కొడుపాక ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

కొడుపాక ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రతిభ

Mar 9 2026 9:26 AM | Updated on Mar 9 2026 9:26 AM

గజ్వేల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించిందని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం రాత్రి గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో నిర్వహించిన రంజాన్‌ ఇఫ్తార్‌ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీలకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందన్నారు. పవిత్ర రంజాన్‌ మాసంలో వారికి శుభాలు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

పాపన్నపేట(మెదక్‌): మండలంలోని కొ డుపాక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని అప్షా కలాం వరల్డ్‌ రికార్డ్స్‌– 2026 అవార్డు అందుకుంది. ఆవర్తన పట్టికలోని 118 మూలకాలను బ్లాక్‌ వైజ్‌, గ్రూప్‌ వైజ్‌లతో కేవలం 32 సెకన్లలో చెప్పడంతో ఈ రికార్డు సాధించింది. ఆదివారం చైన్నెలోని శివానంద మెమోరియల్‌ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు. భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటరమణ మార్గదర్శకత్వం వహించారు. ఈసందర్భంగా విద్యార్థినిని డీఈఓ విజయ, డీఎస్‌ఓ రాజిరెడ్డి, ఎంఈఓ ప్రతాప రెడ్డి, ఉపాధ్యాయులు ప్రశంసించారు.

కేసీఆర్‌ హయాంలోనే

గ్రామాలకు మహర్దశ

చిన్నకోడూరు(సిద్దిపేట): మహాత్ముని స్ఫూర్తితో మాజీ సీఎం కేసీఆర్‌ హయాంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చౌడారంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గాంధీ గారి బాటలోనే కేసీఆర్‌, తెలంగాణ సమాజం స్వరాష్ట్రం కోసం శాంతియుత పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామన్నారు. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం స్ఫూర్తితో పల్లెల అభివృద్ధికి కేసీఆర్‌ పాటుపడ్డారన్నారు. 60 ఏళ్లలో చేయని అభివృద్ధి కేసీఆర్‌ చేసి గ్రామాల స్వరూపాలను మార్చారన్నారు. కేసీఆర్‌ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వాసుదేవాచారి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమం

పట్టని కాంగ్రెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement