చిన్నశంకరంపేటలోని మూడవ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్గా అవతారమెత్తారు. ఉదయం రాగనే టీచర్ను ఎలా విష్ చేస్తారు.. ఇప్పుడు ఎలా విష్ చేయాలని అడిగి చిన్నారులతో జవాబు రాబట్టారు. టేబుల్పై ఏర్పాటు చేసిన వస్తువులను చూపిస్తూ వాటి పేర్లను అడిగారు. ఉదయం గుడ్డు తిన్నారా అని ఆరా తీశారు. ఈ రోజు ఏం కూర వండారని అడిగి తెలుసుకున్నారు. బీఎల్ఓగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ నాగరాణికి ఎస్ఐఆర్పై పలు సూచనలు చేశారు. ఆమె వెంట తహసీల్దార్ మాలతి, ఆర్ఐలు రాజు, వినయ్ ఉన్నారు.


