యూత్‌ రిసోర్స్‌ కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

యూత్‌ రిసోర్స్‌ కేంద్రం ప్రారంభం

Feb 15 2026 6:50 AM | Updated on Feb 15 2026 6:50 AM

యూత్‌ రిసోర్స్‌ కేంద్రం ప్రారంభం

యూత్‌ రిసోర్స్‌ కేంద్రం ప్రారంభం

రాయగడ: విద్యావంతులైన యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ మేరకు జేకేపూర్‌లోని జేకే పేపర్‌ మిల్‌కు చెందిన స్పర్స్‌, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా శనివారం యూత్‌ రిసోర్స్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ అశుతోస్‌ కులకర్ణి హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యావంతులైన యువతులకు ఈ కేంద్రంలో ఉచితంగా ఎస్‌ఎస్‌సీ, రైల్వే, ఓఎస్‌ఎస్‌సీ, పోలీస్‌, బ్యాంకింగ్‌ వంటి రంగాల్లో పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ కల్పిస్తుందన్నారు. తొమ్మిది నెలల పాటుగా కొనసాగే ఈ శిక్షణలో భాగంగా గణితం, జనరల్‌ నాలెడ్జి, ఇంగ్లిష్‌, ఒడియా గ్రామర్‌, కంప్యూటర్‌ విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ కల్పించడం జరుగుతుందని వివరించారు. రాబోయే రోజుల్లో గ్రామీణ, పట్టణ పిల్లల మధ్య అవకాశాల అంతర్యాన్ని తగ్గించడంలో ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో జేకే పేపర్‌ మిల్‌ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు బిశ్వజీత్‌ ద్వివేది, మేనేజర్‌ ఆదిత్యా పట్నాయక్‌, మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అర్చనా పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యువతులకు శిక్షణకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement