మున్సిపల్ ఫలితాలు గుడ్డిలో మెల్ల
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే గీటురాయి: తలసాని
సిద్దిపేటజోన్: రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదు.. అవి వస్తుపోతుంటాయి. ప్రజలే శాశ్వతం. ప్రజలకు చేసిన మంచి పనులు గీటురాయిగా గు ర్తించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్గా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫలితాలు గుడ్డిలో మెల్లగా అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ప్రచారం చేయడం విడ్డురంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని అధికారం నడిపిస్తోందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు, మద్యం, ఏరులై పారిందన్నారు.


