breaking news
Medak District News
-
సత్వర పరిష్కారం చూపండి
అదనపు కలెక్టర్ నగేశ్ మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను పరిశీలించి వెంట వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో జిల్లా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ భారతి 37, పెన్షన్లు 4, ఇందిరమ్మ ఇళ్ల కోసం 7, ఇతర 34 కలిపి మొత్తం 82 వినతులు వచ్చాయి. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను తక్షణమే పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి పాపన్నపేట(మెదక్): ఎస్ఐఆర్కు సమయం దగ్గర పడుతుండటంతో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ ఎస్ఐఆర్ జిల్లా సమన్వయకర్త శశిధర్రెడ్డి పిలునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అర్హులైన ఓటర్లు 100 శాతం నమోదు చేసుకునేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. అనునిత్యం బీఎల్ఓలతో మాట్లాడుతూ.. నమోదు కాని ఓటర్లు ఎవరైనా ఉంటే, వారి ఇంటికి వెళ్లి నమోదు చేయించాలన్నారు. ఆగస్టు 3తో గడు వు ముగుస్తుందని, 2002 ఓటర్ లిస్టు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్ గురుమూర్తిగౌడ్, మల్లన్న, డాక్టర్ రమేష్, శ్రీనివాస్, ఉస్మాన్, వెంకటేశం, భూమాగౌడ్, పంతుల కిషన్, నిజాం, మహేందర్, రవీందర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. రైతుల కోసమే విత్తన మేళా నర్సాపూర్: వర్షాలు తక్కువగా కురుస్తున్నందున వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి రైతులను కోరారు. సోమవారం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆరుతడి పంటలలో ప్రస్తుత వాతావరణానికి మొక్కజొన్న, జొన్న, కందులు, పెసర్లు, పశుగ్రాసం తదితర పంటలు సాగు చేయాలని సూచించారు. విత్తనాలు ఒకే చోట అందుబాటులో ఉంచడానికే విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్, మండల వ్యవసాయాధికారి దీపిక, ఏఈఓలు మోహన్, తేజస్విని, రాజశేకర్, లావణ్య, దుర్గాప్రసాద్ పలువురు విత్తన డీలర్లు పాల్గొన్నారు. 29, 30న అంగన్ వాడీ దరఖాస్తుల పరిశీలన మెదక్ కలెక్టరేట్/నర్సాపూర్: ఈనెల 29, 30 తేదీల్లో అంగన్వాడీ దరఖాస్తుల పరిశీలన ఉంటుందని మెదక్ సీడీపీఓ వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 29న కౌడిపల్లి, పాపన్నపేట మండలాల్లోని టీచర్ పోస్టు అభ్యర్థులకు, 30న హెల్ప్ర్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. అభ్యర్థులంతా ఒరిజినల్ పత్రాలతో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెదక్ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. అలాగే 29న నర్సాపూర్, శివ్వంపేట, చిలప్చెడ్ మండలాలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లు, 30న తూప్రాన్, మనోహరాబాద్, కౌడిపల్లి మండలాలకు చెందిన అభ్యర్థుల పరిశీలన ఉంటుందని సీడీపీఓ సీడీపీఓ హేమాభార్గవి తెలిపారు. -
విద్య, ఉద్యోగాల్లో అన్యాయం
మాలల కోఆర్డినేషన్ ఫోరం నాయకులు రామాయంపేట(మెదక్): విద్య, ఉద్యోగాల నియామకాల్లో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాలల కోఆర్డినేషన్ ఫోరం రాష్ట్ర నాయకులు శకుంతల, తిరుపతయ్య, శంకర్ ఆరోపించారు. మాలల జూయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించి రోస్టర్ పాయింట్లను 22 నుంచి 11కు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భర్తీ చేసిన ఉద్యోగాల్లో మాలలకు అన్యాయం జరిగిందని వాపోయారు. రోస్టర్ పాయింట్లు సవరించే వరకు ఉద్యోగ నియామకాలను, నోటిఫికేషన్ల జారీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 2011లో మాలల జనాభా 15 లక్షలకుపైగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కుట్రతో 2024లో జరిగిన సర్వేలో 14 లక్షలకు తగ్గించిందని ఆరోపించారు. సమావేశంలో మాలల కోఆర్డినేషన్ ఫోరం జిల్లా ఇన్చార్జి జెల్ల సుధాకర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సంజీవ్, మాజీ ఎంపీపీ ఎల్లం, జిల్లా మాజీ అధ్యక్షుడు మాసాయిపేట మల్లేశం, చంద్రం, సురేందర్, రమేశ్ పాల్గొన్నారు. -
భారీ వర్షం.. అతలాకుతలం
రామాయంపేట(మెదక్): చిన్నపాటి వర్షానికే రామాయంపేట మున్సిపాలిటీ అస్తవ్యస్తమవుతోంది. సోమవారం రాత్రి కురిసిన భారీ వానకు సిద్దిపేట రోడ్డు ప్రధాన రహదారిపై, అక్కలబస్తీలో రోడ్డుపై నీరు నిలిచి కాలనీవాసులు అవస్థలు పడ్డారు. అధికారులు తమ గురించి ఎంతమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంఘటనలతో పాఠం నేర్చుకోని మున్సిపల్ అధికారులు గుంతల్లో నామమాత్రంగా కంకరపోయించారు. భారీ వర్షంతో కంకర మొత్తం కొట్టుకుపోయి రోడ్డుపై పెద్ద గుంతలు తేలాయి. దీంతో గంటపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగి వాహనదారులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. -
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
జిల్లా ల్యాండ్ సర్వే ఏడీ కిషన్చిలప్చెడ్(నర్సాపూర్): రీసర్వేతోనే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జిల్లా ల్యాండ్ సర్వే ఏడీ కిషన్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని రాందాస్గూడలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని రైతులకు భూముల రీ సర్వేపై అవగాహన కల్పించారు. ప్రతి 30 సంవత్సరాలకు ఓ సారి భూ సర్వే జరగాలని, తెలంగాణలో వంద సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు ఎలాంటి భూ గణన జరగలేదన్నారు. సక్రమంగా ఉన్నా భూ యజమానులకే హక్కులు ఇచ్చేందుకు ప్రభుత్వం భూముల రీసర్వే చేస్తుందన్నారు. ఆధునిక సాంకేతికతో సర్వే చేసి భూదార్ నంబర్ ఇస్తామన్నారు. జిల్లాలో 75 గ్రామాల్లో భూముల రీసర్వేకు అనుమతి లభించగా, రాందాస్గూడలో సుమారు 53 ఎకరాలు, మంగళపల్లిలో 52 ఎకరాల్లో రీ సర్వే చేస్తామన్నారు. గ్రామస్తులు పూర్తి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌరి, ల్యాండ్ సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ రాంరెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ ప్రశాంత్, సర్వేయర్ రవిప్రసాద్, పంచాయతీ కార్యదర్శి మోహన్, రైతులు పాల్గొన్నారు. -
ధర్నాను విజయవంతం చేద్దాం: తపస్
వెల్దుర్తి(తూప్రాన్): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆగస్ట్ 1న నిర్వహించనున్న చలో హైదరాబాద్ ధర్నాను ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం మాసాయిపేట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయుల ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు, పీఆర్సీ అమలు, హెల్త్ కార్డుల జారీ, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించా లని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంఈ ఓ మధుసూదన్రావు, నాయకులు భద్రయ్య, ఝాన్సి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
శాకాంబరీదేవిగా శ్రీవిద్యాసరస్వతి
వర్గల్ క్షేత్రంలో వైభవంగా మూల మహోత్సవం వర్గల్(గజ్వేల్): అమ్మకు కూరగాయలే ఆభరణాలయ్యాయి. ఫలాలే పూలహారాలుగా ఒదిగిపోయాయి. ఆలయం పందిరితోటను తలపించింది. సోమవారం మూల నక్షత్ర మహోత్సవ వేళ కూరగాయలు, ఫలాలు ఆభరణాలుగా ధరించి వర్గల్ శ్రీవిద్యాసరస్వతి అమ్మవారు శాకంబరీదేవిగా దివ్యదర్శనమిచ్చారు. పీఠాధిపతి శ్రీమాధవానందస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున మూల మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్చకులు మూలవిరాట్టుకు విశేషాభిషేకం చేశారు. ఆషాఢానికి ప్రతీకగా ఫలాలు, కూరగాయలతో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు. లక్ష పుష్పార్చన, సప్తశతి పారాయణం, చండీహోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. -
సారూ.. నా కొడుకులు అన్నం పెడ్తలేరు
ఎస్పీని ఆశ్రయించిన వృద్ధుడు మెదక్జోన్: తన పేరుపై ఉన్న భూమిని ఇద్దరు కొడుకులు పట్టా చేసుకొని తనకు తిండి పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఓ వృద్ధుడు ఎస్పీ శ్రీనివాసరావుని ఆశ్రయించాడు. స్పందించిన ఎస్పీ అతడికి అండగా నిలిచారు. వివరాలు ఇలా.. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన భద్రయ్యకు ఇద్దరు కొడుకులు. తన పేరుపై ఉన్న 36 గుంటల భూమిని పట్టా చేసుకుని అన్నం పెట్టడం లేదని సో మవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. వృద్ధాప్యంలో ఇబ్బంది పడుతున్న భద్రయ్య పరిస్థితి తెలుసుకున్న ఎస్పీ.. నర్సాపూర్ సీఐతో ఫోన్లో మాట్లాడి వృద్ధుడికి వెంటనే న్యాయం చేయాలని ఆదేశించారు. అంతకుముందు ప్రజావాణి లో ఫిర్యాదులు స్వీకరించారు. అలాగే ముగ్గురు ఏఎస్ఐలు రాంబాబు, జైపాల్రెడ్డి, కృష్ణమూర్తి ఎస్ఐలుగా పదోన్నతి లభించడంతో వారికి బాధ్యతలు అప్పగించారు. -
మెడికల్ కళాశాల ఉన్నా వైద్యం శూన్యం
● జ్వరం, జలుబుకు మాత్రమే చికిత్స ● అత్యవసర పరిస్థితుల్లో గాంధీ, ఉస్మానియాకు రెఫర్ çÜÐ]l$çÜÅ ¡{Ð]l…V> E…sôæ¯ól Æð‡çœÆŠḥæతీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంటేనే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నాం. ఇక్కడ కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్లు లేరు. దీంతో అందుకు సంబంధించిన వ్యాధిగ్రస్తులు వస్తే వారిని రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల రెఫర్ చేసిన ఇద్దరు పేషెంట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటాం. – వనజ, ఇన్చార్జి ఆర్ఎంఓ, మెదక్ కొల్చారం మండలం వెంకటాపూర్కు చెందిన అంజయ్య ఇటీవల కుటుంబ కలహాలతో విషం తాగాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు వెంటనే గాంధీకి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబీకులు నానా అవస్థలు పడి అక్కడికి తీసుకెళ్లారు. ఇలా ఎలాంటి సమస్యతో సర్కారు దవాఖానకు వచ్చినా ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేస్తుండటంతో సామాన్య ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.ఈ చిత్రంలోని వృద్ధుడు నరేశ్. పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామం. ఈనెల 26 (ఆదివారం) ఇంట్లో జారి పడగా కాలు విరిగింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు సరైన కారణం చెప్పకుండానే హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. మెదక్జోన్: పేద, మధ్య తరగతి ప్రజలకు జబ్బు చేస్తే మొదటగా ప్రభుత్వ పెద్దాస్పత్రి వైపే చూ స్తారు. ఇక్కడ ఉచితంగా వైద్యం, మందులు, పెద్ద డాక్టర్లు ఉంటారనే నమ్మకంతో వస్తుంటారు. కానీ అలాంటి ఆస్పత్రిలో సరైన వైద్య సేవలు అందకపోవడం పేదలకు శాపంగా మారుతోంది. ప్రాణం మీదికి వచ్చిన రోగులు, అత్యవసర వైద్యం కోసం వస్తే గాంధీకి రెఫర్ చేస్తున్నారు. దగ్గు, జ్వరం లాంటి చిన్నపాటి సమస్యలకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరై రెండేళ్లు అవుతోంది. పెద్ద చదువులు చదివిన డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్పెషలిస్టులు వస్తారని, ఎలాంటి జబ్బు చేసినా స్థానికంగానే చికిత్స అందుతుందని ప్రజలు సంతోష పడ్డారు. కానీ గతంలో లాగే ప్రస్తుతం వైద్య సేవలు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయపాలన పాటించని వైద్యులు మెడికల్ కళాశాల వచ్చినప్పటి నుంచి వైద్యులు ఎప్పుడు విధులకు వస్తారో, ఎప్పుడు వెళ్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఉదయం 11 గంటల వరకు ఆస్పత్రికి రారని, మధ్యాహ్నం 2 గంటలు దాటితే అందుబాటులో ఉండరనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని రోగు లు వాపోతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటూ అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వైద్య సేవలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఆరుతడి పంటలే మేలు
కలెక్టర్ ప్రతిమాసింగ్కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సోమవారం కౌడిపల్లిలో వ్యవసాయ అధికారులు టమాట రైతు మహిపాల్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో తేనెటీగల పెంపకం, రైతువేదికలో విత్తన మేళా నిర్వహించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎల్నినోతో వర్షాలు తగ్గాయని, వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జల్లా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. కూరగాయల పంటలు సాగుతో మంచి ఆదాయం వస్తుందన్నారు. కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయం వస్తుందన్నారు. కార్యక్రమంలో డీఏఓ దేవ్కుమార్, ఉద్యానవన అధికారి ప్రతాప్సింగ్, డీఆర్డీఓ శ్రీనివాసరావు, రు ద్రమూర్తి, ఆర్డీఓ రామకష్ణ, డీఎల్పీఓ సురేశ్బాబు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏడీఏ పుణ్యవతి, ఏఓ స్వప్న, సర్పంచ్ కృష్ణాగౌడ్, రైతులు పాల్గొన్నారు. -
మట్టి డబ్బులు స్వాహా!
శివ్వంపేట(నర్సాపూర్): చెరువు మట్టి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులు గ్రామ పెద్దమనుషుల వద్ద ఉంచగా, వాటికి సంబంధించిన లెక్కలు తేలకపోవడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధి సికింద్లాపూర్లో మూడేళ్ల క్రితం చెరువు మట్టి అమ్మకం ద్వారా గ్రామానికి రూ.16 లక్షల ఆదాయం సమకూరింది. వాటిని గ్రామ అవసరాల కోసం ఖర్చు చేసేందుకు గ్రామానికి చెందిన పలువురు పెద్ద మనుషుల వద్ద ఉంచారు. ప్రస్తుతం ఆ డబ్బులను గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయాలని అడిగితే వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రజా అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులు సొంతానికి వాడుకోవడం ఎంతవరకు సమంజమని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బులు రికవరీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. మెదక్ కలెక్టరేట్: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి నుంచి జిల్లాలో విత్తన మేళాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 29 వరకు జిల్లాలోని 12 రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నా య పంటలను ప్రోత్సహించడం ఈ విత్తన మేళా ముఖ్య ఉద్దేశమన్నారు. తక్కువ నీరు– ఎక్కువ లాభం వచ్చే పంటలు సాగుచేయాలని రైతులకు సూచించారు. కంది, పెసర, మినుము, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లా లోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దుబ్బాకటౌన్: బుద్ధుడు, పూలే, అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ అందించిన సేవలకే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింహులుకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక గౌతమ బుద్ధ అవార్డు లభించిందని మహిళా కమిషన్ సభ్యురాలు శ్వేత తెలిపారు. జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ముత్యాల నర్సింహులుకు ఆదివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత, బీఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉప్పర మల్లేశం, జిల్లా అధ్యక్షుడు శంకర్ బోధి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...బుద్ధుడు బోధించిన కరుణ, సమానత్వం, అహింస, మానవత్వం వంటి విలువలను ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పించేందుకు ముత్యాల నర్సింహులు ఎన్నో ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి, పూలమాలలు వేసి, జ్ఞాపికను అందజేశారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ భవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పీఆర్సీ నివేదిక వెంటనే తెప్పించుకుని 40% ఫిట్మెంట్తో వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన నూతన పీఆర్సీని ఆర్థిక ఇబ్బందులు సాకుతో వాయిదా వేయడం సరికాదన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సంక్షేమ కార్యక్రమాలు రూ.వేల కోట్ల తో కొనసాగేవా అని ప్రశ్నించారు. ప్రభుత్వం 27 వేల పాఠశాలలను 4 వేల పాఠశాలలకు కుదించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. హామీలు నెరవేర్చక పొతే ఉపాధ్యాయులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
కరువును తరిమేట్టు
ఒడిసి పట్టు.. మెతుకుసీమపై ఎల్నినో ప్రభావం అధికంగానే ఉంది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా చెప్పుకోదగ్గ వర్షాలు లేక లోటు వర్షపాతమే నమోదు అయింది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని వీబీజీరామ్జీ పథకంలో విస్తృతంగా ఇంకుడు గుంతల నిర్మాణాలను యుద్ధ ప్రాంతిపదికన నిర్మించాలని ఆశాఖ అధికారులు ఊరూరా అవగాహన కల్పిస్తున్నారు. గతంలో ఈ పథకం ద్వారా వర్షాకాలంలో రకరకాల పనులు చేపట్టేవారు. కానీ తీవ్ర వర్షాభావ పరిసితుల నేపథ్యంలో రాబోయే మూడు నెలల వరకు భూగర్భజలాల పెంపే లక్ష్యంగా ఇంకుడు గుంతల నిర్మాణాలతో పాటు మొత్తం 5 రకా ల పనులు చేసేందుకు శ్రీకారం చుట్టారు. వర్షపునీరు వృథా కాకుండా.. జిల్లావ్యాప్తంగా 492 గ్రామాలు ఉండగా 1.63 లక్షల జాబ్కార్డులు ఉన్నాయి. వాటి పరిధిలో 3.26 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరందరికీ ఉపాధి కల్పించేందుకు ఈ ఏడాది 41 లక్షల పనిదినాలు కేటాయించారు. కాగా, ఎల్నినోను ఎదుర్కొనేందుకు రాబోయే మూడు నెలల పాటు జిల్లావ్యాప్తంగా 39,360 వ్యక్తిగతంగా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి. ఒక్కో గ్రామంలో 80 గుంతలకు తగ్గకుండా నిర్మించాలి. ఇందుకు గానూ ఒక్కోదానికి రూ. 6,690 ఇవ్వనున్నారు. అలాగే కమ్యూనిటీ ఇంకుడుగుంతలు వీటిని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాలి. ప్రతి గ్రామంలో రెండు చొప్పున ఒక్కో దానికి రూ.13,400 చొప్పున ఇవ్వనున్నారు. అలాగే రైతుల పంట పొలాల్లో పాంపండ్స్ నిర్మించుకోవాలి. వీటి సైజును బట్టి ఒక్కో దానికి రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.78 లక్షల వరకు ఇవ్వనున్నారు. గ్రామంలో రెండింటికి తగ్గకుండా జిల్లావ్యాప్తంగా 984 నిర్మించాలి. అలాగే బోర్వెల్ రీఛార్జ్ ఒక్కోదానికి రూ. 36 వేల చొప్పున ఇవ్వనున్నారు. పర్కోలేషన్ ట్యాంకు (చిన్నపాటి కుంటలు) వీటిని ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ ఏరియాల్లో నిర్మించాలి. ఇందుకు ఒక్కోదానికి రూ. 5 లక్షల వరకు ఇస్తారు. ఇవి గ్రామంలో రెండింటికి తగ్గకుండా నిర్మించాలి. వీటి ద్వారా వర్షపునీరు వృథాగా పోకుండా భూమిలోకి ఇంకి భూగర్భజలాలు అభివృద్ధి చెందుతాయి. వీబీజీ–రామ్జీలో భూగర్భజలాల పెంపునకు చర్యలు ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణం పాంపండ్స్, బోర్వెల్ రీఛార్జ్, పర్కోలేషన్ ట్యాంకులు సైతం.. భాగస్వాములు కావాలి ఎల్నినో ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘వీబీజీరామ్జీ’ ద్వారా ప్రవేశపెట్టిన జలసిరి పథకంలో అందరూ భాగస్వాములు కావాలి. వృథాగా పోయే వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించి భూగర్భజాలల పెంపునకు పాటుపడాలి. – శ్రీనివాస్రావు, డీఆర్డీఓ ఎల్నినో ముప్పును మూకుమ్మడిగా ఎదుర్కొనేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ నడుం బిగించింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అంగ్ అజీవికా మిషన్ (వీబీజీ–రామ్జీ) పథకం ద్వారా విరివిగా ఇంకుడు గుంతలు, పాంపండ్స్, బోర్వెల్ రీఛార్జ్, పర్కోలేషన్ ట్యాంకుల నిర్మాణాలతో భూగర్భజాలాలు పెంచేందుకు చర్యలు చేపట్టింది. జనం కదిలి ‘జలరిసి’ పెంచాలని అధికారులు పల్లెల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. – మెదక్జోన్ -
భక్తుల కల నెరవేర్చిన మోదీ
కొమురవెల్లి(సిద్దిపేట): ఎన్నో ఏళ్ల నుంచి మల్లన్న భక్తుల కలగా మిగిలిన కొమురవెల్లి రైల్వేస్టేషన్ ఆశను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ పేర్కొన్నారు. కొత్తపల్లి–మనోహరబాద్ రైల్వే లైన్లో నూతనంగా నిర్మించిన కొమురవెల్లి పుణ్య క్షేత్రం రైల్వే స్టేషన్ను వారు ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ.. గతంలో రైల్వే స్టేషన్ నిర్మించాలన్న, నూతన రైల్వే లైను ఏర్పాటు చేయాలన్న దశాబ్దాల సమయం పట్టేదని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయడం ఒక చారిత్రక ఘట్టమని, స్టేషన్ నిర్మాణం కోసం భూమి పూజచేసిన రెండేళ్లలోనే పూర్తిచేసి భక్తులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి కొమురవెల్లికి కేవలం రూ.20లతో చేరుకోవచ్చని ప్రస్తుతం డీజిల్తో నడుస్తున్న ఈ లైన్ను తర్వలోనే రూ.300 కోట్లతో విద్యుద్దీకరణ చేయనున్నట్లు వెల్లడించారు. మోదీ ప్రభుత్వ సమయం ముగిసేసరికి కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ రైల్వే పనులు పూర్తవుతాయన్నారు. అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పని చేయాలన్నారు. రాష్ట్రంలో రైల్వే లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ ఏర్పాటుకు మాజీ సీఎం కేసీఆర్ కృషి ఫలించిందన్నారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు గత ప్రభుత్వం 50% నిధులు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాజ్యసభ్యులు కె.లక్ష్మణ్, మెదక్ ఎంపీ రఘునందన్రావు, రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవత్సవ,రైల్వే అధికారులు, స్థానిక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు -
అధికారులు కావలెను!
మెదక్ కలెక్టరేట్: మెతుకుసీమ.. అధికారుల కొరతతో సతమతమవుతోంది. జిల్లా కేంద్రం ఏర్పడి సుమారు పదేళ్లు అవుతున్నా, కీలక శాఖల్లోని పోస్టులను ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయిలో జిల్లా అధికారులు లేకపోవడంతో సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొత్తవారు రావు.. ఉన్నవారు పనిచేయరు అన్న చందంగా పరిస్థితి మారింది. ఇన్చార్జిలే బాధ్యతలు జిల్లా అభివృద్ధికి అతి ముఖ్యమైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, విద్యా, వైద్య, సీ్త్ర శిశు సంక్షేమ, పౌర సంబంధాల శాఖ, జిల్లా యువజన క్రీడలు, పర్యాటక, ఇంటర్ విద్యాశాఖ, తూనికలు–కొలత లు, ఎంప్లాయీమెంట్, భూగర్భ జల, మత్స్య, మైనార్టీ సంక్షేమ, జిల్లా పశు సంవర్ధక శాఖ, ఇరిగేషన్ ఈఈ, సోలార్, మార్క్ఫేడ్ డీఎం,మార్కెటింగ్ ఏడీ, వయోజన విద్య, చేనేత సంక్షేమ శాఖలను ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. అదేబాటలో సంక్షేమ శాఖలు జిల్లాలో అతి కీలకమైన అంగన్వాడీ, సీ్త్రలు, శిశువులకు, వృద్ధులకు సేవలందించే డీడబ్ల్యూఓ పోస్టు సైతం ప్రస్తుతం ఇన్చార్జి అధికారితోనే కొనసాగుతోంది. నర్సాపూర్ సీడీపీఓ హేమాభార్గవికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో శిశు విక్రయాలు, బాల్య వివాహాలు పెరిగిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా మత్స్యశాఖ ఇన్చార్జి అధికారి మల్లేశం బదిలీకాగా రెగ్యులర్ అధికారిని నియమించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ అధికారి పూర్ణిమకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే రెండేళ్లుగా ఇంటర్ విద్యా శాఖ నోడల్ అధికారి పోస్టు సైతం ఇన్చార్జితోనే కొనసాగిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అవినితి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రాగానే బదిలీపై వెళ్లి పోయారు. దీంతో తూప్రాన్ వైద్యాధికారికి జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓగా బాధ్యతలు అప్పగించారు. సంతకాల కోసమే.. జిల్లా కేంద్రం ఏర్పడినప్పటి నుంచి సంగారెడ్డికి చెందిన ఎంప్లాయీమెంట్ అధికారి రామచంద్రరాజు ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అసలు మెదక్లో ఎంప్లాయీమెంట్ అధికారి ఉన్నట్లు జిల్లా ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టర్లకు మద్దతు పలుకుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్నార్నన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజావాణికి వచ్చి సంతకం చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 500లకు కంపెనీలున్నా.. గడిచిన పదేళ్లలో ఒక్క నిరుద్యోగికి ఉపాధి కల్పించినట్లు దాఖలాలు లేవు. మెదక్ కలెక్టరేట్జిల్లాలో భర్తీ కానీ కీలక పోస్టులు -
అటకెక్కిన అండర్పాస్లు
● రోడ్డు ప్రమాదాలకు బలవుతున్న వన్యప్రాణులు ● ఏడాదిలో రెండు చిరుతల మృతి రామాయంపేట(మెదక్): అటవీ ప్రాంతాల పరిధిలోని రహదారులపై అండర్పాసుల నిర్మాణం విషయమై జరుగుతున్న జాప్యం వన్యప్రాణుల ప్రాణాల మీదికొస్తుంది. గతేడాది 44వ నంబర్ జాతీయ రహదారిపై నార్సింగి వద్ద అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. తాజాగా ఆదివారం మెదక్, ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ)పై గంగాపూర్ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో మరో చిరుత మృతి చెందింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. స్వయంగా అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. రోడ్డు ప్రమాదాల్లో వన్యప్రాణులు మృతి చెందుతుండటంతో గతంలో కేంద్ర అటవీశాఖ స్పందించి పలు సూచనలు చేసింది. ఇందులో భాగంగా జాతీయ రహదారులపై అటవీ ప్రాంతాల పరిధిలో అండర్పాసులు నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 55 కిలోమీటర్ల మేర హైవే.. జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారి మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, మాసాయిపేట, నార్సింగి, రామాయంపేట మండలాల మీదుగా 55 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రహదారిలో 4 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. ఈ రహదారిపై వల్లూరు, రామాయంపేట వద్ద, మెదక్, ఎల్కతుర్తి 765 డీజీ జాతీయ రహదారిపై గంగాపూర్, తొనిగండ్ల, అక్కన్నపేట వద్ద అండర్పాసులు నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు సర్వే నిర్వహించిన ఆశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయినా ఇప్పటివరకు మంజూరు కాలేదు. చిరుత కళేబరాన్ని పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు -
పర్యాటక ప్రాంతంగా బోరంచ
నారాయణఖేడ్: పర్యాటక ప్రాంతంగా బోరంచ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. నల్లపోచమ్మ, సంగమేశ్వర ఆలయాల సమీపంలో ఉన్న మంజీరా నదిలో భక్తుల సౌకర్యార్థం మాఘ స్నానాల కోసం మెట్ల నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. టూరిజంలో భాగంగా బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. బోరంచ, సంగమేశ్వర ఆలయాలను మరిన్ని నిధులతో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక అభివృద్ధితో ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డి, నాయకులు దిగంబర్రెడ్డి, బీరప్ప, సిద్దారెడ్డి, శేరి రాజు పాల్గొన్నారు. అనంతరం తుమ్నూర్, ముగ్దుంపూర్ గ్రామాల్లో రూ. 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, మురుగు కాల్వ నిర్మాణం పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
రైతు గుండె చెరువు
హత్నూర(సంగారెడ్డి): కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎల్నినో ప్రభావంతో చినుకు జాడ లేకుండా పోయింది. ఏటా ఈ సమయానికి పచ్చని పైర్లతో కనువిందు చేసే సాగు భూములు ఎడారిని తలపిస్తున్నాయి. వర్షాలు లేక చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. అయితే బోర్ల కింద మాత్రం రైతులు జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. అధికారులు వద్దంటున్నా.. రైతన్నలు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. మండలంలోని 38 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 250 వరకు చెరువు, కుంటలు ఉన్నాయి. వర్షాలు కురవకపోవడంతో ఏ ఒక్క చెరువు కుంటల్లో చుక్క నీరు చేరలేదు. అయినప్పటికీ రైతులు మాత్రం వరి నాట్లు వేస్తున్నారు. వరి నాట్లు వేసిన తర్వాత భూగర్భజలాలు అడుగంటి బోర్ల నుంచి నీరు రాకపోతే వేసిన పంటలు ఎండిపోయే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడులు సైతం నష్టపోయే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమ్ముకున్న కరువు వెలవెలబోతున్న నీటి వనరులు బోర్లను నమ్ముకుని వరి నాట్లు -
ఫలించిన రాహుల్ పోరాటం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నీట్ పరీక్షా పత్రాల లీకేజీని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు, రాహుల్గాంధీ చేసిన పోరాట ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి పాతబస్టాండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈసందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మోదీ నివాసం ఎదుట రాహుల్గాంధీ ధర్నా చేసిన తర్వాతే ఈ ఉద్యమం మరింత ఉధృతమైందన్నారు. మోదీ పాలన 14 సంవత్సరాలు పూర్తయిందని బీజేపీ నాయకులు మిఠాయిలు పంచుకున్నారని.. నీట్ పరీక్ష పత్రం లీక్ కావడంతో 14 మంది మెరిట్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి -
విద్యార్థులు పోటీతత్వంతో చదవాలి
● కలెక్టర్ ప్రతిమాసింగ్ ● యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన రామాయంపేట(మెదక్): విద్యార్థులు చదువులో ప్రపంచంతో పోటీపడే విధంగా ముందుకు సాగా లని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శనివారం రామయంపేట పట్టణ శివారులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నామని తెలిపారు. రామాయంపేటలో రూ.200 కోట్లతో స్కూల్ భవన నిర్మాణ సముదాయం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయా లని సూచించారు. వచ్చే ఏడాదికల్లా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఆమె వెంట డీఈఓ రాజు, విద్య, సంక్షేమ మౌలిక సదు పాయాల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, తహసీల్దార్ రజని, జిల్లా గణాంక అధికారి నవీన్, మేఘ ఇంజనీరింగ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆంజనేయులు ఉన్నారు. గణితం బాగా నేర్చుకోవాలి చేగుంట(తూప్రాన్): విద్యార్థులు గణితం బాగా నేర్చుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. శనివారం చేగుంట కేజీబీవీని సందర్శించి పదో తరగతి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఫాస్ట్ మ్యాథ్స్ పుస్తకంలోని అంశాలను నేర్చుకుంటే గణితంలోని లెక్కలను సులభంగా సాధించే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం పాఠశాల వంటశాల, స్టోర్రూంను పరిశీలించారు. -
కొమురవెల్లికి రైలు కూత
సాక్షి, సిద్దిపేట: ఎన్నో ఏళ్లుగా భక్తులు కలలుకంటున్న కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయానికి రైలు అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం భక్తుల కోరిన కోర్కెలను తీర్చుతూ వారి కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. భక్తుల వినతుల మేరకు కొమురవెల్లికి హాల్ట్ రైల్వేస్టేషన్ను కేంద్రం మంజూరు చేసింది. రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వేస్టేషన్ను ఆదివారం(నేడు) కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రారంభించి, రైలును స్టేషన్లో నిలుపనున్నారు. కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్గా రైల్వే శాఖ నామకరణం చేసింది. కొమురవెల్లికి రైలు మార్గం రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.1,160 కోట్లు మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వేమార్గంలో భాగంగా సిద్దిపేట వరకు రైలు రాకపోకలు సాగిస్తోంది. ఈ రైల్వే ప్రాజెక్ట్ను రూ. 1,160 కోట్ల వ్యయంతో చేపట్టారు. తొలుత కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయలేదు. కేంద్ర, రాష్ట్ర మంత్రులకు భక్తులు వినతులు సమర్పించడంతో హాల్ట్ స్టేషన్ను మంజూరు చేశారు. 15 ఫిబ్రవరి 2024న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రయాణం మరింత సులభం ప్రతీ ఏటా మల్లన్న బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, కర్ణాటక, చత్తీస్గడ్, మహారాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కొమురవెల్లికి తరలివస్తుంటారు. ఇప్పటివరకు రోడ్డు మార్గంపైనే ఆధారపడాల్సి వచ్చిన భక్తులకు రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణం మరింత సులభం కానుంది. ప్రయాణ సమయం, ఖర్చు తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి కొమురవెల్లికి రూ.25లు, సిద్దిపేట నుంచి కొమురవెల్లికి రూ.10 రైల్వే చార్జీగా నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు నడుస్తున్న నాలుగు డెమూ రైళ్లను (రెండు అప్..మరో రెండు డౌన్) ప్రతీ రోజు కొమురవెల్లి స్టేషన్లో హాల్ట్ చేయనున్నారు. భక్తుల వినతితో రైల్వేస్టేషన్ ఏర్పాటు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మాణం భక్తులకు ప్రయాణం మరింత సులభం నేడు ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి -
వద్దంటున్నా వరికే మొగ్గు!
● ‘ఎల్నినో’ను పట్టించుకోని రైతులు ● జిల్లాలో ఇప్పటికే 90 వేల ఎకరాల్లో నాట్లు ● నష్టం తప్పదంటున్న అధికారులు జిల్లావ్యాప్తంగా ఈఏడాది 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అందులో 3.15 లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి పంటలు సాగవుతాయని అంచనా. మిగితా 50 వేల ఎకరాల్లో పత్తి సాగుతో పాటు కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలు సాగు చేయనున్నారు. కానీ ఎల్నినో ముప్పుతో వానాకాలం ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా జిల్లాలో చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. ఇప్పటికే లోటు వర్షపాతం నమోదు అయింది. చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేక ఎడారులను తలపిస్తున్నాయి. భూగర్భజలాలు అడుగంటి బోరు బావుల్లో నీటి ఊటలు తగ్గాయి. అడపాదడపా కురిసిన వర్షాలతో వరి సాగును తగ్గించి కంది, పెసర, మినుములు, సో యా, ఆయిల్పాం, కూరగాయలు సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా మూడు విడతలుగా విభజించి పంటలు సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో ఇప్పటికే మొదట విడతగా రైతులకు ఉచితంగా కంది విత్తనాలను అందజేశారు. అయితే జిల్లాలో బోరుబావుల ఆధారంగా 90,819 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. వర్షాలు కురవకుంటే బోరు బావుల్లో నీటి ఊటలు తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రేపటి నుంచి రెండో విడత ఈనెలాఖరు వరకు చెప్పుకోదగిన వర్షాలు కురవకపోతే రెండో విడత ప్రణాళిక అమలు చేయనున్నారు. దీంతో ఈనెల 27, 28, 29 మూడు రోజుల పాటు రైతులకు మరోమారు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు అధికారుల సన్నద్ధమవుతున్నారు. ఆరుతడి. స్వల్పకాలిక పంటలనే సాగు చేయాలని విస్తృతంగా ప్రచారం చేయటంతో పాటు అందుకు సంబంధించిన విత్తనాలను రైతు వేదికల్లో అన్నదాతలకు అందుబాటులో ఉంచనున్నారు. కొల్చారం మండలంలోని చిన్నఘణాపూర్లో వరి సాగు ఎల్నినో ప్రభావంతో ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నా, జిల్లా రైతాంగం మాత్రం వరి వైపే మొగ్గు చూపుతోంది. ఇప్పటికే 90 వేల ఎకరాల్లో వరి నాట్లుపూర్తి చేశారు. అయితే, వర్షాలు పడకపోతే నష్టం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. – మెదక్జోన్ ఆరుతడి పంటలు మేలు ఎల్నినో ముప్పు ఉందని విస్తృతంగా అవగాహన కల్పించినా, కొందరు రైతులు మా మాట పెడచెవిన పెట్టి వరిసాగు చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని రకాల పంటలు 1,31,262 ఎకరాల్లో సాగు కాగా, అందులో 90,819 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటికై నా వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి. లేనిచో నష్టం చవిచూడాల్సి వస్తోంది. – దేవ్కుమార్, డీఏఓ -
రేపు కాంప్లెక్స్
నిన్న యూరియా.. ఇక ఎరువులన్నీ యాప్లోనే! పట్టా లేని రైతులకు కష్టాలే జిల్లాలో వివిధ సమస్యల్లో ఉండి, పట్టాలు లేని భూముల్లో పలువురు రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అటవీ భూముల ఆక్రమణ, శిఖం భూములు, ఎండోమెంట్, వర్క్స్ బోర్డు, సీలింగ్, వివాదస్పద భూములను కొంతమంది రైతులు ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నారు. పట్టాలు లేకపోవడంతో సంబంధిత రైతులకు యాప్ పద్ధతిన ఎరువులు దొరికే అవకాశం ఉండదు. దీంతో వీరికి యాప్ ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. జిల్లాలో సుమారు 12 వేల ఎకరాల వరకు ఇలాంటి భూములు ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్ మాట్లాడుతూ.. త్వరలో ఎరువులన్నీ యాప్ పద్ధతిన మాత్రమే విక్రయిస్తామన్నారు. ఇప్పటికే రెండు జిల్లాలో ఈ పద్ధతి అమలవుతోందని చెప్పారు. రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. మెదక్ అర్బన్: ‘యూరియా బ్యాగ్ తయా రీకి అయ్యే ఖర్చు రూ.1,947. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1680.50. రైతులకు అమ్మాల్సిన ధర రూ. 266.50. మామూలుగా నత్రజని ఉన్న కాంప్లెక్స్ వాడితే, అదనంగా ఎకరాకు యూరియా ఒకటి నుంచి ఒకటిన్నర బస్తా సరిపోతుంది. కానీ ధర తక్కువగా ఉండటంతో రైతులు 3 బస్తాల వరకు వాడుతున్నారు. అలాగే కాంప్లెక్స్ తయారీకి రూ.3171.30 ఖర్చు అనగా, కేంద్రం రూ.1021.30 సబ్సిడీ ఇస్తుంది. విక్రయ ధర రూ.2150. ఇది ఎకరాకు రెండు బ్యాగులు సరిపోతుంది. కానీ 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. దీంతో అటు వృథాతో పాటు ఇటు కేంద్రంపై సబ్సిడీ భారం తడిసి మోపెడవుతోంది. అందుకే ఎరువుల పంపిణీకి యాప్ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది’ ప్రయోగాత్మకంగా అమలు నిన్న యూరియా.. రేపు కాంప్లెక్స్ ఎరువులు యాప్ ద్వారా విక్రయాలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో యాప్ ద్వారా ఎరువుల సరఫరా ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈనెల 28 నుంచి మెదక్ జిల్లాలో యాప్ పద్ధతిన కాంప్లెక్స్ ఎరువులు సరఫరా చేస్తారని ప్రచారం జరుగుతుండగా, అధికారులు మాత్రం త్వరలోనే యాప్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 59,870 మెట్రిక్ టన్నులు అవసరం కాలం కలసి వస్తే అనుకున్న ప్రకారం 3,67,668 ఎకరాల్లో పంటలు సాగు అయితే మొత్తం 59,870 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయి. ఇందులో యూరియా 26,500, డీఏపీ 242, ఎంఓపీ 2317, కాంప్లెక్స్ 27,480, ఎస్ఎస్పీ 1153 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయి. కాగా యాప్ ద్వారా స రఫరా అయితే, వీటి వినియోగం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్, రంగారెడ్డిలో ప్రారంభం జిల్లాలో ఈనెల 28 నుంచి అమలు! -
పేదలకు ఉచిత న్యాయ సహాయం
అల్లాదుర్గం(మెదక్): పేదలకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి సుచరిత తెలిపారు. శనివారం అల్లాదుర్గం పంచాయతీ కార్యాలయంలో గృహహింస, వ్యవసాయ చట్టాలు, మహిళలపై దాడులు, కేజీబీవీలో బాలల హక్కులు, బాల్య వివాహా లు, పోక్సోపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలపై లైంగిక దాడులు, బాల్య వివాహాలు చేస్తే పోక్సో కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాలికలు ధైర్యంగా ఉండాలని, ఎవరైన వేధిస్తే భయపడకుండా పోలీసులకు చెబితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సౌమ్య, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్రవంతి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాపన్నపేట(మెదక్): జిల్లా విద్యాశాఖ అధికారి రాజు శనివారం ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు శంకరశర్మ ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. డీఈఓగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట అక్షయ పాత్ర మెదక్ ప్లాంట్ మేనేజర్ త్రిపాఠి, పవన్ కుమార్, రాకేశ్ కుమార్, భట్టు నాగరాజు, వికాస్ రాజు, బత్తిని రాజు ఉన్నారు. రామాయంపేట(మెదక్): రామాయంపేట ప్రా జెక్టు పరిధిలోని ఆరు మండలాలకు చెందిన అంగన్వాడీ సహాయకుల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుందని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి స్వరూప తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. చేగుంట మండలంలో 14, చిన్నశంకరంపేటలో 10, రామాయంపేట, నిజాంపేట మండలాల్లో 8, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కాగా 27న చేగుంట, 28న చిన్నశంకరంపేట, 29న రామాయంపేట, నిజాంపేట, 30న వెల్దుర్తి, మాసాయిపేట మండలాలకు చెందిన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తామన్నా రు. ఆన్లైన్ రసీదుతో పాటు సర్టిఫికెట్లను వెంట తీసుకొని రావాలని సూచించారు. టేక్మాల్(మెదక్): మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎస్పీ శ్రుతికీర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర విజిలెన్స్ బృందం శనివారం తనిఖీలు చేపట్టింది. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రికార్డులు, లైసెన్స్, ధరల పట్టి కలు, రైతులకు బిల్లుల జారీ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యమైన ఎరువులను నిర్ణీత ధరలకే రైతులకు విక్రయించాలని అధికారులు సూచించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఎరువుల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకుంటున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఏఓ కోటేశ్వర్, మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ పాల్గొన్నారు. -
రిమాండ్ ఖైదీ పరారీ
ిసద్దిపేటకమాన్: వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చిన ఖైదీ పరారైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. జిల్లా జైలులో ఉన్న పలు కేసుల్లోని ఏడుగురు ఖైదీలను ఏఆర్ ఎస్ఐ ఒడ్డన్న తొమ్మిది మంది సిబ్బందితో కలిసి సాధారణ వైద్య పరీక్షల కోసం పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసు వ్యానులో తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం నలుగురు ఖైదీలను ఆస్పత్రి బయట ఉన్న పోలీసు వ్యానులో ఎక్కించారు. ఇక్కడ పోలీసులు ఎస్కార్ట్గా ఉన్నారు. మరో ముగ్గురు ఖైదీలకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వ్యానులో ఉన్న ఖైదీల్లో పలు వాహనాల చోరీ కేసుల్లో అరైస్టె జైలులో ఉన్న జొన్నల సాయికుమార్(26) అనే ఖైదీ తన చేతికి ఉన్న హ్యాండ్ కప్స్, లీడింగ్ చైన్ను తొలగించుకుని వ్యాను అత్యవసర ద్వారం నుంచి దూకి పారిపోయాడు. స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. పారిపోయిన నిందితుడు వాహనాల చోరీ కేసులో నిందితుడుగా గుర్తించి ఈ నెల 15న చిన్నకోడూరు పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. కాగా ప్రభుత్వాసుపత్రి వద్దకు సిద్దిపేట ఏసీపీ రవీందర్రెడ్డి చేరుకుని ఆరా తీశారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో మొట్టమొదటి సారి ఖైదీ పరారు కావడం చర్చనీయాంశమైంది. -
బాలికలకు అండగా పోలీస్ అక్క
పెద్దశంకరంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, వారికి అండగా నిలిచేందుకు ‘పోలీస్ అక్క’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం మండలంలోని కేజీబీవీ విద్యాలయంలో ఈ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలపై జరిగే వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపుల వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి పోలీస్ అక్కలను ఆశ్రయిస్తే వెంటనే స్పందించి చట్టపరమైన రక్షణతో పాటు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, అపరిచితుల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండడం, సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. మహిళల గౌరవం, భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్రెడ్డి, ఎస్సైలు ప్రవీణ్రెడ్డి, శంకర్, పోచయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం
చేగుంట(తూప్రాన్)/మెదక్ కలెక్టరేట్: రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మాసాయిపేట మండలం పోతన్శెట్టిపల్లిలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మ్యాపింగ్తో ప్రతి రైతుకు సంబంధించిన భూమి ఆక్రమణకు గురికాకుండా ఉంటుందని తెలిపారు. సర్వే నంబర్ల ప్రకారం హద్దులను నిర్ణయించి రికార్డులను తయారు చేస్తున్నట్లు చెప్పారు. రీ సర్వేలో చేసిన మ్యాపింగ్ ద్వారా రైతులకు సంబంధించిన భూ వివాదాలను పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం గ్రామ శివారులోని చెరువు శిఖం భూమిని పరిశీలించి చెరువు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సర్పంచ్ ప్రశాంత్, తూప్రాన్ ఆర్డీఓ బావయ్య, ల్యాండ్ సర్వే ఏడీఏ కిషన్, ఇన్చార్జి తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ ధన్సింగ్, సర్వేయర్లు అరుణ్, నర్సింలు తదితరులు ఉన్నారు. అనంతరం కలెక్టరేట్లో జలసిరిపై హైదరాబాద్ నుంచి మంత్రి సీతక్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జలసిరి కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ నగేశ్ -
బ్రేకులు లేని టేకు దందా!
సామిల్లుల చీకటి వ్యాపారం మెదక్ అర్బన్: రంపపు కోత వేదన నుంచి పచ్చని చెట్లను పరిరక్షించడానికి ప్రభుత్వం కొత్త సామిల్లకు అనుమతులు ఇవ్వడం మానేసింది. అయినా కలప స్మగ్లర్లు చీకటి మాటున టేకును నరుకుతున్నారు. అనుమతులు లేకున్నా, వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా టేకును తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నారు. జిల్లాలోని పలుచోట్ల టేకు చెట్లను అడ్డంగా నరికి సామిల్లకు తరలిస్తున్నారు. రాత్రి సమయంలో గృహాలకు అవసరమైన టేకు సైజులను కోస్తున్నారు. గత నెల జిల్లా కేంద్రంలోని ఓ సామిల్లో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ టేకు కలపను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. జిల్లాలో 44 సామిల్లులు జిల్లాలో 44 సామిల్లులు ఉన్నాయి. ఇందులో 18 మిల్లులకు టేకు వ్యాపారం చేసే అనుమతి ఉండగా, మిగితా 26 మిల్లులు లోకల్ కలప వ్యాపారం మాత్రమే చేసుకోవాలి. 2004లో సెంట్రల్ ఎన్ పవర్డ్ కమిటీ, ఇక ముందు సామిల్లులకు అనుమతులు ఇవ్వవద్దని స్టేట్ లేవల్ కమిటీలకు సూచించింది. కాగా, మిల్లులలో వర్టికల్ (నిలువు), హారిజెంటల్(అడ్డం) మిషన్లు ఉంటాయి. హారిజెంటల్ మిషన్లతో పెద్ద పెద్ద కలప మొద్దులను సైతం కోయవచ్చు. అందుకే వాటికి అప్పట్లో ఎక్కువగా అనుమతులు ఇవ్వలేదు. కానీ కొందరు వ్యాపారులు అక్రమంగా హారిజెంటల్ మిషన్లు నడుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చి.. ప్రతి సామిల్లో ఎంత కలప నిల్వ ఉండొచ్చు అనేదానికి పరిమితి ఉంటుంది. కానీ సామిల్ వ్యాపారులు, మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ఇండియన్ టేకు తెచ్చి, చీకటి వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు గత నెల 26న మెదక్లోని ఓ సామిల్పై అధికారులు దాడి చేసి, పరిమితికి మించి నిల్వ ఉన్న 140 సీఎంటీల టేకును సీజ్ చేశారు. అయితే ఇతర రాష్ట్రం నుంచి తెచ్చిన టేకు నిబంధనల ప్రకారం కొనుగోలు చేసినప్పటికీ, ఇక్కడ షాపులో మాత్రం అక్రమ పద్ధతిన నిల్వ ఉంచారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇతడిపై 2017లో సైతం కేసు నమోదు కాగా, కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. అడ్డంగా నరికేస్తున్నారు సా్థనికంగా పెంచిన లోకల్ చెట్లను గృహావసరాల కోసం వినియోగదారులు, వ్యాపారం కోసం సామిల్లు యాజమానులు అనుమతులు లేకుండా నరుకుతున్నారు. నిజానికి టేకు చెట్ల యజమానులు, చెట్టును అవసరాల కోసం వినియోగించుకోవాలంటే టీజీఎఫ్ ఎంఐఎస్ పోర్టల్లో ట్రీఫెల్లింగ్ పర్మిషన్ పేరిట దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలన చేసిన అనంతరం, చెట్టుకు రూ.500 ఫీజుతో అనమతులు మంజూరు చేస్తారు. అలాగే ఒక చెట్టు నరికితే, రెండు మొక్కలు నాటాలి. కానీ చాలా మంది అనుమతి తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇలాగైతే మరికొన్ని రోజుల్లో టేకు చెట్ల ఉనికికే ప్రమాదం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. -
రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం
హవేళిఘణాపూర్(మెదక్)/చిన్నశంకరంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేతో సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం మెదక్ మండలం కోంటూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. రీ సర్వే ద్వారా ఏళ్ల తరబడి సాగుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభించి రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామానికి సంబంధించిన భూములు కూడా స్పష్టత వస్తుందని, ప్రభుత్వ భూములను కూడా గుర్తించేందుకు వీలుందన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, ల్యాండ్ సర్వే ఏడీ కిషన్, గ్రామ రైతులు పాల్గొన్నారు. అనంతరం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందని ఆదేశించారు. జిల్లాలో 86శాతం సర్ పూర్తి నర్సాపూర్: ఓటరు జాబితా సవరణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, జిల్లాలో ఇప్పటివరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ 86 శాతం పూర్తయినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ చెప్పారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్లు, బీఎల్ఓలు, సూపర్వైజర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఓటర్ల వివరాల్లో ఉన్న వ్యత్యాసాలు, లోపాలు తగ్గించేందుకు క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
బీజేపీతో వ్యవస్థలు నాశనం
తూప్రాన్: దేశంలో బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేస్తుందని కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి యత్నించిన రాహుల్గాంధీ సహా ఇతర నేతలను అరెస్టు చేయడాన్ని నిరసనగా టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాచారం దేవస్థానం చైర్మన్ రవీందర్గుప్తా, మండలపార్టీ అధ్యక్షుడు మల్లేశ్, పట్టణశాఖ అధ్యక్షుడు భగవాన్రెడ్డి, నాయకులు నాగరాజుగౌడ్, విఠల్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్లోని మరో వర్గం విజయభాస్కర్రెడ్డి, మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
సైబర్ నేరాలపై పటిష్ట నిఘా
మెదక్జోన్: సైబర్ నేరాలపై పటిష్ట నిఘా పెట్టామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి డీజీపీ సీవీ ఆనంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. గతంలో పోలీసులు నక్సలిజం వంటి అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, ప్రస్తుతం సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, ఆహార పదార్థాల కల్తీ, రోడ్డు ప్రమాదాలు ప్రధాన సవాళ్లుగా మారాయని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆదేశించారు. ఈసందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ.. ప్రతి పోలీస్స్టేషన్లో సైబర్ వారియర్స్ను అందుబాటులో ఉంచి, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రజలను మోసాలకు గురిచేసి ఆర్థికంగా నష్టపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, జార్జ్, సైబర్ క్రైమ్, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
శిశు మరణాలను అరికట్టాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో శిశు మరణాలను అరికట్టాలని జిల్లా వైద్యాధికారి గణేశ్వర్ సంబంధిత అధికారులు, సిబ్బందిని అదేశించారు. గురువారం జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మూడు నెలల్లో జిల్లాలో 7 శిశు మరణాలు జరగడంతో వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం, నెలలు నిండకుండానే పుట్టడం, కవలలు జన్మించడం తదితర కారణాలతో మరణించినట్లు తెలిపారు. అయినప్పటికీ వైద్య సిబ్బంది, సూపర్వైజర్లు ఆస్పత్రిలో చేరిన గర్భిణులను పరిశీలించి పూర్తి ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టడానికి అవసరమైన అన్ని సూచనలు, సలహాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లా కేంద్ర ఆస్పత్రి, మాతా శిశు కేంద్రాల్లో తాగునీటి వసతులు, పారిశుద్ధ్యం తీవ్రంగా లోపించినట్లు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. తనిఖీల్లో సమస్యలున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఐఓ జయశ్రీ, మలేరియా అధికారిణి నవ్య, ఏఓ హరిప్రసాద్, మెడికల్ అధికారులు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గణేశ్వర్ -
ఆఖరి బిల్లు
శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026పెరిగిన నిర్మాణ వ్యయం మూణ్నాళ్ల ముచ్చటేనా!ఆందోళన వద్దు ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఆఖరు బిల్లులు రాలేదు. ఈ విషయమై ప్రభుత్వానికి రాసి పంపించాం. మంజూరు కాగానే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాం. బిల్లులు రాలేదని ఎవరూ ఆందోళన పడొద్దు. ఇళ్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఆర్థికంగా ఆదుకుంటుంది. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం మొదలు పెట్టని వారు వెంటనే ప్రారంభించాలి. – మాణిక్యం, హౌసింగ్ పీడీ -
రోడ్ల అభివృద్ధికి రూ.136.97 కోట్లు
ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: నియోజకవర్గ పరిధిలోని రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన నాలుగు ప్రధాన రోడ్ల అభివృద్ధికి రూ.136.97 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మె ల్యే సంజీవరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఖేడ్–రాయిపల్లి రోడ్డు 10 కి.మీ మేర అభివృద్ధికి రూ.11.58 కోట్లు, ఖేడ్–మాసాన్పల్లి రోడ్డు 22.40 కి.మీకు గాను రూ. 60.57 కోట్లు, ఖేడ్– పెద్దశంకరంపేట రోడ్డు 14.20 కి.మీకు గాను రూ. 39 కోట్లు, ఖేడ్– కరస్ గుత్తి రోడ్డు 22.30 కి. మీల మేర అభివృద్ధికి రూ. 25.82 కోట్లు మంజూరైనట్లు వివరించారు. గత ప్రభుత్వం రోడ్ల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే దెబ్బతిన్నాయని విమర్శించారు. ఆయా రోడ్ల అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రారంభిస్తామని వెల్లడించారు. నేడు విద్యుత్ సరఫరాలో 27న గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు చేగుంట(తూప్రాన్): మెదక్తో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గిరిజన గురుకులాల్లో ఈనెల 27న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు గిరిజన గురకులాల రీజినల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ తెలిపారు. 5 నుంచి 9 తరగతులతో పాటు ఇంటర్ మొదటి సంవత్సరం సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లాలో నర్సాపూర్ జూనియర్ కళాశాల, కౌడిపల్లి పాఠశాల, జూనియర్ కాలేజీల్లో చేరేందుకు కౌడిపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి నిజామాబాద్కు చెందిన నాగిరెడ్డిపేట, బాన్సువాడ, చీమన్పల్లి బాలుర గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం కామారెడ్డి పట్టణం సరంపల్లి గిరిజన గురకులంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని వివరించారు. ఇంకుడు గుంతలు తప్పనిసరి హత్నూర(సంగారెడ్డి): భూగర్భజలాలు పెంపొందించేందుకు ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఆర్డీఓ పీడీ జ్యోతి అన్నారు. గురువారం హత్నూర రైతు వేదికలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో జలసిరి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు తక్కువగా ఉన్నందున అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా కృషి చేయాలన్నారు. పొలాల్లో సైతం నీటి గుంతలను ఏర్పాటు చేసుకోవాలని రైతులను కోరారు. కార్యక్రమంలో ఏపీడి మధులత, ఎంపీడీఓ శంకర్, ఎంపీఈఓ యూసుఫ్, ఏపీఓ ప్రవీణ్, ఏపీఎం రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
నవోదయలో ఫుట్బాల్ సెలెక్షన్స్ మీట్
వర్గల్(గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ నవోదయ వేదికగా ఫుట్బాల్ రీజినల్ సెలెక్షన్స్ మీట్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. వర్షం తాకిడికి స్టేడియం చిత్తడిగా మారడంతో ఎంపీ హాల్లో ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు. ఆతిథ్య నవోదయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి మూడు రోజుల మీట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతేడాది సుబ్రతోకప్ టోర్నమెంట్ అనుభవాన్ని రంగరించి సెలెక్షన్స్ మీట్ను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. వివాదాలకు తావివ్వకుండా మీట్ సక్సెస్కు అందరూ సహకరించాలని కోరారు. వైస్ప్రిన్సిపాల్ మోహన్రాథోర్, సెలెక్షన్ కోచ్లు, ఎస్కార్ట్ టీచర్లు, వ్యాయామోపాధ్యాయులు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నవోదయ విద్యార్థులు పాల్గొన్నారు. భయపెట్టిన వర్షం..మూడు గంటలు ఆలస్యం సెలెక్షన్ మీట్ను వర్షం భయపెట్టింది. తెరిపిలేని వర్షంతో బుధవారం ఉదయం ఎంపిక పోటీలకు బ్రేక్ పడింది. వర్షం తెరిపివ్వడంతో మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం నుంచి ప్రాథమిక దశ సెలెక్షన్స్ నిర్వహించారు. రీజియన్ జట్టు కూర్పునకు ప్రావీణ్యం కలిగిన క్రీడాకారులు ఫో కస్గా కేటగిరీల వారీగా ఇవి కొనసాగాయి. -
మత్తు పదార్థాలను నివారిద్దాం: కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: మత్తు పదార్థాల రవాణాను నివారించి సమాజాన్ని కాపాడుదామని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్తో కలిసి మత్తు పదార్థాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యాంటీ డ్రగ్, రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పాఠశాలల వద్ద వంద మీటర్ల లోపు పాన్షాప్లలో గుట్కా లాంటి అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్, రెవెన్యూ, వైద్యశాఖల అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహంచి, మత్తు పదార్థాలు, పొగాకు విక్రయాలను నిరోధించాలన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో మత్తు పదార్థాల నివారణకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు రోడ్డు భద్రతపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మెదక్ను జీరో యాక్సిడెంట్ జోన్గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు.సర్కు సహకరించండి వెల్దుర్తి(తూప్రాన్): వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న సమగ్ర ఓటరు సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్, ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి వెన్నెల పరిశీలించారు. ఈసందర్భంగా సర్వే నిర్వహిస్తున్న బీఎల్ఓలతో మాట్లాడి ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అర్హులు ఓటరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు తమ వివరాలను మరోసారి పరిశీలించుకోవాలన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించి సరైన వివరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు మూడు జిల్లాల కలెక్టర్లతో సమీక్షహుస్నాబాద్: ఎల్నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ఆయా శాఖల అధికారులతో నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి మూడు జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమీక్ష ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ... వివిధ శాఖల అధికారుల యాక్షన్ ప్లాన్ తెలపడం కోసం ప్రొజెక్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల వసతి కోసం కేటాయించిన రైతు బజార్ను పరిశీలించారు. ఆర్డీఓ రామ్మూర్తి, కళాశాల అద్యాపకులు పాల్గొన్నారు. -
డిగ్రీ ప్రవేశాలకు మరోసారి ‘దోస్త్’
మెదక్జోన్: జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ‘దోస్త్’ ద్వారా మరోసారి ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే మూడు విడతలుగా అవకాశం కల్పించారు. చివరగా ఈనెల 26 వరకు పొడిగించారు. ఈనెల 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. కాలేజీల్లో రిపోర్టింగ్కు ఆగస్టు 1 వరకు ఛాన్స్ ఇచ్చారు. కాగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రారంభమై నెలన్నర అవుతున్నా, ఇప్పటివరకు కేవలం 35 శాతం సీట్టు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 75శాతం ఖాళీ గానే ఉన్నాయి. జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, కౌడిపల్లి మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 2,160 సీట్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం 749 సీట్లు మాత్రమే భర్తీ కాగా, ఇంకా 1,411 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో చేరాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు. ● మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆయా కోర్సుల్లో మొత్తం సీట్లు 1,200 ఉండగా, 620 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 580 ఖాళీగా ఉన్నాయి. ● రామాయంపేట డిగ్రీ కళాశాలలో 240 సీట్లు ఉండగా, 46 సీట్లు భర్తీ అయ్యాయి. 194 ఖాళీగా ఉన్నాయి. ● నర్సాపూర్ కళాశాలలో 480 సీట్లు ఉండగా, 69 సీట్లు భర్తీ అయ్యాయి. 411 ఖాళీగా ఉన్నాయి. ● కౌడిపల్లి డిగ్రీ కళాశాలలో 240 సీట్లు ఉండగా, 14 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 226 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 26 వరకు అవకాశం జిల్లాలో 1,411 సీట్లు ఖాళీ -
ఎల్నినోను ఎదుర్కొందాం
ముందస్తు కార్యాచరణతో ముందుకెళ్దాంసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎల్నినో ప్రభావంతో ఏర్పడనున్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక అమలుపై సోమవారం సంగారెడ్డి జెడ్పీ హాలులో సమీక్ష సమావేశం జరిగింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై లో తుగా చర్చించారు. వ్యవసాయం, తాగునీరు, పశుగ్రాసం, విద్యుత్ వంటి అంశాలకు సంబంధించిన ప్రణాళికలను ఆయాశాఖల అధికారులు వివరించారు. ఈసందర్భంగా తెలంగాణ జలసిరి పోస్టర్ను, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక నివేదికను మంత్రులు, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. స్పెషల్ సెక్రటరీ వాణిప్రసాద్, కలెక్టర్లు ప్రతీక్జైన్, ప్రతిమాసింగ్, ఎమ్మెల్యేలు మాణిక్రావు, సంజీవరెడ్డి, సునీతారెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయకట్టు రైతులను ఆదుకోవాలి సింగూరుకు దిగువన ఉన్న ఘనపురం ఆనకట్ట ఆయకట్టు రైతులను ఆదుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తెచ్చారు. సింగూరు నుంచి నీటి విడుదలకు వీలు లేకుండా పోవడంతో వారికి సబ్సిడీ విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ ఆర్థిక సాయం అందించాలన్నారు. వీలైనంత త్వరగా సింగూరు మరమ్మతులు పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కోతులకు కూ.ని. ఆపరేషన్ కేంద్రాలు కోతుల బెడద కారణంగా చాలా గ్రామాల్లో వరి తప్ప, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. కోతుల సంతానాన్ని తగ్గించేందుకు ఆపరేషన్లు చేసే కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.10 లక్షల వరకు అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపాలని మంత్రి వివేక్ కలెక్టర్లను ఆదేశించారు. అధికారుల మధ్య సమన్వయం అవసరం ‘అమృత్’ పనులపై ఆసక్తికర చర్చ సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ప్రత్యామ్నాయంపై సమీక్షసమన్వయంతో పనిచేయాలి తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి. సింగూరు నీటిని ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాలకే వినియోగించాలి. హెచ్ఎండబ్ల్యూఎస్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాలి. మున్సిపాలిటీలు, గ్రామాల్లో తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయంగా ముందస్తు ప్రణాళికను అమలు చేయాలి. పీఎం సూర్యఘర్ వంటి పథకాల లబ్ధి సామాన్యులకు అందేలా చర్యలు చేపట్టాలి. – అంజిరెడ్డి, ఎమ్మెల్సీ -
హెల్ప్డెస్క్కు వినతుల వెల్లువ
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం హెల్ప్డెస్క్ ద్వారా నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై 85 అర్జీలు అందజేశారు. సంగారెడ్డిలో జరిగిన ఉమ్మడి జిల్లా సమావేశానికి కలెక్టర్తో పాటు జిల్లాస్థాయి అధికారులంతా తరలివెళ్లారు. దీంతో కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ ద్వారా వినతులు స్వీకరించారు. వీటిని కలెక్టర్ అనుమతితో సంబంధిత శాఖలకు అందజేయనున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలోని డబుల్ బెడ్రూంలలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పలువురు వినతిపత్రం సమర్పించారు. కనీస వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. -
సఫారీ రైడ్కు రెడీ
హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ జిల్లా సరిహద్దు పోచారం అభయారణ్యంలో వన్యప్రాణులను తిలకించేందుకు ఫారెస్టు అధికారులు కొత్త సఫారీ వాహనం మంజూరు చేశారు. పాత వాహనంతో కొన్ని ఇబ్బందులు కాగా, సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు నూతన హంగులతో కూడిన సఫారీ వాహనం పంపించారు. ఇందులో 10 మంది పర్యాటకులు ప్రయాణించడంతో పాటు వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా తయారు చేశారు. గతంలో పర్యాటకులు వచ్చిన సమయంలో పాత వాహనంలో అభయారణ్యంలోకి వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. దీంతో తమ సొంత వాహనంలో ఫారెస్ట్ సిబ్బందిని తీసుకెళ్లి చూపించేవారు. నూతన సఫారీ ద్వారా హాయిగా అభయారణ్యంలో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ఇదే విషయమై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భీమ్రెడ్డి మాట్లాడుతూ.. దీనిని సందర్శకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెద్దవారికి రూ.100, చిన్నపిల్లలకు రూ.50 చెల్లించి పర్యటించవచ్చని తెలిపారు. -
ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి: ఎస్పీ
మెదక్జోన్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో వ్యక్తిగత, సా మాజిక, భూ వివాదాలు, మోసాలు, వేధింపులకు తదితర ఫిర్యాదులు వచ్చాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీసులను కలిసి ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు సూచించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్గౌడ్ వెల్దుర్తి(తూప్రాన్): బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని ఎదులపల్లికి చెందిన కందనూరి శ్రీనివాస్గౌడ్ నియమితులయ్యారు. పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాస్గౌడ్ విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. విద్యార్థుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేపట్టారు. కళాశాల అధ్యక్షుడి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగాల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ఈసందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, జిల్లాలో బీజేవైఎంను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. రాజ్యాంగ హక్కులు కాపాడుకుందాం మెదక్ కలెక్టరేట్: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న క్విట్ మోడీ, క్విట్ కార్పొరేట్ పేరుతో జైల్ భరో నిర్వహిస్తున్నట్లు ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. సోమ వారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో కేవల్ కిషన్ భవన్లో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య మాట్లాడుతూ.. మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతీ చర్య కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడేదిగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తేందుకు క్షేత్రస్థాయిలో సదస్సులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు మల్లేశం, కె. మల్లేశం, లచ్చాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనువాద పార్టీలకు చోటులేదు : వెన్నెల చిన్నశంకరంపేట(మెదక్): తెలంగాణలో మనువాద పార్టీలకు చోటులేదని తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ అన్నారు. సోమవారం చిన్నశంకరంపేటలో ఆమె మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియతో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను వాడుకొని తెలంగాణలో పాగా వేయాలని చూస్తుందన్నా రు. బీఎల్ఓలు మీ ఇంటికి రాకుంటే మీరే వారి వద్దకు వెళ్లి వివరాలు అందించాలన్నారు. కాంగ్రెస్ బీఎల్ఏలు సైతం గ్రామాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ కో ఆర్టినేటర్ ప్రతాప్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్నాయక్, సర్పంచ్లు ప్రవీణ్కుమార్, నవీన్కుమార్, నర్సింహులు, అక్బర్ పాల్గొన్నారు. ‘జీఓ 12ను రద్దు చేయాలి’ సంగారెడ్డి ఎడ్యుకేషన్: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యా లయం ఎదుట ధర్నా నిర్వహించారు. -
పరిశ్రమను మూసి వేయాల్సిందే..
మెదక్ కలెక్టరేట్: ప్రజల ప్రాణాలకు సంకటంగా మారిన పరిశ్రమను తొలగించకుంటే జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమ వారం మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం, రంగాయపల్లి గ్రామాల ప్రజలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్లోకి చొ చ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు తోడేస్తున్న కాలుష్య కారక పరిశ్రమను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమను త్వరగా మూసివేసి ఆ రెండు గ్రామాల ప్రజలను కాపాడాలన్నారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై గ్రామంలో యువకులు ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీర్డీఓ అంబదాస్ రాజేశ్వర్కు అందజేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే కలెక్టరేట్ ఎదుట వంటా వార్పు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఏఎంసీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మాజీ కౌన్సిలర్ ప్రభురెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రెండు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి -
రైతుల్లో చైతన్యం నింపాలి
ఎల్నినో ప్రభావంతో తలెత్తే ప్రతికూల పరిస్థితులను ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా ఎదుర్కొవాలి. ఇందుకోసం సంబంధితశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఎల్నినో అనేది ప్రకృతి విపత్తు అని దీన్ని ఎవరూ ఆపలేరు. దీని ప్రభావంతో జరిగే నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. వరి వంటి నీటి అవసరాలు అధికంగా ఉన్న పంటలకు బదులుగా ఆయిల్పామ్ వంటి ఆరుతడి పంటల విస్తీర్ణం పెంచేందుకు రైతుల్లో చైతన్యం నింపాలి. ఇందుకోసం సోషల్ మీడియా రీల్స్, కళాజాతలు, నాటక ప్రదర్శనలను వినియోగించాలి. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. భూగర్భజలాలు పెంచేందుకు ఇంకుడుగుంతలు తవ్వుకునేలా ప్రజలను చైతన్యం చేయాలి. – వివేక్, జిల్లా ఇన్చార్జి మంత్రి -
బఫర్లో బరితెగింపు!
మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026ఏడుపాయల్లో భూ ‘మాయ’ం ● మంజీరా పరీవాహ క ప్రాంతం ఆక్రమణ ● అనుమతి లేకుండానే 7 ఎకరాల్లో రిసార్ట్ నిర్మాణ ర ● కళ్లప్పగించి చూస్తున్న అధికారులుమెదక్జోన్: జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పరిధి పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లికి ఒకవైపు ఉండగా, మరోవైపు కొల్చా రం మండలం పోతన్శెట్టిపల్లిలో కొంత భాగం ఉంది. పోతన్శెట్టిపల్లి వైపు జాతీయ రహదారి (265–డీ) ఉండటంతో భక్తులు పెద్దఎత్తున ఇక్కడి నుంచి వస్తుంటారు. ఈక్రమంలో మంజీరా నదిపై నిర్మించిన మొదటి బ్రిడ్జి సమీపంలో కొందరు వ్యక్తులు (257/అ, 257/ఆ) సర్వే నంబర్లలో 7 ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని భారీ రిసార్ట్ నిర్మిస్తున్నారు. ఏకంగా బఫర్జోన్లోనే రోడ్డు వేసి, భారీ సిమెంట్ నీటి ట్యాంక్ నిర్మించి పనులు చేపడుతున్నారు. హైడ్రా అవసరం ఏడుపాయల పుణ్యక్షేత్రం వద్ద ఎప్పుడు చూసినా ఇసుకేస్తే రాలనంత భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి, మాఘ అమావాస్య, ఉగాది పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రభుత్వం ఏటా జాతర ఉత్సవాలకు రూ. 2 కోట్లు మంజూరు చేస్తోంది. ఇటీవల 12 కాటేజీల నిర్మాణాలకు రూ. 7 కోట్లను స్థానిక ఎమ్మెల్యే రోహిత్రావు మంజూరు చేయించారు. ఆలయానికి తెలంగాణ, ఏపీ, మహా రాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పుణ్యక్షేత్రం వద్ద, మంజీరా నది పక్కన బఫర్జోన్లో నిర్మాణాలు చేపడుతుంటే అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తున్నారు తప్ప అడ్డుకోలేకపోతున్నారు. ఇక్కడి అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా ఇక్కడికి కావాలని పలువురు కోరుతున్నారు. అనుమతి లేకుండానే.. వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలంటే నిబంధనల ప్రకారం నాలా కన్వర్షన్తో పాటు, సంబంధిత పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండానే పెద్ద ఎత్తున రిసార్ట్ నిర్మిస్తున్నారు. అందులో వాటర్ ఫౌంటేన్, కాటేజీల నిర్మాణాలు సాగుతున్నాయి. గతేడాది మాదిరిగా మళ్లీ వర్షాలు కురిస్తే ప్రస్తుతం బఫర్జోన్లో నిర్మిస్తున్న రోడ్డు, నీటి కుండీలు కొట్టుకపోవటం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు. అంతే కాకుండా ప్రాణాపాయం జరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు.బఫర్జోన్లో నిర్మించిన నీటి ట్యాంక్చర్యలు తీసుకుంటాం ఏడుపాయల్లోని పోతంశెట్టిపల్లి శివారులో నూతనంగా నిర్మిస్తున్న రిసార్ట్ను కొంతభాగం బఫర్జోన్లో నిర్మించారు. మంజీరా నది అంచున రోడ్డు వేసి నీటి ట్యాంకును నిర్మించారు. వాటిని తొలగించాలని సదరు వ్యక్తులకు నోటీసులు ఇచ్చాం. తొలగించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – స్వాతి, డీఈ ఇరిగేషన్, కౌడిపల్లి -
సింగూరు నీళ్లు 45 రోజులకే..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి, మెదక్ జిల్లాల వాసులకు తాగునీటి కష్టాలు పొంచి ఉన్నాయి. సింగూరు డ్యాం మరమ్మతుల నేపథ్యంలో ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటి మట్టం కేవలం 45 రోజులకు మాత్రమే సరిపోతాయని మిషన్ భగీరథ అధికారులు తేల్చి చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురియక.. మంజీరా నదికి వరద నీరు రాకపోతే ఈ రెండు జిల్లాల్లోని 316 గ్రామాలు, నివాసిత ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయలేమని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో 275, మెదక్ జిల్లాలో 41 గ్రామాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందేనని అన్నారు. సోమవారం జెడ్పీ సమావేశం హాల్లో జరిగిన సమీక్షలో మిషన్ భగీరథ ఉమ్మడి జిల్లా పర్యవేక్ష ఇంజనీర్ రఘువీర్ ప్రకటించారు. 3 టీఎంసీల కంటే తగ్గితే పంపింగ్ కష్టమే.. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 4.29 టీఎంసీల మేరకు మాత్రమే నీరుంది. ఈ జలాశయం నీటి నిల్వ కనీసం మూడు టీఎంసీల కంటే తగ్గితే అక్కడి నుంచి నీటిని పంపింగ్ చేయడం వీలు కాదు. దీంతో ఉన్న ఒక టీఎంసీ కేవలం నెల రోజులకే సరిపోతాయని, గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొంత మేరకు ప్రాజెక్టులోకి నీళ్లు రావడంతో మరో పక్షం రోజులు అదనంగా సరఫరా చేయడానికి వీలు పడుతుందని ఎస్ఈ వివరించారు. ఈ పరిస్థితి ఎదురైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆశాఖ అధికారులు ప్రకటించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. అవసరమైతే ఆయా గ్రామాల్లో ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవడం, పాడైపోయిన బోర్లను మరమ్మతులు చేయడం, లోతు తక్కువగా ఉన్న బోర్లను మరింత లోతుకు తవ్వడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఈప్రణాళికను తయారు చేస్తున్నారు. అప్పటిలోగా మంజీరాకు వరదరాకపోతే నీరు ఇవ్వలేం తేల్చి చెప్పిన మిషన్ భగీరథ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటనమున్సిపాలిటీల్లో సైతం.. రెండు జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీల్లో ఇప్పటికే పలు కాలనీలకు తాగునీటి సరఫరా కష్టాలు షురువయ్యాయి. సదాశివపేట పట్టణంలో రెండు, మూడు వార్డులకు రెండు రోజులకోసారి నీటి సరఫరా అవుతోంది. అలాగే సంగారెడ్డి మున్సిపాలిటీలో పాత బస్టాండ్ ప్రాంతంలో తాగునీటి సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. జహీరాబాద్, కోహీర్, మెదక్, రామాయంపేట తదితర పట్టణ వాసుల అవసరాలకు, ప్రస్తుతం జరుగుతున్న నీటి సరఫరాకు వ్యత్యాసం ఉంటోంది. ఇప్పుడు సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు రాకపోతే మూడు వందలకు పైగా గ్రామాల వాసులకు తాగునీటి కష్టాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
స్టేడియం అభివృద్ధి చేయండి
మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి మెదక్జోన్: జిల్లా కేంద్రంలోని పట్లోళ్ల నారాయణరెడ్డి (పీఎన్ఆర్) స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరికి లేఖ రాశారు. ఈ స్టేడియంలో నిత్యం క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తుంటారని, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అభివృద్ధి కోసం నిధులు మంజూరు లేఖలో విజ్ఞప్తి చేశారు. మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో నేడు నిర్వహించే ప్రజావాణిలో హెల్ప్డెస్క్ ద్వారా వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా మంత్రుల సమావేశం ఉందని. దీంతో జిల్లాలోని ఆయా శాఖల అధికారులందరూ ఈ సమావేశానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రజలు తమ తమ సమస్యలపై హెల్ప్డెస్క్ ద్వారా వినతులు అందజేయాలని కలెక్టర్ సూచించారు. రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీలో అమృత్ పథకం కింద కేంద్రం మంజూరు చేసిన నిధులు పెద్ద మొత్తంలో దుర్వినియోగం అయ్యాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడి తీర్చడానికి గాను కేంద్రం ఈ నిధులు మంజూరు చేసిందన్నారు. వీటితో కొత్త కాలనీల్లో పైప్లైన్లు వేయాల్సి ఉందన్నారు. ఇందుకు విరుద్దంగా గతంలో పైప్లైన్ వేసిన కాలనీల్లోనే మళ్లీ వేశారని ఆరోపించారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల ఆవరణలో నిర్మించిన ట్యాంకుల నిర్మాణ పనులు సక్రమంగా జరగలేదన్నారు. పనుల్లో సరైనా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, ఇంజనీరింగ్ అధికారులు సైతం నాయకుల బత్తిడికి తలొగ్గారని మండిపడ్డారు. ఈవిషయమై విచారణ జరిపించి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్చెరు టౌన్: బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారానికి చెందిన నవీన్గౌడ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం హైదరాబాద్లోని బీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా నియామకపత్రం అందజేశారు. ఈసందర్భంగా నవీన్గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల పక్షాన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే విధంగా తన వంతుగా కృషి చేస్తానన్నారు. జిల్లాలో అన్ని కమిటీలు వేసి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ కో ఆర్డినేటర్ అరుణ్ కుమార్, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి: నియోజకవర్గంలో అర్హులైన ఏ ఒక్కరి ఓటు మిస్ కాకుండా కాంగ్రెస్ బీఎల్ఏలు, నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. గత నెల రోజులుగా అమలవుతున్న సర్ ప్రక్రియపై ఆదివారం పట్టణంలోని ఓ గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డితో కలిసి ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 282 బీఎల్ఏలతో ఒక్కొక్కరితో జగ్గారెడ్డి ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటికి ఎన్ని ఫారాలు పంపిణీ చేశారు, ఇచ్చిన ఫారాల్లో ఎన్ని తిరిగి వచ్చాయి, ఇంకా ఎన్ని రావాల్సి ఉంది అని అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 66.67% ఓటరు నమోదు పూర్తయిందని, గడువులోగా మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. మూడు రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధా న కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు కూన సంతోష్, కిరణ్గౌడ్ పాల్గొన్నారు. -
నానో టెక్నాలజీతో శాసీ్త్రయ ఆలోచనలు
● ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి ● సీఈఎన్ఎస్ ఆధ్వర్యంలో ‘ నానోజాత– 2026’ మాట్లాడుతున్న ఐఐటీహెచ్ డైరెక్టర్ మూర్తిసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్), బెంగళూరులోని సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ (సిన్స్) సంయుక్తాధ్వర్యంలో ఆదివారం క్యాంపస్లో ‘నానో జాతా–2026’ జాతీయ సైన్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆగస్టు 3 నుంచి 5 వరకు బెంగళూరులో జరగనున్న ఇండియా నానో–2026’ సదస్సుకు ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అడ్వాన్స్ 5జీ, 6జీ కమ్యునికేషన్లు, అంతరిక్ష సాంకేతికతలు, స్వచ్ఛ ఇందనం, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాల్లోని అంశాలను ఈ చర్చా వేదికల్లో, ఉపన్యాసాల్లో చర్చించారు. ఈసందర్బంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి మాట్లాడుతూ.. నానోజాత కార్యాక్రమం విద్యార్థులు, యువతలో శాసీ్త్రయ ఆలోచన విధానాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. సుస్థిర సమాజ నిర్మాణంలో ఈ టెక్నాలజీకి అపారమైన అవకాశాలున్నాయన్నారు. సీఈఎన్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎల్.వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు బహుళ విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు కలిగిన పరిశోధకులు అవసరమన్నారు. నానో టెక్నాలజీతో సుస్థిర భవిష్యత్తును సాధ్యం చేస్తుందన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన ఎగ్జిబిషన్లో ఫ్రూట్ జ్యూస్ నుంచి విద్యుత్ ఉత్పాదన, హ్యుమిడిటీ సెన్సార్స్, సోడియం–అయాన్ బ్యాటరీలు, గ్రాఫేన్ ఆధారిత విద్యుత్ సర్క్యూట్ల వంటివి విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలను రేకెత్తించాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని వివిధ ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలు, ఇతర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఈ ఆవిష్కరణలను తిలకించారు. -
సొంతూరులోనే సర్
● మెజార్టీ ఓటర్ల అభిప్రాయమిదే ● ఊరిలో ఓటు ఉంటేనే విలువ అనే భావన ● ముమ్మరంగా సాగుతున్న డిజిటలైజేషన్ ● 100 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జిల్లాలో మెదక్, నర్సాపూర్ రెండు నియోజకవర్గాలు ఉండగా, 4.53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కాగా, పల్లెటూర్ల నుంచి పెద్దఎత్తున వలస వెళ్లినవారు ఉన్నారు. ఇందులో గిరిజన తండాలకు చెందిన వారు ఉపాధిని వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్లగా, కొందరు ఉద్యోగరీత్యా, మరికొందరు పిల్లల చదువులు, ఇంకొందరు వ్యాపారాల నిమిత్తం పల్లెలను వదిలి పట్టణాలకు వలస వెళ్లారు. వారిలో 90 శాతానికి పైగా సొంతూరుతో పాటు పట్టణాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. కాగా, పల్లెలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోరిక మేరకు పట్టణాల నుంచి పల్లెలకు వచ్చి ఓటు వేస్తున్నారు. అలాగే పట్టణాలు, నగరాల్లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన సమయంలో అక్కడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈక్రమంలో ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు సవరణ(సర్) ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీంతో ఎక్కడో ఒకే చోట మాత్రమే ఓటు కలిగి ఉండాలని, లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో తమకు సొంతూరులోనే ఓటు కోసం చాలా మంది వలసదారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే గ్రామాల్లో ఆస్తులు అమ్ముకొని పట్టణాల్లో స్థిరపడిన వారు మాత్రమే పట్టణాల్లో ఓటు నమోదు చేసుకుంటున్నారు. పట్టణాల్లో తగ్గనున్న ఓటర్లు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 586 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను అందించారు. కాగా, జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. చుట్టుపక్కల పల్లెల ప్రజలు బల్దియాలతో పాటు హైదరాబాద్ లాంటి నగరాల్లో స్థిరపడిన వారు ఉన్నారు. పల్లెలోనూ, పట్టణాల్లోనూ రెండు చోట్ల ఓట్లు ఉన్న వారు రెండేసి ఫారాలను అందుకున్నారు. వాటిని నింపి బీఎల్ఓలకు తిరిగి ఇచ్చే సమయంలో ఇబ్బంది పడుతున్నారు. రెండు చోట్ల ఫారాలు అందిస్తే ఆధార్కార్డు ఆధారంగా గుర్తిస్తే మా పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రామాల్లోనే ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తూ పట్టణాల్లో తీసుకున్నవి తిరిగి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఫలితంగా పట్టణాల్లో ఓటర్ల సంఖ్య చాలా వరకు తగ్గే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. 79.84 శాతం డిజిటలైజేషన్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 4,53,140 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మెదక్లో 2,20,427 మంది ఉండగా, ఇప్పటివరకు 1,79,749 ఓటర్ లిస్టు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో 81.55 శాతం పూర్తి కాగా, నర్సాపూర్లో 2,32,713 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 1,82,051 ఓటర్ లిస్టు డిజిటలైజేషన్ అయింది. ఈలెక్కన 78.23 శాతం అయింది. మొత్తంగా జిల్లాలో 79.84 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. వందశాతం ఎన్యూమరేషన్ ఫారాలు అందించినట్లు తెలిపారు. కాగా, సర్ ప్రక్రియను కలెక్టర్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. అయితే గ్రామాల నుంచి పట్టణాలకు ఉపాధి కోసం వెళ్లిన వారు, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు మాత్రం తమ ఓటు హక్కును స్వగ్రామంలోనే ఉంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలా ఏళ్లుగా పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు మాత్రం అక్కడే ఓటు ఉంచుకుంటున్నారు. – మెదక్జోన్ జిల్లాలో ఇలా.. నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్ మెదక్ 2,20,427 81.55 నర్సాపూర్ 2,32,713 78.23 -
సీఎం రేవంత్ రైతు ద్రోహి
చిన్నకోడూరు(సిద్దిపేట): కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలమైన సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు ఇచ్చి కేసీఆర్ కర్షక బిడ్డగా నిలిస్తే, కన్నేపల్లి పంప్హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉండి కూడా సాగునీరు ఇవ్వకుండా రేవంత్రెడ్డి రైతుద్రోహిగా మారారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. చిన్నకోడూరు మండలంలో చేపట్టిన రైతుపాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. రైతులకు రూ.35 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి కేవలం రూ.18 వేల కోట్లు ఇచ్చి సగం మంది రైతలను మోసం చేశారన్నారు. మూడు పంటలకు సంబంధించి రూ.19 వేల కోట్ల రైతుబంధును ఎగనామం పెట్టారని, కేసీఆర్ తెచ్చిన రైతు బీమా పూర్తిగా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నేపల్లి పంపులు ఆన్ చేసి రైతుల కష్టాలు తీర్చాలని, లేనిపక్షంలో చిన్నకోడూరు రైతుల స్ఫూర్తితో అన్ని మండలాల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనకు విసిగిపోయి రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు -
ప్రతీ ఒక్క ఓటరును కలవాలి
నారాయణఖేడ్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, సర్ ఖేడ్ నియోజకవర్గ ఇన్చార్జి మహ్మద్ ఫయీం కోరారు. ఖేడ్ నియోజకవర్గంలోని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, బీఎల్ఏలకు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్ గడువును వచ్చే నెల 3 వరకు పెంచారని తెలిపారు. దీనిని వరంగా భావించి కష్టపడి పనిచేయాలని సూచించారు. బీఎల్ఏలు తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి అర్హులైన ప్రతీ ఒక్క ఓటరుతో పాటు విద్య, ఉపాధి కోసం ఇతరత ప్రాంతాలకు వెళ్లిన వారిని గుర్తించి వారిచే ఫారాలను నింపించాలని సూచించారు. తమ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంత మంది ఫారాలు నింపి సమర్పించారనే విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలంటూ చెప్పారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
గాంధీభవన్ చేరిన శివ్వంపేట పంచాయితీ
శివ్వంపేట(నర్సాపూర్): శివ్వంపేట మండల కాంగ్రెస్ పంచాయితీ గాంధీభవన్ చేరింది. నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి వైఖరి నిరసిస్తూ శనివారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్కు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా సుదర్శన్గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన నా యకులు, కార్యకర్తలను నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధిపొంది పార్టీ మారిన వారితో కుమ్మకై గ్రామాల్లో పర్యటిస్తున్నాడని తెలిపారు. పార్టీకి నష్టం చేకూరుస్తున్న ఇన్చార్జిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్గౌడ్, నర్సింలు, శ్రీనివాస్గౌడ్, వెంకట్రెడ్డి, అశోక్, తిరుపతిరాథోడ్, అంజిరెడ్డి, ప్రహ్లాద్చారి, పాండ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. హోటళ్లపై దాడులు.. జరిమానాలు రామాయంపేట(మెదక్): నాసిరకం పదార్థాలు విక్రయిస్తున్న హోటళ్లు, బేకరీలపై మున్సిపల్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈనెలలో మూడుసార్లు ఆకస్మిక తనిఖీలు ని ర్వహించి, జరిమానాలు విధించారు. తాజాగా శనివారం సానిటరీ ఇన్స్పెక్టర్ వనిత ఆధ్వర్యంలో పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించి నాసిరకం పదార్థాలను గుర్తించారు. ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకులకు రూ. 10 వేలు, రెండు హోటళ్లకు రూ. 5 వేల చొప్పున జరిమానా విధించారు. హోటళ్లలో పరిశుభ్రత పాటించకపోవడం, ప్లాస్టిక్ వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేసినందుకు జరినామానా విధించారు. వర్షం.. పంటలకు జీవం టేక్మాల్(మెదక్): మండలంలోని ఆయా గ్రా మాల్లో శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం పంటలకు జీవం పోసింది. గత 15 రోజులుగా వర్షాలు లేక ఎండలు తీవ్రస్థాయికి చేరి మొలకలు ఎండుముఖం పట్టాయి. పత్తి, కంది, పెసర, మినుము పంటలకు వర్షం ఊపిరి పోసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మరింత వర్షం కురిసి చెరువు, కుంటలను నింపాలని వరుణ దేవుడిని వేడుకుంటున్నారు. పంటల ఎంపికలో జాగ్రత్తలు అవసరం నర్సాపూర్: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో వాతావరణశాఖ సూచనలు పాటిస్తూ పంటల ఎంపికలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్ సూచించారు. శనివారం స్థానిక రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యా మ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. పలు ప్రాంతాల్లో వర్షాపాతం తగ్గుతుందని, అధిక ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయన్నారు. రైతులు నీటి లభ్యతను బట్టి పంటల సాగు చేయాలని, తక్కువ నీరు అవసరమయ్యే కంది, పెసర, జొన్న తదితర పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్రావు, ఏడీఏ సంధ్యారాణి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మండల వ్యవసాయాధి కారి దీపిక, మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఖైదీల హక్కులు పరిరక్షించాలి సంగారెడ్డి టౌన్: ఖైదీల సంక్షేమ హక్కులు పరిరక్షించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవా ని చంద్ర అన్నారు. శనివారం కందిలోని సెంట్రల్ జైలును జైలు సూపరింటెండెంట్ సంజయ్ కుమార్తో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైదీల హక్కుల పరిరక్షణకు అవసరమైన న్యాయ సేవలు అంది ంచడం న్యాయ సేవాధికారి సంస్థ లక్ష్యం అని, ఖైదీలతో వారికి సమయానికి ములాఖాత్లు అందించాలన్నారు. -
ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026
అథ్లెటిక్స్ సందడి మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని శాయ్ స్టేడియంలో శనివారం 4వ రాష్ట్రస్థాయి అండర్ 14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నెహ్రూ యువకేంద్రం జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్రావు పోటీలను ప్రారంభించి మాట్లాడారు. స్టేడియంలో అన్ని వసతులు కల్పించి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ రఘునందన్రావుతో మాట్లాడి ఖేలో ఇండియా నిధులు సైతం తీసుకొస్తామన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుతో కలిసి అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ.. స్టేడియం అభివృద్ధికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు. కాగా, పోటీలకు వివిధ జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది బాలబాలికలు హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అతిథులు ప్రశంసాపత్రాలతో పాటు మెడల్స్ ప్రధానం చేశారు. -
సాంస్కృతిక వారసత్వం జోడించాలి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) 15వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ విద్యాసంస్థ ఈసారి రికార్డు స్థాయిలో 1,398 మంది బీటెక్, ఎంటెక్, పరిశోధన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేసింది. ‘ఆవిష్కరణలతోనే జాతి నిర్మాణం’అనే సంస్కృత వాక్యాన్ని తమ అధికారిక నినాదంగా ఐఐటీహెచ్ ప్రకటించింది. కార్యక్రమంలో ముఖ్యఅథితిగా పాల్గొన్న పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పద్మా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... శాసీ్త్రయ నైపుణ్యాన్ని భారతదేశపు గొప్ప మేథో, సాంస్కృతిక వారసత్వంతో మేళవించాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ‘విజ్ఞానశాస్త్రం, కళలు మన భరతమాతకు రెండు కళ్లలాంటివని విజ్ఞానశాస్త్రం మన శారీరక ఆరోగ్యాన్ని కాపాడితే, కళలు మనిషిలోని దైవత్వాన్ని మేల్కొలుపుతాయని చెప్పారు. ఆధునిక సాంకేతికత ప్రాచీన జ్ఞానం నుంచి స్ఫూర్తి పొందాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్.బీఎస్.మూర్తి, పాలకవర్గం చైర్మన్ బీ.వీ.ఆర్.మోహన్రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒత్తిడికి గురికావద్దు విద్యార్థులకు పరీక్షలు..ప్రాజెక్టులు..ఇలా కొంత ఒత్తిడి ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు తమ సమస్యను స్నేహితులతో, కుటుంబసభ్యులతో చర్చించాలి. అప్పుడే ఒత్తిడిని జయించి చదువుపై శ్రద్ధ నిలపగలుతాం. ఇక్కడ ఎం.టెక్ (ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్) పూర్తయింది. ఐఏఎస్, ఐపీఎస్ కావాలనే లక్ష్యం ఉంది. 10+2 వరకు చత్తీస్ఘడ్ రాష్ట్రంలోనే చదువుకున్న. – సిద్దార్థ్ అగర్వాల్, ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రణాళికాబద్ధంగా చదువు సాగాలి ఐఐటీహెచ్లో చదువుకోవడం ఆనందంగా ఉంది. ఒత్తిడికి గురి కాకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే అనుకున్నది సాధించవచ్చు. ప్లేస్మెంట్లో ముంబైలోని ఇండస్ఇండ్ బ్యాంక్ ఐటీ విభాగంలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నత చదువులు కొనసాగిస్తాను. సాంకేతిక ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకోవడం ఆనందంగా ఉంది. –హరిణి కోవూరి, బీటెక్, ఎంఎస్ఎంఈపద్మవిభూషణ్ అవార్డుగ్రహీత పద్మా సుబ్రహ్మణ్యం -
క్షేత్రస్థాయిలో అధ్యయనం
వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రంలో కాకతీయ రాజులు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి చారిత్రక కట్టడాలను శనివారం పర్యాటక శాఖ కన్సల్టెంట్లు స్రవంతి గుప్తా, భువన్ సోమని పరిశీలించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా సందర్శించినట్లు వారు చెప్పారు. ఈసందర్భంగా ప్రాచీన కట్టడాల చారిత్రక ప్రాధాన్యం, ప్రస్తుత పరిస్థితి, సంరక్షణ అవసరాలు, అభివృద్ధి అవకాశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఈ ప్రాంతంలో పర్యాటకులను ఆకర్షించేలా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, వారసత్వ సంపద పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. పరిశీలన అనంతరం తమ నివేదికను రాష్ట్ర పర్యాటక శాఖకు సమర్పించనున్నట్లు వెల్లడించారు. -
ఆరుతడి పంటలు సాగు చేయండి
● ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం ● జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ చేగుంట(తూప్రాన్): రైతులు వర్షాభావానికి తగిన పంటలు వేసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. శనివారం చేగుంట రైతు వేదికలో కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయగా, మంత్రి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గిపోయినట్లు తెలిపారు. రాబోయే రెండు నెలల్లో వర్షాలు పడే సూచనలు లేవని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారని తెలిపారు. రైతులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలు ప్రజలను రైతులను తప్పుదోవపట్టించే విధంగా చూస్తున్నారని, వారి మాటలు ఎవరూ నమ్మొద్దన్నారు. తాగునీటికి ఎలాంటి కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాబోయే పరిస్థితులకు అనుగుణంగా పంటలను పండించాలని వివరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్కుమార్, తూప్రాన్ ఆర్డీఓ బావయ్య, మండల స్పెషల్ ఆఫీసర్ హేమాభార్గవి, ఏఎంసీ చైర్మన్ వెంగళ్రావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డితో పాటు రైతులు పాల్గొన్నారు. అనంతరం చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ష్యూరీఫై సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, స్టడీ మెటీరియల్స్ను మంత్రి అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి పాఠశాల విద్యకు ప్రాముఖ్యత కల్పిస్తున్నారని తెలిపారు. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళ్రావు, మండల పార్టీ శాఖ అధ్యక్షుడు నవీన్, ఎంఈఓ నీరజ ఫౌండేషన్ ఎండీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలోని పలు దర్శనీయ స్థలాలకు రూ.3 కోట్లు
మెతుకుసీమ పర్యాటక సొబగులు అద్దుకోనుంది. చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న జిల్లాను అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రత్యేక చొరవతో మెదక్ ఖిల్లాతో పాటు పలు దర్శనీయ స్థలాలకు రూ.3 కోట్లు మంజూరు కాగా, ఏడుపాయల్లో కాటేజీల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.7 కోట్లు విడుదల చేసింది. – మెదక్జోన్ తాను హీరోగా చేయబోయే చిత్రం, లేదా నిర్మించే సినిమా షూటింగ్ మెదక్ ఖిల్లాపైనే చేస్తానని సినీ నటుడు మంచు విష్ణు తెలిపారు. శనివారం ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. మొదట ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెదక్ ఖిల్లా, చర్చిని సందర్శించి మాట్లాడారు. ఇతర దేశాలతో పోలిస్తే మన చరిత్ర 95 శాతం పదిలంగా ఉందని, ఇంతటి అద్భుతమైన ఖిల్లా నిర్మాణం హైదరాబాద్కు అతి సమీపంలో ఉందని, దీని గురించి ఇప్పటికీ తెలుసుకోకపోవటంపై సిగ్గుపడుతున్నా అని అన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ నగేశ్, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్గౌడ్, తదితరులు ఉన్నారు. మెతుకుసీమకు ఘనమైన చరిత్ర ఉంది. 5 వేల సంవత్సరాలకు పూర్వం బుషులు తపస్సు చేసిన పుణ్యభూమిగా విరాజిల్లుతోంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం, కాకతీయుల కాలంలో నిర్మించిన మెదక్ ఖిల్లా, ప్రఖ్యాతిగాంచిన చర్చి, పోచారం ప్రాజెక్టు, దానిపక్కనే అభయారణ్యం, ఇలా ఎన్నో దర్శనీయ, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. టూరిజం సర్క్యూట్ ఏర్పాటు జిల్లాలోని దర్శనీయ స్థలాలన్నింటినీ అభివృద్ధి చేసి టూరిజం సర్క్యూట్గా ఏర్పాటు చేస్తే జిల్లాకు జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు రావటంతో పాటు అన్ని విధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ భావిస్తున్నారు. దీంతో జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే ఇటీవల రాష్ట్ర టూరిజం స్పెషల్ సెక్రటరీ వాణీప్రసాద్ను ఆహ్వానించి జిల్లాలోని చారిత్రక నేపథ్యం గల స్థలాల గురించి వివరించారు. దీంతో ఆమె టూ రిజం అభివృద్ధికి రూ. 3 కోట్లు మంజూరు చేశారు. అందులో రూ. 55 లక్షలు ఖిల్లా కోసం కేటాయించగా, మిగితావి ఇతర స్థలాల అభివృద్ధికి కేటాయించనున్నారు. అలాగే ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి రూ.7 కోట్లు మంజూరీ చేశా రు. వాటితో 12 కాటేజీలను నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చారిత్రక ప్రదేశాల పరిశీలన జిల్లాలో టూరిజంను అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ ప్రత్యేకంగా ఇద్దరు ప్రైవేట్ కన్సల్టెంట్లను పిలిపించారు. వారు జిల్లాలో చారిత్రక నేపథ్యం గల ప్రదేశాలను పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని చెప్పడంతో గత కొన్ని రోజులుగా వారు జిల్లాలోని దర్శనీయ, చారిత్రాక ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. వాటిని అభివృద్ధి చేసేందుకు అయ్యే ఖర్చు, తదితర అంశాలపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. -
ఉద్యోగులకు ఆరోగ్యమస్తు
● 1,816 చికిత్సలు.. రూ. 2 లక్షల గరిష్ట పరిధి ● జిల్లాలో 7,500 ఉద్యోగులు, 3,700 పింఛన్దారులు ● 886 ఆస్పత్రుల్లో సేవలుపాపన్నపేట(మెదక్): ఏళ్ల తరబడి ఉద్యోగులు ఎదురుచూసిన నగదు రహిత వైద్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. పదమూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈహెచ్ఎస్ స్కీం మొక్కుబడిగా మారగా, శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభించింది. మొత్తం 1,816 వైద్య చికిత్సలకు ఈ పథకం కింద వైద్య సేవలు అందనున్నాయి. రాష్ట్రంలోని పేరొందిన 886 పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉంది. ఒక వైద్య చికిత్సకు గరిష్ట పరిమితి రూ.2 లక్షలుగా నిర్ధారించారు. ప్రతి ఉద్యోగికి హెల్త్ డిజిటల్ కార్డు ఇస్తారు. జిల్లాలో సుమారు 7,500 ఉద్యోగులు, 3,700 పింఛన్దారులకు ప్రయోజనం కలుగనుంది. ఉసూరుమన్న ఈహెచ్ఎస్ ఏళ్ల తరబడి చేస్తున్న ఉద్యోగుల డిమాండ్ మేరకు 2013 ప్రాంతలో ఈహెచ్ఎస్ పథకం ప్రవేశపెట్టారు. కానీ, అది మూన్నాళ్ల ముచ్చటగా మారింది. నిమ్స్తో పాటు నాలుగైదు కార్పొరేట్ ఆస్పత్రుల్లో తప్ప, ఎక్కడా నగదు రహిత వైద్య సేవలు అందలేవు. దీంతో చికిత్స చేయించుకున్న ఉద్యోగులు, మొదట డబ్బులు చెల్లించి, తర్వాత రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకునే వారు. ఇందులో సగం డబ్బులు కూడా మంజూరయ్యేవి కావన్న ఆరోపణలున్నాయి. ఆర్థిక పరిస్థితులు సరిగా లేని ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు. కొత్త పథకంపై కోటి ఆశలు ఎన్హెచ్ఈఎస్ పథకం ఉద్యోగులకు ఆరోగ్య భరోసా కల్పిస్తుంది. ప్రతి నెలా ఉద్యోగి, పింఛన్దారు మూల వేతనం నుంచి 1.5 శాతం వాటా కింద మినహాయించుకుంటారు. అంతే మొత్తాన్ని ప్రభుత్వం ఈ నిధికి జమ చేస్తుంది. భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒక్కరి నుంచే వాటా జమ చేస్తారు. అర్హులైన ప్రతి ఉద్యోగి, పింఛన్దారు ఈహెచ్సీటి పోర్టల్ నుంచి డిజిటల్ హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రూ.5 లక్షలకు పెంచాలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యూ ఈహెచ్ఎస్ పథకం ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరం. అయితే ఒక్కో చికిత్సకు నిర్ణయించిన గరిష్ట పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్య ఖర్చులు భరించాలంటే కష్టం. – జగదీశ్చంద్ర, రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు పండుటాకులకు వరం రిటైర్డ్ అయిన పండుటాకులకు నూతన ఆరోగ్య పథకం ఒక వరం. ప్రాణపాయ పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం అందించడానికి కొంత మంది పిల్లలు ముందుకు రావడం లేదు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందించాలి. – లక్ష్మణ్ కుమార్, జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, కోశాధికారి -
26న కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. సుమారు రూ.5కోట్లతో నిర్మించిన కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్యాదవ్తో కలసి 2024 ఫిబ్రవరి 15న శంకుస్థాపన చేసిన ఈ రైల్వేస్టేషన్ పనులు పూర్తయ్యాయి. ఈనెల 26 కిషన్రెడ్డి చేతుల మీదు గా ప్రారంభించనున్నారు. దీంతో హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని ఇతరప్రాంతాల నుంచి కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతగా మారనుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు ప్రతీ రోజు రెండు రైళ్లు రైల్వేశాఖ నడిపిస్తుంది. సిద్దిపేట నుంచి కొత్తపల్లి వరకు రైల్వే పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలనుంచి కొమురవెల్లికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభం కా నుంది. భక్తుల రద్దీ, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రైళ్ల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా రైల్వేశాఖ పరిశీలించనుంది. -
ఇసుక తీసి
మట్టిని కడిగి..● నిత్యం వందలాది ట్రాక్టర్లతో అక్రమ రవాణ ● కరువులోనూ కాసులు కురిపిస్తున్న వైనం ● పట్టించుకోని అధికార యంత్రాంగం తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు మొదలుకొని అన్నివర్గాల ప్రజలు ఆందోళన చెందుతుంటే, మట్టిని ఇసుకగా మార్చి కొందరు అక్రమార్కులు కాసులుగా మార్చుకుంటున్నారు. పుష్పాలవాగులో ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసి నిత్యం వందలాది ట్రాక్టర్ల మట్టిని తవ్వుతూ రూ. లక్షలు గడిస్తున్నారు. పట్టణానికి కూతవేటు దూరంలో ఈ అక్రమ దందా జరుగుతున్నా, అధికారులు మిన్నకుండి పోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. – మెదక్జోన్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో తూర్పు, దక్షిణ భాగంలో పుష్పాలవాగు ఉండగా, దక్షి ణం వైపున బొల్లారం మత్తడి ఉంది. కాగా, ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవటంతో వాగుతో పాటు బొల్లారం మత్తడిలోనూ చుక్కనీరు లేక ఇసుక మేటలు తేలాయి. దీంతో అక్రమార్కుల కన్ను ఇటు వైపు పడింది. అడ్డూ అదుపూ లేకుండా నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. ఇసుక మేటలు తరిగిపోవటంతో వాగు అంచున జేసీబీలతో మట్టి తవ్వుతూ ఫిల్టర్లు ఏర్పాటు చేసి కృత్రిమ ఇసుకను తయారు చేస్తూ సహజ వనరులను కొళ్లగొడుతున్నారు. వాగు రూపురేఖలే మార్చేశారు మెదక్ నుంచి శివ్వాయిపల్లికి వెళ్లే దారిలో తూర్పు దిక్కున గల పుష్పాలవాగుకు ఎటూ నాలుగు వైపులా రోడ్లు ఉన్నాయి. ఈ వాగును ఆనుకొని శివ్వాయిపల్లి తండా గిరిజనులు వ్యవసాయ భూములు ఉండటంతో ఇదే వారికి కలిసొచ్చింది. తండాకు చెందిన యువత నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో వాగులో మట్టిని విచ్చలవిడిగా తవ్వుతూ ఇసుక ఫిల్టర్ల ద్వారా కృతిమ ఇసుకను తయారు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ. 5 వేల చొప్పున విక్రయిస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. దీంతో వాగులో ఎక్కడా చూసినా పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పుష్పాలవాగు రూపురేఖలే మారిపోయాయి. ఈ తతంగం అంతా అధికారులకు తెలిసినా, వారు నెలనెలా ఇచ్చే మామూళ్లుకు అలవాటు పడి చర్యలు తీసుకోకుండా పరోక్షంగా వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శివ్వాయిపల్లి తండాలో ట్రాక్టర్లు, జేసీబీలు లేని ఇళ్లంటూ లేదూ. ప్రతి ఇంటి ఎదుట రెండు, మూడు ట్రాక్టర్లు, జేసీబీలు ఉండగా, కొంత మంది ఏకంగా టిప్పర్లు కొనుగోలు చేశారు. ఆ వాహనాలకు నంబర్ ప్లేట్లు తొలగించి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారు. తండా సమీపంలో కనుచూపు మేరలో ఇసుక కుప్పలే దర్శనం ఇస్తున్నాయి. వీటిని రాత్రి వేళలో, తెల్లవారుజూమున పట్టణానికి సరఫరా చేస్తున్నారు. అలాగే తిమ్మక్కపల్లి తండా వాసులు సైతం తండా చుట్టూరా ఇసుకను నిల్వ చేసి ఉంచారు. చర్యలు తీసుకుంటాం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై గతంలో కేసులు పెట్టాం. వారు రాత్రి వేళల్లో ఇసుకను రవాణా చేస్తుండటంతో వాహనాలను సీజ్ చేయటం కష్టంగా మారింది. పోలీసుల సహకారంతో అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. – లక్ష్మణ్బాబు, మెదక్ తహసీల్దార్ -
మేల్కోండి.. నానోయ్!
● నానో ఎరువులతో భూసారం భద్రం ● తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు ● అవగాహన కల్పిస్తున్న అధికారులు రామాయంపేట(మెదక్): వానాకాలం పంటల సీజన్ వేళ ఎరువుల కొరత రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యూరియా బుకింగ్ యాప్పై అవగాహన లేక కొంతమంది ఆందోళన చెందుతున్నారు. సాధారణ యూరియాకు ప్రత్యామ్నాయంగా పంటల సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తే రైతులు పెట్టుబడులు తగ్గించుకుని ఆశించిన దిగుబడులు పొందే అవకాశాలు ఉంటాయి. అందులో భాగంగా నానో ఎరువుల వినియోగంతో కలిగే ప్రయోజనాలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంటల దిగుబడులే కాకుండా భూసారం ఎలా కాపాడుకోవాలి? అందుకు సాగులో చేసుకోవాల్సిన మార్పులపై వ్యవసాయ అధికారులు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. సాధారణ డీఏపీ, యూరియా బస్తాలు పంట మొక్కలకు చల్లితే కలిగే ప్రయోజనాలతో పోల్చుకుంటే నానో లిక్విడ్ ఎరువులతో ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఇవీ ప్రయోజనాలు.. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందుకు 26,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని చెబుతున్నారు. కాగా, సాధారణ డీఏపీ, యూ రియా కంటే నానో డీఏపీ, యూరియా రైతులు సులభంగా పొందవచ్చు. బస్తా ఎరువులు చేలల్లో చల్లితే మొక్కలకు 30 శాతం నుంచి 40 శాతం వరకే ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. అదే నానో లిక్విడ్ ఎరువులు పంట మొక్కలకు పిచికారీ చేస్తే 70 శాతం నుంచి 80 శాతం మొక్కలకు చేరి ప్రయోజనం కలుగుతుందన్నారు. మరోవైపు బస్తా ఎరువులు పొలాలకు తరలిచడం చల్లించడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటోంది. నానో డీఏపీ, యూరియాలను పొలాలకు తరలించడం, పిచికారీ చేయడం సులభం.అందుకు ఖర్చు కూడా తక్కువే. ప్రభుత్వ సబ్సిడీ పోను ఒక్కో డీఏపీ బస్తా ధర రూ.1,350, యూరియా బస్తా ధర రూ. 266గా ఉంది. అరలీటర్ నానో డీఏపీ, యూరియా ఒక్కో బస్తా డీఏపీ యూరియాతో సమానంగా పంటలకు పనిచేస్తుంది. రైతుల్లో మరింత అవగాహన పెంచితే నానో ఎరువుల వినియోగంపై రైతులు ఎక్కువ దృష్టి సారించే అవకాశాలున్నాయి. -
అర్హులు ‘సర్’లో నమోదు కావాలి
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మాలారెడ్డి జహీరాబాద్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మాలారెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటింటికీ తిరిగి ఓటరుగా నమోదు అయ్యారా లేదా అనే వివరాలను తెలుసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉంటే వారి సమాచారం తెలుసుకోవాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ విషయంలో తెలియని వారికి హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ చైర్మన్ తన్వీర్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి ఉజ్వల్రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా, అసెంబ్లీ కో–ఆర్డినేటర్ మహ్మద్ గౌస్, ఆత్మ చైర్మన్ రామలింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు యూనూస్, అశోక్, సీడీసీ చైర్మన్ ముబీన్, ఆయా మండలాల పార్టీ నాయకులు నరేష్గౌడ్, మల్లన్నపాటిల్, రాములు, నర్సింహారెడ్డి, భాస్కర్రెడ్డి, పవన్ రాథోడ్, ముజఫర్, శ్రీనివాస్రెడ్డి, మక్సూద్, కండెం నర్సింహులు, సామెల్, సర్పంచ్లు పాల్గొన్నారు. -
పోలీసులకు క్రమశిక్షణ అవసరం
నర్సాపూర్: విధుల్లో క్రమశిక్షణ అవసరమని తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ అన్నారు. గురువారం స్థానిక పోలీస్స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా సీసీ కెమెరాలు నిరంతరం పని చేసేలా చూడాలని, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. డ్రంకెన్ డ్రైవ్పై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. పోలీస్స్టేషన్లోని రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసుల పురోగతిపై ఆరా తీశారు. కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ రంగకృష్ణ, ఎస్ఐ రంజిత్రెడ్డి ఉన్నారు. -
వచ్చేనెల 3 వరకు ‘సర్’
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) నమోదు గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడగించిందని కలెక్టర్ ప్రతిమాసింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం బూత్స్థాయి అధికారులు ఆగస్టు 3వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు తమ పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించాలని సూచించారు. ఇంటింటి సర్వే, ఫీల్డ్ వెరిఫికేషన్, దరఖాస్తుల పరిశీలన వంటి ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని ఆదేశించారు. బూత్స్థాయి అధికారులు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అందిన దరఖాస్తులను ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సకాలంలో పరిష్కరించాలని చెప్పారు. మెదక్జోన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షిస్తే కేంద్ర ప్రభుత్వం పీఎం రాహ్–వీర్ పథకంలో భాగంగా రూ. 25 వేల ప్రోత్సాహకం అందిస్తుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రిలో చేర్పిస్తే బతికే అవకాశాలు ఉంటాయన్నారు. అలాగే ఈ పథకం కింద బాధితులకు రూ.1.5 లక్షల వరకు, గరిష్టంగా ఏడు రోజుల పాటు ఉచిత క్యాష్లెస్ వైద్య చికిత్స అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించిన కానిస్టేబుల్ రమేశ్ను ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. తూప్రాన్: అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ సంఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేయడంతో పాటు 40 కమర్షియల్, 22 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా సివిల్ సప్లయ్ అధికారి నిత్యానంద్ తెలిపారు. ఈనెల 14న మనోహరాబాద్ మండలం పర్కిబండ శివారులో జరిగిన సంఘటనపై వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమ గ్యాస్ వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అక్రమార్కులను భయపడొద్దన్నారు. గ్యాస్ అక్రమ వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్ఐ నర్సింహా, ఇన్స్పెక్టర్ గణేశ్ ఉన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని డైట్ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు మిగిలిపోయిన డైట్ సీట్ల భర్తీ చేయనున్నట్లు డీఈఓ, కళాశాల ప్రిన్సిపాల్ రాజు తెలిపారు. గురువారం స్పాట్ అడ్మిషన్లకు 87 మంది హాజరయ్యారని చెప్పారు. నేడు కూడా నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సీట్ల కేటాయింపు ఉంటుందని, స్పాట్ అడ్మిషన్ల కోసం హాజరయ్యే వారు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. మెదక్ కలెక్టరేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ రంగ కార్మికులను దగా చేస్తున్నాయని, ఇన్సూరెన్స్ల పేరిట రూ. కోట్లు దుర్వినియోగం చేస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం ఆరోపించారు. ఈనెల 20న కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాకు సంబంధించిన పోస్టర్ను మెదక్లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. జిల్లాలోని భవన నిర్మాణ రంగ కార్మికులు పెద్దఎత్తున ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి సంతోశ్, నాయకులు అనిల్, రవి, కిరణ్, వేణు తదితరులు పాల్గొన్నారు. -
సకల వసతుల సర్కారు విద్య
మెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యనందిస్తున్నామని ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. గురువారం పట్టణంలోని 12వ వార్డులోని టీజీటీడబ్ల్యూయూఆర్జేసీ (బాలికల) కళాశాలలో సుమారు రూ.4 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హాస్టల్ భవనం, ఓవర్హెడ్ వాటర్ట్యాంక్, సీసీ రోడ్లు, యార్డ్ లైటింగ్ వంటి మౌలిక వసతుల పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ కళాశాలలను అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. బాలికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా అవసరమైన అన్ని సౌకర్యాలను దశలవారీగా కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్, కౌన్సిలర్లు అనీస్ ఫాతిమా, హరిత, సంపత్, రామకృష్ణ, గౌస్, నర్సింలు, కో–ఆప్షన్ సభ్యుడు తాహెర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు రాగి అశోక్, భూపతి రాజు, కళాశాల ఆర్సీ గంగారాం నాయక్, అధ్యాపకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రోహిత్రావు -
రైతుల ఏకరువు
● రిజర్వాయర్లను నింపుతారో..? లేదో..? ● కాళేశ్వరం జలాల కోసం ఎదురుచూపులు ● సాగు... సాగక రైతుల ఆందోళన ● మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్లలో పడిపోయిన నీటిమట్టం ఎల్నినో తీవ్రరూపం దాల్చిన వేళ...‘సాగు’ ముందుకు సాగక ఆందోళనలో ఉన్న రైతులు కాళేశ్వరం జలాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా పడిపోగా ప్రస్తుతం నింపుతారా...? లేదా...? అనే ఆందోళన సర్వత్రా మొదలైంది. జిల్లా వ్యవసాయానికి ప్రాణధారమైన ఈ రిజర్వాయర్లను నింపకపోతే పరిస్థితేమిటనే కలవరం వెంటాడుతోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ఫోకస్ ఇది. గజ్వేల్: కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయకసాగర్, 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్, మరో 15 టీఎంసీ సామర్థ్యమున్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లు జిల్లా సాగు, తాగునీటి అవవసరాలకు ప్రధాన ఆధారంగా మారాయి. మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసే గోదావరి జలాలు సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ మీదుగా జిల్లాలోని రంగనాయకసాగర్కు వస్తుంటాయి. ఈ రిజర్వాయర్కు జిల్లాలో 1.10 లక్షల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి 2.2కిలోమీటర్ల ఓపెన్ కెనాల్, మరో 16.2 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా మల్లన్నసాగర్కు గోదావరి జలాలు వస్తాయి. మల్లన్నసాగర్ వల్ల సిద్దిపేట, మెదక్ జిల్లాలే కాకుండా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో 15.71 లక్షల ఆయకట్టుకు మేలు చేకూరనుంది. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు కొండపోచమ్మసాగర్ను చేరుతాయి. మల్లన్నసాగర్ పంపుహౌజ్ నుంచి 23 కిమీల పొడవున కొండపోచమ్మ సాగర్ వరకు కాలువల ద్వారా గోదావరి నీళ్లు వస్తున్నాయి. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వల్ల సిద్దిపేటతోపాటు మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందులో జిల్లాలో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీంతోపాటు పరోక్షంగా మరెన్నో లక్షల ఎకరాల భూముల్లో భూగర్భ జలమట్టం పెరిగి భారీ ప్రయోజనం కలుగుతుంది. కానీ, మేడిగడ్డ ఘటన తర్వాత నీటి ఎత్తిపోతలకు తరచూ అంతరాయం కలుగుతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ రిజర్వాయర్లను నింపే విషయంలో స్పష్టతలేకపోవడం వల్ల రంగనాయకసాగర్ రిజర్వాయర్లో నీటిమట్టం 1 టీఎంసీకి పడిపోగా, మల్లన్నసాగర్లో కేవలం 16టీఎంసీల లోపు, కొండపోచమ్మసాగర్లో 6.3 టీఎంసీలలోపు మాత్రమే నీరు ఉన్నది. ప్రస్తుతం ఎల్నినో తీవ్రరూపం దాల్చి వేళ...తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్లలో సమృద్ధిగా ఉండి ఉంటే కాల్వల ద్వారా నేరుగా పొలాలకు నీరందే అవకాశంతోపాటు లక్షలాది ఎకరాల్లో భూగర్భజలమట్టం పడిపోకుండా ఉండేది. -
బాల్య వివాహాలను నిర్మూలిద్దాం
మెదక్ కలెక్టరేట్: సామాజిక రుగ్మతలను సమూలంగా రూపుమాపడమే కాకుండా బాల్య వివాహాల నిర్మూలనపై సంఘటితంగా పోరాడుదామని అదనపు కలెక్టర్ నగేశ్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలన, పాఠశాల విడిచిన పిల్లల గుర్తింపు, అనాథ పిల్లలకు ప్రభుత్వ పథకాల అమలు, పోక్సో కేసుల సమీక్ష, పిల్లల హక్కులపై గ్రామస్థాయిలో అవగాహన తదితర కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ప్రతి నెల డ్రాప్ అవుట్ విద్యార్థుల జాబితాను సమర్పించాలని ఆదేశించారు. పాఠశాల విడిచిన పిల్లలకు కౌన్సెలింగ్ అందించేందుకు సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ సేవలను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించారు. పోక్సో, చైల్డ్ మ్యారేజ్ జరిగిన పిల్లలను తప్పకుండా స్కూల్లోకి అనుమతించాలని ఆదేశించారు. జిల్లాలో పిల్లల పరిరక్షణకు సంబంధించి అన్ని శాఖలు సమష్టిగా పనిచేసి తదుపరి సమావేశానికి చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీఈఓ రాజు, సీపీఓ సురేశ్, వైద్యారోగ్య శాఖ అధిశాఖ జ్ఞానేశ్వర్, జిల్లా ఇంటర్ అధికారి మాధవి, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి సింధు, డీఎస్పీ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్ -
అంతా కవరింగే!
ప్లాస్టిక్ నిషేధంపై పట్టింపు కరువు ● జిల్లాలో ప్రమాదకరంగా పెరిగిన వినియోగం ● తీర్మానానికే పరిమితమైన బల్దియా మెదక్ కలెక్టరేట్: ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా తయారయ్యాయి. నిషేధిత కవర్లు, వస్తువులు వినియోగించొద్దని, అమ్మకాలు జరపకూడదనే ఆదేశాలు ఉన్నా క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ముందుకురావడం లేదు. ఫలితంగా పట్టణంలో ఎటుచూసినా ప్రమాదకరమైన ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ రాహుల్రాజ్ జిల్లాలో ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేస్తామని ప్రకటించినా, అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం కలెక్టరేట్లోనే ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు పంపిణీ చేయడం గమనార్హం. తీర్మానానికే పరిమితం మెదక్ బల్దియా నూతనంగా కొలువుదీరిన తర్వాత రెండో సమావేశంలోనే ప్లాస్టిక్ నిషేధంపై తీర్మానం చేశారు. అయితే పట్టణంలో ఎక్కడా అమలుకు చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించలేదు. గతంలో ఎమ్మెల్యే రోహిత్రావు ఆదేశాలతో నిలిపివేసిన తైబజార్ వసూళ్లు మళ్లీ మొదలు పెట్టారు. కాని పట్టణంలో పెరుగుతున్న ప్రమాదకర ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు చేపట్టం లేదని పట్టణవాసులు మండిపడుతున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు అడపాదడపా తనిఖీలు చేసి జరిమానాలు వేశారు. ప్రస్తుతం అవి కూడా చేయడం లేదు. జిల్లా కేంద్రంలో కొంతమంది తమ తమ ఇళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లలో వేసి రోడ్డు పక్కన పారవేస్తున్నారు. ఫలితంగా వాటి కోసం కుక్కలు, కోతులు పోటీపడుతున్నాయి. అటువైపు నుంచి వెళ్తున్న ప్రజలపై దాడులకు దిగుతున్నాయి. రోజుకు 4 టన్నులు మెదక్ బల్దియాలో 32 వార్డులు ఉండగా, రోజుకు 12 టన్నుల చెత్త సేకరిస్తే అందులో 4 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన చేగుంట, తూప్రాన్, రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు మరింత ఎక్కువగా ఉంటాయి. వాటి నియంత్రణ లేక విచ్చలవిడిగా కాలుష్యం పెరిగిపోతుంది. చర్యలు చేపడతాం ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. దీనిపై ఇటీవల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. త్వరలోనే పూర్తిస్థాయిలో అమలుకు కృషి చేస్తాం. ప్లాస్టిక్ కవర్లను ప్రజలు వినియోగించవద్దు. ప్రాణాంతకమైన కేన్సర్ ముప్పు ఉందని గ్రహించాలి. – నవీన్, మెదక్ మున్సిపల్ కమిషనర్ -
సర్కార్ బడిలో కంప్యూటర్ విద్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడతలో 475 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక సాక్షి, సిద్దిపేట: పాఠశాలలో డిజిటల్ విద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించాలని లక్ష్యంతో కంప్యూటర్ విద్యను ప్రారంభించింది. త్వరలో జిల్లాలో పలు పాఠశాలలో కంప్యూటర్ విద్యను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకుగాను కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి ఇన్స్ట్రక్టర్లను ప్రభుత్వం నియమించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో కంప్యూటర్ విద్యకు శ్రీకారం చూట్టారు. అయితే 2014లో కంప్యూటర్ విద్యా బోధన నిలిపివేశారు. అప్పటి నుంచి కంప్యూటర్ విద్యను బోధించే ఇన్స్ట్రక్టర్ లేకపోవడంతో కంప్యూటర్ విద్యకు విద్యార్థులు దూరమయ్యారు. కంప్యూటర్ విద్యను అందించేందుకు ఈ విద్యా సంవత్సరం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలి దశలో 475 పాఠశాలలను ఎంపిక చేశారు. అందులో సిద్దిపేటలో 177, సంగారెడ్డిలో 179, మెదక్లో 119 పాఠశాలలున్నాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ బోధనను అందించనున్నారు. కంప్యూటర్ విద్యను పాఠశాల స్థాయిలోనే అందించడం వలన ఉన్నతవిద్యకు ఎంతగానో దోహపడనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం నేర్చుకోవడం వలన కంప్యూటర్లో ద్వారా చేసే పనులు త్వరగా పూర్తి చేసే సామర్థ్యం విద్యార్థులలో రానుంది. కొత్తగా కంప్యూటర్ ల్యాబ్లను సైతం ఏర్పాటు చేయనున్నారు. పలు చోట్ల ఉన్న ల్యాబ్లను పునరుద్ధరించనున్నారు. ఒక్కో ఇన్స్ట్రక్టర్కు రెండు పాఠశాలలు రెండు పాఠశాలలకు కలిపి ఒక ఇన్స్ట్రక్టర్ను నియమించనున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 237 మంది ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నారు. ఆ రెండు పాఠశాలలు ఒకే మండలంలో, దగ్గర ఉండే విధంగా విద్యాశాఖ మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ ఇన్స్ట్రక్టర్లను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు రాష్ట్రస్థాయిలో ఓ ఏజెన్సీకి బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 22 నుంచి కంప్యూటర్ బోధను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఆషాఢ శోభ
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రంలో కొలువైన బగలాముఖీ శక్తిపీఠంలో బుధవారం ఆషాఢ నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద పండితుడు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి చేగుంట(తూప్రాన్): జిల్లాలోని రైతులంతా తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని డీఏఓ దేవ్కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని చందాయిపేటలో పర్యటించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకుంటే భవిష్యత్తులో వారికి వ్యవసాయ సంబంధమైన అంశాల్లో లబ్ధి జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నాయని, రైతులు ఆరుతడి, కూరగాయల పంటలు వేసుకోవాలని తెలిపా రు. ఆయన వెంట ఏఈఓ దివ్య, రైతు కోఆర్డినేటర్ అంజనేయులు, నాయకులు సాయిబాబా, అధికారి యాదగిరి తదితరులు ఉన్నారు. పకడ్బందీగా ‘సర్’ మెదక్ కలెక్టరేట్: జిల్లాలో సర్ (ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ )కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ బుధవారం అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 67.06 శాతం నమోదైనట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించా లని సూచించారు. ఇంటింటి సర్వే, ఫీల్డ్ వెరిఫికేషన్, దరఖాస్తుల పరిశీలన వంటి ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని తెలిపారు. బూత్స్థాయి అధికారులు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మెదక్ ఖిల్లాకు కొత్త కళ మెదక్ కలెక్టరేట్: మెదక్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముమ్మరంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఖిల్లాపై జరుగుతున్న పారిశుద్ధ్య పనులను బుధవారం మెదక్ మున్సిపల్ కమీషనర్ నవీన్ పరిశీలించారు. మెదక్ ఖిల్లాను సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లకు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్లో చేరికలు రామాయంపేట(మెదక్): పట్టణానికి చెందిన రజక సంఘం సభ్యులు బుధవారం హైదరాబాద్లో కాంగ్రెస్ రాష్ట్ర నేత మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నాగరాజు, సందీప్, రంజిత్, కోఆప్షన్ సభ్యుడు దేమె యాదగిరి, డీసీసీ కార్యదర్శి పోచమ్మల గణేశ్, సీనియర్ నాయకుడు సరాపు యాదగిరి, పట్ట ణాధ్యక్షుడు చింతల స్వామి, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలి మెదక్ కలెక్టరేట్: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేయాలని జిల్లా జేఏసీ సమన్వయ కమిటీ నాయకులు కొండల్రెడ్డి, యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మాట్లాడుతూ.. ప్రభుత్వం కేశవరావు నాయకత్వంలో గుర్తింపు కమిటీ నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. -
ఆర్భాటమే.. ఆచరణేదీ?
జహీరాబాద్: గ్రామీణ యువతీ యువకులకు వృత్తి పరమైన నైపుణ్యాలు పెంపొందించి, వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (ఎస్ఐహెచ్ఎం) సంస్థ వ్యవహారం ఆర్భాటానికే పరిమితమైందనే విమర్శలున్నాయి. కోహీర్ మండలంలోని కవేలి గ్రామ శివారులో గల హోటల్ మేనేజ్మెంట్ భవనంలో మే 18వ తేదీన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో అడ్మిషన్లు, నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రారంభించారు. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన ఈ కోర్సులను మంత్రి ప్రారంభించారు. నిథమ్లో బీబీఏ, ఎంబీఏ అడ్మిషన్లు లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఇది ప్రారంభోత్సవానికి పరిమితం అయింది. అప్పటి నుంచి భవనం మూతపడి ఉంది. దాదాపు రెండు నెలలు కావొస్తున్నా సిబ్బందిని సైతం నియమించలేదు. కళాశాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పడంతో పాటు రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కళాశాల ఆధునికీకరణ, కొత్త కోర్సుల కోసం ఈ నిధులను కేటయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం స్పందించి కళాశాలను పునఃప్రారంభించాలని స్థానికులు, యువత కోరుతున్నారు. టూరిజం హోటల్ మూతపడటంతో.. రెండు దశాబ్దాల క్రితం టూరిజం హోటల్ కోసం భవనం నిర్మించారు. టూరిజం శాఖకు చెందిన బస్సులన్నీ ఇదే హోటల్ వద్ద ఆగుతుండేవి. క్రమంగా పర్యాటకులు తగ్గడం, టూరిజం శాఖ బస్సులు రాకపోవడంతో హోటల్ మూతపడింది. దీంతో భవనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు వీలుగా 2012 డిసెంబర్లో హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ఏర్పాటు చేశారు. మూడేళ్ల బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్, ఏడాదిన్నర డిప్లొమా కోర్సులను ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ప్రత్యేక ప్రవేశ పరీక్ష రాసి ప్రవేశం పొందేవారు. ప్రభుత్వాల నుంచి ఈ కోర్సులకు ఉపకార వేతనాలు, బోధనా రుసుములు అందక పోవడంతో విద్యార్థుల ఫీజులపైనే కళాశాల నిర్వహణ చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేయడంతో ప్రవేశాలు లేక విద్యాసంస్థ మూతపడింది. -
జిల్లాలో లోటు వర్షపాతం
● ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్ ● వ్యవసాయశాఖ ముందస్తు ప్రణాళిక ● ఉచితంగా విత్తనాల పంపిణీఎల్నినో ముప్పు రానే వచ్చింది. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర అవుతున్నా జిల్లాలో లోటు వర్షపాతమే నమోదైంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది. మూడు రకాల ఆరుతడి పంటలు సాగు చేయాలంటూ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో మొదటి దశలో భాగంగా వందశాతం సబ్సిడీపై కంది విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. – మెదక్జోన్ జిల్లాలో ఈఏడాది 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారుల అంచనా వేశారు. అయితే ఎల్నినో అందరి అంచనాలను తలకిందులు చేసింది. దీని ప్రభావంతో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయటమే మేలని వ్యవసాయశాఖ ఇప్పటికే రైతులకు విరివిగా అవగాహన కల్పిస్తుంది. ఈనెల 15 వరకు సాధారణ వర్షపాతం నమోదు కాకుంటే కందులు, పెసర్లు, మినుములు సాగు చేయాలని, 31 వరకు వర్షం కురువకుంటే వేరుశనగ సాగు చేయాలని, ఆగస్టు 15 వరకు వర్షాలు లేకుంటే ఆముదం, పొద్దు తిరుగుడు, కంది పంటలు సైతం సాగు చేయొచ్చని అధికారులు వివరిస్తున్నారు. మూడు దశలుగా విభజన ఎల్నినో మెదటి దశలో భాగంగా జూలై 15 వరకు లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో వందశాతం సబ్సిడీపై కంది విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 8 క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు సరఫరా కాగా, అందులో 6.12 క్వింటాళ్లు రైతులకు సరఫరా చేసినట్లు సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో వర్షధారంగా పంటలు సాగుచేసే నల్లరేగడి భూముల్లో కంది సాగుకు అనువైనవిగా గుర్తించిన అధికారులు అల్లాదుర్గం, రేగోడ్, పెద్దశంకరంపేట, టేక్మాల్ మండలాలతో పాటు శివ్వంపేట, తూప్రాన్, నిజాంపేట మండలాల్లో సైతం ఉచిత విత్తనాల పంపిణీ జరిగింది. మరికొన్ని మండలాలకు త్వరలో పంపిణీ చేయనునట్లు తెలిసింది. రైతుల్లో ఆసక్తి అంతంతే.. ఎల్నినోతో ప్రమాదం పొంచి ఉందని, ఇప్పటికే మొదటి దశ ప్రారంభమైన నేపథ్యంలో వరి సాగుకు బదులు ఇతర ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నా, రైతులు పెద్దగా ఆసక్తి కనబరచడం తెలుస్తోంది. వరి, ఆయిల్పాం సాగు తప్ప ఇతర పంటలను సాగు చేస్తే తమకు కోతులతో ప్రమాదం ఉందంటున్నారని అధికారులు చెబుతున్నారు. కాగా బోరుబావుల ఆధారంగా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 81 వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరో 15 రోజుల పాటు వర్షాలు కురవకుంటే బోరుబావుల్లో నీటి ఊటలు తగ్గిపోయి నాట్లు ఎండిపోయే ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.వరి సాగుతో నష్టమే.. వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొన్న విధంగా ఎల్నినో ప్రభావం జిల్లాపై ఉంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనలు పాటించి రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి. వరిసాగు చేస్తే పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తోంది. – దేవ్కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
సెప్టెంబర్లో జిల్లాస్థాయి క్రీడలు
అదనపు కలెక్టర్ నగేశ్మెదక్ కలెక్టరేట్: సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తామని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. బుధవారం డీఈఓ అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లాలోని పీడీలు, పీఈటీలతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 25 లోపు మండ లస్థాయి క్రీడా పోటీలను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభమవుతాయని చెప్పారు. పోటీల నిర్వహణ లో నాణ్యత, సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి పకడ్బందీగా క్రీడలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులకు దుస్తులు అందించే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు హామీ ఇచ్చారు. అనంతరం ఎస్జీఎఫ్ వెబ్సైట్ను ఆవిష్కరించారు. క్రీడాకారులు వారికి నైపుణ్యం గల ఆటలలో ప్రతిభ కనబరచడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, ఏఎంఓ సుదర్శనమూర్తి, పీటీల సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు నాగరాజు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మధు, శ్రీధర్ రెడ్డి, మాధవరెడ్డి, శ్యామ్, రూపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యశాఖ మెరుపు దాడులు
● నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులు, క్లినిక్లు సీజ్ ● రెండు ఆర్ఎంపీ క్లినిక్లపై కేసులకు ఆదేశాలుపటాన్చెరు టౌన్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై జిల్లా వైద్యారోగ్య శాఖ ఉక్కుపాదం మోపింది. డీఎంహెచ్ఓ లలితాదేవి ఆధ్వర్యంలో బుధవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పటాన్న్చెరు మండలం, భానూర్ గ్రామంలోని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, క్లినిక్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇస్నాపూర్లోని వీకేర్ మీనాక్షి ఆస్పత్రిలో గర్భిణులకు సంబంధించిన ఫామ్–ఎఫ్ రికార్డులను నిబంధనల మేరకు నిర్వహించకపోవడం గుర్తించిన అధికారులు సంబంధిత స్కానింగ్ గదిని సీజ్ చేశారు. అదేవిధంగా అనుమతులు లేకుండా కొనసాగుతున్న రెండు ఆర్ఎంపీ క్లినిక్లను సీజ్ చేసి, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. భానూర్లోని సన్ షూర్ క్లినిక్, అపోలో డయాగ్నొస్టిక్స్లో నిబంధనల ఉల్లంఘన వెలుగుచూడడంతో వాటిని సీజ్ చేశారు. యోగిరాజ్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ క్లినిక్లో గుర్తించిన లోపాలపై నోటీసు జారీ చేయడంతో పాటు జరిమానా విధించారు. -
ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి
కలెక్టర్ ప్రతిమాసింగ్ కొల్చారం(నర్సాపూర్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. మంగళవారం మండలంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణ పనులు ప్రారంభించకుంటే రద్దయ్యే అవకాశం ఉందని తెలిపారు. లబ్ధిదారులకు భారం కాకుండా ఉండేందుకు చిన్న సైజులో 450 ఫీట్ల నుంచి నిర్మాణం చేసుకోవచ్చని సూచించారు. అక్కడి నుంచి వరిగుంతం చేరుకున్న కలెక్టర్ గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని బీఎల్ఓలు, అధికారులను ఆదేశించారు. బూత్స్థాయిలో ఫారాల పంపిణీ, స్వీకరణ, డేటా ఎంట్రీ పురోగతిపై ఆరా తీశారు. ఫారాలు పంపిణీ చేయడం మాత్రమే కాకుండా, పూర్తిగా పూరించిన దరఖాస్తులను తిరిగి సేకరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసి, నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ మాణిక్యం, తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా బేగం, సర్పంచ్లు శేఖర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాములు రామాయంపేట(మెదక్): జాతీయ రహదారి ఆధ్యా హోటల్ జంక్షన్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి మంజూరును అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే పద్మారెడ్డి అడ్డుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగిరాములు కౌన్సిలర్ శంకర్గౌడ్, పార్టీ పట్టణాధ్యక్షుడు అవినాశ్రెడ్డి, సీనియర్ నాయకులు పబ్బ సత్యం, భానుచందర్ మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో బ్రిడ్జి నిర్మాణానికి గాను జాతీయ రహదారుల శాఖ అధికారులు సానుకూలంగా ఉన్నా, తమ స్వలాభం కోసమే అడ్డుకున్నారని ఆరోపించారు. తమ అనుచరుల భూములు పోతాయనే ఉద్దేశంతోనే బ్రిడ్జి మంజూరు కాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. తాజాగా పద్మారెడ్డి బ్రిడ్జి నిర్మాణం కోసం ఉద్యమిస్తానని ప్రకటించడం తగదని, ఇది ప్రజలను తప్పుతోవ పట్టించడమేనని అన్నారు. అభివృద్దిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు కుట్రలు పన్నతున్నారని, వారిని ప్రజలు విశ్వసించరని ఆయన స్పష్టం చేశారు. -
దర్యాప్తు వేగంగా జరగాలి
మెదక్జోన్: ప్రతి కేసులో దర్యాప్తు వేగంగా జరగాలని, రోడ్డు ప్రమాదాలు, సైబర్, ఆర్థిక నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. నిర్ణీత గడువులోగా చార్జిషీట్లు దాఖలు చేయా లని సిబ్బందిని ఆదేశించారు. కేసుల్లో శాసీ్త్రయంగా ఆధారాలను సేకరించి నిందితులకు శిక్షపడేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామానికి విలేజ్ పోలీస్ను నియమించి, రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆర్థిక నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. కీలక ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పా ట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్నకుమార్, సుభాశ్ చంద్రబోస్, సీఐలు రేణుక, రాజశేఖర్రెడ్డి, వెంకటరాజాగౌడ్, మహేశ్, జార్జ్, సందీప్రెడ్డి తదితరులు ఉన్నారు. నర్సాపూర్: మత్తు పదార్థాలతో ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ నియంత్రణ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు అంశాలపై అవ గాహన కల్పించారు. బీవీఆర్ఐటీ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్దూబె మాట్లాడుతూ.. తోటి విద్యార్థుల ఒత్తిళ్లకు లొంగకుండా అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని హితవుపలికారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ట్రైనీ ఏఈఎస్ సతీశ్కుమార్, సీఐ గులాం ముస్తాఫా, ఎస్ఐలు అజీజ్ఖాన్, అరుణ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు 76వ బూత్లో బీఎల్ఓ బైరం సుజాత 100 శాతం సర్ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఈమేరకు తహసీల్దార్ రజని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. మిగితా బీఎల్ఓలు సుజాతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమీషనర్ రవీందర్, కౌన్సిలర్లు నాగరాజు, బైరం స్వప్న, దేవుని రంజిత్, డీసీసీ కార్యదర్శి గణేశ్ ఆమెను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట(మెదక్): గ్రామాల్లో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వద్దని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మంగళవారం చిన్నశంకరంపేట ఎంపీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఎంపీడీఓ దామోదర్కు పలు సూచనలు చేశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక జాగ్రత్తగా తయారు చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణను నాలుగు అంచెలుగా నిర్వహించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం హసింగ్ డీఈ యా దగిరితో కలిసి ఎంపీపీ కార్యాలయ ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇంటిని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీఓ వినోద్కుమార్, హసింగ్ ఏఈ లోకేష్ ఉన్నారు. కొల్చారం(నర్సాపూర్): మండల కేంద్రంలోని కొల్చారం సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మహమూద్ అలీ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. -
55 శాతం ‘సర్’ నమోదు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇప్పటివరకు 55 శాతం ‘సర్’ ఎన్యూమరేషన్ ప్రక్రియ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలో మొత్తం 4,55000 మంది ఓటర్లు ఉండగా, వీరందరికి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తి చేశారు. మంగళవారం మెదక్ పట్టణంలోని 11వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను కలెక్టర్ ప్రతిమాసింగ్ పరిశీలించారు. బీఎల్ఓలు ఇంటింటి పత్రాలు అందజేయడంతో పాటు వాటిని భర్తీ చేసేందుకు ఓటర్లకు సహకరించాలని ఆదేశించారు. అవసరమైన చోట రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బందితో పాటు ఆశావర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ఏజెంట్లను సమన్వయం చేసుకుంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా వీడియోలు, సందేశాలు పంపించి ప్రజల్లో చైతన్యం కల్పించాలని స్పష్టం చేశారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ‘సర్’ నమోదు చేసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే ఓటు తొలగిపోతుందన్నారు. కాగా, శని, ఆదివారాల్లో అన్ని మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక ఎస్ఐఆర్ శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈనెల 24లోపు నమోదు ప్రక్రియను వందశాతం పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
త్వరలో హైవేపై బ్రిడ్జి నిర్మాణం
రామాయంపేట(మెదక్): జాతీయ రహదారిపై రామాయంపేట సమీపంలోని జంక్షన్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి సంబంధిత అధికారులు అంగీకరించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ తెలిపారు. ఈమేరకు పార్టీ కార్యకర్తలతో కలిసి మంగళవారం హైదరాబాద్ వెళ్లి ఆశాఖ ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రామాయంపేట, కోమటిపల్లి జంక్షన్ వద్ద బ్రిడ్జి లేకపోవడంతో ఇప్పటికే పదుల సంఖ్యలో వాహనదారులు మృతిచెందారని అన్నారు. కోమటిపల్లి స్టేజీ వద్ద నుంచి ఆధ్యా హోటల్ వరకు కిలోమీటర్ మేర కవర్ అయ్యే విధంగా బ్రిడ్జి నిర్మించాల్సి ఉందన్నారు. రెండు జంక్షన్లను ఇప్పటికే జాతీయ రహదారుల శాఖ బ్లాక్ స్పాట్లుగా గుర్తించిందని వెల్లడించారు. ప్రతి రోజూ రెండు, మూడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాపోయారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆమె వెంట సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్, కౌన్సిలర్లు చరిత, ప్రవీణ్, జిల్లా నాయకులు ఉమామహేశ్వర్, హస్నొద్దీన్తో పాటు ఇతర నాయకులు ఉన్నారు. ఉద్యమ ఫలితమేనన్న పద్మారెడ్డి -
ఆయువడిగెనే ఆడబిడ్డ!!
లింగ నిర్ధారణ పరీక్షలతో భ్రూణ హ త్యలుసాక్షి, సిద్దిపేట: పేదరికం, మూఢ విశ్వాసాలు, స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు ఇతరత్రా కారణాలతో ఆడబిడ్డల్ని పురిటిలోనే చంపేస్తున్నారు. ఇందుకు కేంద్ర జనగణన విభాగం పౌర నమోదు వ్యవస్థ–(సీఆర్ఎస్)–విడుదల చేసిన 2024 నివేదికనే నిదర్శనం. ఈ నివేదికలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. వెల్లడైన గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో లింగ ఆధారిత వివక్ష స్పష్టంగా దర్శనమిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 2024లో మగపిల్లలు 40,577 పుట్టగా ఆడబిడ్డలు 37,109 మంది జన్మించారు. అయితే 2023తో పోల్చితే 2024లో ఆస్పత్రుల్లో శిశు మరణాలు తగ్గుముఖం పట్టడం ఈ నివేదికలో ఊరటనిచ్చే అంశం.ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 2023లో 72,545 మంది జన్మించగా, 2024లో 77,686 మంది పుట్టారు. ఈ నివేదిక ప్రకారం చూస్తే జననాలు 5,141 పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డిలో, అత్యల్పంగా సిద్దిపేటలో జన్మించారు. 2024లో 1000 మంది మగ పిల్లలకు 915 మంది ఆడపిల్లలు పుట్టారు. కొన్ని ప్రైవేట్ క్లినిక్లలో ఆర్ ఎంపీలు గర్భంలోనే ఆడ,మగను నిర్ధారిస్తుండటంతో ఆడపిల్ల అని తెలియగానే పిండ దశలో చిదిమేస్తున్నారు. దీంతో ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోతున్నారు. తగ్గిన శిశు మరణాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయి. 2023లో 501 మంది శిశువులు మృతి చెందితే అందులో మగవాళ్లు 294, ఆడపిల్లలు 207 ఉన్నారు. 2024లో 467 మంది శిశువులు మృతి చెందగా అందులో మగవారు 251, ఆడ శిశువులు 216 మంది ఉన్నారు. 2023కంటే 2024లో శిశు మరణాలు తగ్గాయి. ప్రభుత్వం ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో శిశు మరణాలు తగ్గాయని చెప్పవచ్చు. 2024లో మరణాలుజిల్లా మగ ఆడ మొత్తం సిద్దిపేట 3,032 2,001 5,033సంగారెడ్డి 5,920 4,086 10,006 మెదక్ 4,143 2,985 7,128 -
మెదక్ అభివృద్ధికి పెద్దపీట
ఎమ్మెల్యే రోహిత్రావుమెదక్ కలెక్టరేట్: నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే రోహిత్రావు తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో రూ.2.93 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. మెదక్ పట్టణ రూపురేఖలు మారుతున్నాయన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీసీ రోడ్లు, మురికి కాల్వలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తన ధ్యేయం అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభించి మెదక్ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలబెడతానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్చైర్మన్ నరేశ్గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నాణ్యమైన సరుకులు అందించాలి
అదనపు కలెక్టర్ నగేశ్ మెదక్ కలెక్టరేట్: టెండర్లు పొందిన గుత్తేదారులు విద్యార్థులకు నాణ్యమైన సరుకులు, పండ్లు అందించాలని, నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తే బ్లాక్లిస్టులో పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలోని 19 కేజీబీవీలు, 6 టీజీఎస్ఆర్(బాలికల), అర్బన్ రెసిడెన్సియల్ స్కూళ్లు, హాస్టళ్లకు సరుకుల టెండర్లు జరిగాయి. ఈసందర్భంగా స్కూళ్లు, హాస్టళ్లకు చికెన్, మటన్, కూరగాయలు, పండ్ల సరఫరాకు లాటరీ పద్ధతిన టెండర్దారులను ఎంపిక చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెండర్ల కోడ్ చేసిన గుత్తేదారులు నాణ్యతను విధిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఏఎంఓ సుదర్శన్మూర్తి, వసతి గృహ సంక్షేమ అధికారులు, ప్రిన్సిపాల్స్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి.. వినేదెవ్వరు?
ఈమె పేరు ఒడ్డె ఎల్లమ్మ. కొల్చారం మండల కేంద్రం గ్రామం. రాళ్లు కొట్టుకొని జీవనం సాగిస్తుంది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. గ్రామ శివారులోని 707/1/8/1 సర్వే నంబర్లో ఎకరం పొలం ఉంది. ఇందులో తాతల కాలం నుంచి పంటలు పండిస్తూ కాస్తులో ఉన్నారు. పాత పట్టాదార్ పాస్ పుస్తకం కూడా ఉంది. కాని కొత్త పాస్బుక్ కోసం ఆరేళ్లుగా ప్రజావాణికి వస్తున్నారు. ఇప్పటివరకు అధికారులు సమస్యకు పరిష్కారం చూపలేదు. ఈయన పేరు మస్కూరి రమేశ్. మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామం. తనకున్న 4 ఎకరాల పొలంలో 2 ఎకరాలు విక్రయించాడు. బిడ్డ పెళ్లి కోసం అప్పులు కావడంతో బతుకుదెరువు నిమిత్తం పట్టణానికి వలసపోగా మరో రెండెకరాలు ఆక్రమణకు గురైంది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ గత ఐదేళ్లుగా తిరుగుతున్నాడు. ఇప్పటికీ న్యాయం జరగడం లేదంటూ బాధితుడు వాపోయారు. ఈయన పేరు కాజిపేట లింగయ్య. నర్సా పూర్ మండల కేంద్రం. గ్రామ శివారులో 7 గుంటల పొలం ఉంది. అతడికి భార్యాపిల్లలు లేరు. బతుకుదెరువు కోసం వరంగల్ వెళ్లాడు. వచ్చేసరికి పక్క పొలం వ్యక్తి అతడి పొలాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ 7 గుంటలను తన పొలంలో కలుపుకొని వెంచర్ చేస్తున్నాడు. బాధితుడు ఈ విషయమై పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఎవరూలేని అనాథను తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నాడు. ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు మెదక్ కలెక్టరేట్: తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశతో జిల్లాలోని ఆయా మండలాల ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వ స్తుంటారు. కాని ఏళ్ల తరబడి తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపనప్పుడు ప్రజావాణి ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భూ ఆక్రమణలు, పట్టాదారు పాస్బుక్లు, పెన్షన్ల వంటి సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ వాపోతున్నారు. గడిచిన 4 నెలల్లో ఇప్పటివరకు సుమారు 600లకు పైగా అర్జీలు రాగా, వాటిలో ఎన్ని పరిష్కరించారన్న వివరాలు లేకపోవడం గమనార్హం. ఫిర్యాదులు చేసిన వారే మళ్లీ మళ్లీ ప్రజావాణికి వస్తున్నారు. కాగా, సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 76 వినతులు వచ్చాయి. ఇలా ప్రతి వారం ప్రజలు తమ తమ సమస్యలపై సుమారు 100 వరకు వినతులు సమర్పిస్తున్నారు. కాని పరిష్కారం మాత్రం కొన్నింటికే లభిస్తుంది. మిగితా వారు ఏళ్ల తరబడి తిరుగుతున్నా పరిష్కారం లభించడం లేదు. -
కుటిల రాజకీయాలు మానుకోండి
ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా సీఎం రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. సోమవారం పార్టీ సభ్యత్వ నియోజకవర్గ ఇన్చార్జి నరహరితో కలిసి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ చేపట్టిన పలు ప్రాజెక్టులకు మరమ్మతులు చేయకుండా కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ను ప్రజల నుంచి దూరం చేయడం సీఎంకు సాధ్యం కాదన్నారు. కన్నెపల్లి పంప్హౌస్ను నడిపించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాగా, హల్దీ ప్రాజెక్ట్ కింద ఉన్న రైతుల సంక్షేమం కోసం తమ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే ‘హల్దీ బచావో’ కార్యక్రమం చేపడతామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. షాబాద్ బాధితులకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. అనంతరం నరహరి మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వాన్ని సకాలంలో పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు దేవేందర్రెడ్డి, చంద్రాగౌడ్, శేఖర్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎత్తిపోతలు చేపట్టాల్సిందే
త్వరలో పాదయాత్ర చేపడతా.. ‘బసవేశ్వర, సంగమేశ్వర’ పనులపై ఎమ్మెల్యే హరీశ్నారాయణఖేడ్: జిల్లాలోని బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పనులు చేపట్టాలన్న డిమాండ్తో త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఖేడ్లో సోమవారం సర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్రావు మాట్లాడారు. బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి ప్రజలతో కలిసి పాదయాత్ర ప్రారంభిస్తానని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాలం కాకపోయినా నారాయణఖేడ్, జహీరాబాదు, అందోలు నియోజకవర్గాల్లో పంటలు పండాలని కేసీఆర్ ఆయా ఎత్తిపోతల పథకాలకు ఖేడ్లోనే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులు నిలిపివేశారని పేర్కొన్నారు. సింగూరుకు మరమ్మతులు చేయాలని నీటిని ఖాళీచేసి ఇంతవరకు మరమ్మతులు పూర్తి చేయలేదన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లు ఫారాలను నింపి ఇవ్వకుంటే ఓట్లు గల్లంతైనట్లేనని అన్నారు. సంగారెడ్డి, జహీరాబాదు ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు, మెదక్ జిల్లా సభ్యత్వ నమోదు సమన్వయకర్త శశిధర్రెడ్డి, మాజీ డీసీఎంఎస్ అధ్యక్షుడు శివకుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ, రాష్ట్ర నాయకులు మొహిద్ఖాన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. పోలీసులు తమ పని తాము చేయకపోవడం వల్లే షాబాద్లో సైకో రాజ్ కుమార్ ఆరుగురిని చంపాడన్నారు. పోక్సో కేసు నమోదైన 45 రోజుల పాటు అరెస్ట్ కాకుండా సీఎం సన్నిహితుడు రూ.20 లక్షలు తీసుకుని కాపాడినందునే హత్యలకు తెగబడ్డాడని ఆరోపించారు. -
ఎస్పీ ప్రత్యేక పూజలు
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని ముత్తాయికోట సిద్దేశ్వరాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి గోవింద్ మహరాజ్ మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పురాతన సిద్దేశ్వరాలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. పెద్దశంకరంపేట(మెదక్): ఎస్ఐఆర్పై ప్రజలు అవగాహన పెంచుకోవాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి జిల్లా సమన్వయకర్త శశిధర్రెడ్డి అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్పై ప్రజలకు వివరించి ఓటు హక్కును కాపాడుకునేలా కార్యకర్తలు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు. గ్రామగ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, సురేశ్గౌడ్, సుభాశ్, దత్తు, జంగం రాఘవులు, శంకరయ్య, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్జోన్: ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం కాదని, నియామకాలు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. సోమవారం యూనియన్ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న డీఏలు చెల్లించి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కోరారు. పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. పబ్లిక్ స్కూల్ పేరు మీద పాఠశాలలను మూసి వేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోందని, అదే జరిగితే టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్, డీఈఓకు అందజేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండల్రెడ్డి, సంగయ్య, గోపాల్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు. తూప్రాన్: కాంగ్రెస్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని నాచారం దేవాలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్గుప్తా హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో పార్టీ కోసం పని చేసే వారిని గుర్తించి నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత నర్సారెడ్డికే దక్కుతుందన్నారు. ఒకే పార్టీలో ఉంటూ గ్రూపులుగా ఏర్పడవద్దని, కలిసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, నాయకులు ఆంజనేయులు గౌడ్ లక్ష్మీనరసింహగౌడ్, పురం రవీందర్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంతోష్రెడ్డి, శ్రీశైలం, యంజాలస్వామి, మాణిక్యరావు, గోపాల్, వేణు, నాగేష్, భాను, శ్రీనివాస్చారి తదితరులు పాల్గొన్నారు. -
పరిశుభ్రత తప్పనిసరి
రామాయంపేట(మెదక్): చికెన్ దుకాణాల్లో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో పట్టణంలోని చికెన్ దుకాణాల వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దుకాణాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ కవర్లను వి నియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి దుకాణంలో ఖచ్చితంగా అహార భద్రత ప్రమాణాలు పాటించాలని, వాటిలో పనిచేసే సిబ్బంది సైతం రక్షణ పరికరాలు వినియోగించాలన్నారు. ప్రతి దుకాణదారుడు మున్సిపల్ కార్యాలయం నుంచి విధిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, సిబ్బంది పాల్గొన్నారు. -
నులిపురుగులను నిర్మూలిద్దాం
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: నులిపురుగుల నివారణతో బాలలకు పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు మాత్రలు వేయించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. సోమవారం మెదక్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి మాట్లాడారు. చేతుల శుభ్రత వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చుని తెలిపారు. మట్టిలో ఆడుకోవడం వల్ల పిల్లలకు నులిపురుగులు ఏర్పడుతాయన్నారు. ఫలితంగా బలహీనత, రక్తహీనత, పోషకాహారలోపం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అవుతాయన్నారు. డీఎంహెచ్ఓ గణేశ్వర్ మాట్లాడుతూ.. ఆల్బెండజోల్ మాత్రలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. అందుబాటులో నిపుణులైన పిల్లల వైద్యులు సేవలు అందిస్తున్నారని, మాత్రలు వేసుకోని పిల్లల కోసం ఈనెల 20వ మాపప్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం ప్ర పంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్న పలు కుటుంబాలను కలెక్టర్ సన్మానించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి జయశ్రీ, మెడికల్ అధికారి సాయిగౌతం, ప్రదీప్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అవినీతిపై చర్యలు తీసుకోండి
రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపాలిటీలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలమై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. స్వాహా అయిన నిధులు రికవరీ చేసి చర్యలు తీసుకోవాలన్నా రు. రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మోసగించాయని ఆరోపించారు. 11వ వార్డులో ఏటా వర్షాకాలంలో ఇళ్లు నీటి ముంపునకు గురవుతున్నాయని, ఈసమస్యను అరికట్టాలన్నారు. ఈమేరకు సిద్దిపేట రోడ్డులో బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి తండాకు తారు రోడ్డు నిర్మాణం కోసం ఏడాది క్రితం కంకర పోసి వదిలేశారని, దీంతో తండావాసులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. పట్టణంలో నెలకొన్న సమస్యల విషయమై ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, పట్టణాధ్యక్షుడు అవినాశ్రెడ్డి, కౌన్సిలర్ శంకర్గౌడ్, జిల్లా ప్రదాన కార్యదర్శి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్, అనిల్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు చింతల శేఖర్, పబ్బ సత్యం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో ‘ధిక్కారం’
● అధిష్టానం వర్సెస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ● తూప్రాన్, మనోహరాబాద్ పార్టీ అధ్యక్షుల నియామకంలో రచ్చ ● పీసీసీని కాదని, తన వర్గానికి కేటాయించిన నర్సారెడ్డి మెదక్జోన్: అధికార కాంగ్రెస్లో ధిక్కార స్వ రం మొదలైంది. తనను కాదని ఎలా నియామకాలు చేపడతారంటూ గజ్వేల్ పార్టీ ఇన్చార్జి నర్సారెడ్డి తిరుగుబాటు చేశారు. జిల్లా పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. కాగా, ఇటీవల కాంగ్రెస్ మండల, పట్టణ పార్టీ కమిటీలను నియమించింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో దీనిపై పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఓ నామినేటెడ్ పదవి విషయంలో తమకు అన్యాయం జరిగిందని తూప్రాన్కు చెందిన కొందరు సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రెండు మండలాల్లో బలమైన నేతలను నియమించాలనే ఉద్దేశంతో ఈనెల 10న తూప్రాన్ పట్టణ అధ్యక్షుడిగా నర్సింగరావు, మనోహరాబాద్ మండల అధ్యక్షుడిగా మల్లారెడ్డిని నియమిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నియామకాలను వ్యతిరేకించిన నర్సారెడ్డి తనను సంప్రదించకుండా పార్టీ పదవులు ఎలా కట్టబెడతారని సమావేశం ఏర్పాటు చేసి తూప్రాన్ మండల అధ్యక్షుడిగా మల్లేశ్, పట్టణ అధ్యక్షుడిగా చిన్న భగవాన్రెడ్డి, మనోహరబాద్ మండల అధ్యక్షుడిగా ఆంజనేయులుగౌడ్ను నియమించారు. గతంలోనూ విభేదాలు అప్పట్లో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడి నియామకంలోనూ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. నర్సారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి కలిసి మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి (పీటీ) సర్పంచ్ మన్నె కళ్యాణ్ను ఫోరం జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఆ మరుసటి రోజే మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన ఆవుల గోపాల్రెడ్డిని ఫోరం జిల్లా అధ్యక్షుడిగా నియమించి నియామకపత్రం అందించారు. అయోమయంలో కేడర్ పోటాపోటీగా నియామకాలు చేపట్టడంతో పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ఏకంగా పీసీసీ అధ్యక్షుడిని సవాల్ చేస్తూ తన అనుచరులకు పార్టీ పదవులు కట్టబెట్టడం, డీసీసీ అధ్యక్షుడిని కాదని జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి నియామకం చేపట్టడంతో జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది. స్టేట్లో పీసీసీ, జిల్లాలో డీసీసీ అధ్యక్షులు చీఫ్గా వ్యవహరిస్తారు. వారిని కాదని సొంత నిర్ణయాలు తీసుకోవటం పార్టీ ధిక్కారమే అవుతుందని పలువురు నేతలు వాపోతున్నారు. -
అమృతం
నత్తనడకన అమృత్ 2.0●నిర్లక్ష్యంతో నీరుగారుతున్న పథకం ●కొనసా..గుతున్న పనులు తాగేదెన్నడో?‘అమృత్ జల్ 2.0’ పథకం నీరుగారుతోంది. నర్సాపూర్ మున్సిపాలిటీ ప్రజలనీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్రం నిధులు మంజూరు చేయగా, పనులు నత్తనడకన సా..గుతున్నాయి. దీనికి ఆయాశాఖల అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రెండేళ్ల క్రితం కేంద్రం రూ. 11.90 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో రెండు భారీ నీటి ట్యాంకులు నిర్మించడంతో పాటు పట్టణంలో పైపులైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. – నర్సాపూర్ -
సర్వం సిద్ధం చేశాం
నులిపురుగుల నిర్మూలనతో పిల్లలు మంచి ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు. చదువుతో పాటు ఆటపాటల్లో చురుగ్గా పా ల్గొంటారు. పాఠశాలలో మెరుగైన హాజరు వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇందుకోసం ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, రిహాబిలిటేషన్ సెంటర్లు, రెస్క్యూ హోమ్స్, లేబర్, మైగ్రెంట్, స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్స్, చైల్డ్ కేర్ హోమ్స్, అనాథ ఆశ్రమాలు, అంగన్వాడీ సెంటర్లు.. ఇలా అన్నీ చోట్ల ఉండే పిల్లల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం. – గణేశ్వర్, డీఎంహెచ్ఓ -
‘మొక్క’బడి తంతు
● అస్తవ్యస్తంగా నర్సరీల నిర్వహణ ● రూ. లక్షలు దుర్వినియోగం ● ప్రజలకు కరువైన ఆహ్లాదం మున్సిపాలిటీలోని మార్కెట్ కమిటీ కార్యాలయం వెనుక భాగంలోని ప్రభుత్వ భూమిలో రూ. లక్షలు ఖర్చుపెట్టి గతంలో నర్సరీ ఏర్పాటు చేశారు. ఇందులో మొక్కల సంరక్షణ పేరిట రూ. లక్షలు దుర్వినియోగం చేశారు. నర్సరీ చుట్టూ ఫెన్సింగ్ వేసి గేటు, ఆర్చ్ నిర్మించారు. ెమొక్కలకు నీటి కోసం ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి బోరు తవ్వించారు. ఇందులో వేల సంఖ్యలో మొక్కలు నాటినట్లు అధికారులు వాస్తవానికి విరుద్ధంగా ప్రకటించారు. నాటిన మొక్కలను పట్టణ వాసులకు పంపిణీ చేసినట్లు గతంలో ప్రకటించగా, అది తప్పని తేలింది. ఈనర్సరీలో మొక్కలు సైతం కొన్ని ఎండిపోయాయి. ఏమైందో తెలియదు కాని కేవలం నీటి వసతి లేదనే కారణంతో ఈనర్సరీని వదిలేసి దీని స్థానంలో వెంకటేశ్వరకాలనీలో మరోటి ఏర్పాటు చేశారు. దీనిలో కూడా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటినట్లు అధికారులు ప్రకటించినా, ప్రస్తుతం అందులో పదుల సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నారు. ఈ నర్సరీ కోసం బడ్జెట్లో రూ. ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు రికార్డులో నమోదు చేయగా, విచారణలో తప్పని తేలింది. రహదారి పక్కనే ఉన్న నర్సీరీని వదిలేయడంతో సామగ్రి దొంగలపాలవుతోంది. పదుల సంఖ్యలో మొక్కలు వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన నర్సరీలో కేవలం పదుల సంఖ్యలో మొక్కలు ఉండగా, గతంలో బోరు తవ్వించారు. ఈనర్సరీ చుట్టూ పెన్సింగ్, ఆర్చ్, వాటర్ ట్యాంక్ నిర్మాణానికి గాను గతంలోనే నిధులు మంజూరైనా పనులు కాలేదు. ఇందులో సైతం తక్కువ సంఖ్యలో మొక్కలు ఉండగా, వీటి నిర్వహణ పేరిట ఖర్చు చేసిన రూ. లక్షలు దుర్వినియోగం అయ్యాయి. ఈవిషయమై పట్టణ వాసులు పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతరించిపోతున్న అడవులను పునరుద్ధరించడం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని తీర్చిదిద్దడం వన మహోత్సవం ముఖ్య ఉద్దేశం. అయితే అందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మొక్కల సంరక్షణ పేరిట రూ. లక్షలు దుర్వినియోగమయ్యాయి. – రామాయంపేట(మెదక్) -
తగ్గిన దూరం.. తీరిన దాహం
● జిల్లాలో విరివిగా బోరు బావుల తవ్వకం ● ‘ఎంఎస్ఎస్ఓ’ ద్వారా సేవా కార్యక్రమాలు మెదక్జోన్: సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో జిల్లాలోని అనేక గ్రామాలకు తాగు నీరు సరిగా రావడం లేదు. అంతే కాకుండా ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవక భూగర్భజలాలు అడుగంటి నీటి ఎద్దడి ఏర్పడింది. ముఖ్యంగా గిరిజన తండాల్లో ఈ తీవ్రత అధికంగా ఉంది. ఈక్రమంలో ‘ఎంఎస్ఎస్ఓ’ ద్వారా బోరు బావులు తవ్విస్తూ సింగిల్ ఫేజ్ మోటార్లు అమర్చి తాగునీటి ఎద్దడి తీరుస్తున్నారు. గడిచిన రెండు, మూడు నెలల్లో నియోజకవర్గంలో సుమారు 80కి పైగా బోరు బావు లు తవ్వించి ప్రజల దాహం తీరుస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 300 మోటార్లు అమర్చారు. ఒకవైపు ఎమ్మెల్యేగా, మరో వైపు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజర్గా రోహిత్రావు రాణిస్తున్నారు. ‘పై చిత్రంలో కనిపిస్తున్న వారు నునావత్ సంత్యాలి, శారద. చిన్నశంకరంపేట మండలం ప్యాటగడ్డ పంచాయతీ పరిధిలోని ఎర్రగుంట తండా. కొంతకాలంగా తండాకు మిషన్ భగీరథ నీరు రావటం లేదు. పంట పొలాల్లో బోర్ల నుంచి నీరు తెచ్చుకొని దాహం తీర్చుకుంటున్నారు. దీంతో ఇటీవల మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజింగ్ (ఎంఎస్ఎస్ఓ) ద్వారా తండాలో బోరు తవ్వించి సింగిల్ ఫేజ్ మోటార్ బిగించి నీటి బాధ తీర్చారు. ఇది ఒక్క ఎర్రగుంట తండాలోనే కాదు మెదక్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో బోర్లు తవ్వించి తాగునీటి సమస్య తీరుస్తున్నారు’. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
తూప్రాన్: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమ నుంచి వెలువడే విషపూరితమైన కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం విడ్డూరం అన్నారు. ఇప్పటికే అనేక మంది వివిధ రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పార్టీలకతీతంగా కలిసికట్టుగా పోరాడి ఎంఎస్ అగర్వాల్ కంపెనీని పారదోలి, మన ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి పరిశ్రమ నుంచి ప్రజలను కాపాడాలని కోరారు. దీక్షకు రంగాయపల్లి, చెట్ల గౌరవం గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. కాగా, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణగౌడ్, వెంకట్గౌడ్, శేఖర్గౌడ్, సాయిగౌడ్, రఘుపతి, తదితరులు పాల్గొన్నారు. నిరాహార దీక్ష చేపట్టిన వంటేరు ప్రతాప్రెడ్డి -
ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి
పటాన్చెరు టౌన్: సర్ ప్రక్రియపై పార్టీ నాయకులు, ఆశావహులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పై ప్రజల్లో నమ్మకం పోయిందని.. స్కామ్ల ప్రభుత్వం పోయి మళ్లీ సంక్షేమ పథకాల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎస్ఐఆర్, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అంశాలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధ్యక్షతన జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కారణంగా ఓటర్ల జాబి తాల్లో అవకతవకలు జరిగి ఎన్నికల ఫలితాలు మారాయని ఆరోపించారు. సిగాచి ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేయలేదని, కంపెనీ యాజమాన్యమే పరిహారం చెల్లించిందని హరీశ్రావు విమర్శించారు. కేసీఆర్ హయాంలో పటాన్చెరు పట్టణంలో రూ.200 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడం చేతకాని దద్దమ్మ రాష్ట్ర ప్రభుత్వం అని విమర్శించారు. పటాన్చెరులో ఐటీ పార్క్ కోసం కేటాయించిన భూమిని ప్రభుత్వం విక్రయించిందని ఆరోపించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాలను బీఆర్ఎస్ గెలుస్తుందని హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీజీఐఐసీ మాజీ చైర్మన్ బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్, మున్సిపల్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీమంత్రి హరీశ్రావు -
నులిమేద్దాం రండి
జిల్లావ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ల వయసు గల 1,81,425 మంది పిల్లలను అధికారులు గుర్తించారు. వీరిలో నులిపురుగుల నిర్మూలనకు మొత్తం 2,36,400 ఆల్బెండజోల్ మాత్రలు సిద్ధం చేసి ఉంచారు. సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆస్పత్రుల్లో మాత్రలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి అధికారులు, సిబ్బందికి డీఎంహెచ్ఓ దిశానిర్దేశం చేశారు. ఉదయం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రార్థన అనంతరం పిల్లలకు చేతుల పరిశుభ్రత, ఆల్బెండజోల్ మాత్రల గురించి అవగాహన కల్పించి, అనంతరం మాత్రలు పంపిణీ చేస్తారు. వేసుకోని వారికి 20న పంపిణీ నేడు మాత్రలు వేసుకోకుండా మిగిలిపోయిన పిల్ల ల కోసం ఈనెల 20వ తేదీన మాపప్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈసందర్భంగా వైద్యారోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తారు. కడుపులో నులి పురుగులు ఉంటే పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, అలసట, శారీరక మానసిక ఎదుగుదల సరిగా ఉండకపోవడం, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బలహీనత, బరువు తగ్గడం వంటి అనేక సమస్యలు ఉంటాయి. తద్వారా ఆరోగ్యం దెబ్బతిని ఎప్పుడూ నీరసంగా ఉంటారు. చదువు, ఆటల్లో వెనకబడిపోతారు. ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవడం వల్ల కడుపులో పెరిగే నులిపురుగులను నిర్మూలిస్తుంది. ఈ మాత్రలతో పిల్లలకు ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. నిపుణులైన పిల్లల వైద్యులను అందుబాటులో ఉంచుతారు. నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం జిల్లాలో 1,81,425 మంది పిల్లల గుర్తింపు 2,36,400 ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు -
ఇంకుడు గుంతలు తప్పనిసరి
మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ నర్సాపూర్: ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ ప్రజలకు సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత వానాకాలం సీజన్లో వర్షపాతం తక్కువగా నమోదు అవుతున్నందున వర్షం నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపితే భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. బోరుబావుల నుంచి నీరు ఎక్కువగా రావడంతో పాటు భూకంపాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెప్పారు. పట్టణంలో 200 గజాలు, అంతకన్న ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించే ప్రతి యజమాని ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. నిర్మాణం చేపట్టని యజమానులపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని మంగళపర్తికి చెందిన సంఘ సేవకుడు రాఘవేందర్రావుకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా అవకాశం రావడంపై నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న రాఘ వేందర్రావుకు ఈ బాధ్యత రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ నియామకం ద్వారా దేవస్థానం అభివృద్ధికి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆయన కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆదివారం డీసీసీ ఉపాధ్యక్షుడు నరేందర్రెడ్డితో పాటు పలువురు నాయకులు, గ్రామ పెద్దలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శివ్వంపేట (నర్సాపూర్): మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నరేందర్ తెలిపారు. పిల్లుట్ల విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ ఉండదని, ప్రజలు సహకరించాలని కోరారు. హవేళిఘణాపూర్(మెదక్): నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరమని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరశురామ్గౌడ్ అన్నారు. మండల పరిధిలోని హవేళిఘణాపూర్, బూర్గుపల్లి, వాడి, కొత్తపల్లి, రాజ్పేటకు చెందిన సుమారు 62 మందికి ఆదివారం చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మె ల్యే రోహిత్ సహకారంతో చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కిరణ్గౌడ్, నాయకులు మహేందర్రెడ్డి, సర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. తూప్రాన్: పీసీసీ అధ్యక్షుడు తీర్మానించిన కమిటీలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చిటుకుల మహిపాల్రెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి అన్నారు. ఆదివారం తూప్రాన్లో వారు మాట్లాడుతూ.. పీసీసీకి వ్యతిరేకంగా గజ్వేల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి కమిటీలు వేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. చర్యలు తీసుకోకుంటే 10 వేల మందితో గాంధీభవన్కు వెళ్తామన్నారు. కాగా, మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలోని ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమ మూతపడే వరకు ప్రజల పక్షానా పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నాగులపల్లి శ్రీనివాస్రెడ్డి, మల్లారెడ్డి, విశ్వరాజ్, నాగరాజు గౌడ్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ వేగవంతమయ్యేలా కృషి చేయాలి
అల్లాదుర్గం(మెదక్): ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై శనివారం నిర్వహించి బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తల సమావేశానికి మంత్రి దామోదర హాజరై మాట్లాడారు. ఎమ్యూరేషన్ ఫారాలు సక్రమంగా పూరించేందుకు ఓటర్లకు సహకారం అందించాలన్నారు. రోజు వారి లక్ష్యాలను నిర్దేశించుకుని, బీఎల్ఓల సహకారంతో ఎలాంటి తప్పులు చేకుండా ఫారాలు పూర్తి చేయించాలని సూచించారు. ప్రతీ గ్రామంలో ఒక్క ఓటు కూడా రద్దు కాకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేషారెడ్డి, నాయకులు సుభాశ్రావ్, బల్రాం, నర్సింహారెడ్డి, గోపాల్రెడ్డి, వీరప్ప, శ్రీనివాస్ రెడ్డి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ -
ఎట్టకేలకు పీఏసీఎస్కు చేరిన యూరియా
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి శనివారం ఎట్టకేలకు యూరియా నిల్వలు చేరుకున్నాయి. రెండు రోజుల క్రితమే యూరియా కొనుగోలు కోసం డీడీ చెల్లించగా, శనివారం లోడ్ పీఏసీఎస్కు వచ్చింది. గురువారం పీఏసీఎస్లో ఫర్టిలైజర్కు సంబంధించిన నిధుల గోల్మాల్పై ‘సాక్షి’ దినపత్రికలో ‘‘స్వాహాకారం’’ పేరుతో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. అధికారుల తనిఖీలు, ఒత్తిడితో పీఏసీఎస్ సిబ్బంది కాజేసిన సొమ్ములో కొంత మేర డబ్బును తిరిగి బ్యాంకులో జమ చేశారు. అయితే సోమవారంలోగా పూర్తి డబ్బును బ్యాంకు అకౌంట్లో జమ చేయాలని డీసీసీబీ మేనేజర్ చంద్రశేఖర్, ఫీల్డ్ ఆఫీసర్ సంగమేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మొత్తం 1,120 బస్తాల యూరియాకు డీడీ చెల్లించగా, ప్రస్తుతానికి 450 బస్తాల లోడ్ వచ్చిందని పీఏసీఎస్ సీఈఓ రమేష్ తెలిపారు. ఈ యూరియాను ఆన్లైన్ యాప్ ద్వారా ముందుగానే బుక్ చేసుకున్న రైతులకు నిబంధనల ప్రకారం పంపిణీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
అడ్రెస్ లేదు!
యూనిఫారం.. ఆమడ దూరం ● బడులు తెరిచినా.. అందని దుస్తులు ● ఎదురుచూస్తున్న విద్యార్థులు ● పాత దుస్తులతోనే స్కూళ్లకు చిన్నారులు మెదక్కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ప్రతియేటా పాఠ్య పుస్తకాలు, నోటు బుక్స్తోపాటు యూనిఫారాలు అందజేస్తుంది. పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం కూడా అందిస్తోంది. పాఠశాలల పునః ప్రారంభం నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు అందజేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం యూనిఫారాల పంపిణీ కానరాలేదు. చేరని వస్త్రం జిల్లాలోని ఎంపీపీ, జెడ్పీహెచ్ఎస్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మొత్తం 64,935 మంది విద్యార్థులకు కొత్త రకం యూనిఫారాలు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న యూనిఫారాల రంగుల్లో మార్పులు చేసి కొత్త డిజైన్లను ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను ఈ యూనిఫారం విధానం అమలు చేయనున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ యూనిఫారాలకు సంబంధించిన వస్త్రం జిల్లాకు చేరలేదు. అందని యూనిఫారాలు విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంకా యూనిఫారాలు అందలేదు. గతంలో విద్యా సంవత్సరానికి ముందే పాఠశాలలకు చేరుకునేవి. దీంతో విద్యార్థులంతా యూనిఫారాలు ధరించి స్కూళ్లకు హాజరయ్యేవారు. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తరకం యూనిఫారం అందిస్తామని ప్రకటించడంతో విద్యార్థులు మురిసిపోయారు. కానీ ఇప్పటికీ అందకపోవడంతో నిరాశగా ఎదురుచూస్తున్నారు. కనీసం వస్త్రం కూడా చేరుకోకపోవడంతో యూనిఫారాలు ఇస్తారా? మర్చిపోయారా? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి యూనిఫారాలు అందజేయాలని విద్యార్థులు, వారి తలిదండ్రులు కోరుతున్నారు. జిల్లా విద్యాశాఖలోని యూనిఫారాల నిర్వహణ అధికారి రాజును వివరణ కోరగా వస్త్రం ఇంకా చేరుకోలేదని చెప్పారు. వస్త్రం రాగానే వెంటనే స్టిచ్చింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. సంక్షేమ గురుకులాలకే.. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీ, యూఆర్ఎస్, టీఆర్ఈఐఎస్, టీడబ్య్లూ, ఎంజేపీటీబీలలో విద్యార్థులకు మాత్రం యూనిఫారాలు త్వరలోనే అందనున్నాయి. వాటిలో ప్రస్తుతం 15,753 మంది విద్యార్థులు ఉండగా వారందరికీ గతంలో ఉన్న మాదిరిగానే యూనిఫారాలు అందజేయనున్నారు. యూనిఫారాలకు సంబంధించిన వస్త్రం రావడంతో స్టిచ్చింగ్ ప్రారంభమైంది. -
ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ వేగిరం చేయాలి
మెదక్ ఆర్డీఓ రమాదేవి చిన్నశంకరంపేట(మెదక్): ఎస్ఐఆర్ ఓటరు సమగ్ర సర్వే డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి అధికారులకు స్పష్టం చేశారు. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ తండాలో శనివారం ఎస్ఐఆర్ పక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఇంటింటికీ అందించిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి తీసుకుని ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేయాలని కోరారు. ఎవరైనా ఫారం నింపలేని పరిస్థితి ఉంటే గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, వీఆర్ఏల సహకారంతో ఓటరు ఫారం నింపేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల నిర్లక్ష్యం చూపవద్దని, అవసరమైతే పనిగంటలను పెంచుకుని కార్యక్రమం పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ మాలతి, సర్పంచ్ ప్రియానాయక్ ఉన్నారు. మాధవానంద సరస్వతి స్వామి పాపన్నపేట (మెదక్): సమాజంలో మానవత్వాన్ని మించినది ఏదీ లేదని రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని నాగ్సాన్పల్లి ఉమా కేదారీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడారు. నిరంతరం భగవంతుడి నామస్మరణ చేయడంతోనే మనిషికి నిజమైన మనఃశాంతి లభిస్తుందని చెప్పారు. మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఆ దేవుడే తగిన పరిష్కారం చూపుతాడని భక్తులకు ప్రబోధించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనా రెడ్డి దంపతులు స్వామి వారికి అత్యంత భక్తిశ్రద్ధలతో పాదపూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ, శ్యాంసుందర్ శర్మ, రామవర్మ, శ్రావిత్ శర్మలతో పాటు పార్శి నర్సింలు, యాబన్న, మోహన్ రెడ్డి, ఎర్రం రవీందర్, సాయిబాబ, మహేందర్, శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు. -
పోలీస్ అక్క.. భద్రత పక్కా
మెదక్ జిల్లా వ్యాప్తంగా 7.24 లక్షల మంది జనాభా ఉండగా వారిలో పురుషులతో పోల్చుకుంటే మహిళా జనాభా ఎక్కువగా ఉంది. తోటి విద్యార్థులతో పాటు తెలిసినవారు, దగ్గరి బంధువులు, ప్రేమ పేరుతో ఇబ్బందులు పెట్టడం, లైంగిక వేధింపుల నేపథ్యంలో బాధిత బాలికలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావటం లేదు. సమాజంలో తెలిస్తే తమ పరువు పోతుందనే భావన, లేదా తల్లిదండ్రులకు తెలిస్తే చదువులు మాన్పిస్తారనే భయంతో చెప్పడానికి సుముఖంగా లేరనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి వారి కోసం జిల్లా రక్షణశాఖ ‘పోలీస్ అక్క’ అనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ముందుగా విద్యాసంస్థల్లో.. ముందుగా విద్యార్థినులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 9న, జిల్లా కేంద్రంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో పోలీస్ అక్క గురించి వివరించారు. అలాగే జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లకు ఒక మహిళా కానిస్టేబుల్ను నియమించారు. బాలికల పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీలు తదితర వాటిలో అవగాహన కల్పించటంతో పాటు ప్రతి బాలిక వద్ద ‘పోలీస్ అక్క’ ఫోన్ నంబర్ ఉండాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా నేరుగా చెప్పుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎస్పీ వివరించారు. ఆకతాయిల ఆట కట్టిస్తారు.. ‘పోలీస్ అక్క’ రంగ ప్రవేశంతో ఇక ఆకతాయిల ఆట కట్టించడమే తరువాయి. మహిళల భద్రతకు ఇప్పటికే షీటీం, బాలికల కోసం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన మేర ఫలితాలు రాలేదని తెలుస్తోంది. పోలీస్ అక్కతో ప్రతీ బాలిక ఎలాంటి సమస్య ఎదురైనా పోలీస్స్టేషన్కు వెళ్లకుండానే ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అనంతరం ఆకతాయిల ఆట కట్టిస్తారు. దీంతో బాలికలకు సంపూర్ణ భద్రతతో వారి ఉన్నత చదువులకు, కెరీర్కు ఎలాంటి ఆటంకం కలుగకుండా అండగా నిలవనుంది. చదువుకునే చోట పాఠశాలలు, కళాశాలలతో పాటు వచ్చి పోయే దారిలో తోటి విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో విద్యార్థినులను(బాలికలను) ఇబ్బందులు పెట్టడం, ప్రేమపేరుతో మోసం చేయటం ఎక్కడో ఒకచోట నిత్యకృత్యంగా మారింది. ఇక నుంచి అలాంటి ఆకతాయిలు చేసే వికృత చేష్టలకు కాలం చెల్లినట్టే. విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా ‘పోలీస్ అక్క’ పేరుతో ప్రతీ పోలీస్ స్టేషన్కు ఒక మహిళా కానిస్టేబుల్ను నియమించింది. – మెదక్ జోన్ పోలీస్ స్టేషన్కు ఒక మహిళా కానిస్టేబుల్ కేటాయింపు విద్యార్థినులు తమ సమస్యలు చెప్పేలా ప్రోత్సాహం మహిళా చట్టాలపై విస్తృత అవగాహన నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన పోలీస్శాఖ -
సర్వర్ డౌన్
మొరాయిస్తున్న భూ భారతి సైట్ మందగించిన భూముల రిజిస్ట్రేషన్లు సర్వే ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఆర్డీఓ రమాదేవి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల తహసీల్దార్ కార్యాలయంలో రోజుకు సగటున 20 నుంచి 25 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. భూభారతి పోర్టల్లో సర్వర్ సమస్య కారణంగా పక్షం రోజులుగా ఏ రోజు కూడా మూడు, నాలు గుకు మించి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. దీంతో పట్టాదారులు, రైతులు ఇలా పడిగాపులు కాస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గత నెల 29 నుంచి ఇప్పటి వరకు సుమారు 85 వరకు రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉండిపోయాయి. ఈ ఒక్క చిన్న మండలంలోనే ఈ పరిస్థితి ఉంటే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 612 తహసీల్దార్ కార్యాలయాల్లో ఎన్ని వేల రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక బ్రేక్ పడిందనేది అంచనా వేసుకోవచ్చు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి భూభారతి పోర్టల్ సర్వర్ సమస్య కారణంగా రైతులు, పట్టాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్షం రోజులుగా రిజిస్ట్రేషన్లు సరిగ్గా జరగకపోవడంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు తమ భూములు రిజిస్ట్రేషన్ జరుగుతుందా..అని ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా రోజుకు రెండు, మూడు రిజిస్ట్రేషన్లు కూడా జరగడం లేదు. దీంతో మిగతావారు రోజంతా వేచి చూసి నిరాశతో వెళ్లిపోతున్నారు. దాదాపు పక్షం రోజులుగా ఇదే సమస్య నెలకొంది. మెయింటెనెన్స్ పేరుతో... భూభారతి పోర్టల్ను యాన్యువల్ మెయింటెనెన్స్ చేస్తున్నారని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదట జూన్ 26 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు రెవెన్యూశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ 12 రోజులవుతున్నా..ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. సాఫ్ట్వేర్ను అప్గ్రేడేషన్ జరుగుతోందని, సర్వర్ సామర్థ్యం కూడా పెంచుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక..రానున్న రోజుల్లో పోర్టల్ మరింత వేగంగా పనిచేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సమస్య లేదు భూభారతిలో పోర్టల్లో ట్రాన్సక్షనల్ సర్వీస్ మాత్రమే సమస్య కొనసాగుతోంది. సాధారణ ప్రజలు సెర్చ్ చేసే సమాచార సేవలకు మాత్రం ఎ లాంటి సమస్య రావడం లేదు. మార్కెట్ వ్యాల్యూ, భూమి వివరాలు, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలు, ఈసీ వివరాలు (ధరణికి ముందు), రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు వంటి సేవలుకు పెద్దగా ఇబ్బంది కావడం లేదు. కేవలం భూలావాదేవీలకు సంబంధించిన లాగిన్లోనే సమస్య కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్లు జరగక తహసీల్దార్ కార్యాలయాల్లో రైతుల పడిగాపులు పక్షం రోజులుగా కొనసాగుతున్న పట్టాదారుల కష్టాలు పోర్టల్ యాన్యువల్ మెయింటెనెన్స్ అంటున్న అధికారులు -
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం
మెదక్జోన్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆపరేషన్ ముస్కాన్– ఆధ్వర్యంలో గడిచిన పది రోజుల్లో 34 మంది చిన్నారులకు రక్షణ కల్పించి 22 కేసులను నమోదు చేశామన్నారు. పిల్లల చేతుల్లో ఉండాల్సింది పనిముట్లు కాదని పుస్తకాలన్నారు. ముఖ్యంగా హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాలు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వెంటనే రక్షించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూ) ముందు హాజరుపరచాలని తెలిపారు. అనంతరం తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు అప్పగించాలని సూచించారు. పిల్లల బాల్యం విద్యకే అంకితం కావాలని, వారి భవిష్యత్తు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఆర్బీ అధికారి జార్జ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సతేంద్ర ప్రసాద్, విద్యాశాఖ, కార్మికశాఖ అధికారులు పాల్గొన్నారు. అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ -
సర్ ప్రక్రియ గడువులోగా పూర్తి
ఆర్డీఓ, తహసీల్దార్లతో కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: నిర్దేశిత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీఓ, తహసీల్దార్లతో సర్ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అందుబాటులో లేని ఓటర్లకు కూడా సమాచారం అందించాలన్నారు. గడువులోగా వారు తమ ఎన్యూమరేషన్ ఫారంలు తిరిగి అందించేలా చూడాలన్నారు. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారి ఎన్యూమరేషన్ ఫారంలను జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. వివరాలు సరి చూసుకున్న మీదట వారి కుటుంబ సభ్యుడి సంతకంతో తీసుకోవచ్చని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారంల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్ను ఏకకాలంలో సమాంతరంగా నిర్వహించాలని సూచించారు. అంతకుముందు న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ పవన్కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రతిమాసింగ్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, ఎన్నికల సూపరింటెండెంట్ గఫార్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
పేరుకుపోతున్న ఫైళ్లు
నర్సాపూర్: భూ భారతి సైట్ మొరాయించడంతో భూముల రిజిస్ట్రేషన్లు నత్తనడకన సాగడంతో తహసీల్దార్ల కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ఫైళ్లు పేరుకుపోతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన భూ భారతి సైట్ను అప్గ్రేడ్ చేసే పనులను ప్రభుత్వం గత నెల 25 నుంచి చేపట్టగా పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అప్గ్రేడ్ చేసే పనులు చేపట్టినప్పటి నుంచి వెబ్సైట్ రోజూ గంట నుంచి గంటన్నర సేపు మాత్రమే ఓపెన్ కావడంతో తహసీల్దార్ల కార్యాలయాల్లో ఒకటి, రెండు భూముల రిజిస్ట్రేషన్లే పూర్తవుతున్నాయి. ఏ రోజుకారోజు భూముల రిజిస్ట్రేషన్లు పూర్తి కానందున రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న రైతుల ఫైళ్లు అన్ని మండల తహసీల్దార్ల కార్యాలయాల్లో పేరుకుపోతున్నాయి. కాగా, భూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకుని భూములు అమ్మే వారితో పాటు కొనుగోలు చేసే రైతులు తమకు స్లాట్ కేటాయించబడిన రోజు ఆయా తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. సైట్ రానందున రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగక రైతులు గంటల తరబడి నిరీక్షించి ఒట్టి చేతులతోనే ఇంటిముఖం పడుతున్నారు. సైట్ను అప్గ్రేడ్ చేసే పనులు చేపట్టినప్పుడు స్లాట్ బుకింగ్ను నిలిపివేస్తే తాము తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని రైతులు అభిప్రాయపడుతున్నారు. అప్గ్రేడ్ పనులు చేస్తూనే స్లాట్ బుకింగ్కు అవకాశం ఇవ్వడంతో తాము స్లాట్ బుక్ చేసి ఆఫీసులకు వచ్చినా రిజిస్ట్రేషన్లు కానందున ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సైట్ పూర్తి స్థాయిలో పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ను వివరణ కోరగా ప్రభుత్వం సైట్ను అప్గ్రేడ్ చేస్తోందన్నారు. సైట్ రానందున భూముల రిజిస్ట్రేషన్లు తక్కువ అవుతున్నాయని చెప్పారు. సైట్ సమస్య అంతటా ఉందని, సైట్ అప్గ్రేడ్ కాగానే భూముల రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతాయని ఆయన చెప్పారు. రోజుకు రెండు మూడు మాత్రమే పూర్తి ఇబ్బందులు పడుతున్నామంటున్న రైతులు -
ఎఫ్ఎల్ఎన్ యాప్ రూపకర్తకు సన్మానం
మెదక్ అర్బన్ /పెద్దశంకరంపేట(మెదక్): ఎఫ్ఎల్ఎన్ యాప్ రూపకర్త, మెదక్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు బృంగి ప్రసన్నకుమార్ను సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ ఏ ఉషారాణి శుక్రవారం హైదరాబాద్లోని కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం అభివృద్ధికి కృత్రిమ మేథస్సు ఆధారంగా రూపొందించిన ఎఫ్ఎల్ఎన్ మొబైల్ యాప్ ఒక వినూత్నమన్నారు. విద్యార్థుల స్థాయి కనుగుణంగా కార్యకలాపాలు, ప్రశ్నలు, గేమ్స్ అందించే ఈ యాప్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, టీచర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎటువంటి కార్పొరేట్, వాణిజ్య సంస్థల సహకారం లేకుండా, సొంత ఆర్థిక వనరులతో , స్వీయ పరిశోధన ద్వారా యాప్ అభివృద్ధి చేశారని కొనియాడారు. ఇది ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ఊతమిస్తుందన్నారు. బృంగి ప్రసన్నకుమార్ కృషిని డీఈఓ రాజు, ఏఎంఓ సుదర్శన మూర్తి, ఏఎస్ఓ నవీన్ కుమార్, టీచర్లు అభినందించారు. -
ఈ రెండు వారాలే కీలకం
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ వాటిలో వర్షాధారంగా ఇప్పటికే 38 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయగా, ప్రధానంగా పత్తిసాగు 31,880 ఎకరాలు, మిగతా 6,120 ఎకరాల్లో మొక్కజొన్న, కందులు, పెసర్లు, బొబ్బర్లు, సోయా, తదితర పంటలను సాగు చేశారు. కాగా వారం రోజులుగా చినుకు జాడలేకపోవటంతో మొలకెత్తిన విత్తనాలు ఎండుముఖం పడుతున్నాయి. ఎల్నినో ముప్పు! జిల్లాపై ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు కురిసే బలమైన కార్తెలు రోహిణి, మృగశిర, ఆరుద్ర, కార్తెలు పోగా ఆరు రోజుల క్రితం పునర్వసు కార్తె కూడా వచ్చింది. ప్రతి ఏటా మృగశిర, ఆరుద్ర కార్తెల్లో వానలు దంచికొట్టేవని, ఈసారి చినుకు జాడ లేదని రైతులు వాపోతున్నారు. జూన్లో 112.4 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 83.8 మి.మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ లెక్కన 28.6 మి. మీటర్ల లోటు కనిపిస్తుంది. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ ఎల్నినో ప్రభావం కనిపిస్తోందని, అందుకే వేసవి మాదిరిగా ఎండలు కొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలకు పైగా నమోదు కావడమే ఇందుకు కారణం అని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. సాగుకు గడ్డుకాలం వారం పదిరోజుల కోసారి కురిసే చిరుజల్లులకు వర్షాధార పంటలను సాగు చేశారు. ఇక మిగిలింది వరిసాగు ఈ ఏడు 3లక్షల 29 వేల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా బోరుబావుల ఆధారంగా ఇప్పటి వరకు 3,234 ఎకరాల్లో మాత్రమే సాగైంది. కేవలం 10శాతం మాత్రమే, ఇంకా 90 శాతం వరి సాగు కావాల్సి ఉంది. బోరుబావుల వద్ద నారుమళ్లు పోసి వేసవి దుక్కులు దున్ని సిద్ధంగా ఉన్నారు. నారుమళ్లు సైతం ఎదగడంతో పెద్ద వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తొందరపడి వరి సాగు చేయొద్దు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతాన్ని బట్టి పంటలను సాగు చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావటంతో ఇటీవల కలెక్టర్ వ్యవసాయ, హార్టికల్చర్, విద్యుత్, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జులై చివరి వారం వరకు వర్షం కురవకుంటే, వరి సాగుకు బదులు ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా ఇప్పటికే ప్రభు త్వం నుంచి కంది, మినుము, పెసర్లు , తదితర ఆరుతడి విత్తనాలు సరఫరా అయ్యాయి. -
మనసున్న మహిళా సర్పంచులు
పాపన్నపేట(మెదక్): ఇంటిని చక్క బెట్టు కోవడమే కాదు.. అవకాశమిస్తే ఊరును..శివారును నందనవనంగా తీర్చిదిద్దుతామని నిరూపిస్తున్నారు మహిళా సర్పంచ్లు. పాపన్నపేట మండలం అనంతుని వాగు వద్ద బ్రిడ్జి రోడ్డు దాటాలంటే వాహనదారులకు నిత్య నరకమే. 300 మీటర్ల మేర రోడ్డు వేయక కాంట్రాక్టర్ వదిలి వేయడంతో..గుంతల రోడ్డుపై ప్రయాణించడం కత్తిమీద సాములా మారింది. ప్రయాణికులు దుమ్మెత్తిపోస్తున్నా అధికారుల్లో చలనం లేకపోవడంతో పొరుగు గ్రామాలైన యూసుఫ్పేట, ఆరెపల్లి సర్పంచ్లు అమ్మరెడ్డి గారి అనిత, మేగజోల్ల రజిత శుక్రవారం ట్రాక్టర్తో రోడ్డును చదును చేయించారు. దీంతో వాహనాల రాకపోకలకు రోడ్డు అనుకూలంగా మారింది. ఎన్హెచ్ 161 రోడ్డును కలిపే మెదక్–బొడ్మట్పల్లి రోడ్డు మధ్యలో, కొత్తపల్లి వద్ద అనంతుని వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం 2022లో రూ.2.35 కోట్లు మంజూరయ్యాయి. కాగా బ్రిడ్జి నిర్మించిన కాంట్రాక్టర్, రోడ్డు నిర్మాణం చేయకుండా వదిలేయడంతో, అడుగుకో గుంత ఏర్పడింది. వర్షాకాలం వచ్చిందంటే, 300 మీటర్ల దూరం దాటడానికి కనీసం ఎనిమిది నిమిషాలు పడుతుంది. వెంటనే అధికారులు స్పందించి, అర్థంతరంగా వదిలేసిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొత్తపల్లి బ్రిడ్జి రోడ్డు చదునుగా మార్చారు -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
నర్సాపూర్: రాజకీయాలకతీతంగా నర్సాపూర్ అభివృద్ధికి కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి చెప్పారు. మున్సిపాలిటీలోని పదవ వార్డులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలన్నారు. గతేడాది మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.15కోట్లు మంజూరు చేసిందని, వాటితో పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ప్రతీ వార్డులో రూ.30లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. పదవ వార్డులో మురికి కాలువ నిర్మాణానికి అదనంగా నిధులు కావాలని కాలనీ ప్రజలు కోరడంతో నిధులు మంజూరు చేయిస్తానని సునీతారెడ్డి హామీ ఇచ్చారు. ఆమె వెంట మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మున్సిపల్ మేనేజర్ మధుసూదన్, వైస్ చైర్మన్ బుచ్చేష్యాదవ్, కౌన్సిలర్లు రాజు, మోహిజోద్దీన్, ఆయా పార్టీల నాయకులు శేఖర్, భిక్షపతి, బాల్రెడ్డి, అశోక్గౌడ్ తదితరులున్నారు. -
ఎస్ఐఆర్పై కాంగ్రెస్ దుష్ప్రచారం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ చిన్నశంకరంపేట(మెదక్): ఎస్ఐఆర్ ఓటరు సమగ్ర సర్వేపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఎవరి ఓటు ఎక్కడికీ పోదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశంగౌడ్ స్పష్టం చేశారు. చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో బీఎల్ఓలు, శక్తి కేంద్రం ఇన్చార్జిలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్తో ఓట్లు తీసివేస్తారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రెండు ఓట్లు ఉన్నవారివి, అసలే ఆధార్కార్డులేని వారి ఓట్లు తీసివేస్తారని వివరించారు. ప్రతీ ఓటరు ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇవ్వాలని సూచించారు. ఫారం నింపడం రాని ఓటర్లకు బీజేపీ బీఎల్ఓలు సహకరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పోగుల రాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు గంగాధర్గౌడ్, మల్లారెడ్డి, బాల్రాజ్, నరేందర్రెడ్డి పాల్గొన్నారు. మెదక్జోన్: బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో బ్రాహ్మణ సదనం భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలో నిర్మించనున్న ఈ భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేయిస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్గౌడ్, నాయకులు గంగాధర్, పవన్, భూపతిరాజు, రమణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని శ్రీరామాలయంలో శుక్రవారం నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. స్థానిక సమ్మోహన నాట్యాలయం ఆధ్వర్యంలో గజ్జల(మువ్వ)పూజా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు భరతనాట్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. చిన్నారులు తమ నాట్య ప్రదర్శన అందరిని అలరించింది. నాట్య కళా నిర్వాహకులు పేరణి తోట ప్రశాంత్ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ బాధ్యులు మురళీ పంతులు, కందుకూరి రవీందర్, జశ్వంత్, అనిల్, మహంకాళి కృష్ణమూర్తి, సీతారామారావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జోగిపేట(అందోల్): తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)లో ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జోగిపేట ఏరియా ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ... తెలంగాణ వైద్య విధాన పరిషత్లో రెగ్యులర్ కమిషనర్ను వెంటనే అపాయింట్ చేయాలని, రీడిప్లాయిమెంట్, ప్రమోషన్లు, సర్వీస్ రెగ్యులరైజేషన్,పెండింగ్ బిల్స్ ,ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు, సర్వీస్ రిజిస్టర్లు రిటర్న్ చేయడం వంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. -
శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026
మెదక్ అర్బన్: ప్రస్తుతం ఏ పల్లెలో చూసినా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) లొల్లి నడుస్తుంది. శిక్షణ పొందిన బీఎల్ఓలు కాకుండా, ఇతర పంచాయతీ సిబ్బంది ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. దీంతో కొంతమందికి అవగాహన లేక ఫారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కాగా, ఎన్యూమరేషన్ ఫాంల గడువు ఈనెల 24 వరకు మాత్రమే ఉండటంతో గ్రామీణ ఓటర్లలో ఆందోళన నెలకొంటుంది. అవగాహన కరువు ఎన్యూమరేషన్ ఫాంలో మూడు భాగాలుంటాయి. 2002 ఓటర్ లిస్టులో పేరు నమోదై ఉంటే, మొదటి భాగంలో వివరాలు రాయాలి. లేకపోతే రెండో భాగం నింపాలి. అయితే మొదటి భాగంలో ఓటరు పేరు, గుర్తింపు కార్డు నంబర్, నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య చాలా మందికి తెలియడం లేదు. అప్పటి ఓటర్ లిస్టు చాలా మందికి అందుబాటులో సైతం లేదు. జిల్లాలో ఇలా.. నియోజకవర్గాలు మెదక్, నర్సాపూర్ మొత్తం ఓటర్లు 4,53,140 బీఎల్ఓలు 586 ఇప్పటివరకు ఎన్యూమరేషన్ పత్రాలు అందినవి 4,45,360 డిజిటలైజ్ అయినవి 82,454 -
ఇంటెలిజెన్స్ ఆరా!
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట పీఏసీఎస్లో నిధుల గోల్మాల్పై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘స్వాహాకారం’ కథనంపై ఇంటెలిజెన్స్ ఆరా తీసినట్లు సమాచారం. బ్యాంకు అధికారులతో మాట్లాడి సమాచారం అడిగినట్లు తెలిసింది. అలాగే సీఈఓ రమేశ్ను బ్యాంకు స్టేట్మెంట్, ఎరువుల నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే పాలకవర్గం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. డబ్బులు వెంటనే బ్యాంకులో జమ చేయాలని, అందుకు సరిపోను ఎరువుల స్టాక్ను చూపాలని సీఈఓను ఆదేశించారు. అలాగే డీసీసీబీ మేనేజర్ చంద్రశేఖర్, ఫీల్డ్ ఆఫీసర్ సంగప్ప పీఏసీఎస్ చేరుకొని డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయాలని సీఈఓను నిలదీశారు. సోమవారం వరకు అవకాశం ఇచ్చారు. తక్షణమే రూ. లక్ష డిపాజిట్ సైతం చేసినట్లు తెలిసింది. అనంతరం పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి విదేశీ పర్యటనలో ఉండటంతో వైస్ చైర్మన్ మేడి నగేశ్కు చైర్మన్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
ప్రపంచ శక్తిగా యువత
నారాయణఖేడ్: మారుతున్న కాలానికి అనుగుణంగా యువతకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ ఇచ్చి వారిని అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిద్దిడమే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల (ఏటీసీ) ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రి వివేక్ పేర్కొన్నారు. ఖేడ్ మండలం జూకల్ శివారులో రూ.47 కోట్లతో నిర్మించనున్న ఏటీసీ భవనానికి గురువారం ఆయన ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనుకున్న 119 ఏటీసీల్లో ఇప్పటివరకు 65 కేంద్రాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయన్నారు. వీటి ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ ఏఐ ఆధారిత కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చి ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. పీఎం సేతు పథకం కింద రాష్ట్రంలో రూ.280 కోట్లతో పటాన్చెరు, సంగారెడ్డి, ఓల్డ్ సిటీలలో మూడు క్లస్టర్లు మంజూరయ్యాయని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులను ఈనెలాఖరులోగా చెల్లిస్తారని వివరించారు. త్వరలో 3 లక్షల కొత్తపెన్షన్లు మంజూరు కానున్నాయని తెలిపారు. జహీరాబాదు ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ఖేడ్ ప్రాంతంలో విద్యాభివృద్ధి కోసం కృషిచేస్తున్నామన్నారు. వివిధ విద్యాసంస్థలు కాంగ్రెస్ హయాంలోనే మంజూరయ్యాయని వెల్లడించారు. ఏటీసీ ద్వారా చాలామందికి ఉద్యో గ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సీ్త్రనిధి.. అతివల పెన్నిధి
జిల్లావ్యాప్తంగా 17,059 స్వయం సహాయక గ్రూపులు (ఎస్హెచ్జీ) సంఘాలు ఉండగా 1.70 లక్షల మంది సభ్యులు ఉన్నారు. సీ్త్రనిధి పథకం ప్రారంభమై 15 ఏళ్లు కావొస్తుండగా, వేలాది మంది మహిళలు రుణాలు తీసుకుని చిరు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో జిల్లాకు రూ. 316.43 కోట్ల రుణాలు లక్ష్యంగా విధించగా, రూ.281.7 కోట్లు పొందారు. ఇందులో ఒక్కో సభ్యురాలు రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు పొందే వెసులుబాటు కల్పించారు. వడ్డీ కేవలం రూ.92 పైసలు కావటంతో పోటీ పడి రుణాలు తీసుకుంటున్నారు. వాటితో కిరాణం, పాడి గేదెల కొనుగోలు, లేడీస్ ఎంపోరియం, టైలరింగ్, ఫ్యాన్సీ స్టోర్ల ఏర్పాటు, ఎలక్ట్రిక్ ఆటోలు తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అలాగే స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం 2024 నుంచి మూడు రకాల బీమా పథకాలను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. సీ్త్రనిధి సురక్ష బీమా, లోన్బీమా, ప్రమాద బీమాతో వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు రుణ విముక్తి కల్పిస్తున్నారు. వీఓఏల చేతివాటం! జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యులు సీ్త్రనిధి ద్వారా రుణాలు పొంది వ్యాపారాల్లో రాణిస్తుంటే కొందరు వీఓఏలు చేతివాటం ప్రదర్శిస్తూ మహిళలకు ఇబ్బందులకు గురుచేస్తున్నారు. కిస్తీల రూపంలో చెల్లించిన డబ్బులను బ్యాంకుల్లో జమ చేయాల్సి ఉండగా, కొంతమంది వారి సొంతానికి వాడుకుంటున్నారు. గడిచిన నాలుగేళ్లలో 24 మంది వీఓఏలు రూ. 64.67 లక్షలు వాడుకున్నట్లు ఆడిట్ ద్వారా బయట పడింది. వారి నుంచి ఇప్పటివరకు రూ. 26.31 లక్షలు రికవరీ చేశారు. 13 మందిని తొలగించారు. సీ్త్రనిధి పథకం మహిళల ఆర్థికాభివృద్ధికి కొండంత అండగా నిలుస్తోంది. వ్యక్తిగత రుణాలు పొంది చిరు వ్యాపారాలు చేసుకుంటూ స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో రూ.281.7 కోట్ల రుణాలు పొంది ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. – మెదక్జోన్ పథకానికి ఎంతో ఆదరణ ఎస్హెచ్జీ సభ్యులకు సీ్త్రనిధి కొండంత అండగా నిలుస్తోంది. ఏటా రూ. కోట్లాది రుణాలు పొందుతూ స్వయంగా వ్యాపా రాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నా రు. దీంతో ఈ పథకం ఎంతో ఆదరణ పొందు తుంది. – గంగారాం, సీ్త్రనిధి ఆర్ఎం జిల్లాలో ఇలా.. సంవత్సరం టార్గెట్ ఇచ్చిన రుణం (రూ. కోట్లలో) 2022 110.55 75.19 2023 60.57 62.45 2024 66.54 64.95 2025 78.77 79.11 2026 (3 నెలల్లో) 93.00 11.60 -
కాంగ్రెస్ పాలనలో రైతుకు కష్టాలే
మాజీ మంత్రి హరీశ్రావుచిన్నకోడూరు(సిద్దిపేట): రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న చూపని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు అన్నీ కష్టాలే వస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని చంద్లాపూర్లో ఫర్టిలైజర్ షాపును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటు ఉంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యాప్ను రద్దు చేసి నేరుగా యూరియా కొనుగోలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అందించే యూరియాపై సీలింగ్ ఎత్తివేయాలన్నారు. సరిపడా యూరియా సరఫరా చేయాలన్నారు. అనంతరం రంగనాయక సాగర్ కట్ట వద్ద ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించారు. ఇతర జిల్లాలకు మొక్కలు తరలించడంతో ఆయిల్ ఫెడ్ అధికారి భాస్కర్రెడ్డితో ఫాన్లో మాట్లాడారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సరిపడా మొక్కలు అందించారా? అందించకముందే ఇతర జిల్లాలకు పంపడం ఏమటని ప్రశ్నించారు. నర్సరీని వారానికి ఒకసారి సందర్శించి నిర్వహణ చూడాలని ఆదేశించారు. -
భూ సమస్యల పరిష్కారానికే రీసర్వే
చేగుంట(తూప్రాన్): భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ రీసర్వే కార్యక్రమం చేపట్టిందని సర్వే అఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీఏ కిషన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. చేగుంట మండలంలోని నాలుగు గ్రామాల్లో భూముల రీసర్వే నిర్వహించి రికార్డులు తయారు చేయనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో భూములకు సంబంధించిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే ఆలోచనతోనే రీసర్వే కార్యక్రమం జరుగనుందన్నారు. రీ సర్వేలో పొందుపరిచిన రికార్డులతో సామాన్య రైతుల భూములకు పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందన్నారు. ముందుగా గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, ఇనాం, ఇతర ప్రభుత్వ సంబంధ భూములను గుర్తిస్తామన్నారు. ప్రజలు, రైతులు పూర్తిస్థాయి సహకారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి, ఆర్డీఓ బాబయ్య, తహసీల్దార్ బాలలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, ఉపసర్పంచ్ రఫీ రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఆదాయం పెంచుకోవాలి
● ఆదర్శ గ్రామాలుగా ఎదగాలి ● కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: గ్రామ పంచాయతీలు ఆదాయ వనరులు పెంచుకొని అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతూ ఆదర్శ గ్రామాలుగా ఎదగాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో మెదక్ నియోజకవర్గ సర్పంచ్లు, కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయా లని సూచించారు. ఇప్పటివరకు మంజూరైన నిధులతో అసంపూర్తి పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నా రు. అనంతరం పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ఉపాధి హామీ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జరిగిన జిల్లా పోషణ కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. మెదక్ను పోషకాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎల్ని నో ప్రభావంపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఇతర మంత్రులు, సీఎస్ సంజయ్జాజు, రెవెన్యూ శాఖ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ లోకేష్కుమార్లు వేర్వేరుగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గుడిసె వాసులకే తొలి ప్రాధాన్యం
చేగుంట(తూప్రాన్): రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గుడిసెల్లో ఉన్న వారికే మొదటి ప్రాధాన్యం కల్పించామని హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. గురువారం చేగుంటలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో గుడిసెల్లో నివాసం ఉంటున్న కుటుంబాల వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. మండలంలో 111 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. లబ్ధిదారులకు వెంటనే డబ్బులు అందిస్తున్నట్లు వి వరించారు. అనంతరం లబ్ధిదారులకు నిర్మాణ విషయంలో పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఈఈ యాదగిరి, ఏఈ రియాజొద్దీన్, కార్యదర్శి వెంకటేశ్ ఉన్నారు. -
అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు
తూప్రాన్: ఐరన్ పరిశ్రమతో ఇబ్బంది పడుతున్న మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి, చెట్లగౌరారం గ్రామాల ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆపార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం ఆ రెండు గ్రామాల ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరిశ్రమతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని, వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరారు. పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భజలాలు సౌతం కలుషితం అయ్యాయని వాపోయారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమ విస్తరణను అడ్డుకోవడంతో పాటు ఇతర ప్రాంతానికి తరలించేవరకు ప్రజల పక్షాన ఉద్యమిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం పరిశ్రమ ఎదుట నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. -
పోలీస్ డ్యూటీ మీట్లో పతకాల పంట
మెదక్జోన్: 3వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో మెదక్కు పతకాలు రావటం గర్వంగా ఉందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. కరీంనగర్లో ఈనెల 7, 8 తేదీల్లో నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్లో జిల్లా పోలీసులు 8 పతకాలు సాధించగా, గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విజేతలను ఆయన అభినందించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు పెంచుకుంటూ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ జిల్లా ప్రతిష్టను నిలబెట్టారని కొనియాడారు. ట్రాకింగ్ విభాగంలో మహేశ్, నార్కోటిక్స్లో శ్రావణ్, యా క్సెస్ కంట్రోల్, కంప్యూటర్ అవేర్నెస్, ఆఫీస్ ఆటోమేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విభాగాల్లో సతీశ్ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించినట్లు తెలిపారు. అలాగే పోలీస్ వీడియో, ఫొటోగ్రఫీ విభాగంలో శ్రీధర్ విజేత గా నిలిచారన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. టీచర్ల సమస్యలు పరిష్కరించండి నర్సాపూర్: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీఆర్టీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్యానాయక్ డిమాండ్ చేశారు. గురువారం నర్సాపూర్తో పాటు మండలంలోని కాగజ్మద్దూర్, రెడ్డిపల్లి, పెద్దచింతకుంట తదితర పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలన్నారు. కొత్త ఆరోగ్య పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలన్నారు. కా ర్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీజ్యోతి, భీమ్లా నాయక్, వీరేశం, శ్రీకాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని హస్తాల్పూర్, ఎం.జలాల్పూర్, మహ్మద్నగర్ తండాలో అంగన్వాడీ టీచర్, శంశిరెడ్డిపల్లి తండాలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవి తెలిపారు. ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తాం: ఏబీవీపీ రామాయంపేట(మెదక్): విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తామని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ అన్నారు. సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం రామాయంపేటలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివేకాంద విగ్రహం వద్ద జెండాను ఎగురవేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలతో పాటు విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ఎల్లవేళలా మందుంటామన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు హరిసింగ్, నవీన్, అరవింద్, ధనరాజ్ పాల్గొన్నారు. ‘అంత్యోదయ కార్డుల రద్దు సరికాదు’ మెదక్ కలెక్టరేట్: ఆహార భద్రత పథకంలో అంత్యోదయ కార్డు రద్దును వెంటనే విరమించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార భద్రత చట్టం ప్రకారం పేదలకు అన్నం పెట్టాలని చ ట్టంలో ఉందన్నారు. -
కాలుష్యంతో నిత్యం ఇబ్బందులే
● పరిశ్రమపై చేట్ల గౌరారం, రంగాయిపల్లి గ్రామస్తుల ఆరోపణ ● అదనపు కలెక్టర్ నగేశ్ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ తూప్రాన్: ఐరన్ పరిశ్రమతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చేట్లగౌరారం, రంగాయిపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఈ గ్రామాల సమీపంలోని ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణలో భాగంగా పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ మాధురి హాజరయ్యారు. ఈ సందర్భంగా చెట్లగౌరారం, రంగాయిపల్లి గ్రామస్తులు గత 20 ఏళ్లుగా పరిశ్రమతో పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ఇప్పటికే పరిశ్రమతో వాయు, శబ్ధ, నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తిరిగి పరిశ్రమను విస్తరిస్తే తాము గ్రామాల్లో నివసించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి అనుమతులు నిరాకరించాలని కోరారు. అనంతరం పరిశ్రమ ప్రతినిధి నరసింహ మాట్లాడుతూ పరిశ్రమ విస్తరణ కోసం అధునాతన టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. అలాగే రెండు గ్రామాల్లో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల నుంచి 43మంది అభిప్రాయాలను సేకరించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులను నివేదిక పంపించనున్నట్లు తెలిపారు. హెచ్ఆర్సీని ఆశ్రయిస్తాం: పద్మారెడ్డి చిన్నశంకరంపేట(మెదక్): ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రజలను నిర్బంధం చేసి పరిశ్రమ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటి స్పీకర్రెడ్డి పద్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటేరు ప్రతాప్రెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న పద్మారెడ్డి, చిన్నశంకరంపేట మండలంలోని బీఆర్ఎస్ నాయకులు పోలీస్స్టేషన్కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డితో కలిసి పద్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలను, బీఆర్ఎస్ నాయకులను నిర్బంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను బలవంతంగా ఏర్పాటు చేయడంపై కలెక్టర్ను కలిసి వివరించడంతోపాటు హెచ్ఆర్సీని ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పరిశ్రమకు అనుమతి ఇస్తే జాతీయ రహదారిని దిగ్బంధం చేసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తూప్రాన్, మనోహరాబాద్, చిన్నశంకరంపేట మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
మా పిల్లల సమస్య పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్ : మా పిల్లల సమస్య పరిష్కరించాలంటూ బెస్ట్ అవైలబుల్ పథకం విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ప్రతిమాసింగ్ కారును అడ్డుకున్నారు. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపికై న 477 మంది విద్యార్థులు పలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన నిధులు రావడం లేదంటూ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి విద్యార్థులను పాఠశాలల్లోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో పిల్లల తల్లిదండ్రులు పక్షం రోజులుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం సైతం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నంలోగా సమస్య పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ నగేశ్ హామీనివ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. మంగళవారం సైతం సమస్య పరిష్కారం కాకపోవడంతో తల్లిదండ్రులు కలెక్టర్ను అడ్డుకొని ఆందోళనకు దిగారు. దీంతో కలెక్టర్ ప్రతిమాసింగ్ కారు దిగి చాంబర్లోకి వెళ్లగా తల్లిదండ్రులు కలెక్టర్ చాంబర్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. తమ పిల్లల సమస్య వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల అరుపులతో కలెక్టరేట్ దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని తల్లిదండ్రులను సముదాయించే ప్రయత్నం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అటు విద్యాసంస్థలు తమ పిల్లలను రానివ్వకపోవడంతో వారి భవిష్యత్ ఆగమైంతుందని, మరోవైపు వారికోసం కలెక్టరేట్కు తిరగడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన డీఎస్పీ హామీనివ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు శాంతించి ఆందోళన విరమించారు. ఈ విషయమై జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి సింధును వివరణ కోరగా మెదక్లోని పలు విద్యాసంస్థల యజమానులతో చర్చించి విద్యార్థులను పాఠశాలలను పంపించినట్లు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ కలెక్టర్ కారు అడ్డగింత కలెక్టర్ చాంబర్ ముందు బైఠాయించి ధర్నా -
ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలే
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మెదక్జోన్: ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు సైతం ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. కళాశాలలు, హాస్టళ్లు ప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నూతనంగా చేరిన విద్యార్థుల పట్ల సీనియర్ విద్యార్థులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. నూతన విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం, అవమానించడం, శారీరక లేదా మానసిక వేధింపులకు పాల్పడటం వంటి చర్యలు చట్టరీత్యా కఠిన చర్యలకు దారితీస్తాయని హెచ్చరించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే కళాశాల యాజమాన్యానికి లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మెదక్ జిల్లా పోలీసు శాఖ విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తుందన్నారు. జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్సింగ్ తూప్రాన్: జాతీయ రహదారి–44పై భద్రతా పర్యవేక్షణను మరింత పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్సింగ్ సూచించారు. మంగళవారం పట్టణ సమీపంలోని టోల్గేట్ వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ను పరిశీలించి సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్హెచ్–44పై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలను వెంటనే గుర్తించి సంబంధిత పోలీసు స్టేషన్లకు సమాచారం అందించాలన్నారు. సీసీ కెమెరాలు ఎప్పుడూ పనిచేసే స్థితిలో ఉండేలా నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ద్వారా నేరాల నియంత్రణతోపాటు రహదారి భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ వెంట డీఎస్పీ నరేందర్గౌడ్, ఎస్సై గంగరాజు, సిబ్బంది ఉన్నారు. నర్సాపూర్: నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.176.85 కోట్లు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి వెల్లడించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ..నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తునన్నారు. హైబ్రీడ్ అన్యూటీ మోడల్(హెచ్ఏఎం) ప్రాజెక్టు కింద ఈ నిధులు వచ్చాయని చెప్పారు. ఈ నిధులతో ఆయా మండలాల్లోని 163.7 కిలో మీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రోడ్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ, వివేక్లకు కృతజ్ఞతలు తెలిపారు. మల్లన్న ఆలయంలో వేలం పాటలు కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం పలు అంశాలకు వేలం పాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డూ, పులిహోర తయారు చేసి అప్పగించే హక్కును కొమురవెల్లికి చెందిన సార్ల నర్సింహులు దక్కించుకున్నారు. అదే విధంగా ఆలయంలో ఫొటోలు, వీడియో తీసే లైసెన్సు హక్కును రావుల మధు దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కల్లలైన కంప్యూటర్ విద్య
కంప్యూటర్ విద్యనభ్యసించాలనుకుంటుంన్న విద్యార్థుల కల కల్లలైంది. 2008లో ఎనిమిదేళ్ల పాటు ఎంపిక చేసిన కొన్ని పాఠశాలకు ఈ విద్యను 2016 వరకు కొనసాగించారు. అనంతరం మూలన పడేశారు. కాగా గతేడాది 2025లో జిల్లాలో ప్రాధాన్యత క్రమంలో కొన్ని ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి వాటికి 300కు పైచిలుకు కంప్యూటర్లు సరఫరా చేశారు. అయితే డిజిటల్ విద్యను నేర్పే వారు రాక కంప్యూటర్లు అలాగే పడి ఉన్నాయి. మెదక్జోన్: మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల మేనేజ్మెంట్ ఉన్నత పాఠశాలలు 147 హైస్కూల్స్ ఉండగా వాటిలో సుమారు 12వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2008లో విద్యార్థులకు డిజిటల్ బోధన అవసరమని భావించిన అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్ఆర్) పథకం ద్వారా కంప్యూటర్లను అందించి బోధకులను (ఇన్స్ట్రక్టర్లను) సైతం కేటాయించింది. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ బోధన బాగానే కొనసాగిన 2016లో ఒప్పందం ముగియడంతో అప్పట్నుంచి కంప్యూటర్ విద్య అటకెక్కింది. నూతనంగా 389 కంప్యూటర్లు..! ప్రతీ విద్యార్థికి కంప్యూటర్ చదువులు అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2025లో జిల్లాలోని 66 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి వాటిలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో పాఠశాలకు 5 నుంచి 10 కంప్యూటర్లు కేటాయించింది. అప్పట్నుంచీ ఇన్స్ట్రక్టర్లను నియమించకపోవటంతో అవికూడా ఏడాది కాలంగా మరుగున పడి ఉన్నాయి. రెండు స్కూళ్లకు ఒకరిని! పక్కపక్కన ఉన్నటువంటి రెండు పాఠశాలలను ఒక్కటిగా మ్యాపింగ్ చేసి ఒక్కోదానికి ఒక్క ఇన్స్ట్రక్టర్ను కేటాయించి కంప్యూటర్ బోధన కొనసాగించనున్నారు. ఈ లెక్కన జిల్లాలో 66 పాఠశాలలను ఎంపిక చేయటంతో 33 మంది డిజిటల్ బోధకులు వచ్చే అవకాశం ఉంది. త్వరలో నియమిస్తాం పదవ తరగతి విద్యార్థులకు కంప్యూటర్ బోధన అందించాలనే ఉద్దేశ్యంతో విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం గతేడాది జిల్లాలోని 66 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి కంప్యూటర్లు అందించింది. వీటి నిర్వహణను ఓ ఏజెన్సీకి అప్పగించారు. వారు త్వరలో ఇన్స్ట్రక్టర్లను కేటాయించి బోధన కొనసాగించనున్నారు. –జ్యోతి, సర్వశిక్ష అభియాన్ ప్లానింగ్ కో–ఆర్డినేటర్ సీఎస్ఆర్ కింద 2008 నుంచి ఎనిమిదేళ్లపాటు కొనసాగింపు గతేడాది 66 ఉన్నత పాఠశాలలకు 389 కంప్యూటర్లు ఇన్స్ట్రక్టర్లు లేక మూలన పడిన పరికరాలు -
మోగని తబలా.. పలకని స్వరాలు
● శిక్షకులు లేక మూలన పడ్డ వాయిద్య పరికరాలు ● జిల్లాలో 13 పీఎంశ్రీ పాఠశాలలకు మంజూరు ● మొత్తం రూ.19.50 లక్షలు మంజూరు ఈసారి సంగీత వాయిద్య శిక్షణ కోసం శిక్షకులను నియమిస్తాం. గతేడాది నిర్ణయించిన, అర్హతలు లేక పోవడంతో నియామకం చేయలేక పోయాం. అర్హతలను బట్టి కాకుండా, నైపుణ్యాలను బట్టి అర్హత గల వ్యక్తులను ఎంపిక చేసి వాయిద్య పరికరాలను అందుబాటులోకి తెస్తాం. –సుదర్శనమూర్తి, ఏఎంఓ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు..ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం వాయిద్య పరికరాలు పంపిణీ చేసింది. జిల్లాలో ఎంపిక చేసిన 13 ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పాఠశాలలకు గతేడాది వాయిద్య పరికరాలు పంపిణీ చేశారు. అయితే శిక్షకులను నియమించకపోవడంతో ఆ పరికరాలు మూలన పడ్డాయి. మెదక్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను పరిపూర్ణ వికాసవంతులుగా తీర్చి దిద్దేందుకు..బట్టీ చదువులకు స్వస్తిచెప్పి..మానసిక ఉల్లాసానికి పెద్దపీఠ వేస్తూ..వారిలో అంతర్లీనంగా దాగివున్న నైపుణ్యాలు వెలికి తీసేందుకు గాను వ్యాయామ, సంగీత, చిత్రలేఖన, వృత్తి విద్యలను పీఎంశ్రీ స్కూళ్లలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో పాఠశాలలకు ల్యాప్టాప్లు, క్రీడా సామగ్రి, సంగీత పరికరాలు, డిజిటల్ బోధనోపకరణాలు పంపిణీ చేశారు. జిల్లాలో13 పాఠశాలలకు రూ.19.50 లక్షలు మెదక్ జిల్లాలో మొత్తం 31 పీఎంశ్రీ స్కూళ్లు ఉండగా, 13 పాఠశాలలకు వాయిద్య పరికరాలు పంపిణీ చేశారు. ఒక్కో పాఠశాలకు శిక్షకుల జీతాల కోసం రూ.1.50 లక్షల మంజూరయ్యాయి. విద్యాశాఖ నుంచి తబలా, హార్మోనియం, వయోలిన్, డోలక్లు పంపిణీ అయ్యాయి. శిక్షకుల జీతాల కోసం జిల్లాకు రూ.19.50 లక్షలు మంజూరయ్యాయి. వీటి శిక్షణ కోసం ప్రత్యేక గది కేటాయించాలని సూచించారు. విడతల వారీగా ఇతర పాఠశాలలకు కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది. శిక్షకులే లేరు.. శిక్షణ ఎలా! వాయిద్య పరికరాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఒక్కో పాఠశాలకు ఒక్కో టీచర్ను నియమించాలి. వీరికి నెలకు రూ.పది వేల చొప్పున జీతాలివ్వాలి. ఈ మేరకు 6 నెలల జీతం అడ్వాన్సుగా విడుదల చేసింది. అయితే మ్యూజికల్ టీచర్ ట్రైనింగ్ చేసిన వారినే శిక్షకులుగా నియమించాలి. కానీ శిక్షణ పొందిన అభ్యర్థులు లేకపోవడంతో గత విద్యా సంవత్సరం అసలు శిక్షకులనే నియమించలేదు. దీంతో చాలా పాఠశాలల్లో వాయిద్య పరికరాలు అలమారాలకే పరిమిత మయ్యాయి. మరికొన్ని పాఠశాలల్లో మూలన పడేశారు. శిక్షకులు లేక పాపన్నపేట ఉన్నత పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు -
రూ.870 కోట్లు..
9.33 లక్షలమంది రైతులుఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు భరోసా పథకం కింద 9,33,950 మంది రైతులకు రూ.8,70,25,44,519లు వారి ఖాతాల్లో జమయ్యాయి. గతనెల జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఎకరాకు 6వేల చొప్పున ఈ నిధులను విడుదల చేసింది. నిత్యం విడతల వారీగా ఈనెల 7వ తేదీ వరకు 7 ఎకరాల వరకు భరోసా నిధులను జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు. నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలో 3,50,560 మంది రైతులకు రూ.348 కోట్లు, సిద్దిపేట జిల్లాలోని 3,19,601మంది రైతులకు రూ.317 కోట్లు, మెదక్ జిల్లాలో 2,63,789 మంది రైతులకు గాను రూ.204 కోట్ల కు పైగా విడుదలయ్యాయి. ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేసింది. రైతులకు ప్రయోజనం రైతు భరోసా పథకం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్లకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. సీజన్ ప్రారంభంలోనే నిధుల విడుదల వల్ల రైతులు వడ్డీకి అప్పులు చేసే బాధ తప్పినట్లైంది. ఇప్పటికే చాలామంది రైతులు విత్తనాలు విత్తుకొన్నారు. ఈ నెల 15వ తేదీవరకు ఆయా పంటలు విత్తుకునేందుకు కూడా అవకాశం ఉంది. ప్రస్తుతం విడుదలైన నిధులు ఎరువులు, పురుగు మందులు, కలుపుతీత, ఇతరత్రా ప్రయోజనాలకు రైతులకు ఉపయుక్తంగా మారనుంది. సీజన్ ప్రారంభం కాగానే ప్రభుత్వం విడుదల చేయడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. ఏడెకరాల వరకు ఇచ్చిన ప్రభుత్వం విడతల వారీగా విడుదల -
ఆరుద్ర కనబడలె.. నేల మురవలె
రైతు మిత్రగా పిలువబడే ఆరుద్ర పురుగులు భూమిలో ఉండే చిన్న చిన్న హానికరమైన కీటకాలు. లా ర్వాలను తిని పంటలకు రక్షణగా నిలుస్తాయి. ఈ మధ్య వీటిని ఔషధాల తయారీలో కూడా వాడుతున్నారు. ఆయుర్వేద వైద్య గుణాలున్నాయని అంటారు. కిలోకు రూ.800 నుంచి 1000 వరకు విక్రయిస్తున్నారని తెలిసింది. దీంతో పర్యావరణానికి ఉపయోగపడే ఆరుద్ర పురుగుల ఉనికికే ప్రమాదం ఏర్పడిందనే ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. ఇవి శివునికి ప్రీతి పాత్రమైన జీవులని వేద పండితులు చెబుతారు. చిన్పపిల్లలు వీటిని పట్టుకొని, అగ్గిపెట్టెలో వేసుకొని ఆడుకుంటారు. మెదక్ అర్బన్: తొలకరి జల్లు కురియగానే పంట పొలాల్లో కనిపించే అరుదైన అందమైన జీవి ఆరుద్ర పురుగు. ఇవి విరివిగా కనిపిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని, వర్షాలు దండిగా కురుస్తాయని రైతుల నమ్మకం. కానీ రాను రాను ఆరుద్ర పురుగులు అంతరిస్తున్నాయి. రైతు నేస్తాలుగా భావించే పర్యావరణ మిత్రలు కనుమరుగవుతున్నాయి. ఆరుద్ర కార్తె ముగి సినా సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు సైతం సాగు పనులు చేపట్టలేదు. పుడమి తల్లికి సింధూరం శాసీ్త్రయంగా ‘ట్రాంబిడియం గ్రాండిస్సిమం’గా పిలిచే ఈ పురుగులు చిన్న పరిణామంలో మక్మ ల్ బట్టలాగా, ముదురు ఎరుపు రంగులో చూడముచ్చటగా ఉంటాయి. ముట్టుకుంటే ముడుచుకొని కాస్సేపు కదలకుండా బొమ్మలా నిలబడిపోతాయి. తమ జీవిత కాలంలో ఎక్కువగా భూమి లోపలే ఉంటాయి. కేవలం వర్షాకాలంలో మాత్రమే సంతానోత్పత్తి కోసం భూమి పైకి వస్తాయి. -
అంగన్వాడీల్లో తొలిముద్ద
చిన్నారుల్లో పోషకాహార నివారణకు చర్యలు ● అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం ● త్వరలో జిల్లాలో అమలుకానున్న పథకం అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు హాజరుశాతం పెంచడానికి త్వరలో అల్పాహార పథకం అమలు కానుంది. మార్చిలో ‘తొలిముద్ద’ పేరిట సీఎం రేవంత్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగా, త్వరలో జిల్లాలో షురూ కానుంది. చిన్నారులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద ఉప్మా, కిచిడీ అందించనున్నారు. – రామాయంపేట(మెదక్) జిల్లాలోని మెదక్, నర్సాపూర్, అల్లాదుర్గం, రామాయంపేట ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,076 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులు నమోదయ్యారు. కేంద్రాల్లో వీరికి భోజనంతో పాటు ప్రతి రోజూ గుడ్డు, పాలు ఇస్తున్నారు. కాగా, అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులు కొందరు ఇప్పటికే పౌష్టికాహార లోపంతో పాటు ఎత్తుకు తగిన బరువు లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఉదయమే తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళితే చిన్నారులు ఏమి తినకుండానే అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆకలతో ఉండి అస్వస్థతకు గురవుతున్నారు. ఈలోపాన్ని అధిగమించడానికి ప్రభుత్వం తాజాగా అల్పా హారం పథకాన్ని ప్రవేశపెట్టింది. అంగన్వాడీల్లో చదువుకునే ఆరేళ్లలోపు చిన్నారులు శారీరక, మానసిక ఎదుగుదలకు ఈపథకం ఎంతో దోహదపడనుంది. ప్రతి రోజూ ఉదయమే అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారులకు తాజాగా పోషక విలువలున్న ఉప్మాతో పాటు కిచిడీ అందజేస్తారు. దీంతో చిన్నారుల్లో పోషా కాహార లోపాన్ని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. -
కలెక్టర్ ఆదేశంతో తీరిన సమస్య
అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మూత్రశాలలు నిర్మించినా, పైకప్పు లేకపోవడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయం హెచ్ఎం అల్లాదుర్గం మండలానికి వచ్చిన కలెక్టర్ ప్రతిమాసింగ్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థినుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సర్పంచ్ సౌమ్యను ఆదేశించడంతో వెంటనే పరిష్కరించారు. పైకప్పు రేకులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ. 50 వేలతో ఈ పనులు వెంటనే చేయడంతో విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్తో పాటు సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు. -
రైతుల కోసమే సహకార సంఘాలు
డీసీఓ పద్మమెదక్కలెక్టరేట్: రైతుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయని డీసీఓ పద్మ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని డీసీఓ కార్యాలయంలో సహకార సంఘాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ను సకాలంలో అందించాలని సూచించారు. అలాగే సంఘాల ద్వారా రైతులకు ఇచ్చిన రుణాలను త్వరితగతిన రికవరీ చేసి సంఘాల అభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన మెదక్, వెల్దుర్తి, కొత్తపల్లి, నర్సాపూర్ సొసైటీలకు మెమోంటోలు అందజేశారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన పాపన్నపేట, వరిగుంతం సొసైటీల సెక్రటరీలు నవీన్, రాములును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ సాయిలు, ఇతర సొసైటీల అధికారులు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛత.. మనందరి బాధ్యత
కలెక్టర్ ప్రతిమాసింగ్మెదక్ కలెక్టరేట్: స్వచ్ఛ మనందరి బాధ్యత అని, వ్యర్థాలు సక్రమంగా వేరుచేసి పరిశుభ్రమైన కలెక్టరేట్గా తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై అన్నిశాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డీపీఓ యాదయ్య ఆధ్వర్యంలో 4రకాల డస్ట్బిన్లను అన్నిశాఖల అధికారులకు అందించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పక్కా ప్రణాళికతో అన్ని కార్యాలయాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం సర్ కార్యక్రమంపై ప్రకటన విడుదల చేశారు. భారత ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎవరు కూడా ఒకటికంటే ఎక్కువ జాబితాల్లో ఓటరుగా ఉండొద్దన్నారు. తప్పుడు సమాచారంతో ఓటరుగా నమోదు చేసుకుంటే ఏడాది జైలు శిక్ష, జరిమానా ఉంటాయని హెచ్చరించారు. ప్రజావాణికి 66 వినతులు అంతకు ముందు కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 66 అర్జీలు రాగా, అందులో భూ భారతి 24, ఇందిరమ్మ ఇళ్లు 12, పెన్షన్లు 3, ఇతర సమస్యలపై 27 దరఖాస్తులు వచ్చాయి. అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీపీఓ యాదయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సత్వర పరిష్కారం: ఎస్పీ
మెదక్జోన్: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను జాప్యం చేయకుడా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఆయన స్వయంగా మాట్లాడారు. అనంతరం ఆయా పోలీస్ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం నేరుగా వచ్చి కలవాలని సూచించారు. నర్సాపూర్: పెంపుడు కుక్కలు, పిల్లులకు రేబిస్ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య సూచించారు. సోమ వారం ప్రపంచ జూనోసిస్ డేను పురస్కరించుకొని స్థానిక పశు వైద్యశాలలో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఉచితంగా అందజేసే టీకాలు, అన్ని పెంపుడు జంతువులకు వేయించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, పశుసంవర్ధక శాఖ ఏడీ జనార్దన్రావు, మండల పశువైద్యాఽ దికారి డాక్టర్ స్వప్న, సిబ్బంది గోవర్దన్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. కాగా టీకాల కార్యక్రమం మంగళవారం సైతం కొనసాగనుంది. దుబ్బాక అభివృద్ధికి సీఎం హామీ: ఎమ్మెల్యే కొత్తదుబ్బాక: నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. సోమవారం సీఎం నివాసంలో కలిసి నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధిపనులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. హబ్షీపూర్ చౌరస్తా నుంచి దుబ్బాక పట్టణం వరకు ఉన్న డబుల్ రోడ్డును ఫోర్లేన్ చేయాలని విన్నవించామన్నారు. మున్సిపాలిటీలో నిర్మించనున్న ఆధునిక నాన్వెజ్ మార్కెట్ కోసం గతంలో మంజూరైన నిధులను తిరిగి విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఆర్అండ్బీ, పీఆర్ రోడ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరామన్నారు. సీఎంను కలిసిన వారిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తదితరులు ఉన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది (అతిథి అధ్యాపకుల) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నాగరాజమ్మ తెలిపారు. పీజీటీ ఫిజికల్ సైన్స్ (మహిళ), పీజీటీ ఇంగ్లిష్, బాటనీ జూనియర్ లెక్చరర్ (మహిళ), కెమిస్ట్రీ జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 8వరకు గజ్వేల్ బాలికల మైనార్టీ గురుకులంలో దరఖాస్తులు అందించాలని, అదే గురుకులంలో ఈ నెల 9న సంబంధిత సబ్జెక్ట్లో డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు. మిరుదొడ్డి(దుబ్బాక): ఆరుతడి సాగుతో మంచి ఆర్థికాదాయం సాధించవచ్చని హార్టికల్చర్ అధికారి రమేశ్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని చెప్యాలలో సాగవుతున్న కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి ఎద్దడిని తట్టుకుని ముందుకు సాగాలంటే పప్పుదాన్యాలు, కూరగాయలను పండించాలన్నారు. -
మా పిల్లల చదువు ఎలా?
‘బెస్ట్ అవైలబుల్’ విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నామెదక్ కలెక్టరేట్: తమ పిల్లలను పాఠశాలల్లోకి రానివ్వడం లేదని.. గత మూడేళ్లుగా ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటుందని బెస్ట్ అవైలబుల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా లోని 477 మంది ఎస్సీ విద్యార్థులు పలు ప్రైవేట్ పాఠశాలల్లో బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపికై చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు రావడం లేదు. దీంతో వారు విద్యార్థులను బడుల్లోకి రానివ్వడం లేదు. దీంతో సోమ వారం కలెక్టరేట్లో ధర్నా నిర్వహించారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతోనే పిల్లలను హాస్టళ్లలో ఉంచి ఇతర ప్రాంతాల్లో పనులు చేసుకుంటామని తెలిపారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి సమస్యను తల్లిదండ్రులు విన్నవించారు. వారికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం, దళిత సంఘాల నాయకుడు సురేశ్ తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను పిలిపించి చర్చించినట్లు తెలిసింది. -
సందిగ్ధంలో సహకారం
పాలకమండళ్ల పదవీకాలం ముగిసి 11 నెలలు● నాటి నుంచి ఇన్చార్జిలతోనే నిర్వహణ ● వచ్చే నెలతో ముగియనున్న పాలన ● జిల్లావ్యాప్తంగా 37 సహకార సంఘాలు గ్రామీణ రైతులకు చేదోడువాదోడుగా ఉండే సహకార సంఘాల భవితవ్యం కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే పాలకవర్గాల పదవీ కాలం ముగియగా, 11 నెలలుగా ఇన్చార్జిల పాలనలో కొనసాగుతున్నాయి. వచ్చే నెలతో వారి పాలన సైతం ముగియనుంది. దీంతో ఎన్నికలు నిర్వహిస్తారా..? లేక వారినే కొనసాగిస్తారా? అనే సందిగ్ధత నెలకొంది. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 37 సహకార సంఘాలు ఉండగా, వాటిలో 65 నుంచి 70 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. కాగా, 2020 ఆగస్టులో ఎన్నికలు జరగగా, ఒక్కో సంఘంలో 13 మంది డైరెక్టర్లను ఓటింగ్ ద్వారా రైతులు ఎన్నుకున్నారు. అందులో నుంచే ఒకరిని చైర్మన్, మరొకరిని వైస్ చైర్మన్గా ఎనుకున్నారు. అయితే గడిచిన ఐదేళ్లలో రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు కొనసాగించారు. ముఖ్యంగా స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు అందించటం, పండించిన పంట ఉత్పత్తులను మార్కెటింగ్లకు మద్దతు ధర కల్పించడం, సభ్యులకు పొదుపు అలవాటు పెంపొందించటం, వ్యవసాయ పనిముట్లను రైతులకు అందుబాటులో ఉంచటం, అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాలు అందించటంతో పాటు అనేక రకాలుగా అన్నదాతల అభివృద్ధికి తోడ్పాటునందించారు. ఇన్చార్జిలుగా కొనసాగింపు సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం 2025 ఆగస్టులో ముగియగా, 2026 ఫిబ్రవరి వరకు పాత పాలకమండళ్లకే ఇన్చార్జిల బాధ్యతలు అప్పగించారు. మార్చిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, కో–ఆపరేటివ్ ఉద్యోగులకు ఇన్చార్జిలుగా బా ధ్యతలు అప్పగించారు. ఈ విషయంపై మాజీ పీఏసీఎస్ చైర్మన్లు హైకోర్టుకెళ్లారు. ఎన్నికలు నిర్వహించే వరకు తమకే ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించాలని కోరారు. వారి వాదనలను సమ్మతించిన హైకోర్టు ఎన్నికలు జరిగేంత వరకు వారినే ఇన్చార్జిలుగా కొనసాగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరో ఆరునెలల పాటు అనగా 2026 ఆగస్టు వరకు పాత పాలకమండళ్లకే బాధ్యతలు అప్పగించింది.ఇన్చార్జిల పదవీ కాలం వచ్చేనెలతో ముగియనుంది. అయితే ఎన్నికలు నిర్వహిస్తారా..? లేక మరోమారు పాత వారినే కొనసాగిస్తారా..? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. 2025 ఆగస్టులో వారి పదవీ కాలం ముగిసిన సమయంలో పీఏసీఎస్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులను ఎన్నికలకు బదులుగా నామినేటెడ్గా నియమిస్తారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల ద్వారా పాలకమండళ్లను కొనసాగిస్తేనే పార్టీలకతీతంగా రైతులకు మేలు జరుగుతుందని పలువురి వాదన. కాగా, వచ్చే నెలతో పాలన ముగుస్తుండటంతో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి. -
పరిహారం ఇచ్చి ఆదుకోండి
మెదక్ కలెక్టరేట్: ట్రిపుల్ఆర్లో రైతుల భూములు లాక్కున్న ప్రభుత్వం బాధిత రైతులకు వెంటనే పరిహారం అందించాలని రైతు రక్షణ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బాధిత రైతులతో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్, తిర్మలాపూర్ గ్రామాలకు చెందిన రైతుల భూములను 2024లో ట్రిపుల్ఆర్ కోసం తీసుకున్నట్లు తెలిపారు. అప్పట్లో పరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం కుంటిసాకులు చెబుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులకు పరిహారం అందించాలన్నారు. -
తాగునీటి కోసం ఆందోళన
చిన్నశంకరంపేట(మెదక్): నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా జరగడం లేదని ఆగ్రహించిన మిర్జాపల్లి రైల్వేస్టేషన్ కాలనీ వాసులు ఆదివారం నార్సింగి– చిన్నశంకరంపేట ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. వర్షంలో తడుస్తూ రోడ్డుకు అడ్డంగా ఖాళీ బిందెలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా జరగకున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరా కాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
రైతులకు అండగా కాంగ్రెస్
ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పటాన్చెరు టౌన్: రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.9 వేల కోట్లను జమ చేసిందని ఆయన వెల్లడించారు. పటాన్చెరు అంబేడ్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని 21 వేలమంది రైతుల ఖాతాల్లో రూ.14 కోట్ల రైతు భరోసా నిధులు జమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ కార్యదర్శి మతిన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, సాయిలు ముదిరాజ్, అంజయ్యరాజు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు పాల్గొన్నారు. -
పోలీసు శాఖలో కొలువుల జాతర
సంగారెడ్డి జోన్: జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసి మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే నియామక ప్రక్రి య చేపట్టనున్నారు. కాగా, జిల్లాలోని 4 సబ్ డివిజన్, 7 సర్కిల్ కార్యాలయాలతో పాటు 30 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్లలో 412కు పైగా కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారే ముఖ్యమైన సభలు, సమావేశాలు ఉన్న సమయంలో ఇతర ప్రాంతాల్లో బందోబస్తుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2022లో చివరిసారిగా పోలీసు శాఖలో ని యామకాలు చేపట్టి 2023లో సుమారు 400కు పై గా కానిస్టేబుల్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. విడతలవారీగా భర్తీకి అవకాశం ఖాళీగా ఉన్న పోలీసు అధికారుల నియామక ప్రక్రి య విడతల వారీగా చేపట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 6,000కు పైగా భర్తీ చేయనున్నట్లు సమాచారం. మరికొన్ని విడతల్లో మిగతా పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మొదటి విడతలో జిల్లాలో సుమారు 110 పోస్టులు భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా ఒకే దశలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. త్వరలో నోటిఫికేషన్ జిల్లాలో 412 కానిస్టేబుల్ పోస్టులు -
నిధులు మంజూరు చేయండి
చిన్నశంకరంపేట(మెదక్): ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిశారు. దుబ్బాక నియోజవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నార్సింగి తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఎంపీపీ కార్యాలయ భవనం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే నూతనంగా ఏర్పాటైనా నార్సింగి, రాయపోల్, అక్బర్పేట–భూంపల్లి మండలాలకు నూతన భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గంలో 29 రహదారుల నెట్వర్క్ బలోపేతం కోసం హ్యామ్ ద్వారా ఆర్అండ్బీ రోడ్లకు రూ.137 కోట్లు, పంచాయతీరాజ్ (పీఆర్) రోడ్లకు రూ.67.95 కోట్లు కలిపి మొత్తం రూ. 204.95 కోట్లు విడుదలైనట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రహదారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిరంతరం పట్టుబట్టి నిధులను సాధించామన్నారు. ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని అంతర్గత, లింకు రోడ్లను నిర్మిస్తామన్నారు. పనులు పూర్తయితే రవాణా ఇబ్బందులు తొలగి నియోజకవర్గ ముఖచిత్రం మారుతుందన్నారు. త్వరలోనే పనులకు శంకుస్థాపన చేసి నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్: జహీరాబాద్ ఐసీడీఎస్ కేంద్రం పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులతో పాటు ఆయాలుగా పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ సుశీల తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో గల అన్ని ప్రాంతాల్లోని 15 అంగన్వాడీ టీచర్ పోస్టులకు, గిరిజన ప్రాంతాల్లో గల 20 ఆయాల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజావాణి, కార్యాలయంలో సమర్పించిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోమన్నారు. ఇతర వివరాలకు జహీరాబాద్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్ నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలో నిర్వహించనున్న కేవీపీఎస్ సామాజిక ఉద్యమ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పి.అశోక్ విజ్ఞప్తి చేశారు. ఖేడ్ పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25, 26వ తేదీల్లో ఈ సామాజిక ఉద్యమ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేవీపీఎస్ కుల వివక్షత, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతుందని గుర్తు చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.శికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నర్సింహులు, న్యాయవాది సుభాష్, సంతోశ్, జిల్లా సహాయ కార్యదర్శి గణపతి, సామాజిక ఉద్యమ నాయకులు కాన్షీరాం, ఇతర నాయకులు మోహన్, సురేశ్, బాబురావు, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. రామాయంపేట(గజ్వేల్): రామాయంపేటలోని వెటర్నరీ ఆస్పత్రిలో సోమవారం జూనోసెస్ డే దినోత్సవం నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ తిరుపతి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. స్థానికులు తమ పెంపుడు జంతువులకు ఆస్పత్రులకు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్తో పెంపుడు జంతువులకు సంబంధించి రేబిస్ వ్యాధులను అరికట్టవచ్చన్నారు. -
నిధుల విడుదలలో అలసత్వం
వెల్దుర్తి(తూప్రాన్): పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని, నిధులు విడుదలలో జాప్యంతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రామాయిపల్లి, ఉప్పులింగాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి పేరిట ప్రతి మూడు నెలలకోసారి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక నిధులు విడుదల చేసిందన్నారు. తద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యం, హరితహారం, తాగునీటి సమస్య లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు పావని, శేఖర్, భూపాల్రెడ్డి, నాయకులు రమేశ్గౌడ్, ప్రతాప్రెడ్డి, కిష్ణాగౌడ్, గోపాల్రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి -
17 ఏళ్లకే ఓటరుగా దరఖాస్తు
ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం మరింత పెంచే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ముందుస్తుగా (అడ్వాన్స్ అప్లికేషన్) ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించింది. అయితే 18 ఏళ్లు పూర్తయిన తర్వాతే వారి పేరు తుది ఓటరు జాబితాలో నమోదవుతుంది. –నారాయణఖేడ్ గతంలో 18 ఏళ్లు పూర్తయ్యాకే ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. కానీ ప్రసుత్తం 17 ఏళ్లు నిండిన యువతీ యువకులు దరఖాస్తు సమర్పించవచ్చు. గతంలో జనవరి 1వ తేదీనాటికి 18 ఏళ్లు పూర్తి కాకపోతే యువత మరో ఏడాది పాటు వేచి ఉండాల్సి వచ్చేది. జనవరి 2న 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరుగా నమోదయ్యేందుకు అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సంవత్సరానికి నాలుగు అర్హత తేదీలను అమలులోకి తెచ్చింది. ఈ నాలుగు తేదీల్లో ఏదో ఒక తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తి అయితే ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. 17 ఏళ్లు నిండిన యువతకు ఓటరుగా దరఖాస్తు చేసుకునేందకు నాలుగు అర్హత తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 అంటే ఏడాదిలో నాలుగు అవకాశాలు అందుబాటులో ఉండనున్నాయి. 18 ఏళ్లు నిండేందుకు కొద్ది నెలలకు ముందే ఫామ్–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 17 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలంటే అందుకు అవసరమైన ధ్రు వపత్రాలు సమర్పించాలి. బూత్స్థాయి అధికారి (బీఎల్వో)లు ధ్రువపత్రాల పరిశీలన జరిగిన తర్వాత ఓటు హక్కు ఇవ్వాలా లేదా అన్నది నిర్ణయిస్తారు. కాగా 18 ఏళ్లు పూర్తయ్యాకే వారి పేరు జాబితాలో నమోదవుతుంది. ఇంటర్ ద్వితీయ, డిగ్రీ మొదటి సంవత్సరం చదివే వేలాదిమంది విద్యార్థులు 17 నుంచి 18 ఏళ్ల వయస్సులోకి వస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల కళాశాలల్లోనే ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఈ లెక్కన ప్రతీ యేటా యువత ముందుగానే దరఖాస్తు చేసుకుని అర్హత పొందడంతో ఓటర్ల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉంది. ముందస్తు దరఖాస్తుకు నాలుగు అర్హత తేదీలు 18 ఏళ్లు నిండాకే ఓటు హక్కు జిల్లాలో 23 వేల పైగా యువతకు అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో జిల్లాలో 23 వేల పైగా యువతకు అవకాశం ఏర్పడుతుంది. జిల్లాలో 2023– 24 విద్యా సంవత్సరంలో 22,012 మంది విద్యార్థులు పదోతరగతి విద్యనభ్యసించారు. ఇందులో 11,136 మంది బాలురు, 10,876 మంది బాలికలున్నారు. 2023– 24వ సంవత్సరంలో పరీక్షలు రాసే సమయానికి 15 ఏళ్లు నిండి ఉంటాయి. అంటే 2026 నాటికి 17 ఏళ్ల వయస్సు వస్తుంది. వీరితోపాటు 8, 9వ తరగతుల్లోనే మధ్యలో చదువు మానినవారు, ఇతరులు కలిపి 1,500 మంది వరకు ఉంటారు. ఈ లెక్కన సుమారు 23 వేలపైగా యువత కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. -
వాన
ఆశల● ఊపందుకున్న సాగు పనులు ● ఆరుతడి పంటలకు ఊపిరి ఈ ఏడాది ఎల్నినోతో ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ అధికారులు ముందు నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వానాకాలం ప్రారంభం జూన్లో లోటు వర్షపాతం నమోదు కావటంతో వారి మాటలకు బలం చేకూరినట్లయింది. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈనెల ప్రారంభం నుంచి సాధారణం కన్నా రెండింతల వర్షం అధికంగా కురవడంతో వారిలో ఆశలు చిగురించాయి. ఫలితంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఏడాది ఎల్నినోతో ముప్పు పొంచి ఉందని, వర్షాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటలు సాగు చేయాలని, వరికి బదులు ఆరుతడి పంటల సాగు లాభదాయకమంటూ రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. అయినా రైతులు ఎప్పటిలాగే వరిసాగుకు మొగ్గు చూపారు. రోహిణి కార్తెలోనే బోరుబావుల ఆధారంగా తుకాలు (నారుమళ్లు) పోశారు. గత నెల అడపాదడపా కురిసిన వర్షాలకు వేసవి దుక్కులు దున్ని సాగుకు సిద్ధమయ్యారు. అదే విధంగా పత్తి విత్తనాలు వేశారు. కాగా, జూన్లో 112.4 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 83.8 మి.మీ మాత్రమే కురిసింది. ఈ లెక్కన ఇంకా 28.6 మి.మీ మేర లోటు వర్షపాతం నమోదైంది. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. ఎల్నినోతో ముప్పు తప్పదేమోనంటూ ఆవేదన చెందారు. భూమిలో వేసిన విత్తును దక్కించుకునేందుకు నానాతంటాలు పడ్డారు. వివిధ మార్గాల ద్వారా నీటి తడులు అందించి విత్తును దక్కించుకున్నారు. కాగా, ఈనెల ప్రారంభం నుంచే జిల్లాలో వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో సాధారణం కన్నా రెండింతలు కురిసింది. భూమి సమృద్ధిగా తడిసింది. ఫలితంగా వర్షాధారంగా సాగు చేసిన పత్తి, ఇతర ఆరుతడి పంటలకు ఊపిరి పోసినట్లు అయింది. భూగర్భజలాలు ఆశాజనకం గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భూగర్భజలాలు సైతం బెటర్గా ఉన్నాయని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది భారీ వర్షాలు కురవటంతో చెరువులు, కుంటలు సమృద్ధిగా నిండి ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. గతేడాది జూన్లో సగటున 14.31 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా, ఈ ఏడాది జూన్లో 13.30 మీటర్లలో ఉన్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 1.01 మీటర్ల పైనే ఉంది. ఇది అన్నదాతలకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.గత వారం రోజులుగా సమృద్ధిగా వర్షాలు కురవటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. అన్నదాతలు పొ లా ల్లో వివిధ పనులు చేస్తూ బిజీగా మారారు. కొందరు సాగునీటి ఆధారంగా బోరుబావుల కింద వరి నాట్లు ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకు నాట్లు వేస్తేనే ఆశించిన దిగుబడి వస్తోందని, లేనిచో నష్టం వాటిళ్లే ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొ ంటున్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ శ్రీనివాసరావు మెదక్జోన్: రోజురోజుకు కొత్త తరహాలో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో ప్రజలను మోసగిస్తున్నారన్నారు. బ్యాంకు అధికారులు, ప్రభుత్వ సంస్థలు, లోన్ కంపెనీల ప్రతినిధులమంటూ ఫోన్ చేసి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటి గోప్యమైన సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొదన్నారు. ఇటీవలి ఏపీకే ఫైల్స్ పంపించడం, క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయించడం, నకిలీ లోన్ యాప్లు, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, ఓఎల్ఎక్స్ వంటి వేదికల ద్వారా మోసాలు పెరుగుతున్నాయన్నారు. రివార్డు పాయింట్ల పేరుతో ప్రజల నుంచి డబ్బులు కాజేసే ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్థిక మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్్కు కాల్ చేయాలన్నారు. -
భూభారతి.. సర్వర్ డౌన్
చిన్నశంకరంపేట(మెదక్): భూ భారతి పోర్టల్ సర్వర్ డౌన్తో మండల తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు నిలిచిపోయాయి. వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సర్వర్ డౌన్తో నిరాశతో వెనుదిరుగుతున్నారు. తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ.. పోర్టల్ సాంకేతిక సమస్యతో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఇప్పటివరకు స్లాట్బుక్ చేసుకున్న వారందరికీ సర్వర్ సమస్య పరిష్కారం అయిన వెంటనే రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. చేగుంట(తూప్రాన్): చేగుంట మోడల్ స్కూల్లో పదో తరగతిలో ఖాళీగా ఉన్న 5 సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ చంద్రకళ తెలిపారు. పదో తరగతితో పాటు ఇంటర్లో ఎంపీసీలో 15, ఏసీఈలో 20 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. సీట్ల భర్తీ కోసం ఈనెల 6లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, అర్హతలను బట్టి చేర్చుకుంటామని పేర్కొన్నారు. -
ఫీజుల దోపిడీని నియంత్రించండి
వెల్దుర్తి(తూప్రాన్): ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని ఏబీవీపీ స్టేట్ కో–కన్వీనర్ ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని యాజమాన్యాన్ని నిలదీశారు. ఫీజుల మోతకు తోడు అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపించారు. సామాన్య, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక భారం పడుతుందని వాపోయారు. నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఏబీవీపీ నాయకుల సమాచారంతో ఎంఈఓ ఆదేశాల మేరకు కాంప్లెక్స్ హెచ్ఎం సాంబయ్య పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తున్న గదులకు తాళం వేశారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ భాను, నాయకులు సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు. -
18న ప్రత్యేక లోక్ అదాలత్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మెదక్జోన్: ఈనెల 18న నిర్వహించనున్న లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకు సంబంధించి అధికారులు ఇరుపక్షా ల కక్షిదారులతో మాట్లాడి కేసులను రాజీ చేయించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ నీలిమ అన్నారు. లోక్అదాలత్ కేసులపై శుక్రవారం సీనియర్ సివిల్ జడ్జి సంతోష్ కుమార్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సాయి ప్రభాకర్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 18న జరుగబోయే ప్రత్యేక లోక్ అదాలత్లో అత్యధికంగా కేసులను రాజీ చేసే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పోచయ్య, శోభన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా భూ రీసర్వే
అధికారులను ఆదేశించిన భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, భూభారతి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, కలెక్టర్ ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్ నగేశ్, ఏడీ ల్యాండ్ సర్వే కిషన్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలో భూ సర్వే అమలు తీరు, భూభారతి, సాదాబైనామా, రెవెన్యూ సదస్సులు నిర్వహణ సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 24 గ్రామాలు రీ సర్వేకు ఎంపిక కాగా, 7 గ్రామాల్లో సర్వే పూర్తయిందన్నారు. మరో 18 గ్రామ సభలు నిర్వహించినట్లు చెప్పారు. మిగితా జిల్లాలతో పోలిస్తే మెదక్ జిల్లాలో భూ సర్వే సమర్థవంతంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. సర్వే నిర్వహించేటప్పుడు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిజమైన భూ లబ్ధిదారులకు న్యాయం చేసే దిశగా రీ సర్వే జరగాలని స్పష్టం చేశారు. గ్రామ సభలు ఏర్పాటు చేసేటప్పుడు డెడ్లైన్ తప్పనిసరిగా పాటించాలన్నారు. భూముల సరిహద్దులు స్పష్టంగా ఉండేందుకు వీలుగా కొత్తగా ల్యాండ్ పార్శిల్ మ్యాప్ నంబర్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ రీసర్వే అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి కావడానికి జిల్లా యంత్రాంగం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందని వివరించారు. సమావేశంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వరద ముప్పు.. ఏదీ కనువిప్పు?
గతేడాది వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెరువు కట్టలు● ఏడాదిగా మరమ్మతులు కరువు ● కాలనీ వాసులకు తప్పని వెతలురామాయంపేట(మెదక్): అందరికీ వానాకాలం వరమైతే.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు మాత్రం శాపంగా మారుతోంది. చినుకు పడితే చాలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గతేడాది ఆగస్టులో కురిసిన కుండపోత వర్షాలకు రామాయంపేట మున్సిపాలిటీలోని శ్రీనగర్కాలనీ, అక్కలగల్లీ, బీసీ కాలనీల చుట్టూ వరద నీరు చేరింది. ఆ కాలనీలకు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కరువైంది. అలాగే జిల్లాలో దెబ్బతిన్న రహదారులు, చెరువు కట్టలు ఏడాది దాటినా మరమ్మతులకు నోచుకోలేదు. కొన్నిచోట్ల తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా, మళ్లీ భారీ వర్షాలు కురిస్తే రహదారులు తెగిపోయే ప్రమాదం ఉంది. ● లక్ష్మాపూర్ నుంచి దంతేపల్లి వరకు గతంలోనే పాక్షికంగా శిథిలమైన అంతర్ జిల్లా రహదారి వర్షాలకు మరింత దెబ్బతింది. రోడ్డుపై తేలిన గుంతలు, కంకరతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ● రామాయంపేట మండలం పర్వతాపూర్కు వెళ్లే తారు రోడ్డు వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. బ్రిడ్జి తెగిపోయి రోడ్డు, కరెంటు స్తంభాలు కొట్టుకుపోయాయి. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. ● నిజాంపేట మండల కేంద్రం నుంచి నస్కల్కు వెళ్లే రహదారిలో కల్వర్టు వర్షాలకు దెబ్బతింది. భారీ వర్షాలు కురిస్తే కల్వర్టు తెగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ● గతేడాది వర్షాలకు జాతీయ రహదారి 765 డీజీపై నందిగామ వద్ద ఏకంగా బ్రిడ్జి కుంగిపోయి పగుళ్లు వ్యాపించాయి. దీంతో రామాయంపేట, సిద్దిపేట ప్రధాన రహదారిపై నెలరోజుల పాటు ప్రయాణాలు స్తంభించాయి. తాత్కాలికంగా బ్రిడ్జి పక్క నుంచి రహదారి నిర్మించినా జాతీయ రహదారుల శాఖ అధికారులు బ్రిడ్జి మరమ్మతులు చేయించలేదు. భారీ వర్షాలు కురిస్తే తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ● హవేళిఘణాపూర్ మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పలు గ్రామాలు, గిరిజన తండాల రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. తర్వాత అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోయారు. ● అలాగే చీపురుదుబ్బ తండా సమీపంలో ఉన్న జిల్లాలోనే అతిపెద్దదైన రాయిన్ చెరువు కట్ట కొంతమేర దెబ్బతింది. నీరు పారే ప్రధాన కాలువ తెగిపోయినా, ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదు. వర్షాలకు కాట్రియాల వద్ద చెరువు కట్ట తెగిపోయి ఏడాది గడుస్తుంది. అయినా ఇప్పటివరకు మరమ్మతులు చేయించలేదు. కనీసం తట్ట మట్టి కూడా పోయకపోవడంతో వర్షాలు కురిస్తే చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం నెలకొంది. -
14 కేసుల్లో నేరస్తులకు శిక్ష
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్జోన్: ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు 14 కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి డీజీపీ సీవీ ఆనంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పోలీస్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తులో పురోగతిని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, పెండింగ్ కేసులు లేకుండా వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడిందని తెలిపారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను డీజీపీ అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు ఎస్పీ, డీఎస్పీలు పాల్గొన్నారు. -
నిధులివ్వకుంటే ఉద్యమిస్తాం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్రావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు, పాదయాత్రలు చేస్తామని హెచ్చరించారు. సంగారెడ్డిలో ఆ పార్టీ శ్రేణులకు ఎస్ఐఆర్ ప్రక్రియపై, పార్టీ సభ్యత్వ నమోదుపై శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో హరీశ్రావు మాట్లాడారు. జిల్లాను సస్యశ్యామలం చేసే ఈ రెండు ఎత్తిపోతల పథకాల విషయంలో జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు, హైదరాబాద్కు తాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో జిల్లాకు మంజూరైన ఎస్డీఎఫ్ నిధులను కాంగ్రెస్ సర్కారు వెనక్కి తీసుకుందని, వెంటనే ఈ నిధులను విడుదల చేయాలని కోరారు. జొన్న రైతులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అసైన్డ్ భూములిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వారి భూములనే లాక్కుంటోందని ధ్వజమెత్తారు. ఒక్క సంగారెడ్డిలోనే 700 ఎకరాలను లాక్కునేందుకు కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, సునీతారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, శశిధర్రెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, పట్నం మాణిక్యం, కాసాలబుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరితోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై మంత్రి ఎందుకుమాట్లాడటం లేదు సింగూరు మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలి మాజీమంత్రి హరీశ్రావు -
నిబంధనలు తప్పనిసరి
రామాయంపేట(మెదక్): ‘రక్తం పీల్చేస్తున్నాయి’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వైద్యాధికారి జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో సిబ్బంది, ఇతర వైద్యశాఖ అధికారులు పట్టణంలోని ల్యాబ్లను తనిఖీ చేశారు. రసాయనాలతో పాటు అనుమతి పత్రాలు, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లింబాద్రి, ఇతర అధికారులు ఉన్నారు. నర్సాపూర్ రూరల్: విద్యార్థులకు సంస్కారంతో కూడిన విద్యా బోధన చేయాలని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్రావు ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అవంచ గ్రామాన్ని సందర్శించారు. ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులు, నూతనంగా నిర్మిస్తున్న మహిళా సంఘం భవనాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో మహిళా సంఘం భవనం ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): గ్రామాల అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య గ్రామ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల వారీగా ఘన వ్యర్థాల నిర్వహణ, వన మహోత్సవం, వర్షాకాల సన్నద్ధతపై తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రతీ గ్రామంలో నాలుగు రకాల చెత్త సేకరణను సమర్థవంతంగా అమలు చేయాలని, ఇంటింటికీ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ స్టిక్కర్లు అందించాలన్నారు. అలాగే వన మహోత్సవాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్, ఎంపీఓ జాకీర్హుస్సేన్, ఏపీఓ సంతోశ్కుమార్ పాల్గొన్నారు. మెదక్జోన్: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఎకో క్లబ్ చైర్మన్ ప్రొఫెసర్ హుస్సేన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకో క్లబ్ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో ప్లాస్టిక్ వినియోగం అనివార్యంగా మారిందన్నారు. అయితే అదే నేడు మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎకో క్లబ్ కోఆర్డినేటర్ మురళి, డాక్టర్ విశ్వనాథం, వేణుగోపాలరావు, రాజు, అధ్యాపకుడు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


