Medak District News
-
పల్లె పోరు హడావుడి
గాజులపల్లి టూ ఢిల్లీ తెలుగు భాష మీద ఉన్న అభిమానం యువకుడిని సిద్దిపేట డిగ్రీ కళాశాల నుంచి ఢిల్లీ దాకా నడిపించింది. వివరాలు 10లో uశనివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2025చిన్నశంకరంపేట(మెదక్): పంచాయతీ సమరంలో తామే ముందు వరుసలో ఉండాలని నాయకులు తహతహలాడుతున్నారు. ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడంతో ఎప్పుడైనా నోటిఫికేషన్ రా వొచ్చని భావిస్తున్న నాయకులు విందులు, విహారయాత్రలకు తెరలేపారు. జిల్లాలో ఎక్కడ చూసిన స్థానిక సంస్థల ఎన్నికల గురించే చర్చంచుకుంటున్నారు. ప్రభుత్వం గ్రామసభలు పూర్తి చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టిన కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటున్నారు. దీంతో పల్లెల్లో నాయకులు తమకు మద్దతుగా కలిసి రావాలని ఇప్పటినుంచే మచ్చిక చేసుకుంటున్నారు. నార్సింగి మండలంలోని ఒక గ్రామంలో పదవిపై కన్నేసిన అధికార పార్టీకి చెందిన నాయకుడు గ్రా మంలో వంద మందిని తన వెంట విహారయాత్రకు తీసుకెళ్లాడు. ఇది గమనించిన అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు అమ్మవారి మొక్కు పేరిట పెద్ద విందును ఏర్పాటుచేశారు. తామేమి తక్కువ అంటూ మరో నాయకుడు తన పొలం వద్ద మొక్కు పేరుతో పెద్ద దవాత్ ఇచ్చి మద్దతుదారులను ప్రసన్నం చేసుకున్నాడు. చిన్నశంకరంపేట, నార్సింగి, చేగుంట లాంటి పెద్ద పంచాయతీలలో పోటీదారులు ఓట ర్లను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కోసం అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ఉన్న ప్లాట్లను అమ్మి మరి డబ్బులు పోగు చేసుకుంటున్నారు. అలాగే ఎన్నికల బరిలో ఉంటామనుకున్న నాయకులు సంక్రాంతి పండుగను చక్కగా వినియోగించుకున్నారు. కొందరు యువతను ప్రసన్నం చేసుకునేందుకు కబడ్డీ, క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయగా.. మరికొందరు పండగ రోజు తమకు కావాల్సిన వారిని ఒక చోటకు పిలిచి దవాత్ ఏర్పాటు చేశారు. అవకాశం కలిసొస్తే తప్పకపోటీలో ఉంటామని, మద్దతుగా నిలబడాలని ముందస్తుగా మాట తీసుకున్నారు. మరికొందరు మాత్రం సైలెంట్గా తాము పోటీదారులమేనని చెప్పకనే చెప్పుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఇలా ఖర్చు పెడితే గెలిచాక ఊరును అమ్ముకుంటారా అని పలువురు వ్యగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. న్యూస్రీల్ ఎవరికి వారే అభ్యర్థులుగా ప్రచారం విందులు.. విహారయాత్రలతో ప్రసన్నం ఇప్పటికే సంక్రాంతి క్రీడా పోటీల నిర్వహణ -
తాగునీటి సమస్య పరిష్కరిస్తా
హవేళిఘణాపూర్(మెదక్): నియోజకవర్గం పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పాతూర్–శమ్నాపూర్ తండాకు రోడ్డు నిర్మాణం, ఔరంగాబాద్ తండా నుంచి పాతూర్ వరకు రోడ్డు నిర్మాణం, హవేళిఘణాపూర్లో మినరల్ వాటర్ ప్లాంట్, ఫరీద్పూర్లో సహకార సంఘ భవన దుకాణ సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువ జన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పరుశురామ్గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, శ్రీకాంత్, మొండి పద్మారావు, రాము, శేఖర్, ఫరీద్పూర్ సొసైటీ చైర్మన్ బ్రహ్మం, సీఈవో అమీర్, మాజీ సర్పంచ్ బ్రహ్మం తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
కౌడిపల్లి(నర్సాపూర్): అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. శుక్రవారం కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డులు, అధికారుల హాజరుతోపాటు ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ డేటా ఎంట్రీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రైతుభరోసా అర్హులందరికి అందుతాయని పేర్కొన్నారు. జాబితాలో పేర్లుంటే మంజూరు అయినట్లు కాదని, గ్రామసభలో ఆమోదం పొందాల్సిందేనని చెప్పారు. ప్రజాపాలన నిరంతర ప్రక్రియ అని, ఇంకా అర్హులు ఉంటే గ్రామాలలో లేదా మండల కార్యాయలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రంగాచార్యులు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్లా పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ ఎల్లయ్య -
అన్నిరంగాల్లో ముందుండాలి
మెదక్ కలెక్టరేట్: అమ్మాయిలు అన్నిరంగాల్లో ముందుండాలని, వారి ఆరోగ్య సంరక్షణకు పౌష్టికాహారం తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి హైమావతి సూచించారు. బేటి బచావో– బేటి పడావో పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బేటి బచావో బేటి పడావో పథకం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం షీటీం సేవలను సంబంధిత అధికారి విజయ్ విద్యార్థినులకు వివరించారు. అత్యవసర సమయాల్లో 1098, 100, 181 నంబర్లలో సంప్రదించాలన్నారు. అనంతరం భరోసా అడ్వకేట్ శ్వేత బాలికల చట్టాల గురించి వివరించారు.డీడబ్ల్యూఓ హైమావతి -
వేగం కన్నా.. ప్రాణం మిన్న
మెదక్ కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ: వేగం కన్నా.. ప్రాణం మిన్న అని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. వాహనదారులు అన్నిపత్రాలు కలిగి ఉండాలని, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దన్నారు. జిల్లాలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ బంక్లో పెట్రోల్ సైతం పోయరని.. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే జిల్లాలో అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అన్నిశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా శకటాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, అధికారులకు ప్రశంస పత్రాలు అందించడానికి జాబితా ఇవ్వాలన్నారు. అనంతరం ఈ– ఆఫీస్ అమలుపై అధికారులతో సమీక్షించారు. పేపర్, ప్లాస్టిక్, ఎలక్ట్రిక్ లెస్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అలాగే నేడు జిల్లా కేంద్రంలో నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ఇంటర్మీడియెట్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గర పడుతున్నందున తల్లిదండ్రులు విద్యార్థులను ఫోన్, టీవీ, సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేలా పర్యవేక్షించాలన్నారు. ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేసి వెనుకబడిన విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా విభజించి బోధన చేయాలని ఆదేశించారు. డేటా నమోదు కీలకంహవేళిఘణాపూర్(మెదక్): ఆన్లైన్ డేటా ప్రక్రియ ఎంతో కీలకమని, ఎలాంటి తప్పుల్లేకుండా జాగ్రత్తతో నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం హవేళిఘణాపూర్ రైతు వేదికలో రేషన్కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అభ్యంతరాల డేటా ఎంట్రీని పరిశీలించారు. గ్రామ సభల్లో వచ్చిన ప్రతీ ఫిర్యాదు, దరఖాస్తు వివరాలను ఆన్లైన్లో నమో దు చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు అనుకూలంగా ఉన్న డైట్ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించొద్దు కలెక్టర్ రాహుల్రాజ్ -
మాకు మాఫీ ఏదీ..?
● మేనేజర్తో రైతుల వాగ్వాదం ● బ్యాంకు ఎదుట నిరసన శివ్వంపేట(నర్సాపూర్): రుణమాఫీ కాకపోవడంతో రైతులు శుక్రవారం బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. శివ్వంపేట మండల పరిఽధి గుండ్లపల్లికి చెందిన పలువురు రైతులు దొంతిలోని యూనియన్ బ్యాంకులో పంట రుణాలు తీసుకున్నారు. అయితే.. తమకు నేటికీ రుణమాఫీ కాలేదని రైతులు సదానందం,వెంకటేశంగౌడ్, సత్యగౌడ్, సత్తయ్య, సత్యనారాయణరెడ్డి తదితరులు ఆరోపించారు. పింఛన్ డబ్బుల కోసం బ్యాంక్కు వస్తే పంట రుణం బకాయి కింద ఖాతాను హోల్డ్లో పెట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లు చెబుతున్నప్పటికీ అమలులోకి రాలేదని వాపోయారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ అమృతపాఠక్తో వాగ్వాదానికి దిగారు. అనంతరం బ్యాంకు ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్నత చదువుతోనే గుర్తింపుఐసీడీఎస్ సీడీపీఓ హేమభార్గవి శివ్వంపేట(నర్సాపూర్): ఉన్నత చదువుతోనే ఆడపిల్లలకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఐసీడీఎస్ సీడీపీఓ హేమభార్గవి, కస్తూర్బా గాంధీ ప్రిన్సిపాల్ మంజుల అన్నారు. మండల పరిధి గూడూర్ కస్తూర్బా గాంధీ వసతిగృహంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లలు ఆత్మస్థైర్యంలో అనుకున్న లక్ష్యం వైపు ముందుకు వెళ్లాల్సిందిగా సూచించారు. ఆడ పిల్లల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు సంతోష, వసుమతి, తదితరులు ఉన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలుసిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తూప్రాన్: ప్రజా పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతితో కలిసి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ కాంస్య విగ్రహం, 12వ వార్డులో బటర్ఫ్లై లైట్లు, 10వ వార్డులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రేవంత్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, కృష్ణ, విశ్వరాజ్, నాగులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. హింసాత్మక ఘటనలను ఉపేక్షించం: ఐజీ పటాన్చెరు టౌన్: ఎట్టిపరిస్థితుల్లోనూ హింసాత్మక ఘటనలను ఉపేక్షించేది లేదని హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ రూపేశ్, డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ వినాయక్రెడ్డితో కలసి శుక్రవారం పటాన్చెరు పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం మీడియాతో ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ...పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి కేసులో 43 మందిపై కేసు నమోదు చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుశాఖ రాజీ పడదని స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలను చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. -
ఆత్మీయ భరోసాకు ఆంక్షలు వద్దు
నర్సాపూర్ రూరల్: భూమిలేని రైతు కూలీలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పెద్దచింతకుంటలో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, రేషన్ కార్డులు అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇవ్వాలని కోరారు. అయితే ఎమ్మెల్యే మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేని మండిపడ్డారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదంతో జరగగా ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఐ లింగం పోలీస్ సిబ్బందితో ఇరువర్గాలను శాంతింపజేశారు. ఇదిలా ఉండగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడటం సరికాదని టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. ప్రజాపాలన గ్రామసభలు అర్హులను గుర్తించడం కోసమే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శివకుమార్, మాజీ ఎంపీటీసీ నర్సింగ్రావు, షేక్ హుస్సేన్, జీవన్రెడ్డి, జితేందర్రెడ్డి, రింగుల ప్రసాద్, భిక్షపతిగౌడ్, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది కోతల ప్రభుత్వం.. కౌడిపల్లి(నర్సాపూర్): అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. శుక్రవారం కౌడిపల్లిలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులందరికీ రుణమాఫీ చేయకుండానే రూ. 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని సీఎం, మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది చేతల ప్రభుత్వం కాదని, కోతల ప్రభుత్వమని అన్నారు. కేసీఆర్ పాలనలో అర్హులందరికీ రైతుబంధు ఇచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, మాజీ ఎంపీపీ రాజు, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రామాగౌడ్, నాయకులు పోల నవీన్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు -
నిధులు రాలె.. పనులు కాలె
ప్రగతిలో వెనుకబడిన మున్సిపాలిటీలు ● ఈనెల 26తో ముగుస్తున్న పాలకవర్గాల గడువుజిల్లాలోని పలు మున్సిపాలిటీలు నిధులు కొరతతో ప్రగతిలో వెనుకబడ్డాయి. మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమయ్యాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయలేకపోయామని అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ పాలకవర్గాల గడువు ఈనెల 26తో ముగుస్తుండటంతో వారి పదవీ కాలంలో చేపట్టిన పనులు, ఇబ్బందులపై ఆయా మున్సిపాలిటీల చైర్మన్లతో ‘సాక్షి’ ముఖాముఖి..నర్సాపూర్: ఆయా పథకాల కింద ప్రభుత్వం నుంచి రూ. 55 కోట్ల నిధులు మంజూరైనా సకాలంలో విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ఏడాది పదవీ కాలంలో అనుకున్న పనులు చేపట్టలేకపోయామని మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్ అన్నారు. శుక్రవారం ‘సాక్షి’తో పలు అంశాలను వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ పదవికి 2023 డిసెంబర్లో మురళీయాదవ్ రాజీనామా చేయగా, గతేడాది జనవరి 27న బాధ్యతలు చేపట్టా. వార్డుల్లో సుమారు రూ. మూడున్నర కోట్లతో సీసీ రోడ్లు నిర్మించా. ప్రధానంగా మున్సిపల్ కార్యాలయానికి కొత్త భవనం, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ యార్డు, దోబీఘాట్ సుమారు రూ.10 కోట్లతో నిర్మించినా సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో మూడు భవనాలు అసంపూర్తిగానే మిగిలాయి. రాయరావు చెరువు సుందరీకరణతో పాటు బోటింగ్ సదుపాయం, పట్టణంలోని జాతీయ రహదారిపై డివైడర్లు, స్టేడియం నిర్మాణంతో పాటు పట్టణంలోని పలు ప్రధాన మార్గాలలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయనందున గుంతల రోడ్లపైనే ప్రజలు తిరగాల్సి వస్తుంది. పలు భవనాల నిర్మాణం చేపట్టినా నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. పట్టణంలో చేపట్టాల్సిన పనులపై ప్రణాళిక రూపొందించినా నిధులు రాకపోవడంతో చేపట్టలేకపోయాం. – అశోక్గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ రామాయంపేట(మెదక్): ఈ ఐదేళ్ల కాలంలో నిధుల కొరతతో తాను అనుకున్న అభివృద్ధి పనులు చేయలేకపోయానని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పలు అంశాలను వెల్లడించారు. పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆశయంతో చైర్మన్గా ఎన్నికై విఫలమయ్యా. ఐదేళ్ల పదవీకాలం తనకు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు. తాను ఇచ్చిన హామీలు సైతం నెరవేర్చలేకపోయా. తన హయాంలో సుమారు రూ. 15 కోట్ల మేర మాత్రమే అభివృద్ధి పనులు చేశా. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేక పోయా. పట్టణంలో గత 30 ఏళ్ల క్రితం నిర్మించిన రహదారులు పూర్తిగా శిథిలమయ్యాయి. ప్రధానంగా పట్టణంలోకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వెజ్, నాజ్ వెజ్ మార్కెట్ నిర్మాణం, మినీట్యాంక్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మించలేకపోయా. నమ్మిన ప్రజలకు న్యాయం చేయలేకపోయా. ఈ ఐదేళ్ల పాలన తనకు ఎంతమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కొంత మేర సహకారం ఇచ్చాయి. మున్సిపాలిటీ అభివృద్ధి విషయమై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయాలి. – జితేందర్గౌడ్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ ఏ మాత్రం సంతృప్తిగా లేనుఅసంపూర్తి పనులే మిగిలాయి -
అర్హులమైనా ఎంపిక చేయరా?
కొల్చారం(నర్సాపూర్): ఇల్లు ఉన్న వారికే కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంపై మండలంలోని కిష్టాపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలో గురువారం ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ నగేష్ హాజరయ్యారు. గ్రామసభ ప్రారంభం కాగానే తహసీల్దార్ గఫార్మియా గ్రామంలో ఇళ్ల మంజూరుకు సంబంధించిన పేర్లను చదువుతున్న క్రమంలో ఇప్పటికే ఇళ్లు ఉన్న వారి పేర్లే జాబితాలో ఉండడం, గుడిసెల్లో ఉంటున్న తమ పేర్లు ఎందుకు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి మమత అవినీతికి పాల్పడిందని, ఆమెను వెంటనే గ్రామం నుంచి పంపి వేయాలంటూ అదనపు కలెక్టర్తో వాగ్వాదానికి దిగారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో అదనపు కలెక్టర్ నగేష్ జోక్యం చేసుకొని జాబితాలో పేర్లు లేనివారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, తిరిగి సర్వే జరిపి అర్హులకే పథకాలు వర్తింపజేస్తామని ప్రజలకు నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయినప్పటికీ అక్కడి ప్రజలు శాంతించలేదు. పంచాయతీ కార్యదర్శిని చుట్టుముట్టి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోదావరి, పీఏసీఎస్ చైర్మన్ మల్లేశంగౌడ్ పాల్గొన్నారు. జాబితాలో పేర్లు లేకపోవడంపై ఆగ్రహం పంచాయతీ కార్యదర్శినిచుట్టుముట్టిన గ్రామస్తులు -
తెరపైకి‘ పేట’ ఆర్టీసీ డిపో!
రామాయంపేట(మెదక్): రాష్ట్రంలో కొత్తగా బస్ డిపోలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడంతో రామాయంపేట డిపో వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బస్డిపో ఏర్పాటు కోసం సుమారు 20 ఏళ్ల క్రితం స్థానికులు తారురోడ్డును ఆనుకుని ఉన్న విలువైన ఐదెకరాల స్థలాన్ని చదును చేసి ఇచ్చారు. అప్పుడు సీఎం హోదాలో చంద్రబాబునాయుడు, అప్పటి రవాణాశాఖ మంత్రి కేసీఆర్ సదరు స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో డిపో మంజూరు చేస్తామని ప్రకటించారు. ఆమేరకు ఆర్టీసీ వారు సదరు స్థలాన్ని సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని చుట్టూ హద్దులు ఏర్పాటుచేశారు. తరువాత ఈ విషయమై ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో విలువైన ఈ స్థలం అన్యాక్రాంతమవుతుంది. ఆర్టీసీ అధికారులు ఏర్పాటుచేసిన హద్దులను సైతం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. డిపో మంజూరు కోసం స్థానికులు పలుమార్లు అప్పటి ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణరావుకు వినతిపత్రాలు అందజేశారు. రామాయంపేట పరిసరాల్లో నిజాంపేట, నార్సింగి, చేగుంట, చిన్నశంకరంపేట, మాసాయిపేట, కామారెడ్డి జిల్లా బిక్కనూర్, దోమకొండ, బీబీపేట, సిద్దిపేట జిల్లా పరిధిలోని భూంపల్లి తదితర మండలాలు ఉన్నాయి. రామాయంపేటలో డిపో ఏర్పాటైతే చుట్టుపక్కల ఉన్న సుమారు 100 గ్రామాలకు రవాణా సదుపాయం ఏర్పడుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితమే ఐదెకరాల అందజేత ఇప్పటికీ మంజూరు కాని ఆర్టీసీ డిపో మంత్రి ప్రకటనతో మళ్లీ ఆశలు -
ఆ దరఖాస్తులు ఎటుపోయాయి?
నాగ్సాన్పల్లి గ్రామసభలో ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్/కౌడిపల్లి: ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేయకుండా కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం ఏమిటని, ప్రజాపాలన దరఖాస్తులు ఎటుపోయాయని ఎమ్మెల్యే సునీతారెడ్డి అధికారులను ప్రశ్నించారు. గురువారం మండలంలోని నాగ్సాన్పల్లి గ్రామసభకు ఎమ్మెల్యే హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శి లబ్ధిదారులు జాబితా చదవడంతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమకు రేషన్కార్డులు మంజూరు కాలేదని గ్రామస్తులు చెప్పారు. గ్రామసభకు ప్రత్యేక అధికారి, ఐబీ ఏఈ రవిమోహన్ గంట ఆలస్యంగా రావడంతో చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఎమ్మెల్యే ఆదేశించారు. చెరువు కట్టు కాలువకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం నర్సాపూర్లో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సభలలో ప్రజలు అధికారులను తిడుతున్నారని, పథకాలు తమకెందుకు మంజూరు చేయలేదని నిలదీస్తున్నారని తెలిపారు. జాబితాలో పేర్లు లేని వ్యక్తులు మళ్లీ దరఖాస్తు చేయాలనడం విచారకరమని అన్నారు. రైతు భరోసా ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని మాట మార్చారన్నారు. ఆత్మీయ భరోసా పథకంలో అనర్హుల పేర్లు ఉన్నాయని, వాటిని సరి చేసి అర్హులకు అందజేయాలని డిమాండు చేశారు. రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలు సరిగా లేవన్నారు. సమావేశంలో ఆయా మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, యాదాగౌడ్, సూరారం నర్సింలు, శ్రీనివాస్రెడ్డి, మహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
రేగోడ్(మెదక్)/అల్లాదుర్గం: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. మండలంలోని సిందోల్లో గురువారం జరిగిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి రాజకీయాలకతీతంగా అర్హులను పథకాలకు ఎంపిక చేయాలని సూచించారని చెప్పారు. ఏదైనా కారణంతో అర్హత ఉండి జాబితాలో పేర్లు రాకపోతే గ్రామసభలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా పథకంలో సాగుకు యోగ్యం కానీ భూములను తొలగించామని, సాగు భూములకే రైతు భరోసా వర్తింపచేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మూడు దఫాలుగా జాబితాలు తయారు చేశామన్నారు. మొదటి విడతలో ఇళ్ల స్థలాలు ఉండి అర్హత ఉన్న వారికి, రెండో జాబితాలో ఇళ్ల స్థలాలు లేని వారిని గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్, రుణమాఫీ చేసిందన్నారు. రూ. రెండు లక్షల పైన ఉన్న రుణాలు దశలవారీగా మాఫీ అవుతాయని వివరించారు. అనంతరం మర్పల్లి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి నూతన భవనంలోకి మార్చాలంటూ అధికారులను ఆదేశించారు. అనంతరం అల్లాదుర్గంకు మంజూరైన మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల, ఐటీఐ, ఫైర్స్టేషన్, ఐసీడీఎస్ ప్రాజెక్టు భవన నిర్మాణాల కోసం రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. నీటి సౌకర్యం, రవాణాపై తహసీల్దార్ మల్లయ్యను అడిగి తెలుసున్నారు. గ్రామానికి దగ్గరలో ప్రభుత్వం స్థలం ఉందా అని ఆరా తీశారు. కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్జీటీయూ
మెదక్ కలెక్టరేట్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం అన్నారు. గురువారం డీఈఓ రాధాకిషన్ చేతుల మీదుగా యూనియన్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా జిల్లాలోని పలు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. కొత్త మండలాలల్లో సామగ్రి, ఎంఈఓ కార్యాలయం సిబ్బందిని పూర్తిగా నియమించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఈఓ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూని యన్ జిల్లా అధ్యక్షుడు జంక అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిమల్లె జగన్, ఇతర సభ్యు లు పరశురాం, దివ్య, ఉపేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోండి కౌడిపల్లి(నర్సాపూర్): ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్ను విధుల నుంచి తొలగించాలని డీఆర్డీఓ శ్రీని వాసరావుకు గురువారం వెల్మకన్న గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ ముత్యాలు అవకతవకలకు పాల్పడుతున్నాడని తెలిపారు. గతంలో ఓసారి సస్పెండ్ అయిన తిరిగి విధుల్లో చేరాడన్నారు. ఇటీవల జరిగిన సామాజిక తనిఖీలో సైతం తిరిగి అధికారులు సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. మరోసారి అతడిని విధుల్లోకి తీసుకోకుండా చూడాలని అధికారులను కోరా రు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు రాజేందర్, ప్రకాష్, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు నవీన్గుప్త, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఏకపక్షంగా ఏర్పాటు చేశారని ఫిర్యాదు చేశారు. అన్ని అంశాలపై అవగాహన అవసరం: డీఈఓమెదక్ కలెక్టరేట్: విద్యార్థులు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. ఈనెల 25న జిల్లా కేంద్రంలో నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురు వారం మెదక్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. పోటీల్లో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవే ట్ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల వివరాలను జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి వివరించారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసపత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్, హెచ్ఎం రేఖ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ‘జ్యోతి యాత్ర’ను విజయవంతం చేయాలి చేగుంట(తూప్రాన్): అమరవీరుల జ్యోతి యాత్రను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం పిలుపునిచ్చారు. చేగుంటలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 25వ తేదీ నుంచి 28 వరకు సీపీఎం రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 25న చేగుంట మండలం పొలంపల్లి శివారులో కేవల్కిషన్ సమాధి నుంచి అమరవీరుల జ్యోతి యాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా నాయకురాలు బాలమణి, లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షల వేళ.. పరేషాన్ వద్దు
ఫోన్ చేయండి..ఒత్తిడిని తగ్గించుకోండి మెదక్ కలెక్టరేట్: ఇంటర్ వార్షిక పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థులు ఒత్తిడికి గురువుతుంటారు. సరిగా రాయలేక పోతామనే భావన వారి ని మరింతగా భయపెడుతుంది. అయితే ఇది విద్యార్థి స్వయంగా సృష్టించుకునే ఒత్తిడి. ఇలాంటి వారికి అండగా నిలవాలని ఇంటర్ బోర్డు టెలీమానస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షల వేళ విద్యార్థుల ఒత్తిడిని తగ్గించి వా రిలో మనోధైర్యం నింపేలా నిపుణులు సూచనలు అందిస్తున్నారు. మార్చి 5వ తేదీ నుంచి పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఇంటర్ బోర్డు ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇప్పటికే 90 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ప్రతివారం పరీక్షలు నిర్వహించడంతో పాటు చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి విద్యార్థుల అభ్యసన పెంపుపై చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో 59 కళాశాలలు జిల్లాలో మొత్తం 59 జూనియర్ కళాశాలలు ఉండగా, 16 ప్రభుత్వ కళాశాలు, 10 ప్రైవేట్ కళాశాలలు, 33 సెక్టోరియల్ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరంలో 6,066, ద్వితీయ సంవత్సరంలో 6,418 కలిపి మొత్తం 12,484 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా అన్ని కళాశాలల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు మెడిటేషన్ క్లాస్లు నిర్వహిస్తున్నారు. 14416 టోల్ఫ్రీ నంబర్ టెలీమానస్ 14416 టోల్ఫ్రీ నంబర్ గురించి చాలా మందికి అవగాహన లేక సేవలకు దూరంగా ఉంటున్నారు. ఒత్తిడి, క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసు కొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. విద్యార్థుల కోసం ఈ సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. సి బ్బంది ఓపికగా సమస్యలను వింటూ సమాధానాలు ఇస్తారు. ఇంటర్తో పాటు భవిష్యత్ లక్ష్యసాధనకు అవలంభించాల్సిన పద్ధతులను వివరిస్తారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటే కలిగే ప్రయోజనాలు, ఆరోగ్యం, జాగ్రత్తలు, చదువు ప్రణాళిక, ఒత్తిడికి గురికాకుండా మార్కుల సాధనకు సలహాలు, సూచనలు ఇస్తారు. సద్వినియోగం చేసుకోవాలి పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావొద్దు. పరీక్ష తప్పుతామని ఆందోళన చెందొద్దు. విద్యాపరంగా ఏమైనా సమస్యలుంటే అధ్యాపకుల ద్వారా పరిష్కరించుకోవాలి. అలాగే టెలీమానస్ సేవల కోసం 14416 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలి. అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి భయం పోగొడుతారు. – మాధవి, డీఐఈఓ ఇంటర్ విద్యార్థులకు టెలీమానస్ సేవలు 24 గంటలు అందుబాటులో టోల్ ఫ్రీ -
పోలీస్ సంక్షేమమే ప్రథమ కర్తవ్యం
మెదక్ మున్సిపాలిటీ: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోలీస్శాఖ పనిచేస్తుందని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కవాతు ప్రాంగణం, సెల్యూట్ బేస్ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాకు మంచి పరేడ్గ్రౌండ్ రావడం శుభసూచికం అన్నారు. క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వం అలవాటు పడుతుందన్నారు. పోలీస్ సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. సరెండర్ లివ్ల బిల్లుల కోసం రూ. 200 కోట్లు, ఆరోగ్య భద్రత కోసం రూ. 75 కోట్లు విడుదలైనట్లు వివరించారు. అమీన్పూర్, రాయపోల్, చేగుంట, నార్సింగి, మండల కేంద్రాల్లో కొత్త భవనాల నిర్మాణంతో పాటు నూతన మండల కేంద్రాల్లో పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి నిబద్ధత, క్రమశిక్షణ గల అధికారి అని కొనియాడారు. తాను నిర్మల్ ఏసీపీగా ఉన్నప్పుడు ఆయన కడెం ఎస్సైగా పనిచేశారని గుర్తుచేశారు. మెదక్ ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ.. పోలీసుల మెడికల్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. టీఏ, డీఎల్ కూడా రావడం లేదని.. దీనిని మొదటి ప్రాధాన్యతగా చూడాలని కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కొన్ని పోలీస్స్టేషన్ భవనాల నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయని, కొత్త పోలీస్స్టేషన్లు సైతం కావాల్సి ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీలు పనిచేయడం లేదని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి, మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, పోలీస్శాఖ ఉన్నతాధికారులు, జిల్లాలోని అన్ని మండలాల ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. డీజీపీ డాక్టర్ జితేందర్ జిల్లాలో కొత్త పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు నక్సల్స్, నార్కోటిక్ డ్రగ్స్పై ఉక్కుపాదం నక్సల్స్, నార్కోటిక్ డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు ఎల్లవేళలా కృషి చేస్తున్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కేసులను త్వరితగతిన ఛేదించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో డయల్ 100 సేవలందించేందుకు 2,000 వాహ నాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సైబర్ క్రైమ్తో రూ. 180 కోట్లు రికవరీ చేశామన్నారు. రూ. 300 కోట్లను వేరే అకౌంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నట్లు వివరించారు. ప్రపంచస్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ 24గంటలు సేవలందిస్తుందని చెప్పారు. -
భగ్గుమన్న విభేదాలు
పటాన్చెరు కాంగ్రెస్లో ఎమ్మెల్యే గూడెం వర్సెస్ కాటా పటాన్ చెరు: కాంగ్రెస్లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి కాంగ్రెస్ అసమ్మతి సెగ తగిలింది. గూడెం కాంగ్రెస్లో చేరినప్పట్నుంచీ ఆ పార్టీ కార్యకర్తలు ఆయనపై లోలోపల రగిలిపోతూనే ఉన్నారు. గురువారం పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనానికి పార్టీ శ్రేణులు ప్రయత్నించడంతో పాటు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రశాంత రాజకీయాలకు పెట్టింది పేరైన పటాన్చెరు నియోజకవర్గంలో తొలిసారి రాజకీయం రచ్చకెక్కింది. కాంగ్రెస్లో చేరినప్పటికీ గూడెం బీఆర్ఎస్కే అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల బొల్లారంలో ఎమ్మెల్యే పర్యటనను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గూడెంపై కాంగ్రెస్ పార్టీకే చెందిన కాటా శ్రీనివాస్గౌడ్ తన వర్గీయులను రెచ్చగొడుతున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికీ గులాబీ రంగు కుర్చీలే... ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో కనీసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో కూడా పెట్టలేదని ఆ కార్యాలయంలో కుర్చీలు ఇంకా గులాబీ రంగులోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. గ్రామాల్లో పట్టణాల్లో కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే సరైన గుర్తింపునివ్వడం లేదని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారికే ప్రాధాన్యతనిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వాస్తవానికి పటాన్చెరులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో అధికార ప్రతిపక్షంగా కొనసాగుతోందనేది బహిరంగ రహస్యం. గూడెం జంప్తో ఆశలపై నీళ్లు గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష నాయకులుగానే పోరాటం చేస్తూ ఉండిపోయారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగానే నామినేట్ పదవులు, ఇతర పదవులపై ఆశలుపెట్టుకున్న కాటా శ్రీనివాస్ వర్గీయులు గూడెం పార్టీలోకి రావడంతో నీరుగారిపోయారు. అయితే అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కాటా శ్రీనివాస్గౌడ్ అధికారుల బదిలీల విషయంలో చక్రం తిప్పారు. దీంతో ఎమ్మెల్యేగా తాను పట్టుకోల్పోతున్నానని గ్రహించిన గూడెం మహిపాల్రెడ్డి నేరుగా సీఎం రేవంత్రెడ్డి వద్దకు వెళ్లి తన అనుచరగణం సూచించినట్లుగా అధికారులను బదిలీలను చేయించుకున్నారు. దీంతో అధికారంలోకి వచ్చినప్పటికీ తాము ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతలుగా మిగిలిపోవాల్సి వస్తోందని కాటా వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. ఎలాగైనా రాష్ట్ర కాంగ్రెస్ దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే తాజాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు.ఒక నియోజకవర్గం.. మూడు గ్రూపులుఒకవైపు ఎంపీగా పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్ మరోవైపు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, కాటా శ్రీనివాస్గౌడ్ వర్గీయులతో పటాన్చెరు కాంగ్రెస్ మూడు గ్రూపులుగా విడిపోయింది. గురువారం కొల్లూరులో మాజీ సర్పంచ్ రాజీవ్ నేతృత్వంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యేపై నిరసన వ్యక్తం చేశారు. ఇకనుంచి ప్రతీ చోట ఎమ్మెల్యే గూడెంను అడ్డుకోవాలని కాటా వర్గం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకే ఈ చర్యలు తీసుకోవాల్సి వస్తోందని కాటా వర్గీయులు బహిరంగంగా చెబుతున్నారు. -
గ్రంథాలయాలతో విజ్ఞానం పెంపు
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి వెల్ధుర్తి(తూప్రాన్)/చిలప్చెడ్(నర్సాపూర్)/రామాయంపేట(మెదక్): గ్రంథాలయాలతో విజ్ఞానం పెరగడంతో పాటు మానసికోల్లాసం పెంపొందుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. బుధవారం వెల్ధుర్తిలోని నూతన గ్రంథాలయానికి ఫర్నీచర్ అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రంథాలయానికి అవసరమైన వసతులు, పుస్తకాలను అందజేస్తామని చెప్పా రు. అలాగే పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. ప్రహరీతో పాటు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. అనంతరం ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఆమె వెంట జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిలప్చెడ్లో పర్యటించారు. త్వరలోనే గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రంథాలయ ఏర్పాటుకు భవనాన్ని పరిశీలించారు. అలాగే రామాయంపేట శాఖా గ్రంథాలయాన్ని సందర్శించి మాట్లాడారు. జిల్లాస్థాయిలో మొత్తం 16 మండలాల్లో లైబ్రరీలు ఉండగా, మిగితా మండలాల్లో ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉందని, త్వరలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
నాణ్యమైన ఆహారం తప్పనిసరి
మాట్లాడుతున్న డీడబ్ల్యూఓ హైమావతిమెదక్ కలెక్టరేట్: అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు నాణ్యమైన ఆహార పదార్థాలే ఇవ్వాలని డీడబ్ల్యూఓ హైమావతి అన్నారు. బుధవారం ఆమె కార్యాలయంలో జిల్లాలోని సీడీపీఓలు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార పదార్థాల నిల్వలు, వాటి ఖర్చుల గురించి చర్చించారు. ఏ సెంటర్లో పాడైన ఆహార పదార్థాలు ఉండకూడదని స్పష్టం చేశారు. కేంద్రాల్లోని పిల్లల బరువును ఎప్పటికప్పుడు పరీక్షించి అవసరమైన వారికి తగిన పౌష్టికాహారం అందించాలని సూచించారు. -
చట్టాలపై అవగాహన అవసరం
కౌడిపల్లి(నర్సాపూర్): చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ అన్నారు. బుధవారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో– బేటి పడావో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలు కల్పించిందన్నారు. ప్రస్తుతం చిన్న పిల్లలు, మహిళపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆడ పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరిబాబు, ఐసీడీఎస్ నర్సాపూర్ ప్రాజెక్ట్ సీడీపీఓ హేమభార్గవి, హెచ్డబ్ల్యూఓ శివరామకృష్ణ, జిల్లా కోఆర్డినేటర్ సంతోషి, కవిత, శ్రీనివాస్గౌడ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ -
ప్రయోగశాల.. ఎప్పటికో?
ఆరంభశూరత్వంగా పశు వ్యాధి నిర్ధారణఆరేళ్ల క్రితం నర్సాపూర్లో నిర్మించిన జిల్లాస్థాయి పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అలంకారప్రాయంగా మిగిలింది. సుమారు రూ. 20 లక్షల వ్యయంతో భవనం నిర్మించి, అవసరమైన యంత్రాలను సమకూర్చిన పాలకులు వినియోగంలోకి తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో పశువులు అస్వస్థతకు గురైన సమయంలో జబ్బును నిర్ధారించేందుకు అవసరమైన టెస్టుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. నర్సాపూర్: కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన అనంతరం నర్సాపూర్లో జిల్లాస్థాయి పశువ్యాధి నిర్ధా రణ ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా సుమారు రూ. 20 లక్షలు వెచ్చించి నూతన భవనంలో ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. రూ. 5 లక్షలతో అవసరమైన యంత్రాలను సైతం సమకూర్చింది. అయితే అందులో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులను మాత్రం మంజూరు చేయలేదు. ఇద్దరు పశువైద్యులు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు అటెండర్లు అవసరం కాగా ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రయోగశాల నిరుపయోగంగా మారింది. జిల్లాలో గేదెలు 1,22,444 ఉండగా, ఆవులు సుమారు 54 వేలు, మేకలు 1,51,000 ఉన్నాయి. గొర్రెలు 4,30,000 వరకు ఉన్నాయి. సంగారెడ్డికి పరుగులు కాగా జిల్లా రైతులకు చెందిన పశువుల జబ్బు నిర్ధారణ పరీక్షల కోసం సంగారెడ్డికి నమూనాలు పంపాల్సి వస్తోంది. పశుసంవర్ధక శాఖ సిబ్బంది అందుబాటులో లేని సమయంలో రైతులే సొంతంగా నమూనాలు తీసుకొని సంగారెడ్డి వెళ్తున్నారు. అక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి టెస్టుల కోసం నమూనాలు రావడంతో ఫలితాల కోసం ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలిసింది. దీంతో రైతులపై ఆర్థిక భారం పడడంతో పాటు ఫలితాల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాస్థాయి ప్రయోగశాల నర్సాపూర్లో అందుబాటులో ఉంటే దూరాభారం తగ్గడంతో పాటు టెస్టుల ఫలితాలు వెంటనే అందే అవకాశం ఉంటుంది. కాగా ప్రయోగశాల కోసం నిర్మించిన భవనంలోని ఒక గదిని పశు సంవర్ధకశాఖ అధికారులు వ్యాక్సిన్ నిల్వ కోసం వినియోగిస్తున్నారు. అవసరమైనప్పుడు జిల్లాలోని ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. ప్రయోగశాల ప్రారంభించాలి పశువుల వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల దగ్గరలో ఉంటే మేలు జరుగుతుంది. పాడి గేదెలు జబ్బు చేసినప్పుడు సంగారెడ్డికి వెళ్లాల్సి రావడంతో ఖర్చు, సమయం వృథా అవుతుంది. ఇప్పటికై నా నర్సాపూర్లో నిర్మించిన ప్రయోగశాలను ప్రారంభించి రైతులకు మేలు జరిగేలా చూడాలి. – సత్యనారాయణ, పాడి రైతు, శివ్వంపేట ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా నర్సాపూర్లో ప్రయోగశాల ఏర్పాటు కోసం భవనం, యంత్రాలు అందుబాటులో ఉన్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. ప్రయోగశాలకు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని కేటాయించి ప్రయోగశాలను ప్రారంభించేందుకు తన వంతుగా కృషి చేస్తా. – వెంకటయ్య, జిల్లా ఇన్చార్జి వెటర్నరీ అధికారి సిబ్బందిని నియమించడంలో తాత్సారం ఇబ్బంది పడుతున్న రైతులు -
జాబితాలో పేరు లేదనిఆందోళన వద్దు
నర్సాపూర్: జాబితాలో పేర్లు లేని వ్యక్తులు ఆందోళన చెందవద్దని, అలాంటి వారి నుంచి దరఖా స్తులు తీసుకొని విచారణ చేపడతామని కలెక్టర్ రాహుల్రాజ్ స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని ఆరవ వార్డులో ఏర్పాటు చేసిన వార్డు సభలో పాల్గొని మాట్లాడారు. అర్హత ఉన్న వారిని లబ్ధిదారుల జాబితాలో చేరుస్తామని వివరించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, వైస్ చైర్మన్ నయి మోద్దీన్, కమిషనర్ రామకృష్ణరావు, ఆర్ఐ ఫైజల్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రేషన్కార్డు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేదని స్థానికురాలు మమత నాయకులతో తన గోడు వివరిస్తూ కంటతడి పెట్టింది. వైద్యుల పనితీరు భేష్ నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు బాగా పని చేస్తున్నారని కలెక్టర్ అభినందించారు. బుధవారం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని వార్డులలో పర్యటించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు, మందులపై గురించి ఆరా తీశారు. అనంతరం రికార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. ఆస్పత్రిలో ఎలాంటి లోటుపాట్లు లేవని రోగులు చెప్పినట్లు ఆయన వివరించారు. ఇష్టానుసారంగా వార్డులలోకి రాకుండా కట్టడి చేయాలని, విజిటింగ్ టైంలోనే వచ్చి తమ వారిని చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయనతో పాటు సూపరింటెండెంట్ పావని, ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
పాపన్నపేట(మెదక్): అర్హులందరికీ సంక్షేమ పథకాలు మంజూరు అవుతాయని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం మండలంలోని ఎల్లాపూర్లో జరిగిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా తదితర పథకాల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. గ్రామ సభలో వెల్లడించిన తర్వాతనే అర్హులను ఎంపిక చేస్తారని చెప్పారు. సభ లో పేర్లు చదివిన తర్వాత ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని కోరారు. సాగుకు యోగ్యమైన భూ ములను పక్కాగా గుర్తించామని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించామన్నారు. ఏమైన అనుమానాలుంటే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆరు గ్యారంటీల పథకం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విష్ణువర్ధన్, జి ల్లా కాంగ్రెస్ కిసాన్సెల్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేష్ -
అనుకున్నంత అభివృద్ధి చేయలేకపోయా
రామాయంపేట(మెదక్): ఈ ఐదేళ్ల కాలంలో అనుకున్నంత మేర అబివృద్ధి సాధించలేకపోయామని మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన మున్సిపల్ చివరి సమావేశం అనంతరం కౌన్సిలర్లు నాగరాజు, అనిల్కుమార్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లా డారు. తాము ఎన్నో ఆశలతో పదవిని అలంకరించామని, అభివృద్ధి పనులు చేయనందుకు ప్రజలు క్షమించాలని కోరారు. కరోనాతో పాటు నిధుల మంజూరు కాకపోవడం అభివృద్ధికి అడ్డంకిగా మా రిందని వాపోయారు. 2020లో జనవరిలో ప్రమాణస్వీకారం చేయగా, తర్వాత రెండు నెలలకే కరోనాతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. 2023లో పలు పథకాల కింద రూ. 10 కోట్ల మేర నిధులు మంజూరు కాగా, రూ. ఆరున్నర కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడితే ఇప్పటివరకు డబ్బులు రాలేదని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అభివృద్ధి పనులకు సంబంధించి వేర్వేరు పథకాల కింద రూ. 50 కోట్లు మంజూరు కాగా, నిధులు మళ్లిపోయాయని పేర్కొ న్నారు. గత ప్రభుత్వ హయాంలో రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ మంజూరు కాగా, ఇంతవరకు గెజిట్ విడుదల కాలేదని వాపోయారు. తాము అధికారంలో లేకపోయినా అభివృద్ధికి సహకరిస్తామన్నారు. ఎమ్మెల్యే రోహిత్రావు, ఎంపీ రఘునందన్రావు మున్సిపాలిటీ అభివృద్ధి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కొండల్రెడ్డి, యాదగిరి, అహ్మద్ పాల్గొన్నారు. ప్రజలు క్షమించాలి రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్ -
భద్రత.. బాధ్యత
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదకర మలుపుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం, వాహనదారుల అతివేగం, మద్యం తాగి, సెల్ఫోన్ మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకుండా.. సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం, విశ్రాంతి లేకుండా వాహనం నడపడం ఇందుకు కారణం. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా తీసు కోవాల్సిన చర్యలపై ప్రత్యేక కథనం. 33 బ్లాక్ స్పాట్ల గుర్తింపు జిల్లా మీదుగా 44, 161, 765డీ, 765 డీజీ జాతీయ రహదారులు వెళ్తున్నాయి. అవి 150 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. అయితే మిగితా జిల్లాలతో పోలిస్తే జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది 568 రోడ్డు ప్రమాదాలు జరుగగా.. 302 మంది మృత్యువాతపడ్డారు. మరో 459 మంది క్షతగాత్రులయ్యారు. అయితే ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు మద్యం మత్తు, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడం వల్లే జరుగుతున్నాయని జిల్లా యంత్రాంగం నిర్ధారించింది. ప్రమాదాల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లాలో 33 బ్లాక్ స్పాట్స్ను గుర్తించింది. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. వీటిపై తక్షణ చర్యలు చేపట్టాలి ● జిల్లాలోని రహదారులపై ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చివేయాలి. ● రోడ్డు భద్రత నియమాలు కఠినంగా అమలు చేయాలి. ● మలుపుల వద్ద చెట్ల పొదలు తొలగించాలి. ● ప్రమాదకర ప్రాంతాల్లో రేడియంతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ● జాతీయ రహదారులపై వేగ నియంత్రణ పరికరాలు అమర్చాలి. ● ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలి. ● రహదారుల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పటిష్ట చర్యలు చేపడుతున్నాం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం. 33 బ్లాక్ స్పాట్లను గుర్తించి రేడియం స్టిక్కర్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశాం. అలాగే పోలీస్శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను చైతన్య పరుస్తున్నాం. – ఉదయ్కుమార్రెడ్డి, ఎస్పీ మెదక్ పట్టణంలో రోడ్డు భద్రతపై ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు, విద్యార్థులురోడ్డు నిబంధనలు తప్పనిసరి: కలెక్టర్ మెదక్జోన్: రోడ్డు భద్రత మనందరి బాధ్యత.. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అంతకుముందు ఎస్పీ ఉదయకుమార్రెడ్డితో విద్యార్థుల ర్యాలీని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణం చాలా విలువైందని, తల్లిదండ్రులు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని విద్యార్థులు చెప్పాలని సూచించారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఎక్కువ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా 20 శాతం మరణాలు తగ్గాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి వెంకటస్వామి, ఆర్అండ్బీ ఈఈ సర్ధార్సింగ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎంఈఓ నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.చేరుదాం.. సురక్షితంగా.. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు గతేడాది అక్టోబర్ 16న శివ్వంపేట మండలం ఉసిరికపల్లి శివారులో వాగులో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించారు. ఇందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. డ్రైవర్ మద్యం మత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. -
ప్రయోగశాల.. ఎప్పటికో?
ఆరంభశూరత్వంగా పశు వ్యాధి నిర్ధారణఆరేళ్ల క్రితం నర్సాపూర్లో నిర్మించిన జిల్లాస్థాయి పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అలంకారప్రాయంగా మిగిలింది. సుమారు రూ. 20 లక్షల వ్యయంతో భవనం నిర్మించి, అవసరమైన యంత్రాలను సమకూర్చిన పాలకులు వినియోగంలోకి తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో పశువులు అస్వస్థతకు గురైన సమయంలో జబ్బును నిర్ధారించేందుకు అవసరమైన టెస్టుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. నర్సాపూర్: కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన అనంతరం నర్సాపూర్లో జిల్లాస్థాయి పశువ్యాధి నిర్ధా రణ ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా సుమారు రూ. 20 లక్షలు వెచ్చించి నూతన భవనంలో ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. రూ. 5 లక్షలతో అవసరమైన యంత్రాలను సైతం సమకూర్చింది. అయితే అందులో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులను మాత్రం మంజూరు చేయలేదు. ఇద్దరు పశువైద్యులు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు అటెండర్లు అవసరం కాగా ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రయోగశాల నిరుపయోగంగా మారింది. జిల్లాలో గేదెలు 1,22,444 ఉండగా, ఆవులు సుమారు 54 వేలు, మేకలు 1,51,000 ఉన్నాయి. గొర్రెలు 4,30,000 వరకు ఉన్నాయి. సంగారెడ్డికి పరుగులు కాగా జిల్లా రైతులకు చెందిన పశువుల జబ్బు నిర్ధారణ పరీక్షల కోసం సంగారెడ్డికి నమూనాలు పంపాల్సి వస్తోంది. పశుసంవర్ధక శాఖ సిబ్బంది అందుబాటులో లేని సమయంలో రైతులే సొంతంగా నమూనాలు తీసుకొని సంగారెడ్డి వెళ్తున్నారు. అక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి టెస్టుల కోసం నమూనాలు రావడంతో ఫలితాల కోసం ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలిసింది. దీంతో రైతులపై ఆర్థిక భారం పడడంతో పాటు ఫలితాల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాస్థాయి ప్రయోగశాల నర్సాపూర్లో అందుబాటులో ఉంటే దూరాభారం తగ్గడంతో పాటు టెస్టుల ఫలితాలు వెంటనే అందే అవకాశం ఉంటుంది. కాగా ప్రయోగశాల కోసం నిర్మించిన భవనంలోని ఒక గదిని పశు సంవర్ధకశాఖ అధికారులు వ్యాక్సిన్ నిల్వ కోసం వినియోగిస్తున్నారు. అవసరమైనప్పుడు జిల్లాలోని ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. ప్రయోగశాల ప్రారంభించాలి పశువుల వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల దగ్గరలో ఉంటే మేలు జరుగుతుంది. పాడి గేదెలు జబ్బు చేసినప్పుడు సంగారెడ్డికి వెళ్లాల్సి రావడంతో ఖర్చు, సమయం వృథా అవుతుంది. ఇప్పటికై నా నర్సాపూర్లో నిర్మించిన ప్రయోగశాలను ప్రారంభించి రైతులకు మేలు జరిగేలా చూడాలి. – సత్యనారాయణ, పాడి రైతు, శివ్వంపేట ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా నర్సాపూర్లో ప్రయోగశాల ఏర్పాటు కోసం భవనం, యంత్రాలు అందుబాటులో ఉన్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. ప్రయోగశాలకు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని కేటాయించి ప్రయోగశాలను ప్రారంభించేందుకు తన వంతుగా కృషి చేస్తా. – వెంకటయ్య, జిల్లా ఇన్చార్జి వెటర్నరీ అధికారి సిబ్బందిని నియమించడంలో తాత్సారం ఇబ్బంది పడుతున్న రైతులు