ అక్క’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం మండలంలోని కేజీబీవీ విద్యాలయంలో ఈ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలపై జరిగే వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపుల వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి పోలీస్ అక్కలను ఆశ్రయిస్తే వెంటనే స్పందించి చట్టపరమైన రక్షణతో పాటు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, అపరిచితుల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండడం, సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. మహిళల గౌరవం, భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్రెడ్డి, ఎస్సైలు ప్రవీణ్రెడ్డి, శంకర్, పోచయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
విద్యార్థులు పోటీతత్వంతో చదవాలి
● కలెక్టర్ ప్రతిమాసింగ్ ● యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన రామాయంపేట(మెదక్): విద్యార్థులు చదువులో ప్రపంచంతో పోటీపడే విధంగా ముందుకు సాగా లని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శనివారం రామయంపేట పట్టణ శివారులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నామని తెలిపారు. రామాయంపేటలో రూ.200 కోట్లతో స్కూల్ భవన నిర్మాణ సముదాయం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయా లని సూచించారు. వచ్చే ఏడాదికల్లా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఆమె వెంట డీఈఓ రాజు, విద్య, సంక్షేమ మౌలిక సదు పాయాల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, తహసీల్దార్ రజని, జిల్లా గణాంక అధికారి నవీన్, మేఘ ఇంజనీరింగ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆంజనేయులు ఉన్నారు. గణితం బాగా నేర్చుకోవాలి చేగుంట(తూప్రాన్): విద్యార్థులు గణితం బాగా నేర్చుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. శనివారం చేగుంట కేజీబీవీని సందర్శించి పదో తరగతి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఫాస్ట్ మ్యాథ్స్ పుస్తకంలోని అంశాలను నేర్చుకుంటే గణితంలోని లెక్కలను సులభంగా సాధించే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం పాఠశాల వంటశాల, స్టోర్రూంను పరిశీలించారు. -
ఫలించిన రాహుల్ పోరాటం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నీట్ పరీక్షా పత్రాల లీకేజీని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు, రాహుల్గాంధీ చేసిన పోరాట ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి పాతబస్టాండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈసందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మోదీ నివాసం ఎదుట రాహుల్గాంధీ ధర్నా చేసిన తర్వాతే ఈ ఉద్యమం మరింత ఉధృతమైందన్నారు. మోదీ పాలన 14 సంవత్సరాలు పూర్తయిందని బీజేపీ నాయకులు మిఠాయిలు పంచుకున్నారని.. నీట్ పరీక్ష పత్రం లీక్ కావడంతో 14 మంది మెరిట్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి -
కొమురవెల్లికి రైలు కూత
సాక్షి, సిద్దిపేట: ఎన్నో ఏళ్లుగా భక్తులు కలలుకంటున్న కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయానికి రైలు అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం భక్తుల కోరిన కోర్కెలను తీర్చుతూ వారి కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. భక్తుల వినతుల మేరకు కొమురవెల్లికి హాల్ట్ రైల్వేస్టేషన్ను కేంద్రం మంజూరు చేసింది. రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వేస్టేషన్ను ఆదివారం(నేడు) కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రారంభించి, రైలును స్టేషన్లో నిలుపనున్నారు. కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్గా రైల్వే శాఖ నామకరణం చేసింది. కొమురవెల్లికి రైలు మార్గం రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.1,160 కోట్లు మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వేమార్గంలో భాగంగా సిద్దిపేట వరకు రైలు రాకపోకలు సాగిస్తోంది. ఈ రైల్వే ప్రాజెక్ట్ను రూ. 1,160 కోట్ల వ్యయంతో చేపట్టారు. తొలుత కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయలేదు. కేంద్ర, రాష్ట్ర మంత్రులకు భక్తులు వినతులు సమర్పించడంతో హాల్ట్ స్టేషన్ను మంజూరు చేశారు. 15 ఫిబ్రవరి 2024న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రయాణం మరింత సులభం ప్రతీ ఏటా మల్లన్న బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, కర్ణాటక, చత్తీస్గడ్, మహారాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కొమురవెల్లికి తరలివస్తుంటారు. ఇప్పటివరకు రోడ్డు మార్గంపైనే ఆధారపడాల్సి వచ్చిన భక్తులకు రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణం మరింత సులభం కానుంది. ప్రయాణ సమయం, ఖర్చు తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి కొమురవెల్లికి రూ.25లు, సిద్దిపేట నుంచి కొమురవెల్లికి రూ.10 రైల్వే చార్జీగా నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు నడుస్తున్న నాలుగు డెమూ రైళ్లను (రెండు అప్..మరో రెండు డౌన్) ప్రతీ రోజు కొమురవెల్లి స్టేషన్లో హాల్ట్ చేయనున్నారు. భక్తుల వినతితో రైల్వేస్టేషన్ ఏర్పాటు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మాణం భక్తులకు ప్రయాణం మరింత సులభం నేడు ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి -
రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం
హవేళిఘణాపూర్(మెదక్)/చిన్నశంకరంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేతో సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం మెదక్ మండలం కోంటూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. రీ సర్వే ద్వారా ఏళ్ల తరబడి సాగుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభించి రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామానికి సంబంధించిన భూములు కూడా స్పష్టత వస్తుందని, ప్రభుత్వ భూములను కూడా గుర్తించేందుకు వీలుందన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, ల్యాండ్ సర్వే ఏడీ కిషన్, గ్రామ రైతులు పాల్గొన్నారు. అనంతరం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందని ఆదేశించారు. జిల్లాలో 86శాతం సర్ పూర్తి నర్సాపూర్: ఓటరు జాబితా సవరణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, జిల్లాలో ఇప్పటివరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ 86 శాతం పూర్తయినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ చెప్పారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్లు, బీఎల్ఓలు, సూపర్వైజర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఓటర్ల వివరాల్లో ఉన్న వ్యత్యాసాలు, లోపాలు తగ్గించేందుకు క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
బ్రేకులు లేని టేకు దందా!
సామిల్లుల చీకటి వ్యాపారం మెదక్ అర్బన్: రంపపు కోత వేదన నుంచి పచ్చని చెట్లను పరిరక్షించడానికి ప్రభుత్వం కొత్త సామిల్లకు అనుమతులు ఇవ్వడం మానేసింది. అయినా కలప స్మగ్లర్లు చీకటి మాటున టేకును నరుకుతున్నారు. అనుమతులు లేకున్నా, వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా టేకును తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నారు. జిల్లాలోని పలుచోట్ల టేకు చెట్లను అడ్డంగా నరికి సామిల్లకు తరలిస్తున్నారు. రాత్రి సమయంలో గృహాలకు అవసరమైన టేకు సైజులను కోస్తున్నారు. గత నెల జిల్లా కేంద్రంలోని ఓ సామిల్లో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ టేకు కలపను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. జిల్లాలో 44 సామిల్లులు జిల్లాలో 44 సామిల్లులు ఉన్నాయి. ఇందులో 18 మిల్లులకు టేకు వ్యాపారం చేసే అనుమతి ఉండగా, మిగితా 26 మిల్లులు లోకల్ కలప వ్యాపారం మాత్రమే చేసుకోవాలి. 2004లో సెంట్రల్ ఎన్ పవర్డ్ కమిటీ, ఇక ముందు సామిల్లులకు అనుమతులు ఇవ్వవద్దని స్టేట్ లేవల్ కమిటీలకు సూచించింది. కాగా, మిల్లులలో వర్టికల్ (నిలువు), హారిజెంటల్(అడ్డం) మిషన్లు ఉంటాయి. హారిజెంటల్ మిషన్లతో పెద్ద పెద్ద కలప మొద్దులను సైతం కోయవచ్చు. అందుకే వాటికి అప్పట్లో ఎక్కువగా అనుమతులు ఇవ్వలేదు. కానీ కొందరు వ్యాపారులు అక్రమంగా హారిజెంటల్ మిషన్లు నడుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చి.. ప్రతి సామిల్లో ఎంత కలప నిల్వ ఉండొచ్చు అనేదానికి పరిమితి ఉంటుంది. కానీ సామిల్ వ్యాపారులు, మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ఇండియన్ టేకు తెచ్చి, చీకటి వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు గత నెల 26న మెదక్లోని ఓ సామిల్పై అధికారులు దాడి చేసి, పరిమితికి మించి నిల్వ ఉన్న 140 సీఎంటీల టేకును సీజ్ చేశారు. అయితే ఇతర రాష్ట్రం నుంచి తెచ్చిన టేకు నిబంధనల ప్రకారం కొనుగోలు చేసినప్పటికీ, ఇక్కడ షాపులో మాత్రం అక్రమ పద్ధతిన నిల్వ ఉంచారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇతడిపై 2017లో సైతం కేసు నమోదు కాగా, కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. అడ్డంగా నరికేస్తున్నారు సా్థనికంగా పెంచిన లోకల్ చెట్లను గృహావసరాల కోసం వినియోగదారులు, వ్యాపారం కోసం సామిల్లు యాజమానులు అనుమతులు లేకుండా నరుకుతున్నారు. నిజానికి టేకు చెట్ల యజమానులు, చెట్టును అవసరాల కోసం వినియోగించుకోవాలంటే టీజీఎఫ్ ఎంఐఎస్ పోర్టల్లో ట్రీఫెల్లింగ్ పర్మిషన్ పేరిట దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలన చేసిన అనంతరం, చెట్టుకు రూ.500 ఫీజుతో అనమతులు మంజూరు చేస్తారు. అలాగే ఒక చెట్టు నరికితే, రెండు మొక్కలు నాటాలి. కానీ చాలా మంది అనుమతి తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇలాగైతే మరికొన్ని రోజుల్లో టేకు చెట్ల ఉనికికే ప్రమాదం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. -
శిశు మరణాలను అరికట్టాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో శిశు మరణాలను అరికట్టాలని జిల్లా వైద్యాధికారి గణేశ్వర్ సంబంధిత అధికారులు, సిబ్బందిని అదేశించారు. గురువారం జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మూడు నెలల్లో జిల్లాలో 7 శిశు మరణాలు జరగడంతో వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం, నెలలు నిండకుండానే పుట్టడం, కవలలు జన్మించడం తదితర కారణాలతో మరణించినట్లు తెలిపారు. అయినప్పటికీ వైద్య సిబ్బంది, సూపర్వైజర్లు ఆస్పత్రిలో చేరిన గర్భిణులను పరిశీలించి పూర్తి ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టడానికి అవసరమైన అన్ని సూచనలు, సలహాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లా కేంద్ర ఆస్పత్రి, మాతా శిశు కేంద్రాల్లో తాగునీటి వసతులు, పారిశుద్ధ్యం తీవ్రంగా లోపించినట్లు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. తనిఖీల్లో సమస్యలున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఐఓ జయశ్రీ, మలేరియా అధికారిణి నవ్య, ఏఓ హరిప్రసాద్, మెడికల్ అధికారులు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గణేశ్వర్ -
రోడ్ల అభివృద్ధికి రూ.136.97 కోట్లు
ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: నియోజకవర్గ పరిధిలోని రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన నాలుగు ప్రధాన రోడ్ల అభివృద్ధికి రూ.136.97 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మె ల్యే సంజీవరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఖేడ్–రాయిపల్లి రోడ్డు 10 కి.మీ మేర అభివృద్ధికి రూ.11.58 కోట్లు, ఖేడ్–మాసాన్పల్లి రోడ్డు 22.40 కి.మీకు గాను రూ. 60.57 కోట్లు, ఖేడ్– పెద్దశంకరంపేట రోడ్డు 14.20 కి.మీకు గాను రూ. 39 కోట్లు, ఖేడ్– కరస్ గుత్తి రోడ్డు 22.30 కి. మీల మేర అభివృద్ధికి రూ. 25.82 కోట్లు మంజూరైనట్లు వివరించారు. గత ప్రభుత్వం రోడ్ల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే దెబ్బతిన్నాయని విమర్శించారు. ఆయా రోడ్ల అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రారంభిస్తామని వెల్లడించారు. నేడు విద్యుత్ సరఫరాలో 27న గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు చేగుంట(తూప్రాన్): మెదక్తో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గిరిజన గురుకులాల్లో ఈనెల 27న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు గిరిజన గురకులాల రీజినల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ తెలిపారు. 5 నుంచి 9 తరగతులతో పాటు ఇంటర్ మొదటి సంవత్సరం సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లాలో నర్సాపూర్ జూనియర్ కళాశాల, కౌడిపల్లి పాఠశాల, జూనియర్ కాలేజీల్లో చేరేందుకు కౌడిపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి నిజామాబాద్కు చెందిన నాగిరెడ్డిపేట, బాన్సువాడ, చీమన్పల్లి బాలుర గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం కామారెడ్డి పట్టణం సరంపల్లి గిరిజన గురకులంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని వివరించారు. ఇంకుడు గుంతలు తప్పనిసరి హత్నూర(సంగారెడ్డి): భూగర్భజలాలు పెంపొందించేందుకు ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఆర్డీఓ పీడీ జ్యోతి అన్నారు. గురువారం హత్నూర రైతు వేదికలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో జలసిరి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు తక్కువగా ఉన్నందున అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా కృషి చేయాలన్నారు. పొలాల్లో సైతం నీటి గుంతలను ఏర్పాటు చేసుకోవాలని రైతులను కోరారు. కార్యక్రమంలో ఏపీడి మధులత, ఎంపీడీఓ శంకర్, ఎంపీఈఓ యూసుఫ్, ఏపీఓ ప్రవీణ్, ఏపీఎం రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
బీజేపీతో వ్యవస్థలు నాశనం
తూప్రాన్: దేశంలో బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేస్తుందని కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి యత్నించిన రాహుల్గాంధీ సహా ఇతర నేతలను అరెస్టు చేయడాన్ని నిరసనగా టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాచారం దేవస్థానం చైర్మన్ రవీందర్గుప్తా, మండలపార్టీ అధ్యక్షుడు మల్లేశ్, పట్టణశాఖ అధ్యక్షుడు భగవాన్రెడ్డి, నాయకులు నాగరాజుగౌడ్, విఠల్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్లోని మరో వర్గం విజయభాస్కర్రెడ్డి, మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
ఆఖరి బిల్లు
శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026పెరిగిన నిర్మాణ వ్యయం మూణ్నాళ్ల ముచ్చటేనా!ఆందోళన వద్దు ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఆఖరు బిల్లులు రాలేదు. ఈ విషయమై ప్రభుత్వానికి రాసి పంపించాం. మంజూరు కాగానే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాం. బిల్లులు రాలేదని ఎవరూ ఆందోళన పడొద్దు. ఇళ్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఆర్థికంగా ఆదుకుంటుంది. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం మొదలు పెట్టని వారు వెంటనే ప్రారంభించాలి. – మాణిక్యం, హౌసింగ్ పీడీ -
సైబర్ నేరాలపై పటిష్ట నిఘా
మెదక్జోన్: సైబర్ నేరాలపై పటిష్ట నిఘా పెట్టామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి డీజీపీ సీవీ ఆనంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. గతంలో పోలీసులు నక్సలిజం వంటి అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, ప్రస్తుతం సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, ఆహార పదార్థాల కల్తీ, రోడ్డు ప్రమాదాలు ప్రధాన సవాళ్లుగా మారాయని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆదేశించారు. ఈసందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ.. ప్రతి పోలీస్స్టేషన్లో సైబర్ వారియర్స్ను అందుబాటులో ఉంచి, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రజలను మోసాలకు గురిచేసి ఆర్థికంగా నష్టపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, జార్జ్, సైబర్ క్రైమ్, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
మత్తు పదార్థాలను నివారిద్దాం: కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: మత్తు పదార్థాల రవాణాను నివారించి సమాజాన్ని కాపాడుదామని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్తో కలిసి మత్తు పదార్థాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యాంటీ డ్రగ్, రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పాఠశాలల వద్ద వంద మీటర్ల లోపు పాన్షాప్లలో గుట్కా లాంటి అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్, రెవెన్యూ, వైద్యశాఖల అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహంచి, మత్తు పదార్థాలు, పొగాకు విక్రయాలను నిరోధించాలన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో మత్తు పదార్థాల నివారణకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు రోడ్డు భద్రతపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మెదక్ను జీరో యాక్సిడెంట్ జోన్గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు.సర్కు సహకరించండి వెల్దుర్తి(తూప్రాన్): వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న సమగ్ర ఓటరు సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్, ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి వెన్నెల పరిశీలించారు. ఈసందర్భంగా సర్వే నిర్వహిస్తున్న బీఎల్ఓలతో మాట్లాడి ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అర్హులు ఓటరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు తమ వివరాలను మరోసారి పరిశీలించుకోవాలన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించి సరైన వివరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు మూడు జిల్లాల కలెక్టర్లతో సమీక్షహుస్నాబాద్: ఎల్నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ఆయా శాఖల అధికారులతో నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి మూడు జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమీక్ష ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ... వివిధ శాఖల అధికారుల యాక్షన్ ప్లాన్ తెలపడం కోసం ప్రొజెక్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల వసతి కోసం కేటాయించిన రైతు బజార్ను పరిశీలించారు. ఆర్డీఓ రామ్మూర్తి, కళాశాల అద్యాపకులు పాల్గొన్నారు. -
నవోదయలో ఫుట్బాల్ సెలెక్షన్స్ మీట్
వర్గల్(గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ నవోదయ వేదికగా ఫుట్బాల్ రీజినల్ సెలెక్షన్స్ మీట్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. వర్షం తాకిడికి స్టేడియం చిత్తడిగా మారడంతో ఎంపీ హాల్లో ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు. ఆతిథ్య నవోదయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి మూడు రోజుల మీట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతేడాది సుబ్రతోకప్ టోర్నమెంట్ అనుభవాన్ని రంగరించి సెలెక్షన్స్ మీట్ను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. వివాదాలకు తావివ్వకుండా మీట్ సక్సెస్కు అందరూ సహకరించాలని కోరారు. వైస్ప్రిన్సిపాల్ మోహన్రాథోర్, సెలెక్షన్ కోచ్లు, ఎస్కార్ట్ టీచర్లు, వ్యాయామోపాధ్యాయులు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నవోదయ విద్యార్థులు పాల్గొన్నారు. భయపెట్టిన వర్షం..మూడు గంటలు ఆలస్యం సెలెక్షన్ మీట్ను వర్షం భయపెట్టింది. తెరిపిలేని వర్షంతో బుధవారం ఉదయం ఎంపిక పోటీలకు బ్రేక్ పడింది. వర్షం తెరిపివ్వడంతో మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం నుంచి ప్రాథమిక దశ సెలెక్షన్స్ నిర్వహించారు. రీజియన్ జట్టు కూర్పునకు ప్రావీణ్యం కలిగిన క్రీడాకారులు ఫో కస్గా కేటగిరీల వారీగా ఇవి కొనసాగాయి. -
డిగ్రీ ప్రవేశాలకు మరోసారి ‘దోస్త్’
మెదక్జోన్: జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ‘దోస్త్’ ద్వారా మరోసారి ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే మూడు విడతలుగా అవకాశం కల్పించారు. చివరగా ఈనెల 26 వరకు పొడిగించారు. ఈనెల 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. కాలేజీల్లో రిపోర్టింగ్కు ఆగస్టు 1 వరకు ఛాన్స్ ఇచ్చారు. కాగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రారంభమై నెలన్నర అవుతున్నా, ఇప్పటివరకు కేవలం 35 శాతం సీట్టు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 75శాతం ఖాళీ గానే ఉన్నాయి. జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, కౌడిపల్లి మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 2,160 సీట్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం 749 సీట్లు మాత్రమే భర్తీ కాగా, ఇంకా 1,411 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో చేరాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు. ● మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆయా కోర్సుల్లో మొత్తం సీట్లు 1,200 ఉండగా, 620 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 580 ఖాళీగా ఉన్నాయి. ● రామాయంపేట డిగ్రీ కళాశాలలో 240 సీట్లు ఉండగా, 46 సీట్లు భర్తీ అయ్యాయి. 194 ఖాళీగా ఉన్నాయి. ● నర్సాపూర్ కళాశాలలో 480 సీట్లు ఉండగా, 69 సీట్లు భర్తీ అయ్యాయి. 411 ఖాళీగా ఉన్నాయి. ● కౌడిపల్లి డిగ్రీ కళాశాలలో 240 సీట్లు ఉండగా, 14 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 226 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 26 వరకు అవకాశం జిల్లాలో 1,411 సీట్లు ఖాళీ -
రైతుల్లో చైతన్యం నింపాలి
ఎల్నినో ప్రభావంతో తలెత్తే ప్రతికూల పరిస్థితులను ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా ఎదుర్కొవాలి. ఇందుకోసం సంబంధితశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఎల్నినో అనేది ప్రకృతి విపత్తు అని దీన్ని ఎవరూ ఆపలేరు. దీని ప్రభావంతో జరిగే నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. వరి వంటి నీటి అవసరాలు అధికంగా ఉన్న పంటలకు బదులుగా ఆయిల్పామ్ వంటి ఆరుతడి పంటల విస్తీర్ణం పెంచేందుకు రైతుల్లో చైతన్యం నింపాలి. ఇందుకోసం సోషల్ మీడియా రీల్స్, కళాజాతలు, నాటక ప్రదర్శనలను వినియోగించాలి. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. భూగర్భజలాలు పెంచేందుకు ఇంకుడుగుంతలు తవ్వుకునేలా ప్రజలను చైతన్యం చేయాలి. – వివేక్, జిల్లా ఇన్చార్జి మంత్రి -
ఎల్నినోను ఎదుర్కొందాం
ముందస్తు కార్యాచరణతో ముందుకెళ్దాంసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎల్నినో ప్రభావంతో ఏర్పడనున్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక అమలుపై సోమవారం సంగారెడ్డి జెడ్పీ హాలులో సమీక్ష సమావేశం జరిగింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై లో తుగా చర్చించారు. వ్యవసాయం, తాగునీరు, పశుగ్రాసం, విద్యుత్ వంటి అంశాలకు సంబంధించిన ప్రణాళికలను ఆయాశాఖల అధికారులు వివరించారు. ఈసందర్భంగా తెలంగాణ జలసిరి పోస్టర్ను, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక నివేదికను మంత్రులు, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. స్పెషల్ సెక్రటరీ వాణిప్రసాద్, కలెక్టర్లు ప్రతీక్జైన్, ప్రతిమాసింగ్, ఎమ్మెల్యేలు మాణిక్రావు, సంజీవరెడ్డి, సునీతారెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయకట్టు రైతులను ఆదుకోవాలి సింగూరుకు దిగువన ఉన్న ఘనపురం ఆనకట్ట ఆయకట్టు రైతులను ఆదుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తెచ్చారు. సింగూరు నుంచి నీటి విడుదలకు వీలు లేకుండా పోవడంతో వారికి సబ్సిడీ విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ ఆర్థిక సాయం అందించాలన్నారు. వీలైనంత త్వరగా సింగూరు మరమ్మతులు పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కోతులకు కూ.ని. ఆపరేషన్ కేంద్రాలు కోతుల బెడద కారణంగా చాలా గ్రామాల్లో వరి తప్ప, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. కోతుల సంతానాన్ని తగ్గించేందుకు ఆపరేషన్లు చేసే కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.10 లక్షల వరకు అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపాలని మంత్రి వివేక్ కలెక్టర్లను ఆదేశించారు. అధికారుల మధ్య సమన్వయం అవసరం ‘అమృత్’ పనులపై ఆసక్తికర చర్చ సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ప్రత్యామ్నాయంపై సమీక్షసమన్వయంతో పనిచేయాలి తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి. సింగూరు నీటిని ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాలకే వినియోగించాలి. హెచ్ఎండబ్ల్యూఎస్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాలి. మున్సిపాలిటీలు, గ్రామాల్లో తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయంగా ముందస్తు ప్రణాళికను అమలు చేయాలి. పీఎం సూర్యఘర్ వంటి పథకాల లబ్ధి సామాన్యులకు అందేలా చర్యలు చేపట్టాలి. – అంజిరెడ్డి, ఎమ్మెల్సీ -
ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి: ఎస్పీ
మెదక్జోన్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో వ్యక్తిగత, సా మాజిక, భూ వివాదాలు, మోసాలు, వేధింపులకు తదితర ఫిర్యాదులు వచ్చాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీసులను కలిసి ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు సూచించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్గౌడ్ వెల్దుర్తి(తూప్రాన్): బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని ఎదులపల్లికి చెందిన కందనూరి శ్రీనివాస్గౌడ్ నియమితులయ్యారు. పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాస్గౌడ్ విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. విద్యార్థుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేపట్టారు. కళాశాల అధ్యక్షుడి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగాల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ఈసందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, జిల్లాలో బీజేవైఎంను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. రాజ్యాంగ హక్కులు కాపాడుకుందాం మెదక్ కలెక్టరేట్: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న క్విట్ మోడీ, క్విట్ కార్పొరేట్ పేరుతో జైల్ భరో నిర్వహిస్తున్నట్లు ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. సోమ వారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో కేవల్ కిషన్ భవన్లో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య మాట్లాడుతూ.. మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతీ చర్య కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడేదిగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తేందుకు క్షేత్రస్థాయిలో సదస్సులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు మల్లేశం, కె. మల్లేశం, లచ్చాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనువాద పార్టీలకు చోటులేదు : వెన్నెల చిన్నశంకరంపేట(మెదక్): తెలంగాణలో మనువాద పార్టీలకు చోటులేదని తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ అన్నారు. సోమవారం చిన్నశంకరంపేటలో ఆమె మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియతో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను వాడుకొని తెలంగాణలో పాగా వేయాలని చూస్తుందన్నా రు. బీఎల్ఓలు మీ ఇంటికి రాకుంటే మీరే వారి వద్దకు వెళ్లి వివరాలు అందించాలన్నారు. కాంగ్రెస్ బీఎల్ఏలు సైతం గ్రామాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ కో ఆర్టినేటర్ ప్రతాప్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్నాయక్, సర్పంచ్లు ప్రవీణ్కుమార్, నవీన్కుమార్, నర్సింహులు, అక్బర్ పాల్గొన్నారు. ‘జీఓ 12ను రద్దు చేయాలి’ సంగారెడ్డి ఎడ్యుకేషన్: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యా లయం ఎదుట ధర్నా నిర్వహించారు. -
బఫర్లో బరితెగింపు!
మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026ఏడుపాయల్లో భూ ‘మాయ’ం ● మంజీరా పరీవాహ క ప్రాంతం ఆక్రమణ ● అనుమతి లేకుండానే 7 ఎకరాల్లో రిసార్ట్ నిర్మాణ ర ● కళ్లప్పగించి చూస్తున్న అధికారులుమెదక్జోన్: జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పరిధి పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లికి ఒకవైపు ఉండగా, మరోవైపు కొల్చా రం మండలం పోతన్శెట్టిపల్లిలో కొంత భాగం ఉంది. పోతన్శెట్టిపల్లి వైపు జాతీయ రహదారి (265–డీ) ఉండటంతో భక్తులు పెద్దఎత్తున ఇక్కడి నుంచి వస్తుంటారు. ఈక్రమంలో మంజీరా నదిపై నిర్మించిన మొదటి బ్రిడ్జి సమీపంలో కొందరు వ్యక్తులు (257/అ, 257/ఆ) సర్వే నంబర్లలో 7 ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని భారీ రిసార్ట్ నిర్మిస్తున్నారు. ఏకంగా బఫర్జోన్లోనే రోడ్డు వేసి, భారీ సిమెంట్ నీటి ట్యాంక్ నిర్మించి పనులు చేపడుతున్నారు. హైడ్రా అవసరం ఏడుపాయల పుణ్యక్షేత్రం వద్ద ఎప్పుడు చూసినా ఇసుకేస్తే రాలనంత భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి, మాఘ అమావాస్య, ఉగాది పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రభుత్వం ఏటా జాతర ఉత్సవాలకు రూ. 2 కోట్లు మంజూరు చేస్తోంది. ఇటీవల 12 కాటేజీల నిర్మాణాలకు రూ. 7 కోట్లను స్థానిక ఎమ్మెల్యే రోహిత్రావు మంజూరు చేయించారు. ఆలయానికి తెలంగాణ, ఏపీ, మహా రాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పుణ్యక్షేత్రం వద్ద, మంజీరా నది పక్కన బఫర్జోన్లో నిర్మాణాలు చేపడుతుంటే అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తున్నారు తప్ప అడ్డుకోలేకపోతున్నారు. ఇక్కడి అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా ఇక్కడికి కావాలని పలువురు కోరుతున్నారు. అనుమతి లేకుండానే.. వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలంటే నిబంధనల ప్రకారం నాలా కన్వర్షన్తో పాటు, సంబంధిత పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండానే పెద్ద ఎత్తున రిసార్ట్ నిర్మిస్తున్నారు. అందులో వాటర్ ఫౌంటేన్, కాటేజీల నిర్మాణాలు సాగుతున్నాయి. గతేడాది మాదిరిగా మళ్లీ వర్షాలు కురిస్తే ప్రస్తుతం బఫర్జోన్లో నిర్మిస్తున్న రోడ్డు, నీటి కుండీలు కొట్టుకపోవటం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు. అంతే కాకుండా ప్రాణాపాయం జరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు.బఫర్జోన్లో నిర్మించిన నీటి ట్యాంక్చర్యలు తీసుకుంటాం ఏడుపాయల్లోని పోతంశెట్టిపల్లి శివారులో నూతనంగా నిర్మిస్తున్న రిసార్ట్ను కొంతభాగం బఫర్జోన్లో నిర్మించారు. మంజీరా నది అంచున రోడ్డు వేసి నీటి ట్యాంకును నిర్మించారు. వాటిని తొలగించాలని సదరు వ్యక్తులకు నోటీసులు ఇచ్చాం. తొలగించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – స్వాతి, డీఈ ఇరిగేషన్, కౌడిపల్లి -
పరిశ్రమను మూసి వేయాల్సిందే..
మెదక్ కలెక్టరేట్: ప్రజల ప్రాణాలకు సంకటంగా మారిన పరిశ్రమను తొలగించకుంటే జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమ వారం మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం, రంగాయపల్లి గ్రామాల ప్రజలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్లోకి చొ చ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు తోడేస్తున్న కాలుష్య కారక పరిశ్రమను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమను త్వరగా మూసివేసి ఆ రెండు గ్రామాల ప్రజలను కాపాడాలన్నారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై గ్రామంలో యువకులు ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీర్డీఓ అంబదాస్ రాజేశ్వర్కు అందజేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే కలెక్టరేట్ ఎదుట వంటా వార్పు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఏఎంసీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మాజీ కౌన్సిలర్ ప్రభురెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రెండు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి -
సఫారీ రైడ్కు రెడీ
హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ జిల్లా సరిహద్దు పోచారం అభయారణ్యంలో వన్యప్రాణులను తిలకించేందుకు ఫారెస్టు అధికారులు కొత్త సఫారీ వాహనం మంజూరు చేశారు. పాత వాహనంతో కొన్ని ఇబ్బందులు కాగా, సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు నూతన హంగులతో కూడిన సఫారీ వాహనం పంపించారు. ఇందులో 10 మంది పర్యాటకులు ప్రయాణించడంతో పాటు వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా తయారు చేశారు. గతంలో పర్యాటకులు వచ్చిన సమయంలో పాత వాహనంలో అభయారణ్యంలోకి వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. దీంతో తమ సొంత వాహనంలో ఫారెస్ట్ సిబ్బందిని తీసుకెళ్లి చూపించేవారు. నూతన సఫారీ ద్వారా హాయిగా అభయారణ్యంలో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ఇదే విషయమై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భీమ్రెడ్డి మాట్లాడుతూ.. దీనిని సందర్శకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెద్దవారికి రూ.100, చిన్నపిల్లలకు రూ.50 చెల్లించి పర్యటించవచ్చని తెలిపారు. -
హెల్ప్డెస్క్కు వినతుల వెల్లువ
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం హెల్ప్డెస్క్ ద్వారా నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై 85 అర్జీలు అందజేశారు. సంగారెడ్డిలో జరిగిన ఉమ్మడి జిల్లా సమావేశానికి కలెక్టర్తో పాటు జిల్లాస్థాయి అధికారులంతా తరలివెళ్లారు. దీంతో కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ ద్వారా వినతులు స్వీకరించారు. వీటిని కలెక్టర్ అనుమతితో సంబంధిత శాఖలకు అందజేయనున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలోని డబుల్ బెడ్రూంలలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పలువురు వినతిపత్రం సమర్పించారు. కనీస వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.


