Medak District Latest News
-
సక్రమంగా సన్న బియ్యం సరఫరా
తీపెక్కిన చెరుకు సీజన్ ఈసారి చెరుకు మరింత తీపెక్కింది.ఈ ఏడాది చెరుకు క్రషింగ్ సీజనుఆశాజనకంగా ముగిసింది. వివరాలు 8లో uకలెక్టర్ ప్రతిమాసింగ్మెదక్ కలెక్టరేట్/కౌడిపల్లి(నర్సాపూర్)/వెల్దుర్తి(తూప్రాన్): పేదలకు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన సన్న బియ్యం సరఫరాను సక్రమంగా పంపిణీ చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో గల ఎంఎల్ఎస్ పాయింట్ను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా మూడు నెలల బియ్యం సరఫరా గురించి ఆరా తీశారు. అలాగే రికార్డులతో పాటు బియ్యం నిల్వలను పరిశీలించారు. పెండింగ్ ఉన్న రేషన్న్షాపులకు త్వరగా బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అధికారులు సక్రమంగా ప్రజలకు బియ్యం పంపిణీ చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ జగదీష్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, సంబంధిత అధికారులు ఉన్నారు. అంతకుముందు కౌడిపల్లి మండలంలోని వెల్మకన్న, కొట్టాల గ్రామాల్లో రేషన్షాపులను తనిఖీ చేసి స్టాక్ను పరిశీలించారు. మూడు నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే వెల్దుర్తి కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించారు. మెస్ నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. -
పట్టపగలే దోపిడీ పాడైన గ్యాస్పొయ్యిలు బాగుచేస్తామని నమ్మించి వృద్ధ మహిళ నుంచి బంగారం లాక్కొని పరారయ్యారు. వివరాలు 9లో u
గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026ఇందిరమ్మ బిల్లులు వెంటనే చెల్లించాలిఅసెంబ్లీలో ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు బిల్లులను వెంటనే మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బుధవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో వారు నిర్మాణ పనులు చేపట్టారని, పలువురు బేస్మెంట్స్థాయి వరకు పూర్తయినా బిల్లులు చెల్లించడం లేదని వివరించారు.దరఖాస్తు గడువు పొడిగింపు మెదక్ కలెక్టరేట్: షెడ్యూల్ట్ కులాలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు గడువును ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 249 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దర ఖాస్తు చేసి హార్డ్ కాపీలను సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలన్నారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. నేడు అఖిలపక్ష సమావేశంరామాయంపేట(మెదక్): గతంలో రద్దయిన రామాయంపేట నియోజవర్గాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దశలవారీగా ఆందోళనకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈమేరకు నియోజకవర్గ సాధన సమితి పేరిట ఒక కమిటీని ఏర్పాటు చేశారు. గురువారం సాధన సమితి ప్రత్యేక సమావేశం ప్రగతి రిసార్ట్లో నిర్వహించనున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. రామాయంపేట నియోజవర్గ పునరుద్ధరణ విషయమై సమావేశంలో చర్చిస్తామని, అన్ని పార్టీల నాయకులు హాజరుకావాలని కోరారు. ఈమేరకు సమితి సభ్యులు తహసీల్దార్ రజనికి వినతిపత్రం అందజేశారు. పనుల పురోగతిపై ఆరాహవేళిఘణాపూర్(మెదక్): మండలంలోని అవుసులపల్లి శివారులో పోలీస్శాఖ నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ పనులను ఏఎస్పీ మహేందర్ పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఆయన వెంట ఏఆర్ డీఎస్పీ రంగానాయక్, ఆర్ఎస్ఐ మహిపాల్, సిబ్బంది ఉన్నారు. -
జాబ్ మేళాలో 21 మంది ఎంపిక
ఇన్చార్జి ప్రిన్సిపాల్ సింహారెడ్డి మెదక్జోన్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీఎస్కేసీ, కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్ ఫార్మసీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు మంగళవారం నిర్వహించిన జాబ్మేళా 21మంది ఎంపికయ్యారు. ఈ మేరకు ఇన్చార్జి ప్రిన్సిపాల్ సింహారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ జాబ్మేళాకు మొత్తం 42 మంది అభ్యర్థులు హాజరుకాగా, ఆరుగురు ఎంఎస్ఎన్ కంపెనీకి, 15 మంది అమెజాన్కు ఎంపికై నట్లు చెప్పారు. కార్యక్రమంలో శ్రీనివాస్, వేణుగోపాల్రావు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సింగూరు ప్రాజెక్టు వద్ద ఆక్టోపస్ దళాలు
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు వద్ద మంళవారం ఆక్టోపస్ దళాలు మార్చ్ ఫాస్టు నిర్వహించాయి. ఆపదకాలంలో ప్రాజెక్టును ఎలా సంరక్షించుకోవాలో సూచించారు. మూడేళ్ల క్రితం కూడా ప్రాజెక్టు వద్ద ఆక్టోపస్ దళాలు మార్చ్పాస్టు నిర్వహించారు. పాలిసెట్కు తుదిగడువు ఏప్రిల్ 20 జోగిపేట(అందోల్): పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షకు హాజరుకావాలనుకుంటున్న విద్యార్థుల ఏప్రిల్ 20వ తేదీ చివరి తేదీ అని జోగిపేట ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఎం.వీణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మే13న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే మూడు బ్రాంచులు ఉన్నాయని తెలిపారు. ఈ పాలిటెక్నిక్ ప్రత్యేకంగా మహిళల కోసం మాత్రమేనని, ఇటీవల మా సంస్థకు చెందిన అధ్యాపకులు పాలిటెక్నిక్ చదువు గురించి అవగాహన పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు పెంచాలి
సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా మెదక్ కలెక్టరేట్: జిల్లా సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో నిధుల కోటా పెంచాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేసి కలెక్టరేట్లో ఏఓ యూనస్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ...ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తుందని విమర్శించారు. భూ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు, ఉపాధి హమీ సమస్యలు ఎక్కడికక్కడ పేరుకు పోయాయని ఆరోపించారు. భూ సమస్యలు పరిష్కారం కాక ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగి పోతున్నారన్నారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పేరుతో పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి శివారులోని రైతుల భూమి బ్లాక్ లిస్టులో పెట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ, పద్మ, ఏ.మల్లేశం, కే.మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సమర్థవంతంగా జనగణన
అదనపు కలెక్టర్ నగేశ్మెదక్ కలెక్టరేట్: జనగణన–2027 తొలివిడతలో ప్రక్రియలో భాగంగా ఇళ్లలెక్కింపును ఎన్యూమరేటర్లు సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ స్పష్టం చేశారు. మెదక్ సమీకృత కలెక్టరేట్లో జనగణన అధికారులకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...జనగణన విధులను అధికారులు సక్రమంగా నిర్వహించాలన్నారు. జనగణనలో సాంకేతిక వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాప్ ద్వారా జనగణన చేయాలని తెలిపారు. తొలిసారిగా జనగణనను డిజిటల్ పద్ధతిలో చేస్తున్నట్లు వెల్లడించారు. మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్లగణన కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పునర్విభజనకు ముందడుగు
● కొత్తగా రెండు నుంచి మూడు అసెంబ్లీ స్థానాలు! ● అసెంబ్లీ, లోక్సభ స్థానాలను 50 శాతం పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం ● దీంతో జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పెరిగే అవకాశం! మారనున్న నియోజకవర్గాల రూపురేఖలురాష్ట్రంలో లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో మెదక్ లోక్సభ స్థానం స్వరూపం కూడా సమూలంగా మారనున్నాయని రాజకీయవర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మెదక్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాగా ఏయే అసెంబ్లీ స్థానాలు ఏ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయనే దానిపై పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత స్పష్టత రానుంది.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల రూపురేఖలు సమూలంగా మారనున్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధి, స్వరూపంలో కూడా మార్పులు రానున్నాయి. వాటి పరిధిలో మండలాల్లోను మార్పుచేర్పులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో ప్రస్తుతం మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే అందోల్ నియోజకవర్గ పరిధిలో టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలున్నాయి. పెద్దశంకరం పేట మండలం నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం పరిధిలో ఉంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లాలో వీటి సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో జిల్లాలో కనీసం రెండు నుంచి మూడు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నట్లు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభాను బట్టి.. 2011 జనాభా లెక్కల ప్రకారం మెదక్ జిల్లా జనాభా 7.67 లక్షల జనాభా ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం మేలో జనగణన చేపట్టనుంది. 2027 మార్చి వరకు దేశవ్యాప్తంగా జనగణన పూర్తవుతుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. 2027 జనాభా లెక్కల ప్రకారం ఎంత జనాభా పెరుగుతుంది? ఎంతమంది ఓటర్లుండే అవకాశాలున్నాయి? వీటి సంఖ్యను ఆధారంగా కొత్త నియోజకవర్గాలను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదించేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో మహిళా రిజర్వుడు స్థానాలు కూడా ఉండే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
దరఖాస్తులు పరిష్కరించాలి
భూభారతిపై కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని భూభారతి దరఖాస్తులను తహసీల్దార్లు చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. కలెక్టరేట్లో భూభారతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, ఓటరు జాబితా తయారీపై రెవెన్యూ అధికారులతో మంగళవారం కలెక్టర్ వీడియో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...రెవెన్యూ శాఖలో పారదర్శకత పాలన కోసం అధికారులంతా పాటు పడాలన్నారు. ప్రజావాణి, భూభారతి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలకు వెనకాడబోమని తహసీల్దార్లను హెచ్చరించారు. ఓటర్ జాబితా తయారీ అన్ని శాఖల సమన్వయం చేసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని సొంత నిర్ణయాలకు తావు లేదన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మర్ యాక్షన్ ప్లాన్పై కలెక్టర్ సమీక్షించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి తీర్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం అధికారులంతా సమన్వయంతో వేసవి కార్యచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తిన వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ కమిషనర్ సమిష్టిగా పని చేయాలన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో వన్య ప్రాణులకు దప్పిక తీర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఎఫ్ఓ జోజి, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీపీఓ యాదయ్య, మిషన్ భగీరథ ఇంట్రాగ్రిడ్ ఈఈ సంపత్ కుమార్, గ్రిడ్ నాగభూషణం, సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వడగండ్ల బీభత్సం
నేల రాలిన పంటలునందిగామ గ్రామంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటనిజాంపేట(మెదక్): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్లతో చాలా వరకు పంట నష్టం వాటిల్లింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘామృతమైంది. సాయంత్రం కాగానే గాలి వాన బీభత్సం సృష్టించింది. దీంతో ఈదురు గాలులు వీస్తూ రాళ్ల వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అలాగే ఈదురు గాలులకు మామిడికాయలు నేల రాలిపోయాయి. పలు గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. అలాగే వరి పంటలో గింజలు రాలిపోయాయని రైతులు వాపోయారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలిపారు. -
రైతులకు పరిహారం చెల్లించండి: ఎమ్మెల్యే
నర్సాపూర్: సింగూర్ ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించినందున ప్రభుత్వం రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసేందుకు రెండేళ్ల పాటు క్రాప్ హాలిడే ప్రకటించారని తెలిపారు. ప్రాజెక్టు కింద చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, వారికి పరిహారం అందచేసి ఆదుకోవాలన్నారు. కాగా చిన్నఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచడంతో పాటు మరమ్మతులు చేపట్టేందుకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, ఇప్పటివరకు పనులు చేపట్టలేదన్నారు. ఇప్పటికై నా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దరఖాస్తులకు నేడు ఆఖరు మెదక్ కలెక్టరేట్: స్వయం ఉపాధి సబ్సిడీ పథకాలను జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు నేడే ఆఖరి రోజు అని తెలిపారు. జిల్లాలో 2025–26 వార్షిక ప్రణాళిక అమలు చేసేందుకు రూ.236.60 లక్షలతో 249 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు. 119 ఈవీ ద్విచక్ర వాహ నాలు, 59 ఈవీ ఆటోలు, రైతులకు సోలార్ పంపులు అందజేయడం జరుగుతుందన్నారు. అర్హత, ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
ఏప్రిల్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026మెదక్ కలెక్టరేట్: జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలని కలెక్టర్ ప్రతి మాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ కు ఏప్రిల్ 15 నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది యాసంగిలో 4,45,466 మెట్రిక్ టన్నుల లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే వన మహోత్సవంలో జిల్లావ్యాప్తంగా 31.7 లక్షల మొ క్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు. అందుకనుగుణంగా అధికారులు పటిష్ట ప్రణాళికతో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ సమస్యలపై 73 అర్జీలు అందజేశారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
మంత్రి పొన్నం కృతజ్ఞతలు
నంగునూరు(సిద్దిపేట): సీఎం రేవంత్రెడ్డి పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు భరోసా నిధుల విడుదల, రిఫైనరీ యూనిట్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన సీఎంకు జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. పటాన్చెరుటౌన్: స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్సింగ్ ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. భగత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని శ్రామిక్ భవన్ నుంచి బీరంగూడ కమాన్ వరకు తలపెట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ...భగత్సింగ్ తన 23 సంవత్స రాల కాలంలోనే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ధీరుడని గుర్తు చేశారు. 1907 లో జన్మి ంచి, 1931 మార్చి 23 న ఉరి తీయబడ్డారన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు -
సోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026
రైతు భరోసా నిధులు విడుదల● మొదటి విడతలో రూ.110.45 కోట్లు విడుదల మెదక్జోన్: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరో సా నిధులు విడుదల చేసింది. తొలుత ఎకరం వరకు ఉన్న రైతులకు నేటి నుంచి ఖాతాల్లో జమ కానుంది. జిల్లాలో 3.65 లక్షల ఎకరాల సాగు భూములు ఉండగా, ఈ ఏడాది కొత్తగా మరో 10,694 ఎకరాల పార్ట్(బీ) భూములకు పట్టాలు అందజేశారు. దీంతో మొత్తం 3,75,694 ఎకరాలకు చేరుకుంది. ఎకరాకు రూ.6000 చొప్పున, మొత్తం 225.41 కోట్లు అవసరం కానున్నాయి. మూడు విడతల్లో ఈ నిధులను కర్షకుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి విడతలో 1,84,084 ఎకరాలకు గానూ రూ.110.45 కోట్లు విడుదలయ్యాయి. మిగితా 1,91,610 ఎకరాలకు మరో రెండు విడతల్లో నిధులు విడుదల చేయనున్నారు. కాగా యాసంగి పనులు జనవరి నుంచి ప్రారంభం కాగా, ప్రభుత్వం మూడు నెలల అనంతరం పెట్టుబడి సాయం విడుదల చేసింది. మిగితా రెండు విడతలు ఏప్రిల్లో అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇదిలా ఉండగా 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, అదే ఏడాది వానాకాలంలో ఎకరాకు రూ. 6 వేల చొప్పున ఇచ్చింది. 2024 వానాకాలంలో రైతు భరోసా ఇవ్వలేదు. ఈ ఏడాది యాసంగికి సంబంధించి ప్రస్తుతం నిధులు విడుదల చేసింది. ముక్క తగ్గనంటోంది.. ముద్ద దిగనంటోంది ● రూ.360కి చేరిన కిలో చికెన్పార్టీ బలోపేతానికి కృషి చేయాలి రామాయంపేట(మెదక్): బీజేపీ బలోపేతం దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయా లని పార్టీ మూడు జిల్లాల ఇన్చార్జి రంజిత్ మోహన్ పిలుపునిచ్చారు. రామాయంపేటలో కొనసాగుతున్న పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమస్యలపై ప్రజలతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ లకు వివరించి వారిని చైతన్యపర్చాలన్నారు. పదేళ్లలో మోదీ ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారని, యువతను పార్టీలోకి ఆహ్వానించాలని రంజిత్ మోహన్ సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ నాయకులు వెల్ముల సిద్దరాంలు, నవాత్ రాజేంద్రప్రసాద్, ఆకుల రమేశ్, పోలీస్ దేవెందర్, పార్టీ మండలాధ్యక్షుడు నవీన్గౌడ్, పట్టణాద్యక్షుడు అవినాశ్రెడ్డి, వీహెచ్పీ జిల్లా అద్యక్షుడు సత్యం, అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి పాల్గొన్నారు. -
పోరాటాల ఫలితమే..
సిద్దిపేటజోన్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా వత్తిడి చేయడం వల్లే సర్కారు దిగివచ్చిందని, మా పోరాటాల ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కజొన్న క్వింటాల్కు రూ.2400 మద్దతు ధర ఉండగా, సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది రైతులు దళారులకు రూ.1600 నుంచి రూ.1700 అమ్మి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే 25శాతం మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఇప్పటికై నా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సన్ఫ్లవర్ క్వింటాల్ రూ.7,721 మద్దతు ధర ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఒకప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో 8వేల ఎకరాల్లో యాసంగికి సాగు ఉండేదని, కాళేశ్వరం పుణ్యమా అని పదింతలు పెరిగి 80 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందన్నారు. కాళేశ్వరం వచ్చాక కరువు అనే పదం లేదన్నారు. జిల్లా వ్యవసాయ రూపురేఖలు మార్చిన ఘనత కాళేశ్వరానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే కొనుగోలుకేంద్రాల ఏర్పాటు సర్కారు నిర్లక్ష్యంతో ఇప్పటికేదిగుబడులు దళారుల చేతుల్లోకి మాజీ మంత్రి హరీశ్రావు -
నేడు సిద్దిపేటకు సీఎం రాక
సాక్షి, సిద్దిపేట: సీఎం రేవంత్రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత రెండో సారి సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నర్మేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారు. అక్కడే వర్చువల్గా పలువాటికి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. రూ.300 కోట్ల వ్యయంతో పామాయిల్ ఫ్యాక్టరీని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. గంటకు 120 టన్నుల పామాయిల్ గెలలను క్రష్ చేసి నూనె తీయనుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఈనెల 19న రైతు మహోత్సవ ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల పోటాపోటీ నినాదాలతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ముందస్తు చర్యలలో భాగంగా ఐజీ చంద్రశశేఖర్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభ ఏర్పాట్లను ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, కలెక్టర్ హైమావతి, ఐజీ చంద్రశేఖర్, సీపీ రష్మీ పెరుమాళ్ పర్యవేక్షించారు. 900 మంది పోలీస్ సిబ్బంది, అధికారులతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను గుర్తించి ముందస్తుగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పటిష్ట బందోబస్తు నంగునూరు(సిద్దిపేట): నర్మేటలోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఐజీ చంద్రశేఖర్రెడ్డి తోపాటు ఇంటెలిజెన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఫ్యాక్టరీని సందర్శించి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరిమాళ్ తోపాటు భద్రతా సిబ్బంది, పోలీస్ అధికారులతో సమాలోచన చేశారు. సీఎం రేవంత్ హెలికాప్టర్లో వచ్చి.. తిరిగి రోడ్డు మార్గంలో వెళ్లే అవకాశం ఉండటంతో సిద్దిపేట నుంచి ఫ్యాక్టరీ వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.ఏర్పాట్లపై మంత్రుల ఆరా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఐజీ, కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు పోలీసుల పటిష్ట బందోబస్తు -
చేయూతనివ్వరూ!
బడ్జెట్లో కొత్త పింఛన్ల ప్రకటనపై వృద్ధుల్లో నిరాశ ‘పాపన్నపేట మండలం గాంధారిపల్లికిచెందిన అంకిడి మరియమ్మ భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. మరుసటి ఏడాది ఒక్కగానొక్క కొడుకు ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిల్లు అయ్యాయి. ప్రస్తుతం ఉపాధిహామీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. నాలుగేళ్లుగా వృద్ధాప్య పింఛన్ కోసం ఎదురుచూస్తోంది. అయినా అతీగతి లేదు’ ఇలా జిల్లాలో వేలాది మంది పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా వారి వేదన అరణ్య రోదనే అవుతుంది. మెదక్ అర్బన్: పండుటాకుల ఆశలపై బడ్జెట్ నీళ్లు చల్లింది. సామాజిక పింఛన్లకు గతేడాది బడ్జెట్నే ప్రతిపాదించారు. అయితే అర్హులైన వారికి రెండు లక్షల కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. అంటే 2023 డిసెంబర్ చివరి నుంచి గత నెల చివరి వరకు వివిధ కేటగిరిల కింద పింఛన్ పొందుతున్న వారిలో మరణించిన వారు, అనర్హులు, ఇతర కారణాలతో పింఛన్లు కోల్పోయిన వారి స్థానంలో అర్హులైన కొత్తవారికి ఇచ్చే అవకాశం. ఈలెక్కన చూస్తే మండలానికి 10 పింఛన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల హామీలో ఇచ్చినట్లుగా వివిధ రకాల పింఛన్లు రూ. 2,016 నుంచి రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లు రూ.4,016 నుంచి రూ.6 వేలకు పెంచే అవకాశం కూడా కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. జిల్లాలో 1,09,116 పింఛన్ పొందుతున్న వారు ఉన్నారు. వీరికి నెల నెలా రూ.24,92,56,832 పంపిణీ చేస్తున్నారు. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 35,846, వితంతు 43,515, దివ్యాంగ 7,997, గీత కార్మికులు 838, చేనేత 447, ఫైలే రియా 455, డయాలిసిస్ 160, బీడీ కార్మికులు 15,656, ఒంటరి మహి ళలు 4,102 మంది ఉన్నారు.నాలుగేళ్లుగా దరఖాస్తుల పెండింగ్ గతంలో 61 ఏళ్లు ఉన్న వృద్ధాప్య పింఛన్ వయస్సును 57 ఏళ్లకు తగ్గించారు. ఆగస్టు 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు డీఆర్డీఓ కార్యాలయంలో 1,287 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సైట్ ఓపెన్ కాకపోవడంతో తీసుకున్న దరఖాస్తులు పంచాయతీ కార్యదర్శుల వద్ద, మండల పరిషత్ కార్యాలయాల్లో కుప్పలు, తెప్పలుగా పడి ఉన్నాయి. మొత్తం మీద జిల్లాలో సుమారు 10 వేలకు పైగా పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మండలానికి 10 మందికి మాత్రమే వచ్చే అవకాశం! జిల్లాలో వేలాది మంది ఎదురుచూపు -
మాయ‘దారి’ మృత్యుపాశం
కొల్చారం(నర్సాపూర్): మెదక్– నర్సాపూర్– హైదరాబాద్(బాలానగర్) 765డీ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. మండల పరిధిలో ఒకేలేన్గా ఉన్న ఈరోడ్డును విస్తరణలో భాగంగా 2021లో రెండు వరసల్లో జాతీయ రహదారిగా విస్తరించారు. మండల శివారులోని లోతు వాగు నుంచి రాంపూర్ వరకు మలుపులతో కూడి ఉన్న ఈ జాతీయ రహదారి ప్రస్తుతం వాహనదారుల పాలిట మృతిదారిగా తయారైంది. గడిచిన వారం రోజుల్లో ఆరుగురు ఈ రహదారిపై వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈనెల 14న రంగంపేటకు ఓ శుభకార్యానికి వచ్చిన హవేళిఘణాపూర్ వాసులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బైక్పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈనెల 18న పోతంశెట్టిపల్లి వద్ద మెదక్ వైపు నుంచి వస్తున్న ఆటోను వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్తో పాటు ప్రయాణికుడు దుర్మరణం చెందారు. తాజాగా శనివారం బైక్పై వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఐఎంఎల్ డిపోకు చెందిన నగేశ్ మృత్యువాతపడ్డాడు.అతివేగమే ప్రమాదాలకు కారణం! అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు చోట చేసుకుంటున్నాయని పోలీసుల విచారణలో తేలింది. దీనికి తోడు జాతీయ రహదారి మధ్యలో డివైడర్ లేకపోవడం, మలుపులు కూడా ఉండడం మరో కారణంగా తెలుస్తోంది. ఇదే విషయమై కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మైనొద్దీన్ను ఆరా తీయగా.. రోడ్డుపైకి వచ్చే ముందు వాహనాలు నడిపే వ్యక్తులు జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహ నాల వేగాన్ని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఇదే సమయంలో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో తలకు బలమైన గాయాలై చనిపోతున్నారు. వాహనదారులు జాగ్రత్తలు వహిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ప్రమాదాలకు నిలయంగాఎన్హెచ్– 765డీ వారంలో ఆరుగురు మృత్యువాత -
2,650 మంది రైతుల తరలింపు
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన రైతు ఉత్సవాల’ కార్యక్రమంలో జిల్లా రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. నేడు సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్రెడ్డి ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లా పరిధిలోని 21 మండలాలకు చెందిన 2,650 మంది రైతులను 53 బస్సుల ద్వారా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం పెద్దశంకరంపేట(మెదక్): మండలంలోని 33 కేవీ సబ్స్టేషన్ పరిధిలో నూతన ఫీడర్ విస్తరణలో భాగంగా ఆదివారం విద్యుతత్్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఏఈ శ్యాంసుందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చెట్ల తొలగింపు, మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈవిషయాన్ని ప్రజలు గమనించి, సహకరించాలని కోరారు. 24న కలెక్టరేట్ ఎదుట ధర్నా మెదక్ కలెక్టరేట్: ప్రజాసమస్యలపై ఈనెల 24న కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య తెలిపారు. శనివారం మెదక్లోని కేవల్ కిషన్ భవన్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో అనేక గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభం కాలేదన్నారు. పని ప్రారంభించిన చోట కూలీలకు సరైన డబ్బులు రావడం లేదన్నారు. ధర్నాకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు నర్సమ్మ, మల్లేశం, బాలమణి, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి డీసీసీ ఉపాధ్యక్షుడు యాదగిరి రామాయంపేట(మెదక్): కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని డీసీసీ ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికై న చింతల యాదగిరి అన్నారు. శనివారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై నమ్మకంతో పార్టీ పెద్దలు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే రోహిత్, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, కౌన్సిలర్ నాగరాజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీహెచ్ఈఎల్ నుంచి గోవాకు బస్సు సర్వీసులుపటాన్చెరు: బీహెచ్ఈఎల్ డిపో నుంచి కుక్కే సుబ్రహ్మణ్యస్వామి, ఉడుపి, మురుడేశ్వర, గోకర్ణ మీదుగా 25వ తేదీన గోవాకు సర్వీస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ మోహన్రావు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వీకెండ్లలో గోవాకు ఒక్కరి రూ.6,150 టికెట్ ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక కాలనీలో కనీసం 30మంది విహారయాత్రలకు, పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బీఓసీ కింద బస్సులు నడపనున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకోసం 9063401072 సంప్రదించాలని సూచించారు. -
హత్యాయత్నం చేసిన వారికి బెయిలా?
మాట్లాడుతున్న ఎంపీ రఘునందన్రావుపాపన్నపేట(మెదక్): పోలీసులపై కాల్పులు జరిపిన డ్రగ్స్ ముఠాపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించాలని ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని లక్ష్మీనగర్లో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ అభియాన్ కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులపై తుపాకులతో కాల్పులు జరిపిన డ్రగ్స్ ముఠాకు స్టేషన్ బెయిల్ ఇచ్చింది తెలంగాణ పోలీసులే అన్నారు. డీజీపీ ఫాంహౌస్ సీసీ ఫుటేజీ చూసి నిష్పక్షపాత విచారణ జరపాలన్నారు. దోషులు ఎంతటి వారైన కఠిన శిక్ష పడేలా కేసులు నమోదు చేయాలని కోరారు. పైలెట్ రోహిత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈవిషయమై మాట్లాడవద్దని తనకు బీజేపీ పెద్దలెవరూ చెప్పలేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచమంతా అతలాకుతలమవుతుంటే, భారత ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. ప్రజలందరూ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్గౌడ్, జగిత్యాల జిల్లా ఇన్చార్జి గడ్డం శ్రీనివాస్, ప్రశిక్షణ జిల్లా కన్వీనర్ రంజిత్రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ, జనగామ జిల్లా ప్రచారి నందారెడ్డి, నాయకులు సు భాష్గౌడ్, సుధాకర్, ఎంఎల్ఎన్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు సంతోష్చారి తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
ఆస్పత్రి కార్యాలయ అధికారి సరెండర్
పెండింగ్ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకు మోక్షం మెదక్ అర్బన్: మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మంజూరులో అవినీతికి, అలసత్వానికి పాల్పడిన సర్వజన ఆస్పత్రి కార్యాలయ సూపరింటెండెంట్ లతీఫొద్దీన్ ముజాహిద్దీన్ను తదుపరి చర్యల నిమిత్తం రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుడు సరెండర్ చేసినట్లు మెదక్ సూపరింటెండెంట్ సునీత తెలిపారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మంజూరులో ముజాహిద్దీన్పై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు జిల్లా అధికారులు స్పందించారు. ఈనెల 13న ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించి, రికార్డులు పరిశీలించారు. అనంతరం సంబంధిత డిపార్డ్మెంట్కు నివేదిక అందజేసేందుకు అవసరమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈలోగా సూపరింటెండెంట్ కార్యాలయం ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. అతడిపై వచ్చిన ఆరోపణలు, ప్రవర్తన, ఫైళ్ల పరిష్కారంలో జాప్యం, తీవ్రమైన అక్రమాలను గుర్తించింది. ఈమేరకు ముజాహిద్దీన్ను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెండింగ్ ఫైళ్లను సైత్తం క్లియర్ చేశారు. -
మసీదుల వద్ద పటిష్ట భద్రత
మెదక్ కలెక్టరేట్: రంజాన్ను పురస్కరించుకుని నవాబ్పేట్లోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను అదనపు ఎస్పీ మహేందర్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈసందర్భంగా ఈద్గా పరిసరాల్లో భద్రతా చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. జిల్లా కేంద్ర పరిధిలోని మసీదుల వద్ద పటిష్ట భద్రత కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ప్రత్యేక పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసి, రద్దీ ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించినట్లు వివరించారు. పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తామన్నారు. ముస్లింలు పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ మహేష్, సిబ్బంది ఉన్నారు. అదనపు ఎస్పీ మహేందర్ -
పండుగలా రైతు మహోత్సవం
భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు నంగునూరు(సిద్దిపేట): నర్మేట ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు అన్నదాతలను ఆకట్టుకుంటున్నాయి. ఉద్యాన, ఇరిగేషన్, మార్క్ఫెడ్, వ్యయ సాయ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, నల్లగొండ, జనగాం, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి వచ్చిన రైతులు ఒక్కో స్టాల్ తిరుగుతూ పనిముట్లు, పంటసాగుపై ఆరా తీశారు. ఒక్కో స్టాల్ వద్ద ఆయా కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వివరించారు. ఆకట్టుకున్న పాల యంత్రం పీవీ నరసింహారావు తెలంగాణ యూనివర్సిటీ కాలేజీ విద్యార్థులు విద్యుత్తో నడిచే మీగడ తయారీ యంత్రంలో పాలు పోసి చేసే విధానాన్ని ప్రదర్శించారు. యంత్రంలో పోసిన పాలను వివిధ రూపాల్లో వేడి చేయడం ద్వారా గంటలో పెరుగు, నెయ్యి, పాలకోవ, మజ్జిగ, పన్నీర్, మిల్క్పౌడర్, జున్ను పాల ఉత్పత్తులను ఏలా తయారు చేయవచ్చో వివరించారు. చిన్న పరిశ్రమలు పెట్టుకునే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని కళాశాల విద్యార్థి రైతులకు వివరించారు. డ్రిప్ ద్వారా నీటి ఆదా ఆయిల్పామ్ సాగు తోపాటు బిందు సేద్యానికి ప్రాధాన్యత పెరగడంతో స్టాల్లో ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలను అన్నదాతలు ఆసక్తిగా గమనించారు. -
ట్రామా కేర్ ఏదీ?
ఈనెల 4న రాత్రి చేగుంట మండలం నర్సంపల్లి తండాకు చెందిన సాయికుమార్ తన స్నేహితులతో కలిసి బైక్పై వెళ్తుండగా.. రామాయంపేట శివారులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సాయికుమార్ మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందితే ఆ యువకుడు బతికేవాడు. జనవరి 28న కామారెడ్డి జిల్లా బస్వాపూర్కు చెందిన బాలరాజు తన కుటుంబంతో కలిసి ఆటోలో పాతూర్ వెళ్తున్న క్రమంలో అక్కన్నపేట వద్ద ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి భార్య సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది. బాల్రాజును హైదరాబాద్ తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ ఉంటే అతడు బతికే అవకాశాలు ఉండేవని పలువురు పేర్కొంటున్నారు. రామాయంపేట(మెదక్): రామాయంపేట మీదుగా 44వ నంబర్ జాతీయ రహదారితో పాటు 765 డీజీ హైవే వెళ్తోంది. కాగా ఈ రెండు జాతీయ రహదారులపై నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. క్షత్రగాత్రులను హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో చాలా మంది మార్గమధ్యలోనే మృత్యువాత పడుతున్నారు. ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ ఉంటే చాలా మంది బతికే అవకాశాలుంటాయి. కాగా గత ప్రభుత్వం జిల్లాలో ప్రత్యేకంగా ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మెదక్తో పాటు పొరుగున ఉన్న కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దులో ఉన్న రామాయంపేటకు సైతం గతంలో ట్రామా కేర్ సెంటర్ మంజూరైనా, అతీగతీ లేకుండా పోయింది. జిల్లాలో ఒక్క సెంటర్ లేదు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గతంలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. జిల్లాలో రామాయంపేట, చేగుంట, తూప్రాన్ మండలాల మీదుగా 56 కిలోమీటర్ల మేర 44వ జాతీయ రహదారి, 58 కిలోమీటర్ల మేర 765 డీజీ హైవే విస్తరించి ఉంది. ఈరెండు రహదారులపై ప్రతి రోజు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. క్షత్రగాత్రులను గోల్డెన్ అవర్లో సకాలంలో ఆస్పత్రికి తరలిస్తేనే బతికే అవకాశాలుంటాయి. ఏ మాత్రం ఆలస్యమైన ఫలితం ఉండదు. నూతనంగా నిర్మించిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రామా కేర్ సెంటర్కు సరిపడా స్థలం ఉంది. ప్రస్తుతం ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ను మాత్రమే వినియోగిస్తున్నారు. మొదటి, రెండో అంతస్తులు నిరుపయోగంగా ఉన్నాయి. వీటిలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిపాదనలు పంపాం జిల్లాలో జాతీయ రహదారి వెంట ఉన్న రామాయంపేట, నర్సాపూర్లో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు కోసం తా ము ప్రతిపాదనలు పంపాం. ఇప్పటివరకు ఎలాంటి మంజూరు రాలేదు. త్వరలో మంజూరయ్యే అవకాశం ఉంది. – శ్రీరాం, డీఎంహెచ్ఓ -
గ్యారంటీలకు నిధులేవి?
నర్సాపూర్: ప్రజలను మభ్యపెట్టే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్తో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. ఇప్పటి వరకు మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు నిధులు సైతం ప్రభుత్వం కేటాయించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులవి మాటలే తప్ప చేతల్లో ఏమి ఉండటం లేదన్నారు. ఇప్పటికై నా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీకి రూ.89 లక్షల ఆదాయంగజ్వేల్: మున్సిపాలిటీకి తెబజార్, పశువుల సంత వేలం ద్వారా రూ.89లక్షల ఆదాయం సమకూరింది. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గంగిశెట్టి చందన, కమిషనర్ వెంకటగోపాల్ ఆధ్వర్యంలో ముందుగా తైబజార్ వేలం జరిగింది. ఇందులో 21మంది పాల్గొనగా..ఈ భిక్షపతి అత్యధికంగా రూ.70లక్షలు పాట పాడి దక్కించుకున్నారు. -
గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
పాపన్నపేట(మెదక్)/టేక్మాల్: గ్యాస్, యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. శుక్రవారం పాపన్నపేటలోని రైతు ఆగ్రో సెంటర్, ప్యాక్స్ సెంటర్లను పరిశీలించారు. అందులో ఉన్న యూరియా, ఎరువుల నిల్వ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అలాగే గ్యాస్ బుకింగ్ రికార్డులను చూశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు కలుగకుండా సేవలు అందించాలని సూచించారు. అవకతవకలు చోటు చేసుకుంటే, సంబంధిత దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ సతీశ్, ఇతర అధికారులు ఉన్నారు. అలాగే టేక్మాల్ మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ఆగ్రో సేవా కేంద్రాన్ని, గ్యాస్ గోదాంను పరిశీలించారు. కేజీవీబీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. జిల్లాలో సరిపడా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయన్నారు. ఆయన వెంట తహసీల్దార్ తులసీరామ్, వ్యవసాయ అధికారి రాంప్రసాద్, ఆర్ఐ సాయి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
సంక్షేమ పద్దు పొడుపు
అసెంబ్లీలో శుక్రవారం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన పద్దు సంక్షేమ మంత్రం జపించింది. అన్నివర్గాలను లక్ష్యంగా చేసుకుని వరాల వాన కురిపించింది. విద్యార్థులను మురిపించి.. అన్నదాతలను మెప్పించి.. పేదలకు బీమా కల్పిస్తూ బడ్జెట్ పద్దు బహుబాగు అనిపించింది. అదే సమయంలో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు ఏమి జరగపోవడం నిరాశ కలిగించింది. – మెదక్జోన్ ఇందిరమ్మ బీమా పథకాన్ని బడ్జెట్లో కొత్తగా ప్రవేశపెట్టారు. కుటుంబ యజమాని ఏదేని కా రణంతో మరణిస్తే ఈ పథకం ద్వారా రూ. 5 లక్షల బీమా వర్తించనుంది. దీంతో జిల్లాలో 1,68,365 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అలాగే ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే విద్యార్థులకు వారంలో 3 రోజులు పాలు, మరో 3 రో జుల పాటు రాగిజావ అందించనున్నారు. జిల్లావ్యాప్తంగా 75,263 మంది విద్యార్థులు ఈపథకం ద్వారా మేలు చేకూరనుంది. ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించనున్నారు. జిల్లాలోని 16 ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే 6,585 మంది విద్యార్థులకు లబ్ధి జరగనుంది. అంతేకాకుండా దివ్యాంగ విద్యార్థులకు ద్విచక్ర వాహనాలు అందనున్నాయి. కొత్త పెన్షన్లకు మోక్షం ఎన్నో ఏళ్లుగా చేయూత పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొత్త పెన్షన్లకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 1,200 మంది ఆన్లైన్, మరో 6 వేల పైచిలుకు మంది ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరికి త్వరలో కొత్త పింఛన్లు అందనున్నాయి. అలాగే రాజీవ్ యువ వికాసం కోసం బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటా యించారు. జిల్లాలో నిరుద్యోగ యువత సుమారు 19 వేల పైచిలుకు ఉన్నట్లు తెలిసింది. వారందరికీ ఈ పథకం ద్వారా ఉపాధి లభించనుంది. అలాగే అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటీసీ) సెంటర్లలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగులకు నెలకు రూ. 2 వేల చొప్పున స్కాలర్షిప్ అందిస్తామని చెప్పడంతో, జిల్లాలో 170 మందికి మేలు జరగనుంది. పెట్రోల్, డీజిల్తో నడిచే ఆటోలను ప్రభుత్వ ఖర్చుతో ఎలక్ట్రానిక్ వాహనాలుగా మారుస్తామన్నారు. జిల్లాలో 10,734 ఆటోవాలాలు ఉన్నారు. సన్నాలకు నిధులు.. అలాగే సన్న ధాన్యానికి బడ్జెట్లో రూ. 3,500 కోట్ల నిధులు కేటాయించారు. జిల్లాలో గత యాసంగిలో 40 వేల ఎకరాల్లో రైతులు సన్నాలు సాగు చేయగా, రూ.31.37 కోట్ల బకాయిలు నేటికీ చెల్లించలేదు. ప్రస్తుతం రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. అలాగే ఉద్యోగులకు, పెన్షన్దారులకు నగదు రహిత వైద్యం అందించనున్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.20 కోట్ల బీమా ఇస్తామని ప్రకటించారు. జిల్లాలో 5 వేల పైచిలుకు ఉద్యోగులు, పెన్షన్దారులు ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్నారులకు ఏడాదికి రెండు జతల యూనిఫాంలు ఇవ్వనున్నారు. జిల్లాలో 25,245 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. అలాగే రైతు భరోసా కింద జిల్లాలోని 2.62 లక్షల మంది రైతులకు సుమారు రూ.220 కోట్ల పెట్టుబడి సాయం అందనుంది. ఈ‘సారీ’ నిరాశే మెతుకుసీమలో ఏకై క మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్ స్థిరాయకట్టు కేవలం 25 వేల ఎకరాలు మాత్రమే. దాని ఎత్తు పెంపు కోసం చాలా కాలంగా రైతులు ఎదురుచూస్తుండగా, ఈసారి నిరాశే మిగిలింది. అలాగే కాళేశ్వరం కెనాళ్ల పనులకు నిధులు కేటాయించలేదు. మెదక్ బైపాస్ రోడ్డు ప్రస్తావనకు రాలేదు. బడ్జెట్లో అన్ని రంగాలకుకేటాయింపులు -
ఇంటి నిర్మాణాలకు వెనకడుగు
● జిల్లాలో మొదటి విడతలో 9,209 ఇళ్లు మంజూరు ● ప్రారంభించినవి 5,337 మాత్రమే పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లు మంజూరు చేసింది. అయితే ఇళ్లు మంజూరై తొమ్మిది నెలలు గడిచినా, ఇప్పటివరకు 30 శాతం మంది నిర్మాణాలు ప్రారంభించలేదు. కాగా వారి పేర్లను జాబితా నుంచి తొలగించి అర్హులైన వారికి అధికారులు ఇళ్లు మంజూరు చేస్తున్నారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 21 మండలాలు ఉండగా, మొదటి విడతలో 9,209 ఇళ్లు మంజూరయ్యాయి. గడిచిన తొమ్మిది నెలల్లో ఇప్పటివరకు 5,337 మంది లబ్ధిదారులు మాత్రమే ఇళ్ల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఈ లెక్కన ఇంకా 3,827 మంది నిర్మాణాలు ప్రారంభించలేదు. దీంతో వారి పేర్లను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇలా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 500 మంది పైచిలుకు పేర్లను జాబితా నుంచి తొలగించారు. వారి స్థానంలో అర్హులైన 482 మంది లబ్ధిదారుల పేర్లను కొత్తగా జాబితాలో చేర్చారు. నిబంధనల ప్రకారం లబ్ధిదారుడు 45 రోజుల్లో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలి. లేనిచో ఆ ఇంటిని రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. కాగా పూరిగుసెలో నివాసం ఉంటున్న వారు ఇంటి నిర్మాణం ప్రారంభించక పోయినా, వారి పేర్లు మాత్రం జాబితా నుంచి తొలగించలేదు. వారికి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ ఆర్థికంగా వెనుకబడి, స్వయం సహాయక గ్రూపు సభ్యులై ఉంటే వారికి సదరు గ్రూపు నుంచి రూ.లక్ష వరకు అప్పు ఇప్పించి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నారు. గ్రూపులో లేని వారిని గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. నేతల ప్రమేయంతోనే ఎంపిక ఇందిరమ్మ ఇళ్ల కోసం నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా, రాజకీయ నాయకుల ప్రమేయంతోనే అధికారులు అర్హుల జాబితా తయారు చేసినట్లు తెలిసింది. దీంతో ఇళ్లు మంజూరైన వారికి ఉండేందుకు ఇళ్లు ఉండటంతోనే నిర్మాణాలు ప్రారంభించ లేదని తెలిసింది. ఇక రెండో విడత లబ్ధిదారుల ఎంపికలోనైనా రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్హులకే ఇళ్లు మంజూరు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి 9 నెలలు గడుస్తోంది. నేటికీ నిర్మాణాలు ప్రారంభించని వారి పేర్లు జాబితా నుంచి తొలగించి అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చుతున్నాం. పూరి గుడిసెలో ఉండే వారి పేర్లు మాత్రం ప్రస్తుతానికి తొలగించటం లేదు. – మాణిక్యం, హౌసింగ్ పీడీ -
ఊరూరా.. ఉగాది సందడి
● ‘పరాభవ’కు ఘన స్వాగతం పలికిన జిల్లా ప్రజలు ● ఆలయాల్లో పూజలు.. పంచాంగ శ్రవణం మెదక్ కలెక్టరేట్: తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని గురువారం జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఊరూవాడ పరాభవ నామ సంవత్సరానికి ఘనస్వాగతం పలికారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఇంటా నూతన మట్టికుండల్లో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారు చేసి పిల్లలు, పెద్దలు పంచుకున్నారు. భక్షాలు తయారు చేసి కుటుంబ సభ్యులంతా ఆరగించారు. సాయంత్రం అన్ని గ్రామాల కూడళ్లు, దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయం, రామాలయంలో పూజారి వైద్య శ్రీనివాసశర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ నూతన సంవత్సరంలో అకాల వర్షాలతో కొంత నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటాయన్నారు. అంతకుముందు మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఉగాది పండుగ వేళ మెదక్ కూరగాయల మార్కెట్ జనంతో కిటకిటలాడింది. మట్టి కుండలు, వేప పువ్వు, మామిడి కాయలు, ఆకులు విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. -
గ్యాస్ కష్టాలు.. కళ్లకు కట్టెనట్టు
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలో గ్యాస్ కొరత గృహాలు, హోటళ్లకు తాకింది. దీంతో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. హోటల్లో టిఫిన్ ధరలు అమాంతం పెంచారు. మండల కేంద్రంలోని కౌడిపల్లిలో గత వారం రోజులుగా గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. బుక్ చేసినా స్టాక్ లేక సిలిండర్ దొరకడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాగా హోటల్ యజమానులు గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. కాగా కౌడిపల్లిలో ఇన్నాళ్లు ప్లేట్ టిఫిన్ ధర రూ.30 ఉండగా, ప్రస్తుతం రూ. 40కు పెంచారు.కౌడిపల్లి: హోటల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న నిర్వాహకులు -
61 మందితో డీసీసీ కార్యవర్గం
మెదక్జోన్: జిల్లా కాంగ్రెస్ కమిటీలో 61 మందికి చోటు కల్పిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ గురువారం జాబితా విడుదల చేశారు. డీసీసీ అధ్యక్ష స్థానానికి ప్రధానంగా నలుగురు పోటీపడగా ఆంజనేయులుగౌడ్ను రెండోసారి నియమించిన విషయం తెలిసిందే. కాగా జిల్లా కార్యవర్గంలో 61 మంది సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు చోటు కల్పించారు. అందులో 14 మంది వైస్ ప్రెసిడెంట్లు, 20 మంది జనరల్ సెక్రటరీలు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 20 మంది సెక్రటరీలు, ఒకరిని ట్రెజరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార ప్రతినిధులుగా జె. నర్సింహచారి, శెట్టి శ్రీకాంత్, బండారి గంగాధర్, లూనావత్ రాణినాయక్, శ్రీనివాస్రావు, మహేశ్వరరెడ్డి, ట్రెజరీగా శివరామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులుగా మన్నె విజయభాస్కర్, నర్సింహారెడ్డి, గడప దేవేందర్, కొడకంటి హరిత, దేమ యాదగిరి, ప్రశాంత్రెడ్డి ఎరుకల నర్సింహా, శ్రీనివాస్రెడ్డి, ప్రవీణ్ కుమార్రెడ్డి, యాదగిరి, సిద్దిరాములు, నరేందర్రెడ్డి, అశోక్, పాషా, జనరల్ సెక్రటరీలుగా, అశోక్రెడ్డి, రాజేంద్ర పాటీల్, నవీన్ కుమార్, రాజాగౌడ్, ఎండీ అఫ్సర, శశిభూషణ్రెడ్డి, నర్సింగ్నాయక్, ప్రేమ్కుమార్, వినోద్కుమార్, విద్యాసాగర్, అమీరుద్దీన్, రమేష్, శేక్ సల్మాన్, కుమార్, రమేష్గౌడ్, గోపీనాయక్, శ్రవణ్కుమార్, మేఘమాల, సిద్దిరాములుగౌడ్, శేఖులుతో పాటు సెక్రటరీలుగా మరో 20 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
నేత్రపర్వం.. శతఘటాభిషేకం
వర్గల్(గజ్వేల్): ఉగాది పర్వదిన శుభవేళ దేవదేవుని అష్టోత్తర శతకలశ మహాభిషేకం నేత్రపర్వం చేసింది. నాచగిరీశుడు లక్ష్మీనృసింహుని దివ్యదర్శనంతో భక్తజనావళి తరించింది. సుప్రసిద్ధపుణ్యక్షేత్రం నాచగిరిలో ఆధ్యాత్మిక అనుభూతులు పంచిన బ్రహ్మోత్సవాలు గురువారం అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిశాయి. ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి, చైర్మన్ రవీందర్గుప్తా పర్యవేక్షణ, ధర్మకర్తలు, తీర్థజనుల సమక్షంలో ఉదయం అర్చకులు ఆలయ మండపంలో 108 కలశాలు స్థాపన చేశారు. కలశ పూజ నిర్వహించారు. హోమం జరిపారు. పూర్ణ కలశంతో ఆలయ ప్రదక్షిణ చేసి నృసింహ నామార్చనలు, మంత్రోచ్ఛారణల మధ్య గర్భగుడిలో మూలవిరాట్టులకు మహాభిషేకం జరిపారు. పట్టువస్త్రాలు, పూలమాలికలు, సర్వాభరణాలతో శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామివారిని కమనీయంగా అలంకరించారు. భక్తులు నాచగిరీశుని దివ్యమంగళరూపం దర్శించుకుని తరించారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తీర్థం స్వీకరించారు. -
అన్నదాతకు భరోసా
మెదక్ అర్బన్: అన్నదాతల ఎదురుచూ పులు ఫలించే వేళ ఆసన్నమైంది. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి విడత రైతు భరోసా విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలో సుమారు 2,62,043 రైతులకు గానూ రూ.220.84 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఎకరానికి రూ.6 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మూడు సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించారు. 2023–24 యాసంగి సీజన్లో ఎకరానికి రూ. 5 వేలు, 2024–25 యాసంగిలో రూ. 5 వేలు, 2025–26లో వానాకాలం సీజన్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్ ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా, రైతు భరోసా నిధులు జమ చేయలేదు. గత వానాకాలంలో చాలా వరకు పంటలు దెబ్బతినడం, సకాలంలో పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సాగులో 2,86,225 ఎకరాలు జిల్లాలో యాసంగికి సంబంధించి 2,86,225 ఎ కరాల్లో పంటలు వేశారు. సుమారు 2,62,043 రైతులు ఉన్నారు. గత వానాకాలం లెక్కలకు సంబంధించి అప్పట్లో రైతు భరోసా కింద రూ.220,84,32,452 నిధులు విడుదలయ్యాయి. ఈసారి నిధులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధుల జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 22న ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు, 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరు లోపు మూడో విడతగా మొత్తం మంది రైతులకు భరోసా నిధులు జమచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్ను వివరణ కోరగా తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని తెలిపారు. 22 నుంచి పెట్టుబడి సాయం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ జిల్లాలో 2,62,043 రైతులు రూ.220.84 కోట్లు అవసరం -
ఆర్వో ప్లాంట్లు
అంగన్వాడీలకు●జిల్లాలో మొదటి విడతగా 268 కేంద్రాలకు మంజూరు ●వచ్చే నెలాఖరులోగా బిగింపుఅంగన్వాడీ కేంద్రాల్లో సురక్షిత తాగు నీరు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది. చిన్నారులు, గర్భిణులు కలుషిత నీటితో వ్యాధుల బారిన పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సాక్షం అంగన్వాడీ పోషణ్ 2.0 పథకం కింద నిధులు మంజూరు చేసింది. ఇందుకు గాను మొదటి విడతగా జిల్లాలో 268 కేంద్రాలను ఎంపిక చేసింది. – రామాయంపేట(మెదక్) జిల్లాలో ఇలా.. అంగన్వాడీ కేంద్రాలు 1,076 సొంత భవనాలు 369 ఆర్వో ప్లాంట్ల మంజూరు 268 కేంద్రాల్లో చిన్నారులు 54 వేల పైచిలుకు జిల్లాకు మంజూరైన ఆర్వో ప్లాంట్లను ప్రాధాన్యత క్రమంలో సొంత భవనాలు, విద్యుత్ సదుపాయం ఉన్న కేంద్రాలను మొదటి విడతగా ఎంపిక చేశారు. తర్వాత మిగితా కేంద్రాలకు ప్లాంట్లు మంజూరవుతాయని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పోషక విలువలున్న కూరగాయలు, ఆకుకూరలు పండించడానికి వీలుగా పోషణ్ వాటిక పథకం కింద కిచెన్ గార్డెన్లు నిర్వహిస్తున్నారు. ● -
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా భవాని
పెద్దశంకరంపేట(మెదక్): జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మండల కేంద్రానికి చెందిన అవుసుల భవాని నియమితులయ్యారు. గతంలో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఈక్రమంలో ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు అలకలాంబ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పిలుపు మేరకు తిరిగి ఆమె హస్తం పార్టీలో చేరారు. ఈమేరకు సోమవారం గాంధీభవన్లో నియామకపత్రం అందుకున్నారు. తనను తిరిగి జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన కాంగ్రెస్ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. చేగుంట(తూప్రాన్): రైతులు ఆయిల్పామ్ పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ సూచించారు. సోమవారం మండలంలోని పెద్దశివునూర్లో ఆయిల్పాం పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. నీటి సౌకర్యం తక్కువగా ఉన్న పొలాల్లో ఆయిల్పాం వేసుకోవాలన్నారు. ఒకసారి పంట వేసుకుంటే నాలుగో సంవత్సరం నుంచి 25 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. కోతుల బెడద లేకుండా ఉండటంతో పాటు అంతర పంటలు వేసుకుంటే ప్రభుత్వం పెట్టుబడి సాయం కోసం ఎకరాకు రూ.4 వేలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, సర్పంచ్ సర్సింలు, వ్యవసాయ విస్తరణ అధికారి భువనేశ్వరీ తదితరులు పాల్గొన్నారు. మెదక్జోన్: సఖీ, భరోసా సెంటర్లు మహిళలకు రక్షణగా నిలుస్తున్నాయని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ కరుణాకర్ తెలిపారు. సోమవారం పట్టణంలోని సఖీ, భరోసా కేంద్రాలతో పాటు బాలసదన్ చిల్డ్రన్ హోమ్ను సందర్శించారు. చిన్నారులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో అడ్వకేట్ బాలనర్సింలు, సఖీ సిబ్బంది రేణుక, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట(మెదక్): కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, మండలాధ్యక్షుడు నవీన్గౌడ్, పట్టణశాఖ అధ్యక్షుడు శీలం అనివాశ్రెడ్డి, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యం సోమవారం మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, ఈప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసగించిందని ఆరోపించారు. అంతకుమందు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్ఐకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి, పార్టీ జిల్లా నాయకులు రాజేంద్రప్రసాద్, చింతల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
గాలి వాన బీభత్సం
తూప్రాన్/పాపన్నపేట(మెదక్)/నర్సాపూర్/హవేళిఘణాపూర్: జిల్లాలోని పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. తూప్రాన్లో సోమవారం ఉదయం ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. గుండ్రెడ్డిపల్లి– మల్కాపూర్ గ్రామానికి వెళ్లే రహదారిపై భారీ వృక్షం విరిగిపడింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ స్థానికుల సహాయంతో రహదారిపై అడ్డంగా ఉన్న వృక్షాన్ని తొలగించా రు. అలాగే పాపన్నపేట, హవేళిఘణాపూర్ నర్సాపూర్, కొల్చారం మండలాల్లోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. -
మొగులు.. గుబులు
● భ యపెడుతున్న అకాల వర్షాలు ● వాతావరణ మార్పులతో రైతుల్లో కలవరం ● పాలు పోసుకునే దశలో వరిచేలు దుబ్బాక: రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. 20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలో పెద్దఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఈదెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ వాతావరణంలో మార్పులు అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈనెల 20 వరకు గాలివానతో కూడిన భారీ వర్షాలు, వడగళ్లు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సోమవారం వడగళ్ల వాన కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 60 శాతానికి పైగా వరి పంటలు పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఇప్పుడు గాలివాన, వడగళ్లు పడితే తీవ్ర నష్టం వాటిళ్లే అవకాశం ఉంది. జిల్లాలో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్ జలశయాల్లో సంవృద్ధిగా నీరు ఉండడంతో పెద్ద ఎత్తున రైతులు వరి సాగు చేశారు. రైతులు రూ. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు వేసుకోగా, తీరా చేతికొచ్చే దశలో ప్రకృతి ఆగం జేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
వార్డుల్లో సమస్యలపై ఆరా
మెదక్ కలెక్టరేట్: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పట్టణంలోని 1, 16, 17 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్ గౌడ్ పర్యటించారు. ఈసందర్భంగా ప్రజలతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయించారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కౌడిపల్లి(నర్సాపూర్): ఉపాధ్యాయులు అ ంకితభావంతో పనిచేసి విద్యార్థుల అ భ్యున్నతికి కృషి చేయాలని డీఈఓ విజయ అన్నారు. సోమవారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ గురుకుల పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, పరిసరాలు, పారిశుద్ధ్యం, కిచెన్రూంను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల గురించి ప్రిన్సిపాల్ హరిబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విధులు పట్ల అంకిభావంతో పనిచేయాలన్నారు. -
ఆద్యంతం.. భ క్తి పారవశ ్యం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజామున వరకు ఈ కార్యక్రమం ఉత్కంఠ భరితంగా సాగింది. మల్లన్న నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. భారీ సంఖ్యలో భక్తులు అగ్నిగుండాలను దాటారు. స్వామివారి కల్యాణ వేదిక ప్రాంగణంలో ఆదివారం రాత్రి 7.15 గంటలకు వీరభద్ర ప్రస్థానం, భద్రకాళి పూజ, 9 గంటలకు బియ్యం సుంకు పట్టుట. 12 గంటలకు అగ్నిగుండాల ప్రజ్వలన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు గురుపూజ, బలిహరణ, అగ్నిగుండాల ప్రవేశం, విజయోత్సవం, 11 గంటలకు స్వామి అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకం, మహామంగళహారతి, మంత్రపుష్పం.. అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అగ్నిగుండాల కార్యక్రమం శివశంకర శివాచార్య మహాస్వామి సేడం పీఠాధీశుల ఆధ్వర్యంలో కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, ఏఈఓలు సుదర్శనం, బుద్ధి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ ఉత్సవాల్లో సుమారు 12లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అంచనా. భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాల ప్రవేశం మారుమోగిన మల్లన్న నామస్మరణం ముగిసిన కొమురవెల్లి బ్రహ్మోత్సవాలు -
24 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే
చిన్నశంకరంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ సరాఫరా చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని సూరారంలో ఆమె మాట్లాడుతూ.. పంటలకు విద్యుత్ సరిగా అందకపో వడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. కనీసం 10 గంటలు కూడా అందించడం లేదని వా పోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకుంటే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతుభరోసా డబ్బులు అందరికీ ఒకేసారి విడుదల చేయాలన్నారు. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఆమె వెంట మాజీ జెడ్పీటీసీ పట్లోరి మాధవిరాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, నాయకులు లక్ష్మారెడ్డి, మహిపాల్రెడ్డి, సర్పంచ్ సావిత్రి, నాగరాజు ఉన్నారు. -
బాధితులకు చట్టపరంగా న్యాయం
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుమెదక్ కలెక్టరేట్: పోలీస్శాఖ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని, చట్టపరంగా అందరికీ న్యాయం చేస్తామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు. చట్టపరంగా న్యాయం చేయాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని తెలిపారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీస్శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజావాణి ద్వారా ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. తద్వారా ప్రజల్లో పోలీస్శాఖపై నమ్మకం మరింత పెరిగిందన్నారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి
మెదక్ కలెక్టరేట్: కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మారావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుకనుగుణంగా సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. అలాగే సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి అజయ్ కుమార్, కార్యదర్శులు నాగుల్ మీరా, శేఖర్, భీమ్లా నాయక్, నర్సింలు, తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, సీఆర్పీల జిల్లా అధ్యక్షుడు గట్టయ్య, కేజీబీవీల యూనియన్ రాష్ట్ర నాయకులు సుహాసిని, పూర్ణేశ్వర్ ఉమా, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ అధికారులను సస్పెండ్ చేయాలి’
మెదక్జోన్: జిల్లా కేంద్ర ఆస్పత్రి మెడికల్ బోర్డులో లంచాలు ఇచ్చిన వారి ఫైళ్లను మాత్రమే పరిష్కరిస్తున్న సదరు ఉద్యోగితో పాటు, అతడికి సహకరించిన వారందరిని వెంటనే సస్పెండ్ చేయాలని తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు చాలా తక్కువ మొత్తంలో మంజూరు చేయడం, విడుదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి అంశాలపై మెడికల్ బోర్డు ఏడీ విజయ్భాస్కర్కు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ప్రస్తుతం మెడికల్ బోర్డుపై ఏసీబీ దాడులు చేసిందని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్దు, కోశాధికారి మంగ నర్సింలు, సంతోష్, ప్రవీణ్, చేగుంట మండల అధ్యక్షులుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: పారిశుద్ధ్య కార్మికులు యాప్రాన్, గ్లౌజ్లు ధరించాలని, వారు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్ పేర్కొన్నారు. ప్రజాపాలనా–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం పారిశుద్ధ్య కార్మికులకు యాప్రాన్, గ్లౌజ్లు, మాస్క్లు పంపిణీ చేశారు. అనంతరం వైస్ చైర్మన్ నరేశ్గౌడ్ పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. రేడియంతో కూడిన యాప్రాన్లు ధరించడం వల్ల ప్రమాదాలు జరుగకుండా ఉంటాయని తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో శానిటేషన్ అధికారులు, జవాన్లు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ కలెక్టరేట్: పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు విషాదంగా మారకూడదని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలకు ఈత నేర్పించాలని స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ...ఏదైనా ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమన్నారు. గ్రామాల్లోని బావులు, చెరువుల వద్ద భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకుని చదువు లేదా ఇతర మంచి విషయాలు నేర్పించాలని ఆయన సూచించారు. న్యాల్కల్ (జహీరాబాద్): ఎండల తీవ్రత అధికమవుతుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికశాతం పాఠశాలల్లో ఫ్యాన్లు పాడైపోవడంతో ఉక్కపోతకు విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని అనంతరం మధ్యాహ్నం భోజనం పెట్టి వదిలి పెట్టాలని సూచించింది. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో విద్యార్థులకు ఎండల నుంచి కొంత మేర ఉపశమనం లభించింది. -
పోటెత్తిన నల్లపోచమ్మ ఆలయం
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి శ్రీ నల్లపోచమ్మ దేవి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి కుంకుమార్చన చేసి, ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. పలువురు భక్తులు తలనీలాలు సమర్పించి, వాహాన పూజలు జరిపించారు. »» -
జనగణన దేశాభివృద్ధికి కీలకం
● తొలిసారి డిజిటల్ పద్ధతిలో లెక్కింపు ● అదనపు కలెక్టర్ నగేశ్ మెదక్ కలెక్టరేట్: జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రూపొందించడానికి దోహదపడతాయని అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. మెదక్ సమీకృత కలెక్టరేట్లో ఆదివారం జిల్లాలో జనగణన–2027 సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండలస్థాయి అధికారులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికల తయారీకి జనగణన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాస్థాయిలో జనగణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన నిర్వహించనున్నట్లు తెలిపారు. మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్ను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. మే 11న నుంచి జూన్ 9వ తేదీ వరకు గృహాల గణన, రెండో దశలో జనగణన 2027 ఫిబ్రవరిలో జరుగుతుందని వివరించారు. మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణించడం జరుగుతుందన్నారు. మండలంలో తహశీల్దార్, మున్సిపాలిటీలో కమిషనర్ ఇంచార్జ్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓలు రమాదేవి, జయచంద్రారెడ్డి, రామకృష్ణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డీఎఫ్ఓ జోజీ, వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
బీసీలను ఓటు బ్యాంక్గా చూస్తోంది
పటాన్చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుంటుందని, ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీమంత్రి హరీశ్రావు మండిపడ్డారు. హైదరాబాద్ కోకాపేట్లోని ఆదివారం హరీశ్రావు నివాసంలో పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, పటాన్చెరు మండల ఇన్చార్జ్, జెడ్పీటీసీ మాజీసభ్యులు శ్రీకాంత్గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ...ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్కు అతీగతీలేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారని విమర్శించారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదని చురకలంటించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతామని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో మల్లేశ్గౌడ్, ధనుంజయ్గౌడ్, పవన్గౌడ్, చరణ్గౌడ్, నక్క వికాస్గౌడ్, కాసా వినయ్గౌడ్, పట్లోళ్ల తిరుపతిరెడ్డి తదితరులున్నారు. కాంగ్రెస్పై మాజీమంత్రి హరీశ్రావు ధ్వజం -
సబ్సిడీ పథకాలు సద్వినియోగం చేసుకోండి
● స్వయం ఉపాధి పథకాలకు 24 వరకు ఆన్లైన్ చేసుకునే అవకాశం ● కలెక్టర్ ప్రతిమాసింగ్ వెల్లడి మెదక్ కలెక్టరేట్: స్వయం ఉపాధి ద్వారా జీవన ప్రమాణాలను పెంపొందించుకునేందుకు షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ సబ్సిడీ పథకాలు అందజేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో 2025–26 వార్షిక ప్రణాళిక అమలు చేసేందుకు 236.60 లక్షలతో 249మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. 119 ఈవీ ద్విచక్ర వాహనాలు, 59 ఈవీ ఆటోలు, రైతులకు సోలార్ పంపులు అందజేస్తున్నట్లు వివరించారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద 59 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రూ.లక్షలోపు యూనిట్లకు 90%, రూ.2లక్షల వరకు 80%, రూ.4లక్షల వరకు 70% రాయితీ ఉంటుందని వివరించారు. ఆసక్తి, అర్హత గల ఎస్సీ అభ్యర్థులు ఈనెల 24వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటి హార్డ్ కాపీలను మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలకు అందజేయాలన్నారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ప్రజావాణి వాయిదామెదక్ సమీకృత కలెక్టరేట్తోపాటు ఆర్డీఓ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులంతా జనగణన–2027 విధుల్లో ఉన్నందున కార్యక్రమాన్ని వాయిదా వేశామని, ప్రజలు విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని లింగారెడ్డిపేటకు చెందిన ఆ కుల సారిక రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై ంది. గతనెల 16 నుంచి 19 వరకు సిరిసిల్లలో జరిగిన పోటీలలో ప్రతిభ చూపింది. శనివారం బాలికను గ్రామస్తులు అభినందించారు. ఒడిషాలోని భువనేశ్వర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో సైతం రాణించి జాతీయస్థాయికి ఎంపిక కావా లని వారు ఆకాంక్షించారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం మెదక్ కలెక్టరేట్: ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్గౌడ్ తెలిపారు. శనివారం పట్టణంలోని 2, 3, 30, 31 వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేకు వినతి శివ్వంపేట(నర్సాపూర్): ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నాయకులు ఎమ్మెల్యే సునీతారెడ్డిని కోరారు. ఈ మే రకు శనివారం ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు, బకాయిలు, పీఆర్సీ తదితర సమస్యల గురించి వివరించారు. -
తొలిరోజు 99.83% హాజరు
ప్రారంభమైన ‘పది’ పరీక్షలుమెదక్ కలెక్టరేట్: పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్షకు 11,239 విద్యార్థులకు గానూ 11,220 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరయ్యారు. దీంతో 99.83 హాజరు శాతం నమోదైంది. డీఈఓ విజయ, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, అదనపు ఎస్పీ మహేందర్ పలు సెంటర్లను సందర్శించారు. అలాగే ఇతర పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి. విద్యార్థులను గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పరీక్షకు పరీక్షకు మధ్య సెలవులు ఉండటంతో ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ సూచించారు. సెలవుల దినాల్లో బాగా చదివి పరీక్షకు సిద్ధమై రావాలన్నారు. -
ఆందోళన వద్దు: కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సమస్య లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచన మేరకు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా పరిస్థితిని, గోదాముల్లో నిల్వల స్థితిని రోజువారీగా కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. అలాగే సిలిండర్లు నిల్వ చేయడం, దారి మళ్లింపు, బ్లాక్ మార్కెటింగ్, గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరా లకు అక్రమంగా ఉపయోగించడం వంటి చర్యలను నివారించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు నిరంతరంగా అందుబాటులో ఉండేలా కమిటీ తరచుగా సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు. -
కదులుతున్న డొంక
116 బిల్లులు పంపకపోవడంలో ఆంతర్యం ఏంటి? ● మెడికల్ రీయింబర్స్మెంట్ శాఖ పర్యవేక్షకుడిపై చర్యలు! ● ముడుపుల కోసమే డైరెక్ట్గా ప్రొసీడింగులు ● ఏసీబీ తనిఖీలతో మెదక్లో కలకలంమెదక్ అర్బన్: ఈనెల 9న ‘మెడికల్ బిల్లులు ఏవీ? ముడుపులు ఇస్తేనే ముందుకు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో మెడికల్ రీయింబర్స్ మెంట్ పర్యవేక్షకుడి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఇందులో విస్తుగొలిపే విషయాలు బయట పడినట్లు తెలుస్తోంది. రీయింబర్స్మెంట్ కోసం కార్యాలయానికి వచ్చిన బిల్లుల్లో 116 పాస్ అయినప్పటికీ, వాటిని సంబంధిత కార్యాలయాలకు పంపకుండా, తమ వద్దే పెట్టుకోవడం, బిల్లులను ఔట్ వార్డులో నమోదు చేయకుండా, సంబంధికులకే ఇచ్చినట్లు నిర్ధారించారు. లంచాలకు ఆశపడే ఈ చర్యలకు పాల్పడిన ట్లు భావిస్తున్నారు. కార్యాలయంలో రిజిస్టర్ల నిర్వహణ కూడా లోప భూయిష్టంగా ఉన్నట్లు గుర్తించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఏసీబీ అధికారుల పూర్తిస్థాయి నివేదిక అనుగుణంగా బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు రూ. 50 వేల లోపు ఉంటే మంజూరు కోసం జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయానికి పంపుతారు. ఇవి సాధారణంగా 21 రోజుల్లో మంజూరు చేయాలి. కానీ ఇక్కడ ఓ పర్యవేక్షకుడు ముడుపులకు ఆశపడి, అన్నీ తానై వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు విచారణ చేశారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఉద్యోగులకు సంబంధించి 282 బిల్లులు వచ్చాయి. అందులో 116 బిల్లులు ఆమోదించారు. వీటిని ఔట్ వార్డులో నమోదు చేసి, సంబంధిత శాఖలకు పంపాలి. కానీ వాటిని నమోదు చేయకుండా, పర్యవేక్షకుడు తన వద్దే పెట్టుకున్నట్లు, డైరక్ట్గా వచ్చి అతడిని కలసిన వారికి ప్రొసీడింగులు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వారి నుంచి లంచాలు స్వీకరిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. అసలు ఔట్ వార్డు రిజస్టర్ జనవరి 5 వరకు రాసినట్లు, ఆపై ఎంట్రీలు చేయలేదని గుర్తించారు. ఆ తర్వాత సుమారు 60 బిల్లులు వచ్చినట్లు తెలుస్తోంది.భారీగా పెండింగ్ బిల్లులు జిల్లా మెడికల్ బోర్డులో మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు భారీగా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. 2025 మార్చి నుంచి ఈఏడాది మార్చి 5 వరకు 1,053 రీయింబర్స్మెంట్ బిల్లులు వచ్చాయి. అందులో 529 చెల్లించారని, మిగితావి పర్యవేక్షకుడి వద్దే పెండింగ్లో ఉన్నట్లు తేలింది. బిల్లులు పంపిన తర్వాత ఉద్యోగులు వచ్చి, సదరు పర్యవేక్షకుడిని కలిస్తే వాటికి మోక్షం లభిస్తుందని, లేకుంటే కొర్రీలు వేస్తాడన్న ఆరోపణలున్నాయి. ఒకేసారి వాటిని వెనక్కి పంపుతాడని బాధితులు అంటున్నారు. కార్యాలయంలో తాము రాసిందే రికార్డు అన్నట్లు తమ ఇష్టమొచ్చిన రీతిలో రికార్డులు రాస్తున్నారు. లేకుంటే వాటిని మూలన పడేస్తున్నారన్న విమర్శలున్నాయి. అలాగే మెడికో లీగల్ కేసుల ధ్రువపత్రాలకు సంబంధించిన రిజిస్టర్ కూడా అసంపూర్తిగా ఉన్నట్లు తేలింది. సుమారు 5 గంటల పాటు తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తా మని తెలిపారు.నివేదిక అనుగుణంగా చర్యలు తీసుకుంటాం మెడికల్ రీయింబర్స్మెంట్ విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. అవసరమైన సమాచారాన్ని తమతో తీసుకెళ్లారు. వారు ఇచ్చి న నివేదిక అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – సునీత, మెదక్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: ఎస్పీ
మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి జిల్లాలో జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలులో ఉంటుంద ని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులను ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్పీ ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు. -
ఆమె ఆరోగ్యానికి భరోసా
జిల్లావ్యాప్తంగా 14,007 మహిళా స్వయం సహాయక (ఎస్హెచ్జీ) గ్రూపు సంఘాలు ఉండగా, వాటిలో 1.44 లక్షల మంది సభ్యులు ఉన్నా రు. వీరంతా సెర్ప్, డీఆర్డీఓ శాఖల ఆధ్వర్యంలో సీ్త్ర నిధితో పాటు పావలా వడ్డీ.. తదితర రుణాలు పొంది వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సభ్యులందరికీ ఉచితంగా 32 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి డిజిటల్ హెల్త్ కార్డులు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా మండలాల్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో రక్త నమూనా లు సేకరించి జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపించనుంది. ఈ పరీక్షల్లో వ్యాధులు ఉన్న ట్లు తేలితే వారికి వెంటనే చికిత్స సైతం అందిస్తారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ వైద్యం ! కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఎస్హెచ్జీ సభ్యులకు వైద్య పరీక్షలు చేసి ఆరోగ్య డిజిటల్ కార్డులు అందించేందుకు సిద్ధమైంది. ఈ కార్డులతో మహిళలకు ఆరోగ్య భద్రత లభించనుంది. ఏదేని జబ్బు చేస్తే కార్డు తీసుకొని కార్పొరేట్ ఆస్పత్రిలో చూపించినా ఉచితంగా వైద్యం అందుతుందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.ఎస్హెచ్జీ మహిళలకు32 రకాల వైద్య పరీక్షలు అనంతరం డిజిటల్ హెల్త్కార్డుల పంపిణీ జిల్లావ్యాప్తంగా 1.44 లక్షలమందికి లబ్ధి రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్ ఎస్హెచ్జీ మహిళా సభ్యులకు 32 రకాల వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం ప్రభుత్వం డిజిటల్ హెల్త్కార్డులను అందించనుంది. కాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ మరో రెండు, మూడు రోజుల్లో రానుంది. షెడ్యూల్ వచ్చిన వెంటనే ప్రతి మండలంలో రోజుకు 50 నుంచి 100 మంది చొప్పున ఎస్హెచ్జీ సభ్యుల రక్త నమూనాలు సేకరిస్తాం. – శ్రీరాం, డీఎంహెచ్ఓ మహిళల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా స్వయం సహాయక గ్రూపు (ఎస్హెచ్జీ) సభ్యులకు పలు రకాల వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించింది. అనంతరం డిజిటల్ హెల్త్ కార్డులు అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. – మెదక్జోన్ -
గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతిమాసింగ్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3,84373 కనెక్షన్లు ఉండగా, 16 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు గ్యాస్ కొరతపై వస్తున్న అపోహలను నమ్మకూడదని, జిల్లాలో గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవద్దని సూచించారు. వంట గ్యాస్ సమస్యలపై కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (9391942254) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నర్సాపూర్లోని హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 46 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు వివరించారు. అనంతరం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అక్రమంగా గ్యాస్ నిల్వ చేయడం, అక్రమంగా దారి మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు. వినియోగదారులు గ్యాస్ బుకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసర లింకులు ఓపెన్ చేసి సైబర్ క్రైమ్కు గురి కావొద్దన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కాగా అదనపు కలెక్టర్ నగేష్ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం ని ర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద, డీపీఆర్ఓ రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
ఆర్థిక సర్వేకు ప్రజలు సహకరించాలి
మెదక్ కలెక్టరేట్: సామాజిక ఆర్థిక సర్వేకు జిల్లాలోని ప్రజలంతా సహకరించాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సురేష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సీపీఓ కార్యాలయంలో మండల ప్రణాళిక, గణాంక అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి నుంచి ప్రారంభమైన సర్వే ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగుతుందని తెలిపారు. సామాజిక ఆర్థిక సర్వే ద్వారా దేశంలోని ఉపాధి, నిరుద్యోగుల స్థితిగతులు, కార్మిక శక్తి పరిస్థితులు, నమోదు కాని పారిశ్రామిక, వాణిజ్య సేవా రంగాల ఆర్థిక అంశాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తామన్నారు. ఖచ్చితమైన గణాంకాలు సిద్ధం చేసేందుకు జిల్లాలోని ప్రజలంతా సహకరించాలని కోరారు. అంతకుముందు ఫీల్డ్ సిబ్బందికి ట్యాబ్స్ అందించా రు. కార్యక్రమంలో గణాంక అధికారి పద్మజ, ఉపగణాంక అధికారులు రవి, శ్రీనివాస్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.ట్యాబ్స్తో ఫీల్డ్ సిబ్బంది, అధికారులు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సురేష్ -
గ్యాస్ గోస
పశ్చిమాసియా దేశాల యుద్ధం కారణంగా వచ్చిన గ్యాస్ కొరతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. ఈకేవైసీ అడగటం, బుకింగ్ కాకపోవటం, సర్వర్ డౌన్ కారణంగా జనం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అసలే ఇప్పుడు పరీక్షల సమయం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదని ఏజెన్సీ నిర్వాహకులతో వినియోగదారులు గొడవ పడుతున్నారు. కాగా హాస్టళ్లు, హోటళ్లు, కర్రీపాయింట్ నిర్వాహకులు కట్టెల పొయ్యి మీదవంట చేస్తున్నారు. కోత్లాపూర్లో సిలిండర్ కోసం క్యూ లైన్లో నిలబడిన జనం -
పశు సంపద పెరగాలి
నర్సాపూర్ రూరల్: రైతులు పశు సంపదను పెంచుకొని అభివృద్ధి చెందాలని జిల్లా పశు వై ద్యాధికారి వెంకటయ్య సూచించారు. శుక్రవారం మండలంలోని ఖాజీపేటలో ఉచిత పశువైద్య శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. పాడి ఉత్పత్తిని పెంచి నాణ్యమైన పాలను నేటి తరానికి అందివ్వాలన్నారు. అనంతరం పశువులకు కావాల్సిన మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నర్సా పూర్ పశుసంవర్ధక శాఖ ఏడీ జనార్దన్రావు, పశు వైద్యాధికారులు సౌమిత్, స్వప్న, ప్రియాంక, ఫరినా, సర్పంచ్ యాదగిరి గౌడ్, వెటర్నరీ సిబ్బంది ఆంజనేయులు, వెంకటేష్, ఏసుప్రభు రైతులు పాల్గొన్నారు. -
మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెన్షన్
నర్సాపూర్: నర్సాపూర్లోని ప్రభుత్వ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నసీమాషేక్తో పాటు వార్డెన్ హజీ అలీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవల గురుకులంలో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా వారిని విధులనుంచి తొలగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్చార్జి ప్రిన్సిపాల్గా లెక్చరర్ మురళీకి బాధ్యతలు అప్పగించారు. రూ.147 కోట్లతో ఏడుపాయల అభివృద్ధి పాపన్నపేట(మెదక్): ఏడుపాయల పరిపూర్ణ అభివృద్ధి కోసం రూ.147 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఈఓ వీరేశం తెలిపారు. శుక్రవారం హైదరాబాద్కు చెందిన తనికెళ్ల ఇంటిగ్రేటెడ్ కన్సల్టెన్సీ సభ్యులు స్థల పరిశీలన చేశారు. కాటేజీలు, అద్దాల మేడ, క్యూలైన్, ఒడిబియ్యం కౌంటర్, స్టార్ గదులు, బోనాల మంటపం తదితర నిర్మాణాలు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్టిక్యూటీవ్ డైరెక్టర్ మాధవి, ప్రాజెక్ట్ మేనేజర్ రవి పాల్గొన్నారు. వైద్య శిబిరాలతో మేలు రామాయంపేట(మెదక్): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని ప్రగతిధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ శ్రీరాం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి, ఇతర వైద్యులు పాల్గొన్నారు. నిల్వ నీటితో అనర్థాలు రామాయంపేట(మెదక్): మున్సిపల్ పాలకవర్గ సభ్యులు శుక్రవారం పట్టణంలో డ్రైడే– ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా చైర్పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో 11వ వార్డులో ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డులో ఇళ్ల మధ్య మురుగు నీరు నిల్వ ఉంటే దోమల వ్యాప్తి పెరుగుతుందని వివరించారు. అనంతరం కుండీల్లో నిల్వ ఉంచిన నీటిని తొలగింపజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నవనీత, కౌన్సి లర్లు నాగరాజు, రంజిత్, శ్యామల, ఆర్పీలు పాల్గొన్నారు. గ్యాస్ కొరత లేదు: ఆర్డీఓ నర్సాపూర్: నర్సాపూర్లో వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఆర్డీఓ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం పలువురు అధికారులతో కలిసి కంపెనీకి చెందిన గ్యాస్ గోదాం, పలు హోటళ్లలో తనిఖీలు చేసి మాట్లాడారు. ప్రజలకు కావాల్సిన మేర గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ఎమర్జెన్సీ సర్వీసులకు అవసరం మేర సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వ్యాపార సంస్థల్లో వాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ కొరత పుకార్లు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ జాన్రెడ్డి, ఎస్ఐ రంజిత్రెడ్డి, ఆర్ఐ ప్రభాకర్ తదితరులు ఉన్నారు. -
● రండి.. డిగ్రీలో చేరండి
మెదక్జోన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగియడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డిగ్రీ కళాశాలలో చేరాలంటూ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హుస్సేన్ మాట్లాడుతూ.. 2026– 27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా లభించిందని తెలిపారు. జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులను కలిసి డిగ్రీ దోస్త్ అడ్మిషన్ల గురించి వివరించారు. అనంతరం దోస్త్ అడ్మిషన్ల సమన్వయకర్త సురేందర్రావు అడ్మిషన్ల పెంపునకు అధ్యాపకులు చేస్తున్న కృషిని అభినందించారు. కాగా కొల్చారం, పాపన్నపేట, టేక్మాల్, రామాయంపేట, గోపాలేపేట, చేగుంట, మెదక్లోని అన్ని జూనియర్ కళాశాలల్లో ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. -
తడి, పొడి చెత్తను వేరు చేయండి
మెదక్ కలెక్టరేట్: ప్రజలు తడి, పొడి చెత్తపై అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్గౌడ్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 1, 12, 18 వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా వార్డుల్లోని ప్రజలకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, శానిటేషన్ సిబ్బంది, ఆర్పీలు, వార్డుల ప్రజలు పాల్గొన్నారు. -
పకడ్బందీగా మ్యాపింగ్ ప్రక్రియ
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు త్వరితగతిన మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. బూత్స్థాయి అధికారులతో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం డూప్లికేట్ ఓట్లు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నా మని వివరించారు. కార్యక్రమంలో మెదక్, నర్సాపూర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేష్ -
మహిళలు ముందంజలో ఉండాలి
డీఆర్డీఓ అదనపు పీడీ సరస్వతి చేగుంట(తూప్రాన్): అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని డీఆర్డీఓ అదనపు పీడీ సరస్వతి అన్నారు. గురువారం చేగుంట ఐకేపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు ఆటల పో టీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక స్వావలంబనతో పాటు పిల్లలను బాగా చదివించడం, సామాజిక అంశాలను అవగాహన చేసుకొని స్థానికంగా సమస్యలు పరిష్కరించుకునేలా ఉండాలన్నారు. పిల్లలు ఫోన్ తక్కువగా వాడేలా జాగ్రత్త వహించాలన్నారు. ఆన్లైన్ గేమింగ్కు అలవాటు కాకుండా చూసుకోవాలన్నారు. అనంతరం గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీఎం దుర్గాప్రసాద్, సీసీలు రామస్వామి, శంకర్, స్వేతతో పాటు మహిళలు పాల్గొన్నారు. -
కేన్సర్ రహిత సమాజం నిర్మిద్దాం
మెదక్జోన్: కేన్సర్ రహిత సమాజం కోసం ప్రభుత్వం 15 ఏళ్ల లోపు బాలికలకు ఉచి తంగా అందిస్తున్న హెచ్ిపీవీ వ్యాక్సిన్ జిల్లా ఆస్పత్రిలో గురువారం కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఆరోగ్య సమస్యగా ఉన్న సర్వైక ల్ కేన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు వెల్లడించారు. బాలికల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రుల సమక్షంలోనే టీకా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ శ్రీరామ్ పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం 10గంటలకు ఉగాది కవిసమ్మేళనం నిర్వహించనున్నట్లు వెన్నెల సాహితీ సంగమం అధ్యక్షుడు వంగర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్కపెల్లి యాదగిరిలు గురువారం తెలిపారు. కార్యక్రమానికి ప్రముఖ కవి, రచయిత కోడం పవన్కుమార్, విశిష్ట అతిథులుగా ప్రముఖకవి, రచయిత, తెరవే రాష్ట్ర అధ్యక్షులు కొండిమల్లారెడ్డి, ఆత్మీయ అతిథిగా సొప్పదండి విద్యాసాగర్లు హాజరవుతారన్నారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు అందెశ్రీ ఉగాది పురస్కారం, జ్ఞాపికలు అందించనున్నట్లు తెలిపారు. -
పరీక్షలకు పదిలమైన ఏర్పాట్లు
మెదక్ కలెక్టరేట్: పదో తరగతి విద్యార్థులు తమలోని భయాన్ని వీడి ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేపటి నుంచి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు, విధులు నిర్వర్తించే అధికారులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థుల కోసం కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం (9848214166) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల కోసం జిల్లాలోని 68 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి మొత్తం 11,347 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షకు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు తమ హాల్టికెట్ను కండక్టర్కు చూపిస్తే సరిపోతుందన్నారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని, సందేహాలుంటే పరిష్కరించుకోవాలన్నారు. విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూం హాల్టికెట్ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం విద్యార్థులు భయం వీడాలని కలెక్టర్ సూచన -
చట్టాలపై అవగాహన అవసరం
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కంది(సంగారెడ్డి)/సంగారెడ్డి జోన్: నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని కందిలో కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న మున్సిపల్ చైర్పర్సన్లు, గ్రామ సర్పంచులు కౌన్సిలర్లకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’99 రోజుల కార్యచరణ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి దామోదర పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్ ఆవరణలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం సీఎస్ఆర్ నిధులతో మెడికల్ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...99 రోజుల కార్యచరణను ఐదు దశలు, పది అంశాలుగా రూ పొందించామన్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి సారించాలని సూ చించారు. ఆరోగ్య శిబిరాలు, వైద్య పరీక్షలు, గర్భిణీలు, చిన్నారులకు పోషకాహార అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి.. రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్ర భు త్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు తెలిపారు. -
ఆరుతడి.. సాగండి
‘బియ్యం నిల్వలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఆశించిన మేర ఎగుమతులు లేక గోదాముల్లో ముక్కిపోతున్నాయి. రైతులు ఏడాదికి రెండు పంటలు వరి సాగు చేయటంతోనే ఈ పరిస్థితి నెలకొంది. వారిని ఆరుతడి పంటల వైపు, ముఖ్యంగా ఆయిల్పాం సాగు వైపు మళ్లించండి. వచ్చే రబీ నాటికి కనీసం 30 శాతం పంటలు సాగు కావాలి’. ఇటీవల కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో అధికారులతో జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలు. – మెదక్జోన్ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో మొత్తం 2.75 లక్షల ఎకరాల్లో రైతులు అన్నిరకాల పంటలు సాగు చేశారు. వాటిలో 2.33 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, కేవలం 22 వేల ఎకరాల్లో మాత్రమే ఇతర ఆరుతడి పంటలు వేశారు. మొత్తంగా 11 శాతం మేర మాత్రమే సాగు చేశారు. వర్షాకాలం సీజన్లో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 4 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నారు. ఫలితంగా బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. వచ్చే రబీ సీజన్ నాటికి సాగులో కనీసం 30 శాతం ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించాలని, ప్రధానంగా ఆయిల్పామ్పై అవగాహన కల్పించాలని మంత్రి వివేక్ ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 2 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ పంటలు సాగవుతున్నాయి. అందులో ఈఏడాది 978 ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకొచ్చారు. కాగా మరింత సాగు పెరగాలని రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ఈనెల 16న జిల్లా నుంచి 50 మందికి పైగా రైతులను భద్రాచలం తీసుకెళ్లి ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించనున్నారు. వచ్చే రబీ నాటికి 30 శాతం పెరగాలని ఇటీవల మంత్రి వివేక్ ఆదేశం రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ముమ్మర ప్రయత్నాలు మంత్రి ఆదేశాలతో ఆరుతడి పంటల సాగు వైపు రైతులను మళ్లించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చే రబీ సీజన్ నాటికి 30 శాతానికి పైగా పంట మార్పిడి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – దేవ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి 7 రోజుల పాటు అవగాహన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మే 4 నుంచి మే 10 వరకు వ్యవసాయ, హార్టికల్చర్ శాఖలు సంయుక్తంగా 7 రోజుల పాటు ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. వాటిలో నానో యూరియా పనితీరు, ఆయిల్ పామ్ సాగు, తుంపరసేద్యం, పందిరి సాగు, పట్టు పురుగుల సాగు, కూరగాయలు, సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. -
బాలికలకు టీకా తప్పనిసరి
నర్సాపూర్: బాలికలకు హెచ్పీవీ టీకా తప్పనిసరిగా వేయించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి సూ చించారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో టీకా కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. హెచ్పీవీ వైరస్తో గర్భాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, టీకా తీసుకోవడంతో భవిష్యత్తులో ఆ వ్యాధిని తగ్గించుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం సూచించిన విధంగా 14 నుంచి 15 సంవత్సరాల బాలికలు టీకా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ పావని, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సృజన, ఆర్ఎంఓ రాజేష్, రెడ్డిపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రఘువరన్, కౌన్సిలర్ నర్సమ్మ, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనోహరాబాద్(తూప్రాన్): రైతులు పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి స్రవంతి అన్నారు. గురువారం మండలంలోని రంగాయపల్లిలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీజన్ను బట్టి పంటలు వేయాలని సూచించారు. శుక్రవారం కూచారం రైతువేదికలో సాయంత్రం 5 గంటలకు జరిగే పీఎం కిసాన్ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. ఆమె వెంట ఏఈఓ సచిన్ ఉన్నారు. మనోహరాబాద్(తూప్రాన్): పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు వైద్యం అందించాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని పీహెచ్సీ వద్ద పల్లె ప్రగతి పనుల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆస్పత్రి పరిసరాలను శుభ్రం చేయించారు. వైద్యం కోసం వచ్చే వారికి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రీతిరెడ్డి, పీహెచ్సీ వైద్యురాలు జ్యోత్స్న దేవి, సర్పంచ్ చీర్ల అనూష, ఉపసర్పంచ్ వెంకట్రెడ్డి, వైద్య బృందం, పంచాయతీ కార్యదర్శి రూపాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి మాధవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చివరిరోజు జనరల్ విభాగంలో 6,085 గాను 5,895 మంది హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 279 గాను 260 విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. దీంతో హాజరు శాతం 96.71 నమోదైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, సీసీ కెమెరాల ద్వారా పరీక్షలను పర్యవేక్షించినట్లు తెలిపారు. కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ సృజన అన్నారు. గురువారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ బీసీ మత్స్యకారుల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి సీపీఆర్పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తుందన్నారు. అనారోగ్య సమస్యలుంటే ఉపాధ్యాయులకు, ఏఎన్ఎంకు చెప్పాలని సూచించారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరిబాబు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
సమయం వృథా చేయొద్దు
డీఈఓ విజయపాపన్నపేట(మెదక్): విద్యార్థులు పరీక్షల మధ్య ఉన్న వ్యవధిని వినియోగించుకొని మంచి ఫలితాలు సాధించాలని డీఈఓ విజయ సూచించారు. గురువారం మండలంలోని నాగ్సాన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సుమారు 34 రోజుల పాటు సాగే పరీక్షల్లో, ఒక్కో పరీక్షకు మధ్య చాలా విరామం దొరుకుతుందని తెలిపారు. ఈ సమయాన్ని వృథా చేయొద్దన్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పక్కా ప్రణాళికతో చదివితే లక్ష్యం సాధించవచ్చని చెప్పారు. అనంతరం పాఠశాల అభివృద్ధి కోసం రూ.లక్ష విరాళమిచ్చిన గ్రామస్తుడు వట్టం సంగమేశ్వర్ను డీఈఓ ఘనంగా సన్మానించారు. మన ఊరు, మన బడికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ చంద్రమ్మ, సర్పంచ్ దండెం సుశీల, హెచ్ఎం నజీరొద్దీన్, ఏఎంఓ సుదర్శణమూర్తి, ఏఎస్ఓ నవీన్, సీఎంఓ రాజు, రిటైర్డ్ హెచ్ఎంలు మహిపాల్రెడ్డి, రాంకిషన్, సాయికృష్ణ, టీచర్లు శ్రీనివాస్, అశోక్ కుమార్, నర్సింలు, సిద్దేశ్వర్, రేఖ, ముజీబ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పని చేయండి
మెదక్కలెక్టరేట్: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ విధిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సర్పంచ్లు నాగ్రామం అనే స్వభావాన్ని కలిగి ఉండాలని, అప్పుడే అభివృద్ధికి అడుగులు పడతాయన్నారు. అనంతరం ఎమ్మె ల్యే రోహిత్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం నిరంతరం శ్రమిస్తుందన్నారు. అధికారులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్లు ఎప్పుడూ ముందుంటారన్నారు. రోడ్డు ప్రమాదాలతో మరణాల సంఖ్య పెరుగుతుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి శ్రీనివాస్రావు, అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీఓ రమాదేవి, మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ఫొటోల ఎగ్జిబిషన్ను కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి తిలకించారు. ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం హాజరైన ఎమ్మెల్యే రోహిత్ -
ఉపాధి కూలీల సమస్య పరిష్కారం
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని సూరారంలో ఉపాధి హామీ కూలీల ఫొటో క్యాప్చర్ సమస్యను పరిష్కరించినట్లు ఏపీఓ రాజ్కుమార్ తెలిపారు. గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఉపాధికి ఫొటో చిక్కులు’ కథనంతో సిబ్బంది స్పందించారు. ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశానికి టీఏలు సంపత్, లక్ష్మణ్, కంప్యూటర్ ఆపరేటర్ భానుప్రసాద్ చేరుకొని ఎన్ఎంఎంఎస్ యాప్లో తలెత్తిన సమస్యను పరిష్కరించారు. దీంతో పనులకు వచ్చిన అందరి ఫొటోలు క్యాప్చర్ అయ్యాయని, వందశాతం కూలీలు పనులకు హాజరైనట్లు పేర్కొన్నారు. అక్కడక్కడ యాప్లో సాంకేతిక సమస్య తతెత్తినప్పటికీ తమ సిబ్బంది వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నాంపల్లి, ఫీల్డ్ ఆసిస్టెంట్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
మరో రెండు పంట విరామాలు!
పుల్కల్(అందోల్): సింగూరు మరమ్మతు పనులు ఈ జూన్ నాటికి పూర్తికావడం కష్టమేనని తెలుస్తోంది. రివిట్మెంట్ పనులు జూన్ నాటికి కూడా పూర్తి కావని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో మరో రెండు పంటలకు విరామం ప్రకటించాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సింగూరు మరమ్మతులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం బుధవారం పర్యటించి పర్యవేక్షించింది. ఈ బృందం డ్యామ్ పటిష్టతపై నివేదిక ఇవ్వనుంది. గతేడాది ఈ బృందం డ్యామ్ లోపలి భాగంలో రాతికట్ట(రివిట్మెంట్) నీటి తొలుకులకు కుంగిందని నివేదిక సమర్పించింది. వెంటనే మరమ్మతులు చేయాలని సూచించింది. దీంతో ప్రభుత్వం రూ.16 కోట్లను మంజూరు చేసింది. ఈ రివిట్మెంట్ పనులను జరిపించేందుకు కమిటీ సూచనల మేర స్థానికంగా పంట విరామం ప్రకటించింది. డ్యామ్లో మిషన్ భగీరథకోసం 8 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదిలారు. మొదట 800 మీటర్లు కుంగిందని నివేదికలో పేర్కొన్నారు. డ్యామ్ పటిష్టతకోసం లోపలిభాగంలో మొత్తం 8 కిలోమీటర్ల మేర రాతికట్టను నిర్మించాలని సూచించారు. ప్రస్తుతం కేటాయించిన రూ.16 కోట్లకు అదనంగా నిధులు అవసరమవుతాయని ఇంజినీర్ల బృందం సూచించింది. ఎన్డీఎస్ఏ బృందం డ్యామ్ను పటిష్టతను అంచనా వేశారు. డ్యామ్ మరమ్మతు పనులను పర్యవేక్షించిన బృందంలో కమిటీ చైర్మన్ విజయ్ ట్రింబక్ దేశాయ్ సారధ్యంలో మురళీధర్, సతీశ్కుమార్ రేగొండ, శ్రీకాంత్, రాజు, లక్ష్మణరావు ఉన్నారు. ఈ సీజన్లో పూర్తి కానట్లే... డ్యామ్ రివిట్మెంట్ పనులు జూన్లోగా పూర్తి చేసి వానాకాలం పంటకు సాగునీరు ఇవ్వాలని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర నీటిపారుదల శాఖ అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. డ్యామ్లో మరో 8 టీఎంసీల నీరు ఉందని ఆనీటిని తాగునీటికి వదులుతూ నీరు తగ్గిన కొద్దీ పనులు జరిపించాలని ఇంజినీర్లు చెబుతున్నారు. దీంతో మరో రెండు పంటల వరకు క్రాఫ్ హాలీడే ప్రకటించాల్సి రావచ్చని తెలిపారు. ఈ బృందం వెంట నీటిపారుదల శాఖ రాష్ట్రస్థాయి అధికారులున్నారు. జూన్లోగా సింగూరు రివిట్మెంట్ పనులు పూర్తికావడం కష్టమే డ్యామ్ పనుల పరిశీలన.. పటిష్టతపై నివేదిక ప్రాజెక్టును సందర్శించిన ఎన్డీఎస్ఏ బృందం -
పకడ్బందీగా ప్రజాపాలన
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అల్లాదుర్గం(మెదక్)/టేక్మాల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ పనులను పకడ్బందీగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం మండల పరిధిలోని ముస్లాపూర్లో పనులను పర్యవేక్షించి మాట్లాడారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దరిచేరవన్నారు. ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి, లీకేజీలను అరికట్టాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ మల్లయ్య, ఎంపీడీఓ చంద్రశేఖర్ ఉన్నారు. అనంతరం టేక్మాల్ మండల పరిధిలోని బొడ్మట్పల్లి పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ ప్రజాపాలనలో జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామస్తులు వందశాతం ఇంటి పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అవినాష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మౌనిక, నాయకులు రాందాస్, రవిశంకర్, నర్సింలు, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా పోలీస్ క్రీడలు
మెదక్జోన్: పోలీస్ వార్షిక క్రీడలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండో రోజు బుధవారం పట్టణంలోని సింథటిక్ ట్రాక్పై అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్పుట్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. క్రీడ లతో శారీరక దృఢత్వం పెరగడంతో పాటు విధుల్లో చురుకుదనం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈసందర్భంగా విజేతలను అభినందించారు. కొల్చారం(నర్సాపూర్): గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డీఎంహెచ్ఓ శ్రీరామ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీహెచ్సీ ఆవరణలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. కాగా వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సమస్య ఉన్న వారిని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. వివిధ గ్రామాల నుంచి 215 మంది వైద్య శిబిరానికి హాజరైనట్లు వైద్యాధికారి రమేష్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్, ఎంపీహెచ్ఓ మ దన్మోహన్, సూపర్వైజర్ మార్తా, యేసుమని, శాంతి కుమార్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. రామాయంపేట(మెదక్): పట్టణంలోని పలు హోటళ్లలో నాసిరకం పదార్థాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య, కమిషనర్ శ్రావణ్ తనిఖీలు నిర్వహించారు. కొన్ని హోటళ్లలో పాచిపోయి దుర్వాసన వెదజల్లుతున్న నాసిరకం పదార్థాలను గుర్తించి పారబోయించారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతీస్తే ఊరుకోమని చైర్పర్సన్ హెచ్చరించారు. ఇది మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నామని, మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట వైస్ చైర్పర్సన్ నవనీత, కౌన్సిలర్లు వెంట ఉన్నారు. -
ఉపాధికి ఫొటో చిక్కులు
కుస్తీమే సవాల్చిన్నశంకరంపేట(మెదక్): ఉపాధి కూలీలకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఫొటో క్యాప్చర్ కాలేదని పనులకు నిరాకరించడంతో కూలీలు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని సూరారంలో బుధవారం ఉపాధి హామీ పథకంలో భాగంగా కందకం తవ్వకం పనులు నిర్వహిస్తున్నారు. పనుల కోసం వచ్చిన కూలీల ఫొటోలను ఎన్ఎంఎంఎస్ యాప్లో ఫీల్డ్ ఆసిస్టెంట్ రామకృష్ణారెడ్డి క్యాప్చర్ చేయగా, చాలా వరకు కాలేదు. దీంతో పనులు చేసేందుకు నిరాకరించారు. దీంతో ఉపాధి పనులకు వచ్చిన కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే మస్టర్ హాజరు నిర్వహించాలని కోరారు. ఈవిషయమై ఏపీఓ రాజ్కుమార్ను ఆరా తీయగా, ఈ సమస్య కొన్ని చోట్ల మాత్రమే ఉత్పన్నం అవుతుందని, త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. తలపడుతున్న మల్లయోధులు టేక్మాల్(మెదక్): మండల కేంద్రంలో దుర్గమ్మ, పోచమ్మ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీలకు రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మల్లయోధులు తరలివచ్చారు. కొబ్బరికాయ కుస్తీ మొదులుకొని కడి యం కుస్తీ వరకు పోటీలు హోరాహోరీగా సాగాయి. కర్ణాటకలోని లాతూర్కు చెందిన అభిషేక్ ఇద్దరిపై గెలుపొందడంతో సర్పంచ్ సుధాకర్ వెండి కడియాన్ని బహూకరించారు. -
మహిళలు ఆర్థికంగా బలపడాలి
మెదక్జోన్: మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించటం అత్యంత అవసరమని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, రుణ సౌకర్యాలు, ఉపాధి అవకాశాలతో మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
పేటకు 200 ఇందిరమ్మ ఇళ్లు
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రామాయంపేట(మెదక్): రామాయంపేట మండలానికి రెండు వందల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రకటించారు. బుధవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలను మోసగించడానికి హడావిడిగా ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించిందని ఆరోపించారు. ఈవిషయం సీఎం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో అధికారికంగా కార్యాలయాన్ని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రికి డయాలసిస్ సెంటర్తో పాటు ట్రామా కేర్ సెంటర్ మంజూరు చేయిస్తానన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి వార్డులో సీసీ కెమరాలు ఏర్పాటు చేయిస్తామని, వైకుంఠధామం మరమ్మతులకు రూ. 30 లక్షలు మంజూరు చేస్తానన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నీటి ఎద్దడి సమస్య పరిష్కరిస్తానన్నారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరధ, కాళేశ్వరం పేరిట రూ. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎలాంటి అవినీతికి తావివ్వొద్దని పాలకవర్గానికి సూచించారు. పార్టీలకతీతంగా రామాయంపేటను అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించి యాదాద్రి పార్కులో మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నవనీత, కమిషనర్ శ్రావణ్, మేనేజర్ రఘువరన్, కౌన్సిలర్లు, నాగరాజు, రంజిత్, సందీప్, రవినాయక్, ప్రవీణ్, స్వప్న, చరిత, శ్యామల, మాధవి, శంకర్గౌడ్ పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు ఇవ్వండినర్సాపూర్: గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ మాజీ బుధవారం ఎమ్మెల్యే హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ మంత్రి సీతక్కను కలిశారు. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాక సర్పంచ్లు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. పార్టీలకతీతంగా పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరినట్లు వారు చెప్పారు. కాగా జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనాలు, రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మే నెలాఖరురు పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు ఆయా పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులుకౌడిపల్లి(నర్సాపూర్): పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని డీఈఓ విజయ తెలిపారు. బుధవారం కౌడిపల్లిలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డెస్కులు, విద్యుత్, వెలుతురు, ఫ్యాన్లు, తాగునీరు తదితర సౌకర్యాలను పరిశీలించారు. కేంద్రం చుట్టుపక్కల ఎలాంటి చిత్తు కాగితాలు, పేపర్లు ఉండకుండా శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. ఓ గదిలో నేలపై బండలు సరిగా లేకపోవడంతో ఫ్లోరింగ్ చేయాలని ఆదేశించారు. కాగా తనిఖీ సమయంలో ఉన్నత పా ఠశాలలో హెచ్ఎం లలితాదేవి లేకపోవడంతో ఉపాధ్యాయులను ప్రశ్నించారు. కాగా ప్రతిరోజు హెచ్ఎం ఆలస్యంగా వస్తారని గ్రామస్తులు డీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలలో వార్డు సభ్యురాలు, వంటమనిషి బొంతమ్మ పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు ఇవ్వగా డీఈఓ అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎంలు సాజిద్అలి, ఓంప్రకాష్, పీడీ విజయ్కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఈఓ విజయ -
మల్కాపూర్ అభివృద్ధిపై ఆరా
శ్రీలంక బృందం సందర్శనతూప్రాన్: మండలంలోని మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని మంగళవారం శ్రీలంక దేశానికి చెందిన ప్రజా ప్రతినిధుల బృందం ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో మంగళవారం సందర్శించారు. గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులను సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, రాక్ గార్డెన్, డంపింగ్ యార్డ్లను పరిశీలించారు. అంగాన్వాడీల పనితీరు, జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వపరంగా అందుతున్న ప్రయోజనాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మల్కాపూర్ అంచలంచెలుగా అభివృద్ధి చెంది మోడల్ విలేజ్గా మారిన తీరుతెన్నులపై శ్రీలంక ప్రజా ప్రతినిధుల బృందం సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయాన్ని బృందం సందర్శించి అధికారుల పనితీరుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, ఎన్ఐఆర్డీ ప్రతినిధి ఆశాలత, ఎంపీడీవో సతీష్, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, సత్యం, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
రేపు సర్పంచ్, కౌన్సిలర్లకు శిక్షణ
● హాజరు కానున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ● కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: సర్పంచ్లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లకు ఈనెల 12న ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ప్రజాపాలనా– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గురువారం నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమం నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. అనంతరం ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్షించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం, గ్రామాలు, పట్టణాల్లో శుభ్రత, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లోని పలు శాఖల్లో జరుగుతున్న ఫైళ్ల క్లియరెన్స్ను పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. మంగళవారం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను ఇన్ని రోజులు ఎందుకు అలా వదిలేశారని అధికారులను ప్రశ్నించారు. వారం రోజుల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటిని పరిష్కరించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
వర్క్షాప్కు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
జహీరాబాద్: గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో మంగళవారం ప్రారంభమైన ఎమ్మెల్యేల వర్క్షాప్కు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, ఎమ్మెల్యేలు కె.మాణిక్రావు, చింతా ప్రభాకర్ వర్క్షాప్లో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయడంతోపాటు సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, నియమ నిబంధనలు, రాజ్యాంగం అంశాలపై అవగాహన కల్పించేందుకు వర్క్షాప్ ఏర్పాటు చేశారు. -
లక్ష్యం.. కావాలి శతశాతం
పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మెదక్ అర్బన్: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 11,247 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. దానిపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని స్కాన్ చేస్తే.. పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ కనిపిస్తుంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షల కోసం విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ విజయ సూచించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఐదుగురు రూట్ ఆఫీసర్లు, 16 కస్టోడియన్లు, 17 సిట్టింగ్ స్క్వాడ్లు, 563 ఇన్విజిలేటర్లను నియమించారు. జిల్లాలో 22ఏ, 27బి, 19 సీ కేటగిరి సెంటర్లు ఉన్నాయి. రాహుల్రాజ్ మార్క్ ఫలించేనా..! బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యాశాఖపై తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ విద్యా సంవత్సరం వందల కొద్ది స్కూల్ళ్లు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను పర్యవేక్షించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ క్రమంలో నవంబర్ నుంచి స్పెషల్ క్లాసులు ప్రారంభించారు. పీఎంశ్రీ స్కూల్ విద్యార్థులకు స్నాక్స్ మొదట్నుంచీ అందించగా, ఇతర పాఠశాలల్లో గత నెల 15 నుంచి ప్రారంభించారు. వెనుక బడిన విద్యార్థుల దత్తత కార్యక్రమాన్ని కొనసాగించారు. సీ గ్రేడ్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయించారు. ప్రీ ఫైనల్తో పాటు, గతేడాది సెకండ్ సెట్ పేపర్తో సమాయత్త పరీక్షలు నిర్వహించారు. డీఈఓ విజయ సైతం ప్రతి పాఠశాలను సందర్శిస్తూ.. ఉపాధ్యాయులు.విద్యార్థుల్లో స్ఫూర్తి రగిలించారు. 227 పాఠశాలలు.. 11,247 విద్యార్థులు 68 పరీక్ష కేంద్రాలు.. సీసీ కెమెరాల ఏర్పాటు 14 నుంచి పరీక్షలు ప్రారంభం సీసీ కెమెరాల నీడన పరీక్షలు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు, ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా రాసేలా మానసిక సన్నద్ధత సాధించాలి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, సూపరింటెండెంట్ల దృష్టికి తీసుకెళ్లాలి. –విజయ, డీఈఓ -
అంగన్వాడీ టీచర్గా కలెక్టరమ్మ
చిన్నశంకరంపేటలోని మూడవ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్గా అవతారమెత్తారు. ఉదయం రాగనే టీచర్ను ఎలా విష్ చేస్తారు.. ఇప్పుడు ఎలా విష్ చేయాలని అడిగి చిన్నారులతో జవాబు రాబట్టారు. టేబుల్పై ఏర్పాటు చేసిన వస్తువులను చూపిస్తూ వాటి పేర్లను అడిగారు. ఉదయం గుడ్డు తిన్నారా అని ఆరా తీశారు. ఈ రోజు ఏం కూర వండారని అడిగి తెలుసుకున్నారు. బీఎల్ఓగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ నాగరాణికి ఎస్ఐఆర్పై పలు సూచనలు చేశారు. ఆమె వెంట తహసీల్దార్ మాలతి, ఆర్ఐలు రాజు, వినయ్ ఉన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ● పోలీసు వార్షిక క్రీడోత్సవాలు ప్రారంభంమెదక్ కలెక్టరేట్: క్రీడలతో ఒత్తిడిని జయించవచ్చునని, శారీరక ధృడత్వానికి ఎంతో అవసరమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో పోలీసు వార్షిక క్రీడోత్సవాలను నిర్వహించారు. క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీసు సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తూ అనేక సవాళ్లను ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని చెప్పారు. క్రీడా పోటీలు సిబ్బందిలో ఐక్యత, జట్టు భావన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. ఈ క్రీడోత్సవాల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, పరుగుపందెం, లాంగ్ జంప్, షాట్పుట్ వంటి పలు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, సీఐలు మహేష్, రేణుక రెడ్డి, కృష్ణమూర్తి, జాన్ రెడ్డి, వెంకట రాజా గౌడ్, ఆర్ఐలు శైలేందర్, రామకృష్ణ, ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ పట్టణంలో... మెదక్జోన్: మానసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగ పడుతాయని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మహిళా ఉద్యోగులకు మంగళవారం ఆటల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ, నిత్యం విధుల్లో నిమగ్నమయ్యే మహిళా ఉద్యోగులకు ఈ క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. ఇందులో జ్యూట్ బ్యాగ్, జంపింగ్, మ్యూజికల్ చైర్, త్రెడ్ అండ్ నీడిల్, లెమన్ అండ్ స్పూన్, క్యారమ్స్, స్పీడ్ వాక్, చెస్, టగ్ ఆఫ్ వార్ తదితర క్రీడలు నిర్వహించగా.. ఉద్యోగులు అసక్తితో పోటీలలో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన విజేతలకు బుధవారం కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ హేమభార్గవి, అధికారులు రమేష్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి రాజ్కుమార్, సహ అధ్యక్షుడు ఇక్బాల్ పాషా, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షులు సంతోష్ పాల్గొన్నారు. -
24 గ్రామాల్లో భూముల రీ సర్వే
అదనపు కలెక్టర్ నగేశ్ రామాయంపేట(మెదక్): జిల్లాలోని 24 గ్రామాల్లో భూముల రీ సర్వే కొనసాగుతోందని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని అక్కన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన భూముల రీసర్వే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వే అనంతరం ప్రతి హక్కుదారుడికి తాజాగా సదరు స్థలాలపై పూర్తి హక్కులు ఏర్పడుతాయని చెప్పారు. కొన్ని గ్రామాల్లో భూములతోపాటు సమస్యలు పెరిగిపోయాయని, రీ సర్వేతో భూములకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. సర్వే విభాగం ఏడీ కిషన్ మాట్లాడుతూ.. సర్వే అనంతరం సంబంధిత రైతుకు భూదార్ కార్డు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, డీపీఆర్వో రామచంద్రరాజు, తహసీల్దార్ రజనీ, ఎంపీడీవో సజీలుద్దీన్ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు మెదక్ కలెక్టరేట్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని అజంపురా వీధిలో ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అనంతరం 26 వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. అంతకు ముందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలోని 9వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్గౌడ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు దీపక్కుమార్, జుబేర్ పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య చిలప్చెడ్(నర్సాపూర్): ముందస్తు జాగ్రత్తగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయాలని, దీంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగి, పశువు ఆరోగ్యంగా, బలంగా తయారవుతుందని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య అన్నారు. మంగళవారం ఆయన చిలప్చెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెంకటయ్య మాట్లాడుతూ.. పాడి రైతులు ప్రతి పశువుకు టీకా ఇప్పించాలన్నారు. పశువుల్లో గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు చేయించి, సకాలంలో చూడికట్టేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ సర్జన్ డాక్టర్ వినోద్, పశువైద్య సిబ్బంది గట్టయ్య, యాదయ్య, నర్సింలు, సతీష్ పాల్గొన్నారు. ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్ నర్సాపూర్: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే వ్యవస్థ బలోపేతం అవుతుందని ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్ చెప్పారు. మంగళవారం ఐకేపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా రాణించినప్పుడే వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మహిళలకు పలు రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది మేఘన, షహనాజ్, ప్రవీణ, రవీందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశుభ్రతే లక్ష్యంగా ‘ప్రణాళిక’
జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ చిలప్చెడ్(నర్సాపూర్): గ్రామాల్లో పరిశుభ్రతే లక్ష్యంగా ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కొనసాగుతోందని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ అన్నారు. మంగళవారం 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండల పరిధిలోని ఫైజాబాద్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులతో పాటు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పాలకవర్గంతో చర్చించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, పాలకులతో పాటు, ప్రజలు సైతం గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. గ్రామాలలో సమస్యలు ఎదురైతే, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు తమ వంతు కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రశాంత్, అర్డబ్య్లూస్ ఏఈ ఆన్వేష్రెడ్డి, కార్యదర్శి నాగరాజు, సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు. -
మట్టి.. కొల్లగొట్టి
అక్రమార్కులు తరలించగా మిగిలిన మట్టి కుప్పలుఅర్ధరాత్రి గుట్టుగా తరలింపునర్సాపూర్ రూరల్: అక్రమార్కులకు మట్టే ఆహారంగా మారింది. అర్ధరాత్రి గుట్టుగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని రెడ్డిపల్లి శివారులో కాళేశ్వరం 18వ ప్యాకేజీ కాలువ వెళ్తోంది. గత ప్రభుత్వ హయాంలో సుమారు నాలుగున్నర కిలోమీటర్ల మేర టన్నెల్ (సొరంగం) పనులు ప్రారంభించి సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర పనులు చేపట్టి అర్ధంతరంగా నిలిపివేశారు. కాగా కాంట్రాక్టర్ టన్నెల్ కోసం తీసిన మట్టి గుట్టలుగా పేరుకుపోయింది. పనులు నిలిచిపోయి నెలలు గడవడంతో అక్రమార్కుల కన్ను మట్టి కుప్పలపై పడింది. పెద్దఎత్తున టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రాత్రి వేళల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పాటు సొరంగం నుంచి వెలువడిన రాళ్లను సైతం ఇంటి నిర్మాణాల కోసం తరలిస్తూ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. కాగా మట్టి కుప్పలు కరిగిపోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ మట్టి వ్యాపారుల నుంచి అధికారులకు మాముళ్లు ముట్టడంతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ. కోట్ల విలువ చేసే మట్టిని తరలించిన అక్రమార్కులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆట, పాట.. భవితకు బాట
చిన్నారులతో మాట్లాడుతున్న ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజాబుడి బుడి అడుగులతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఆట, పాటలతో కూడిన విద్యను అందిస్తున్నారు. సోమవారం మండలంలోని రెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా సందర్శించారు. మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా తదితర వాటిని పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న పోషకాహారాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట డీడబ్ల్యూఓ హేమాభార్గవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. – నర్సాపూర్ రూరల్ -
సాధికారతతో సమాజాభివృద్ధి
మెదక్ కలెక్టరేట్: మహిళా సాధికారతే సమాజాభివృద్ధికి పునాది అని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కు టుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలోనే కాకుండా దేశ అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ ముందుకు సాగుతున్నారని వివరించారు. పోలీస్శాఖలో మహిళా సిబ్బంది ధైర్యం, నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళా పోలీస్ సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్ఐ శైలందర్, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.అదనపు ఎస్పీ మహేందర్ -
దరఖాస్తులు పెండింగ్లో ఉండొద్దు
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని, పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతవారం ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలపై శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిశీలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రజావాణి అర్జీలు, క్షేత్రస్థాయి పర్యటనలపై సమీక్షించారు. అధికారులందరూ క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై స్పష్టమైన నివేదికలు అందజేయాలని ఆదేశించారు. శాఖల వారీగా పనితీరు మరింత మెరుగుపడే దిశగా పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా ప్రజావాణికి వివిధ సమస్యలపై 80 వినతులు వచ్చాయి. పంట వివరాల నమోదు తప్పనిసరి కొల్చారం(నర్సాపూర్)/తూప్రాన్: రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, 10వ తేదీ వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ వ్యవసాయాధికారులకు సూచించారు. సోమవారం మండలంలోని అప్పాజిపల్లిలో పంట నమోదు యాప్ పనితీరును పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంట నమోదు వివరాలను మొబైల్ యాప్ ద్వారా పక్కాగా నమోదు చేయాలన్నారు. జిల్లాలో 2,85,774 ఎకరాలకు గాను ఇప్పటివరకు 39,827 ఎకరాలు నమోదు చేసినట్లు తెలిపారు. అధిక ధరలకు యూరియా విక్రయించే వారి లైసెన్స్ రద్దు చేయాలని, రైతులకు అందుబాటులో ఉండని అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏఓ శ్వేతా కుమారి, సర్పంచ్ వెంకట్గౌడ్, ఏఈఓలు ఉన్నారు. అనంతరం తూప్రాన్ మున్సిపాలిటీలో పర్యటించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని సూచించారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు సూచన -
నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం
నర్సాపూర్: నర్సాపూర్లోని ప్రభుత్వ మైనార్టీ పాఠశాల, కాలేజీలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11 మంది విద్యార్థులు డీహైడ్రేషన్కు గురయ్యారని, వారికి ప్రిన్సిపాల్ నసీమా షేక్తో పాటు సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సకాలంలో వైద్యం చేయించారన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. వంటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు మెరుగైన వైద్యం చేగుంట(తూప్రాన్): పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డీఎంహెచ్ఓ శ్రీరామ్ అన్నారు. సోమవారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగాహెల్త్ క్యాంపు నిర్వహించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా క్యాంపును డీఎంహెచ్ఓ సందర్శించి మాట్లాడారు. 205 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. 57 మందిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట వైద్యులు అనిల్కుమార్, అరుణ, శిరీష, శారద, కిరణ్, అక్షయ్తో పాటు సిబ్బంది ఉన్నారు. ‘నిర్భయంగా ఫిర్యాదు చేయండి’ మెదక్ కలెక్టరేట్: సమస్యలపై ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలు ఎలాంటి పైరవీల అవసరం లేకుండా నేరుగా సంప్రదించాలన్నారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. పరిశుభ్రతే ముఖ్యం రామాయంపేట(మెదక్): పట్టణ పరిశుభ్రత విషయమై అందరూ సహకరించాలని మున్సి పల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం రామాయంపేటలో 5 కే రన్ను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, రంజిత్, స్వప్న, ప్రవీణ్, శంకర్గౌడ్, రవినాయక్, మాధవి, కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు స్వామి తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డీఐఈఓ మాధవి తెలిపారు. సోమవారం మొదటి సంవత్సరం ఫిజిక్స్–1, ఎకానమిక్స్–1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. జనరల్ విభాగంలో 6,401 విద్యార్థులకు గాను 6,198 మంది హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 621 విద్యార్థులకు గాను 600 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం 96.80 శాతం నమోదైనట్లు వివరించారు. ఐదు నిమిషాల నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
మండే ఎండ!
జిల్లాలో భానుడి భగభగ ● ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి ● బయటికి వెళ్లాలంటే జంకుతున్న ప్రజలుజిల్లాలో మార్చి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం నుంచే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. – మెదక్జోన్ జిల్లాలో వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం వేళ పనుల మీద బయటికెళ్లిన వారు ఎండ వేడిమికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం వరకే పనులు ముగించుకొని ఇళ్లకు చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపశమనం పొందడానికి ఫ్యాన్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాతో పాటు పలు మండలాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఇప్పుడే ఎండలు ఈవిధంగా ఉంటే మున్ముందు ఇంకెలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. నిర్మానుష్యంగా రోడ్లు ఎండకు జిల్లా కేంద్రంలోని పలు చౌరస్తాలు, రోడ్లు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులపై బయటికి వెళ్తున్న వారు మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరకు, పండ్ల రసాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్త పడుతున్నారు. జిల్లాలో మార్చి మొదటి వారంలోనే 38 డిగ్రీల ఉప్ణోగ్రత దాటింది. వచ్చే ఏప్రిల్, మే నెలాఖరు వరకు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.జిల్లాలో ఇలా.. తేదీ ఉష్ణోగ్రత 4 35 డిగ్రీలు 5 36.5 6 36.8 7 38.6 8 37.9 9 38.3నాలుగైదు రోజులుగా జిల్లాలో పగటి ఉష్ణ్రోగ్రతలు పెరుగుతున్నప్పటికీ, రాత్రివేళ మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజూమున చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఏటా ఉగాది వరకు ఇదే వాతావరణం ఉంటుందని, ఆ తర్వాత ఎండల తీవ్రత మరింతగా పెరిగి పగటి ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.జాగ్రత్తలు పాటించాలి ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. తలపై గొడుకు, చేతి రుమాలు, టోపీ ధరించాలి. ఎక్కువగా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాయనాలు, నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా వయో వృద్ధులు, మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తగు జాగ్రతలు పాటించాలి. – సునీతా, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఆరుతడి.. సిరుల జడి
చల్లపల్లి శివారులో సాగుతున్న జొన్న పంటయాసంగిలో అన్నదాతలు ఆరుతడి పంటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కూరగాయల పంటలతో పాటు జొన్న, శనగ, మొక్కజొన్న, గోదుమ, ఉల్లిగడ్డ సాగు వంటి పంటలను తక్కువ నీటితో విరివిగా సాగు చేస్తున్నారు. టేక్మాల్ మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 450 ఎకరాల వరకు ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం కొంత మంది రైతులు శనగపంట కోస్తుండగా.. మరికొందరు పంటను విక్రయిస్తున్నారు. – టేక్మాల్(మెదక్) -
అభివృద్ధే మా ఎజెండా
మెదక్ కలెక్టరేట్: మెదక్ మున్సిపల్ సాధారణ సర్వ సభ్య సమావేశం సోమవారం కమిషనర్ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రోహిత్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా కౌన్సిలర్లు పట్టణంలో నెల కొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా తాగునీరు, శానిటేషన్, కోతులు, కుక్కలు, అంతర్గత సీసీ రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పేరిట రూ. కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. తమ సొంత నిధులతో బోర్లు వేయించామన్నారు. పార్టీల పేరుతో రాజకీయాలు చేయడం లేదన్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు. పట్టణ ప్రజలపై అడ్డగోలుగా పన్నుల భారం మోపితే సహించేది లేదని కమిషనర్ను హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 70 శాతం నూతన కౌన్సిలర్లు ఉన్నందున వారికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి కోసం తాను ముందుంటానని, ఎలాంటి అవసరం ఉన్న తనకు ఫోన్ చేయాలని సభ్యులకు సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా పట్టణాభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పట్టణంలో నెలకొన్న తాగునీరు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించుకుందామని తెలిపారు. వైస్ చైర్మన్ దొంతి నరేష్గౌడ్ మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని వార్డుల్లో పర్యటిస్తున్నామన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపడుతామని వివరించారు. మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్రావు -
కొడుపాక ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రతిభ
పాపన్నపేట(మెదక్): మండలంలోని కొ డుపాక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని అప్షా కలాం వరల్డ్ రికార్డ్స్– 2026 అవార్డు అందుకుంది. ఆవర్తన పట్టికలోని 118 మూలకాలను బ్లాక్ వైజ్, గ్రూప్ వైజ్లతో కేవలం 32 సెకన్లలో చెప్పడంతో ఈ రికార్డు సాధించింది. ఆదివారం చైన్నెలోని శివానంద మెమోరియల్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు. భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటరమణ మార్గదర్శకత్వం వహించారు. ఈసందర్భంగా విద్యార్థినిని డీఈఓ విజయ, డీఎస్ఓ రాజిరెడ్డి, ఎంఈఓ ప్రతాప రెడ్డి, ఉపాధ్యాయులు ప్రశంసించారు. కేసీఆర్ హయాంలోనే గ్రామాలకు మహర్దశ చిన్నకోడూరు(సిద్దిపేట): మహాత్ముని స్ఫూర్తితో మాజీ సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చౌడారంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గాంధీ గారి బాటలోనే కేసీఆర్, తెలంగాణ సమాజం స్వరాష్ట్రం కోసం శాంతియుత పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామన్నారు. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం స్ఫూర్తితో పల్లెల అభివృద్ధికి కేసీఆర్ పాటుపడ్డారన్నారు. 60 ఏళ్లలో చేయని అభివృద్ధి కేసీఆర్ చేసి గ్రామాల స్వరూపాలను మార్చారన్నారు. కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వాసుదేవాచారి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమం పట్టని కాంగ్రెస్ -
ఎనిమిదోవారం.. భక్తజన సంద్రం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. వేకువజామునుంచే భక్తులు స్వామివారి పుష్కరిణిలో స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేకపూజలు, పట్నాలువేసి, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఏర్పాట్లను ఆలయ చైర్మన్ నర్సింహారెడ్డి, ఈఓ కృష్ణప్రసాద్, ఏఈఓ సుదర్శన్, శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలు పర్యవేక్షించారు. -
జనసందోహంతోగిరి ప్రదక్షిణ
లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవ సంరంభ ం షురూ అయింది. పోటెత్తిన భక్తులతో హరిద్రాతీరం పరవశించింది. భక్తజన నృసింహ నామస్మరణతో నాచగిరి మార్మోగింది. ఆదివారం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, స్వాతి నక్షత్రవేళ ‘గిరి ప్రదక్షిణ’ ఊరేగింపుతో క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. పీఠాధిపతులు మాధవానంద సరస్వతి, మధుసూదనానంద సరస్వతి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్గుప్తా, ఈఓ రంగాచారి, ఆలయ ధర్మకర్తలు, ఇతర ప్రముఖులు బ్రహ్మోత్సవాల అంకురార్పణ, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సాయంత్రం ఆలయ అర్చక, వేదపండితులు పాంచరాత్ర ఆగమ పద్ధతిలో శ్రీవారి బ్రహ్మోత్సవ పూజలకు శ్రీకారం చుట్టారు. – వర్గల్ (గజ్వేల్ )బ్రహ్మోత్సవం.. ఆధ్యాత్మిక సంరంభం -
కూలీ అందక.. ఆకలి కేక
● రెండు నెలలుగా ఎదురుచూపులు ● నిత్యం 9 వేల మందికి పైగా ‘ఉపాధి’ ● రూ.12 కోట్ల పైచిలుకు బకాయిలుమెదక్జోన్: వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన గ్రామీణ రోజ్ గార్ గ్యారంటీ యోజన (బీఆర్జీవై) పథకం రోజు రోజుకు నీరుగారి పోతుంది. కూలీలకు వారానికోసారి రావాల్సిన డబ్బులు నెలల తరబడి అందడం లేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో కూలీ డబ్బులు రాకపోవటంతో కుటుంబాలకు గడవటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1.63 లక్షల జాబ్కార్డులు జిల్లావ్యాప్తంగా 1.63 లక్షల జాబ్కార్డులు ఉండగా, 3.23 లక్షల మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 9 వేల పైచిలుకు మంది పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా మట్టి రోడ్ల నిర్మాణాలు, కుంటల్లో పూడికతీత, ఇంకుడు గుంతల నిర్మాణం, నర్సరీల్లో మొక్కల పెంపకం, అడవుల్లో కందకాలు, ఫీడర్ ఛానళ్లు.. తదితర పనులు చేస్తున్నారు. కాగా నిబంధనల ప్రకారం బీఆర్జీవై పథకంలో పనులు చేసే కూలీలకు వారం రోజులకోసారి కూలీ డబ్బులు చెల్లించాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి 10 నుంచి డబ్బులు రావటం లేదు. ఈ లెక్కన సుమారు రెండు నెలలకు సంబంధించి రూ.12 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా అంగన్వాడీ, మహిళా భవనాలు, గొర్రెలు, గేదెలు, మేకల షెడ్లు తదితర నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ పనులు, ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులతో పాటు ఇతర లబ్ధిదారులు చేసిన పనులకు ఏడాదిగా నిధులు విడుదల కావడం లేదని తెలిసింది. పథకంలో మార్పులు ఫీల్డ్ అసిస్టెంట్లకు సైతం రెండు నెలలుగా వేతనాలు రావటం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కుటుంబాలు గడవటం లేదని, ప్రభుత్వం వెంటనే ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఒకేసారి 3 నెలల రేషన్
రామాయంపేట(మెదక్): తెల్లరేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త అందించింది. గతంలో మాదిరిగా వచ్చే నెలలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను ఒకేసారి ఇవ్వనున్నట్లు తెలిపింది. వేసవి తీవ్రతతో పాటు రాబోయే కొనుగోలు సీజన్లో గోదాంలలో బియ్యం నిల్వలకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈనిర్ణయం తీసుకుంది. ఈమేరకు మండల కేంద్రాల్లో ఉన్న గోదాంల్లోకి బియ్యాన్ని తరలించడానికి పౌర సరఫరాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 520 రేషన్ దుకాణాలు జిల్లాలో 520 రేషన్ దుకాణాలుండగా, మొత్తం 2,16,716 తెల్లరేషన్ కార్డుదారులున్నారు. ఈ దుకాణాల ద్వారా ప్రతినెల వినియోగదారులకు బియ్యం సరఫరా అవుతున్నాయి. గతేడాది జూన్లో కూడా ఇలాగే మూడు నెలల కోటా బియ్యాన్ని ముందస్తుగానే వినియోగదారులకు అందజేశారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా రేషన్ దుకాణాలకు మూడు నెలల బియ్యం కోటాను విడతల వారీగా సరఫరా చేయనున్నట్లు తెలిసింది. ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం రేషన్ దుకాణాలకు పంపితే సమస్యలు ఎదురవుతాయని, గతంలో మాదిరిగా తాము ఇబ్బందుపాలవుతామని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ దించడానికి తగినంత స్థలం ఉండదని, తక్కువ సమయంలో జిల్లా పరిధిలో అన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేయడానికి సమయం సరిపోదని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి రేషన్ బియ్యం వచ్చే నెలాఖరులోగా వినియోగదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల చొప్పున మూడు నెలలకు గాను 18 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈమేరకు త్వరలో మండల స్థాయి గోదాంలకు రేషన్ బియ్యం సరఫరా అవుతుందని సమాచారం. జిల్లా పరిధిలోని రేషన్ దుకాణాలకు ప్రతినెలా 13,500 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా అవుతున్నాయి. నాలుగైదు రోజుల్లో గోదాంలకు చేరనున్న సన్న బియ్యం స్టాక్ ఏప్రిల్లో పంపిణీకి ఏర్పాట్లు జిల్లాలో 2,16,716 రేషన్ కార్డుదారులుఉత్తర్వులు జారీ కాలేదు వచ్చే నెలలో వినియోగదారులకు మూడు నెలల రేషన్ బియ్యం ఇవ్వాలనే ఆ దేశాలు ఇంకా తమ కు అందలేదు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కాగానే జిల్లా లో గోదాంలకు తద్వారా రేషన్ దుకాణాలకు బియ్యాన్ని సరఫరా చేస్తాం. – జగదీశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి -
లక్ష్యసాధనలో ముందుండాలి
మెదక్జోన్: లక్ష్యసాధనలో మహిళలు ఎప్పుడూ ముందుండాలని మున్సిపల్ చైర్పర్సన్ కానుగ రా ధిక అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని ఔట్డోర్ స్టేడియంలో లక్ష్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నిరంగాల్లో మహిళలు రాణించాలని, ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు వినియోగించుకోవాలన్నారు. అనంతరం వైస్ చైర్మన్ నరేశ్గౌడ్ మాట్లాడుతూ.. స్టేడియం అభివృద్ధికి తన వంతుగా సహకారం అందిస్తానని క్రీడాకారులకు హామీ ఇచ్చారు. క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది భూపతిరాజు, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి నాగరాజు, పీడీలు మాధవరెడ్డి, దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మున్సిపల్ చైర్పర్సన్ రాధిక -
సాధికారితతోనే మహిళాభ్యున్నతి
నారాయణఖేడ్: మహిళల అభ్యున్నతి వారి సాధికారితతోనే ముడిపడి ఉందని, మహిళా ఎంపవర్మెంట్కు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రిలో సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి మహిళా ఉద్యోగులు, సిబ్బందిని ఎమ్మెల్యే సన్మానించారు. క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు బాలికలకు స్వయంగా వ్యాక్సిన్ వేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..14 ఏళ్లుపై బడిన బాలికలు, యువతులు విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోందన్నారు. అలాగే ఖేడ్ శ్రీసరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల 44వ వార్షికోత్సవంలో కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహరాజ్తో కలిసి సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
పెండింగ్లో ఫైళ్లు ఉండొద్దు
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు పెండింగ్లో ఉండొద్దని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. ‘ప్రజాపాలన– ప్రగతి’ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం అదనపు ఎస్పీ నగేశ్తో కలిసి కలెక్టరేట్లో ఫైళ్ల క్లియరెన్స్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పా రు. వేసవి దృష్ట్యా తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎంల గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఏఓ యూనస్, కలెక్టరేట్లోని ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యువతే దేశ భవిష్యత్: ఏఎస్పీ
మెదక్ కలెక్టరేట్: దేశ భవిష్యత్ను నిర్మించే శక్తి యువతలోనే ఉందని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో భాగంగా ‘ 50 ఇయర్స్ ఆఫ్ ఎమర్జెన్సీ– లెసెన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ’ అంశంపై జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టమని, ఆ కాలం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు అనేక పాఠాలు నేర్పిందన్నారు. యూత్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హుస్సేన్, అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
గుది ‘బండ’
● భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర ● తాజాగా ఒక్కో సిలిండర్పై రూ.60 పెంపు ● ఉమ్మడి మెదక్ జిల్లాలో వినియోగదారులపై రూ. 3 కోట్ల భారంసాక్షి, సిద్దిపేట: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై ఏకంగా రూ. 60, కమర్షియల్ సిలిండర్పై రూ. 115 పెంచింది. దీంతో శనివారం నుంచి కొత్త ధరలకే గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు. ఇప్పటికే బియ్యం, నూనె, పప్పులు వంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈక్రమంలో తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ రూ. 922 ఉండగా, రూ. 60 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రూ. 982కు చేరింది. సంగారెడ్డిలో రూ. 905 ఉండగా, ప్రస్తుతం రూ. 965కు చేరింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 11,56,140 గృహ గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో ప్రతి నెల ఒక్కో సిలిండర్ చొప్పున 5 లక్షల మంది వినియోగిస్తున్నారు. దీంతో ఆ కుటుంబాలపై ప్రతి నెల దాదాపు రూ. 3 కోట్ల భారం పడనుంది. ఉజ్వల పథకం కింద తీసుకున్న కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రేషన్ కార్డు కలిగిన పేద, మధ్య తరగతి కుటుంబాలకు రూ. 500కు సిలిండర్ను అందజేస్తోంది. మహాలక్ష్మి లబ్ధిదారుల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఈ ధర ప్రభావం ప్రభుత్వం పై ఎక్కువగా పడనుంది.జిల్లా గ్యాస్ కనెక్షన్లు ప్రస్తుత ధర సిద్దిపేట 3,33,850 రూ. 982 మెదక్ 2,35,412 రూ. 982 సంగారెడ్డి 5,86,878 రూ. 965 -
పర్యటించి.. ప్రశ్నలడిగి
స్టార్ రిపోర్టర్గా మున్సిపల్ చైర్పర్సన్ రాధికఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక ‘సాక్షి’ స్టార్ రిపోర్టర్ అవతారమెత్తారు. శనివారం పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పట్టణ ప్రజలు, మార్నింగ్ వాకర్స్ను కలిసి సమస్యలపై ప్రశ్నలు అడిగారు. ఈసందర్భంగా వారు సమస్యలను ఏకరువు పెట్టారు. వాటిలో 90 శాతం పనులు మున్సిపల్ పరిధిలో పరిష్కరించేవే ఉన్నాయని, త్వరలోనే వాటికి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. – మెదక్జోన్ ● మెదక్ పట్టణానికి బైపాస్ రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. పట్టణంలో చిన్నపాటి కార్యక్రమం జరిగినా, గంటల తరబడి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. కనీసం అంబులెన్స్ సైతం బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. – నాగభూషణం, పట్టణవాసి ● పట్టణంలోని పార్కులు కొన్ని అన్యాక్రాంతం కాగా, మరికొన్ని ఆక్రమణకు గురయ్యాయి. వాటిని అక్రమార్కుల చెర నుంచి విడిపించి వినియోగంలోకి తీసుకురావాలి. పట్టణవాసులకు ఆహ్లాదం అందించాలి. – కొండల్రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగి ● మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. అన్ని దుకాణాలు, హోటళ్లలో ప్లాస్టిక్ కవర్ల చలామణి పెరిగింది. వాటితో కేన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటిని అరికట్టే ప్రయత్నం చేయాలి – శ్రీనివాస్, యువకుడు ● కూరగాయల మార్కెట్ సమీపంలో నిర్మించిన రైతు బజార్ పనులు అర్ధాంతరంగా ఆగిపోవటంతో కూరగాయల వ్యాపారులు, రైతులు రోడ్లమీదనే విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. రైతుబజార్ను పూర్తిస్థాయిలో నిర్మించి సమస్యను పరిష్కరించాలి. – ఆనందం, రిటైర్డ్ ఉద్యోగి ● పట్టణంలోని పిట్లం, మల్లెం, బంగ్లా చెరువులు రోజురోజుకు ఆక్రమణకు గురవుతున్నాయి. అంతేకాకుండా వాటిలోకి పట్టణంలోని మురికినీటిని వదులుతున్నారు. వాటిలో చెత్త వేయడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. – బాలేశ్వర్గౌడ్, పట్టణవాసి ● పట్టణంలోని మూడు చౌరస్తాలు, హెడ్ పోస్టా ఫీస్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. రోడ్డు విస్తరణలో భాగంగా ఆ ప్రాంతంలోని మహనీయుల విగ్రహాలను తొలగించారు. రోడ్డు మ రమ్మతులు అయినప్పటికీ చౌరస్తాలో సుందరీకరణ పనులు చేయటం లేదు. – శంకర్, పట్టణవాసి ● పట్టణంలో కోతుల బెడద విపరీతంగా ఉంది. వాటి దాడిలో గాయపడి పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. వాటిని పట్టి ఇతర ప్రాంతాలకు తరలించి ప్రజలకు రక్షణ కల్పించాలి. – సంజీవరావు, స్థానికుడు ● మెదక్ నుంచి రైల్వేస్టేషన్కు వెళ్లే దారిలో వీధి లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళ చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వెంటనే లైట్లు అమర్చి సమస్యను పరిష్కరించాలి. అలాగే రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన సింథటిక్ ట్రాక్ వృథాగా మారింది. దీనిపై చర్యలు తీసుకోవాలి. – సిద్దన్న, రవి సమస్యలు ఏకరువు పెట్టిన వాకర్స్ వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ -
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక
రామాయంపేట(మెదక్): రామాయంపేట డిప్యూటీ రేంజ్ అధికారిణి గీతా అగర్వాల్ ఆశాఖలో రాష్ట్రస్థాయి ఉత్తమ మహిళా ఉద్యోగిగా ఎంపికయ్యారు. ఈమేరకు శనివారం దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జవేటర్ ఆఫ్ ఫారెస్ట్) సువర్ణ, అదనపు డీజీ స్వాతి లక్రా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గతేడాది జిల్లాస్థాయి ఉత్తమ అధికారిణిగా గీత అవార్డు అందుకున్నారు. ఈసందర్భంగా ఆశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. 10న ఆర్టిజన్ల మహాధర్నా మెదక్ కలెక్టరేట్: విద్యుత్ శాఖలోని ఆర్టిజన్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న హైదరాబాద్ టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపడుతున్నట్లు టీవీఏఈజేఏసీ చైర్మన్ బీఎన్ స్వామి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్శాఖలో 20 నుంచి 30 ఏళ్లుగా పనిచేస్తున్నా, ఇప్పటికీ రెగ్యులర్ కార్మికులుగా గుర్తింపు పొ ందలేకపోవడం దారుణం అన్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఆర్టిజన్లు సమస్యల పరిష్కారానికి చేపడుతున్న ఈ సమ్మెకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని కార్మికులు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సర్కార్ బడి విద్యార్థుల సత్తా పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని కొత్తపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మనోహర్, విష్ణువర్ధన్ రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్కు ఎంపికై నట్లు గైడ్ టీచర్ వేణుగోపాల్ తెలిపారు. ఈసందర్భంగా హెచ్ఎం భూజాత, టీచర్లు దత్తురెడ్డి, శివకుమార్, నాగభూషణం, ప్రసాద్, తులసీరాం, సోమశేఖర్ విద్యార్థులను అభినందించారు. జాతీయస్థాయి రగ్బీ పోటీలో ప్రతిభ నర్సాపూర్ రూరల్: జాతీయస్థాయి రగ్బీ పోటీలో మండలంలోని నారాయణపూర్ గిరిజన గురుకుల బాలికల కళాశాల, పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచినట్లు ప్రిన్సిపాల్ లలితాదేవి శనివారం తెలిపారు. కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఎన్. వందన ఇవాళ బీహార్లో జరిగిన జాతీయస్థాయి ఎస్జీఎఫ్ రగ్బీ పోటీలో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని ప్రతిభ కనబరచినట్లు చెప్పారు. అలాగే 9వ తరగతి విద్యార్థిని నందిని ఇటీవల చైన్నెలో జరిగిన జాతీయస్థాయి అస్మిత్ ఖేల్ ఇండియా రగ్బీ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ఆడి కాంస్య పతకం సాధించింది. ఈసందర్భంగా విద్యార్థులను అధ్యాపకులు తోటి విద్యార్థులు అభినందించారు. -
వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
చిన్నశంకరంపేట(మెదక్): తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆపార్టీ రాష్ట్ర నాయకుడు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ వెళ్తుండగా, నార్సింగి మండల కేంద్రంలో కొద్దిసేపు ఆగి కార్యకర్తలతో మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. రాష్ట్రంలో ఆపార్టీ మళ్లీ గెలిచే పరిస్థితి లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం అదే పరిస్థితిలో ఉందన్నారు. ఈసందర్భంగా నార్సింగి నుంచి శాలిపేట వరకు రోడ్డు అభివృద్ధికి కృషి చేయాలని, రైల్వే వంతెన నిర్మాణానికి సహకరించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు నర్సింహులు, నాయకులు లింగారెడ్డి, నరేష్, యాదగిరి, శ్రీనివాస్, నరేష్నాయక్, సాయికుమార్, వినోద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ బిల్లుల మంజూరులో జాప్యం మెదక్జోన్: మెడికల్ బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోందని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి అన్నారు. శుక్రవారం యూనియన్ బాధ్యులు కలెక్టర్ ప్రతిమాసింగ్ను మర్యాద పూర్వకంగా కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి మెడికల్ బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు బయట అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రారామిరెడ్డి, సంగయ్య, హీరాలాల్, రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అల్లాదుర్గం(మెదక్): పేదలందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు డిప్యూ టీ డీఎంహెచ్ఓ అనీల తెలిపారు. శుక్రవారం అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. అన్ని రకాల డాక్టర్లతో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన వారికి జిల్లా, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. వంద రోజులలో నాలుగు విడతలుగా జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైద్యులు నవ్య, అశ్విని, సర్పంచ్ సౌమ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి ‘ప్రగతి ప్రణాళిక’ గజ్వేల్: మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’దోహదపడుతుందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల్లో పాలన తీరు మెరుగుపరచడంతోపాటు పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కాగా 16వార్డులో శిథిలావస్థలో ఉన్న మొండి గోడలను తొలగించాలని మున్సిపల్ చైర్పర్సన్, అధికారులు నిర్ణయించారు. -
వన్యప్రాణుల దాహం తీరేదెలా!
మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఏదో ఒక రకంగా తాగు నీరు లభించే అవకాశాలు ఉంటాయి. కానీ అడవుల్లో ఆ వెసులుబాటు ఉండదు. ఉన్న వాగులు, వంకలు ఎండలకు పూర్తిగా అడుగంటుతాయి. ఈక్రమంలో వన్యప్రాణులు తాగు నీటి కోసం వెంపర్లాడుతుంటాయి. కౌడిపల్లి లోత్వాగ్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన సాసర్పిట్లు ధ్వంసమై ఇలా దర్శనమిచ్చాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి వాటికి మరమ్మతులు చేయించి నీరు అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు. – కౌడిపల్లి(నర్సాపూర్) -
సమన్వయంతో పనిచేయండి
మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించి ఉమ్మడి మెదక్ జిల్లాను టాప్లో నిలపాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మూడు జిల్లాల కలెక్టర్లు, జిల్లాల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఉమ్మడి జిల్లాకు తాగు, సాగు నీటిని అందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా, ఈ వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు ప్రజాప్రతినిధులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఉమ్మడి మెదక్ జిల్లాను టాప్లో నిలపండి ఇన్చార్జి మంత్రి వివేక్ కలెక్టరేట్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంకాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ఇది మూడోసారని, గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. జిల్లాలో వానాకాలంలో భారీ వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా పరిశీలించి, నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి పైసా ఇవ్వలేదన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ నిధుల నుంచి ఫైర్ వాహనాలు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హత్నూరలో ఫైర్స్టేషన్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. డంప్యార్డుల పక్కన అర ఎకరం ప్రభుత్వ స్థలం కేటాయిస్తే చెత్త నుంచి బయో డీజిల్ తయారు చేసేందుకు గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ముందుకు వచ్చాడని వివరించారు.అర్హులైన ప్రతి రైతుకు బీమా చేయించే బాధ్యత వ్యవసాయ అధికారులు తీసుకోవాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్షెట్కార్ సూచించారు. అలాగే కేంద్రం సబ్సిడీపై అందించే సూర్య హర్ఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెదక్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు రోహిత్రావు, సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు ప్రతిమాసింగ్, ప్రావీణ్య, హైమావతితో పాటు మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్, ఎస్పీ శ్రీనివాస్రావు, అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దు రాళ్లు ఏర్పాటు
న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని ముంగి తండా పరిధిలో గల నిమ్జ్ ఏర్పాటుకు సంబంధించి శుక్రవారం పోలీస్ బందోబస్తు మధ్య సరిహద్దు రాళ్ల ఏర్పాటు ప్రారంభమైంది. తమకు పూర్తిస్థాయిలో పరిహారం అందించడంతోపాటు తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతే నిమ్జ్ పనులు చేపట్టాలని నిమ్జ్ భూ బాధితులు, తండా వాసులు రెండు రోజులుగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు శుక్రవారం ఉదయం తండాకు చేరుకుని భారీ పోలీస్ బందోబస్తు మధ్య సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తండాలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ అధ్వర్యంలో 52 మంది పోలీస్ల బందోబస్తు మధ్య తహాసీల్దార్ ప్రభులు, ఆర్ఐ శ్యామ్రావు, సర్వేర్, ఇతర సిబ్బంది హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. -
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి
చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని ప్రజారోగ్య రాష్ట్ర సంచాలకులు డాక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు పీహెచ్సీలో ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆరోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలు, అసంక్రమిత వ్యాధులు, క్యాన్సర్, ఎయిడ్స్పై అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట నోడల్ అధికారి డాక్టర్ వినోద్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, నిర్మల, దీప్తి, మీనా, ఐశ్వర్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
నిధులు లేకుండా ఎలా ..?
కొల్చారం(నర్సాపూర్): నిధులు విడుదల చేయకుండా ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ముందుకు సాగుతుందా..? అని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం మండలంలోని సంగాయిపేటలో రూ. 30 లక్షలతో నిర్మించనున్న గోదాంతో పాటు పలు గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కేంద్రం నుంచి వస్తున్న ఉపాధి హామీ నిధులను ఖర్చు చేయడం తప్పించి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది లేదన్నారు. ఇప్పటికే కొత్త సర్పంచ్లు నిధుల లేమితో గ్రామాల్లో పనులు చేయలేని పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం గ్రామ సమాఖ్య భవనాలు నిర్మించడం హర్షనీయమన్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసా, ఏఓ శ్వేతా కుమారి, సంగాయిపేట రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఉప సర్పంచ్ నందు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రమేశ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సునీతారెడ్డి -
అభివృద్ధి దిశగా గ్రామాలు
రామాయంపేట(మెదక్): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఆర్.వెంకటాపూర్లో పంచాయతీ, అంగన్వాడీ భవన నిర్మాణ పనులు, లక్ష్మాపూర్లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పిట్టలవాడకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉమ, మాజీ సర్పంచ్ మహేందర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు చింతల స్వామి, నాయకులు రమేశ్రెడ్డి, సంజీవరెడ్డి, పోచమ్మల గణేశ్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
సమస్యల కూత!
గజ్వేల్: మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మా ర్గంలోని రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు నానా ఇక్కట్లు పడుతున్నారు. తాగునీరు మొదలుకొని ఇతర కనీస వసతులు కరువయ్యాయి. ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరగకపోవడంతో ట్రాక్లు దాటడం ప్రమాదకరంగా మారింది. 50 శాతం వరకు పనులు పూర్తి మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున న్యూబ్రాడ్గేజ్ లైన్న్ నిర్మాణం జరుగుతుండగా.. రూ. 1160.47 కోట్లను వెచ్చిస్తున్నారు. 2017లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీ దుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్నతో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా లాంటి మహా నగరాలను కలుపుతూ జాతీయ లైన్గా ఆవిర్భవించనుంది. ఉత్తర తెలంగాణ లోని సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మీదుగా సిద్దిపేట వరకు 74 కిలోమీటర్ల మేర.. అంటే మొత్తం లైన్ పొడవులో 50 శాతం వరకు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం సిరిసిల్ల వైపునకు పను లు సాగుతున్నాయి. కాగా 2023 అక్టోబర్ 3న ప్యాసింజర్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.ట్రాక్లు దాటాలంటే నరకమే ఈ లైన్పై మనోహరాబాద్ తర్వాత నాచారం(స్టేషన్), అప్పాయిపల్లి (హాల్ట్), గజ్వేల్ (స్టేషన్), కొడకండ్ల (హాల్ట్), లకుడారం (స్టేషన్), కొమురవెల్లి (హాల్ట్), దుద్దెడ (స్టేషన్), సిద్దిపేట(స్టేషన్) ఉన్నాయి. స్టేషన్లతో పాటు హాల్ట్ స్టేషన్లలోనూ కనీస వసతులు కరువయ్యాయి. గజ్వేల్లో ప్రయాణికులు ట్రాక్పై ఒకవైపు నుంచి మరోవైపునకు వెళ్లేందుకు ప్రారంభించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పిల్లర్ల దశలో నిలిచిపోయాయి. ఫలితంగా ట్రాక్ను దాటడం ప్రమాదకరంగా పరిణమించింది. నాచారం స్టేషన్ గ్రామానికి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లేందుకు రోడ్డు సక్రమంగా లేక ఇబ్బందులు తప్పడం లేదు. లకుడారం, దుద్దెడ స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు కనీస తాగునీటి వసతి కూడా సక్రమంగా లేదు. పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వాష్రూమ్లు వాడకంలో లేవు. మరోవైపు ఏ స్టేషన్లోనూ తగినంత సిబ్బంది లేరు. హాల్ట్ స్టేషన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నిర్వహణ లేక ఈ స్టేషన్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. కాగా ఈ మార్గంలో నడుస్తున్న రైలు వేగం పెంచకపోవడంతో ప్రయాణికుల్లో ఆసక్తి తగ్గుతుంది. రైల్వేస్టేషన్లలో కనీస వసతులు కరువు తాగునీరు మొదలుకొని అన్నింటికీ తిప్పలే.. సిబ్బంది కొరతతో అరకొర సేవలు -
పత్తి పంటపై రైతులకు అవగాహన
హత్నూర(సంగారెడ్డి): పత్తి పంటపై రైతులకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ పేర్కొన్నారు. హత్నూర రైతువేదికలో సంగారెడ్డి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఏడీఏ రమాదేవి, శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మలు మాట్లాడుతూ...అధిక సాంద్రత పద్ధతి వల్ల చాలావరకు మొక్కల ఎత్తు తగ్గించి పూత, కాత బాగా వచ్చి ప్రతీ మొక్కకు కాయల సంఖ్య పెంచవచ్చన్నారు. మంచి దిగుబడితో ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన డా.ఎన్.హరి, జహీరాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డా.ఎన్.స్నేహలత, డా.రమేశ్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, వ్యవసాయ విస్తరణ అధికారి రమేశ్, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
వేలానికి దొడ్డు బియ్యం
జిల్లాలో ఏడాదిగా పేరుకుపోయిన దొడ్డు బియ్యం వేలానికి ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికే ముక్కిపోయి, పురుగులు పట్టిన ఈ బియ్యం కొనుగోలుకు మొదట్లో టెండర్ పిలిచినా, ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ధర తగ్గించి రెండోసారి జిల్లా పరిధిలోనే వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈమేరకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అయితే పూర్తిగా చెడిపోయిన ఈ బియ్యం కొనుగోలు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా..? వేచి చూడాలి. – రామాయంపేట(మెదక్) జిల్లావ్యాప్తంగా 520 రేషన్ దుకాణాలు ఉండగా, వీటి ద్వారా గతేడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తుంది. అంతకుముందు సరఫరా చేసిన దొడ్డు బియ్యం నిల్వలను పక్కన పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏడాది గడుస్తున్నా, పౌర సరఫరాల శాఖ తాత్సారం చేయడంతో బియ్యం ఎందుకు పనికిరాకుండా పోయాయి. రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్ గోదాంల్లో 3,044 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం పురుగులమయమైంది. ఈస్టాక్ను తరలించే విషయమై పౌర సరఫరాల శాఖ తాత్సారం చేయడంతో తుట్టెలు కట్టి ఎలుకలకు ఆహారమయ్యాయి. వీటిని భద్రపరచడం డీలర్లకు సమస్యగా మారింది. ఈ బియ్యం విలువ సుమారు రూ. 11 కోట్ల పైమాటే. చెడిపోయిన ఈబియ్యాన్ని విక్రయించడానికి ప్రభుత్వం మొదట కిలో రూ. 24కు చొప్పున విక్రయించడానికి టెండర్లు ఆహ్వానించగా, ఎవరూ ముందుకు రాలేదు. ఇటీవల సమావేశమైన మంత్రివర్గం పురుగులు పట్టిన దొడ్డు బియ్యం తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. మొదట్లో టెండర్ పిలిచినా, ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈనిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈమేరకు రూ. 21.60 కిలో చొప్పున విక్రయించడానికి గాను త్వరలో టెండర్లు పిలువనున్నారు.జిల్లాలో ఇలా.. బియ్యం నిల్వలు (మెట్రిక్ టన్నుల్లో) గోదాంలు 259.254 రేషన్ దుకాణాలు 503.116 బఫర్ గోదాంలు 2281.675జిల్లాలో పేరుకుపోయిన 3,044 మెట్రిక్ టన్నులు కిలో రూ. 21.60 విక్రయించాలని నిర్ణయం ప్రభుత్వానికి రూ. కోట్ల మేర నష్టం -
భూసేకరణకు రైతులు సహకరించాలి
రైల్వే డీఎన్ ధర్మరాజు, ఆర్డీఓ రమాదేవి చిన్నశంకరంపేట(మెదక్): రైల్వే డబుల్ లేన్కు అవసరమైన భూ సేకరణకు రైతులు సహకరించాలని రైల్వే డీఎన్ ధర్మరాజు, మెదక్ ఆర్డీఓ రమాదేవి కోరారు. బుధవారం మండలంలోని మిర్జాపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో భూములు పరిశీలించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామానికి వెళ్లే రైల్వే బ్రిడ్జిలో నీరు నిల్వకుండా చూస్తే అవసరమైన భూ ములు ఇచ్చేందుకు తమకేలాంటి అభ్యంతరం లేదన్నారు. మరికొందరు రైతులు తమకు బ్రిడ్జితో సమస్య ఏర్పడుతుందని, మరో చోట నుంచి రహదారి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈసందర్భంగా డీఎన్ ధర్మరాజు మాట్లాడుతూ.. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బ్రిడ్జిలో చెరువు నీరు నిల్వకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. బ్రిడ్జి వద్ద నుంచి నీటిని తరలించేందుకు అవసరమైన పైప్లైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అదనపు దారి విషయంలో గ్రామస్తులు చర్చించుకొని రహదారికి అవసరమైన భూమిని అందిస్తే అదనపు రోడ్డును కూడా వేసి ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో రైల్వే డబుల్ లైన్ భూసేకరణ అధికారులు రాకేష్, రమేష్, చిన్నశంకరంపేట తహసీల్దార్ మాలతి, ఆర్ఐలు రాజు, వినయ్, మిర్జాపల్లి ప్రజాప్రతినిధులు రమణ, జనార్దన్, మనోజ్, యాదగిరి, సంజీవ్, గంగాధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆఖరి మజిలీకి అవస్థలే..
నర్సాపూర్: మున్సిపాలిటీలోని శ్మశానవాటికలో సమస్యలు తిష్ఠవేశాయి. అధికారులు కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. గతే డాది సెప్టెంబర్లో జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పట్టణంలో పర్యటించారు. ఈసందర్భంగా రూ. కోటి వెచ్చించి నిర్మించిన శ్మశానవాటికను ప్రారంభించారు. అయితే నీటి వసతి కల్పించకపోవడంతో అది ప్రారంభించినప్పటి నుంచి అలంకారప్రాయంగానే మిగిలింది. ఆరు నెలలు కావొస్తున్నా, అధికారులు వినియోగంలోకి తేలేకపోయారు. మోటార్, వైరును దొంగలు ఎత్తుకుపోవడంతో నీటి కటకట ఏర్పడింది. కొత్త బర్నింగ్ యూనిట్ నిర్మించినా, పాత బర్నింగ్ యూనిట్పైనే మృతదేహాలను దహనం చేస్తు న్నారు. మృతుడి కుటుంబీకులు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇస్తేనే నీటి ట్యాంకర్ను వైకుంఠధామం వద్దకు పంపుతున్నారు. దహన సంస్కారాలు పూర్తవగానే ఆరు బయట స్నానాలు చేసి ఇళ్లకు వెలుతున్నారు. మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయమై మున్సిపల్ ఏఈ కృష్ణయ్యను వివరణ కోరగా.. వైకుంఠధామంలో బోరు వేసి కరెంట్ మోటార్ బిగించామని, రెండు సార్లు మో టార్ను దొంగలు ఎత్తుకుపోయారని తెలిపారు. బోరుకు మరమ్మతులు చేసి, నీటి సదు పా యం కల్పించి శ్మశానవాటికను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నీటి వసతి లేక నిరుపయోగం పట్టించుకోని అధికారులు -
మూడు తహసీల్దార్ కార్యాలయాలకు భవనాలు
మెదక్ అర్బన్: జిల్లాలో నూతనంగా ఏర్పాటైన మూడు మండలాల్లో, తహసీల్దార్ కార్యాలయాల భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని హవేళిఘణాపూర్, చిలప్చెడ్, నిజాంపేట మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 51 తహసీల్దార్, 5 ఆర్డీఓ కార్యాలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో జిల్లాలోని మూడు మండలాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న తహసీల్దార్ కార్యాలయాల్లో తిప్పలు తప్పనున్నాయి. రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపల్ కమిషనర్గా శ్రావణ్ నియామకయ్యారు. గ్రూప్1లో ఎంపికై న ఆయన, మొదటి పోస్టింగ్ కమిషనర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాన ని అన్నారు. ఈమేరకు కౌన్సిలర్ నాగరాజు తదితరులు నూతన కమిషనర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలోని పశువైద్యాధికారి సమయపాలన పాటించడం లేదని పాడి రైతులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బుధవారం గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఆస్పత్రికి వెళ్లగా, డాక్టర్ అందుబాటులో లేరు. దీంతో వారు నిరసన తెలిపారు. సరైన సమయంలో వైద్యం అందక మూగజీవాలు మృతి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా వెటర్నరీ ఏడీకి సమాచారం ఇవ్వగా, ఆయన వెంటనే ఫిర్యాదు పత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపించాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు రాజిరెడ్డి, శ్రీకాంత్, శ్రీరాములు, తిరుపతిరెడ్డి, పర్షరాములు, కనకరాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: హైదరాబాద్లో గురువారం నుంచి జరిగే జనగణన శిక్షణకు జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి ఎంపికయ్యారు. ఈసందర్భంగా బుధవారం ఆయన కలెక్టర్ ప్రతిమాసింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగే ఈ శిక్షణలో పాల్గొననున్నారు. జిల్లాలో వేసవిలో మొదటి దశలో జరిగే జన గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని రాజిరెడ్డి తెలిపారు. నేడు, రేపు తాగు నీటి సరఫరా బంద్ మెదక్జోన్: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రెండు రోజుల పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపి వేస్తున్నామని మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ నాగభూషణం బుధవారం తెలిపారు. భగీరథ నీరు సరఫరా అయ్యే పైపులైన్లు పెద్దారెడ్డిపేట, ఎల్లాపూర్ ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని వాటి మరమ్మతుల కారణంగా ఈనెల 5, 6వ తేదీల్లో మెదక్ నియోజకవర్గంలోని 275 గ్రామాలకు, ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల పరిధిలోని 80 గ్రామాలు, మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరా నిలిపి వేస్తున్నామన్నారు. కాగా ముందస్తుగా ఆయా గ్రామాల సర్పంచ్లకు సమాచారం అందించామన్నారు. -
సింగూరు కాలువ మరమ్మతులు ప్రారంభం
పుల్కల్(అందోల్): సింగూరు కాలువ సిమెంట్ లైనింగ్ పనులు పునఃప్రారంభమైనాయి. గతేడాది గుత్తేదారు పనులు ప్రారంభించిన అనంతరం వానాకాలం రావడంతో సాగునీటికి ఇబ్బంది కలుగుతుందని పనులను నిలిపివేశారు. ప్రస్తుతం డ్యాం మట్టికట్టకు మరమ్మతులు జరుగుతున్నందున యాసంగి పంటలకు విరామం ప్రకటించారు. దీంతో కాలువ సిమెంట్ లైనింగ్ పనులను కూడా గుత్తేదారు ప్రారంభించారు. ప్రస్తుతం కాలువలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి కాలువను మార్కింగ్ చేసుకుంటున్నారు. సంగారెడ్డి టౌన్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న సీతారామచంద్రుల కల్యాణోత్సవ ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇంటివద్దకే అందించనున్నట్లు సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. ఇందుకోసం భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.151 చెల్లించి https:// www.tgsrtclogistics. gov.in ద్వారా తలంబ్రాలు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. డిపో కార్యాలయంలో బుధవారం తలంబ్రాల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. తలంబ్రాలు కావాల్సిన వారు ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో కూడా సంప్రదించవచ్చన్నారు. -
శిథిల ప్రక్షాళన
నాచగిరిలో నిరర్ధక భవనాల తొలగింపు వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రంలో గుదిబండగా మారిన శిథిల భవనాల తొలగింపునకు మోక్షం లభించింది. శిథిల ప్రక్షాళన.. సౌకర్యాల కల్పనే’ధ్యేయంగా ఆలయం చుట్టూ చెత్త చెదారం, పిచ్చిమొక్కలు, పెరిగి, బూత్బంగ్లాలను తలపిస్తున్న దశాబ్ధాల క్రితం నాటి శిథిల భవనాల కూల్చివేత పనులు వేగవంతం చేసింది. అక్కడ దుకాణ సముదాయాలు, వసతి గృహాలు నిర్మించి యాత్రికులకు సౌకర్యాలు మెరుగుపరచే దిశగా అడుగులు వేస్తున్నది. అంచెల వారీగా ఒక్కో పని చక్కబెట్టుకుంటూ గుడిని సాధ్యమైనంత అభివృద్ధి చేసుకుందామనే యోచనలో ఆలయ యంత్రాంగం ముందుకు సాగుతున్నది. శిథిలమై.. చిక్కిశల్యమై.. భక్తుల సౌకర్యం కోసం దశాబ్ధాల క్రితం నిర్మించిన అనేక భవనాలు శిథిలమయ్యాయి. దుకాణ సముదాయాల వెనుక, ప్రధాన గుడి పక్కన అనేక శిథిల భవనాలు ఆలయ శోభను దెబ్బతీస్తున్నాయి. హరిద్రాతీరం వెంబడి, సభామండపం పక్కన సత్రాలు ఇదే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటిని తొలగిస్తే ఆలయ శోభ ఇనుమడించడంతోపాటు సౌకర్యా లు మెరుగుపరిచే వీలు కలుగుతుంది. రెండేళ్ల క్రితమే అనుమతి నాచగిరి గుడి చుట్టూ శిథిల భవనాల తొలగింపునకు రెండేళ్ల క్రితమే దేవాదాయశాఖ నుంచి అను మతి వచ్చింది. తాజాగా ఆలయ యంత్రాంగం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. శిథిల ప్రక్షాళన దిశగా తొలగింపు పనులను వేగవంతం చేసింది. -
నీటిఎద్దడి నివారణకు రూ.27 కోట్లు
ప్రతిపాదించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: వేసవిలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రూ.27కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రఘువీర్, ఇంట్రా ఈఈ శేఖ్ పాష, గ్రిడ్ ఈఈ నాగభూషణం, డిప్యూటీ ఈఈ ఫణివర్మ, ఏఈలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఖేడ్ నియోజకవర్గంలో నీటి ఎద్దడి పరిష్కారానికి రూ.7కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్నాలా ప్రాజెక్టు నుంచి కంగ్టి మండలంలోని 40 గ్రామాలు (హ్యాబిటేషన్లు), జుక్కల్ నియోజకవర్గంలోని 30 గ్రామాలకు నీటి సరఫరాకు రూ.20కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లోని 42వరకు బోర్ల ఫ్లష్షింగ్, డీపనింగ్కు రూ.30లక్షలు, 111 గ్రామాలకు హైరింగ్ ద్వారా నీటి సరఫరాకు రూ.25 లక్షలు, అత్యవసర పరిస్థితుల్లో రవాణా ద్వా రా నీటి సరఫరాకు రూ.1.5కోట్లు అవసరం అని గుర్తించామన్నారు. -
బాలికలకు హెచ్పీవీ టీకా
జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులురామాయంపేట(మెదక్): విద్యార్థినులు గర్భాశయ కేన్సర్ బారిన పడకుండా కేంద్ర వైద్యారోగ్యశాఖ హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాక్సిన్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు ఇవ్వనున్నారు. ఈమేరకు జిల్లా పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రిలో గుర్తించిన విద్యార్థినులకు టీకా ఇవ్వనున్నారు. త్వరలో జిల్లాలో టీకా పంపిణీ ప్రారంభమవుతుందని వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే డాక్టర్లతో పా టు నర్సులు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కాగా టీకా తీసుకుంటే భవిష్యత్తులో కేన్సర్ సోకే ప్రమాదాన్ని 90 శాతం వరకు తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు బాలికలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు. -
బిల్లుల చెల్లింపులో జాప్యం వద్దు
కలెక్టర్ ప్రతిమాసింగ్నర్సాపూర్/కౌడిపల్లి: ఇందిరమ్మ ఇంటి బిల్లుల చెల్లింపులో జాప్యం చేయొద్దని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని 12వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. నిర్మాణం పూర్తవగానే నిబంధనల మేరకు బిల్లులు అందుతాయని తెలిపారు. కాగా పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఆమె వెంట ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ ప్రభాకర్, హౌసింగ్ డీఈ ప్రభు, ఏఈ రాజ్కుమార్తో పాటు నాయకులు ఉన్నారు. అనంతరం కౌడిపల్లిలో పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం ఇసుక పంపిణీ చేసిందా..? బిల్లులు వచ్చాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. కాగా ప్రభుత్వ ఇసుక రాలేదని వారు చెప్పగా, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓను ఎందుకు ఇసుక ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక ఇంటికి 40 టన్నులు ఇసుక సరఫరా చేస్తుందని, ఎంతమంది లబ్ధిదారులు తీసుకున్నారనే వివరాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్, పంచాయతీరాజ్ అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, హౌసింగ్ డీఈ ప్రభు, ఏఈ అభిషేక్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, ఆర్ఐ విజయలక్ష్మి నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వసూళ్లు.. వాటాలు!
● అనుమతి లేని డాక్యుమెంట్ రైటర్ల హవా ● డాక్యుమెంట్కు రూ. 3 వేలు వసూలు ● లిటిగేషన్ ల్యాండ్లకు కనక వర్షం అవినీతికి కేరాఫ్గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతుంది. ఎలాంటి లైసెన్స్లు లేని డాక్యుమెంట్ రైటర్లు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఒక్కో డాక్యుమెంట్కు రూ.3 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. వీటిని అధికారులు.. రైటర్లు వాటాలేసి పంచుకుంటున్నారు. లిటిగేషన్ ల్యాండ్లు ఈ కోటరీకి కనక వర్షం కురిపిస్తున్నాయి. కనీస న్యాయ పరిజ్ఞానం లేని రైటర్లు సైతం డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారు. జిల్లాలో నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, సుమారు 35 మంది డాక్యుమెంట్ రైటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. – మెదక్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎలాంటి సేవలు అందాలన్నా, వీరే క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో డాక్యుమెంట్కు సాధారణంగా రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో సుమారు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు రిజిస్ట్రార్ ఆఫీస్కు చెల్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బాండ్ పేపర్కు కొంత పోనూ మిగితావి టైప్ రైటర్, డాక్యుమెంట్ ఏజెంట్ వాటా లేసి పంచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇక ఏవైనా భూసమస్యలుంటే, వాటి రేటు రూ. వేలల్లో ఉంటుంది. ముఖ్య అధికారి తమకు అనుకూలంగా ఉంటే సరి, లేకుంటే ఆయన లేని సమయంలో కింది స్థాయి ఇన్చార్జిలు, రూ. వేలు తీసుకొని పని పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. డీటీసీపీ లేని ప్లాట్లు, కచ్చా లేఅవుట్, మార్టిగేజ్ అయిన ప్లాట్లు, టైటిల్ సమస్యలున్న వాటివి కూడా చక్క బెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈసీ, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ తదితర సేవలకు అందిన కాడికి దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. చివరకు డాక్యుమెంట్పై సంతకం తీసుకునే ఆఫీస్ సబార్డినేట్ సైతం డాక్యుమెంట్కు రూ.100 వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రద్దు అయినా కొనసాగుతున్న వ్యవస్థ న్యాయ పరమైన జ్ఞానమున్న అడ్వకేట్ లాంటి వారు డాక్యుమెంట్ రైటర్లుగా కొనసాగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కనీస న్యాయ పరమైన పరిజ్ఞానంలేని వారు కూడా, ఏజెంట్లుగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని, డాక్యుమెంట్ రైటర్ విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టణ ప్రాంతాలో, రోజు వారీగా రూ. వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. రియల్ ఎస్టేట్ దందా జోరందుకున్న కాలంలో వీరి ఆగడాలు ఎక్కువ కావడంతో, 2009లో ప్రభుత్వం డాక్యుమెంట్ లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిసింది. అయినా ఏళ్ల తరబడి దందా నడుపుతున్న వారు, ఇప్పటికీ డాక్యుమెంట్ రైటర్లుగా కొనసాగుతున్నారు. అధికారులకు వారధిగా పని చేస్తూ అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. కొంత మంది కనీసం ఇంటర్, డిగ్రీ చదువుకోని వారు కూడా డాక్యుమెంట్ రైటర్లుగా పని చేస్తున్నారు. నిజానికి రిజిస్ట్రేషన్ లాంటి సేవలకు ఎలాంటి డాక్యుమెంట్ రైటర్ అవసరం లేదు. విషయమంతా ఆన్లైన్లో ఉంటుంది. అక్కడ పేర్లు వివరాలు మారిస్తే సరిపోతుంది. ప్రస్తుతం మండల రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు అదే పద్ధతిన కొనసాగుతున్నాయి. అక్కడ ఎలాంటి డాక్యుమెంట్ రైటర్లు లేరు. నిబంధనల మేరకే సేవలు 2009లో అప్పటి ప్రభుత్వం డాక్యుమెంట్ రైటర్ లైసెన్స్లు రద్దు చేసింది. తిరిగి వాటిని పునరుద్ధరించలేదు. కనీస న్యాయ పరిజ్ఞానం ఉన్నవారు, విద్యాధికు లు డాక్యుమెంట్లు తయారు చేసు కోవచ్చు. తాము డాక్యుమెంట్ రైటర్ల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదు. నిబంధనలకు అనుగుణంగానే సేవలు అందిస్తున్నాం. – కిరణ్కుమార్, మెదక్ సబ్ రిజిస్ట్రార్ -
జాతీయస్థాయిలో కానిస్టేబుల్ ప్రతిభ
మెదక్కలెక్టరేట్: కానిస్టేబుల్ సాయికుమార్ విధుల్లో రాణించడంతో పాటు క్రికెట్లో జాతీయస్థాయికి ఎదగడం అభినందనీయమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయనను సన్మానించి నగదు ప్రోత్సా హకం అందజేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల తిరుపతిలో జరిగిన సౌత్జోన్ క్రికెట్ టోర్నమెంట్లో సాయికుమార్ అద్భుత ప్రదర్శనతో జట్టును సెమీ ఫైనల్ వరకు చేర్చడంలో కీలకపాత్ర పోషించినట్లు చెప్పారు. అలాగే ఎలైట్ క్రికెట్ ప్రీమియర్ లీగ్లో తెలంగాణ పోలీస్ జట్టును విజేతగా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించాడని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్ఐ శైలేందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్రెడ్డి, సీసీ రాజేందర్ సిబ్బంది త దితరులు పాల్గొన్నారు. -
గర్భస్రావాలు
ఆందోళన కలిగిస్తోన్నసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గర్భస్రావం (మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ–ఎంటీపీ) కేసుల నమోదు వృద్ధి రేటు తెలంగాణలో గణనీయంగా పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. ఐదేళ్లలో ఏకంగా 900% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024–25లో రాష్ట్రవ్యాప్తంగా 16,059 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) రాష్ట్రంలో గర్భ నిరోధక మాత్రల వినియోగంపై దృష్టి సారించింది. అన్వాంటెడ్ కిట్గా పిలుచుకునే ఈ మాత్రలు హిమాచల్ప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నట్లు డీసీఏ గుర్తించింది. ఈ మాత్రల వినియోగంపై జిల్లాల్లోని డ్రగ్ ఇన్స్పెక్టర్ల ద్వారా ఆరా తీస్తోంది. ఈ అన్వాంటెడ్ కిట్స్ ఏయే మెడికల్ ఏజెన్సీలకు సరఫరా అయ్యాయి? వాటిని ఏ మెడికల్ షాపులకు విక్రయించారు? లేదా ఆస్పత్రులకు పంపారు? ఈ మాత్రలు ఎవరికి ఇచ్చారు? వంటి వివరాలను డ్రగ్ ఇన్స్పెక్టర్లు సేకరిస్తున్నారు. ప్రతి నెలా కనీసం 15 మెడికల్ షాపులనైనా చెక్ చేస్తున్నామని మెదక్ జిల్లాకు చెందిన ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగం గర్భస్రావం మాత్రలు నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ మాత్రలను మెడికల్ షాపుల్లో విక్రయించడానికి వీలు లేదు. గైనకాలజీ వైద్యసేవలందించే ఆస్పత్రులు మాత్రమే వీటిని వినియోగించాలి. కానీ, రాష్ట్రంలో వీటి వినియోగం విచ్చలవిడిగా సాగుతోందనే విమర్శలున్నాయి. పీఎంపీలు, ఆర్ఎంపీల సూచనల మేరకు వీటిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలాగే గర్భందాల్చిన నిర్ణీత సమయంలోపే వీటిని వినియోగించాలి. కానీ నెలలు నిండాక కూడా వీటిని వాడటంతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరైతే శాశ్వతంగా మాతృత్వాన్ని కోల్పోతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. పల్లెల్లోనూ అన్వాంటెడ్ కిట్ల వినియోగం దృష్టి పెట్టిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ తనిఖీలు చేస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు నగరాల్లో అత్యధికంగా నమోదుగర్భస్రావాల కేసులు పల్లె పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి వంటి జిల్లాల్లో ఎక్కువగా ఎంటీపీ కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ఉండటమే కారణమని భావిస్తున్నారు. ఈ మూడు జిల్లాలో ఏటా సగటున 2,500 నుంచి 5,200 కేసులు నమోదవుతుండటం గమనార్హం. గ్రామీణ, అత్యంత మారుమూల ప్రాంతాలైన ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఏటా 100 నుంచి 300 కేసులు రికార్డవుతున్నాయి. ఇక్కడ సరైన స్పెషలిస్టు వైద్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో సమీప పట్టణాలకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏటా 1000 కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలి
మెదక్ కలెక్టరేట్: భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని జై భీమ్ మహాసేన జాతీయ అధ్యక్షుడు మాస్టర్ జీ పేర్కొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ సంఘం విశ్వజన కళామండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న రథయాత్ర మంగళవారం మెదక్కు చేరుకుంది. ఈ సందర్భంగా గోల్కొండ వీధిలోని అంబేద్కర్ కాలనిలో అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టుగా పాఠ్యాంశంలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర ద్వారా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్షల్లో రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్న పత్రం ఉండాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జై భీమ్ మహాసేన నాయకులు అంజన్న, అశోక్, రాణి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ మహాసేన జాతీయ అధ్యక్షుడు మాస్టర్ జీ -
మెతుకు సీమ మెరిసేనా..!
మెతుకుసీమగా ప్రసిద్ధిగాంచిన మెదక్ పాలకుల నిర్లక్ష్యంతో ఏళ్ల తరబడి వెనుకబాటుకు గురవుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా పట్టణ ముఖచిత్రం మాత్రం మారడం లేదు. జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రజలు పెట్టుకున్న కొండంత ఆశలు అడియాశలయ్యాయి. చిన్నపార్కుకు కూడా నోచుకోలేదంటే మెదక్ పట్టణం ఎంత నిర్లక్ష్యానికి గురైందో ఇట్టే అర్థమవుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా యువకులు, కొత్తవారే కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. కనీసం వీరి హయాంలోనైనా పేరుకు పోయిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. – మెదక్ కలెక్టరేట్ మెదక్ పట్టనంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన రైతుబజారును యేళ్ల తరబడి ప్రారంభించకుండా వదిలేశారు. జిల్లా నలుమూలల నుంచి కూరగాయలు తెచ్చిన రైతులు రోడ్లపైనే అవస్థలు పడుతున్నారు. రైతుబజారును ప్రారంభించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే.. మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో పాతవారే పాతుకు పోయారు. 40 యేళ్లుగా కొనసాగుతున్న మున్సిపల్ దుకాణాలకు రీ టెండర్లు వేయాలని పలు సంఘాల నాయకులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు. గతంలో ఉన్న కలెక్టర్లు సైతం ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ బల్దియా పాలకవర్గం పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో కొంతమంది చేతుల్లోనే పదుల సంఖ్యలో దుకాణాలు ఉండగా, బల్దియా ఆదాయానికి గండి పడుతూనే ఉంది. కొత్త పాలకవర్గంతో మార్పు వస్తుందని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. సేదతీరేందుకు చోటేది? జిల్లా కేంద్రం ఏర్పాటుతో సమీకృత కలెక్టరేట్, ఎస్పీతోపాటు పలు శాఖల కార్యాలయాలు నిర్మించారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు నిత్యం అధిక సంఖ్యలో వస్తున్నారు. వివిధ పనులపై వచ్చే వారు సేదదీరేందుకు మంచి పార్కు కూడా లేకుండా పోయింది. ఉన్న పార్కులో కొంతభాగం మిషన్ భగీరథ పైలాన్ నిర్మించారు. మిగతా భాగంలో ప్రైవేట్ వాహనదారులు అడ్డాగా మార్చుకున్నారు. సుందరీకరణ ఆగమాగం పట్టణంలోని మల్లం, పిట్లం, గోసముద్రం చెరువుల సుందరీకరణ పనులు చేపట్టారు. మినీ ట్యాంక్బండ్ల ఏర్పాటుకు గత పాలకులు రూ.కోట్లు ఖర్చుచేసి మధ్యలోనే వదిలేశారు. మల్లం చెరువు కట్ట డంపుయార్డుగా మారింది. ఈ రోడ్డు మీదుగా నర్స్ఖేడ్ వెళ్లే ప్రజలు, శ్మశాన వాటికకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. యేళ్ల తరబడి పేరుకు పోయిన సమస్యలు పాలకుల నిర్లక్ష్యంతో పడకేసిన ప్రగతి కొత్త పాలకవర్గంపైనే కోటి ఆశలు పట్టణంలోని ఇందిరాపురికాలనీలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠధామాల నిర్మాణాలు పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయాయి. రాందాస్ చౌరస్తా నుంచి సర్ధన వెళ్లే రోడ్డు యేళ్ల తరబడి పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. నిధులు మంజూరైనట్లు పాలకులు చెబుతున్నా.. రోడ్డు పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అలాగే రాందాస్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నత్త నడకన సాగుతోంది. దుకాణాల కోసం డబ్బులు చెల్లించిన లబ్ధిదారులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. -
మూడు రోజులు డ్రైడే
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: హోలీ పండుగను పురస్కరించుకుని జిల్లాలో మూడు రోజులు డ్రైడే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నెల 5 తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి మూడు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయనున్నట్లు చెప్పారు. పండుగల పవిత్రతను కాపాడేందుకు వైన్ షాపులు, బార్లు పూర్తిగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. రైల్వే జీఎంకు ఎంపీ రఘునందన్రావు వినతి మెదక్జోన్: మెదక్ లోక్సభ పరిధి పెండింగ్లో ఉన్నా రైల్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. మంగళవారం రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవను కలిసి పెండింగ్ పనులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. చేగుంట–మెదక్ ప్రధాన రహదారి వద్ద మంజూరైనా రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) నిర్మాణంతో పాటు మెదక్ రైల్వేస్టేషన్లో కొనసాగుతున్న అమృత్ పనులపై చర్చించినట్లు చెప్పారు. అలాగే, మెదక్ జిల్లా అక్కన్నపేట్ వద్ద అజంతా, రాయలసీమ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని జీఎంకు వినతిపత్రం ఇచ్చారు. ఎంఎల్ఆర్ ఆటో పరిశ్రమ వద్ద చెలరేగిన మంటలు మనోహరాబాద్(తూప్రాన్): పరిశ్రమ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి తగలబెట్టడంతో మంటలు అంటుకుంటున్నాయి. మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో గల ఎంఎల్ఆర్ ఆటో పరిశ్రమల దగ్గరలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు గడ్డిని తగులబెట్టారు. కాగా మంటలు పరిశ్రమ వద్దకు వ్యాపించాయి. గుర్తించిన పరిశ్రమ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు మంటలను ఆర్పి భారీ ప్రమాదాన్ని తప్పించారు. కాగా పరిశ్రమలో స్క్రాప్ ధ్వంసమైందని పరిశ్రమ సిబ్బంది తెలిపారు. అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ రామాయంపేట(మెదక్): పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ పేర్కొన్నారు. వణ్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థుల ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ముందు తరాలకు మంచి వాతావరణం కల్పించే దిశగా మనం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేసవిలో అటవీప్రాంతంలో మంటలు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు తమకు సహకరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారిణి గీత పాల్గొన్నారు. ‘ద్వార’ బంధనంనాచగిరి, విద్యాధరి ఆలయాలు మూసివేత వర్గల్(గజ్వేల్): చంద్ర గ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం జిల్లాలోని సుప్రసిద్ధమైన నాచగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి, వర్గల్ విద్యాధరి ఆలయాలకు ద్వార బంధనం చేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ, అభిషేకం అనంతరం ఆలయాలలోకి యథావిదిగా భక్తులకు అనుమతి కల్పిస్తారని ఆలయ వేదపండితులు పేర్కొన్నారు. -
దూది రైతు దుఃఖం
సాక్షి, సిద్దిపేట: పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు దిగుబడి తగ్గి.. మరోవైపు మద్దతు ధర దక్కక.. సీసీఐ నిబంధనలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధిక వర్షాలతో కొంత పత్తి నల్లబారినా, తేమ ఎక్కువ ఉంటే సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించారు. జిల్లాలో ఇప్పటివరకు 81,321 మెట్రిక్ టన్నుల పత్తి మాత్రమే విక్రయించారు. ఎకరాకు ఆరేడు క్వింటాళ్లే దిగుబడి 2025–26లో వానకాలంలో 1,18,785 ఎకరాల్లో పత్తి సాగైంది. అధికారుల అంచనా ప్రకారం ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున లెక్కించినా 1.18 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పత్తి రావాలి. అలాంటిది ఎకరానికి దాదాపు 6 నుంచి 7 క్వింటాళ్లే దిగుబడి వచ్చినట్లు పత్తి విక్రయాలను బట్టి తెలుస్తోంది. అధిక వర్షాలతో పత్తి రైతు నష్టపోయారు. పత్తి ఏరే సమయంలో ఎండ ఎక్కువ ఉండాలి. మబ్బులు పట్టడంతో పత్తికాయలు పగలలేదు, కొన్ని చోట్ల పత్తికాయలు చెట్ల మీదనే కుళ్లిపోయాయి. పత్తికాయల్లో తేమ శాతం పెరగడంతో నల్లబారి మొలకలు సైతం వచ్చాయి. పత్తి తగ్గడమే కాకుండా నాణ్యత సైతం దెబ్బతింది. రెండేళ్ల కంటే తగ్గిన దిగుబడి ఇటీవల సీసీఐ కొనుగోళ్లు ముగిశాయి. 57,949 మంది రైతుల నుంచి 74,146 మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 చాలామంది రైతులకు దక్కలేదు. నాణ్యత లేదని క్వింటాలుకు రూ.100 తగ్గించారు. తేమ ఉందని, నాణ్యత లేదని సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్కు 7,175 మెట్రిక్ టన్నులు విక్రయించారు. తేమ పేరుతో, కొంత నల్లబారండంతో సీసీఐ కొనుగోళ్లు చేయలేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించారు. గతేడాది కంటే 40వేల మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోళ్లు తగ్గాయి.సంవత్సరం సీసీఐ ప్రైవేట్ మొత్తం (మెట్రిక్ టన్నుల్లో) 2023–24 74,588 26,199 1,00,787 2024–25 1,05,736 15,038 1,20,774 2025–26 74,146 7,175 81,321నట్టేట ముంచిన పత్తి పంట -
ఎనిమిది రకాల పంటలు
గుంట భూమి..● సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరల సాగు ● తునికి ఆర్వీజే ఫీల్డ్ సూపర్వైజర్ వినూత్న ప్రయోగం కౌడిపల్లి(నర్సాపూర్): ఇంటి అవసరాల కోసం స్థలం లేదు.. కోతుల బెడద ఉంది. నీళ్లు లేవు అంటూ సాకులు చెప్పే ప్రజలకు తమ ఇంటి వద్దే ఉన్న కాస్తంత స్థలంలో పంటలను సాగుచేసి ఆదర్శంగా నిలిచాడు మండలంలోని తునికి ఆర్వీజే (డాక్టర్ డి రామానాయుడు విజ్ఞాన జ్యోతి) వ్యవసాయ కళాశాల ఫీల్డ్ కోఆర్డినేటర్ జగదీష్. తన ఇంటి ముందు ఉన్న గుంట స్థలంలో ఐరన్షెడ్ వేసి సేంద్రియ పద్ధతితో వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నాడు. జగదీష్ మండలంలోని తునికి వద్దగల విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యాసంస్థ వ్యవసాయ కళాశాలలో విద్యార్థులకు సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తన ఇంటి ముందు ఉన్న గుంట స్థలంలో కూరగాయల సాగు కోసం వినూత్న ప్రయోగం చేశారు. రూ 30వేలతో ఐరన్ జాలీతో షెడ్ వేశారు. అందులో టమాట, వంకాయ, రెడ్ క్యాబేజీ, గ్రీన్క్యాబేజీ, బ్రోకాలి, ఆకుకూరలు పాలకూర, తోటకూర, తీగజాత మొక్కలు పెంచుతున్నాడు. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నామన్నారు. చీడ పీడల నివారణకు ఇంగువ, పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తున్నామని చెప్పారు. నాలుగు రోజులకు ఒకసారి భూమిలో కలుపు నివారిస్తూ నీటి తడులు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి రైతు తక్కువ స్థలంలో ఇంటి వద్ద కూరగాయలు సాగు చేసుకోవచ్చని జగదీష్ చెప్పారు. -
ఆలు ధర ఢమాల్
మార్కెట్లో లభించని గిట్టుబాటు జహీరాబాద్: ఆలుగడ్డ పంటను సాగు చేసుకున్న రైతుల నోట్లో మట్టిపెల్ల పడుతోంది. మార్కెట్లో ఏ మాత్రం గిట్టుబాటు ధరలు లేక పోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఎకరా పంటపై రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంటున్నారు. మార్కెట్లో క్వింటా ధర రూ.500 నుంచి రూ.600 మాత్రమే పలుకుతోంది. కాగా, ఈ ధరకు పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేదంటున్నారు. జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలోనే ఆలుగడ్డ పంట 90 శాతం వరకు సాగవుతుంది. ఈ ఏడాది జిల్లాలో 6వేల ఎకరాల్లో పంట సాగు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. క్వింటా విత్తనానికి రూ.4వేలు ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు రైతులు.. 8 క్వింటాళ్ల మేర విత్తనం నాటుకున్నారు. ఈ లెక్కన కేవలం విత్తనానికే రూ.32వేలు, ఇతరు పెట్టుబడులకు మరో రూ.50వేల మేర ఖర్చు చేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. అయితే క్వింటా రూ.1,200 పలికితేనే గిట్టుబాటవుతుందని రైతులు చెబుతున్నారు. మార్కెట్కు పోటెత్తిన పంట మార్కెట్కు అధికంగా పంట రావడంతో గిట్టుబాటు ధర లభించలేదని అంటున్నారు. గతంలో జహీరాబాద్ ప్రాంతంలో మాత్రమే అధికంగా సాగవుతుండగా.. ప్రస్తుతం ఇతర జిల్లాలకు విస్తరించడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సైతం ఉత్పత్తులు వస్తున్నాయి. ఇందూర్, వికారాబాద్ జిల్లాల నుంచి హైదరాబాద్లోని మార్కెట్లకు అధికంగా ఉత్పత్తులు రావడంతో ధర పూర్తిగా పడిపోయేందుకు కారణమవుతోందని రైతులు వాపోతున్నారు. నవంబర్ నుంచి ఆలుగడ్డ పంట చేతికి అందకపోవడంతో ఆగ్రా ప్రాంతం నుంచి ఉత్పత్తులు దిగుమతి కావడం, ప్రస్తుతం ఇతర జిల్లాల నుంచి రావడంతో మార్కెట్లో ధర లభించకుండా పోయింది. దీంతో ధర పెరుగుతుందేమోనని కొంతమంది రైతులు పంటను భూమిలోనే ఉంచారు. కాగా, ఆలుగడ్డ పంటకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంటను సాగు చేసిన రైతులకు వరికి ఇచ్చిన మాదిరిగానే క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
నర్సంపల్లిలో మద్యపాన నిషేధం
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలంలోని నర్సంపల్లిలో మద్యపాన నిషేధం విధించారు. ఈమేరకు సోమవారం సర్పంచ్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో తీర్మానించారు. అ నంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఈనెల 5 నుంచి గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించవద్దని చెప్పారు. ఒక వేల గ్రామసభ తీర్మానం ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.1 లక్ష జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అలాగే మద్యం విక్రయిస్తుండగా, పట్టిస్తే రూ. 25 వేల నజరానా అందించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ బాల్రాజ్గౌడ్, మాజీ ఎంపీటీసీ రఫీ పాల్గొన్నారు. -
ఐటీఐలో నూతన కోర్సులు
మెదక్ కలెక్టరేట్: హవేళిఘణాపూర్ ప్రభుత్వ ఐటీఐలో పలు నూతన కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఎలక్ట్రిక్ వెహికిల్ మెకానిక్, సీఎన్సీ టెక్నీషియన్ కోర్సుల్లో మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్తో పాటు గుర్తింపు పొందిన ప్రముఖ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల పది, ఇంటర్ చదివిన విద్యార్థులు మెదక్లోని ప్రభుత్వ ఐటీఐలో సంప్రదించాలని సూచించారు. -
సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం
● వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు సన్నాహాలు ● ఇందుకోసం రూ. 57 కోట్లు మంజూరు మెదక్జోన్: వేసవిలో విద్యుత్ వినియోగం భారీగా పెరగనున్న నేపథ్యంలో జిల్లాలో అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించగా, రూ. 57 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో ఇప్పటికే 124 సబ్స్టేషన్లు ఉండగా, నూతనంగా మరో 8 సబ్స్టేషన్లు నిర్మించారు. ఇవికాకుండా గత వానాకాలంలో పట్టణ పరిధి పుష్పాలవాగు సమీపంలోని సబ్స్టేషన్ నీటి మునిగిపోగా, దానిని మరో చోట నిర్మించారు. ఇందుకోసం అదనంగా మరో రూ. 3.50 కోట్లు ఖర్చు చేశారు. 9 చోట్ల ఓవర్లోడ్ జిల్లాలో తొమ్మిది ప్రాంతాల్లో ఎక్కువగా ఓవర్లోడ్ అవుతున్నట్లు గుర్తించారు. వీటి పరిధిలో ఏడు 33 కేవీ సబ్స్టేషన్లలో లైన్వర్క్లు, ఇంటర్నల్ లింకులు ఇచ్చారు. గాలి దుమారంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, ఇతర కారణాలతో అంతరాయం ఏర్పడితే మరో లైన్ నుంచి కనెక్షన్ ఇచ్చి సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. నూతనంగా 200 పైచిలుకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐదు టీఆర్ సెంటర్లు జిల్లావ్యాప్తంగా 5 ట్రాన్స్ఫార్మర్ రిపేర్ (టీఆర్) సెంటర్లు ఉన్నాయి. ప్రస్తుతం వేసవిలో విద్యుత్ విని యోగం పెరగటంతో ఓవర్లోడ్, ఇతర సమస్యలతో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే జిల్లాలోని మెదక్, పాపన్నపేట, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేటలోని టీఆర్ సెంటర్లకు తరలించి మరమ్మతులు చేయనున్నారు. కాగా వ్యవసాయ బోరు బావుల వద్ద ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 48 గంటల్లో రిపేర్ చేసి రైతులకు ఇవ్వాల్సి ఉండగా, అదే గృహ అవసరాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మ ర్ కాలిపోతే కేవలం 24 గంటల్లో రిపేర్ చేసి ఇస్తారు. ఇదే విషయమై విద్యుత్శాఖ ఎస్ఈ నారాయణనాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ వినియోగం ఇప్పటికే గణనీయంగా పెరిగిందని, వచ్చే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు, పరిశ్రమల్లో అవసరం మేరకే కరెంట్ వాడాలని సూచించారు. ఈనెలలో రోజుకు 572 మెగావాట్ల విద్యుత్ ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. -
వ్యవసాయానికి పెద్దపీట
ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: వ్యవసాయ రంగం అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మనూరు మండలం దుదగొండ పంచాయతీ పరిధిలోని గట్టులింగంపల్లి పెద్దచెరువుకు రూ.48.7లక్షల వ్యయంతో చేపట్టనున్న మరమ్మతు పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువు మరమ్మతుల కారణంగా కుడి కాలువ 1.4కిలోమీటర్లు, ఎడమ కాలువ 1.2కిలోమీటర్ల మేర 300 ఎకరాల వరకు ఆయకట్టుకు నీరందనుందని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ జలందర్, ఏఈలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, శేరి రాజు, శ్రీకాంత్రెడ్డి, చంద్రలీలా, ప్రతిభ అనిల్ పాటిల్ పాల్గొన్నారు. ఇదే గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమా ఖ్య భవనానికి శంకుస్థాపన చేశారు. ఖేడ్ మండలం అనంతసాగర్కు చెందిన లక్ష్మిబాయికి కల్యాణలక్ష్మి చెక్కు, ఆరె మారుతిరావుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.60 వేలకు సంబంధించిన చెక్కును అందజేశారు. -
ప్రజలు నేరుగా కలవొచ్చు
మెదక్జోన్: ఎలాంటి పైరవీలకు తావులేకుండా ప్రజలు తనను నేరుగా కలవొచ్చని ఎస్పీ శ్రీనివాస్రావు ప్రజలకు సూచించారు. సోమ వారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి వినతులు స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించామని, ప్రజల్లో పోలీస్శాఖపై నమ్మ కం పెరిగిందన్నారు. నర్సాపూర్: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్లో జరగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆయనను కలిశారు. వారం రోజులుగా కొనసాగిన శిక్షణలో పార్టీ సంస్థాగత బలోపేతం, సమస్యలపై అనుసరించాల్సిన పోరాట వ్యూహాలపై అవగాహన కల్పించారు. టేక్మాల్(మెదక్): రైతులు వాణిజ్య పంటలే కాకుండా చిరుధాన్యాలు సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని మిల్లెట్ మ్యాన్ఆఫ్ తెలంగాణ వీర్శెట్టి అన్నారు. సోమవారం మండలంలోని కుసంగిలో రైతు వెంకటేశం సాగుచేస్తున్న జొన్న, సజ్జ, రాగి, ఊద, అరికె వంటి పంటలతో పాటు కుసుమ, మొక్కజొన్న పంటలను ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అనిల్, నరేష్బొమ్మైతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండెకరాల్లో పదికిపైగా చిరు ధాన్యాల పంటలను సాగు చేయడం అభినందనీయమన్నారు. గ్రామా ్లోని రైతులు సంఘటితమై చిరు ధాన్యాలు సాగు చేయాలని కోరారు. ఆయన వెంట రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు మెగిలయ్య, రైతులు తదితరులు ఉన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 2026– 27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ విజయ తెలిపారు. మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్త అడ్మిషన్లు 7, 8, 9 ,10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఆసక్తి, అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నర్సాపూర్ రూరల్: వ్యవసాయ, ఉద్యానశాఖల ఆధ్వర్యంలో నర్సాపూర్ రైతులు సోమవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఆయిల్పామ్ సాగు చేస్తున్న భాగ్యలక్ష్మి అనే మహిళా రైతు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆయిల్పామ్ పంట సాగు దిగుబడిపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి సంతోష్, వ్యవసాయశాఖ ఏఈఓ మోహన్, ఆయిల్పామ్ టెక్నికల్ పర్సన్ అజయ్, రైతులు పాల్గొన్నారు. -
సీ్త్రనిధి బకాయిలపై
జిల్లాలో పేరుకుపోయిన రూ.18 కోట్లు● ఈనెలాఖరు వరకు అవకాశం ● చెల్లించకుంటే ఆస్తులు జప్తు ● జిల్లాలో 16,866 సంఘాలు జిల్లాలో మొత్తం 16,866 మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో మెప్మా పరిధిలో 1,960 సంఘాలు ఉండగా 19,600 మంది సభ్యులు, సెర్ప్ పరిధిలో 14,906 సంఘాలు ఉండగా 14,9060 మంది సభ్యులు ఉన్నారు. వీరికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.78 కోట్ల పంపిణీ లక్ష్యంగా ఉండగా, రూ.68 కోట్లు అందజేశారు. మరో రూ.10 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అలాగే జిల్లాలో మొ త్తం రూ.18 కోట్లు బకాయిలు ఉండగా, ఇందులో రూ.15 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. మిగితా రూ.3 కోట్లు రెగ్యులర్ బకాయిలు ఉన్నా యి. ఇందులో అత్యధికంగా రామాయంపేట మండలంలో రూ.2.50 కోట్లు, చేగుంటలో రూ.1.65 కోట్లు, కౌడిపల్లిలో రూ.1.45 కోట్లు, చిన్నశంకరంపేటలో రూ.1.45 కోట్లు, నర్సాపూర్లో రూ.135 కోట్లు పేరుకుపోయాయి. వీటితో పాటు మిగితా మండలాల్లోనూ రూ. లక్షల్లో బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఆర్ఆర్యాక్ట్ అమలు ఈ నెలాఖరులోగా మొండి బకాయిలు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో మెప్మా, సెర్ప్ అధికారులు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బకాయిలున్న సంఘాలతో సమావేశాలు నిర్వహించి నోటీసులు అందజేస్తున్నారు. వెంటనే బకాయిలు చెల్లించేలా చైతన్య పరుస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఆర్ఆర్, కో అపరేటివ్ యాక్ట్ ద్వారా ఆస్తులు జప్తు చేస్తామని చెబుతున్నారు. మహిళా సంఘాల్లో పేరుకుపోయిన మొండి బకాయిల వసూళ్లే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పంపిణీ చేసిన రుణాలను చెల్లించడంలో కొంతమంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలో రూ.18 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. అధికారులు ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహించినా, స్పందన రావడం లేదు. దీంతో రెవెన్యూ రికవరీ, కో ఆపరేటివ్ యాక్ట్లు అమలు చేయాలని ప్రభుత్వం జీఓ జారీ చేసింది. – మెదక్ కలెక్టరేట్ మొండి బకాయిల వసూళ్ల కోసం మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి డబ్బులు కట్టేలా చైతన్య పరుస్తున్నాం. బకాయి ఉన్న మహిళల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి అర్థమయ్యేలా చెబుతున్నాం. ఈనెలాఖరులోగా డబ్బులు చెల్లించాలని వివరిస్తున్నాం. – గంగారాం, సీ్త్రనిధి ఆర్ఎం, మెదక్ -
ప్రజావాణికి వినతుల వెల్లువ
అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ప్రతిమాసింగ్మెదక్ కలెక్టరేట్: మూడు నెలల అనంతరం ప్రారంభమైన ప్రజావాణికి సోమవారం ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ తమ సమస్యలపై వినతులు సమర్పించి పరిష్కరించాలని నూతన కలెక్టర్ ప్రతిమాసింగ్కు మొర పెట్టుకున్నారు. సావధానంగా విన్న కలెక్టర్ ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణికి మొత్తం 74 వినతులు రాగా, ఇందులో అత్యధికంగా భూ సమస్యలు, పెన్షన్లు ఉన్నాయి. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అధికారులు తమ పనితీరును మరింత మెరుగు పర్చుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. అనంతరం టీజీఓ, జిల్లా టీజీఆర్ఎస్ఏ సంఘాల నాయకులు కలెక్టర్ను వేర్వేరుగా కలిసి సన్మానించారు. అంతకు ముందు కలెక్టరేట్లో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏఓ యూనస్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో నివాసం ఉండే ఓ వ్యక్తి మా భూమిని కబ్జా చేసి.. అందులోకి వస్తే చంపుతానని బెదిరిస్తున్నాడని కుషన్గడ్డ తండాకు చెందిన గిరిజనులు ఫిర్యాదు అందించారు. కొడుకుకు రెండెకరాలు ఇచ్చినా, అన్నం పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని రామచంద్రాపురం గ్రామానికి చెందిన మల్లయ్య కలెక్టర్ను కలిసి వివరించారు. కొడుకులు లేరని కూతురును ఇళ్లరికం పెట్టుకున్నా. 4 ఎకరాలు ఆమె పేరుపై పట్టా చేశా. ప్రస్తుతం తనను కొడుతూ ఇంట్లో నుంచి వెళ్లగొడుతుందని యశ్వంతరావుపేటకు చెందిన ఆండాలమ్మ ఫిర్యాదు చేసింది. -
డె యిరీకి మహ ర్దశ!
యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివినా ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కౌన్సిలర్లుగా గెలిచి పట్టణాలను ప్రగతి బాట పట్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో అత్యధికులు 35 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. ‘పురం’లో తమ మార్క్ చూపించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ‘సాక్షి’తో వెల్లడించిన యువ కౌన్సిలర్ల అభిప్రాయాలు... 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు విజయ పాలుఇఫ్తార్ ఆదివారం: 6.28 సహర్ సోమవారం: 5.11 -
ప్రాక్టికల్ ్సతో పట్టు సాధించాలి
నర్సాపూర్: సాంకేతిక చదువుకు పరిశోధనాత్మక అనుభవం అవసరమేనని హైదరాబాద్ ఐఐటీ అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ అశోక్కుమార్పాండె అన్నా రు. బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న మెకానికల్ బాహాసే ఇండియా పోటీల సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ‘క్లాస్రూం వెలుపల విద్య అనుభవాధారిత అభ్యాస విధానం’ అంశంపై జరిగిన చర్చలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. క్లాస్ రూంలో పాఠ్యాంశాలు చదవడంతో పాటు వాటికి అనుబంధంగా ప్రాక్టికల్స్తో పట్టు సాధించాలని సూచించారు. చర్చలో తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ వి.ఆర్ గనేషన్, కాట్మండ్ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ గోకర్ణ ఫౌడెల్, అటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సి ల్ ప్రతినిధి గరిమా ఝూంబ్, నామ్టెక్ డైరెక్టర్ కేసీ వోరా, సే ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్నాయర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆదివారం ఫైనల్ పోటీలు జరుగుతాయని బాహీసే ఇండియా కన్వీనర్ అలీసయ్యద్, కో కన్వీనర్ మురళీకృష్ణ చెప్పారు. కార్యక్రమాల్లో కాలేజీ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్దూబె, మేనేజర్ బాపిరాజు, ఏఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి
హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని ఎంజేపీ బాలుర పాఠశాల వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంజేపీ జాయింట్ సెక్రటరీ మద్దిలేటి, డీఈఓ విజయ, డీసీఓ హరిబాబు, ఎంఈఓ మధుమోహన్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు బాగా చదవి, ఉన్నతస్థాయికి చేరుకొని పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. ఈసందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సృజన, శ్రావణి, ఉపాధ్యాయులు సునీత, నాగరాజు, సంతోశ్ పాల్గొన్నారు. -
క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యం
మెదక్ కలెక్టరేట్: విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం ఎంతో అవసరమని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన జిల్లా పోలీస్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో యువత శాతం అధికంగా ఉండటం ఆందోళనకరమన్నారు. చివరగా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, సీఐలు జార్జ్, మహేష్, కృష్ణమూర్తి, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి
మెదక్ కలెక్టరేట్: రాష్ట్రంలోనే మెదక్ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం కలెక్టర్ ప్రతిమాసింగ్ హైదరాబాద్లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేసి ప్రజాప్రభుత్వానికి మరింత మంచి పేరు తేవాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులను సమన్వయం చేసి ప్రజలకు పారదర్శకమైన ప్రజాపాలన అందిస్తామన్నారు. తన శక్తి వంచనతో అహర్నిశలు పనిచేసి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెస్తామన్నారు. ‘అన్ని వసతులు కల్పించాలి’ మెదక్జోన్: పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి సిబ్బందికి సూచించారు. శనివారం పట్టణంలోని పలు ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. తాగునీరు, మెడికల్ కిట్లు, టాయిలెట్ వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అలాగే సీసీ కెమెరాల పనితీరు, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు వివరాలపై ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే ప్రశ్నాపత్రాలు ఇవ్వాలన్నారు. ఎలాంటి కాపీయింగ్కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకతతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ పరిశ్రమతో ఇబ్బంది పడుతున్నాం చిన్నశంకరంపేట(మెదక్): కావేరి పరిశ్రమ వెదజల్లే కాలుష్యంతో బతకలేకపోతున్నామని.. పరిశ్రమ సమీపంలోని పంట పొలాలు సైతం సాగు యోగ్యతను కోల్పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని ఖాజాపూర్ శివారు కావేరి పరిశ్రమ పరిసరాలతో పాటు చెరువును తహసీల్దార్ మాలతి పరిశీలించారు. ఈసందర్భంగా రైతులు ఆమె ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. పరిశ్రమ నుంచి వెదజల్లుతున్న కాలుష్యంతో పాటు నల్లని దుమ్ము తమ పంటలకు నష్టం కలిగిస్తుందన్నారు. కంపెనీ పక్కన ఉన్న అంబారెడ్డి చెరువులో పరిశ్రమ వ్యర్థాలను వేయడంతో కలుషితం అవుతుందన్నారు. కాగా చెరువు ఎఫ్టీఎల్లో వేసిన డస్ట్ను వారం రోజుల్లో తొలగించాలని పరిశ్రమ మేనేజర్ను తహసీల్దార్ ఆదేశించారు. కాలుష్యంపై పీసీబీ అధికారులకు నివేదిక అందించనున్నట్లు తెలిపారు. సఖి, భరోసా కేంద్రాలతో రక్షణ మెదక్ కలెక్టరేట్: సఖి, భరోసా సెంటర్లు ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలుస్తున్నాయని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ సిద్దాగౌడ్ అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సూచనల మేరకు శనివారం పట్టణంలోని సఖి, భరోసా కేంద్రాలతో పాటు బాల సదనం సందర్శించినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవి మహిళల రక్షణ, న్యాయం, సహాయం కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమైన వేదికలని అన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్ ఉప్పలయ్య, సఖి వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రేణుక, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ సౌమ్య, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి జిల్లాలో పోలీస్ యాక్ట్
మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి జిల్లాలో నెలరోజుల పాటు పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈనెల 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 30, 30(ఏ) పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. దీని ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి ధర్నా లు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దన్నారు. అలాగే ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సత్తేటి వారాలలో భాగంగా ఏడో ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. శనివారం సాయంత్రానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. వేకువ జామున పుష్కరిణిలో స్నానమాచరించి మల్లన్నకు పట్నం వేసి బోనం సమర్పించి మొక్కులు సమర్పించుకోనున్నారు. -
సేవా భావం కలిగి ఉండాలి
నర్సాపూర్ రూరల్: వృద్ధుల పట్ల సేవా భావం కలిగి ఉండాలని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి హేమలత ప్రజలకు సూచించారు. శనివారం పట్టణంలోని విజన్ ఓల్డ్ ఏజ్ హోమ్ను సందర్శించారు. ఈసందర్భంగా వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆధార్ కార్డులు లేకపోవడంతో ఆసరా పెన్షన్ అందుకోలేకపోతున్నామని న్యాయమూర్తికి వృద్ధులు మొరపెట్టుకున్నారు. మందులు కొనేందుకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు అపర్ణ, సుధాకర్రెడ్డి, సుజాతరెడ్డి, అరుణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నిధులు వెచ్చించి.. పనులు చేయించి
ప్రజాప్రతినిధుల సేవా కార్యక్రమాలుస్కూల్ స్టేజీ నిర్మాణానికి సర్పంచ్ భూమి పూజ ఇచ్చిన హామీ మేరకు..రామాయంపేట(మెదక్): జిల్లాలో నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు సొంత నిధులతో తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిలో కొందరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుండగా, మరికొందరు సొంత డబ్బులతో పనులు చేయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జిల్లాలో యువతీ, యువకులే ప్రజాప్రతినిధులుగా గెలుపొందారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోయినా, తమ సొంత నిధులతో గ్రామాల్లో బోర్లు తవ్వించడం, వీధి దీపాల ఏర్పాటు, నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టైలు, బెల్ట్లు, మినీ ట్యాంకుల నిర్మాణం.. తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు
ఎస్పీ శ్రీనివాసరావు తూప్రాన్: రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని ఎస్పీ శ్రీనివాస్రావు అన్నారు. శనివారం పట్టణంలోని జాతీయ రహదారి టోల్ప్లాజా వద్ద ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడ పడం, మొబైల్ ఫోన్ వినియోగం, చూపు సమస్యను నిర్లక్ష్యం చేయడమే ప్రధాన కారణమన్నారు. ఈ మేరకు ఆటో, బస్సు, లారీలు తదితర వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించా రు. అనంతరం అవసరం ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను గోల్డెన్ అవర్ సమయంలో ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐలు జాన్రెడ్డి, రంగకృష్ణ, సందీప్రెడ్డి, జీఎమ్మార్ అధికారులు, సీఎంఆర్ ఆస్పత్రి సిబ్బంది, వాహన డ్రైవర్లు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
తప్పుడు కేసులపై హెచ్ఆర్సీకి వెళ్తాం
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డిమెదక్జోన్: బీఆర్ఎస్ నేతలపై పోలీసులు పెడుతున్న తప్పుడు కేసులపై త్వరలో హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. శనివారం మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేసి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈసందర్భంగా నాయకులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతల అక్రమాలను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై 307 సెక్షన్తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ఆరాచకాలపై తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు స్వీకరించటం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు భరించి రాష్ట్రాన్ని తెచ్చామని, ఈ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్రెడ్డి, అడ్వకేట్ జీవన్రావు తదితరులు పాల్గొన్నారు. -
వైజ్ఞానిక ప్రదర్శనలతో మేలు
వెల్దుర్తి(తూప్రాన్): విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని డీఈఓ విజయ అన్నారు. సర్ సీవీ రామన్ జయంతిని పురస్కరించుకొని శని వారం మాసాయిపేట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మండలస్థాయి సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్టాళ్లను పరిశీలించి అభినందించారు. కొన్ని జాతీయ స్థాయిలో ఉండడంపై సంబంధిత గైడ్ ఉపాధ్యాయులను అభినందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. సర్కారు బడుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కిష్టారెడ్డి, ఎంఈఓ మధుసూదన్రావు, ఎంపీడీఓ విఘ్నేశ్వర్, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, సైన్స్ ఉపాధ్యాయులు రంగారెడ్డి, భాగ్యలక్ష్మి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఇబ్బంది పడొద్దు
నర్సాపూర్: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె పట్టణంలోని మైనార్టీ గురుకుల కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తాగు నీరు, కరెంట్ వసతి, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అలాగే మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అభివృద్ధి, సంక్షేమంలో జిల్లాను ముందంజలో ఉంచాలని మంత్రి సూచించారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
ఎల్సీ తీసుకున్నా.. కరెంట్ సరఫరా
● కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలు ● సబ్స్టేషన్ను ముట్టడించితాళం వేసిన గిరిజనులు రామాయంపేట(మెదక్): విద్యుత్షాక్తో కాంట్రాక్టు కార్మికుడు తీవ్రంగా గాయపడగా, ఆగ్రహించిన గిరిజనులు శుక్రవారం రాత్రి స్థానిక సబ్స్టేషన్ను ముట్టడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆశాఖ ఉన్న తాధికారులకు సమాచారం ఇవ్వకుండానే కొంతమంది విద్యుత్ సిబ్బంది సాయంత్రం ఎల్సీ తీసుకొని కాంట్రాక్టు కార్మికుడైన నిజాంపేట మండలం జడ్చెరువు తండాకు చెందిన బాబూనాయక్ను స్తంభం ఎక్కి ంచారు. స్తంభానికి కరెంట్ సరఫరా కావడంతో తీవ్రంగా గాయపడి కింద పడ్డాడు. వెంటనే అధికారులు, సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అతడిని హైదరాబాద్ తరలించారు. ఆగ్రహించి న వందలాది మంది గిరిజనులు సబ్స్టేషన్ ప్రధాన గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. అదే సమయంలో ఏడీఈ ఆదయ్య, ఏఈ తిరుపతిరెడ్డి అక్కడికి రాగా, వారిని దూషించారు. ఎస్ఐ బాల్రాజు వా రిని సముదాయించారు. బాధ్యులను సస్పెండ్ చేసి వారిపై కేసులు నమోదు చేసే వరకు ఊరుకోమని హెచ్చరించారు. ఎల్సీ తీసుకున్న విషయం తమకు తెలియదని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఏడీఈ తెలిపారు.


