జన జాతరకు రెడీ
విద్యుత్ దీపాల వెలుగుల్లో ఏడుపాయల
మూడు రోజుల వైభవం
ఏడుపాయల జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుంది. మొదటి రోజు ఆదివారం భక్తులు శివదీక్షలు చేపట్టి దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం స్థానిక ఈశ్వరాలయంలో దీక్షలు విరమించి, రాత్రంతా శివరాత్రి జాగరణ చేస్తారు. రెండో రోజు సోమవారం బండ్లు తిరిగే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మూడో రోజు మంగళవారం సాయంత్రం రథోత్సవం కనుల పండువగా జరుగుతుంది. ఈమేరకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాతి గుహలో వెలసిన అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
నేటి నుంచి ప్రారంభం
ముస్తాబైన ఏడుపాయల
దుర్గమ్మకు పట్టువస్త్రాలు
సమర్పించనున్న ఎమ్మెల్యే రోహిత్
విధుల్లో 3 వేల మంది ఉద్యోగులు
జన జాతరకు రెడీ


