పట్టణ ప్రజలు సేద తీరేలా..
రెండు మున్సిపాలిటీలకు సంబంధించి ప్రజలతో పాటు రహదారి వెంట వెళ్తున్న ప్రజలు సేద తీరడానికి వీలుగా కేంద్రం నిదులతో అర్బన్ పార్క్ నిర్మిస్తున్నాం. ఈమేరకు రూ. రెండు కోట్లు మంజూరయ్యాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న జంతువుల మనుగడ, వాటి జీవన విధానంపై సందర్శకులకు అవగాహన కల్పిస్తాం. పనులు కొనసాగుతున్నాయి. వచ్చే నాలుగైదు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.
– విద్యాసాగర్,
రామాయంపేట రేంజ్ అధికారి


