breaking news
Medak District News
-
అటవీ సంపద పెంచేందుకు చర్యలేవీ?
ఎంపీ రఘునందన్ రావు నర్సాపూర్ రూరల్: దట్టమైన అడవులు, సంపద పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారని అటవీశాఖ ఉన్నత అధికారులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. మంగళవారం నర్సాపూర్ అర్బన్ పార్క్ ఆవరణలోని ఎకో పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఒక రోజు మానవ – వన్యప్రాణి సంఘర్షణపై వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైందన్నారు. అడవులను పెంచి కోతులు ఇతర వన్య ప్రాణులకు కావలసిన ఆహారం దొరికేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న 765డి జాతీయ రహదారి వెడల్పునకు అనుమతులు ఇవ్వాలని కోరారు. గుమ్మడిదల నుంచి నర్సాపూర్ వరకు అటవీ ప్రాంతంలో ఉన్న రోడ్డుకు చాలా మలుపులు ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రాజన్న సర్కిల్ సీసీఎఫ్ రామలింగం, మెదక్, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల అటవీ, విద్యుత్, పశు సంవర్ధక, వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులు, మెదక్ డీఎఫ్ఓ జోజి తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పనిచేయండి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం ● పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో కలిసి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారికి వివరించారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలని, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. సరిపడా సిబ్బంది, బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంచడంతో పాటు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా సైనన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
మోగిన నగారా
మున్సిపాలిటీ వార్డులు ఓటర్లు మెదక్ 32 36,955 నర్సాపూర్ 15 16,876 తూప్రాన్ 16 20,259 రామాయంపేట 12 13,095మెదక్జోన్: ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దీంతో నేటి నుంచి మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. 31న స్క్రూట్నీ, ఫిబ్రవరి 3న విత్డ్రాలు, 11న ఎన్నికల నిర్వహణ, 13న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కాగా అభ్యర్థులు ఫిబ్రవరి 4 నుంచి 10వ తేదీ వరకు.. 7 రోజుల్లో ప్రచారం ముగించుకోవాలి. జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 75 వార్డులు ఉండగా 87 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. కాగా ప్రతి వార్డులో రెండు చొప్పున 150 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు(ఆర్వోలు) 25 మంది, ప్రిసైడింగ్ అధికారులు 125 మందిని కేటాయించి ఇప్పటికే శిక్షణనిచ్చారు. మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ! నామినేషన్ల స్వీకరణను ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో స్వీకరిస్తున్నారు. కాగా మూడు వార్డులకు ఒక్క ఆర్వో చొప్పున మెదక్లో 32 వార్డులు ఉండగా మున్సిపల్ కార్యాలయంలోనే 11 మంది ఆర్వోలను నియమించారు. వీరు నామినేషన్లు స్వీకరించనున్నా రు. తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 5 కౌంటర్లు ఏర్పాటు చేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులకు 5 కౌంటర్లు, రామాయంపేటలో 12 వార్డులకు 4 కౌంటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. కాగా రామాయంపేట, నర్సాపూర్ ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపాలి టీలు చిన్నగా ఉండటంతో వాటికి మండల పరిషత్ కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఒక్కో ఆర్వో మూడు వార్డుల నామినేషన్ల స్వీకరణ నాలుగు మున్సిపాలిటీల్లో 75 వార్డులు 87 వేల పైచిలుకు ఓటర్లు -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
మనోహరాబాద్(తూప్రాన్): గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలు గుర్తించి పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తూప్రాన్ డీఈ గరుత్మంతరాజు పేర్కొన్నారు. మంగళవారం ప్రజాబాటలో భాగంగా మండల పరిధి పోతారంలో విద్యుత్ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామస్తులతో చర్చించి విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. రైతుల కోసం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే, పలు వీధుల్లో ఇబ్బందికరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాస్, ఏఈ రాజ్కుమార్, ఇంజనీర్ ఆనంద్, నాయకులు పుట్ట మహేందర్ తదితరులు పాల్గొన్నారు. డీఈ గరుత్మంతరాజు -
పురపాలికలకు ఎన్నికళ
● ఇక సందడి షురూ ● ఊపందుకున్న చేరికలు ● నామినేషన్లకు సిద్ధమైన ఆశావహులు రామాయంపేట(మెదక్): ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికల కళ వచ్చేసింది. ఎక్కడికక్కడ టికెట్లు ఆశిస్తున్న ఆయా పార్టీల ఆశావహలు అంతర్గత ప్రచారం నిర్వహించుకుంటున్నారు. ఇక జిల్లాలోని అన్ని ము న్సిపాలిటీలు మహిళలకే రిజర్వుడు కావడంతో చైర్మన్ పదవులకోసం ఎవరికి వారే తీవ్రస్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలించ ని ఆశావహులు ఇతర వార్డులపై దృష్టి సారించి ఇప్ప టికే ప్రచారం ప్రారంభించారు. పార్టీలు ఆశావాహులనుంచి దరఖాస్తులు స్వీకరించడంతోపాటు అభ్యర్థుల గెలుపు అవకాశాలపై సర్వే నిర్వహిస్తున్నాయి. ఎవరికి వారు సర్వేలు రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీ బరిలో ఎవరిని బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఉంటాయనే విషయమై నాయకులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు తమదైన శైలిలో వారు పావులు కదుపుతున్నారు. టికెట్ల కోసం అవసరమైతే పార్టీలు మారడానికి సైతం సిద్ధంగా ఉన్న కొందరు ఆశావహులు తమవంతు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. గెలుపు అవకాశాలున్నవారిని పార్టీలో చేర్చుకొని టికెట్ కట్టబెట్టేందుకు సైతం పార్టీలు యత్నిస్తున్నాయి. జిల్లాలోని మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, నర్సాపూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మెదక్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీలను ఎలాగైనా కై వసం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రయత్నాలు చేస్తున్నారు. నర్సాపూర్లో చేరికల పర్వం నర్సాపూర్లో ప్రధాన పార్టీల్లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. కుల సంఘాలకు ఆశావహులు తాయిలాలు ప్రకటిస్తున్నారు. తూప్రాన్ మున్సిపాలిటీ మాత్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెగ్మెంటు పరిధిలో ఉంది. గజ్వేలు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తూప్రాన్లో పాగా వేయాలని అధికార కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి వివేక్ పలుమార్లు తూప్రాన్లో సమావేశాలు నిర్వహించారు. రామాయంపేటలో విచిత్ర పరిస్థితి రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. టికెట్లకోసం అధికార పార్టీలో పోటీ నెలకొంది. ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందనే భరోసాతో ప్రచారం ప్రారంభించేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడిని పార్టీలో చేర్చుకోవడానికి బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కౌన్సిలర్లు కొందరు ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయారు. పట్టణంలోని ఎనిమిదో వార్డులో టికెట్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, బీఆర్ఎస్ తరఫున ఇద్దరు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తమకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సరైన ప్రాధాన్యత దక్కలేదని కొందరు నాయకులు వాపోతున్నారు. అలాంటి వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జొన్నల బాలు తాజాగా మాజీ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. -
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి
అదనపు కలెక్టర్కు అంగన్వాడీ టీచర్, ఆయాల వినతి మెదక్ కలెక్టరేట్: అంగన్వాడీలో సేవలందించి రిటైర్ అయిన వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను తక్షణమే అందజేయాలని పలువురు రిటైర్డ్ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ నగేశ్కు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ...అంగన్వాడీ ఉద్యోగులు, యూనియన్లు అనేక పోరాటాల ఫలితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ జీఓ విడుదలైందన్నారు. దాని ప్రకారం టీచర్కు రూ.2 లక్షలు, ఆయాకు రూ.లక్ష ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిందని కానీ రిటైరైన ఒక్క టీచర్కుగాని, ఆయాకుగాని ఇప్పటివరకు ఎలాంటి బెనిఫిట్స్ అందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిటైర్డైన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల పరిధి తిప్పన్నగుల్ల గ్రామంలో మంగళవారం మద్యపాన నిషేధం చేస్తున్నట్లు గ్రామ పాలకవర్గం తీర్మానం చేశారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ మంజుల ఆధ్వర్యంలో తీర్మాన పత్రాన్ని ఎస్ఐ రాజేష్కు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే రూ.50 వేలు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. జరిమానాను కట్టని యేడల పంచాయతీ తరఫున వారి దుకాణాలకు తాళం వేస్తామని హెచ్చరించారు. గ్రామాన్ని మద్యపాన నిషేధం దిశగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మంగిలిపల్లి రమేశ్, రాజు, రాములు, యాదగిరి, శ్రీనివాస్ పాల్గొన్నారు. చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. అంతకుముందు యాసంగి పంటకు నీళ్లు విడుదల ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయం ఎదుట మంగళవారం రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ సుధా కిరణ్, ఈఈ వేణు బాబు, డీఈలు మంగారెడ్డి, చంద్రశేఖర్, ఆంజనేయులు, ఏఈ రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ జలాలు.. తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వార్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల రైతాంగానికి యాసంగి పంట సాగుకు మంగళవారం రాత్రి నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఈ కవిత, సిద్దిపేట ఈఈ శంకర్లు నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట, గజ్వే ల్ డీఈఈలు శిరీష, దయాకర్ పాల్గొన్నారు. కొమురవెల్లి(సిద్దిపేట): ఆయిల్పామ్ సాగుతో బోలెడు లాభాలు పొందవచ్చని, రైతులు సాగు కు ముందుకు రావాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జి.సువర్ణ సూచించారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాలలో ఆయిల్పామ్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట ఒక్కసారి సాగు చేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. మొదటి మూడేళ్లు (అంతర పంటల ద్వారా రైతులకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అదే విధంగా కచ్చితమైన మార్కెట్ సదుపాయం ఉండడం వల్ల రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. కార్యక్రమ ంలో జిల్లా ఆయిల్ఫెడ్ అధికారి భాస్కర్రెడ్డి, మండల ఉద్యాన అధికారిని పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం.. అందని ఆరోగ్యం
అల్లాదుర్గం(మెదక్): ఆరోగ్యశాఖ మంత్రి నియోజకవర్గంలో ప్రజలకు ఆరోగ్యం అందని ద్రాక్షగా మారింది. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. పది గంటలు దాటితే తప్ప కేంద్రంలోకి సిబ్బంది అడుగుపెట్టడం లేదు. డాక్టర్తో పాటు సిబ్బంది తమ ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పల్లె దవాఖాన డాక్టర్లు ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించడంతో అవి మూతపడుతున్నాయి. మంగళవారం అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సాక్షి విజిట్ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విధుల్లో నిర్లక్ష్యం అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పది మంది సిబ్బంది ఉన్నారు. ఉదయం 10 గంటలకు అటెండర్, హెల్త్ అసిస్టెంట్ మాత్రమే విధులకు హాజరయ్యారు. డాక్టర్ మాత్రం విధులకు హాజరు కాలేదని పలువురు రోగులు చెప్పారు. ముప్పారం పల్లె దవాఖానలో విధులు నిర్వహించవలసిన డాక్టర్ అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ముప్పారం పల్లె దవాఖాన మూతపడింది. ఆశా వర్కరు కొద్దిసేపు విధులు నిర్వహించినట్టు గ్రామస్తులు తెలిపారు. దవాఖాన ఉన్నా అందని వైద్యం డాక్టర్ నిర్మల సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని పంచాయతీ సభలో గ్రామస్తులు అధికారుల దృష్టికి తెచ్చారు. అయితే తనకు అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించాలని జిల్లా అధికారులు ఆదేశించినట్టు డాక్టర్ చెప్పారని గ్రామస్తులు తెలిపారు. పల్లె దవాఖాన ఉన్నా తమకు వైద్యం అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నాయకుల, అధికారుల అండదండలతో వైద్య సిబ్బంది విధులకు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. డాక్టర్ వేధిస్తున్నారు.. అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ తమను వేధిస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ తమ ఫోన్లను తీసుకొని ఎవరికి ఫోన్ చేస్తున్నారు, నాయకులు, విలేకరుల నంబర్లు మీ వద్ద ఎందుకు ఉన్నాయని ప్రశ్నిస్తున్నట్లు వాపోయారు. డాక్టర్పై ఆరోపణలు వచ్చినా, ఎవరైనా విమర్శించినా తమనే నిందితులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అస్తవ్యస్తంగా ఆరోగ్య కేంద్రాలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులు, సిబ్బంది మూతపడిన పల్లె దవాఖాన -
అర్హులకు సంక్షేమ ఫలాలు
అభివృద్ధిలో భాగస్వాములవుదాం● మహనీయుల కలలు సాకారం చేద్దాం: కలెక్టర్ రాహుల్రాజ్ ● పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా గణతంత్ర వేడుకలుప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్య్ర ఫలాలు అర్హులకు అందినప్పుడే వారి కల సాకారమవుతుందన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్పదని అభివర్ణించారు. జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు సాధించిన ప్రగతిని వివరించారు. – మెదక్జోన్ప్రసంగిస్తున్న కలెక్టర్ రాహుల్రాజ్మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3.62 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. దీంతో వారికి రూ.126. 57 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. అలాగే గృహజ్యోతి పథ కం ద్వారా పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,28,811 మంది వినియోగదారులకు జీరో బిల్లులు జారీ చేశామని, ఇందుకోసం రూ. 84.58 కోట్ల సబ్సిడీని లబ్ధిదారులు పొందారన్నారు. అలాగే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 1,26,961 మంది లబ్ధిదారులకు 4,68,195 గ్యాస్ సిలిండర్లను రూ. 500లకే అందించామన్నారు. ఇందుకోసం రూ. 13.18 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం అందించిందన్నారు.రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ. 6 వేల చొప్పున 2025– 26 వానాకాలంలో 2.62 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 220.84 కోట్లు జమచేశామన్నారు. సాగులో ఉన్న అన్ని భూములకు ఏడాదికి ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. అలాగే దేశంలో ఎప్పుడూ లేని విధంగా రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని, జిల్లాలో అర్హులైన 87,491 మంది రైతులకు రూ. 645.41 కోట్లు మాఫీ చేశామని కలెక్టర్ వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఉన్న ఈ పథకాన్ని రూ.10 లక్షల వరకు పెంచిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 31,041 మంది పలు రకాల చికిత్స పొందగా, అందుకు రూ.85.18 కోట్లు ప్రభుత్వం ఆస్పత్రులకు చెల్లించిందన్నారు.2025–26 వానాకాలం సీజన్లో 1,04,371 మంది రైతుల నుంచి 3,77,914 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ. 902.84 కోట్లను నేరుగా రైతుల అకౌంట్లో జమచేశామన్నారు. అలాగే 1,43,212 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని 37,416 మంది రైతుల నుంచి సేకరించి క్వింటాల్కు రూ. 500 చొప్పున రూ. 61.53 కోట్ల బోనస్ డబ్బులను రైతులకు అందించినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 9,209 ఇళ్లు మంజూరు చేశామని, వాటిలో 6,377 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా, వివిధ స్థాయిలో నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు రూ. 101.29 కోట్లు లబ్ధిదారులకు అ కౌంట్లో జమ చేశామన్నారు. గ్రామీణాభివృద్ధి పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా చేయూత పథకం ద్వారా ప్రతీ నెల 1,09,572 మంది లబ్ధిదారులకు నెలకు రూ. 24.52 కోట్ల వివిధ రకాల పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అలాగే మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా 5,683 సంఘాలకు రూ. 564.40 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. అలాగే గడిచిన మూడేళ్లకు సంబంధించి 10,574 సంఘాలకు రూ. 21.68 కోట్ల వడ్డీలేని రుణాలు అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్రావు, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ మ హేందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
తేలిన వన్యప్రాణుల లెక్క
రామాయంపేట(మెదక్): అటవీశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంతు గణన జిల్లాలో పూర్తయింది. ఈమేరకు జిల్లాలోని ఆరు అటవీ రేంజ్ల పరిధిలోని 98 బీట్లలో గణన కొనసాగింది. సర్వేలో 71 మంది అటవీ సిబ్బందితో పాటు 143 మంది వలంటీర్లు పాల్గొన్నారు. ఈనెల 19 నుంచి ప్రారంభమైన గణనలో మూడు రోజుల పాటు మాంసాహార, మరో మూడు రోజులు శాఖాహార జంతువుల లెక్కింపు చేపట్టారు. దీంతో అటవీ ప్రాంతంలో మనుగడ కొనసాగిస్తున్న జంతువుల లెక్క లేలింది. మెదక్ రేంజ్ పరిధిలో అధికం జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్, కౌడిపల్లి, పెద్దశంకరంపేట రేంజ్లు ఉన్నాయి. వీటి పరిధిలోని అటవీ ప్రాంతంలో వేల సంఖ్యలో వణ్యప్రాణులున్నాయి. జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) జోజీ పర్యవేక్షణలో వారం రోజుల పాటు గణన కొనసాగింది. గణనలో సిబ్బందితో పాటు వలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొనగా, వారికి అధికారులు శిక్షణ ఇచ్చారు. 19న జిల్లాలో టీంల వారీగా ఒకే రోజు కార్యక్రమం ప్రారంభించారు. సీసీ కెమెరాలు, జంతువుల పాదముద్రలు, వన్యప్రాణుల మలం.. తదితర ఆధారాలతో గణన నిర్వహించారు. జిల్లాలో అత్యధికంగా మెదక్ రేంజ్, అత్యల్పంగా పెద్దశంకరంపేట రేంజ్ పరిధిలో జంతు గణన చేపట్టారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో మొత్తం మాంసాహార జంతువులు 51, శాఖాహార జంతువులు వెయ్యికి పైగా ఉన్నట్లు తెలిందని అధికారులు పేర్కొన్నారు. మాంసాహార జంతువుల్లో చిరుతలు, అడవి కుక్కలు, నక్కలు, జంగ పిల్లులు ఉన్నాయి. శాకాహార జంతువుల్లో నీల్గాయ్, మచ్చల జింకలు, సాంబార్ జింకలు, కొండగొర్రెలున్నాయి. కాగా అటవీ ప్రాంతంలో చిరుతల సంఖ్య గతంలో కంటే పెరిగింది. పర్వతా పూర్, తిమ్మాయపల్లి అటవీ ప్రాంతంలో నాలుగు, గుండ్రెడ్డిపల్లి పరిధిలో రెండు, గాజిరెడ్డిపల్లి అటవీప్రాంతంలో మూడు, తొనిగండ్ల అటవీప్రాంతంలో రెండు చిరుతలతో పాటు మూడు చిరుత పిల్లలున్నట్లు వెల్లడైంది. అటవీప్రాంతంలో అత్యధికంగా 200లకు పైగా నీల్గాయ్లున్నాయి.మాంసాహార జంతువుల వివరాలు మెదక్ రేంజ్ 16రామాయంపేట 9తూప్రాన్ 5నర్సాపూర్ 6కౌడిపల్లి 12 పెద్దశంకరంపేట 3 అడవిలో ముగిసిన జంతు గణన 15 చిరుతలు ఉన్నట్లు నిర్ధారణ గణనలో పాల్గొన్న 214 మంది సిబ్బందిఆన్లైన్లో నమోదు చేశాం జిల్లాలో వారం రోజుల పాటు వన్యప్రాణుల గణన కొనసాగింది. మొత్తం 214 మంది తమ సిబ్బందితో పాటు వలంటీర్లు కార్యక్రమంలో పాల్గొని జంతువుల పాదముద్రలు, సీసీ కెమరాలు, వాటి మలం ద్వారా గణన చేపట్టి ఆన్లైన్లో నమోదు చేశాం. సాఫీగా గణన కార్యక్రమం కొనసాగింది. – జోజి, జిల్లా అటవీ అధికారి -
గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని బీజేపీ నర్సాపూర్ బల్దియా ఇన్చార్జి పాపయ్యగౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి, పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తాను ఎన్నికలు పూర్తయ్యే వరకు పట్టణంలోనే ఉంటానని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ మాట్లాడుతూ.. అందరం కలిసికట్టుగా పని చేస్తే మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవచ్చని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ఇన్చార్జి నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, నాయకులు పాల్గొన్నారు. క్రీడలకూ ప్రోత్సాహం నారాయణఖేడ్: విద్యతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. గాంధీచౌక్లో ఎంపీ సురేశ్ షెట్కార్, ఇందిరాచౌక్, క్యాంపు కార్యాలయం, తహసీల్గ్రౌండ్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి గణతంత్ర వే డుకల్లో పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, శివరావుషెట్కార్చౌక్లో నగేశ్ షెట్కార్, రాజీవ్చౌక్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఖేడ్లోని అప్పారావుషెట్కార్ మెమోరియల్ స్టేడియంలో పట్టణంలోని గురుకులాలు, విద్యార్థులకు క్రీడాపోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు తదితర అంశాలపై పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. అన్ని శాఖలకు సంబంధించి ఉత్తమ అధికారులను ఎంపిక చేసి అవార్డులను అందజేశారు. నేటి ధర్నాకు ‘తపస్’ మద్దతు మెదక్జోన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమరయ్య, అంజిరెడ్డి చేపట్టనున్న ధర్నాకు తపస్ ఉపాధ్యాయ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లం తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు మూడేళ్లుగా పీఆర్సీ, ఐదేళ్లుగా డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అలాగే పదవీ విరమణ పొందిన వారికి మూడేళ్లుగా బెనిఫిట్స్ ఇవ్వలేదని వాపోయా రు. ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించినప్పటికీ చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాకు జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. జెండా తలకిందులు! దుబ్బాక: పట్టణంలో సోమవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. దీంతో వెంటనే మున్సిపల్ అధికారులు, అక్కడున్న వారు గమనించి జెండాను కిందికి దింపి సరిచేశారు. అనంతరం మళ్లీ ఎగురవేశారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. సంఘటనపై విచారించి చర్యలు తీ సుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఏం చేయడం లేదని విమర్శించారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. అంతే కాకుండా ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అతికష్టం మీద ఇరువర్గాలను వారించి ఎమ్మెల్యేను పంపించారు. -
కష్టపడిన వారికే పార్టీ టికెట్
తూప్రాన్: పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ వస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరగా, పార్టీ కండువా కప్పి ఆ హ్వానించారు. ఈసందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో తూప్రాన్ పురపాలక ఇన్చార్జి మచ్చ వేణుగోపాల్రెడ్డి, నా యకులు మామిండ్ల అనిల్, శ్రీకాంత్చారి, బందెల నరేశ్, గణేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మాజీ మంత్రి హరీశ్రావు -
రాజ్యాంగానికి లోబడి జీవించాలి
మెదక్ మున్సిపాలిటీ: పౌరులుగా రాజ్యాంగ విలువలకు లోబడి జీవించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంతో పాటు క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారతదేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు అత్యంత విశిష్టమైనదని అన్నారు. ఈసందర్భంగా ఆ మహనీయులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తించాలన్నారు. విధులను అంకితభావంతో నిర్వర్తించి ప్రజల మనసులు గెలవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్రబోస్, రంగా నాయక్, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ శ్రీనివాసరావు -
ఓటు వజ్రాయుధం
మెదక్ కలెక్టరేట్: దేశంలో 18 ఏళ్లు నిండిన పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు. ఐదేళ్ల మన భవిష్యత్ను నిర్ణయించుకొనే ఏకై క అస్త్రం. ఎన్నికలు రాగానే హడావుడి చేసి ఇంటింటా ప్రచారం నిర్వహించే నాయకులు, అనంతరం ఓటేసిన వారిని విస్మరించే ప్రస్తుత పరిస్థితుల్లో ఓటరు ముఖ్య భూమిక పోషించాల్సిన సమయం. ఓటు వేయడంలో నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా పౌరులు అనామకులను అందలమెక్కించిన వారవుతారు. తాను ఒక్కడినే ఓటు వేయకపోతే ఏమవుతుందనే అభిప్రాయం అనర్హులకు ఊతం ఇచ్చినట్లవుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరుల బాధ్యత. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ఓటు వినియోగించుకునేందుకు అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం ఓటర్లు 6,10,512 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 2,93,547 ఉండగా, మహిళలు 3,16,955 ఓటర్లు ఉన్నారు. ఇతరులు 10 మంది ఉన్నారు. గ్రామాలు, పట్టణాల్లో 16వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నేడు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ ఏడాది ‘నా దేశం– నా ఓటు‘ అనే అంశంపై అధికారులు కార్యక్రమాలు చేపట్టారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాహుల్రాజ్ ఆధ్వర్యంలో విద్యార్థు లు, యువకులు, వివిధ ఎన్జీఓ సంస్థల సభ్యులు, అధికారులు మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం ఓటర్ ప్రతిజ్ఞ చేస్తారు. గత శాసనసభ, పార్లమెంటు, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక మంది ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు.ఈ ఏడాది నాదేశం– నా ఓటురాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు జిల్లావ్యాప్తంగా 6,10,512 మంది ఓటర్లు నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
మెదక్ కలెక్టరేట్: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ కోర్సు ద్వారా 5 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఉచిత శిక్షణ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూప్ 1, 2, 3, 4, ఆర్ఆర్బీ, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో డిగ్రీ పూర్తి చేసి రూ. 3 లక్షల లోపు ఆదాయం కలిగిన ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 8న సిద్దిపేట ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంట్రెన్స్ నిర్వహిస్తారని తెలిపారు. మెరిట్ ఆధారంగా ఎస్సీలకు 75, బీసీలకు 15, ఎస్టీలకు 10 శాతం సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి సింధు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.ఈనెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ -
నేటి నుంచి ఖేడ్లో ఉత్పత్తుల జాతర
నారాయణఖేడ్: రిపబ్లిక్ డేను పురస్కరించుకొని డివిజన్లోని స్వయం సహాయక బృందాలు రైతు బజార్లో ఈ నెల 25, 26 తేదీల్లో మహిళా జీవనోపాధి ఉత్పత్తుల జాతరను నిర్వహించనున్నట్లు ఐకేపీ డీపీఎంలు మల్లేశం, రమేష్బాబు, ఏపీఎం సాయిలు తెలిపారు. ఇందులో మహిళా సంఘాలు స్వయంగా తయారు చేసిన వివిధ ఉత్పత్తులు, దుస్తులు, తినుబండారాలు, ఇతర పదార్థాలకు సంబంధించిన 43 దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శన వల్ల మహిళా సంఘాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమా హారతిలు హాజరై జాతరను ప్రారంభించనున్నట్లు చెప్పారు. మహిళా ఉత్పత్తులను ప్రొత్సహించడంతో పాటు సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీఎం సాయిలు, డీఎంటీ నారా నర్సప్ప, సీసీలు వెంకట్, సంతోష్కుమా ర్, సురేశ్, సుందర్లాల్, తుకారాం పాల్గొన్నారు. -
బాలికల హక్కులను పరిరక్షిద్దాం
మెదక్ కలెక్టరేట్: ప్రతి కుటుంబానికి ఆడపిల్ల ఒక గిఫ్ట్ అని, బాలికల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శనివారం బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని గురుకుల బాలికల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్ల ఉన్న ప్రతీ ఇళ్లు ఎప్పుడూ సంతోషకరంగా ఉంటుందన్నారు. బాలికల హక్కుల రక్షణ కోసమే ఉజ్వల అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉజ్వల కమిటీలను ఏర్పాటు చేసి బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ‘బేటీ బచావో– డిజిటల్ హటావో’ అనే సందేశంతో బాలికలను డిజిటల్ దుర్వినియోగం నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. జిల్లాలో ఆడపిల్లలకే చదువుపై ఎక్కువగా ఆసక్తి ఉందన్నారు. వారికి సరైన నైపుణ్యాలను అందిస్తే ఆకాశమే హద్దుగా వారి భవిష్యత్ సాగుతుందన్నారు. మహిళలు, పిల్లలు ఎదుర్కొనే సమస్యలను ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. అనంతరం పలు అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులు, మహిళలకు మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ హేమాభార్గవి, ఆయాశాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.అదనపు ఎస్పీ మహేందర్ -
అభ్యర్థులు.. జర దేఖో
మున్సిపల్ ఎన్నికల నిబంధనలివే.. మెదక్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులకు ఒకరు.. స్వతంత్ర అభ్యర్థులను 10 మంది బలపర్చాలి. ఒక అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తి మరో అభ్యర్థిని ప్రతిపాదించరాదు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాఽశం ఉన్నందున, ఆశావహులైన అభ్యర్థులు కనీస నిబంధనలు మొదలే తెలుసుకొని ఉంటే, నామినేషన్ సమయంలో ఇబ్బందులు ఉండవు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారతీయ పౌరుడై, 21 సంవత్సరాలు నిండి ఉండాలి. మున్సిపల్ పరిధిలో ఏదేని ఒక వార్డులో ఓటరై ఉండాలి. కాంట్రాక్టర్ అయి ఉండరాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, సర్వీసు నుంచి తొలగించిన వా రు పోటీకి అనర్హులు. పార్టీ అభ్యర్థులైతే నిర్ణీత సమయంలో బీఫాం అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ. 1,250, ఇతరులు రూ. 2,500 డిపాజిట్ చెల్లించాలి. గ్రేడ్–1 మున్సిపాలిటీలో రూ. 5 లక్షలు, గ్రేడ్– 2లో రూ. 4 లక్షలు, గ్రేడ్– 3లో రూ. 3 లక్షలకు లోబడి ఎన్నికల వ్యయం చేయాలి. నామినేషన్ ఫారం వెంట ఆస్తులు, అప్పులు, ఆదాయం, కేసులు, వివరాలతో కూడిన అఫిడ విట్, అభ్యర్థి ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, పాన్కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అందజేయాలి. ఒక్క వ్యక్తి నాలుగు కంటే ఎక్కువ నామినేషన్లు వేయకూడదు. -
జంతు గణన వేగవంతం
చిన్నశంకరంపేట(మెదక్): వన్యప్రాణుల లెక్కి ంపు వేగవంతం చేయాలని రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి విద్యాసాగర్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం నార్సింగి మండలం వల్లూర్ అటవీప్రాంతంలో వన్యప్రాణుల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు మాంసాహార జంతువులను లెక్కించనున్నట్లు తెలిపారు. తర్వాత మూడు రోజులు శాఖాహార జంతువుల లెక్కింపు ఉంటుందన్నారు. జాతీయ వన్యప్రాణుల లెక్కింపు ప్రక్రియలో భాగంగా అటవీ ప్రాంతంలో పులుల సంచారంపై ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. రైస్మిల్లులో తనిఖీలు తూప్రాన్: మండలంలోని ఘనపూర్ శివారు వీరభద్ర రైస్మిల్లులో జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానందం, డీఎం జగదీష్కుమార్, ఇన్స్పెక్టర్ తాటి నర్సింలు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టగా, 21,596 క్వింటాళ్ల కొరత ఉంది. వీటి విలువ సుమారు రూ. 4.50 కోట్లని నిర్ధారించారు. తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి సమక్షంలో తనిఖీలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు అధికారులు వెల్లడించా రు. రైస్మిల్ యజమాని అందుబాటులో లేరని, చట్టరీత్యా చర్యలు తప్పవని అధి కారులు హెచ్చరించారు. కృత్రిమ గర్భధారణతో మేలు జాతి దూడలు కౌడిపల్లి(నర్సాపూర్): కృత్రిమ గర్భధారణతో మేలుజాతి దూడలు జన్మిస్తాయని, దీంతో పాలు అధికంగా ఇవ్వడం ద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య తెలిపారు. శనివారం మండలంలోని కంచన్పల్లిలో పశువైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులకు వచ్చే వ్యాధుల పట్ల పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉచిత పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా పశువులకు గర్భకోశ వ్యాధులు, నట్లల నివా రణ, చూడి పరీక్షలు నిర్వహంచి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యంగౌడ్, ఉపసర్పంచ్ లక్ష్మణ్, మండల పశువైద్యాధికారి ఫర్హిన్ ఫాతిమా, స్వప్న, కిషన్బాబు, వీరారెడ్డి, రామకృష్ణ, సత్యనారాయణ, కవిత, రఘుపతి, శైలజ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట ఎన్నికల ఇన్చార్జిగా సాయిబాబా రామాయంపేట(మెదక్): రామాయంపేట ము న్సిపల్ ఎన్నికల ఇన్చార్జిగా నర్సాపూర్ డీఎల్ పీఓ సాయిబాబా నియమితులయ్యారు. ఈమేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చే శారు. ఇటీవల మున్సిపల్ కార్యకలాపాల తీరు వివాదస్పదమైంది. దీంతో అధికారులు ఆయనను ప్రత్యేకంగా నియమించారు. సాయిబాబా శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
కక్షగట్టి 20 కేసులు పెట్టించిండ్రు
దుబ్బాక: ‘రాజకీయంగా భిక్షపెట్టిన ఈ గడ్డపై నాకున్న ప్రేమ.. ప్రభాకర్రెడ్డికి ఉందా?, దుబ్బాక ఉప ఎన్నికలో నేను ఎమ్మెల్యేగా గెలిచాక కక్షగట్టి నాపై 20 కేసులు పెట్టించారని, అయినా భయపడలేదని, తెగించి ధైర్యంగా ఎదుర్కొన్నా’నని ఎంపీ మాధవనేని రఘునందన్రావు తెలిపారు. శనివారం దుబ్బాక పట్టణంలోని 15, 16, 19, 20 వార్డులలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎమ్మెల్యేగా ప్రభాకర్రెడ్డి గెలిచి దుబ్బాకకు ఏం చేశారని ప్రజలు ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ మున్సిపల్లో గెలిస్తే మళ్లీ పరాయి పెత్తనం కింద ఉంటుందని అందుకే ఈ సారి బీజేపీకి పట్టం కట్టాలన్నారు. దుబ్బాకపై సిద్దిపేట పెత్తనం ఎందుకని మొదటి నుంచి తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దుబ్బాక అభివృద్ధి చెందలేదని, రెవెన్యూ డివిజన్ చేయలేదన్నారు. మున్సిపల్ ఎన్నికలను తాను ఛాలెంజ్గా తీసుకొని బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటానన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆధారాలున్నా అరెస్ట్ చేయరేం ● ఫోన్ ట్యాపింగ్లో స్పష్టమైన ఆధారాలున్నా ప్రభుత్వం, సిట్ ఏం చేస్తుందని, ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ఎంపీ ప్రశ్నించారు. ● కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క బీఆర్ఎస్ నాయకుడి అవినీతిని వెలికితీసింది లేదు.. అరెస్ట్ చేసింది లేదన్నారు. ● బావ, బామ్మర్దులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్కు చేతకాకపోతే వచ్చేది మేమే అప్పుడు తప్పకుండా చూస్తామంటూ రఘునందన్రావు అన్నారు. -
అందని గ్యాస్ రాయితీ!
వివరాలు 8లో..ఉమ్మడి మెదక్ జిల్లాలో ‘మినీ మేడారం’ సందడి.. జాతరల నేపథ్యంలో ఊరూరా సంబరాలు వెల్లువెత్తనున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలకు ఆయా గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మ గద్దెలను సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు నెలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు.మెదక్జోన్: జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులు రాయితీ డబ్బుల కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న వారిని మహాలక్ష్మి పథకానికి అర్హులుగా ఎంపిక చేసింది. జిల్లావ్యాప్తంగా 17 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, అధికారిక లెక్కల ప్రకారం 2,35,712 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. భారత్, ఇండియన్, హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు సిలిండర్లు సరఫరా చేస్తున్నాయి. లబ్ధిదారులు రూ. 920 చెల్లించి గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. అనంతరం వారి అకౌంట్లో ఒకసారి రూ. 44, మరోసారి రూ. 376 జమ అవుతోంది. ఈ లెక్కన ఒక్క గ్యాస్పై రూ. 420 తిరిగి లబ్ధిదారులకు వస్తుండటంతో సదరు వ్యక్తికి గ్యాస్కు రూ. 500 చెల్లిస్తునట్లు లెక్క. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల సబ్సిడీ చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు నెలలుగా చెల్లించడం లేదని పలువురు మహిళలు వాపోతున్నారు. పథకం ప్రారంభమైన కొన్ని నెలలు మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ నగదును జమ చేశారు. తర్వాత నగదు జమ కాలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో కొంత మందికే రాయితీ వచ్చిందని, మిగితా వారికి నగదు జమ కాలేదని తెలుస్తోంది. ఇదే విషయమై అధికారులను సంప్రదిస్తే తమకు రాయితీ గ్యాస్పై ఎలాంటి సమాచారం లేదని పేర్కొనడం గమనార్హం.రూ. 26.58 కోట్ల బకాయిలు ఒక్కో కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్ల చొప్పున, ఒక్కోటి రూ. 500లకే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ లెక్కన జిల్లాలో మూడు నెలల్లో సుమారు 7,07,136 గ్యాస్ బండలకు ఒక్కోదానికి రూ. 376 చొప్పున లబ్ధిదారులకు రూ. 26,58,83,136 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో పేద, మధ్య తరగతి మహిళలు నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ అయ్యాయా అంటూ ఆరా తీస్తున్నారు. నెలల తరబడి సబ్సిడీ కోసం ఎదురుచూసే బదులు బుక్ చేసే సమయంలోనే రూ. 500 చెల్లిస్తే గ్యాస్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. మూడు నెలలుగా జమకాని డబ్బులు లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు జిల్లావ్యాప్తంగా 2.35 లక్షల గ్యాస్ కనెక్షన్లు -
పరిసరాల పరిశుభ్రత ముఖ్యం
నర్సాపూర్ రూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండలంలోని రెడ్డిపల్లి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ల్యాబ్, మందుల నిల్వ గది, ఇన్ పేషెంట్ వార్డు, వ్యాక్సినేషన్, టాయిలెట్స్ను పరిశీలించారు. ఆస్పత్రిలో ఎన్ని డెలివరీలు జరుగుతున్నాయని ఆరా తీశారు. తనిఖీ సమయంలో డాక్టర్ రఘువరన్ సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా రెడ్డిపల్లి సర్పంచ్ సుమతి శివకుమార్ కలెక్టర్ను కలిసి గ్రామ సమస్యలను విన్నవించారు. -
పుర పోరు.. ఏర్పాట్ల జోరు
బల్దియా ఎన్నికలకు అధికార యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారుల ఎంపిక పూర్తి చేశారు. వారికి శిక్షణ సైతం ఇచ్చారు. బ్యాలెట్ బాక్స్లు సైతం సిద్ధంగా ఉంచారు. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో అందుకు పూర్తి స్థాయిలో అధికారులు సన్నద్ధం అవుతున్నారు. – రామాయంపేట(మెదక్) జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి పేపర్లు, వైట్, ఎల్లో, గ్రీన్, బ్రౌన్, బ్ల్యూ, పింక్ కవర్లు, ఇంకు, పేపర్ సీళ్లు, ట్యాగ్స్, అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల నిబంధనల బుక్స్, ఇతర సామగ్రి కార్యాలయాలకు చేరాయి. నామినేషన్లు స్వీకరించే కార్యాలయాలు, స్ట్రాంగ్రూంలు, కౌంటింగ్ సెంటర్ల కోసం భవనాల ఎంపిక సైతం అధికారు లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించి, వాటిలో వసతుల కల్పన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాంపులు, లైటింగ్, ఫర్నిచర్, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు.మూడు వార్డులకు ఒక ఆర్వో ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం ఇప్పటికే అధికారులు, సిబ్బంది కేటాయింపు మున్సిపల్ కేంద్రాలకు చేరిన సామగ్రిజిల్లాలో ఇలా.. మున్సిపాలిటీ వార్డులు పోలింగ్ ఆర్వోలు ఏఆర్వోలు నోడల్ కేంద్రాలు అధికారులుమెదక్ 32 64 15 15 10నర్సాపూర్ 15 30 8 8 5తూప్రాన్ 16 32 9 9 5రామాయంపేట 12 24 7 7 5ఈసారి మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. ఈసారి గెజిటెడ్ హోదా ఉన్నవారినే ఆర్వోలుగా నియమించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఫలితాలు వెలువడే వరకు ఆయా వార్డులకు ఆర్వోలే బాధ్యత తీసుకుంటారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు వీరే చేయనున్నారు. కాగా ప్రతి మున్సిపాలిటీకి 20 శాతం అదనంగా ఆర్వోలు, ఏఆర్వోలను నియమించారు. ముఖ్యంగా ఎన్ని కల ఫలితాల అనంతరం కౌన్సిలర్లుగా ఎంపికై న వారికి ధ్రువపత్రాలు అందజేయడం కూడా వీరి బాధ్యతే. -
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. శనివారం పట్టణంలో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి కౌంటర్ల ఏర్పాటు కోసం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహిపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరన్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ మధులత తదితరులు ఉన్నారు.అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాహుల్రాజ్ -
ఓటేద్దాం.. భవిష్యత్ను నిర్ణయిద్దాం
మెదక్ కలెక్టరేట్/మెదక్జోన్: ప్రతి ఓటరూ తమ ఓ టు హక్కుకు వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో అన్ని విభాగాల ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 16వ జాతీయ ఓటరు దినోత్సవంలో ‘నా భారత్– నా ఓటు’ నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నూతనంగా నమోదైన ఓటర్లను గుర్తించి వారికి ఓటరు గుర్తింపు కార్డులను అందిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్ఓ భుజంగరావు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్ల మొ దటి విడత శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పొందిన శిక్షణను తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కేవలం సర్పంచ్లపైనే ఆధారపడి ఉంటుందన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం మెదక్ కలెక్టరేట్: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని హైదరాబాద్ నుంచి ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతకు ముందు ఆర్ఓలు, ఏఆర్ఓల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. -
మహిళలకు మంచి తరుణం
గ్రూప్ సభ్యులకు వడ్డీలేని రుణాలు ఎన్నికల నేపథ్యంలో ఆగమేఘాలపై పంపిణీ మూడు బల్దియాల్లో చీరలు అందజేతరామాయంపేట(మెదక్): మహిళా గ్రూపు సభ్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో రెండేళ్లకు సంబంధించిన వడ్డీలేని రుణాలను (వీఎల్ఆర్)ను మంజూరు చేసింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో మొత్తం 854 గ్రూపులున్నాయి. వీటికి గత మూడేళ్లుగా వీఎల్ఆర్ రుణాలు అందలేదు. ఫలితంగా గ్రూపు సభ్యులు ఇబ్బందులపాలయ్యారు. మున్సి‘పోల్స్’ పుణ్యమా అని.. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద వీఎల్ఆర్ నిధులు మంజూరు చేసింది. ఈమేరకు 2023–24, 2024– 25కు సంబంధించి జిల్లాకు రూ. 3.09 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. ఇటీవల మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నిధుల మంజూరుకు సంబంధించిన చెక్కులను మహిళలకు అందజేశారు. నర్సాపూర్లో మంత్రి వివేక్, కలెక్టర్ రాహుల్రాజ్, ఎమ్మెల్యే సుతీతారెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. అలాగే చీరలను సైతం అందజేశారు. జిల్లా పరిధిలో రామాయంపేట మున్సిపాలిటీకి 5,040, నర్సాపూర్కు 6,000, తూప్రాన్కు 7,440 చీరలు మంజూరు కాగా, వాటిని మహిళలకు అందజేశారు. కాగా మెదక్ మున్సిపాలిటీకి ఇంకా మంజూరు కాలేదు. స్టాక్ వచ్చిన తర్వాత చీరలు అందజేస్తామని అధికారులు ప్రకటించారు.జిల్లాలో ఇలా.. మున్సిపాలిటీ వడ్డీ తీసుకున్నవారు వచ్చిన నిధులు మెదక్ 346 రూ. 90,24,810 నర్సాపూర్ 157 66,93,541 తూప్రాన్ 140 42,75,218రామాయంపేట 211 1,09,53,152 -
పుర పోరులో సత్తా చాటుదాం
తూప్రాన్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్పై నమ్మకంతోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించారని తెలిపారు. కేటీఆర్ ప్ర జలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. అయినా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రావడం లేదన్నారు. అవినీతిలో మునిగిన బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే లక్ష ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 40 వేల ఉద్యోగాల ఇస్తామన్నారు. విభేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. తూప్రాన్కు డిగ్రీ కళాశాల మంజూరు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బీజేపీ, బీఆర్ఎస్లకు చెందిన పలువులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, ఎలక్షన్రెడ్డి, భూంరెడ్డి, రవీందర్గుప్తా, భాస్కర్రెడ్డి, పెంటాగౌడ్, నాగరాజుగౌడ్, నారాయణగుప్తా, నందాల శ్రీనివాస్, భగవాన్రెడ్డి, దీపక్రెడ్డి, మామిళ్ల కృష్ణ, సంతోశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు మంత్రి వివేక్ పిలుపు బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని వ్యాఖ్య తూప్రాన్లో ముఖ్య నాయకుల సమావేశానికి హాజరు -
దరఖాస్తుల ఆహ్వానం
మెదక్ అర్బన్: జిల్లాలోని మోడల్ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విజయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026– 27 సంవత్సరానికి గాను 6వ తరగతి రెగ్యులర్, 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్ల కోసం ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓసీ విద్యార్థులు రూ. 200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ. 125 ఫీజుతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న ఉంటుందని తెలిపారు. దర్గా ఉత్సవాల్లో మంత్రి టేక్మాల్(మెదక్): హజరత్ షాహెదల్లా దర్గా ఉత్సవాల్లో శుక్రవారం మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు టేక్మాల్లోని కిందివాడ నుంచి గంధం, చాదర్ను ఊరేగింపుగా తీసుకొచ్చి దర్గాలో సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్, నాయకులు పాల్గొన్నారు. జిల్లాకు 3 బహుమతులు మెదక్ కలెక్టరేట్: దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాకు మూడు బహుమతులు లభించినట్లు డీఈఓ విజయ, జిల్లా సైన్స్ అధికా రి రాజిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈనెల 19 నుంచి 23 వరకు సంగారెడ్డి జిల్లాలోని గాడియ మ్ స్కూల్, కొల్లూరులో నిర్వహించిన దక్షిణ భారతస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాపన్నపేట మండలం కొడుపాక జెడ్పీహెచ్ఎస్ టీచర్ వెంకటరమణ మొదటి స్థానం పొందినట్లు చెప్పారు. అలాగే తూప్రాన్ గీత స్కూల్ విద్యార్థిని మహతి మూడవ స్థానం, సిద్ధార్థ రూరల్ హై స్కూల్ విద్యార్థి అక్షయ్ నాలుగో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ రమేశ్ చేతుల మీదుగా బహుమతులను పొందినట్లు వివరించారు. సమన్వయం అవసరం నర్సాపూర్: విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సమన్వయం అవసరమని డీఐఈఓ మాధవి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ చూ పాలని సూచించారు. లెక్చరర్లతో నిరంతరం సం బంధాలు కలిగి ఉండాలన్నారు. ప్రిన్సిపాల్ శేషాచారి కాలేజీలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం కళాశాలలో చదివి కానిస్టేబుళ్లుగా ఎంపికై న పూర్వ విద్యార్థులను సన్మానించారు. ప్రమాదాల నివారణకు చర్యలు మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మని ఏఎస్పీ మహేందర్ అన్నారు. ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఐటీసీ పరిశ్రమ ఆధ్వర్యంలో ప్రత్యేక కా ర్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఎస్పీ హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఒక్క కుటుంబానికే కాదు, సమాజానికి తీరని నష్టం కలిగిస్తాయన్నారు. ప్రస్తుతం హెల్మెట్ ధరించి వాహనం నడిపేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం కార్మికులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాశ్గౌడ్, ఫ్యాక్టరీ మేనేజర్ ఆనంద్, హెచ్ఆర్ మేనేజర్ శివం కల్రా, అడ్మిన్ మేనేజర్ నరసింహం, సేఫ్టీ మేనేజర్ సూర్య తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు విశిష్ట గుర్తింపు అవసరం
నర్సాపూర్రూరల్/కౌడిపల్లి: కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం ప్రతి రైతుకు విశిష్ట గుర్తింపు అవసరమని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ అన్నారు. శుక్రవారం నర్సాపూర్ మండలం నారాయణపూర్లో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. 11 అంకెలతో కూడిన రైతు విశిష్ట సంఖ్యను ప్రతి రైతు పొందాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉండే ఏఈఓల వద్దకు రైతులు తమ పట్టాదార్ పాస్పుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్కు లింకు ఉన్న మొబైల్ను తీసుకొని వెళ్లాలన్నారు. మీ సేవలో సైతం నమోదు చేసుకోవచ్చని సూచించారు. అనంతరం కౌడిపల్లి మండల పరిధిలోని కన్నారం గ్రామంలో పర్యటించారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపట్టిందన్నారు. కార్యక్రమంలో ఏడీ సంధ్యారాణి, మండల వ్యవసాయ శాఖ అధికారి దీపిక, సర్పంచ్ దేవిసింగ్, ఏఈఓ దుర్గాప్రసాద్, కార్యదర్శి శేఖర్, రైతుల పాల్గొన్నారు.డీఏఓ దేవ్కుమార్ -
అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు
మెదక్జోన్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో రాజకీయ వలసలు మొదలయ్యా యి. గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని పలు పార్టీలకు చెందిన నేతలు బహిరంగంగా చెబుతుండటంతో ఆశావహులు కండువాలు మార్చుతున్నారు. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గెలిచే సత్తా ఉన్న వారితో సంప్రదింపులు జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక ఎన్నికల షెడ్యూలే మిగిలి ఉంది. కాగా చైర్మన్లతో పాటు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కాగా, ఫలానా వార్డు నుంచి టికెట్ కావాలని కోరి భంగపడిన ఆశావహులు మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ప్రజల్లో మంచి పేరు ఉండి, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టే స్థోమత ఉన్న వారిని తమ పార్టీలో చేర్చుకొని టికెట్ ఇస్తామంటూ ఇప్పటికే అధికార కాంగ్రెస్, పత్రిపక్ష బీఆర్ఎస్ నేతలు పలు సమావేశాల్లో బహిరంగంగా చెబుతున్న విషయం విధితమే. అలాగే ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు..? అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్లు వేర్వేరుగా సర్వేలు చేయిస్తున్నాయి. గురువారం మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ కొండన్ సావిత్రి, సురేందర్గౌడ్ దంపతులతో పాటు మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా, ఇటీవల నర్సాపూర్కు చెందిన పలు పార్టీల నాయకులు హరీశ్రావు సమక్షంలో గులా బీ పార్టీలో చేరారు. ఇదే మున్సిపాలిటీ నుంచి బీజేపీకి చెందిన మరికొంత మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కాగా ఓ బీఆర్ఎస్ రాష్ట్రనేత ముఖ్య అనుచరుడు, మాజీ కౌన్సిలర్తో పాటు మరికొంత మంది నాయకులు కాంగ్రెస్లో చేరనునట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే రంగం సిద్ధం అయినట్లు తెలిసింది. బీజేపీ సైలెంట్ మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరుగుతుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్లు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా బలమైన నేతలను పార్టీలో చేర్చుకుంటూ దూకుడు పెంచాయి. బీజేపీ మాత్రం సైలెంట్గా ఉంది. మొదట్లో ఎంపీ రఘునందన్రావు పలు మున్సిపాలిటీల్లో పర్యటించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఆ పార్టీలో ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. జిల్లాలో జోరుగా రాజకీయ వలసలు టికెట్ల కేటాయింపు అనంతరం మరింత పెరిగే అవకాశం -
సరస్వతీ నమస్తుభ్యం
వసంత పంచమిని పురస్కరించుకొని శుక్రవారం ఏడుపాయల వనదుర్గామాత భక్తులకు సరస్వతి మాత అలంకారంతో దర్శనమిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి అమ్మవారిని దర్శించుకొని పత్యేక పూజలు చేశారు. అలాగే వర్గల్ విద్యా సరస్వతిదేవి క్షేత్రం చిన్నారుల అక్షరాభ్యాసాలలో అలరారింది. సకల విద్యలకు మూలమైన విద్యాసరస్వతి అమ్మవారు స్వర్ణ కిరీటాది విశేషాభరణాలతో దివ్యదర్శనమిచ్చారు. సుమారు 6,000 వరకు చిన్నారుల అక్షరాభ్యాసాలు జరగగా, రోజంతా క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. – పాపన్నపేట(మెదక్)/వర్గల్(గజ్వేల్) -
ఇంటికి వెళ్లి.. బడికి తీసుకెళ్లి
కొల్చారం(నర్సాపూర్): మండల కేంద్రంలోని కేజీబీవీని డీఈఓ విజయ శుక్రవారం సందర్శించారు. ఈ సమయంలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పాఠశాలకు కొన్ని రోజులుగా గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థిని బడికి రాకపోవడంపై స్పందించి విద్యార్థిని ఊరైన పాపన్నపేటకు స్వయంగా వెళ్లారు. వెంటనే పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. అనంతరం ఆమె వెంట బాలికను కేజీబీవీకి తీసుకొచ్చారు. పాఠశాలకు విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడాలని అక్కడి అధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు. -
బడిపాట్లు.. సర్కస్ ఫీట్లు
ప్రయాణం ప్రాణసంకటంఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. సరైన బస్సు సౌకర్యంలేక కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. కొన్నిచోట్ల బస్సు ఫుట్బోర్డుపై, నలుగురు ప్రయాణించే ఆటోలో ఏకంగా 15 మంది చిన్నారులు కిక్కిరిసి వెళ్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి పాఠశాల విద్యార్థుల ప్రయాణ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన బస్సు సౌకర్యంలేక నిత్యం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. రోజూ ఆరు నుంచి ఎనిమిది కి.మీ.లు కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితులు పలు చోట్ల ఉన్నాయి. వర్షాకాలం వస్తే వీరి కష్టాలు రెట్టింపవుతుంటాయి. మరోవైపు ఆటోల్లో వెళ్లే విద్యార్థులూ ఇబ్బందులే పడుతున్నారు. ముగ్గురు ప్రయాణించే ఆటోల్లో ఏకంగా 19 మంది చిన్నారులను తీసుకెళ్తుండటం గమనార్హం. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు సైతం నెలకు రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకంగా 369 గ్రామాలకు అసలు బస్సు సౌకర్యమేలేదు. మొత్తం 1,370 గ్రామాలు ఉండగా, దాదాపు మూడో వంతు గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. దీంతో విద్యార్థులకు నడక కష్టాలు తప్పడం లేదు. ఒకవేళ ఆయా రూట్లలో బస్సులు తిరుగుతున్నప్పటికీ.. స్కూల్కు వెళ్లే సమయం.. ఇంటికి వచ్చే వేళల్లో బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలే ఉన్నాయి. 6 తరగతి నుంచి పదో తరగతి వరకు చదువు కోవాలంటే ఈ నడక, ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణించే కష్టాలు తప్పడం లేదు. ఈ పరిస్థితులు ఒక్క మారు మూల మండలాల్లోనే కాదు, అన్ని మండలాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం గమనార్హం. చాలా రూట్లలో రద్దీ తగ్గట్టుగా బస్సు లు లేకపోవడంతో విద్యార్థులు ఫుట్బోర్డులపై ప్రమాదపు అంచుల్లో ప్రయాణించాల్సి వస్తోంది.సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ వద్ద బస్సు కోసం పరుగులు తీస్తున్న విద్యార్థులుపెద్దశంకరపేట: పలు గ్రామాల నుంచి ఆటోలో వస్తున్న విద్యార్థులుబడికి వెళ్లాలంటే రోజూ 8 కి.మీటర్లు నడవాల్సిందే.. కాలి నడకన వెళ్తున్న ఈ విద్యార్థులదీ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మధుర గ్రామం. గ్రామంలో కేవలం ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు నాలుగు కి.మీ.ల దూరంలో ఉన్న కొన్యాల గ్రామంలోని జెడ్పీ పాఠశాలకు నిత్యం కాలినడకన వెళ్తున్నారు. ఈ గ్రామాల మద్య బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇలా రోజూ ఎనిమిది కి.మీ.లు బరువైన పుస్తకాల బ్యాగ్తో నడవాల్సి వస్తుండటంతో కాళ్లు నొప్పులు పడుతున్నాయని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు ప్రయాణ సామర్థ్యం కలిగిన ఒక్క ఆటోలో ఏకంగా 19 మంది విద్యార్థులు కిక్కిరిసి వెళుతున్న ఈ విద్యార్థులు చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చదువుతున్నారు. బస్సులు రద్దు కావడంతో సుమారు ఆరు కి.మీ.ల దూరంలో ఉన్న గవ్వలపల్లి, కొండాపూర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఇలా ప్రమాదపుటంచుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద ఉన్న హైస్కూల్ విద్యార్థులు. సుమారు మూడు కి.మీ.ల దూరంలో ఉన్న హాస్టల్గడ్డ వసతిగృహాల నుంచి నిత్యం 300 మంది విద్యార్థులు ఇలా ఆరు కి.మీ.ల నడిచి వెళ్లి వస్తున్నారు. ఎక్కడో మారు మూల గ్రామాల్లో ఈ పరిస్థితి ఉందంటే సాధారణం అనుకోవచ్చు కానీ ప్రజాప్రతినిధులు ఉండే జిల్లా కేంద్రంలోని విద్యార్థుల పరిస్థితి ఇది. తమకు బస్సు సౌకర్యం కల్పించాలని అనేక మార్లు విద్యార్థులు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. 6 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది.. మా ఊరి నుంచి దొంతికి బస్సు సౌకర్యం లేకపోవడంతో దొంతిలోని మా స్కూల్కు వెళ్లాలంటే రోజు ఆరు కి.మీలు నడవాల్సి వస్తోంది. పుస్తకాల బ్యాగు బరువుతో ప్రతిరోజు అంతదూరం నడవాలంటే చాలా ఇబ్బంది అవుతోంది. ఒక గంట ముందు ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తోంది. వర్షకాలంలో నడుచుకుంటూ వెళ్లాలంటే మరింత ఇబ్బంది అవుతోంది. అధికారులు బస్సు సౌకర్యం కల్పించాలి. – ఆకాంక్ష, పదో తరగతి, గంగాయిపల్లి, శివంపేట మండలంఅదనంగా 62 కొత్త బస్సులు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాకు అదనంగా 62 కొత్త బస్సులను తెప్పిస్తున్నాం. ప్రధానంగా విద్యార్థులు, మహిళా ప్రయాణికుల సౌకర్యం కోసం వీటిని తిప్పుతాం. పాఠశాల విద్యార్థుల రద్దీకి తగ్గట్టుగా ట్రిప్పులను పెంచాం. ప్రతి బస్టాప్లోనూ విద్యార్థులను ఎక్కించుకుని వారి గమ్యస్థానాలను చేర్చేందుకు డీఎంలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బస్సులు లేని గ్రామాలకు సైతం నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – విజయభాస్కర్, ఆర్టీసీ ఆర్ఎం. నెలకు రూ.వెయ్యి ఖర్చవుతోంది.. మా ఊరిలో జెడ్పీ పాఠశాల లేకపోవడంతో రాయికోడ్కు వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. నిత్యం ఆటోలో వెళ్లి వస్తున్నాను. దీంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నప్పటికీ.. ఆటోచార్జీలు నెలకు రూ.వెయ్యి వరకు ఖర్చు అవుతోంది. సమయానికి బస్సు లేకపోవడంతో ఆటోలో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. – ప్రశాంత్, పదో తరగతి విద్యార్థి, కూసునూరు, రాయికోడ్ మండలం. -
ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలి
రామాయంపేట(మెదక్): ప్రాణం కన్నా విలువైనది ఏమి లేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గురువారం రామాయంపేటలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించి, ఇతరులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో రెండు షీటీంలతో పాటు భరోసా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెలంగాణలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది వేల మంది మృత్యువాత పడుతుండగా, 20 వేల మంది గాయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రతి సంవత్సవం ప్రమాదాల మూలంగా 450 మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రంకెన్ డ్రైవ్తోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతుకుముందు ఎమ్మెల్యేతో పాటు ఎస్పీ ఇతర పోలీసులు, యువకులు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. -
పుర బరి.. పీఠంపై గురి
రామాయంపేట(మెదక్): ‘పుర’ ఎన్నికలు రామాయంపేట మున్సిపాలిటీలో రసవత్తరంగా మారాయి. చైర్మన్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో ఆశావహులు కుటుంబ సభ్యులను బరిలో ని లిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికార కాంగ్రెస్లో నాయకుల మధ్య పోటీ తీవ్రతరమైంది. ఒక నాయకుడు తన కూతురుతో, మరో నాయకుడు భార్యతో నామినేషన్ వేయించాలని నిర్ణయించుకున్నారు. సదరు నాయకుల మధ్య ఐక్యత లోపించి ఎవరికి వారే అన్న చందంగా ముందుకెళ్తున్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీలో అసమ్మతిని సహించమని, అదిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా, కలిసి పనిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు ఇటీవల హెచ్చరించారు. ఇతర పార్టీ నాయకులతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఈ పరిణాయం కాంగ్రెస్లో ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. పనిలో పనిగా ఇతర పా ర్టీల నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు ఇప్పటికే చాలా మంది అధికార పార్టీ పంచన చేరారు. ప్రభుత్వ వ్యతిరేకతపై గులాబీ ఆశలు బీఆర్ఎస్లో సైతం పోటీ తీవ్రంగా ఉంది. మాజీ ఎంపీపీతో పాటు మాజీ సర్పంచ్ ఒకరు చైర్మన్ పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడంతో ప్రజలు ఈసారి తమకే పట్టం కడుతారని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురి మద్దతు కూడగడుతూ ముందుకెళ్తున్నారు. వరుస సమావేశాలతో తాము గట్టి పోటీ ఇస్తామనే సంకేతాలిస్తున్నారు. సత్తా చాటాలని కమలం ఆరాటం గెలుపు కోసం బీజేపీ కార్యకర్తలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. సభలు, సమావేశాలతో ప్రజల ముందుకెళ్తున్నారు. ఇటీవల ఎంపీ రఘునందన్రా వు సమావేశం నిర్వహించి కార్యకర్తలకు సూ చనలు ఇచ్చారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై ఇటీవల మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రజల మెప్పు పొందడానికి యత్నిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను వివరిస్తూ వారు ముందుకు సాగుతున్నారు. కాగా మూడు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. -
రద్దు చేస్తామన్న వారికి బుద్ధి చెప్పండి
మెదక్ మున్సిపాలిటీ: కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి జిల్లాను రద్దు చేస్తానన్న సీఎం రేవంత్రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు ప్రజల కు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ఓ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొండన్ సావిత్రితో పాటు పలు పార్టీలకు చెందిన మాజీ కౌన్సిలర్లు, నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరగా, వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్కు ఓటు వేయడమంటే మన వేలితో మన కన్ను పొడుచుకోవడమేనన్నారు. జిల్లా కేంద్రం ఉండాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలోనే మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పడిందన్నారు. అలాగే కలెక్టరేట్, రైతుబజార్, ఎంసీహెచ్, మెడికల్ కళాశాల, రైల్వేస్టేషన్, ఎస్పీ కార్యాలయాలు కట్టించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏం పనులు చేశారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందన్న నమ్మకం ఉందన్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామన్నారు. టికెట్ రా నివారు బాధ పడొద్దని, అందరికి పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్కు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. అంతకుముందు పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, శేరి సుభాశ్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు బట్టి జగపతి, మల్లికార్జున్గౌడ్, కృష్ణారెడ్డి, ప్రభురెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం ఉండాలంటే కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలి మాజీ మంత్రి హరీశ్రావు పిలుపు బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు -
మెదక్ జిల్లాలోనూ నజర్..
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ చేరికలపై దృష్టి సారించింది. ఎలాగైనా మున్సిపాలిటీలపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు సర్వశక్తుల్ని ఒడ్డుతోంది. ఇందులోభాగంగా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు ఈ చేరికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఆయా మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు, బీజేపీలకు చెందిన స్థానిక నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది. వీరికి ఆ పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్రావులు కండువాలు కప్పేస్తున్నారు. ఇలా ఆయా పట్టణాల్లో కీలకంగా ఉన్న నాయకులను కారెక్కించుకోవడం ద్వారా పార్టీ బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల సంగారెడ్డి, జోగిపేట, జిన్నారం మున్సిపాలిటీల్లో ఆయా పార్టీలకు చెందిన నాయకులకు గులాబీ కండువా కప్పుకోగా..ఒకటీరెండు రోజుల్లో మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీల పరిధిలో కీలక కాంగ్రెస్ నాయకులు కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్రెడ్డి ఇటీవల కేటీఆర్, హరీశ్రావుల సమక్షంలో చేరిన సంగతి తెలిసిందే. ఇటు బీజేపీ నుంచి కూడా బీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు. జోగిపేట పట్టణానికి చెందిన తాజా మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన కౌన్సిలర్లలో కొందరు తిరిగి తమ సొంత గూటికి చేరుతుండటం గమనార్హం. అలాగే గడ్డపోతారం మున్సిపాలిటీలోనూ స్థానికం కీలక నాయకులు ఇటీవల బీఆర్ఎస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. మెదక్ జిల్లాలోనూ పార్టీలో చేరికలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు, మహిళ నాయకులు ఒకటీ రెండు రోజుల్లో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రేసులో ఉన్న వీరు గురు, శుక్రవారాల్లో హరీశ్రావు సమక్షంలో కారెక్కే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల భొగట్టా. నర్సాపూర్ మున్సిపాలిటీలో బీజేపీకి చెందిన తాజా మాజీ కౌన్సిలర్లు ఒకరిద్దరు కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. చేరికలపై బీఆర్ఎస్ నజర్ టికెట్లు ఖరారు కాకముందే.. మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలవాలని భావిస్తున్న నాయకులు టికెట్ల కోసం పార్టీలు మారడం సాధారణంగా జరిగేదే. కానీ, ఇంకా టికెట్లు ఖరారు కాకముందే బీఆర్ఎస్లో చేరికలు జరుగుతుండటం ఆ పార్టీ మళ్లీ పుంజుకుంటోందనే సంకేతానికి నిదర్శనమని రాజకీయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపాలిటీలపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేసి మరింత పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ చేరికలపై దృష్టి సారించి ఆయా గ్రామాల్లో గట్టి పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకుంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 40% గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలను గెలుచుకోగలిగింది. ఇప్పుడు పట్టణ పోరులోనూ పట్టు నిలుపుకునేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. -
అవినీతికి చోటు లేదు
మున్సిపాలిటీ నిధుల ఖర్చు విషయంలో ఎ లాంటి అవినీతికి పాల్పడలేదు. లెక్కలన్నీ పారదర్శకంగానే ఉన్నాయి. ప్రభుత్వం గుర్తించిన హాకా సంస్థ ద్వారానే కొనుగోళ్లు జరిపాం. గిట్టని వారు చేస్తున్న ఆరోపణలు ఇవి. – దేవేందర్, మున్సిపల్ కమిషనర్ రుజువైతే కఠిన చర్యలు అవినీతి, ఆరోపణల విషయమై విచారణ జరిపిస్తాం. ఈమేరకు కలెక్టర్కు లేఖ రాశాం. మున్సిపాలిటీలో చేపట్టిన పనులు, ఖర్చు వివరాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశాం. నిధులు దుర్వినియోగమైనట్లు తెలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయిస్తాం. – మైనంపల్లి రోహిత్, ఎమ్మెల్యే -
ముమ్మరంగా జంతు గణన
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని పోచారం అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న జంతుగణనను అదనపు కలెక్టర్ నగేశ్, డీఎఫ్ఓ జోజీతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లకోసారి జరిగే ఆల్ ఇండియా టైగర్ ప్రతిపాదనలను జిల్లావ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో అమలుచేస్తున్నామన్నారు. జిల్లాలో ఆరు రేంజ్లు, 98 బీట్లలో మాంసాహార జంతు గణన కొనసాగుతుందన్నారు. చిరుత పులులు ఎలుగుబంటి, నిల్గాయి, కొండ గొర్రె తదితర జంతువుల పాదముద్రలు, వెంట్రుకలు, గోళ్లు తదితరాలను ఏం స్క్రిప్ట్ యాప్లో నమోదు చేస్తున్నారని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మణ్బాబు, ఆర్ఐ లక్ష్మణ్, డిప్యూటీ తహసీల్దార్ చరణ్, డీఆర్ఓ వేణు, ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు.నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని గవ్వలపల్లి సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా గవ్వలపల్లి, మడూర్, శాలిపేట సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలకు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఏఈ దినకర్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. ‘పది’లో వందశాతం ఫలితాలు: డీఈఓ కౌడిపల్లి(నర్సాపూర్): పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామని డీఈఓ విజయ తెలిపారు. బుధవారం కౌడిపల్లి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థుల కో సం ప్రత్యేక ప్రణాళికా సిద్ధం చేసి అమలు చేస్తున్నామన్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు చెప్పారు. ఆమె వెంట ఇన్చార్జి హెచ్ఎం పద్మజ, పీడీ విజయ్కృష్ణ, ఉపాధ్యాయులు నరేందర్, లక్ష్మణ్, శర్మ, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ జగన్ తదితరులు పాల్గొన్నారు. ‘చౌకబారు విమర్శలు మానుకోవాలి’ తూప్రాన్: బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్పై చౌకబారు విమర్శలు మానుకోవాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నా రు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధ వారం పట్టణంలోని ఓ గార్డెన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితం అయ్యారని విమర్శించారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరోజు ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమా వేశంలో కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్రెడ్డి, నాచారం దేవస్థానం చైర్మన్ రవీందర్గుప్త, మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, నాయకులు నందాల శ్రీనివాస్, పెంటాగౌడ్, మా మిళ్ల కృష్ణ, నారాయణగుప్త, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏడుపాయల హుండీ ఆదాయం రూ. 52.42 లక్షలు పాపన్నపేట(మెదక్): ఏడుపాయల హుండీ ఆదాయం రూ. 52,42,905 వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. మాఘ అమావాస్యను పురస్కరించుకొని జరిగిన ఉత్సవం తర్వాత బుధవారం హుండీ లెక్కింపు చేపట్టారు. వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కానుకలు తెక్కించారు. ఇందులో కొన్ని వెండి, బంగారం మిశ్రమ కానుకలతో పాటు నగదు వచ్చినట్లు చెప్పారు. 61 రోజుల తర్వాత లెకించామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సులోచన, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు
మెదక్జోన్/రామాయంపేట(మెదక్): గెలిచే సత్తా ఉన్న వారు ఏ పార్టీలో ఉన్నా చేర్చుకొని టికెట్లు ఇస్తామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని మున్సిపాలిటీలన్నీ గెలుస్తామని, హరీశ్రావు మెదక్ తొంగి చూడొద్దన్నారు. ఇతర పార్టీల నేతలతో ఎన్నికలు అయ్యేవరకు మాట్లాడొద్దని కార్యకర్తలను ఆదేశించారు. టికెట్లు రాని వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పారు. పార్టీకి నష్టం చేసేవారు ఎవరైనా క్షమించమని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామాయంపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీలో 22 నుంచి సర్వే జరుగుతుందని, 48 గంటల్లో సర్వే రిపోర్టు వస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీలను కై వసం చేసుకుంటామని స్పష్టం చేశారు. అంతకుముందు మండలంలోని సుతారిపల్లి, శివ్వాయపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, రమణ, రమేశ్రెడ్డి, సరాపు యాదగిరి, మహేందర్రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు -
పేట బల్దియాలో అవినీతి ఊట
రామాయంపేట మున్సిపాలిటీలో అవినీతి తారాస్థాయికి చేరింది. పాలకవర్గం పూర్తయిన ఏడాదిలోనే రూ. కోటికి పైగా పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్దియా ఆధ్వర్యంలో జరిగిన ప్రతి పనిలో అవినీతి స్పష్టంగా కనిపిస్తోంది. ఇంజనీరింగ్ అధికారి ధన దాహమే ఇందుకు కారణమని తెలిసింది. – రామాయంపేట(మెదక్) మున్సిపాలిటీకి గతేడాది 15వ ఆర్థిక సంఘం కింద సుమారు రూ. 2.83 కోట్లు, జనరల్ ఫండ్ కింద రూ. 1.19 కోట్లు, టీయూఎఫ్ఐడీసీ కింద రూ. 25 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో జనరల్ ఫండ్ కింద వచ్చిన నిధులు ఏడాది వేతనాలకు ఖర్చయ్యాయి. టీయూఎఫ్ఐడీసీ కింద వచ్చిన నిధులతో పట్టణంలోని వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం కొనసాగుతోంది. కాగా 15వ ఆర్థిక సంఘం నిధులు పెద్దఎత్తున గోల్మాల్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ ధర కంటే ఎక్కువ బిల్లులు పెట్టి నిధులు స్వాహా చేసినట్లు తెలిసింది. వందల సంఖ్యలో మొక్కలు నాటి, వేల మొక్కలు నాటి, ట్రీగార్డులు ఏర్పాటు చేసినట్లు రూ. 35 లక్షల బిల్లులు రాసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. లైన్ ఫౌడర్ వేయడానికి సున్నం కొనుగోలు నిమిత్తం రూ. 3.98 లక్షలు ఖర్చు చూపారు. ఇందుకు రూ. వేలల్లో అయిన ఖర్చును రూ. లక్షల్లో చూపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాకా సంస్థ ద్వారా నాలుగు వందల బ్లీచింగ్ ఫౌడర్ సంచులు కొనుగోలు చేసినట్లు బిల్లులు రాసి రూ. 6.42 లక్షలు ఖర్చు చేశారు. దీనిపై గతంలో ఆరోపణలు రాగా, కలెక్టర్ తనిఖీలు నిర్వహించి తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. పట్టణంలో పది వేల పండ్ల మొక్కలు పంపిణీ చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి రూ. 4.18 లక్షలు నిధులు డ్రా చేశారు. చెత్తబుట్టల కొనుగోలులో సైతం.. చెత్త బుట్టల కొనుగోలు విషయంలో సైతం పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు తెలిసింది. మొత్తం 12,600 చెత్త బుట్టలు కొనుగోలుకు రూ. 32 లక్షల నిధులు వినియోగించినట్లు నమోదు చేశారు. వాస్తవానికి ఒక్కో చెత్త బుట్ట విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 లోపే ఉంటుంది. అధికారులు మాత్రం రూ. 253కు కొనుగోలు చేసినట్లు బిల్లులు చేసుకున్నారు. ఈఏడాది శానిటేషన్ కింద రూ. 25.75 లక్షలు ఖర్చులు, లేబర్ దుస్తుల కొనుగోలు నిమిత్తం రూ. 8.65 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. వాస్తవానికి ఇందులో 50 శాతం నిధులు కూడా దుస్తుల కొనుగోలు కోసం ఖర్చు చేయలేదని సమాచారం. వీధి కుక్కల స్టెరిలైజేషన్కు రూ. 6.27 లక్షలు ఖర్చయినట్లు చూపారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ కింద వాల్ రైటింగ్ నిమిత్తం రూ. 3.13 లక్షలు ఖర్చు పెట్టినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. శానిటేషన్ లేబర్కు షూ, దుస్తులు, గ్లౌజుల కొనుగోలు నిమిత్తం రూ.8.65 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపారు. చెత్త ట్రాక్టర్లు, ఆటోల్లో డీజిల్ కోసం రూ. లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డులు సృష్టించారు. -
రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేద్దాం
మెదక్మున్సిపాలిటీ/మెదక్ కలెక్టరేట్/మెదక్జోన్/రామాయంపేట: అవగాహనతోనే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మా ట్లాడారు. హెల్మెంట్ లేకుండా ద్విచక్ర వాహనం, సీటు బెల్టు లేకుండా కారు నడపరాదన్నారు. నిబంధనలు పాటించని కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్నప్పటికీ ప్రమాదాలు తగ్గడం లేదని వాపోయారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వాహ నం నడిపేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడటం, మ ద్యం సేవించడంతోనే ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఆర్టీఓ వెంకటస్వామి, ఈఈ వేణు, డీఎస్పీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కుల నిర్మూలన జరగాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పురోగతి సాధించాలన్నారు. బాధితులకు సత్వరమే పరిహారం అందించాలని ఆదేశించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అలాగే పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందజేయడంలో ఉద్యోగుల పాత్ర అభినందనీయమని కొనియాడారు. అంతకుముందు క్యాలెండర్, డైరీనీ ఆవిష్కరించారు. రామాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి పదో తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
పాఠశాలల్లో మూత్రశాలలు కరువు
మెదక్ ఎంపీ రఘునందన్రావువిద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎంపీ రఘునందన్రావురామాయంపేట(మెదక్)/చేగుంట/నర్సాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మూత్రశాలలు లేక విద్యార్థినులు ఇబ్బందులపాలవుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని అక్కన్నపేటలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కా రానికి కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలతో పాటు అంగన్వాడీ భవనాలు, మూత్రశాలలు నిర్మించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రభు త్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎంపీ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి, తొనిగండ్ల, దంతేపల్లి సర్పంచ్లు నవీన్గౌడ్, బాల్రాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, వెల్ముల సిద్దరాంలు పాల్గొన్నారు. అంతకుముందు వడియారం రైల్వేస్టేషన్లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్ను రైల్వే అధికారులతో కలిసి ఎంపీ ప్రారంభించారు. ప్రస్తు తం మేడ్చల్ నుంచి కామారెడ్డి వరకు డబుల్ లేన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను వడియారంలో నిలపడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు స్రవంతి, సర్పంచ్లు సాయికుమార్, సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుజాత తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్సాపూర్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కో రారు. నర్సాపూర్ మున్సిపాలిటీని ఆశించిన స్థాయి లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ తదితరులు ఉన్నారు. -
నీటి గుంత.. తీర్చేను చింత
వట్టిపోయిన బోర్లలో నీరు పుష్కలం ● మెదక్ బల్దియాలో సమృద్ధిగా జలం ● కొత్త ఇళ్లు కట్టాలంటే గుంత నిర్మాణం తప్పనిసరి చేసిన అధికారులుమెదక్జోన్: బల్దియాలో నూతన ఇళ్లు నిర్మించుకోవాలంటే నీటి గుంత తప్పనిసరని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ప్రజలు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. కానీ చిన్నపాటి నీటి గుంతలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వట్టిపోయిన బోరు బావుల్లో పుష్కలంగా నీరు వస్తోందని పేర్కొంటున్నారు. 13 వేలకు పైగా నివాస గృహాలు మెదక్ మున్సిపాలిటీ ఆవిర్భవించి ఏడు దశా బ్దాలు గడిచిపోయింది. ప్రస్తుతం పట్టణ జనాభా 80 వేల పైచిలుకు ఉండగా, 13 వేలకు పైగా నివాస గృహాలు ఉన్నాయి. వీటిలో కమర్శియల్ షాపులు, ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. కాగా ఇళ్ల అవసరాల కోసం సుమారు 8,200 పైచిలుకు బోర్లు ఉన్నట్లు తెలిసింది. మిగితా ఇళ్లకు మున్సిపల్ అధికారులు నల్లాల ద్వారా నీటిని అందిస్తున్నారు. ప్రతి రోజు బోరు మోటార్ల ద్వారా వేలాది పంపు సెట్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. కాగా నూతన ఇళ్లు నిర్మించుకునే వారిలో 70 శాతం ప్రజలు బోరు తవ్విన తర్వాతే నిర్మాణాలు మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో నీటి సమస్య ఉత్పన్నం కాకున్నా, వేసవిలో మాత్రం భూగర్భజలాలు తగ్గిపోయి సమస్యలు ఎదురవుతున్నాయి. 2012 వేసవిలో మెదక్లో చాలా వరకు బోర్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో ప్రజలు వ్యవసాయ బోరు బావుల నుంచి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకున్నారు. ఈక్రమంలోనే మున్సిపాలిటీ పరిధిలో ఇళ్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరూ బోరు తవ్వగానే దాని పక్కనే వర్షపు (ఫిట్) గుంత నిర్మించాలనే నిబంధన పెట్టారు. ప్రస్తుతం గతంలో తవ్వించిన బోర్లు ఫెయిల్ కాగా, ఈ ఏడాది వేసవిలో వాటి పక్కన ఇంకుడు గుంతలు నిర్మించారు. దీంతో వాటిలో ప్రస్తుతం పుష్కలంగా నీరు వస్తోంది. వీటి నిర్మాణం బట్టి ఖర్చు అవుతుంది. మామూలు ఇంటి కోసం తవ్వించిన బోరుకు 4/6 గుంతకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, కమర్శియల్ (రెంట్) బిల్డింగ్ కోసం 10/10 వర్షపు గుంతకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. -
తాగునీటి ఎద్దడికి చర్యలు
మెదక్ కలెక్టరేట్: రాబోయే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లా వ్యాప్తంగా పంప్ సెట్లు, పనిచేస్తున్న బోర్వెల్ల పూర్తి వివరాలు సేకరించాలన్నారు. మైనర్ రిపేర్ల కోసం చెక్లిస్ట్ తయారు చేసి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ బోర్లు, ఇతర నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలో భారీ ర్యాలీ ఉంటుందన్నారు. 26న నిర్వహించే గణతంత్ర వేడుకలపై కలెక్టర్ సమీక్షించారు. మెదక్ పోలీస్ పరేడ్ మైదానంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి కొల్చారం(నర్సాపూర్): ఇంటర్మీడియెట్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థులను పరీక్షలకు పూర్తి సంసిద్ధులుగా చేయవలసిన అవసరం అధ్యాపకులపై ఉందని సూచించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్ 25న జాతీయ ఓటర్ల దినోత్సవం -
మహిళలకు పెట్రోలు బంకులు
నర్సాపూర్: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహిళా పెట్రోలు బంకులు పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్ పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ఆయన మాట్లాడారు. మహిళా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతోందని చెప్పారు. అవసరమైతే నర్సాపూర్లోని మరో మండలంలో సైతం వీటి ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని హామీనిచ్చారు. మహిళా సంఘాలకు రూ.3.46కోట్లు, నర్సాపూర్ పట్టణంలో రూ.66.93 లక్షల వడ్డీలేని రుణాలను అందజేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ...మహిళలకు రూ.20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్యే కోటాలో 1,400 ఇందిరమ్మ ఇళ్లు పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరలో కేటాయించాలన్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు పలువురు అధికారులతో కలిసి మహిళ సంఘాల సభ్యులకు చెక్కులు, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్డీఓ శ్రీనివాస్రావు, ఆర్డీఓ మహిపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓట్లు చీలకుండా చూడాలి క్యాడర్కు మంత్రి వివేక్ సూచన 25 లేదా 26న ఎన్నికల నోటిఫికేషన్ నర్సాపూర్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లు చీలకుండా చూడాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పార్టీ నేతలకు సూచించారు. మంగళవారం రాత్రి నర్సాపూర్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న ఆంజనేయులుగౌడ్ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ ఎన్నికల పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు. రెబెల్స్ లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. క్రమశిక్షణ కల్గిన ప్రతి కార్యకర్తకు పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుందని ఓటర్లలో నమ్మకం కల్గించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో వ్యూహత్మకంగా వ్యవహరించి ఓటర్లను ఆకట్టుకుని తమ వైపు తిప్పుకోవాలని ఆయన సూచించారు. ఈనెల 25 లేదా 26 న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఫిబ్రవరి 11 ఎన్నికలు జరుగుతాయని మంత్రి చెప్పారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, పార్టీ నాయకులు రిజ్వాన్, మల్లేష్, రాజుయాదవ్, చిన్న ఆంజనేయులుగౌడ్, శ్రీధర్గుప్తా, వెంకట్రాంరెడ్డి, శ్రీఽనివాస్గుప్తా, హబీబ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెల్లడి త్వరలో 1,400 ఇందిరమ్మ ఇళ్లు మహిళలకు చీరల పంపిణీ -
మూడో చైర్పర్సన్ ఎవరో..
మెదక్ మున్సిపల్ చైర్మన్ పదవి ఈ సారి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన మహిళా నాయకులు చైర్మన్ పీఠం కోసం పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా పార్టీ అధిష్టానం ఆశిస్సులు పొందేందుకు ఇప్పటికే ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో కొంత మంది ఇతర పార్టీలోకి వెళ్లి తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి యత్నాలు ముమ్మరం చేశారు. చివరకు మెదక్ చరిత్రలో మూడో సారి చైర్మన్ పీఠం ఎవరి పరమవుతుందోననే ఉత్కంఠ నెలకొంది.పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట అప్పటి కౌన్సిలర్లు -
ఫార్మర్ రిజిస్ట్రేషన్పై అవగాహన
పెద్దశంకరంపేట(మెదక్): రైతులు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కృష్ణ అన్నారు. మంగళవారం మండల పరిధి కమలాపూర్లో రైతులకు ఫార్మర్ రిజిష్ట్రేషన్పై అవగాహన కల్పించారు. మండలంలో 16,500 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 45 శాతం మంది రైతులు నమోదు చేసుకున్నారని, మిగతా రైతులు కూడా వెంటనే చేయించుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు ఈఐడీ నంబర్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంట్ల సుజాత, సెక్రటరీ రాజుగౌడ్, ఏఈఓలు వినీత్, అఖిల్, సుభాష్ తదితరులున్నారు. -
పారదర్శకంగా దర్యాప్తు చేయండి
మెదక్ మున్సిపాలిటీ: దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, బాధితులకు న్యాయం చేయడమే అంతిమ లక్ష్యం కావాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కేసులో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్న్, గ్రేవ్, నాన్–గ్రేవ్, మిస్సింగ్ కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత సంఖ్యలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ‘‘అరైవ్ అలైవ్’’కార్యక్రమం ప్రతి మారుమూల గ్రామ ప్రజలకు కార్యక్రమ ఉద్దేశం చేరే విధంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్రబోస్, సీఐలు జాన్రెడ్డి, రేణుకారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గా కృష్ణ, సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి పాల్గొన్నారు. ఎస్పీ శ్రీనివాస రావు ఆదేశం -
పనులు వడివడి
● మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుండటంతో.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ● మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీలు ● మంత్రులు దామోదర, వివేక్ సుడిగాలి పర్యటనలుమంత్రుల హడావుడి.. ఆగమేఘాలపై అభివృద్ధి పనులుఅభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పంపిణీల పేరుతో అధికార పార్టీ హడావుడి చేస్తోంది. ఒకటీ రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి రానుండటంతోఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఆగమేఘాలపై ఆయా పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేస్తున్నారు. పనిలో పనిగా పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు యూనిట్లను అందజేస్తున్నారు. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డిజిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ మంగళవారం ఒక్క రోజే మూడు మున్సిపాలిటీల్లో పర్యటించారు. సంగారెడ్డి 254 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసిన దామోదర.. సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.31.70 కోట్ల అంచనా వ్యయం కలిగిన పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో హెచ్ఎండీఏ, సీడీఎంఏ నిధులతో రాజీవ్పార్కు సుందరీకరణ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పథకం ఫిల్టర్ బెడ్ మరమ్మతు పనులకు శంకుస్థాపనలు చేశారు. అక్కడి నుంచి నేరుగా జోగిపేట్ మున్సిపాలిటీలోనూ మంత్రి పర్యటించారు. పట్టణంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.7.46 కోట్ల వడ్డీరుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. అలాగే 6,584 మంది మహిళా సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కాగా, సంగారెడ్డి మున్సిపాలిటీలో మూడు నెలల క్రితమే ప్రారంభించిన పనులకు ఎన్నికల వేళ శంకుస్థాపనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం శంకుస్థాపనలు చేసిన వాటిలో కొన్ని ఇప్పటికే కొనసాగుతున్న పనులు కూడా ఉండటం గమనార్హం. ఇన్చార్జి మంత్రి వివేక్ సైతం.. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ సైతం నర్సాపూర్ మున్సిపాలిటీలో పర్యటించారు. ఇందిర మహిళా శక్తి సంబురాలు చేసి స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఇచ్చారు. మరోవైపు జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో సోమవారం ఇందిరమ్మ చీరలు, సదాశివపేట మున్సిపాలిటీలోనూ ఎస్హెచ్జీ మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఇలా పలు మున్సిపాలిటీల్లో వివిధ పనులకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం కుదరదు. దీంతో ఎన్నికల ముందు వీటికి శ్రీకారం చుడితే ఈ బల్దియా ఎన్నికల్లో ఎంతో కొంత పార్టీ అభ్యర్థులకు మేలు జరుగుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని.. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు వీలు కలుగుతుందని హస్తం పార్టీ భావిస్తోంది. -
బాల్యవివాహాలపై అవగాహన
ఎల్లంకి డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నర్సాపూర్ రూరల్: నర్సాపూర్లోని ఎల్లంకి డిగ్రీ కళాశాలలో మంగళవారం జూనియర్ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాలపై ఏజీపీ శ్రీధర్ రెడ్డి, లీగల్ సర్వీస్ న్యాయవాది స్వరూప రాణి, లోక్ అదాలత్ బెంచ్ సభ్యులు మధుశ్రీ అవగాహన కల్పించారు. ఎవరైనా బాల్యవివాహాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల వంటి నేరాలకు పాల్పడితే జరిగే శిక్షలు, చట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అశోక్, లీగల్ సర్వీస్ సిబ్బంది ఆంజనేయులు, వై శ్రీను, అరుణ, రాజులు పాల్గొన్నారు. ప్రజల అవసరాలకనుగుణంగా పనిచేయాలి: డీపీఓమెదక్జోన్: ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య పేర్కొన్నారు. మంగళవారం నూతన సర్పంచ్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, అధికారాల గురించి వివరించారు. ఏ అధికారాలు ఉన్నాయో తెలిస్తే గ్రామ పరిపాలనకు దోహద పడతాయని చెప్పారు. అలాగే ఒక సర్పంచ్ ఎమ్మెల్యే, ఎంపీలతో ఎలా సమన్వయం చేసుకోవాలో తెలుస్తుంది అన్నారు. విద్యార్థిలా శిక్షణ తరగతులలో చెప్పిన అంశాలను శ్రద్ధగా వినాలని, వాటిని ఆచరించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శుల విధులు, అనుమతులు, ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో ఏమేమి పను లు చేయాలో శిక్షణ ద్వారా తెలుస్తుందన్నారు. జంతు గణన ప్రారంభంజిల్లా అటవీ అధికారి జోజి రామాయంపేట, హవేళి ఘణపూర్ (మెదక్): జిల్లా వ్యాప్తంగా అటవీప్రాంతాల్లో జంతు గణన మంగళవారం ప్రారంభమైంది. ఈమేరకు జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) జోజి హవేళి ఘణపూర్ మండలం తిమ్మాయపల్లిలో కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈసందర్భంగా సిబ్బందికి సూచనలు చేశారు. పకడ్బందీగా గణన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా పరిధిలోని ఆరు రేంజీలు, 98 బీట్లలో మూడు రోజులపాటు మాంసాహార జంతు గణన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈమేరకు బీట్లలో 176 మంది తమ సిబ్బందితోపాటు విద్యార్థులు గణన కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఆ తరువాత మూడు రోజులు శాకాహార జంతువుల గణన కొనసాగుతుందన్నారు. రామాయంపేట రేంజీ పరిధిలోని తొనిగండ్ల, అక్కన్నపేట అటవీప్రాంతంలో రేంజీ అధికారి విద్యాసాగర్ పాల్గొన్నారు. గణతంత్ర వేడుకలకు గుమ్మడిదల మహిళకు ఆహ్వానం జిన్నారం(పటాన్చెరు)/సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు రావాల్సిందిగా గుమ్మడిదల పట్టణ కేంద్రానికి చెందిన చెన్నంశెట్టి మౌనికకు భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు మంగళవారం మౌనిక విలేకరులకు వెల్లడించారు. సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో కాయిర్ బోర్డ్ మహిళా కాయిర్ యోజన కింద మౌనికతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి మరో నలుగురు మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా ఈ ఆహ్వానాలు అందాయి. తారా డిగ్రీ కళాశాల విద్యార్థి కూడా.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్కు తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన తృతీయ సంవత్సరం విద్యార్థి చరణ్ రాజ్ ఎంపికయ్యారు. అదేవిధంగా రాష్ట్ర రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపునకు నలుగురు తారా కళాశాల ఎన్సీసీ క్యాడేట్లు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ మీడియాకు వెల్లడించారు. -
క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
సంగారెడ్డి క్రైమ్: మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన సంసద్ ఖేల్ మహోత్సవ్ సోమవారం ముగిసింది. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ రఘునందన్రావు ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ఖేల్ మహోత్సవ్ ముఖ్య ఉద్దేశం అని అన్నా రు. గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో సంగారెడ్డి స్టేడియం అభివృద్ధిలో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కచ్చితంగా అభివృద్ధి చేస్తానంటూ క్రీడాకారులకు హామీ ఇచ్చారు. పోటీల్లో వ్యక్తిగత ఓవరాల్ చాంపియన్గా బాడ్మింటన్ డబుల్లో విశా ల్ నాయక్, శివ దినేష్గౌడ్, క్రికెట్లో మహివర్దన్ టీం, కబడ్డీలో సంగారెడ్డి అసోసియేషన్, కోకోలో పాపన్నపేట, వాలీబాల్ చాంపియన్గా కాసాల గ్రా మం విజేతలుగా నిలిచి ట్రోఫీలు అందుకున్నారు. కార్యక్రమంలో కబడ్డీ జాతీయ కోచ్ శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్ యాదవ్, ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్, దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు -
ఎవరికి మంచి పేరుంది?
మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ రహస్య సర్వే● అభ్యర్థుల గురించి అడిగి తెలుసుకుంటున్న టీం ● ప్రభుత్వ పనితీరు, పథకాలపై ఆరామెదక్జోన్: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. ఓటరు నాడి తెలుసుకునేందుకు గత మూడు రోజులుగా వార్డుల్లో రహస్య సర్వే నిర్వహిస్తోంది. అభ్యర్థుల వ్యక్తిత్వంపై ఆరా తీస్తోంది. ఎవరికి బీఫాం ఇస్తే గెలుపు సునాయా సం అవుతుందని ప్రజలను అడిగి తెలుసుకుంటుంది. కాగా లోకల్ వ్యక్తులు సర్వేలో పాల్గొంటే ఓటర్లు వాస్తవాలను చెప్పరనే ఉద్దేశంతో కొత్త వ్యక్తులతో సర్వే చేయిస్తున్నారు. ఇప్పటికే నర్సాపూర్లో పూర్తి కాగా, మెదక్, రామాయంపేట, తూప్రాన్లో సర్వే కొనసాగుతోంది. ఎవరు గెలిస్తే మేలు? జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీల్లో గత మూడు రోజులుగా బీఆర్ఎస్ సర్వే చేయిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచింది. పింఛన్ సక్రమంగా ఇస్తున్నారా..? కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అందుతున్నాయా..? మహిళలకు రూ. 2,500, నిరుద్యోగ భృతి, రైతు భరోసా లాంటి పథకాల గురించి ఓటర్లను అడిగి తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వం మంచి చేసిందా..? ప్రస్తుత ప్రభుత్వం మంచి చేస్తుందా..? అంటూ ఇంటింటికీ తిరిగి ఓటర్లను అడిగి నమోదు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మీ వార్డులో కౌన్సిలర్గా ఎవరికి మంచి పేరుందని ఆరా తీస్తున్నారు. కాగా ఈ సర్వే ఆధారంగానే బీఫాంలు ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఊసెత్తడం లేదు బీఆర్ఎస్ చేస్తున్న ఈ రహస్య సర్వేలో అధికార కాంగ్రెస్ గురించి మాత్రమే ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే బెటరా..? కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందా..? అంటూ సర్వేలో పాల్గొన్న వ్యక్తులు ఓటర్లను అడిగి తెలుసుకుంటున్నారు. కాగా బీజేపీ గురించి ఎక్కడా ఆరా తీయడం లేదని తెలిసింది. -
కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం: సీఐటీయూ
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. సోమవారం కార్మిక, కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ల కోసం కేంద్రం కార్మికులు, రైతుల పొట్ట కొడుతుందని ఆరోపించారు. లేబర్కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీబీ జీ రామ్జీ పేరుతో ఉపాధి హామీ పేరు మార్చి కూలీలను మోసం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 12న కార్మిక వర్గం దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాగయ్య, నాయకులు గౌరయ్య, నాగేందర్రెడ్డి, సంతోశ్, నాగరాజు, బస్వరాజు, బాబు, కవిత, షౌకత్, సత్యం తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు నిర్మూలించాలి నర్సాపూర్ రూరల్: బాల్య వివాహాలను నిర్మూలించాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టు ఏజీపీ శ్రీధర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాలతో పాటు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాలపై ప్రతి విద్యార్థికి అవగాహన అవసరమన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే వారు సీటుబెల్ట్, హెల్మెంట్ ధరించాలన్నారు. మద్యం, డ్రగ్స్కు బానిస కావొద్దని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది స్వరూపరాణి, మాజీ ఏజీపీ సుధాకర్, హెచ్ఎం జ్యోతి, శైలజ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. లబ్ధి పొందడానికే ఆరోపణలు రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీలో అ వినీతి ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు సోమవారం కార్యాలయానికి వెళ్లి విచారించారు. ఈమేరకు మాజీ కౌన్సిలర్లు నాగరాజు, దేమె యాదగిరి, అనిల్కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల స్వామి తదితరులు ము న్సిపల్ కమిషనర్తో సమావేశమై చర్చించారు. మున్సిపాలిటీకి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలు కమిషనర్ వారికి వివరించారు. తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నాయకులు లబ్ధిపొందడానికే ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈవిషయమై తాము ఎమ్మెల్యేకు వివరాలు అందజేస్తామని ప్రకటించారు. చిరుత సంచారం తూప్రాన్: మండలంలోని గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో బండరాళ్లపై రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు సోమవారం గ్రామస్తులు గుర్తించారు. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో వ్యవసాయ బావుల వద్దకు వెళ్తే దాడి చేస్తాయని భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి బోన్లు ఏర్పాటుచేసి చిరుతలను పట్టుకెళ్లాలని కోరారు. కాగా గతంలో చాలాసార్లు ఇదే ప్రాంతంలో చిరుతలు కనిపించాయని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం చిరుతలు అటవీ ప్రాంతంలోనే సంచరిస్తామని, రైతులు ఒంటరిగా వెళ్లవద్దని సూచిస్తున్నారు. -
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్
¯]lÆ>Þç³NÆŠḥæGÐðl$ÃÌôæÅ çÜ$±™é-Æð‡yìlzనర్సాపూర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ అమలుకు సా ధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. పురపాలక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే నాయకులను హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శివకుమార్, శేఖర్,అశోక్గౌడ్, నయీం, సత్యంగౌడ్, భిక్షపతి, బాల్రెడ్డి లక్ష్మణ్ , నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పశువులకు టీకాలు తప్పనిసరి
కొల్చారం(నర్సాపూర్)/చిలప్చెడ్: పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య సూచించారు. సోమవారం మండలంలోని తుక్కాపూర్లో పశువైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. పాడి రైతులు పాడి పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స చేయించి సకాలంలో చూడికట్టేలా చూసుకోవాలన్నారు. ఎద లక్షణాలను గుర్తించి గోపాలమిత్ర ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించాలని రైతులకు సూచించారు. లేగ దూడలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో రంగంపేట పశువైద్యాధికారి ప్రియాంక, సర్పంచ్ అంజనేయులు, ఉప సర్పంచ్ రవీందర్, జిల్లా గోపాల మిత్ర సూపర్ వైజర్ శ్రీనివాస్రెడ్డి, గోపాల మిత్రులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం చిలప్చెడ్ మండలం చిట్కుల్లో జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. పస్తుతం జీవాలకు (అమ్మతల్లి) అంటు వ్యాధి ఎక్కువగా సోకుతుందన్నారు. దీనికి టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ అఖిల్, పశు వైద్యాధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య -
భక్తజన హోరు.. ఎగిసిన బండారు
ఘనంగా పెద్దపట్నం, అగ్నిగుండాలు.. మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లికొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న క్షేత్రం పసుపువర్ణమైంది. పట్నం వారం సందర్భంగా భక్తిపారవశ్యం వెల్లివిరిసింది. పంచవర్ణాల పెద్ద పట్నాన్ని దాటుకుంటూ.. అగ్నిగుండం ప్రవేశం చేస్తూ మేడలమ్మ, కేతమ్మ సమేత మల్లికార్జునుడిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందారు. మల్లన్న క్షేత్రంలో జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ తోటబావి ప్రాంగణంలో సోమవారం హైదరాబాద్కు చెందిన యాదవ భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్తోపాటు అర్చకులు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా పెద్దపట్నం వ రకు చేర్చి యాదవ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు(కల్యాణం) నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు అగ్నిగుండాలు దాటిన తర్వాత గ్యాలరీలలోని భక్తులు, శివసత్తులు యాదవ భక్తులు అగ్నిగుండాలు దాటూతూ స్వామిని దర్శించుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చా రు. శివసత్తులు, భక్తులు బండారు చల్లుకోవడంతో ఆలయ పరిసరాలన్నీ పసుపుమయమయ్యాయి. ఆలయ అధికారులు, ధర్మకర్తలు హైదరాబాద్కు చెందిన యాదవ భక్తులకు,శివసత్తులకు కొత్త బట్టలతో ఘనంగా సన్మానించారు. -
వేడెక్కిన పుర రాజకీయం
చర్చలు, సమీక్షలు, సమాలోచనలు● అధిక స్థానాలు కై వసం చేసుకునే దిశగా అడుగులు ● నర్సాపూర్ బల్దియాలో రాజకీయాలు రసవత్తరంనర్సాపూర్: రిజర్వేషన్లు ఖరారు కావడంతో ‘పుర’ రాజకీయాలు వేడెక్కాయి. నర్సాపూర్ మున్సిపాలిటీలో అన్ని పార్టీలు ఎన్నికలపై దృష్టి సారించాయి. చైర్మన్ పదవిని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఆదివారం ఎమ్మెల్యే సునీతారెడ్డి తన నివాసంలో కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు, ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఆయా వార్డులలో పార్టీ పరిస్థితులు, తదితర అంశా లపై అభిప్రాయాలు తీసుకున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ ఇప్పటికే పార్టీ నాయకులు, ఆశావహులతో సమావేశమయ్యారు. పలు వార్డుల్లో సిట్టింగ్లకు రిజర్వేషన్ అనుకూలంగా రాకపోవడంతో, వారు ఏ వార్డులో పోటీ చేయాలనే అంశాలపై చర్చించారు. ఎంపీ రఘునందన్రావు సూచనల మేరకు పోతన్శెట్టిపల్లి సర్పంచ్ దయాకర్గౌడ్, హత్నూర మండల పార్టీ ఉపాధ్యక్షుడు రాజమల్లారెడ్డి, కౌడిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రాకేశ్ సోమవారం నర్సాపూర్లో అందుబాటులో ఉంటారని, పార్టీ టికెట్ ఆశిస్తున్న నాయకులు తమ పేర్లు వారి వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్కు చెందిన ఆశావహులు సైతం తమ పేర్లను పార్టీ సూచించిన నాయకులకు అందచేసినట్లు తెలిసింది. సోమవారం నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పార్టీ నాయకులు, ఆశావహులతో సమావేశం అయినట్లు తెలిసింది. కాగా జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ముఖ్య నాయకులతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. మద్దతు కోరుతున్న పలువురు ఆయా పార్టీల టికెట్లు ఆశిస్తున్న పలువురు తమ వార్డుల్లో ప్రచారం మొదలు పెట్టారు. కుల సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులతో పాటు ప లువురి ఇళ్లకు వెళ్లి పోటీలో ఉంటున్నానని, మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కాగా ఆయా వార్డుల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమకే పార్టీ టికెట్ ఇస్తుందనే నమ్మకంతో ప్రచారం మొదలు పెట్టారు. అయితే టికెట్ ఎవరికి వస్తుందో వేచి చూడాలి మరి.నేడు మంత్రి వివేక్ రాక జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్ మంగళవారం నర్సాపూర్ వస్తున్నారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ని ర్వహిస్తున్న సన్నాహక సమావేశంలో పాల్గొని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు. పట్టణంలోని పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొని విజయవంతం చేయా లని కోరారు. -
ఏడుపాయలకు రూ.16.87 లక్షల ఆదాయం
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల మాఘ అమావాస్యకు రూ.16.87 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. ఒడి బియ్యం టికెట్ల ద్వారా రూ. 6,450, కేశఖండనం రూ. 8,850, లడ్డూ ద్వారా రూ. 5,84,620, పులిహోర రూ. 2,76,550, కుంకుమార్చన (రూ. 500 టికెట్) రూ. 2,77,500, కుంకుమార్చన (రూ. 250 టికెట్) రూ.56,750, ప్రత్యేక దర్శనం (రూ. 100 టికెట్) రూ. 3,78,800, ప్రత్యేక దర్శనం (రూ.20) రూ. 83,420, విరాళం రూ. 5,100, సత్రముల రూ.7,900, మొక్కుబడి రూ.1,275 కలిసి మొత్తం రూ.16,87,215 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. కాగా గతేడాది రూ.13,13,170 ఆదాయం వచ్చిందని వివరించారు. ‘తపస్’ రాష్ట్ర అదనపు కార్యదర్శిగా భాస్కర్ నిజాంపేట(మెదక్): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర కార్యదర్శిగా మండలంలోని నస్కల్కు చెందిన దుబాసి భాస్కర్ ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రకటించారు. తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈసందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చే స్తానని హామీ ఇచ్చారు. -
గ్రామాల అభివృద్ధే లక్ష్యం కావాలి
మెదక్జోన్/పాపన్నపేట/మెదక్ కలెక్టరేట్: గ్రామా ల అభివృద్ధే లక్ష్యం కావాలి, గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ నూతన సర్పంచ్లకు సూచించారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. సర్పంచ్ల పనితీరుతోనే రాష్ట్రంలో గ్రామాలకు గుర్తింపు లభిస్తుందన్నారు. పంచాయతీ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. మొదటి రోజు పాపన్నపేట, నార్సింగి, మెదక్ హవేళిఘణాపూర్ మండలాల సర్పంచ్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ రవీందర్, డీపీఓ యాదయ్య, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, మాస్టర్ ట్రైనర్లు, డీఎల్పీఓలు తదితరులు పాల్గొన్నారు. అలాగే పాపన్నపేట మండల పరిధిలోని కొడుపాక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల వరకు సెల్ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు. స్పెషల్ క్లాసులకు విధిగా హాజరు కావాలని చెప్పారు. అలాగే గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. మహిళా సంఘాల సభ్యుల తో పాటు ఇతర మహిళలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
రామాయంపేట(మెదక్)/మెదక్జోన్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు విజ్ఞప్తి చేశారు. శనివారం రామాయంపేటలో మెప్మా గ్రూపు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేసి మా ట్లాడారు. మాయ మాటలతో మరోసారి ప్రజలను మోసగించడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రజల ముందుకు వస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. రామా యంపేటలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయి ంచామన్నారు. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డ్వా మా పీడీ హన్మంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మేనేజర్ రాఘవేందర్రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షు డు రమేశ్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మెదక్లో మహిళా సంఘాల సభ్యులకు రూ. 90 లక్షల వడ్డీలేని రుణా లు అందించి మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయటమే ప్రభుత్వ లక్ష్యం అన్నా రు. అభివృద్ధి, సంక్షేమంలో మెదక్ దూ సుకెళ్తుందన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమి లేదని విమర్శించారు.మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు -
3 కంది కొనుగోలు కేంద్రాలు
● మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ● డిమాండ్ మేరకు కేంద్రాల పెంపు ● మద్దతు ధర క్వింటాలుకు రూ.8 వేలు నారాయణఖేడ్: కందిపంటకు మద్దతు ధర కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే రైతులు కంది పంట నూర్పిళ్లను ప్రారంభించిన నేపథ్యంలో సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన పక్షంలో వీరికి ఎంతో ఉపయుక్తంగా మారనుంది. కందులు క్వింటాల్కు రూ.8వేల కనీస మద్దతు ధర నిర్ణయించగా కొన్నిచోట్ల మార్కెట్లో దళారులు రూ.6,500కు కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. ఇటీవలే కందుల కొనుగోలు కేంద్రాలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రారంభించింది. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికంగా ఈ మూడు నియోజకవర్గాల్లో.. జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల్లో కంది పంట అధికంగా సాగవుతో ంది. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘంలో పీఏసీఎస్, జహీరాబాద్లో డీసీఎంఎస్, ఖేడ్ నియోజకవర్గంలోని బాచేపల్లిలో పీఏసీఎస్ల ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పంట దిగుబడుల డిమాండ్ మేరకు ఈ ప్రాంతాల్లో తక్షణ కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. డిమాండ్ మేర కేంద్రాల పెంపు.. జిల్లాలో కందుల దిగుబడుల డిమాండ్ మేరకు మరిన్ని కేంద్రాలను పెంచేందుకు మార్క్ఫెడ్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. గతేడాది నాగల్గిద్ద, సత్వార్, చెల్మడ కలాన్, ఝరాసంఘంలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా రైతుల డిమాండ్ మేరకు కేంద్రాలను పెంచేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. డిమాండ్ మేర కేంద్రాలుపంట దిగుబడులు, రైతుల డిమాండ్ మేరకు కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఝరాసంఘం, బాచేపల్లి, జహీరాబాద్లలో కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. రైతులు కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులను విక్రయించి మద్దతు ధర పొందాలి. – శ్రీదేవి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్, సంగారెడ్డి జిల్లాలో కంది పంటను రైతులు ఈ ఏడాది వానాకాలంలో 76,823 ఎకరాల్లో సాగు చేశారు. వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో కంది దిగుబడి గణనీయంగా వచ్చింది. పెసర, మినుము పంటలు వర్షాల వల్ల దెబ్బతినగా కంది పంటకు మాత్రం మేలు చేశాయి. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చాయి. ఏ కమతాల్లోనైనా 5 నుంచి 6 క్వింటాళ్లకు తగ్గకుండా పంట దిగుబడులున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మంచి దిగుబడులు రావడంతో కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం వల్ల వరి పంట సాగు పెరగడంతో కొంత కంది పంట విస్తీర్ణం తగ్గింది. -
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి
కొల్చారం(నర్సాపూర్): గ్రామీణ క్రీడలను ప్రభుత్వ ం ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం మండలంలోని కోనాపూర్లో కేపీఎల్ సీజన్–2 క్రికెట్ పోటీల ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. విన్నర్, రన్నర్గా నిలిచిన జట్లకు సర్పంచ్ నిర్మల, బీఆర్ఎస్ మండల యువత అధ్యక్షుడు సంతోశ్రావుతో కలిసి ఎమ్మెల్యే ట్రోఫీలతో పాటు నగదు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్నేహపూర్వక వాతావరణంలో పోటీలు జరగడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో పై తర సర్పంచ్ రవితేజరెడ్డి, ఉపసర్పంచ్ మురళీరావు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్గుప్తా, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి -
ఆర్టీసీ ద్వారా మేడారం ప్రసాదం
సిద్దిపేటకమాన్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్ల ప్రసాదాన్ని ముందుగా బుక్ చేసుకున్న వారికి ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికి పంపిస్తామని ఆర్టీసీ డీఎం భవభూతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం సిద్దిపేట ఆర్టీసీ డిపోలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28నుంచి 31వరకు జరగనున్న మేడాకం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళలేని వారికి ప్రసాదాన్ని అందజేయడానికి ఆర్టీసీ ప్రత్యేక సేవలు ఏర్పాటు చేసిందన్నారు. ఆర్టీసీ ఆన్లైన్ ద్వారా, పత్య్రేక కౌంటర్ల ద్వారా ఎవరైనా భక్తులు ముందుగా రూ.299 చెల్లించి వారి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్తో పాటు పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వారు నమోదు చేసుకున్న వారికి మేడారం ప్రసాదం, అమ్మవార్ల ఫోటోతో పాటు పసుపు కుంకుమ ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే పంపించడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 7702160630 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
పుర బరి.. పార్టీల గురి
● అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి ● గెలుపే లక్ష్యంగా వ్యూహాలు ● మెతుకుసీమలో వేడెక్కిన రాజకీయంమున్సిపల్ ఎన్నికలపై ప్రధాన పార్టీలు గురి పెట్టాయి. గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు వ్యూహాలురచిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ప్రక్రియ పూర్తి చేసేలా నేతలు కసరత్తు చేస్తున్నారు. దీంతో మెతుకుసీమ రాజకీయం వేడెక్కింది. – మెదక్జోన్జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, 2020లో జరిగిన ఎన్నికల్లో అన్నింటిలో బీఆర్ఎస్ జెండా ఎగరవేసిన విషయం తెలిసిందే. అనంతరం 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మెదక్లో కాంగ్రెస్, నర్సాపూర్లో బీఆర్ఎస్ గెలిచింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్లు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. నర్సాపూర్ నియోజకవర్గానికి వచ్చే సరికి బీఆర్ఎస్ ముందంజలో నిలిచింది. కాగా ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా వ్యూహా ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. బీఆర్ఎస్.. గెలుపు గుర్రాల వేట ఉమ్మడి మెదక్ జిల్లాపై బీఆర్ఎస్ నేత హరీశ్రావు ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ, ప్రత్యేకంగా మెదక్ బల్దియాపై ఎలాగైనా బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం మెదక్ పట్టణంలో గెలుపు గుర్రాలను తన పార్టీలోకి ఆహ్వానించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. కాంగ్రెస్లో ఓ పేరున్న చైర్మన్ స్థాయి నేతను బీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్లు తెలిసింది. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. గెలుపే లక్ష్యంగా.. బీజేపీ గత సర్పంచ్ ఎన్నికల్లో చావుతప్పి కళ్లు లొట్టపోయిన చందంగా బీజేపీ నామమాత్రపు సీట్లు గెలుపొందింది. మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో యువత బీజేపీ వైపు మొగ్గు చూపుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాగా ఒక్కో వార్డు నుంచి ముగ్గురిని ఎంపిక చేసి ఆ పేర్లను రాష్ట్ర పార్టీకి పంపించనున్నట్లు తెలిసింది. వారిలో ఎవరికి బీఫాం దక్కితే వారే బరిలో నిలుస్తారని సమాచారం. కాగా గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ ఒక్కో మున్సిపాలిటికీ ఒక్కో ఇన్చార్జిని నియమించింది.అధికార కాంగ్రెస్ వార్డుకు ముగ్గురి పేర్లను స్వీకరించాలని నిర్ణయించింది. వారిలో ఎవరికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని పరిశీలించి, గెలిచే వ్యక్తి పేరును ఫైనల్ చేసి బీఫాం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక దశ సర్వే సైతం పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. టికెట్ ఆశించి భంగపడిన కార్యకర్తలకు భవిష్యత్తులో మరో అవకాశం కల్పిస్తామని చెప్పి ఎంపిక ప్రక్రియ కొనసాగించినట్లు తెలిసింది. -
మహా మాఘం.. పుణ్యస్నానం
పాపన్నపేట(మెదక్): మాఘస్నానాలతో భక్తులు పులకించారు. ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయల మంజీరా నదిలో సుమారు రెండు లక్షల మంది స్నానాలు ఆచరించారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీ, ప్రత్యేక, ధర్మ దర్శనం క్యూలైన్లు కిటకిటలాడాయి. పోలీసులు భక్తులను కట్టడి చేయాల్సి వచ్చింది. మంజీరా నది చుట్టూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను నియమించారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పోతంషెట్పల్లి వైపు మొదటి బ్రిడ్జి వరకు వాహనాలు జామ్ అయ్యాయి. రాజగోపురానికి ఇరువైపులా భక్తులు కిక్కిరిసిపోయారు. అమ్మవారు దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది. కాగా చాలా మంది భక్తులు జాతరలో తప్పిపోయారు. దీంతో ఈఓ కార్యాలయంలోని మైక్ ద్వారా ప్రకటనలు చేశారు. భక్తులకు తప్పని తిప్పలుపోతంషెట్పల్లి, నాగ్సాన్పల్లి వైపు కి.మీ దూరంలో వాహనాల పార్కింగ్ ఏర్పా టు చేయడంతో ఆలయం వద్దకు వచ్చేందుకు, పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని వారు ఆరోపించారు. గతంలో ఆలయం వద్ద షవర్ బాత్లు ఉండేవి. ఈసారి వాటిని ఏర్పాటు చేయలేదు. దీంతో మడుగు నీటిలో భయం, భయంగా భక్తులు స్నానాలు చేశారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు సరైన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం తాగునీరు సైతం అందించలేకపోయారు. దర్శనానికి రూ. 20, 100, 250, 500 వసూలు చేయడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొండెక్కిన కొబ్బరి కాయజాతర రద్దీని అవకాశంగా తీసుకొని రూ. 50కి కొబ్బరికాయ అమ్మాల్సిన కాంట్రాక్టర్ రూ.100కు విక్రయించారు. భక్తుల సమస్యలను తీర్చాల్సిన ఈఓ చంద్రశేఖర్ కేవలం గర్భగుడికే పరిమితమయ్యారని భక్తులు మండిపడ్డారు. మెదక్ డీఎస్నీ ప్రసన్నకుమార్ అధ్వర్యంలో 210 మంది పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. మంజీరా నదిలో భక్తుల పుణ్య స్నానాలు -
పట్నం.. పరవశం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లికి భాగ్యనగర వాసులు పోటెత్తారు. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలన్నీ మారుమోగాయి. ‘మల్లన్నస్వామి మమ్మేలు.. కోరమీసాల స్వామి దీవించు..’ అంటూ భక్త జనం పారవశ్యంలో మునిగిపోయారు. మరోవైపు శివసత్తుల పూనకాలు పోతరాజుల విన్యాసాలతో సందడి నెలకొంది. ఆదివారం స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి వారాన్ని పురష్కరించు కుని హైదరాబాద్ భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి, స్వామివారికి ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించి పూ జలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. బోనాలతో బారులు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది బోనం. భక్తులు అందంగా అలంకరించిన బోనాలతో బారుతీరారు. స్వామివారికి నైవేద్యం సమర్పించారు. అలాగే గుట్టపై కొలువైన మల్లన్న సోదరి రేణుక ఎల్లమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. దారులన్నీ కొమురవెల్లికే.. ‘పట్నం వారం’ సందర్భంగా ప్రధాన రహదారులన్నీ కొమురవెల్లి వైపే కొనసాగాయి. ఆలయానికి చేరుకునే రహదారుల్లో సుమారు 2 కిలోమీటర్ల మేర భక్తులు నిండిపోయారు. మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ ఆధ్వర్యంలో పోలీసులు భారీబందోబస్తు చేపట్టారు. కాగా సోమవారం ఉదయం ఆలయ తోట బావి ప్రాంగణంలో పెద్దపట్నం, అగ్నిగుండాల నిర్వహణకు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.స్వామి వారి రాజగోపురం ఎదుట భక్తజనంవైభవంగా మల్లన్న పట్నం వారం -
హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతాం
హుస్నాబాద్: ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రిటైర్డ్ జడ్జిచే నివేదిక తయారు చేసి హుస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సికింద్రాబాద్ గతంలో జిల్లా కాదని, జిల్లాల విభజన జరిగినప్పుడు సికింద్రాబాద్ కాకుండా మల్కాజిగిరి జిల్లా చేశారని మంత్రి గుర్తు చేశారు. హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేటలో కలిపితే నిరసనలు, ఆమరణ దీక్షలు చేశారన్నారు. అప్పుడు ఇక్కడి నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా ప్రాంతాలు ఉండాలన్నారు. పార్టీ నిర్ణయం మేరకే మున్సిపల్ చైర్మన్ అవుతారని అన్నారు. స్ధానిక నాయకుల పై సర్వే జరుగుతుందని, గెలుపు ఆధారంగా టికెట్లు ఇస్తామని తెలిపారు. -
ఇక విద్యార్థులకు స్కూల్ కిట్లు
మెదక్ అర్బన్: కార్పొరేట్కు దీటుగా సర్కార్ బడులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు స్కూల్ కిట్లు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేస్తున్న విద్యాశాఖ, మరో అడుగు ముందుకు వేసి 22 వస్తువులతో కూడిన కిట్లను పాఠశాల ఆరంభం రోజే అందించేందుకు సంసిద్ధమవుతోంది. కాగా పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు వేర్వేరు కిట్లు అందజేయనున్నారు. జిల్లాలో 956 ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో 956 ప్రభుత్వ పాఠశాలల్లో 83,064 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో నిరుపేద విద్యార్థులకు పెద్ద చదువులు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సర్కార్ బడులకు భారీగా నిధులు కేటాయిస్తుంది. ప్రభుత్వ పరిధిలో లోకల్ బాడీ స్కూళ్లు 902 ఉండగా, 63,266 విద్యార్థులు ఉన్నారు. కేజీబీవీ, గురుకులాలు, మినీ గురుకులాలు, మోడల్ స్కూళ్లు కలిసి 54 ఉండగా, 19,798 విద్యార్థులు ఉన్నారు. ఇందులో నాన్ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ విద్యార్థులకు వేర్వేరు కిట్లు ఇవ్వనున్నారు. ఒక్కో కిట్లో మొత్తం 22 వస్తువులు ఉంటాయి. కాగా విద్యార్థులకు ఇప్పటికే ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, రెండు జతల యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. 22 రకాల వస్తువులు ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇచ్చే కిట్లలో పాఠ్య పుస్తకాలు, నోట్, వర్క్బుక్లు, ఏకరూప దుస్తులు, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్స్, బెల్ట్, టై, ఐడీ కార్డులు, పెన్సిళ్లు తదితర వస్తువులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలు, కేజీబీవీ వి ద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, బూట్లు, దుప్పటి, స్పోర్ట్స్, పీటీ డ్రెస్, బ్లేజర్ తదితర వస్తువులు అందజేయనున్నారు. బడులు తెరిచేరోజున పంపిణీ జిల్లాలో 83,064 మందికి లబ్ధి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు -
సంతోషంగా ఉంది
మాది ధంజ్యా తండా, బస్సు సౌకర్యం లేదు. అయినా చదువుకోవాలన్న తపనతో ప్రతి రోజు కాలినడకన 5 కి.మీ నడిచి పాపన్న పేట ఉన్నత పాఠశాలకు వస్తాం. గిరిజన కుటుంబంలో పుట్టిన మాకు షూలు, టైలు, స్పోర్ట్స్ డ్రెస్లు తెలియవు. ఇవన్నీ ఉన్న ప్రైవేట్ విద్యార్థులను చూస్తే, కొంచెం బాధగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్కూల్ కిట్లు ఇవ్వడం సంతోషకరం. – పూజిత, పదో తరగతి, పాపన్నపేట సర్కార్ బడులు బలోపేతం ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రస్తుతం విద్యార్థులకు కిట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతుండటం సంతోషకరం. ఇంకా అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – విజయ, డీఈఓ -
దశలవారీగా సమస్యల పరిష్కారం
నర్సాపూర్ రూరల్: దశలవారీగా విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని విద్యుత్శాఖ ఎస్ఈ నా రాయణనాయక్, డీఈ రామేశ్వరస్వామి అన్నారు. శనివారం నర్సాపూర్ విద్యుత్శాఖ ఏడీ రమణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని లింగాపూర్లో జరిగిన ప్రజా బాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. లో ఓల్టేజీ, వేలాడుతున్న తీగలు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, కొత్త విద్యుత్ లైన్ల గురించి ప్రజా బాట ద్వారా తెలుసుకొని దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. అత్యవసర సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు సొంతంగా కరెంట్ మరమ్మతులు చేసుకోవద్దని సూచించారు. సమస్యలు ఉంటే తమ సిబ్బందికి తెలపాలన్నారు. వ్యవసాయానికి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్గుప్తా, ఏఈ రామ్మూర్తి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.విద్యుత్శాఖ ఎస్ఈ నారాయణనాయక్ -
కాంగ్రెస్ను నిలదీయండి
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో రెండో రోజు పర్యటించి కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజలకు పంపిణీ చేశారు. పెంచిన పింఛన్ వస్తుందా, తులం బంగారం ఇస్తున్నారా..? అంటూ ఆరా తీశారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శివకుమార్, అశోక్గౌడ్, నయీమోద్దీన్, సత్యంగౌడ్, భిక్షపతి, బాల్రెడ్డి, రాకేశ్గౌడ్, నాగరాజుగౌడ్, /్ఞానేశ్వర్, లక్ష్మణ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జంతు గణనపై శిక్షణ రామాయంపేట(మెదక్): అటవీప్రాంతంలో ఈనెల 19 నుంచి చేపట్టనున్న జంతు గణనలో ఆశాఖ అధికారులతో పాటు విద్యార్థులు పాల్గొ నన్నారు. ఈమేరకు విద్యార్థులకు పలుమార్లు శిక్షణ కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించారు. తాజాగా శనివారం మండలంలోని అక్కన్నపేట అటవీప్రాంతంలో స్థానిక చత్రపతి శివాజీ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆశాఖ అధికారులు అవగాహన కల్పించారు. ప్రైవేట్ వ్యక్తికి తోడుగా తమ శాఖకు చెందిన వ్యక్తి ఉంటారని, వారిద్దరు కలిసి జంతు గణన చేపట్టి వెంటనే ఆన్లైన్ చేయాల్సి ఉంటుందని అటవీశాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్ తెలిపారు. సర్వేలో భాగంగా ప్రతి రోజూ కనీసం నాలుగు కిలో మీటర్లు అటవీలో పర్యటించాల్సి ఉంటుందన్నారు. సాఫీగా కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కుంటలు కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవు మనోహరాబాద్(తూప్రాన్): గ్రామాల్లో కుంటలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇరిగేషన్ ఏఈ విజయ్కుమార్, రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. శనివారం మండలంలోని చెట్లగౌరారం గ్రామస్తులు మాక్సోని కుంట కబ్జా చేస్తున్నారని అధికారులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ ఏఈ విజయ్కుమార్, మండల రెవెన్యూ అధికారులు కుంటను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి కుంట, చెరువు భూములను సర్వే చేసిన హైడ్రా ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలిపారు. కుంట శిఖం, బఫర్ జోన్లను అందులో ఉంచామన్నారు. ఎవరు ఎలాంటి కబ్జా చేసిన వెంటనే తెలిసిపోతుందన్నారు. కుంటలు, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వారి వెంట నాయకుడు శ్రీహరిగౌడ్, గ్రామస్తులు ఉన్నారు. -
4 బల్దియాలు నారీమణులకే
● మున్సిపల్ చైర్పర్సన్ రిజర్వేషన్లు ఖరారు ● మెదక్ బీసీ మహిళకు, మిగితా మూడు జనరల్కు కేటాయింపుమెదక్జోన్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు శనివారం ఖరారయ్యాయి. రాష్ట్ర యూనిట్లో భాగంగా ప్రభుత్వం నాలుగింటిని మహిళలకే రిజర్వుడ్ చేసింది. మెదక్ (బీసీ) మహిళకు కేటాయించగా, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సి పాలిటీలను జనరల్ మహిళకు రిజర్వుడ్ చేశారు. ఇప్పటికే ఆయా సామాజికవర్గాల వారీగా వార్డుస్థానాల రిజర్వేషన్లు పూర్తి కాగా, నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి 75 వార్డులు ఉండగా వాటిని కలెక్టరేట్లో ఆయా రాజకీయ పార్టీల నేతల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. కాగా మొత్తంగా 50 శాతం వార్డులను మహిళాలకు కేటాయించగా, 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు రిజర్వేషన్లు కల్పించారు. మెదక్ మున్సిపాలిటీ 1952లో ఏర్పాటు అయింది. 74 ఏళ్లలో రెండుసార్లు చైర్పర్సన్గా మహిళలకు అవకాశం దక్కింది. తాజాగా శనివారం మరోసారి మహిళకు కేటాయించారు. 1957లో కేవల్ మున్నాబాయి చైర్మన్గా పనిచేయగా, 2000 సంవత్సరంలో కొండన్ సావిత్రి చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం 26 ఏళ్ల తర్వాత మరోసారి చైర్పర్సన్గా బీసీ మహిళాకు అవకాశం దక్కింది. కాగా నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీలు 2018లో ఏర్పడ్డాయి. వాటికి 2020 జనవరిలో ఎన్నికలు జరగగా నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలు (బీసీ) జనరల్ రిజర్వుడ్ అయింది. రామాయంపేట ఓసీకి రిజర్వుడ్ అయింది. ప్రస్తుతం ఈ మూడు మున్సిపాలిటీలు జనరల్ మహిళకు రిజర్వుడ్ కావటం విశేషం.కొందరికి ఖేదం.. మరికొందరికి మోదంమెదక్ అర్బన్: మెదక్ మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లు ఆశావహులకు ఆశ, నిరాశలు మిగిల్చాయి. చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకొని రాజకీయ పావులు కదిపిన కాంగ్రెస్లోని ఓ ముఖ్య నాయకుడికి రిజర్వేషన్ ఆశనిపాతమైంది. చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఓసీ వర్గానికి చెందిన ఆయన నిరుత్సాహానికి గురయ్యారు. కాగా ఇదే పార్టీ నుంచి చైర్మన్ పదవి ఆశిస్తున్న మరో ముఖ్య నాయకుడికి రిజర్వేషన్ కలిసొచ్చింది. ఆయన సొంత వార్డు సైతం అనుకూలంగా వచ్చింది. గతంలో ఆయన సతీమణి సైతం మున్సిపల్ చైర్మన్గా పని చేయడం.. ఆయన ఆశలకు ఊపిరి పోస్తున్నాయి. ఇక బీఆర్ఎస్లో చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఓ యువ నాయకుడు చైర్మన్గా, వైస్ చైర్మన్గా, ఆయన భార్య కౌన్సిలర్గా పని చేశారు. ప్రస్తుతం ఆయన, ఆయన భార్యకు గతంలో పోటీ చేసిన వార్డులు అనుకూలంగా రిజర్వ్ కావడంతో ఆ శలు పెరిగాయి. బీఆర్ఎస్ నుంచి చైర్మన్ పదవి ఆశిస్తున్న ఓ మాజీ చైర్మన్కు గతంలో పోటీ చేసిన వార్డు రిజర్వేషన్ అనుకూలంగా రాలేదు. పార్టీ ఆశీస్సులు లభిస్తే ఆయన భార్యను మరో వార్డు నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని తెలు స్తోంది. బీఆర్ఎస్కు చెందిన మరో ఓసీ నాయకుడు గతంలో కౌన్సిలర్గా పని చేశారు. ఈసారి ఆయన పోటీ చేసిన వార్డు బీసీ జనరల్కు రిజర్వ్ కావడంతో అవకాశం లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఓ మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఓ కౌన్సిలర్ సొంత వార్డుల్లో అనుకూలమైన రిజర్వేషన్లు వచ్చా యి. కాగా చైర్మన్ గతంలో ఇతర వార్డు నుంచి పోటీ చేసి గెలిచాడు. కాంగ్రెస్లో కొనసాగుతున్న ఓ మహిళా కౌన్సిలర్ గతంలో రెండు పర్యాయాలు గెలిచారు. రిజర్వేషన్ సైతం అనుకూలంగా రావడంతో చైర్పర్సన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం మీద రిజర్వేషన్లు అనుకూలంగా లేకపోవడంతో కొంత మ ంది ఔత్సాహికులు ఆశలు చావక, అనుకూల వా ర్డుల్లోకి వలస వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారు. అయితే చైర్మన్ పదవికి మాత్రం రెండు పార్టీల్లో రిజర్వేషన్లు అనుకూలించక, బహుముఖ పోటీ తప్పిందని భావిస్తున్నారు. ఒక విధంగా పార్టీ అధినాయకులకు తలనొప్పి తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
‘పుర’ రిజర్వేషన్లు ఇలా..
మెదక్ కలెక్టరేట్: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు చెందిన వార్డుల రిజర్వేషన్ ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రిజర్వేషన్పై సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మెదక్ మున్సిపాలిటీ 32 వార్డులు, నర్సాపూర్ 15, తూప్రాన్ 16, రామాయంపేట 12 వార్డులకు రిజర్వేషన్లు ప్రకటించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, ప్రత్యేక అధికారి సంధ్య, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.మెదక్ మున్సిపాలిటీవార్డు రిజర్వేషన్ 1, 13 ఎస్సీ మహిళ 2 ఎస్టీ జనరల్ 8,11, 12, 21 బీసీ మహిళ 7, 15, 16,20, 24, 25, 29 బీసీ జనరల్ 3, 4, 10, 14, 17, 23, 27, 28, 32 జనరల్ మహిళ 18, 26 ఎస్సీ జనరల్ 5, 6, 9, 19, 22, 30, 31 అన్ రిజర్వ్డ్ జనరల్ -
అన్నా పండుగొచ్చిందే..!
● ఆశావహులకు సంక్రాంతి భారం ● ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు దావత్లు ● తడిసి మోపడవుతున్న ఖర్చు మెదక్కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న ఆశావహులకు సంక్రాంతి పండుగ ఖర్చు తడిసి మోపెడవుతోంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇప్పటికే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఆశావహు లు పండుగ వేళ ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మీ మద్దతు తనకే ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. ఇదే సమయంలో సంక్రాంతి రావడంతో అన్నా పండగొచ్చింది.. దావత్ లేదా? అంటూ యువకులు, పెద్దలు అడగటంతో చేసేది లేక ఖర్చు పెడుతున్నారు. నోటిఫికేషన్ రాకముందే ఖర్చు ఇలా ఉంటే తర్వాత ఎలా? అని ఆందోళన చెందుతున్నారు. పండుగ ఖర్చు కాదంటే.. ఓట్లు పోతాయన్న భయంతో భరిస్తున్నామని చెబుతున్నారు. ఇదే సమయంలో ఎలాగైనా గెలవాలన్న తపనలో ఉన్న కొంతమంది పండుగను ఆసరా చేసుకొని ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఎన్నికల కమిషన్ రిజర్వేషన్లను ప్రకటించడంతో ఇక ఏ క్షణ మైన షెడ్యుల్ విడుదల చేసే అవకాశ ం ఉంది. జిల్లాలో నాలుగు బల్దియాలు జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్లో 32, నర్సాపూర్ 15, తూప్రాన్ 16, రామాయంపేటలో 12 వార్డులు ఉన్నాయి. వార్డులకు సంబంధించిన ఓటరు తుది జాబితాను ఇప్పటికే ప్రకటించారు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 87,185 మంది ఓటర్లు ఉన్నారు. -
రామలింగేశ్వరాలయం ముస్తాబు
నేటి నుంచి 17 వరకు ఉత్సవాలుముస్తాబైన రామలింగేశ్వరాలయం, (ఇన్సెట్) గర్భగుడిలోని స్వయంభు రామలింగేశ్వరుడుతూప్రాన్: మండలంలోని ఇస్లాంపూర్ శివారు రామలింగేశ్వరాలయం విశిష్ట ప్రాచుర్యం పొందింది. ఇక్కడ పూజలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ఏటా మకర సంక్రాంతి సందర్భంగా మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. వేడుకలకు ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఏళ్ల క్రితం భూమి నుంచి 300 అడుగుల ఎత్తులో ఇక్కడ రామలింగేశ్వరాలయాన్ని నిర్మించారు. పూర్వకాలంలో శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో తిరుగుతున్నప్పుడు ఈ ఆలయంలో పూజలు చేసినట్లు చెబుతారు. ఈనెల 15 నుంచి 17 వరకు జాతర ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పూజారి శలాక ఆత్రేయశర్మ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. -
క్రీడలతో మానసికోల్లాసం
కొల్చారం(నర్సాపూర్): క్రీడలతో మానసికోల్లా సం కలుగుతుందని, గ్రామీణ యువత ప్రతిభ చాటేందుకు దోహదం చేస్తాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పైతరలో జరిగిన పీపీఎల్ సీజన్– 3 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన జట్లకు మెడల్స్, ట్రోపీలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ యాబన్నగారి రవితేజరెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్, మాజీ ఎంపీటీసీలు చంద్రశేఖర్రెడ్డి, ఆదాం, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్గుప్తా, యువత అధ్యక్షుడు సంతోశ్రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లేశం, సమరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూప్రాన్: మండలంలోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మండలంలోని ఇస్లాంపూర్, వెంకట రత్నాపూర్, మున్సిపాలిటీ పరిధిలోని తాతపాపన్పల్లికి చెందిన నాయకులు వంటేరు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో బయలుదేరారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్, మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, మహేందర్రెడ్డి, రమేశ్, మహేశ్, శ్రీశైలం, నగేష్, నరేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేగోడ్(మెదక్): వాహనదారులు నిబంధనలు పాటించాలని అదనపు ఎస్పీ మహేందర్ సూ చించారు. మండలంలోని చౌదర్పల్లిలో బుధవారం సర్పంచ్ సురేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీలను ప్రారంభించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంప్రదాయ పండగలను ప్రతీ ఒక్కరూ జరుపుకోవాలని కోరారు. మద్య సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. అదే విధంగా రేగోడ్లో కొనసాగుతున్న టోర్నమెంట్కు హాజరై క్రీడాకారులకు సూచనలు ఇచ్చా రు. కార్యక్రమంలో ఎస్ఐ పోచయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 19న కార్మిక, కర్షక ఐక్యత సభను నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. బుధవారం మెదక్లోని కేవల్ కిషన్ భవన్లో వారు విలేకరులతో మాట్లాడారు పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను వేగంగా అమలు చేస్తుందన్నారు. 2019లో తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తుందన్నారు. వీటి రద్దు కోసం ఈనెల 19న సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షిక ఐక్యత సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని కార్మికులు, కర్షకులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏ.మల్లేశం, కే.మల్లేశం, నర్స మ్మ, మహేందర్రెడ్డి, బస్వరాజు, గౌరి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
కొండెక్కిన కోడి
మెదక్కలెక్టరేట్: సంక్రాంతికి మాంసం ధరలు చుక్కలనంటుతున్నాయి. కొనక ముందే కుత కుత ఉడుకుతున్నాయి. పండుగ సందర్భంగా చాలా మంది ఇంట్లో చికెన్, మటన్ వండుకుంటారు. అతిథులకు కూడా రకరకాల నాన్వెజ్ వంటకాలను వడ్డిస్తారు. అయితే చికెన్ ధరలు ఇప్పటికే ట్రిపుల్ సెంచరీ దాటి పరుగులు పెడుతుండటం మాంసం ప్రియులను ఆందోళనకు గురిచేస్తుంది. పండుగ నాటికి డిమాండ్ పెరిగితే ధరలు రూ. 350 దాటే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. చికెన్ ధరలు ఆకాశాన్ని తాకడంతో సామా న్యులు, పేదలు చికెన్ కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. కాగా ప్రస్తుతం మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ నెల రోజులుగా రూ. 300 పలుకుతోంది. గతంలో స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ. 200 ఉండేది. కానీ ఇప్పుడు అదే చికెన్ ధర రూ. 300 నుంచి రూ. 320 వరకు ఉంది. మార్కెట్లో కోళ్ల లభ్యత ఆధారంగా ధరలను వ్యాపారులు నిర్ణయించనున్నారు. పండుగకు అందరూ మాంసం వంటలు ఘుమఘుమ లాడించడంతో ధరలు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. కేజీ మటన్ రూ. 800 నుంచి రూ. 100 వరకు పలుకుతోంది. నాటు కోళ్ల ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. మటన్ ధరలతో సమానంగా ఉన్నాయి. గతంలో నాటుకోడి రూ.400 నుంచి రూ. 500 లోపు పలికేది. పండుగ సీజన్ కావడంతో వాటి ధరలకు కూడా రెక్కలొచ్చాయి. కిలో రూ. 300 నుంచి రూ. 320 గతంలో ఎన్నడూ లేని విధంగా ధర నాటుకోళ్ల ధరలూ పెరిగాయి పండుగపూట మాంసం ప్రియుల జేబులకు చిల్లు -
పల్లె లోగిళ్లు.. భోగిభాగ్యాలు
●అంబరాన్నంటిన వేడుకలు ●ఎక్కడ చూసినా పండుగ సందడే ●నేడే రంగుల సంక్రాంతి.. సర్వం సిద్ధంమెదక్అర్బన్ : మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి వేడుకలు జిల్లాలో అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. బుధవారం భోగిని జిల్లావ్యాప్తంగా ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే మహిళలు వాకిట్లో రంగవల్లులు వేసి ఆకట్టుకున్నారు. ముగ్గు లో గొబ్బెమ్మలు పెట్టి మధ్యలో నవధాన్యాలు పోశారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులపై భోగిపండ్లు పోసి పెద్దలు ఆశీర్వదించారు. పాత వస్తువులతో భోగి మంటలు వేశారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకోగా, చిన్నారులు, పెద్దలు పతంగులు ఎగురవేస్తూ సందడి చేశారు. కాగా గురువారం మకర సంక్రాంతి, రేపు కనుమను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో లోగిళ్లన్నీ సందడిగా మారాయి. -
జాతీయ యోగాసన పోటీలకు ఎంపిక
శిరీషమనోజచేగుంట(తూప్రాన్): జాతీయ యోగాసన పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గణేశ్ రవికుమార్ తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్లో స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో సౌత్జోన్ యోగాసన చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన శైనీ శిరీష, చిక్కుల మనోజ రిథమిక్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వీరిద్దరు త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి యోగాసన పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ, మెదక్ ట్రైబల్ డిగ్రీ కళాశాల పీడీ రంగీలాతో పాటు యోగాసన అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
మౌలిక వసతులు కల్పించాలి
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్మున్సిపాలిటీ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 10వ వార్డులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డికి సూచించారు. తాగునీటి సౌకర్యం, ర్యాంపులు ఉండేలా చూసుకోవాలన్నారు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలి కౌడిపల్లి(నర్సాపూర్): ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని పీహె చ్సీ, సీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన సీహెచ్సీ భవనాన్ని పరిశీలించారు. మిగిలిపోయిన పనుల గురించి కాంట్రాక్టర్తో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చుచేస్తుందన్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించి మెరుగైన వైద్యం అందించాలని, అనుమతి లేనిదే సెలవులో వెళ్లవద్దని చెప్పారు. కార్యక్రమంలో సీహెచ్ఓ ఎలిజిబెత్రాణి, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీలకు ఊరట
మెదక్జోన్: సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు తీపి కబురు అందించింది. జిల్లాకు రూ. 6.70 కోట్లు విడుదల చేసింది. వీటిని అభివృద్ధికి కేటాయించాలని సూచించింది. అయితే గడిచిన రెండేళ్లకు సంబంధించి రావాల్సిన నిధులు కొండంత కాగా, వచ్చింది మాత్రం గోరంతేనని పలువురు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో 21 మండలాలు, 492 గ్రామాలు ఉండగా, 7.24 లక్షల మంది జనాభా ఉన్నారు. జనాభా ప్రాతిపదికన జిల్లాకు ప్రతీ నెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 6.70 కోట్లు రావాలి. ఆ నిధులను పారిశుద్ధ్య కార్మికుల వేతనాలతో పాటు పంచాయతీ అభివృద్ధికి వెచ్చిస్తుంటారు. కాగా 2024 జనవరి నుంచి పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవటంతో ఆ నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. గడిచిన కాలానికి సంబంధించి మొత్తం జిల్లాకు రూ. 160.80 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ. 6.70 కోట్లు మాత్రమే వచ్చినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ లెక్కన కేవలం 4.16 శాతం మాత్రమేనని పలువురు వాపోతున్నారు. కార్యదర్శులు వెచ్చించింది ఎక్కువే.. పాలకవర్గాల గడువు ముగియగానే జిల్లా అధికారులు పల్లెలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అయితే వారు ఏనాడు పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. అవసరాలకు అప్పులు చేసి రెండేళ్లుగా గ్రామాలను నెట్టుకొచ్చారు. దీంతో ఒక్కో పంచాయతీ కార్యదర్శి రూ. 1.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. మొత్తంగా కార్యదర్శులు తెచ్చిన అప్పులే రూ. 8 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. కాగా జిల్లా కు కేవలం రూ. 6.70 కోట్లు మాత్రమే రావటంతో పెదవి విరుస్తున్నారు. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం జిల్లాకు రూ. 6.70 కోట్లు కేటాయింపు రెండేళ్లుగా రావాల్సింది రూ. 160.80 కోట్లు -
నారీమణులే నిర్ణేతలు
● మున్సిపల్ ఎన్నికల్లో వీరే కీలకం ● గెలుపోటములపై తీవ్ర ప్రభావం ● మహిళా ఓటర్లపైనే పార్టీల దృష్టి మున్సిపాలిటీల్లో ఓటర్ల వివరాలు మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఓటర్లు మెదక్ 17,548 19,406 1 36,954 రామాయంపేట 6,291 6,804 - 13,095నర్సాపూర్ 8,219 8,656 1 16,876తూప్రాన్ 9,957 10,302 - 20,259 నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ నాయకులందరూ ఐక్యంగా పని చేసి చైర్మన్ పదవిని దక్కించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన పార్టీ నాయకులు హైదరాబాద్లో మంగళవారం హరీశ్రావును కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నర్సాపూర్లో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు చెప్పి ఓటు అడగాలన్నారు. బీఆర్ఎస్లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా సహించేదిలేదని హెచ్చరించారు. పార్టీ చేయించే సర్వేలో ప్రజల్లో పట్టున్న వారికే టికెట్లు ఇస్తామని, పోటీచేయాలనుకుని అవకాశం దక్కని నాయకులు నిరుత్సాహపడవద్దని సూచించారు. పార్టీ కోసం పని చేయాలని అటువంటివారికి భవిష్యత్తులో తగిన గుర్తింపునిస్తుందని స్పష్టం చేశారు. హరీశ్రావును కలిసిన వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నయిమోద్దీన్తోపాటు పలువురు నాయకులు ఉన్నారు. రామాయంపేట (మెదక్): జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మహిళల ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. దీంతో ఆయా పార్టీల నాయకులు మహిళా ఓటర్లపై దృష్టి సారించారు. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 87,185 ఓట్లకు గాను, పురుషులు 42,015 కాగా, మహిళలు 45,168, ఇతరులు ఇద్దరు ఉన్నారు. మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,153 మంది అధికంగా ఉన్నారు. కౌన్సిలర్లుగా పోటీ చేసేవారు ముందుగా మహిళా ఓటర్లనే ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఆశావహులు ఇప్పటి నుంచే మహిళా సంఘాల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మహిళల శ్రేయస్సుకు అఽధిక ప్రాధాన్యత ఇస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. మెదక్ మున్సిపాలిటీలో పురుషుల కంటే మహిళలు 18,48 మంది, తూప్రాన్లో 345 మంది, నర్సాపూర్లో 437 మంది, రామాయంపేటలో 513 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో మున్సిపాలిటీల్లో మహిళల ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు మెప్మా గ్రూపు సభ్యులపై నమ్మకం పెట్టుకున్నారు. ఇటీవల ఈ గ్రూపులకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయడంతో వారి మద్దతు తమకే ఉంటుందని అంటున్నారు. వేల సంఖ్యలో ఉన్న మహిళా గ్రూపుల సభ్యులు అధికార పార్టీని ఆదరిస్తారని వారు భావిస్తున్నారు. మెదక్లో 7,975 మంది, తూప్రాన్లో 4,199, నర్సాపూర్లో 2,967, రామాయంపేటలో 3,339 మంది మెప్మా గ్రూపులో మహిళా సభ్యులున్నారు. హరీశ్రావును కలిసిన ఎమ్మెల్యే సునీతారెడ్డి, పార్టీ నాయకులు -
జిల్లాల పునర్విభజనపై రేకెత్తిస్తున్న ఆశలు
‘నాగిరెడ్డిపేట మండలాన్ని 20 కి.మీ దూరంలో ఉన్న మెదక్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ 2016 అక్టోబర్లో హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకొని చనిపోయాడు మాల్తుమ్మెదకు చెందిన ఉడావాటి రాజు. అయినా ఇంత వరకు అతని కోరిక నెరవేరలేదు. నెలల తరబడి మండలవాసులు చేసిన పోరాటం ఫలించలేదు. చివరకు కామారెడ్డి జిల్లాలోనే కలసి పోయింది.’ మెదక్ అర్బన్ జిల్లాల పునర్విభజనలో రాజకీయ నాయకులు ప్రజాభిప్రాయాన్ని గాలికొదిలాశారు. అశాసీ్త్రయ విభజనతో అంతులేని ఆవేదన మిగిల్చారని విమర్శలున్నాయి. పలు గ్రామాల ప్రజలు ఒక జిల్లాలో ఉంటూ.. మరో నియోజక వర్గం ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. దీంతో ఒకే రాజకీయ పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చ కెక్కుతున్నాయి. ఇద్దరు నాయకుల మధ్య స్థానిక క్యాడర్ సతమతమవుతోంది. ఈ జిల్లా మాకు అనుకూలంగా లేదు. అనుకూలమైన జిల్లాలో కలపాలంటూ పలు మండలాల ప్రజలు యేళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లా అశాసీ్త్రయ విభజన.. జనాల్లో అంతులేని ఆవేదన మిగిల్చింది. తిరిగి జిల్లాల పునర్విభజన అంశానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో పునర్విభజనపై మళ్లీ చర్చ మొదలైంది. అశాసీ్త్రయ విభజన జిల్లా పేరును తనలో ఇముడ్చుకున్న మెదక్ 2016లో సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ పేర్లతో మూడు ప్రత్యేక జిల్లాలుగా అవతరించాయి. ఉమ్మడి జిల్లా ప్రజల దశాబ్ధాల డిమాండ్ నెరవేరినప్పటికీ, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలతో పోలిస్తే.. మెదక్ అతి చిన్న జిల్లాగా అవతరించింది. ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ డివిజన్గా ఉన్న మెదక్లో 18 మండలాలు ఉండగా.. కొత్త జిల్లా కేవలం 15 మండలాలతో ఏర్పడింది. అనంతరం మరో 6 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. సిద్ధిపేటలో మూడు రెవెన్యూ డివిజన్లు, 508 పంచాయతీలు, సంగారెడ్డిలో నాలుగు రెవెన్యూ డివిజన్లు 633 పంచాయతీలు, మెదక్లో నాలుగు రెవెన్యూ డివిజన్లు 492 పంచాయతీలు ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాబా 5,65,741. అయితే అభివృద్ధి చెందిన ప్రదేశాలు, అననుకూల ప్రదేశాలు పొరుగు జిల్లాల్లో కలిశాయని, అప్పట్లో ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఒకటి.. నియోజకవర్గం మరొకటి.. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్ మండలాలు మెదక్ జిల్లాలో ఉండగా, సంగారెడ్డి జిల్లాలోని అందోల్ అసెంబ్లీ నియోజక వర్గ ఓటర్లుగా తమ ఎమ్మెల్యేను ఎన్నుకుంటున్నారు. అలాగే చేగుంట, నార్సింగ్ మెదక్ జిల్లాలో, దుబ్బాక నియోజక వర్గంలో, తూప్రాన్, మనోహరాబాద్ మెదక్ జిల్లాలో, గజ్వేల్ నియోజక వర్గంలో, శంకరంపేట(ఏ) మెదక్ జిల్లాలో, నారాయణఖేడ్ నియోజక వర్గంలో, హత్నూర సంగారెడ్డి జిల్లాలో నర్సాపూర్ నియోజక వర్గంలో కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలో రెండు, సిద్ధిపేట జిల్లాలో నాలుగు, సంగారెడ్డి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఒకే రాజకీయ పార్టీ అఽధ్యక్షుల మధ్య గ్రూపు తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన డీసీసీ ఎన్నికలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నామినేటెడ్ విషయంలో ఒకే పార్టీకి చెందిన అందోల్, గజ్వేల్, మెదక్ నియోజక వర్గాల కాంగ్రెస్ బాస్ల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలు. ఆధిపత్య పోరుకు తెర లేపాయి. అలాగే మెదక్ జిల్లాను రాజన్న సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్కు మార్చాలని జిల్లా ఉద్యోగులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ● జిల్లా ఒకచోట.. మండలం, నియోజకవర్గం మరోచోట.. అనుకూల జిల్లాలో కలపాలంటున్న మండలవాసులు రాజకీయ పార్టీల్లోనూ గ్రూపు తగాదాలు చార్మినార్ జోన్ కావాలంటున్న నిరుద్యోగులు, ఉద్యోగులు పునర్విభజనతో మెతుకు సీమ మెరిసేనా.. ! ముఖ్యమంత్రి ప్రకటనతో జిల్లాల పునర్విభజనపై మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్నాయి. అశాసీ్త్రయ విభజనతో ఉమ్మడి మెదక్ జిల్లావాసులు అనేక అవస్థలు పడుతున్నారు. మండలం ఒకజిల్లాలో ఉంటే.., నియోజకవర్గం మరో జిల్లాలో.. రెవెన్యూ డివిజన్ ఇంకో చోట ఉంటుంది. ఇలా మూడు ముక్కలాటగా మారిన విభజనతో జిల్లావాసులకు అంతులేని ఆవేదన మిగిల్చింది. పెద్ద శంకరంపేట మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలి.భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మాకు మెదక్ కన్నా, సంగారెడ్డి అనుకూలం. అల్లాదుర్గం, రేగోడ్ మండలాల ప్రజలకు కూడా సంగారెడ్డి దగ్గర. మేము మెదక్ వెళ్లాలంటే, ఇతర జిల్లాకు వెళ్లినట్లు ఉంటుంది. మాకున్న కుటుంబ సంబంధాలు, ఉద్యోగ స్థలాలు సంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. –జోడు రవీందర్. శంకరంపేట అసెంబ్లీ నియోజక వర్గాల తర్వాతే జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలి. అప్పుడే ప్రస్తుతమున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జిల్లాలు, మండలాలను తగ్గింపు, పెంచే ఆలోచన తగదు. ఉన్న వాటిలో సమస్యలను గుర్తంచి సర్దుబాటు చేయాలి. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు మెదక్ను చార్మినార్ జోన్లో కలిపేందుకు చర్యలు తీసుకోవాలి. –బి.కొండల్ రెడ్డి, మాజీ టీపిటిఎఫ్, రాష్ట్ర అధ్యక్షులు -
రూ2.50 కోట్లు స్వాహా
● మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్ ఆరోపణ ● నకిలీ బిల్లులతో నిధులు కాజేశారని ధ్వజం రామాయంపేట (మెదక్): స్థానిక మున్సిపాలిటీ పరిధిలో భారీస్థాయిలో రూ.2.50 కోట్ల మేర అవినీతి జరిగిందని మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బుట్టల కొనుగోలు, బ్లీచింగ్, మొక్కల పెంపకం, చెత్త సేకరణ ట్రాక్టర్లు, ఆటోల్లో డీజిల్ వినియోగం వంటి వాటిలో అవినీతి చోటు చేసుకుందని తెలిపారు. తన హయాంలో కొనుగోలు చేసిన బుట్టలు కార్యాలయంలో నిలువ ఉండగా ఇటీవల రూ.32 లక్షలు ఖర్చుతో 12,600 చెత్త సేకరణ బుట్టలు, రూ.15లక్షలతో బ్లీచింగ్ కొనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి నిధులు స్వాహా చేశారన్నారు. మున్సిపల్ కమిషనర్ దేవేందర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సహకారంతో నిధులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, అధికారులు వీరిపై చర్యలు తీసుకోకపోతే రామాయంపేట పట్టణం బంద్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సహకార సంఘం మాజీ చైర్మన్ బాదెచంద్రం, సీనియర్ నాయకులు అహ్మద్, హస్నొద్దీన్, పార్టీ యూత్ విభాగం మండలశాఖ అధ్యక్షుడు ఉమ, నాయకులు నాగార్జున, చింతల రాములు, రమేశ్, బాసం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చార్మినార్ జోన్లో కలపండి
మెదక్ కలెక్టరేట్: మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్లో కలపాలని కలెక్టరేట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ రాహుల్రాజ్కు వినతి పత్రం అందజేశారు. సిరిసిల్ల జోన్లో కలపడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా మెదక్ జిల్లాను వెంటనే చార్మినార్ జోన్లో కలపాలని వారు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఆయాశాఖల అధికారులు సందీప్, నవీన్కుమార్, నవీన్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి
రామాయంపేట(మెదక్): రామాయంపేటలో రూ. రెండు వందల కోట్ల నిధులతో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన సముదాయం నిర్మాణంలో నాణ్యత పాటించాలని అధికారులను కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. మంగళవారం స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు సంబంధించి స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. త్వరితగతిన నిర్మాణం పనులు ప్రారంభించాలన్నారు. మారుమూల గ్రామాల విద్యార్థుల ఉన్నత స్థానానికి ఎదగడానికి ఈ స్కూలు దోహదపడుతుందని చెప్పారు. స్కూలు నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్థలసేకరణ, పనుల పురోగతికి సంబంధించి వివరాలు ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక తహసీల్దార్ రజని, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అత్యుత్తమ సేవలందించాలి మెదక్ కలెక్టరేట్: అధికారులు అత్యుత్తమ సేవలతో జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్కు చెందిన టేబుల్ క్యాలెండర్, వాల్ క్యాలెండర్లను అదనపు కలెక్టర్ నగేష్, ఏఎస్పీ మహేందర్తో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె సీమలు, పశుసంవద, వ్యవసాయ, ఉద్యాన పంటలతో సుభిక్షంగా కళకళలాడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు విఠల్, కార్యదర్శి నాగభూషణం, శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్, ఎల్లయ్య, మహేష్, సౌజన్య, మధులత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సంరక్షణ కిట్ల పంపిణీ హర్షణీయం అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు పురుగు మందులు పిచికారీ చేసే క్రమంలో వారి ఆరోగ్య పరిరక్షణకై సంరక్షణ కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. రైతులకు ఇలాంటి పరికరాలు అందజేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జిల్లా అధికారి దేవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
నిర్లక్ష్యం.. బతుకులు ఛిద్రం
● అతివేగంతోనే ప్రమాదాలు: ఎస్పీ శ్రీనివాసరావుకొల్చారం(నర్సాపూర్): అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎస్పీ హాజరై మాట్లాడారు. చిన్న పార్టీ నిర్లక్ష్యం ప్రాణాలనే హరిస్తుందన్నారు. అలాగే.. కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 13 నుంచి 24 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్టు, హెల్మెట్ ధరించాలన్నారు. అనంతరం గ్రామంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. అనతరం రోడ్డు భద్రత పోస్టర్ను ఆవిష్కరించి, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు ఎస్పీ క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్టీసీ డీపో మేనేజర్ సురేఖ, మెదక్ రూరల్ సీఐ జార్జ్, ఏఎంవీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ హైమద్ మోహినొద్దీన్, సర్పంచ్ దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తితో జీవితాన్ని గెలవాలి: అడిషనల్ ఎస్పీ మహేందర్ పాపన్నపేట(మెదక్): ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో జీవితాన్ని గెలవాలని మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు. మండల పరిధి మిన్పూర్లో మంగళవారం జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. కబడ్డీ గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థి జీవితంలో ఆటలు భాగస్వామ్యం కావాలని సూచించారు. మిన్పూర్ లాంటి చిన్న గ్రామం నుంచి పలువురు యువకులు, విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సృజన, యేసురత్నం, ఉపసర్పంచ్ కిరణ్, ప్రభాకర్రెడ్డి, ఐజేయూ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
బాల్యవివాహాలకు చెక్
ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాలు, తండాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఐసీడీఎస్ రాయిలాపూర్ సెక్టార్ సూపర్వైజర్ లక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని పాంపల్లిలో ఏఎల్ఎంఎస్ (అంగన్వాడీ లేవల్ మానిటరింగ్ అండ్ సపోట్) కమిటీ, లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికై న సర్పంచ్ యశోదను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాణి, లబ్ధిదారులు పాల్గొన్నారు. తేల్చి చెప్పినప మిర్జాపల్లి వాసులు చిన్నశంకరంపేట(మెదక్): రైల్వే అండర్పాస్ బ్రిడ్జి సమస్యను పరిష్కరిస్తేనే డబుల్లైన్కు అవసరమైన భూములు ఇస్తామని చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు రైల్వే అధికారులకు తేల్చి చెప్పారు. మంగళవారం మండలంలోని మిర్జాపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గ్రామానికి వెళ్లే రైల్వే బ్రిడ్జిని రైల్వే ఇంజనీర్ రాకేశ్, భూసేకరణ అధికారి రమేశ్ తహసీల్దార్ మాలతి, ఆర్ఐ రాజు, సర్వేయర్ దుర్గాభవాని పరిశీలించారు. అండర్పాస్ రైల్వే బ్రిడ్జిలోకి చెరువు బ్యాక్ వాటర్ చేరి గ్రామానికి దారి లేకుండా పోతుందని గ్రామస్తులు అధికారుల వద్ద వాపోయారు. బ్రిడ్జిని మరో చోటుకు మార్చడమా లేదా తమకు ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు దారి విషయంలో స్పష్టత ఇచ్చిన తరువాతనే తమ భూములు సర్వే చేయాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రమణ, మాజీ ఉపసర్పంచ్ మనోజ్, గ్రామ నాయకులు గంగాదర్గౌడ్, యాదగిరి ఉన్నారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాశ్చంద్రబోస్హవేళిఘణాపూర్(మెదక్): వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని మెదక్ సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాశ్చంద్రబోస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ముత్తాయికోటలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ శ్వేత, సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గుండారం కిరణ్గౌడ్ పాల్గొన్నారు. తూప్రాన్లో ‘అరైవ్ అలైవ్’పై అవగాహన తూప్రాన్: రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రంగకృష్ణ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్బెల్ట్ వినియోగం, మద్యం తాగి వాహనం నడపకూడదని, అధిక వేగం నివారించాల్సిన అవసరం వంటి ముఖ్య అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, కుటుంబాలపై పడే దుష్పరిణామాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు జ్యోతి, యాదగిరి, సిబ్బంది పాల్గొన్నారు. -
పుర ఓటర్లు 87,375
రామాయంపేట(మెదక్)/మెదక్మున్సిపాలిటీ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల తుది జా బితా సోమవారం విడుదలైంది. ఈమేరకు సాయంత్రం ఆయా మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు కొత్త ఓటర్ జాబితాను విడుదల చేశారు. జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 75 వార్డుల్లో 87,375 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈనెల 1న విడుదల చేసిన ముసాయిదా జాబితాల్లో వందల సంఖ్యలో మృతుల పేర్లతో పాటు ఇతర గ్రామాలకు చెందిన ఓటర్ల వివరాలు చోటు చేసుకున్నా యి. దీంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు ఈనెల 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అదే రోజు పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేశారు. మంగళవారం పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. 16న ఫొటోలతో కూడిన లిస్ట్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అర్హత ఉన్న కొత్త ఓటర్లను చేర్చుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. పట్టణాల్లో యువ ఓటర్లను ఆశావహులు నమోదు చేయించినా, ఓటు హక్కు లభించలేదు. రిజర్వేషన్ల మార్పు తఽథ్యం గత ప్రభుత్వం 2019లో నూతన పురపాలిక చట్టం రూపొందించి రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ కొనసాగే విధంగా చట్టం చేసింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధనలు తొలగించేలా సవరణ బిల్లును ఆమోదించింది. దీంతో రెండు పర్యాయాల రిజర్వేషన్లు రద్దయినట్లే. ముందుగా ఎస్సీ, ఎస్టీకి రిజర్వ్ చేసిన తర్వాత 50 శాతానికి మించకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. మహిళలకు ఆయా సామాజిక వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లలో విధిగా 50 శాతం కేటాయించనున్నారు. మహిళా ఓటర్లే కీలకం ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు. కౌన్సిలర్గా పోటీపడే అభ్యర్థులు ఇక మహిళలను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో గత అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే కీలకమయ్యారు. ఇక మున్సిపోల్స్ వంతు వచ్చింది. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల జయపజయాలను వారే నిర్ణయించనున్నారు. వారిని మెప్పించగలిగితే గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని నాయకులు భావిస్తున్నారు. మెదక్ పట్టణంలో మొత్తం 32 వా ర్డులు ఉండగా, మొత్తం ఓటర్లు 36,955 ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహిళా ఓటర్లు 19,406, పురుషులు 17,548 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. -
గ్రూపుల లొల్లి
కాంగ్రెస్లో గందరగోళం ● అయోమయంలో నాయకులు ● బల నిరూపణలకు విందులు, వినోదాలు ● తూప్రాన్ మున్సిపాలిటీలో రాజకీయాలు రసవత్తరం తూప్రాన్: మున్సి‘పోల్స్’ అధికార పార్టీ నాయకుల్లో ఆశలు రేకెత్తిస్తుండగా, గ్రూపుల లొల్లి గందరగోళంలో పడేసింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు నర్సారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు వర్గాలుగా చిలిపోయారు. ఎటు మొగ్గు చూపుతే ఏం జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికే టికెట్ల కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదేస్థాయిలో బీఫాం ఎవరు ఇస్తారనేది తెలియక ఆయోమయంలో పడ్డారు. ఎవరికి వారే.. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో మున్సిపాలిటీని కై వసం చేసుకునేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం అధిష్టానం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే స్థానిక కాంగ్రెస్ నాయకులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. అర్హులకు బీఫాంలు ఇవ్వాలని అంతర్గతంగా చర్చించారు. కాగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సైతం గజ్వేల్ నియోజకవర్గంలో తన ఉనికిని చాటుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పుట్టినరోజు వేడుకలు, వివాహాలు, జాతరలకు తన అనుచరగణంతో హాజరవుతున్నారు. ఇక్కడి నాయకులు కొందరు ఆయనతో జతకడుతున్నారు. తనకున్న పలుకుబడితో బీఫాం ఇప్పిస్తారని భావిస్తున్నారు. అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అయోమయంలో పడ్డారు. చైర్మన్ పీఠంపై గురి మున్సిపల్ చైర్మన్ పీఠంపై కన్నేసిన కాంగ్రెస్ నాయకులు కొందరు ఇప్పటికే బల నిరూపణకు తెరలేపారు. విందులు వినోదాలతో ఆకట్టుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఫాం ఇస్తే ఎన్ని డబ్బులు అయినా ఖర్చు చేసేందుకు వెనకాడమని బాహాటంగా చెబుతున్నారు. చైర్మన్ రేసులో ఉన్నామని ప్రచారం చేసుకుంటున్నారు. కాగా రిజర్వేషన్లు తేలకపోవడంతో డైలామాలో పడ్డారు. -
బల్దియాలపై ఎగిరేది గులాబీ జెండానే
● కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ● ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో మాజీ మంత్రి హరీశ్రావుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి హరీశ్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్లో ము న్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, మాణిక్యరావు, సునీతారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, 17 మున్సిపాలిటీల ఎన్నికల ఇన్చార్జిలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈసందర్భంగా హరీశ్రావు మా ట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, పల్లెల నుంచి పట్టణాల వరకు పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతితో దేశానికి ఆదర్శంగా నిలిచిన మన మున్సిపాలిటీలు, నేడు నిర్వహణ లేక కళ తప్పాయని వాపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణాల అభివృద్ధి కోసం ప్రతినెలా క్రమం తప్పకుండా నిధులు విడుదల అయ్యాయని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వక, ఉన్నవాటిని నిర్వహించలేక పట్టణాలను గాలి కొదిలేసిందని విమర్శించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించామని.. నేడు కనీసం ఆ తాగునీటి సరఫరాను నిర్వహించడం కూడా చేతకావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని హరీశ్రావు చెప్పారు. -
పేటను సంగారెడ్డి జిల్లాలో కలపండి
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని కోరుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్కు చెందిన నాయకులు కలెక్టర్ రాహుల్రాజ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. సోమవారం మండలంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వారు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 86 వినతులు వచ్చి నట్లు తెలిపారు. అనంతరం వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యు వత ఆయన చూపిన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ షాకీర్అలీ, ఎంఈఓ వెంకటేశం, ఏఓ కృష్ణ, ఏఈ రమేశ్ తదితరులు పాల్లొన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి మెదక్ కలెక్టరేట్: త్వరలో నిర్వహించబోయే మున్సిపల్ ఎన్నికలకు మున్సిపల్ అధికారులంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా, మున్సిపల్ అధికారులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని 4 మున్సిపాలిటీల కమిషనర్లతో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. -
సకాలంలో వైద్యం అందించాలి
రామాయంపేట(మెదక్): మండలంలోని ప్ర గతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్ఓ శ్రీరాం సందర్శించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సకాలంలో వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించా రు. అనంతరం ఆస్పత్రి ఆవరణతో పాటు రికార్డులను పరిశీలించారు. డీఎంహెచ్ఓ వెంట ఏఓ హరిప్రసాద్, పీఓ నవ్య, డీడీఓ రేఖ, ఇతర అధికారులు ఉన్నారు. నాలుగు లేబర్కోడ్లు రద్దు చేయాలి: సీఐటీయూ మెదక్ కలెక్టరేట్: కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలనే డి మాండ్తో ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు తెలిపారు. సోమవారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో సీఐటీయూ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భ ంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభు త్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలు రద్దు చేసిందని మండిపడ్డారు. లేబర్కోడ్లు అమలు కాకుండా రాష్ట్ర ప్రభు త్వం తగిన చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు బాలమణి, మల్లేశం, జి ల్లా కోశా ధికారి నర్సమ్మ, జిల్లా ఉపాధ్య క్షుడు మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: నగేశ్ మెదక్ కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై 44 వినతులు అందజే శారు. ఇందులో భూభారతి 32, పెన్షన్ల కోసం 2, ఇందిరమ్మ ఇళ్లు 2, ఇతర సమస్యలపై 9 వచ్చాయి. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ ఎల్ల య్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీఆర్ఓ భు జంగరావుతో పాటు ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్లో స్వామి వివేకానంద వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించారు. వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలి చిన్నశంకరంపేట(మెదక్): స్వామి వివేకానంద స్ఫూర్తితో యువకులు ముందుకు సాగాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని చందంపేటలో సర్పంచ్ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామ గ్రంథాలయం, నూతన సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, ప్రజల కోసం ప్రతి ఆరు నెలలకోసారి స్థానిక పరిశ్రమ సహకారంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. గ్రంథాలయంలో తన వంతుగా రూ. 2 వేల పుస్తకాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఐ నారాయణగౌడ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు గోపాల్రెడ్డి, ఉపసర్పంచ్ నర్సింహులు, మాజీ సర్పంచ్ రమేశ్, బలరామ్, శ్రీనివాస్, దత్తుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. -
క్యూఆర్టీ సిబ్బంది పనితీరు భేష్
మెదక్ మున్సిపాలిటీ: క్యూఆర్టీ సిబ్బంది పనితీరు భేష్గా ఉందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో క్యూఆర్టీ బృందాన్ని అభినందించి క్యాష్ రివార్డు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాపన్నపేట మండలం ఏడుపాయల్లో ఆదివారం కామారెడ్డి జిల్లాకు చెందిన బసవయ్య అనే వ్యక్తి మంజీరాలో దూకి ఆత్మహత్యకు యత్నించగా, అక్కడే విధులు నిర్వర్తిస్తున్న క్యూఆర్టీ–1 సిబ్బంది వెంటనే స్పందించారని తెలిపారు. ప్రమాదకరమైన నది ప్రవాహాన్ని లెక్కచేయకుండా చాకచక్యంగా వ్యవహరించి ఆ వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ప్రాణాలను కాపాడారని కొనియాడారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆదనపు ఎస్పీ మహేందర్, ఆర్ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు పరిహారం ఇవ్వండి
మెదక్ కలెక్టరేట్: యాసంగి పంటలకు సింగూరు నీరు విడుదల చేయాలని, లేనిపక్షంలో ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను ఆగమాగం చేస్తుందని మండిపడ్డారు. రెండేళ్ల క్రితం సింగూరు మరమ్మతులు చేసి ఉంటే ఇప్పుడు రైతులకు ఈ గోస తప్పేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి సింగూరు, కృష్ణ జలాలను ఏపీకి అప్పగించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఘనపూర్ ఆనకట్ట కింద 40 వేల ఎకరాలకు నీళ్లు అందక రైతు కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మాట్లాడకపోవటం విచారకరమన్నారు. రైతుల గోస సీఎంకు తెలిసేలా పోస్ట్కార్డు ఉద్యమం చేపడతామన్నారు. కఅనంతరం ర్యాలీగా వెళ్లి అదనపు కలెక్టర్ నగేశ్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే శశిధర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జెడ్పీ మాజీ వైస్చైర్మన్ లావణ్యరెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. -
షాపును బట్టి వసూలు
మెదక్ అర్బన్ వందల కొద్ది దరఖాస్తులు.. ఫీజు లకు లక్షలాది రూపాయలు.. ఒకటో, రెండో వైన్షాపులు దక్కించుకున్న యజమానులకు ‘గుడ్ విల్ దందా.. గోటి చుట్టుపై రోకటి పోటు’లా మారింది. షాపులను బట్టి సాగుతున్న కాసుల వేటలో జిల్లా నుంచి రాష్ట్రస్థాయి బాస్ల వరకు వాటాలున్నాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరో వైపు నెల నెలా స్టేషన్ మామూళ్లు.. ఆరునెలల కోసారి స్పెషల్ పార్టీ వసూళ్లు, పండగలు.. పబ్బాలకు లిక్కర్ బాటిళ్ల పంపకాలు.. వెరసి రెండేళ్లలో రూ. 10 లక్షలు మామూళ్ల పాలవుతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 49 వైన్ షాపులు.. 5 బార్లు జిల్లాలో 49 వైన్షాపులు.. 5 బార్లు ఉన్నాయి. ఈఏడాది కొత్త ఎకై ్సజ్ సంవత్సరం డిసెంబర్ 1 నుంచి ప్రారంభం అయ్యింది. వైన్షాపుల మీద ఉన్న మోజులో కొంతమంది కలిసి సిండికేట్లుగా ఏర్పడ్డారు. సుమారు 50 నుంచి 160 వరకు దరఖాస్తులు చేశారు. రూ. 3 లక్షల చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించి, చివరకు ఒక్కటో.. రెండో షాపులు దక్కించుకున్నారు. అయితే లైసెన్స్ల మంజూరు ప్రక్రియలో నిబంధనలను సాకుగా తీసుకొని ఎక్సైజ్ అధికారులు ‘గుడ్ విల్’ దందాకు తెరలేపారన్న ఆరోపణలున్నాయి. ఇది చాలా ఏళ్లుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. గుడ్ విల్ పేరిట షాపును బట్టి రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ డబ్బులో జిల్లా అధికారుల నుంచి రాష్ట్రస్థాయి బాస్ల వరకు వాటాలున్నాయన్న ప్రచారం ఉంది. ఈ లెక్కన చూస్తే జిల్లా నుంచి సుమారు 1.5 కోట్లు వసూలు అవుతున్నట్లు సమాచారం. ఇవిగాక షాపును బట్టి, నెల మామూలు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు ఠంచన్గా వసూలు చేస్తుంటారని తెలిసింది. ఇక డీటీఎఫ్, ఎస్టీఎఫ్ పార్టీలకు 6 నెలలకోసారి ఒక్కోషాపు నుంచి రూ. 40 నుంచి రూ. 50 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఏసీ, డీసీ స్థాయిలో ఆరు నెలలకోసారి జాయింట్గా రూ. 40 ను ంచి రూ. 50 వేలు ఇస్తుంటారు. మామూళ్లు వసూలు చేయడానికి కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి వరకు రంగంలోకి దిగుతుంటారు. ఇక దసరాకు ఒక్కో వైన్షాపు నుంచి 3 నుంచి 4 కాటన్ల మద్యం ఫుల్బాటిళ్లు తీసుకెళ్తుంటారు. వైన్షాపు తనిఖీలకు వస్తే డీజిల్ డబ్బులు అదనం. ఇవన్నీ కలిపితే రెండేళ్లలో ఒక్కో షాపు నుంచి సుమారు రూ. 10 లక్షల వరకు మామూళ్ల రూపంలో వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇన్చార్జి ఈఎస్ శ్రీనివాస్రెడ్డిని వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.ఎకై ్సజ్వారి పాట రూ. 3 లక్షలు -
పక్కాగా.. వన్యప్రాణుల లెక్క
19 నుంచి జంతు గణనకు సన్నద్ధం జిల్లాలోని 98 బీట్లలో సర్వేకు సన్నాహాలు అటవీశాఖ సిబ్బందితో పాటు పాల్గొననున్న విద్యార్థులు ● జంతువుల లెక్క తేల్చేందుకు అటవీశాఖసిద్ధమైంది. ఈనెల 19 నుంచి 25 వరకు జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతాల్లో గణన కోసం సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం జిల్లాలోని 98 బీట్లలో బీట్కు ఇద్దరు చొప్పున 196మంది అవసరం కాగా, ప్రస్తుతం 74 మంది ఉన్నారు. దీంతో ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులను గణనలో భాగస్వామ్యులనుచేయనున్నారు. – రామాయంపేట(మెదక్) జిల్లా పరిధిలో 57,627 హెక్టార్లలో అటవీ భూమి విస్తరించి ఉంది. రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన ఈ అటవీ ప్రాంతంలో వేల సంఖ్యలో వన్యప్రాణులు ఉన్నాయి. చిరుతలు, ఎలుగుబంటి, తోడేళ్లు, జింకలు, నక్కలు, రేసు కుక్కలు, కొండ గొర్రెలు, దుప్పులు, నీల్గాయిలు, చుక్కల దుప్పులు, సాంబారు, కృష్ణ జింకలు, అడవి పందులు మనుగడ సాగిస్తున్నాయి. కాగా వీటి లెక్కింపులో పాల్గొననున్న ఆశాఖ సిబ్బందితో పాటు విద్యార్థులకు మొదటి విడత శిక్షణ ఇప్పటికే పూర్తయింది. సోమవారం నుంచి నర్సాపూర్లో రెండో విడత శిక్షణ ప్రారంభం కానుంది. 98 బీట్లు.. 196 మంది సిబ్బంది జిల్లాలోని 98 బీట్లలో జంతుగణన ప్రారంభం కానుంది. ఇందుకోసం ఒక్కో బీట్లో ఇద్దరు చొప్పున 196 మంది సిబ్బంది అవసరం. ప్రస్తుతం ఈశాఖలో కేవలం 44 మంది బీట్ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. వీరితో పాటు కామారెడ్డి అగ్రికల్చర్ బీఎస్సీ, మెదక్ జిల్లాలోని ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులను లెక్కింపు కోసం వినియోగించుకుంటున్నారు. సాధారణంగా అటవీప్రాంతం, అందులో జంతువుల గురించి ఆశాఖ సిబ్బందికే పూర్తి అవగాహన ఉంటుంది. ప్రతి టీంలో అటవీశాఖ సిబ్బంది ఒకరితో పాటు ప్రైవేట్ వ్యక్తిని నియమిస్తున్నారు. రోజూ నాలుగు కిలోమీటర్లు.. ఎంపిక చేసిన టీంలలో ఇద్దరు చొప్పున సభ్యులు ప్రతి రోజూ నాలుగు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో పర్యటించి జంతు గణన చేపడతారు. ఇందుకు గాను అడవిలో మార్కింగ్, డైరెక్షన్స్, మ్యాపులను అధికారులు ప్రకటించారు. గణన నిర్వహించే బయటి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. కాగా మొదటి విడతగా 19 నుంచి మూడు రోజుల పాటు మాంసాహార జంతువుల గణన కొనసాగనుంది. ఇందులో కేవలం జంతువుల వివరాలు, పాదముద్రలు సేకరిస్తారు. 23 నుంచి మూడు రోజుల శాఖాహార జంతువుల గణన కొనసాగుతుంది. ఈమేరకు గుర్తించిన వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు.పర్వతాపూర్ అటవీ ప్రాంతంజిల్లాలో ఇలా.. అటవీ విస్తీర్ణం 57,627 హెక్టార్లు రేంజ్లు 6 డిప్యూటీ రేంజ్లు 8సెక్షన్లు 21 బీట్లు 126 పకడ్బందీగా నిర్వహిస్తాం ఈనెల 19 నుంచి జిల్లాలోని 98 బీట్లలో పకడ్బందీగా జంతు గణన చేస్తాం. ఇందుకు గాను తమ సిబ్బందితో పాటు వలంటీర్ల ను నియమించాం. మొదటి మూడు రోజులు మాంసాహార, తర్వాత మూడు రోజులు శాఖాహార జంతువుల గణన కొనసాగుతుంది. ఒక్కో టీంలో ఇద్దరు చొప్పున ప్రక్రియలో పాల్గొంటారు. – జోజి, జిల్లా అటవీ అధికారి -
రిజర్వేషన్ కలిసొచ్చేనా..?
మెదక్జోన్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. సోమవారం వార్డుల వా రీగా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ఏ క్షణమైన షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికలపై దృష్టిసారించాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇప్పటికే కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచి బల్దియాలపై జెండా ఎగరవేయాలనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు. కాగా రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయా..? లేదా..? ఒకవేళ ఆశించిన స్థానంలో రిజర్వేషన్ మహిళలకు వస్తే ఆశావహులు వారి భార్యలు, తల్లులను బరిలో దింపాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన సీనియర్ నేతలు ఏకంగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవిపై కన్నేశారు. అంతేకాకుండా పోటీలో నిలిచే తమ పార్టీ కౌన్సిలర్లకు ఎన్నికల ఖర్చు నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు ఇచ్చేందుకు సైతం వెనకాడటం లేదు. గెలుపొందిన తర్వాత తనకు మద్దతు ఇవ్వాలని మచ్చిక చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆశించిన వార్డులో రిజర్వేషన్ కలిసి రాకపోతే మరోవార్డు నుంచి అయినా బీఫాం ఇవ్వాలని ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది. ఓటరు జాబితానే ప్రామాణికం! ఈనెల 16న తుది ఫొటో గుర్తింపు ఓటరు జా బితా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా 2020 ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభు త్వం 10 ఏళ్ల పాటు ఇవే రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. కానీ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వా టిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం విధితమే. అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ రిజర్వేషన్ల మార్పు ఉంటుందని అందరూ భావిస్తున్నారు.ఏ క్షణమైనా నోటిఫికేషన్మెదక్ మున్సిపాలిటీ: ఏ క్షణమైనా మున్సిపల్ ఎ న్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. ఆదివారం మెదక్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితాను పరిశీలించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ.. ఎన్నికల నోటిఫికేషన్ ఏ సమయంలోనైనా విడుదల కావొచ్చని, విధుల నిర్వహణకు అధికారులు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్యలకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. తుది ఓటరు జాబితా తయారీలో ఎన్నికల నిబంధనలు పాటించినట్లు వివరించారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి భూపతి, మేనేజర్ భవాని, ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.పేరున్న నేతలకు గాలం మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే చైర్మన్గా అవకాశం ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. అలాగే మరికొంత మంది పేరున్న నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో అధికార కాంగ్రెస్ నేతలు నిమగ్నమయ్యారు. పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు అవకాశం ఇవ్వాలంటూ ముఖ్య నేతలకు విన్నపాలు నేడు ఓటర్ల తుది జాబితా విడుదల -
పోరాట యోధుడు వడ్డే ఓబన్న
మెదక్ కలెక్టరేట్: పీడిత వర్గాల పోరాట యోధుడు వడ్డే ఓబన్న అని కలెక్టర్ రాహుల్రాజ్ కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్లో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పి ంచి మాట్లాడారు. తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం వడ్డెర సంఘం నాయకులు ఓబన్న విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారి వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గ సాయిలు, జిల్లా గౌరవ అధ్యక్షుడు పెంటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, ఉపాధ్యక్షులు ఎల్లయ్య, సంపంగి, శ్రీను, భిక్షపతి, నర్సింలు, మధు, ఎల్లం, శ్రీశైలం, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక
చేగుంట(తూప్రాన్): జాతీయస్థాయి రగ్బీ పోటీలకు జిల్లాకు చెందిన 11 మంది క్రీడాకారులు ఎంపికై నట్లు కోచ్ కరణం గణేశ్రవికుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లిలో అండర్ 15 రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన 11 మంది క్రీడాకారులు ప్రతిభ చాటి జాతీయస్థాయికి ఎంపికై నట్లు చెప్పారు. జిల్లా బాలికల టీం రెండోస్థానంలో నిలువగా, బాలుర టీం మూడో స్థానంలో నిలిచిందన్నారు. బాలికల విభాగంలో హరిణి, కీర్తన, నందిని, అర్చన, వర్షశ్రీ, లావణ్య, రక్షిత, బాలుర విభాగంలో విష్ణు, రఘునందన్, వేణుగోపాల్ ఎంపికయ్యారని వివరించారు. వీరంతా ఈనెల 15 నుంచి 21 వరకు భువనేశ్వర్లో జరిగే రగ్బీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
పేకాట, కోడి పందేలకు తావు లేదు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పరిధిలో పేకాట, కోడి పందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలను పూ ర్తిగా నియంత్రించేందుకు పోలీస్శాఖ కఠిన చర్యలు చేపడుతుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ తరహా అక్రమ కార్యకలాపాలు శాంతిభద్రతలకు భంగం కలిగించడమే కాకుండా యువతను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందన్నారు. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో నిరంతర వాహన తనిఖీలు, గస్తీ ముమ్మరం చేశామన్నారు. పేకాట, కోడి పందేలు నిర్వహించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమో దు చేస్తామన్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి సమాచారమిస్తే వెంటనే చర్యలు చేపడతామన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
చిన్నశంకరంపేట(మెదక్): ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయా లని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లా డుతూ.. నిత్యావసర ధరలకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకోసారి అందించాల్సిన డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. మరో వైపు ఆరోగ్య భద్రత కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికే బకాయిపడిన 5 డీఏలు, పీఆర్సీ, ఈహెచ్ఎస్ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యకర్తలే బీఆర్ఎస్కు బలం కౌడిపల్లి(నర్సాపూర్): కార్యకర్తలే బీఆర్ఎస్కు బలం అని, వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మా ట్లాడారు. అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు, సర్పంచ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కల్లబొల్లిమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆరు గ్యారంటీలు అమలులో పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ప్రభుత్వ భూమలు అమ్మడం, దోచుకోవడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. అనంతరం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు రామాగౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షు డు శ్రీనివాస్, నాయకులు నవీన్కుమార్, మహిపాల్రెడ్డి, కాంతారావు, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే మెదక్జోన్: రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాధవి అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈనెల 25 వరకు బూత్ స్థాయిలో లోటు పాట్లు సరిచేసు కోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నాయకులు గడ్డం శ్రీనివాస్, రంజిత్రెడ్డి, పంజా విజయ్, నందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బంగారమ్మకు మొక్కులు మనోహరాబాద్(తూప్రాన్): వారాంతపు సెలవు దినం కావడంతో కాళ్లకల్ బంగారమ్మ దేవాలయంలోని వనదుర్గా అమ్మవారిని భక్తులు భారీగా దర్శించుకున్నారు. ఒడిబియ్యం సమర్పి ంచి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన పూజారి వేణుగోపాల్శర్మ తీర్థ ప్రసాదాలను అందించారు. ఉపాధి రద్దుకు కేంద్రం కుట్ర రామాయంపేట(మెదక్): కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడానికి కుట్ర పన్నుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పోరుయాత్ర ఆదివారం రామాయంపేట చేరుకోగా ఆమె మాట్లాడారు. కేంద్ర వైఖరిపై కార్మికులను చైతన్యపర్చేందుకు ఈనెల 8న మెదక్లో పోరుయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. వందలాది మంది కార్మికులతో కలిసి ఈనెల 12న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. కేంద్రం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులను ఏకం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచ్ఎస్ శివదయాల్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం కౌడిప ల్లి సీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా జనరల్ ఓపీ, ల్యాబ్, మందుల రూం, ఇన్ పేషెంట్ వార్డులను పరిశీలించి సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న సీహెచ్సీని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు సీహెచ్సీలో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నూతనంగా నిర్మించిన సీహెచ్సీలో చిన్న చిన్న పనులు ఉన్నాయని తెలిపారు. సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.డీసీహెచ్ఎస్ శివదయాల్ -
సేంద్రియ సాగుతో ప్రయోజనం
తూప్రాన్: సేంద్రియ కూరగాయల పంటల సా గుతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి ప్రతాప్సింగ్, కేవీకే తునికి శాస్త్రవేత్తలు రవి, శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని నర్సంపల్లిలో రైతులకు ఉద్యాన పంటల సాగు, రాయితీలపై రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తూప్రాన్ మండలంలో 500 ఎకరాల్లో కూరగాయ పంటలు సాగులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో పురుగుమందుల వాడకం వల్ల కలుషితమైన కూరగాయల ఉ త్పత్తి జరుగుతుందన్నారు. రైతులందరూ ఉద్యాన శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను పాటించి నాణ్యమైన కూరగాయలను పండించాలని సూ చించారు. అనంతరం ఆయిల్పామ్ సాగు ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గంగుమల్లు, ఉద్యాన అధికారి రచన, లీవ్ పామ్ మేనేజింగ్ డైరెక్టర్ రంగనాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్సింగ్ -
ముందస్తు సంక్రాంతి సంబరాలు
కౌడిపల్లి: తునికి ప్రభుత్వ పాఠశాలలో ముగ్గులు వేస్తున్న చిన్నారులుతూప్రాన్: గీతా స్కూల్లో విద్యార్థుల సందడిజిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. రంగు రంగుల ముగ్గులు, హరిదాసు వేషధారణతో విద్యార్థులు అలరించారు. భోగి మంటలు వేసి పతంగులు ఎగురవేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ తెలుగు లోగిళ్లలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ముగ్గులు వేసిన విద్యార్థినులు -
ఆలోచన అదిరె.. విద్యార్థులు మురిసె
మెదక్జోన్: మనసుంటే మార్గం ఉంటుందని, అది పది మందికి ఉపయోగపడుతుందని నిరూపించా రు జిల్లా పాలనాధికారి రాహుల్రాజ్. నూతన సంవత్సర వేళ అధికారులు, యూనియన్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తనను కలిసేందుకు వచ్చే వారు శాలువాలు, పుష్పగుచ్ఛాలకు బదులు దుప్పట్లు తీసుకురావాలని సూచించారు. ఆయన నోటి నుంచి మాట రావటమే ఆలస్యం వేలాదిగా దుప్పట్లు వచ్చి చేరాయి. వాటిని వసతి గృహాల్లో చదువుకునే పేద విద్యార్థులకు అందిస్తున్నారు. జిల్లాలోని సుమారు 56 శాఖల అధికారులతో పాటు టీచర్స్ యూనియన్ నేతలు, రాజకీయ నాయకులు భారీ గా దుప్పట్లు తీసుకొచ్చారు. ఇప్పటివరకు సుమారు 1,900 పైచిలుకు దుప్పట్లు రాగా, వాటిని విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. మెదక్లో చలితీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఉపశమనం కలగనుంది. గతంలోనూ అధికారుల నుంచి ఇదే మాదిరిగా నోట్ బుక్కులు, పెన్నులు స్వీకరించి వసతిగృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు కలెక్టర్ పంపిణీ చేశారు. తన పిలుపు మేరకు అధికారులు స్పందించటం గర్వంగా ఉందని, ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండటంతో పలువురు అందించే దుప్పట్లు వసతిగృహ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నా యని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. -
పుర పోరులో మీ పాత్ర కీలకం
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల్లో కమిషనర్ల పాత్ర కీలకమని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలకు ఏ సమయంలోనైనా నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. అధికారులు విధుల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలన్నారు. నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి విధులు కేటాయించిన నోడల్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. గత పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమర్థ విధుల నిర్వహణకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈనెల 17 నుంచి సీఎం కప్ ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే సీఎం కప్ క్రీడల విజయవంతానికి అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో సీఎం కప్ క్రీడలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. -
జిల్లాకు 6 బహుమతులు మెదక్ కలెక్టరేట్: రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాకు ఆరు బహుమతులు లభించాయని, రెండు ప్రాజెక్ట్లు దక్షిణభారతస్థాయికి ఎంపికై నట్లు డీఈఓ విజయ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు కామారెడ్డిలో న
నేడు, రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం మెదక్ కలెక్టరేట్: మెదక్లో రెండు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడీఈ మోహన్బాబు, టౌన్ ఏఈ నవీన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద మరమ్మతులు, ఎర్తింగ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈనేపథ్యంలో శనివారం, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు మరమ్మతులు చేపడుతున్నామని, తమకు సహకరించాలని కోరారు. -
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026
సంక్రాంతికి ప్రత్యేక బస్సులుఈ రూట్లలో.. ● దుప్పట్లు పంచి.. చలి నుంచి రక్షించి ● కలెక్టర్ వినూత్న కార్యక్రమం నీటి విడుదలకు కలెక్టర్ అనుమతి! ప్రాజెక్టు నీటి మట్టాన్ని 520 మీటర్ల నుంచి 517 మీటర్ల (8.1 టీఎంసీ)కు తగ్గిస్తే ఈ సీజనులో కొంత మేరకు కట్ట బలోపేతం పనులు చేసేందుకు వీలుంటుంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలేయాలని నిర్ణయించారు. హైదరాబాద్తో పాటు, సంగారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాల కోసం 8.1 టీఎంసీలకు తగ్గించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆది లేదా సోమవారం గానీ ప్రాజెక్టు నుంచి నాలుగు వేల క్యూసెక్కుల నుంచి ఐదు వేల క్యూసెక్కు నీటి విడుదల ఉంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నీటిని వదిలేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి రాగా, కలెక్టర్ పి.ప్రావీణ్య అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
నల్లపోచమ్మ హుండీ ఆదాయం రూ.5.45 లక్షలు సమయం వృథా చేయొద్దు ప్రత్యేక జీపీగా ప్రకటించాలి రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శుక్రవారం రిలే దీక్షలు ప్రారంభించారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీ పరిధిలో చేర్చడం వల్ల తాము అన్ని విధాలుగా నష్టపోతున్నామని వాపోయారు. ఉపాధి పనులకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు తమ ఇంటి పన్నులు సైతం విపరీతంగా పెరిగాయన్నారు. గ్రామాన్ని మున్సిపాలిటీ ను ంచి తొలగించి పంచాయతీగా ఏర్పాటు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని లంబాడి ఐక్య వేదిక కోఆర్డినేటర్ సురేశ్నాయక్ హెచ్చరించారు. ‘లేబర్ కోడ్లు రద్దు చేయాలి’ టేక్మాల్(మెదక్): కార్మికుల పొట్టకొట్టే విధంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు ఉద్యమాలు చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం తెలిపారు. శుక్రవారం టేక్మాల్కు జీపు జాత రా గా, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని నీరుగార్చే చర్యలు సరికాదన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి
సీఎం కప్ ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్మెదక్ మున్సిపాలిటీ/కొల్చారం(నర్సాపూర్): గ్రా మీణ యువత క్రీడల్లో రాణించాలని కలెక్టర్ రాహు ల్రాజ్ అన్నారు. శుక్రవారం పట్టణంలో సీఎం కప్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల యువతను క్రీడల వైపు ఆకర్షించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా ప్రో త్సహించడమే సీఎం కప్ లక్ష్యమన్నా రు. ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. యువత, చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. ర్యా లీలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు, ఎన్సీసీ కేడెట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కొల్చారం కేజీబీవీని తనిఖీ చేశారు. పాఠశాలలో సౌకర్యాలు, విద్యా బోధన, పరిసరాల పరిశుభ్రత, భోజనంపై ఆరా తీశారు. పరిసరాల పరిశుభ్రత లోపించడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. అధికారులు ఎప్పటికప్పుడు వసతి గృహాలను పర్యవేక్షించాలని సూచించారు. సంక్రాంతి సెలవుల అనంతరం విద్యార్థులు తిరిగి వచ్చేసరికి వసతి గృహ ఆవరణ పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలన్నారు. కలెక్టర్ వెం డీఈఓ విజయ, తహసీల్దార్ శ్రీనివాస్చారి, సిబ్బంది ఉన్నారు. -
అవంచను సందర్శించిన యూపీ బృందం
నర్సాపూర్రూరల్: మండలంలోని అవంచ గ్రామాన్ని యూపీకి చెందిన జిల్లా, గ్రామస్థాయి అ ధికారులు, ప్రజాప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది. గ్రామస్థాయిలో అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకునేందుకు వచ్చినట్లు వారు తెలిపారు. అందులో భాగంగా గ్రామంలోని వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ యూనిట్తో పాటు శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల క్షేత్రస్థాయి చేస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామ పాలకవర్గం వారిని సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి, కార్యదర్శి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ విద్యార్థులకు అల్పాహారం
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ఉపశమనం లభించింది. ఫిబ్రవరి 16 నుంచి అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక తరగతులు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహారం అందించ లేకపోయింది. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు కేవలం 19 రోజులు మాత్రమే అల్పాహారం అందించాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు 9,640 మందికి లబ్ధి చేకూరనుంది. ఈసారి అక్టోబర్ 7 నుంచే టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ ప్రారంభించింది. ఇంతవరకు బాగానే ఉన్నా దూర ప్రాంతాల నుంచి ఉదయం వచ్చే విద్యార్థు లు ఆకలితో ప్రత్యేక తరగతులకు హాజరవుతూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో అధ్యాపకులు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో అరకొరగా స్నాక్స్ సదుపాయాలు కల్పించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 చొప్పున రూ. 285 అందించనుంది. ఉడకబెట్టిన పెసలు, బొబ్బర్లు లేదా శనగలు, పల్లీలు, బెల్లం వంటి పోషకాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిపాయ పకోడి వంటివి రోజుకు ఒక్కోరకం చొప్పున విద్యార్థులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే నెల 16 నుంచి ప్రారంభం ప్రత్యేక తరగతుల్లో అందజేత ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం -
క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగు
అదనపు కలెక్టర్ నగేశ్ మెదక్ కలెక్టరేట్: క్రీడలతో స్నేహ సంబంధాలు పెరుగుతాయని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు, అవుట్ డోర్ స్టేడియంలో ఫుట్బాల్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఓటమి లేకుంటే గెలుపు అనేదే లేదన్నారు. ఓడిన జట్టు మరింత శిక్షణ పొంది గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. అనంతరం డీఈఓ విజయ మాట్లాడుతూ.. క్రీడల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలోని 29 పాఠశాలల నుంచి 700 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి పట్టణ సీఐ మహేశ్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి నాగరాజు, పీడీలు మాధవరెడ్డి, వినోద్, శ్యా మయ్య, విజయ్, శేఖర్, దేవేందర్రెడ్డి, రవి, కిరణ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
జలం.. సాగుకు బలం
జిల్లాలో సమృద్ధిగా భూగర్భజలాలుమెదక్జోన్: జిల్లాలో వానాకాలంలో సమృద్ధిగా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వెరసి జిల్లా అంతటా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా సాధారణ వర్షపాతం కంటే 80 శాతం అధికంగా నమోదు అయింది. దీంతో ఈ యాసంగి సాగుకు ఢోకా లేదని అధికారులు చెబుతున్నారు. పాపన్నపేటలో ౖపైపెనే.. జిల్లాలో వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం 7.79 మీటర్లలోతులో నీటిమట్టం ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందులో పాపన్నపేట మండలంలో 4.58 మీటర్లలోతులోనే జలాలు ఉండగా, తూప్రాన్లో 10.84 మీటర్లలో ఉన్నాయి. అల్లాదుర్గం 9.89, చేగుంట, 7.20, చిలప్చెడ్ 9.13, హవేళిఘణాపూర్ 5.59, కౌడిపల్లి 9.10, కొల్చారం 9.61, మనోహరాబాద్ 5.08, మాసాయిపేట 10.40, మెదక్ 7.15, నర్సాపూర్ 8.83, నార్సింగి 14.40, నిజాంపేట 7.85, పాపన్నపేట 4.58, రామాయంపేట 9.47, రేగోడ్ 11.52, పెద్దశంకరంపేట 8.22, చిన్నశంకరంపేట 10.05, శివ్వంపేట 6.26, టేక్మాల్ 5.06, తూప్రాన్ 10.85, వెల్దుర్తి 5.15 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. కాగా గడిచిన రెండు దశాబ్దాలతో పోలిస్తే ఇంత పైన నీరు ఎప్పుడూ లేదని అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఇదే సమయంలో 9.95 మీటర్లలోతులో జలాలు ఉండగా, ఈ ఏడాది 2.16 మీటర్ల జలం పైన ఉండటం రైతాంగానికి ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. వర్షాకాలం ప్రారంభం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం జిల్లావ్యాప్తంగా 772 మిల్లీ మీటర్లు కాగా, సగటున 1,390.30 మి.మీ కురిసింది. ఈ లెక్కన 668.30 మి.మీ వర్షం అదనంగా నమోదైంది. కురవాల్సిన దాని కంటే 80 శాతం ఎక్కువగా కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో భూమిలోకి పుష్కలంగా నీరు చేరి భూగర్భజలాలు ౖపైపెనే ఉన్నాయని అంటున్నారు. యాసంగి సాగు 3.17 లక్షల ఎకరాలు జిల్లావ్యాప్తంగా యాసంగిలో 3.17 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాది యాసంగిలో 2.96 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ ఏడాది మరో 21 వేల ఎకరాలు అదనంగా సాగవుతోంది. ఇందుకు భూగర్భజలాల పెంపే ప్రధాన కారణమని తెలిసింది. కాగా సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నేపథ్యంలో దానిపై ఆధారపడిన ఘనపూర్ ప్రాజెక్టుకు సైతం నీటి తడులు వచ్చే అవకాశం లేదు. ఆ ప్రాజెక్టు పరిధిలోని 21 వేల ఎకరాల ఆయకట్టు తగ్గే అవకాశం ఉంది. దీంతో అధికారులు వేసిన సాధారణ సాగు అంచనాలో కొంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఎప్పటిలాగే రైతులు వరిసాగుకు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ యాసంగిలో అధికారిక లెక్కల ప్రకారం 3.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా, అందులో సింహభాగం 2.95 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. మిగితా 22 వేల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, కూరగాయలు ఇతర పంటలు సాగు కానున్నాయి. -
పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికలు
కలెక్టర్ రాహుల్రాజ్ రామాయంపేట(మెదక్): మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్రూంను పరిశీలించి మాట్లా డారు. ఎన్నికల సంఘం ఆదేశాలను విధిగా పాటించాలని, బ్యాలెట్ పేపర్ల భద్రతకు మూడంచెల భద్రత వ్యవస్థతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ హాల్లో టేబుళ్లు, కంట్రోల్ రూం ఏర్పాటు విషయమై దృష్టి సారించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చో టు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని సందర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని, అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజని, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మేనేజర్ రఘువరన్, వ్యవసాయ విస్తరణ అధికారి రాజ్నారాయణ ఉన్నారు. -
ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి
మెదక్ ఎంపీ రఘునందన్రావుమెదక్జోన్/నర్సాపూర్/రామాయంపేట(మెదక్): పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధిని గాలికి వదిలేశారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపుతానని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్వచ్ఛభారత్ కింద కేంద్రం నుంచి ప్రతి జిల్లాకు నిధులు మంజూరైతే కేవలం సిద్దిపేట, గజ్వేల్కు మాత్రమే వినియోగించారన్నారు. మెదక్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్రోడ్డు నిర్మాణం కోసం డీపీఆర్ తయారు చేశామని, అనుమతులు రాగానే నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. మార్చి 31 వరకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి వచ్చే రూ. 950 కోట్లు వాపస్ పోతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆరాట పడుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, నేతలు రంజిత్రెడ్డి, నందారెడ్డి, ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నర్సాపూర్ మేజర్ పంచాయితీ నుంచి మున్సిపాలిటీగా మా రినా అభివృద్ధి అంతంతే జరిగిందన్నారు. నాయకులు సమష్టిగా ముందుకు సాగితే మున్సిపాలిటీని బీజేపీ కై వసం చేసుకుంటుందన్నారు. గెలిచే వ్యక్తులను మాత్రమే అభ్యర్థులుగా ఎంపిక చేస్తారని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామాయంపేటలో పర్యటించారు. సంక్రాంతి పండుగను సద్వినియోగం చేసుకొని పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటు అడగాలని సూ చించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఎన్నికల ఇన్చార్జి నర్సింహారెడ్డి, నాయకులు నందారెడ్డి, శ్రీనివాస్, అంజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, శంకర్గౌడ్, మండలశాఖ అధ్యక్షుడు నవీన్గౌడ్, పట్టణాధ్యక్షుడు అవినాశ్రెడ్డి పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
నర్సాపూర్ రూరల్: వరిలో అంతర పంటగా ఆయిల్పామ్ సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్సింగ్ రైతులకు సూచించారు. గురువారం మండలంలోని కాగజ్మద్దూర్కు చెందిన రైతు వెంకటరమణ వరిపొలంలో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో లీవ్ఫామ్ అధికారి డాక్టర్ రంగనాయకులు, ఏడీ సంధ్యారాణి, మండల వ్యవసాయ శాఖ అధికారి దీపిక, ఏఈఓలు మోహన్, తేజస్విని, రుతు, కాగజ్ మద్దూర్ ఉపసర్పంచ్ భాస్కర్, లీవ్ ఫామ్ రిసోర్స్ కంపెనీ మేనేజర్ కృష్ణారావు, టెక్నికల్ పర్సన్ అజయ్, శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ -
బల్దియాలకు నిధులు
తూప్రాన్ మినహా.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేసింది. మెదక్ మున్సిపాలిటీకి ఏడాది కాలంలో ఏకంగా రూ. 160 కోట్లు ఇచ్చింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కేటాయించినట్లుతెలిసింది. – రామాయంపేట(మెదక్) టీయూఎఫ్ఐడీసీ పథకం కింద జిల్లాలోని తూప్రాన్ మినహాయించి, మిగితా మున్సిపాలిటీలకు నిధులు మంజూరయ్యాయి. మూడు మున్సిపాలిటీలకు రూ. 92.5 కోట్లు కేటాయించారు. గజ్వేల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న తూప్రాన్ మున్సిపాలిటీకి టీయూఎఫ్ఐడీసీ కింద నయా పైసా మంజూరు కాలేదనే ఆరోపణలున్నాయి. ఇతర శాఖల నుంచి కూడా తూప్రాన్కు నామమాత్రంగానే నిధులు మంజూరైనట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. మెదక్ పట్టణంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, దుకాణ సముదాయం, అమృత్ పథకం కింద వాటర్ ట్యాంకులు, మూత్రశాలల నిర్మాణం, ట్రీ ప్లాంటేషన్ తదితర పనులకు పెద్దఎత్తున నిధులు మంజూరయ్యాయి. తెలంగాణ అర్బన్ మౌలిక వసతులు, యూఎఫ్ఐడీసీ, అమృత్ పథకం, హడ్కో తదితర శాఖల నుంచి నిధులు కేటాయించారు. వీటిని మున్సిపాలిటీల పరిధిలో సిమెంటు రోడ్లు, మురుగు కాలువలు, తారు రోడ్లు, పార్కుల అభివృద్ధి, ఇతరత్ర పనులకు కేటాయించనున్నారు. ఇటీవల మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సీఎం రేవంత్రెడ్డి కలిసి నిధుల కోసం విన్నవించగా, ప్రత్యేకంగా మెదక్ మున్సిపాలిటీకి రూ. 85 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం నాలు గు మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పార్టీకి లబ్ధి చేకూరుతుందని, తద్వారా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు దోహదపడుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో రూ. 25 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, ఇతరత్ర పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నట్లు సమాచారం.ఎన్నికల నేపథ్యంలో కేటాయింపు -
అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
మెదక్ మున్సిపాలిటీ: సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ‘మహిళల రక్షణ– పిల్లల సంరక్షణ’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం పెరగడంతో సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. డేటింగ్ యాప్లు, సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని నమ్మకం పొంది, అనంతరం మోసాలకు పాల్పడుతున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయని వివరించారు. అపరిచితులను నమ్మవద్దని సూచించారు. అనంతరం విద్యార్థులతో సైబర్ నేరాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. క్విజ్ పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ సు భాశ్ చంద్రబోస్, కళాశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి, అధ్యాపకులు, సైబర్ క్రైం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.అదనపు ఎస్పీ మహేందర్ -
ఎన్నికలకు సమాయత్తం అవుతున్న ప్రధాన పార్టీలు
గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026పుర పోరులో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఎలాగైనా మున్సిపాలిటీలపై పార్టీ జెండాలను ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా, మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతుండటంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. – మెదక్జోన్ పుర పీఠంపై గురి!సత్తా చాటాలని కమలం ఆరాటం ‘హస్త’గతం దిశగా సన్నద్ధం గెలుపే లక్ష్యంగా కారు పయనం గెలుపు గుర్రాల వేటలో నేతలు మెజార్టీ స్థానాల్లో గెలుపునకు వ్యూహాలు -
గ్రామాల అభివృద్ధిలో మీరే కీలకం
మెదక్ కలెక్టరేట్: గ్రామాల అభివృద్ధిలో మీ పాత్ర కీలకం, ఆర్థిక క్రమశిక్షణతో వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఎంపీడీఓలు, కార్యదర్శలతో సమీక్ష నిర్వ హించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. నేటి నుంచి 11వ తేదీ వరకు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మహిళా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు మున్సిపల్ కమిషనర్లతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చలి నేపథ్యంలో పేద పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు దుప్పట్ల అందజేయాలని సూచించారు.పంచాయతీ కార్యదర్శులతోకలెక్టర్ రాహుల్రాజ్ -
స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
రామాయంపేట(మెదక్): రామాయంపేటను స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హామీ ఇచ్చారు. బుధవారం పట్టణంలోని పోలీస్స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్పీఎల్ క్రికెట్ పోటీలను, మున్సిపాలిటీకి కొత్తగా మంజూరైన రెండు చెత్త సేకరణ ఆటోలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ వాసులు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బండిలోనే వేయాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకు ంటే వ్యాధులు ధరి చేరవని సూచించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని హితవుపలికారు. కొద్దిసేపు క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే సిక్స్ కొట్టి ఆలరించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, మాజీ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, పట్టణ పార్టీ అధ్యక్షుడు చింతల స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా రామాయంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పక్కా భవనం మంజూరు చేయాలని కోరుతూ ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ ఎమ్మెల్యేక వినతిపత్రం అందజేశారు.ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
అట్టహాసంగా పీఎంశ్రీ క్రీడా పోటీలు
మెదక్జోన్: జిల్లా కేంద్రంలో బుధవారం పీఎంశ్రీ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్ర భుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లాస్థాయి ఖోఖో పోటీలు జరగగా, అవుట్ డోర్ స్టేడియంలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 29 పాఠశాలలకు చెందిన 680 మంది బాల, బాలికలు పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి డీఈఓ విజయ హాజరై విజేతలకు బహుమతులతో పాటు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ఆడిన ప్రతీ ఒక్కరూ విజేతలే అన్నారు. అనంతరం క్రీడా సమాఖ్య జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. జిల్లా స్థాయికి ఎంపికై న క్రీడాకారులు ఈనెల 18 నుంచి హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీడీలు మాధవరెడ్డి, వినోద్, శ్రీధర్రెడ్డి, దేవేందర్రెడ్డి, రవి, మధు, రాజేందర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న అధికారులు -
ఆటలకు టాటా..
నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు తూప్రాన్: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పా టు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. ఆటలకు అనువుగా లేని చోట, చెరువులు, శిఖం భూములు, అడవులు, వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో క్రీడా మైదానానికి ఎకరం నుంచి మూడెకరాల వరకు కేటాయించారు. అక్కడ పరిస్థితులను బట్టి ఒక్కో మైదానానికి రూ. 1.65 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఖర్చు చేసేలా అనుమతించారు. అయితే క్రీడా ప్రాంగణాలకు కేవలం బోర్డులు ఏర్పాటు చేసి వదిలేశారు. కొన్నిచోట్ల వాలీబాల్, కోకో ఆటలకు అవసరమైన స్తంభాలు ఏర్పాటు చేశారు. మండలంలోని వెంకటాయపల్లి సమీపంలోని చెరువులో, కిష్టాపూర్లోని వ్యవసాయ పొలాల్లో క్రీడా మై దానాలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా తూప్రాన్ పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటుకు గతంలో పట్టణ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల పక్కన ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని అధికారులు గుర్తించారు. ఇందుకోసం నిధులు సైతం కేటాయించినట్లు చెప్పారు. అయితే ఇప్పటివరకు క్రీడా మైదానం ఊసే ఎత్తకపోవటంపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఈఓ
టీచర్లకు టెట్ నిబంధన తొలగించాలి: ఎస్టీయూ సమయపాలన తప్పనిసరి చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ ఆదేశించారు. బుధవారం నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పి ంచాలని సూచించారు. అస్పత్రికి వచ్చే రోగులకు అవసరమైన పరీక్షలు, మందులు అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలన్నారు. ఈసందర్భంగా వైద్యాధికారులు రవికుమార్, రేణుక, శ్రీనివాస్కు పలు సూచనలు చేశారు. దరఖాస్తుల ఆహ్వానం నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం -
ఏడుపాయల టెండర్ల ఆదాయం రూ.30.60 లక్షలు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో మంగళవారం జరిగిన టెండర్ల ద్వారా రూ.30.60 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. దేవస్థానం వద్ద పూజా సామగ్రి విక్రయించుకునే హక్కుకు రూ.25.10 లక్షలు, ఎంటర్టైన్మెంట్, ఎగ్జిబిషన్కు రూ.5.50లక్షలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కాగా జాతరలో విద్యుత్ దీపాల అలంకరణ కోసం రూ.3.84 లక్షలు, టెంట్లు వంట సామగ్రి సరఫరా రూ.3.80 లక్షలు, తడకల పందిళ్లు ఏర్పాటు చేసేందుకు రూ.2.44 లక్షలు, అద్దె గదులకు పేయింట్ వేసేందుకు రూ.2.30 లక్షలకు టెండర్లు పాడారని తెలిపారు. ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సాయిలుపాపన్నపేట(మెదక్): మండల కేంద్రమైన పాపన్నపేటకు చెందిన సుంకరి సాయిలు ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శంషాబాద్లో మూడు రోజులుగా ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన కార్యక్రమంలో టేక్మాల్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న సాయిలును రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన విద్యార్థి దశలో ఉస్మానియా యూనివర్శిటీలో ఏబీవీపీ కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర బాధ్యులుగా అవకాశం కల్పించినందుకు సాయిలు రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. -
మైనార్టీలకు సహారా
మెదక్ కలెక్టరేట్: గత ఏడాది సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఆగిపోయిన ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంతన్నకా సహారా పథకాలు ప్రభుత్వం తిరిగి తెరపైకి తీసుకొచ్చింది. నిరుపేద ముస్లిం మైనార్టీ ప్రజల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 19న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఈ పథకాలను ప్రారంభించారు. సర్పంచ్ ఎన్నికలు రావడంతో పథకాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో తిరిగి వాటిని అమలు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన జిల్లాలోని ఆర్థికంగా వెనకబడిన నిరుపేదలైన మైనార్టీ (ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ వర్గాలకు చెందిన) మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం ద్వారా రూ.50వేల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. ముఖ్యంగా ఫకీర్, దూదెకుల, వితంతువులు, ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వీరంతా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చేయూత అందిస్తారు. రుణం పొందిన మహిళలు చిన్నపాటి వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. వంద శాతం సబ్సిడీ రాష్ట్రంలోని నిరుపేద ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ముస్లిం మైనార్టీ వర్గాల్లోని నిరుపేదలైన ఫకీర్, దూదెకుల, ఇతర అట్టడుగు వర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధికి మోపెడ్లు, బైక్లు, ఈ–బైక్లు వందశాతం సబ్సిడీపై అందించనున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.1లక్ష వరకు గ్రాంట్ మంజూరు చేయనున్నారు. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈనెల 10 వరకు గడువు మొత్తం రూ.30 కోట్లతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలను ప్రవేశ పెట్టింది. జిల్లాలోని అర్హులైన ముస్లిం మైనార్టీలు ఈనెల 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరించడం ఉండదు.ఎవరు అర్హులు రెండు పథకాలకు శ్రీకారం సబ్సిడీ రుణాలు, ఉచిత వాహనాలు ఈనెల 10 వరకు దరఖాస్తుల స్వీకరణమైనార్టీ వర్గాలకు చెంది తెలంగాణలో స్థిర నివాసులై ఉండాలి. కనీసం పదో తరగతి చదివి 21 నుంచి 55 యేళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి ఉండాలి. ఐదేళ్లలో మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి ఎలాంటి సాయం పొందలేదని డిక్లరేషన్ ఇవ్వాలి. కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఒక పథకం అందించనున్నారు. -
గజ్వేల్లో వార్డుల విభజన అశాసీ్త్రయం
తూప్రాన్: గజ్వేల్ మున్సిపల్ వార్డుల విభజన శాసీ్త్రయంగా జరగలేదని మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. తూప్రాన్లో మంగళవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్ మున్సిపల్లో 20 వార్డులు ఉండగా.. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల ఓటర్లు సుమారు 14 వేల మందిని అశాసీ్త్రయంగా ఓటరు జాబితాలో చేర్చారని విమర్శించారు. 20 వార్డులున్న గజ్వేల్ మున్సిపాలిటీలో మరో 10 వార్డులు పెంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. తూప్రాన్లో బీజేపీకి మంచి పట్టు ఉందన్నారు. తూప్రాన్, గజ్వేల్ మున్సిపాలిటీల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. తూప్రాన్లో పదేళ్లు బీఆర్ఎస్, రెండేళ్లు కాంగ్రెస్ పాలనను ప్రజలు చూశారని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, జానకిరాంగౌడ్, మధుసూదన్రెడ్డి, దుర్గరాజ్యాదవ్, మహేశ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. సరి చేయండి.. లేకుంటే కోర్టుకెళుతాం ఎంపీ రఘునందన్రావు -
రసవత్తరం.. ఆసక్తికరం
ఆద్యంతం ఆకట్టుకున్న ‘యూత్ పార్లమెంట్’ ● వాడీవేడి చర్చలు.. వాదోపవాదాలు ● పోటీపడిన సభ్యులతో అట్టుడికిన సభ ● మోడల్ పార్లమెంట్ సెషన్ అబ్బురం ● కొల్లాం, వల్సాడ్ విద్యార్థుల విశేష ప్రతిభ వర్గల్(గజ్వేల్): వాడీవేడి చర్చ.. అధికార ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు.. సమస్యలు లేవనెత్తిన ప్రతిపక్ష సభ్యులు.. ప్రధాని, మంత్రుల సమాధానాలు.. సంతృప్తి చెందని సభ్యుల నిరసనలు.. సభ వాయిదా.. ఇలా.. మంగళవారం వర్గల్ నవోదయ వేదికగా జాతీయ స్థాయి ‘యూత్ పార్లమెంట్’ ఆద్యంతం రసవత్తరంగా.. ఆసక్తికరంగా సాగింది. యూత్ పార్లమెంట్ పోటీలలో భాగంగా కేరళ రాష్ట్రంలోని కొల్లాం, గుజరాత్ రాష్ట్రం వల్సాడ్ నవోదయ విద్యార్థులు 55 మంది చొప్పున వేర్వేరుగా గంట పాటు వాడీవేడి ప్రసంగాలతో అదరగొట్టారు. పార్లమెంటేరియన్ల మాదిరి చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. స్పీకర్, ప్రధానమంత్రి, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్ సభ్యులుగా పాత్రలు పోషిస్తూ 55 మంది సభ్యులతో కూడిన ఒక్కో విద్యాలయ జట్టు సభను కొనసాగించారు. వల్సాడ్ విద్యార్థులు ఇలా.. మొదట వల్సాడ్ నవోదయ బృందం సెషన్ జరిగింది. దాదాపు గంటపాటు కొనసాగిన ఈ సభలో యూత్ పార్లమెంటేరియన్లుగా విద్యా విధానంపై, రైల్వే దుర్ఘటనలపై, లోక్సభ, అసెంబ్లీకి జరిగే జమిలి ఎన్నికలపై క్వశ్చన్ అవర్లో ప్రస్తావించారు. జీరో అవర్లో పర్యావరణ సమస్య, నీటి కాలుష్యంపై సభ్యులు చర్చించారు. విద్యా బిల్లుపై సమగ్ర చర్చ జరిపారు. అనంతరం బిల్లును సభలో ఆమోదింపజేశారు. సభ వాయిదా వేసి ప్రదర్శన ముగించారు. కొల్లాం విద్యార్థుల ప్రదర్శన.. కొల్లాం నవోదయ విద్యార్థుల యూత్పార్లమెంట్ సెషన్లో ఇటీవల మరణించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్పై సంతాప తీర్మానం ప్రవేశపెట్టింది. క్వశ్చన్ అవర్లో ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్ష విధానం, భారత విదేశాంగ విధానం, రైతుల సమస్యపై ప్రశ్నలతో ప్రస్తావించారు. జీరోఅవర్లో విదేశాల్లో భారతీ య విద్యార్థుల వెతలను సభ్యులు ప్రస్తావించారు. మహిళ రిజర్వేషన్ బిల్లుపై చర్చ అనంతరం సభలో ఆమోదింపజేశారు. రెండు జట్ల నుంచి ఉత్తమ ప్రతిభ చాటిన 16 మందిని పురస్కారానికి ఎంపిక చేశారు. -
బోగస్ ఓట్లు ఉండొద్దు
మెదక్ కలెక్టరేట్: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా సూచనలు ఇవ్వాలని కలెక్టర్ రాహుల్రాజ్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లో పురపాలక తుది ఓటరు జాబితా రూపకల్పనపై గుర్తింపు ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బోగస్ ఓటర్లు ఉండరాదన్నారు. అదే సమయంలో అర్హులకు అన్యాయం జరగొద్దన్నారు. ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులపై అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులో సమర్పించాలని కోరారు. క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జయచంద్రారెడ్డి, డీపీఓ యాదయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
నా ఓటు ఎటు..?
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026ఓటరు జాబితా తప్పుల తడక నాలుగు మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి ● ముసాయిదాపై అభ్యంతరాల వెల్లువమెదక్ పట్టణంలోని ఆజంపుర వార్డుకు చెందిన పిల్లి ఆంజనేయులు, ఉమాదేవీ భార్యాభర్తలు. ఇరవై ఏళ్లుగా ఓటు వేస్తున్నారు. ఇటీవల మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేయగా.. అందులో ఈ దంపతుల పేర్లు లేవు. ఆన్లైన్ ద్వారా పరిశీలిస్తే ఫ్రీజింగ్లో పెట్టినట్లు తెలిసింది. ఈ సమస్య ఒక్క ఆంజనేయులు దంపతులదే కాదు.. వందలాది మంది ఓటర్ల పరిస్థితి. కొన్ని మున్సిపాలిటీల్లో అయితే.. చనిపోయిన వారి ఓట్లు తొలగించకుండా జాబితాలో ప్రదర్శించడం, ఒకే కుటుంబానికి చెందిన వారి ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండటం, గ్రామ ప్రజల ఓట్లు మున్సిపాలిటీల్లో ఉండడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.మెదక్జోన్: జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటి పరిధిలో 75 వార్డులు ఉండగా.. సుమారు 86 వేల మంది ఓటర్లు ఉన్నారు. 2025 అక్టోబర్ ఒకటిన ఫైనల్ చేసిన ఓటరు జాబితాను ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు విడుదల చేశారు. బల్దియా ఓటర్లను విభజించి వార్డుల వారీగా జాబితాను ప్రదర్శించారు. అయితే.. వాటిలో అనేక తప్పులు దొర్లాయి. సోమవారం అన్ని మున్సిపాలిటీలలో కమిషనర్లు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయగా, ఓటరు జాబితాలో దొర్లిన తప్పులను వెంటనే సరిచేశాకనే ఎన్నికలను నిర్వహించాలని ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేశారు. తూప్రాన్ పరిధిలో ఆయా గ్రామాలకు చెందిన ఓటర్లను మున్సిపాలిటీలో చేర్చటంతో అంతా విస్మయం చెందుతున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న వారి పేర్లు మున్సిపాలిటీల్లో దర్శనమిస్తున్నాయి. తూప్రాన్లో గతంలో 17 వేల పైచిలుకు ఓటర్లు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం 19 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన అదనంగా 2 వేల ఓట్లు ఎక్కువగా నమోదు అయ్యాయి. వీటిని వెంటనే సరిచేయాలని పార్టీలకు అతీతంగా నేతలు డిమాండ్ చేస్తున్నారు. నర్సాపూర్లోని పలు వార్డుల్లో సైతం ఆయా గ్రామాలకు చెందిన వారి ఓటర్లు బల్దియాల్లో ఉన్నాయి. రామాయంపేటలో చనిపోయిన వారి పేర్లు తొలగించలేదు. మెదక్లోనూ ఒక కుటుంబానికి చెందిన వారి ఓట్లు ఒకే వార్డులో ఉండాల్సి ఉండగా వివిధ వార్డుల్లో ఉండటం, మరి కొంత మంది ఓట్లు ఫ్రీజింగ్లో పెట్టడంతో అంతా గందరగోళంగా ఉంది.10న తుది జాబితా విడుదల చేస్తాం కుటుంబ సభ్యుల పేర్లన్నీ ఒకే వార్డులోకి వచ్చే విధంగా జాబితాను సరి చేసి ఈనెల 10న తుది జాబితాను విడుదల చేస్తాం. ప్రస్తుత జాబితాలో ఎవరైనా చనిపోయిన వారి పేరుంటే వాటిని తొలగించటం కుదరదు, అలాగే కొత్తవారిని చేర్చటం సాధ్యంకాదు. ప్రస్తుతం విడుదలైన జాబితాలో 2025 నవంబర్ ఒకటిన తాజాగా తయారు చేసింది. – బల్దియాల ప్రత్యేక అధికారి, నగేష్ -
క్రీడలకు అత్యంత ప్రాధాన్యం
మెదక్ కలెక్టరేట్: క్రీడాకారులు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డీఈఓ విజయ సూచించారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా స్థాయి పీఎంశ్రీ వాలీబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 29 పాఠశాలల నుంచి 580 మంది బాలబాలికలు ఈ పోటీలలో పాల్గొన్నారు. డీఈవో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. క్రీడా పరికరాల కొనుగోలుకై ఇప్పటికే పీఎంశ్రీ పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని రాష్ట్రస్థాయిలో రాణించాలన్నారు. ముగింపు కార్యక్రమానికి డీఎస్పీ ప్రసన్నకుమార్ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో బాలుర విభాగంలో చిన్నశంకరంపేట, గోమారం, శివ్వంపేట మండలాల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు నిలిచారు. అలాగే బాలికల విభాగంలో గోమారం, అక్కన్నపేట, శివ్వంపేట జెడ్పీహెచ్ఎస్ల విద్యార్థులు నిలిచారు. వీరికి మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ బహుమతులు అందజేశారు. జిల్లా విద్యాధికారి విజయ పీఎంశ్రీ వాలీబాల్ పోటీలు ప్రారంభం -
వానర సైన్యం బందీ!
ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆలోచించకుండా ఆ గ్రామ యువకులు నడుంబిగించారు. నిత్యం తీవ్ర సమస్యగా మారిన కోతుల బెడదను తొలగించేందుకు ముందుకు వచ్చారు. తలా ఇంత పోగేశారు.. కోతులను తరిమేసేందుకు కార్యచరణ చేపట్టారు. ఫలితంగా చిన్నశంకరంపేట మండలం జంగరాయిలో నెలకొన్న కోతుల బెడదకు పరిష్కారం చూపారు. గ్రామానికి చెందిన 27 మంది యువకులు ఏకమై మొత్తం రూ.2.25లక్షలు జమ చేశారు. కోతులను పట్టేవారితో మాట్లాడి మూడు రోజులుగా సుమారు 500 కోతుల వరకు పట్టారు. వానర సైన్యం ఉపశమనం పొందారు. – చిన్నశంకరంపేట(మెదక్): -
కేసీఆర్ను కలిసిన పద్మారెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి మంగళవారం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావును ఆయన వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన జన్మదినం సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం ప్రజాబాటలో ఏడీ రమణారెడ్డి బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలిఏఐటీయూసీ కార్యదర్శి లక్ష్మణ్ నిజాంపేట(మెదక్): బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎ.లక్ష్మణ్ కోరారు. మంగళవారం నిజాంపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీడీ కార్మికులకు దేశ వ్యాప్తంగా ఒకే వేతనం, వెయ్యి బీడీలకు రూ.300 అమలు చేయాలని, కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పదవీ విరమణ అనంతరం గ్రాట్యూవిటీ డబ్బులు ఇవ్వాలన్నారు. కార్మికులకు 26 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. పీఎఫ్ ద్వారా పదవీ విరమణ చేసిన కార్మికులకు కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ. 5000లకు పెంచి అమలు చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు, రాష్ట్ర ఉపాద్యాక్షులు శాంత, వి.అనసూయ, కార్యవర్గ సభ్యులు కడారి రాములు తదితరులు పాల్గొన్నారు. బాల కార్మికులతో పనిచేయిస్తే చర్యలు ఆర్డీఓ జయచంద్రారెడ్డి తూప్రాన్: పరిశ్రమల్లో చిన్నపిల్లలతో పని చేయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఆర్డీఓ జయచంద్రారెడ్డి హెచ్చరించారు. మంగళవారం డివిజన్ పరిధిలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ చట్ట విరుద్ధమని చెప్పారు. బాలల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని నిర్మూలించాలని తెలిపారు. గ్రామాల పరిధిలో ఉన్న పరిశ్రమలు, వర్క్షాప్లు, దుకాణాలు, ఇటుక బట్టీలు, చిన్న తయారీ కేంద్రాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. విముక్తి పొందిన బాలలకు విద్య, పునరావాసం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్: డీఐఈఓ మాధవిమెదక్ కలెక్టరేట్: వచ్చేనెల 2వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు, 25 నుంచి థియరీ పరీక్షలు ఉంటాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 28 ప్రాక్టికల్ సెంటర్లు, 28 థియరీ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆరు ఒకేషనల్ సెంటర్లు కూడా ఉంటాయని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 6,306, రెండో సంవత్సరంలో 6,017 మంది మొత్తం 12,323 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. -
ప్రజావాణి మరింత బలోపేతం
కలెక్టర్ రాహుల్రాజ్ రేగోడ్(మెదక్): మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి నోడల్ అధికారులను నియమించి మరింత బలోపేతం చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన ప్రజావాణికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పలు సమస్యలపై మొత్తం 111 అర్జీలు వచ్చాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు దూరభారం, సమయాన్ని తగ్గించడం కోసమే మండలాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దర ఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తామని, ఆయా దరఖాస్తులు ఏ అధికారి స్థాయిలో ఉన్నాయో తెలి పే సాంకేతికతను అందుబాటులోకి తెస్తామన్నారు. భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు, పోలీస్ పరిధిలో ఉన్న వాటిని సంబంధిత శాఖలకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సీతారావమ్మ, తహసీల్దార్ దత్తారెడ్డి, ఆర్ఐలు శరణప్ప, విజయలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ భవాని, ఏఓ రాంప్రసాద్, సర్పంచ్ పర్వీన్ సుల్తాన తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫొటోతో మాత్రమే ఫ్లెక్సీ ఏర్పాటుచేయడం, సీఎం, మంత్రుల ఫొటోలు లేకపోవటంతో ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. -
గ్రామాల్లో ఐదేళ్లు పనిచేయాలి
● ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ● అసెంబ్లీలో ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సర్వీసులో ఐదారేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా నిబంధనలు విధించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ...పిల్లల చదువుల కోసం పట్టణాలు, నగరాల్లో, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతుండటం, గ్రామీణప్రాంతాల్లో పనిచేస్తున్నా డిప్యూటేషన్పై వెళ్తుండటంతో గ్రామీణప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడంలేదన్నారు. విశ్వవిద్యాలయాలు పట్టణ ప్రాంతానికే పరిమితమవుతున్నాయన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల శాఖలను ఏర్పాటు చేయాలని కోరారు. నిజాంసాగర్ సమీపంలోని ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్ను పునరుద్ధరిస్తే ఖేడ్, జుక్కల్ నియోజకవర్గాలకు మేలు చేకూరుతుందని వివరించారు. హాస్టల్ బెడ్స్ అమ్మకం సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్కు సరఫరా అయిన బెడ్స్, మంచాలను అమ్ముకున్నట్లు సంజీవరెడ్డి అసెంబ్లీలో సభ దృష్టికి తీసుకొవచ్చారు. ఈ హాస్టల్ వార్డెన్ 8 ఏళ్లుగా లాంగ్స్టాండింగ్గా ఉండటం, పిల్లలకు సక్రమంగా భోజనం పెట్టడంలేదని పిల్లలు చెప్పారన్నారు. -
సత్వరమే పరిష్కరించాలి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. డీఆర్ఓ భుజంగరావు, డీఆర్డీఓ శ్రీనివాస్, జెడ్పీసీఓ ఎల్లయ్యతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈమేరకు భూ సంబంధిత సమస్యలపై 32, పెన్షన్ 10, ఇందిరమ్మ ఇళ్లు 2, ఇతర సమస్యలు 18 కలిపి మొత్తం 64 వినతులు వచ్చాయి. కాగా గతంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్రాజ్ పాల్గొని అర్జీలు స్వీకరించేవారు. దీంతో జిల్లాస్థాయి అధికారులంతా పాల్గొనేవారు. సోమవారం రేగోడ్ మండల కేంద్రంలో జరిగిన ప్రజావాణికి కలెక్టర్ హాజరయ్యారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు కనిపించక పోవడం గమనార్హం. రోడ్డు నిబంధనలు తప్పనిసరి మెదక్జోన్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు తప్పనిసరి ధరించాలని, అలాగే కార్లు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని ఎంవీఐ విజయలక్ష్మి సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభు త్వం ప్రవేశపెట్టే నిబంధనలు వాహనదారుల రక్షణ కోసమనే విషయాలు ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖా పరమైన చర్యలు తప్పవని హె చ్చరించారు. కార్యక్రమంలో ఇతర అధికారులు శ్రీలేఖ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యాసంగికి సరిపడా యూరియా: ఏడీఏ కౌడిపల్లి(నర్సాపూర్): యాసంగికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు అందోళన చెందవద్దని ఏడీఏ పుణ్యవతి అన్నారు. సోమవారం మండలంలోని మహమ్మద్నగర్ గేట్ వద్ద గల పీఏసీఎస్, కౌడిపల్లిలోని డీసీఎంఎస్ ఎరువుల దుకాణంలో యూరియా స్టాక్ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాసంగి పంటల అంచనా మేరకు ప్రభుత్వం యూరియా సరఫరా చేస్తుందన్నారు. రైతులు అనవసరంగా ఆందోళన చెందుతూ ముందుగానే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ–పాస్ మిషన్ ద్వారా యూరియా విక్రయించాలని డీలర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ స్వప్న, పీఏసీఎస్ సీఈఓ దుర్గాగౌడ్, రైతులు పాల్గొన్నారు. సమయపాలన పాటించాలి డీఎంహెచ్ఓ శ్రీరాం నర్సాపూర్: పీహెచ్సీలలో పని చేసే వైద్యులతో పాటు ఇతర సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్ఓ శ్రీరాం ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఏరియా ఆస్పత్రిలో నర్సాపూర్ వైద్యశాఖ సబ్ డివిజన్ పరిధిలోని రెడ్డిపల్లి, కౌడిపల్లి, శివ్వంపేట, రంగంపేట, కొల్చారం పీహెచ్సీల వైద్యులు, ఇతర సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అందరూ సమయపాలన పాటిస్తూ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. చలికాలం సీజన్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సృజన, డీఐఓ డాక్టర్ మాధురి, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు రఘువరన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ కార్యాలయం సందర్శన రామాయంపేట(మెదక్): మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎంపీపీ కార్యాలయంలో స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. ఈమేరకు ఆయన మున్సిపల్ కమిషనర్ దేవేందర్, తహసీల్దార్ రజనితో కలిసి ఎంపీపీ కార్యాలయాన్ని సందర్శించారు. కౌంటింగ్కు సంబంధించి నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఆయన వెంట టౌన్ ప్లానింగ్ అధికారి దేవరాజు, మున్సిపల్ మేనేజర్ రఘువరన్ ఇతర అధికారులు ఉన్నారు. -
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
ఇసుకంతైనాసంగాయిగుట్ట తండా వద్ద హల్దీ వాగులో ఇసుక తీస్తున్న ఇటాచీ (ఫైల్)భయమేదీ?హల్దీ నుంచి వందలాది టిప్పర్లతో ఇసుక తరలింపుమెదక్ అర్బన్: ‘హల్దీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను పట్టుకుంటే.. తెల్లారి తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. ఇది ఓ ప్రధాన శాఖకు చెందిన అధికారి ఆందోళన’ జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు కొలువు దీరినప్పటికీ.. ఓ ప్రధాన అధికారి రెక్కలు కట్టుకొని కలియ దిరుగుతున్నప్పటికీ.. అక్కడ ఇసుక దోపిడీ ఆగడం లేదు. కూత వేటు దూరంలో ఉన్న సంగాయిగుట్ట తండా వద్ద హల్దీ వాగు నుంచి రెండు నెలలుగా వందలాది టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పెద్దల అండతో సాగుతు న్న దోపిడీని ఆపేందుకు ఏ అధికారి సాహసించడం లేదన్న ఆరోపణలున్నాయి. అక్రమార్కులు ఇస్తున్న మామూళ్లు కూడా, వారిని నోరు మెదపకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్లతో పెరిగిన డిమాండ్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇసుక మాఫియా కన్ను హల్దీ వాగుపై పడింది. మెదక్ మండలం జానకంపల్లి సమీపంలోని సంగాయిగు ట్ట తండా వద్ద హల్దీ వాగులో రెండు నెలల క్రితం ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. మొదట మెదక్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంజూరైన అభివృద్ధి పనుల కోసం 1,000 టన్నుల ఇసుక అవసరమని, మున్సిపల్ కమిషనర్ మెదక్ ఎమ్మార్వోకు లేఖ రాశారు. అయితే ఆ టెండర్లకు అప్పటికే లీడ్ ఇచ్చినందున, ఇసుక తీయొద్దని రెవెన్యూ అధికారులు బదులిచ్చారు. అయినా ఈ అవకాశాన్ని సాకుగా మలుచుకొన్న ఇసుక మాఫియా గత రెండు నెలలుగా సంగాయిగుట్ట వద్ద నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తీయడం ప్రారంభించారు. వందల కొద్ది టిప్పర్లలో మెదక్, పాపన్నపేట, జహీరాబాద్, కొల్చారం, కౌడిపల్లి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్కు రూ. 20 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది కొనుగోలు చేస్తున్న దళారులు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర జిల్లాలకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. వారు ఆయా ప్రాంతాల్లో ఇసుక వ్యాపారులకు రూ. 1,300లకు టన్ను చొప్పున విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు రూ. కోట్లలో వ్యాపారం జరిగిందన్న ఆరోపణలున్నాయి. కాగా ఇటీవల బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సైతం ఆందోళన నిర్వహించి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒకటి, రెండు రోజుల ఇసుక రవాణా ఆగింది. తెల్లారి మళ్లీ మొదలైంది. ఈ విషయం రాష్ట్రస్థాయి అధికారుల వరకు వెళ్లడంతో ఆదివారం మైనింగ్ విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, పలు వాహనాలు సీజ్ చేశారు. ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు హె చ్చరించారు. -
ఇళ్లు నిర్మించకుంటే రద్దు చేస్తాం
హౌసింగ్ పీడీ మాణిక్యంకౌడిపల్లి(నర్సాపూర్): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే రద్దు చేస్తామని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. సోమవారం కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించి మాట్లాడారు. జిల్లాకు 9,209 ఇళ్లు మంజూరు కాగా, 57 పూర్తయ్యాయని తెలిపారు. 2,109 ఇళ్లు బేస్మెంట్ లెవల్, 1,042 రూప్ లెవల్, 1,432 స్లాబ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 2,922 మంది పనులు ప్రారంభించలేదన్నారు. జి ల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు ఇళ్లు ప్రారంభించని వారు లిస్టు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రద్దు అయిన వాటి స్థానంలో అర్హులైన కొత్తవారికి మంజూరు చేస్తామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో రూ. 90 కోట్లకు పైగా ఇందిరమ్మ ఇళ్లకు వివిధ దశలలో బిల్లులు చెల్లించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఈలు సుష్మ, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
పుర పోరు.. కసరత్తు జోరు
ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదలరిజర్వేషన్లపై ఉత్కంఠ..! తప్పుల తడకగా జాబితామున్సిపాలిటీల్లో ఇటీవల అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా, వాటిలో అనేక తప్పులు దొర్లాయని, వాటిని వెంటనే సరి చేసి ఫైనల్ ఓటర్ లిస్టును వార్డుల్లో ప్రదర్శించాలని బీఆర్ఎస్ నేతలు ఇటీవల మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే వార్డులో ఓటు హక్కు ఉండాల్సి ఉండగా, కొన్ని వార్డుల్లో ఒకే కుటుంబీకుల ఓట్లు రెండు, మూడు వార్డుల్లో ఉన్నాయని ఆరోపించారు. -
గ్రామాభివృద్ధికి కృషి చేయండి
మెదక్జోన్: నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నూతన సర్పంచ్ల సమక్షంలో జిల్లా సర్పంచ్ల ఫోరం కమిటీని ఎన్నుకున్నారు. అ ధ్యక్షుడిగా ఆవుల గోపాల్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్యాదవ్ నియామకపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో నమ్మకంతో ప్రజలు పదవులు కట్టబెట్టారని, ప్రభుత్వం మంజూరు చేసే సంక్షమ పథకాలు ప్రతి గడపకు చేరేలా కృషి చేయాలన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు ప్రతి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరా వు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసినిరెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గౌడ్, నాయకులు మహిపాల్రెడ్డి, సుప్రభాతరావు, రమేశ్రెడ్డి ,శ్రీనివాస్రెడ్డి ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు -
ఆర్వోబీ నిర్మాణానికి సహకరించాలి
ఆర్డీఓ జయచంద్రారెడ్డి చేగుంట(తూప్రాన్): రేల్వేగేటు వద్ద ఆర్వోబీ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు దారి మళ్లింపు కోసం ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు సహకరించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. సోమవారం వడియారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వడియారం శివారులోని అండర్ బ్రిడ్జి నుంచి మె దక్ రోడ్డు పోలీస్స్టేషన్ వరకు ద్విచక్ర వాహనాలు, ఆటోల రాకపోకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర భారీ వాహనాలకు నార్సింగి మీదుగా శంకరంపేటకు వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెద్ద పెద్ద కంటైనర్లు నర్సాపూర్ మీదుగా మెదక్ వైపునకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందరి సహకారం ఉంటేనే ఆర్వోబీ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం వడియారం శివారులోని అండర్ బ్రిడ్జిని అధికారులు పరిశీలించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ వెంకటరాజాగౌడ్, ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ వేణు, రైల్వే ఇంజినీర్లు సమీర్కుమార్, జగదీశ్బాబు, సర్పంచ్లు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
నేటి నుంచి పీఎంశ్రీ క్రీడలు
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలో మంగళవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు పీఎంశ్రీ క్రీడలు నిర్వహించనున్నట్లు డీఈఓ విజయ తెలిపారు. సోమవారం పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. క్రీడలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. పోటీల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, కేజీబీవీ, తెలంగాణ మోడల్ స్కూళ్ల నుంచి సుమారు 92 మంది వ్యాయామ ఉపాధ్యాయులను నియమించినట్లు చెప్పారు. జిల్లాలోని మొత్తం 29 పీఎం శ్రీ పాఠశాలల నుంచి ప్రతిరోజూ సుమారు 520 మంది బాల బాలికలు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. పోటీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. క్రీడాకారులకు భోజన వసతి కల్పించడంతో పాటు, గెలుపొందిన విజేతలకు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పీడీలు నాగరాజు, ప్రతాప్సింగ్, మాధవరెడ్డి, దాసరి మధు, రవి, అశోక్, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.డీఈఓ విజయ -
నేరుగా సంప్రదించాలి
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎస్పీ శ్రీనివాసరావు హాజరై ఫిర్యాదులు స్వీకరించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను, వివాదాలను, పోలీస్ సంబంధిత ఇబ్బందులను ఎస్పీకి నేరుగా వివరించారు. పరిష్కరించాలని వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా సంప్రదించాలని సూచించారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందిస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రజావాణి ద్వారా పరిష్కారమైన అనేక కేసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని తెలిపారు. మైనార్టీల ఆర్థికాభివృద్ధికి కృషి మెదక్కలెక్టరేట్: మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం రెండు కీలక పథకాలను ప్రారంభించిందని జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజొద్దీన్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేష న్ ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. అర్హులు ఈనెల 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. -
కరాటేతో ఆత్మస్థైర్యం పెంపు
మనోహరాబాద్(తూప్రాన్): కరాటేతో ఆత్మస్థైర్యం పెరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో సన్షైన్ షాటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్ రాష్ట్ర కరాటే పోటీలను నిర్వహించారు. కాగా పలు జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొని బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో కరాటే నేర్చుకోవాలని సూచించారు. అనంతరం పోటీలు నిర్వహించిన గ్రాండ్ మాస్టర్ మల్లేశ్, అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ను మైనంపల్లి హన్మంతరావు సన్మాని ంచారు. అనంతరం విజేలతకు సర్టిఫికెట్లతో పాటు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన గ్రాండ్ మాస్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో ఉల్లి నారు
నూతన కార్యవర్గం మెదక్ కలెక్టరేట్: జిల్లా జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగాయి. అధ్యక్షుడిగా ఖాజామొహినొద్దీన్, ప్రధాన కార్యదర్శిగా రమేశ్, ఉపాధ్యక్షులుగా సునీతా, రాజేశ్, కిరణ్కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా శ్యాంకుమార్, జాయింట్ సెక్రటరీగా భవాని, వినయ్కుమార్, వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సమీయొద్దీన్, రాజు, మహిళా ప్రతినిధిగా స్వాతి ఎన్నికయ్యారు. మెదక్ కలెక్టరేట్: అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన నవయుగ వైతాళికుడు లూయిస్ బ్రెయి లీ అని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక యూనియన్ జిల్లా కార్యదర్శి యశోద అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రెయిలీ లిపి అందుబాటులోనికి వచ్చాకే అంధులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. సమాజంలో ప్రతి సంవత్సరం 30 వేల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముత్యాలు, కార్యదర్శి యశోద, గౌరవ అధ్యక్షులు మల్లేశం, ఉపాధ్యక్షులు యాదగిరి, రాష్ట్ర మహిళా సభ్యులు కవిత, సహాయ కార్యదర్శి దుర్గ, శ్రీదేవి, వినోద్, దుర్గమ్మ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్రావు పటాన్చెరు టౌన్: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు విజన్ లేదని ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఐబీలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్రెడ్డితో కలసి ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా నదీ జలాల అంశంపై తె లంగాణకు ఎన్ని టీఎంసీల నీరు సరిపోతాయో అంగీకరించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పెట్టిన సంతకం తాలూకూ పత్రాలు ప్రజలముందు ఉంచామని చెప్పారు. తెలంగాణకు నష్టం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు దొందూ దొందేనని విమర్శించారు. -
కాంగ్రెస్లో కుమ్ములాటలు
చిచ్చురేపిన సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడి ఎంపిక● హన్మంతరావు వర్సెస్ రాజిరెడ్డి ● పోటాపోటీగా నియామకాలు కాంగ్రెస్ పార్టీలో చాపకింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి ఎంపిక విషయం మైనంపల్లి హన్మంతరావు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి మధ్య చిచ్చురేపింది. ఇరువురు చెరో వ్యక్తికి మద్దతు పలకగా, చివరకు రాజిరెడ్డి మద్దతుదారుడు కల్యాణ్కు రాష్ట ఫోరం అధ్యక్షుడు ఆశాదీప్ నియామకపత్రం అందజేశారు. – మెదక్జోన్ జిల్లాలో గత నెలలో పంచాయతీ ఎన్నికలు జరగగా, ఆయా మండలాల పరిధిలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుల నియామకాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి అవుల రాజిరెడ్డి మధ్య విభేదాలు తలె త్తాయి. మైనంపల్లి తన అనుచరుడు చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన ఆవుల గోపాల్రెడ్డిని ఎంపిక చేసేందుకు సర్వం సిద్ధం చేశాడు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సమావేశం ఏర్పాటు చేసి గోపాల్రెడ్డి పేరును ప్రకటించాలని నిర్ణయించాడు. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారని తెలిసింది. ఈ క్రమంలోనే ఆవుల రాజిరెడ్డి ఆదివారం జిల్లాలోని సుమారు 15 మందికి పైగా సర్పంచ్లతో మాసాయిపేట మండలం హకింపేటలోని ఓ రిసార్టులో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్రెడ్డి, సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యాయి. జిల్లావ్యాప్తంగా 21 మండలాలు ఉండగా, 15 మండలాల ఫోరం అధ్యక్షుల మద్దతు కూడగట్టి ఫోరం రాష్ట్ర అధ్యక్షుడి చేతుల మీదుగా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి (పీటీ) సర్పంచ్ మన్నె కల్యాణ్కు సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా అధికారంగా నియామకపత్రం అందించారు.పంతం నెగ్గించుకున్న రాజిరెడ్డిఅక్టోబర్లో జరిగిన డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి జ్యోతిరౌతేలా, పీసీసీ నుంచి ఎన్నికల పరిశీలకులు జగదీశ్వరరావు, నాసిక్ మహ్మద్, వరలక్ష్మి మెదక్ వచ్చారు. కాగా అధ్యక్ష పీఠం కోసం ఆవుల రాజిరెడ్డి, అదే నియోజకవర్గానికి చెందిన అంజనేయులుగౌడ్, రాంచందర్గౌడ్ పోటీపడగా రాజిరెడ్డి, అంజనేయులుగౌడ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా అంజనేయులుగౌడ్ అప్పటికే డీసీసీగా కొనసాగాడని, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని రాజిరెడ్డి గట్టిగా పట్టుబట్టినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో మైనంపల్లి హన్మంతరావుకు సన్నిహితంగా ఉండే అంజనేయులుగౌడ్కే రెండోసారి డీసీసీ పీఠం దక్కింది. దీంతో రాజిరెడ్డి, హన్మంతరావుల మధ్య దూరం పెరిగింది. అప్పటి నుంచి రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలోనే జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా తన వర్గానికి చెందిన కల్యాణ్ను ఎంపిక చేసి రాజిరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. -
కలిసికట్టుగా ముందుకెళ్దాం
సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్రెడ్డి వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్రంలో సర్పంచ్లు ఎదుర్కొనే సమస్యలపై పార్టీలకతీతంగా పోరాటం చేసి కలిసికట్టుగా పరిష్కరించుకుందామని సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్రెడ్డి అన్నారు. ఆదివారం మాసాయిపేట మండలం హకింపేట శివారులోని ఓ రిసార్ట్లో జిల్లా కార్యవర్గాన్ని ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్నయాదవ్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రాజిరెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి పీటీ సర్పంచ్ కల్యాణ్ను జిల్లా అధ్యక్షుడిగా, మాసాయిపేట స ర్పంచ్ కిష్టారెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్గా, మంగళపర్తి సర్పంచ్ సంధ్యను ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎన్నిక పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆశాదీప్రెడ్డి మాట్లాడుతూ.. రెండున్నర ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో సర్పంచ్లుగా ఎన్నికై న వారిపై బరువు, బాధ్యతలు పెరిగాయన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన ప్రత్యేక నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులను గ్రామాల అభివృద్ధికి సక్రమంగా వినియోగించుకుంటామన్నారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ముఖ్య సలహాదారులు వీరభద్ర ఆచార్య, పాండుగౌడ్తో పాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య
కలెక్టర్ రాహుల్రాజ్రామాయంపేట(మెదక్)/చిన్నశంకరంపేట: ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వి ద్య అందుతుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని ప్రగతి ధర్మారంలో బీసీ హాస్టల్ను సందర్శించి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నారని తెలిపారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరుపేదలకు సరైన వైద్యసేవలు అందేవిధంగా కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆస్పత్రుల తనిఖీ చేపట్టామన్నారు. కలెక్టరేట్ నుంచే సీసీ కెమెరాల ద్వారా అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.అనంతరం నార్సింగి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ విద్యార్థులు 65 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు క ష్టపడి చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.


