breaking news
Medak District News
-
కొనుగోలు కోలాహలం
జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి కోతలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసారి 423 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశం ఉండగా, కొనుగోలు కేంద్రాలకు 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ఽధాన్యం రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. –మెదక్ అర్బన్ మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి కురిసిన వర్షాలు.. పోటెత్తిన వరదల్లో పంటలు మునిగి తేలాయి. దిన దిన గండంగా ఎవుసం చేసిన అన్నదాత ఎట్టకేలకు గట్టెక్కాడు. కొన్ని చోట్ల ఇంకా పంటలు చేతికి రాలేదు. జిల్లాలో సుమారు 3.80 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. ఇందులో 3.30 లక్షల మెట్రిక్ టన్నులు రైస్ మిల్లుల్లో దించుకుంటామని, మరో 60 వేల మెట్రిక్ టన్నులు సమీప జిల్లాలకు పంపించే అవకాశం ఉందని డీఎం జగదీశ్వర్ తెలిపారు. కాగా గత ఖరీఫ్కు సంబంధించి 90 శాతం, యాసంగికి సంబంధించి 50 శాతం సీఎంఆర్ పూర్తి చేశారు. ప్రస్తుతం మొత్తం 493 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకేపీ 176, పీఏసీఎస్ 317 కేంద్రాలు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి. కాగా ఈసారి 38 పారా, 47 రా రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించనున్నారు. ఎంపిక చేసిన మిల్లులు బ్యాంక్ గ్యారంటీ విధిగా ఇవ్వాల్సి ఉంటుంది. కోతలు ప్రారంభం కొల్చారం, రామాయంపేట, పాపన్నపేట మండలాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. కాగా కొల్చారం మండలంలోని వరిగొంతం, అప్పాజిపల్లి, అంసాన్పల్లి, పోతంశెట్టిపల్లి, కొంగోడ్, నాయిని జలాల్పూర్ , వెంకటాపూర్, కొల్చారం గ్రామాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. పాపన్నపేట మండలంలోని చీకోడ్, లింగాయపల్లి, లక్ష్మీనగర్లో వరి కోతలు కోస్తున్నారు. రామాయంపేట మండలంలోని కోనాపూర్, వెంకటాపూర్, ప్రగతి ధర్మారం, నిజాంపేట మండలం నస్కల్, నందిగామ, కల్వకుంట తదితర గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైనా... ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ఏర్పాట్లు పూర్తి చేశాం ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. కోటి గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, ప్రస్తుతం 50 లక్షలు నిల్వ ఉన్నాయి. మిగతావి త్వరలో వస్తాయి. 13 వేల టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి. మరో 7 వేలు అవసరం అవుతాయి. అవసరమైనన్నీ మాయిశ్చర్ మీటర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉన్నాయి. ఈసారి కొత్తగా 100 ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్లను ఉపయోగిస్తాం. – జగదీశ్ కుమార్, డీఎం, సివిల్ సప్లయిస్ 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా 426 కొనుగోలు కేంద్రాలుప్రారంభం 7 వేల టార్పాలిన్లు.. 50 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో గోదాంలు -
దర్జాగా దగా
సీఎంఆర్ బియ్యం ఇవ్వడంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను సైతం ఖాతరు చేయడంలేదు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ మిల్లర్లు మొండికేస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మరాడించి సివిల్సప్లైకి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బియ్యాన్ని కాజేస్తున్నారు. తొమ్మిదేళ్లుగా 13 మంది మిల్లర్ల యాజమాన్యాలు 61వేలకుపైగా మెట్రిక్టన్నుల బియ్యం ఎగ్గొట్టారు. వీటి విలువ రూ. 214 కోట్లు. రికవరీ కోసం ఆర్ఆర్యాక్టు ప్రయోగించినా వసూళ్లు కాకపోవడం గమనార్హం. – మెదక్జోన్ మెదక్ జిల్లాలో గత తొమ్మిదేళ్లు(వానాకాలం, రబీ)గా 13 రైస్ మిల్లర్లు 61,786.193 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సివిల్సప్లైయ్కి బకాయి పడ్డారు. వీటికి సంబంధించి జరిమానా, వడ్డీ కలిపి మొత్తం రూ.214.15 కోట్లు ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వీటి రికవరీ కోసం ఆర్ఆర్ యాక్టు ప్రయోగించినా పెద్దగా ఫలితం లేదని తెలిపారు. రికవరీ చేయకుండానే కేటాయింపులు బకాయి పడిన మిల్లర్ల నుంచి పూర్తిగా బియ్యం రికవరీ చేశాకే మళ్లీ ధాన్యాం కేటాయించాల్సి ఉంది. కానీ అవేం నిబంధనలు పట్టించుకోకుండా తొమ్మిదేళ్ల పాటు వానాకాలం, రబీ సీజన్లలో 18 సార్లు బకాయిపడిన మిల్లులకు ధాన్యం కేటాయించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో ఉన్న నేతల ఒత్తిడి ఏమైనా ఉందా? లేకా మరేకారణాలు ఉన్నాయో తెలియదుకానీ వందల కోట్ల విలువైన బియ్యాన్ని 13 మంది మిల్లర్లు బొక్కడం గమనార్హం. ఒకే మిల్లు వద్ద రూ.4 కోట్ల బియ్యం బకాయి పాపన్నపేటకు చెందిన ఒక రైస్ మిల్లు.. 2012 నుంచి 2016 వరకు వానాకాలం, యాసంగిలో 70.128 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సివిల్సప్లైయ్కి బకాయి పడింది. ఇందుకు సంబంధించి జరిమానా, వడ్డి కలిపి ఆ బియ్యం విలువ రూ.4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సదరు మిల్లర్ యజమాని ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో దర్జాగా విక్రయించి రూ.కోట్లు సొమ్ము చేసుసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్ఆర్యాక్టు ప్రయోగం తొమ్మిదేళ్లుగా 61,786 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం బకాయి పడిన 13 మంది మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం. అయినా స్పందించక పోవటంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. ఆర్ఆర్యాక్టు ప్రయోగించాం. రికవరీకి చేర్యలు చేపడుతున్నాం. – జగదీశ్కుమార్, డీఎం సివిల్సప్లై తొమ్మిదేళ్లుగా సీఎంఆర్ బియ్యం ఎగవేత రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యం 61,786 మెట్రిక్ టన్నుల రైస్ బకాయి పెనాల్టీతో వీటివిలువ రూ.214 కోట్లు క్రిమినల్ కేసులు నమోదు -
తాగునీటి కోసం తండ్లాట
మండల పరిధిలోని కామారం తండా వాసులు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో వ్యవసాయ బోరుమోటార్లను ఆశ్రయించాల్సి వస్తుంది. తాగునీరు సరిగా సరఫరా కావడం లేదని, ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని ఎన్నిసార్లు కోరినా గ్రామపంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని మహిళలు విమర్శించారు. వరి కోతలు మొదలైతే వ్యవసాయ రైతులు కూడా బోరుమోటార్లు బంద్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు తాగు నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. – చిన్నశంకరంపేట(మెదక్) -
పోషక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం
ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులుతూప్రాన్: సమతుల్య ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునాని ఐసీడీఎస్ సూపర్ వైజర్ శివ కుమారి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పోషక ఆహారంపై 9, 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, స్పీచ్ కాంపిటీషన్ నిర్వహించారు. పోటీ పరీక్షలో గెలుపొందిన విద్యార్థులను అభినందించా రు. కిశోర బాలికలు తీసుకునే ఆహారంలో అన్ని రకా ల సమతుల్య ఆహారం తీసుకుంటేనే సరైన పోషణ లభిస్తుందని తెలిపారు. దీనితో పాటు వ్యక్తిగత పరి శుభ్రత, నిత్యం సుమారు 4లీటర్లకు అధికంగా మంచినీరు తాగాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో పోషణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురా లు ఫ్లోరిన్, అంగన్వాడీ టీచర్లు శ్రీలత, ఉమా పాల్గొన్నారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ శివకుమారి -
రూ.8 కోట్లతో పర్యాటక సొబగులు
● దంతేపల్లి శివారులో 80 ఎకరాలలో ఏర్పాటు ● జిల్లా అటవీ అధికారి జోజి ● పర్యాటక ప్రదేశం సందర్శన రామాయంపేట(మెదక్): రామాయంపేట అటవీశాఖ రేంజ్ పరిధిలో పర్యాటక ప్రాంతం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మండలంలోని దంతేపల్లి శివారులో 80 ఎకరాల అటవీప్రాంతాన్ని గుర్తించారు. రూ.8 కోట్ల వ్యయంతో ఇది ఏర్పాటు కానుంది. పర్యాటకులు రాత్రివేళ బస చేయడానికి వీలుగా గుడారాలు, గుట్టల చుట్టూ రహదారి సదుపాయం, లోపలిభాగంలో తిరుగడానికి వీలుగా సఫారి వాహనం, ఇతర వసతులు సమకూరనున్నాయి. మట్టిరోడ్డు వెంట పర్యాటకులు కూర్చోడానికి వీలుగా కుర్చీలు, బల్లలు, తాగునీటి సదుపాయం, మూత్రశాలలతో నిర్మించనున్నారు. కుంటలు, చెక్డ్యాంల నిర్మాణం, రెండు వాచ్ టవర్లు ఏర్పాటు, సోలార్ బోర్వెల్, వాటర్ ట్యాంక్, రహదారికి రెండువైపులా ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేయనున్నారు. మెదక్, కామారెడ్డి జిల్లాలను కలుపుతున్న అంతర్ జిల్లా రహదారిని ఆనుకునే పది కిలోమీటర్ల మేర వైశాల్యంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనితో పర్యాటకులకు వణ్యప్రాణులతోపాటు జలపాతాలు, అటవీ సొబగులు, గుట్టలు, కుంటలు వీక్షించే అవకాశం కలుగుతుంది. ఈకో నిధులతో.. వణ్యప్రాణి సంరక్షణ విభాగం పరిధిలో ఈకో నిధులతో పర్యాటక ప్రాంతం ఏర్పాటు చేయనున్నారు. దంతేపల్లి అటవీప్రాంతం పరిధిలో ఇందుకోసం ఆశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. పర్యాటకుల కోసం దంతేపల్లి శివారులోని కాకుల గండి, లొంక ప్రాంతాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అటవీ అధికారి జోజి, ఇతర అధికారులు అటవీప్రాంతాన్ని సందర్శించారు. -
అప్పులు తీర్చేందుకే రెండేళ్లు
మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు నిజాంపేట(మెదక్): గత ప్రభుత్వంలో చేసిన అప్పులు తీర్చడంతోనే రెండేళ్ల పాలన సరిపోయిందని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమ ంతరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు డా.మోహన్ నాయక్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసినా ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. వచ్చే మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. అనంతరం మహిళలు గ్రామానికి బస్సులు నడపాలని విజ్ఞప్తి చేయడంతో డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, మహేందర్, సత్యనారాయణ, వెంకట్గౌడ్ పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండలం సంగాయిగూడతండాకు చెందిన కమలను హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్రూరల్ సీఐ జార్జ్కు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం కమల నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహిళలపై జరుగుతున్న హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖ, సీతక్క ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆమె వెంట జాగృతి జిల్లా నాయకుడు వీరప్ప గారి రమేశ్గౌడ్, రాజేశ్వరి తదితరులు ఉన్నారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రణీద్ కుమార్ నిజాంపేట(మెదక్): 317 జీఓ కారణంగా స్థానిక జిల్లాను కోల్పోయిన ఉపాధ్యాయులందరికీ శాశ్వతంగా వారి సొంత జిల్లాలకు కేటాయించేలా చూడాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రణీద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీటీఎఫ్ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిజాంపేట మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బైతి ఐలయ్య మాట్లాడుతూ.. తాత్కాలిక డిప్యుటేషన్ కోసం ఇచ్చిన జీఓ 190 సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం చేసే లా ఉందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నవీన్ రత్నాకర్, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్, జిల్లా బాధ్యులు మోహన్, పరమేశ్వర్, శ్రీకాంత్రెడ్డి, వినయ్కుమార్ పాల్గొన్నారు. నర్సాపూర్: రాజ్యాంగం ద్వారా సంక్రమించే హక్కులను బాలికలు సంపూర్ణంగా పొందాలని ఇన్చార్జి డీడబ్ల్యూఓ హేమ భార్గవి పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలో బాలికల రక్షణ కోసం రాజ్యాంగంలో పలు చట్టాలు ఉన్నాయని, ఆయా చట్టాలను బాలికలు తమ రక్షణకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోకిరిల నుంచి రక్షణ పొందడానికి 100 కు ఫోన్ చేసి సహాయం పొందాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రంజిత్రెడ్డి, కోర్టు ఏజీపీ సుధాకర్, ఎంఈఓ తారాసింగ్, లీగల్ సర్వీస్ కమిటీ న్యాయవాదులు మధుశ్రీ, రాజునాయక్, సాయికుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సంతోష, జెండర్ కోఆర్డినేటర్ కవిత పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
498 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
● కలెక్టర్ రాహుల్రాజ్ ● అవినీతికి పాల్పడితే కేసులే.. రామాయంపేట(మెదక్): ధాన్యం కొనుగోలులో అవినీతికి పాల్పడితే కేసులు తప్పవని కలెక్టర్ రాహుల్రాజ్ హెచ్చరించారు. మండలంలోని కోనాపూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోకుండా టార్ఫాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో 498 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందులో 430 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. పది కేంద్రాలకు రైతులు ధాన్యం తరలించారని, దీపావళి అనంతరం కేంద్రాలకు అధిక మొత్తంలో ధాన్యం వచ్చే అవకాశం ఉందని, తూకం యంత్రాలతోపాటు తేమ శాతాన్ని కొలిచే పరికరాలు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్ తదితరులున్నారు. విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దు మెదక్ కలెక్టరేట్: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులను బకాయిల కోసం గది బయటకు పంపితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దని చెప్పారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందని, తల్లిదండ్రులను ఫీజు కట్టమని అడగటం లేదా విద్యార్థులను బయటకు పంపడం వంటి వాటికి పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్రూంను కలెక్టర్ ప్రారంభించారు. -
రెవెన్యూ చట్టాలపై అవగాహన: ఆర్డీఓ
తూప్రాన్: రెవెన్యూ పాలన, భూ చట్టాలపై డివిజన్ పరిధిలో నూతనంగా నియమితులైన గ్రామపాలన అధికారులకు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీఓ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వివిధ భూ సంబంధిత చట్టాలు, ప్రభుత్వ పథకాలు, గ్రామపాలన విధానాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా భూభారతి చట్టం గురించి వివరించి, గ్రామస్థాయిలో భూముల రికార్డుల డిజిటల్ నిర్వహణ, ప్రజలకు సులభంగా భూమి వివరాలు అందుబాటులో ఉంచడం, భూములపై అనధికార ఆక్రమణలు నివారించడం వంటి అంశాల గురించి వివరించారు. ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్, భూదాన్ భూములకు సంబంధించి చట్టపరమైన విధానాలు, వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లో హైస్కూల్ స్థాయి విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ పుస్తకం తూచా తప్పకుండా అమలు చేయాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి అన్నారు. సోమవారం హవేళిఘణాపూర్ డైట్లో ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా విద్యార్థుల్లో కోడింగ్ డేటా సైన్స్, ఏఐ అంశాలలో నైపుణ్యం పెంపొందించేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు శ్రీకాంత్, నాగరాజు, రవికాంత్త్, భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని అవుట్డోర్ స్టేడియంలో ఉమ్మడి మెదక్ జిల్లా అథ్లెటిక్స్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అండర్– 14, అండర్– 17 బాలుర పోటీల్లో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల నుండి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇన్చార్జి యువజన క్రీడలశాఖ అధికారి, డీఈఓ రాధాకిషన్ హాజరై ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. అండర్–17లో 36 మంది అండర్–14లో 22 మంది మొత్తం 58 మంది ఉమ్మడి జిల్లా జట్టును రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పీడీలు శ్రీధర్రెడ్డి, మాధవరెడ్డి, మధుసూదన్, సత్యనారాయణ, శ్రీనివాసరావు, దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎండీకి ఎంపీ రఘునందన్ విజ్ఞప్తి దుబ్బాక: స్థానిక బస్డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఎంపీ రఘునందన్రావు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998లో 54 బస్లతో డిపో ప్రారంభించారని 134 మంది సిబ్బంది ప్రతిరోజు 14,014 కి,మీటర్ల ప్రయాణంతో రూ.8 లక్షల దినసరి ఆదాయం సాధించిందన్నారు. నష్టాల సాకుతో 2006లో దుబ్బాక డిపోను మూసి వేయడంతో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధుల నిరసనలతో వారం రోజుల్లోనే 10 బస్లతో మళ్లీ పునః ప్రారంభించారన్నారు. ప్రస్తుతం 35 బస్లతో రాష్ట్రంలో ఆదాయపరంగా ముందున్న డిపోలలో దుబ్బాక ఒకటన్నారు. డిపోకు డీఎం ను నియమించి 60 బస్లను కేటాయించి పూర్తిస్థాయి డిపోగా మార్చాలని ఎండీకి విన్నవించారు. -
హత్య కేసు దర్యాప్తు వేగవంతం: ఎస్పీ
కొల్చారం(నర్సాపూర్)/మెదక్మున్సిపాలిటీ: పోతంశెట్టిపల్లి శివారులో శనివారం గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యాచారం, హత్యకు గురైన మహిళ కేసును ఛేదించేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సోమ వారం ఘటనాస్థలిని సందర్శించి మాట్లాడారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఎస్పీ వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఎస్ఐ మోహినొద్దీన్, సిబ్బంది ఉన్నారు. అనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలపై 11 ఫిర్యాదులను అందజేయగా, వాటిని స్వయంగా స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కొన్నింటిపై సంబంధిత పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. -
ఎవరి చేతికో పగ్గాలు!
● నామినేషన్ వేసిన ఆంజనేయులుగౌడ్, రాజిరెడ్డి, రాంచందర్గౌడ్ ● అందరి అభిప్రాయాలతో నివేదిక సా్థనిక సంస్థల ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీని గ్రామీణస్థాయి నుంచి బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రజామోద యోగ్యమైన నాయకుడికి డీసీసీ పదవి కట్టబెట్టాలని, ఏకంగా ఏఐసీసీ నాయకులే రంగంలోకి దిగారు. సామాన్య కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం నామినేషన్లనే కాకుండా, పార్టీకోసం కష్టపడిన, సేవాభావం గల నాయకుల వివరాలు సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది. సమావేశానికి రాలేకపోయిన వారు ఫోన్ల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలపవచ్చని సూచించినట్లు సమాచారం. నాయకత్వ ఒత్తిడి, పరపతికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలు అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రధానంగా డీసీసీ అధ్యక్ష రేసులో ఉన్న ఇద్దరు నాయకులు, ఒకే నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో పోటీ తీవ్రంగానే ఉన్నట్లు కనపడుతుంది. రెండు జిల్లాలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, చెరో అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నట్లు పార్టీవర్గాలు గుసగుసలాడుతున్నాయి. చివరికి ఎవరు జిల్లా కాంగ్రెస్ బాద్షా అవుతారో వేచి చూడాల్సిందే. డీసీసీ అధ్యక్షుడిని నియమించి పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది. డీసీసీ పదవికి ముగ్గురు నామినేషన్లు వేసినా, ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. – మెదక్ అర్బన్ డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి జ్యోతి రౌతేలా, పీసీసీ నుంచి ఎన్నికల పరిశీలకులు జగదీశ్వర్రావు, నాసిర్ అహ్మద్, వరలక్ష్మిని నియమించారు. ఆదివారం మెదక్, రామాయంపేట బ్లాక్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది. మెదక్ నియోజకవర్గంలోని రెండు బ్లాకుల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఒక అభ్యర్థి పేరును ప్రతిపాదించగా, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ ప్రాంతానికి చెందిన కొంతమంది ముఖ్య నాయకులు, సంగారెడ్డి జిల్లాకు చెందిన అమాత్యుల నిర్ణయమే తమ అభిప్రాయంగా భావించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే మెదక్ ప్రాంతానికి చెందిన నాయకులు కలిసికట్టుగా పరిశీలకుల ముందుకు వెళ్లి, తమ అభిప్రాయాన్ని ఏకకంఠంతో తెలిపినట్లు తెలుస్తోంది. మూడో అభ్యర్థి మాత్రం తాను నామమాత్రంగా పోటీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ ఏఐసీసీ పరిశీలకులు అవకాశం ఇస్తే స్వీకరిస్తానని తెలిపారు. సోమవారం నర్సాపూర్, కౌడిపల్లిలో జరిగిన సమావేశానికి నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం, మాసాయిపేట మండలాలకు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులకు మద్ధతు లభించినట్లు తెలుస్తోంది. -
పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు
నర్సాపూర్/కౌడిపల్లి(నర్సాపూర్): పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ పరీశీలకురాలు జ్యోతి రౌతేలా అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో డీసీసీ అధ్యక్ష పదవి కోసం నర్సాపూర్, శివ్వంపేట మండలాలకు చెందిన పార్టీ నాయకుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతి థిగా ఆమె హాజరై మాట్లాడారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అగ్రనేత రాహుల్గాంధీ పలు కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. పార్టీ పదవుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, మైనార్టీ వర్గాల కార్యకర్తలు పోటీ పడవచ్చన్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి పార్టీ పదవుల భర్తీ సమయంలో తగిన ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ అ బ్జర్వర్లు నసీర్ అహ్మద్, జగదీశ్వర్, వరలక్ష్మి, డీసీసీ అద్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అనంతరం కౌడిపల్లి మండలం తిమ్మాపూర్లో కౌడిపల్లి, కొల్చారం, వెల్దుర్తి, మాసాయిపేట, చిలప్చెడ్ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. 18న ఏఐసీసీ కార్యాలయానికి దర ఖాస్తుల జాబితా పంపుతామని చెప్పారు.ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రౌతేలా -
తడి లేదు.. పొడి లేదు
● అలంకారప్రాయంగా షెడ్లు ● రూ. 40 లక్షల నిధులు వృథా ● నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ అపహాస్యమవుతోంది. పట్టణానికి దూరంగా ఏర్పాటు చేసిన డంప్యార్డులో తడి, పొడి చెత్తను వేరు చేయడానికి, వాటిని రిసైక్లింగ్ చేయడానికి గాను రూ. 40 లక్షల నిధులతో నిర్మి ంచిన రెండు షెడ్లు నిరుపయోగంగా మారాయి. వీటి కోసం ఖర్చు చేసిన 40 లక్షల నిధులు వృథాగా మారాయి. ఆరు బయటే చెత్త పారబోత పట్టణంలో ప్రతి రోజూ ట్రాక్టర్లు, ఆటోల్లో 12 వార్డుల నుంచి సేకరిస్తున్న తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. వేర్వేరుగా చెత్తను ఇవ్వడానికి గాను పట్టణంలోని అన్ని గృహాలకు బుట్టలు సరఫరా చేశారు. అయినా వేర్వేరుగా ఇవ్వకుండా ఒకే చోట ఇస్తున్నారు. డంపింగ్యార్డులో తడి చెత్త, కుళ్లిపోయిన కూరగాయలు, ఇతర వస్తువులను సెగ్రిగేషన్ షెడ్డులో వేసి సేంద్రియ ఎరువు తయారు చేయాలి. పొడి చెత్తతో పాటు ప్లాస్టిక్, బాటిళ్లు, ఇతర వస్తువులను డీఆర్సీసీ (డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్)కు తరలించి వేరు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు షెడ్లను వేర్వేరుగా నిర్మించారు. తయారు చేసిన సేంద్రియ ఎరువును మున్సిపాలిటీ పరిధిలో మొక్కలకు, నర్సరీల్లో వినియోగించి మిగితాది విక్రయిస్తారు. డీఆర్సీసీలో వేర్వేరు చేసిన చెత్త, ఇతర సామగ్రిని స్వచ్ఛంద సంస్థకు విక్రయించి చెత్త నుంచి సంపద సృష్టించాలి. దీంతో మున్సిపాలిటీకి ఆర్థికంగా చేయూత లభించడంతో పాటు చెత్త రహిత పట్టణంగా రూపొందుతుంది. కాగా పట్టణం మున్సిపాలిటీగా అవతరించి ఏడేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను ప్రారంభించలేదు. ట్రాక్టర్లు, ఆటోల్లో తరలిస్తున్న తడి, పొడి చెత్తతో పాటు ఇతర సామగ్రిని షెడ్లలో వేయకుండా ఆరు బయటనే వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా దుర్వాసన వెదజల్లుతోంది. ఈప్రాంతంలో పంటలు చేస్తున్న రైతులు దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. సెగ్రిగేషన్ షెడ్డు, డీఆర్సీసీ సెంటర్ నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు వినియోగంలోకి తీసుకురాలేదు. ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కడం లేదు. -
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై కలెక్టర్కు వినతులు సమర్పించారు. మొత్తం 58 అర్జీలు అందజేయగా, ఇందులో భూ సమస్యలు 24, పెన్షన్లు 10, ఇందిరమ్మ ఇళ్ల కోసం 6, ఇతర సమస్యలపై 18 వచ్చాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల అభ్యర్థనలు గౌరవిస్తూ, పారదర్శకత, సమయపాలనతో సేవలందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, ట్రైనీ డీఆర్ఓ అహ్మద్, ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా మార్కెట్ విలువకనుగుణంగా ట్రిపుల్ఆర్ పరిహారం ఇవ్వాలని నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామస్తులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పాత జీఓ ప్రకారమే వేతనాలివ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే రోజువారీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఇసుక కొరత లేకుండా చూడండి నర్సాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్రాజ్ మైనింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నర్సాపూర్ ఇసుక బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేసి విక్రయాలకు సంబంధించిన పలు రికార్డులను పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామని, నల్గొండ నుంచి తీసుకురావడానికి అయ్యే రవాణా చార్జీలను లబ్ధిదారుల నుంచి తీసుకుంటున్నట్లు చెప్పారు. పంచాయతీ కార్యదర్శి నుంచి టోకెన్ తీసుకొని వస్తే ఇసుక అందచేస్తారని వివరించారు. ఇసుక మాఫియాను తొలగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. జిల్లాలో తొమ్మిది వేల పైచిలుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, మైనింగ్ శాఖ అధికారులు ఉన్నారు. -
లక్ష్యం.. నిర్లక్ష్యం
పచ్చదనం పెంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం జిల్లాలో మందకొడిగా సాగుతోంది. కొన్నిశాఖల నిర్లక్ష్యంతో లక్ష్యం నెరవేరడం లేదు. పథకం ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా, జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఇక జిల్లా పోలీస్శాఖ ఈ పథకాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. – మెదక్ కలెక్టరేట్ జూలై 17న కలెక్టరేట్లో ఇన్చార్జి మంత్రి వివేక్ మొక్కలు నాటి వన మహోత్సవం పథకాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 37 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ణయించారు. జిల్లాలోని 21 మండలాలు, 492 గ్రామాలు, 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మండలాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడే నర్సరీలు ఉన్నాయి. వీటిని డీఆర్డీఏ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తారు. అలాగే అటవీశాఖ ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసింది. వీటితో పాటు జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీల్లో ఇప్పటికే శాశ్వత నర్సరీలు ఉన్నాయి. వీటిలో నీడనిచ్చే వాటితో పాటు పండ్లు, పూలనిచ్చే 30 రకాల మొక్కలు పెంచుతున్నారు. ఆసక్తి చూపని మున్సిపాలిటీలు జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వన మహోత్సవంలో శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాన్ని కేటాయించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలు లక్ష్యానికి దాదాపు దగ్గర ఉన్నాయి. కానీ మున్సిపాలిటీల్లో మాత్రం పథకం ముందుకు సాగడం లేదు. 4 మున్సిపాలిటీలకు 2.60 లక్షలు లక్ష్యంగా కేటాయించగా, ఇప్పటివరకు 1,87,520 నాటడం పూర్తయ్యింది. మరో 72,480 లక్షలు పూర్తిచేయాల్సి ఉంది. అలాగే అగ్రికల్చర్ శాఖకు 30 వేలు కేటాయించగా 1,373 మాత్రమే నాటగా, పోలీస్శాఖకు 18 వేలు కేటాయించగా, ఒక్క మొక్క కూడా నాటకపోవడం గమనార్హం. ముందుకు సాగనివన మహోత్సవం పట్టించుకోని పోలీస్శాఖ అగ్రికల్చర్ అంతంతే.. 87 శాతం పూర్తి జిల్లాలో వన మహోత్సవం 87 శాతం పూర్తయ్యింది. కొన్ని శాఖలతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో వన మహోత్సవం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. అందువల్లే లక్ష్యం పూర్తి కావడం లేదు. – జోజీ, డీఎఫ్ఓ -
బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
చిన్నశంకరంపేట(మెదక్): పాఠశాలల సమయానికి బస్సులు రాకపోవడంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం మండలంలోని అంబాజిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టా రు. చిన్నశంకరంపేటలోని జెడ్పీ పాఠశాల, మోడల్ స్కూల్కు వెళ్లేందుకు రోడ్డుపై గంటపాటు వేచి ఉన్న బస్సు రా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గు రయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నారాయణగౌడ్ పోలీస్ సిబ్బందితో వచ్చి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు. -
పట్నాలు వేసి.. మొక్కులు చెల్లించి
మల్లన్న ఆలయంలో భక్తుల కోలాహ లంకొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆల యం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. శనివారం సాయంత్రం నుంచి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించారు. స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ వెంకటేశ్, ఏఈఓ శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్లు పర్యవేక్షించారు. -
సీపీఆర్తో శ్రీరామ రక్ష
జిల్లాలో నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు మెదక్జోన్: మరణం ఎప్పుడు ఎలా వస్తుందో.. ఎవరూ చెప్పలేరు. అప్పటివరకు నవ్వుతూ కనిపించిన వారే కళ్ల ముందు కుప్పకూలుతుంటారు. రెప్పపాటులో కళ్లు మూస్తుంటారు. గుండెపోటుతో తరు చూ ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అయితే గుండెపోటు వచ్చిన వారిని సీపీఆర్ (కార్డి యో పల్మోనరీ రిససిటేషన్)తో సకాలంలో కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు వైద్యారోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి 17వ తేదీ వరకు జిల్లాలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యులతో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఉరుకుల పరుగుల జీవితంలో మూడు పదుల వయసులోనే బీపీ, షుగర్తో పాటు ఎన్నో రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు ఎక్కువవుతున్నాయి. అవి మరణాలకు దారి తీస్తున్నాయి. ఈ మధ్యకాలంలో గుండె సమస్యలతో సంభవిస్తున్న మరణాల్లో యువతే ఎక్కువగా ఉంటున్నారని పలు అధ్యయనాలు తేల్చాయి. అయితే గుండెపోటు, ప్రమాదాలు వంటివి జరిగినప్పుడు స్పృహ కోల్పోయిన లేదా శ్వాస తీసుకోని వారికి అత్యవసర సమయంలో సీపీఆర్ ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంది. పోలీసులు, ఇతర సామాన్యులు కూడా సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడిన సంఘటనలు అనేకం ఉన్నా యి. జిల్లాలో ఇటీవల ఓ పోలీస్ కానిస్టేబుల్ మహిళ ప్రాణాన్ని కాపాడారు. ఈక్రమంలో వైద్యారోగ్యశాఖ సీపీఆర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాకు చెందిన వైద్యులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. ఇందులో చేగుంట పీహెచ్సీ వైద్యుడు అనిల్, వెల్దుర్తి పీహెచ్సీ వైద్యురాలు సౌజన్య, రెడ్డిపల్లి డాక్టర్ ఫర్నాజ్, సర్దన పీహెచ్సీ వైద్యుడు వినయ్సుశీల్ ఉన్నారు. వీరితో పాటు 108 సిబ్బంది అవగాహన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లాలో ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, జన సంచారం ఎక్కువగా ఉన్న రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్మాల్స్, వైద్యారోగ్య సెంటర్లలో అధికారులు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సీపీఆర్పై ప్రతి ఒక్కరూ విధిగా అవగాహన కలిగి ఉండాలి. అకస్మాత్తుగా గుండె కొట్టుకోవటం ఆగి శ్వాస నిలిచిపోయిన వ్యక్తులకు వెంటనే సీపీఆర్ చేస్తే 60 శాతం బతికే అవకాశం ఉంటుంది. ప్రభు త్వం దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. – గణేశ్వర్, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, మెదక్ -
పర్యాటక సొబగులు
●అర్బన్పార్కుకు మరిన్ని హంగులు ●ప్రారంభానికి సిద్ధమైన కాటేజీలు ●సందర్శకులకు సకల వసతులు పర్యాటక పరంగా నర్సాపూర్ మరింత అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే అర్బన్పార్కుకు సందర్శకుల తాకిడి పెరిగింది. అదే పార్కులో వారు బస చేసేందుకు అనువుగా నిర్మించిన కాటేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈనెల చివరి వారంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. – నర్సాపూర్ నర్సాపూర్– హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని పట్టణ శివారులోని 258 హెక్టార్లలో అటవీశాఖ అర్బన్పార్కు ఏర్పాటు చేసింది. వాచ్ టవర్పైకి ఎక్కితే పచ్చని అడవి అందాలతో పాటు పట్టణానికి చెందిన రాయరావు చెరువు, పట్టణ వ్యూ పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది. కాగా సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 80 మ ంది వరకు పార్కుకు వస్తుండగా, సెలవు రోజుల్లో ఆ సంఖ్య రెట్టింపు అవుతోంది. అయితే అర్బన్పార్కును పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అటవీశాఖ అడుగులు వేసింది. పాత కాటేజీల పనులు పూర్తి చేయడంతో పాటు కొత్తగా మరిన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నీరు నిల్వ ఉండే ప్రాంతంలో 21 కాటేజీలు, ఒకే బ్లాక్లో ఉండే విధంగా మరో 12 కాటేజీలు, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్, సెమినార్ హాల్, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్, నెట్ క్రికెట్తో పాటు స్విమ్మింగ్ పూల్, పర్యాటకులకు భోజన సదుపాయం కల్పించేందుకు రెస్టారెంట్, దానిని ఆనుకొని కిచెన్ నిర్మాణాలు పూర్తయ్యాయి. కాగా కాటేజీల పరిసరాల్లో అక్కడక్కడ ఖాళీ స్థలంతో పాటు కొంత ఏరియాలో మొక్కలు నాటారు. త్వరలోనే అందుబాటులోకి.. అర్బన్పార్కులో చేపట్టిన కాటేజీల నిర్మాణ పనులు పూర్తి కాగా, కాటేజీలు, రెస్టారెంట్, ఇతర భవనాల్లో ఫర్నిచర్ సమకూర్చాల్సి ఉంది. ఈ మేరకు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంస్థ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. కాగా స్థానిక ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారకపోతే ఈనెల చివరి వారంలో లేదా వచ్చె నెలలో కాటేజీలు ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ చర్యలు చేపడుతోంది. అర్బన్పార్కుతో ఇప్పటికే నర్సాపూర్ పర్యాటకంగా పేరు గడించింది. పార్కులో నిర్మించిన కాటేజీలు అందుబాటులోకి వస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉ ంటుంది. మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అటవీశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం
ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రౌతేలామెదక్జోన్: కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని ఉత్తరాఖండ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రౌతేలా అన్నా రు. ఆదివారం మెదక్లో డీసీసీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పారదర్శక ఎన్నిక కోసం అన్నిస్థాయిల కార్యకర్తల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మండల, బ్లాక్, జిల్లాస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు సందర్శిస్తున్నామన్నారు. పార్టీ కోసం పని చేసే నాయకులకు సముచిత ప్రాఽ దాన్యం లభిస్తుందన్నారు. ఈనెల 22న ఏఐసీసీకి నివేదిక సమర్పిస్తామని వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్రావు, పీసీసీ కోఆర్డినేటర్లు అహ్మద్ నజీర్, వరలక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురాంగౌడ్, నాయకులు ఆవుల రాజిరెడ్డి, హఫీజ్, మ్యాడం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మందులు అందుబాటులో ఉంచండి
కలెక్టర్ రాహుల్రాజ్కొల్చారం(నర్సపూర్): ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందేలా చూడాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం కొల్చారం,రంగంపేట ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్లు, సిబ్బంది హాజరుతో పాటు మ ందుల స్టాక్ను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల కేసులు, వా టికి సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయా..? అని ఆరా తీశారు. వ్యాధుల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట వైద్యులు ప్రవీణ్ కుమార్, సిబ్బంది త దితరులు ఉన్నారు. -
ముందస్తు అనుమతి తప్పనిసరి
మెదక్ మున్సిపాలిటీ: దీపావళి సందర్భంగా జిల్లా పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలు, మార్గదర్శకాల కోసం సంబంధిత సబ్ డివిజనల్ పోలీస్ అధికారిని సంప్రదించాలన్నారు. అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇటీవల జరుగుతున్న నేరాల గురించి ప్రస్తావించారు. లోన్యాప్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, బిట్కాయిన్, క్రిఫ్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. తక్కువ వడ్డీతో వెంటనే లోన్ ఇస్తామని చెప్పి కొన్ని యాప్లను ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు చెప్పారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే హెల్ప్లైన్ 1930 నంబర్కు కాల్ చేయాలన్నారు.ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
సేవలందించని రైతు వేదికలు
ప్రారంభానికి నోచుకోని ఫరీద్పూర్ రైతు వేదికఅధ్వానంగా ర్యాలమడుగు రైతువేదిక హవేళిఘణాపూర్(మెదక్): గత ప్రభుత్వ హయాంలో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన రైతు వేదికలు అలంకారప్రాయంగా మిగిలాయి. క్లస్టర్ పరిధిలోని ఏఈఓలు కనీసం నిర్వహణను పట్టించుకోవడం లేదు. మండల పరిధిలోని ర్యాలమడుగు రైతువేదిక అధ్వానంగా మారింది. కనీసం వెళ్లేందుకు దారి కరువైంది. మెదక్, హవేళిఘణాపూర్ మండలాల పరిధిలోని అన్ని రైతు వేదికల పరిస్థితి ఇలాగే ఉంది. ఫరీద్పూర్లో నిర్మించిన వేదికను ఇప్పటివరకు ప్రారంభించలేదు. అధికారులు హవేళిఘణాపూర్, మెదక్ కార్యాలయాల్లోనే ఉంటూ రైతులను అక్కడికే రప్పించి పనులు చేస్తున్నారు. బూర్గుపల్లి శివారులో నిర్మించిన రైతు వేదిక సైతం ప్రారంభానికి నోచుకోకుండా పోయింది. ఇది మందుబాబులకు అడ్డాగా మారింది. ఇలాగే వదిలేస్తే అవి శిథిలావస్థకు చేరే అవకాశం ఉందని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రైతు వేదికలను వినియోగంలోకి తీసుకువచ్చేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కనీస నిర్వహణ కరువు -
చాకరిమెట్లలో పూజలు
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణస్వామి మండపంలో దంపతులు సామూహిక వ్రతాలు ఆచరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆంజనేయశర్మ, ఈఓ శ్రీనివాస్, అర్చకులు పాల్గొన్నారు. వైభవంగా బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ దుబ్బాక: పట్టణంలో శనివారం ప్రధాన గ్రామదేవత బొడ్రాయి (నాభిశిల, భూలక్ష్మీదేవి) విగ్రహాల ప్రతిష్ఠ కనులపండువగా జరిగింది.అంతకు ముందు వేదస్వస్తి తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఎంపీ మాధవనేని రఘునందన్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు పలువురు ప్రముఖులు హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక పట్టణంలో బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. భవిష్యత్త్లో అమ్మవారి కృపతో దుబ్బాక పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. ఉత్సవంలో పట్టణంలోని అన్ని కులసంఘాల పెద్దలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయస్థాయిలో రాణించాలి మెదక్ మున్సిపాలిటీ: హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఎలైట్ ప్రీమియర్ లీగ్– సీజన్ 1 టోర్నమెంట్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచిన సాయిలాటిని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. ఈ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ తెలంగాణ పోలీస్, టాలీవుడ్ హీరోస్ జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. రెండు జట్లు అద్భుతమైన క్రీడా ప్రదర్శన కనబరిచినా, తెలంగాణ పోలీస్ జట్టు విజయాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సాయిలాటి కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయస్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీజేఐపై దాడికి యత్నం అమానుషం గజ్వేల్: సీజేఐ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడి ఘటనపై నిరసన వెల్లువెత్తింది. శనివారం దళిత, ప్రజా, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గజ్వేల్లోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరాపార్కు చౌరస్తా నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, దళిత, ప్రజా సంఘాల నా యకులు మాట్లాడుతూ.. సీజేఐపై దాడి..దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. దేశంలో దళితులకు అత్యున్నత పదవులు దక్కుతున్నా.. ఆధిపత్య కులాల నుంచి అవమానాలు తప్పడం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. -
మెరుగైన వైద్యం అందించండి
చేగుంట(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్): ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆస్పత్రి ఓపీ రికార్డులను పరిశీలించారు. మందులను పరిశీలించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరా తీశారు. గత నెలలో మండల పరిధిలో ఎంతమందికి డెలివరీలు చేయించారని ఏఎన్ఎంలను ప్రశ్నించారు. ఆస్పత్రి ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సిబ్బంది రాజిరెడ్డి, అనిత ఏఎన్ఎంలు, సిబ్బంది ఉన్నారు. అనంతరం చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూను పరిశీలించారు. వసతి గృహంలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా సహించేదిలేదని సిబ్బందిని హెచ్చరించారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
ఉద్యాన పంటలపై దృష్టి సారించాలి
ములుగు ఉద్యానవర్సిటీవైస్ చాన్స్లర్ రాజిరెడ్డి ములుగు(గజ్వేల్): రైతులు అవకాడో, కూరగాయల లాంటి ఉద్యాన పంటలపై దృష్టి సారించి అధిక దిగుబడులు, లాభాలు సాధించాలని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ రాజిరెడ్డి సూచించారు. శనివారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ధన్–ధాన్య కృషి యోజన పథకంలో భాగంగా వి శ్వవిద్యాలయంలో రైతులు, అధికారులు, విద్యార్థులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యాన పంటల ఉత్పత్తి ఇప్పటికే 350 మిలియన్ టన్నులకు చేరిందని ఇది సాధారణ వ్యవసాయం కంటే ఎక్కువని రైతులకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలపై అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని లాభాల దిశలో ముందుకు వెళ్లాలని వివరించారు. అనంతరం రైతులు ఉద్యాన శాస్త్రవేత్తలతో వివిధ అంశాలపై చర్చించారు. కరివేపాకు, మునగ వంటి ఇతర పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన వర్సిటీ అధికారులు సురేష్కుమార్, సిందుజ, మల్లేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
తొమ్మిదేళ్లు.. అవస్థలు ఎన్నాళ్లు!
కోటి ఆశ లతో పదో వసంతంలోకి మెతుకుసీమÐðl$™èl$MýS$ïÜÐ]l$ ¯]l*™èl¯]l hÌêÏV> AÐ]l-™èlÇ…_ ™öÑ$Ã-§ólâ¶æ$Ï ç³NÇ¢ ^ólçÜ$-Mö° ç³§ø Ð]lçÜ…-™èl…-ÌZMìS Ayýl$-VýS$-ò³-sìæt…¨. Mö…§ýlÆý‡$ ´ëÌS¯]l ^ólÆý‡$-OÐðl…§ýl° B¯]l…-§ýl-ç³-yýl$™èl$…sôæ.. ç³Ë$-Ð]l#Æý‡$ Cº¾…-§ýl$Ë$ ™èlç³µyýl… Ìôæ§ýl° BÐól-§ýl¯]l Ð]lÅMýS¢… ^ólçÜ$¢-¯é²Æý‡$. Mö™èl¢ hÌêÏ HÆ>µ-r$MýS$ Ð]l¬…§ýl$ ´ëÌS-¯]l…™é çÜ…V>-Æð‡yìlz MóS…{§ýl…-V>¯ól ÝëW…-¨. §ýl*Æ>-¿ê-Æý‡…™ø {ç³fË$ A¯ólMýS AÐ]lçܦË$ ç³yézÆý‡$. hÌêÏÌS ç³#¯]l-Ç-Ó-¿ýæ-f-¯]l™ø D {´ë…™èl {ç³fÌS _Æý‡-M>ÌS MøÇMýS ¯ðlÆý‡-ÐólÇ…¨. 11 AMøtºÆŠæḥ 2016ÌZ ™ðlÌS…-V>׿ _{™èl-ç³r…Oò³ Ððl$§ýlMŠS {ç³™ólÅMýS hÌêÏV> AÐ]l-™èlÇ…_…-¨. – మెదక్జోన్ ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన తర్వాత మెదక్ కొంతమేర అభివృద్ధి వైపు పయనిస్తోంది. 2022లో జిల్లాకు రైలు రావటంతో ఇక్కడి ప్రజల చిరకాల కోరిక తీరింది. 2023లో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా పరిషత్, మాతా శిశు ఆస్పత్రి (ఎంసీహెచ్) భవనాలు అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర వైద్యం అందించే (క్రిటికల్ కేర్) యూనిట్ మాత్రం నిర్మాణంలో ఉంది. అలాగే మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరు కాగా, ఓ ప్రైవేట్ భవనంలో తరగతులు కొనసాగుతున్నాయి. భవనాల నిర్మాణం కోసం రూ. 180 కోట్లు మంజూరయ్యాయి. స్థల సేకరణ పూర్తి అయినప్పటికీ టెండర్ దశలో ఉన్నాయి. జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూ రైంది. రామాయంపేటలో స్థల సేకరణ సైతం పూర్తి అయింది. అలాగే చేగుంట రైల్వేగేట్ సమీపంలో ఆర్వోబీ నిర్మాణం కోసం కేంద్ర ప్రభు త్వం రూ. 47 కోట్లు మంజూరు చేసింది. ఇటీవలే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా, పనులు ప్రారంభించారు. ఆశించిన ప్రగతి కరువు మెదక్కు రింగ్రోడ్డు లేకపోవటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. జిల్లాలో చూడదగిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి, ఖిల్లా, పోచారం అభయారణ్యం, కామారెడ్డి– మెదక్ జిల్లాల సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు, ఏడుపాయల దేవస్థానం, కొల్చారంలో నిర్మించిన జైన మందిరం గత చరిత్రకు అద్దం పడుతున్నాయి. వీటిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఏళ్లుగా పాలకులు హామీలు ఇస్తున్నా, ఆచరణలో ముందుకు సాగటం లేదు. జిల్లాలో ఉన్నత విద్య సైతం అందని ద్రాక్షగానే మిగిలింది. పీజీ, ఇంజనీరింగ్, కేంద్రీయ విద్యాలయాలు కరువయ్యాయి. ఉన్నత చదువులకు విద్యార్థులు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేవు. ఏకై క మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్ రైతుల కల్పతరువు. దీని ఆయకట్టు ప్రస్తుతం 25 వేల ఎకరాలు మాత్రమే ఉంది. ఆనకట్ట ఎత్తు పెంచితే మరో 10 నుంచి 15 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ఎత్తు పెంపు కోసం గతంలో నిధులు మంజూరు కాగా, నేటికీ ముంపునకు గురయ్యే భూములకు పరిహారం ఇవ్వలేదు. ఎత్తు పెంపు పనులు ముందుకు సాగటం లేదు. అలాగే కొన్ని మండలాల్లో కాళేశ్వరం కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. మధ్యలో నిలిచిన పనులు జిల్లా కేంద్రంలోని పిట్లం చెరువు, గోసముద్రం చెరువులను మినీట్యాంక్ బండ్గా మార్చేందుకు 8 ఏళ్ల క్రితం రూ. 9 కోట్లు మంజూరయ్యాయి. ఇరిగేషన్ పరిధి పనులు పూర్తి అయినప్పటికీ, టూరిజం కింద చేపట్టిన పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అలాగే పట్టణంలోని రాందాస్ చౌరస్తా, హెడ్ పోస్టాఫీస్, బోధన్ చౌరస్తాలు ఎలాంటి ప్రగతికి నోచుకోలేదు. మహానీయుల విగ్రహాలను నేటికీ పునరుద్ధరించలేదు. కరువైన రింగురోడ్డు.. కష్టతరంగా ప్రయాణం ఊసే లేని పర్యాటకం.. రైలుకూత, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తలమానికం -
సర్కారు బడుల్లో అల్పాహారం
మెదక్ అర్బన్: విద్యార్థుల హాజరుశాతం పెంచడంతో పాటు ఆకలి బాధలు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్కార్ బడుల్లో ఉదయం పూట అల్పాహారం అందించనుంది. ఈ పథకానికి అయ్యే ఖర్చు, నిర్వహణ.. తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే నివేదిక రూపొందించినట్లు సమాచారం. జిల్లాలో లోకల్ బాడీ స్కూళ్లు 902 ఉండగా, విద్యార్థులు 64,681 మంది చదువుతున్నారు. కాగా 7 మోడల్ స్కూల్స్ ఉండగా, ఇందులో బాలురు సుమారు 2 వేలు ఉన్నారు. మొత్తం మీద సుమారు 66,681 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. వంట కార్మికుల జీతాలు పెంపు తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకనుగుణంగా విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రతి రోజు ఉదయం రోజుకో రకం టిఫిన్ అందివ్వనున్నారు. వారంలో మూడు రోజులు పులిహోర, వెజ్ బిర్యాని, కిచిడి.. మరో రెండు రోజులు బోండా, ఉప్మా, ఇడ్లీ అందించాలని సంకల్పించారు. 1 నుంచి 5 తరగతుల వారికి రోజుకు రూ. 8తో, 6 నుంచి 10 వరకు రూ.12 తో అల్పాహారం అందివ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు అవసరమైన పాత్రలు, గ్యాస్ తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఇక వంట కార్మికులకు ప్రస్తుతం ఉన్న రూ. 3 వేల జీతాన్ని రూ. 3,500కు పెంచాలని నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు జిల్లాలో 66,681 మంది విద్యార్థులకు ప్రయోజనం ఇప్పటికే కొనసాగుతున్న రాగిజావ పంపిణీతీరనున్న ఆకలి బాధలు ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. సమయపాలనతో పాటు హాజరుశాతాన్ని పెంచేందుకు ఇటీవల ప్రభుత్వం విద్యార్థులతో పాటు టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ సిస్టం ప్రవేశపెట్టింది. సమీప గ్రామా ల నుంచి వచ్చే విద్యార్థులు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఉదయం 8 గంటలకే ఇళ్ల నుంచి బయలు దేరుతున్నారు. ఆ సమయానికి ఇంటి వద్ద వంటలు కాకపోవడంతో ఏమీ తినకుండానే బడికి వస్తున్నారు. కొంత మంది విద్యార్థులు ప్రార్థనలో కళ్లు తిరిగి పడిపోవడం కూడా జరుగుతుందని టీచర్లు అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. వారానికి మూడుసార్లు గుడ్లు, రాగి జావ ఇస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసుల సమయంలో సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నారు. ఈ విషయమై డీఈఓ రాధాకిషన్ను వివరణ కోరగా.. ఇప్పటివరకు అల్పాహారానికి సంబంధించి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మంచి లక్ష్యం.. అంతా నిర్లక్ష్యం
● గుంతలు తీశారు.. మొక్కలు మరిచారు ● పట్టించుకోని మున్సిపల్ అధికారులునర్సాపూర్ రూరల్: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తుకారాం తండాకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు అధికారులు గుంతలు తీయించారు. అయితే నాటడం మాత్రం మరిచారు. ప్రస్తుతం ఆ మొక్కలు ఎండుముఖం పట్టాయి. వన మహోత్సవంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో 30 వేల మొక్కలు నాటాలనే లక్ష్యం ఉంది. అందులో భాగంగా నర్సాపూర్ నుంచి తుకారం తండాకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు నెల రోజుల క్రితం గుంతలు తీశారు. వాటిలో నాటేందుకు రాయరావు చెరువు కట్టపై నుంచి మొక్కలు తెచ్చి పెట్టి నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఎండిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్డు వెంట మొక్కలు నాటారు. కానీ సంరక్షణ చర్యలు మాత్రం చేపట్టలేదు. ఇదే విషయమై మున్సిపల్ ఎన్విరాల్మెంట్ ఇంజినీర్ శ్రీకాంత్ను వివరణ కోరగా.. సిబ్బంది కొరత కారణంగా టార్గెట్ను రీచ్ కాలేకపోతున్నామని చెప్పారు. సిబ్బంది సమస్య తీరితే వన మహోత్సవంలో ఇచ్చిన 30 వేల మొక్కల నాటే టార్గెట్ పూర్తి చేసి సంరక్షిస్తామని తెలిపారు. -
అసలేం జరిగింది?
మెదక్జోన్: జిల్లాలో సంచలనం రేపిన గిరిజన మహిళ హత్యాచారం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి వద్ద సెల్ఫోన్ లేకపోవడంతో అసలేం జరిగిందనే దానిపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే మహిళ పని కోసం టిఫిన్ కట్టుకుని సమీప బంధువు (మహిళ)తో కలిసి మెదక్ అడ్డా వద్దకు ఇంటి నుంచి ఆటోలో బయల్దేరింది. ఆ తర్వాత ఎక్కడకు వెళ్లింది? ఎవరిని కలిసింది? అనే విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ శనివారం తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించి క్లూస్టీంను రంగంలోకి దింపారు. ఆటోడ్రైవర్తో పాటు బాధితురాలితో వచ్చి న మరో మహిళను విచారించినట్లు తెలుస్తోంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మంబోజిపల్లి చౌరస్తాలో ఎన్ని ఆటోలున్నాయనే విష యాన్ని తెలుసుకునేందుకు అక్కడ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాధితురాలి భర్తతో పాటు ఆ తండాలోని పలువురిని సైతం విచారించారు. అయితే సదరు మహిళ మంబోజిపల్లికి రాగానే తనకు ఇక్కడే పని ఉందని ఆటో దిగిపోగా, ఆమె బంధువు ఓ మేసీ్త్ర వద్ద పనికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పని కల్పిస్తామని ఇద్దరు వ్యక్తులు ఆ మహిళను కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి, ఏడుపాయల దేవస్థానం సమీపంలోని ఓ వెంచర్ వద్దకు తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలో ఆమైపె అత్యాచారం చేయబోగా సదరు మహిళ ప్రతిఘటించటంతో చీరతో చేతులు కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె బతికుంటే విషయం బయట పడుతుందని ఆమైపె దాడి చేశారు. చనిపోయిందని భావించిన దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న మహిళను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా మెదక్ జిల్లా ఆస్ప త్రికి తరలించారు. కాగా ఈ ఉదంతంలో ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మెదక్ మండలం జానకంపల్లి పంచాయతీ పరిధిలోని సంగాయిగూడ తండాకు చెందిన ఈ మహిళకు ఐదుగురు సంతానం. అందులో పెద్ద కుమార్తె పెళ్లి చేయగా, మిగతా నలుగురు పిల్లలను రెక్కల కష్టం మీద పోషిస్తున్నారు. దంపతులిద్దరూ అడ్డా కూలీలుగా పనిచేస్తుంటారు. గిరిజన మహిళ హత్యాచారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం సంచలనం రేపిన కొల్చారం ఘటన -
సంతకం కావాలి సారూ..
VðSh-sñæyŠæ íÜVóS²^èlÆŠḥMøçÜ… ´ër$Ï మెదక్ మున్సిపాలిటీ: ‘జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల తన కూతురు పెళ్లి జరిపించాడు. ప్రభుత్వం నుంచి వచ్చే కల్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తు పత్రాలపై గెజిటెడ్ సంతకం తప్పనిసరి అయింది. అధికారుల చుట్టూ తిరిగినా సంతకం చేసేందుకు విముఖత చూపారు. చేసేది లేక తెలిసిన వారిని ఆశ్రయించి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్తో సంతకం చేయించి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. అట్టి దరఖాస్తు పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో అందజేయగా తిరస్కరించారు. దీంతో మళ్లీ పత్రాలన్నీ సిద్ధం చేసి మరో గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాడు’. కొన్నింటికి తప్పనిసరి ప్రభుత్వ పథకాలకే కాక ప్రభుత్వ ఉద్యోగాలకు, పోటీ పరీక్షలు, పై చదువుల దరఖాస్తులకు కావాల్సిన సర్టిఫికెట్లపై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తు సమయంలో దంపతులది మొదటి వివాహమేనని ధృవీకరించడానికి ఈ సంతకం అవసరం. అలాగే లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్, పోటీ పరీక్షల దరఖాస్తులపై ఫొటో గుర్తింపు, పుట్టిన తేదీ సర్టిఫికెట్లలో పేరు మార్పు, పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్లు, కోర్టుకు సమర్పించే జిరాక్స్ పత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ దరఖాస్తులోని సమాచారం వాస్తవమని ధృవీకరించినట్లు అవుతుంది. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు దరఖాస్తులపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించడం దరఖాస్తుదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఏ కార్యాలయానికి వెళ్లినా..గంటల తరబడి అధికారుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. కొందరు విసిగిపోయి పథకాలకు దరఖాస్తు చేసుకోవడం లేదు. తప్పనిసరిగా అవసరమైన వారు మాత్రం అధికారుల కోసం నిరీక్షిస్తున్నారు. అయితే సంతకం చేసేందుకు కొందరు అధికారులు సంకోచిస్తున్నారు. మరికొందరు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తుండటంతో అందుబాటులో ఉండటం లేదు. ఆయా అంశాలను పరిగణలోకి తీసుకొని గెజిటెడ్ అధికారి సంతకం విషయంలో వెసులుబాటు కల్పించాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు. -
హస్తవాసి ఎవరికో!
● డీసీసీ రేసులో ఆ నలుగురు ● 11న ఏఐసీసీ పరిశీలకుల రాక ● క్షేత్రస్థాయిలో పర్యటన, వారం రోజుల్లో నివేదిక మెదక్ అర్బన్: సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కుదిర్చి, ఏకాభిప్రాయంతో సమర్థుడైన డీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు చర్యలు చేపట్టింది. ఈమేరకు ఈనెల 11న ఏఐసీసీ నుంచి 22 మంది పరిశీలకులు జిల్లాకు రానున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, అందరి అభిప్రాయాలు సేకరించి, సమగ్రమైన నివేదికను ఏఐసీసీకి అందజేయనున్నట్లు సమాచారం. కాగా డీసీసీ అధ్యక్ష పదవికి జిల్లాలో తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా నలుగురు నాయకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, మరికొందరు అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆంజనేయులుగౌడ్ నర్సాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన ఆంజనేయులుగౌడ్ విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యూఐలో పలు పదవులు చేపట్టి, చురుకై న నాయకుడిగా రాజకీయ ఆరంగ్రేటం చేశారు. ఒకసారి ఎంపీటీసీగా పని చేశారు. ఆయన తల్లి, సోదరులు సొంత గ్రామా నికి సర్పంచ్లుగా సేవలందించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆంజనేయులుగౌడ్కు పార్టీ డీసీసీ బాధ్యత లు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి విజయం కోసం కృషి చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు అనుంగు అనుచరుడిగా కొనసాగుతున్నారు. రెండోసారి డీసీసీ పదవిని ఆశిస్తున్నారు. ఆవుల రాజిరెడ్డి మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన ఆవుల రాజిరెడ్డి కుటుంబీకులు ఆది నుంచి కాంగ్రెస్వాదులే. ఆయన తండ్రి నారాయణరెడ్డి మాసాయిపేట ఎఫ్ఏసీఎస్ చైర్మన్గా రెండుసార్లు పనిచేశారు. విద్యాధికుడైన రాజిరెడ్డి లాయర్గా హైదరాబాద్లో పని చేస్తూనే, నర్సాపూర్ నియోజకవర్గంలో సునీతారెడ్డి అనుచరుడిగా కొనసాగారు. 2019లో సునీతారెడ్డి కాంగ్రెస్ను వీడిన తర్వాత, కష్టకాలంలో నర్సాపూర్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి సునీతారెడ్డి చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష రేసులో ఉన్నారు. పబ్బతి ప్రభాకర్రెడ్డి పాపన్నపేట మండలం ఎల్లాపూర్కు చెందిన పబ్బతి ప్రభాకర్రెడ్డి 24 ఏళ్ల వయస్సులో పోలింగ్ ఏజెంట్గా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికీ ప్రతి ఎన్నికలో ఆయనే ఏజెంట్గా విధులు నిర్వహించడం విశేషం. 1998లో రాజశేఖర్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మండలస్థాయిలో కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ప్రభాకర్రెడ్డి ఇచ్చిన స్పీచ్కు ఆకర్షితులైన కాంగ్రెస్ నాయకులు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. అనంతరం ఏడేళ్ల పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించారు. సీడీసీ డైరెక్టర్, ఏడుపాయల చైర్మన్, ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ నాన్ అఫీషియల్ మెంబర్, డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, సర్పంచ్గా, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ కార్యక్రమాలపై పట్టున్న ఆయన డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. సుప్రభాత్రావు రామాయంపేటకు చెందిన సుప్రభాత్రావు విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా యువతను ఆకట్టుకుంటూ పార్టీ నిర్మాణానికి కృషి చేశారు. 25 ఏళ్లుగా పీసీసీ మెంబర్గా పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లిన తర్వాత డీసీసీ పదవిని ఆశించారు. అప్పట్లో పదవి వస్తుందనుకున్న తరుణంలో ఆంజనేయులుగౌడ్ను వరించింది. ప్రస్తుతం అవకా శం వస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. -
కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలి
మెదక్ మున్సిపాలిటీ: హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డితో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డ్ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. ప్ర తిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను గుర్తు చేయడానికే కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రా రంభించినట్లు తెలిపారు. ఎకరానికి రూ. 15,000 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రూ. 2 లక్షల రుణమాఫీ ఊసేలేదని, రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి చేతులెత్తేశారన్నారు. ఈ మో సాలకు కాంగ్రెస్ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక పైళ్లెన ఆడబిడ్డలకు తులం చొప్పున బంగారం బాకీ అయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి -
ఆయిల్పామ్ సాగుతో లాభాలు
ఏడీ సంధ్యారాణి నర్సాపూర్ రూరల్: ఆయిల్పామ్ సాగుతో మంచి లాభాలు పొందవచ్చని నర్సాపూర్ వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని తుజాల్పూర్లో ప్రసాద్రావు అనే రైతు పొలంలో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీపై డ్రిప్పు అందజేయడంతో పాటు ఆయిల్పామ్ మొక్కలను కేవలం రూ. 20కే అందజేస్తుందన్నారు. నీటి సౌకర్యం సరిగా లేకుండా ఉన్న భూముల్లో సాగు చేసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి సాధించవచ్చని వివరించారు. కార్యక్రమంలో లీవ్ ఫామ్ రిసోర్స్ కంపెనీ టెక్నికల్ పర్సన్ అజయ్, ఏఈఓ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. కౌడిపల్లి(నర్సాపూర్): రైతులందరూ తప్పనిసరిగా పంటల నమోదు చేసుకోవాలని డీఏఓ దేవ్కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని కన్నారంలో పంటల నమోదును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో తిరిగి పంటల నమోదు చేస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో నమోదు ప్రక్రియ ను పరిశీలించినట్లు తెలిపారు. పంటల నమోదు ఆధారంగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు సులభంగా జరుగుతాయని వివరించారు. ఆయన వెంట ఏఓ స్వప్న, ఏఈఓ స్రవంతి ఉన్నారు. -
వరద నష్టం రూ.262 కోట్లు
మెదక్జోన్: మెతుకుసీమలో భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కాగా, చెరువులు, కుంటలు తెగిపోయాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. వే లాది ఎకరాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయి. పలు ఇళ్లు నేలమట్టం కాగా, ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. కాగా వరద నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లాలో ఇటీవల కేంద్ర బృందం విస్తృతంగా పర్యటించింది. సుమారు రూ. 262.76 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ● జిల్లావ్యాప్తంగా ఆర్అండ్బీ రోడ్లు 307 కిలోమీటర్ల మేర ధ్వంసం కాగా, లోలెవెల్, హైలెవెల్ బ్రిడ్జిలు వరదల్లో కొట్టుకుపోయాయి. వీటి తాత్కాలిక మరమ్మతుల కోసం అత్యవసరంగా రూ. 2.56 కోట్లు అవసరం ఉండగా, పర్మనెంట్ పనులు చేసేందుకు రూ. 144 కోట్లు కావాలి. ● పంచాయతీరాజ్శాఖ పరిధిలో 167 కిలోమీటర్ల మేర రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కాగా, ఇందుకోసం రూ. 67 కోట్లు అత్యవసరంగా మంజూరు చేస్తే రోడ్ల మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ● వరదల కారణంగా జిల్లాలో 218 చెరువులు, కుంటలు, నీటి కాలువలు, ఘనపూర్ ప్రాజెక్టు కెనాల్స్తో పాటు పంటలకు సాగు నీరందించే అనేక కాలువలు దెబ్బతిన్నాయి. వీటిలో అత్యవసరంగా 67 చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. వీటి కోసం రూ. 3.16 కోట్లు కావాల్సి ఉందని, పర్మనెంట్ పనులు చేసేందుకు రూ. 22.44 కోట్లు అవసరం ఉందని ఇరిగేషన్శాఖ అంచనా వేసింది. ● జిల్లాలో వరదల కారణంగా 6,470 ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయి. వాటిలో 1,200 ఎకరాల్లో ఇసుక మేటలు పేరుకుపోగా, మిగితా 5,270 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా రూ. 6.47 కోట్లు చెల్లించాల్సి ఉంది. పరిహారం త్వరగా చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ● వరద ఉధృతికి 3,500 విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా, 646 ట్రాన్స్ఫార్మర్లు, ఒక సబ్స్టేషన్ నీటిలో మునిగిపోయింది. దీంతో విద్యుత్శాఖకు రూ. 13.50 కోట్ల నష్టం వాటిల్లింది. ● భారీ వర్షాల కారణంగా మెదక్ పట్టణంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, తూప్రాన్లోని బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలు దెబ్బతిన్నాయి. నూతన భవనాల నిర్మాణానికి రూ. 2.13 కోట్లు అవసరం ఉన్నట్లు విద్యాశాఖ పేర్కొంది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం తెగిన చెరువులు, కుంటలు స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆగస్టు 14 నుంచి మొదలుకుని నేటి వరకు వరద ఉధృతిలోనే ఉంది. సింగూరు నీటిని దిగువకు వదలటంతో భారీగా వరద వస్తోంది. ఆలయానికి సుమారు రూ. 1.50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సంబంధిత అధికారులు అంచనా వేశారు. -
భగీరథ నీళ్లు బంద్
● పైప్లైన్ పగిలి 10 రోజులుగా నిలిచిన నీటి సరఫరా ● దాహార్తిలో ఆరు మండలాల్లోని 449 గ్రామాలు ● మరమ్మతులకు మరో పది రోజులు పట్టవచ్చంటున్న అధికారులు హత్నూర(సంగారెడ్డి)/నర్సాపూర్: పుల్కల్ మండలం వెండికొలు గ్రామ శివారులో పదిరోజుల క్రితం మంజీరా నది నీటిలో పైప్లైన్ పగిలిపోయింది. దీంతో హత్నూర, జిన్నారం, గుమ్మడిదలతోపాటు మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట కౌడిపల్లి ఆరు మండలాల్లో 449 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో ఉండే రక్షిత మంచినీటి బోర్లను కనీసం మరమ్మతులు చేయకపోవడంతో నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నీటి సరఫరా చేసే బోర్లున్నప్పటికీ వాటికి మోటార్లు లేకపోవడం, మరమ్మతులు చేయించకపోవడంతో అవి నిరుపయోగంగా మారా యి. దీంతో ప్రజలు నీటి కోసం వ్యవసాయ బోరు బావులను ఆశ్రయిస్తున్నారు. నర్సాపూర్, దౌల్తాబాద్, పట్టణాలలో కొంతమంది నాయకులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజలకు సరిపోవడం లేదు. పైప్లైన్ మరమ్మతులు చేసేంతవరకై నా తాగునీటికి కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లైనా చేయా లని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సమస్య పరిష్కరించాలని వినతి తాగు నీటి సమస్యను పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ను నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి కోరారు. ఈమేరకు శుక్రవారం మంత్రిని కలిసి నియోజకవర్గంలో నీటి సమస్యను వివరించారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు గోదావరి జలాలను కోమటిబండ నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా శివ్వంపేటలోని సంప్కు మళ్లించి నియోజకవర్గ ప్రజలకు నీటి సరఫరా చేపట్టాలని కోరారు.నీరు తగ్గుముఖం పడితేనే.. పైపులైన్ పగిలిపోవడంతో గ్రామాలకు గత పది రోజులుగా నీరు రావడం లేదు. మంజీరాలో నీళ్లు తగ్గితే పైపులైన్కు మరమ్మతు చేయడానికి వీలవుతుంది. ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. – రఘువీర్, జిల్లా మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ -
పనుల్లో వేగం పెంచండి
కలెక్టర్ రాహుల్రాజ్హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలో నిర్మిస్తున్న అధునాతన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హవేళిఘణాపూర్ శివారులో ని ర్మించిన ఏటీసీని సందర్శించారు. విద్యార్థులకు బోధన, కోర్సుల వివరాలు, ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సెంటర్లో శిక్షణ పొందడం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. కలెక్టర్ వెంట ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏటీసీ నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు. -
పత్తి కొనుగోళ్లకు కపాస్ కిసాన్
● యాప్లో నమోదు చేసుకుంటేనేమద్దతు ధర ● అవగాహన కల్పిస్తున్న అధికారులు సంగారెడ్డి జోన్: పత్తి కొనుగోలు, అమ్మకాలలో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించి అందుబాటులోకి తీసుకువచ్చింది. పత్తి పంట రంగు మారిందని, నాణ్యత లేదని కొర్రీలు చూపిస్తూ రైతుల నుంచి దళారులు దోపిడీకి పాల్పడేవారు. కొనుగోలు చేసే సమయంలో తూకం సరైన విధంగా చేయకపోవడం, కొనుగోలు చేసిన తర్వాత సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం తదితర మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు అనుసంధానం చేస్తూ కపాస్ కిసాన్ యాప్ను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులకు తాము పండించిన పత్తి పంట సులభంగా కొనుగోళ్లు జరుపుకునేందుకు వీలుగా ఉంటుంది. దీనిపై మార్కెటింగ్ శాఖతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నమోదు తప్పనిసరి సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర పొంది పంటను అమ్ముకోవాలంటే ఈ కపాస్ కిసాన్ యాప్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
బాబ్బాబూ.. దరఖాస్తు చేసుకోండి
వ్యాపారులకు ఎకై ్సజ్ అధికారుల ఫోన్లునర్సాపూర్: ‘గతంలో మీరు వైన్ షాపు నిర్వహణ లైసెన్స్ పొందడానికి దరఖాస్తు చేశారు. ఈనెల 18 వరకు గడువు ఉంది.. అవకాశం ఉంటే ఈసారి సైతం దరఖాస్తు చేయండి’ అని ఎకై ్సజ్ అధికారులు వ్యాపారులకు ఫోన్లు చేస్తున్నారు. దసరా రోజు భారీగా దరఖాస్తులు చేస్తారనే నమ్మకంతో పండుగకు ముందే ప్రభుత్వం మద్యం టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు వారాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నా.. వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లేదని తెలిసింది. దీంతో మండలస్థాయి అధికారులతో గతంలో దరఖాస్తు చేసిన వ్యాపారులకు ఫోన్లు చేయిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా దరఖాస్తు రుసుం రూ. 3 లక్షలకు పెంచడం పట్ల పలువురు వ్యాపారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఎకై ్సజ్ సీఐ గులాం ముస్తాఫాను వివరణ కోరగా.. మద్యం దుకాణాల లైసెన్స్ పొందడానికి దరఖాస్తు చేసుకునేందుకు తమ సిబ్బంది వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పా రు. గతంలో దరఖాస్తు చేసిన వారిలో పలువురికి మద్యం వ్యాపారం పట్ల ఆసక్తి ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి ఉందా..? లేదా..? తెలుసుకొని గడువు, తదితర వివరాలను తమ సిబ్బంది వివరిస్తున్నారని పేర్కొన్నారు. -
విద్యార్థినులు అన్నిరంగాల్లో రాణించాలి
హవేళిఘణాపూర్(మెదక్): ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో విద్యార్థినులు పాల్గొనడం అభినందనీయమని ఏఎస్పీ మహేందర్ అన్నారు. గురువారం కూచన్పల్లి జెడ్పీ హైస్కూల్లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థినులు అన్నిరంగాల్లో రాణించడంపై సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సమాజ సేవతో పాటు విద్య, వైద్య, పోలీస్ లాంటి రంగాలను ఎంచుకొని ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీలత, అధ్యాపకులు వెంకటేశ్వర్లు, సుధారాణి అరుంధతి, దీప్తి, గ్రామస్తులు పాల్గొన్నారు.ఏఎస్పీ మహేందర్ -
కాలుష్య తనిఖీల జాడెక్కడ?
● పరిమితికి మించి వెలువడుతున్న ఉద్గారాలు ● పట్టించుకోని రవాణాశాఖ అధికారులు జిల్లాలో 1.88 లక్షల వాహనాలుమెదక్ మున్సిపాలిటీ: పెరుగుతున్న అవసరాలతో ఇంటికో వాహనం తప్పనిసరైంది. వీటితో పాటు కాలుష్యం కూడా పెరుగుతోంది. జిల్లాలో 1.88 లక్షల వాహనాలు ఉండగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిపోయే వాహనాలు మరో లక్ష వరకు ఉంటాయని అంచనా. దీంతో పరిమితికి మించి ఉద్గారాలు వెలువడుతున్నాయి. తనిఖీలు చేసి నియంత్రించాల్సిన రవాణాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆరునెలలకోసారి తప్పనిసరి మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి తనిఖీలు చేయాలి. అయితే పర్యవేక్షించాల్సిన రవాణాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనాల కాలుష్యాన్ని పరిక్షించడం కోసం ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో నిబంధనల ప్రకారం పొల్యూషన్ పరీక్షలు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. డబ్బుల కోసం నామమాత్రంగా పరీక్షలు చేసి పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పొల్యూషన్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తున్న పీయూసీ రవాణా శాఖ అధికారులు, తనిఖీల జోలికి మాత్రం వెళ్లడం లేదు. సదరు వాహనం నిర్దేశించిన పొల్యూషన్ పరిధిలో ఉందా? లేదా? అనేది విధిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇష్టారాజ్యంగా పొల్యూషన్ సర్టిఫికెట్లు పొల్యూషన్ తనిఖీ కేంద్రాలు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా పీయూసీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో మొత్తం 1.88 లక్షల వాహనాలు ఉండగా, వీటిలో 15 ఏళ్ల కాలం తీరిన వాహనాలు వేలల్లో ఉన్నాయి. ఆటోలు, లారీలు మరమ్మతుల కారణంగా పరిమితికి మించి పొగను వదులుతూ వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇలాంటి వాహనాలను గుర్తించి సీజ్ చేయాల్సిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. వాతావరణం కలుషితం కాలం చెల్లిన వాహనాలు వదిలిన పొగతో వాతావరణం కలుషితమై ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అన్నిరకాల వాహనాలు నిర్దేశించిన విధంగా పొగను వదులుతున్నాయా? లేదా అని పరిశీలించేందుకు జిల్లాలో పొల్యూషన్ కేంద్రాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ కేంద్రాల నిర్వాహకులు నిబంధనల ప్రకారం వాహనాలను పరీక్షించి అవి వదులుతున్న కలుషితమైన పొగ ఏ మేరకు ఉందని వెల్లడించకుండా జిల్లా రావాణా శాఖ అధికారులు పీయూసీ జారీ చేస్తున్నారు. అయితే జిల్లాలో పొల్యూషన్ తనిఖీ చేసేందుకు మొత్తం 9 మోబైల్ వాహనాలు ఉన్నప్పటికీ, అవి ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. కాగా విద్యాసంస్థల బస్సులు, లారీలు, కమర్షియల్ వాహనాలు మాత్రమే పొల్యూషన్ పరీక్ష చేయించుకుంటున్నాయి. ద్విచక్ర వాహనాలు పది శాతం కూడా పరీక్షలు చేయించుకోవడం లేదు. ఆర్టీఏ, పోలీస్ అధికారులు పట్టుకున్నప్పుడు నామమాత్రపు జరిమానాతో తప్పించుకుంటున్నారు. ఇదే విషయమై ఇన్చార్జి డీటీఓ వెంకటస్వామిని వివరణ కోరగా.. తనిఖీలు చేయకుండా పీయూసీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. అలా జరిగినట్లు తేలితే చర్యలు చేపడుతామని తెలిపారు. -
అభ్యర్థుల ఉత్సాహంపై నీళ్లు
● నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను షురూ చేసినట్లు ప్రకటించిన ఆర్ఓలు ● తీరా బీసీ రిజర్వేషన్ల జీఓపైస్టే విధించిన హైకోర్టు ● వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలు మెదక్జోన్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గురువారం ఆసక్తిరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి విడతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 10.30 గంటల నోటిఫికేషన్ జారీ అయింది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. తీరా సాయంత్రం బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ నంబర్ 9పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సైతం వాయిదా పడింది. దీంతో ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన అభ్యర్థుల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. ఆశావహులకు నిరాశే మిగిలింది. రిజర్వేషన్లు కలిసి రాని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయోమయం.. ఉత్కంఠ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీఓ నంబర్ 9ని జారీ చేసింది. ఈ జీఓను రద్దు చేయాలని, మద్దతుగా పలువురు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు గురువారం జీఓ 9పై స్టే విధించింది. కౌంటర్లు దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి, పలువురు పిటీషనర్లకు ఆరువారాల పాటు గడువు ఇచ్చింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నాయకుల్లో ముందు నుంచి అయోమయమే నెలకొంది. ఎన్నికల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పును ఇ స్తుంది. అనే దానిపై ఉత్కంఠగా ఎదురు చూశారు. రిజర్వేషన్లు అనుకూలించిన వారు పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థిత్వం ఎంపికపై కసరత్తు చేశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, నాయకులు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశాయి.ఈ నేపథ్యంలో గురువారం రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చా రు. కోర్టు విచారణ నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. -
నిర్బంధాలు మాకు కొత్త కాదు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డిమెదక్ మున్సిపాలిటీ: పోలీస్ నిర్బంధాలు మాకు, మా పార్టీకి కొత్త కాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ గురువారం పార్టీ ఛలో బస్ భవన్కు పిలుపునిచ్చింది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ఎదుట భారీగా పోలీసులను మోహరించి ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈసందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో బస్సు చార్జీలు పెంచలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 22 నెలలకే చార్జీలు పెంచడం సరికాదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అంటూనే చార్జీలు పెంచడంతో సామాన్యలపై భారం పడుతుందన్నారు. బస్భవన్్కు వెళ్లకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను నాయకుల ఇళ్ల వద్దకు పంపారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకునే వరకు నిరసన తెలుపుతూనే ఉంటామన్నారు. వినతిపత్రం ఇస్తామంటే హౌస్ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. -
కోలాహలం.. నిరుత్సాహం
స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్చిన్నశంకరంపేట(మెదక్): స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో గురువారం ఉదయం కన్పించిన ఉత్సాహం సాయంత్రం కోర్టు తీర్పుతో నీరుగారింది. మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటుతో పాటు నామినేషన్ల స్వీకరణకు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి నాయకుల రాకపోకలతో కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పలువురు నాయకులు నామినేషన్ పత్రాలను సైతం తీసుకెళ్లారు. తీరా సాయంత్రం హైకోర్టు స్టే విధించడంతో నిరుత్సాహానికి గురయ్యారు. అప్పటి వరకు హడావిడి చేసిన అధికారులు సైతం సైలెంటయ్యారు. హెల్ప్డెస్క్ కోసం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన టెంట్ను సిబ్బంది తొలగించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఆయా రాజకీయ పార్టీల నాయకులు హడావిడి చేశారు. మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో బీఆర్ఎస్ మండలస్థాయి ముఖ్య కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. ఎంపీటీసీ అభ్యర్థుల కసరత్తు కోసం గ్రామాల వారీగా గ్రూపు మీటింగ్ ఏర్పాటుచేశారు. ఈక్రమంలోనే హైకోర్టు స్టే విషయం తెలుసుకొని అర్ధంతరంగా సమావేశం ముగించారు. బీజేపీ నాయకులు ఉదయం నామినేషన్ పత్రాలు తీసుకొని జిల్లా కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్ నాయకులు సైతం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. తీరా హైకోర్టు ఎన్నికలపై నాలుగు వారాలు స్టే విధించడంతో అవాక్కయ్యారు. టెంట్ను తొలగిస్తున్న సిబ్బందినామినేషన్ పత్రాల కోసం వస్తున్న నాయకులుటెంట్ను తొలగిస్తున్న సిబ్బందినామినేషన్ పత్రాల కోసం వస్తున్న నాయకులు -
కాంగ్రెస్లోకి మాజీ జెడ్పీటీసీ
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మాజీ జెడ్పీటీసీ, మాజీ ఏఎంసీ చైర్మన్ పోతరాజ్ రమణ కాంగ్రెస్లో చేరారు. గురువారం డీసీసీ అధ్యక్షుడు అంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో పార్టీలో చేరారు. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరిన రమ ణ, ఎన్నికల అనంతరం క్రియాశీల రాజకీయా లకు దూరంగా ఉన్నారు. మైనంపల్లి పిలుపుతో తిరిగి హస్తం గూటికి చేరుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాన సత్యనారాయణ, ప్రభాకర్, రాజ్కుమార్, ఉదయ్ ఉన్నారు. -
మళ్లీ కల్లాలొస్తున్నాయ్..
● ‘ఉపాధి’లో నిర్మాణానికికేంద్రం అంగీకారం ● జిల్లా రైతులకు చేకూరనున్న లబ్ధి ● గతంలో 2,500 కల్లాల నిర్మాణం రామాయంపేట(మెదక్): రైతులు పంట ఉత్పత్తులను ఆరబోసుకోవడానికి వీలుగా ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణానికి తాజాగా కేంద్రం అంగీకారం తెలిపింది. దీంతో జిల్లాలోని రైతులకు లబ్ధి చేకూరనుంది. గతంలో రెండేళ్లపాటు అమలులో ఉన్న ఈ పథకం కింద జిల్లావ్యాప్తంగా సుమారు 2,500 మంది రైతులు కల్లాలు నిర్మించుకున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు ధాన్యం ఆరబెట్టుకోవడానికి సరైన స్థలం లేకపోవ డంతో ఇళ్ల ఎదుట, సమీపంలోని రహదారులపై రైతులు ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా రోడ్లపై ఆరబోసిన ధాన్యం కుప్పలు ఢీకొని జిల్లాలో సుమారు 8 మంది మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. అలాగే రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసినందుకు 10 మందికిపైగా రైతులపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. ధాన్యాన్ని ఆరబెట్టడానికి గాను అద్దె ప్రాతిపదికన టార్పాలిన్లు తీసుకుంటున్న వారు ఏటా కనీసం రూ. రెండు నుంచి రూ.మూడు వేల వరకు నష్టపోతున్నారు. అర్ధంతరంగా ఆగిన నిర్మాణాలు ఈ పథకం అమలులో ఉండగానే జిల్లా పరిధిలో 550 మందికిపైగా రైతులు ఎంపీడీఓ కార్యా ల యాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈమేరకు కొందరు నిర్మాణాలకు సంబంధించి ముగ్గు పోసుకొని పునాదుల తవ్వకాలు చేపట్టారు. ఈక్రమంలో అర్ధంతరంగా కల్లాల నిర్మాణ పథకాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ పథకాన్ని ప్రారంభించిన ఏడాదిన్నరకే రద్దు చేసిన కేంద్రం, పలువర్గాల విజ్ఞప్తి మేరకు తాజాగా అంగీకరించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పెద్ద సంఖ్యలో రైతులు కల్లాలు నిర్మించుకోనున్నట్లు సమాచారం. ఇబ్బంది పడుతున్నాం కల్లాల నిర్మాణానికి సంబంధించి కేంద్రం వెంటనే అనుమతులు మంజూరు చేయాలి. ఈ పథకాన్ని రద్దు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. రోడ్లపై ధాన్యం ఆరబోస్తున్న క్రమంలో ప్రమాదాలు సైతం జరిగాయి. – రాజయ్య, రైతు, కాట్రియాల కల్లాల నిర్మాణం అత్యవసరం ధాన్యం ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికి రైతులకు కల్లాల నిర్మాణం అత్యవసరం. గతంలో ఒకసారి కేంద్రం అనుమతించగా, సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది నిర్మించుకోలేదు. ప్రస్తుతం మళ్లీ కేంద్రం కల్లాల నిర్మాణానికి అనుమతించడం సంతోషకరం. – గోపాల్, రైతు, దంతేపల్లి తండా -
ఆర్టీఐ సేవల్లో జిల్లాకు రెండో స్థానం
మెదక్ కలెక్టరేట్: సమాచార హక్కు చట్టం నిర్వహణలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు రెండోస్థానం దక్కింది. సమాచార హక్కు చట్టం వారోత్సవాలు గురువారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా కలెక్టర్ రాహుల్రాజ్ అవార్డు అందుకున్నారు. 19 నెలల కాలంలో సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో నిబద్ధతకు ప్రతిభా పురస్కారం అందజేశారు. ఆర్టీఐ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పెండింగ్ లేకుండా వ్యవహరిస్తున్నందుకు గాను జిల్లాకు ఈ అవార్డు దక్కింది. అధికారులు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిగజ్వేల్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లికి చెందిన బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బాల్రాజు, యూత్ ప్రెసిడెంట్ వెంకట్తోపాటు పలువురు నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రూ.2 లక్షల రుణమాఫీ, సన్న బియ్యం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి కార్యక్రమాలతో గ్రామీణ సమాజంలో పరివర్తనకు నాందిపలుకుతున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలన పూర్తిగా అవినీతిమయంగా సాగిందన్నారు. బీఆర్ఎస్ చేసిన మోసాలను వివరిస్తూ ఢోకా కార్డుల పేరుతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం
మెదక్జోన్: {MîSyýlË$ Ð]lÅMìS¢™èlÓ ÑM>-Ýë-°MìS, {MýSÐ]l$Õ„ýS-׿MýS$, ÔèæÈÆý‡ §éÆý‡$-ÉéŰMìS G…™èl-V>¯ø §øçßæ§ýl-ç³-yýl-™éĶæ$° yîlDK Æ>«§éMìS-çÙ¯ŒS A¯é²Æý‡$. ´ëuý‡Ô>ÌS {MîSyé çÜÐ]l*QÅ B«§ýlÓÆý‡Å…ÌZ º$«§ýl-ÐéÆý‡… hÌêÏ MóS…{§ýl…ÌZ° þ°Ä¶æ$ÆŠḥæ MýSâêÔ>Ë OOÐðl$§é¯]l…ÌZ °Æý‡Ó-íßæ…-_¯]l MýSºyîlz ´ùsîæ-ÌSMýS$ hÌêÏ ¯]lË$-Ð]lÊ-ÌSÌS ¯]l$…_ »êÌS, »êÍ-MýSË$ àf-Æý‡-Ķæ*ÅÆý‡$. Ð]l¬W…ç³# M>Æý‡Å{MýS-Ð]l*-°MìS Ð]l¬QÅ A†¤V> yîlDK àfOÆð‡ Ñgôæ-™èl-ÌSMýS$ ºçßæ$Ð]l$-™èl$Ë$ A…§ýl-gôæ-Ô>Æý‡$. A¯]l…-™èlÆý‡… G‹Ü-i-G‹œ M>Æý‡Å-§ýlÇØ ¯éVýSÆ>k Ð]l*sêÏ-yýl$-™èl*.. {糆¿ýæ MýS¯]l-º-Ça¯]l ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ ¯ðlÌS 10¯]l çÜ…V>Æð‡-yìlzÌZ fÆý‡-VýS-¯]l$¯]l² EÐ]l$Ãyìl Ððl$§ýlMŠS hÌêÏ ´ùsîæÌZÏ ´ëÌŸY…-sêÆý‡° ™ðlÍ-´ëÆý‡$. M>Æý‡Å{MýS-Ð]l$…ÌZ Æ>çÙ‰ ï³Dsîæ çÜ…çœ$… M>Æý‡Å-°-Æ>Ó-çßæMýS A«§ýlÅ„ýS$yýl$ }°-Ðé-çÜ-Æ>Ð]l#, ï³yîlË$ ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. పంట నష్టం అంచనా కొల్చారం(నర్సాపూర్): గత నెల రోజులకుపైగా సింగూరు నుంచి ఘణపురం ఆనకట్టకు ఎడతెరిపి లేకుండా వస్తున్న వరద నీటితో మండలంలోని మంజీరా పరివాహక గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. బుధవారం చిన్నఘనాపూర్ పరిధిలో నీట మునిగిన పంటలను ఏఈఓ రాజశేఖర్రెడ్డి రైతులతో కలిసి సందర్శించారు. దాదాపు 62 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వరద కారణంగా పంట నష్టపోయిన రైతుల వివరాలను పొందుపరుస్తూ పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం చిలప్చెడ్(నర్సాపూర్): బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీడబ్ల్యూఓ హేమభార్గవి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. చిలప్చెడ్లో మైనర్ బాలికను 34 ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకోవడంతో పెళ్లి కొడుకుతో పాటు సహకరించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు అయిందన్నారు. బాల్య వివాహాలకు పాల్పడిన, సహకరించిన చట్టరీత్యా నేరమని అన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే 1098, 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఓటరు జాబితా కోసం ప్రత్యేక వెబ్సైట్ మెదక్ కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాలో పేరును సులువుగా తెలుసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటర్లు తమ వివరాలను ఈ సైట్ ద్వారా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. టీఎస్ఈసీ వెబ్సైట్కు వెళ్లి మొత్తం జాబితా పరిశీలించవచ్చు. లేదా ఎపిక్ నంబర్ ఆధారంగా ఓటరు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. సదరు ఓటరు ఏ వార్డు పరిధికి చెందితే ఆ వార్డు పేజీని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. వార్డు పరిధిలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉంటే వారి వివరాలు తెలుసుకోవచ్చు. రోడ్డును బాగు చేయించండి మనోహరాబాద్(తూప్రాన్): మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి, కాళ్లకల్ పరిశ్రమల వాడ రోడ్డును బాగు చేయించాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును స్థానికులు కో రారు. బుధవారం మండల కేంద్రానికి వచ్చి న సందర్భంగా వారికి వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మహిపాల్రెడ్డి, నాయకులు నర్సింహా, నాగరాజు, నరేష్, రంగాచారి, రాంచందర్, వెంకటేష్, పెంటన్న, మహేష్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పరిషత్ సంగ్రామం
మెదక్జోన్/మెదక్కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక ఘట్టానికి గురువారం తెరలేవనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఉదయం 10.30 గంటలకు ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ జారీ కానుంది. ఆయా మండలాల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓలు) ఈ నోటిఫికేషన్ను జారీ చేస్తారు. వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉంటుంది. ఈ మేరకు 21 జెడ్పీటీసీ స్థానాలకు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ కొనసాగిస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్ అధికారులను ఆర్ఓలుగా నియమించారు. ఇక ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ప్రతీ రెండు, మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒక ఆర్ఓను నియమించారు. క్లస్టర్ స్థాయిల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. గెజిటెడ్ అధికారులు, హెచ్ఎంలు, సూపరింటెండెంట్ కేడర్ అధికారులకు ఎంపీటీసీ స్థానాల ఆర్ఓలుగా వ్యవహరిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ కేడర్ అధికారులను ఏఆర్ఓలుగా నియమించారు. రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం విదితమే. ఈ వాదనలు గురువారం కూడా కొనసాగనున్నాయి. బుధవారం హైకోర్టు ఎలాంటి స్టే విధించకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం యథావిధిగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనుంది. మెదక్ డివిజన్లో.. మొదటి విడత జిల్లాలో 21 మండలాలు ఉండగా, 21 ఎంపీపీ, 21 జెడ్పీటీసీ 190 ఎంపీటీసీలు స్థానాలు ఉన్నాయి. మొదటి విడతలో మెదక్ డివిజన్ పరిధిలోని రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, మెదక్, హవేళిఘణాపూర్, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, పెద్దశంకరంపేట మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించనున్నారు. 10 జెడ్పీటీసీ, స్థానాలకు ఎన్నికలు కొనసాగనుండగా, మెదక్ డివిజన్ పరిధిలోకి వచ్చే 91 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లోని 11 మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ముహూర్తాలు చూసుకుంటున్న అభ్యర్థులు ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ముహుర్తాలు చూసుకుంటున్నా రు. ఈ మూడు రోజుల్లో వారికి కలిసి వచ్చే రోజు చూసుకొని నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సైతం వేగం పెంచింది. íܧýl®…V> E…yýl…yìl: MýSÌñæMýStÆŠæḥ మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి జిల్లాలో జరిగే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన ఎన్నికల అధికారులు, సిబ్బందితో నామినేషన్ల ప్రక్రియపై గూగుల్ మీట్ నిర్వహించారు. మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఆర్వో, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రిపోర్టులను ఎప్పటికప్పుడు పంపిస్తున్నామని చెప్పారు. -
అన్నీ ఉన్నా.. అకాడమీ ఏదీ?
అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది మెతుకుసీమ పరిస్థితి. రూ. కోట్లు వెచ్చించి జిల్లా కేంద్రంలో నిర్మించిన సింథటిక్ ట్రాక్ను అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా అది వృథాగా మారింది. కానీ ట్రాక్ విషయం తెలుసుకున్న రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఆర్మీ అభ్యర్థులు 80 మందికిపైగా ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నారు. – మెదక్జోన్ జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం అథ్లెటిక్స్ అకాడమీని ప్రారంభించి సింథటిక్ ట్రాక్ను మట్టితో నిర్మించింది. ఆ ట్రాక్పై ఎంతో మంది క్రీడాకారులు శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. కాగా 2018లో సింథటిక్ ట్రాక్ నిర్మాణం కోసం రూ. 6.20 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో ట్రాక్ నిర్మాణంతో పాటు అథ్లెటిక్స్ అకాడమీ భవన మరమ్మతులు, మరుగుదొడ్లు, కిచెన్షెడ్ తదితర పనులు చేశారు. కాగా నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఇక్కడ శిక్షణలో ఉన్న అథ్లెటిక్ క్రీడాకారులను హైదరాబాద్లోని గచ్చిబౌలికి పంపించారు. 2020లో నిర్మాణం పూర్తయినా, హైదరాబాద్కు తరలించిన అథ్లెటిక్స్ అకాడమీని తిరిగి రప్పించే విషయంలో అధికారులు, పాలకులు విఫలం అయ్యారు. ఫలితంగా రూ. కోట్లాది రూపాయలతో నిర్మించిన సింథటిక్ ట్రాక్ వృథాగా మారింది. వెతుకుంటూ వచ్చారు ఆర్మీ ఎంట్రెన్స్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు హన్మకొండలో వచ్చే నెల 10 నుంచి 23వ తేదీ వరకు ఫిజికల్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 1600 మీటర్ల రన్నింగ్, లాంగ్, హైజంప్ లాంటి టెస్టులు నిర్వహించనున్నారు. కాగా ఆయా జిల్లాలో శిక్షణ పొందేందుకు సింథటిక్ ట్రాక్ లేకపోవటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 80 మందికిపైగా అభ్యర్థులు మెదక్ సింథటిక్ ట్రాక్పై గత కొన్ని రోజులుగా శిక్షణ పొందుతున్నారు.శిక్షణలో భాగంగా రన్నింగ్ చేస్తున్న ఆర్మీఅభ్యర్థులుమెదక్లో వృథాగాసింథటిక్ ‘ట్రాక్’ రూ. 6.20 కోట్లు వెచ్చించి నిర్మాణం పట్టించుకోని పాలకులు శిక్షణ పొందుతున్న ఆర్మీ అభ్యర్థులు మా జిల్లాలో లేదు మా జిల్లాలో సింథటిక్ ట్రాక్ లేదు. ఇక్కడ ట్రాక్ ఉందని తెలుసుకొని మా కోచ్తో పాటు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నాం. వచ్చే నెల 10 నుంచి ఆర్మీ ఈవెంట్స్ ఉన్నాయి. ట్రాక్పై శిక్షణ తీసుకోవటంతో ఈవెంట్స్లో రాణిస్తామనే నమ్మకం వచ్చింది. – మమత, వనపర్తి జిల్లా క్రీడాభివృద్ధికి కృషి చేయాలి జిల్లా కేంద్రంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణం పూర్తయి ఐదేళ్లు అవుతోంది. ట్రాక్ నిర్మాణంలో ఉండగా ఇక్కడి నుంచి అథ్లెటిక్ అకాడమీని హైదరాబాద్లోని గచ్చిబౌలికి తరలించారు. ఆ అకాడమీని తిరిగి రప్పించాలని ఎంతో మంది నేతలను వేడుకున్నాం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి అకాడమీని రప్పించి ఈ ప్రాంతంలో క్రీడా అభివృద్ధికి కృషి చేయాలి. – మధుసూదన్, అథ్లెటిక్ జిల్లా కార్యదర్శి -
అక్షరాస్యత దిశగా మహిళలు
చేగుంట(తూప్రాన్): మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యాశాఖ యాక్షన్ప్లాన్ రూపొందించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి చదువులు పూర్తి చేయించనుంది. ఇందుకోసం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గ్రామాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు కేవలం ఏడో తరగతి వరకు మాత్రమే ఉంటాయి. ఈ కారణంతో గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు ఏడో తరగతి లేదా పదో తరగతి వరకు మాత్రమే చదువు పూర్తి చేసుకునేవారు. ఈవిషయం క్షేత్రస్థాయిలో తెలుసుకున్న అధికారులు మహిళా సంఘాల సభ్యుల్లో ఏడో తరగతి పూర్తి చేసిన వారిని పదో తరగతి, పది పూర్తి చేసిన వారిని ఇంటర్ వరకు పరీక్షలు దూర విద్య ద్వారా రాయించేలా చర్యలు చేపట్టారు. చేగుంట మండలంలో 35 గ్రామైక్య సంఘాలు ఉండగా, 60 మందిని పదో తరగతి, 60 మంది ఇంటర్ పరీక్షలు రాయించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దూరవిద్య ద్వారా మహిళలు పదో తరగతి, ఇంటర్ పూర్తి చేస్తే స్వయం ఉపాధి కోసం సులభంగా రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
మరో విడత వచ్చేశాయి
జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలుఇంకా రావాల్సినవి 12,750వచ్చినవి 1,64,300మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు రెండో విడత పాఠ్య పుస్తకాలు సరఫరా చేయనున్నారు. జిల్లాలో మొదటి విడత పాఠ్య పుస్తకాలు (పార్ట్–1) జూన్లో విద్యార్థులకు అందజేశారు. తాజాగా రెండో విడతవి జిల్లా కేంద్రంలోని గోదాంకు చేరుకున్నాయి. వీటిని గురువారం నుంచి ఎమ్మార్పీలకు తరలించనున్నారు. అనంతరం పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేయనున్నా రు. జిల్లాకు 1,77,050 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, ప్రస్తుతం 1,64,300 వచ్చాయి. ఇంకా 12,750 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలలు 629 ఉండగా 25,911 మంది విద్యార్థులు, 128 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా 8,754 మంది, 146 ఉన్నత పాఠశాలలు ఉండగా 28,878 మంది, 19 కేజీబీవీలు ఉండగా 4,001 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా 3వ తరగతి గణితం, 4వ తరగతి ఈవీఎస్ పుస్తకాలు రావాల్సి ఉంది. -
వరద నష్టంపై ఆరా
మెదక్కలెక్టరేట్/హవేళిఘణాపూర్(మెదక్)/ రామాయంపేట/నిజాంపేట/పాపన్నపేట: ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం బుధవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించింది. మొదటగా కలెక్టరేట్కు చేరుకున్న కేంద్రం బృందం సభ్యులు డాక్టర్ పొన్నుస్వామి, వినోద్ కుమార్, అభిషేక్ కుమార్, ఎస్ఎస్పింటులకు కలెక్టర్ రాహుల్రాజ్ స్వాగతం పలికారు. కలెక్టరేట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వరద నష్టం తీరును వివరించారు. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మండలాల్లో పర్యటించారు. వారి వెంట కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, ఇతర అధికారులు ఉన్నారు. జిల్లాలో కేంద్ర బృందం పర్యటన దెబ్బతిన్న రోడ్లు, పంటల పరిశీలన -
న్యాయవాదుల నిరసన
హుస్నాబాద్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం.. న్యాయ వ్యవస్థపై దాడి చేయడమేనని హుస్నాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం న్యాయవాదుల ఆధ్యర్వంలో కోర్టు ఎదుట విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అలాగే నాలుగు రోజుల పాటు విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏజీపీ సదానందం, న్యాయవాదులు మల్లేశం, కన్నోజు రామకృష్ణ, ప్రవీణ్, హుస్నాబాద్ జేఏసీ కో–ఆర్టినేటర్ వీరన్నయాదవ్, నాయకులు గంపల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎన్నికల ఖర్చుపై నిఘా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై నిఘా ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుకు వీలు లేదని, ఇందుకు పరిమితులు ఉంటాయని చెబుతున్నారు. జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.4 లక్షలకు మించరాదు. అలాగే ఎంపీటీసీ అభ్యర్థి వ్యయం రూ.1.50 లక్షల లోపు ఉండాలి. ఇక సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు కూడా ఓ లెక్క ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఐదు వేల జనాభా లోపు ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి అభ్యర్థి ఖర్చు రూ.1.50 లక్షల లోపు అలాగే వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.30 వేల లోపు ఉండాలి. మరోవైపు ఐదు వేలకు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు బరిలోకి దిగుతున్న అభ్యర్థులకు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యునికి ఖర్చు రూ.50 వేలు ఉండాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి చెబుతోంది. ఖర్చు చేసే ప్రతీ రూపాయి బ్యాంకు లావాదేవీల ద్వారానే జరగాల్సి ఉంటుంది. ఆయా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసే రోజుకంటే ఒకరోజు ముందుగా ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలి. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తమ ఎన్నికల ఖర్చు వివరాలను తెలపాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పరిశీలకుల నియామకం స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టేందుకు మండల స్థాయిలో సహాయక పరిశీలకులను (అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు) నియమించారు. గెజిటెడ్ అధికారుల నుంచి ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులను ఈ పరిశీలకులుగా నియమించారు.లెక్కలు తప్పనిసరిస్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఓ స్థాయిలో ఖర్చు చేస్తుంటారు. ప్రధానంగా పట్టణీకరణ ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు, మండలాల్లో అభ్యర్థుల ఖర్చు భారీగానే ఉంటుంది. ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, పోస్టర్లు, కరపత్రాలు, కండువాలు, క్యాప్లు, టీషర్టులు వంటి ఖర్చులు ఉంటాయి. జెడ్పీటీసీ అభ్యర్థులు సమావేశాలు సైతం నిర్వహిస్తుంటారు. ఎన్నికల ప్రచారానికి వాహనాలను వినియోగిస్తుంటారు. ఇలా అభ్యర్థులు తాము పెట్టే ఎన్నికల ఖర్చుకు లెక్కలు చూపాలని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల విషయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు పాటించాలని ఎక్స్పెండిచర్ మానిటరింగ్ నోడల్ అధికారి, జిల్లా ఆడిట్ అధికారి బలరాం ‘సాక్షి’తో పేర్కొన్నారు.జెడ్పీటీసీకి రూ.4 లక్షలు.. ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు అభ్యర్థులు వెచ్చించే వ్యయంపై పరిమితులు మండలస్థాయిలో సహాయక పరిశీలకులు అభ్యర్థులు ఎంసీసీని పాటించాలంటున్న అధికారులు -
ఆశల పల్లకిలో..
ఎవరికి వారు.. ప్రయత్నాల జోరు ● అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు ● ఫైనల్ లిస్టు కోసం నిరీక్షణనర్సాపూర్: రిజర్వేషన్ల జీఓపై హైకోర్టులో కేసు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ నేపథ్యంలో నర్సాపూర్ మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల కోసం ఆయా పార్టీల్లో పలువురు నాయకులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు పదవుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో నాయకులు తమకే టికెట్ ఇవ్వాలని పోటీ పడుతున్నారు. కాగా బీసీ కేటగిరిలో ఉన్న ఎంపీటీసీ స్థానాలతో పాటు జనరల్ ఎంపీటీసీ స్థానం ఉన్న ప్రాంతాలకు చెందిన పలువురు ఆయా పార్టీల నాయకులు ఎంపీపీ అధ్యక్ష పీఠంపై దృష్టి పెట్టి పార్టీ అగ్ర నాయకుల వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీపీ అధ్యక్ష పదవి బీసీ జనరల్ నర్సాపూర్ ఎంపీపీ అధ్యక్ష పదవి బీసీ జనరల్కు కేటాయించబడింది. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీపీ అధ్యక్ష పదవి కోసం రుస్తుంపేటకు చెందిన మాజీ సర్పంచ్ అశోక్, చిన్నచింతకుంటకు చెందిన మాజీ ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ తన భార్య అనురాధ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. కాగా బీఆర్ఎస్ నుంచి పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బోగ చంద్రశేఖర్తో పాటు అదే పార్టీకి చెందిన ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్ తన కుమారుడు సుదీప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఇదిలాఉండగా బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు నగేశ్ భార్య నవనీత, పెద్దచింతకుంటకు చెందిన గుర్రాల వాణితో పాటు మరో నాయకుని పేర్లతో కూడిన జాబితాను బీజేపీ మండల శాఖ పార్టీ రాష్ట్ర అధిష్టానానికి పంపినట్లు తెలిసింది. సందిగ్ధంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బోగ చంద్రశేఖర్ ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల్లో ఏ పదవికి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఎంపీపీ అధ్యక్ష పదవి బీసీ జనరల్కు కేటాయించగా, జెడ్పీటీసీ బీసీ మహిళకు రిజర్వేషన్లో కేటాయించారు. కాగా ఎంపీపీ కోసం తాను ఎంపీటీసీగా పోటీ చేయాలా లేక జెడ్పీటీసీ పదవికి తన భార్య రాణిని పోటీలో నిలపాలా? అనే సందిగ్ధంలో ఉన్నాడని, తన మిత్రుల సలహాలు తీసుకుంటున్నాడని చెబుతున్నారు. ఇదిలా ఉండగా పార్టీ అధిష్టానం ఏ పదవికి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తారోననే డైలమాలో సైతం ఉన్నట్లు తెలిసింది. జెడ్పీటీసీకి ప్రయత్నాలు షురూ.. నర్సాపూర్ జెడ్పీటీసీ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ భార్య సంధ్యను పోటీలో నిలిపే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అదే పార్టీ నుంచి చిప్పల్తుర్తికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సురేశ్గౌడ్ తన భార్య స్వప్నకు టికెట్ కోసం పార్టీ అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. కాగా బీఆర్ఎస్ నుంచి మండలంలోని మూసాపేటకు చెందిన రవి తన భార్య సునీతకు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా బీజేపీ నుంచి ముగ్గురి పేర్లను మండల పార్టీ రాష్ట్ర అధిష్టానానికి పంపినట్లు తెలిసింది. -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
నిజాంపేట(మెదక్): స్థానిక ఎన్నికల నేపథ్యంలో నిజాంపేట మండలంలోని సమస్యాత్మకమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, చల్మెడ, కల్వకుంట, నార్లాపూర్ గ్రామాలల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఆయనతో పాటు రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్, నిజాంపేట ఎస్ఐ రాజేశ్, ఎంపీడీఒ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. మెరుగైన బోధన చేయాలి డీఈఓ రాధాకిషన్ శివ్వంపేట(నర్సాపూర్): చదువులో వెనకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈఓ రాధాకిషన్ ఉపాధ్యాయులు సూచించారు. మంగళవారం మండలంలోని చండి, దొంతి, కొంతంపల్లి, దంతాన్పల్లి పలు పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులతో చేతిరాత రాయించడంతోపాటు గణితంలో చతుర్విద ప్రక్రియలు చేయించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అకాడమిక్ మానిటర్ అధికారి సుదర్శన మూర్తి, నవీన్, రాజు సీఎస్ఎఫ్ ఫౌండేషన్ సభ్యులు సిరి ఆదిత్య, ఎంఈఓ బుచ్చా నాయక్ పాల్గొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రవిబాబు చేగుంట(తూప్రాన్): చేగుంటలోని మోడల్ పాఠశాలలో పని చేస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రవిబాబుకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు వరించింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ చంద్రకళ తెలిపారు. జాతీయ క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన కార్మక్రమంలో రవిబాబుకు అవార్డు అందుకున్నారని చెప్పారు. కాగా, రవిబాబుకు అవార్డు రావడం పట్ల పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. నేషనల్ చాంపియన్షిప్కు ఎంజేపీ విద్యార్థి హవేళిఘణాపూర్(మెదక్): మహాత్యాజ్యోతిరావుపూలె బాలుర రెసిడెన్షియల్ హవేళిఘణాపూర్ విద్యార్థి జశ్వంత్ నేషనల్ –2025 చాంపియన్షిప్కు ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ సృజన మంగళవారం తెలిపారు. ఎంజేపీ బాలుర పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి జశ్వంత్ అక్టోబర్ చివరి వారంలో కర్ణాటక రాష్ట్రంలో జరిగే నేషనల్ లెవెల్ పోటీల్లో పాల్గొననున్నాడని పేర్కొన్నారు. నేషనల్ లెవెల్ చాంపియన్షిప్కు ఎంపిక కావడం పట్ల పాఠశాల అధ్యాపకులు సంతోశ్, విద్యార్థులు తదితరులు అభినందించారు. -
రుణ లక్ష్యాలు సాధించాలి
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ ,ప్రైవేటు బ్యాంకర్లు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ బ్యాంకు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్ నుంచి జిల్లాలోని పలు బ్యాంకుల అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఎక్కువగా వర్షాలు పడటం వల్ల ఖరీఫ్, రబీ సీజన్లో సమృద్ధిగా పంటలు పండే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ కల్లా 80 శాతం రుణ లక్ష్యాలు సాధించాలన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, స్వయం సహాయక, ముద్ర, ఎంఎస్ఎంఈ, సూక్ష్మ, చిన్న , మీడియం ఎంటర్ప్రైజెస్లకు నిర్దేశించిన రుణాలను ఆర్బీఐ నిబంధనల మేరకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్తోపాటు డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. 12 వరకు ఆర్టీఐ వారోత్సవాలు జిల్లాలో సమాచార హక్కు చట్టం వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 నుంచి 12 వరకు వారోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ వారంలో రెవెన్యూ డివిజన్లు, మండల ప్రధాన కార్యాలయాల్లోని అన్ని విభాగాల్లో నిర్వహించాలని చెప్పారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలి మెదక్జోన్: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. త్వరలో నిర్వహించే మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల బ్యాలెట్బాక్సులను పట్టణంలోని గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో భద్రపరచనున్న నేపథ్యంలో వాటిని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతతోపాటు సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు తదితరులు ఉన్నారు.బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశం -
బిల్లులివ్వకుంటే భోజనమెట్లా..?
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళాపేరు షబీనాబేగం. పట్టణంలోని ఫతేనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో వంట కార్మికురాలిగా పనిచేస్తోంది. 180 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతుంది. నాలుగు నెలలుగా మధ్యాహ్న భోజనం బిల్లులు రాకపోతుండటంతో షబీనాబేగం తన బంగారు ఆభరణాలు రూ.80వేలకు కుదవబెట్టి పిల్లలకు వంట చేసి పెడుతోంది. బిల్లులతోపాటు ఆమెకు రావాల్సిన గౌరవ వేతనం కూడా ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో అప్పు తెచ్చిన చోట వడ్డీ పెరిగిపోతోందని షబీనా బేగం ఆందోళన చెందుతోంది. ఇది ఒక్క షబీనా బేగంకే కాదు. జిల్లాలో వేలాది మంది వంట కార్మికులది దాదాపు ఇదే పరిస్థితి. మెదక్జోన్: మెదక్ జిల్లా వ్యాప్తంగా 882 ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం పథకం కొనసాగుతోంది. వీటిలో 63 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. మధ్యాహ్నభోజనం వండి పెట్టినందుకుగానూ 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు రూ 6.29 చొప్పున అలాగే 9–10 విద్యార్థులకు రోజుకు రూ.8.40 చొప్పున దీనికి తోడు గుడ్డుకోసం ప్రత్యేకంగా రూ.6 ప్రభుత్వం ఇస్తోంది. వారంలో 3 సార్లు గుడ్డు విద్యార్థులకు పెట్టాల్సి ఉండగా పప్పు, కూరగాయలు, సాంబారుతో మాత్రమే భోజనం వడ్డిస్తున్నారు. రూ 3.50 కోట్ల బకాయిలు! విద్యార్థులకు అందించే మధ్యాహ్నభోజన బిల్లులతో పాటు వంట నిర్వాహకులకు ఇచ్చే గౌరవవేతనంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తోంది. 1–8 వ తరగతి విద్యార్థులకు అందించే భోజన బిల్లుల్లో 60% కేంద్ర ప్రభుత్వం 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాయి. వంట నిర్వాహకులకు ఒక్కో మహిళకు నెలకు రూ.3000 చొప్పున చెల్లిస్తుండగా అందులో రాష్ట్రప్రభుత్వం రూ.2,400 ఇస్తుండగా కేంద్రం రూ.600 చొప్పున చెల్లిస్తోంది. 1–8 విద్యార్థులకు సంబంధించిన భోజన బిల్లులు ఆగస్టు నుంచి 2 నెలలు పెండింగ్లో ఉండగా 9–10 వ, తరగతి విద్యార్థులకు సంబంధించి భోజన బిల్లులను మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే జూన్ నుంచి 4 నెలల బిల్లులను ప్రభుత్వం పెండింగ్లో ఉంచింది. అలాగే వంట కార్మికులకు ఇచ్చే గౌరవవేతనం సైతం నాలుగు మాసాలుగా పెండింగ్లో ఉన్నాయి. అమలుకాని మెనూ..! నాలుగు మాసాలుగా మధ్యాహ్నభోజన బిల్లులతో పాటు వంట కార్మికులకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వక పోవటంతో అనేక బడుల్లో మెనూ అమలు కావటంలేదు. వంటకార్మికులకు బిల్లులు రాకపోవటంతో ఉపాధ్యాయులు సైతం వంట నిర్వాహకులను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని నిర్వాహకులు చేతులు ఎత్తేస్తే ఉపాధ్యాయులే వడ్డీకి డబ్బులు ఇప్పించి విద్యార్థులకు మధ్యాహ్నభోజనం సాగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వారం రోజుల్లో బడ్జెట్ రావచ్చు మరోవారం రోజుల్లో మధ్యాహ్నభోజన బిల్లులతోపాటు వంట కార్మికులకు జీతం సైతం వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్రాగానే కార్మికులకు అందజేస్తాం. – రాధాకృష్ణ డీఈఓ మెదక్కూచన్పల్లి ఉన్నత పాఠశాలలో వంట చేస్తున్న వంట కార్మికులు -
సన్నాల బోనస్ ఏమాయె!
నాలుగు నెలలుగా ఎదురుచూపులుదసరా పోయి దీపావళి వస్తున్నా.. సన్న వడ్లకు రావాల్సిన యాసంగి బోనస్ ఇంకా అందకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బోనస్పై ఆశతో ఎన్నో కష్టనష్టాల కోర్చి సన్నాలు సాగు చేశామని, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కన్నీళ్లే దిక్కవుతున్నాయని రైతులు చెబుతున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల వేళ బోనస్ బకాయిలు ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులుభావిస్తున్నారు – మెదక్ అర్బన్ మంజీరా తీరం.. వరి పంటలకు నిలయంగా విరాజిల్లుతోంది. చుట్టూర మంజీరా నది ప్రవ హిస్తుండటం.. ఘనపురం ఆనకట్ట కాలువల నీరు పంటలకు ప్రాణం పోస్తున్నాయి. జిల్లాలో గత యాసంగి సీజన్లో 3,19,144 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. అయితే సన్నాలకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభు త్వం ప్రకటించింది. దీంతో 14,994 మంది రైతు లు 62,747 టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. వీరికి బోనస్ రూపంలో రూ.31.37కోట్లు రావాల్సి ఉంది. మరికొంత మంది రైతులు సన్నాలు పండించినా వారి అవసరం మేరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. నాలుగు నెలలైనా రాకపోవడంతో.. నాలుగు నెలలు కావస్తున్నా బోనస్ రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుత సీజన్లో చాలా మంది సన్నాలు సాగు చేశారు. భారీ వర్షాలతో వేలాది ఎకరాల వరి పంట నీటమునిగింది. అయితే గత యాసంగి బోనస్ ఇప్పటి వరకు రాలేదని, ఇక ఖరీఫ్ సీజన్ బోనస్ ఎప్పుడు వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోనస్ ప్రభావం సా్థనిక ఎన్నికలపై సన్న వడ్ల బోనస్ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా పండుగ, ఎన్నికల నేపథ్యంలో బోనస్ ఇస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు బోనస్ చెల్లింపులు జరగలేదు. దీంతో ఏ రైతు నోట విన్నా.. బోనస్ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు సైతం బోనస్ అంశాన్ని ప్రధాన అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందు కోసం డాక్యుమెంటరీ చిత్రాలతో పాటు, సోషల్ మీడియా, పాటల సీడిలు, కళాబృందాలను ఉపయోగించి రైతులను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికై నా ఇవ్వండి సారూ.. బోనస్ వస్తుందన్న ఆశతో యాసంగిలో రెండు ఎకరాల్లో సన్న వరి వేశాను. సుమారు రూ.17 వేల బోనస్ రావాలి. ఈ ఖరీఫ్లో వేసిన వరి పంట నీట మునిగింది. కష్ట సమయంలో కనీసం బోనస్ వస్తే కొంత ఉపశమనంగా ఉంటుంది. పండుగలకు ఉపయోగపడతాయి. – కిషన్రెడ్డి, రైతు, పాపన్నపేట -
విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి
డీఈఓ రాధాకిషన్ చేగుంట(తూప్రాన్): విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో రాణించేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపా లని డీఈఓ రాధాకిషన్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. అన్ని పాఠశాలల్లో ఎక్కువ శాతం విద్యార్థులు బాగా చదివేలా చూడాలని తెలిపారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించి విద్యా ప్రమాణాల మెరుగు కోసం పని చేయాలన్నారు. విద్యాపరమైన విషయంలో మెదక్ జిల్లా ముందు వరుసలో ఉండేలా కృషి చేయాలన్నారు. పదోతరగతి ఫలితాల్లో సైతం మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ నీరజ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా వ్యవహరించాలి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుమెదక్ మున్సిపాలిటీ: స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, శాంతి భద్రతల మధ్య సజావుగా జరిగేలా ప్రతి పోలీస్ అధికారి కృషి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా తూ ప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తే తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి అధికారి తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి పరిస్థితులను అవగాహన చేసుకోవాలన్నారు. ఎలాంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు కఠినంగా నిర్వహించి అక్రమ రవాణా, అసాంఘిక చర్యలను అరికట్టాలని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్గౌడ్, రంగానాయక్, సీఐలు సందీప్రెడ్డి, మధుసూదన్గౌడ్, జాన్రెడ్డి, రంగాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎన్నికలు
కౌడిపల్లి(నర్సాపూర్): స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతవరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్డీఓ మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం స్ట్రాంగ్రూం, కౌంటింగ్హాల్ కోసం మండలంలోని ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, ఆర్ఎస్ శ్రీహరి, సర్వేయర్ మొగులయ్య తదితరులు ఉన్నారు. నర్సాపూర్: తమకు ఏడు నెలలుగా జీతాలు లేవని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నర్సాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్టీ హాస్టళ్లలో పనిచేసే సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీ ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్ ఎదుట బైఠాయించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, తమనే పర్మనెంట్ చేయాలని, అప్పటివరకు జిల్లా కలెక్టర్ గెజిట్ మేరకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము గత నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగ జేఏసీ నాయకులు సురేష్, సువర్ణ తదితరులు ఆరోపించారు. పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం ఏడుపాయల వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. మొదట రాజగోపురంలోని ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు చేసిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): స్థానిక ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు సోమవారం మండల కేంద్రానికి చేరుకున్నాయి. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలో ఒక జెడ్పీటీసీ, 12 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి గాను 61 పోలింగ్ కేంద్రాల పరిధిలో 73 బ్యాలెట్ బాక్సులు మండల కేంద్రానికి రాగా, వాటిని మండల పరిషత్ కార్యాలయంలో భద్రపర్చారు. నారాయణఖేడ్: ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోమ వారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు. ఆయన వెంట ఇబ్రహీంపట్నం, నకిరేకల్, భువనగిరి ఎ మ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, అనిల్కుమారెడ్డి తదితరులు ఉన్నారు. -
సమర్థవంతంగా ఎన్నికల విధులు
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్/తూప్రాన్/మనోహరాబాద్(తూప్రాన్): స్థానిక ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులంతా పనిచేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. సోమ వారం కలెక్టరేట్లో అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో అన్ని అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. నామినేషన్ నుంచి లెక్కింపు వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్రావు, డీపీఓ యా దయ్య, డీఈఓ రాధాకిషన్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్రెడ్డి, జయచంద్రారెడ్డి, జిల్లా సైన్స్ అధి కారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే తూప్రాన్ మండలంలోని లింగారెడ్డిపేట సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించనున్న కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్రాజ్ పరిశీలించారు. రేపు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన మెదక్ కలెక్టరేట్: వరద నష్టం అంచనా వేసేందుకు ఈనెల 8న జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పాలన యంత్రాంగం వరద నష్టంపై బృందం సభ్యులకు వివరించనున్నట్లు తెలిపారు. మెదక్, నిజాంపేట, రామాయంపేట, హవేళిఘణాపూర్, పాపన్నపేట మండలాల్లో పర్యటన కొనసాగుతుందన్నారు. అలాగే ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. -
పంటలు వర్షార్పణం
కొల్చారం(నర్సాపూర్): రెండు రోజులుగా మండలంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగలంతా ఎండ కాస్తూ రాత్రి వర్షం పడుతోంది. ఆదివారం, సోమవారం 16 గంటల వ్యవధిలో 65.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఎడతెరిపి లేని వర్షాలతో మండలవ్యాప్తంగా పత్తి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతి న్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడం, దీనికి తోడు వర్షాలు కురుస్తుండటంతో చేన్లు తెగుళ్ల భారిన పడుతున్నాయి. మరో 15 రోజుల్లో పంట చేతికొచ్చి దశలో కొన్నిచోట్ల వరిలో కాండం కుళ్లు తెగులు సోకి పంట నేలవాలుతోంది. అటు పత్తికి సైతం ఇదే పరిస్థితి ఉంది. ఇలాగే కొనసాగితే పత్తి రంగు మారి, దిగుబడి తగ్గి పెట్టుబడి కూడా రాని పరిస్థితులు నెలకొంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
స్థానికంపై ఫోకస్
● వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు ● పావులు కదుపుతున్న నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. హస్తం సింగిల్ డిజిట్కే పరిమితం కాగా, కాషాయ పార్టీ ఖాతా తెరవలేదు. అయితే ఈసారి త్రిముఖ పోరు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. – మెదక్జోన్ స్థానిక పోరుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, మెతుకుసీమలో మాత్రం ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మెదక్లో కాంగ్రెస్ గెలుపొందగా, నర్సాపూర్ అసెంబ్లీ స్థానం మాత్రం బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. ఎంపీ రఘునందన్రావు భారీ మెజార్టీతో విజయం సాధి ంచారు. అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య గెలుపొందారు. జిల్లాలో మూడు ప్రధాన పార్టీలను ప్రజలు అక్కున చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో కారుదే హవా జిల్లాలో 2019లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. అప్పట్లో 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, 18 చోట్ల బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 2 చోట్ల మాత్రమే గెలుపొందింది. బీజేపీ ఖాతా తెరవని పరిస్థితి. దీంతో జెడ్పీ పీఠం గులాబీ పార్టీ కై వసం చేసుకుంది. అలాగే మండల పరిషత్ స్థానాలు 189 ఉండగా, 117 చోట్ల బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ 44 చోట్ల గెలుపొందగా, ఇతరులు 28 చోట్ల విజయం సాధించారు. దీంతో 20 ఎంపీపీ స్థానాలకు 14 చోట్ల బీఆర్ఎస్, 4 చోట్ల కాంగ్రెస్, ఇతరులు 2 స్థానాలు కై వసం చేసుకున్నారు. ఈసారి త్రిముఖ పోటీఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగనుంది. అధికార కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకుంది. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఇన్చార్జి మంత్రి వివేక్ జిల్లాలో పర్యటించి శ్రేణులను సమాయత్తం చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులే ఎజెండాగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఇదే విషయమై మాజీ మంత్రి హరీశ్రావు స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇక బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. జీఎస్టీ శ్లాబుల తగ్గింపును తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఎంపీ రఘునందన్రావు జిల్లాలో విస్తృతంగా పర్యటించి కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నా రు. ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సైతం గతంలో జిల్లాలో పర్యటించి క్యాడర్లో జోష్ నింపారు. -
సామాజిక భద్రతకు భరోసా
● వృద్ధులు, కిశోర బాలికలకుకొత్త సంఘాలు ● కొనసాగుతున్న అర్హుల గుర్తింపు రామాయంపేట(మెదక్): ఆదరణ కరువైన వృద్ధులు, కిశోర బాలికలను గుర్తించి ఆదుకోవడంతో పాటు వారితో వేర్వేరుగా సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లావ్యాప్తంగా సభ్యుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా 20 మండలాల్లో గ్రూపులకు సంబంధించి సభ్యుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న మహిళా సమాఖ్య, దివ్యాంగుల సంఘాలతో పాటు అదనంగా కిశోర బాలికలు, వృద్ధులతో సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామ సంఘం కనీసం ఒక గ్రూపు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. 60 ఏళ్లు నిండిన మహిళలకు మళ్లీ అవకాశం సాధారణంగా 60 ఏళ్లు నిండిన మహిళలు మహిళా సంఘాల్లో ఉండటానికి నిబంధనలు అంగీకరించవు. వారు సంఘం నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే. ప్రస్తుతం వారిని గుర్తించి ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 21 గ్రూపులను ఏర్పాటుచేసిన అధికారులు 210 మందిని సభ్యులుగా చేర్పించారు. మేమున్నామని వారికి మనోధైర్యం కల్పిస్తున్నారు. సంఘంలో సభ్యులుగా ఉన్న వృద్ధులు తమ వారి ఆదరణకు దూరమైతే వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఈమేరకు వీరికి ప్రభుత్వం ప్రత్యేకంగా రివాల్వింగ్ ఫండ్ మంజూరు చేయనున్నట్లు సమాచారం. అలాగే 14 నుంచి 18 ఏళ్ల బాలికలను గుర్తించి వారితో ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 43 సంఘాలను ఏర్పాటు చేసిన అధికారులు 430 మందిని సభ్యులుగా చేర్పించారు. వారిలో ఆత్మవిశ్వాసంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొవడం వంటి విషయాల్లో చైతన్యపరుస్తామని అధికారులు చెబుతున్నారు. కొత్త ఎస్హెచ్జీలకు కసరత్తు మహిళా సంఘాల్లో ఇప్పటివరకు సభ్యులుగా చేరని వారిని గుర్తించి వారితో కొత్త సంఘాలు ఏర్పాటు చేయించడానికి గ్రామాల వారీగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 56 సంఘాలను ఏర్పాటు చేసి 560 మందిని సభ్యులుగా చేర్పించారు. వీరికి పొదు పు చేయడం, సంఘాల బాధ్యతల విషయమై అవగాహన కల్పిస్తున్నారు. దివ్యాంగులతో సైతం.. అలాగే జిల్లాలో గతంలో ఉన్న 172 సంఘాలకు తోడు కొత్తగా అదనంగా మరో 14 దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం తోడ్పాటు అందించే విధంగా కృషి చేస్తున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పనిముట్లు, పరికరాల్లో ప్రాధాన్యం ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా పథకాలను వర్తింపజేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రోత్సాహం అందిస్తాం జిల్లాలో ఉన్న పాత మహిళా సంఘాలకు తోడు కొత్తగా మరిన్ని సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. వృద్ధులతో పాటు కొత్తగా కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సంఘాలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం, తోడ్పాటు అందే విధంగా కృషి చేస్తాం. – శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
సింగూరు రికార్డు బ్రేక్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టు వరద జలాల రికార్డులు బ్రేక్ అయింది. ఈ వర్షాకాలం సీజనులో ఇప్పటి వరకు ఏకంగా 200 టీఎంసీల వరద జలాలు ఈ ప్రాజెక్టులోకి వచ్చాయి. దీంతో వరద నీటిని ప్రాజెక్టు గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి వదలేశారు. ప్రాజెక్టు చరిత్రలో ఇంత రికార్డు స్థాయిలో వరద జలాలు నదిలోకి వదలడం ఈ ఏడాదే మొదటిసారని నీటి పారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 1989లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. 1998–99లో ఈ ప్రాజెక్టుకు 176 టీఎంసీల వరద వచ్చినట్లు నీటి పారుదల రికార్డులు చెబుతున్నాయి. 2010 –11 సంవత్సరంలో కూడా భారీగానే వరద వచ్చింది. ఆ సంవత్సరం 106 టీఎంసీల వరద వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2016–17లోనూ 105 టీఎంసీలు, 2021–22లో 101 టీఎంసీలు వచ్చి ంది. సుమారు 27 ఏళ్ల తర్వాత ఈసారి ఏకంగా 200 టీఎంసీలు దాటడం గమనార్హం. సాధారణంగా ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. ఈ లెక్కన 200 టీఎంసీలతో సుమారు 20 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఏ స్థాయిలో వరద జలాలు మంజీరా నది పాలయ్యాయనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కర్నాటక, మహారాష్ట్రల్లో క్యాచ్మెంట్.. జిల్లాలో ఉన్న ఏకై క బహుళార్థక సాధక ప్రాజెక్టుకు జిల్లాతో పాటుగా, కర్నాటక, మహారాష్ట్రల పరిధిలో క్యాచ్మెంట్ ఏరియా ఉంది. ఈ ఏరియాల్లో ఈసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ కారణంగా ఈ ప్రాజెక్టుకు వరద జలాల రాక ఉధృతంగా సాగుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద జలాలను మంజీరా నదిలోకి వదులుతున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు ఆనకట్ట దెబ్బతిన్న నేపథ్యంలో డ్యాం సేఫ్టీ అధారిటీ నీటి నిల్వలను 16 టీఎంసీలకే పరిమితం చేయాలని సూచించింది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.9 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 16 టీఎంసీలకే పరిమితం చేస్తున్న విషయం విదితమే. క్రాప్ హాలీడే ప్రకటించిన సంవత్సరంలో.. సింగూరు ప్రాజెక్టు ఆయకట్టుకు ఈ ఏడాది ప్రభుత్వం క్రాప్ హాలీడే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా క్రాప్హాలీడే ప్రకటించిన సంవత్సరంలోనే ఇంత భారీ స్థాయిలో వరద రావడం గమనార్హం. మరోవైపు భారీ ఎత్తున వరద జలాలు రావడంతో విద్యుత్ ఉత్పత్తి కోసం జెన్కోకు కూడా నీటి విడుదల కొనసాగుతోంది. నిర్దేశిత లక్ష్యం మేరకు ఈసారి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని జెన్కో అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఈ జలాశయం ఆధారంగా ఉన్న ఘనపురం ఆనకట్టకు, కామారెడ్డి జిల్లాలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా నీటి విడుదల చేశారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్తో పాటు, మిషన్భగీరథ అవసరాల కోసం కూడా ఈ నీటిని వినియోగిస్తున్న విషయం విదితమే. 200 టీఎంసీలు దాటిన వరద జలాల రాక 1998–99లో వచ్చిన వరద 176 టీఎంసీలు 27 ఏళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో వరద మంజీరా నది పాలైన జలాలు -
హస్తంలో నిస్తేజం
మెదక్ అర్బన్: ఈనెల 5వ తేదీకల్లా జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసేందుకు అర్హులను గుర్తించి, ఒక్కోస్థానం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను గాంధీ భవన్కు పంపాలని పీసీసీ ఆదేశించినా.. మెదక్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎన్నికల సందడి కనిపించడం లేదు. స్థానిక నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి, అభ్యర్థుల పేర్లు గుర్తిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల గాంధీభవన్ వర్గాలు మాత్రం కొంతమంది కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులకు ఫోన్ చేసి ఆశావహుల వివరాలు అడిగినట్లు సమాచారం. ఆశావహుల్లో ఆందోళన జిల్లాలో 21 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, మెదక్ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈనెల 5 కల్లా జెడ్పీటీసీ స్థానాలకు ఆశావహులను గుర్తించి, ఒక్కో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పంపాలని జిల్లా పార్టీ కమిటీలను పీసీసీ ఆదేశించింది. జిల్లాకు చెందిన, ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కానీ ఇప్పటివరకు అలాంటి సమావేశాలు ఏర్పాటు కాలేదని మండల కార్యవర్గాలు అంటున్నాయి. ఓ వైపు ముగ్గురేసి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి పీసీసీకి పంపాలనే సూచనలు ఉన్నాయి. కాగా రెండు, మూడు రోజుల కింద పీసీసీ వర్గాలు, కొంతమంది మండల కాంగ్రెస్ శాఖ అధ్యక్షులకు ఫోన్లు చేసి, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న వారి వివరాలు అడిగినట్లు తెలుస్తుంది. అయితే వారు తమకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పినట్లు సమాచారం. మెదక్ నియోజకవర్గంలో పోటాపోటీ మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట మండలంలో కాంగ్రెస్ నుంచి పంతుల భూమన్న, శ్రీకాంతప్ప, రమేశ్గౌడ్, రాజశేఖర్, భరత్గౌడ్, సూఫీ, మెదక్ మండలం జెడ్పీటీసీకి శంకర్, నాగరాజు, మురళి, హవేళిఘణాపూర్ మండలం నుంచి శ్రీనివాస్, పరుశురాంగౌడ్, చిన్నశంకరంపేట నుంచి సాన సత్యనారాయణ, భిక్షపతి, ప్రభాకర్, పడాల సిద్దిరాములు, రామాయంపేట నుంచి మహేందర్ రెడ్డి, మోహన్నాయక్, శివప్రసాద్రావు, నిజాంపేట నుంచి వెంకటేశంతో పాటు ఇంకా కొంతమంది నాయకులు జెడ్పీటీసీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. పేర్లు పంపిస్తాం పీసీసీ సూచన మేరకు ఆదివారం సాయంత్రానికల్లా ఒక్కో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పంపిస్తాం. ఇప్పటికే మండలాల వారీగా సమాచారం సేకరించాం. కొన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేయలేదు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న వారి పేర్లు తీసుకున్నాం. – ఆంజనేయులు గౌడ్, డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్లో ఖరారు కాని ఆశావహుల పేర్లు మండల సమావేశాలు నిర్వహించని వైనం 5 వరకు జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితా పంపాలని కోరిన అధిష్టానం రాజకీయాల్లో అనాధిగా అగ్రవర్ణ నాయకుల అధిపత్యం కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో ఓసీలకు చాలా చోట్ల రిజర్వేషన్లు ప్రతికూలంగా వచ్చాయి. దీంతో వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రియాశీలకంగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన కూడా రాజకీయ వాతావరణాన్ని రగిలించడం లేదు. దీంతో చాలా చోట్ల ఎన్నికల సన్నాహక సమావేశాలు జరుగలేదని తెలుస్తోంది. -
స్థానికంగానే నామినేషన్లు
● ఎంపీడీఓ కార్యాలయాల్లోనే కౌంటర్లు ● 21 ఏళ్లు నిండిన వారే పోటీకి అర్హులు నారాయణఖేడ్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు స్థానికంగా మండల పరిషత్తు కార్యాలయాలు (ఎంపీడీఓ)ల్లోనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీటీసీ స్థానానికి గానీ, జెడ్పీటీసీ స్థానానికి గాను ఆయా మండలాలకు సంబంధించిన వారు సదరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసే కౌంటర్లో ఆర్వోలకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపీటీసీ స్థానం ఎన్నికల నిర్వహణకు గాను గెజిటెడ్ హోదా ఉన్న హెడ్మాస్టర్లు, లెక్చరర్లు, ఇతర అధికారులను రిటర్నింగ్ అధికారిగా నియమించనున్నారు. సదరు అధికారి తాను పనిచేసే మండలం, సొంత మండలం రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని ఇతర మండలాల వారిని ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తున్నారు. జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఆ క్లస్టర్ పరిధిలో వచ్చే ఎంపీటీసీ స్థానాల వివరాలను సంబంధిత ఆర్వోల వద్ద ప్రదర్శిస్తారు. తొలివిడత పరిషత్ ఎన్నికల కోసం ఈ నెల 9న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. పోటీ చేసే అభ్యర్థితోపాటు ముగ్గురికి మాత్రమే నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ర్యాలీలు, ప్రచారాలకు అనుమతులు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థి వయస్సు నామినేషన్ల స్వీకరణ నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కేటగిరీని బట్టి డిపాజిట్ చెల్లించాలి. ఎంపీటీసీగా పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250, జెడ్పీటీసీ జనరల్ అభ్యర్థులు రూ.5,000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.2,500, గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసే జనరల్ అభ్యర్థి రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.1000, వార్డు సభ్యుడు జనరల్ అభ్యర్థి రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.250లు చెల్లించాలి. పోటీ చేసే అభ్యర్థులు పంచాయతీకి పన్ను బకాయి, కరెంటు బిల్లులు క్లియర్ చేసి ఆ రశీదును తీసుకోవాల్సి ఉంటుంది. తమ నామిషన్ల సందర్భంగా కులధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. -
ఓట్లడిగే హక్కు ఆ పార్టీలకు లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుజోగిపేట(అందోల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకొని ప్రధాని మోదీకి గిఫ్ట్గా ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ప్రకటించారు. ఆదివారం అందోలులో నిర్వహించిన అలయ్– బలయ్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజల్లో బీజేపీ పార్టీకి ఆదరణ ఉందన్నారు. ఎక్కడికి వెళ్లినా తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కార్యకర్తల ఉత్సా హం చూస్తుంటే సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్్ పదవిని బీజేపీ కై వసం చేసుకోవడం ఖాయమని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును కూడా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా ఐకమత్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సంగారెడ్డి, నారాయణఖేడ్ అసెంబ్లీ ఇన్చార్జిలు దేశ్పాండే, సంగప్ప, నాయకులు అనంతరావు కులకర్ణి, ప్రభాకర్గౌడ్, లక్ష్మినర్సింహ రెడ్డి, వివిధ మండల శాఖల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అన్నదాతకు వరుణ గండం
మెదక్జోన్: ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన రైతన్నకు పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తునాయి. ఆదివారం జిల్లాలోని పలు మండలాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరికోత దశలో వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వదలని వానతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కర్షకులు కొట్టుమిట్టాడుతున్నారు. 503 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లావ్యాప్తంగా 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో దొడ్డు రకం 2.28 లక్షలు, సన్నాలు 77 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకోసం 7.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో 3.39 లక్షల మెట్రిక్ టన్నులు రైతులు ఆహారం కోసం నిల్వ ఉంచుకుంటారు. విత్తన కంపెనీలకు కొంతమేర పోనూ, మరికొంత బయట వ్యాపారులకు విక్రయిస్తారని భావిస్తున్నారు. అదిపోను కొనుగోలు కేంద్రాలకు 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 3 గంటలు.. 12 సెంటీమీటర్లు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సుమారు 3 గంటల పాటు వర్షం దంచికొట్టింది. జిల్లాలోని చిన్నశంకరంపేట, చేగుంట, మెదక్, హవేళిఘణాపూర్, నార్సింగి, కౌడిపల్లి, కొల్చారం, నర్సాపూర్, పాపన్నపేట, టేక్మాల్, చిలప్చెడ్ తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇప్పటికే మొక్క జొన్న పంటను కోసి ఆరబెట్టగా, 40 శాతం వరి పంటలు కోతకు వచ్చాయి. కానీ వర్షాల కారణంగా పంట చేతికందుతుందా..? లేదా అని రైతు లు ఆందోళన చెందుతున్నారు. కోత కోయలేరు.. ఆరబెట్టలేరు ఈ ఏడాది భారీ వర్షాలతో ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కాగా మిగిలిన పంటనైనా కోసి అమ్ముకుందామంటే వర్షాలు వెంటాడుతున్నాయి. చైన్ మిషన్లతో వరి పంటను కోసినా, ధాన్యాన్ని ఆయబెట్టలేని దుస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరికోతల వేళ వెంటాడుతున్న వర్షాలు ధాన్యం కొనుగోళ్లకు అధికారుల ఏర్పాట్లు జిల్లాలో 4.23 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా -
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
పాత చిక్కులు..కొత్త ముడులుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల లొల్లి తెరపైకి వస్తోంది. పలు నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రూపులు తయారైన నేపథ్యంలో ఈ ఎన్నికల టికెట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ దృష్టి సారించింది. ప్రధానంగా జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఒక్కో మండలానికి ముగ్గురు చొప్పున పేర్లతో నియోజకవర్గాల వారీగా జాబితాను రూపొందిస్తోంది. గ్రూపు విభేదాలు ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది ఆ పార్టీలో ప్రహసనంగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జహీరాబాద్లో గ్రూపుల లొల్లి.. జహీరాబాద్ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. ఇక్కడ పార్టీ మూడు వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్రెడ్డి వర్గాలు ఎవరికి వారే అన్నచందంగా తయారయ్యాయి. ఈ గ్రూపులకు తోడుగా ఎంపీ సురేశ్ షెట్కార్ అనుచరవర్గం కూడా మరో వర్గంగా వ్యహరిస్తోంది. అప్పట్లో ముగ్గురు వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకునేందుకు ఆయా వర్గాల నేతలు పట్టుబట్టే అవకాశాలున్నాయి. దీంతో ఇక్కడ ఎవరి అనుచరులకు టికెట్లు దక్కుతాయనేది చర్చనీయాంశంగా మారింది. ఖేడ్లోనూ అంతర్గతంగా ఆధిపత్య పోరు నారాయణఖేడ్లోనూ కాంగ్రెస్ కేడర్ రెండు వర్గాలుగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ అనుచరుల మధ్య ఆధిపత్య పోరు ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బయట పడకపోయినా..అంతర్గతంగా మాత్రం కొనసాగుతోంది. ఇప్పుడు ఇక్కడ కూడా అభ్యర్థుల ఎంపిక అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నర్సాపూర్లోనూ అదే తీరు మెదక్ జిల్లా నర్సాపూర్లోనూ హస్తం పార్టీ కేడర్ రెండు గ్రూపులుగా తయారైంది. నియోజకవర్గం ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి వర్గంతోపాటు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సన్నిహితంగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినీరెడ్డి వేర్వేరుగా పార్టీ కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా అభ్యర్థుల ఎంపిక అనేది కత్తి మీద సాముగానే మారింది. ఎవరికి వారే తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకునేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.గ్రూపులున్న చోట్ల ప్రత్యేక కమిటీలు గ్రూపుల లొల్లి తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ పరిశీలిస్తోంది. ఆయా వర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారిలో వడపోత కార్యక్రమం చేపట్టే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తామని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. అవసరమైతే సర్వే నిర్వహించి టికెట్లు కేటాయింపులు ఉంటాయని చెబుతున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆయా నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.ఒక్కో నియోజకవర్గంలో రెండు, మూడు గ్రూపులు ఏ గ్రూపునకు ‘స్థానిక’ టికె ట్లు దక్కుతాయనే దానిపై ఆసక్తి తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు నేతల పట్టు పలు నియోజకవర్గాల్లో హస్తం పార్టీలో ఇదీ పరిస్థితి ఇప్పటికీ పలుచోట్ల బయటపడుతున్న విభేదాలు సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలు వేసే యోచనలో పార్టీ నాయకత్వం! -
డీజీపీని కలిసిన ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్రెడ్డిని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ, నేర నిరోధక చర్య లు, పోలీస్ విభాగం పనితీరుపై ఆయనతో చర్చించారు. జోరు తగ్గిన మంజీరా పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో శనివారం మంజీరా నది జోరు తగ్గింది. సింగూరు నుంచి 38,467 క్యూసెక్కుల నీరు వదలగా, గతంలో పోలిస్తే ప్రవాహం తక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ రాజగోపురంలోనే దుర్గమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్నారు. వైద్య సేవలపై ఆరా చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలోని పల్లె దవాఖానను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. స్టాఫ్నర్స్ రేణుకతో మాట్లాడి మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబు, పట్టణ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. విద్యా సామర్థ్యాలు పెంచాలి వెల్దుర్తి(తూప్రాన్): ప్రాథమిక దశ నుంచే విద్యా సామర్థ్యాలు పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. శనివారం మండలంలోని శంశిరెడ్డిపల్లితండా, చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, మధ్యా హ్న భోజన పథకం, పరిసరాలు, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను పరిశీలించి సిబ్బంది పనితీరును అభినందించారు. అదేవిధంగా ఎంఆర్సీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. పాఠశాలల వారీగా సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల మెరుగకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆయన వెంట ఎంఈఓ సీతారాం ఉన్నారు. బీజేపీకే ప్రజాదరణ నర్సాపూర్: జిల్లాలో బీజేపీకే ప్రజాదరణ ఉందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షుడు నగేశ్ అధ్యక్షతన నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాలను కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని, వారి మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్, నాయకులు నారాయణరెడ్డి, రాములునాయక్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ.. జంపింగ్ల మేళా
జోరుగా రాజకీయ వలసలు మెదక్జోన్: Ý린MýS çÜ…çܦÌS G°²-MýSË$ çÜÒ$í³-çÜ$¢¯]l² Ðólâýæ hÌêÏÌZ f…í³…VŠæ ´ëÍ-sìæMŠSÞ gZÆý‡…-§ýl$-MýS$¯é²Æ‡$$. Æð‡…yýl$ ¯ðlÌS-Ë$V> D ç³Æý‡…ç³Æý‡ ÝëVýS$-™èl*¯ól E…¨. Ýë«§é-Æý‡×æ M>Æý‡Å-MýS-Æý‡¢Ë$ Ððl¬§ýl-Ë$-Mö° °Äñæ*-f-MýS-Ð]lÆý‡Y, Ð]l$…yýl-ÌSÝë¦Æ‡$$ ¯éĶæ$-MýS$ÌS Ð]lÆý‡MýS$ ´ëÈ-tË$ Ð]l*Æý‡$-™èl$-¯é²Æý‡$. D Ð]lÅÐ]làÆý‡…ÌZ ½BÆŠḥG‹Ü, M>…{VðS‹ÜË$ §ýl*MýS$yýl$V> Ð]lÅÐ]lçß ÇçÜ$¢¯é²Æ‡¬. VýS™èl AòÜ…½Ï G°²-MýSÌS çÜÐ]l$-Ķæ$…ÌZ Ððl$§ýlMŠS GÐðl$ÃÌôæÅ Æøíßæ-™Œæ-Æ>Ð]l# Ððl¯]l²…sìæ E¯]l² Ķæ¬Ð]l-¯ól™èl iÐ]l-¯ŒS-Æ>Ð]l#, Æ>Ð]l*-Ķæ$…õ³r Ð]l*i Ð]l*Æð‡PsŒæ MýSÑ$sîæ O^ðlÆý‡Ã¯ŒS VýS…V> ¯]lÆó‡…-§ýlÆŠ‡ ĶæÊrÆŠ‡² ¡çÜ$-Mö° Æð‡…yýl$ ¯ðlÌSÌS {MìS™èl… ½B-ÆŠ‡-G‹Ü ¡Æý‡¦… ç³#^èl$a-MýS$-¯é²Æý‡$. Aç³µsZÏ hÌêÏÌZ C¨ àsŒæ-sê-í³MŠSV> Ð]l*Ç…-¨. ©°MìS Mú…r-ÆŠ‡V> GÐðl$ÃÌôæÅ Æøíßæ-™Œæ-Æ>Ð]l#, M>…{VðS‹Ü Æ>çÙ‰ ¯ól™èl OÐðl$¯]l…ç³-ÍÏ çßæ¯]lÃ…-™èl-Æ>Ð]l# hÌêÏÌZ ¿êÈ ºíßæ-Æý‡…VýS çÜ¿ýæ¯]l$ HÆ>µ-r$-^ólÔ>Æý‡$. ï³ïÜïÜ `‹œ Ð]l$õßæ-ÔŒæ-MýS$-Ð]l*-ÆŠ‡VúyŠæ, hÌêÏ C¯ŒS-^é-Çj Ð]l$…{† ÑÐól-MŠS¯]l$ Bà-Ó-°…-^éÆý‡$. D çÜ¿ýæÌZ °Äñæ*-f-MýS-Ð]lÆý‡Y…ÌZ° ç³Ë$ Ð]l$…yýl-ÌêË$, {V>Ð]l*-ÌSMýS$ ^ðl…¨¯]l Ð]l*i çÜÆý‡µ…-^Œl-ÌS™ø ´ër$ ½B-ÆŠ‡-G‹Ü, ½gôæ-ï³ÌS ¯]l$…_ M>Æý‡Å-MýSÆý‡¢Ë$, ¯ól™èlË$ ò³§ýlª-G-™èl$¢¯]l M>…{VðS‹Ü ¡Æý‡¦… ç³#^èl$a-MýS$-¯é²Æý‡$. ÐéÇ™ø ´ër$ {ç³Ð]l¬Q çÜ…çœ$ õÜÐ]lMýS$yýl$ ÎÌê {VýS*‹³ O^ðlÆý‡Ã¯ŒS Ððl*çßæ-¯ŒS-¯éĶæ$-MŠS¯]l$ M>…{VðS-‹Ü-ÌZMìS Bà-Ó-°…-^éÆý‡$. అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు కౌడిపల్లి మండలం దేవులపల్లికి చెందిన సుమారు 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు రెండు రోజుల క్రితం అధికార పార్టీకి గుడ్బై చెప్పి ఎమ్మె ల్యే సునీతారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఇటీవల యూరియా కొరతతో పాటు స్థానికంగా ఉన్న నేతలతో పొసగకపోవటమేనని తెలుస్తోంది. పెద్దశంకరంపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సీనియర్ నేత మురళి (పంతులు) ఇటీవల ఆ పార్టీని వీడారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమక్షంలో ఆయనతో పాటు మరో 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దశంకరంపేట మేజర్ పంచాయతీతో పాటు ఆ మండల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు సైతం జనరల్ మహిళాకు రిజర్వేషన్ కావటంతో ఆయన అధికార పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా శనివారం పాపన్నపేట మండల పరిధిలోని పలు పార్టీలకు చెందిన నాయకులు హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు స మక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, జిల్లా నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పార్టీల వలసల పరంపర కొనసాగుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మళ్లీ బీజేపీ వైపు పంజా చూపు! రామాయంపేట(మెదక్): స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన నిజాంపేట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పంజా విజయకుమార్ జూలై 20న కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పంజా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి పంజా పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. కార్యకర్తలతో సైతం అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన కాంగ్రెస్లో చేరిన 75 రోజుల్లోనే మనసు మార్చుకొని బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈవిషయమై బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా తన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించలేదని ‘పంజా‘ సాక్షితో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను కాషాయ పార్టీలోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ముదిరాజ్ కుల ంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన విజయకుమార్ తిరిగి బీజేపీలో చేరితే కొన్ని మండలాల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. -
నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఎంసీఎంసీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూంను పరిశీలించారు. అభ్యర్థులు తమ ఎన్నికల ప్రకటనల కోసం ఎంసీఎంసీ ద్వారా అనుమతి పొందాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచా యతీ అధికారి యాదయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి రామాయంపేట/నిజాంపేట(మెదక్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు వంతెనలు, చెరువుల తాత్కాలిక మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం రామాయంపేట, నిజాంపేట మండలాల్లో పర్యటించారు. మెదక్ కలెక్టరేట్: స్థానిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి హెల్ప్డెస్క్ ద్వారా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. -
స్థానిక ఎన్నికల విధుల్లో టీచర్లు
● పరిషత్ పోరుకు 3,500 మంది ● పంచాయతీకి 3,800 మంది ● ఇప్పటికే రెండు విడతల్లో శిక్షణ పూర్తి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల విధుల్లో అత్యధికంగా ఉపాధ్యాయులు పనిచేయనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎంపిక చేసి వారికి ఎన్నికల నిర్వహణపై రెండు విడతల్లో శిక్షణ సైతం ఇచ్చారు. కాగా పరిషత్ పోరుకు 3,500 మంది, పంచాయతీ ఎన్నికలకు 3,800 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో సీనియర్ ఉపాధ్యాయులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా, సూపర్వైజర్లుగా, ప్రిసైడింగ్, స్టేజ్–1, స్టేజ్– 2 అధికారులుగా పనిచేయనున్నారు. అలాగే డీఈఓ రాధాకిషన్తో పాటు మరో 11 మంది అధికారులు జిల్లా ఎన్నికల నోడల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. వీరితో పాటు పంచాయతీ సెక్రటరీలకు పోలింగ్ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి దశలో మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లోని 99 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 23న పోలింగ్ జరగనుంది. రెండో దశలో నర్సాపూర్ డివిజన్లోని 5 మండలాలు, తూప్రాన్ డివిజన్లోని 6 మండలాల పరిధిలో గల 11 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు 27న పోలింగ్ నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలు సైతం రెండు దశల్లో జరుగనున్నాయి. మొదటి దశలో మెదక్ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో 244 పంచాయతీ, 2124 వార్డులకు వచ్చే నెల 4న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడతలో నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లోని 11 మండలాల్లోని 248 పంచాయతీలకు, 2,096 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి నవంబర్ 8న పోలింగ్, అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. -
పేటలో పోటీ.. జెడ్పీ పీఠంపై గురి
రామాయంపేట(మెదక్): జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం జనరల్కు కేటాయించడంతో ఈ స్థానాన్ని కై వసం చేసుకోవడానికి ప్రధాన పా ర్టీలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లాలోని 21 జెడ్పీటీసీ స్థానాల్లో రామాయంపేట, కొల్చారం,తూప్రాన్ స్థానాలు జనరల్, నిజాంపేట, పెద్దశంకరంపేట, మనోహరాబాద్ జెడ్పీటీసీ స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించారు. మూడు ప్రధాన పార్టీల్లో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత, మాజీ జిల్లా అధ్యక్షులు, గుర్తింపు పొందిన నేతలు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. జెడ్పీటీసీగా గెలిస్తే చాలు ఎలాగైనా జెడ్పీ పీఠం కై వసం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్న నాయకులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. రామాయంపేటలో పోటీ చేయడానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ భర్త దేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, మెదక్ నియోజవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాజీ మంత్రి హరీశ్రావు ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్లో ఆర్ వెంకటాపూర్ మాజీ సర్పంచ్ మహేందర్రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన మోహన్నాయక్, దామరచెరువు మాజీ సర్పంచ్ శివప్రసాదరావు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములుతో పాటు మరికొందరు టికెట్ ఆశి స్తున్నారు. తమ మండలాల్లో రిజర్వేషన్లతో పోటీ చేయడానికి అవకా శం లేని నాయకులు పక్క మండలాలపై దృష్టి సారిస్తున్నారు. కాగా జెడ్పీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీ ల అభ్యర్థుల ఎంపిక విషయమై జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. -
పరిషత్ పోరుకు కసరత్తు
సంగారెడ్డి జోన్: పరిషత్ పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాను సైతం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ తాజాగా పరిషత్తు స్థానాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఎన్నికలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 12 మందిని నోడల్ అధికారులుగా నియమించారు. ఒక్కో అంశంపై ఒక్కో అధికారిని పర్యవేక్షించే విధంగా బాధ్యతలను అప్పగించారు. 261 ఎంపీటీసీ.. 25 జెడ్పీటీసీ స్థానాలు జిల్లాలో 25 మండలాల పరిధిలో 613 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 261 ఎంపీటీసీ, 25 జెడ్పీటీసీ స్థానాలకు పోరు జరగనుంది. రెండు విడతలలో పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి విడతలో జహీరాబాద్తో పాటు నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలాల్లో ఉన్న 141 ఎంపీటీసీ స్థానాలు, 13 జెడ్పీటీసీ స్థానాలకు, రెండో విడతలో అందోల్, సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గంలోని 12 జెడ్పీటీసీ, 120 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం ఇప్పటికే 1,458 కేంద్రాలను గుర్తించారు. జిల్లాలో 1,748 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.పేరు అధికారి హోదా అంశం వెంకటేశ్వర్లు విద్యాశాఖ సిబ్బంది నియామకం అభిలాష్రెడ్డి సాంఘిక సంక్షేమ బ్యాలెట్ బాక్సులు అరుణ జిల్లా రవాణాశాఖ రవాణా రామాచారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిక్షణ కార్యక్రమాలు స్వప్న డిప్యూటీ సీఈఓ సామగ్రి పంపిణీ జగదీష్ బీసీ సంక్షేమశాఖ ఎన్నికల ప్రవర్తన, నియమావళి బలరాం ఆడిట్ అధికారి వ్యయ పరిశీలన సూర్యారావు అదనపు డీఆర్డీఓ రిపోర్టులు సమర్పణ బాలరాజ్ అదనపు డీఆర్డీఓ బ్యాలెట్, పోస్టల్ పేపర్ ముద్రణ ఏడుకొండలు డీపీఆర్ఓ మీడియా కమ్యూనికేషన్ సాయిబాబా డీపీఓ హెల్ప్లైన్, ఫిర్యాదుల కేంద్రం చలపతిరావు హౌసింగ్, పీడీ అబ్జర్వర్ 12 మంది నోడల్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ ఇప్పటికే ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా -
పండుగ కిక్కు
కొల్చారం(నర్సాపూర్): ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దసరాకు ‘కిక్కు’ అదిరింది. ఈనెల 2న దసరా రావడం అదే రోజు గాంధీ జయంతి ఉండడంతో ముందస్తుగానే మద్యం దుకాణాదారులు అమ్మకాలు చేపట్టారు. జిల్లాలోని కొల్చారం మండలం చిన్నఘనాపూర్ శివారులోని మద్యం ఆధారిత నిల్వ కేంద్రం (ఐఎంఎల్ డిపో) ద్వారా పండగకు ముందు గత నెల 29, 30 ఈనెల 1 (ఈ మూడు రోజుల్లో) ఏకంగా రూ. 22.17 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు డిపో వర్గాలు తెలిపాయి. వీటిలో 23,714 కేసుల లిక్కర్, 18,988 కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ. 3.57 కోట్ల అధిక మద్యం అమ్ముడైంది. -
వరికి తెగుళ్ల బెడద
మెదక్జోన్: ఖరీఫ్లో వరి సాగు కలిసి వస్తుందనుకున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. వరి పంట చేతికందే సమయంలో తెగుళ్లు ఆందోళనకు గురిచేస్తోంది. పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఈఏడాది అన్నిరకాల పంటలు కలిపి 3.29 లక్షల ఎకరాలు సాగు కాగా, అందులో 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేశారు. అందులో 2.28 లక్షల ఎకరాల్లో దొడ్డురకం, 77 వేల ఎకరాల్లో సన్నా లు సాగు చేశారు. కాగా ఈ ఏడాది జిల్లాలో భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గొలకాటు, మెడవిరుపు, కాటుక తెగుళ్లు సోకి పాలుపోసే దశలో గింజలు పొల్లుపోతున్నాయి. అధికారులు సూచించిన పురుగు మందులు ఒకటికి, రెండుసార్లు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో అత్యధికంగా కొల్చారం, పాపన్నపేట, హవేళిఘణాపూర్, మెదక్, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, రామాయంపేట, నిజాంపేట, నర్సాపూర్, శివ్వంపేట, తూప్రాన్ తదితర మండలాల్లో అధికంగా వరి సాగు చేశారు. టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడు, పెద్దశంకరంపేట మండలాల్లో పత్తి సాగు చేశారు. పత్తికి సైతం కాయకుళ్లు, ఎండుతెగులు సోకి తీవ్ర నష్టం జరిగింది. చిరుపొట్ట దశలో భారీ వర్షాలు కురవడంతోనే పంటలకు తెగుళ్లు ఆశించినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.పంటంతా దెబ్బతింటుంది నాకున్న రెండెకరాల్లో దొడ్డురకం వరి సాగు చేశాను. భారీ వర్షాలతో గొలకాటు వచ్చింది. ప్రస్తుతం వరి గింజలు పాలు పోసుకొనే దశలో పంటంతా దెబ్బతింటుంది. ఇప్పటికీ రెండుసార్లు పురుగు మందులు పిచికారీ చేశారు. వర్షాలతో పనిచేయకుండా పోయింది. ఇది మూడోసారి పిచికారీ చేస్తున్నాను. – ఆంజనేయులు, రైతు చందాపూర్ -
ఇసుక నోస్టాక్..!
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను అందుబాటులో ఉంచేందుకు జిల్లాలో అందోలు, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ప్రభుత్వం శాండ్ బజార్లు ఏర్పాటు చేసింది. డిజిటల్ మానిటరింగ్ సిస్టం ద్వారా విక్రయించేందుకు ఆర్భాటంగా కేంద్రాలను ప్రారంభించింది. అయితే అనుకున్నస్థాయిలో లబ్ధిదారులకు ఇసుకను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. శాండ్ బజార్ నిర్వాహకులు విఫలం చెందారనే విమర్శలున్నాయి. – జోగిపేట(అందోల్) జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 1,350 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులకు ఇసుక భారం కాకుండా ఉండేందుకు జిల్లాలో అందోలు, నారాయణఖేడ్ ప్రాంతాల్లో శాండ్ బజార్లు ఏర్పాటు చేసింది. టన్నుకు రూ. 1,200 చొప్పున విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం శాండ్ బజార్లో ఇసుక అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద టన్నుకు రూ. 2,800 చొప్పున లబ్ధిదారులు కొనుగోలు చేయా ల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు వస్తుందో చెప్పడానికి కేంద్రం వద్ద ఎవరూ అందుబాటులో లేరు. ఇసుక రావొచ్చునన్న ఆశతో టేక్మాల్, పుల్కల్, అందోలు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు నిత్యం శాండ్ బజార్ల వద్దకు వచ్చి పోతున్నారు.ఇబ్బంది పడుతున్నాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాండ్ బజార్లో 15 రోజులు గా ఇసుక నిల్వలు లేవు. గత్యంతరంలేక టన్నుకు రూ. 2,800 చెల్లించి బయట కొనుగోలు చేస్తున్నాం. సెంటర్ వద్ద లబ్ధిదారులకు సమాచారం ఇచ్చే వారు లేరు. టన్నుకు రూ. 1,200 అయితే తమకు గిట్టుబాటు అవుతుంది. లేదంటే తలకు మించిన భారం అవుతుంది. – నాగరాజు, లబ్ధిదారుడు, జోగిపేట ఆందోళన చెందొద్దు నల్గొండ, కొండపాక ప్రాంతాల నుంచి ఇసుక తీసుకువస్తాం. ప్రస్తుతం వర్షాల కారణంగా తీసుకురాలేకపోయాం. ఇప్పటివరకు అందోలులో 1,200 మెట్రిక్ టన్నులు, ఖేడ్లో 480 మెట్రిక్ టన్నుల ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు విక్రయించాం. త్వరలో ఇసుకను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు. – శ్రీకాంత్, పీఓ, శాండ్ బజార్ ఇందిరమ్మ లబ్ధిదారుల పరేషాన్ 15 రోజులుగా తప్పని తిప్పలు టన్నుకు రూ. 2,800 వెచ్చించి బయట కొనుగోలు జిల్లాలో రెండు చోట్ల శాండ్ బజార్ల ఏర్పాటు -
రాజరాజేశ్వరిదేవిగా వర్గల్ అమ్మవారు
వర్గల్(గజ్వేల్): అమ్మ విజయదర్శనం..శ్రీరాజరాజేశ్వరిదేవిగా సాక్షాత్కారం..వర్గల్ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన దసరాశరన్నవరాత్రోత్సవాలు గురువారం విజయ దశమి వేడుకలతో ముగిశాయి. దసరా పర్వదిన వేళ జయములిచ్చే జగన్మాత శ్రీరాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో అమ్మవారికి విశేషాభిషేకం జరిపారు. శమీపూజ అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి భక్తులకు అమ్మవారి విజయదర్శనం లభించింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవెంకటేశ్వరునికి లక్ష తులసి దళార్చన నిర్వహించారు.విజయదశమి రోజున శ్రీరాజరాజేశ్వరిదేవిగా వర్గల్ అమ్మవారు -
నిలిచిన రేషన్ సంచుల పంపిణీ
● ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ● జిల్లాకు 2.36 లక్షల పర్యావరణ హిత బ్యాగులు సరఫరారామాయంపేట(మెదక్): ఎన్నికల కోడ్ మూలంగా జిల్లాలోని తెల్లరేషన్ కార్డుదారులకు పర్యావరణ హిత సంచుల పంపిణీ నిలిచిపోయింది. జిల్లాలో ఉన్న 520 రేషన్ దుకాణాల్లో 2,32,579 తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. రేషన్ వినియోగదారులకు సరఫరా చేయడానికి గాను జిల్లాకు మొత్తం 2.36 లక్షల సంచులు సరఫరా అయ్యాయి. అక్టోబర్ నెల కోటాతో పాటు సంచులు వినియోగదారులకు అందజేయాలని మొదట్లో పౌర సరఫరాలశాఖ ఆదేశాలు జారీ చేసింది. సదరు సంచిపై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభయహస్తం చక్రం, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చిత్రాలు ముద్రించారు. ఇప్పటికే జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లకు, కొన్ని రేషన్ దుకాణాలకు సంచులు సరఫరా చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో లబ్ధిదారులకు సంచులు పంపిణీ చేయవద్దని తాజాగా పౌర సరఫరాలశాఖ ఆదేశాలు జారీ చేసింది.కోడ్ ముగిసిన తర్వాతే.. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రేషన్ విని యోగదారులకు పర్యావరణ హిత సంచుల సరఫరా నిలిపివేశాం. ఈమేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కోడ్ ముగిసిన తరువాత లబ్ధిదారులకు అందజేస్తాం. – జగదీశ్, డీఎం, పౌరసరఫరాలశాఖ -
కొల్చారం వైపు పెద్దాయన చూపు
● హాట్టాపిక్గా జెడ్పీటీసీ స్థానం ● అన్రిజర్వ్డ్ కావడంతో పోటీకి పలువురు సై..కొల్చారం(నర్సాపూర్): జిల్లాలో కొల్చారం జెడ్పీటీసీ స్థానం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. బీసీ రిజర్వేషన్తో ఇక్కడి జెడ్పీటీసీ స్థానం అన్ రిజర్వ్డ్ కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. గత ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ పెద్దాయన ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్లో చేరారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై ముందస్తు హామీ పొందినట్లు సమాచారం. అయితే ఆయన సొంత మండల జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్ కావడంతో పోటీ చేయలేని పరిస్థితి. దీంతో తనకు అనుకూలంగా ఉన్న కొల్చారం స్థానంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇక్కడి నాయకులతో మంతనాలు జరపడం, గత అనుభవాన్ని రంగరిస్తూ తనకు పూర్తి మద్ధతు ఇవ్వాలంటూ కోరినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు చెందిన యువ నాయకులు సైతం నేతలను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. తాము బరిలో ఉన్నామన్న సంకేతాన్ని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసుకుంటున్నారు. ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం యువ నాయకులకు కాకుండా స్థానికంగా ఉన్న సీనియర్లు, మరో బయటి వ్యక్తిని పోటీగా తీసుకువస్తారని సమాచారం. స్థానిక ఎన్నికలపై కోర్టు తీర్పు ఈనెల 8న ఉండటంతో అప్పటికీ బరిలో ఎవరు ఉంటారన్నది అధికారికంగా స్పష్టత రానుంది. -
దసరా సంబురం
దహనమవుతున్న రావణుడి ప్రతిమమెదక్జోన్/మెదక్మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా దసరా పండుగను గురువారం ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. ఉదయమే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాహనాలకు సైతం పూజలు చేయించారు. సాయంత్రం వేళ ఊరంతా ఒకచోట చేరి పాలపిట్టను దర్శనం చేసుకున్నారు. జమ్మిచెట్టుకు శమీ పూజలు నిర్వహించి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. మెదక్ పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పా టు చేసిన రావణవధ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్రావు హాజరయ్యారు. రావణుడి ప్రతిమకు నిప్పుపెట్టి వేడుకలను ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, మల్లికార్జున్గౌడ్, నాయకులు ఆంజనేయులు, మ్యాడం బా లకృష్ణ, గంగాధర్, బీజేపీ నేత గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోదండ రామా లయంలో జరిగిన ప్రత్యేక పూజలో కలెక్టర్ రాహుల్రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అంతకుముందు రాందాస్ చౌరస్తాలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. -
గెలుపు గుర్రాల వేటలో పార్టీలు
మెదక్జోన్/పాపన్నపేట (మెదక్): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపేలక్ష్యంగా ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఒక్కోజెడ్పీ స్థానానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున గుర్తించి జాబితాను పంపాలని కాంగ్రెస్పార్టీ సూచించగా ఆ దిశగా అభ్యర్థులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల జాబితాను ఇవ్వాలని ముఖ్యకార్యకర్తలకు సూచించింది. ఈ నెల 5 నాటికి పీసీసీకి జాబితా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకోవాలని భావించి ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులను గుర్తించి ఈనెల 5వరకు వారి జాబితాను పీసీసీకి పంపించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించటంతో ఆ పార్టీ నేతలు ఆగమేఘాల మీద గెలుపుగుర్రాల కోసం జల్లెడపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా బీఆర్ఎస్ రెండేళ్లల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని దీనినే అస్త్రంగా చేసుకుని స్థానిక ఎన్నికల బరిలో దిగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. బీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు దేవేందర్రెడ్డి బుధవారం జిల్లా కేంద్రంలోగల ఆ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇదే విషయాన్ని వెల్లడించారు. పోటీ చేయాలనుకునే వారి జాబితాను ఇవ్వాలని వారికి సూచించారు. ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురిని గుర్తిస్తున్న కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో నిమగ్నమైన బీఆర్ఎస్, బీజేపీజీఎస్టీ తగ్గింపుతో బీజేపీ ప్రధాని మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జీఎస్టీ తగ్గింపుతో దేశ ప్రజలకు కలిగే లాభాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థలల్లో భారీగా లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తోంది. పాపన్నపేట మండలంలో బుధవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశంగౌడ్ నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో బీజేపీ నిమగ్నమైంది. -
మంజీరా వరదలతో అప్రమత్తం
పాపన్నపేట(మెదక్): పోటెత్తుతున్న మంజీరా వరదలతో అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచించారు. ఏడుపాయల ఆలయం ముందు బుధవారం ఆయన మంజీర వరదను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఘనపురం ఆనకట్టపై నుంచి 1.09 లక్షల నీరు వెళ్తుందన్నారు. వరదలు ఉధృతంగా ఉండటంతో ఎల్లాపూర్ బ్రిడ్జిని తాకుతూ నీరు ప్రవహిస్తోందన్నారు. ప్రవాహం పెరిగితే రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉన్నందున, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా నది వైపు ఎవరు వెళ్లొద్దని చెప్పారు.ఎల్లాపూర్ బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్న మంజీరా -
సంగారెడ్డిలో సందడే..
సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో ఉత్సవాల ఏర్పాట్లు..సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రం దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. పండగను పురస్కరించుకుని పాతబస్టాండ్ రాంమందిర్ నుంచి శావ శోభాయత్ర నిర్వహిస్తారు. భక్తిశ్రద్ధలతో భజన కీర్తలతో ఈ శోభయాత్ర ఉంటుంది. రాంమందిర్ నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది. అంబేద్కర్ స్టేడియంలో రావణ దహణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. భారీ స్థాయిలో బాణాసంచ కాల్చుతారు. పట్టణ వాసులతో పాటు, పరిసర గ్రామాల ప్రజలు ఈ వేడుకలకు హాజరవుతుంటారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడి దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రతి ఏటా ఈ వేడుకలను తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. తాను మున్సిపల్ చైర్మన్గా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఈ వేడుకలను స్వయంగా పర్యవేక్షిస్తారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుల బృందాలు పాడే భక్తిగీతాలు వేడుకకు హాజరైన వారిలో ఆధ్మాత్మిక భావాన్ని పెంపొందిస్తుంటాయి. -
అందరిచూపు కోర్టు తీర్పుపైనే
మెదక్ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆశావహులంతా అక్టోబర్ 8న కోర్టు వెలువరించే తీర్పు కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. 42% బీసి రిజర్వేషన్లు అమలు అవుతాయా? అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే గందరగోళంలో కొట్టు మిట్టాడుతున్నారు. ఈ నెల 9న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నప్పటికీ, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఖర్చులు పెట్టుకోవడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. ఈ నెల 5 వరకు జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజక వర్గానికి ముగ్గురు ఆశావహుల చొప్పున పేర్లు పంపాలని పీసీసీ ఆదేశించడంతో, కాంగ్రెస్లో కొంత కదలిక మొదలైంది. అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా బుధవారం ఏడుపాయల్లో కలుసుకున్నారు. కాగా అధికారులు మాత్రం ఎన్నికల నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎవరి ధీమా వారిదే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలవుతాయని కాంగ్రెస్ ఽరాష్ట్ర నాయకులు ధీమాగా ఉండగా అదే పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకుల్లో మాత్రం అనుమానాలు లేవనెత్తుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా రాని వారు కూడా స్థానిక ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా పార్టీలో ముఖ్యులుగా చలామణి అవుతున్న ఓసీ వర్గాలు రిజర్వేషన్లు అనుకూలించక పోవడంతో నిర్లిప్తంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రిజర్వేషన్ల అమలుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్కు అనుగుణంగా కొంత మేర సంసిద్ధత ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ, ఈ నెల 8 న కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని వేచి చూస్తున్నారు. చాలామంది ఆశావహులు ఈ నెల 8 తర్వాతే ,ఆర్థిక పరమైన ఖర్చులు చేయాలని భావిస్తున్నారు. పండుగల సమయంలో కూడా వృథా ఖర్చులు చేయడం లేదు. సందిగ్ధత నడుమ ఎన్నికలకు సంసిద్ధులవుతున్నారు.బీసీ రిజర్వేషన్లు అమలవుతాయా! మెదక్ జిల్లాలో 21 జెడ్పీటీసీలు,190 ఎంపీటీసీలు, 492 గ్రామపంచాయతీలు,5,23,327 ఓటర్లు ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ప్రక్రియలో భాగంగా, ప్రభుత్వం జీవో నంబర్ 09 విడుదల చేసింది. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేసింది. అయితే బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సెప్టెంబర్ 27న కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. ఈ విషయంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, 42% రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వానికి,ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. 42% బీసీ రిజర్వేషన్లపై 8న తీర్పు వెలువరించనున్న కోర్టు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే దానిపై నెలకొన్న సందిగ్ధత తీర్పు వచ్చాకే ఎన్నికల క్షేత్రంలోకి దూకాలనుకుంటున్న నేతలు స్థానిక ఎన్నికల తీరిది -
‘జమ్మి’వనం..
ప్రత్యేకత చాటుకుంటున్న తున్కిఖాల్సా పల్లెప్రకృతి వనంవర్గల్(గజ్వేల్): అడవిలో ‘జమ్మి’ వనం ఊరందరికి చేరువైంది. పల్లె ప్రకృతికి శోభనిస్తోంది. పూజనీయమైన జమ్మి వృక్షాలతో వర్గల్ మండలం తున్కిఖాల్సా పల్లె ప్రకృతి వనం ప్రత్యేకత చాటుకుంటున్నది. గ్రామానికి అర కిలోమీటరు దూరంలో 5 జమ్మి వృక్షాలు ఒకేచోట సముదాయంగా పెరిగాయి. అక్కడే దసరా జమ్మీ పూజ నిర్వహించుకునేవారు. 2019లో పల్లెప్రకృతివనం ఆలోచన తెరపైకి వచ్చింది. ఆ వెంటనే రెండెకరాల విస్తీర్ణంలో జమ్మిచెట్లు మధ్యలో ఉండేలా పచ్చనిలాన్, చుట్టూరా వృత్తాకారంలో గద్దె, అక్కడే భారతమాత విగ్రహం, దేశభక్తికి చిహ్నంగా ఎత్తయిన జాతీయ జెండా, కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు, తెలంగాణ సంస్కృతికి చిహ్మంగా బతుకమ్మ..ఇలా అన్ని కలగలసి పల్లెప్రకృతి వనం శోభాయమానంగా రూపుదిద్దుకున్నది. ఆహ్లాదతకు నెలవుగా, ఊరందరూ దసరా వేళ జమ్మి వృక్షాలు పూజించే ఆధ్యాత్మికతల కొలువుగా ప్రత్యేకత చాటుకుంటున్నది. -
ఊరంతా ఏకమై.. సంప్రదాయం వేడుకై
బతుకమ్మ, దాండియా ఆటలతో దుమ్మురేపే ఆడపడుచులుయువకుల అలయ్– బలయ్ దుబ్బాకలో ప్రత్యేకందుబ్బాక/దుబ్బాకటౌన్: పట్టణంలో దసరా ఉత్సవాలు ప్రతీ ఏటా ప్రత్యేకంగా నిలుస్తాయి. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఈ వేడుకలు జరుగుతున్నాయి. పండుగ రోజు సాయంత్రం ఊరి ప్రజలంతా గాంధీ విగ్రహం వద్ద ఏకమై రావణ దహనం చేస్తారు. అనంతరం ఆడపడుచుల బతుకమ్మ, దాండియా ఆటలతో అలరిస్తారు. యువకులు, పెద్దలు అలయ్ – బలయ్ కార్యాక్రమాలు, యువకుల డ్యాన్సులు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. పట్టణాలను నుంచి వచ్చిన ఉద్యోగస్తులు, కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తుకుంటారు. దసరా రోజే కాకుండా దేవి శరన్నావరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండల పాల వద్ద వారం పాటు ఆడపడుచుల దాండియా, బతుకమ్మ ఆటపాటలు కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నాయి. అలాగే దసరారోజున పట్టణంలోని చెల్లాపూర్రోడ్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జమ్మిచెట్టు వద్దకు డప్పుచప్పుళ్లతో వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. -
నేడు విజయదశమి ఉమ్మడి జిల్లాలో వైవిధ్యభరితం
ఉమ్మడి మెదక్ జిల్లా విభిన్న జీవన సంస్కృతుల సమ్మేళనం. అనేక ఆచారాలు, అలవాట్లతో కూడిన వైవిధ్యమైన ఉమ్మడి జిల్లా. వివిధ వర్గాల ప్రజలు దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దసరా అంటే సరదాలకు, సందళ్లకు మరొక పదం. ఆట పాటలకు ఆలవాలం. ఇంటిల్లిపాదీ నూతన దుస్తులు ధరించి రకరకాల పిండి వంటలు, నాన్వెజ్ వంటకాలతో ఆనందంగా గడిపేస్తారు. అంతా కలిసి బ్యాండు మేళాలతో వెళ్లి పాలపిట్టను చూసి విజయోత్సాహంతో కేరింతలు కొడతారు. అక్కడి నుంచి నేరుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేస్తారు. పాపాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటారు. మనుషుల మధ్య కల్మషాలన్నింటినీ కడిగి పారేసి ప్రేమ, ఆత్మీయత, అనురాగాలను పంచిపెట్టే పండుగ దసరా. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వైవిధ్యభరితంగా జరిగే వేడుకల కథనాలు కొన్ని.. -
‘జెడ్పీ’ పీఠానికే గురి
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పట్టు కోసం కాంగ్రెస్..పునర్వైభవం కోసం బీఆర్ఎస్..ఉనికి కోసం బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే జెడ్పీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని అటు అధికార పార్టీ కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సర్వశక్తుల్ని కూడదీసుకుంటున్నాయి. – మెదక్ అర్బన్: గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ ఈ సారి పట్టు సాధించేందుకు కృషి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రధానాస్త్రంగా ప్రయోగించే యత్నాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని భావిస్తోంది. ఆ దిశగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్రావు పార్టీ కేడర్ను బలోపేతం చేస్తున్నారు. గెలుపు అవకాశాలున్నవారికి, పార్టీ కోసం కష్టించిన వారికే టికెట్లు ఇవ్వాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. అలాగే సర్పంచ్ అభ్యర్థులను సైతం ఎంపిక చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇక సొంత గ్రామాల్లో రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో కాంగ్రెస్ నుంచి జెడ్పీ పీఠాన్ని ఆశిస్తున్న ఓ పెద్దాయన, పక్క మండలం నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. కమలం వికసించేనా! గత పార్లమెంటరీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీని స్థానిక ఎన్నికల్లో సైతం వికసించేలా ప్రచార పర్వం కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రధాని మోదీ పేరుతో యువతను, సామాన్య ప్రజానీకాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.యువకులు, విద్యాధికులపై పార్టీ ఆశలు పెట్టుకుంది. ఆర్ఎస్ఎస్ మూలాలున్న గ్రామాలపై దృష్టి పెట్టింది. గెలుపు అవకాశాలున్న అన్ని చోట్ల, గెలుపోటములను ప్రభావితం చేసే గ్రామాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే జిల్లాలో ‘సేవా పక్షం’పేరిట ఎంపీ రఘునందన్రావు స్థానిక సంస్థల ఎన్నికల శంఖాన్ని పూరించారు. ఆయన ఎంపీగా ఎన్నికై న అనంతరం పలు రోడ్లు, సోలార్ దీపాలను మంజూరు చేయించారు. నియోజక వర్గంలో తరచూ పర్యటనలు చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.పట్టు చేజారినివ్వకుండా బీఆర్ఎస్ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఊడ్చేసిన బీఆర్ఎస్ తిరిగి పునర్వైభవం దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. గత ఎన్నికల్లో 20 జెడ్పీటీసీ స్థానాలకు 18 స్థానాల్లో విజయం సాధించడంతోపాటు సుమారు 15 ఎంపీపీ స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అదే పట్టును కొనసాగించేందుకు ‘ఇంటింటికీ బాకీ కార్డు’ను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలని ఆపార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలను ఎండగట్టే విధంగా ప్రచార సరళి నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. గ్రామీణులను ఆకట్టుకునేలా డాక్యుమెంటరీలు రూపొందించినట్లు తెలుస్తోంది. రైతులకు యూరియ కష్టాలు, మహిళలకు రూ.2,500 ఫించన్, రూ.4 వేల నిరుద్యోగ భృతిని వంటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల్ని ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి కాపాడుకోగలిగారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై తరచూ ఆందోళనలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అదే బలంతో ఎన్నికల పోరాటంలో నిలిచి విజయం సాధిస్తామన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఓ ప్రధాన నాయకుడికి సొంత ప్రాదేశిక నియోజక వర్గంలో జెడ్పీటీసీ రిజర్వేషన్ అనుకూలంగా వచ్చింది. ఆయన అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టు కోసం కాంగ్రెస్.. పునర్వైభవం కోసం బీఆర్ఎస్.. ఉనికి కోసం బీజేపీ జెడ్పీ చైర్మన్ కోసం వలస వెళ్లనున్న పెద్దాయన స్థానిక సంస్థల్లో పట్టుకోసం సర్వశక్తుల్ని కూడదీసుకుంటున్న పార్టీలు -
బాసరలో పూజలు చేసిన కాంగ్రెస్ నేతలు
నర్సాపూర్: బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీమాత ఆలయాన్ని పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం సందర్శించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, చిలప్చెడ్ మాజీ జెడ్పీటీసీ శేషసాయిరెడ్డితోపాటు పలువురు నాయకులు అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నల్లపోచమ్మదేవి ఆలయంలో ఎమ్మెల్యే పూజలుకౌడిపల్లి(నర్సాపూర్): మండలంలో తునికి శ్రీనల్లపోచమ్మదేవి ఆలయంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి మంగళవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి ఎమ్మెల్యే రావడంతో ఆలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. అనంతరం నల్లపోచమ్మదేవికి ఎమ్మెల్యే కుంకుమార్చన చేశారు. పూజలు అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సారరామాగౌడ్, నాయకులు సాయాగౌడ్, ఎల్లం, ప్రవీణ్కుమార్, కిశోర్గౌడ్, అమర్సింగ్, సంజీవ్, చంద్రయ్య, రామానుజం తదితరులు పాల్గొన్నారు. పూర్తయిన రైల్వే బ్రిడ్జి మరమ్మతులునేటి నుంచి పునఃప్రారంభం హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని శమ్నాపూర్ శివారులో ఆగస్టు 28న కురిసిన భారీ వర్షాలకు రైల్వేబ్రిడ్జి కొట్టుకుపోయిన విషయం తెల్సిందే. దీంతో గత కొంత కాలంగా బ్రిడ్జి మరమ్మతులు చేసేందుకు భారీ వర్షాలు కురుస్తుండటంతో పనులకు అంతరాయం ఏర్పడగా ఎట్టకేలకు పనులు పూర్తి చేసి బుధవారం నుంచి మెదక్ రైల్వే రాకపోకలు కొనసాగించనున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు మంగళవారం విలేకరులకు తెలిపారు. అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలిసదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని అగ్ని ప్రమాదాలపట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ ఎమర్జెన్సీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ నారాయణరావు పేర్కొన్నారు. ఎంఆర్ఎఫ్ పరిశ్రమ సీఆర్ఎస్ నిధులతో సదాశివపేట అగ్నిమాపక కేంద్రం ఆవరణలో నిర్మించిన అగ్నిమాపక కేంద్రం నూతన భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం అగ్నిమాపక కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అగ్నిమాపక కేంద్రం పరిధిలో 552 అగ్ని ప్రమాదాలు జరిగాయని 28 అత్యవసర రక్షణ చర్యలు చేపట్టారన్నారు. అగ్నిప్రమాద రక్షణ చర్యల్లో భాగంగా రూ.80.74 కోట్ల విలువైన ఆస్తులను కాపాడినట్లు తెలిపారు. -
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
మెదక్జోన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఎవరైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 29 నుంచే జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని అయితే మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్, మున్సిపల్ల్లో కోడ్ ఉండదని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారానికి 3 రోజులు ముందుగానే అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా ఎవరైనా కోడ్ ఉల్లంఘించినట్లు, డబ్బులు పంచినట్లు సమాచారముంటే కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎవరూ రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బులు వెంట తీసుకెళ్లకూడదని, పెళ్లిల్లు, ఆస్పత్రి ఖర్చులు, పిల్లల కాలేజీ ఫీజులు చెల్లించేందుకు అంతకుమించి డబ్బు తీసుకెళ్లి పట్టుబడితే సరైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. పేపర్, టీవీ, సోషల్ మీడియా యాడ్స్ విషయంలో పార్టీలు, అభ్యర్థులు ఎంసీఎంసీ కమిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్డ్ ఆయుధాలు కలిగి ఉన్నవారు వాటిని డిపాజిట్ చేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య పాల్గొన్నారు. ర్యాలీలు, సభలకు అనుమతులు తప్పనిసరి జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ -
రాజుకున్న ఎన్నికల వేడి
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో రిజర్వేషన్ కలిసొచ్చిన పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు దసరా రోజున మద్యం, మటన్ పంపిణీ చేసేందుకు సన్నాహాలు మొదలెట్టారు. రిజర్వేషన్ కలిసిరాని బడానేతలు పక్కమండలం నుంచి పోటీచేసేందుకు పావులు కదుపుతున్నారు. – మెదక్జోన్: జిల్లాలో 21 మండలాలు, 492 పంచాయితీలు, 21 ఎంపీటీసీ స్థానాలు, 21 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుతో ఎన్నికలు జరుగనున్నాయి. ఆశావహులకు రిజర్వేషన్ కలిసొచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులకు పోటీ చేయదలచుకున్న నేతలు గ్రామాల్లో అప్పుడే మందు, విందులతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మద్యం కొనుగోలు! ఎన్నడూలేనివిధంగా చిన్నా, చితక పనులుంటే మాకు చెప్పండి చేసి పెడతాం అంటూ వరుసలు పెట్టి మరీ పలుకరిస్తూ ఓటర్ దేవుళ్లను ఆశావహులు మచ్చిక చేసుకుంటున్నారు. గాంధీ జయంతి రోజున మద్యంషాపులు మూసిఉంటాయని ముందుగానే భారీగా మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దసరా రోజు తెల్లవారు జామునే ఇంటికి కిలో చొప్పున మటన్, ఆఫ్ బాటిల్ చొప్పున మద్యం పంపిణీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. పక్క మండలాలకు వలస మెదక్ ప్రత్యేక జిల్లా ఏర్పాటు అయ్యాక 2019లో మొదటిసారి జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళకు రిజర్వేషన్ ఖరారైంది. ప్రస్తుతం ఆ సీటు జనరల్కు కేటాయించింది. జిల్లాలో పలువురు బడా నేతలు జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి సొంత ప్రాదేశిక స్థానాల్లో రిజర్వేషన్ అనుకూలించలేదు. దీంతో ఎలాగైనా జెడ్పీ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు సదరు నేతలు పక్కమండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచేందుకు పావులు కదుపుతున్నారు.ఆశలు అడియాశలైన వేళ ఇందులో ప్రధానంగా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మధన్రెడ్డి (ఓసీ) వర్గానికి చెందిన వ్యక్తి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను వీడి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్పట్లో ఆయనకు జెడ్పీచైర్మన్ పదవి కట్టబెడతారని ప్రచారం జోరుగా సాగింది. కానీ అయితే ఆయన స్వగ్రామం కౌడిపల్లి సొంత జిల్లా పరిషత్ స్థానం బీసీ జనరల్కు కేటాయించడంతో కొల్చారం ఓసీ జెడ్పీటీసీ జనరల్ కావటంతో అక్కడి నుంచి పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అదే నియోజకవర్గం మాసాయిపేటకు చెందిన రాజిరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆయన సైతం జెడ్పీ చైర్మన్ ఆశించినప్పటికీ ఆయన జిల్లా ప్రాదేశిక(జెడ్పీటీసీ)ఎస్సీలకు రిజర్వుడ్ అయింది. పాపన్నపేట మండలానికి చెందిన తాజా, మాజీ ఎంపీపీ చందన భర్త ప్రశాంత్రెడ్డి అదేమండలానికి చెందిన ప్రభాకర్రెడ్డి కూడా జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆ మండలంలోని జిల్లాపరిషత్ బీసీకి రిజర్వుడ్ కావటంతో వారి ఆశలు సైతం అడియాశలైయ్యాయి. మొదటి నుంచి ఎన్నోఆశలు పెట్టుకుని రూ.లక్షలు ఖర్చులు పెట్టుకున్న బడానేతలు పక్కమండలాల నుంచి పోటీచేసి జెడ్పీపీఠాన్ని కై వసం చేసుకునేందుకు రాష్ట్రనేతల వద్దకు పరుగులు పెడుతున్నారు.రిజర్వేషన్ కలిసొచ్చిన గ్రామాల్లో పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు దసరారోజు మటన్, మద్యం పంపిణీకి సన్నాహాలు రాష్ట్ర నేతల ఆశీస్సులకోసం పరుగులు -
ప్రతిభావంతులకు ప్రోత్సాహం
మెదక్ మున్సిపాలిటీ: శిక్షణా కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచే సిబ్బందిని జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఫైరింగ్, పీపీటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన కానిస్టేబుల్ నరేశ్ను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇలాంటి యువ సిబ్బంది కృషి భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్తుందన్నారు. ఈ సందర్బంగా నరేశ్కు రివార్డు మంజూరు చేశారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ రవీందర్, సీనియర్ అసిస్టెంట్ అల్తాఫ్ హుస్సేన్లను ఎస్పీ ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మీకు ఏవైనా సమస్యలు ఎదురైనా, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, శైలేందర్, ఎసైలు నరేశ్ భవానీ కుమార్, మణి పాల్గొన్నారు.కానిస్టేబుల్ నరేశ్ను అభినందించిన ఎస్పీ -
మాకు రిజర్వేషన్ ఉండదా?
మెదక్ కలెక్టరేట్/పాపన్నపేట(మెదక్): డభై ఐదేళ్లుగా ఒక్కసారి కూడా తమ గ్రామం ఎస్సీలకు రిజర్వుడు కాలేదని పాపన్నపేట మండలం కొత్త లింగాయపల్లి దళితులు ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా కుట్రపూరితంగా రిజర్వేషన్లు ఖరారు చేశారని ఆరోపిస్తూ మంగళవారం మెదక్ కలెక్టరేట్లో సదరు గ్రామంలోని దళితులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ రాహుల్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కేటాయించిన రిజర్వేషన్లతో తాము పోటీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామంలో 25% ఎస్సీ జనాభా ఉండగా గతంలో రెండు వార్డులు ఎస్సీలకు రిజర్వేషన్ ఉండేవని తెలిపారు. ఈసారి ఆ రెండు కూడా లేకుండా కుట్రతో రిజర్వేషన్లు కేటాయించారని ఆరోపించారు. దళితులు కనీసం వార్డు మెంబర్గా కూడా ఎదగొద్దని కుట్రపూరితంగా రిజర్వేషన్లు కేటాయించినట్లు ఉందన్నారు. గ్రామంలో 8వార్డులు ఉండగా 4 వార్డుల్లో 90% ఎస్సీలు, 10% ఓసీ జనాభా ఉందని తెలిపారు. ఆ వార్డుల్లో బీసీ రిజర్వేషన్ చేయడంతో ఎస్సీలు పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని మరో 4 వార్డుల్లో ఓసీలు, బీసీలు లేరు, అక్కడ అన్రిజర్వ్ చేశారని ఆరోపించారు. ఈ రిజర్వేషన్ను పునఃపరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ను కలసిన వారిలో గ్రామానికి చెందిన దళితులు దినకర్, ఆనంద్, కుమార్, అనంతి, దేవయ్య, సాయిబాబు, ఆగమయ్య, సామేల్, సాయికుమార్,భాగ్య, రత్నమ్మ తదితరులు ఉన్నారు. కలెక్టరేట్ వద్ద కొత్త లింగాయపల్లి దళితుల నిరసన ఎస్సీలున్న చోట బీసీలకు.. బీసీలున్న చోట ఎస్సీలకు రిజర్వేషన్! -
సాయుధ కారాగారంలో ఆయుధపూజ
సంగారెడ్డి జోన్: జిల్లా పోలీస్ సాయుధ కారాగారంలో ఆయుధ పూజను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దుర్గాష్టమి పురస్కరించుకుని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆయుధాలతోపాటు వాహనాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలు నియంత్రణలో విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతం అయ్యేందుకు దుర్గామాత కరుణ, కటాక్షాలు పోలీసులపై ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు (అక్టోబరు 1వ తేదీ నుంచి 31 వరకు) 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని చెప్పారు. ముందస్తు అనుమతి లేనిదే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగసభలు, సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు.పూజలో పాల్గొన్న జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ -
ఆ పార్టీలకు గుణపాఠం చెప్పండి
నర్సాపూర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రజలను మోసం చేశాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రెండు పా ర్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. అన్ని స్థానాల్లో పోటీ చేసి మెజారిటీ స్థానాలను ద క్కించుకోవడంతో పాటు జెడ్పీ చైర్మన్ పదవిని సైతం కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాగా రిజర్వేషన్లలో పలు చోట్ల అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో చాలా వెనుకబడిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రూ. 140 కోట్లు పంచాయతీ కార్యదర్శులకు విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. సమావేశంలో పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేశ్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్, నాయకులు రమేశ్గౌడ్, ఆంజనేయులుగౌడ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సన్నాలకు బోనస్ ఎప్పుడు? మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి పాపన్నపేట(మెదక్): దసరా పండుగకై నా సన్న వడ్ల బోనస్ డబ్బులు విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డికి మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పాపన్నపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారీ వర్షాలతో జిల్లాలో చేతికొచ్చిన వేలాది ఎకరాల వరి పంట మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగకు డబ్బులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. యాసంగిలో సన్న వడ్లకు ఇస్తానన్న బోనస్ డబ్బులు ఇప్పటివర కు ఇవ్వలేదని వాపోయారు. కనీసం ఈ రెండు రోజుల్లో ఇస్తే, సంతోషంగా పండుగ జరుపుకుంటారన్నారు. ఆయన వెంట మాజీ ఉపసర్పంచ్ అనిల్రెడ్డి, చిట్యాల రవీందర్, సంజీవరెడ్డి, యువ నాయకుడు ప్రేమ్కుమార్ త దితరులు ఉన్నారు. గంగమ్మ ౖపైపెకి.. కౌడిపల్లి(నర్సాపూర్): విద్యుత్ మోటార్ సహాయం లేకుండానే బోరు బావి నుంచి నీరు పైకి వచ్చిన సంఘటన మండలంలోని ధర్మాసాగర్ గేట్ సమీపంలో సోమవారం జరిగింది. రైతు రాంరెడ్డి వ్యవసాయం పొలంలోని రెండు బోరు బావుల్లో మోటార్ వేయకుండానే కేసింగ్పైపు నుంచి నీరు పైకి వచ్చింది. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పూర్తిగా నిండటంతో భూగర్భజలాలు పెరిగి నీరు పైకి వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. కవికి కీర్తి రత్న పురస్కారం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి వెంకటేశం కీర్తి రత్న పురస్కారం అందుకున్నట్లు, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. హైదరాబాద్లో జరిగిన కా ర్యక్రమంలో ‘అందమైనది నాదేశం’ గేయానికి గాను భ వాని సాహిత్య వేదిక నిర్వాహకులు కీర్తి రత్న పురస్కారంతో పాటుగా ఘనంగా సన్మానించారన్నారు. వెంకటేశంకు జిల్లా కవు లు బస్వరాజ్కుమార్, రాజయ్య, పర్శరాము లు, తదితరులు అభినందనలు తెలిపారు. 11 నుంచి ఇర్ఫానీ దర్గా ఉత్సవాలుసంగారెడ్డి టౌన్: ç³rt׿ ÕÐé-Æý‡$ÌZ° CÆ>¹± §ýlÆ>Y EÆý‡$Þ E™èlÞÐéË$ AMøt-ºÆŠḥæ 11 ¯]l$…_ fÆý‡$-VýS-¯]l$-¯é²Ä¶æ$° ï³u>-«¨ç³† çßæ{f™Œæ çßæMîSÐŒl$ JÐ]l$ÆŠæ ¼¯Œl AçßæÃ§Šæ çÜfj§Šæ Äôæ$ ¯]lïÙ-¯Œl »êÆý‡Y CÆ>¹± ™ðlÍ-´ëÆý‡$. D E™èlÞ-Ðé-ÌSMýS$ ò³§ýlª G™èl$¢¯]l ¿ýæMýS$¢Ë$ àfOÆð‡ Ððl¬MýS$PË$ ¡Æý‡$a-MýS$…-sêÆý‡° ™ðlÍ-´ëÆý‡$. Ððl¬ §ýlsìæ Æøk Ð]l$ïܧýl$ ¯]l$…_ ÝëĶæ$…{™èl… 5 VýS…r-ÌSMýS$ VýS…«§ýl… FÆó‡-W…ç³#, Æ>{† 8 VýS…r-ÌSMýS$ CÆ>¹± §ýlÆ>YÌZ VýS…«§é-Æ>-«§ýl¯]l, 9 VýS…rÌSMýS$ BÌŒæ C…yìlĶæ* Ð]l¬Úë-Ƈ$$Æ> E…r$…§ýl° ™ðlÍ-´ëÆý‡$. -
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం మండలంలోని తునికి గేట్ సమీపంలోని ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో స్ట్రాంగ్రూం, కౌంటింగ్హాల్ ఏర్పాటు కోసం గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికల రిజర్వేషన్లు పూర్తికాగా, ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. దీంతో జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తునికి ఎంజేపీలో బ్యాలెట్ బాక్స్లు భద్రపరిచేందుకు, కౌటింగ్ కోసం పరిశీలించినట్లు వివరించారు. గురుకులానికి సంబంధించి పూర్తివివరాలు ప్రిన్సిపాల్ హరిబాబును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పటిష్టంగా కోడ్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శనివారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముది హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ మహేందర్, ఇతర శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కోడ్ ఉల్లంఘన జరిగితే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఆర్డీఓ రమాదేవి, నోడల్ అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
కోడ్ కూసింది
స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలస్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో జిల్లాలో కోడ్ అమల్లోకి వచ్చింది. ముందుగా ప్రాదేశిక, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తంగా 37 రోజుల పాటు సాగే ఈ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం అయింది. – మెదక్జోన్ జిల్లాలో 21 మండలాలు ఉండగా, 21 ఎంపీపీ, 21 జెడ్పీటీసీ, 190 ఎంపీటీసీలు ఉన్నాయి. మొదటి విడతలో మెదక్ డివిజన్ పరిధిలోని రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, మెదక్, హవేళిఘణాపూర్, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, పెద్దశంకరంపేట మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అక్టోబర్ 9వ తేదీ నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 15న విత్డ్రాకు అవకాశం కల్పించి, 23న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడతలో తూప్రాన్, నర్సాపూర్ డివిజన్ల పరిధిలో గల 11 మండలాలకు ఎన్నికలు జరుగనున్నాయి. చేగుంట, నార్సింగి, మాసాయిపేట, వెల్దుర్తి, మనోహరాబాద్, తూప్రాన్, నర్సాపూర్, చిలప్చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 13వ తేదీ నుంచి 15 వరకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించి 16న స్క్రూ ట్నీ, 17న అప్పిల్ (ఫిర్యాదు), 18న వివరణ, 19న విత్డ్రాకు అవకాశం కల్పించి 27న ఎన్నికలు జరుపనున్నారు. మొదటి, రెండో దశలో జరిగిన పోలింగ్కు సంబంధించి నవంబర్ 11న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. పంచాయతీ ఎన్నికలు ఇలా.. జిల్లాలో రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో రేగోడ్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, మెదక్, హవేళిఘణాపూర్, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట మండలాల పరిధిలో అక్టోబర్ 17 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. 31న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజు 2:30 గంటల నుంచి సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు చేట్టి ఫలితాల వెల్లడించనున్నారు. రెండో విడతలో నర్సాపూర్, చిలప్చెడ్, శివ్వంపేట, కౌడిపల్లి, కొల్చారం, తూప్రాన్, మనోహరాబాద్, మాసాయిపేట, వెల్దుర్తి, చేగుంట, నార్సింగి మండలాల పరిధిలో అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 27న విత్డ్రాకు అవకాశం కల్పించి, అదేరోజు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. నవంబర్ 4వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి, అదేరోజు సాయంత్రం ఫలితాల వెల్లడించనున్నారు. అధికారులు సర్వం సిద్ధం ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు సిద్ధంగా ఉన్నారు. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 1,052 పోలింగ్ బూత్లను సిద్ధం చేశారు. ప్రిసైడింగ్, రూట్ అధికారులతో పాటు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అలాగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 4,220 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 3,882 బ్యాలెట్ బాక్సులు అవసరం ఉండగా, గుజరాత్ నుంచి 1,036 బాక్సులను తెప్పించారు. జిల్లాలో 2,846 సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి మొత్తం 736 మంది అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. జిల్లాలో రెండు విడతల్లో ప్రాదేశిక, పంచాయతీ పోరు వచ్చేనెల 23, 27 తే దీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ 11న ఓట్ల లెక్కింపు పోలింగ్ రోజునే సర్పంచ్ ఎన్నికల ఫలితాలుజిల్లాలో ఇలా.. గ్రామ పంచాయతీలు 492 వార్డు సభ్యులు 4,220 జెడ్పీటీసీల సంఖ్య 21 ఎంపీటీసీలు 190 ఎంపీపీలు 21 మొత్తం ఓటర్లు 5,23,327 మహిళలు 2,71,787 పురుషులు 2,51,532 ఇతరులు 8 -
సమస్యలుంటే నేరుగా సంప్రదించాలి
మెదక్ మున్సిపాలిటీ: ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా సంబంధిత పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి చట్టప్రకారం ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో వాటిని పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు.అదనపు ఎస్పీ మహేందర్ -
పుస్తక రూపిణి.. వివేకధాత్రి
వర్గల్(గజ్వేల్): పుస్తక రూపిణి..వివేకధాత్రి.. విద్యాసరస్వతిదేవి నిజరూప దర్శనం భక్తజనావళిని మంత్రముగ్ధులను చేసింది. శంభుని కొండ అమ్మవారి స్మరణతో మార్మోగింది. విశేషాభరణాలు, నవరత్న మణిమయ స్వర్ణకిరీటంతో పుస్తకరూపిణి దివ్యదర్శనం..ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన ఈ అపూర్వఘట్టం సోమవారం వర్గల్ క్షేత్రంలో మూల మహోత్సవం సందర్భంగా ఆవిష్కృతమైంది. పీఠాధిపతులు విద్యాశంకరభారతి స్వామి, మాధవానందసరస్వతి స్వామి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి ఆధ్వర్యంలో మూల నక్షత్ర వేడుకలు కొనసాగాయి. వేదమంత్రోచ్ఛరణల మధ్య భక్తజన సామూహిక లక్ష పుష్పార్చ న, మహాపుస్తక పూజ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. పూర్ణకుంభస్వాగతం క్షేత్రం సందర్శించిన పుష్పగిరి, రంగంపేట పీఠాధిపతులు విద్యాశంకర భారతి స్వామి, మాధవానంద సరస్వతి స్వామిలకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అభి షేకాది పూజలు నిర్వహించి అమ్మవారి సేవలో త రించారు. భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తది తరులు అమ్మవారిని దర్శించుకున్నారు.వర్గల్ సరస్వతిదేవి నిజరూపదర్శనం 3,000 పైగా అక్షర స్వీకారాలు మూల మహోత్సవం సందర్భంగా సరస్వతిమాత సన్నిధిలో చిన్నారుల అక్షరాభ్యాసాల సందడి కొనసాగింది. 3000 పైగా చిన్నారులు అక్షరస్వీకారాలు చేశారని ఆలయ వర్గాలు తెలిపాయి. -
సద్దుల సంబురం
చిన్నశ ంకరంపేట: అంబాజీపేటలో బతుకమ్మలను నిమజ్జనానికి తీసుకెళ్తూ..శివ్వంపేట: బతుకమ్మ పేరుస్తున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి● జిల్లాలో ఘనంగా పెద్ద బతుకమ్మ ● సంబురంగా ఆడిపాడిన మహిళలు ● ఊరూరా గౌరమ్మకు ఘన వీడ్కోలుసద్దుల సంబురాలు జిల్లాలో అంబరాన్నంటాయి. సోమవారం ఆడబిడ్డల ఆటపాటలతో ఊరూరూ పూలవనాల్లా మారాయి. ఉదయం నుంచే మహిళలు తీరొక్కపూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం కొత్త దుస్తులు ధరించి, గౌరమ్మకు పూజలు చేశారు. అనంతరం కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆటాపాటలతో హోరెత్తించారు. అనంతరం స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. ‘పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా’ అంటూ వీడ్కోలు పలికారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కాగా కొన్ని మండలాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను మంగళవారం నిర్వహించనున్నారు. -
జోరుగా పూల విక్రయాలు
శివ్వంపేట(నర్సాపూర్): సోమవారం సద్దుల బతుకమ్మ కావడంతో పూల అమ్మకాలు జో రుగా సాగుతున్నాయి. కొనుగోలుదారులతో శివ్వంపేటలో సందడి నెలకొంది. కిలో బంతిపూలు రూ. 90 నుంచి 120 వరకు వ్యాపారులు విక్రయించారు. మహాసభల కరపత్రం ఆవిష్కరణ మెదక్ కలెక్టరేట్: మెదక్లోని కేవల్ కిషన్ భవన్లో ఆదివారం సీఐటీయూ మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జిల్లాలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల కరపత్రాలను రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఆవిష్కరించి మాట్లాడారు. మహాసభ లకు విస్తృత ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య, మల్లికార్జున్, ఆహ్వాన సంఘం వైస్ చెర్మన్ అడివయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, మల్లేశం, జిల్లా కోశాధికారి నర్సమ్మ, మహేందర్రెడ్డి, నాగరాజు, బస్వరాజు, సంతోశ్, గౌరయ్య, మల్లేశం, అజయ్, ప్రవీణ్, బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇక సమరమే..
పల్లెల్లో ‘స్థానిక’ సందడి ● ముగిసిన రిజర్వేషన్ల ప్రక్రియ ● 42 శాతంతో బీసీలకు డబుల్ ధమాకా పల్లెల్లో బతుకమ్మ, దసరా పండుగలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల సందడి కూడా కనిపిస్తోంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ రిజర్వేషన్లు శనివారం సాయంత్రం ప్రకటించగా, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ అర్థరాత్రి వరకు కొనసాగింది. ఖరారు చేసిన రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపించింది. బీసీలకు 42 శాతం అమలు చేయడంతో గతంతో పోలిస్తే సుమారు రెండింతల పాలకపక్షం పెరగనుంది. – మెదక్జోన్ జిల్లాలో 21 మండలాలతో పాటు 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 4,220 వార్డులు, 190 ఎంపీటీసీలు ఉండగా, 5,23,327 ఓటర్లు ఉన్నారు. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో బీసీవర్గాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నా రు. గతేడాది జిల్లాలో 469 గ్రామాలు ఉండగా, పరిపాలన సౌలభ్యం కోసం 23 పంచాయతీలను కొత్తగా ప్రకటించారు. దీంతో వాటి సంఖ్య 492 చేరుకుంది. అలాగే మాసాయిపేట మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేయడంతో మండలాల సంఖ్య 21కి చేరింది. గతంలో 189 ఎంపీటీసీలు ఉండగా, నూతన మండలం మాసాయిపేటతో కలిపి 190కి చేరుకుంది.మారిన ముఖచిత్రం 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికలకు 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 25 శాతం రిజర్వేషన్ అమలు చేశారు. అందులో భాగంగా 120 స్థానాలు ప్రకటించగా, ప్రస్తుతం 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ 179 స్థానాలను కేటాయించారు. ఈలెక్కన 59 స్థానాలు బీసీలకు అదనంగా పెరిగాయి. అలాగే ఎస్టీ 92 స్థానాలు, ఎస్సీ 77, అన్ రిజర్వుడ్(యూఆర్)కు 144 కేటాయించారు. వాటిలో మొత్తంగా మహిళకు 50 శాతం వాటా కల్పిస్తూ రిజర్వేషన్ ఫైనల్ చేశారు. అలాగే జిల్లావ్యాప్తంగా 190 ఎంపీటీసీలు ఉండగా, 2018లో జరిగిన ఎన్నికల్లో బీసీలకు 46 సీట్లు కేటాయించారు. ప్రస్తుతం 42 శాతం రిజర్వేషన్లో బీసీల వాటా కింద 79 సీట్లు కేటాయించారు. గతంలో పోలిస్తే 33 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. అలాగే 2011 దమాషా ప్రకారం ఎస్టీకి 23, ఎస్సీ 34, అన్రిజర్వుడ్(యూర్)కు 54 చొప్పు న కేటాయించగా, అన్నివర్గాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. మిగితావి పురుషులకు కేటాయించారు. -
శోభాయమానం.. విద్యాధరి క్షేత్రం
● మహాచండీదేవిగా అమ్మవారు దర్శనం ● నేడు మూల మహోత్సవం వర్గల్(గజ్వేల్): శంభునికొండ దేదీప్యమానమైంది. విద్యుత్ దీపాలతో వర్గల్ క్షేత్రం కాంతు లీనుతోంది. దసరాశరన్నవరాత్రి ఉత్సవాలో భాగంగా ఆదివారం అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో భక్తజనావళికి దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి నేతృత్వంలో అమ్మవారికి మహాభిషేకం, రాజోపచార, షష్ట్యుపచార పూజలు నిర్వహించారు. భక్తజనులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. నేడు విశేషపూజలు, అక్షరస్వీకారాలు ఉత్సవాలలో అత్యంత ప్రధానమైన మూల మహోత్సవానికి వర్గల్ క్షేత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా నిజరూప దర్శనమిస్తారు. రంగంపేట, పుష్పగిరి పీఠాధిపతులు మాధవానంద సరస్వతి, శ్రీవిద్యాశంకర భారతి స్వామి తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. రోజంతా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తనున్నారు. భారీసంఖ్యలో చిన్నారుల అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఇందుకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. -
మహాచండిగా దుర్గమ్మ
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడుపాయల వన దుర్గమ్మ మహాచండి (కాళరాత్రి) అలంకారం, నారింజ రంగు వస్త్రాలతో భక్తులకు దర్శనమిచ్చారు. మంజీరా వరదలతో దారులు మూసేయడంతో భక్తుల సంఖ్య తక్కువగా కనిపించింది. అర్చకులు శంకరశర్మ, పార్థివశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. – పాపన్నపేట(మెదక్)బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఆదివారం మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఒక చోట చేరారు. ‘చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మా.. ఈ వాడలోనా’.. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మా..! శ్రీ.. అంటూ ఆడిపాడారు. అనంతరం స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. – కౌడిపల్లి(నర్సాపూర్) బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. -
మా సమస్యలు పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డెయిలీ వైజ్, కాంటింజెంట్ వర్కర్లు ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. 212 జీఓను సవరించి 2014 నాటికి ఐదేళ్ల సర్వీస్ ఉన్న వారందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు ట్రెజరీలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. కొత్త మెనూ, పెరిగిన పనిభారానికి అనుగుణంగా కార్మికులను పెంచాలన్నారు. విద్యార్థులతో పాటు కార్మికులకు సైతం రెండు జతల యూనిఫాం, ఐడీ కార్డులు ఇవ్వాలన్నారు. కార్మికులకు రూ. 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సునంద, కోశాధికారి మాధవి, శేఖర్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
మంజీరా ఉగ్రరూపం
● ఘనపురంపై నుంచి 1.24 లక్షల క్యూసెక్కుల నీరు ● నీట మునిగిన వెయ్యి ఎకరాలు ● మెదక్కు నిలిచిన రాకపోకలుపాపన్నపేట(మెదక్)/కొల్చారం(నర్సాపూర్): మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం 1,24,598 క్యూసెక్కుల నీరు దిగువకు పయనిస్తుంది. ఘనపురం ప్రాజెక్టు దిగువన గల మొదటి బ్రిడ్జి, ఎల్లాపూర్ బ్రిడ్జి నీట మునిగాయి. రెండు రోడ్లను మూసివేయడంతో పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంజీరా నది వైపు ఎవరూ వెళ్లకుండా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మంజీరా వరదలు పోటెత్తడంతో తీర ప్రాంతాల్లో ఉన్న సుమారు వెయ్యి ఎకరాలకుపైగా వరి పంట నీట మునిగింది. మరికొన్ని రోజుల్లో ఇంటికి చేరాల్సిన పంట గంగ పాలయ్యిందని రైతులు వాపోతున్నారు. ఎంకెపల్లి, చిత్రియాల్, గాజులగూడెం, కొడుపాక, నాగ్సాన్పల్లి, ఎల్లాపూర్, గాంధారిపల్లి, కొత్తపల్లి, యూసుప్పేట, ఆరెపల్లి, మిన్పూర్, ముద్దాపూర్, రామతీర్థం, మల్లంపేట, కందిపల్లి, చీకోడ్, కొంపల్లి తదితర గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. కొల్చారం మండలంలోని మంజీరా పరివాహక గ్రామాల్లో నదికి ఇరువైపులా పంటలు ఎక్కడికక్కడ నీట మునిగాయి. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులకు, వరద ఉధృతి మరింత నష్టాన్ని తెచ్చిపెట్టింది. -
పర్యాటక ప్రాంతంగా బోరంచ
● మొదటి విడతగా రూ. 2 కోట్లు మంజూరు ● మంజీరా నదిలో బోటింగ్, ఇతర ఏర్పాట్లు నారాయణఖేడ్: ఉమ్మడి జిల్లాలోనే ఏడుపాయల దుర్గామాత తర్వాత రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన మనూరు మండలంలోని బోరంచ నల్లపోచమ్మ ఆలయం పర్యాటక ప్రాంతంగా అవతరించనుంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఎకో టూరిజంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా బోరంచ వద్ద పర్యాటక ప్రాంత అభివృద్ధి కోసం తొలి విడతగా రూ. 2 కోట్లను విడుదల చేయనుంది. ఈమేరకు ఆర్థికశాఖ అనుమతులిచ్చింది. మరో రూ. కోటిన్నర నిధులకు ప్రతిపాదించారు. మంజీరా నదీ తీరాన బోరంచ ఆలయం ఉండటంతో బోటింగ్, పర్యాటకుల విడిదితో పాటు ఆలయంలో దర్శనం, ఇతర సౌ కర్యాలు ఏర్పాట్లు చేయనున్నారు. సంగమేశ్వర ఆలయం, రాఘవపూర్ సరస్వతీ అమ్మవారు, సూర్యదేవాలయం వరకు టెంపుల్ సర్కిల్గా మార్చి బోటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా.. ఆందోల్ నియోజకవర్గంలోని రాయిపల్లి మండలంలోని ఇందూర్ వద్ద మంజీరా నది గుట్టపై రిసార్ట్స్ ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదించారు. 12 కిలోమీటర్లు బోటింగ్ ద్వారా ప్రయణిస్తూ ఆలయాలను దర్శించుకోవడంతో పాటు రిసార్ట్ను కూడా వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. అటవీశాఖ ద్వారా ఎకో టూరిజంకు రూ. 5 కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేసేందకు ప్రతిపాదించారు. ఎకో టూరిజంలో కాంక్రీట్ నిర్మాణాలు కాకుండా ఎకో ఫ్రెండ్లీ కాటేజెస్ నిర్మించనున్నారు. బాంబోస్టిక్స్తో కాటేజెస్ నిర్మాణం, రెస్టారెంట్లు సైతం ఇదే తరహాలో నిర్మించనున్నారు. బోరంచ ఆలయానికి సీజీఎఫ్ కింద రూ. 50 లక్షలు మంజూరయ్యాయి. పీపీపీ మోడ్లో ఇతర ఏర్పాట్లు.. బోరంచలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) మోడ్లో వాటర్ ఫ్రంట్ హరిత రెస్టారెంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. థీమ్ పార్క్, చిల్డ్రన్స్ ఏరియా, బొటానికల్ గార్డెన్ తదితర ఏర్పాట్లు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ కింద ఆలయాభివృద్ధికి నిధులకు ప్రతిపాదించారు. ఈ నిధులతో సంగమేశ్వరాలయం వద్ద ఉన్న మంజీరా నదిలో స్నానాలఘాట్, రహదారు లు, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యావరణానికి లోబడి ఇతర నిర్మాణాలు, డీర్ పార్క్ లాంటి ఏర్పాట్లకు ప్రయత్నాలు చేపట్టారు. -
నష్టపరిహారం ఎప్పుడో?
గత నెల చివరివారంలో కురిసిన భారీ వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. స్పందించిన సర్కార్ పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పింది. ఆ మేరకు అధికారులు సర్వే చేసి పంట నష్టం వివరాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వనికి నివేదించారు. నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు పరిహారం అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. – రామాయంపేట(మెదక్) జిల్లా పరిధిలో భారీ వర్షాలకు 6,500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 1,060 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. నెల రోజులుగా ఇంకా కొన్ని పంటచేన్లు నీటిలోనే ఉన్నాయి. రంగుమారి పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే నష్టపోయిన రైతా ంగాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. అధికారులు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటల వివరాలు ప్రభుత్వానికి నివేదించారు. నెల రోజులుగా నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతులు వ్యవసాయ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వర్షాలతో ప్రధానంగా వరి పంట తీవ్రంగా దెబ్బతింది. 5,850 ఎకరాల్లో నష్టం జరిగిందని అధికారుల సర్వేలో తేలింది. దీనికి తోడూ పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. 11 ఎకరాలు మాత్రమే గుర్తింపు భారీ వర్షాలతో జిల్లా పరిధిలో 1,060 ఎకరాలకు పైగా పంట చేలల్లో ఇసుకమేటలు వేసింది. ఈసీజన్లో తొలగించుకోవడం సాధ్యం కాదని భావిస్తున్న రైతులు కొందరు వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఇసుకమేటలు తొలగించాలంటే రూ. లక్షలు ఖర్చవుతాయని, ఈ పరిస్థితుల్లో తాము అంత డబ్బు ఖర్చుపెట్టే పరిస్థితుల్లో లేమని చెబుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో పంటలను అలాగే వదులుకుంటున్నామని వాపోతున్నారు. కాగా రామాయంపేట, నార్సింగి, హవేళిఘణాపూర్ మండలాల్లో మొదటి విడతగా 11 ఎకరాలను మాత్రమే గుర్తించిన అధికారులు, సదరు భూముల్లో నుంచి ఇసుకమేటలు తొలగిస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వానికి నివేదించాం దెబ్బతిన్న పంటల వివ రాలు సర్వే చేసి ప్రభుత్వా నికి నివేదించాం. నష్టపరిహారం విషయం తమ పరిధిలో లేదు. ఇసుకమేటలు వేసిన భూములను గుర్తించాం. పైఅధికారుల ఆదేశాల మేరకు ముందుకెలుతాం. – దేవ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారితీవ్రంగా నష్టపోయాం గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంటలు కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయాం. పంట చేన్లు ఇసుకమేటలు, రాళ్లుతో నిండిపోయాయి. వీటి కి తొలగించుకోవడం తమతో సాధ్యం కాదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – దేవ్జా, రైతు, కోనాపూర్ తండా -
తెగులు.. దిగులు
●వర్షాలతో పంటలపై తీవ్ర ప్రభావం ●దిగుబడిపై ఆందోళన చెందుతున్న రైతన్నలు కొల్చారం(నర్సాపూర్): అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. దీంతో చేతికొచ్చే దశలో పంటలు దెబ్బతింటున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు వరి, పత్తి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పత్తి ప్రస్తుతం పూత, పిందె దశలో.. వరి పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో తెగుళ్లు సోకుతున్నాయి. ముందస్తుగా నాట్లు వేసిన వరి పొలాలు గింజ తొడుగుతున్న దశలో కంకులు నల్లగా మారి తాలు కనిపిస్తుందని రైతులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వ్యవసాయ అధికారులు వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు సూచనలు చేస్తున్నప్పటికీ, ఎడతెరిపి లేని వర్షం సత్ఫలితాలు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఈసారి దిగుబడి తగ్గడమే కాకుండా కనీసం పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఒక్కేసి పువ్వేసి చందమామ
● కలెక్టరేట్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు ● పాల్గొన కలెక్టర్, కుటుంబ సభ్యులు ● ఆడిపాడిన అధికారులు, సిబ్బంది మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో శనివారం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒక చోట చేర్చి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళా సిబ్బంది ఆడిపాడారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జిల్లా యంత్రాంగం ఆధ్వ ర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్ ఓ భుజంగరావు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఆయాశాఖల మహిళ అధికారులు, సిబ్బందితో కలిసి నృత్యాలు చేశారు. సంబురాలకు కలెక్టర్ తల్లి తో పాటు ఆయన భార్యాపిల్లలు హాజరయ్యారు. -
నేతల జాతకాలు తారుమారు
బీసీ రిజర్వేషన్లతో ఆశ లు ఆవిరి మెదక్అర్బన్: ‘దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లుంది’ రాజకీయ నాయకుల పరిస్థితి. మెదక్ జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులకు వారి సొంత ప్రాదేశిక స్థానాల్లో రిజర్వేషన్లు అనుకూలించలేదని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో నేతల జాతకాలు తారుమారయ్యాయి. అనాదిగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారు, పదవులపై ఆశలు పెంచుకొని పార్టీలో చేరిన వారికి రిజర్వేషన్లు ప్రతికూలంగా వచ్చాయి. కాగా ఖచ్చితంగా పార్టీ ఎవరినైనా చైర్మన్ అభ్యర్థిగా భావిస్తే, అతడు తనకు అనుకూలమైన మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. జెడ్పీ చైర్మన్ పదవి అందని ద్రాక్షేనా! నర్సాపూర్ నియోజకవర్గంలోని ఓసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. అయితే అప్పట్లో సదరు నాయకునికి వచ్చే ఎన్నికల్లో జెడ్పీ చెర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. కాగా ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లలో ఆయన సొంత జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం బీసీ జనరల్కు కేటాయించారు. అలాగే అదే నియోజకవర్గం నుంచి ఇటీవల కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓసీ నాయకుడు ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఆయన పేరు కూడా జెడ్పీ చైర్మన్ పదవి రేసులో వినిపిస్తుంది. కాగా ఆయన సొంత జెడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు అలాట్ అయ్యింది. మనోహరాబాద్ మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని ఆశించి సఫలీకృతం కాలేకపోయారు. ప్రస్తుతం ఓసీ వర్గానికి చెందిన ఆయన పేరు కూడా చైర్మన్ రేసులో వినిపిస్తుంది. కాగా ఆయన సొంత ప్రాదేశిక నియోజకవర్గం ఓసీ మహిళకు అలాట్ అయ్యింది. పాపన్నపేట మండలంలోని ఓసీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కరడు గట్టిన కాంగ్రెస్ వాది. ఆయన కూడ జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ పాపన్నపేట జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్కు కేటాయించారు. శంకరంపేట(ఆర్)కు చెందిన ఓసీ నాయకుడు కూడా చైర్మన్ పదవిపై ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆ స్థానం బీసీ జనరల్కు అలాట్ అయ్యింది.అంచనాలు తలకిందులు కేవలం జెడ్సీటీసీ చైర్మన్ పదవే కాకుండా, ఎంపీపీ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు నాయకులకు సొంత ప్రాదేశిక నియోజకవర్గాల్లో ప్రతికూల రిజర్వేషన్లు వచ్చాయి. అర్కెల గ్రామ పంచాయతీలోని 9, 10 వార్డులు ఎస్టీ వర్గానికి కేటాయించారు. కాగా అక్కడ ఒక్క ఎస్టీ కుటుంబం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. -
ఉత్కంఠకు తెర
జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఖరారుమెదక్జోన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ జీఓ విడుదల అయిన నేపథ్యంలో శనివారం మండల పరిషత్, జిల్లా పరిషత్ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్రాజ్ జాబితాను విడుదల చేశారు. జిల్లాలో 21 మండలాలు ఉండగా, 21 ఎంపీపీలు, 21 జెడ్పీటీసీలకు రిజర్వేషన్ పక్రియను పూర్తిచేశారు. బీసీలకు గతంతో పోలిస్తే ఈసారి 2 జెడ్పీటీసీ స్థానాలు, 2 ఎంపీపీ స్థానాలు పెరిగాయి. 2019– 2024 జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో జిల్లాలో 20 మండలాలు మాత్రమే ఉండగా, పరిపాలన సౌలభ్య కోసం గతేడాది నూతనంగా మాసా యిపేట మండలాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మండలాల సంఖ్య 21కి చేరింది. కాగా గతంలో జరిగిన ఎన్నికల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లో భాగంగా 7 జెడ్పీటీసీ, 7 ఎంపీపీ స్థానాలను కేటాయించారు. ప్రస్తుతం 42 శాతం అమలు కావటంతో 21 మండలాలకు 9 జెడ్పీటీసీ, 9 ఎంపీపీ స్థానాలను బీసీలకు రిజర్వుడ్ చేస్తూ జాబితాను విడుదల చేశారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు అయ్యాక మెదటగా జిల్లా పరిషత్ పీఠాన్ని బీసీ మహిళకు ఎన్నికల కమిషన్ రిజర్వుడ్ చేసింది. ఈసారి అన్రిజర్వ్డ్ (జనరల్)కు కేటాయించారు. ఓసీ జనరల్ కు కేటాయించే అవకాశాలు ఉన్నాయంటూ జిల్లాలో జోరుగా ప్రచారం సాగింది. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఇలా -
సకాలంలో వైద్యసేవలు అందించాలి
రామాయంపేట(మెదక్): పట్టణంలోని ప్రభు త్వ ఆస్పత్రిని శనివారం వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శివదయాల్ సంద ర్శించారు. ఈసందర్భంగా ఆయన రోగులను పరీక్షించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, సకాలంలో వైద్య సేవలు అందజేయాలని సూచించారు. ఆస్పత్రి లో రిజిస్టర్లు, మందులను పరిశీలించి డాక్టర్లకు సూచనలు చేశారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి, వైద్యులు, సిబ్బంది ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్నిశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విధుల్లో నిమగ్నమై ఉంటారని, సోమవారం నిర్వహించే ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. చెరువులు తెగే పరిస్థితి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులు హెడ్ క్వార్టర్లోనే ఉండాలన్నారు. కరెంట్ స్తంభాలు, రహదారుల వద్ద నీరు నిల్వ ఉంటే వెంటనే స్పందించాలన్నారు. శిథిలావస్థ ఇళ్లలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాగులు, చెరువుల వద్ద ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భూసేకరణ శాసీ్త్రయంగా జరగాలి మెదక్ కలెక్టరేట్: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మా ణానికి భూసేకరణ శాసీ్త్రయంగా జరగాలని సీ పీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అజ్జమర్రి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం అదనపు కలెక్టర్ నగేశ్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులకు చట్టం ప్రకారం పరిహా రం ఇవ్వాలని, లేదంటే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొందరు పెద్దల కోసం అలైన్మెంట్ మార్చుతున్నట్లు ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు భూము లు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేస్తే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతా మని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నర్సమ్మ, మల్లేశం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలిహత్నూర(సంగారెడ్డి): సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఉపాధి అవకాశాలు పొందాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. హత్నూర ఐటీఐ ప్రాంగణంలో నిర్మించిన అ డ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...గతంలో ఐటీఐలో శిక్షణ పొంది ఎంతో మంది విద్యార్థులు ప్రైవేటు, ప్రభు త్వ పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు పొందారన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఉద్యోగ అవకాశాలతోపాటు స్వయం ఉపాధి పొందాలని సూచించారు. రూ. కోట్లతో నిర్మించిన ఏటీసీ సెంటర్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు అధునాతన యంత్ర పరికరాల ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, హత్నూర ఐటీఐ భవనం శిథిలావస్థకు చేరగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నిధుల మంజూరుకు కృషి చేయనున్నట్లు సూచించారు. -
నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో 21 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 21 జెడ్పీటీసీ స్థానాలకు ఎస్సీ (4 ఇందులో 2 మహిళలకు), ఎస్టీ (2 ఇందులో ఒకటి మహిళ) కేటాయించడినట్లు చెప్పారు. బీసీలకు 9 స్థానాలు రిజర్వ్ కాగా, 4 మహిళలకు కేటాయించినట్లు తెలిపారు. మిగితా 6 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, వీటిలో 3 స్థానాలు మహిళలకు కేటాయించామని వివరించారు. రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు నివేదిస్తామని తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
చిన్నశంకరంపేట(మెదక్): దుర్గామాత ఆశీస్సులతో స్థానిక నియోజవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మండలంలోని కొర్విపల్లిలో వెలసిన దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, రాజిరెడ్డి, యాదవరావు, శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. మెరుగైన సేవలు అందించాలి పాపన్నపేట(మెదక్): పెట్రోల్ బంకు యజమానులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పాపన్నపేటలో హెచ్పీ పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బంకు యజమానులు రాజశేఖర్, మహేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంతప్ప, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు -
ఆర్టీసీ ప్రయాణికులకు బహుమతులు
నర్సాపూర్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు డ్రా పద్ధతిలో తమ సంస్థ బహుమతులు అందించనున్నట్లు డిపో మేనేజర్ సురేఖ చెప్పారు. ఈనెల 27నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు మెదక్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో ఆర్టీసీకి చెందిన డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి అవకాశం ఉంటుందన్నారు. డీలక్స్ బస్సుల్లో ప్రయాణం ముగిసిన అనంతరం వారి టికెట్ వెనకాల అడ్రస్ రాసి జేబీఎస్, మెదక్, నర్సాపూర్ బస్టాండ్లలో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్సుల్లో టికెట్లు వేయాలని ఆమె సూచించారు. ఆ తర్వాత ఇందులోని టికెట్లను డ్రా తీసి మొదటి బహుమతిగా రూ.25వేలు, రెండవ బహుమతిగా రూ.15వేలు, మూడవ బహుమతిగా రూ.10 వేలు అందజేయనున్నట్లు ఆమె చెప్పారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యం ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీశైల టేక్మాల్(మెదక్): గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీశైల తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎల్లుపేట అంగన్వాడీలో పోషకాహార మాసోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సరిత, పంచాయతీ కార్యదర్శి మహేష్ కుమార్, ఏఎన్ఎం కృష్ణవేణి, ఆశావర్కర్ రాణి తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనం రూ.26 వేలు అందించాలి
చిన్నశంకరంపేట(మెదక్): అసంఘటిత కార్మికులకు కనీస వేతనం అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో అసంఘటిత కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిందిస్థాయి ఉద్యోగులతో వెట్టిచాకిరి చేయించుకునే శ్రద్ధ వేతనాలు అందించడంలో పెట్టడం లేదన్నారు. గ్రామాల్లో అంగన్వాడీ, ఆశావర్కర్లు, ఐకేపీ వీఓలు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు కీలక సేవలు అందిస్తున్నా ప్రభుత్వం వేతనాలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. అసంఘటిత కార్మికులను రెగ్యూలర్ చేయడంతో పాటు కనీస వేతనం రూ.26 వేలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీపీ వర్కర్స్ యూనియన్ నాయకులు రాములు, సత్యనారాయణ, రాజు, యాదమ్మ, ఆశ యూనియన్ నాయకులు రేణుక, విద్యుత్ కార్మిక సంఘం నాయకులు నర్సింహులు, ఈజీఎస్ ఎఫ్ఏల సంఘం నాయకులు నర్సింహులు ఉన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం -
కుండపోత వర్షం
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలో 65.6మిల్లీ మీటర్ల కుండపోత వర్షం నమోదైంది. దీం కౌడిపల్లి, రాయిలాపూర్, మహమ్మద్నగర్, రాజిపేట, సదాశివపల్లి తదితర గ్రామాలలోని పెద్ద చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. నిలిచిన రాకపోకలు టేక్మాల్(మెదక్): మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గుండువాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో టేక్మాల్–జోగిపేట, ఎలకుర్తి–కోరంపల్లి ప్రధాన రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలలో నీరు సమృద్ధిగా చేరి అలుగులు ప్రవహిస్తున్నాయి. అయితే ఈ వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతరాయం.. హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో కురిసిన వర్షాలతో చెరువు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. గంగమ్మవాగు ఉధృతి పెరగడంతో దూప్సింగ్ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మెదక్ మండలంలోని కోంటూర్ చెరువు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సాపూర్: మండలంలో 74 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు రాయరావు చెరువు మళ్లీ అలుగు పారింది. దీంతో పాటు ఆయా గ్రామాల చెరువులు సైతం అలుగులు పారుతున్నాయి. ● అలుగు పారుతున్న చెరువులు, కుంటలు ● పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం -
గొప్ప మనసు చాటుకున్న మాజీ ఎమ్మెల్యే
కౌడిపల్లి(నర్సాపూర్): పట్టణంలోని డిగ్రీ కళాశాలకు రెండేళ్లపాటు కిరాయి లేకుండా సొంతభవనం ఇస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మంజూరు చేసిన డిగ్రీ కళాశాల నర్సాపూర్లో కొనసాగుతుందన్నారు. అయితే కౌడిపల్లిలోని తన సొంతభవనం రెండేళ్లపాటు కిరాయి లేకుండా డిగ్రీ కళాశాలకు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ప్రాంత విద్యార్థులు నర్సాపూర్ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రెండు నెలల క్రితం ఉన్నత విద్యాశాఖకు లేఖ రాయగా ప్రస్తుతం అనుమతి మంజూరైనట్లు చెప్పారు. ప్రస్తుతం నర్సాపూర్లో కొనసాగుతున్న డిగ్రీ కళాశాల దసరా ముగిసిన అనంతరం ఇక్కడే ప్రారంభించనున్నట్లు వివరించారు. త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి సహకారంతో సొంతభవనం నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. దీంతోపాటు నూతనంగా నిర్మిస్తున్న సీహెచ్సీని త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు గోవర్ధన్రెడ్డి, రాజుయాదవ్, వైస్చైర్మన్ చిన్నంరెడ్డి, నాయకులు కృష్ణాగౌడ్, దుర్గాగౌడ్, శాఖయ్య, శెట్టయ్య, మోతిలాల్గౌడ్, పుండరీకంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రెండేళ్లపాటు కిరాయి లేకుండా కళాశాలకు సొంతభవనం మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి -
‘స్థానిక’ విధుల్లో అవకాశం కల్పించాలి
మెదక్ కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో సీనియర్ టీచర్లకు అవకాశం ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల శ్రీనివాస్, సామ్యనాయక్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పీఆర్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం అదనపు కలెక్టర్ నగేష్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఎన్నికల శిక్షణకు హాజరుకాని టీచర్లకు దసరా సెలవుల అనంతరం మరోసారి శిక్షణ ఇవ్వాలన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో సీనియర్ టీచర్లకు అవకాశం కల్పించాలన్నారు. దివ్యాంగులకు, మెడికల్ గ్రౌండ్లో ఉన్న టీచర్లకు ఎలక్షన్ విధుల నుంచి మినహాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సుంకరి కృష్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వెంకటరామ్ రెడ్డి, మల్లారెడ్డి, మహేష్, సతీష్ రావు, పంతులు రాజు, అమీరుద్దీన్, సహదేవ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ వర్కర్లకు వైద్య పరీక్షలు
మెదక్ మున్సిపాలిటీ: స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేష్, టౌన్ ప్లానింగ్ అధికారి భూపతి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రభాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వెంకటేష్, ప్రభుత్వ వైద్యులు వంశీ చారి, ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులు సెల్ఫోన్కు దూరంగా ఉండాలి
నర్సాపూర్ రూరల్: విద్యార్థులు సెల్ఫోన్కు దూరంగా ఉండాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శేషాచారి సూచించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు చెడు స్నేహం చేయకుండా లక్ష్యంతో చదువుకోవాలన్నారు. డ్రగ్స్, మత్తు పానీయాలకు దూరంగా ఉండి ఎలాంటి వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థినులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు జోత్స్న దేవి, నాగరాజు, రామ్ రెడ్డి, హరీష్, భాగ్యలక్ష్మి, అనిల్, కళింగ రెడ్డి, రమాదేవి, అతిక్ ఫాతిమా, అభినవ్, రాజేశ్వర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శేషాచారి -
పురాభివృద్ధికి నిధులు
● నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు ● తీరనున్న ప్రధాన సమస్యలు నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీకి నగరాభివృద్ధి పథకం కింద ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేసింది. పలు ప్రత్యేక పనులతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మా ణాలకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. త్వరలో టెండర్లు వేసి నిబంధనల మేరకు పనులు చేపట్టే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చెరువుల సుందరీకరణ నిధుల కేటాయింపులో భాగంగా పట్టణానికి చెందిన రాయరావు చెరువు, కోమటికుంట సుందరీకరణ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. రాయరావు చెరువుకు రూ. 1.20 కోట్లు, కోమటి కుంటకు రూ. 1.20 కోట్లు కేటాయించింది. కాగా నర్సాపూర్– మెదక్ జాతీయ రహదారి నుంచి డంపింగ్ యార్డు వరకు సీసీ రోడ్డు నిర్మించేందుకు రూ. కోటి 80 లక్షలు కేటాయించింది. ఈ మార్గంలో సీసీ రోడ్డు నిర్మిస్తే చాలా మంది రైతులకు మేలు జరుగనుంది. కాగా మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో వ్యాపార షాపింగ్ కాంప్లెక్స్ నిర్మా ణానికి రూ. కోటి 20 లక్షలు మంజూరు కాగా, మున్సిపాలిటీకి శాశ్వత ఆదా యం వచ్చే అవకాశం ఉంటుంది. పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలోని కొంత ఏరియా నుంచి మురికి నీరు చెరువులోకి వెళ్లడంతో కలుషి తం అవుతుతోంది. దీంతో మురికి నీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి రూ. 70 లక్షలు కేటాయించింది. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని పిల్లల పార్కు వసతుల లేమితో నిరుపయోగంగా ఉన్నందున పార్కు అభివృద్ధికి తాజాగా ప్రభుత్వం రూ. 30 లక్షలు కేటాయించింది. సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 10.40 కోట్లు కేటాయించింది. ఆయా వార్డులలో చేపట్టాల్సిన పనుల ప్రాధాన్యత మేరకు ఒక్కో వార్డుకు రూ. 30 నుంచి రూ. 60 లక్షల వరకు నిధులు కేటాయించారు. సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మాణం పూర్తయితే చాలా వార్డులలో ప్రజల ఇబ్బందులు కొంత మేర తీరనున్నాయి. నిబంధనల మేరకు పనులు ప్రభుత్వం మున్సిపాలిటీ నగరాభివృద్ధి కింద మంజూరు చేసిన రూ. 15 కోట్లతో నిబంధనల మేరకు అభివృద్ధి పనులు చేపడతాం. నిధులలో అన్ని వార్డులతో పాటు ప్రత్యేకంగా పలు పనులకు నిధులు కేటాయించారు. వీటితో పట్టణంలో చాలా సమస్యలు పరిష్కారం కానున్నాయి. – శ్రీరాంచరణ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
సైబర్ మోసాలపై జాగ్రత్త
మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్పాపన్నపేట(మెదక్): అత్యాశ అనేక అనర్థాలకు దారి తీస్తుందని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. గురువారం మండల పరిధిలోని నార్సింగిలో మెదక్, అల్లాదుర్గం సర్కిల్ పరిధిలోని పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం కమ్యూనిటీ కనెక్టివిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలో సాయుధ పోలీసులు కవాతు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. అనుమానిత వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. సెల్ఫోన్లో వచ్చే అనుమానిత మెసేజ్లకు స్పందించవద్దని సూచించారు. ఇతరులతో వ్యక్తిగతమైన సమాచారాన్ని పంచుకోవద్దన్నారు. సైబర్ నేరాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ల జోలికిపోవద్దని సూచించారు. యువతీ, యువకు లు మత్తు పదార్థాలకు అలవాటుపడొద్దని హితవు పలికారు. కార్యక్రమంలో ఎస్సైలు, స్నెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పోటెత్తిన మంజీరా
పాపన్నపేట(మెదక్): సింగూరు నుంచి గురువారం భారీ స్థాయిలో నీరు విడుదల చేయడంతో మంజీరా పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి నీరు ఎక్కువగా వస్తుండటంతో సింగూరు ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తి 77,821 క్యూసెక్కులు దిగువకు వదిలారు. దీంతో మంజీరా నుంచి వస్తున్న భారీ వరద ఘనపురం మీదుగా ప్రవహిస్తూ ఏడుపాయల దుర్గమ్మ ఆలయాన్ని చుట్టుముట్టి నిజాంసాగర్ వైపు పయనిస్తుంది. ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు ప్రవహిస్తుంది. మంజీరా నది వైపు ఎవరు వెళ్లొద్దని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ సూచించారు. అత్యవసర పరిస్థితిలో 8712657920 ఫోన్ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
మెరుగైన వైద్యం అందించండి
కలెక్టర్ రాహుల్రాజ్టేక్మాల్(మెదక్): ‘స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం మండలంలోని పీహెచ్సీ, మో డల్ స్కూల్, హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీ ద్వారా అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో పిల్లల వైద్య నిపుణులు, ఇతర స్పెషలిస్టులు అందు బాటులో ఉన్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాల గురించి ముందుగానే అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మెరుగైన ఆరోగ్య సేవలు అవసరం ఉన్న వారిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేయాలన్నారు. అనంతరం మోడల్ స్కూల్, కేజీబీవీలను పరిశీలించి పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించి మౌలిక వసతులపై ఆరా తీశారు. మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు గుణాత్మక విద్య అందించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ తులసీరాం, వైద్యురాలు హర్షిత, మో డల్ స్కూల్ ప్రిన్సిపాల్ సాయిలు, ఆర్ఐ సాయిశ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
మద్యం టెండర్లకు వేళాయె..
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ2025– 27 కొత్త మద్యం పాలసీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మద్యం దుకాణాల కేటాయింపు.. షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది. నేటి నుంచి మద్యం షాపులకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనుంది. 2023– 25 మద్యం పాలసీ ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుంది. – మెదక్ అర్బన్ జిల్లావ్యాప్తంగా ఉన్న 49 వైన్ షాపులకు శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లక్కీ డ్రా తీయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పా టు చేయనున్నారు. ఇందులో షాపు దక్కించుకున్న వ్యాపారులు అదే రోజు, మరునాడు లైసెన్స్ ఫీజుకు సంబంధించి మొదటి వాయిదా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్స్ షాపులు ప్రారంభం కానున్నాయి. ఈసారి దర ఖాస్తు ధరను రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. ఐదు వేల నుంచి 50 వేల జనాభా ఉన్న షాపులకు రూ. 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు రూ. 60 లక్షలు, లక్ష నుంచి ఐదు లక్షల జనాభా వరకు రూ. 65 లక్షల ఫీజును వసూలు చేయనున్నారు. కాగా ఈసారి ఏడుపాయల కమాన్ (చిత్రియాల్) వద్ద ఉన్న వైన్ షాపును కొల్చారం మండలం పోతంషెట్పల్లి– అప్పాజిపల్లి శివారులోకి మార్చారు. కాగా మద్యం సిండికేట్ సభ్యులు వైన్స్ టెండర్లలో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు ఎక్కువగా ఉండటంతో కొంతమంది సిండికేట్గా ఏర్పడి టెండర్లు వేస్తూ వ్యాపారం చేస్తుంటారు. ఒక్కో వ్యాపారి 20 నుంచి 60 దరఖాస్తులు సమర్పిస్తారు. మరింత ఆదాయం సమకూరే అవకాశం జిల్లాల్లో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలు కావడంతో వైన్స్ షాపుల టెండర్లకు భా రీగా దరఖాస్తులు వచ్చే అవకాఽశం ఉందని భావిస్తున్నారు. 2021లో జిల్లాలో 832 దరఖాస్తులు రాగా, 2023లో 1,905 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో అత్యధికంగా పోతంషెట్పల్లి వైన్ షాపుకు 111 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఆ దుకాణం, వైన్షాపులో పని చేస్తున్న వర్కర్కు దక్కడం విశేషం. గతేడాది కేవలం అప్లికేషన్ రుసుం ద్వారా రూ. 38.10 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తు ఽఫీజు రూ. 3 లక్షలకు పెంచడంతో మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంది. గతేడాది ద రఖాస్తు గడువు 12 రోజులు ఇవ్వగా, ఈసారి రెట్టింపు వ్యవధిగా 24 రోజులు ఇచ్చారు. జిల్లాలో మొత్తం 49 వైన్ షాపులు ఉన్నాయి. ఇందులో 16 వివిధ కేటగిరి వ్యక్తుల కు రిజర్వు చేయగా, 33 ఓపెన్లో మిగిలాయి. గురువారం సాయంత్రం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జిల్లాలో ఎస్టీ కేటగిరికి 1, ఎస్సీ వర్గానికి 6, బీసీలకు 9 షాపులు కేటాయించామని, మిగితా 33 షాపులు ఓపెన్ కేటగిరిలో ఉంటాయని చెప్పారు. రిజర్వేషన్ కేటగిరిలో అలాట్ అయిన వైన్ షాపుల వివరాలు, గెజిట్లో ప్రచురిస్తామని వివరించారు. వచ్చే నెల 18 వరకు గడువు 23న లక్కీ డ్రా జిల్లావ్యాప్తంగా 49 వైన్ షాపులు -
డ్యాం వద్దకు ఎవరినీ రానీయొద్దు
హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఎస్పీ శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసులపై ఎస్ఐ నరేశ్ను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం మండల పరిధిలోని పోచారం డ్యాం వద్ద వరద ఉధృతిని పరిశీలించి, అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు ఎవరూ డ్యాం వద్దకు రాకుండా చూడాలన్నారు. మరోవైపు వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పోచారం ప్రాజెక్టు వద్ద నీటి ఉధృతిని పరిశీలించా రు. డ్యాం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు పికెటింగ్లో ఉన్న సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. -
స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ వెనుకడుగు
మెదక్ ఎంపీ రఘునందన్రావురామాయంపేట(మెదక్): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. బుధవారం రామాయంపేట పట్టణంలో జీఎస్టీ తగ్గింపు విషయమై వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఎన్నికలు జరిపే ఆలోచన లేదని, ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశం లేదన్నారు. ఒకవేళ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే ముందుగా పంచాయతీ వర్కర్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీ తగ్గించిందన్నారు. దీంతో అన్నివర్గాల ప్రజలకు లాభం చేకూరుతుందని వివరించారు. నిధుల కొరతతో పంచాయతీలు నీరసించి పోయాయని ఆరోపించారు. అంతకుముందు ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షుడు నవీన్గౌడ్, పట్టణ శాఖ అధ్యక్షుడు అవినాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాల లేకపోవడం దారుణం తూప్రాన్: కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న తూప్రాన్లో ఒక్క డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడం దారుణమని ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. సేవా పక్వాడ్లో భాగంగా తూప్రాన్ ఏరియా ఆస్పత్రిని సందర్శించి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు, కాంగ్రెస్కు మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సంబంధాలు అంటగడుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు అయినా విద్యార్థుల చదువులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులేదని ఆరోపించారు. ఉమ్మడి -
కేసుల ఛేదనపై దృష్టి సారించండి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుమెదక్ మున్సిపాలిటీ: పోక్సో కేసులను అత్యంత ప్రాధాన్యంతో విచారించి నిందితులకు కఠిన శిక్షలు పడేవిధంగా కృషి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పోలీస్, ఇతరశాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పా ల్గొని మాట్లాడారు. చిన్న వయసులో వేధింపులు, ప్రేమ వ్యవహారాలు వంటి చర్యలు భవిష్యత్తును శాశ్వతంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. అవగాహన ద్వారానే నివారణ సాధ్యమన్నారు. భరోసా సెంటర్ 24 గంటల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా పని చేయడానికి నిరంతర పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి శుభావళి, అదనపు ఎస్పీ మహేందర్, హై దరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏసీపీ శ్రీధర్, భరోసా బృందం, జిల్లా సంక్షేమ, విద్య, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
టేక్మాల్(మెదక్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని రోడ్లు భారీగా కోతకు గురయ్యాయి. మరమ్మతులు చేయాల్సిన ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని వెంకటాపూర్, చంద్రుతండా, టేక్మాల్, ఎల్లుపేట, బొడ్మట్పల్లి, చల్లపల్లి, బర్దిపూర్, ఎలకుర్తి గ్రామాలకు వెళ్లే తారు రోడ్లతో పాటు, వ్యవసాయ పొలాలకు వెళ్లే మట్టి రోడ్లు భారీగా వరదలకు కోతకు గురయ్యాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. టేక్మాల్ శివారులో కోతకు గురైన కల్వర్టు -
మార్కెట్లకు దసరా జోష్
జిల్లా కేంద్రంలోని మార్కెట్లలో బుధవారం దసరా సందడి నెలకొంది. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని నూతన దుస్తులు, ఇతర సామగ్రి కొనుగోళ్లకు ప్రజలు తరలివస్తున్నారు. వారం రోజులుగా పట్టణంలోని రాందాస్ చౌరస్తా, జేఎన్ రోడ్డు వరకు ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడుతున్నాయి. కూరగాయల మార్కెట్, పెద్ద బజార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిగా వాహనాలు వస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. – మెదక్మున్సిపాలిటీ -
విద్యతో పాటూ సేవాభావం ఉండాలి
కొల్చారం(నర్సాపూర్): ప్రతి విద్యార్థి సామాజిక సేవాగుణం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. మండలంలోని పోతంశెట్టిపల్లిలో గత ఆరు రోజులుగా మెదక్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాతో పాటు గ్రామంలోని ప్రధాని కూడళ్ల వద్ద ఉన్న మురికి కాలువలను శుభ్రం చేస్తున్నారు. గ్రామంలో ఉద్యోగ, విద్య సర్వే నిర్వహించారు. బుధవారం ఉన్నత పాఠశాలలో ముగింపు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. సమష్టిగా ముందుకు సాగుతూ సేవా కార్యక్రమాల నిర్వహించడం హర్షించదగిన విషయమన్నారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను మరింత విస్తృత పరచాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం ఉమారాణి, అధ్యాపకుడు ప్రవీణ్ కు మార్, ప్రోగ్రాం అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.అదనపు ఎస్పీ మహేందర్ -
రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి
ఆర్డీఓ జయచంద్రారెడ్డి మనోహరాబాద్(తూప్రాన్): రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, నూతనంగా బాధ్యతలు చేపట్టిన జీపీఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారికి పలు అంశాలపై సూచనలు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలించాలన్నారు. అలాగే సాదాబైనామా, నిషేధిత భూములు, భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. సాదాబైనామా, అసైన్డ్ భూముల కోసం రెండు కమిటీలు వేశామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ ఆంజనేయులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
సర్కారు వైద్యం.. దైవాదీనం!
● నిండుకున్న మందుల నిల్వలు ● మూడేళ్లుగా బిల్లుల పెండింగ్ ● వేధిస్తున్న సిబ్బంది కొరత ● పేదలకు అరకొరగా వైద్యసేవలు ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు లక్ష్మి. చిన్నశంకరంపేట మండలం జంగారాయి. ఈనెల 20న గేదె పొడవటంతో తలకు తీవ్ర గాయం అయింది. అదే రోజు సాయంత్రం జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లగా, పరీక్షించిన వైద్యులు సిటీస్కాన్ తీయాలని, టెక్నీషియన్ అందుబాటులో లేడని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. అలాగే ఆస్పత్రిలో మందులు లేవని, బయటి నుంచి తెచ్చుకోవాలని చీటీరాసి ఇచ్చారు. దీంతో చేసేది లేక ఆమె కుటుంబీకులు బయట కొనుగోలు చేసి తీసుకొచ్చారు. సిటీస్కాన్ కోసం రెండు రోజులు ఎదురుచూసిన బాధితురాలు చేసేది లేక ఆస్పత్రి నుంచి వెళ్లిపోయింది. మెదక్జోన్: జిల్లా కేంద్రంలో గత నాలుగు దశాబ్దాల క్రితం ఏరియా ఆస్పత్రిని నిర్మించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానిని జిల్లా ఆస్పత్రిగా మార్చారు. కాగా మెడికల్ కళాశాల మంజూరు కావటంతో ఇక్కడ అన్ని రకాల వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆశపడిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఆరోగ్యశ్రీలో భాగంగా రావాల్సిన నిధులు సుమారు రూ. 1.50 కోట్లు నిలి చిపోయాయి. ఇవి సకాలంలో వస్తే ఆస్పత్రి నిర్వహణ, మందుల కొనుగోలుతో పాటు వైద్యు లు, సిబ్బందికి రావాల్సిన వాటా సైతం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మూడేళ్లుగా ఆరోగ్యశ్రీ నిధులు నిలిచిపోవటంతో ప్రస్తుతం ఆస్పత్రిలో మందుల కొరత వేధిస్తోంది. అంతేకాకుండా రూ. 14 లక్షల విలువ చేసే అత్యవసర మందులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అరువుగా తెచ్చినట్లు సంబంధిత వైద్యాధికారులు చెబుతున్నారు. సిటీస్కాన్ ఉన్నా టెక్నీషియన్ లేడు! జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 15 రోజుల క్రితం సిటీస్కాన్ ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా తలకు గాయం అయినప్పుడు తీవ్రతను గుర్తించేందుకు ఉపయోగిస్తారు. దీనిని ప్రైవేట్లో తీయాలంటే ఒక్కో పేషెంట్కు రూ. 2,500 వరకు అవుతుంది. ఆస్పత్రిలో ఏర్పాటు చేయటంతో సంతోషించా రు. కానీ టెక్నీషియన్ ఒక్కరే ఉండటంతో అతను విధుల్లో ఉన్నప్పుడు మాత్రమే దానిని ఉపయోగిస్తున్నారు. సాయంత్రం 5 గంటలు అయిందంటే గదికి తాళం వేస్తున్నారు. దీంతో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. నిధుల కొరత ఉంది ఆస్పత్రికి రావాల్సిన ఆరోగ్యశ్రీ నిధులు గత మూడేళ్లుగా నిలిచిపోయాయి. దీంతో అత్యవసర మందులను బయట అరువుకు తేవాల్సి వస్తోంది. సిటీస్కాన్ టెక్నీషియన్లు నలుగురు ఉండాల్సి ఉండగా, ఒక్కరే ఉన్నారు. త్వరలో మరో ముగ్గురిని నియమిస్తాం. కొన్ని పరికరాలు లేనందున వైద్యానికి కొంత ఆటంకం కలుగుతోంది. – సునీత, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళిక
మెదక్ కలెక్టరేట్: ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అన్నిశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ మొదటి వారం నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. ఏ గ్రేడ్ రకం క్వింటాల్కు రూ. 2,389, సాధారణ రకానికి రూ.2,369 చొప్పున కనీస మద్దతు ధరగా నిర్ణయించినట్లు చెప్పారు. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం ఖరీఫ్లో 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుందని చెప్పారు. ధాన్యం తరలించే వాహనాలన్నింటికీ జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు. లారీల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. త్వరితగతిన సీఎంఆర్ బియ్యం రికవరీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఏఓ దేవ్కుమార్, లీగల్ మెట్రాలజీ అధికారి, సుధాకర్, రవాణాశాఖ అధికారి వెంకన్న కో–ఆపరేటివ్ అధికారి కరుణాకర్, జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, సివిల్ సప్లై డీఎం జగదీష్, అదనపు డీఆర్డీఓ సరస్వతి, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గాయత్రీదేవిగా.. వన దుర్గమ్మ
దసరా శరన్నవ రాత్రోత్సవాల్లో భాగంగా ఏడుపాయల వన దుర్గమ్మ మంగళవారం శ్రీ గాయత్రీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. గోకుల్ షెడ్డులో కొలువు దీరిన దుర్గమ్మ తల్లిని తెల్లవారు జామున వేద బ్రాహ్మణులు గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వనదుర్గా అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కాగా, మూడో రోజైన బుధవారం అమ్మవారు అన్నపూర్ణా దేవి అలంకారంతో దర్శనమిస్తారు. – పాపన్నపేట(మెదక్)శ్రీ గాయత్రీ దేవి అలంకారంతో వన దుర్గమ్మ -
పారదర్శకత విజయ ప్రత్యేకత
● నాణ్యమైన పాల సరఫరాయే లక్ష్యం ● జీఎం మధుసూదన్ రావు మెదక్ కలెక్టరేట్: పారదర్శకత విజయ డెయిరీ ప్రత్యేకత అని రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ మధుసూదన్రావు తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారులకు అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. స్వచ్ఛమైన పాల సేకరణ, సరఫరాపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. రైతుల నుంచి పాలు సేకరించే సమయంలోనే ఎనలైజర్లతో పరీక్షించి కొనుగోలు చేస్తున్నామన్నారు. విజయ డెయిరీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెడుతున్నట్లు తెలిపారు. పలు రకాల పరీక్షలు చేసిన తర్వాతే వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన పాల పదార్థాలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో పలు రద్దీ ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలను గుర్తిస్తామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తామని చెప్పారు. సమావేశంలో అధికారులు, ప్రసన్న, కల్యాణి, విజయ్, అవినాష్, రమేష్, మెదక్ , జహీరాబాద్, నారాయణఖేడ్ కేంద్రాల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
త్వరితగతిన ఏటీసీ భవన నిర్మాణ పనులు
కలెక్టర్ రాహుల్రాజ్హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రమైన హవేళిఘణాపూర్ శివారులో నిర్మిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్రాజ్ మంగళవారం పరిశీలించారు. భవన నిర్మాణంలో పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలు, మిగిలిపోయిన పనులను గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక విద్యనందించి ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఇంటస్ట్రీయల్ ఇన్ఫారస్ట్టక్చర్ కార్పొరేషన్ జోనల్ మేనేజర్ అనురాధ, డీఈ రాందాస్, వాణిలత పాల్గొన్నారు. -
పైసలున్నా పనులేవీ..?
● పెచ్చులూడి.. వర్షపునీరు వచ్చి.. ● అందులోనే తరగతుల నిర్వహణ ● భయాందోళనలో విద్యార్థులు నర్సాపూర్: పెచ్చులూడిన గదుల్లోనే ఉపాధ్యాయు లు తరగతులు నిర్వహిస్తున్నారు. ఎప్పడేం జరుగుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు కావ డంతో పనులు చేపట్టిన కాంట్రాక్టరు కొన్ని పనులు చేపట్టి అర్ధంతరంగా ఏడాది క్రితం నిలిపివేశాడు. సదరు కాంట్రాక్టర్పై గిరిజన గురుకుల సంస్థ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నర్సాపూర్లోని అల్లూ రి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలకు మరమ్మతులు చేపట్టేందుకు గత ఏడాది ప్రభుత్వం రూ. 2కోట్లు మంజూరు చేసింది. అప్పట్లోనే మరమ్మతు పనులను ఓ కాంట్రాక్టరు చేపట్టి కొన్ని పనులు చేశాడు. కాగా గత ఏడాది అక్టోబరులో పనులు ఆపివేశాడు. ఇంత వరకు మిగిలిన పను లను అధికారులు చేయించకపోవడంతో విద్యార్థు లు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలోని పలు తరగతి గదుల పైకప్పుల పెచ్చులు ఇప్పటికే ఊడిపోయి వర్షం వచ్చినప్పుడు నీరు కిందికి కారుతోంది. భయపడుతూ ఆ గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. గదుల పైకప్పు పాడై వర్షానికి ఎక్కువగా నీరు కారుతున్న కొన్ని గదులకు తాళం వేసి వాడటం లేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా బాలుర టాయిలెట్స్కు మరమ్మతులు చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు. దీంతో విద్యార్థులు అత్యవసరమైనప్పుడు బయటకు వెళుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పాఠశాల భవనంతో పాటు హాస్టల్ భవనం కిటికీలకు తలుపులు బిగించకపోవడంతో రాత్రి ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. భవనాల గోడలు పాకురు పట్టి చాలా అధ్వాన్నంగా కనిపిస్తున్నాయి. అలాగే మీటింగ్ హాలుకు మరమ్మతులు చేసేందుకు కిటికీలు తొలగించి వదిలేశారు. ఏదైనా సమావేశం ఏర్పాటు చేయాల్సి వస్తే ఏడాది నుంచి చిన్న గదుల్లోనే నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులకు చెప్పాం.. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, మరమ్మతులు నిలిచిపోయిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరమ్మతులు చేయకపోవడంతో ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించాం. – కృష్ణ కిశోర్, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ -
ఆగం చేశారు..!
ఆశ పెట్టారు..రాజీవ్ యువ వికాసంపై నిరుద్యోగుల ఆవేదన● నెలాఖరులోగా ‘స్థానిక’ నోటిఫికేషన్ ● మరింత వాయిదా పడే అవకాశం ● ఆందోళనలో లబ్ధిదారులు జిల్లాలో యూనిట్ల వివరాలు మొత్తం యూనిట్లు 10,687 లింకేజీ లేకుండా 3,498 యూనిట్లు రూ.లక్షలోపు రుణాలు 2,632 యూనిట్లు రూ. 2లక్షల వరకు 2261 యూనిట్లు రూ.4 లక్షల వరకు 2,205 యూనిట్లు మైనర్ ఇరిగేషన్కు అదనంగా మరో 51 యూనిట్లు దరఖాస్తులు : 32,638మెదక్ కలెక్టరేట్: రాజీవ్ యువ వికాసం పథకం సరిగా అమలు కావడం లేదు. ఆశావహులు దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్నా.. పురోగతి కనిపిండం లేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిస్తాం... అప్పడిస్తామంటూ ఆశ పెట్టి తమను ఆగం చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. డబ్బులొస్తే ఉన్న ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకుందామమన్న ఆశలు అడియాశలయ్యాయి. పైగా నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రచారం నేపథ్యంలో లబ్ధిదారుల్లో మరింత గుబులు రేకెత్తిస్తోంది. అప్పటిలోగా రుణాలిస్తారా? లేక ఆశ చూపి ఆగం చేస్తారోనన్న వారిని పట్టి పీడిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా రుణాలిచ్చి స్వయం ఉపాధికి మార్గం చూపాలని మెదక్ పట్టణంలోని గోల్కొండ వీధికి చెందిన నిరుద్యోగ యువకుడు దానోల్ల క్రాంతి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నో ఆశలతో.. ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని మే నెలలో ప్రారంభించి 18 నుంచి 55 యేళ్లలోపు నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన చేసింది. దీంతో జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులంతా ఉద్యోగం లేనందున ప్రభుత్వం స్వయం ఉపాధికి దారి చూపుతుందని ఎంతో ఆశ పడ్డారు. దీంతో నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. అర్హత ఆధారంగా రూ.50 నుంచి రూ.4లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఓబీసీలు కలిపి మొత్తం 32,638 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఎస్సీలు 6,711, ఎస్టీలు 3,461, బీసీలు 19,686, ఈబీసీలు 550, మైనార్టీలు 2,175, క్రిస్టియన్లు 55 దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. వీటిని పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన అధికారులు 29,855 దరఖాస్తులను బ్యాంకులకు పంపించారు. సరైన ధ్రువ పత్రాలు లేకపోవడంతో వాటిని తొలగించినట్లు సమాచారం. ముందుగా రూ.50వేల వరకు రుణాలు ఇస్తామని తెలిపి తేదీని ప్రకటించిన ప్రభుత్వం చివరకు వాయిదా వేయడంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటి వరకు రాజీవ్ యువ వికాసం పథకంపై అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. రూ.50వేల వరకు రుణం తీసుకునే నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆపై రుణాలకు బ్యాంకు లింకేజీల ద్వారా ఇస్తూ యూనిట్ విలువ ఆధారంగా సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులు స్వయం ఉపాధి పొందడానికి ప్రభుత్వం 81 యూనిట్లు పెట్టుకునేందుకు అవకాశం కల్పించింది. -
ఆలయ భూమిని కబ్జా చేస్తే ఊరుకోం
● అంబాజీపేట గ్రామస్తుల రాస్తారోకో ● పనులు చేయించేందుకు వచ్చిన వ్యక్తిని చితకబాదిన వైనం చిన్నశంకరంపేట(మెదక్): దుర్గామాత ఆలయానికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకునేది లేదని చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామస్తులు తేల్చి చెప్పారు. కబ్జా చేసిన స్థలంలో ప్రహరీ గోడ నిర్మించేందుకు రియల్టర్ తరఫు మనిషి పనులు చేయించేందుకు రాగా అతడిని గ్రామస్తులు చితకబాది వెనక్కి పంపించారు. ఆలయ భూమి కాపాడాలంటూ మెదక్–చేగుంట ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో వెలసిన దుర్గామాత ఆలయం ముందు ఖాళీ స్థలాన్ని హైదరాబాద్కు చెందిన ఓ రియల్టర్ కబ్జా చేయగా ఈ విషయమై అప్పటి నుంచి సదరు గ్రామస్తులకు అతడికి మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా సదరు రియల్టర్ అక్కడ ప్రహరీ నిర్మించేందుకు అతడి తరఫున ఓ వ్యక్తిని పనుల నిమిత్తం అక్కడకు పంపించాడు. అయితే పునాదులు తవ్వుతుండగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు పనులు నిలిపివేయించి అతడిని చితకబాదారు. అనంతరం ఆలయ భూమిని కాపాడాలంటూ రోడ్డుపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. అనంతరం డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ వెంకటరాజంగౌడ్ దుర్గామాతను దర్శించుకుని మొక్కుకున్నారు. -
పోషకాహరంతోనే సంపూర్ణ ఆరోగ్యం
టేక్మాల్(మెదక్): గర్భిణులు, బాలింతలు పోషకారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని సీడీపీఓ పద్మలత అన్నారు. మండలంలోని బొడ్మట్పల్లిలో అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ మాసం సంబురాలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు అందిస్తున్న పోషక పదార్థాలను ప్రదర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మునగాకులో విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని, అవి రోగనిరోధక శక్తిని పెంచుతాయన్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియత్రించి, 340 రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఉంటుందని చెప్పా రు. అనంతరం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. సూపర్వైజర్ కలాలి కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్లు దీపిక, లక్ష్మి, ఏఎన్ఎం జయప్రద, సావిత్రి, అంగన్వాడీ హెల్పర్లు గడ్డం అమల, దుర్గరాణి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ ఏడీఏ రాజ్నారాయణ రామాయంపేట(మెదక్): వరి సాగులో వివిధ దశల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ, సమగ్ర పోషక యజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్నారాయణ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఆర్ వెంకటాపూర్లో పలు వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి మాట్లాడారు. ప్రతి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు ఎంటీయు 1010 రకం వరి విత్తనాలను అందజేశామన్నారు. వారు పండించిన ఉత్పత్తులను ఇతర రైతులకు అందజేస్తామని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త నిర్మల మాట్లాడుతూ.. చిరు పొట్ట దశలో చీడపీడలు సోకకుండా పంటలకు వాడాల్సిన మందులను పిచికారీ చేయాలని సూచించారు. పంటచేలకు మోతాదుకు మించి యూరియా వాడితే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. కౌడిపల్లి(నర్సాపూర్): వరి, పత్తి పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, తెగుళ్లను నివారించాలని తునికి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని రాయిలాపూర్లో వరి, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వరిలో కాండంతొలుచు, కంకినల్లి పురుగుల ఉధృతిని గమనించామన్నారు. కాండంతొలుచు పురుగు నివారణకు ఐసోసైక్లోసిరమ్120మి.లీ, లేదా క్లోరానిట్రిలిప్రోల్ 60మి.లీ, ఎకరాకు పిచికారీ చేయాలని తెలిపారు. కంకినల్లి నివారణకు స్పైరోమెసిఫిన్ 200మి.లీ, ప్రోజికొనజోల్ 200మి.లీ, ఎకరాకు పిచికారీ చేయాలని సూచించారు. రైతులు రోజు పంటను పరిశీలించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. తూప్రాన్: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) కోసం భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కోసం వెంటనే బ్యాంకు అకౌంట్లను అందజేయాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ఆర్ కోసం భూసేకరణ పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేశామని, భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 630 మంది రైతులకు గాను 505 మాత్రమే బ్యాంకు అకౌంట్లు అందజేశారని తెలిపారు. మెదక్ కలెక్టరేట్: ముస్లిం మైనార్టీల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల బలోపేతానికి ప్రభుత్వం ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకం తెచ్చి నట్లు జిల్లా ఇన్చార్జి మైనార్టీ వెల్ఫేర్ అధికారి విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం మహిళలకు రూ.50 వేల వరకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 21 నుంచి 55 యేళ్ల మధ్య వయస్సు కలిగిన ఫకీర్, దూదెకుల, దుర్బాల వర్గానికి చెంది ఉండాలన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందలేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత గల మహిళలు అక్టోబర్ 6వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం 8142741976 నెంబర్లో సంప్రదించాలన్నారు. -
గొర్రెల పెంపకంతో అధిక ఆదాయం
● పశుసంవర్థకశాఖ ఏడీఏ జనార్ధన్ ● కేవీకేలో పెంపకందారుకు శిక్షణ కౌడిపల్లి(నర్సాపూర్): గొర్రెలు, మేకల పెంపకంతో అధిక ఆదాయం పొందవచ్చని నర్సాపూర్ పశుసంవర్థకశాఖ ఏడీఏ జనార్థన్ తెలిపారు. మంగళవారం మండలంలోని తునికి కేవీకేలో నేషనల్ మీట్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గొర్లు, మేకల పెంపకందారులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గొర్రెలు, మేకల మాంసానికి మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వం సైతం పెంపకందారులకు సబ్సిడీ అందచేస్తుందన్నారు. జిల్లాలో 5లక్షల గొర్రెలు, 4.5లక్షలు మేకలు ఉన్నాయన్నారు. మేలు జాతిని పెంచడంతో ఆదాయం బాగుంటుందన్నారు. వ్యాధులు సోకితే పశువైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యం చేస్తారని, వాక్సిన్స్ సైతం ఇస్తారని చెప్పారు. అనంతరం డాక్టర్ యేగేష్ మాట్లాడుతూ దేశంలో 77శాతం మాంసాహారులు ఉన్నారని, గొర్రెలను పెంచడంతో వాటిని అమ్మగా వచ్చిన ఆదాయంతోపాటు వారి ఎరువుకు సైతం ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేవీకే హెడ్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, శాస్త్రవేత్త శ్రీకాంత్ వివిధ గ్రామాల పెంపకందారులు పాల్గొన్నారు.