జహీరాబాద్: గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో మంగళవారం ప్రారంభమైన ఎమ్మెల్యేల వర్క్షాప్కు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, ఎమ్మెల్యేలు కె.మాణిక్రావు, చింతా ప్రభాకర్ వర్క్షాప్లో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయడంతోపాటు సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, నియమ నిబంధనలు, రాజ్యాంగం అంశాలపై అవగాహన కల్పించేందుకు వర్క్షాప్ ఏర్పాటు చేశారు.


