ఎక్స్ప్రెస్ బస్టాండ్ ఏర్పాటు చేయండి
మనోహరాబాద్(తూప్రాన్): మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ బస్సులు ఆపడంతో పాటు బ స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతూ మండల ప్రజాప్రతినిధులు సోమవారం మంత్రి పొ న్నం ప్రభాకర్ను కలిసి విన్నవించారు. ఈమేరకు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో చీర్ల భాస్కర్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి తదితరులు ఉన్నారు.
నూనె గింజలు.. ఎంతో మేలు
టేక్మాల్(మెదక్): రైతులు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నూనె గింజల పంటలు పండించడంతో నాణ్యమైన ఆహారం పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండలంలోని కుసంగి రైతు వేదికలో వ్యవసాయాధికారి రాం ప్రసాద్ అధ్యక్షతన నూనెగింజల సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.


