నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Feb 10 2026 9:46 AM | Updated on Feb 10 2026 9:46 AM

నిబంధనలు ఉల్లంఘిస్తే  కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

పాపన్నపేట(మెదక్‌): మండలంలోని 33 కేవీ మిన్‌పూర్‌ సబ్‌స్టేషన్‌లో అత్యవసర పనుల నిమిత్తం మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నర్సింలు తెలిపారు. దీంతో మిన్పూర్‌, దౌలాపూర్‌, కుర్తివాడ, యూసూఫ్‌పేట, ఆరేపల్లి గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

మెదక్‌ కలెక్టరేట్‌: ఎన్నికల ప్రచారం ముగిసిందని, ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌ షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం స్పష్టం చేశారు. సైలెన్స్‌ పీరియడ్‌లో సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపులు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని తెలిపారు. ఈ అంశంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్‌ రోజు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా జిల్లా పోలీస్‌ శాఖ పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టిందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామన్నారు. జిల్లా ప్రజలు ఎన్నికల నిబంధనలను గౌరవించి పోలీస్‌శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో

అంతరాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement