Medak District News
-
పల్లె పాలన!
పడకేసినకార్మికులకు జీతాలు కరువు రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రాకపోవడంతో వారు సైతం పనులు చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో పంచాయతీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అయితే పల్లెల్లో వివిధ రకాల పన్నులు వసూలు అయినప్పటికీ వాటిని నేరుగా ఉపయోగించేందుకు వీలు లేదు. పంచాయతీ అకౌంట్లో జమ చేసి డ్రా చేయాల్సి ఉంటుంది. అలా అకౌంట్లో జమచేసిన మరుక్షణమే ఫ్రీజింగ్లోకి వెళ్లిపోతున్నాయని, దీంతో ఆ డబ్బులను వాడుకునే అవకాశం లేకుండా పోయిందని పంచాయతీ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 493 గ్రామాలు ఉండగా, 7 లక్షల పైచిలుకు జనాభా ఉన్నారు. గతేడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. ఆ వెంటనే ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. పాలకవర్గాలు లేకపోవడంతో 16 నెలలుగా పంచాయతీలకు కేంద్రం నుంచి పైసా విడుదల కాలేదు. స్పెషలాఫీసర్లు జీపీల ముఖం చూడటం మానేశారు. దీంతో భారమంతా కార్యదర్శులపైనే పడింది. గ్రామాల్లో చెత్త సేకరణ కోసం ఉపయోగించే ట్రాక్టర్లలో డీజిల్, వీధి దీపాలు, మోటార్ల రిపేర్లు, మురికి కాలువల వెంట గడ్డి మందు పిచికారీ, దోమలకు ఫాగింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాలు, గ్రామసభల నిర్వహణ, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు సైతం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో చెత్త ట్రాక్టర్ల నిర్వహణ మాతో కాదంటూ తాళాలను ఆయా మండలాల ఎంపీడీఓలకు అప్పగించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తప్ప గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు ఏ ఇతర పనులు చేపట్టబోమంటూ తేల్చిచెప్పారు. ఇదిలాఉండగా గతేడాది సెప్టెంబర్లో పచ్చదనం.. స్వచ్ఛదనం కింద 2 వేల జనాభాకుపైగా ఉన్న జీపీలకు రూ. 75 వేలు, అంతకంటే తక్కువ ఉన్న పంచాయతీలకు రూ. 50 వేల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా, అవి నేటికీ విడుదల కాకపోవటం గమనార్హం. పొంచి ఉన్న సీజనల్ వ్యాధుల ముప్పుప్రస్తుతం వానాకాలం ప్రారంభం కావటంతో పారిశుద్ధ్య నిర్వహణపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. తాగునీటి నల్లాల లీకేజీలను అరికట్టకపోయినా, మురికి కాలువల వెంట చెత్తా చెదారం తొలగించకపోయినా, ఈగలు, దోమలకు ఆవాసం ఏర్పడి మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. 16 నెలలుగా నిధులు లేకనీరసించిన గ్రామాలు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువు పనిభారంతో చేతులెత్తేసిన పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓలకు చెత్త సేకరణట్రాక్టర్ల తాళాలు అప్పగింత -
మార్పు వెనుక మతలబేమిటో!
దుకాణాలు ఎప్పుడు అప్పగిస్తారో?నర్సాపూర్లో దుకాణ సముదాయంనిర్మించి రెండున్నరేళ్లు కావొస్తున్నా అద్దెకు ఇవ్వడం లేదు. వివరాలు 9లో uశనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025ముప్పును ముందే చెబుతాయి వాతావరణానికి సంబంధించిన వివరాలు అందించే ప్రత్యేక యాప్లు అందుబాటులోకి వచ్చాయి. వివరాలు 8లో uసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి మార్పుపై రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బాధ్యతల నుంచి కొండా సురేఖను తప్పించి కొత్తగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న గడ్డం వివేక్ వెంకటస్వామిని ఇన్చార్జి మంత్రిగా నియమిస్తూ గురువారం ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే కొండా సురేఖ ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతోపాటు, ఇటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలను సమన్వయం చేయడంలో ఇన్చార్జి మంత్రిది కీలక బాధ్యత ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ బలంగా ఉంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో కేవలం నాలుగు చోట్ల మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన ఏడు చోట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్న జిల్లాలో ఇన్చార్జి మంత్రి పాత్ర మరింత కీలకం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను, కేడర్ను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంతో కీలకమైన ఇన్చార్జి మంత్రిగా కొండా సురేఖను మార్చడం వెనుక కారణమేమై ఉంటుందోననే దానిపై చర్చ జరుగుతోంది. కలకలం రేపిన వేర్వేరు సమీక్షలు.. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి కొండా సురేఖలు ఒకే అంశాలపై ఒక్క రోజు వ్యవధిలోనే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం అధికార వర్గాల్లో చర్చోపచర్చలకు దారితీసింది. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, ఖరీఫ్ పనుల సమాయత్తం వంటి అంశాలపై ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రులు సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించిన విషయం విదితమే. ఈ ఆదేశాల మేరకు పక్షం రోజుల క్రితం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సంగారెడ్డిలో జరిగింది. మీడియాను అనుమతించకుండా నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి ఇద్దరు మంత్రులు హాజరైనప్పటికీ.. కేవలం కొండా సురేఖ మాత్రమే సమీక్షలో మాట్లాడారని తెలిసింది. ఈ సమీక్ష జరిగిన 24 గంటలు గడవకముందే దామోదర రాజనర్సింహ ఇవే అంశాలపై జిల్లా పరిషత్లో మరోసారి సమీక్షలు నిర్వహించారు. ఇలా కొండా సురేఖ సమీక్షించిన అంశాలనే ఒక్క రోజు కూడా గడవక ముందే దామోదర సమీక్షించడం అధికార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇలా జిల్లా మంత్రితో పొసగక పోవడంతోనే ఇన్చార్జి మంత్రి మారారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్దదైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను కై వసం చేసుకోవాలంటే పకడ్బందీగా కార్యాచరణ అవసరం ఉంటుంది. ఇన్చార్జిగా బాధ్యతల్లో ఉంటే ఈ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించడం కుదరకపోవచ్చనే కారణంగానే ఈ బాధ్యతల నుంచి తప్పించారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.న్యూస్రీల్ఆ నియోజకవర్గాల్లో కీలకం.. ఇన్చార్జి మంత్రిగా నియమితులైన వివేక్కు ఒకవిధంగా ఈ బాధ్యతలు సవాలుగానే కనిపిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికంగా ఉండడంతో పార్టీ కేడర్ను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సమన్వయం కీలకం. చర్చనీయాంశంగా మారిన ఇన్చార్జి మంత్రి మార్పు నిర్ణయం కొండా సురేఖను తప్పించి వివేక్ నియామకం ఆ నియోజకవర్గాల్లో కేడర్ సమన్వయంవివేక్కు సవాలే -
ప్రభుత్వ బడుల బలోపేతానికి చర్యలు
పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నా రు. శుక్రవారం పెద్దశంకరంపేట, మల్కాపూర్ పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులకు నూతన దుస్తులు, పుస్తకాలు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బడీడు పిల్లలు బడిలో ఉండే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు విజయ్కుమార్, మారుతి, విఠల్, సత్యకుమార్ ఉపాధ్యాయులు రామకృష్ణాగౌడ్, సిద్దిరాములు, నాయకులు సురేందర్రెడ్డి, మధు, నారాగౌడ్, ఆర్ఎన్.సంతోష్, సంగమేశ్వర్, సుభాష్గౌడ్, గంగారెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
కొల్చారం(నర్సాపూర్): భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎనగండ్లలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. ఈసందర్భంగా గ్రామంలో చాలా ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న సాదా బైనామాలను వెంటనే పరిష్కరించాలని రైతులు అదనపు కలెక్టర్ను కోరారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసచారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. అవసరమైన మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యా ప్రమాణాలు పెంపొందించే విధంగా బోధనను అందించాలని సూచించారు. -
బడీడు పిల్లలు బడిలోనే ఉండాలి
చిన్నారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాహుల్రాజ్ హవేళిఘణాపూర్(మెదక్): గ్రామీణ ప్రాంతంలో బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కూచన్పల్లిలో విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చూడాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని కూచన్పల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సును సందర్శించారు. దరఖాస్తులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందన్నారు. రైతుల నుంచి అవసరమైన అర్జీలు స్వీకరించి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన ధ్రువపత్రాలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సింధూరేణుక, గిర్దావర్ ఆబేద్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక మెదక్ కలెక్టరేట్: జిల్లాలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుకను ఉచితంగా అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో మైనింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్మాణాలకు జీరో పర్మిట్ సిస్టంతో కాంట్రాక్టర్లకు అవసరమైన ఇసుక, కంకర, మినరల్స్ను ఆన్లైన్ ద్వారా కొనుగోలుకు అవకాశం కల్పి ంచాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి ప్రతి మండలంలో ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు క్రియాశీలకంగా పనిచేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. అనంతరం సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈనెల 16న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగనున్న రైతునేస్తం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
డీఈఓ రాధాకిషన్
కార్పొరేట్కు దీటుగా బోధన నిజాంపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని డీఈఓ రాధాకిషన్ అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామా ల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. చల్మెడలో సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ యాదగిరి, మాజీ ఎంపీటీసీ బాల్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రమే ష్, గ్రామ కార్యదర్శి వెంకట నరసింహారెడ్డి, హెచ్ఎం సతీష్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వివేక్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర కార్మిక, భూగర్భ గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నియమితులయ్యారు. ఇప్పటివరకు జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన కొండా సురేఖ స్థానంలో వివేక్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అమాత్య పదవి దక్కిన సంగతి తెలిసిందే. కేబినెట్లో బెర్త్ లభించిన వారంలోనే ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులు కావడం గమనార్హం. -
బల్దియాల్లో మాన్సూన్
కొనసాగుతున్న100 రోజుల యాక్షన్ప్లాన్ ● సెప్టెంబర్ 10 వరకు కొనసాగింపు ● జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు,75 వార్డులువానాకాలంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీల్లో మాన్సూన్ పేరిట 100 రోజుల ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఈనెల 2వ తేదీన యాక్షన్ప్లాన్ ప్రారంభం కాగా, సెప్టెంబరు 10వ తేదీ వరకు కొనసాగనుంది. ముందస్తుగా పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్తపై వార్డుల వారీగా అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. – మెదక్జోన్ జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 75 వార్డులు ఉండగా, రెండు లక్షల పైచిలుకు జనాభా ఉన్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ముందస్తుగా దోమల నివారణతో పాటు కలుషిత తాగునీటితో వచ్చే వ్యాధులపై అధికారులు రోజుకో వార్డులో పర్యటిస్తూ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పట్టణాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 62 రకాల అంశాలను 100 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి వంద రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్య నిర్వహణతో పాటు ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వార్డుల్లో మురికి కాలువల పరిశుభ్రత, పిచ్చిమొక్కల తొలగింపు, తడి, పొడి చెత్తపై ప్రచారం, గుంతల్లో నీటి నిల్వ లేకుండా చూడటం, దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. మలేరియా, డెంగీ వ్యాధులు సోకకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వీధుల్లో రోడ్ల శుభ్రత, ఇళ్లలో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లలో నీటి నిల్వ లేకుండా చూడటం, పరిసరాల పరిశుభ్రతపై ముందుస్తుగా వివరిస్తున్నారు. 62 అంశాలపై కార్యాచరణ మున్సిపాలిటీల్లో 62 అంశాలపై వంద రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించి, ఆ దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఆయా బల్దియాల పరిధిలో పెంచుతున్న నర్సరీల్లో మొక్కల వివరాలు సేకరించి వార్డుల్లో, చెరువు కట్టలు, రోడ్లకు ఇరువైపులా నాటడం, ఇంజనీరింగ్ అధికారులు అభివృద్ధి పనులపై దృష్టి సారించడం, అత్యవసరమైన పనులకు వెంటనే టెండర్లు పిలిచి నిర్దేశించిన పనులను తగిన సమయంలో చేయించడం, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం వార్డు అధికారులు ఇంటితో పాటు వివిధ రకాల పన్నులను ఎప్పటికప్పుడు వసూలు చేయటం, కొత్తగా వ్యాపారులకు లైసెన్స్లు అందించడం, వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించటం, వికలాంగుల కోసం ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం, మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించటం, అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించి అవసరమైన వారికి కనెక్షన్ ఇవ్వటం లాంటి పనులు చేపట్టనున్నారు. పక్కాగా అమలుచేస్తాం ప్రభుత్వం నిర్దేశించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తాం. ఇప్పటికే వార్డుల్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. ముందుగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలను, మహిళా సంఘాల సభ్యులతో పాటు ఎన్జీఓలను సైతం భాగస్వాములను చేస్తున్నాం. – శ్రీనివాస్రెడ్డి, మెదక్ మున్సిపల్ కమిషనర్ -
భూభారతికి దరఖాస్తుల వెల్లువ
8 రోజులు.. ● 216 సదస్సులు.. ● 13,693 అర్జీలుమెదక్ కలెక్టరేట్: భూ భారతి రెవెన్యూ సదస్సులకు జిల్లాలో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయిన రైతులు కొండంత నమ్మకంతో తరలివస్తున్నారు. జిల్లాలోని 216 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా, రైతులు తమ సమస్యలపై ఇప్పటివరకు 13,693 అర్జీలు సమర్పించారు. అయితే అత్యధికంగా అసైన్డ్ భూముల సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, సాదాబైనామాలు, పాస్పుస్తకంలో తప్పులు వంటి సమస్యలపై అత్యధికంగా దరఖాస్తులు అందజేస్తున్నారు. ఇదిలాఉండగా రెవెన్యూ సదస్సులను కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్తో పాటు ఆర్డీఓలు సందర్శించి దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆరుగురు అధికారుల బృందం జిల్లాలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో ఆరుగురు అధికారుల బృందం పాల్గొంటున్నారు. ఈ బృందంలో తహసీల్దార్, డిప్యుటీ తహసీల్దార్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారులు బృందంగా ఏర్పడి రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. రైతుల నుంచి వినతులు స్వీకరించి కేటగిరీల వారీగా విభజిస్తున్నారు. హెల్ప్డెస్క్ల ఏర్పాటు గ్రామాల్లో చాలా వరకు రైతులు నిరక్షరాస్యులుగా ఉండటంతో వారికి ఉపయోగపడేలా హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉచితంగా దరఖాస్తు పత్రాలు ఇవ్వడంతో వారి సమస్యను అక్కడే హెల్ప్డెస్క్ అధికారులు రాసిస్తున్నారు. అంశాలు అర్జీలు అసైన్డ్ భూ సమస్యలు 2,639 సర్వే నంబర్ మిస్సింగ్ 2,624 సాదాబైనామాలు 2,429 పీఓటీలు 2,014 పాస్పుస్తకంలో తప్పులు 964 ఓఆర్సీ 412 సక్సెషన్ 435 మ్యూటేషన్ పెండింగ్ 307 కొత్త అసైన్డ్ భూములు 246 ఫారెస్ట్, రెవెన్యూ సర్వే కోసం 164 ఇతర సమస్యలపై 1,459 -
త్వరితగతిన సమస్యలు పరిష్కారం
37 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంతూప్రాన్/మనోహరాబాద్(తూప్రాన్)/శివ్వంపేట(నర్సాపూర్): భూభారతి రెవెన్యూ చట్టంతో రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గు రువారం తూప్రాన్లోని రావెళ్లి, మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లిలో రెవెన్యూ సదస్సును సందర్శించారు. ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, వాటిని వెంటవెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 13,693 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయన వెంట ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్లు కృష్ణ, చంద్రశేఖర్రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమూర్తి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. అనంతరం శివ్వంపేట ప్రభు త్వ జూనియర్ కాలేజీకి తరగతి గదుల కొరత ఉండడంతో కలెక్టర్ పరిశీలించారు. కాలేజీకి సొంత భవనం లేకపోవడంతో ప్రస్తుతం శివ్వంపేట ఉన్నత పాఠశాలలో కొనసాగుతుంది. త్వరలోనే సమస్యను పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట జిల్లా ఇంటర్ విద్యాధికారి మాధవి, తహసీల్దార్ కమలాద్రి, ఎంఈఓ బుచ్చనాయక్, ప్రిన్సిపాల్ శైలజ, హెచ్ఎం బాలచంద్రం ఉన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ జిల్లాలో 37 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం ఐటీసీ పరిశ్రమలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలను నాటడమే కాకుండా సంరక్షించాలని సూచించారు. ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెట్లను నరికితే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రకాశ్రావు, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమూర్తి, ఎంఈఓ మల్లేశం, ఎంపీఓ శ్రీనివాస్రెడ్డి, ఏపీఓ ఆదినారాయణ, ఐటీసీ ప్రతినిధులు, సిబ్బంది ఉన్నారు. -
బడిగంట మోగింది
మెదక్జోన్: బడిగంటలు గణగణ మోగాయి. వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశా లలు తెరుచుకున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ఆరంభం అయింది. ఇంటి వద్ద ఆటాపాటలతో గడిపిన పిల్లలు బడిబాట పట్టారు. బడిలో అడుగుపెట్టగానే ఉపాధ్యాయులు పూలు అందించి ఘన స్వాగతం పలికారు. కాగా తొలిరోజు విద్యార్థులు అంతంత మాత్రంగానే పాఠశాలలకు వచ్చారు. చాలా చోట్ల ఉదయం ప్రార్థనలో ఉపాధ్యాయులే దర్శనం ఇచ్చారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ అధికారులు చెప్పినట్టుగానే విద్యార్థులకు మొదటి రోజే పుస్తకాలు, యూనిఫాంలు అందించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి కౌడిపల్లి(నర్సాపూర్): పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు పుస్తకాలు, యునిఫాంలు అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రమైన కౌడిపల్లి ఉన్నత, బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృిషి చేస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సొంతభవనం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలరాజు, హెచ్ఎంలు సాజిద్అలీ, పద్మజ, ఓంప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సర్కారు బడులపై నమ్మకం పెరిగింది పాపన్నపేట(మెదక్)/అల్లాదుర్గం/టేక్మాల్: ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేట్ బడి నుంచి విద్యార్థులు రావడం కొత్త మార్పుకు నిదర్శనమని డీఈఓ రాధాకిషన్ అన్నారు. గురువారం పాపన్నపేట మండలం గాజులగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ బడులన్నీ ప్రజలయే అన్న విషయాన్ని గుర్తించి, ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపాలని కోరారు. అధునాతన విద్యావిధానంతో పాటు చిన్నప్పటి నుంచే పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ విద్య అందిస్తున్నామని, కృత్రిమ విద్య సైతం అందుబాటులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రతాప్రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలాగౌడ్, సొసైటీ చైర్మన్ మల్లేశం, హెచ్ ఎం సాయికుమార్, టీచర్లు రవీందర్ రెడ్డి, సాయిలు, వేణుగోపాల్, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం టేక్మాల్ మండలంలోని బొడ్మమటిపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించారు. అలాగే అల్లాదుర్గం మండల పరిధిలోని ముస్లాపూర్ పీఎంశ్రీ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్నారు. తొలి రోజు హాజరు అంతంతే.. విద్యార్థులకు యూనిఫాం,పాఠ్యపుస్తకాలు పంపిణీ -
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్లో రికార్డుస్థాయి లో ధాన్యం కొను గోలు చేసినట్లు అదనపు కలెక్టర్ నగేష్ గురువారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 488 కొనుగోలు కేంద్రాల్లో పూర్తయినట్లు తెలిపారు. ప్రస్తుతం మరో 10 కేంద్రాల్లో కొంతమేర ధాన్యం మిగిలిఉందన్నారు. 80,045 మంది రైతుల నుంచి 3,19,460,480 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పారు. ఇందుకుగానూ రూ.701 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. మరో 10 కొనుగోలు సెంటర్లలో మాత్రమే కొనుగోలు ముగింపుస్థాయిలో ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి అధికారిని అభినందించారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తూ రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ, గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో ధాన్యం సేకరించినట్లు పేర్కొన్నారు. సదస్సులు సద్వినియోగం చేసుకోండి చిన్నశంకరంపేట(మెదక్): భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. గురువారం మండలంలోని గవ్వలపల్లిలో రెవెన్యూ సదస్సును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈసందర్భంగా తహసీల్దార్ మన్నన్కు పలు సూచనలు చేశారు. అనంతరం నార్సింగి మండల కేంద్రంలోని రైతు సదస్సును పరిశీలించారు.అదనపు కలెక్టర్ నగేష్ -
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావుమెదక్ కలెక్టరేట్/చిన్నశంకరంపేట(మెదక్): పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు వరమని మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో 311 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. గత పాలకులు పదేళ్లలో కుంటిసాకులతో కాలం వెళ్లదీశారే తప్ప ప్రజలకు చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి దిశ గా ముందుకు సాగుతున్నామని తెలిపారు. విద్యా, వైద్యం ప్రధాన అంశాలుగా తీసుకున్నామని చెప్పారు. రామాయంపేటలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 420 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. -
విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు అవసరం
నర్సాపూర్ రూరల్: ప్రతి రైతు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ పద్మ, గీత, రంజిత, గాయత్రి రైతులకు సూచించారు. గురువారం మండలంలోని రుస్తుంపేట, అద్మాపూర్లో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవాలన్నారు. రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో మంచి దిగుబడి వస్తుందన్నారు. నర్సాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారి దీపిక తెలిపారు. -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
చేగుంట(తూప్రాన్): కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం చేగుంటలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటై ఏడాదిన్నర దాటినా పంచాయతీల పాలనను పట్టించుకోవడం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరుగుతున్నా యని వాపోయారు. రామాయంపేటలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని బాధితుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమయంలో పాఠశాలల నిర్వహణ, వర్షాకాలం సీజన్కు సంబంధించి సమీక్షలు నిర్వహించాల్సి ఉండగా, మంత్రులు జిల్లా వైపు తొంగిచూడకపోవడం విడ్డూరమన్నారు. ప్రొటోకాల్ పాటించకుండా, ఓడిపోయిన వారు గ్రామాల్లో పర్యటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్, రాజిరెడ్డి, విశ్వేశ్వర్రావు, జర్నల్సింగ్, యాదగిరి పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడిలోనే బంగారు భవిష్యత్
మెదక్మున్సిపాలిటీ/హవేళిఘణాపూర్/నర్సాపూర్ రూరల్: తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించి వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. బుధవారం మెదక్ మండలం మంభోజిపల్లి నుంచి అవుసులపల్లి వరకు 10కే రిలే వాకింగ్ను ప్రారంభించారు. అనంతరం అవుసులపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మా రుతున్న కాలానుగుణంగా సరికొత్త సాంకేతిక విద్యా విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నామని వివరించారు. కార్పొరేట్ పాఠశాలల కు ధీటుగా మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, డీఈఓ రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, యువజన క్రీడల నిర్వహణ అధికారి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తిలో భూ భారతి రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈనెల 10 తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 187 గ్రామాల్లో 10,933 దరఖాస్తులు స్వీకరించామన్నారు. అయిల్పాం సాగుకు ఆసక్తి చూపండి శివ్వంపేట(నర్సాపూర్): రైతులు అయిల్పాం సాగుకు ముందుకు రావాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని సీతారం తండాలో ఆయిల్పాం మొక్కలు నాటి మాట్లాడా రు. రైతులు ఒకే పంట విధానం కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందన్నారు. 2025– 26 సంవత్సరంలో 2,500 ఎకరాల్లో అయిల్పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అనంతరం రత్నాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఆయ న వెంట పలువురు అధికారులు ఉన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
బడికి వేళాయె..!
ఆటాపాటలతో వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ తొలిరోజే అందించేందుకు సిద్ధం చేసింది. ఇక తల్లిదండ్రులు పొద్దున్నే పిల్లలను రెడీ చేయడం, పాఠశాలలకు వెళ్లబోమని మారం చేస్తే బుజ్జగించడం వంటివి మొదలుకానున్నాయి. – మెదక్జోన్నేటి నుంచి పునఃప్రారంభం ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● ప్రభుత్వ పాఠశాలలబలోపేతానికి బడిబాట ● జిల్లావ్యాప్తంగా 922 పాఠశాలలు, 87 వేల మంది విద్యార్థులుపుస్తకాలు, యూనిఫామ్స్ రెడీ తొలిరోజే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ను అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 4,60,408 పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటికే ఆయా పాఠశాలలకు చేరాయి. అలాగే ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున యూనిఫాం అందించాల్సి ఉంది. ఇప్పటివరకు 80 శాతం మాత్రమే కుట్టడం పూర్తికావడంతో మొదటి రోజున ఒక్కో జత అందించేందుకు సిద్ధమయ్యారు. మరో వారం రోజుల్లో మరో జత యూనిఫాం అందజేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 922 పాఠశాలలు ఉండగా, వాటిలో 87 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా గతేడాది ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా 562 పాఠశాలలను ఎంపిక చేసి మరమ్మతుల కోసం రూ. 20 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులతో తాగునీటి సౌకర్యం, పాఠశాలల పైకప్పుల మరమ్మతులు, మరుగుదొడ్లు, కిచెన్షెడ్లు, పాఠశాలల చుట్టూ ప్రహరీ, కరెంట్ మరమ్మతులు, కిటికీలు, తలుపులకు రిపేర్లు చేయించి మౌలిక వసతులు కల్పించారు. బడిబాటలో 1,800 మంది గుర్తింపు జిల్లాలో బడిబాటను ఈనెల 6 నుంచి ఉపాధ్యాయులు ప్రారంభించారు. ఇది ఈనెల 19 వరకు కొనసాగించనున్నారు. అయితే ఇప్పటికే 1,800 విద్యార్థులను గుర్తించి వివిధ పాఠశాలల్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా వేసవి సెలవుల్లో ముందస్తు బడిబాటలో భాగంగా జిల్లాలో డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించారు. ఇంటింటికీ తిరిగి సర్కారు బడిలో కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన గురించి తల్లిదండ్రులకు వివరించారు. అలాగే వివిధ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి చదువు ప్రాధాన్యతను చెప్పారు. ఇదిలా ఉండగా అంగన్వాడీ పాఠశాలల నుంచి 7 వేల పైచిలుకు విద్యార్థులు ప్రాథమిక పాఠశాలల్లో చేరనున్నారు. భవిత సెంటర్లకు రూ. 1.20 కోట్లు దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్ కోసం జిల్లాలో 21 భవిత సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. కాగా వాటిలో ప్రస్తుతం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలు ఉండగా, మండలానికో పాఠశాలను గుర్తించి వాటిలో భవిత సెంటర్లు కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు నిత్యం వైద్య పరీక్షలు నిర్వహించి వినికిడి యంత్రాలతో పాటు చేతికర్రలు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుతున్నారు. వీరికి ఆట వస్తువులను చూపుతూ చదువు చెబుతారు. అయితే ఆ సెంటర్లలో మరుగుదొడ్లు, తాగునీరు తదితర అవసరాల కోసం రూ. 1.20 కోట్ల నిధులు విడుదల కాగా, మరమ్మతులు చేపడుతున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా 3,400 మంది ఉపాధ్యాయులకు గత నెలలో 19 రోజుల పాటు పలు అంశాలపై టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా విద్యార్థుల స్థాయిని గుర్తించడం, వెనుకబడిన వారికి అర్థమయ్యేలా బోధించడం, మారుతున్న బోధనా విధానాలను అనుసరించడంతో పాటు ఏఐపై అవగాహన కల్పించారు. సర్కారు బడిలోనే సంపూర్ణ విద్య సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తోంది. అన్ని అర్హతలు గల ఉపాధ్యాయులచే బోధన సాగుతుంది. అలాగే పాఠశాలలను అన్ని హంగులతో తీర్చిదిద్దాం. పుస్తకాలు, యూనిఫామ్స్ ఉచితంగా అందజేస్తాం. తల్లిదండ్రులు విద్యార్థులను సర్కారు బడుల్లోనే చేర్పించాలి. – రాధాకిషన్, డీఈఓ -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
మెదక్ కలెక్టరేట్: ఈనెల 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా లోక్ అదాలత్కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆర్ఎం సుభవల్లి తదితరులు పాల్గొన్నారు. ఆ బాధ్యత ప్రభుత్వానిదే: పీఆర్టీయూ మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. బుధవారం మెదక్లో ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం అవుతున్నాయని, జిల్లాలోని చాలా వరకు బడుల్లో కనీస వసతులు లేవన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో విద్యార్థులను నాణ్యమైన విద్యకు దూరం చేయొద్దన్నారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా ప్రభుత్వం మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. అందులోని విద్యార్థులను ప్రాథమిక పాఠశాలల్లో చేర్చుకొనే అవకాశం ఉందన్నారు. దీంతో పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్నారు. 392 మందికిసీట్ల కేటాయింపు కౌడిపల్లి(నర్సాపూర్): ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి బుధవారం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ హరిబాబు తెలిపారు. జిల్లాలోని వివిధ ఎంజేపీ గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న 392 సీట్లు భర్తీ చేయగా, ఇందులో 217 మంది బాలికలు, 175 మంది బాలురు ఉన్నట్లు చెప్పారు. వీరికి గురుకుల పాఠశాలలో అడ్మిషన్ పొందేందుకు అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్లు వివరించారు. దేశవ్యాప్త సమ్మెనుజయప్రదం చేద్దాం శివ్వంపేట(నర్సాపూర్): కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9వ తేదీన నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని దొంతిలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ను రద్దు చేసే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి మల్లేష్, నాయకులు రవీంద్రప్రసాద్, శంకర్, ప్రభాకర్, లక్ష్మణ్, వసంత, శ్రీకాంత్, పాల్గొన్నారు. కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని డైట్ కళాశాలలో డీసెట్ అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన కొనసాగుతోంది. 9వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కాగా బుధవారం వరకు 900మంది సర్టిఫికెట్లను పరిశీలించినట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. మొత్తం 2,198 మందికి గాను నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మిగితా విద్యార్థులు 11వ తేదీ లోపు హాజరుకావొచ్చని సూచించారు. 13వ తేదీన అభ్యర్థుల ర్యాంకును బట్టి సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. -
డబ్బులు లేక.. పనులు ప్రారంభించక
రామాయంపేట(మెదక్): ‘ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ముందు పనులు చేస్తే గాని ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కావు. ఇప్పుడు ఇంటి నిర్మాణం ఎలా’ అని మండలంలోని ఝాన్సిలింగాపూర్ పంచాయతీ పరిధిలోని సదాశివనగర్ తండాకు చెందిన గిరిజన మహిళ రజిత ఆవేదన వ్యక్తం చేస్తుంది. గతంలో భర్త విద్యుత్షాక్తో మృతిచెందగా, కట్టెలు అమ్మి, కూలీ పనులు చేస్తూ పిల్లలను పెంచి పోషిస్తుంది. ప్రస్తుతం శిథిలమైన పూరి గుడిసెలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో తండాకు మూడు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, అందులో రజిత పేరు ఉంది. అయితే చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇంటి నిర్మాణానికి దూరంగా ఉంటుంది. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేస్తే మొదటి బిల్లు వస్తుందని అధికారులు చెబుతుండగా, డబ్బులు లేకపోవడంతో పనులు ప్రారంభించలేదు. దాత లు సహకరించాలని వేడుకొంటుంది. రజిత ఇళ్లు నిర్మించుకునేందుకు సహాయ సహకారాలు అందజేస్తామని ఎంపీడీఓ సజీలుద్దీన్ హామీ ఇచ్చారు. -
భూసేకరణ కొలిక్కి..!
పలు గ్రామాల అవార్డులకు ఎన్హెచ్ఏఐ ఆమోదముద్ర ● పరిహారం చెల్లించేందుకు రెవెన్యూశాఖ సన్నాహాలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వస్తోంది. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భూ సేకరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ప్రకటించిన అవార్డు (సేకరించే భూముల సర్వేనంబర్లు, పట్టాదారుల పూర్తి వివరాలు)లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ఆమోదముద్ర వేసింది. మరికొన్నింటికి అప్రూవల్ రావాల్సి ఉంది. ఈ ఆమోదం వచ్చి న వెంటనే నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్గా భావిస్తున్న ఈ రహదారి ఉత్తర భాగం 161 కి.మీలు సంగారెడ్డి, ఆందోల్, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్ ఆర్డీఓలు భూసేకరణ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇదీ జరిగింది... మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీఓ పరిధిలో శివంపేట, నర్సాపూర్ మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో 1,048 మంది రైతుల వద్ద మొత్తం 758 ఎకరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి 28 అవార్డులను ప్రకటించారు. ఇందులో ఎన్హెచ్ఏఐ పీడీ కార్యాలయం నుంచి 13 అవార్డులకు ఇప్పటికే అనుమతి లభించింది. మరో 15 అవార్డులకు అప్రూవల్ వచ్చిన వెంటనే పరిహారం చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లోని 13 గ్రామాలు, ఆందోల్ డివిజన్లోని ఐదు గ్రామాలు కలిపి మొత్తం 824 ఎకరాలు సేకరిస్తున్నారు. సంగారెడ్డి డివిజన్కు సంబంధించి 24 అవార్డులకుగాను ఎన్హెచ్ఏఐ అధికారులు ఆరింటికి మాత్రమే అప్రూవల్ ఇచ్చారు. ఆందోల్కు సంబంధించిన భూసేకరణ అవార్డులకు అప్రూవల్ రావాల్సి ఉంది. తూప్రాన్ ఆర్డీఓ పరిధిలో 430 ఎకరాల భూములను సేకరిస్తున్నారు. ఎనిమిది గ్రామాల్లోని 482 మంది రైతులు నిర్వాసితులుగా మారుతున్నారు. ఆయా గ్రామాలకు సంబంధించిన అవార్డులకు అప్రూవల్ కోసం ఎన్హెచ్ఏఐకి పంపనున్నారు. ఈ అప్రూవల్ వచ్చిన వెంటనే రెవెన్యూ అధికారులు నిర్వాసిత రైతులకు పరిహారం పంపిణీ చేస్తారు. కనీసం రూ.70 లక్షలు చెల్లించాలంటున్న నిర్వాసితులు.. తప్పనిసరి పరిస్థితుల్లో తమ భూములు గుంజుకుంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని నిర్వాసితులుకోరుతున్నారు. గతంలో పలుచోట్ల ఈ భూసేకరణకు సంబంధించిన సర్వే పనులను నిర్వాసిత రైతులు అడ్డుకున్న విషయం విదితమే. దీంతో రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించారు. అయితే పరిహారం కింద ఎకరానికి రూ.70 లక్షలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా నర్సాపూర్ మ ండలం రెడ్డిపల్లి వంటి గ్రామాల నిర్వాసితులు ఈ భూసేకరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వే పనులను కూడా అడ్డుకున్నారు.మూడేళ్లలో జరిగిన లావాదేవీలను బట్టి ధర భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించేందుకు ధర నిర్ణయం చేయాల్సి ఉంది. ఈ ప్రాంతంలో మూడేళ్లుగా జరిగిన భూముల క్రయవిక్రయాలకు ధరను బట్టి...ఈ పరిహారం లెక్కిస్తారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు పరిహారం అందే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కనీసం రూ.70 లక్షలు చెల్లించాలని నిర్వాసితులు కోరుతున్నారు. -
గడువులోగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలి
మెదక్ కలెక్టరేట్: ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని, నిర్లక్ష్యం వహిస్తే అర్హులైన ఇతరులకు అవకాశం కల్పిస్తామని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి మొదటి విడతలో 1,555, రెండో విడతలో 8,260 ఇళ్లు మంజూరు చేసిందన్నారు. కాగా జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్, నారాయణఖేడ్, సిద్దిపేటలోని దుబ్బాక, గజ్వేల్, నియోజకవర్గాలకు సంబంధించిన మరో 8 మండలాలు మెదక్ జిల్లాలోనే ఉన్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మొత్తం 9,815 ఇళ్లను మంజూరు చేసిందని వివరించారు. రూ.1.80 కోట్ల బిల్లులు చెల్లించాం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన 180 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.80 కోట్లు జమ చేశాం. జిల్లాలో 450 మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. మిగితా లబ్ధిదారులు ఇంకా ప్రారంభించలేదు. ఉచితంగా ఇసుక అందించడంతోపాటు నిర్మాణాలు ప్రారంభించగానే వారంవారం బిల్లులు మంజూరు చేస్తామని చెబుతున్నా, లబ్ధిదారుల్లో మార్పు రావడం లేదు. అలాంటి వారిని పక్కన పెట్టి వారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పిస్తాం. నిరుపేదలను ఆదుకుంటాం ఇళ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. జిల్లాలో సుమారు 200 మంది వరకు సొంతిళ్లు నిర్మించుకోలేని నిరుపేదలు ఉన్నట్లు గుర్తించాం. వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా రుణం ఇప్పించి ఇంటి నిర్మాణం చేపట్టేలా కృషి చేస్తున్నాం. వారి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఆర్థికంగా ఉండి ఇళ్ల నిర్మాణం చేపట్టకుంటే మూడు నెలల గడువు ఇస్తాం. అయినప్పటికీ నిర్మాణాలు చేపట్టకుంటే వారి స్థానంలో ఇతర అర్హులకు అవకాశం కల్పిస్తాం.మున్సిపాలిటీల్లో ప్రారంభిస్తున్నాం ఇటీవల మలి విడతలో భాగంగా ప్రభుత్వం 8,260 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తాం. జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నా లుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా మున్సిపల్ కమిషనర్లు ప్రొసీడింగ్ పత్రాలు అందజేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు చేపడుతాం.నిర్లక్ష్యం వహిస్తేకొత్తవారికి అవకాశం జిల్లాకు 9,815 ఇందిరమ్మఇళ్లు మంజూరు ‘సాక్షి’తో హౌసింగ్ పీడీ మాణిక్యం -
పోషకాహార లోపాన్ని నివారిద్దాం
నర్సాపూర్ రూరల్: పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతివారం ఎగ్ బిర్యానీ వంటకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కలిసి ఎగ్ బిర్యానీ వంటకం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు పిల్లలకు పోషకాహారంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యను నేర్పించి వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తూ వేతనాలు పెంచిందన్నారు. పిల్లలకు ఆట వస్తువులతో పాటు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ హేమభార్గవి, ఎంపీడీఓ మధులత, సూపర్వైజర్ సరళ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి -
నిర్వహణ మరింత మెరుగుపడాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ మరింత మెరుగు పడాలని, ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకూడదని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీల ప్రత్యేక అధికారులు, వార్డెన్లకు 2025–26 విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన అంశాలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి హాస్టల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ప్రతి విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్, ఉపాధ్యాయులు, కుక్, కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. హాస్టళ్లను ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీ చేస్తామని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీలను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేయించాలని కోరారు. మెదక్లో కలెక్టర్ పర్యటన మెదక్ మున్సిపాలిటీ: కలెక్టర్ రాహుల్రాజ్ మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా పట్టణంలోని గాంధీనగర్ ఏరియాలో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను పరిశీలించారు. మ్యాప్ను పరిశీలిస్తూ పంచాయతీరాజ్ డీఈ పాండురంగారావు, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావులను పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు, నిర్దేశిత గడువు తేదీలోగా నిర్మాణం పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ను పరిశీలించారు. సంక్షేమ హాస్టళ్లలో మెనూ తప్పనిసరి కలెక్టర్ రాహుల్రాజ్ -
కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం
మెదక్ కలెక్టరేట్: సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును మంగళవారం పాత్రికేయులు నిరసించారు.ఈ మేరకు మంగళవారం అదనపు కలెక్టర్ నగేష్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛపై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టులాంటిదని పేర్కొన్నారు. ఈ దాడిని మేధావులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహించే వారు ఎవరైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. -
రెవెన్యూ సదస్సులతో రైతులకు మేలు
రేగోడ్(మెదక్)/అల్లాదుర్గం(మెదక్): భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి సదస్సులతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని మెదక్ ఆర్డీఓ రమాదేవి తెలిపారు. రేగోడ్ మండలంలోని వెంకటాపూర్లో, అలాగే.. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్లలో ఏర్పాటు చేసిన సదస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కరించేందుకే భూభారతిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను భూభారతితో మోక్ష లభించనుందని పేర్కొన్నారు.మెదక్ ఆర్టీఓ రమాదేవి -
భూసమస్యలు పరిష్కరిస్తాం
కౌడిపల్లి(నర్సాపూర్): భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని ధర్మాసాగర్లో రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సులలో ఎక్కువగా సాదాబైనామా, ప్రభుత్వ భూములను కొనుగోలు చేసిన రైతులు వాటికి పట్టాలు కావాలని దరఖాస్తులు చేస్తున్నారని చెప్పారు. దరఖాస్తులను పరిశీలించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్రెడ్డి -
భూసార పరీక్షలతో బహుళ ప్రయోజనాలు
పాపన్నపేట(మెదక్): భూసార పరీక్షలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాష్త్రవేత్తలు మహేంద్రకుమార్, అంబికా సోని సూచించారు. మంగళవారం మండల పరిధిలోని ఎల్లాపూర్లో జరిగిన వికసిత సంకల్ప అభియాన్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రతి పంటకు ముందు మట్టి పరీక్షలు నిర్వహించడం ద్వారా ,భూమికి అవసరమైన పోషకాలను గుర్తించవచ్చన్నారు. ఇందుకనుగుణంగా ఏయే ఎరువులు వాడాలో తెలుస్తుందన్నారు. వ్యవసాయ అధికారుల సూచన మేరకే ఎరువులు వాడాలన్నారు. మోతాదుకు మించి ఎరువులు వాడితే.. దిగుబడి తగ్గడమే గాకుండా, పెట్టుబడి వ్యయం తడిసి మోపెడువుతుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, శాస్త్రవేత్తలు ప్రసాద్, సాయిప్రసాద్, చిన్నబాబు, రవికుమార్, ఆత్మడిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ అంబికా సోని, ఏడిఏ విజయ నిర్మల, ఏఓ నాగమాధురి, ఏఇఓలు అభిలాష్, జనార్ధన్, రజిత పాల్గొన్నారు.వ్యవసాయ శాస్త్రవేత్తలు మహేంద్రకుమార్అధిక దిగుబడులు సాధించాలి నర్సాపూర్: వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి అధిగ దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారి వినయ్కుమార్ రైతులకు సూచించారు. మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోయా చిక్కుడు సాగుపై శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి, వానాకాలానికి అనువైన కూరగాయల విత్తనాలపై ఉద్యానవన కళాశాల అసిస్టెంటు ప్రొఫెసర్ శ్రీనివాస్, పశువుల వ్యాధులు, వాటి నివారణపై పశువైద్యురాలు లక్ష్మి సూచనలు ఇచ్చారన్నారు. శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే మంచి లాభాలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి దీపిక తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేటు విద్య ఉచితం
మెదక్ కలెక్టరేట్: నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పథకం ప్రవేశ పెట్టింది. ఈ పథకానికి జిల్లాలో మెరుగైన వసతులు కలిగిన ఐదు ప్రైవేట్ పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రతి ఏడాది లక్కీ డ్రా ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో చేరే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేలా అవకాశం కల్పించారు. కలెక్టరేట్లోని ఎస్సీ అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తు పత్రాలు అందజేస్తున్నారు. ఎస్సీ విద్యార్థులకు 120 సీట్లు బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎస్సీ విద్యార్థులు చేరేందుకు ఒకటవ తరగతికి 59 సీట్లు, 5వ తరగతికి 61 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఎంపిక కోసం ఈనెల 20న మెదక్ కలెక్టరేట్లో లక్కీ డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఎంపికై తే జిల్లాలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ స్థాయి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చేరే అవకాశం ఉంటుంది. ఎస్టీ విద్యార్థులకు 49 సీట్లు ఎస్టీ విద్యార్థులకు మొత్తం 49 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అందులో 3వ తరగతి(25), 5వ తరగతి(12), 8వ తరగతి(12) సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. 20న కలెక్టరేట్లో లక్కీ డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికై న గిరిజన విద్యార్థులు సేయింట్ జోసెఫ్ హైస్కూల్, సంగారెడ్డి, శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయం సిద్దిపేటలో విద్యాభ్యాసం చేసే అవకాశం దక్కుతుంది. ఎస్టీ బాలికలకు 33శాతం రిజర్వేషన్ ఎస్టీ బాలికలకు 33శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. విద్యార్థులు అంతకు ముందు చదివిన తరగతుల బోనఫైడ్లు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.1,50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. పూర్తిచేసిన దరఖాస్తు పత్రాలను ఈనెల 17వ తేదీ సాయంత్రంలోగా జిల్లా సమీకృత కలెక్టరేట్లోని ఎస్టీ అభివృద్ధి కార్యాలయంలో సమర్పించాలి. కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు విద్యార్థులు దరఖాస్తు పత్రానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా జత చేయాలి. మీ సేవ ద్వారా 2025 జనవరి తర్వాత పొందిన జనన ధ్రువీకరణ, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాలు, ఆధార్కార్డు, రేషన్కార్డు, బోనఫైడ్, ప్రోగ్రెస్కార్డులు కలిగి ఉండాలి.బెస్ట్ అవైలబుల్ పథకం.. పేద విద్యార్థులకు వరం ఎస్టీ విద్యార్థులకు 49 సీట్లు ఈనెల 16 వరకు దరఖాస్తుల స్వీకరణఅర్హతలు బెస్ట్ అవైలబుల్ పథకం కింద దరఖాస్తు చేసుకునే ఎస్సీ విద్యార్థులు 1వ తరగతిలో చేరేందుకు యూకేజీ పూర్తి చేసి ఉండాలి. 1వ తరగతిలో చేరేందుకు 2019 జూన్ 01 నుంచి 2020 మే 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. అలాగే 5వ తరగతిలో చేరేందుకు 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. 2024–25లో 4వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 5వ తరగతిలో చేరేందుకు అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.1,50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. పూర్తి చేసిన దరఖాస్తు పత్రాలను ఈనెల 16వ తేదీ సాయంత్రంలోగా మెదక్ సమీకృత కలెక్టరేట్లోని ఎస్సీ అభివృద్ధి కార్యాలయాల్లో సమర్పించాలి. -
సదస్సులను సద్వినియోగం చేసుకోండి
కౌడిపల్లి(నర్సాపూర్): భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం మండలంలోని పాంపల్లి, ధర్మాసాగర్లో సదస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసమస్యలు ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియో గం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ జహీర్, ఆర్ఐ శ్రీహరి, లక్ష్మణ్ పాల్గొన్నారు.సమస్యల పరిష్కారానికి చర్యలుజెడ్పీ సీఈఓ ఎల్లయ్యపెద్దశంకరంపేట(మెదక్): గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారాన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. మంగళవారం పెద్దశంకరంపేట మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించారు. ఉపాధి హామీ పనుల లక్ష్యాన్ని చేరుకోవాలని ఇన్చార్జి ఎంపీడీఓ షాకీర్ అలీ, ఈ జీఎస్ ఏపీవో సంతోష్ కుమార్లను ఆదేశించారు. అన్ని గ్రామాలలో ఉపాధి పనులను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, మంచినీటి ట్యాంకులను శుభ్రపరచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈసీ నవాజుద్దీన్ తదితరులు ఉన్నారు.ఎంపీపీ కార్యాలయం తనిఖీఅల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం మండల పరిషత్ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య మంగళవారం తనిఖీ చేశారు. ప్రతి పంచాయ తీలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించేందు కు చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది సమ య పాలన పాటించాలని సూచించారు. ఆయ న వెంట ఎంపీడీఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.హామీలను నెరవేర్చాలి తపస్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంమెదక్జోన్: కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తపస్ జిల్లా అధ్యక్షుడు ఎల్లం డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల విడుదల, జీవో 317 బాధితులందరికీ న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాకపోవడం బాధాకరమని చెప్పారు. ఐదు డీఏలు పెండింగ్లో ఉండగా రెండింటిని ప్రకటించి ఒకటి మాత్రమే అమలు చేయడం దారుణమని వాపోయారు. హామీలను నెరవేర్చకుంటే ఆందోళనమే శరణ్యమని హెచ్చరించారు. కార్యక్రమంలో తపస్ జిల్లా బాధ్యులు నర్సింలు, శ్రీధర్రెడ్డి, సిద్ధూ, నరేందర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.మోదీ పాలనలో ఎంతో అభివృద్ధిబీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్హత్నూర(సంగారెడ్డి): ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి జరిగిందని బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్ పేర్కొన్నారు. హత్నూర మండల బీజేపీ మండల అధ్యక్షులు నాగప్రభు ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హత్నూర మండలం దౌల్తా బాద్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రమేశ్గౌడ్ మాట్లాడుతూ.. మోదీ 11 ఏళ్ల పాలన అమృతకాలమని ఎన్నో అసాధ్యం కాని నిర్ణయాలు తీసుకుని సుసాఽ ద్యం చేసి దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత మోదీనేన్నారు. -
ఆర్టీసీ చార్జీల మోత
మెదక్జోన్: ఆర్టీసీ బస్పాస్ చార్జీల పెంపు విద్యార్థులు, ప్రయాణికులకు శరాఘాతంగా మారింది. అలాగే.. ప్రయాణికులకు టోల్గేట్ చార్జీలు కూడా అదనంగా భారం పడనుంది. పెరిగిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టీసీ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ బస్సు డిపోలలో 140 బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్థుల బస్పాస్లపై 20 శాతం పెంచగా, టోల్గేడ్ దాటే ప్రతి ప్రయాణికులపై 8 శాతం పెరిగింది. దీంతో ప్రయాణికులపై నెలకు రూ.62.38 లక్షల అదనంగా భారం పడనుంది. టోల్ గేట్ చార్జీ టిక్కెట్కు అదనంగా రూ.10 పెరిగింది. కాగా, రెండు డిపోల పరిధిలో నిత్యం ఆర్టీసీకి రూ.20 లక్షల ఆదాయం వస్తుండగా.. 8శాతం బస్సు చార్జీలు పెరగటంతో ప్రయాణికులపై నిత్యం రూ.1.60 లక్షలు, నెలకు సుమారు రూ.48 లక్షలు అదనంగా భారం పడనుంది. విద్యార్థుల పాస్లపై 20 శాతం అదనం ఆర్టీసీ యజమాన్యం ప్రయాణికులతో పాటు విద్యార్థుల బస్సుపాస్లపై ఏకంగా 20 శాతం అదనంగా చార్జీ పెంచేసింది. మొన్నటి వరకు 20 కిలోమీటర్లు ఆర్డీనరి బస్సులో ప్రయాణించే విద్యార్థికి నెలకు రూ.450 చెల్లించగా.. పెరిగిన ధరతో రూ. 540 కానుంది. జిల్లా వ్యాప్తంగా 6,365 మంది బస్సు పాస్లు ఉన్నాయి. వీరి ద్వారా మొన్నటి వరకు నెలకు రూ.71.51 లక్షల ఆదాయం వస్తుండగా.. పెరిగిన 20 శాతం ధరతో నెలకు రూ. 14.30 లక్షలు అదనపు భారం పడుతుంది. దీంతో నెలకు రూ. 85.81 లక్షలు విద్యార్థులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని విద్యార్థులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల బస్పాస్లపై 20 శాతం.. టోల్గేట్ చార్జీలు 8 శాతం అదనం నెలకు రూ. 62.38 లక్షల భారం మండిపడుతున్న ప్రయాణికులు, విద్యార్థి సంఘాలుచదువుకు దూరం చేయటమే.. విద్యార్థుల బస్సుపాస్లపై ఏకంగా 20 శాతం చార్జీలు పెంచటం అంటే మారు మూల గ్రామాలకు చెందిన పేద విద్యార్థులను చదువులకు దూరం చేయటమే అవుతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్య, వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలి. పాస్లపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. లేకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన తప్పదు. శ్రీనివాస్గౌడ్, ఏబీవీపీ మెదక్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ -
అమ్మ పేరు మీద మొక్క నాటండి
నర్సాపూర్ రూరల్: అమ్మ పేరు మీద మొక్కలు నాటి భావితరాలకు బాసటగా నిలవాలని జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి సీహెచ్ శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం నర్సాపూర్ మండలం రామచంద్రాపూర్లో ఐకెపీ ఏపీఎం గౌరీ శంకర్ అధ్యక్షతన జరిగిన గ్రామైక్య మహిళా సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రతి మహిళా బాధ్యతగా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి మూడేళ్లపాటు సంరక్షించాలని సూచించారు. ప్రతి సంవత్సరం రాఖీ కట్టి జాతికి అంకితం ఇవ్వాలని కోరారు. దీంతో మన భావితరాల పిల్లలకు స్వచ్ఛమైన గాలితో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతామని పేర్కొన్నారు. ఆర్థిక పారదర్శకతలో భాగంగా అన్ని సంఘాల సభ్యులు సామాజిక ఆర్థిక లావాదేవీలపై సమీక్షించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మధులత, ఐకెపి సీసీ దేవిసింగ్, కార్యదర్శి సిఏ నీరజ, గ్రామ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు -
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందుకోసం ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించేందుకు వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు నెలకొల్పనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,633 గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ భారత్ మిషన్– గ్రామీణ్ కింద రూ. 61.28కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కేంద్రం 60శాతం, రాష్ట్రం వాటా 40శాతం ఉండనుంది. ఈ నిధులకు వివిధ టార్గెట్లను నిర్ణయించారు. ఆగస్టు చివరి వరకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో డీఆర్డీఏ అధికారులు ముందుకు సాగుతున్నారు. – సాక్షి, సిద్దిపేటప్రతిపాదనలు రూపొందిస్తున్నాం ఎస్బీఎంలో మంజూరైన నిధులకు టార్గెట్కు అనుగుణంగా గ్రామాల వారీగా ప్రతిపాదనలు తెప్పిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంపికలు కాగానే వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేస్తాం. ఆగస్టులోగా పనులు పూర్తి అయ్యేలా ముందుకు సాగుతున్నాం. అలాగే కొత్తగా ఏర్పాటైన గ్రామాలను ఓడీఎఫ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాం. – జయదేవ్ ఆర్యా, డీఆర్డీఓ, సిద్దిపేట పల్లెల్లో తొలిసారిగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు 11 మంజూరు చేశారు. ఒక్కోదానికి రూ.64లక్షల చొప్పున రూ.7.04కోట్లను కేటాయించారు. రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్, నీటి సౌకర్యం ఉన్న ప్రాంతంలో ఈ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వివిధ రకాల వస్తువులను తయారు చేయనున్నారు. ప్రాసెస్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్, రికవరీ ప్రక్రియల ద్వారా వివిధ ఉత్పత్తులను తయారు చేస్తారు. పునర్వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం చేయడం కానీ, ల్యాండ్ ఫిల్లింగ్ చేయడం చేయనున్నారు. కాలుష్యంను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 19వేల మరుగుదొడ్లు మంజూరు ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిధులతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించనున్నారు. ఒక్కో మరుగుదొడ్డి కోసం రూ.12వేల చొప్పున కేటాయించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు 19,806 వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం రూ.23.76 కోట్లను మంజూరు చేశారు. పర్యాటక ప్రాంతాలు, పాఠశాలలు, మార్కెట్ స్థలాలు, ఆస్పత్రులు, బస్టాండ్లు అవసరమైన చోట్ల 53 శానిటేషన్ కాంప్లెక్స్లను రూ.1.59కోట్లతో నిర్మించనున్నారు. ● కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు ఉమ్మడి మెదక్ జిల్లాకు 53 కేటాయించారు. ఒక్కోదానికి రూ.3లక్షల నిధులు మంజూరు చేశారు. ఇందులో నిధులు ఎస్బీఎం నుంచి 70శాతం, 15వ ఆర్థిక సంఘం నిధులు 30శాతం మంజూరు చేయనున్నారు. 50 నూతన పంచాయతీల్లో.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,633 గ్రామ పంచాయతీలలో నూతనంగా 50 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. నూతనంగా మెదక్లో 24, సంగారెడ్డిలో 11, సిద్దిపేటలో 15 గ్రామ పంచాయతీలను బహిరంగ మలమూత్రవిసర్జన రహిత గ్రామా లుగా తయారు చేయడానికి అధికారులు కార్యాచరణ రూపొందించారు.పల్లెల్లో రీసైక్లింగ్ ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,633 జీపీలకు రూ.61 కోట్లు 11 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు మంజూరు ఓడీఎఫ్ దిశగా నూతన పంచాయతీలు జిల్లాల వారీగా చేపట్టే పనులు యూనిట్లు మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మొత్తం నిధులు వ్యక్తిగత మరుగుదొడ్లు 1,200 15,606 3,000 రూ. 23.76కోట్లు ఇంకుడు గుంతలు 5,744 7,390 5,931 రూ. 12.39కోట్లు సామూహిక ఇంకుడు గుంతలు 898 1,091 876 రూ. 15.70కోట్లు సిగ్రిగేషన్ షెడ్లు 24 11 15 రూ. 80లక్షలు మేనేజ్మెంట్ ప్లాస్టిక్ వేస్ట్ 03 04 04 రూ. 7.04కోట్లు పారిశుద్ధ్య సమూహాలు 15 19 19 రూ. 1.59కోట్లు -
తెగని ఢీఎస్ఆర్!
ఇబ్బందులు పెట్టడం సరికాదు ఫే్స రికగ్నైజేషన్తో హాజరు వేసే క్రమంలో సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా 18 నెలలుగా పాలకవర్గాల లేక ఇప్పటికే లక్షలాది రూపాయలు అప్పు చేసి గ్రామాలను నెట్టుకొస్తున్నాం. ఈక్రమంలో కొత్త నిబంధన పేరుతో ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. వెంటనే ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలి. – నగేష్, పంచాయితీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు క్రమశిక్షణా చర్యలు తప్పవు నేటి నుంచి డీఎస్ఆర్ యాప్ను వినియోగించి, దాని ద్వారానే పంచాయతీ కార్యదర్శులు హాజరువేయాలి. దీంతో పాటు రోజువారీ కార్యక్రమాలను యాప్లో పొందుపర్చాలి. యాప్ అందుబాటులోకి వచ్చి 15 రోజులు కావొస్తుంది. విస్మరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవు – యాదయ్య, డీపీఓ యాప్ను బహిష్కరించిన పంచాయతీ కార్యదర్శులు ● రెండు వారాలుగా అటెండెన్స్ వేయని తీరు ● నేటి నుంచి తప్పనిసరి అంటూ ఉన్నతాధికారుల అల్టిమేటం ● జిల్లాలో 469 మంది కార్యదర్శులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ రూపొందించిన రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్ఆర్) యాప్ పంచాయతీ ఎటూ తెగడం లేదు. కొత్త మార్గదర్శకాలు మరింత ఇబ్బందికరంగా మారాయని పంచాయతీ కార్యదర్శులు రెండు వారాలుగా యాప్ను బహిష్కరించారు. ఈక్రమంలో సోమవారం నుంచి యాప్ను తప్పనిసరిగా వినియోగించాలని ఉన్నతాధికారులు అల్టిమేటం జారీ చేశారు. మాట వినకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 493 గ్రామ పంచాయతీలు ఉండగా, 469 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో గ్రామాల్లో మెరుగైన పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల 24వ తేదీన రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్ఆర్) యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతిరోజు ఉదయం 11 గంటలలోపు కార్యదర్శులు ఫేస్ రికగ్నైజేషన్తో అటెండెన్స్ వేయాలని, పంచాయతీలో జరిగే శానిటేషన్, ఇతర పనులకు సంబంధించిన ప్రక్రియ ఫొటోలు అప్లోడ్ చేయాలని చెప్పింది. రోజువారీగా ఇళ్ల నుంచి సేకరించే చెత్త ఎన్ని కిలోలన్న దానిపై వివరాలను చేర్చాలని నిర్ణయించారు. అందులో తడి, పొడి చెత్త ఎంత సేకరిస్తున్నారు.. దాని నుంచి వర్మీ కంపోస్టు ఎరువులు తయారు చేస్తున్నారా..? గ్రామంలోని పల్లె పకృతి వనాల నిర్వహణ, డంప్యార్డులు, శ్మశానవాటికలు, మురికి కాలువలు.. ఇలా అన్నిరకాల కార్యక్రమాలను యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ససేమిరా అంటున్న సెక్రటరీలు ఏ ఉద్యోగులకు లేని విధంగా ప్రభుత్వం తమకు అనేక నిబంధనలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తుందని పంచాయతీ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గాలు లేక 18 నెలలు అవుతుందని, గ్రామాల్లో చిన్నా చితక పనులతో పాటు చెత్త సేకరణ కోసం ప్రతి రోజు ట్రాక్టర్ను ఇంటింటికీ పంపుతున్నామని, డీజిల్ కోసం అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఒత్తిడికి గురవుతున్నామని.. కొత్తగా వచ్చిన డీఎస్ఆర్ యా ప్ మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అండర్– 14 క్రికెట్ క్యాంపునకు ఎంపిక
వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్ర అండర్–14 క్రికెట్ క్యాంపునకు వెల్దుర్తి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి శశ్రీత్ గౌడ్ ఎంపికయ్యాడని పాఠశాల హెచ్ఎం సాంబయ్య తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థిని మండలంలోని చెర్లపల్లిలో ఆదివారం గ్రామస్తులు, ఉపాధ్యాయులు సత్కరించి అభినందించారు. యంగ్ స్టార్ క్రికెట్ లీగ్ నేషనల్ టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్లో గత నెలలో నిర్వహించిన పోటీల్లో శశ్రీత్గౌడ్ ప్రతిభ చాటారన్నారు. భవిష్యత్లో రాష్ట్ర, జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. నల్లపోచమ్మకు ప్రత్యేక పూజలు కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి నల్లపోచమ్మదేవి ఆలయంలో ఆదివారం భక్తు లు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దేవాదాయశాఖ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్స్పెక్టర్, ఆలయ ఇన్చార్జి ఈఓ రంగారావు ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అలాగే మేడ్చల్ సెషన్ కోర్డు జడ్జి అర్జున్, ఎన్ఐఏ అధికారి విశాల్గౌతమ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జడ్జికి ఆలయ అధికారులు స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వెంకట్రెడ్డి, ఆలయ సిబ్బంది, ధర్మకర్తలు పాల్గొన్నారు. రేషన్ కోసం పడిగాపులు కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రంలో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం పంపిణీ చేస్తుంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడు ఈపీడీఎస్ మిషన్పై ఆరుసార్లు వేలిముద్రలు వేయా ల్సి వస్తుంది. దీంతో బియ్యం పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు తూప్రాన్: బీసీలకు కాంగ్రెస్తోనే సముచిత న్యాయం లభిస్తుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్రెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మగుడి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు బీసీలకు అన్యా యం జరుగుతూనే ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులందరికీ అందించడమే తమ ధ్యేయం అన్నారు. రాష్ట్రంలో గద్వాల్ నుంచి ఆదిలాబాద్ వరకు పెద్దఎత్తున పెద్దమ్మ తల్లి ఆలయాలు నిర్మాణాలు జరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. -
కంది రైతుకు.. కరెంటు రంది
కొల్చారం(నర్సాపూర్): మండలంలోని ఎనగండ్లలో బోర్ల కింద డ్రిప్ ఇరిగేషన్తో రైతులు ఆరుతడి పంట అయిన కంది సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొక్క పిలకదశకు వచ్చింది. ఈక్రమంలో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో నీరు సరిగా అందక పంట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వరి సాగు కోసం తుకం పోసే పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అప్రకటిత విద్యుత్ కోతలు ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై దుంపలకుంట సబ్స్టేషన్ సిబ్బందిని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాలో అంతరా యం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. -
రోగులకు మెరుగైన వైద్య సేవలు
కలెక్టర్ రాహుల్రాజ్ ఎంపీ నిధులతో బోర్ల తవ్వకాలు: ఎంపీ షెట్కార్రామాయంపేట(మెదక్): జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను, ప్రగతి ధర్మారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదలకు అందుతున్న వైద్య సేవలను విస్తృత పర్చాలని, ఈ మేరకు ఆస్పత్రుల బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది పనితీరును సీసీ కెమెరాల ద్వారా నిత్యం మానిటరింగ్ చేస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బంది విధులకు హాజరవుతూ రోగులకు వైద్యసేవలు అందజేస్తున్నారని కొనియాడారు. రామాయంపేట, కౌడిపల్లి, ఇతర ఆస్పత్రుల్లో త్వరలో పూర్తిస్థాయిలో సిబ్బంది, డాక్టర్లను నియమిస్తామని వెల్లడించారు. తూప్రాన్, రామాయంపేట పరిధిలో జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, త్వరలోనే ట్రామా కేంద్రం ఏర్పాటయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. కలెక్టర్ డాక్టర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. బియ్యం సక్రమంగా ఇస్తున్నారా? మండలంలోని అక్కన్నపేటలో ఆదివారం రేషన్ దుకాణాన్ని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా మూడు నెలల బియ్యాన్ని డీలర్ సక్రమంగా ఇస్తున్నారా..? అని వినియోగదారులను ప్రశ్నించారు. అనంతరం బియ్యం నాణ్యత విషయమై ఆరా తీశారు. ఈ–పాస్ డివైస్లో కొత్తగా ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ పనితీరు గురించి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బియ్యం పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. నారాయణఖేడ్: తాగునీటి సమస్య పరిష్కారానికి పలు గ్రామాలు, తండాలకు బోర్ల తవ్వకం కోసం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ తనకోటా నిధుల ద్వారా ఒక్కోచోట బోరు తవ్వకం, మోటారు బిగించడం, పైపులైను ఏర్పాటు పనులకోసం రూ.3 లక్షల చొప్పున కేటాయించారు. ఆదివారం ఖేడ్ మండలం స్కూల్ తండా, హన్మాన్ తండాలతోపాటు మనూరు మండలం రాణాపూర్ గ్రామంలో బోర్ల తవ్వకాలను ఆయా తండాల పెద్దలు, గ్రామస్తులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఆయా తండాల వాసులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు -
రేపటి నుంచి డీసెట్ ధ్రువపత్రాల పరిశీలన
మెదక్ కలెక్టరేట్: ఈనెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు డీసెట్ ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు మెదక్ డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాధాకిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీసెట్ – 2025లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెదక్ డైట్ కళాశాలలో జరిగే పరిశీలనకు సకాలంలో హాజరుకావాలని సూచించారు. ర్యాంక్ కార్డు, హాల్టికెట్, పదో తరగతి, ఇంటర్ మెమోలు, 1 నుంచి ఇంటర్ వరకు బోనాఫైడ్, కులం, ఆదాయం వంటి పూర్తి ధ్రువపత్రాలతో హాజరుకావాలని తెలిపారు. 9న 1 నుంచి 500 ర్యాంకు వరకు, 10న 501 నుంచి 1,000, 11న 1,001 నుంచి 1,500, 12న 1,501 నుంచి 2,000, 13న 2,001 నుంచి 2,198 వరకు రావాలని వివరించారు. సందేహాలకు 9949993717, 939 7682345, 9701767857 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వైద్య సేవలపై కాయకల్ప బృందం ఆరారామాయంపేట(మెదక్): రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం కాయకల్ప రాష్ట్ర ప్రతినిధుల బృందం సభ్యులు సందర్శించారు. ఈసందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. టీం హెడ్ డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో సభ్యులు ఆస్పత్రి పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. రోగుల వెంట వచ్చే వారికి ఇస్తున్న భోజనం, బయో మెడికల్ వినియోగం తీరును పరిశీలించారు. ఆస్పత్రిలో డెలివరీలు ఎందుకు కావడం లేదని సూపరింటెండెంట్ లింబాద్రిని ప్రశ్నించారు. మార్చురీలో ఫ్రీజర్ల పనితీరును పరిశీలించారు. ఆస్పత్రిలో ఇన్, అవుట్ పేషెంట్ల వివరాలతో పాటు ఆస్పత్రికి సంబంధించి పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే విధానాన్ని పరిశీలించారు. డాక్టర్లతో పాటు సిబ్బంది విధిగా డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశించారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఒకే దేశం, ఒకే ఎన్నికపై అవగాహన నర్సాపూర్: ఒకే దేశం.. ఒకే ఎన్నిక అంశంపై పార్టీలకతీతంగా కుల, యువజన సంఘాలకు అవగాహన కల్పిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్ చెప్పారు. శనివారం పట్టణంలోని వీరభద్రీయ కులసంఘ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ అధిష్టానం మేరకు ఆయా సంఘాలకు ఒకే దేశం, ఒకే ఎన్నికపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ సాగుతో రైతులకు మేలు శివ్వంపేట(నర్సాపూర్): రైతులు సేంద్రియ సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు శరవణన్, పాపారావు, శ్రీనివాస్ అన్నారు. వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం తునికి ఆధ్వర్యంలో మండల పరిధి గోమారంలో శనివారం రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ప్రతి రైతు భూసార పరీక్షలు నిర్వహించి అందుకనుగుణంగా అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల ఎంపిక చేసుకోవాలన్నారు. రసాయన ఎరువుల వాడకం పూర్తిస్థాయిలో తగ్గించాలన్నారు. ప్రతి రైతు తన ఇంటికి సరిపడా అన్ని రకాల కూరగాయలు, ధాన్యం, ఇతర పంటలు సేంద్రియ పద్ధతిలో పండించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్రభుత్వ వ్యవసాయ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఏఓ లావణ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ని సద్వినియోగం చేసుకోండి
కలెక్టర్ రాహుల్రాజ్చిన్నశంకరంపేట(మెదక్): ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులను కూలీలు సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. శనివారం మండలంలోని మడూర్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న ఉపాధి పనులను ప రిశీలించారు. ఈసందర్భంగా కూలీలతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. జాబ్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వంద రోజుల పని కల్పించనున్నట్లు తెలిపారు. చేపల చెరువుల తవ్వకంతో మత్స్యకారులు లబ్ధిపొందనున్నారని, అ లాగే గ్రామంలో ఎంత ఎక్కువ సంఖ్యలో పనులు నిర్వహిస్తే అదే స్థాయిలో ప్రత్యేక నిధులు అందనున్నాయన్నారు. భూమి లేని కూలీలు కనీసం 25 రోజుల పనిచేస్తేనే ఆత్మీయ భరోసా లభించనున్నట్లు చెప్పారు. త్వరలోనే దివ్యాంగులకు అవసరమైన పరికరాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ దామోదర్, ఏపీఓ రాజ్కుమార్, గ్రామ కార్యదర్శి ప్రతిభ ఉన్నారు. అనంతరం చిన్నశంకరంపేట పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసీ రికార్డులు పరిశీలించారు. ప్రజారోగ్యంపై దృష్టిసారించాలని, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని వైద్య సిబ్బందికి సూచించారు. -
సమ్మెను జయప్రదం చేద్దాం
మెదక్ కలెక్టరేట్: జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టాలు తెచ్చి ఏళ్లుగా పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందన్నారు. లేబర్ కోడ్స్ అమలు కావడం వల్ల మహిళా కార్మికులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 8 గంటల పనిని, 12 గంటలకు పెంచిందన్నారు. దేశవ్యాప్త సమ్మెతో కేంద్రం కళ్లు తెరిపించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, మల్లేశం, జిల్లా కోశాధికారి నర్సమ్మ, ఉపాధ్యక్షులు మహేందర్రెడ్డి, నాగరాజు, బస్వరాజు, సహాయ కార్యదర్శులు సంతోష్, నాగేందర్రెడ్డి, అన్నపూర్ణ, గౌరయ్య తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు -
పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలోని 4వ వార్డులో శనివారం మున్సిపల్ సిబ్బంది 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికీ తిరిగి తడి, పొడి, హానికరమైన చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనానికి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో వేయకూడదని, అలా వేస్తే దోమలు పెరుగుతాయని హెచ్చరించారు. వార్డులో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సింగూరు చేపకు గిరాకి
పుల్కల్(అందోల్): మృగశిర కార్తె ఆరంభం రోజే చేపలు తింటే ఆస్తమా, ఉబ్బసం వంటి వ్యాధులు రావని చాలామంది నమ్ముతుంటారు. ఆదివారం మృగశిర ప్రారంభం కావడంతో చేపలకు మంచి గిరాకీ లభిస్తుంది. ఇక జిల్లాలో సింగూరు చేపకున్న డిమాండ్ అయితే చెప్పనవసరం లేదు. పసందుగా చేప.. జిల్లాలో ఉన్న ఏకై క భారీ నీటిపారుదల సింగూరు బహుళార్థసాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు జిల్లా ప్రజలకు, జంట నగరాల ప్రజలకు తాగునీటిని, స్థానికంగా సాగునీటిని అందిస్తుంది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా మత్స్యకారులకు ఉపాధిని కల్పించి వారి జీవితాల్లో సిరులు పూయిస్తుంది. ఈ ప్రాజెక్టులో చేపలు పట్టుకుని వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగూరు డ్యాంలో పెరిగే చేపలు రుచికరంగా ఉంటాయని చేప ప్రియులు చెబుతుంటారు. ఇక్కడ పెరిగిన చేపలు హైదారాబాద్తోపాటు, జిల్లాలో పలు ప్రాంతాల ప్రజలు ఇష్టంగా తింటారు. ప్రాజెక్టుకు వచ్చిన పర్యాటకులు చాలామంది చేపలు కొని తీసుకెళ్తారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వమే చేప పిల్లల విడుదల.. సింగూరు భారీ నీటి పారుదల ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వమే చేప పిల్లలను విడుదల చేస్తుంది. ఏటా 60 నుంచి 70 లక్షల చేప పిల్లలను, రొయ్య పిల్లలను విడుదల చేస్తుంది. దీంతో ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలు చాలామంది చేపల వృత్తిని ఎన్నుకుని ఉపాధి పొందుతున్నారు. జోరుగా విక్రయాలు మత్స్యకారులు పట్టిన చేపలను కొందరు వ్యాపారులు ఆటోల్లో తరలించి సమీప పట్టణాల్లో విక్రయిస్తారు. స్థానికులు మాత్రం అక్కడే ప్రాజెక్టు సమీపంలో షెడ్లు వేసుకుని విక్రయాలు చేపడతారు. మృగశిర నాడు ప్రత్యేక కౌంటర్లు పెట్టి విక్రయాలు చేపడతారు. ప్రస్తుతం డ్యాంలో 18 టీఎంసీల వరకు నీరు ఉండటంతో చేపల సంపద వృద్ధి చెందుతుంది. మత్స్యకారులకు ఉపాధి గ్రామాల్లో చెరువుల్ని మత్స్యకారులకే ప్రభుత్వం అప్పగించి, చేప పిల్లలు సరఫరా చేయడంతో ఊరూరా చేపల విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో జీవించే మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. సాధారణ చేపలు కిలో రూ.150, కొర్రమీను కిలో రూ. 350కు విక్రయిస్తారు. మృగశిర నాడు మాత్రం రెట్టింపు ధరలకు అమ్ముతారు. మృగశిర కార్తె ఆరంభం నుంచే విక్రయాల సందడి ఆస్తమా, ఉబ్బసం వ్యాధులు దరిచేరవని ప్రజల నమ్మకం -
సేద్యంలో రైతే శాస్త్రవేత్త
● త్వరలో ఆదర్శ రైతు వ్యవస్థ,విత్తన చట్టం ● రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిహుస్నాబాద్: వ్యవసాయ సేద్యంలో రైతే పెద్ద శాస్త్రవేత్త అని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండో రోజు శనివారం నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోదండ రెడ్డి మాట్లాడుతూ ధరణితో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం భూ భారతి తెచ్చి రైతుల ఇక్కట్లను దూరం చేస్తున్నారన్నారు. అలాగే నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ములుగులో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి రైతులను ఆగం చేశాయన్నారు. త్వరలో రైతుకు విత్తన హక్కు కల్పి ంచే విధంగా విత్తన చట్టం తీసుకువచ్చేందుకు కమిటీలు వేశామని తెలిపారు. పసుపు రైతులు యాంత్రీకరణ దిశగా ఆలోచించాలన్నారు. రైతులు సంప్రదాయ పంటలు వేసి ఆదాయాన్ని పెంచుకోవాలని కోదండరెడ్డి సూచించారు. త్వరలో ఆదర్శ రైతు వ్యవస్థను ప్రభుత్వం ప్రకటిస్తుందని వెల్లడించారు. ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండుతాయో అక్కడ ఆయా మార్కెట్లు ఉండాలని రైతు కమిషన్ సూచించిందన్నారు. -
విద్యలో సమూల మార్పులు రావాలి
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ బడులు నిలబడాలి– చదువులో అంతరాలు పోవాలి అని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రచార జాతా కార్యక్రమంలో మాట్లాడారు. పేద, ధనిక బేధం లేకుండా అందరి పిల్లలు ఒకే చోట చదువుకోవాలనే లక్ష్యంతో పౌర స్పందన వేదిక పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో పాఠశాలలు, కళాశాలు ఎంత డబ్బు పెడితే అంతా చదువు అన్నచందంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి పేద ప్రజలకు నాణ్యమైన విద్యనందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీఎస్వీ ఉపాధ్యక్షుడు మంగ దక్షణమూర్తి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పద్మారావు తదితరులు పాల్గొన్నారు. -
ఎరువులు, విత్తనాల జాడేది?
వానాకాలం సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ఖరారు చేశారు. జిల్లావ్యాప్తంగా అన్నిరకాల పంటలు కలిపి 3,50,164 ఎకరాల్లో సాగు కానున్నట్లు అంచనా వేశారు. కానీ అందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను మాత్రం అందుబాటులో ఉంచలేదు. ఇప్పటికే రైతులు దుక్కులు సిద్ధం చేసి నారు పోసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఒక్క వర్షం పడితే సాగు పనులు మొదలు పెట్టేందుకు ఎదురు చూస్తున్నారు. సరిపడా విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పేలా లేవు.. మొదట్లోనే ఈ పరిస్థితి ఉంటే, సాగు మొదలైతే పరిస్థితి ఏంటని రైతులు వాపోతున్నారు. – మెదక్ కలెక్టరేట్ భూసారం పెంచేందుకు రైతులు పచ్చిరొట్ట (జీలుగా, జనుము) విత్తనాలు సాగు చేసి నేలలో దున్నుతారు. జిల్లాకు 30 వేల క్వింటాళ్ల జీలుగా విత్తనాలు అవసరం ఉండగా, కేవలం 2 వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. అలాగే జనుము 15 వేల క్వింటాళ్లు అవసరం కాగా, ఒక్క క్వింటాల్ కూడా అందుబాటులో లేవు. వచ్చిన విత్తనాలు కొంతమంది రైతులకే దొరికాయి. మిగితా వారు విత్తనాల కోసం ఇబ్బంది పడుతున్నారు. అలాగే జిల్లాకు మొత్తం 91,500 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం ఉండగా, ప్రస్తుతం 13,500 క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఖరీఫ్ సీజన్లో సన్నాల సాగు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే వర్షాధారంగా సాగు చేసే పంటల్లో పత్తి పంట ఒకటి. ఈ సీజన్లో జిల్లాకు పత్తి విత్తనాలు 74,400 ప్యాకెట్లు (ఒక్కో ప్యాకెట్లో 450 గ్రాములు) అవసరం కానున్నాయి. కాగా ప్రస్తుతం 65,200 ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. మొక్కజొన్న ఆరు, జొన్న విత్తనాలు ఒక క్వింటాల్ అందుబాటులో ఉన్నాయి. ఈ పంటలు జిల్లాలోని టేక్మాల్, పెద్దశంకరంపేట, రేగోడ్, అల్లాదుర్గం మండలాల్లో అధికంగా సాగు చేస్తారు. చాలా వరకు ఈ రెండు రకాల విత్తనాలు రైతులు తమ సొంతంగా పండించిన పంట నుంచే తయారు చేసుకుంటారు. పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచని అధికారులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు జిల్లాలో 3.50 ఎకరాల్లో సాగు అంచనా 58 వేల మెట్రిక్ టన్నులు అవసరం వానాకాలం సీజన్లో రైతులు సాగు చేసే పంటలకు సుమారు అన్నిరకాల ఎరువులు 58 వేల మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనా. ఇందులో అత్యధికంగా యూరియా 25 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 19 వేలు, ఎంఓపీ 2 వేలు, కాంప్లెక్స్ ఎరువులు 28 వేలు, ఎస్ఎస్పీ 615 మెట్రిక్ టన్నులు కావాలి. కాని అన్ని ఎరువులు కలిపి కేవలం 13 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే అందుబాటులోకి.. ప్రతిపాదన మేరకు ప్రభుత్వం నుంచి విత్తనాలు, ఎరువులు సరఫరా కాలేదు. రైతులు సాగు పనులు ప్రారంభించేలోగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – విన్సెంట్ వినయ్, జిల్లా వ్యవసాయ అధికారి -
నేటి నుంచి ‘బడిబాట’
సమస్యల పరిష్కారానికే సదస్సులుఅదనపు కలెక్టర్ నగేష్ భక్తిమార్గంలో పయనించాలి విశ్వయోగి విశ్వంజి మహారాజ్మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా శుక్రవారం నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈమేరకు గురువారం కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 19 వరకు జిల్లాలో కొనసాగే బడిబాట కార్యక్రమంలో సమాజంలోని అందరిని భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి, ఉపాధ్యాయుల సమన్వయంతో గ్రామసభలు నిర్వహించి తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు గ్రామసభలో పాలు పంచుకునేలా చూడాలన్నారు. డ్రాపౌట్ నియంత్రణ, బాలికల నమోదు శాతం పెంచాలన్నారు. ప్రతి ఇంటిని సందర్శించి పిల్లలంతా తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, డీఐఈఓ మాధవి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు పాల్గొన్నారు. సదస్సులను సద్వినియోగం చేసుకోండి కొల్చారం(నర్సాపూర్): భూభారతి గ్రామ సభల ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తును పరిశీలించి, న్యాయం చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం మండలంలోని రంగంపేటలో జరిగిన గ్రామ సభను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. గ్రామ సదస్సుకు 70 దరఖాస్తులు రాగా, వీటిలో సాదా బైనామాలు 15 వరకు ఉన్నాయి. కొంగోడులో జరిగిన సదస్సుకు 37 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసచారి, ఆర్ఐ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రేగోడ్(మెదక్)/అల్లాదుర్గం: రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. గురువారం మండలంలోని జగిర్యాల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దత్తరెడ్డి, ఆర్ఐ ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అల్లాదుర్గం మండల పరిధిలోని సీతానగర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈసందర్భంగా రైతులు పలు సమస్యలను అధికారుల దృష్టి తీసుకొచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలను అయినా భూ భారతిలో పరిష్కరిస్తామని తెలిపారు. కా ర్యక్రమంలో తహసీల్దార్ మల్లయ్య, ఆర్ఐ సందీప్ తదితరులు పాల్గొన్నారు.శివ్వంపేట(నర్సాపూర్): ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో నడుచుకోవాల్సిన అవసరం ఉందని గుంటూరు విశ్వ గురుపీఠం విశ్వయోగి విశ్వంజి మహారాజ్ అన్నారు. మండల పరిధిలోని గూడూర్లో నిర్మించిన శ్రీ గురుపీఠంలో దత్తా త్రేయ, సాయిబాబా విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం గురువారం ముగిసింది. అఖరి రోజు విశ్వయోగి విశ్వంజి మహారాజ్ ఆధ్వర్యంలో దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠ, యంత్ర స్థాపనలు, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఆగమ శాస్త్ర పండితుడు పుల్లెటి కుర్తి గణపతిశర్మ, వేద పండితుడు శాస్త్రుల వామనశర్మ పూజా కార్యక్రమాలు చేపట్టారు. విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్రావు, మాజీ సీఎంఓ కార్యదర్శి నర్సింగరావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ కమలాద్రి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, భక్తులు పాల్గొన్నారు. -
మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మాది
మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావుమెదక్ కలెక్టరేట్: మాది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వమని, ఎమ్మెల్యేగా గెలిచిన 14 నెలల్లోనే నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. గురువారం కలెక్టరేట్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికీ అండగా నిలబడి, వారికి నిలువ నీడ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. దశలవారీగా లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని తెలిపారు. నియోజకవర్గంలో విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రజలలో మమేకమై పనిచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నందున నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, హౌసింగ్ పీడీ మాణిక్యం, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మెదక్ కలెక్టరేట్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమవంతుగా ఒక మొక్క నాటి సంరక్షించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుభవల్లి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కోర్టు కార్యాలయ ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మొక్కలు నాటడంతో ఆక్సిజన్ శాతం పెరిగి మానవ జాతి మనుగడకు సాకారం అవుతుందన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి పరిరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా, జూనియర్ సివిల్ జడ్జి సిరి సౌజన్య, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మొక్కలు నాటి సంరక్షించాలి నర్సాపూర్ రూరల్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి హేమలత పిలుపునిచ్చారు. గురువారం కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు సిబ్బంది, న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పిల్లల పుట్టినరోజు సందర్భంగా చెట్లు నాటించి సంరక్షించే విధానాన్ని అలవాటు చేయా లని తల్లిదండ్రులకు సూచించారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం పచ్చదనాన్ని కాపాడుకోవాల్సి న అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవింద్, న్యాయవాదులు ఎగ్బాల్ అలీ జాఫర్, స్వరూప రాణి, మధుశ్రీ శర్మ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుభవల్లి -
మద్యం అమ్మకాలపై నిషేధం
కిషన్తండా వాసుల ఏకగ్రీవ తీర్మానంరామాయంపేట(మెదక్): మండలంలోని కిషన్తండా పంచాయతీ పరిధిలో సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం తండా వాసులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎవరైనా మద్యం విక్రయాలు కొనసాగిస్తే రూ. లక్ష జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈమేరకు గ్రామస్తులు గురువారం సమావేశమై చర్చించారు. తండాలో ఉన్న రెండు బెల్ట్షాపుల్లో మద్యం అమ్మకాలతో యువత చెడు మార్గం పడుతుందని, మద్యం సేవించిన వారు తరచూ రో డ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. తాము ఎన్నిసార్లు చెప్పినా బెల్ట్షాపు నిర్వాహకులు ఖాతరు చేయకుండా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని, ఇక నుంచి కొనసాగిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ మేరకు తీర్మాన ప్రతులను ఎకై ్సజ్, స్థానిక పోలీస్స్టేషన్లలో అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్నా.. కోడెలకు దిక్కెవరూ?
తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఒకటి. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. స్వామివారికి ఎక్కువగా పట్నాలు, బోనాలు, అభిషేకాలు, కల్యాణోత్సవంతో మొక్కులు తీర్చుకుంటారు. అలాగే పలువురు భక్తులు కోడెలను దేవాలయానికి సమర్పిస్తుంటారు. అయితే వీటి సంరక్షణ ఆలయ నిర్వాహకులకు కష్టంగా మారుతోంది. ఇందుకు కారణం ప్రత్యేక గోశాల లేకపోవడమే. – సాక్షి, సిద్దిపేట తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి కొమురవెల్లికి భక్తులు భారీగా తరలివస్తారు. దేవుడి మొక్కుల కింద కోడెలను ఆలయానికి సమర్పించడం ఏళ్లుగా కొనసాగుతోంది. అలాగే కొందరు కోడెలు కడతామని మొక్కుతారు. దేవాలయానికి రూ.200 చెల్లించి టోకెన్ తీసుకుని అక్కడే ఉన్న కోడెను గుడికి సమీపంలో కట్టేస్తారు. ట్రస్ట్కు కోడెలు దేవాలయాలనికి కోడెల నిర్వహణ భారంగా ఉండటంతో ఓ ప్రైవేట్ ట్రస్ట్కు అప్పగిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. కోడెలను ఓ ప్రైవేట్ గోశాలకు ఇస్తుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఇచ్చిన కోడెలను నిర్వహణ చేయకపోతే ఎలా అని అంటున్నారు. దేవాలయానికి గత మూడేళ్లలో 100 కోడెలు భక్తులు సమర్పిస్తే వాటిలో 81 కోడెలు ఓ ప్రైవేట్ ట్రస్ట్కు అప్పగించడం గమనార్హం. మూడేళ్లలో నాలుగు కోడెలు మృతిచెందాయి. దేవాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లో 15 కోడెలను సంరక్షిస్తున్నారు. వేములవాడలో కోడెలు మృతిచెందుతుండటంతో కొమురవెల్లిలో అందజేసిన కోడెలు ఎలా ఉన్నాయో అని భక్తులు ఆందోళన చెందుతున్నారు. షెడ్లో నిర్వహణ దేవాలయం సమీపంలోని ఒక షెడ్లో కోడెలను సంరక్షిస్తున్నారు. తక్కువ స్థలంలో షెడ్ ఉండటంతో కొన్నింటినే ఉంచుతున్నారు. దేవాలయానికి ఏటా రూ. కోట్ల ఆదాయం వస్తుంది. అలాగే దాదాపు 150 ఎకరాలకు పైగా స్థలం ఉంది. ఆ స్థలాల్లో కొంత భాగం గోశాల నిర్మాణం చేయాలని భక్తులు కోరుతున్నారు. అలాగే ఆలయ సమీపంలో గోపూజ చేసుకునేందుకు మండపం ఏర్పాటు చేయాలన్న విన్నపాలు వస్తున్నాయి. ఇప్పటకై నా దేవాదాయ శాఖ, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రత్యేక గోశాలను నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. కొమురవెల్లి ఆలయంలో ‘గోశాల’ లేక అవస్థలు మూడేళ్లలో 100 కోడెలనుఅందజేసిన భక్తులు చేసేదిలేక ప్రైవేట్కు 81 కోడెలు తాత్కాలిక షెడ్లో 15 పశువుల సంరక్షణ ప్రత్యేక గోశాల ఏర్పాటు చేయాలంటున్న భక్తులు -
మానవ అక్రమ రవాణా నేరం
మెదక్ కలెక్టరేట్: మానవ అక్రమ రవాణా అతిపెద్ద నేరమని డీఈఓ రాధాకిషన్ అన్నారు. బుధవారం మెదక్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మనుషుల అక్రమ రవాణాను అరికట్టే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ మహిళలను కిడ్నాప్ చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. ఈ విషయంలో ప్రతి మహిళ అప్రమత్తంగా ఉండాలని, తోటి మహిళలను సైతం అక్రమ రవాణాపై అవగాహన కల్పించాలన్నారు. హైదరాబాద్కు చెందిన ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో మహిళలకు లఘు చిత్రం ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. మొబైల్, ఇంటర్నెట్ ద్వారానే అధికంగా ట్రాఫికింగ్కు గురవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు, జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన 58 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఈఓ రాధాకిషన్ -
రైతు మహోత్సవానికి రారండీ..
రేపటి నుంచి హుస్నాబాద్లో కిసాన్ మేళా● వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీ ఏర్పాట్లు ● ఆధునిక వ్యవసాయ పరికరాలు, విత్తనాలపై అవగాహన ● మేళాను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● హాజరు కానున్న మంత్రులు పొన్నం, ఉత్తమ్, పొంగులేటి, కొండా సురేఖ ● వేలాదిగా తరలిరానున్న రైతులుహుస్నాబాద్: రైతు మహోత్సవం సందర్భంగా కిసాన్ మేళాను హుస్నాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తు న నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 6, 7, 8వ తేదీల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులో మేళా నిర్వహించనున్నారు. వివిధ రకాల వ్య వసాయ యంత్రాలపై అవగాహన కోసం స్టాళ్లను ఏర్పాటు చేశారు. మొదటి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు కలిసి మేళాను ప్రారంభించనున్నారు. వీరితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు హాజరుకానున్నారు. 108 స్టాళ్లు.. కిసాన్ మేళాలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖ విభాగాలు, బ్యాంకులు, ఎఫ్పీఓలు, స్టార్టప్ కంపెనీలు, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన 108 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయ పరికరాలు, డ్రోన్లు, రోబొటిక్ యంత్రాలు, సేంద్రియ ఎరువులు, ఫెస్టిసైడ్, హార్టికల్చర్, సెరికల్చర్, ఆయిల్పామ్, వివిధ రకాల పంటల విత్తనాలను ప్రదర్శిస్తారు. కొత్త పద్ధతులు, సాగు ఖర్చు తగ్గించే విధానాలు, వివిధ పంటలల్లో అధిక దిగుబడులకు పాటించాల్సిన మెలకువలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. అలాగే అభ్యుదయ రైతుల సక్సెస్ స్టోరీలను వివరించనున్నారు. 10వేల మంది రైతుల తరలింపు కిసాన్ మేళా కార్యక్రమానికి జిల్లా నుంచి 10 వేల మంది రైతులను తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. 6న హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి, 7న సిద్దిపేట, చేర్యాల డివిజన్ల నుంచి, 8న దుబ్బాక, గజ్వేల్, ములుగు డివిజన్ల నుంచి రైతులను కిసాన్ మేళాకు తరలించనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. సద్వినియోగం చేసుకోండి మూడు రోజుల పాటు జరిగే కిసాన్ మేళా కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వివిధ రకాల విత్తనాలు, ఆధునిక పరికరాల ప్రదర్శన ఉంటుంది. రోజూ వివిధ శాఖల అధికారులతో వర్క్షాపుతోపాటు శాస్త్రవేత్తల ద్వారా ముఖాముఖి నిర్వహిస్తున్నాం. ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తాం. రైతులను తరలించడానికి ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాం. – రాధిక, జిల్లా వ్యవసాయ అధికారి -
మెదక్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లా ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాసరావును మెదక్కు బదిలీ చేశారు. రాష్ట్రంలో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీనివాసరావు 2013 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. మెదక్ ఎస్పీగా పనిచేసిన ఉదయ్కుమార్రెడ్డి ఇటీవల పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఒకటి రెండు రోజుల్లో డీవీ శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య టేక్మాల్(మెదక్): ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్యా బోధన అందుతుందని, ప్రభుత్వ బడులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పద్మారావు అన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో బడిబాట ప్రచార జాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులతో నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులందరూ పిల్లలను చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో విద్యార్థుల పెంపునకు సహకరించాలని కోరారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ మనోహరాబాద్(తూప్రాన్): గంజాయి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఒకరిని అరెస్ట్ చేసినట్లు నర్సాపూర్ ఎకై ్సజ్ అధికారులు బుధవారం తెలిపారు. ఈసందర్భంగా ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ గులాం ముస్తాఫా మాట్లాడుతూ.. మండలంలోని ముప్పిరెడ్డిపల్లిలో బీహార్కు చెందిన ఆదియ రాజు నివాసముంటున్నాడు. కాగా అతడు గంజాయి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు దాడి చేయగా అతని వద్ద నుంచి 221 గ్రాముల ఎండు గంజాయి లభించిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కూలీలకు గిట్టుబాటు అయ్యేలా చూడండి కౌడిపల్లి(నర్సాపూర్): కూలీలకు గిట్టుబాటు అయ్యే విధంగా కొలతల ప్రకారం ఉపాధి పనులు చేయాలని డీఆర్డీఓ శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని మహమ్మద్నగర్లో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు కూలీ రూ. 300 వచ్చేలా ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేయాలన్నారు. పని జరిగే చోట ఆన్లైన్లో హాజరు నమోదు చేయాలని ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం ఉచితంగా పాంపండ్స్ నిర్మిస్తుందని తెలిపారు. కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తూప్రాన్: భూ భారతి ద్వారా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వట్టూరు పడాలపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పర్యవేక్షించారు. ఈ గ్రామాల్లో 67 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో ఎక్కువగా సాదా బైనామాలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ సమస్యను రెవెన్యూ సదస్సు ద్వారా దరఖాస్తు చేసుకుంటే, వివిధ స్థాయిలలో పరిష్కారం అవుతాయని తెలిపారు. -
గిరిజనులకు వాహనాలు
● మత్స్యశాఖ ఆధ్వర్యంలో పంపిణీ ●● జిల్లాలో 15 తండాల ఎంపిక ● 90 శాతం సబ్సిడీపైఅందించేందుకు చర్యలు మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గిరిజనుల అభివృద్ధికి ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద మారుమూల తండాలలో నివసిస్తున్న నిరుపేద గిరిజనులను గుర్తించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. గిరిజనులు మత్స్యకారుల మాదిరిగా తండాల్లో చేపలు పెంపకానికి ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేస్తుంది. అలాగే వాటిని విక్రయించుకునేందుకు విక్రయ కేంద్రాలు, ఇతర ప్రాంతాలకు చేపలను తరలించేందుకు ద్విచక్ర వాహనాలు, ఆటో లను 90 శాతం సబ్సిడీపై అందిస్తుంది. ఈ పథకం కింద జిల్లావ్యాప్తంగా 9 మండలాల నుంచి 15 గిరిజన తండాలను ఎంపిక చేశారు. ఈ తండాలకు చెందిన గిరిజన ప్రజలు వారి ఆసక్తికనుగుణంగా దర ఖాస్తు చేసుకుంటే అవసరమైన వాహనాలు అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వసతులు కరువు జిల్లాలోని ఎంపిక తండాల్లో ఎక్కడా చేపల చెరువుల ఏర్పాటుకు అవకాశం లేదు. చేపల చెరువులు ఉండాలంటే వర్షాధారంగా నదులు, వాగులు, కాల్వల ద్వారా నీటి సరఫరా జరగాలి. అలాంటి అవకాశం లేకపోవడంతో తండాల్లో చెరువుల ఏర్పాటును ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. గిరిజనులు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మత్స్యశాఖకు చెందిన వాహనాలు మాత్రమే అందిస్తున్నారు. ప్రస్తుతం దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్నారు. ఈ తండాల్లోని గిరిజనులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే సంబంధిత గ్రామాల కార్యదర్శులకు బాధ్యతలను అప్పగించారు. వాహనాలు చేపలను శీతలీకరించిన వాహనాలు, ఇన్సులేటెడ్ వాహనాలు, ఐస్బాక్స్తో కూడిన మోటార్ సైకిల్, ఐస్ బాక్స్లతో కూడిన సైకిల్, చేపల అమ్మకం కోసం ఈ– రిక్షాలు, సహా ఐస్బాక్స్తో కూడిన త్రిచక్ర వాహనాలు, ప్రత్యక్ష చేపల విక్రయ కేంద్రాలు, రోజుకు 2 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల చేపల మిల్లులు, అక్వేరియం, అలంకార చేపల కియోస్క్లతో సహా చేపల కియోస్క్ల నిర్మాణం, సాంప్రదాయ మత్స్యకారులకు పడవలు, వలలు అందించడం, ఫిష్ వాల్యూయాడ్ ఎంటర్ప్రైజెస్ యూనిట్లు ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. -
ప్రతి దరఖాస్తును పరిశీలిస్తాం
విధుల్లో నైతిక విలువలు పాటించాలి ● భూ భారతితో న్యాయం చేస్తాం ● కలెక్టర్ రాహుల్రాజ్ చిన్నశంకరంపేట(మెదక్)/మెదక్ కలెక్టరేట్: భూ భారతి గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం మండలంలోని కొర్విపల్లిలో నిర్వహించిన భూ భారతి గ్రామసభను పరిశీలించారు. రైతులు అందించిన దరఖాస్తులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని.. కలెక్టరేట్కు ఎవరూ రావొద్దని సూచించారు. అనంతరం గవ్వలపల్లిలోని విత్తన దుకాణాన్ని పరిశీలించా రు. రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే అందించాలని డీలర్కు సూచించారు. అలాగే చిన్నశంకరంపేటలోని స్టీల్ అండ్ సిమెంట్ దుకాణాన్ని తనిఖీ చేసి ధరల వివరాలను తెలుసుకున్నారు. సిమెంట్ను ఎక్కు ధరను అమ్ముతున్నట్లు గుర్తించారు. స్టీల్, సిమెంట్ను అధిక ధరలకు అమ్మవద్దని హెచ్చరించారు. అలాగే రేషన్ దుకాణాన్ని పరిశీలించి సన్న బియ్యం పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట తహసీల్దార్ మన్నన్ ఉన్నారు. అలాగే మెదక్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యా ర్డులో ప్యాడీ క్లీనర్ యంత్రాలను ప్రారంభించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే సీజన్ నుంచి ఈ యంత్రాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఇన్చార్జి ఎస్పీ రాజేష్చంద్ర ఎస్ఐ విధులకు ఆటంకంకలిగించిన కానిస్టేబుల్పై వేటు మెదక్ మున్సిపాలిటీ: పోలీసులు విధుల్లో నైతిక విలువలు పాటించాలని ఇన్చార్జి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మెదక్ మ ండలం తిమ్మక్కపల్లి సమీపంలో రెండు టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన మెదక్ రూరల్ ఎస్ఐ మురళి విధులకు కొల్చారం పోలీస్స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ రాజ్కుమార్ అడ్డుపడటమే కాకుండా అక్రమ ఇసుక రవాణాదారులకు మద్దతుగా వ్యవహరించాడని.. ఈమేరకు అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. అలాగే పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశా మన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. -
భూ భారతితో సమస్యలు పరిష్కారం
అదనపు కలెక్టర్ నగేష్ వెల్దుర్తి(తూప్రాన్)/చేగుంట: అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసిందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ఈ మేరకు మాసాయిపేట మండలం రామంతాపూర్ పంచాయతీ పరిధి లింగారెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం చేగుంట మండలంలోని వల్లభాపూర్లో పర్యటించారు. ప్రభుత్వ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన దరఖాస్తులను గ్రామస్తులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు అమ్మడం, కొనడం నిషేధం అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ స్వప్న, ప్రత్యేక అధికారి భూమేష్ రైతులు పాలొన్నారు. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని గూడూర్లో నిర్మించిన శ్రీ గురుపీఠంలో దేవతామూర్తులు విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. రెండో రోజు వాస్తుపూజ, హోమం, లక్ష గోధారణ, క్షీరాధివాసం, మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. నేడు, రేపు కూడా పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యేలు హరీశ్రావు, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర నాయకులు ప్రతాప్రెడ్డి, దేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, నాయకులు తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఇక గ్రామాలే విత్తన బ్యాంకులు
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: రైతుల సంక్షేమమే ప్రధానంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇక నుంచి గ్రామాలే విత్తన బ్యాంకులుగా పనిచేస్తాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని రైతువేదికలో మంగళవారం అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తన బస్తాలను ఆయన పంపిణీ చేశారు. అంతకుముందు ఝరాసంగం ఆలయకమిటీ నూతన బోర్డుసభ్యులుగా నియమితులైన ఈశ్వరప్పను ఖేడ్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి సన్మానించారు. అనంతరం బాణాపూర్ గ్రామంలో భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ... గతప్రభుత్వం విత్తనాలు, వ్యవసాయ పనిముట్లపై రాయితీని ఎత్తివేసి రైతులపై భారం మోపిందన్నారు. ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసి గ్రామస్థాయిల్లోనే విత్తన బ్యాంకులు ఏర్పాటు జరిగేలా శ్రీకారం చుట్టిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరిట లక్షలాదిమంది రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపింఆరు. అన్యాయాన్ని సరిద్దిడానికి భూ భారతి చట్టం తీసుకువచ్చి రైతుల భూసమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చేందకు పక్కా ఇండ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. అనంతరం బాణాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఏ నూతన్ కుమార్, ఏవో శంకర్, నాయకులు రమేశ్చౌహన్, తాహెర్ అలీ, పండరీరెడ్డి, శంకర్ ముదిరాజ్, నెహ్రూనాయక్, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర(సంగారెడ్డి): ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తాలో మంగళవారం కార్యకర్తలు ఏర్పాటు చేసిన మాజీమంత్రి హరీశ్రావు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ...హరీశ్రావు నిత్యం ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విమర్శించడం తప్ప కాంగ్రెస్ నాయకులకు పనేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని భూభారతి ద్వారా భూ సమస్యలను వెంటనే 100% పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు, నాయకులు రవికుమార్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఏసీఎస్ డైరెక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే హత్నూర మండలం గుండ్ల మాచనూర్ పీఏసీఎస్ డైరెక్టర్ బేగరి సాయిలు ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని సునీతారెడ్డి పరామర్శించి ఓదార్చారు. మండల కేంద్రంమైన హత్నూరలోని మాజీ జెడ్పీటీసీ ఆశయ్య అనే గ్రామపంచాయతీ కార్మికుడు గుండెపోటుతో ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు. -
చెరువు కట్టలు భద్రమేనా?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : వర్షాకాలంలో చెరువులు, కుంటల నిర్వహణపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. భారీ వర్షాలతో వరద నీరు వచ్చి కట్టలు తెగిపోవడం, బుంగలు పడటం, కాలువలు ధ్వంసం కావడం వంటి జరిగే అవకాశాలుండటంతో ఆ శాఖ అప్రమత్తమైంది. గతేడాది వర్షాకాలంలో 75 శాతానికి మించి నిండిన చెరువులు, అలుగులు పారిన చెరువుల పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఈ చెరువుల కట్టలు ఎక్కడైనా బలహీనంగా ఉన్నాయా? తూములు మరమ్మతులు అవసరం ఉంటాయా? అలుగుల పరిస్థితి ఎలా ఉంది? 75 శాతానికి మించి నీళ్లు చేరితే కట్టలు తెగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. ఆయా మండలాల ఏఈఈలు, డీప్యూటీఈఈలు ఈ చెరువులను వెంటనే పరిశీలించాలని ఆదేశాలు వెళ్లాయి. ఎక్కడైనా బుంగలు పడితే తక్షణం మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 75%కు మించి నిండిన చెరువులు 748 నీటిపారుదలశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 1,769 చెరువులున్నాయి. ఇందులో 100 ఎకరాల లోపు ఆయకట్టు ఉన్న చిన్న చెరువులతోపాటు, వంద ఎకరాలకు మించి ఆయకట్టున్న చెరువులు కూడా ఉన్నాయి. గతేడాది వర్షాలు విస్తారంగా కురవడంతో సెప్టెంబర్లోనే సుమారు 748 చెరువులు నిండాయి. ఇందులో 218 చెరువులు అలుగు పారగా, 75 శాతానికి మించి నిండిన చెరువులు 530 వరకు ఉంటాయి. ఇలా 75% నిండిన చెరువుల్లోకి ఈ వర్షాకాలంలో కూడా వరదనీరు వచ్చి చేరే అవకాశాలుండటంతో ఈ చెరువులపై ఈ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడైనా చెరువుల కట్టలు ధ్వంసమైతే తక్షణం మరమ్మతులు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆ శాఖ ఆదేశించింది. అలాగే అలుగులు, తూములను మరమ్మతులు చేయాలని సూచించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై నీటిపారుదలశాఖ అధికారులతో కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో.. జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడైనా ముంపునకు గురైతే ఆ ప్రాంతాల్లో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ప్రధానంగా మంజీర, నక్కవాగు వంటివి ఉన్నప్పటికీ..ఈ పరీవాహక ప్రాంతాల్లో ముంపు ముప్పు పెద్దగా ఉండదు. వర్షాకాలం నేపథ్యంలో నీటిపారుదలశాఖ అప్రమత్తం మరమ్మతులు చేపట్టాలి క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు -
బియ్యం కోసం బారులు
ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో సంగారెడ్డిలో బియ్యం తీసుకోవడానికి జనం బారులు తీరారు. తమవంతు ఎప్పుడు వస్తుందోనని గంటల తరబడి క్యూలో వేచి ఉంటున్నారు. బియ్యం తీసుకోవడానికి వచ్చినవారు మూడుసార్లు వేలిముద్ర ఇవ్వాల్సి రావడంతో రోజంతా నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎండవేడి, ఉక్కపోత భరించలేక చిన్న పిల్లల తల్లులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల బియ్యం త్వరగా తీసుకోవాలనే ఆతృతలో ‘‘నేను ముందు వచ్చాను అంటే నేను ముందు వచ్చాను’’అని కొట్లాడుకున్నారు. కొన్ని రేషన్ దుకాణాల వద్ద మంగళవారం కనిపించిన దృశ్యాలను ‘సాక్షి’క్లిక్మనిపించింది. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ , సంగారెడ్డి -
మావన అక్రమ రవాణాను అరికట్టాలి
మెదక్ కలెక్టరేట్: మనుషుల అక్రమ రవాణాను నిరోధించడం ప్రతీ ఒక్కరి బాధ్యతని విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వచ్ఛంద సంస్థ ప్రజ్జ్వల, విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మనుషుల అక్రమ రవాణాను అరికట్టే అంశంపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ అక్రమ రవాణా ప్రపంచంలోనే అతి పెద్ద నేరంగా ఉన్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు, మహిళలు అక్రమరవాణాకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉద్యోగం, సినిమా అవకాశాల ద్వారా మోసం చేసి విదేశాలకు అమ్ముతున్నట్లు తెలిపారు. ప్రతీ మహిళ తమ పరిధిలో ఉన్న వారికి అవగాహన కల్పించి రక్షించాలని చెప్పారు. ప్రజ్వల ఎన్జీఓ సంస్థ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రయ్య మాట్లాడుతూ.. సీ్త్ర శిశు సంక్షేమ, పోలీస్, విద్యా, న్యాయ శాఖల సమన్వయంతో ఇప్పటివరకు 29,200 మంది మహిళలను కాపాడి పునరావాసం కల్పించినట్లు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 1930ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ప్రజ్జ్వల సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అత్యధికంగా మహిళలే బాధితులు విద్యాశాఖ ఏఎంఓ సుదర్శనమూర్తి -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేవిధంగా చూడాలని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివిధ శాఖల అధికారులతో మంగళ వారం జిల్లా పరిషత్తు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ..ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రహదారులు ముఖ్యం అని, రహదారులు అనుసంధానం చేస్తే విద్య ఉపాధి మార్గాలు పెరుగుతాయని చెప్పారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో మందులు నిల్వ ఉంచాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో ఇసుక కొరత లేదని తేల్చి చెప్పారు. సమీక్షలో అదనపు కలెక్టరు చంద్రశేఖర్, మాధురి, జెడ్పీసీఈఓ జానకి రెడ్డి పాల్గొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్ష -
సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
అదనపు కలెక్టర్ నగేశ్ నర్సాపూర్ రూరల్/పాపన్నపేట(మెదక్)/హవే ళిఘనపూర్(మెదక్): భూ సమస్యలున్న ప్రతీ ఒక్కరు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. మండలంలోని మంతూర్, గొల్లపల్లి, పాపన్నపేట మండలం ముద్దాపూర్ , మెదక్ మండలం పేరూర్ గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరికై నా భూ సమస్యలు ఉండే రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి కోసమే ఈ సదస్సులు ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదులపై తహసీల్దార్ విచారణ జరిపి,తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అక్కడ పరిష్కారం లభించక పోతే ఆర్డీఓకు, ఆపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మంతూర్లో 57, గొల్లపల్లిలో 47, ముద్దాపూర్, కొంపల్లి గ్రామాల్లో 68 భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. -
ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మె విరమించాం
టీఎంయూ రాష్ట్ర నాయకుడు అశ్వత్థామరెడ్డి పాపన్నపేట(మెదక్): ప్రభుత్వంపై నమ్మకంతోనే ఆర్టీసీలో తలపెట్టిన సమ్మెను విరమించామని టీఎంయూ రాష్ట్ర నాయకుడు అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఏడుపాయల్లో మంగళవారం జరిగిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ...ఆర్టీసీ కార్మికులు అనేక సమస్యలతో సతమవుతున్నారని చెప్పారు. వీటి పరిష్కారం కోసం అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా, ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు సిద్ధమయ్యామని చెప్పారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు సమ్మె విరమించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎంఆర్కే రావు, శాఖన్న, అశ్వక్, వెంకన్న, నర్సింహులు, ముత్యం,హన్మయ్య, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. -
భూ భారతితో శాశ్వత పరిష్కారం..
టేక్మాల్(మెదక్)/మెదక్ కలెక్టరేట్: భూ భారతితోనే భూ సమస్యల పరిష్కారమవుతాయని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మంగళవారం టేక్మాల్ మండలం షాబాద్ తాండలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి ప్రజల భూములకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర, అదనపు కలెక్టర్ నగేశ్లతో కలిసి కలెక్టర్ రాహుల్రాజ్ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి అమలుకు చిలప్చేడ్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకుమన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటిరోజు జిల్లావ్యాప్తంగా 31 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 929 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వీటిని క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి తదుపరి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. శాంతియుతంగా బక్రీద్... ప్రజలు మత సామరస్యంతో శాంతియుత వాతావరణంలో బక్రీద్ను జరుపుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. ఏదైనా చిన్న సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు, అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఏ వర్గానికి చెందిన వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, డీఎస్పీ ప్రసన్నకుమార్, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, రవాణాశాఖ అధికారులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ ఈ నెల 20 వరకు రెవెన్యూ సదస్సులు షాబాద్ తాండ రెవెన్యూ సదస్సును పరిశీలించిన కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా 929 దరఖాస్తులు -
మెలకువలు.. మెరుగులు
● 6న ముగియనున్న వేసవి శిక్షణ ● అథ్లెటిక్స్ పోటీలకు సన్నద్ధంచేగుంట(తూప్రాన్): అథ్లెటిక్స్ పోటీలకు నిష్ణాతులుగా తయారు చేసేందుకు ప్రభుత్వం యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో బాల బాలికలకు వేసవి శిక్షణ ఇస్తుంది. జిల్లాలో కేవలం చేగుంటలో మాత్రమే శిబిరం ఏర్పాటు చేశారు. మేలో ప్రారంభించిన శిక్షణ ఈనెల 6వ తేదీతో ముగియనుంది. అథ్లెటిక్స్ శిక్షణలో భాగంగా 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాల, బాలికలలకు అవకాశం కల్పించారు. రన్నింగ్, షార్ట్పుట్, లాంగ్జంప్, డిస్కస్ త్రో, జావెలింగ్ త్రో వంటి వాటిలో మెలకువలతో పాటు శారీరక దృఢత్వం కోసం వ్యా యామం చేయిస్తున్నారు. వీటితో పాటు జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ సౌజన్యంతో రగ్బీ క్రీడకు సంబంధించిన శిక్షణ సైతం అందిస్తున్నారు. మండల కేంద్రమైన చేగుంటలోని స్టేడియంలో ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రెండున్నర గంటల పాటు శిక్షణ నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల్లో బాల బాలికలకు శిక్షణ ఉపయోగరంగా మారింది. చేగుంట, వడియారం, రెడ్డిపల్లి, చిట్టోజిపల్లి గ్రామాల బాల బాలికలను తల్లిదండ్రులు శిబిరానికి పంపుతున్నారు. వీరితో పాటు సెలవుల్లో భాగంగా చేగుంటలోని బంధువుల ఇళ్లకు వచ్చిన వివిధ జిల్లాలకు చెందిన చిన్నారులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ మెలకువలు నేర్చుకున్న వారు జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారు. -
మల్లన్న సాగర్ను సందర్శించిన ఏసీపీ
తొగుట(దుబ్బాక): మండలంలోని కొమురవెల్లి మల్లన్న సాగర్ను గజ్వేల్ ఏసీపీ నర్సింహు లు సోమవారం సందర్శించారు. పంప్హౌస్, రిజర్వాయర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణం, సాగు నీరు, తాగునీటి వినియోగానికి సంబంధించి న సమాచారాన్ని డీఈ చెన్ను శ్రీనివాస్ ఏసీపీకి వివరించారు. అంతకు ముందు లింగాపూర్ శివారు లోని వైష్ణవి కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన ఎక్స్ఫ్లోజీవ్ (డిటోనెటర్లు భద్రపరిచే) గోదాంను ఏసీపీ పరిశీలించారు. గోదాంకు సంబంధించిన అనుమతి పత్రాలు, స్టాక్ రికార్డులను ఆయన పరిశీలించారు. గోదాములో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. గోదాం వద్ద సెక్యూరి టీని ఏర్పాటు చేయాలని ఏసీపీ సూచించారు. -
శాంతియుతంగా పండగలు జరుపుకోవాలి
తూప్రాన్: కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని డీఎస్పీ నరేందర్గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని లింగారెడ్డి గార్డెన్లో తూప్రాన్ పోలీస్ సర్కిల్ పరిధిలోని శివ్వంపేట, మనోహరాబాద్, వెల్దుర్తి, తూప్రాన్ పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రముఖులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిమతాలకు చెందిన పండగలను గౌరవించాలని సూచించారు. సోదరభావంతో కులమతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉండాలని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే విషయాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐ రంగాకృష్ణ, ఎస్ఐలు, ప్రజలు పాల్గొన్నారు. కలెక్టరేట్లో మిల్లెట్ క్యాంటీన్ మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో మిల్లెట్ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. 12 రకాల మిల్లెట్లతో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఉలవలు, జొన్నలు, రాగుల, అవస, ఇప్ప పువ్వు లడ్డులు, మునగాకు పౌడర్, కొర్రలు, అవసగింజలు, జొన్న ఉప్మా, ఊదలతో పొంగలి తదితర ఆహార పదార్థాలు లభించనున్నాయి. కేవలం రూ. 50కే ప్లేట్ విక్రయిస్తున్నట్లు ప్రతి సోమవారం క్యాంటీన్ ఉంటుందని పెద్దశంకరంపేట మండలానికి చెందిన ఎస్హెచ్జీ సభ్యురాలు అనిత తెలిపారు. అమరవీరులకు నివాళి చిన్నశంకరంపేట(మెదక్): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి నివాళులర్పించారు. ఈసందర్భంగా అమరుల త్యాగాలను కొనియాడారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, నాయకులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ అరుణ, శ్రీమన్రెడ్డి, గోపాల్రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, శివకుమార్ తదితరులు నివాళులర్పించారు. హామీలు అమలు చేయాలి పాపన్నపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చి న హామీలను వెంటనే నెరవేర్చాలని టీజీ సీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంగ నర్సింలు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే పీఆర్సీ ఇస్తామని, పెండింగ్ డీఏలు విడుదల చేస్తామని, హెల్త్కార్డులు ఇస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. లేకుంటే ఉద్యమాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి సదాశివపేట(సంగారెడ్డి): ఆచార్యా కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రభుత్వం తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని పద్మశాలి సేవా సంఘం డిమాండ్ చేసింది. సోమవారం సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సరస్వతికి వినతి పత్రం అందజేశారు. మలిదళ పోరాటానికి లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి ప్రదాత అని సంఘం అధ్యక్షులు మేకల జనార్ధన్, గౌరవ అధ్యక్షుడు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి మల్లేశం కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేశారని, అందుకే ఆయనకు జాతిపిత ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చింత చంద్రశేఖర్, కోట రవీందర్, ఆనంద్కుమార్, వెంకటేశం, రవి పాల్గొన్నారు. -
తాగునీటి కోసం ఆందోళన
ఆవిర్భావ వేడుకలను అడ్డుకున్న గ్రామస్తులువెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని హస్తాల్పూర్లో తాగునీటి కోసం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యదర్శి జెండా ఎగురవేయడానికి ప్రయత్నించగా, మూకుమ్మడిగా అడ్డుకున్నారు. జెండా గద్దె చుట్టూ ఖాళీ బిందెలు పెట్టి అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయినా, పట్టించుకునే నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా, తమ గ్రామానికి చుక్క నీరు సరఫరా చేయలేదని ఆరోపించారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు జెండా ఎగురవేసేది లేదంటూ భీష్మించుకుకూర్చున్నారు. హల్దీవాగులోని బోరు మోటార్ చెడిపోయి రోజులు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టడానికి సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహించారు. పోలీసులు నచ్చజెప్పినా స్పందించలేదు. చివరికి కాంగ్రెస్ జిల్లా నాయకుడు నరేందర్రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకొని 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించి ఆందోళన విరమించారు. దీంతో రెండున్నర గంటలు ఆలస్యంగా సుమారు 11 గంటల ప్రాంతంలో పంచాయతీ కార్యదర్శి జెండా ఎగురవేశారు. -
నేటి నుంచి ఊరూరా ‘భూ భారతి’
● 392 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు ● కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్/కొల్చారం: పటిష్ట ప్రణాళికతో మంగళవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టర్లో మాట్లాడుతూ.. ఇటీవల జిల్లాలోని చిలప్చెడ్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసుకొని మండలంలోని 16 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మొత్తం 1,045 దరఖాస్తులు వచ్చాయని, వాటిని కేటగిరిల వారీగా విభజించి పరిష్కార చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇందులో 250 దరఖాస్తులు డిస్పోజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 392 రెవెన్యూ గ్రామాలు ఉన్నా యని, వాటిలో దశలవారీగా సదస్సులు నిర్వహిస్తామన్నారు. దరఖాస్తులను ఎటువంటి రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా అందజేస్తామన్నారు. సమస్యల పరిష్కార నిమిత్తం హెల్ప్డెస్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో ఆరుగురు అధికారుల బృందం పాల్గొంటుందని వెల్లడించారు. అనంతరం హౌసింగ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, హౌసింగ్ పీడీ మాణిక్యం, డీఎంహెచ్ఓ శ్రీరామ్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే కొల్చారం మండలంలోని కోనాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. వాతావరణంలో నెలకొన్న మార్పుల దృష్ట్యా కొనుగోళ్లు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి, రైతులకు సూచించారు. -
పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు
● నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): పార్టీలో కష్టపడిన వారిని గుర్తిస్తూ త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా సోమ వారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అంతకు ముందు రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దని మీకు అండగా ఎప్పటికీ అందుబాటులో ఉంటామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు హరికృష్ణ, అత్తు ఇమామ్, లక్ష్మి, బొమ్మల యాదగిరి, కలీమొద్దిన్, ఎల్లం యాదవ్, ఆనంద్, గోపీకృష్ణ, సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
భూమి కోల్పోయి.. అప్పులు పెరిగి..
సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం శివ్వంపేట(నర్సాపూర్): సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శివ్వంపేట మండలం కొత్తపేటలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. కొత్తపేట గ్రామానికి చెందిన కంచన్పల్లి శేఖర్ ఉపాధి కోసం పట్నం వెళ్లి సూరారం, బాచుపల్లిలో ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఫ్రీ బస్ వల్ల ఆటో గిరాకీ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. సుమారు రూ. 20 లక్షల వరకు అప్పులు అయ్యాయి. ట్రిపుల్ఆర్లో 20 గుంటల భూమి కోల్పోగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వ లేదు. ఇటు ఆటో నడవక, అటు కోల్పోయిన భూమికి నష్టపరిహారం రాక అప్పులు తీర్చే మార్గం లేకుండా పోయింది. దీనికితోడు మూడు ఎకరాల సీలింగ్ భూమి ఇతరులు కబ్జా చేశారు. పలుమార్లు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. కేసీఆర్ సార్ మంచోడని కేసీఆర్ తనను ఆదుకోవాలని కోరాడు. సీఎం రేవంత్రెడ్డితో ఏమి కాదన్నాడు. అప్పు తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగుతూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి గ్రూపులలో షేర్ చేశారు. ఇది చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్త సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఆత్మహత్యాయత్నం చేయడం ఇది రెండోసారని తెలిసింది. -
ప్రగతి పరుగులు..
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025● సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు ● అవతరణ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావుమెదక్ కలెక్టరేట్: తెలంగాణను దేశంలోనే అగ్రస్థాన ంలో నిలిపేందుకు ప్రభుత్వం తెలంగాణ రైజింగ్– 2047 విజన్తో ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు అన్నారు. రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమ వారం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి, ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలను సీఎం రేవంత్రెడ్డి ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో ప్రకటించారని తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు భగవధ్గీత లాంటిదని, ఇది రాష్ట్ర రూపురేఖలను మార్చేస్తుందని చెప్పారు. ఈసందర్భంగా జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల తీరును వివరించారు. ఆయన మాటల్లోనే.. 14,796 మందికి ఆపరేషన్లు జిల్లాలో ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజీ మంజురు చేసి తరగతులు ప్రారంభించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలో 14,796 మంది పేదలు చికిత్సలు పొందగా, ఇందుకు గాను ప్రభుత్వం రూ. 38.04 కోట్లు ఖర్చు చేసింది. 13 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 2,16,716 కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా ఇప్పటివరకు 13,922 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేశాం. జిల్లాకు 3,800 కొత్త రేషన్ కార్డులు మంజురయ్యాయి. యాసంగిలో కొనుగోలు కేంద్రాల ద్వారా 2,95,703 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 70,815 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి, వారి ఖాతాల్లో రూ. 573,60 కోట్లు జమ చేశాం. రూ. 5 కోట్లతో బడుల నిర్వహణ ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా 96.87 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 12వ స్థానంలో నిలవడం అభినందనీయం. జిల్లాలోని 904 పాఠశాలల నిర్వహణకు సుమారు రూ. 5 కోట్లు ఖర్చు కేటాయించాం. సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీల కింద ప్రభుత్వం 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సమీకృత గురుకులాన్ని రూ. 200 కోట్లతో నిర్మించనున్నాం. 34 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం జిల్లాలో వన మహోత్సవం ద్వారా 34 లక్షల మొ క్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించాం. శాంతిభద్రతల పరిరక్షణ, మత్తు పదార్థాలు, సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, హౌసింగ్ పీడీ మాణిక్యం,జిల్లా వ్యవసాయ అధికారి వినయ్తో కలిసి రైతులకు, విత్తనాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో అధికా రులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. న్యూస్రీల్సంక్షేమ పథకాలకు పెద్దపీట మహాలక్ష్మి (ఉచిత బస్సు సౌకర్యం) పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు మహిళలకు రూ. 69 కోట్ల లబ్ధి చేకూరింది. మహిళలంతా కలిసి 2. 38 కోట్ల ప్రయాణాలు ఉచితంగా చేశారు. గృహజ్యోతి కింద జిల్లాలో ఇప్పటివరకు 1,29,500 మంది వినియోగదారులకు జీరో బిల్లులు జారీ చేశాం. రూ. 54 కోట్ల 24 లక్షల సబ్సిడీని ప్రభుత్వం డిస్కంలకు చెల్లించింది. సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా జిల్లాలో 1,26,658 వినియోగదారులకు 4,68,195 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీపై అందుకున్నారు. వీరికి రూ. 13.18 కోట్ల మేర లబ్ధి జరిగింది. రైతు రుణమాఫీ పథకం ద్వారా 87,491 మంది రైతన్నలకు రూ. 645 కోట్లు రుణమాఫీ జరిగింది. రైతు భరోసా పథకం కింద మొత్తం 2,26,970 మంది రైతుల ఖాతాల్లో రూ.140, 70 కోట్లు జమయ్యాయి. పంట నష్టపో యిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేల ఆర్ధిక సహాయం అందుతోంది. అలాగే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు అందజేస్తున్నాం. గిరిజనుల భూములకు సాగునీరు, విద్యుత్ సౌకర్యం అందుతోంది. అలాగే జిల్లాలో ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు ప్రతి రెవెన్యూ గ్రామంలో సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. -
ఘనంగా ఆవిర్భావ వేడుకలు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ మహేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో మరింత బాధ్యతగా పనిచేసి, రాష్ట్ర, జాతీయస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మెదక్ మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ప్రత్యేక అధికారి నగేష్ జెండావిష్కరణ చేశారు. ఈసందర్భంగా పారిశుద్ధ్యంపై వంద రోజుల యాక్షన్ ప్లాన్పై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ శ్రీనివాస్రెడ్డితో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లా బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
యాజమాన్య పద్ధతులు తప్పనిసరి
కొల్చారం(నర్సాపూర్): పంటల సాగులో యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అన్నారు. ఆదివారం మండలంలోని పోతిరెడ్డిపల్లి, రంగంపేటలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కా ర్యక్రమంలో భాగంగా రైతులకు శిక్షణ కార్య క్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మట్టి నమూనా సేకరణ విధానం, భూసార పరీక్షల వలన కలిగే లాభాలను రైతులకు వివరించారు. అధిక దిగుబడినిచ్చే కేఎన్ఎం 1,638, ఆర్ఎన్ఆర్ 15048, 28361, జేజీఎల్ 24423, కేఎన్ఎం 118, 28361 సాగు చేయాలన్నారు. రసాయన ఎరువులతో పాటు, పచ్చిరొట్టతో అధిక దిగుబడి పొందవచ్చన్నారు. రైతులు విత్తనాలు కొనే ముందు తీసు కోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు గురించి వివరించా రు. శాస్త్రవేత్తలు ప్రతాప్రెడ్డి, ప్రనూష, బసవరాజు, ఏఓ శ్వేత, రైతులు పాల్గొన్నారు. -
విలేజ్లోనే విత్తనోత్పత్తి
విత్తనాల సాగుకు రైతుల ఎంపిక ● జిల్లాలో 1,173 మందికి అవకాశం ● నేటి నుంచి నాణ్యమైన సీడ్స్ పంపిణీకి ఏర్పాట్లు ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడకుండా రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకోసం గ్రామాల వారీగా రైతులను ఎంపిక చేసింది. వారికి కావాల్సిన నాణ్యమైన విత్తన సీడ్ను 95 శాతం సబ్సిడీపై అందించడానికి కసరత్తు చేస్తుంది. సోమవారం అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో గల రైతు వేదికల ద్వారా విత్తనాలను అందించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. – మెదక్ కలెక్టరేట్ వరి, పెసర విత్తనోత్పత్తి వంగడాలు పండించేందుకు క్లస్టర్ల వారీగా వ్యవసాయశాఖ అధికారులు రైతులను ఎంపిక చేశారు. జిల్లాలో 21 మండలాలు 391 క్లస్టర్ గ్రామాలు ఉండగా.. అన్ని మండలాల్లో గ్రామానికి ముగ్గురు చొప్పున మొత్తం 1,173 మంది రైతులను గుర్తించారు. ఇందులో వరి విత్తనోత్పత్తి సాగుకు 782 మంది, పెసరకు 402 మందిని ఎంపిక చేశారు. వీరికి అవతరణ దినోత్సవం సందర్భంగా రైతు వేదికల ద్వారా విత్తనాలను అందించేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎంపికై న రైతులకు 10 కిలోల వరి విత్తన బస్తా కేవలం రూ. 50కే అందజేస్తున్నారు. అలాగే 3 కిలోల పెసర విత్తన బస్తాను సైతం రూ. 50కే ఇస్తున్నారు. విత్తనాలను ఉచితంగా ఇస్తే రైతులకు ఆసక్తి ఉండదన్న ఉద్దేశంతో మొక్కుబడి చార్జి వేసినట్లు సంబంధిత వ్యవసాయ అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ విత్తనాలను సాగు చేసిన రైతులు పంట ఉత్పత్తి జరిగిన అనంతరం గ్రామంలోని తోటి రైతులకు అందజేయాల్సి ఉంటుంది. ఇలా రైతులు తమకు కావాల్సిన విత్తనాలను వారే సొంతంగా పండించుకునే కార్యాచరణను ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటికే జిల్లాకు వరి, పెసర విత్తన సీడ్స్ను సరఫరా చేసింది. శాస్త్రవేత్తల పరిశీలన విత్తనాల నారు సిద్ధం కాగానే జిల్లాకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు వాటిని పరిశీలిస్తారు. నాటు ఎలా వేయాలి, ఎంతమేర మందులు వాడాలి, నీరు ఏ మోతాదులో అందించాలి, కలుపు తీసే విధానం, సస్యరక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు అందజేసి పంట పూర్తయ్యే వరకు పరిశీలిస్తారు. రైతులు అత్యధిక దిగుబడులు సాధించేలా మెలకువలు అందిస్తారు. కల్తీ విత్తనాలకు చెక్ కల్తీ విత్తనాలతో ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వాటిని తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులే సొంతంగా సీడ్ విత్తనాలను పండించడంతో తిప్పలు తప్పనున్నాయి. ఈ విత్తనోత్పత్తి అంతకంతకు పెరిగితే కల్తీ విత్తనాలు విక్రయించే మోసగాళ్లకు చెక్ పెట్టవచ్చు. రైతులకు లాభసాటి రైతులు సొంతంగా విత్తనాలను పండించుకోవడంతో విత్తనాల కోసం కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అలాగే రైతులకు నకిలీ విత్తనాల బెడద ఉండదు. నాణ్యమైన విత్తనాలు సొంత గ్రామంలో లభించడంతో రైతులకు మంచి లాభాసాటిగా ఉంటుంది. భవిష్యత్లో గ్రామాలే విత్తన కేంద్రాలుగా ఏర్పడనున్నాయి. అలాగే నాణ్యమైన విత్తనాలు కావడంతో అధిక దిగుబడుల సాఽధించి ఆర్థికాభివృద్ధి పొందవచ్చు. – వినయ్, జిల్లా వ్యవసాయ అధికారి -
వారంలో కొనుగోళ్లు పూర్తి
కలెక్టర్ రాహుల్రాజ్ఉత్తమ సేవలకు గుర్తింపు అదనపు ఎస్పీతో పాటు మరో 8 మందికి పతకాలుబోనం.. వైభవం కొల్చారం(నర్సాపూర్): వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపడతామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని పోతంశెట్టిపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో జిల్లాలోని రైతులందరికీ నిర్దేశించిన మద్దతు కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 2,95,703 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇందుకు సంబంధించి రైతులకు రూ. 573.60 కోట్లు చెల్లించినట్లు వివరించారు. ఇందులో సుమారు 12,872 మంది రైతుల నుంచి 53,659 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొను గోలు చేసి క్వింటాల్కు రూ. 500 బోనస్ చొప్పు న మొత్తం రూ. 26.83 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు చివరి దశలో ఉన్నాయని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఉన్నారు.మెదక్ మున్సిపాలిటీ: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులకు సేవా పతకాలను ప్రకటించింది. అదనపు ఎస్పీ మహేందర్ మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. అలాగే జిల్లాకు చెందిన మరో 8 మందికి పతకాలు వరించాయి. ఉత్తమ సేవా పతకానికి యశ్వంతరావు (మెదక్ ఆర్ఎస్ఐ), గాలయ్య (ఏఎస్ఐ పాపన్నపేట), కే.ఎన్.మూర్తి (ఏఎస్ఐ మనోహరాబాద్), మోహన్ (ఏఆర్ఎస్ఐ మెదక్), రాములు (హెడ్ కానిస్టేబుల్, డీఎస్బీ మెదక్), వైద్యనాథ్ (ఏఆర్హెచ్సీ మెదక్), బస్వరాజ్ (ఏఆర్హెచ్ఈ మెదక్), రాజు (కానిస్టేబుల్, చేగుంట) ఉత్తమ పతకాలకు ఎంపికయ్యారు. వీరంతా నేడు పతకాలు అందుకోనున్నారు.మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో ఆదివారం మున్నూరుకాపు కులస్తుల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డులకు చెందిన మహిళలు ఆటోనగర్లో గల నల్లపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఎమ్మెల్యే రోహిత్రావు ఉత్సవాలకు హాజరై బోనమెత్తారు. శివసత్తుల సిగాలు, పోతరాజులు, యువకుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డితో పాటు మున్నూరుకాపు సంఘం నాయకులు, మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. -
‘బడిబాట తర్వాతే టీచర్లను సర్దుబాటు చేయాలి’
మెదక్ కలెక్టరేట్: బడిబాట అనంతరం ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని పీఆర్టీ యూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత డైస్ సంఖ్య ఆధారంగా ఈనెల 13 లోపు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. ఇది విద్యా వ్యవస్థను అయోమయానికి గురి చేస్తుందని తెలిపారు. బడిబాట కార్యక్రమం పూర్తయ్యే సరికి ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో 60 మందికి ఇద్దరే టీచర్లు, 90 మందికి ముగ్గురు టీచర్లు అని ఉత్తర్వులు ఇవ్వడం సమంజసమైన విధానం కాదన్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నప్పుడే నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి చిన్నశంకరంపేట(మెదక్): క్రీడా స్ఫూర్తితో యువకులు ముందుకుసాగాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. ఆదివా రం మండలంలోని శాలిపేటలో క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హా జరై విజేతలకు నగదు బహుమతు లు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువకులు క్రీడల ద్వారా మానసికోల్లాసం, శారీరక ధారుడ్యం పెరుగుతుందన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, మాజీ వైస్ ఎంపీపీ సత్యంగౌడ్, మాజీ సర్పంచ్ పోచయ్య, నాయకులు శ్రీనివాస్రెడ్డి, యాదగిరి, శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం అన్లోడ్ చేయడం లేదని ఆందోళన శివ్వంపేట(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాల నుంచి రైస్మిల్కు తీసుకొచ్చిన దొడ్డురకం ధాన్యం 10 రోజులు అవుతున్నా అన్లోడింగ్ చేయడం లేదని డ్రైవర్లు, రైతులు అదివారం అందోళన చేశారు. మండల పరిధి దొంతిలోని మీనాక్షి రైస్మిల్కు వివిధ ప్రాంతాల కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లోడుతో లారీలు, ట్రాక్టర్లు వచ్చాయి. రైస్మిల్ యాజమాన్యం దొడ్డు రకం ధాన్యం అన్లోడింగ్ చేయకుండా సన్నాలను ముందుగా అన్లోడింగ్ చేస్తున్నారని వాపోయారు. సీరియల్ ప్రకా రం ధాన్యం అన్లోడింగ్ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయించండి శివ్వంపేట(నర్సాపూర్): అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనులు పూర్తి చేయించేందు కు చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందర్రావును మండల బీజేపీ నాయకులు కో రారు. అదివారం హైదరాబాద్లోని నివాసంలో ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. చండీ నుంచి అనంతారం చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కొండల్రావు, వెంకట్రెడ్డి, భి క్షపతి, మ ల్లేష్, అశోక్, ఆంజనేయులుచారి ఉన్నారు. -
● పాతది నిరుపయోగం.. కొత్తది అసంపూర్ణం ● రోడ్డు పక్కనే కూరగాయల విక్రయం ● పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
రామాయంపేట(మెదక్): రామాయంపేటలో గతంలో రూ. 50 లక్షలతో నిర్మించిన రైతుబజార్ దుకాణ సముదాయం నిరుపయోగంగా మారింది. రూ. 2 కోట్లతో నూతనంగా చేపట్టిన వెజ్, నాన్వెజ్ మార్కెట్ సముదాయం పిల్లర్లస్థాయిలోనే నిలిచిపోయింది. దీంతో తాత్కాలికంగా మెదక్ రోడ్డు పోలీస్స్టేషన్ పక్కన మార్కెట్ కొనసాగుతోంది. ఆరేళ్ల క్రితం నిర్మించిన రైతుబజార్ దుకాణాల సముదాయం మార్కెట్ కొనసాగే ప్రదేశంలో కాకుండా అనువుగా లేని చోట నిర్మించారు. మార్కెట్కు వెళ్లడానికి కనీసం రోడ్డు సదుపాయం సరిగా లేకపోవడంతో పాటు పార్కింగ్ సైతం లేదు. దీంతో అక్కడికి వెళ్లడానికి ప్రజలు ఆసక్తి చూపలేదు. దీంతో మార్కెట్ను ఎత్తివేసి కొద్ది రోజుల పాటు జూనియర్ కళాశాల ఎదురుగా సీఎస్ఐ ఆధీనంలో ఉన్న స్థలంలో ఏర్పాటు చేశారు. చర్చి నిర్వాహకుల అభ్యంతరం మేరకు అక్కడి నుంచి తొలగించి మెదక్ రోడ్డు మార్గంలో ఏర్పాటు చేశారు. ఆసక్తిచూపని వ్యాపారులు గతంలో కూరగాయల వ్యాపారం పట్టణంలోకి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా కొనసాగేది. సరైన స్థలం లేకపోవడంతో వ్యాపారులతో పాటు ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీంతో అధికారులు ప్రత్యేకంగా రైతుబజార్ నిర్మించి వ్యాపారులకు దుకాణాలను అలాట్ చేశారు. అయితే ఇందులో వ్యాపారం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. పట్టణ ప్రజలు అక్కడికి రాకపోడంతో రైతుబజార్లో కూరగాయల వ్యాపారం నిర్వహించడానికి వ్యాపారులు ఆసక్తి చూపలేదు. కేవలం మాంసం వ్యాపారులు కొందరు మాత్రమే అమ్మకాలు కొనసాగించారు. ఈ క్రమంలో అధునాతన రీతిలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ సముదాయం నిర్మాణానికి గతేడాది నిధులు మంజూరయ్యాయి. స్థలం అనువుగా లేకపోయినా ఎంపీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో నిర్మాణ పనులు చేపట్టారు. నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో పిల్లర్లస్థాయిలో పనులు నిలిచిపోయాయి. నిరుపయోగంగా రైతుబజార్ రైతు బజార్.. బేజార్! అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం రామాయంపేటలో అసంపూర్తిగా నిలిచిపోయిన వెజ్, నాన్వెజ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. పాత రైతు బజార్ను వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. – దేవేందర్, మున్సిపల్ కమిషనర్ -
అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్రాజ్ పరిశీలించారు. పతాకావిష్కరణకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు రానున్న నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, తాగునీరు తదితరాలపై పలు సూచనలు చేశారు. పోలీసుల గౌరవ వందనం, బందోబస్తుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓ రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్, కలెక్టరేట్ ఏఓ యూనస్, ఇతర అధికారులు సిబ్బంది ఉన్నారు. – మెదక్ కలెక్టరేట్ -
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
మెదక్ మున్సిపాలిటీ: ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంతో సంతోషంగా గడపాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. ఉద్యోగ విరమణ పొందుతున్న ఆర్ఎస్ఐ యశ్వంత్రావును శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సన్మానించి పోలీస్ వ్యవస్థకు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగానాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు పెద్దశంకరంపేట(మెదక్): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట, ముసాపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు సంబంధించి భూమి పూజలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సొంతింటి కల నెరువేరుతుందన్నారు. అన్నివర్గాలకు సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లబ్ధిదారులకు బిల్లులు వెంటవెంటనే వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ షాకీర్అలీ, నాయకులు సంతోష్, అంజిరెడ్డి, బక్కారెడ్డి, సాయిరెడ్డి, శశిధర్రెడ్డి, సంగమేశ్వర్, రోమాల సాయిలు, గోవింద్రావు, విఠల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ వెల్దుర్తి(తూప్రాన్): గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు ఎస్జీఆర్ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్లో జూన్ 15 నుంచి ఉచిత ఉద్యోగ శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్ట్ ఎండీ మధు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణ సమయంలో భోజన వసతి, హాస్టల్ సౌకర్యం ఉచితంగా అందించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు జూన్ 15లోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9441348569, 7287080612 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు చేగుంట(తూప్రాన్): నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవ సాయ అధికారి వినయ్కుమార్ అన్నారు. శుక్రవారం చేగుంటలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. రికార్డులతో పాటు విత్తనాలను పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని నిర్వాహకులను ఆదేశించారు. స్టాక్కు సంబంధించిన రికార్డులను ఖచ్చితంగా రాయాలని సూచించారు. వానాకాలం సీజన్లో నిత్యం టాస్క్ఫోర్స్ అధికారులు దుకాణాలను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలి: డీడబ్ల్యూఓ నర్సాపూర్: అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని డీడబ్ల్యూఓ హైమావతి ఆదేశించారు. శుక్రవారం నర్సాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టులోని సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోషణలోపంతో ఉన్న పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు పిల్లల ఎదుగుదల స్థితిని వివరించాలని సూచించారు. బాల్య వివాహాలు జరగకుండా ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేయాలన్నారు. అనంతరం పట్టణంలోని రీహాబిలిటేషన్ సెంటర్ను తనిఖీ చేశారు. ఆమె వెంట సీడీపీఓ హేమాభార్గవి పలువురు సూపర్వైజర్లు ఉన్నారు. -
ప్రభుత్వ వైఫల్యంతోనే ఇబ్బందులు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరగడం లేదన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. హమాలీలను సమకూర్చడంలో, వడ్ల రవాణాకు అవసరమైన లారీలు సమకూర్చడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. వానాకాలం సీజన్కు కావాల్సిన విత్తనాలు సైతం అందుబాటులో లేవన్నారు. ఈ విషయమై వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు వివరించారు. అనంతరం నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి మండలాలకు చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆమె వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, -
యోగమెప్పుడు?
మల్లన్నా.. డిజిటల్సాంకేతికతకు దూరంగా కొమురవెల్లి ఆలయం●ఆన్లైన్ చెల్లింపులు లేక భక్తుల అవస్థలు ●ఏటా కోటి మంది దర్శనం ●స్వామి వారి వార్షిక ఆదాయం రూ. 20 కోట్లపైనే.. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఒకటి. స్వామి వారిని ఏటా కోటి మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు. ఆలయానికి సుమారు రూ.20 కోట్లకు పైగా వార్షిక ఆదాయం సమకూరుతున్నా సాంకేతికతకు దూరంగా ఉంది. ఇప్పటి వరకు ఆన్లైన్ సేవలు అమలు కాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకతతో పాటు భక్తులు సులువుగా సేవలను పొందేందుకు ఆస్కారం లేకుండా పోయింది. కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులు.. వసతి గదులు, దర్శనం, నిత్యకల్యాణం, రుద్రాభిషేకం, అర్చన, పట్నం వేయడం, తలనీలాలు, ఒడిబియ్యం, బోనం తదితర ఆర్జిత సేవల కోసం రుసుం చెల్లించి టికెట్లు తీసుకోవాలి. రద్దీ ఎక్కువగా లేకపోతే పది పదిహేను నిమిషాలలో టికెట్లు లభిస్తాయి. రద్దీ ఎక్కువగా ఉంటే మాత్రం గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించాల్సి వస్తోంది. స్వామి వారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఏటా సుమారు మూడు నుంచి నాలుగు లక్షల వరకు పట్నాలు, బోనాల టికెట్లను ఆలయం విక్రయిస్తోంది. భక్తుల్లో అసహనం.. భక్తులు స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడే నిత్యాన్నసత్రానికి, కాటేజీల నిర్మాణాలకు విరాళాలు చెల్లిస్తుంటారు. ఆలయంలో ఆన్లైన్ సేవలు లేకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ వ్యవస్థను తీసుకురావడానికి ఆలయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చడం లేదు. మూడేళ్ల క్రితమే హుస్నాబాద్ మండలం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరాలయం, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో కూడా సాంకేతికత సాయంతో డిజిటల్ హుండీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లన్న ఆలయం సాంకేతికతలో వెనుకబడి ఉందని చెప్పవచ్చు. -
రైతు సంక్షేమానికి బీజేపీ పెద్దపీట
మెదక్ కలెక్టరేట్: రైతు సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే గత పదేళ్లలో 14 రకాల పంటలపై పలుమార్లు మద్దతు ధర పెంచిందని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభి షేకం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలకు మద్దతు ధర పెంచడంతో దేశవ్యాప్తంగా రైతుల్లో ఆనందం నెలకొందన్నారు. అనంతరం జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని యూరియా కొరత నివారించినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు ఈశ్వర్రెడ్డి, లింగారెడ్డి, శంకర్, ఓబీసీ నాయకులు గడ్డం కాశీనాథ్, రాగి రాములు తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ బకాయిలు చెల్లించండి
మెదక్ కలెక్టరేట్: ఉపాధి హామీ పథకంలో కూలీలకు రావాల్సిన బకాయిలతో పాటు పార్టీ(బీ) భూముల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 30 వేల ఎకరాల భూములు పార్ట్బీలో ఉన్నాయని తెలిపారు. ఫారెస్ట్, రెవెన్యూ మధ్యలో ఉన్న భూ సమస్యను పరిష్కరించాలన్నారు. పోడు పట్టాలు ఇవ్వాలని, గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను భూ భారతి పోర్టల్లో పొందుపరిచి పథకాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో వేగం పెంచండి
కలెక్టర్ రాహుల్రాజ్ ముదిరాజ్ల సంక్షేమానికి కృషి పాపన్నపేట/మెదక్ కలెక్టరేట్: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన మిన్పూర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ ఏడాది రుతుపవనాలు త్వరగా వచ్చినందున వర్షాలు పడే అవకాశముందన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 2 నుంచి మంజూరు పత్రాలు జూన్ 2వ తేదీ నుంచి రాజీవ్ యువ వికాసం పథకం మొదటి విడత రూ. 1 లక్షలోపు రు ణాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పారదర్శకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరగాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అన్లోడింగ్ త్వరగా పూర్తి చేయండి శివ్వంపేట(నర్సాపూర్): ధాన్యం అన్లోడింగ్ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం దొంతిలోని మీనాక్షి రైస్మిల్లో ధాన్యం అన్లోడింగ్ను పరిశీలించా రు. వర్షాలు పడుతున్నందున ధాన్యం త్వరగా అన్లోడింగ్ చేసి పంపించాలని యాజమానులకు సూచించారు. రామాయంపేట(మెదక్): ముదిరాజ్లు చదువుతో పాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఝాన్సిలింగాపూర్లో జరుగుతున్న పెద్దమ్మ ఆలయ ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ముదిరాజ్ల సంక్షేమానికై తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఆలయాల నిర్మాణానికి సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామకిష్టయ్య, తహసీల్దార్ రజనికుమారి తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణం.. ప్రమాదకరం
అసలే ప్రమాదకరంగా మలుపులు.. దీనికి తోడు ఏపుగా పెరిగిన చెట్లు, ముళ్లపొదలతో మండలంలోని రంగంపేట– పైతర, తుక్కాపూర్ రహదారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటాయి. 3 కిలోమీటర్ల పరిధిలో పదికి పైగా మలుపులు ఉన్నాయి. ఏపుగా పెరిగిన చెట్లు, ముళ్ల పొదలతో ముందు నుంచి వచ్చే వాహనం కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. –కొల్చారం(నర్సాపూర్) -
బాసర ట్రిపుల్ఐటీ పిలుస్తోంది
పాపన్నపేట(మెదక్): సర్కార్ బడిలో చదివిన విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ ప్రకటించింది. ఈ ఏడాది పదో తరగతిలో జీపీఏ విధానాన్ని తొలగించి, మార్కుల విధానం ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అడ్మిషన్లలో మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా 24 మార్కులు కలపనుంది. ఈ మేరకు 2025– 26కు సంబంధించి ట్రిపుల్ఐటీ దరఖాస్తులు ఈనెల 31 నుంచి జూన్ 21వ తేదీ వరకు స్వీకరించనుంది. ఈసారి జిల్లాలో 10,370 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా, 10,045 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందుబాటులో 1,500 సీట్లు నిరుపేద గ్రామీణ విద్యార్థులకు పదో తరగతి అనంతరం ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008లో ఆరేళ్ల ఇంటిగ్రేటేడ్ ట్రిపుల్ఐటీలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో ట్రిపుల్ఐటీ కాలేజీని నిర్మించారు. ఇందులో 1,500 సీట్లు ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు మంచి ప్యాకేజీతో క్యాంపస్ ఉద్యోగాలు వస్తున్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు లభిస్తాయి. ప్రభుత్వ విద్యార్థులకు ప్రోత్సాహం ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం డిప్రివేషన్ స్కోర్ విధానం అమల్లోకి తెచ్చింది. గతేడాది వరకు పదో తరగతిలో గ్రేడింగ్ విధానం అమల్లో ఉన్నందున ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 0.4 గ్రేడింగ్ పాయింట్లు కలిపేవారు. ఈ విద్యా సంవత్సరం మళ్లీ మార్కుల విధానం ప్రవేశపెట్టడంతో ఆరు సబ్జెక్టులలో ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 24 మార్కులు కలుపనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఆదర్శ (నాన్ రెసిడెన్షియల్ ) విద్యార్థులకు ఇవి వర్తిస్తాయి. రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం సర్కార్ బడిలో చదివితే24 మార్కులు అదనం జిల్లాలో పదో తరగతి ఉత్తీర్ణులు 10,045 మంది పది విద్యార్థులకు గుడ్ న్యూస్ ప్రభుత్వ పాఠశాలల్లో పది పాసైన విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులు మాత్రమే చదువుతారు. ఈ క్రమంలో కార్పోరేట్ పాఠశాలల విద్యార్థుల నుంచి పోటీ తట్టుకోవడం ఇబ్బందికరమే. అయినా నేను 542 మార్కులు తెచ్చుకున్నా. ఇప్పుడు 24 మార్కులు కలిపితే 566 అవుతాయి. ట్రిపుల్ఐటీలో సీటు వచ్చే అవకాశం మెరుగవుతుంది. – దీక్షిత, విద్యార్థిని, కుర్తివాడ -
ల్యాబ్ల.. చీటింగ్!
నిర్ధారణకు వెళితే నిలువు దోపిడీ! ● జిల్లావ్యాప్తంగా 52 ల్యాబ్లు ● అనుమతిలేనివి డబుల్ ● నిబంధనలకు పాతర ● పట్టించుకోని వైద్యాధికారులు ప్రజారోగ్యంతో పరీక్ష కేంద్రాల (ల్యాబ్) నిర్వాహకులు చెలగాటం ఆడుతున్నారు. వ్యాధి నిర్ధారణకు వెళితే నిలువు దోపిడీ చేస్తున్నారు. నిబంధనలు విస్మరించి అనుమతి లేకుండానే యథేచ్ఛగా నడుపుతున్నారు. అర్హత లేకున్నా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ల్యాబ్లో ఒక్కో రకం ఫలితాలు వస్తుండడంతో రోగులు ఏది నమ్మాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. – మెదక్ మున్సిపాలిటీ వాస్తవానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే వైద్యశాఖ నుంచి అనుమతి తప్పనిసరి. అన్నిరకాల చికిత్సలకు సంబంధించిన పరికరాలు ఉండాలి. ఎంబీబీఎస్ డాక్టర్తో పాటు పాథలాజిస్ట్, టెక్నీషియన్, మైక్రో బయాలజిస్ట్ ఉండాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఇవేమీ లేకుండానే యథేచ్ఛగా ల్యాబ్లు నిర్వహిస్తున్నారు. రోగుల అవసరాలను ఆసరాగా చేసుకొని ల్యాబ్ నిర్వాహకులు వివిధ రకాల పరీక్షల పేరుతో ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో అనుమతి పొందిన 52 (ల్యాబ్) డయాగ్నొస్టిక్ సెంటర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాని అంతకు రెట్టింపు స్థాయిలో అనుమతిలేనివి కొనసాగుతున్నట్లు సమాచారం. సీజన్లో జోరుగా దందా! వర్షాకాల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఆస్పత్రుల్లో ఎక్కువగా రోగులు చేరుతుంటారు. ఇదే సమయంలో కొన్ని అస్పత్రులకు అనుసంధానంగా ల్యాబ్లు లేకపోవడంతో వైద్యులు సూచించిన ల్యాబ్లకు పరీక్షలకు వెళ్తుంటారు. ఇదే అదనుగా కొందరు ఎక్కువ వసూలు చేస్తున్నారు. రూ. 100కు నిర్వహించే పరీక్షకు రూ. 500 వరకు బిల్లులు వేస్తున్నారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్న ల్యాబ్లో పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. కాని కొందరు వైద్యులు తమకు కమీషన్లు ఇచ్చే ల్యాబ్లకు వైద్య పరీక్షల కోసం రోగులను పంపుతున్నారు. కానరాని ఫీజు బోర్డులు మెడికల్ ల్యాబ్లలో ఆయా వైద్య పరీక్షలకు సంబంధించి ధరల పట్టికలు ఏర్పాటు చేయాలి. జిల్లాలో కొనసాగుతున్న ల్యాబ్లలో అధికశాతం వాటిల్లో ధరల పట్టికలు కనిపించడం లేదు. ఒకవేళ ధరల పట్టికలు పెడుతున్నా.. వాటిని రోగులకు కానరాకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఒకే రకమైన టెస్ట్లకు ఒక ల్యాబ్కు మరో ల్యాబ్కు ధరల విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. పెద్ద ల్యాబ్ల నిర్వాహకులు రాయితీలను ప్రకటిస్తున్నారంటే.. ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. నియంత్రణ కరువు సాధారణంగా ల్యాబ్లు ఐదేళ్ల కోసారి లైసెన్స్లు రెన్యూవల్ చేసుకోవాలి. లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు ల్యాబ్ దరిదాపుల్లోకి అధికారులు వెళ్లడం లేదు. దీంతో సదుపాయలు, అవసరమైన యంత్ర పరికరాలు లేకపోయినా నిర్వాహకులు అలాగే నడిపించేస్తున్నారు. అయితే తనిఖీలు చేయకుండా ఉండేందుకు నిర్వాహకులు అధికారులను మచ్చిక చేసుకుంటున్నట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు నిర్వహిస్తున్నాం జిల్లాలో ప్రైవేట్గా 52 ల్యాబ్లు ఉన్నాయి. వీటిలో ఎప్పటికప్పుడు తని ఖీలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఆస్పత్రిని బట్టి ధరలు ఉంటాయి. అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి రాలేదు. వచ్చే నెలలో ప్రైవేట్ ఆస్పత్రుల యజమానుల తో సమావేశం నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేస్తాం. – శ్రీరాం, డీఎంహెచ్ఓ -
రోడ్డు భద్రత.. జీవితానికి రక్షణ
కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డిఐదు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ నెల రోజులైనా ధాన్యం కొనరా?మెదక్ కలెక్టరేట్: రోడ్డు భద్రతను మెరుగుపరిచి ప్రజల ప్రాణాలను కాపాడవచ్చునని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డితో కలిసి జిల్లాలోని వివిధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా రహదారి భద్రత, ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్, నేషనల్ హైవే ద్వారా చేపట్టే ప్రణాళికలను చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను పక్కా ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నియమాలను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం జిల్లాస్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, చదువుపైనే దృష్టి సారించాలన్నారు. మాదక ద్రవ్యాల విని యోగం లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నిరంతర తనిఖీలు నిర్వహించి గంజాయి, మత్తు పదార్థాల రవాణాను అరికడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ సర్దార్సింగ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎంహెచ్ఓ శ్రీరాం, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, నేషనల్ హైవే, పోలీస్, రెవెన్యూ, రవాణా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. చిలప్చెడ్(నర్సాపూర్): మరో ఐదు రోజుల్లో మండలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ అన్నా రు. గురువారం చిలప్చెడ్ రెవెన్యూ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులను పరిశీలించడంతో పాటు చిట్కుల్లో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను రెండు బృందాలు పరిష్కరిస్తున్నాయని తెలిపారు. రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని, లారీల కొరత లేకుండా చేసి మరో ఐదు రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. రైతులు తేమశాతం తక్కువ ఉండేలా చూసుకుంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సహదేవ్, డిప్యూటీ తహసీల్దార్ సింధూజ, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. గడిపెద్దాపూర్ రైతుల ఆందోళనఅల్లాదుర్గం(మెదక్): ధాన్యం కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. నెలరోజులుగా ధాన్యం బస్తాల వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం గడిపెద్దాపూర్ 161 జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ధాన్యం తూకం వేసినా తామే కాపలా ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో విషయం తెలుసుకున్న సీఐ రేణుకారెడ్డి, తహసీల్దార్ మల్లయ్య సంఘటన స్థలికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి అందోళన విరమింపజేశారు. ఇదిలాఉండగా అల్లాదుర్గం, గడిపెద్దాపూర్ కొనుగోలు కేంద్రాలను డీఎస్ఓ సురేశ్రెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ జగదీశ్వర్ తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, రెండు రోజుల్లో తూకం వేసిన ధాన్యం తరలిస్తామని చెప్పారు. గడిపెద్దాపూర్లో రెండు లారీల ధాన్యం వెంటనే తరలిస్తున్నట్లు తెలిపారు. వర్షాలతో మ్యాచర్ రాక మిల్లర్లు కొనడం లేదని అన్నారు. -
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దు
మెదక్ మున్సిపాలిటీ: ప్రజలంతా శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. బక్రీద్ సందర్భంగా గురువారం పట్టణంలోని ఓ గార్డెన్లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. హిందూ, ముస్లింలు ఎలాంటి ఘర్షణలకు వెళ్లకుండా శాంతియుతంగా పండుగలను జరుపుకోవాలన్నారు. గతేడాది జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. హిందువులు గోవులను దేవతగా పూజిస్తారు కాబట్టి, వారికి ప్రత్యేక శ్రద్ధ ఉంటుందన్నారు. ముస్లింలు ఏదైనా చట్టపరంగా, నియమ నిబంధనలకు అనుగుణంగా చేస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. చట్టానికి వ్యతిరేకంగా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ నాగరాజు, ఎస్సై అమర్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, వెటర్నరీ డాక్టర్ లక్ష్మణ్, పోలీసు సిబ్బంది, హిందూ, ముస్లింలు పాల్గొన్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ -
చివరి గింజ వరకు కొంటాం
కలెక్టర్ రాహుల్రాజ్రామాయంపేట(మెదక్)/తూప్రాన్/మనోహరాబాద్/చేగుంట: కలెక్టర్ రాహుల్రాజ్ బుధవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడంతో పాటు ఎరువులు, విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. మనోహరాబాద్ మండలంలోని దండుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లు పూర్తి చేసేలా చొరవ చూపించాలని నిర్వాహకులను ఆదేశించారు. ముందస్తు వర్షాలతో ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తున్నాయని తెలిపారు. తడిసిన ధాన్యం కొను గోలు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తూప్రాన్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్మించిన ఇందిరమ్మ ఇంటి నమూనాను పరిశీలించారు. జిల్లాలో 9 వేల మంది ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించామన్నారు. ఎంపీడీఓ భవనం కోర్టు నిర్వహణకు అనుకూలంగా ఉందని, ఎంపీడీఓ కార్యాలయాన్ని ఇంటిగ్రేటేడ్ మార్కెట్లో కొనసాగించేందుకు ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే చేగంటలో ఓ ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు వానాకాలం సీజన్కు సంబంధించి ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వ్యవసాయ, పోలీస్శాఖల సమన్వయంతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం రామాయంపేటలో పర్యటించారు. మల్లె చెరువులోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన మినీ ట్యాంక్బండ్ పనులను పరిశీలించారు. చెరువు సుందరీకరణకు మంచి అవకాశం ఉందని, ఈమేరకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఆయన వెంట వివిధశాఖల అధికారులు, నాయకులు ఉన్నారు. -
బోధనలో సాంకేతికతను జోడించాలి
డీఈఓ రాధాకిషన్మెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెంచేలా బోధనలో సాంకేతికతను జోడించాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండో విడత భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈఓ ఆకస్మికంగా సందర్శించి పలు సూచనలు చేశారు. అన్ని పాఠశాలల్లో ఐఎఫ్టీ ప్యానల్స్ అందుబాటులో ఉన్నందున, ఏఐ సాంకేతికతను ఉపయోగించి బోధించాలని సూచించారు. రిసోర్స్పర్సన్ సొంతంగా తయారు చేసిన బోధన అభ్యసన సామగ్రిని పరిశీలించారు. ఉపాధ్యాయులు కూడా ఇదే విధమైన బోధన అభ్యసన సామగ్రిని రూపొందించుకొని బోధించాలన్నారు. ప్రయోగాలు, కృత్యాలను వీడియో ద్వారా చిత్రీకరిస్తూ నేరుగా ఐఎఫ్టీ ప్యానల్స్లో వీక్షించే విధంగా సాఫ్ట్వేర్ అందుబాటులో ఉందన్నారు. ఉపాధ్యాయులంతా దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అంతకుముందు డైట్ కళాశాలలో నిర్వహిస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, కోర్స్ కోఆర్డినేటర్ రేఖ, రిసోర్స్ పర్సన్లు రాజ్కుమార్, మహేందర్, వెంకటరమణ పాల్గొన్నారు. -
ఐటీఐకి అడుగులు పడేనా?
మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని కాళ్లకల్, కూచారం, జీడిపల్లి, ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్ గ్రామాల్లో పరిశ్రమల వాడలు ఏర్పాటయ్యాయి. కాగా ఇక్కడి యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించడం లేదు. ఉన్నత విద్యే కాకుండా సాంకేతిక విద్య కలిగిన వారికి పరిశ్రమల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అయితే అందుబాటులో ఐటీఐ కళాశాల లేకపోవడంతో స్థానిక విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఐటీఐ ఏర్పాటుకు బాటలు వేయాలని పలువురు కోరుతున్నారు. కాగా పరిశ్రమల వాడ ఏర్పాటుకు రైతుల నుంచి భూములు సేకరించే సమయం (2007)లో అప్పటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి ఇంటికి ఒకరి చొప్పున ఉపాధి కల్పిస్తామని, ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయించి స్థానికులకు సాంకేతిక విద్యనందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పరిశ్రమల ఏర్పాటుపై పెట్టిన దృష్టి యువత ఉపాధిపై పెట్టలేదని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనోహరాబాద్ మండల నేత ర్యాకల హేమలత జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆమె సైతం ఐటీఐ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చి ఏర్పాటు చేయలేకపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో స్థానికుల్లో ఆశలు చిగురించాయి. ప్రజాప్రతినిధులు దృష్టి సారించి యువతకు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రచించి అందుబాటులో ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.పారిశ్రామికవాడలో ఏర్పాటుకు గతంలోనే హామీస్థల సేకరణకు కృషి చేశాం ముప్పిరెడ్డిపల్లి శివారులో గల పరిశ్రమల వాడలో కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ భూమి గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఫైల్ పైస్థాయిలో ఉండగా, ప్రభుత్వం మారింది. దీంతో ఐటీఐ ఏర్పాటుకు బ్రేక్ పడింది. – హేమలత, మాజీ జెడ్పీ చైర్పర్సన్ -
జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు
నర్సాపూర్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించే భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ మహిపాల్ రైతులకు సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు డివిజన్ పరిధిలో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. సదస్సులకు తహసీల్దార్లు హాజరై అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను సదస్సుల్లో అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు అమ్మాలి కౌడిపల్లి(నర్సాపూర్): రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అమ్మాలని ఏడీఏ పుణ్య వతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మన గ్రోమోర్, ఆగ్రోస్ రైతుసేవా కేంద్రంతో పాటు పలు ఎరువుల దుకాణాల్లో ఏఓ స్వప్న, ఎస్ఐ రంజిత్రెడ్డితో కలిసి తనిఖీలు నిర్వహించారు. విత్తనాలు, ఎరువులతో పాటు కంపెనీ, లాట్ నంబర్, స్టాక్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రభు త్వం నిషేధించిన విత్తనాలు, పురుగు, గడ్డి మందు అమ్మవద్దని చెప్పారు. రైతులు కొనుగోలు చేసిన వాటికి బ్యాచ్, లాట్ నంబర్ ఉన్న రసీదు ఇవ్వాలన్నారు. కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్హత ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక మెదక్ కలెక్టరేట్: అర్హత ఆధారంగా రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. పథకం కింద వచ్చే సహాయంతో యువత వ్యాపారం చేసి ఉపాధి పొందేలా ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ నర్సాపూర్: నాబార్డు ఆధ్వర్యంలో మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు తెలిపారు. బుధవారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బందితో ఆయన ఉచిత శిక్షణపై సమీక్ష నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండి 45 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తారని చెప్పారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల ని సూచించారు. జూన్ మొదటివారంలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని కమిషనర్ వివరించారు. అభ్యర్థులు పదో తరగతి చదివి ఉండాలని, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోను తమ కార్యాలయంలోని మెప్మా సిబ్బందికి అందజేయాలన్నారు. సమావేశంలో జిల్లా మెప్మా పీడీ ఇందిర, కోఆర్డినేటర్ దేవపాల తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలిరామాయంపేట(మెదక్): ప్రపంచ పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం రోడ్ల పక్కన పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను అటవీ సిబ్బంది తొలగించారు. అక్కక్కన్నపేట బీట్ పరిధిలోని రోడ్డు పక్కన బాటసారులు వేసిన ప్లాస్టిక్ సీసాలను తొలగించి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మసక చీకట్లో ఇసుక దోపిడీ!
పాటిగడ్డ కేంద్రంగా ఆగని దందారాత్రి 3 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు రవాణా గాడిద కష్టం.. దళారుల అదృష్టం! ● సీజ్ చేసిన ఇసుక కుప్పలు మాయంపొలాల్లో ఇసుక కుప్పల నిల్వలుపాపన్నపేట(మెదక్): గాడిద కష్టం.. దళారుల అదృష్టం అన్నట్లుంది ఇసుకాసురుల తిరకాసు దందా. జల వనరులను పరిరక్షించాల్సిన ఖద్దరు నాయకులే మంజీరా పాలిట జలగల్లా మారారన్న ఆరోపణలున్నాయి. స్థలం మార్చి.. అధికారులను ఏమార్చి మంజీరా నదిని ఎడారిగా మార్చే యత్నం చేస్తున్నారు. రాత్రి 3 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు దర్జాగా దందాను కొనసాగిస్తున్నారు. యూసుఫ్పేట శివారులోని పాటిగడ్డ కేంద్రంగా గాడిదలపై సాగుతున్న ఇసుక రవాణా దళారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఖద్దరు బట్టల చాటున వ్యాపారం వేసేది తెల్లబట్టలు.. చేసేది చీకటి వ్యాపారం అన్నట్లుంది ఇసుక అక్రమ దందా తీరు. పాపన్నపేట మండలం చుట్టూ మంజీరా నది ఉండటంతో వర్షాకాలంలో భారీగా ఇసుక మేటలు పెడతాయి. దీంతో వేసవి రాగానే అక్రమార్కులు ఇసుక దందాకు తెరలేపుతారు. గతంలో ట్రాక్టర్లపై ఇసుక రవాణా చేసేవారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు కేసులు నమోదు చేస్తుండడంతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రస్తుతం గాడిదలపై ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు రూ. 6 వేలు వస్తుండటంతో ప్రధాన పార్టీల నాయకులు ఇసుక దందాలో పాలుపంచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల మొక్కుబడి దాడులు పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే పోలీస్, రెవెన్యూ అధికారులు దాడులు చేసి డంపులు సీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. సీజ్ చేసిన ఇసుక కుప్పలకు ఓపెన్ టెండర్ నిర్వహించి, డబ్బులను డిపాజిట్ చేయాలి. కాని అవేవి చేయకపోవడంతో గతంలో సీజ్ చేసిన ఇసుక కుప్పలను అక్రమార్కులు యథేచ్ఛగా కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. ఒక వేళ టెండర్లు నిర్వహించినా, లోలోపల తతంగం అయిందనిపించి దళారులే వాటిని మొక్కబడి ధరలకు సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పాటిగడ్డ ఇసుక దిబ్బగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అధికారులు గాడిదల యజమానులను అక్కడి నుంచి కుర్తివాడకు తరలించగా, యూసుఫ్పేట వ్యాపారులు తిరిగి వారిని రప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై తహసీల్దార్ సతీష్ కుమార్ను వివరణ కోరగా.. పాటిగడ్డపై నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణా అడ్డుకొని, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.స్థలం మార్చి.. అధికారులను ఏమార్చియూసుఫ్పేట శివారులోని పాటిగడ్డ ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణాపై ఇటీవల ‘సాక్షి’లో కథనాలు రావడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు చేసి ఇసుక కుప్పలను సీజ్ చేశారు. దీంతో దళారుల కన్ను సంగమేశ్వర్రెడ్డి పొలం దగ్గర గల పాటిగడ్డపై పడింది. అక్కడ నాణ్యమైన ఇసుక ఉండటంతో నదిలోకి ప్రత్యేక రోడ్డు వేశారు. గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి వరకు గల కొందరు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు గాడిదలపై ఒడ్డు వరకు ఇసుక తరలిస్తున్నారు. అక్కడి నుంచి సమీప పొలాల వరకు ట్రాక్టర్లపై రవాణా చేసి, అక్కడ నిల్వ చేస్తున్నారు. ఇందుకు గాను గాడిదల యజమానులకు రూ. 1,500, ట్రాక్టర్లో ఇసుక లోడ్ చేసే లేబర్కు రూ. 500 చెల్లిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు రూ. 5,500 నుంచి రూ. 6 వేల వరకు బయట అమ్ముకుంటున్నారు. -
భూసార పరీక్షలతో రైతులకు మేలు
నర్సాపూర్ రూరల్: రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకొని వ్యవసాయం చే యాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ గీత, పద్మశ్రీ, గాయత్రి, శ్రీలత సూచించారు. బుధ వారం మండలంలోని నత్నయ్యపల్లి, అహ్మద్నగర్ గ్రామా ల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతులు పంటలు సాగు చేసే ము ందు తమ భూముల్లో భూసార పరీక్షలు చేయించుకొని రిపోర్టు ఆధారంగా అనువైన పంటలను సాగు చేసుకోవాలన్నారు. రసాయన ఎరువులకు దూ రంగా ఉండి సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసుకోవాలని తెలిపారు. ప్రతి రైతు తమ వివరాలు అందించి ఐడీ కార్డు పొందాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని దీపిక, ఏఈఓలు చంద్రవేణి, తేజస్విని, రైతులు పాల్గొన్నారు. -
కొండపోచమ్మ బాగుంది
మర్కూక్(గజ్వేల్): మర్కూక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ను బుధవారం కోల్ ఇండి యా ఉద్యోగుల బృందం సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణం, అమలు చేసిన సాంకేతికత, ప్రాజెక్టు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాల గురించి ఏఈఏలు శ్రీనివాస్, శుశాంత్.. బృందం సభ్యులకు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తీరును, ప్రస్తుతం రైతుల పంట పొలాలకు కాల్వల ద్వారా నీటిని ఏ విధంగా వదులుతున్నామనే విషయాలను వారికి తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నిర్మాణం బాగుందని వారు కితాబిచ్చారు.కోల్ ఇండియా ఉద్యోగుల బృందం కితాబు -
స్పాట్ రిజిస్ట్రేషన్లు
స్లాట్ లేకున్నాసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్లాట్ బుకింగ్ విధానం అమలవుతున్న సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్ర యోగాత్మకంగా వాక్–ఇన్ రిజిస్ట్రేషన్లకు కూడా అవకాశం కల్పించారు సదాశివపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు. దీంతో స్లాట్ బుక్ చేసుకోని వారు కూడా వాక్ – ఇన్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. సోమవారం మొత్తం 19 స్లాట్లు బుక్ కాగా, ఇందులో 20 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇలా స్లాట్ బుక్ చేసుకోకుండా..వాక్ – ఇన్ పద్ధతిలో ఐదు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే గజ్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా వాక్–ఇన్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వివిధ రకాల స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్తగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రయోగాత్మకంగా సదాశివపేట, గజ్వేల్, సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల (ఎస్ఆర్ఓ)ల్లో ఈ విధానాన్ని అమలు చేస్తోంది. తప్పిన పడిగాపులు ఏదైనా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే సంబంధిత వ్యక్తులు ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్లో కేటాయించిన సమయానికి ఎస్ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు గంటల తరబడి కార్యాలయంలో పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ ఉంటే రోజంతా పనులు మానుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నారు. వాక్ – ఇన్ రిజిస్ట్రేషన్లు అంటే.. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకోని వారు ఈ వాక్ – ఇన్ విధానాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతీరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ విధానంలో రిజిస్ట్రేషన్లు చేస్తారు. స్లాట్ బుక్ చేసుకోనివారు నేరుగా సాయంత్రం 5 గంటలకు కార్యాలయానికి వెళితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. అయితే వాక్ – ఇన్ విధానంలో రోజుకు ఐదు రిజిస్ట్రేషన్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇలా వాక్ – ఇన్ విధానంలో ఎక్కువగా బ్యాంకు లోన్లకు సంబంధించిన మార్ట్గేజ్ డాక్యుమెంట్లు, రిలీజ్ డీడ్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయని ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో రోజు 48 స్లాట్లు.. స్లాట్ బుకింగ్ విధానంలో ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. 48కి మించి స్లాట్లు బుక్ చేయడానికి వీలు లేదు. అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవడంతో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు చాలా మట్టుకు పడిపోయాయి. ప్రస్తుతానికి 48 డాక్యుమెంట్లకు మించి అవసరం పడటం లేదని ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం జూన్ 2 నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.మంచి ఫలితాలనిస్తోంది ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం సదాశివపేట, గజ్వేల్, సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ విధానం అమలవుతోంది. అయితే ఈ విధానం మంచి ఫలితాలినిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తొందరగా జరుగుతోంది. దీంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటోంది. స్లాట్లో పేర్కొన్న నిర్ణీత సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని వెళుతున్నారు. లైన్లో నిలబడటం, గంటల తరబడి వేచి ఉండటం వంటి తిప్పలు తప్పుతున్నాయి. –ఐ.వి.సుబ్బలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్, ఉమ్మడి మెదక్ జిల్లా అత్యవసరమైన వారి కోసమే ఈ సేవలంటున్న అధికారులు రోజుకు ఐదు చొప్పున డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కు అవకాశం -
విస్తరిస్తున్న మైక్రో ఫైనాన్స్లు గతంలో అమాయక ప్రజల ప్రాణాలు బలి గొన్న మైక్రో ఫైనాన్స్లు జిల్లాలో చాపకింద నీరులా మళ్లీ విస్తరిస్తున్నాయి. వివరాలు 9లోu
చివరి గింజ వరకు కొంటాం● రైతులు అధైర్య పడొద్దు ● కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: రైతులు అఽధైర్య పడొద్దని, చివరి గింజ వరకు పూర్తి స్థాయిలో వరిధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,75,392 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇది గత ఏడాది కంటే ఎక్కువ మొత్తమని పేర్కొన్నారు. ఈ ధాన్యాన్ని సంబంధించి 66,133 మంది రైతులకు రూ.501 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయానికి 2,48,374 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 57,657 మంది రైతులకు రూ.423.73 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ ఏడాది గతంలో కంటే మెరుగ్గా కొనుగోలు ప్రక్రియ నిర్వహించినట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని రైతులు ఎవరూ అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ధాన్యం కొనుగోలులో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో మేడ్చల్ నుంచి కలెక్టర్ రాహుల్రాజ్ పాల్గొనగా.. మెదక్ కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ ప్రత్యేక అధికారిణి, మెదక్ ఆర్డీవో రమాదేవి ఆదేశించారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో పారిశుద్ధ్య కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తడి, పొడి చెత్త సేకరణతోపాటు పట్టణంలోని ఇళ్లలో పాత టైర్లు, కూలర్లు, ఇతర ప్రదేశాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. నీరు నిలిస్తే దోమలు వ్యాప్తి చెందుతాయని పేర్కొన్నారు. ప్రతి వారం అన్ని వార్డుల్లో ఫాగింగ్ చేయాలని, మురుగు కాలువలు శుభ్రపర్చాలని ఆమె ఆదేశించారు. పారిశుద్ద్య కార్యక్రమాలకు సంబంధించి ప్రతి రోజూ వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. చెత్త సేకరణ సక్రమంగా కొనసాగాలని ఆర్డీవో ఆదేశించారు. -
ఇన్చార్జీల పాలన ఇంకెన్నాళ్లు?
● అదనపు కలెక్టర్ నుంచి అంతా ఇన్చార్జీ అధికారులే ● రెగ్యులర్ అధికారుల నియామకం ఎప్పుడు? ● అవస్థలు పడుతున్న ప్రజలు మెదక్ కలెక్టరేట్: ఇన్చార్జీల పాలనతో జనం సతమతమవుతున్నారు. సకాలంలో సమస్యలు పరిష్కారానికి నోచుకోక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్చార్జీ అధికారులతోనే నెట్టుకొస్తున్నారు. ఇతర జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీంతో ఎడ్కడా న్యాయం చేయలేక పోతున్నారు. సమస్యలు కూడా పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా కార్మికశాఖ అధికారిగా సంగారెడ్డికి చెందిన యాదయ్యను అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇప్పటి వరకు ప్రజలకు కనిపించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్గా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో ఎవరికి అర్థంకాని పరిస్థితి. స్థానిక సంస్థల అధికారిగా నగేష్ జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవెన్యూశాఖ అదనపు కలెక్టర్ రెండు పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం రెవెన్యూశాఖ అదనపు కలెక్టర్గా నగేష్ విధులు నిర్వహిస్తుండగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆ బాధ్యతలు కూడా నగేష్ నిర్వర్తిస్తున్నారు. అలాగే.. గత డిసెంబర్లో ఆహార భద్రత అధికారి స్వాదీప్కుమార్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి శిక్షణలోనే ఉన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన అధికారి యాదయ్యకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. జిల్లా ప్రజలకు దర్శనమిచ్చిన దాఖలాలేవనే చెప్పాలి. కాగా ప్రస్తుతం ఆయన ఇన్చార్జీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం శాఖకు అధికారి లేరు. లేబర్కార్డుతోపాటు సంక్షేమ పథకాలపై దరఖాస్తులు చేసుకున్న కార్మికులు అధికారి రాక సమస్యలు పరిష్కారానికి నోచుకోక కార్యాలయానికి తిరుగుతున్నారు. మెదక్ వ్యవసాయ అధికారి గోవింద్ నాలుగు నెలల క్రితం వ్యక్తిగత కారణాలతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో వ్యవసాయ శాఖ టెక్నికల్ అధికారి వినయ్కుమార్కు అదనపు వ్యవసాయ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఇంకా కొన్ని శాఖలు జిల్లా మైనింగ్, ఎకై ్సజ్, ఎంప్లాయిమెంట్, పశు సంవర్ధక, బీసీ సంక్షేమశాఖ అధికారి, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి, లీగల్ మెట్రాలజీ, భూగర్భ జలశాఖ, విజయ డెయిరీ, వయోజన విద్యాశాఖ, డీఎల్పీఆర్ఓ, కో ఆపరేటీవ్ శాఖ, మార్కెటింగ్ ఏడీ, మార్క్ఫెడ్, హ్యండ్లూమ్, డీఎం సోలార్, ఆరోగ్యశ్రీ శాఖలు ఇన్చార్జీలతోనే కొనసాగుతున్నాయి. -
పొంచి ఉన్న సీజనల్ గండం
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సమస్య ప్రధాన సమస్యగా మారింది. దీంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఎక్కడిక్కడ చెత్తా చెదారం పేరుకుపోవడం, ఫాగింగ్ చేపట్టకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నా.. మున్సిపల్ అధికారులు ఏ మాత్రం ముందస్తు చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వినవస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అస్తవ్యస్త పారిశుద్ధ్యం నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మునిసిపల్ ప్రత్యేక స్పెషల్ అధికారిగా మెదక్ ఆర్డీవో రమాదేవిని నియమించారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రతి రోజూ ఏడు మెట్రిక్ టన్నుల మేర చెత్తను సేకరిస్తున్నారు. 40 మంది పారిశుద్ధ్య సిబ్బంది, రెండు ట్రాక్టర్లు, మూడు ఆటోల్లో చెత్తను సేకరిస్తున్నారు. వారు సేకరించిన చెత్తను పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఎక్కలదేవి బండపై ఉన్న డంపు యార్డులో వేస్తున్నారు. కొత్తగా మురుగు కాల్వల నిర్మాణం చేపట్టకపోవడంతో గతంలో నిర్మించినవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటిలో చెత్త పేరుకుపోవడంతో స్థానికులు ఇబ్బందుల పాలవుతున్నారు. మురుగు కాలువల్లో క్రిమి సంహారక మందు చల్లడానికిగాను రూ.లక్షల వ్యయం చేసి రెండు ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు. వీటితోపాటు గడ్డి కత్తిరించే యంత్రాలు ఉన్నా ఏవీ పనిచేయడంలేదు. కాగా, వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ద్యం విషయమై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని,..? వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పడకేసిన పారిశుద్ధ్యం ఎక్కడి చెత్త అక్కడే.. ఫాగింగ్ యంత్రాలు నిరుపయోగం పట్టించుకోని మున్సిపల్ అధికారులు కార్యాచరణ రూపొందించాం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం విషయమై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకుగాను కార్యాచరణ రూపొందించాం. మురుగు కాలువల్లో ఫాగింగ్ చేయడంతో పాటు ఆయిల్ బాల్స్ వేయిస్తున్నాం. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాం. –దేవేందర్, మున్సిపల్ కమిషనర్ -
ప్రజారోగ్యానికి పెద్దపీట
ఎమ్మెల్యే రోహిత్రావు మెదక్ కలెక్టరేట్: నియోజకవర్గ అభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేశామని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా మెదక్ ఆర్డీఓ రమాదేవికి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని శానిటేషన్పై స్పెషల్ డ్రైవ్లు చేపట్టామన్నారు. ప్రజలకు జ్వరాలు సోకకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి నర్సాపూర్: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్దూబె కోరారు. మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఈఈఈ ఎస్బీ అండ్ పీఈఎస్ సొసైటీ భాగస్వామ్యంతో బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలోని ఈఈఈ బ్రాంచ్ ఆధ్వర్యంలో సమాజ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఐటీఐ, డిగ్రీ విద్యార్థులకు వారం రోజుల పాటు ఈ శిక్షణ నిర్వహించనున్నామని చెప్పారు. సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సౌర వ్యవస్థల నిర్వహణ, విద్యుత్ భద్రతా చర్యలు, విద్యుత్ వాహన సాంకేతికత తదితర అంశాలపై ఉచిత శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈఈఈ హెచ్ఓడీ రాయుడును ప్రిన్సిపాల్ సంజయ్దూబె అభినందించారు. కార్యక్రమంలో మేనేజర్ బాపిరాజు, ఏఏఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. 166 మంది గైర్హాజరు ఇంటర్ నోడల్ ఆధికారి మాధవి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం మొదటి సంవత్సర విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 2,332 మంది విద్యార్థులకు గానూ 122 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు జరిగిన పరీక్షలకు మొత్తం 761 మంది హాజరు కావాల్సి ఉండగా 44 మంది గైర్హాజయ్యారు. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో మొత్తం 166 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ నోడల్ ఆధికారి మాధవి తెలిపారు. తీర్ధ యాత్రలకు ప్రత్యేక రైళ్లు ● జూన్ 14 నుంచి ప్రారంభం ● ఐఆర్సీటీసీ జనరల్ మేనేజర్ కిశోర్ మెదక్ కలెక్టరేట్: తీర్థయాత్రలకు వెళ్లే వారికోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపిస్తుందని ఐఆర్సీటీసీ జనరల్ మేనేజర్ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 14 నుంచి జూలై 13వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం రెండు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణ బీమా, అలాగే రైల్వే స్టేషన్ నుంచి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైలులో 718 మంది ప్రయాణికులు ఉంటారని, ప్రతి 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు అందజేస్తారని తెలిపారు. రైలులో సీసీ కెమెరాలతో కూడిన భద్రతా ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు, టికెట్ బుకింగ్ కోసం 97013 60701, 92810 30712, 92814 95845, 92810 30749, 92810 30750లకు సంప్రదించాలని కోరారు. క్రీడల హాస్టళ్లకు విద్యార్థుల ఎంపిక మెదక్ కలెక్టరేట్: రాష్ట్రంలోని రీజినల్ స్పోర్స్ హాస్టళ్లలో చేరడానికిగాను ఆసక్తి గల క్రీడాకారు లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ ఒకటి నుంచి 13వ తేదీ వరకు ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. వాలీబాల్, సైక్లింగ్, జిమ్నాస్టిక్, స్విమ్మింగ్, అథ్లెటి క్స్, హ్యాండ్బాల్, హాకీ క్రీడల్లో పోటీలు ఉంటా యని పేర్కొన్నారు. 10 నుంచి 12 ఏళ్లలోపు వా రికి జిమ్నాస్టిక్, స్విమ్మింగ్ 12 నుంచి 16 లోపు వారికి అథ్లెటిక్స్, సైక్లింగ్, హ్యాండ్బాల్, హాకీ, వాలీబాల్, కుస్తీ పోటీలు ఉంటాయని తెలిపా రు. సమాచారం కోసం జిల్లా యువజన కార్యా లయంలో సంప్రదించాలని సూచించారు. -
విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో అప్రమత్తం అవసరం
మెదక్ మున్సిపాలిటీ: మరికొద్ది రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభం కానుంది. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో పలు విత్తన కంపెనీల ప్రచారం ఊపందుకుంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా.. ప్రైవేట్ కంపెనీలు ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రచార ఆర్భాటాలు సాగిస్తున్నాయి. విత్తనాలకు సంబంధించిన కంపెనీలు పట్టణాల్లో, గ్రామాల్లో రైతులను ఆకట్టుకునేలా కరపత్రాలు, వాల్ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నాయి. మైక్ సెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆయా కంపెనీల ప్రచారాలతో రైతులు మోస పోకుండా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో సీడ్స్, ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ లైసెన్స్ కలిగిన మొత్తం 312 దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 3.05 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు కానుంది. ఇందుకోసం 91.530 మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరం అవుతాయి. అలాగే 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 1.912 డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు, 28,400 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయి. ప్రకటనలు చూసి మోస పోవద్దు పలు కంపెనీలు చేసే ప్రచారాలు, ప్రకటనలు చూసి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. ఆకర్షణీయమైన ప్యాకింగ్తో గుర్తింపులేని లేబుళ్లతో కొన్ని కంపెనీలు రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నాయి. కంపెనీలపై అప్రమత్తంగా ఉండాలి. అన్ని సరి చూసుకున్నాకే నమ్మకం కలిగితేనే కొనుగోలు చేయాలి. విత్తన కంపెనీపై ప్రభుత్వ నిబంధనల వివరాలు ఉన్నాయో లేదా? అన్న విషయాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ముఖ్యంగా విత్తనాలను ఉత్పత్తి చేసే కంపెనీపై నమ్మకం ఉండాలి. కంపెనీల ప్రకటనలతో మోసపోవద్దు గుర్తింపు పొందిన విత్తనాలే మేలు వ్యవసాయం అధికారుల సూచనలునకిలీ విత్తనాలు అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ బృందం జిల్లాలో నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ఇటీవల కలెక్టర్ రాహుల్రాజ్ ప్రత్యేకంగా వ్యవసాయ అధికారులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా టాస్క్పోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం జిల్లాలో విస్తృతంగా పర్యటించి అన్ని ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేయనుంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి నకిలీ విత్తనాలు, ఎరువులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సైతం జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. –విన్సెంట్ వినయ్, జిల్లా వ్యవసాయ అధికారిఎరువులు కొనే ముందు: లైసెన్స్ కలిగిన డీలర్ నుంచే ఎరువులు కొనుగోలు చేయాలి మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల బస్తాలనే కొనుగోలు చేయాలి. ఎరువుల బస్తాకు చేతికుట్టు ఉంటే సీలు ఉందో లేదో చూసుకోవాలి చిల్లులు పడిన, చిరిగిన ఎరువుల బస్తాలను కొనవద్దు అన్య పదార్థాలు కలిస్తే ఎరువును కల్తీగా గుర్తించాలి కొనుగోలు చేసే సమయంలో డీలర్ రికార్డులో రైతు విధిగా సంతకం చేయాలి ఎరువుల నాణ్యతపై అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ అధికారి సహకారంతో ఎరువులను పరీక్షలకు పంపించాలి. లైసెన్స్ కలిగిన వాటిల్లో కొనాలి లైసెన్స్ పొందిన డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి కొనుగోలు చేసిన సమయంలో బిల్లులను సరిచూసుకోవాలి బిల్లుపై దుకాణం పేరు, కేంద్ర, రాష్ట్ర, అమ్మకపు పన్ను నంబర్, రైతు, గ్రామం పేరు విక్రయదారుడి సంతకం, తేదీలు, విత్తన రకం పేరు, బ్యాచ్ నంబర్, గడువు తేదీలు, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుండి విత్తనాలు కొనుగోలు చేయ్యేద్దు. విత్తన ప్యాకెట్, సీసా, బస్తా, డబ్బాలకు సీలు ఉందో లేదో నిర్ధారించుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనాలను డీలర్ వద్దనే తూకం వేసి సరిచూసుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపర్చాలి. విత్తనాలు మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలి. -
సత్వర పరిష్కారం చూపండి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి వినతులను పెండింగ్లో పెట్టవద్దని సూచించారు. భూ సమస్యలపై 19, పెన్షన్ల కోసం 3, డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి 1, ఇతర సమస్యలపై 29 కలిపి మొత్తం 52 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాస్రావు, ఏఓ యూనస్తో పాటు ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ ప్రజావాణికి 52 వినతులు -
ముందస్తుగానే రుతుపవనాలు
ఈసారి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశిస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడుతున్న అల్పపీడన ద్రోణి వల్ల ఈ వర్షాలు కురుస్తున్నట్లు అంచనా. దీనికి తోడు రావాల్సిన నైరుతి ముందే కూసింది. సహజంగా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి ఈసారి మే మధ్యస్తంలోనే పలకరించింది. జూన్ 24నాటికే కేరళను రుతుపవనాలు తాకాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇలాంటి అకాల వర్షాల కారణంగా భూసారంలో తేడా వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గమనిస్తే సాధారణం కంటే ముందుగా వర్షాకాలం ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో ముందుగా వర్షాలు పడి సరైన సమయంలో వర్షాలు కురియకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వానాకాలం సాగు చేసేవారు వాతావరణ మార్పులు ఎలా ఉన్నా వారి జాగ్రత్తల్లో వారు ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని బాగాలకు రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా వచ్చేశాయి. -
● ధాన్యం కొనండి.. మహాప్రభో..
అల్లాదుర్గం(మెదక్): ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. 10 రోజుల క్రితం కాంటా చేసినా ధాన్యం తరలించకపోవడంతో కేంద్రం వద్దే జాగారం చేస్తున్నారు. మరికొంత మంది రైతుల ధాన్యం తూకం కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వర్షాలు పడుతుండటంతో ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో సోమవారం అల్లాదుర్గం రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్ని రోజులు ఊరి బయటపడుకోవాలని తహసీల్దార్ మల్లయ్యను కలిసి మొరపెట్టుకున్నారు. ఈసందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. మ్యాచర్ వచ్చిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. కొల్చారం(నర్సాపూర్): యాసంగి పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆరబెట్టిన ధాన్యం ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. మండలంలోని తుక్కాపూర్, కోనాపూర్, ఏటిగడ్డ మాందాపూర్ గ్రామాల్లో ఆలస్యంగా వరి కోతలు అయ్యాయి. ధాన్యాన్ని ఆరబెడుతున్న క్రమంలో వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన వడ్లు కొన్నిచోట్ల మొలకెత్తుతుండగా, మరికొన్ని చోట్ల ముక్కిపోయి ముద్దలుగా మారుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని రైతులు వాపోతున్నారు. ఇంకెన్ని రోజులు కల్లాల వద్ద గడపాలని, అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రవాణా చేయాలని కోరుతున్నారు. -
సీఈఐఆర్ పోర్టల్తో మేలు
మెదక్ మున్సిపాలిటీ: పట్టణ పరిధిలో 35 మొబైల్స్ రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధితులకు మొబైల్స్ అందజేసి మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మా రిందన్నారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే, లేదా గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. దీంతో పోగొట్టుకున్న ఫోన్ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, ఒక వేల పోగొట్టుకున్న వ్యక్తులకు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. అంతకు ముందు జిల్లాస్థాయి ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులకు చట్టపరంగా న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, పట్టణ సీఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి -
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
పెద్దశంకరంపేట(మెదక్): మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా హార్టికల్చర్ ప్లాంటేషన్ మేనేజర్ శ్రావణ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని గొట్టిముక్కుల, మ ల్కాపూర్ తదితర గ్రామాల్లో నర్సరీలు, హార్టికల్చర్ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రా మాల వారీగా అవసరమైన మొక్కలను పెంచడంతో పాటు వాటి సంరక్షణ చేపట్టాలన్నారు. రైతులకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఈసీ నవాజుద్దీన్, ఎఫ్ఏలు నర్సింలు, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. తాగు నీటి వసతి కల్పిస్తాం కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని కూకుట్లపల్లిలో నూతనంగా నిర్మించిన పాఠశాల వద్ద తాగు నీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని డీఎల్పీఓ సాయిబాబ తెలిపారు. సోమవారం పాఠశాల వద్ద పైపులైన్ ను పరిశీలించి మిషన్ భగీరథ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. భగీరథ ద్వారా నల్లా కనెక్షన్ ఇప్పించి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. వర్షాకాలంలో మురికి నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ కలీముల్ల, హెచ్ఎం రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్లో చేరికలు నర్సాపూర్: మండలంలోని పెద్దచింతకుంట, చిన్నచింతకుంట గ్రామాలకు చెందిన పలు వురు సోమవారం బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. వారికి డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న ఆంజిగౌడ్, నాయకులు శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్ గుప్తా, హర్షవర్దన్ తదితరులు పాల్గొన్నారు. సకాలంలో సర్టిఫికెట్లు అందించాలి మెదక్ కలెక్టరేట్: తమ పిల్లల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని సకాలంలో కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఎస్సీ మన్నె కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం సంఘం నాయకులతో కలిసి అదనపు కలెక్టర్ నగేష్ను వినతిపత్రం అందజేశారు. రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలి నర్సాపూర్: ప్రభుత్వ లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని ఏడీఏ సంధ్యారాణి సూచించారు. సోమవారం ఆమె నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హన్మంతాపూర్లో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా అన్ని వివరాలతో కూడిన రసీదులు తీసుకోవాలన్నారు. రసీదులు ఇవ్వని పక్షంలో తమ దృష్టికి తేవాలని పేర్కొన్నారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి దీపిక, ఏఈఓ చంద్రవేణి ఉన్నారు. -
కవిత లేఖపై కేసీఆర్ స్పందించాలి
వెల్దుర్తి(తూప్రాన్): ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని ఓ ఫంక్షన్హాల్లో పలు గ్రామాలకు చెందిన వారికి సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ వర్గాలకు కాంగ్రెస్తోనే న్యా యం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ద్వారా స్పష్టం అయిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లు ఒక్కటే అనడానికి ఆమె చేసిన ఆరోపణలు బలాన్ని ఇస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ, భగీరథ రూపంలో రూ. వేల కోట్లు కాజేసిన హరీశ్రావు, ఫార్ములా వన్ రేస్, ఐటీ పేరుతో ఓఆర్ఆర్ చుట్టూ భూములు కాజేసిన కేటీఆర్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డగోలుగా ప్రభుత్వ భూములు అప్పజెప్పి రూ. కోట్లు గడించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్రావులో దయ్యం ఎవరో బహిర్గతం చేయాల్సిన అవసరం కేసీఆర్పై ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మేహేహశ్రెడ్డి, నాయకులు నరేందర్రెడ్డి, సుధాకర్గౌడ్, నర్సింహారెడ్డి, మల్లేశం, శంకరయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి -
సర్వేయర్ల శిక్షణ ప్రారంభం
మెదక్ కలెక్టరేట్: భూ లావాదేవీల్లో పారదర్శకత కోసమే లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ పరిధిలో గల ఆర్ట్స్ క్యాంపస్లో మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) నుంచి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థులు జిల్లా నుంచి మొదటి విడతలో మొత్తం 116 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరికి రెండు నెలల శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ప్రభుత్వం తరఫున విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. భూ భారతి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న పట్టాదారుని భూములకు సంబంధించిన కొలతలు, మ్యాప్లు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష ఉంటుందని, శిక్షకులు అన్ని అంశాలను బోధించాలని సూచించారు. నూతన సర్వేయర్ల నియామకంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈసందర్భంగా సర్వేయర్లకు శిక్షణ సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో భూ కొలతల సహాయ సంచాలకులు శ్రీనివాస్, డిప్యూటీ సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
జీలుగ సాగుతో లాభాలెన్నో.. జీలుగ విత్తనాలు వేసుకుంటే పొలంలో సేంద్రియ ఎరువును తయారు చేసుకునే అవకాశం ఉంది. వివరాలు 9లో uమెదక్ కలెక్టరేట్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలికలు)లో బోధనకు జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల కో–ఆర్డినేటర్ సువర్ణలత తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని మెదక్, తూప్రాన్, రామయంపేట, కొల్చారంలోని పాఠశాలలు, కళాశాలల్లో తెలుగు, హిందీ, ఆంగ్లం, పీఈటీ, పీడీ, పౌర, కామర్స్, భౌతిక, రసాయన, జువాలజీ, జీవశాస్త్రం, గణితం తదితర సబ్జెక్టుల్లో టీజీటీ, పీజీటీ, ఉపాధ్యాయ, జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. పార్ట్టైం ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఆసక్తి, అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 29వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. అభ్యర్థులను మెరిట్, డెమో ప్రాతిపదికన ఎంపిక చేస్తామని, ఈనెల 31న ఉదయం 10 గంటలకు డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు. -
మల్లన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. స్వామివారిని దర్శించుకున్న అనంతరం గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ ఎస్పీ అన్నపూర్ణ.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాటేజీల నిర్మాణానికి మంచిర్యాలకు చెందిన దాతలు మహేందర్, రవీందర్లు రూ.15లక్షలు చెక్కురూపంలో ఈఓ అన్నపూర్ణకు అందించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
పచ్చిరొట్టతో నాణ్యమైన దిగుబడి
మెదక్ కలెక్టరేట్: పచ్చిరొట్ట ఎరువులు వాడటంతో భూసారం పెరిగి నాణ్యమైన దిగుబడులు వస్తాయని జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి వినయ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం జిల్లాలో 15,000 క్వింటాళ్ల జనుము, 30,000 క్వింటాళ్ల జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వరి నాట్లు ఎక్కడైతే ముందు జరుగుతాయో ఆ మండలాల్లో ప్రాథమిక సహకార సంఘాలు, రైతు ఆగ్రోస్ కేంద్రాల వద్ద పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మిగితా మండలాలకు నా లుగు రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. నేలకు, పంటకు మేలు చేసే పచ్చిరొట్ట ఎరువును తయారు చేసేందుకు ప్రభుత్వం జీలుగ విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందజేస్తుందన్నారు. పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు ఉన్న రైతుకు మాత్రం 50 శాతం వరకు సబ్సిడీపై అందుతుందన్నారు. రైతులు రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతిలో భూసారం పెంచే దిశగా పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అందుబాటులో జనుము, జీలుగ విత్తనాలు జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి వినయ్ -
హైవే నిర్మాణం..
భూసార పరీక్ష.. పంటకు రక్ష సాగుకు ముందు భూసార పరీక్షలు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. వివరాలు 9లో uచెట్లు మాయంరామాయంపేట(మెదక్): మెదక్– రామాయంపేట మధ్య 20 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వేల సంఖ్యలో ఏళ్ల క్రితం నాటిన చెట్లు ఉండేవి. ఈదారిలో ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉండేది. ఈక్రమంలో మెదక్ నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణానికి మూడేళ్ల క్రితం కేంద్రం రూ. 882 కోట్లు మంజూరు చేసింది. పనులు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. అ యితే రోడ్డు పక్కన ఏళ్ల క్రితం నాటిన పెద్ద పెద్ద చెట్లను నిర్మాణంలో భాగంగా తొలగించారు. కూకటివేళ్లతో సహా పెకిలించి మరో చోట నాటడానికి ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నా అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోలేదు. రామాయంపేట మండల పరిధిలోని అటవీప్రాంతంలో నాలుగున్నర కిలోమీటర్లు తప్పించి, ఇతర చోట్ల చెట్ల తొలగింపు ప్రక్రియ దాదాపు పూర్తి అయింది. అనుమతులు వస్తే అటవీ ప్రాంతంలో చెట్లను కూడా పూర్తిస్థాయిలో తొలగించి పనులు ప్రారంభిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మెదక్, రామాయంపేట, సిద్దిపేట మధ్య రోడ్డు పక్కన చెట్లను నరికివేయగా, రహదారి బోసిపోయింది. అటవీలో పరుచుకున్న పచ్చదనం సైతం త్వరలో కనుమరుగు కానుందని పర్యావరణ ప్రేమికులు తల్లడిల్లుతున్నారు. -
‘బడిబాట’కు సన్నద్ధం
పాపన్నపేట(మెదక్): జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కోసం విద్యాశాఖ సన్నద్ధం అవుతుంది. పండగ వాతావరణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రైవేట్, బడిబయట పిల్లలే లక్ష్యంగా నమోదు కార్యక్రమం చేపట్టనుంది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచేలా.. తల్లిదండ్రులను ఆకట్టుకునేలా చదువుల పండగ కొనసాగనుంది. ఇప్పటికే అన్ని పాఠశాలలను ఆధునీకరించే దిశగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డిజిటల్ బోధనలకు అనుకూలంగా క్లాస్ రూంలు తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలో 876 ప్రభుత్వ పాఠశాలలుండగా, 61,533 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా కొన్ని గ్రామాల్లో టీచర్లు ముందస్తు బడిబాట ప్రారంభించారు. ప్రభుత్వ బడుల బలోపేతం ప్రభుత్వ బడిని బతికించుకునే దిశగా విద్యాశాఖ భగీరథ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పభుత్వ బడులను పరిపూర్ణ వికాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. ప్రైవేట్కు ధీటుగా డిజిటల్ క్లాసులు ప్రారంభించింది. 50 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ, ఏఎక్స్ఎల్ ల్యాబ్లు ఆరంభించింది. డిజిటల్ పాఠాల కోసం ఇప్పటికే 176 పాఠశాలల్లో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బాండ్ సర్వీసుల సౌకర్యం కల్పించగా, మరో 300 పాఠశాలల కోసం ప్రతిపాదనలు పంపారు. ఐఎఫ్పీ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్) బోర్డులతో బోధన కొనసాగిస్తున్నారు. ఈఏడాది ఖాన్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్తో సైన్స్, గణితం పాఠాలు బోధించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని బడులకు కలర్లు వేశారు. ప్రతి పాఠశాలకు ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు పంపిణీ చేశారు. కనీస సామర్థ్యాల సాధన దిశగా ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇచ్చారు.కార్యక్రమాలు ఇలా.. జూన్ 6న స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయడం. 7న టీచర్లు ప్రతి ఇంటికి వెళ్లి బడీడు పిల్లలను గుర్తించడం. 8, 9, 10 తేదీల్లో కరపత్రాల పంపిణీ, డ్రాపౌట్ పిల్లల గుర్తింపు. 11న అప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష. 12న పాఠ్య, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహణ 16న తరగతి గదుల్లో అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్లు వేసి, పిల్లలు తయారు చేసిన చార్టులు ప్రదర్శించాలి. ఎఫ్ఎల్ఎన్ క్విజ్ పోటీలు పెట్టాలి. 17న సమీకృత విద్య, బాలికా విద్యా దినోత్సవం నిర్వహణ 18న తల్లిదండ్రులకు తరగతి గదుల డిజిటలీకరణ, ఆధునిక సౌకర్యాలు చూపాలి 19న బడిబాట ముగింపు, విద్యార్థులకు క్రీడా పోటీల నిర్వహణ జూన్ 6 నుంచి 19 వరకు నిర్వహణ కార్యాచరణ రూపొందించిన విద్యాశాఖ జిల్లాలో 876 పాఠశాలలు, 61,533 విద్యార్థులుసర్కారు బడికి పంపండి రూ. వేలు పోసి చదువులు కొంటారా..! ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటారా !! తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి. సర్కార్ బడికి పంపండి మీ పిల్లల భవిష్యత్, బాధ్యత మాది. ఆధునిక పద్ధతుల్లో డిజిటల్ విద్యను, ఏఐ టెక్నాలజీతో జోడించి, విలువలు గల చదువులు నేర్పి, బంగారు భవిష్యత్ను ఇస్తాం. స్థాయికి తగిన సామర్థ్యాలను నేర్పుతాం. 1 నుంచి 10 వరకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది. క్వాలిఫైడ్ టీచర్లతో ఉత్తమ బోధన అందిస్తాం. – రాధాకిషన్, డీఈఓ -
కొనుగోళ్లలో కొర్రీలు రైతన్న వెతలు
అల్లాదుర్గం(మెదక్): అన్నదాతలు దగా పడుతున్నారు. యాసంగి ధాన్యం విక్రయించేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయంలో కొర్రీలు పెడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. లారీ లోడ్ ధాన్యం లేదని.. రైస్మిల్లు టార్గెట్ అయిపోయిందని.. మ్యాచర్ రాలేదని.. ఇలా రకరకాల సాకులు చెబుతుండటంతో లబోదిబోమంటున్నారు. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ కొనుగోలు కేంద్రంలో పీఏసీఎస్ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వర్షాలతో మ్యాచర్ రాక అవస్థలు పడుతుంటే, మరో వైపు మ్యాచర్ వచ్చినా, లారీ ధాన్యం లేదంటూ కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారి మ్యాచర్ చెక్ చేసి వచ్చిందని చెప్పి 10 రోజులు గడిచినా.. ధాన్యం కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. కొనుగోలు చేయమని అధికారులు, పీఏసీఎస్ చైర్మన్ను వేడుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయమై పీఎసీఎస్ సిబ్బందిని వివరణ కోరగా.. కేంద్రంలో 100 బస్తాలు మాత్రమే ఉన్నాయని, లారీ లోడ్ లేదని, అందుకే కొనుగోలు చేయడం లేదని తెలిపారు. స్థానిక రైస్మిల్లు వారు టార్గెట్ అయిపోయిందని ధాన్యం బస్తాలు దించుకొవడం లేదన్నారు. సిద్దిపేట మిల్లుకు బస్తాలు తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. లారీ లోడ్ ఉంటేనే కొంటామని షరతు మ్యాచర్ రాలేదని మెలిక లబోదిబోమంటున్న అన్నదాత -
మెరుగైన వైద్యం అందించండి
మనోహరాబాద్(తూప్రాన్): ఆస్పత్రికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోజువారీగా ఓపీ ఎలా ఉంటుందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట వైద్యులు వినోద, సూపర్వైజర్ పల్లవి, ఫార్మసిస్ట్ సురేష్కుమార్, ఏఎన్ఎం మాధవి, శ్రవణ్ ఉన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
నిబంధనల పట్టింపు ఏది?
రాయికోడ్(అందోల్): జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై నిబంధనల పట్టింపులేకుండా వ్యవహరించడమేమిటని కేంద్ర తనిఖీ బృందం పంచాయతీ రాజ్ శాఖ అధికారులను నిలదీశారు. దీంతో సంబంధిత అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లునమిలారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్వహించిన పనులను తనిఖీ చేసేందుకు ఆదివారం రాయికోడ్కు గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ అధికారులు సంజయ్కుమార్ తదితరులు వచ్చారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో నిర్మించిన టాయిలెట్స్, వంట గది, ప్రహరీలను, పలు మెటల్, ఫార్మేషన్ రోడ్లను పరిశీలించారు. ఎక్కడా నిబంధనలు పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బృందం పర్యటిస్తుంటే రాష్ట్ర, జిల్లా అధికారులు పీఆర్డీఈ తదితరులు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈజీఎస్ నిధుల వినియోగంలో కనీస నిబంధనలు పాటించకపోవడంపై వివరాలు నమో దు చేసుకున్నారు. నివేదికను తమ శాఖకు నివేదించనున్నట్లు తెలిపారు. ఉపాధి పనులపై కేంద్రం బృందం నిలదీత -
కేతకీలో కోటి జపయజ్ఞం
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో ఆలయ ఆవరణలో విశ్వ మానవ ధర్మ ప్రచారం పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం శివ మంత్ర కోటి జపయజ్ఞం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఆవరణలో ‘దేశ రక్షణ–ధర్మ శిక్షణ’సంకల్పంతో యజ్ఞం, పూర్ణాహుతి, మహా మంగళ హారతి తదితర పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో దత్తగిరి మహరాజ్ ఆశ్రమ పీఠాధిపతి గిరి మహారాజ్, ధనసిరి పీఠాధిపతి వీరేశ్వర శివాచార్య మహాస్వామి, రంజోల్ రాజయోగ ఆశ్రమ పీఠాధిపతి రాజయ్య స్వామి, కేతకీ ఆలయ పాలకమండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఆలయ ఈఓ శివ రుద్రప్ప, మాజీ చైర్మన్ నీల వెంకటేశం, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. -
అందుబాటులో కేఎన్ఎం 1638 వరి విత్తనం
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి వద్ద గల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో కేఎన్ఎం 1638 సన్నరకం వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, శాస్త్రవేత్తలు రవికుమార్, డాక్టర్ ప్రతాప్రెడ్డి తెలిపారు. 20 కిలోల బస్తా రూ. 1,060 లభిస్తుందన్నారు. ఎన్ఎం 1638 సన్నరకం వరి విత్తనాల పంటకాలం 135 రోజులు కాగా, అగ్గితెగులు, ఉల్లికోడును సమర్థవంతంగా తట్టుకుంటుందని చెప్పారు. ఎకరాకు 28 నుంచి 30 క్వింటాళ్లు దిగుబడి వస్తుందన్నారు. వానాకాలం, యాసంగి రెండు పంటలకు అనుకూలమని వివరించారు. జూన్ 2 నుంచి రైతులకు విత్తనాలను విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ‘భూభారతి’పై అవగాహన అవసరం పాపన్నపేట(మెదక్): గ్రామీణ రైతాంగం భూ భారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని హైకోర్టు న్యాయవాది శ్రీకాంత్ సూచించారు. ఆదివారం మండల పరిధిలోని పొడిచన్పల్లి తండాలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 1168, కొత్తపల్లి పరిధిలోని సర్వే నంబర్ 342లో కొంతమంది రైతులు పాత పాస్ పుస్తకాలు కలిగి ఉండి, భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ రైతు భరోసా, బీమా వంటి పథకాలు అందడం లేదని చెప్పారు. ఈ సమస్యలను ప్రో బోనోగా స్వీకరించి న్యాయపరంగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నిరుపేదలకు న్యాయం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు నల్లపు మణిదీప్, చంద్రకుమార్, గణే ష్, పలువురు రైతులు, గ్రామస్తులు త దితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా గ్రామ పాలన అధికారి పరీక్ష మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రామ పాలన అధికారి పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఆర్ఓ భుజంగరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షకు 104 మంది దరఖాస్తు చేసుకోగా, 79 మంది హాజరైనట్లు చెప్పారు. మరో 25 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమాదేవి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్, తహసీల్దార్ లక్ష్మణ్బాబు, పోలీస్ అధికారులు ఉన్నారు. ‘వారిపై చర్యలు తీసుకోండి’ కొమురవెల్లి(సిద్దిపేట): దళితబంధు పేరుతో గత ప్రభుత్వంలో డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ డిమాండ్ చేశారు. ఆదివారం లెనిన్నగర్లో దళితబంధు పథకం కోసం బీఆర్ఎస్ నాయకుడికి డబ్బులు ఇచ్చి మోసపోయిన దాసరి హరిబాబును పరామర్శించారు. -
రైతులను మోసం చేస్తే చర్యలు
మెదక్ మున్సిపాలిటీ: నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంగా పని చేసి రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా జరగకుండా చూడాలన్నారు. ఆరుగాలం కష్టపడే రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత విత్తన సంస్థలు, డీలర్లు, వ్యాపారులపై ఉందన్నారు. రైతులకు నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరంగా కేసులు నమోదు చేస్తా మని హెచ్చరించారు. ముందస్తుగా రైతులతో సమావేశాలు నిర్వహించి చైతన్య పర్చాలన్నారు. గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో స ంబంధం ఉన్నవారిపై నిఘా ఉంచాలని ఆదేశించా రు. రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండి నాణ్యమైన కంపెనీ విత్తనాలు ఎంచుకోవాలన్నారు. లేబుళ్లు, ప్యాకింగ్ లేని విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. నకిలీ విత్తనాల గురించి, అనుమానిత బ్రోకర్లు, డీలర్ల గురించి పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డి -
బేస్మెంట్ పూర్తికాగానే డబ్బులు
కౌడిపల్లి(నర్సాపూర్)/కొల్చారం: ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారులకు బేస్మెంట్ పూర్తి అయిన వెంటనే మొదటి బిల్లు అందజేస్తున్నామని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. శనివారం కౌడిపల్లిలో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 120 ఇళ్లకు మొదటి విడత రూ. 1 లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమచేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400 నుంచి 600 ఫీట్లలోపు ఇల్లును నిర్మించుకోవాలని సూచించారు. కాగా ఎక్కువ విస్తీర్ణంలో బేస్మెంట్ నిర్మించిన వారికి సైతం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. బేస్మెంట్ పరిధి ఎక్కువగా ఉన్న గోడలు 600 ఫీట్లలోపు నిర్మించే విధంగా అంగీకార పత్రం రాసిస్తే మొదటి విడత బిల్లు మంజూరు చేస్తామని వివరించారు. ఆయన వెంట సీనియర్ అసిస్టెంట్ బలరాం ఉన్నారు. అనంతరం కొల్చారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు.జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం -
మిగిలిన సీట్ల భర్తీకి 27న కౌన్సెలింగ్
నర్సాపూర్: నర్సాపూర్లోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల కాలేజీలో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 27న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ శ్రీనివాస్రాయ్ తెలిపారు. మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తామని, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట తీసుకొని రావాలన్నారు. ఇతర వివరాలకు 8790724953, 8639898246 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. గోహత్యలను అరికట్టండి మెదక్జోన్: గోవుల అక్రమ రవాణాను అరికట్టి గోహత్యలు జరగకుండా చూడాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ అన్నారు. ఈ మేరకు శనివారం పలువురు కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్, మెదక్ పట్టణ పోలీస్స్టేషన్లో వినతిపత్రాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా చుట్టూ చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి గో అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం నేతలు బబ్బులు, సాయి, రాహుల్, ప్రశాంత్, పండరి, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్యల బలోపేతానికి చర్యలు రామాయంపేట(మెదక్): మహిళా సమాఖ్యల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డీపీఎం జాన్ కెన్నడీ అన్నారు. శనివారం రామాయంపేటలోని ఐకేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచి ంచారు. అనంతరం మండల సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా రేణుక, కార్యదర్శిగా హారిక, కోశాధికారిగా రచన ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఏపీఎం రాములు, సీసీలు వెంకట్రాములు, అమృత, చెన్నమ్మ, అకౌంటెంట్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. కేవీకేలో ఫార్మర్ హాస్టల్ కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి కేవీకేలో రూ. 84 లక్షలతో నిర్మిస్తున్న ఫార్మర్ హాస్టల్ పనులను శనివారం ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) చైర్మన్ డాక్టర్ పీవీరావు పరిశీలించారు. ఎక్సాన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనుల నాణ్యతలో రాజీపడొద్దని సూచించారు. కార్యక్రమంలో కేవీకే కోషాధికారి రాఘవరావు, కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, శాస్త్రవేత్తలు రవికుమార్, శ్రీనివాస్, ప్రతాప్రెడ్డి, ఉదయ్కుమార్, సైట్ ఇంజనీర్ జానకీరాం తదితరులు పాల్గొన్నారు. అన్నదాత ‘వరి’ గోస హవేళిఘణాపూర్(మెదక్): ధాన్యం కొనాలని మాచవరం గ్రామానికి చెందిన అన్నదాతలు రోడ్డెక్కారు. శనివారం మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ధాన్యం కుప్పలు పోసి రోజుల తరబడి ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి వడ్లు తడిసి మొలకెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పకడ్బందీగా నిర్వహించాలి మెదక్జోన్: గ్రామపాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. ఇదే విష యమై శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో ఆర్డీఓ రమాదేవి, కలెక్టరేట్ ఏఓ యూనస్, తహసీల్దార్ లక్ష్మణ్బాబు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్, డీఆర్వో భుజంగరావు తదితరులుపాల్గొన్నారు. -
పట్టుకుంటే బంగారమే!
సాంప్రదాయ వ్యవసాయంతో నష్టాలు చవిచూస్తున్న రైతులు మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకంతో ప్రతి నెల ఆదాయం ఆర్జించవచ్చు. తక్కువ సమయంలోనే అధికంగా లాభాలు పొందవచ్చు. అయితే జిల్లాలో కేవలం మల్బరీ సాగు 95 ఎకరాల్లో ఉండగా, పట్టు పురుగుల పెంపకానికి 20 షెడ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికై నా చిన్న, సన్నకారు రైతులు సబ్సిడీలతో పాటు, తక్కువ పనితో ఎక్కువ ఆదాయం ఆర్జించే పట్టు పురుగుల పెంపకంపై ఆసక్తి చూపాలని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. – చిలప్చెడ్(నర్సాపూర్) చిన్న, సన్నకారు రైతులకు పట్టు పురుగుల పెంపకం సులభమైనది. ఒక్కసారి పెట్టుబడితో కొన్నేళ్ల వరకు లాభాలు ఆర్జించవచ్చు. కేంద్ర ప్రభుత్వం షెడ్డు నిర్మాణానికి రూ. 2.4 లక్షల సబ్సిడీతో పాటు, ఎకరా మల్బరీ మొక్కలకు రూ. 30 వేల రాయితీ ఇస్తుంది. మొక్కల ఎదుగులకు అనువైన నేలలు ఉండి, పట్టు పురుగుల పెంపకానికి అనుకూలమైన వాతావరణం ఉంటే నాణ్యమైన కకూన్స్ (పట్టు పురుగులు అల్లుకున్న గూళ్లు) వస్తాయి. దీంతో అధిక లాభాలు పొందవచ్చు. పట్టు పురుగుల గుడ్లు తెచ్చిన నాటి నుంచి 30 రోజుల్లో బ్యాచ్ పూర్తవుతుంది. రెండెకరాల మల్బరీ సాగుతో బ్యాచ్కు రూ. లక్ష వరకు అదాయం వస్తుంది. చాకి పెంపకం (పట్టు పురుగుల గుడ్ల నుంచి వచ్చే పిల్లల)తో మరింత ఆదాయం సంపాదించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో 30 వేల డీఎఫ్ఎల్ చాకీ పెంపకం పిల్ల పురుగుల ధర రూ. 3,500 ఉంటే, మాములు గుడ్లు రూ. 1,300 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన కకూన్స్ ధర క్వింటాల్కు రూ. 50 వేలు ఉంది. ప్రభుత్వం కిలోకు రూ. 75 అదనంగా చెల్లిస్తుంది. అయితే నాలుగేళ్లుగా అదనపు డబ్బులు చెల్లించడం లేదు. రాష్ట్రంలో హైదరాబాద్లోని తిరుమలగిరి, జనగాంలో పట్టు పరుగుల కకూన్స్ కొనుగోలుకు మార్కెట్లు ఉన్నాయి. నాణ్యతను బట్టి వాటికి ధర ఉంటుంది. మేలు రకం కకూన్స్కు వందశాతం డబ్బులు చెల్లిస్తారు.జిల్లాలో 95 ఎకరాల్లోమల్బరీ సాగు సబ్సిడీ, ఆదాయం ఉన్నాఆసక్తి చూపని రైతులు ముందుకు రావాలని అధికారుల సూచన రైతులకు మంచి అవకాశం జిల్లాలో పట్టు పురుగుల పెంపకం చాలా తక్కువ. రైతులు ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణం. పట్టు పురుగుల పెంపకంతో అధిక లాభాలు గడించవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు సెరికల్చర్ మంచి అవకాశం. పైగా ప్రభుత్వం సబ్సిడీ సైతం ఇస్తుంది. ఒక్కసారి పెట్టుబడితో ఎన్నో ఏళ్లుగా లాభాలు గడించవచ్చు. ఇప్పటికై నా రైతులు ముందుకు రావాలి. – ప్రతాప్సింగ్, జిల్లా ఉద్యాన అధికారిప్రతీ నెల డబ్బులు సేంద్రియ ఎరువులతో మల్బరీ సాగు చేస్తున్నా. పట్టు పురుగులకు లేత మల్బరీ ఆకులు మేతగా వేస్తే నాణ్యమైన కకూన్స్ వస్తాయి. పట్టు పురుగుల పెంపకంతో నెల నెల రాబడి వస్తుంది. సంవత్సరంలో తొమ్మిది బ్యాచ్లు పూర్తయ్యాయి. ఏది ఏమైనా రెండెకరాలు మల్బరీ సాగుతో తయారైన బ్యాచ్తో ఖర్చులు అన్నీ పోనూ. రూ. 80 వేలు మిగులుతుంది. – జూపల్లి జ్యోతిర్మయి, రైతు, చిలప్చెడ్ -
అడ్మిషన్ ప్లీజ్
కిక్కిరిసిన తునికి ఎంజేపీకౌడిపల్లి(నర్సాపూర్): బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం మండలంలోని తునికి ఎంజేపీ (మహాత్మ జ్యోతిబా పూలే) బీసీ గురుకులంలో శనివారం నిర్వహించిన కౌన్సెలింగ్కు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్సీఓ గౌతంకుమార్రెడ్డి, గురుకుల ప్రిన్సిపాల్ హరిబాబు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 979 బ్యాక్లాగ్ సీట్లు ఉండగా, ఉమ్మడి జిల్లా నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కౌన్సెలింగ్ కోసం వచ్చిన వారి వాహనాలు జాతీయ రహదారికి ఇరువైపులా నిలపడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎస్ఐ రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. -
జిల్లాలో మందకొడిగా ధాన్యం సేకరణ
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. సెంటర్లు ప్రారంభించి రెండు నెలలు కావొస్తున్నా వడ్ల సేకరణ పూర్తి కాకపోవడంతో రైతులు రోజుల తరబడి కల్లాల వద్దే జాగారం చేస్తున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకెత్తుతుండటంతో అరిగోస పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. – మెదక్జోన్● వెంటాడుతున్న అకాల వర్షాలు ● ఇంకా 1.20 లక్షల మెట్రిక్ టన్నులుకేంద్రాల్లోనే.. ● ఆందోళనలో అన్నదాతలుజిల్లావ్యాప్తంగా యాసంగిలో 2.95 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, కొనుగోలు కేంద్రాలకు 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకనుగుణంగా జిల్లాలో 498 సెంటర్లను ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించారు. అందులో 92 కేంద్రాలను ప్రత్యేకంగా సన్నధాన్యం సేకరణ కోసం, 406 సెంటర్లను దొడ్డు ధాన్యం కోసం ఏర్పాటు చేశారు. కాగా దొడ్డు రకం ధాన్యం కోసం ఏర్పాటు చేసిన 406 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 155 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేశారు. సన్నాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన 92 కేంద్రాలు అలాగే కొనసాగుతున్నాయి. సేకరించింది 2.60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నేటికీ 55 రోజులు అయింది. ఇప్పటివరకు రైతుల నుంచి 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అందులో దొడ్డుకరం 2,14,634 మెట్రిక్ టన్నులు కాగా, సన్నాలు 46,110 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రూ. 426.52 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. బోనస్ డబ్బులు ఎప్పుడో..? కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ ధాన్యానికి రూ. 2,320 చొప్పున మద్దతు ధర చెల్లిస్తుండగా, సన్నధాన్యం కోసం ప్రభుత్వం అదనంగా ఇచ్చే క్వింటాల్కు రూ. 500 బోనస్ డబ్బులు మాత్రం ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. సన్నధాన్యం 46,110 మెట్రిక్ టన్నులు రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించారు. ఇందుకు సంబంధించి క్వింటాల్కు రూ. 2,320 చొప్పున మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ కలిపితే క్వింటాల్కు రూ. 2,820 అవుతుంది. అయితే బోనస్ డబ్బులు ఇవ్వకుండా కేవలం మద్దతు ధరను మాత్రమే రైతు ఖాతాల్లో జమచేస్తున్నారు. ఇప్పటివరకు విక్రయించిన ధాన్యానికి రైతులకు చెల్లించాల్సిన బోనస్ డబ్బులు రూ. 23.6 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఎప్పుడు చెల్లిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత వానాకాలంలోనూ బోనస్ డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరగటంతో అన్నదాతలు ఇబ్బంది పడ్డారు. ఈసారి అలా కాకుండా సకాలంలో చెల్లించాలని కోరుతున్నారు.జిల్లా వివరాలు ఇప్పటివరకు సేకరించిన ధాన్యం 2.60 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా కొనాల్సింది 1.20 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తయిన సెంటర్లు 155వారంలో పూర్తి చేస్తాం: కలెక్టర్ చిన్నశంకరంపేట(మెదక్): మరో వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శనివారం మండలంలోని అంబాజీపేటలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. రైతులకు వెంట వెంటనే డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు. సన్న వడ్ల బోనస్ కూడ త్వరలో అందనుందని వివరించారు. అదనంగా హమాలీలతో పాటు 150 లారీలను సమకూర్చినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట తహసీల్దార్ మన్నన్ ఉన్నారు. -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
నర్సాపూర్: మండల లీగల్ సర్వీస్ కమిటీ నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జూనియర్ సివిల్ జడ్జిహేమలత ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కోర్టు పరిధిలోని ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీఓలతో పాటు పలుశాఖల అధికారులతో కోర్టులో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మండల లీగల్ సర్వీస్ కమిటీని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. వాటిని లీగల్ సర్వీస్ కమిటీ ఫ్రీ లిటిగేషన్ కేసుగా నమోదు చేసి సంబంధిత మండలస్థాయి అధికారులకు, వ్యక్తులకు నోటీసులు జారీ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సకాలంలో స్పందించకపోతే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.జూనియర్ సివిల్ జడ్జి హేమలత -
చెక్కుల పంపిణీ రసాభాస
● ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు తూప్రాన్: పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ముందుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను మాజీ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారని తెలిపారు. దీంతో కేసీఆర్ విషయం ఈ సమావేశంలో చర్చించవద్దని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో కాసేపు రసాభాస చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్సీ తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా అపేశారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్రెడ్డి, భూంరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మామిళ్ల జ్యోతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అనాథలకు ఆర్థిక సహాయం
పాపన్నపేట(మెదక్): ‘బడికి సెలవులంటేనే భయం’ శీర్షికన గతంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి టీచర్లు స్పందించారు. శనివారం కుర్తివాడలోని పిల్లలు లావణ్య, అనురాధ, నవీన్ వద్దకు వెళ్లి రూ. 26 వేల ఆర్థిక సహాయం అందజేశారు. పీఆర్టీయూ పాపన్నపేట శాఖ పిలుపు మేరకు మండల ఉపాధ్యాయులంతా తలా కొంత పోగు చేసి ఆర్థిక సహాయం చేశారు. పిల్లల కనీస అవసరాల కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల పీఆర్టీయూ అధ్యక్షుడు రాజు, కార్యదర్శి సురేష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అంజనాచారి, ఉపాధ్యక్షుడు రవీందర్రెడ్డి, కార్యదర్శి జనార్దన్, జిల్లా కార్యదర్శి స్వామి, మండల అసోసియేట్ అధ్యక్షుడు సంతోష్ కుమార్, మండల కార్యదర్శి నాగేశ్వర్, సాయిలు, మధుసూదన్, సీఆర్పీ దేవయ్య పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
తూప్రాన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, మాజీ జాతీయ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన సంవిధాన్ బచావో ర్యాలీకి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అనంతరం గ్రామ, మండల స్థాయి కమిటీల కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి తదితరులు హాజరయ్యారు.ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్ -
ఇందిరమ్మ ఇళ్లు
నిమ్జ్ నిర్వాసితులకుసభావేదికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. చిత్రంలో కలెక్టర్ క్రాంతి, మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కార్, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మాణిక్రావు తదితరులుమహిళలను కోటీశ్వరుల్ని చేస్తాం మంత్రి కొండా సురేఖ సంగారెడ్డి జోన్: ప్రతీ మహిళను కోటీశ్వరుల్ని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రభుత్వం చేపట్టి ప్రతీ కార్యక్రమంలో మహిళలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించి, ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా మహిళా సంఘాలకు రుణాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. త్వరలో పెట్రోల్ బంక్ల నిర్వహణ కూడా వారే నిర్వహించబోతున్నారని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికే భూభారతి మంత్రి దామోదర రాజనర్సింహ గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో రైతులు అనేక భూ సమస్యలు ఎదుర్కొన్నారని, వాటిని పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చి పరిష్కారం దిశగా కృషి చేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అప్పటి కాంగ్రెస్ హయాంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. హైదరాబాద్ తర్వాత అభివృద్ధి జరిగేది జహీరాబాద్ ప్రాంతమేనని వెల్లడించారు. పారిశ్రామిక అభివృద్ధి దిశగా ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ జహీరాబాద్ నియోజకవర్గ పారిశ్రామిక అభివృద్ధి రంగంలో దూసుకుపోతోందని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జహీరాబాద్ ప్రాంతానికి నిమ్జ్ వచ్చిందని గుర్తు చేశారు. ప్రారంభంలో మూడు వేల ఎకరాలు సేకరిస్తే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భూ సేకరణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని వి మ ర్శించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో భూ సేకరణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రూ. 250 కోట్లతో 100 ఎకరాల విస్తీర్ణంలో చెరుకు రైతుల సమస్య పరిష్కారానికి పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పట్టాలిచ్చే ప్రత్యేక బాధ్యతలు జగ్గారెడ్డికి అప్పగిస్తున్నా సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిమ్జ్లో భూములు కోల్పోతున్న 5,612 నిర్వాసిత కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్రెడ్డి హామీనిచ్చారు. ఈ నిర్వాసితులకు పట్టాలు అందించే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అప్పగిస్తున్నానన్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం రూ.494 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రేవంత్రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. 2014 తర్వాత మెదక్ జిల్లాతో పాటు, నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. నిమ్జ్ నిర్వాసితుల సమస్యలను మంత్రి దామోదర రాజనర్సింహ తన దృష్టికి తెచ్చారని, వెంటనే అధికారులను పిలిచి నిర్వాసితులకు న్యాయం చేసేలా నష్టపరిహారం పెంచాలని ఆదేశించామన్నారు. జంట నగరాలకు తాగునీరు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగునీరు అందిస్తున్న సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రస్తావించిన రేవంత్రెడ్డి వీటికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. చెరుకు రైతుల సమస్య పరిష్కరిస్తాం జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు రైతుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. సహకార రంగంలో చక్కెర కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన పదెకరాల భూమిని నిమ్జ్లో కేటాయించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఇక్కడ పది లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన చక్కెర కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హుందాయ్ ఇదే నిమ్జ్లో తన యూనిట్ స్థాపన పనులను త్వరలోనే ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ కంపెనీకి 450 ఎకరాలు భూమిని కేటాయించామన్నారు. జిల్లాలోని రెండు జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అండర్ పాస్ల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఆదర్శనీయుడు బసవేశ్వరుడు గౌతమ బుద్ధుని తర్వాత బసవేశ్వరుడు ఆదర్శనీయుడని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆ రోజుల్లో అనుభవ మండపాలను ఏర్పాటు చేసి అన్ని సామాజికవర్గాల ప్రజలకు న్యాయం జరగేలా చేసిన విశ్వగురువు బసవేశ్వరుడన్నారు. అప్పటి అనుభవ మండపాల మాదిరిగానే ఇప్పుడు అసెంబ్లీ.. పార్లమెంట్లను నిర్వహించుకుంటున్నామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధిపై త్వరలో సమీక్ష జిల్లాలోని జహీరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యను పరిష్కరించి ఈ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని ఎన్నికలయ్యాక అందర్నీ కలుపుకుని పోతామన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీకి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. 150 ఎకరాల భూమిని కేటాయించి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామన్నారు. చెక్డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఇచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డిఇందిరమ్మకు మెదక్తో విడదీయలేని అనుబంధం.. మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు విడదీయలేని అనుబంధం ఉందని రేవంత్ పేర్కొన్నారు. ఇందిరమ్మ తన చివరి శ్వాస వదిలేవరకు మెదక్ ఎంపీగా కొనసాగారని గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ భాగారెడ్డి, ఈశ్వరీబాయిలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు చేసుకుంటారు. గీతారెడ్డి హయాంలోనే జహీరాబాద్కు నిమ్జ్ మంజూరు చేయించారని పేర్కొన్నారు. మినీ ఇండియాగా పేరున్న పటాన్చెరు ప్రాంతంలో బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్, నిమ్జ్ ఇవన్నీ కాంగ్రెస్ అధికారంలో వచ్చినవేనని గుర్తు చేశారు. ఈ అభివృద్ధిని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామన్నారు. మెదక్ సాగు, తాగునీరు, పరిశ్రమల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. కో–ఆపరేటివ్ సెక్టార్లో చక్కెర పరిశ్రమ త్వరలో హుందాయ్ కార్ల పరిశ్రమ పనులు ప్రారంభం సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం స్పాట్గా అభివృద్ధి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు నిధులు బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
ఇళ్లు నిర్మించిన వెంటనే బిల్లులు ఇస్తాం
రేగోడ్(మెదక్): ఇళ్లు నిర్మించిన వెంటనే బిల్లులు చెల్లిస్తామని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం చౌహాన్ అన్నారు. మండల కేంద్రమైన రేగోడ్లో ఇందిరమ్మ మోడల్ గృహ నిర్మాణ పనులను శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోనే రేగోడ్లో మోడల్ గృహ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయని చెప్పారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ యాదగిరి, ఏఈ ప్రియ, కాంట్రాక్టర్ శంకరప్ప తదితరులు పాల్గొన్నారు. నేడు భగీరథ నీటి సరఫరాలో అంతరాయం నర్సాపూర్: మిషన్ భగీరథ నీటి సరఫరాలో శనివారం అంతరాయం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బోర్పట్ల సబ్స్టేషన్లో మరమ్మతులు నిర్వహించనున్న నేపథ్యంలో పంపింగ్ నిలిపివేస్తున్నట్లు చెప్పారు. దీంతో నల్లాల ద్వారా నీటి సరఫరా కావని, ప్రజలు సహకరించాలని కోరారు. మహిళా సమాఖ్యల బలోపేతం పెద్దశంకరంపేట(మెదక్): మహిళా సమాఖ్యల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సెర్ప్ డీపీఎం మోహన్ అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట సీ్త్రశక్తి భవన్లో మండల సమాఖ్య కార్యవర్గ ఎన్నికలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకొని అర్థికంగా, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందాలని సూచించారు. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా జోడు మాధవి, కార్యదర్శిగా బాలమణి, కోశాధికారిగా పద్మ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఏపీఎం గోపాల్, సీసీలు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. పిల్లలకు పోషకాహారం అందించండి: డీడబ్ల్యూఓ కౌడిపల్లి(నర్సాపూర్): పిల్లల్లో పోషకాహారలోపం లేకుండా చూడాలని డీడబ్ల్యూఓ హైమా వతి అంగన్వాడీలకు సూచించారు. శుక్రవారం మండలంలోని దేవులపల్లి, భుజి రంపేట అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పిల్లల ఎత్తు, బరువు పరిశీలించారు. అనంతరం తల్లులతో మాట్లాడి పిల్లల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పోష కాహార లోపం లేకుండా చేసేందుకు ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా పోషకాహారం పంపిణీ చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ మండల సూపర్వైజర్ ఖమర్సుల్తానా, అంగన్వాడీ టీచర్లు అనురాధ, మహేశ్వరీ పాల్గొన్నారు. 91 మంది గైర్హాజరు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం రెండో రోజు 91 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్కు పరీక్షకు 1,061 మంది హాజరుకావాల్సి ఉండగా, 970 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. టైలరింగ్లో ఉచిత శిక్షణ సంగారెడ్డి టౌన్: పురుషులకు టైలరింగ్లో ఉచిత శిక్షణ కల్పించనున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ డైరెక్టర్ వంగ రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని 18 నుంచి 45 ఏళ్లు పురుషులు ఈ నెల 31 నుంచి నెల రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు సంగారెడ్డి బైపాస్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం, 97044 46956, 94901 29839 సంప్రదించాలని సూచించారు. -
సిబిల్.. గుబుల్!
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు సిబిల్ గుబులు పట్టుకుంది. సిబిల్ స్కోర్తో సంబంధం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. దరఖాస్తులను సిబిల్ స్కోర్తో ముడిపెడుతూ అర్హుల ఎంపిక చేపడుతున్నారు. దీంతో అసలు రుణం వస్తుందా? లేదా? అనే అనుమానం నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిపి మొత్తం 32 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంలో రూ. లక్ష నుంచి రూ. 4 లక్షల వరకు సబ్సిడీ రుణాలను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నచ్చి న యూనిట్ను ఎంపిక చేసుకొని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆయా మండలాల ఎంపీడీఓలతో పాటు మున్సిపల్ కార్యాలయాల్లో సంబంధిత పత్రాలను అందజేశారు. వాటిని స్వీకరించిన అధికారులు బ్యాంకర్లకు పంపించారు. ప్రస్తుతం వారు లబ్ధిదారుల సిబిల్ స్కోర్ను పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగానే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియలో నిమగ్నమైనట్లు తెలిసింది. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోర్ తో సంబంధం లేదని ప్రకటింటినా, బ్యాంకర్లు అవేం పట్టించుకోవడం లేదు. అనర్హులుగా తేలే అవకాశం! బ్యాంకు లావాదేవీలు చేసే ప్రతి ఒక్కరికీ సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. రుణం తీసుకునే సమయంలో దీన్ని ప్రామాణికంగా పరిగణించి.. సదరు వ్యక్తి అర్హతను నిర్ధారిస్తారు. బ్యాంకులో తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోయినా.. పాతబకాయి కోసం వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్నా.. ఇలా అనేక రకాల పద్ధతులపై సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రాజీవ్ యువవికాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మెజార్టీ ప్రజలు సిబిల్ స్కోర్కు అర్హత సాధించే అవకాశం లేదని చర్చ జరుగుతోంది. చాలా మంది బ్యాంకుల ద్వా రా పంట రుణం తీసుకున్న వారు ఉన్నారు. రుణమాఫీ అవుతుందని సకాలంలో చెల్లించని వారు ఉన్నారు. దీంతో వారు అర్హత కోల్పోయే అవకాశం ఉంది. అదే జరిగితే జిల్లావ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 32 వేల మందిలో కేవలం 8 వేల మంది మాత్రమే అర్హులుగా తేలే అవకాశం ఉందని తెలుస్తోంది.గందరగోళంగా‘రాజీవ్ యువ వికాసం’ ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్న బ్యాంకర్లు అయోమయంలో దరఖాస్తుదారులు జిల్లావ్యాప్తంగా 32 వేల దరఖాస్తులు స్కోర్ ప్రామాణికంగానే రుణాలు రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన దరఖాస్తులను క్షుణంగా పరిశీలిస్తున్నాం. ముఖ్యంగా దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్ను పరిగణలోకి తీసుకుంటున్నాం. సిబిల్ స్కోర్ ను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. – మూర్తి, లీడ్ బ్యాంక్ మేనేజర్, మెదక్ -
పాపన్నపేటలో చిరుత కలకలం!
పాపన్నపేట(మెదక్): మండల కేంద్రమైన పాపన్నపేటలో శుక్రవారం చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని వెంకటేశ్వర గుట్ట పరిసర ప్రాంతంలో చిరుతను పోలిన పాదముద్రలు కనిపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. నెలరోజుల క్రితం ఇదే గుట్టకు ఆవతలి వైపున దౌలాపూర్ శివారులో సైతం చిరుత కనిపించింది. అయితే శుక్రవారం కనిపించిన రెండు పాదముద్రలను బట్టి, ఒకటి తల్లి, మరొకటి పిల్ల చిరుతగా స్థానికులు భావిస్తున్నారు. దీంతో అటువైపు పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. ఈ విషయమై డీఎఫ్ఓ జోజిని వివరణ కోరగా తమ సిబ్బందిని పంపుతామని తెలిపారు. అయితే సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ పరిశీలించి పాదముద్రలు చిరుతలా కనిపించడం లేదన్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. -
గుణాత్మక విద్యను అందించాలి
కలెక్టర్ రాహుల్రాజ్ తడిసిన ధాన్యం కొనుగోలు చేయండిబీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డిపాపన్నపేట(మెదక్): సామర్థ్యాలను పెంపొందించి విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం పాపన్నపేటలో నిర్వహిస్తున్న టీచర్ల శిక్షణను సందర్శించి మాట్లాడారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, గణితం రావాలని చెప్పారు. మారుతున్న కాలానుగుణంగా బోధనా పద్ధతులను ఆధునీకరించాలని సూచించారు. ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో విద్యార్థికి నేర్పినప్పుడే శిక్షణ అర్థవంతమవుతుందని వివరించారు. ఆయన వెంట డీఈఓ రాధాకిషన్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, ఎంఈఓ ప్రతాప్రెడ్డి, ఆర్పీలు ఉన్నారు. అనంతరం ఆగ్రోస్ రైతు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు అనధికారిక డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సబ్సిడీపై విత్తనాలు దొరుకుతాయని చెప్పారు. విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రసీదు తప్పకుండా పొందాలన్నారు. విత్తనాలను అధిక ధరకు విక్రయించరాదని హెచ్చరించారు. ఆయన వెంట వ్యవసాయ అధికారి నాగమాధురి ఉన్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మెదక్ కలెక్టరేట్: జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకంపై ఉక్కుపాదం మోపేందుకు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో పోలీస్, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ జాయింట్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్, వ్యవసాయ శాఖల దేనిని స్పష్టం చేశారు. అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ ద్వా రా సమన్వయంతో పని చేస్తామని తెలిపా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, పోలీస్, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. పాపన్నపేట(మెదక్): తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మండల పరిధిలోని నాగ్సాన్పల్లిలో ధాన్యాన్ని పరిశీలించారు. వెంటనే కలెక్టర్కు ఫోన్ చేసి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకలు రావడంతో రైతులు ఆందోళనకు గురువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి మొదట తడిసిన ధాన్యాన్ని లారీలు, ట్రాక్టర్లలో తరలించాలన్నారు. నాగ్సాన్పల్లిలో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నా పట్టించుకునే వారే లేరని వాపోయారు. ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి కూడా చూసిన పాపాన పోలేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోకపోతే రైతు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఆమె వెంట బీఆర్ఎస్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు సోములు, మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ విష్ణువర్ధన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
బస్సులు నడపండి.. బాధలు తీర్చండి
మెదక్ మున్సిపాలిటీ: పలు రూట్లలో బస్సులు నడపాలని కోరుతూ పలువురు ప్రయాణికులు శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎంకు విన్నవించారు. మెదక్ నుంచి వెల్పుగొండ మీదుగా రేగోడ్కు, మెదక్ నుంచి టేక్మాల్, బొడ్మట్పల్లి మీదుగా జోగిపేట, సంగారెడ్డి. పటాన్చెరుకు, అలాగే ఉదయం 6 గంటలకు మాచారం మీదుగా జేబీఎస్ వరకు, టేక్మాల్ నుంచి నర్సాపూర్కు బస్సు నడపాలని కోరారు. ఈసందర్భంగా డిపో మేనేజర్ సురేఖ ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు. -
తగ్గిన శిశు మరణాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో శిశు మరణాలు తగ్గాయి. 2020లో 541 మంది చిన్నారులు మృతి చెందితే అందులో మగవాళ్లు 285, ఆడవాళ్లు 256 మంది ఉన్నారు. 2021లో 427 మంది చిన్నారులు మృతి చెందగా అందులో మగ వారు 234, ఆడ శిశువులు 193 మంది ఉన్నారు. రెండేళ్లలో ఆడ శిశువులు తక్కువగానే మృతి చెందారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో శిశు మరణాలు తగ్గాయని చెప్పవచ్చు. 2021లో శిశు మరణాలు జిల్లా మగ ఆడ మొత్తం మెదక్ 148 119 267 సిద్దిపేట 20 19 39 సంగారెడ్డి 66 55 121 -
లారీలు రావు.. బస్తాలు పోవు
ఆగ్రహించి రోడ్డెక్కిన రైతులుకొల్చారం(నర్సాపూర్): వారం రోజులుగా కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోవడం, అకాల వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసి మొలకలు రావడంతో ఆగ్రహించిన పైతర గ్రామానికి చెందిన రైతులు బుధవారం ఆందోళన దిగారు. రంగంపేట పీఏసీఎస్ ఎదురుగా మెదక్– జోగిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనుగోలు కేంద్రంలో ఇప్పటికే తూకం వేసిన 5 వేల ధాన్యం బస్తాలు తరలించేందుకు లారీలు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు బస్తాల్లోని ధాన్యం మొలకెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గంట పాటు సాగిన రాస్తారోకోతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఎస్ఐ మహమ్మద్ గౌస్ రైతుల వద్దకు చేరుకొని లారీలు వచ్చేలా చూస్తామని నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు. -
మెతుకుసీమపై ప్రత్యేక ముద్ర
హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్జోన్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే 2024 జూలైలో మెదక్ జిల్లాకు ఎస్పీగా బదిలీపై వచ్చారు. ఉదయ్కుమార్కు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. నెలకోసారి సొంత గ్రా మంలోని పొలాలను సందర్శిస్తారు. ఆ మక్కువతోనే జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం చుట్టూ 60 ఎకరాలకు ఫెన్సింగ్ వేయించి అందులో రకరకాల మొక్కలు నాటి పెంచుతున్నారు. ఇప్పటివరకు 1,000 మొక్కలు నాటించి వాటికి డ్రిప్ ఇరిగేషన్ వేయించారు. అలాగే జిల్లాలో ఫైరింగ్ రేంజ్ను, జిల్లా పోలీస్ కార్యాలయ పరిధిలోనే సిబ్బందికి అవసరమయ్యే పరేడ్ ఏర్పాటు చేయించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నూతనంగా మెదక్ టౌన్లో ట్రాఫిక్ వింగ్ను కొత్తగా ఏర్పాటు చేశారు. జిల్లాలో పనిచేసే పోలీసులు, హోంగార్డ్ సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి పోస్టల్ ఎన్ఐసీని తీసుకునే విధంగా చొరవ చూ పారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత గ్రామం రామచంద్రాపురంలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. -
స్వస్థలం.. చదువు.. కుటుంబ నేపథ్యం
కమ్యూనిటీ పోలీసింగ్ అవార్డు అందుకుంటూ..ఉదయ్కుమార్ది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాంచంద్రాపురం గ్రామం. తల్లిదండ్రులు దేవరపల్లి సామ్రాజ్యం– సుబ్బారెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబం. ఆయనకు సోదరి అరుణ ఉన్నారు. సొంత గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు, 6, 7 తరగతులు సమీప గ్రామమైన సుర్దెపల్లికి కాలినడకన వెళ్లి చదువుకున్నారు. 8, 9 నేలకొండపల్లి.. పదో తరగతి నల్గొండ జిల్లా కోదాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. ఇంటర్ నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ (బీఏ) కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పట్టా పొందారు. ఈక్రమంలో 1986లో అరుణతో వివాహం జరిగింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక టీచర్ కావాలని అనుకున్నారు. ఉద్యోగ వేటలో భాగంగా 1991లో ఎస్సైగా మొదటి ప్రయత్నంలో ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీ 1991 బ్యాచ్లో షూటింగ్లో ప్రథమస్థానం సాధించి అప్పటి హోం మంత్రి మైసూరారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు సాధన ప్రస్తుతం అమెరికాలో స్థిరపడగా, కుమారుడు సంతోష్రెడ్డి సివిల్ ఇంజినీర్గా హైదరాబాద్లో విధులు నిర్వర్తిస్తున్నారు. -
చిరస్మరణీయుడు రాజీవ్గాంధీ
నర్సాపూర్ రూరల్: రాజీవ్గాంధీ చిరస్మరణీయుడని, ఆయన ఆశయ సాధనకు యువత కృషి చేయా లని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. బుధవారం పార్టీ క్యాంపు కార్యాలయంలో రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్గాంధీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. యువత రాజకీయాల్లోకి రావాలని అనేక కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్గుప్తా, నాయకులు శ్రీనివాస్గౌడ్, లలిత, నగేష్, సురేందర్, శ్రీశైలం యాదవ్, మల్లేష్ యాదవ్, రషీద్, రవి, సురేష్, అజ్మత్, కార్యకర్తలు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
ఆదర్శనీయుడు అంబేడ్కర్
చిన్నశంకరంపేట(మెదక్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ గమనాన్ని మార్చిన గొప్ప నాయకుడని, ఆయన మార్గదర్శనం ఆదర్శనీయమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం మండలంలోని గజగట్లపల్లిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభ్యున్నతిలో అంబేడ్కర్ పాత్ర గొప్పదన్నారు. ఆయన ముందుచూపు వల్లే నేడు దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, నాయకులు తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, పట్లోరి రాజు, బండారు స్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్లు జితేందర్గౌడ్, మల్లికార్జున్గౌడ్, మాజీ సర్పంచ్లు రవీందర్, కుమార్గౌడ్, యాదగిరి, లక్ష్మణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు నర్సాపూర్ రూరల్: కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి హేమలత హె చ్చరించారు. బుధవారం మండలంలోని చిప్పల్తుర్తిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశానికి వెన్నముక లాంటి రైతులను మోసం చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే ముందు నాణ్యత ప్రమాణాలు చూసుకోవాలని సూచించారు. ప్రతి రైతు సేంద్రియ ఎరువులను వాడి పంటలు సాగు చేస్తే ప్రజల ఆరోగ్యంతో పాటు మంచి లాభాలు ఉంటాయన్నారు. రైతులు పంట సాగులో వచ్చే సమస్యలతో పాటు ఆర్థిక కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని అన్నారు. పేద రైతులకు చట్టపరమైన సమస్యలు ఉంటే ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. సాంకేతికతను జోడిస్తూ బోధించాలి మెదక్ కలెక్టరేట్: బోధనలో అత్యాధునిక సాంకేతికతను జోడించి బోధన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకుడు భాస్కర్దేశ్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు సన్న ద్ధం అయినట్లు తెలిపారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆసక్తి కలిగేలా అత్యాధునిక సాంకేతిక పద్ధతులను బోధనలో వినియోగించాలని వివరించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, కోర్స్ కో ఆర్డినేటర్, హెచ్ఎం రేఖ, రిసోర్స్ పర్సన్లు మహేందర్, రాజ్కుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మెదక్ కలెక్టరేట్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి జరగనున్నాయి. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 130 మంది ఇన్విజిలెటర్లను కేటాయించారు.ఫస్ట్ ఇయర్లో 3,626 మంది, సెకండ్ ఇయర్లో 2,214 మంది కలిపి మొత్తం 5,840 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సీసీ కెమెరాల నిఘాలో కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. -
క్యూఆర్కోడ్ సిటిజన్ లో ప్రథమం
ఉత్తమ పోలీస్స్టేషన్లుగా నర్సాపూర్, తూప్రాన్మెదక్ మున్సిపాలిటీ: పోలీసుల పనితీరు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్ర పోలీస్శాఖ ఈ ఏడాది నిర్వహించిన క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజన్ సర్వేలో జిల్లా మొదటిస్థానంలో నిలిచినట్లు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్టిఫికేషన్ కార్యక్రమంలో జిల్లా నుంచి అదనపు ఎస్పీ మహేందర్ హాజరై సర్టిఫికెట్ అందుకున్నట్లు చెప్పారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్లో రాష్ట్రంలోనే 10 ఉత్తమ పోలీస్స్టేషన్లలో నర్సాపూర్కు 1వ స్థానం,తూప్రాన్కు 4వ స్థానం వచ్చినట్లు వివరించారు. ఆయా పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు డీజీపీ చేతుల మీదగా సర్టిఫికెట్లు అందుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా పోక్సో కేసుల్లో 60 రోజుల్లోపే ఎక్కువగా చార్జిషీట్లు వేసినందుకు తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి రాష్ట్రంలోనే రెండో స్థానం పొంది అదనపు డీజీపీ అనిల్కుమార్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నట్లు పేర్కొన్నారు. -
పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి
మెదక్ మున్సిపాలిటీ: పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి పోలీస్ సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పెండింగ్ కేసులపై పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... సమస్యలతో స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులకు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. గ్రామాల్లో సీసీటీవీల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, వెంకట్రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, ఎఆర్ డీఎస్పీ రంగానాయక్,టౌన్ సీఐ నాగరాజు, సీఐ రేణుక, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి -
సిందూర్ను విమర్శించేవారు మూర్ఖులు
మెదక్జోన్: ఆపరేషన్ సిందూర్ను విమర్శించే మూర్ఖులకు ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఎంపీ రఘునందన్రావు అన్నారు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని గుల్షన్ క్లబ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు త్రివర్ణ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. హిందువులను టార్గెట్ చేస్తూ భర్తలను చంపి వారి భార్యల నొదుట సిందూరం తుడిచిన ముష్కరులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సిందూర్ అని పేర్కొన్నారు. భారతదేశం ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో ప్రపంచానికి మన సైన్యం సత్తా ఏంటో సిందూర్ ద్వారా చూపించిందన్నారు.ఎంపీ రఘునందన్రావు -
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు
వానాకాలం సీజన్లో 3.50 లక్షల ఎకరాల్లో సాగు ● 3 లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి ● ఈసారి సన్నాలు పెరిగే అవకాశం? ● ఉన్నతాధికారులకు నివేదిక అందజేతమెదక్జోన్: వానాకాలం సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు ఖరారు చేశారు. ఈనెల 19న సాక్షి దినపత్రికలో ‘ఖరారు కానీ ఖరీఫ్ ప్రణాళిక‘ అనే కథనం ప్రచురితం కావటంతో స్పందించిన అధికారులు పంటల ప్రణాళికను సిద్ధం చేశారు. సరిపడ ఎరువులు, విత్తనాలపై ఉన్నతాధికారులకు సైతం నివేదిక అందజేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల పంటలు 3,50,164 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అందులో సింహాభాగం వరి ఏకంగా 3,05,100 ఎకరాల్లో సాగు కానుంది. 2వ స్థానంలో పత్తి 37,200 ఎకరాల్లో సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. వరి, పత్తి పంటలు 3,42,300 ఎకరాల్లో సాగు అవుతుండగా మిగతా 7,864 ఎకరాల్లో మాత్రమే ఇతర పంటలు సాగవనున్నాయి. కాగా గత 2024 వానాకాలం సీజన్లో వరి, పత్తితో పాటు అన్ని రకాల పంటలు 3,43,399 ఎకరాల్లో సాగు కాగా ఈ ఏడు 6,765 ఎకరాల్లో అధికంగా సాగవుతుంది. పంటల సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాల ప్రణాళికను ఉన్నతాధికారులకు నివేదించారు. గణనీయంగా పెరగనున్న సన్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 వానాకాలం సీజన్ నుంచి సన్నాలు సాగు చేసిన రైతులకు అదనంగా క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తోంది. దీంతో రైతులు సన్నాల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో వరి 3,05,100 ఎకరాల్లో సాగు కానుండగా అందులో 40శాతం సన్నాలను వేసే అవకాశం ఉంది. అంటే 1.20 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అంతే కాకుండా మరో 50 వేల ఎకరాలకు పైగా వరి విత్తనాలను సాగు చేసే అవకాశం లేకపోలేదు. కొంత కాలంగా జిల్లాలో పలు రకాల వరి విత్తన కంపెనీలు రైతులతో సాగు చేయిస్తున్నారు. ఒక్కో ఎకరాకు రూ. 70 వేల నుంచి రూ.లక్ష వరకు సదరు కంపెనీలు రైతుకు ఇచ్చి సాగు విత్తనాలను పండిస్తున్నారు. దీంతో రైతులు విత్తనాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టితో కానీ పంటలు దెబ్బతింటే సదరు కంపెనీ రైతుతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పరిహారం అందజేస్తారు. దీంతో రైతులు వరి విత్తన సాగును విరివిగా పండిస్తున్నారు. వర్షాధారంగానే పత్తి సాగు వానాకాలం అత్యధికంగా సాగయ్యే పంటల్లో పత్తి పంట రెండవది. జిల్లా వ్యాప్తంగా 37,200 ఎకరాల్లో సాగు అవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇది ఎక్కువగా జిల్లాలోని పెద్దశంకరంపేట, రేగోడు, అల్లాదుర్గ్, టేక్మాల్ మండలాల్లో సాగవుతుంది. ఈ పంటను పూర్తిగా వర్షాధారంగా సాగు చేయటం గమనార్హం. సాగు చేసే రైతులకు పంట చేతికందే వరకు నమ్మకం ఉండదు. అతివృష్టి , అనావృష్టితో పాటు పంట చేతికందే దశలోనూ వర్షం కురిస్తే పత్తి నల్లబడి పోయే ప్రమాదం ఉంది. ఈ పంట సాగు చేయటానికి ప్రధాన కారణం సరైనా సాగునీటి సౌకర్యం లేక పోవడమేనని రైతులు చెబుతున్నారు.పంటల సాగు ఎకరాల్లో.. వరి 3,05,100 పత్తి 37,200 మొక్కజొన్న 2,640 కందులు 1,500 పెసర్లు 1,500 మినుములు 550 జొన్నలు 100 రాగులు 40 ఆముదం 120 సోయాబీన్ 140 చెరుకు 50 నల్లజొన్నలు 60 కూరగాయలు 708 ఆయిల్ పామ్ 456విత్తనాలు క్వింటాళ్లు వరి 91,530 పత్తి (ప్యాకెట్స్) 74,400 కందులు 90 మొక్కజొన్న 264 జొన్నలు 6 మినుములు 33 పెసర్లు 90 ఎరువులు మెట్రిక్ టన్నుల్లో యూరియా 25,000 డీఏపీ 1,912 ఎంఓపీ 2,118 కాంప్లెక్స్ 28,400 ఎస్ఎస్పీ 615 -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్లో అసంఘటిత రంగ కార్మికులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తున్నారని, 12 గంటల పనిని చట్టబద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, నాయకులు బాలనర్సు, సాయిలు, శౌకత్ అలీ, హలీమ్, రాజు, కృష్ణ, కుమార్, కొమరయ్య, గట్టయ్య, రెడ్డి, అమృత, బాలమ్మ, రాజు, మల్లేశం, యాదగిరి, కృష్ణ, మైపాల్, షాకీర్ పాల్గొన్నారు.సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా -
ఉపాధిపై సామాజిక తనిఖీ
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని తొమ్మిది గ్రామ పంచాయతీల పరిధిలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై నార్సింగి మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ నిర్వహించారు. మంగళవారం నార్సింగి ఎంపీడీఓ ఆనంద్ అధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు, డీవీఓ శ్రీహరిగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు గ్రామాల వారీగా పనుల వివరాలతో పాటు అవకతవకలు వివరించారు. బీమ్రావుపల్లిలో సీనియర్ మెట్ నిబంధనలకు విరుద్ధంగా కుటుంబ సభ్యుల పేరుతో పనిచేసినట్లు మస్టర్లో రాశారని, జప్తిశివనూర్లో ఆదివారం కూడా పనిదినాలు కల్పించినట్లు రికార్డు చేసినట్లు వివరించారు. వల్లూర్లో పనిచేసిన వారికి డబ్బులు చెల్లించలేదని, నార్సింగిలో ఏడు రోజులు పనిచేసిన 162 మందికి డబ్బులు చెల్లించకపోవడంతో ఉపాధి కూలీలు నష్టపోయారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా డీఆర్డీఏ పీడీ మాట్లాడుతూ సిబ్బంది నుంచి రూ.21,911 రికవరి పెట్టామని, రూ.20 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి దామోదర్రెడ్డి, ఈజీఎస్ ఏపీఓ రాజేశ్వర్, సామాజిక తనిఖీ బృందం ఎస్ఆర్పీ తిరుపతి,హెచ్ఆర్ రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూ.21,911 రికవరి, రూ.20 వేల జరిమానా డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు వెల్లడి