పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీమ్ను ఏర్పా టు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఈ కమిటీల కంటే అడ్వయిజరీ కమిటీలు వేస్తే బాగుండేది. కమిటీలో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను తీసుకుంటే బాగుండేది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులే లేని పరిస్థితి. అలాంటి పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సక్రమంగా లేవు. అలాంటి వాటిలో ఇన్స్పెక్షన్ పేరున పాఠశాలలకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తే బాగుండేది. కానీ కొందరు తోటి ఉపాధ్యాయులను తక్కువ చేసే విధంగా ఇది బాగలేదు అది బాగలేదంటూ చెప్పడం బాధ కలిగిస్తుంది.
– నామిరెడ్డి మహేందర్రెడ్డి, పీఆర్టీయూ, తిప్పర్తి మండల శాఖ అధ్యక్షుడు


