Odisha News
-
జనాల్లోకి కమ్యూనిస్టు నాయకులు
జయపురం: కొరాపుట్ జిల్లా గ్రామాల్లో నెలకున్న సమస్యలను తెలుసుకోవానికి జనాల్లోకి వెళ్లాలని సీపీఐ నాయకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలసి సమస్యలపై చర్చించాలని, మే నెలలో గ్రామ పంచాయతీల్లో ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపట్టాలని కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ పరిషత్ సమావేశం నిర్ణయించింది. స్థానిక కార్మిక భవన్లో బుధవారం పార్టీ నేత కామ్రెడ్ కుమార్ జాని అధ్యక్షతన సమావేశం జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శి రామకృష్ణ దాస్ మూడు నెలల పార్టీ కార్యక్రమాల నివేదికను సభికులకు వివరించారు. అనంతరం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు కామ్రెడ్ ప్రమోద్ కుమార్ మహంతి ఇటీవల జరిగిన రాష్ట్ర పార్టీ పరిషత్ తీసుకున్న నిర్ణయాలను సభికులకు వివరించారు. ప్రతి ఏడాదిలాగనే ఈ సంవత్సరం కూడా సభ్యత్వ సేకరణ జాబితాను వెంటనే రాష్ట్ర కమిటీకి సమర్పించాలని, ఏప్రిల్ ఐదో తేదీన జరగనున్న అఖిల భారత దళిత హక్కుల రాష్ట్రస్థాయి సమావేశంలో కొరాపుట్ జిల్లా నుంచి ప్రతినిధులను పంపే విషయాన్ని వివరించారు. పార్టీ నాయకులు ఏప్రిల్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సహాయ, సంక్షేమ పథకాలు వారికి చేరుతున్నవీ లేనివీ తెలుసుకొని జాబితాను తయారు చేయాలని పార్టీ పిలుపునిచ్చిందని వెల్లడించారు. పార్టీ నేతలు గ్రామీణ ప్రజల నుంచి సేకరించిన సమస్యలపై మే నెలలో గ్రామ పంచాయతీ స్థాయిలలోఆందోళనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్టు పేర్కొన్నారు. సమావేశం ప్రారంభంలో వందేళ్ల శతాయుస్మాన్ కమ్యూనిస్టు పార్టీ నేత నల్లకన్ను సోమనాథ్ పాత్రో, అలాగే అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ దాడులలో ఇరాన్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ అగ్రనేత అయితొల్లా ఆలీ ఖామెనెయి, మరణించిన వారికి , కటక్ భంజీ మెడికల్ కళాశాల ఐసీయూలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయంత దాస్, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కమ్యూనిస్టు పార్టీ పాత్రపై వివరించారు. సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి కామ్రెడ్ ఝుధిస్టర్ రౌళో, సహాయ కార్యదర్శులు బురుదా బొడనాయిక్, కురమ్నాత్ భొత్రో, పూర్ణ చంద్రసువార్, నంద హరిజన్, రూపధర్ పూజారి ఉన్నారు. -
అండర్–17 క్రికెట్ టోర్నీ ప్రారంభం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంని దండకారణ్య క్రీడా మైదానం అండన్–17 గ్రీష్మకాల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. జిల్లాలోని ప్రతి సమితి నుంచి క్రీడాకారులను పిలిచి ఎంపిక పోటీలు నిర్వహించారు. వారిలో మల్కన్గిరి, కలిమెల, పోడియా నుంచి ఎక్కువ మంది ప్రతిభ కనబర్చారు. వారిలో కొంతమందిని జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఐదు జట్లుగా విభజించి టోర్నమెంట్ను అధికారికంగా ప్రారంభించారు. టోర్నమెంట్ 11 రోజులు జరుగుతాయి. ఏప్రిల్ ఐదో తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి ఫారుక్, కార్యదర్శి హృదానంద సాహు, భారత్ క్రికెట్ మాజీ మేనేజర్ సత్వీర్ సింగ్, కోచ్ విశాల్ మాలాకర్ పాల్గొన్నారు. -
షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ నోటీఫైడ్ ఏరియ కౌన్సిల్ (ఎన్ఏసీ) పరిధి హాట్పొదర్లో కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను కొట్పాడ్ శాసనసభు్యు రూపు భొత్ర బుధవారం ప్రారంభించారు. రూ. 30 లక్షల వ్యయంతో వీటిని నిర్మించారు. ఈ సందర్భంగా రూపు భొత్ర మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇటువంటి స్టాల్స్ నిర్మించి నిరుద్య్గో యువతకు సమకూర్చుతే వ్యాపారాలు చేసుకొని స్వయం ఉపాధి పొందగలరన్నారు. కొట్పాడ్ నోటిఫైడ్ ఏరియా పరిధిలోని ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాలని కొట్పాడ్ ఎన్ఏసీ కార్యనిర్వాహక అధికారి కమలేసు మహంతి ఎమ్మెల్యేను కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. కొట్పాడ్ ఎన్ఏసీ సర్వాంగ ఉన్నతికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కొట్పాడ్ ఎన్ఏసీని మున్సిపాలిటీగా ప్రకటించాలని తాను ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్ఏసీ చైర్మన్ ఎం.శంకరరావు, వైస్చైర్మన్ ఎం.సంతోషీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో జస్టిస్ శేఖర్
శ్రీకాకుళం కల్చరల్: ప్రత్యక్షదైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని బుధవారం ఉదయం హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, కార్యనిర్వహణాధికారి కేఎన్వీడీవీ ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కూర్మనాథుని సన్నిధిలో... గార: విష్ణుక్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథున్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి టీసీడీ శేఖర్ బుధవారం దర్శించుకున్నారు. మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర మహాత్యాన్ని ఆలయ ప్రధానార్చకులు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు తెలియజేశారు. ఆయనతో పాటు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, ఆలయ ఈవో టి.వాసుదేవరావు, తహసీల్దార్ ఎం.చక్రవర్తి తదితరులు ఉన్నారు. -
ఈదురుగాలులకు దెబ్బతిన్న రేకిల్లు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి 90 గ్రామంలో బుధవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు సురేంద్ర హరిజన్ ఇంటి పైకప్పు (రేకులు) పూర్తిగా ఎగిరిపోయాయి. ఆ సమయంలో అందరూ ఇంటిలోనే ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సురేంద్రకు కొద్ది నెలల క్రితం జరగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. శస్త్రచికిత్స చేయడంతో సరిగా నడవలేసి స్థితి. కూలి పనులు వెళ్లలేక ఇట్టి వద్దే ఉంటున్నారు. ఇటువంటి కష్ట సమయంలో ఇల్లును కూడా కోల్పాయ్యారు. వీరికి ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రోడ్డున పడిన టమాటా
● పెరిగిన దిగుబడి.. తగ్గిన అమ్మకాలు ● చెల్లని టమాటాను సాయంత్రం పూట పారబోస్తున్న వ్యాపారులు శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో పలుచోట్ల టమాటాలను వ్యాపారులు రోడ్డుపైనే పారబోశారు. కొన్ని రోజులుగా టమాటా ధర భారీగా పతనమైంది. హోల్సేల్లో 25 కిలోల ట్రే రూ.80 నుంచి రూ. 100కు విక్రయిస్తున్నారు. రిటైల్ మూడు కేజీలు రూ.20 చొప్పున అమ్ముతున్నారు. రోజురోజుకు దిగుబడి పెరుగుతుండగా, అమ్మకాలు తగ్గుతుండడంతో వ్యాపారులు చెల్లని టమాటాలను సాయంత్రంపూట రోడ్లపై పడేసి వెళుతుండగా వాటిని పశువులు తింటున్నాయి. ఐదు నెలల క్రితం 25 కేజీల టమాటా ట్రే రూ.1600 వరకు ధర పలికింది. ఆ సీజన్లో జిల్లాలో పంట ఉండ దు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు కూడా ఇతర ప్రాంతా ల నుంచి దిగుమతి అవుతున్నప్పటికీ జిల్లాలోనే పంట ఉండడంతో ఇవన్నీ అమ్మకాలు కాక రోడ్లపై పడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
జగన్నాథుని ఆభరణాల జాబితా తయారీ
భువనేశ్వర్: దీర్ఘ కాలం తర్వాత పూరీ శ్రీజగన్నాథుని వజ్ర, రత్న, వైడూర్య, బంగారు ఆభరణాల లెక్కింపు అనుబంధ జాబితా తయారీ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ముందస్తు నిర్ధారిత సుముహూర్త ఘడియల ప్రకారం ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభించారు. 48 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. స్వామి రత్న భాండాగారంలోని ఆభరణాల జాబితా తయారీ పురస్కరించుకుని శ్రీమందిరం లోపల ప్రత్యేక నిపుణుల బృందం ఆలయం లోనికి ప్రవేశించింది. జాబితా తయారీ కోసం శ్రీమందిరం పాలక మండలి ప్రతిపాదించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్ఓపీ) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది. దీని ప్రకారం ఈ ప్రక్రియ ఆరంభించారు. నిరంతరాయంగా దర్శనం.. అమూల్యమైన రత్న సంపద లెక్కింపు, జాబితా రూపకల్పన సందర్భంగా సాధారణ భక్తులకు నిరంతరాయ సర్వదర్శనం సౌకర్యానికి ప్రాధాన్యత కల్పించారు. మరోవైపు రత్న వేదికపై కొలువుదీరిన మూల విరాట్లు, ఇతర మూర్తుల దైనందిన నిత్య సేవాదులు, పూజల్లో ఎటువంటి అంతరాయం చోటు చేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించారు. జాబితా తయారీ ఇలా.... రత్న భాండాగారంలోని ఆభరణాల జాబితా అనంతరం ఆభరణాలను 1978 నాటి జాబితాతో సరిపోల్చి చూస్తారు. సరిపోల్చిన వివరాలతో వాటిని తూకం వేస్తారు. ఆభరణాలను గుర్తించడానికి ఇద్దరు రత్న శాస్త్రవేత్తలను నియమించారు. డిజిటల్ ఫొటోగ్రఫీ ఆభరణాల జాబితాకు ప్రత్యేక హంగుగా జోడిస్తారు. ఆభరణాలు గుర్తించి, లెక్కించి, తూకం వేసిన తర్వాత వస్తువులను 2, 3 పొరలలో చుట్టి ఒక పెట్టెలో భద్రంగా ఉంచుతారు. ఈ ప్రక్రియలో పసుపు, తెలుపు, ఎరుపు రంగు వస్త్రాల్ని వినియోగిస్తారు. 6 పెట్టెల్లో అమూల్య ఆభరణాలను పదిలపరుస్తారు. బంగారు ఆభరణాలను పసుపు రంగు వస్త్రంపై ఉంచి వరుస క్రమంలో పెట్టెలో పేర్చుతారు. వెండి ఆభరణాలను తెల్ల వస్త్రం చుట్టి భద్రపరుస్తారు. ఇతర ఆభరణాలను భద్రపరిచేందుకు ఎరుపు రంగు వస్త్రం వినియోగిస్తారు. ఈ లెక్కింపులో దేవాలయ ఆభరణాల ప్రముఖులు, ప్రభుత్వ బ్యాంకు ఆభరణాల నిపుణులు, రత్న శాస్త్రవేత్తలు, భారత రిజర్వు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. ఈ ముఖ్యమైన ప్రక్రియను నిర్వహించడంలో సేవకులు, అధికారులు , భక్తులు ఇలా అన్ని వర్గాల సహకారాన్ని శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టర్ అరవింద్ కుమార్ పాడీ కోరారు. భక్తుల ప్రవేశం యథాతథం.. రత్న భాండాగారం లెక్కింపు జరుగుతున్నప్పటికీ దేవుళ్ల పూజాదికాలు యథాతథంగా కొనసాగుతాయి. ఈ కార్యకలాపాలతో ముడిపడిన అధీకృత సేవకులకు జగమోహన్, గర్భ గృహంలోనికి ప్రవేశించేందుకు అనుమతించారు. భద్రతా కారణాల దృష్ట్యా లోపలి గడప నుంచి భక్తులకు సర్వ దర్శనం నివారించి, వెలుపలి వాకిలి నుంచి రత్న వేదికపై మూల విరాట్ల దర్శనాన్ని పరిమితం చేశారు. -
ట్రాఫిక్ నియమాలపై అవగాహన
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్–3 ఆధ్వర్యంలో ఎచ్చెర్లలో జరుగుతున్న ప్రత్యేక శిబిరంలో భాగంగా బుధవారం ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జి.లక్ష్మణరావు మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించడం, లైసెన్స్ కలిగి ఉండటం వంటి ట్రాఫిక్ నియమాలను ప్రతీ ఒక్కరూ పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్–3 పీవో డా.ఎం.సుబ్బారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈనెల 29వ తేదీ వరకు శిబిరం కొనసాగనుంది. ఆర్థిక సాయం అందజేత శ్రీకాకుళం: జిల్లాలోని పంచాయతీ రాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగులు ఇటీవల మృతి చెందిన డీపీవో కార్యాలయ ఉద్యోగి కిషోర్ కుమార్ కుటుంబానికి తమ వంతు సాయం అందించారు. వీరంతా రూ.1,77,000ల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సత్యనారాయణ, సంఘం అధ్యక్షుడు కిల్లారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. దళితులపై దాడులు పెరిగాయి గార: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీసెల్ విభాగం అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి అన్నారు. బుధవారం గారలో ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రికి చెందిన టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు దళిత మహిళపై హేయమైన మాటలు ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా దళితులకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. శాలిహుండంలో దళితులు 15 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను లాక్కోవడానికి ప్రయత్నం జరుగుతోందని, ప్రభుత్వం పునరాలోచించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హుండీ ఆదాయం లెక్కింపు గార: ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథాలయ హుండీలను బుధవారం లెక్కించగా రూ.19,76,584లు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో టి.వాసుదేవరావు తెలిపారు. ఆలయంలోని హుండీలతో పాటు సమీప పాతాళ సిద్ధేశ్వేర ఆలయ హుండీలను లెక్కించారు. 98 రోజులకు ఈ ఆదాయం వచ్చిందని పర్యవేక్షణాధికారి టి.గురునాథం తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరం శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని నైరా, బట్టేరు గ్రామాల్లో మెడికవర్ ఆస్పత్రి సౌజన్యంతో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు దంత, గుండె, పల్మనరీ, ఈసీజీ, గైనిక్ వంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందజేశారు. కార్యక్రమంలో నైరా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.జి.జోగినాయుడు, సర్పంచ్ అరవల రామ్ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. 29న చెస్ పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి అండర్–9 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు ఈనెల 29వ తేదీన జరగనున్నాయని చెస్ ఇన్ స్కూల్ కమిటీ సభ్యుడు సనపల భీమారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం బలగ నుంచి రాగోలుకు వచ్చే కొత్తరోడ్ జంక్షన్ సమీపంలోని కశ్యప్ నర్సింగ్ కళాశాలలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఇక్కడ విజేతలుగా నిలిచినవారు త్వరలో జరగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. ఎంపికల్లో పాల్గొనే బాలబాలికలు 2017 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ఈనెల 28వ తేదీలోగా క్రీడాకారులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 99125 59735 నంబర్ను సంప్రదించాలన్నారు. ఆలయ ప్రతిష్ట రణస్థలం: మండలంలోని కోష్ట పంచాయతీ పరిధి పైడిపేట గ్రామంలో రామాలయ ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్ని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
● బంద్ ప్రశాంతం
మల్కన్గిరి: జిల్లాలో అన్ని మండీలలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు జరగకపోవడాన్ని నిరసిస్తూ, గ్యాస్, పెట్రోల్ సకాలంలో సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మల్కన్గిరి జిల్లా కాంగ్రీస్ కమిటీ బుధవారం జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. కలిమెల సమితిలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు గోవింద పాత్రో, కలిమెల సమితి కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ మిసీ్త్ర నాయకత్వంలో సీనియర్ కాంగ్రేస్ నాయకులు మాలా మాడీ, ల్యాంప్ అధ్యక్షుడు బుద్రా కబాసి తదితరులు జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిని దిగ్బంధించారు. పలు దుకాణాలు మూసివేయించారు. సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి నిరసనకారుల వద్దకు వచ్చి ఈ నెల 30లోగా మండీలో ధాన్యం కొనుగోలు చేస్తామని హమీ ఇచ్చారు. -
ఘనంగా పాఠశాల వార్షికోత్సవం
జయపురం: నేటి బాలల నవ్వులే బావి భారత రత్నాలని పలువురు వక్తలు అన్నారు. స్థానిక పాయిక సాహిలో ఉన్న సరస్వతీ బాల మందిర ప్రాంగణంలో ఆ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు హరిహర కరసుధా పట్నాయక్ ముఖ్య అతిథిగా, జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ విభాగ అధికారి చందన కుమార్ నాయక్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. నేటి చిన్నారులకు క్రమశిక్షణతో కూడిన గుణాత్మక విద్య అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. సిఆర్సిసి రుద్ర ప్రసన్న పాణిగ్రహి, రామేశ్వర పండా, విజయలక్ష్మీ స్వైన్ ప్రసంగించారు. విజ్ఞాన ప్రదర్శనలు, మహానుబావుల చిత్రపటాలు, వివిధ రకాల పువ్వులు, ఔషధ మొక్కలు, ఆహార పదార్థాలు, ఆయుధాలు, వివిధ రకాల ధాన్యాలు, కొలతల పరికరాలు, హస్తకళల పరికరాలను ప్రదర్శించారు. బాలబాలికలకు పాటలు, నృత్యం, కథలు, కవితలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు, జయపురం ప్రముఖులు ఎం.డి షరీఫ్, పద్మ చరణ్, పద్మిణీ పాడీ, సుస్మితా మహంతి, ఉదయ శంకర జానీ, గోపాల్ సామంతరాయ్, రామనాథ్ త్రిపాఠీ, కిశోర్ త్రిపాఠీ, రాధామోహన్ పండా, ధిరెన్ మోహన్ పట్నాయక్, సుధాకర పట్నాయక్, పాఠశాల కార్యదర్శి అనూప్ కుమార్ సామంతరాయ్, కార్యదర్శి నిరంజన్ పాణిగ్రహి, పాఠశాల డైరెక్టర్ రితాలీ సాహు పాల్గొన్నారు. -
కారు బోల్తాపడి ఇద్దరికి గాయాలు
రాయగడ: సదరు సమితి తొలొగుమ్మ ఘాటీ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న సైకిల్ను తప్పించబోయి అదుపుతప్పిన కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవ్వగా వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. సమాచారం తెలుసుకున్న కుంభొకోట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం .. కొరాపుట్ జిల్లా జయపురం నుంచి సుమన్ సస్మాల్, మీనతీ సాహు, సునీతసాహు, అలిస్కా సాహులు అస్కా వెళ్లేందుకు కారులో బయలు దేరారు. ఈ క్రమంలో తొలొగుమ్మ ఘాటి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఒక సైకిల్ను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమన్ సస్మాల్, మీనతి సాహులకు తీవ్రగాయాలయ్యాయి. సునీత సాహు, అలిస్కా సాహులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. బోల్తా పడిన కారులో ఇరుక్కుపోయిన సుమన్, మీనతీసాహులను బయటకు తీయడానికి క్రేన్ సహాయం అవసరమయ్యింది. మీనతి కుడి చేతికి చెందిన రెండువేలు తెగిపొగా సుమన్కు తలపై బలమైన గాయాలయ్యాయి. అస్కా వెళ్లేందుకు జయపురం నుంచిబయలు దేరినవీరు రాయగడ జిల్లాలో ప్రమాదానికి గురకావడంతో స్థానికంగా వారి బంధువులకు సమాచారం అందించడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
ప్రతిపక్షాల నిరసన
భువనేశ్వర్: శాసనసభ వద్ద బుధవారం ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనపై విపక్ష బిజూ జనతా దళ్, కాంగ్రెసు సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో సభా ప్రాంగణం మారుమోగింది. ఈ నేపథ్యంలో విపక్ష సభ్యులు నల్లని దుస్తులు ధరించి నిరసన ప్రదర్శనలో పాలుపంచుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నిరసన ప్రదర్శన, తీవ్ర నినాదాలతో సభాకార్యకలాపాలు ప్రభావితం అయ్యాయి. విపక్ష సభ్యులు నల్ల టీ షర్టులు ధరించి సభలోకి ప్రవేశించారు. కటక్ ఎస్ిసీబీ వైద్య బోధన ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనపై ప్రతిపక్షాలు వినూత్న రీతిలో చేపట్టిన నిరసన అధికార పక్షానికి ఇబ్బంది కలిగించింది. బలహీన ముఖ్యమంత్రి – బలమైన ఆరోగ్య శాఖ మంత్రి నినాదంతో రాసి ఉన్న టీ షర్టులు ధరించి ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని మేలుకొలిపేందుకు నల్ల టీ షర్టులు ధరించి నిరసన తెలుపుతున్నామని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విపక్ష బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే బ్యోమకేష్ రాయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి ఆరోగ్య శాఖ మంత్రి అంటే భయమని ఎమ్మెల్యే రాజన్ ఎక్కా ఎద్దేవా చేశారు. 13 మంది ప్రాణాలు బలిగొన్న కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి అగ్రి ప్రమాదం సంఘటనపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
సభలో శ్వేత పత్రం సమర్పణ
భువనేశ్వర్: రాష్ట్ర హోం శాఖ బుధవారం శాసన సభలో శ్వేత పత్రం ప్రవేశపెట్టింది. 2025లో రాష్ట్రంలోని నేరాల పరిస్థితిపై ఈ శ్వేతపత్రాన్ని ప్రచురించారు. 2024తో పోలిస్తే 2025లో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తేలింది. 2025లో రాష్ట్రంలోని నేరాల పరిస్థితిని ఈ శ్వేత పత్రం ప్రతిబింబించింది. 2025లో 2,29,881 నేరాలు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా 1,55,223 కేసులు క్రిమినల్ అభియోగాల కింద దాఖలయ్యాయి. వీటిలో 2,994 అత్యాచార కేసులు ఉన్నాయి. నమోదైన 1,304 హత్య కేసులలో 1,218 కేసులు రుజువయ్యాయి. ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపాటు.. సభలో ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం రాష్ట్రంలో కుప్పకూలిన శాంతిభద్రతల వ్యవస్థని బట్టబయలు చేసిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. ప్రభుత్వం వెల్లడించిన శ్వేత పత్రం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నేరాలు పెరిగాయని స్పష్టం అవుతుందని ఆరోపించారు. నేరాలు పెరగడంతో నిరుద్యోగం పెరిగిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చట్టం అమలు, కార్యాచరణ నిర్వీర్యం అయిందని కాంగ్రెసు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
వైభవంగా పాయికా మహోత్సవ్–2026
భువనేశ్వర్: ఒడిశా నదుల ఆధ్యాత్మికత ఆధారంగా సాంస్కృతిక చైతన్య కార్యక్రమం పాయికా మహోత్సవం–2026లో హైటెక్ విద్యా సంస్థల ఒడియా భాషా సాహిత్య విభాగం సీనియర్ అధ్యాపకులు, ఒడిస్సీ నృత్యకారులు డాక్టర్ చిత్తరంజన్ సహాని ఆధ్వర్యంలో కటక్ నృత్య శాల కళాకారుల బృందం ఒడిస్సీ నృత్య రూపకం ప్రదర్శించింది. పురాణాలలో వర్ణించబడిన పాయికా నదీ తీరంలో గత 15 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ యూత్ క్లబ్ పాయికా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆహ్వానం మేరకు డాక్టర్ చిత్తరంజన్ సహాని ఆధ్వర్యంలో నృత్య శాల ఒడిస్సీ నృత్యకారులు డాక్టర్ సంగీత సాహు, అభిలిప్స సెఠి, బైష్ణబి సాహు బృందం ప్రదర్శించిన ఆధ్యాత్మిక, భావోద్వేగభరితమైన ఒడిస్సీ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. -
నబరంగ్పూర్ ఐఐసీకి డీజీపీ డిస్క్ మెడల్
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్ర పోలీస్ స్టేషన్ ఐఐసీ సంబిత్కుమార్ బెహరాకు డీజీపీ డిస్క్ మెడల్ లభించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏప్రిల్ 1న ఒడిశా రాష్ట్ర పొలీసు అవతరణ దినోత్సవం సందర్భంగా రాజధానిలో జరిగే కార్యక్రమంలో డీజీపీ ఈ అవార్డును బహూకరిస్తారు. విధి నిర్వహణలో ఉత్తమ నైపుణ్యం కనబరిచిన పోలీసులకు డీజీపి డిస్క్ మెడల్ను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా సంబిత్ను సహచర పోలీసులు బుధవారం అభినందించారు. బాలుడి కిడ్నాప్కు యత్నం! రాయగడ: పన్నెండేళ్ల బాలుడుని కిడ్నాప్ చేసేందుకు గుర్తు తెలియని దుండగుడు ప్రయత్నించాడని సదరు పోలీస్స్టేషన్లో మంగళవారం కేసు నమోదయ్యింది. స్థానిక సాయిప్రియనగర్లో నివాసముంటున్న చందన్ విశ్వకర్మ 12 ఏళ్ల కొడుకు ఆయుష్ పనిమీద మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగుడు స్కూటీపై వచ్చి బాలుడితో అడ్రాస్ అడిగే ప్రయత్నం చేశాడు. అనంతరం బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బాలుడు అతని దగ్గర నుంచి చాకచక్యంగా తప్పించుకుని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన వారు సదరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడుతోపాటు అతని తల్లిదండ్రులతో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ కెమెరా ఆధారంగా దుండగుని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సింగిపురంలో హనుమాన్ మందిర ప్రతిష్ట పర్లాకిమిడి: జిల్లాలోని కాశీనగర్ బ్లాక్ సింగిపురం గ్రామంలో బుధవారం హనుమాన్ మందిర ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, హైటెక్ మెడికల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతిరావు, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, బీజేపీ నాయకులు దారపు రాజేష్ కుమార్, సమితి మాజీ చైర్మన్ ఛిత్రి సింహాద్రి, సర్పంచ్ తేజ తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాలుగా హనుమాన్ మందిర నిర్మాణాలు జరుగుతుండగా నేటికి ప్రాణప్రతిష్టా కార్యక్రమాలు జరిగాయి. ఐదు రోజులు జరిగే మందిర ప్రతిష్టకు ఎమ్మెల్యే ల్యాడ్ నిధుల నుంచి రూ. 3 లక్షలు, నవీన్ పట్నాయిక్ ప్రభుత్వ హయాంలో రూ. 15 లక్షలు నిధులు అందజేశారు. ప్రతిష్టా మహోత్సవం అనంతరం అన్నప్రసాదాలు భక్తులకు అందజేశారు. పర్లాకిమిడిలో ఈదురుగాలులు పర్లాకిమిడి: పట్టణంలో బుధవారం సాయంత్రం దట్టమైన మేఘాలతో ఈదురుగాలులు వీచాయి. రామగిరి, రాయఘడలో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. నువాగుడలో రూటేజ్ స్మార్ట్ విలేజ్ ప్రారంభం జయపురం : జయపురం సబ్ డివిజన్ కుంద్రా సమితి నువాగుడ గ్రామంలో ఎం.ఎస్.స్వామినాథన్ పరిశోధన కేంద్రం, జయపురం, నాబార్డ్ సంస్థలు సంయుక్తంగా రూటేజ్ స్మార్ట్ విలేజ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని కొట్పాడ్ ఎమ్మెల్యే రూపుభొత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూటేజ్ స్మార్ట్ విలేజ్ అనేది కొత్త ఆలోచన అని, దీని ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ జ్ఞానం, నైపుణ్యాభివృద్ధిని ఆన్లైన్ సేవల ద్వారా అందుతుందన్నారు. -
పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం
పర్లాకిమిడి : కొంతమంది బీజేడీ పార్టీలో ఉన్నామని చెబుతూ రెండు రోజుల క్రితం బీజేపీలో చేరడం ఎటువంటి ఆశ్చర్యం కలిగించలేదని బిజూ జనతా దళ్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. స్థానిక రాంనగర్లో హైటెక్ ప్లాజాలో బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, గుసాని జెట్పిటిసి బాలరాజు, మాజీ సర్పంచ్ (గారబంద) నీరోభుయ్యాన్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎరగాన రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రెండేళ్లుగా అన్ని వర్గాలనూ మోసం చేస్తోందన్నారు. రైతుల వద్ద ధాన్యం కొంటామని మోసం చేసిందని, కొత్తగా వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయడం లేదని, ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు కొన్ని ఆస్పత్రుల్లో పనిచేయడం లేదని దుయ్యబట్టారు. అనంతరం గుసాని సమితి బిజేపీ సర్పంచ్ నిరంజన్ కుమార్ శోబోరో బీజేడీలో చేరారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మరికొందరు మద్దతుదారులు బీజేడీలో చేరారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, గుసాని సమితి చైర్మన్ వీర్రాజు, గారబంద బీజేడీ నాయకులు నీరోభుయ్యాన్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం బలహీనుడు
● వైద్యశాఖ మంత్రి బలవంతుడు ● కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీ పతి ఎద్దేవా కొరాపుట్: రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత బలహీనుడని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీ పతి ఎద్దేవ చేశారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రి అత్యంత బలవంతుడని అభివర్ణించారు. ఆయనకు న్యూఢిల్లీలో బలమైన లాభీయింగ్ ఉందన్నారు. అందుకే ఎస్సీబీ మెడికల్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించి 12 మంత్రి చనిపోయినా మంత్రి పదవికి రాజీనామా చేయలేదన్నారు. వాస్తవంగా సీఎం చేతులోనే మంత్రుల రాజీనామా వ్యవహారం ఉంటుందన్నారు. కానీ ప్రస్తుత సీఎంకు అ బలం లేదన్నారు. బతకడానికి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చావుని కొనితెచ్చుకున్నా ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నార. గత ప్రభుత్వంలో మంత్రులు తప్పు చేస్తే చర్యలు ఉండేవన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో తప్పులను పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా సమావేశాలు కొనసాగించడం ప్రజాస్వామ్య హత్యగా పేర్కొన్నారు. డీలిమిటేషన్ బిల్లులో బీజేపీ తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందడానికి వీలుగా మార్పులు చేస్తున్నారన్నారు. బీజేడీ పార్టీతో తమకు పొత్తు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తనదైన పద్ధతిలో పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయన్నారు. -
పోర్టు బహిరంగ సభ విజయవంతం చేయండి
సంతబొమ్మాళి: నౌపడ మూడు రోడ్లు జంక్షన్ వద్ద ఈ నెల 30న జరిగే మూలపేట పోర్టు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ కోరారు. మంగళవారం నౌపడ మూడురోడ్లు జంక్షన్ వద్ద స్థలం లెవలింగ్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మూలపేట పోర్టు పనులు 75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన పనులు పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. టీడీపీ నాయకులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి మిగిలిన వారిని విస్మరించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. పార్టీ తరఫున ఉత్తరాంధ్ర నాయకులు మూలపేట పోర్టు, పరిసర ప్రాంతాలను సందర్శిస్తారని తెలిపారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు పిలక రవికుమార్రెడ్డి, చిన్ని జోగారావు యాదవ్, బడ్డ రాజేష్ తదితరులు ఉన్నారు. -
ఉద్యోగులకు శిక్షణ
పర్లాకిమిడి: ప్రభుత్వ కార్యాలయాల్లో ఒడియా భాషలో ప్రత్యుత్తరాలు రాయాలని కోరుతూ రెండు రోజుల శిక్షణ శిబిరాన్ని అదనపు జిల్లా మాజిస్ట్రేట్ (రెవెన్యూ) మునీంద్ర హానంగా మంగళవారం కలెక్టరేట్ హాల్లో ప్రారంభించారు. ఈ శిబిరంలో జిల్లాలోని ప్రభుత్వ అడ్మిన్స్ట్రేటివ్ సిబ్బంది ఒడియా భాషలో ఎలా ప్రత్యుత్తరాలు ఎలా రాయాలో ఒడియా భాషా వ్యవహార ప్రతిష్టాన్ డైరెక్టర్ సిద్ధార్థ శంకర పాడీ వివరించారు. ఈ శిబిరంలో ఒడియా భాష పండితులు, భువనేశ్వర్ డాక్టర్ రబినారాయణ పండా, శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల (ఒడియా విభాగం) డాక్టర్ రమేష్ చంద్ర మల్లిక్, సాహిత్యకారులు పూర్ణచంద్ర ప్రధాన్ పాల్గొని పలు అంశాలను వివరించారు. ఇంగ్లిష్ నుంచి ఒడియా భాషకు తర్జుమా, ఒడియా శబ్ధకోశం, గ్రామర్, తదితర అంశాలను తెలియజేశారు. ఒడియా భాష, సంస్కృతి విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ శిబిరానికి జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
● అధికారులూ.. మీ మాటలన్నీ ‘గ్యాస్’యేనా!
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో జిల్లా కేంద్రంలో హోటళ్లు, టిఫిన్ షాపులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కొందరు కట్టెల పొయ్యిపై నెట్టుకొస్తున్నా ఒకటి రెండు రోజుల తర్వాత ఇక తమ వల్లకాదంటూ చేతులెత్తేస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం గ్యాస్ కొరత లేదంటూ ఆర్భాటపు ప్రకటనలు గుప్పిస్తుండటం పట్ల హోటల్ నిర్వాహకులు మండిపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం మూతపడిన అమ్మా మెస్ తాత్కాలికంగా సెలవు అంటూ బోర్డు -
జనగణనపై శిక్షణ ప్రారంభం
జయపురం: జయపురం సబ్డివిజన కొట్పాడ్ నోటిఫైడ్ ఏరియ కౌన్సిల్(ఎన్ఏసీ) కార్యాలయంలో జన గణనపపై మూడు రోజుల శిక్షణ శిబిరం మంగళవారం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శిబిరం నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. జనగణన ఇన్చార్జి, కొట్పాడ్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ కార్యనిర్వాహక అధికారి కమలేశు మహంతి, ఎన్ఏసీ చైర్మన్ ఎం.శంకరరావు, ఫీల్డ్ ట్రైనర్ దుర్గాప్రసాద్ నాయక్ పర్యవేక్షణలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు స్వాగతం పలికి ప్రతిజ్ఞ చేయించారు. 50 మంది ఉపాధ్యాయులు, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. వారికి జనాభాను లెక్కించే విధానంపై ఫీల్డ్ ట్రైనర్లు శిక్షణ ఇస్తారు. జిల్లా జనగణన బాధ్యతల పర్యవేక్షకులు కె.గుణవర్ధన్ శిక్షణ ఉద్దేశాన్ని వివరించారు. జనగణన 2027 కార్యక్రమం రెండు విడతలుగా నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా మొదటి విడత ఏప్రిల్ ఒకటి నుంచి 15వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమనిరేషన్, ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు ఎన్యూమరేషన్ నిర్వహణ ఉంటుందన్నారు. రెండవ విడత జనగణన కార్యక్రమం 2027 ఫిబ్రవరిలో ఉంటుందన్నారు. నిబంధల ప్రకారం పదేళ్లకు ఒకసారి జనగణన జరుగుతుంది. 2011లో జనాభా లెక్కులు జరిగాయని.. తరువాత 2021లో చేపట్టాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈ ప్రక్రియ జరగలేదు. -
ఆటోను ఢీకొట్టిన స్కూల్ బస్సు
● ముగ్గురు డిగ్రీ విద్యార్థులకు గాయాలు నరసన్నపేట : తామరాపల్లి సమీపంలో జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు డిగ్రీ విద్యార్థులు గాయపడ్డారు. కోటబొమ్మాళి వైపు నుంచి విద్యార్థులతో నరసన్నపేట వస్తున్న ఆటోను మార్కెట్ కమిటీ వద్ద ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డిగ్రీ విద్యార్థులు కోటబొమ్మాళి మండలం సింహాద్రిపురానికి చెందిన రాజాపు సంతోష్, హర్ష, నిమ్మాడకు చెందిన శిమ్మ మాధురిలకు గాయాలయ్యాయి. మరో ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డీజల్ కోసం బస్సు రాంగ్రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను అదుపు తప్పి ఢీకొట్టిందని ఆటో డ్రైవర్ వీరాస్వామి తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే నరసన్నపేట ఎస్సై బి.గణేష్ ఘటనా స్థలానికి వెళ్లి సమీక్షించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును పక్కకు తరలించి గాయపడ్డ విద్యార్థులకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
23 తులాల బంగారం చోరీ
● రూ.లక్షన్నర నగదు మాయం ● అవలింగి గ్రామంలో ఘటన సారవకోట: అవలింగి గ్రామంలో ముద్దాడ గౌరినాయుడు ఇంట్లో భారీ చోరీ జరిగింది. కప్ బోర్డులో దాచిన 23 తులాల బంగారం, లక్షన్నర నగదు మాయమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకా రం.. గౌరినాయుడు తన తల్లి హేమలత, భార్య పావని, ఆరు నెలల పాపతో కలిసి అవలింగిలో సొంతింట్లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ వారానికి ఒకటి రెండు రోజులు స్వగ్రామానికి వచ్చి పొలం పనులు చూసుకుని వెళ్తుంటాడు. శనివారం సాయంత్రం తల్లి హేమలత ఆమె బంధువుల ఇంటికి వెళ్లగా, గౌరినాయుడు భార్య పావని చంటి బిడ్డతో ఇంట్లోనే ఉంది. ఆదివారం పావని తన బిడ్డను చూస్తుండమని పక్కింట్లో ఉండే ఓ బాలుడికి చెప్పి దుస్తులు ఉతికేందుకు సమీపంలోని కాలువ వద్దకు వెళ్లి వచ్చేసింది. సోమ వారం అత్తయ్య హేమలత క్యాంపు నుంచి తిరిగి వచ్చి అదే రోజు సాయంత్రం బ్యాంకు ఖాతాలో జమైన రూ.4వేలు విత్డ్రా చేసి కప్బోర్డులో పెట్టేందుకు చూడగా, ఆ కప్బోర్డులో ఉండాల్సిన 23 తులాల బంగారు నగలు, ఇంటి పనుల కోసం తెచ్చిన రూ.లక్షన్నర నగదు కనిపించలేదు. దీంతో కుమారుడు గౌరినాయుడుకు సమాచారమివ్వగా ఆయన వచ్చి మంగళవారం సారవకోట పోలీసుల కు సమాచారం అందించారు. క్లూస్టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. -
అదరగొట్టిన సిక్కోలు క్రికెట్ జట్టు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా సీనియర్స్ పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. కెప్టెన్, స్టార్ ఆటగాడు ఎస్డీఎన్వీ ప్రసాద్ తుఫాన్ ఇన్నింగ్స్తో 388 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. విజయనగరం జిల్లాలోని ఏసీఏ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఏసీఏ అంతర్జిల్లాల సీనియర్స్ పురుషుల వన్డే క్రికెట్ టోర్నీలో మంగళవారం తూర్పుగోదావరి జిల్లాతో శ్రీకాకుళం తలపడింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తూ.గో. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. జిల్లా జట్టులో సాయియశ్వంత్, ఎన్.హిమకర్ తలా రెండు వికెట్లు, నంబళ్ల సుశాంత్ ఒక వికెట్ పడగొట్టాడు. భారీ లక్ష్యసాధనతో బరిలోకి దిగిన శ్రీకాకుళం జిల్లా 48.4 ఓవర్ల 391 పరుగులు సాధించి ఔరా అనిపించింది. ప్రసాద్ 59 బంతుల్లోనే 146 పరుగులతో నాటౌట్గా నిలిచి సిక్కోలును విజయపథంలో నిలిపాడు. బెందాళం సాత్విక్ 70 బంతుల్లో 84 పరుగులు, కె.సాయిసాత్విక్ 71 బంతుల్లో 78 పరుగులతో రాణించారు. జట్టు రికార్డు లక్ష్యసాధన పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పుల్లెల శాస్త్రి, ప్రధాన కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదినా శైలానీ, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్, సంఘ ప్రతినిధులు, కోచ్లు, క్రీడాకారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. ఎస్డీఎన్వీ ప్రసాద్ బి.సాత్విక్ సాయిసాత్విక్ -
గిరిజనులకు అండగా నిలుద్దాం
● ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి శ్రీకాకుళం పాతబస్టాండ్: గిరిజనులు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని, వారికి రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీలపై జరిగే దాడుల విషయంలో పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని ఆదేశించారు. గిరిజన ఉద్యోగులపై పని ప్రదేశాల్లో వేధింపులు జరిగితే సహించేది లేదన్నారు. ఐటీడీఏ పరిధిలోని పనులన్నింటిలోనూ గిరిజనులకే తొలి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. గిరిజనుల ముసుగులో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై, అక్రమంగా సంఘాలు నడుపుతున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కలర్ గ్రానైట్ పర్మిషన్ల అంశంపై చర్చిస్తూ గిరిజనులకు ఇబ్బంది కలిగించే వారి లీజులపై పునః సమీక్షించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో ఎస్టీలపై దాడులకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, గతేడాది 5 కేసులు నమోదయ్యాయని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలపై ఐటీడీఏ పీవో స్వప్నల్ పవార్తో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో ఎస్టీ కమిషన్ సభ్యులు మల్లేశ్వరరావు, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం.అన్నాదొర, గిరిజన సంఘాల నేతలు చౌదరి లక్ష్మీనారాయణ, గేదెల రమణమూర్తి, బిడ్డిక తేజేశ్వరరావు, సవర కుమారి, సవర తులసి, ధరణి బైరిసింగి, బి.పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్కు ఏసీఏ ఆహ్వానం
భువనేశ్వర్: ఈ ఏడాది శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి ఏసీఏ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని ఏసీఏ కార్యదర్శి ఆర్.సత్యసాయి తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జి.ఆనందరావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటికి ప్రత్యేకంగా ఆహ్వా నించారు. ఉత్సవాలకు ప్రత్యక్షంగా హాజరవుతా నని ప్రతినిధి బృందానికి గవర్నర్ తెలియజేశారు. ఎంపీ అపరాజిత షడంగి, ఎమ్మెల్యే అనంత నారాయణ జెనాకు ఏసీఏ ఆహ్వాన పత్రికలు అందజేసింది. -
దళితుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
● రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ●జెడ్పీలో వినతుల స్వీకరణ శ్రీకాకుళం/శ్రీకాకుళం పాతబస్టాండ్: దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. దళితులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేక గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన దళితుల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ, ఐఐఐటీ, మున్సిపల్ కార్పొరేషన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఏపీఈపీడీసీఎల్, తదితర శాఖల అధికారులతో ఎస్సీ రోస్టర్ పాయింట్ అమలుపై సమీక్షించి సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ దళితులపై దాడులు జరిగిన వెంటనే పోలీసుల స్పందించి ఆలస్యం చేయకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా కమిషన్ దృష్టికి తీసుకువచ్చేందుకు 9701305417 వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దళితుల హక్కుల పరిరక్షణ, న్యాయం అందించడంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఎస్సీ కమిషన్ 59 ఉప కులాలకు రక్షణ కవచం వంటిదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ రోస్టర్ పాయింట్ తప్పనిసరిగా అమలు జరగాలని రాష్ట్ర ఎస్సీ కమీషన్ సభ్యులు రావాడ సీతారాం అధికారులను కోరారు. అంతకుముందు సీతారాంకి జిల్లాలోని దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో దళిత నాయకులు బోకర నారాయణరావు, కల్లేపల్లి రామ్గోపాలరావు,, డి.గణేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.వినాయకం, భూ గర్భ గణులు శాఖ ఉప సంచాలకులు మోహనరావు, డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా కో–ఆర్డినేటర్ వై.యశోధ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దళిత సంఘాల జేఏసీ నేతలు తైక్వాండో శ్రీను, డాక్టర్ కంఠ వేణు, ఏపీఈఈడబ్ల్యూఐడీసీ డైరెక్టర్ పి.ఎం.జె.బాబు తదితరులు పాల్గొన్నారు. -
12న దండ జాతర
జయపురం: జయపురం పారాబెడలో దండ జాతర నిర్వహణ కోసం సన్నాహక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఏప్రిల్ 12వ తేదీ దండ జాతర నిర్వహించేందుకు సమావేశం నిర్ణయించింది. పారాబెడ ఝంఖరదెయి మందిరం ప్రాంగణంలో కాళీమాతకు 12వ తేదీ రాత్రి పూజలు జరపాలని సమావేశం నిర్ణయించింది. ఆ రాత్రి పారాబెడ కూడలి ప్రాంతంలో అపేరాతో పటు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో శివ ప్రసాద్ పందా, దృభచరణ మహంతి, హరి బోరడ, పంచానన నాయక్, శివ ప్రసాద్ తియాడి, జి.సూర్యనారాయణ పాత్రో, జగబందు పండా, ఆర్.బినోద్ రెడ్డి, రాజేంద్ర పాణిగ్రహి, పవిత్ర కుమార్ నాయక్, లక్ష్మీనారాయణ పాడీ, రామప్రసాద్ పాడీ, రాజేంద్ర కుమార్ గౌడ, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో వడ్డింపు
కొత్తూరు: గొట్టిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులే తోటి విద్యార్థులకు వడ్డించారు. విద్యార్థులతో ఎటువంటి పనులు చేయించ కూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇలా చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై పాఠశాల వార్డెన్ అప్పన్నమ్మ వద్ద ప్రస్తావించగా కమాటి అనారోగ్యం వల్లత హాజరు కాలేదని, కుక్ ఒక్కరే ఉన్నందున విద్యార్థులు వడ్డించినుట్ల చెప్పారు. యురేకా సైన్స్ ఎక్స్పో ఫలితాలు విడుదల శ్రీకాకుళం: యురేకా సైన్స్ ఎక్స్పో–2026 రాష్ట్ర, జిల్లా స్థాయి ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎస్.లక్ష్మణరావు, తవ్వా సురేష్, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో పర్యావరణం సుస్థిర అభివృద్ధికి సంబంధించి పైడి భీమవరం, ఇప్పిలి హైస్కూళ్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పైడి భీమవరం, కొల్లిపాడు హైస్కూల్ తొలి రెండు స్థానాలు సాధించాయి. మూఢ నమ్మకాలు–శాసీ్త్రయ దృక్పథం అంశంలో జర్జంగి విద్యార్థులు ప్రథమ స్థానాన్ని పొందారు. ప్రైవేటు స్కూళ్లకు సంబంధించి అన్ని విభాగాల్లోనూ ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ నెల 29న ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం యూటీఎఫ్ భవన్లో జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందిస్తామని గిరిధర్ తెలిపారు. సమగ్ర చైతన్యయాత్ర ప్రారంభం ఇచ్ఛాపురం: రాష్ట్రంలో ప్రైవేటు ఎలక్ట్రికల్ కార్మికుల సంక్షేమ సాధనకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర చైతన్య, రాష్ట్ర సర్వే యాత్రను చేపట్టినట్లు రాష్ట్ర ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు డి.వి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురం గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సమగ్ర చైతన్య రాష్ట్ర సర్వే యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో పర్యటించి ఎలక్ట్రికల్ కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వై.శంకర్రావు, ఉపాధ్యక్షుడు కె.పాల్రాజు, కార్యదర్శి బి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి కె.శ్రీహరి, కోశాధికారి ఎం.శ్రీధర్, స్వేచ్ఛావతి ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు రంగాల శ్రీనివాసరావు, కార్యదర్శి చిలకలపూడి కృష్ణారావు, ధర్మసాహు, దానేష్రెడ్డి, కాయశ్రీను, దుదిష్టి, కె.మణి పాల్గొన్నారు. ఆదిత్యలో సావి–3 సినిమా పోస్టర్ ఆవిష్కరణ టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సావి–3 సినిమా పోస్టర్ను డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. శ్రీలక్ష్మి కృష్ణ ఫిల్మ్ సిటీ యూనిట్ ఆధ్వర్యంలో డైరెక్టర్ కృష్ణమాయ, నిర్మాత విజయ్ తదితరులు తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాలలో నాలుగు రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో నటులు సామ్రాట్రెడ్డి, లిఖిత, డిమాన్ పవన్, టెంపర్ వంశీ, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అలుమ్ని ఇన్చార్జి డి.యుగంధర్, శాక్ ఇన్చార్జి సురేష్, ఎస్టేట్ మేనేజర్ పిరియా రమేష్, డీన్ డి.విష్ణుమూర్తి పాల్గొన్నారు. పోక్సో కేసు నమోదు ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం మండలంలోని ఓ గ్రామంలో తోటలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయమై గ్రామపెద్దల వద్ద పంచాయితీ జరిగినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ జనార్దనరావు తెలిపారు. యాత్రలో పాల్గొన్న ఎలక్ట్రికల్ యూనియన్ ప్రతినిధులు -
జాబ్మేళాకు స్పందన
సోంపేట: నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి బి.చంద్రమౌళి అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోంపేట పట్టణంలోని కె.ఆర్.కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించారు. 13 ప్రెవేటు కంపెనీల ప్రతినిధులు హాజరై 256 మంది నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన 105 మందిని వివిద కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్లేస్మెంట్ అధికారి ఎం.వంశీకృష్ణ, కళాశాల కరస్పాండెంట్ కొంచాడ శేషాద్రి, ప్రిన్సిపాల్ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే కుల బహిష్కరణ
● కుమార్తెకు కులాంతర వివాహం చేయాలని నిర్ణయించడమే కారణం కొరాపుట్: కాలం మారుతున్నప్పటికీ కుల రక్కసి ప్రజలను వీడడం లేదు. అందుకు అగ్ర, వెనుకబడిన కులాలనే తేడాలేదు. ఎంతటి వారైనా దీనికి బలికాకతప్పడం లేదు. ప్రతిపక్ష బీజేడీ పార్టీకి చెందిన నబరంగ్పూర్ మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని కుటుంబాన్ని ఆ సమాజిక వర్గం కుల బహిష్కరణ చేసింది. గిరిజనులలో బోత్ర తెగకి చెందిన సదాశివని బోత్ర జాతి కుల సంఘం కులం నుంచి బహిష్కరించింది. అతని కుటుంబాన్ని ఎటువంటి శుభ, అశుభ కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని కులపెద్దలు తీర్మానం చేశారు. అలాగే అతని ఇంట జరిగే కార్యక్రమాలకు హాజరు కావద్దని బోత్ర కులం చెందిన వారికి హెచ్చరించారు. జోరిగాం సమితిలో జరిగిన బోత్ర సమాజ్ సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. సదాశివ కుమార్తెకి ఒడియా బ్రాహ్మణ యువకునితో ప్రేమ వివాహం జరగనుంది. వీరి ప్రేమకి ఇరు కుటుంబాలు అంగీకరించి నిశ్చితార్ధం జరిపారు. ఇది తెలిన బోత్ర సమాజ్ పెద్దలు తమ గిరిజన యువతి బ్రాహ్మణ యువకుడిని పెళ్లి చేసుకొంటుండంపై ఆగ్రహం వ్యక్తం చేసి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఇదే గిరిజనులకు చెందిన బోత్ర సమాజ్ అతన్ని కులం నుంచి బహిష్కరించింది. విమానాశ్రయంలో విలువైన గంజాయి స్వాధీనం భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 3 కోట్లకు పైబడి విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళ వారం ఉదయం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చేపట్టిన ఒక భారీ దాడుల్లో ఈ అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం బ్యాంకాక్ నుంచి వచ్చిన 6ఈ–1066 విమానం ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఇద్దరు ప్రయాణికుల నుంచి నిషేధిత పదార్థం గంజాయి బయటపడింది. నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా డీఆర్ఐ బృందం కూలంకషంగా తనిఖీ నిర్వహించగా ఇద్దరు నిందితుల నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వారివురు తమిళనాడు నివాసులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం వారిని డీఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జగులై మాతకు ప్రత్యేక పూజలు భువనేశ్వర్: జట్నీ మున్సిపల్ మండలి జేఎంసీ పరిధిలోని కుదియారి గ్రామ దేవత జగులై మాత వసంత నవరాత్రి ఉత్సవాల్లో సప్తమి తిథిని పురస్కరించుకుని జగులాయి మాత పీఠంలో సాల మండన్, సూర్యపూజ తదితర పూజాదులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం అభిషేకం అనంతరం రూపకార్ విజయ్ పండా దేవీని కాళ రాత్రి రూప ధారణతో అలంకరించారు. షోడశ ఉపచార పూజలు, సప్త సతీ చండీ ఆహుతి అర్ధరాత్రి వరకు క్రమ పద్ధతిలో కొనసాగాయి. మహా అష్టమి పురస్కరించుకుని బుధవారం జగులై మాత మహాగౌరీ అలంకరణలో దర్శనం ఇస్తారని ఆలయ ప్రధాన అర్చకుడు వినోద్ పండా తెలియజేశారు. -
ఆభరణాల జాబితా తయారీ
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026శ్రీ జగన్నాథుని.. భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయ రత్న భాండాగారంలో భద్రపరిచిన అమూల్య ఆభరణాల జాబితా తయారీ, ధ్రువీకరణ బృహత్తర ప్రక్రియ బుధవారం నుంచి ఆరంభం అవుతుంది. దీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రక్రియ వివరణాత్మక ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) ప్రకారం చేపడుతున్నట్లు శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢి తెలిపారు. ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సవివరంగా అనుబంధ వర్గాలకు పూర్తి అవగాహన కల్పించినట్లు వివరించారు. సుదీర్ఘంగా 48 ఏళ్ల విరామం తర్వాత ఈ ప్రక్రియను చేపడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుముహూర్తం ఆలయ సంప్రదాయాల ప్రకారం ఈ ప్రక్రియ బుధ వారం మధ్యాహ్నం 12.09 గంటల నుండి 1.45 గంటల మధ్య శుభ ముహూర్తంలో ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రామాణిక కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆభరణాలను 1978లో తయారు చేసిన జాబితాతో సరిపోల్చడం ద్వారా సమగ్ర ఽధ్రువీకరణ ప్రక్రియ జరుగుతుంది. ప్రతి ఆభరణాన్ని విడివిడిగా జాగ్రత్తగా పరిశీలించి తూకం వేస్తారు. సరైన డాక్యుమెంటేషన్న్ నిర్ధారించడానికి అధికారులు ప్రతి వస్తువును గుర్తించి ట్యాగ్ చేస్తారు. ఈ ప్రక్రియలో ఆభరణాల విలువను నిర్ధారించబోమని అధికారులు స్పష్టం చేశారు. భౌతిక ధ్రువీకరణతో పాటు ప్రతి ఆభరణం సమగ్రమైన, సురక్షితమైన రికార్డును రూపొందించడానికి డిజిటల్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, 3డీ మ్యాపింగ్ వంటి ఆధునిక డాక్యుమెంటేషన్ పద్ధతులను ఉపయోగించనున్నారు. దైనందిన సేవలు యథాతథం జాబితా ప్రక్రియ సమయంలో దేవతల దైనందిన పూజలు, మతపరమైన ఆచారాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు పూజల పవిత్రతను కాపాడటమే ప్రధాన ధ్యేయమని ఆలయ అధికారులు నొక్కి చెప్పారు. మహా లఘు దర్శనం ఈ నేపథ్యంలో భక్తులకు మహా లఘు దర్శనం వెలుపలి వాకిలి నుంచి కల్పిస్తారు. భక్తులకు నిరవధికంగా సర్వ దర్శనం కల్పించడం ఈ చొరవ లక్ష్యంగా పేర్కొన్నారు. -
శ్రీరామనవమి వేడుకలకు సన్నాహాలు
జయపురం: జయపురంలో శ్రీరామ నవమి ఉత్సావాలను వైభవంగా నిర్వహించేందుక కమిటీ సభ్యులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ఉత్సవ కమిటీలకు, ప్రజలకు ఆహ్వాన పత్రాలను మంగళవారం నుంచి పంపిణీ ప్రారంభించారు. జయపురం సనాతని ఏకతా యాత్ర, గురు రెస్పెక్ట్ ఆహ్వాన్ అభిజాన్ 2026ను శ్రీరామ నిర్వాహక కమిటీ నిర్వహించింది. ఆ కమిటీ కార్యకర్తలు శ్రీరామ భక్తులు బెనాసూర్, ముండాగుడ, రనస్పూర్, బిసింగపూర్, కుములి, భుమక్తపొదర్, చారుముల్ల, నారిగాం, గుమడ,బొడిగాం, కమత, బొరిగుమ్మ గ్రామాల్లో పర్యటించి గ్రామ పెద్దలను కలిసి ఉత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన చందాలను వసూలు చేశారు. -
అగ్నివీర్పై కలెక్టర్ సమీక్ష
మల్కన్గిరి: భారతీయ సైన్యంలో అగ్నివీర్ నియామకానికి సంబంధించి మల్కన్గిరి జిల్లాలో యువతలో అవగాహన, నమోద్ సంఖ్యను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే అధ్యక్షతన మంగళవారం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో జయపూర్ ప్రాంతీయ విద్యా డైరెక్టర్, జిల్లా నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అధికారి, జిల్లా సబ్ కలెక్టర్, జిల్లా విద్యశాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారి, ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, గోపాలపూర్ ఏఆర్వో, సైనిక నియామక కార్యాలయ డైరెక్టర్ పాల్గొన్నారు. ముఖ్యంగా అగ్నివీర్ నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు మల్కన్గిరి జిల్లాలో కేవలం 25 మంది అభ్యర్థులు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇది రాష్ట్రంలోనే అతి తక్కువ సంఖ్య. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేసి మరింత మంది యువతను తమ పేర్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పాఠశాల, కళాశాలలో అగ్నివీర్ నమోద్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నట్టు కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ తెలిపారు. -
‘బాల్య వివాహం హక్కుల ఉల్లంఘనే’
మల్కన్గిరి : ఒడిశా రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ గౌరవ సభ్యురాలు సుజాతా నాయక్ మంగళవారం మల్కన్గిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పిల్లల కోసం అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు, వారి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చేందుకు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఎంవీ–03 అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ పిల్లలకు అందిస్తున్న ఆహారం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఆమె తమసా ఆశ్రమ పాఠశాల, మల్కన్గిరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్య హక్కు చట్టం సరైన అమలుపై దృష్టి సారించి పిల్లల భద్రతను నిర్ధారించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తమసా గ్రామ పంచాయతీలో నిర్వహించిన పంచాయతీ స్థాయి బాలల సంక్షేమ, కమిటీ సమావేశంలో పాల్గొన్న సభ్యురాలు మాట్లాడుతూ, బాల్య వివాహం అనేది బాలల హక్కులపై ఘారమైన ఉల్లంఘన అని తెలిపారు. దోపిడీ లేని బాల్యం ప్రతి పిల్లవాడి జన్మహక్కు అని పేర్కొన్నారు. సమావేశంలో బాల కార్మికత్వం, భిక్షాటనలో పిల్లలను ఉపయోగించడం లేదా మత్తు పదార్థాల వ్యాపారంలో పిల్లలును వినియోగించడం వంటి నేరాలపై కఠన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కటక్ ఎల్ఐసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
● పలు కీలక పత్రాలు దగ్ధం భువనేశ్వర్: కటక్ నగరం లింక్ రోడ్డులో ఉన్న జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కార్యాలయంలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని సుమారు రెండు గంటలు నిర్విరామంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో పలు కీలక పత్రాలు దగ్ధమయ్యాయి. తెల్లవారు జామున కార్యాలయ భవనం నుంచి పొగలు కమ్ముతున్నట్లు స్థానికుల దృష్టికి వచ్చింది. అత్యవసర హెల్ప్లైన్ ద్వారా సమాచారం చేరదీయడంతో అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తక్షణమే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ కసరత్తులో చౌలియాగంజ్, కటక్ నగరం యూనిట్లతో సహా పలు బృందాలను రంగంలోకి దించారు. మొత్తం 20 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. -
సామాజిక అంశాలపై అవగాహన
పర్లాకిమిడి: గజపతి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్, భారతీయ రెడ్ క్రాస్, ఒడిశా ఆధ్వర్యంలో ‘మేక్ ఎ ఛేంజ్ ఇన్సిటివ్’ ఆధీనంలో ఎస్సీ, ఎస్టీలకు స్వశక్తీకరణ, అనాధల కోసం సామర్థ్య నిర్మాణ శిక్షణా కార్యక్రమాలు స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో రెడ్ క్రాస్ అధికారి సంజీవ్ కుమార్ దాస్, ఆదనపు డీఈఓ ఎస్.గిరిధర్, జిల్లా శిక్షాక్రీడాధికారి సురేంద్ర కుమార్ పాత్రో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ కోఆర్డినేటరు అంపోలు రవికుమార్, సీనియర్ రిసోర్పర్సన్ సంజయ్ చంద్ర సాహు, గాంధీ మెమోరియల్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్.తిరుపతిరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. జూనియర్ రెడ్క్రాస్లో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రక్తదానం, ప్రాథమిక చికిత్స, సైబర్ మోసాల నుంచి సురక్షా, రోడ్డు భధ్రతా, తదితర సామాజిక సేవలు గురించి వివరించారు. కొత్తగా చేరిన రెడ్ క్రాస్ అభ్యర్థులకు బ్యాడ్జీ, పుస్తకాలు, పెన్నులు, ఇతర సామగ్రీని అందజేశారు. రాష్ట్ర జూనియర్ రెడ్ క్రాస్ అధికారి లక్ష్మణకుమార్ స్వయిని, మహేంద్రగిరి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పూర్ణచంద్ర ప్రధాన్కు జూనియర్ రెడ్ క్రాస్ అధికారి లక్ష్మణ ముర్ముకు అభినందనలు తెలిపారు. -
నల్ల రిబ్బన్లతో నిరసన
మందస: బిడిమి గ్రామంలో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బిడిమి గ్రామంలో ప్రజలు, రైతులు నల్ల రిబ్బన్లతో సమావేశంలో పాల్గొని నిరసన తెలిపారు. గత 18 నెలలుగా కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నామన్నారు. సర్పంచ్ ధర్మారావు మాట్లాడుతు కొంతమంది వ్యక్తులు శ్రీకాకుళం కలెక్టరేట్ వెళ్లి భూములు ఇవ్వడానికి ఈ ప్రాంతం ప్రజలు సిద్దంగా ఉన్నారని ప్రచారాన్ని చేస్తున్నారని,కానీ అది పూర్తిగా అసత్యమని అన్నారు. కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లతో నిరసన చేస్తున్న రైతులు -
పూరీ బస్టాండ్లో బస్సు దగ్ధం
భువనేశ్వర్: పూరీ బస్ స్టాండ్లో ఒక ప్రైవేట్ బస్సుకు నిప్పంటుకుంది. మంగళ వారం రాత్రి పొద్దుపోయాక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. చాలా సేపటి తర్వాత అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కొంత మంది దుండగులు కావాలనే నిప్పంటించి ఉంటారని అనుమానిస్తున్నారు. జనగణనపై శిక్షణ మల్కన్గిరి: దేశంలో మొదటిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ జనగణన –2027ను విజయవంతం చేయడానికి మల్కన్గిరి జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే పర్యవేక్షణలో సోమవారం శిక్షణ ఇచ్చారు. మల్కన్గిరి నోడల్ హైస్కూల్ ప్రాంగణంలో మల్కన్గిరి తహసీల్దార్ పరిధిలోని ఎన్యూమరేటర్లు (లెక్క గణకులు), సూపర్వైజర్లు కోసం మొదటి బ్యాచ్ శిక్షణ శిబిరం విజయవంతంగా పూర్తియింది. రెండో విడత శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేధ్బ్ర్ ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా జనగణన అధికారి మునా తురుక్, మల్కన్గిరి తహసీల్దార్ విశ్వరంజన్ విశ్వస్ శిక్షణార్థులకు మార్గదర్శనం చేశారు. ఫీల్డ్ ట్రైనర్గా భాగ్యరంజన్ లెంకా, హరప్రసాద్ మహాపాత్రో పాల్గొని మొబైల్ యాప్ ద్వారా డేటాను సేకరిణకు సంబంధించిన సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ అందించారు. జిల్లాలో మొత్తం జనగణన (జనభ లెక్కలు) పనుల కోసం 1269 మంది ఎన్యూమరేటర్లు, 227 మంది సూపర్ వైజర్లను నియమించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 6వ తేదీ వరుకు జరుగుతుంది. అనంతరం ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి డిజిటల్ విధానంలో సమాచారం సేకరిస్తారని అధికారులు తెలిపారు. -
సనాతన ధర్మ ప్రచారం కోసం..
కంచిలి: భారత దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం ప్రచారం చేసేందుకు ఇద్దరు యువకులు ఉపక్రమించారు. ఒకరు సైకిల్తోను, మరొకరు స్కేటింగ్ చేస్తూ తిరుగుతున్నారు. సైక్లింగ్ చేసే అశుతోష్ పాండే ఈ ఏడాది జనవరి 20వ తేదీన బీహార్ రాష్ట్ర పరిధి శివాం జిల్లా నుంచి బయల్దేరి నేపాల్ బోర్డర్ వరకు వెళ్లి, మళ్లీ దక్షిణ భారతదేశం వైపు వచ్చారు. సైకిల్ వినియోగిస్తే డబ్బులు ఆదా కావడంతోపాటు వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ తగ్గుతుందని, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు. స్కేటర్ రాజా ఛార్దమ్ యాత్ర చేస్తూ 12 శక్తిపీఠాలను దర్శనం చేస్తూ ఆల్ ఇండియా టూర్ చేస్తున్నట్లు తెలిపారు. వీరు ఇప్పటి వరకు 2500 కిలోమీటర్లు ప్రయాణించారు. మొత్తం 15వేల కిలోమీటర్లు ప్రయాణిస్తామని తెలిపారు. వీరిద్దరూ వేర్వేరుగా వీళ్ల ఆల్ ఇండియా యాత్రలు చేపడుతూ, కంచిలి వచ్చేటప్పుడు ఒక్కచోట కలిశారు. వీరికి కంచిలికి చెందిన వ్యాపారి సంజయ్ కుమార్ శర్మ ఆదివారం రాత్రి ఆతిథ్యం కల్పించి సత్కరించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
జయపురం: ఆదివారం రాత్రి జయపురం సమితి పాత్రోపుట్ గ్రామ సమీపంలో తురిడిపుట్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతి చెందిన యువకులు జయపురం పట్టణం దొబాసాహికి చెందిన లాలు ఖొరా, పీతు జానిలుగా గుర్తించారు. రాంచీ–విజయవాడ 326 జాతీయ కారిడార్ మార్గంలో ఒక బొలేరో వాహనం లాలు ఖొరా, పీతు జానిలు వస్తున్న బైక్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని బైక్ పై వస్తున్న ఇద్దరు సంఘటన స్థలం వద్దనే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే జయపురం సదర్ పోలీసులు వెంటనే సంఘటనా ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం జయపురం ఫూల్బెడ లో గల జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. లభించిన సమాచారం ప్రకారం మృతులు లాలు ఖొర, పీతు జానిలు జయపురం సమితి డొంగరచించి గ్రామంలో ఒక డాబా హొటల్లో పని చేస్తున్నారు. గత రాత్రి పని ముగించుకొని బైక్ పై జయపురం వస్తుండగా మార్గంలో తురిడిపుట్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ చేరుకుని మృతదేహాలు చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. సోమవారం ఉదయం మృతుల కుటుంబాల సభ్యులు బంధువులు జయపురం సదర్ పోలీసు స్టేషన్ వద్ద బైఠాయించి మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని ఆందోళన చేపట్టారు. -
ఖచ్చితమైన గణాంకాలే దేశ ప్రగతికి పునాది
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశ భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు, ప్రభుత్వ వనరుల శాసీ్త్రయ పంపిణీకి అత్యంత ఖచ్చితమైన జన గణాంకాలే ప్రాతిపదిక అని కలెక్టర్, ప్రిన్సిపాల్ సెన్సస్ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భారత జన గణన–2027కు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పదేళ్లకొకసారి నిర్వహించే ఈ మహత్తర ప్రక్రియలో ఫీల్డ్ ట్రైనర్ల బాధ్యత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మార్చి 1, 2027ను సూచిక తేదీగా తీసుకుని నిర్వహించే ఈ గణనలో ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు కూడా తావులేకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవ గణాంకాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. సమర్దవంతమైన డేటా సేకరణ ద్వారానే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన పథకాలు రూపొందించడం సాధ్యమవుతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, సెన్సస్ జాయింట్ డైరెక్టర్ బి.వి.ఎల్.సాయి శేఖర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ అధికారి శివ కుమార్, మాస్టర్ ట్రైనర్లు శేషగిరి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
సామూహిక అక్షరాభ్యాసం
మల్కన్గిరి: విద్యాశాఖ ఆదేశాల మేరకు మల్కభ్గిరి ముండగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే, ఇతర ఉన్నతాధికారులు విద్యకు కొత్త అధ్యాయాన్ని సామూహిక అక్షరభ్యాసం కర్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు చాక్లెట్లు, పూలు ఇచ్చి ఆహ్వానించారు. కొత్తగా స్కూల్లో చేరే చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారుల తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడారు. చిన్నారుల భవిషత్ గూర్చి అవగహన కల్పించారు. ముఖ్యమంత్రి సంతకం చేసిన ప్రత్యేక ఆహ్వాన పత్రాలను తల్లిదండ్రులకు అందజేశారు. ఏప్రిల్ 2వ తేదీన జిల్లాలో అన్ని పాఠశాలల్లో అక్షరభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా విద్యశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి దశరాథి సరాబు, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విక్రమ్దేవ్ వర్సిటీ సందర్శన
జయపురం: జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ న్యూఢిల్లీ ప్రత్యేక మానిటర్ ప్రొఫెసర్ కనైయ్ త్రిపాఠీ సోమవారం స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు విశ్వ విద్యాలయ సిబ్బంది ఎన్సీసీ క్యాడర్ ఘనంగా స్వాగతం పలికింది. క్యాడెట్ల ప్రతిభను చూసి ప్రశంసించారు. సైబర్ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ అధికారులతో చర్చించారు. బాలికల హాస్టల్ వద్ద కామన్ టాయిలెట్లలో వెండింగ్ మిషన్ల ద్వారా శానిటరీ ప్యాడ్లు ఉండేలా ఏర్పాటుచేయాలని కోరారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తదితర విషయాలలో న్యాయం జరిగేలా చూడాలని, పీఎంజీ 4 కింద హాస్టల్ సదుపాయాలు మెరుగు పరచాలని ఆయన యూనివర్శిటీ రిజిస్ట్రార్ మహే్ష్ చంద్ర నాయక్తో జరిపిన చర్చల్లో సూచించారు. -
బీజేపీలో పలువురి చేరిక
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పదోవార్డుకి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి నరేష్కుమార్ సాహు, 13వ వార్డుకు చెందిన అట్టాడ వాసు, గుమ్మా బ్లాక్ ఝమ్మి గ్రామానికి చెందిన దనాన దామోదర్లు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంధర్భంగా కొత్త బస్టాండు నుంచి ఖంజావీధి పార్టీ కార్యాలయం వరకూ మోటారు సైకిల్ ర్యాలీ బీజేపీ శ్రేణులు నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కోడూరు నారాయణరావు, జిల్లా అధ్యక్షులు నబ కిశోర్శోబోర్ ఆధ్వర్యంలో జరిగిన మిశ్రణపర్వ్ సభలో నరేష్కుమార్, దామోదర్, వాసులకు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. వచ్చే పురపాలక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారన్న ధీమాను వ్యక్తం చేశారు. -
కులాంతర వివాహం చేసుకున్నందుకు శిరో మండనం
కొరాపుట్: కులాంతర వివాహం చేసుకున్నందుకు శిరో మండన శిక్ష అనుభవించాల్సి వచ్చింది. సోమ వారం కొరాపుట్ జిల్లా కేంద్రానికి సమీపంలో కొరాపుట్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జయపూర్ పట్టణంలో ఇద్దరు యువతీ యువకులు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని యువకులు కులస్తులు వ్యతిరేకించారు. అనంతరం కుల పెద్దలు పంచాయతీ పెట్టి యువకుడు శిరో మండనం చేసుకోవాలని, కులస్తులకు మాంసాహార భోజనం పెట్టాలని, కుల సంఘానికి రూ.90వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించారు. దీంతో ఆ యువకుడు షరతులు అంగీరిస్తూ వారు చెప్పిన ఆదేశాలు పాటించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంబంధిత వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
కన్నుల పండువగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
రాయగడ: వసంత నవరాత్రుల్లో భాగంగా స్థానిక బాలాజీనగర్లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారి కల్యా ణం కనుల పండువగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కల్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించగా అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుణుపూర్ గ్రీవెన్స్లో 86 వినతుల స్వీకరణ రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశం హాల్లో సోమవారం గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, జిల్లా ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, గుణుపూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అజయ్కుమార్ ప్రధాన్ , జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజినిదేవి తదితరులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుంచి 86 వినతులను స్వీకరించిన అధికారులు వీటిలో 53 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించారు. మరో 33 సామూహిక గ్రామ సమస్యలుగా గుర్తించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నవీన్చంద్ర నాయక్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మజ్జి గౌరి అమ్మవారికి వెండి మకరతోరణం రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే చల్లని తల్లి మజ్జిగౌరి అమ్మవారికి 35 కిలోల వెండి మకర తోరణాన్ని రూపొందించారు. అజ్ఞాత దాతలు ఇచ్చిన వెండితో అమ్మవారికి ఈ వెండి మకర తోరణం రూపొందించామని ఆలయ మేనేజింగ్ ట్రస్టీ రాయిసింగి బిడిక తెలియజేశారు. ఈ మేరకు మందిర ప్రాంగణంలో శుద్ధి చేసి పుణ్యాహవచనం నిర్వహించి శక్తి హోమాన్ని జరిపారు. ఆలయ ట్రస్టు సభ్యులు వడ్డాది శ్రీనివాస్ రావు దంపతులు ఈ హోమ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి ప్రారంభమైన అమ్మవారి చైత్రోత్సవాల్లో ఈ తోరణాన్ని అమ్మవారి గర్భగుడిలో అలంకరిస్తారు. సిటిజన్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక జయపురం: జయపురం సిటిజన్ కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. స్థానిక లంకేశ్వరి ఉద్యాన వనంలో ఎన్నిక ప్రక్రియ సోమవారం జరిగింది. అధ్యక్షులుగా శక్తి ప్రసాద్ పాణిగ్రహి, ఉపాధ్యక్షులుగా నరసింహ పాణిగ్రహి, లక్ష్మీనారాయణ మహంకుడొ, జి.సత్యనారాయణ, కార్యదర్శిగా అక్షయ కుమార్ సాహు, సహాయ కార్యదర్శులుగా నరేంద్రనాథ్ త్రిపాఠీ, అనీల్ పట్నాయక్, కోశాధికారిగా నవీణ చంద్రపాత్రో, సలహాదారులుగా భజన్ సింగ్, దీనబందు అగ్రవాల్ ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా గోవింద చంద్రసాహు, గణేష్ ఆచార్య, ప్రఫుల్ల రాయ్, సూర్యనారాయణదాస్, సుభాష్ జైన్, సుభాష్ చంద్రచౌదరి, రమేష్ చంద్ర త్రిపాఠీ, శివ ప్రసాద్ పట్నాయక్, ప్రితీష్ పట్నాయక్ను నియమించారు. అనంతరం నూతన కమిటీ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. -
డీజిల్ దొంగల ముఠా
కొరాపుట్ : యుద్ధ ప్రభావంతో కొత్త తరహా దొంగల ముఠాలు ఏర్పడ్డాయి. సోమవారం కొరాపుట్ సదర్ పోలీస్ స్టేషన్ పోలీసులు డీజిల్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. ఎస్డీపీఓ సంజయ్ మండల్ ఈ కేసు వివరాలు ప్రకటించారు. పొడాఘఢ్ ప్రాంతంలో ఒక ట్రక్ నుంచి డీజిల్ దొంగతనం అవ్వడంతో పోలీసులు ముఠా కోసం గాలించారు. మొత్తం 11 మంది ముఠాలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా టునా హరిజన్, ధనుర్జయ్ పరజాలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన వారితో పాటు డీజిల్ కొనుగోలు చేసిన మరో ఆరుగురు దుకాణ యజమానులను కూడా అరెస్టు చేశారు. వీరి నుంచి 470 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ప్రధాన మంత్రికి గవర్నర్ శుభాకాంక్షలు భువనేశ్వర్: 8,931 రోజుల సుదీర్ఘ పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా నిలిచిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి హదయపూర్వక అభినందనలు తెలిపారు. నిర్ణయాత్మక నాయకత్వం, అంకిత భావం మరియు భారత దేశ ప్రగతి పట్ల అచంచలమైన నిబద్ధతతో కూడిన ఒక అద్భుతమైన ప్రయాణంగా ఈ విజయాన్ని అభివర్ణించారు. భావి ప్రయాణంలో ఆయనకు నిరంతర శక్తి, విజయం చేకూరాలని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆకాంక్షించారు. -
మద్యం మత్తులో తుపాకీ కాల్పులు
కొరాపుట్: మద్యం మత్తులో తుపాకీతో కాల్పులు జరపడంతో యువకుని పరిస్థితి విషమంగా మారింది. సోమవారం నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితి ఏకంపారా గ్రామానికి చెందిన బిక్షయా సబర్ అనే యువకుడు అతిగా మద్యం సేవించి కుసుంబల్ గ్రామానికి వచ్చి గ్రామస్తులతో గొడవ పడ్డాడు. గ్రామస్తులు నచ్చజెప్పి అతనిని పంపించేశారు. అనంతరం బిక్షయా సంబర్ తన వద్ద ఉన్న నాటు తుపాకీతో తిరిగి గ్రామానికి వచ్చాడు. గ్రామం మధ్యలో మాట్లాడుతున్న పాండు జానీ అనే వ్యక్తి పై వెనుక నుంచి తుపాకీ తో కాల్పులకు దిగాడు. దీంతో పాండు కుప్పకూలిపోయాడు. వెంటనే గ్రామస్తులు జొరిగాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఉమ్మర్కోట్ ప్రభుత్వ ఆస్పత్రికి అనంతరం నబరంగ్పూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే కొరాపుట్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాలకి తరలించారు. బాధితుడికి రూ.5 చోట్ల తుపాకీ తూటా గాయాలయ్యాయని, ప్రభుత్వ వైద్యురాలు సుస్మితా నాయక్ ప్రకటించారు. అందులో ఒక బులెట్ వెన్నెముకకి తగిలిందని పేర్కొన్నారు. జొరిగాం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
15 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బలిమెల పోలీసులు సోమవారం మధ్యాహ్నం బలిమెల –చిత్రకొండ ముఖ్య రహదారిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ సంచి పట్టుకొని బస్సు కోసం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా నిలబడి ఉన్నారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా.. గంజాయి వెలుగు చూసింది. వెంటనే గంజాయిని స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. ఐఐసీ దీరాన్ పట్నాయక్ నిందితుడిని విచారింగా.. చిత్రకొండలో గంజాయి కొనుగోలు చేసి బీహార్కు తరలిస్తున్నట్టు నిందితుడి అంగీకరించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తూకం వేయగా 15 కిలోలు ఉంది. దీని విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని ఐఐసీ దీరాన్ తెలిపారు. నిందితుడు బీహార్ రాష్ట్రం ససారాం జిల్లాకు చెందిన కృష్ణ చౌరాసియాగా గుర్తించారు. అతని వద్ద నుంచి గంజాయితోపాటు సెలల్ఫోన్, ఆధార్ కార్డును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామన్నారు. -
అపూర్వ కలయిక
జయపురం: అప్పర్ కొలాబ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఇరిగేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అప్పర్ కొలాబ్ ప్రాజెక్టు ఉన్నత పాఠశాలలో 2002 విద్యా సంవత్సరంలో మెట్రిక్ చదువుకున్న పూర్వ విద్యార్థులు సోమవారం అత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బందుమిలన్ పేరిట ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో వేర్వేరు ప్రాంతాల్లో.. వివిధ హోదాల్లో స్థిరపడిన 100 మందికిగా పూర్వ విద్యార్థులు 24 ఏళ్ల తరువాత కలుసుకొని సందడి చేశారు. చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగాక్షేమాలు తెలుసుకున్నారు. గ్రూపు ఫొటోను తీసుకొని మురిసిపోయారు. ఈ సందర్భంగా ‘మొ స్కూల్ అభిజాన్’పథకంలో చదువుకున్న పాఠశాలకు 20 వేల రూపాయలను ప్రధాన ఉపాధ్యాయురాలు ధరిత్రి మహారాణ అందజేశారు. చదువు నేర్పిన అప్పటి గురువులను దుశ్శాలువలతో సత్కరించి గౌరవించారు. విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయురాలు పి.జ్య్త్స్నోరాణి రావు, ఉపాధ్యాయులు తపన్ కిరణ్ త్రిపాఠీ, రామ మోహనపండ, ఇందుమతి దాస్, సంయుక్త పండా, జగదీష్ ప్రసాద్ స్వైన్ పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల త్యాగాన్ని మర్చిపోవద్దు
● హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి భువనేశ్వర్: హైటెక్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ‘కుహుడి’ నాటకాన్ని సోమవారం ప్రదర్శించారు. ప్రముఖ నాటక సంస్థ విద్యా కనక సజన సంస్థ కళాకారులు ప్రదర్శించిన ఈ నాటకం అందరినీ ఆకట్టుకుంది. హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సందేశం ఉన్న ఇలాంటి నాటకాలు రాబోయే తరానికి స్ఫూర్తిదాయకంగా, ఉపయోగకరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. తన జీవితంలో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనలను ఆయన వివరించారు. పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రుల త్యాగాలను మర్చిపోకూడదన్నారు. ఎందుకంటే వారే తొలి దైవమని అన్నారు. ఒక విరామ ఉద్యోగికి తన సొంత ఇల్లు, కుటుంబం భరించలేని భారంగా మారుతున్న వర్ధమాన సమాజానికి ఈ నాటకం చక్కని మానవీయ సందేశం ప్రసారం చేసిందని నటీనటులు, సాంకేతిక, ఇతర వర్గాల కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా కళాకారులను హైటెక్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహిని ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. -
వ్యతిరేక దినోత్సవం’
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026‘ఇది సామ్రాజ్యవాదుల.. జయపురం: కమ్యూనిస్టు పార్టీ దాని అనుబంధ సంస్థలు అమర వీరుల దినోత్సవాన్ని సామ్రాజ్యవాదుల వ్యతిరేక దినంగా నిర్వహించారు. కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్, ఉత్కళ మహిళా సమితి సంయుక్తంగా అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమర వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయపురం శ్రామిక భవనం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన మార్గంలో గల సహిద్ లక్ష్మణ నాయిక్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి జుధిస్టర్ రౌళో అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయంత దాస్ మాట్లాడుతూ అమర వీరులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్లు బ్రిటిష్ వలస పాలనలో దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ప్రపంచంలో సామ్రాజ్యవాదుల దురాగతాలపై ఆయన నిప్పులు చెరిగారు. అమెరికా, ఇజ్రాయిల్ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. -
మాత్తిలి సమితి గ్రీవెన్స్కు 80 వినతులు
మల్కన్గిరి: జిల్లాలోని మాత్తిలి సమితి కుమార్పల్లి పంచాయతీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజల నుంచి 80 వినతులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు . వాటిలో కొన్నింటిని అక్కడకక్కడే పరిష్కరించారు. 52 సాముహిక గ్రామ సమస్యలు కాగా, 28 వ్యక్తిగత సమస్యలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వీటిని పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని గిరిజనులతో మాట్లాడి ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్, జిల్లా అభివృధి శాఖ అధికారి దశరథి సరబు, సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి పాల్గొన్నారు. వినతుల వెల్లువ పర్లాకిమిడి: గజపతి జిల్లాలో రాయఘడ బ్లాక్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, రాయఘడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా హాజరయ్యారు. 52 వినతులు అందాయి. వీటిలో వ్యక్తిగతం14, గ్రామ సమస్యలకు సంబంధించినవి 38 ఉన్నాయి. వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాయఘడ పంచాయతీ ఉపాధ్యక్షుడు జ్యోతి రంజన్ పాణి, బీడీఓ సంతోష్ కుమార్ బారిక్, తహసీల్దార్ సుకాంత ప్రధాన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
బంగారం దొంగతనం చేసిన వ్యక్తి అరెస్టు
మందస: మండలంలోని హరిపురం గ్రామ పెద్దవీధికి చెందిన పొట్టి శాంతి ఇంట్లో ఇటీవల 20 గ్రాముల బంగారం దొంగతనం జరిగింది. ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కేసుని విచారణ చేసిన పోలీసులు నిందుతుడిని సోమవారం పట్టుకున్నారు. నిందితుడు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. నిందితుడు ఉమాకాంత్ బిస్వల్(శంకర్) హరిపురంలోని శ్రీలక్ష్మీ స్వీట్ షాప్లో కూలీపని చేసుకుంటున్నాడు. అదే షాపులో పొట్టి శాంతి కూడా పని చేస్తుండగా, ప్రతిరోజు మాదిరిగానే ఇంటికి తాళం వేసి తన హ్యాండ్ బ్యాగులో వేసుకొని షాపునకు వచ్చింది. నిందితుడు శంకర్ ఆమె బ్యాగ్లో ఉన్న తాళం చెవిని తీసి శాంతి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను పట్టపగలే దొంగలించాడు. దీనిపై ఆమె ఈనెల 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందుతుడిని పట్టుకున్నారు. సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి సోంపేట కోర్టుకు తరలించారు. -
హుండీలో నగదు చోరీ
సోంపేట: బారువ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివా రం రాత్రి హుండీని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి నగదు దొంగిలించారు. కమిటీ సభ్యులు ఆదివారం ఉదయం వెళ్లే సరికి హుండీ ధ్వంసమై ఉండడాన్ని గమనించారు. కమిటీ సభ్యుడు ఎస్.ఆదినారాయణ బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదినారాయణ ఫిర్యా దు మేరకు ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా నిరసన మందస: బిడిమి గ్రామంలో జుత్తు జగన్నాయకులు స్మారక చిహ్నం వద్ద ఆదివారం కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు కొందరు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు శ్రీకాకుళం కలెక్టరేట్కు వెళ్లి భూములు ఇవ్వడానికి ఈ ప్రాంతం ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారని, అది పూర్తిగా అసత్యమని తేల్చి చెప్పారు. ఈ ప్రాంతంలో సెంటు భూమి కూడా ఇవ్వబోమని తేల్చి చె ప్పారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషకు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పామన్నారు. కేంద్ర మంత్రికి ఉద్దానం సమస్యలపై పట్టింపు లేదన్నారు. కార్యక్రమంలో తెప్పల అప్పారావు, కృష్ణమూర్తి, గంటు రామస్వామి, దున్న రామారా వు, తామాడ లక్ష్మీ నారాయణ, దున్న సురేష్, మర్ల సంతోష్, లబ్బ సురేష్ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నారని రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీ సీమ రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు సమస్యలపై వినతులు అందజేయవచ్చన్నారు. సాయంత్రం మూడు గంటలకు జిల్లా అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు. -
ఫోజులు కొత్తవి
పనులు పాతవి.. ఈ ఫొటో చూడండి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన అరసవల్లి ఇంద్ర పుష్కరిణి పునః నిర్మాణ పనులకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కలిపి మరోసారి శంకుస్థాపన చేసిన దృఽశ్యమిది. నాడు మంజూరైన నిధులనే వినియోగిస్తూ దానికి ప్రసాద్ స్కీమ్ రూ. 58కోట్లతో అభివృద్ధి పనులని కలరింగ్ ఇచ్చారు. ఈ ఫొటో చూడండి. 2023 డిసెంబర్ 20వ తేదీన రూ.4కోట్లతో అరసవల్లి ఇంద్ర పుష్కరిణి పునః నిర్మాణ పనులకు నాటి రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేసిన దృశ్యమిది. నిధులు కూడా మంజూరయ్యాయి. పుష్కరిణిలో ఉన్న నీరు అంతా తీసేసి క్లీన్ చేశారు. అప్పటికి కాంట్రాక్టర్ ఖరారు కాలేదు. పనులు చేసే లోపు ఎన్నికల కోడ్ వచ్చేసింది. పనులు ముందుకు సాగలేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అభివృద్ధి అనే పదానికి చంద్రబాబు ప్రభుత్వం వింత అర్థం చెబుతోంది. గత ప్రభుత్వంలో శంకుస్థాపన జరిగిన పనులకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రసాద్ స్కీమ్ కింద అరసవల్లి అభివృద్ధి చేస్తామని అనేక శాశ్వత కట్టడాలను కూల్చేశారు. ఆ పనులకు ఇప్పటివరకు అతీగతి లేదు. ఇప్పటికే రెండు రథసప్తమి వేడుకలు అయిపోయాయి. కూల్చేసిన కట్టడా లు ఎక్కడికక్కడే ఉన్నాయి. ప్రసాద్ స్కీమ్ మంజూరుకు నోచుకోలేదు. ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడేమో రూ. 58కోట్లతో ప్రసా ద్ స్కీమ్ ద్వారా అరసవల్లి క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పి.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేసిన ఇంద్ర పుష్కరిణి పనులకే మళ్లీ కింజరాపు బాబాయ్, అబ్బాయ్లు శంకుస్థాపన చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రథ సప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా గుర్తించి, ప్రజల సొమ్ముతో సంబరాలు చేసి, వివిధ కార్యక్రమాలతో సోకులు చేశారే తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకురాలేదు. అట్టహాసం పేరుతో విపరీతమైన పబ్లిసిటీ చేసి ఈ సారి రథసప్తమి దర్శనాల సమయంలో భక్తులను తీవ్ర ఇబ్బందులకు గు రి చేశారు. ప్రత్యేకంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. ఒక్క పైసా విడుదల చేయలేదు. కార్పొరేషన్లో అప్పటికే ఉన్న నిధులను, సుడా నిధులను వాడేసి అభివృద్ధి పనుల ముసుగులో కావాల్సిన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు. ఆ పనులు ఎంత నాసిరకంగా ఉన్నాయో వాటిని ప్రస్తుతం చూస్తే ఎవరికై నా అర్థమవుతుంది. కార్పొరేషన్ సొమ్మును దుబారా చేయడం తప్ప పనులకు సార్థకత ఉండటం లేదు. వీరు చేసిన పనికి కార్పొరేషన్ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, నిధులు ఖాళీ అయిపోయాయని, కొత్త పనులు చేపట్టడానికి ఏమీ లేదని ఓ అధికారి ఉన్నతాధికారులకు ఏకంగా నివేదిక ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడేమో రూ. 58కోట్లతో ప్రసాద్ స్కీమ్ కింద అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని కొత్త పబ్లిసిటీకి తెరలేపారు. డైవర్షన్ పాలిటిక్స్ మాదిరి ప్రజల్ని మభ్య పెట్టేడమే లక్ష్యంగా అడుగులు వేస్తు న్న పరిస్థితులు ఉన్నాయి. నాలుగు సార్లు ముఖ్య మంత్రిగా చేసిన చంద్రబాబు ఈ జిల్లాకు చేసిన మేలంటూ ఏమీ లేదు. వైఎస్సార్ చేపట్టిన వంశధార ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన మూలపేట పోర్టు, బుడగట్లపాలెం పిషింగ్ హార్బర్, వంశధార ఎత్తిపోతల పథకం, కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి, ఉద్దానం మంచినీటి పథకం, గత ప్రభుత్వంలో మంజూరైన విద్యా సంస్థలకు పూర్తి సౌకర్యాలు, వసతులు, పనుల పూర్తిపై ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. ఇప్పటికే అధికారం వచ్చి రెండేళ్లు కావస్తోంది. మిగతా మూడేళ్లలో ఏం చేస్తారో క్లారిటీ లేదు. దానికి అరసవల్లి ఆలయం అభివృద్ధి పనుల పేరుతో కూల్చేసిన కట్టడాల చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేసిన శంకుస్థాపనలకు మళ్లీ శంకుస్థాపనలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నదిదే కొత్తగా మంజూరు కాని నిధులు పాత వాటితో సోకులు అరసవల్లి ఆలయ అభివృద్ధి పేరుతో కొత్తగా హడావుడి -
చలో ఢిల్లీ విజయవంతం చేయండి
జయపురం: జనజాతుల మౌళిక హక్కుల సాధనకు ఈ నెల 24వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు జాతీయ జనజాతీ సురక్షా మంచ్ ఇచ్చిన పిలుపుమేరకు కొరాపుట్ జిల్లా నుంచి జనజాతి సురక్షా మంచ్ ప్రతినిధులను పంపేందుకు ఆదివారం స్థానిక వనవాసి కళ్యాణ మంచ్ కార్యాలయంలో కొరాపుట్ జిల్లా జనజాతి సురక్ష మంచ్ సమావేశమైంది. జిల్లా అధ్యక్షుడు బాలాజీ బెహర అధ్యక్షతన జరిగిన సమావేశంలో వనవాసీ కళ్యాణ ఆశ్రమ యువ విభాగ ప్రాంతీయ సమన్వయ కర్త రతికాంత సాహు ఢిల్లీ లో నిర్వహించే ఉద్యమం యొక్క లక్ష్యాలను, ఉద్దేశాలను, మార్గదర్శకాలను వివరించారు. దేశంలో మౌళిక హక్కుల పరిరక్షణ, రాజ్యాంగంలో ఆర్టికల్ 341ను తప్పకుండా కఠినంగా అమలు చేయటం, జనజాతి సంప్రదాయ ప్రజలను ప్రలోబాలు చూపి మతమార్పికి పాల్పడుతున్న వారి నుంచి విముక్తి కల్పించటం ప్రధాన లక్ష్యంగా అఖిల భారత జన జాతి సురక్ష మంచ్ ఈ నెల 24వ తేదీన చలో ఢిల్లీకి పిలుపు నిచ్చిందని వెల్లడించారు. రెండు లక్షలకు పైగా జనజాతి ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో కొరాపుట్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొరాపుట్ జిల్లా వన వాసి సమన్వయ కర్త చిత్ర సేన్ మాట్లాడుతూ ర్యాలీలో కొరాపుట్ జిల్లా నుంచి 100 మందితోపాటు అవిభక్త కొరాపుట్ నుంచి 250 మంది పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో వనవాసి కళ్యాణ ఆశ్రమ యువ విభాగ ప్రాంత సహాయ సమన్వయకర్త లక్ష్మీకాంత మిశ్ర, సధా భూమియ, ప్రపుల్ల బిశాయి, దహనాఘీవురియ, ద్రౌపతి నాయక్, దుర్లభ మఝి, వికాస్ చలాన్, తదితరులు పాల్గొన్నారు. -
ధ్యానంతో మానసిక ప్రశాంతత
రాయగడ: ప్రతి నిత్యం ధ్యానం చేయడంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, ఆర్యోగానికి ఎంతో మేలు చేకూరుతుందని డాక్టర్ లీజారాణి సతపతి అన్నారు. స్థానిక అటానమస్ కళాశాల సువర్ణజూబ్లీ సమావేశం హాల్లో గత వారం రోజులుగా కొనసాగుతున్న ధ్యానం కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా సతపతి మాట్లాడుతూ ప్రతిరోజూ కనీసం గంట సమయం ధ్యానం కోసం కేటాయించాలని కళాశాల విద్యార్థినులకు సూచించారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. అనంతరం ధ్యానం చేసే విధానాన్ని వివరిస్తూ శిక్షణ కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సరస్వతి రాయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా పకాల్ దినోత్సవం
రాయగడ: స్థానిక జంఝావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సంఘం కార్యాలయం ప్రాంగణంలో పకాల్ దినోత్సవాన్ని క్లబ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల వెజ్, నాన్వెజ్లతో కూడిన కూరల వంటకాలను చేసుకుని చద్దన్నంతో సామూహికంగా తిని ఆనందించారు. చద్దన్నం తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఈ సందర్భంగా సందేశాన్ని ఇస్తూ అంతా ఆనందించారు. క్లబ్ అధ్యక్షురాలు అనసూయా మాఝి, ఎంజీఎఫ్ రుడి కుండు, ఉపాధ్యక్షురాలు రేణుబాల పాణిగ్రహి, కోశాధికారి బియలక్ష్మీ మిశ్రోల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. -
ప్రపంచ జల దినోత్సవంపై అవగాహన
జయపురం: జయపురం ఎం.ఎస్ స్వామినాథన్ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో సెమిలిగుడ సమితి దుధారి గ్రామ పంచాయతీలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఐఐఎస్బ్ల్యూ సునాబెడ శాస్త్రవేత్త డాక్టర్ జ్యోతిర్మయి లెంక పాల్గొని నీటి సంరక్షణ, నీటి ప్రాముఖ్యత, శాసీ్త్రయపద్ధతులపై రైతులకు అవగాహణ కల్పించారు. దుధారి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ మహేశ్వర్ నాయక్ మాట్లాడుతూ.. దుదాయి ప్రాంతంలో పెరుగుతున్న నీటి కొరత, నీటి వినియోగ నిర్వహణ, ప్రభుత్వ తాగునీటి సరఫరా, సాగునీటి వనరులు, తదితర విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ కార్తీక చరణ లెంక మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి నీటి సంరక్షణలో సమర్థవంతమైన పాత్ర నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీటి సంరక్షణకు కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. రిసెర్చ్ సెంటర్ మరో సైంటిస్టు సంతోష్ కుమార్ సాహు మాట్లాడుతూ.. భూగర్భ జల వనరుల సంవరక్షణ, వర్షం నీరు సంవరక్షణ ఎంతో అవసరమన్నారు. మరో అతిథి దీప్తి మయి సాహు మాట్లాడుతూ.. వర్షపు నీటిని ఎలా వినియోగించాలి, నీటిని ఎలా నిల్వ చేయాలి, తదితర విషయాలను సమగ్రంగా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దుధారి పంచాయతీలోని గ్రామాల నుంచి 80 మంది రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గోపీ గొలారి, దిలీప్ కుమార్ సుబుద్ది, ప్రత్యూష్ పాడీ, ఎం.ఎస్.స్వామినాథన్ జయపురం డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడ, కార్తీక చరణ్ లెంక పర్యవేక్షణలో సమర్థవంతంగా నిర్వహించారు. -
27 ఏళ్ల తర్వాత ఇంటికి..!
● కన్నకొడుకును చూసి కన్నీరుమున్నీరైన తండ్రిఅల్లిపురం (విశాఖ): ఇరవై ఏడు ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇంటికి చేరుకుంటే ఆ కుటుంబంలో కలిగే ఆనందం వర్ణనాతీతం. అలాంటి మధుర అనుభూతిని ఏయూటీడీ సంస్థ ప్రతినిధులు ఆ కుటుంబానికి కల్పించారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం, కలహండి జిల్లా, బర్గాన్ గ్రామానికి చెందిన మహేందర్ చత్రియ గతంలో మానసిక అనారోగ్యానికి గురై ఇల్లు వదిలి వచ్చేశాడు. 2024 నవంబర్లో విశాఖ రైల్వే స్టేషన్లో దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న అతడిని ఏయూటీడీ సిబ్బంది గుర్తించి చేరదీశారు. ఐదు నెలలుగా ‘శ్రద్ధా’ మందులతో వైద్య సేవలందించారు. చికిత్స అనంతరం మహేందర్ కోలుకోవడంతో, సంస్థ ప్రతినిధులు అతడిని నేరుగా సొంతూరికి తీసుకువెళ్లారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత గ్రామానికి చేరుకోవడంతో అక్కడి పరిసరాలన్నీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఎనిమిదేళ్ల కిందటే మహేందర్ తల్లి మరణించగా, తండ్రి రాకేశ్ కుమార్ చత్రియ మాత్రం కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. చనిపోయాడనుకున్న కొడుకు కళ్లముందు నిలబడటంతో ఆ వృద్ధ తండ్రి భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ఇక నేను నిశ్చింతగా కన్నుమూస్తాను’ అంటూ ఆయన అన్న మాటలు గ్రామస్తులందరినీ కదిలించాయి. మహేందర్ను అతని తండ్రికి, సోదరులకు క్షేమంగా అప్పగించినట్లు ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు తెలిపారు. -
బీజేపీలో పలువురి చేరిక
● కాశీనగర్, గుసాని సమితిల్లో బీజేడీ పార్టీకి షాక్పర్లాకిమిడి: కాశీనగర్, గుసాని సమితుల్లో బిజూ జనతా దళ్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ యూత్ ప్రెసిడెంటు శాసనం లింగరాజు, కాశీనగర్ సమితి వైస్ చైర్మన్ ఎస్.కళ్యాణి, సీహెచ్ లోకనాథంతో పాటు వందలాది వారి మద్దతుదారులు, కార్యకర్తలు ఆదివారం జరిగిన మిశ్రణ్ పర్వ్లో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక బిజూ కళ్యాణ మండపములో బీజేపీ మిశ్రణ్ పర్వ్కు కేంద్ర మాజీ మంత్రి, గజపతి జిల్లా బీజేపీ ప్రభారీ విశ్వేశ్వర టుడు, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కోడూరు నారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కాషాయం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే గుసాని నాలుగో వార్డు సర్పంచ్ కల్పనా ప్రధాన్, బొమ్మిక సర్పంచ్ జి.విమలావతి, మాజీ సమితి సభ్యులు లక్ష్మణరావు, భిన్నల మాజీ సర్పంచ్ శిశిర్ ప్రధాన్, హడ్డుభంగి, ఉప్పలాడ, ఖండవ, గుసానిబ్లాక్లోని అగర్ఖండి, ఘోర్నీ, బాగుసల గ్రామాల నుంచి అధికసంఖ్యలో వారి మద్దతుదార్లు, కార్యకర్తలు బీజేపీలోకి చేరారు. వీరి చేరికతో కాశీనగర్, గుసాని సమితిలో తమ పార్టీ బలం రెండింతలు అయ్యిందని గజపతి జిల్లా బీజేపీ ప్రభారీ విశ్వేశ్వర టుడు అన్నారు. తమ పార్టీలో 600 మందికిపైగా కాంగ్రెస్, బీజేడీ పార్టీల నుంచి చేరారన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లోగా మరికొంతమంది బీజేడీ నాయకులు బీజేపీలోకి రావకడం ఖాయమని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కోడూరు నారాయణరావు ధీమా వ్యక్తం చేశారు. మిశ్రణ్ పర్వ్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు నబకిశోర్ శోబోరో, కాశీనగర్ మాజీ చైర్మన్ ఛిత్రి సింహాద్రి, కాశీనగర్ మండల అధ్యక్షులు కోడూరు జీవన్రావు పాల్గొన్నారు. -
క్రీడా పోటీల్లో కిశోర్చంద్ర రథ్ ప్రతిభ
పర్లాకిమిడి: హరియాణ రాజధాని చండీగఢ్లో ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకూ జరిగిన మాస్టర్ గేమ్స్లో పర్లాకిమిడికి చెందిన విశ్రాంత అబ్కారీ శాఖ ఉద్యోగి కిశోర్చంద్ర రథ్ సత్తాచాటారు. వందమీటర్ల పరుగు పందెంలో సిల్వర్, 200 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్, ట్రిపుల్ జంప్లో ద్వితీయ బహుమతిగా సిల్వర్ పతకాలు సాధించాడు. ఈ గెలుపుతో కిశోర్ చంద్ర రథ్ వచ్చే వరల్డ్ మాస్టర్ గేమ్స్లో పాల్గోనేందుకు ఆర్హత సాధించాడు. గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆథెలెటిక్స్లో అనేక బహుమతులు సాధించాడు. ఆయన గెలుపుపై గజపతి జిల్లాలోని క్రీడాకారులు, జిల్లా స్పోర్ట్స్ అధికారి త్రినాథసాహు హర్షం వ్యక్తం చేశారు. -
‘అణగారిన వర్గాల గాథలే కవితలు’
జయపురం: కవితలు అణగారిన వర్గాల బాధలను గాథలను ప్రతిబింబిస్తాయని ప్రముఖ కవి డాక్టర్ బాసు దేవ్ సునాని అన్నారు. కవి బలరాం పూజారి 52వ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక ఎస్ఆర్ మాల్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో బాసుదేవ్ సునానీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ బలరాం పూజారి ప్రజా కవి అని ఆయన కవితలు ప్రజలను చైతన్యపరిచేవిగా ఉంటున్నాయన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా ప్రముఖ పరిశోధకులు డాక్టర్ పరమేశ్వర ముంఢ, కవయిత్రి డాక్టర్ ప్రీతి ధారా సామల్, కవి బలరామ్ పూజారి సాహిత్య ప్రమాణాలను విశ్లేసిస్తూ ప్రసంగించారు. ప్రముఖ కవి కార్యక్రమ పరిచాలకులు ధర్మ రాజ్ మఝి అధ్యక్షతన జరిగిన బలరాం పూజారి జయంతి వేడుకల్లో కవి చక్రపాణిని సత్కరించారు. ఈ సందర్భంగా కవి బలరాం పూజారికి అంకితంగా ‘కవి కొరాపుట్’ పేరుతో ప్రత్యేక కవి సమ్మేళనం నిర్వహించారు. -
ప్రత్యేక పడవలు
సత్తిగూడ ఇకో పార్క్లోమల్కన్గిరి: మల్కన్గిరి సమితి సత్తిగూడ డ్యామ్ వద్ద అటవీ దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజేశిర్కే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇకో పార్క్లో భాగంగా డ్యామ్లో ప్రత్యేక యాంత్రిక పడవలను ప్రారంభించారు. వన్య ప్రాణుల సంరక్షణ గురించి వివరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి సాయి కిరణ్ డీఎన్, జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, అదనపు అటవీ శాఖ అధికారి ప్రియాంక మహుకా, సత్తిగూడ డ్యామ్ ప్రాజెక్ట్ సహాయ ఇంజినీర్ లలిత్ బెహరా తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికుడిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
రాయగడ: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగారు. ఆదివారం సాయంత్రం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాయగడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న నాగావళి ఎక్స్ప్రెస్ నడుస్తుండగా ఒక ప్రయాణికుడు ఎక్కే సమయంలో జారి పడ్డాడు. అదే సమయంలో ఒకటో నంబర్ ప్లాట్ఫారంపై విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అంకుర్ చౌదరి సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలు కిందకు జారిపడుతున్న ప్రయాణికుడిని పట్టుకుని బయటకు తీసి ప్రాణాలను కాపాడాడు. నిండు ప్రాణాన్ని కాపాడినందుకు అందరూ అతనిని అభినందించారు. గత ఏడాది ఏప్రిల్ 12వ తేదీన కూడా ఇదే తరహాలో అంకుర్ చౌదరి ఓ ప్రయాణికుడిని కాపాడి అందరి మన్ననలను పొందారు.ఇళ్లలోకి దూసుకెళ్లిన ట్యాంకర్రాయగడ: పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి ఝార్సుగుడ వైపు అల్యూమిన కెమికల్స్ లోడుతో వస్తున్న ట్యాంకర్ అదుపుతప్పి మునిగుడలోని కన్యకాపరమేశ్వరి మందిరం సమీపంలోని ఇళ్లల్లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో మూడు ఇళ్లకు చెందిన ప్రహరీలు, పెంకుటిళ్ల ముందుభాగం పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న మునిగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో పెద్ద శబ్దం రావడంతో ఇళ్లలో నిద్రిస్తున్న వారు బయంతో బయటకు పరుగులు తీశారు. ఇళ్ల గోడలను ఢీకొన్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 18 అడుగుల కొండచిలువ పట్టివేతమల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంపీవీ 18 గ్రామంలో ఆదివారం ఓ ఇంటిలోకి కొండ చిలువ ప్రవేశించింది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వగా పాములు పట్టే నిపుణులను తెచ్చి రెండు గంటల పాటు శ్రమించి పామును పట్టుకున్నారు. ఇది 18 అడుగుల పొడవు ఉన్నట్లు తెలిపారు. దీన్ని సమీప అడవిలో విడిచిపెడతామని తెలిపారు. జన గణన జన కల్యాణం భువనేశ్వర్: పూరీ సాగర తీరంలో రూపుదిద్దుకున్న సైకత శిల్పం జన గణన జన కల్యాణం సందేశంతో సందర్శకులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల జన గణన బ్రాండ్ అంబాసిడరుగా నియమితులైన సుదర్శన్ పట్నాయక్ ఈ శిల్పం తీర్చిదిద్దారు. భారత తొలి డిజిటల్ జన గణన. ఈ కార్యక్రమం తొలి విడత కింద ఇండ్ల జాబితా మరియు లెక్కింపు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం మే నెల 15వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతుందని ఈ శిల్పంలో ప్రదర్శించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి చాటికోన వద్ద ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలొ ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒక యువతి, ఒక యువకుడు ఉన్నారు. కాశీపూర్ సమితిలోని టికిరి ప్రాంతానికి చెందిన ఆకాష్ నాయక్ (32), రాయగడకు చెందిన పూనమ్ (21)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పొస్టుమార్టం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఆదివారం నాడు పూనమ్, ఆకాష్లు బైక్పై బిసంకటక్ వైపు వెళ్తుండగా బైకు అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో బైకు వెనుక కూర్చున్న ఆమె కొద్ది దూరం ఎగిరి పడిపొగా బైకు డ్రైవ్ చేస్తున్న ఆకాష్ కిందపడి తీవ్రగాయాలకు గురయ్యాడు. అనంతరం వారు సంఘటన స్థలం వద్దే మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అగ్ని ప్రమాద నివారణ చర్యలు పరిశీలన
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంరక్షణ చర్యలు అధికార యంత్రాంగం పరిశీలించింది. శనివారం నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి అత్యవసరంగా ఈ పర్యటన నిర్వహించారు. కటక్లోని ఎస్ఈబీలో జరిగిన ప్రమాదం దృష్ట్యా ఈ పర్యటన జరిగింది. కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ నేతృత్వంలోని బృందం ఆస్పత్రిలో వివిధ విభాగాలు పరిశీలించారు. వివిధ బ్లాకుల్లో అగ్ని ప్రమాదం ఏర్పడితే తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై క్షేత్ర పర్యటనలో తెలుసుకున్నారు. కొన్నిచోట్ల లోపాలను సరిదిద్దాలని ఎమ్మెల్యే గౌరీ అధికారులను సూచించారు. అనంతరం సమీక్ష సమావేశం జరిగింది. -
మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించండి
రాభమద్రపురం/బొబ్బిలిరూరల్: మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి గోపాలం డిమాండ్ చేశారు. రామభద్ర పురం మండంలోని ఎస్.సారాంపురం,గొల్లపేట,ఇట్లామామిడిపల్లి, బొబ్బిలి మండలంలోని కారాడ,పిరిడి,అలజంగి గ్రామాల్లో శనివారం పర్యటించారు.మొక్కజొన్న పంటను పరిశీలించి, రైతుల కష్టాలను తెలుసుకున్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోం దని, తీరా సాగు చేశాక ఆయా పంటలను కొనుగోలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు.జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో 60వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగులో ఉందని, పంట దిగుబడి బాగుందని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పంటను ప్రైవేటు వ్యాపారులకు క్వింటాల్ రూ.1,600 నుంచి రూ.1,700 విక్రయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.దళారులు రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు.క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించి, ప్రభుత్వమే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంటకు మద్ధతు ధర కల్పించడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23వ తేదీన విజయనగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకు చేపట్టనున్న ధర్నాకు రైతులు తరలిరావాలని కోరారు. రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రంనాయుడు,తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతల స్వీకరణ
బొబ్బిలి: మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి పరిపాలనను సమర్థవంతంగా చేపట్టనున్నట్టు మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆర్డీఓ జె.వి.వి.ఎస్.రామమోహనరావు తెలిపా రు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శని వారం ఆయన బాధ్య తలు స్వీకరించారు. ము న్సిపాలిటీలోని 31 వార్డులూ అభివృద్ధి పథంలో పయనించేలా కలెక్టర్ ఆదేశాలు పాటిస్తూ పని చేస్తామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఇంటిపన్ను చెల్లించాల్సిందే..రాజాం: ప్రజలు బకాయిపడిన తమ ఇంటిపన్నును తప్పక చెల్లించాల్సిం దేనని డిప్యూటీ ఎంపీడీఓ వి.శ్రీనివాసరావు అన్నారు.కంచరాం గ్రామంలో ఇంటిపన్ను వసూళ్లను శనివారం పరిశీలించారు. ఆ పంచాయతీలో అధికంగా ఇంటిపన్ను బకాయిపడినవారితో మాట్లాడి స కాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు. అన్నదానంరాజాం: మండలంలోని అంతకాపల్లి గ్రామంలోని టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద శనివారం అన్నదానం నిర్వహించారు. రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన టంకాల యల్లంనాయుడు కుటుంబీకులు 2 వేల మందికి అన్నసంతర్పణ చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు.ఆలయ ఇన్స్పెక్టర్ కె.వి.రమణ పాల్గొన్నారు. రామాలయ నిర్మాణానికి భూమిపూజసంతకవిటి: మండలంలోని పోతురాజుపేట గ్రామంలో రామాలయం నిర్మాణానికి గ్రామస్తులు శనివారం భూమిపూజ చేశారు.ముందుగా మహిళలు కలశాలతో గ్రామప్రదక్షిణ చేశారు.అనంతరం రామాలయ నిర్మాణ స్థలం వద్ద పురోహితులు పూజలు చేశారు. గ్రామపెద్దలతో పాటు ఉత్తరాంధ్ర సాదుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి పాల్గొన్నారు. వడ్డీ రాయితీని వినియోగించుకోండిబొబ్బిలి: పట్టణ ప్రజలు ఇళ్లు,నివాస స్థలాల పన్నులను వెంటనే చెల్లించి ప్రస్తుతం ప్రకటించిన వడ్డీలో 50శాతం రాయితీని వినియో గించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి సూచించారు. శనివారం ఆమె మున్సిపల్ సిబ్బందితో కలిసి పలు వార్డులు, బజారులోని వాణిజ్య స్థలాలకు వెళ్లి దాదాపు రూ.2 లక్షల పన్ను వసూలు చేశారు. ఈ నెలాఖరులోగా శతశాతం వసూళ్లు చేపట్టేం దుకు ఏరియాల వారీగా సిబ్బందిని నియమించారు. గజపతినగరం పరిశీలకుడిగా జగన్మోహన్రావుసంతకవిటి: శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సిరిపురపు జగన్మోహన్రావును గజపతినగరం నియోజక వర్గ వైఎస్సార్సీపీ పరిశీలకుడిగా పార్టీ అధి ష్టానం నియమించింది. పలువురు నాయకులు, కార్యకర్తలు శనివారం ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని తెలిపారు. -
ఏప్రిల్ రెండు నుంచి అక్షరాభ్యాసం కార్యక్రమం
భువనేశ్వర్: కొత్త విద్యా సంవత్సరం ఆరంభాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రవేశాలు, అక్షరాభ్యాసం కార్యక్రమం ఖరారు అయింది. ఈ కార్యక్రమం ఏప్రిల్ నెల రెండో తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఆరేళ్లు పైబడిన పిల్లలను ఒకటో తరగతిలో చేర్చుకుంటారు. ఆరేళ్ల లోపు పిల్లలు బాలల విభాగంలో బాల వాటికలో చేరగలరని రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యాశాఖ మంత్రి నిత్యానంద్ గోండ్ తెలిపారు. ఒంటి పూట బడులు రాష్ట్రంలో వేసవి క్రమంగా పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలో ఉదయం పూట తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేసవి కాలంలో ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విషయమై త్వరలో జరిగే శాఖా సమావేశం అనంతరం నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ మంత్రి తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులు, వర్గాలకు ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నారు. అప్పారికి ఘనంగా నివాళులు విజయనగరం అర్బన్: స్థానిక ఏపీ యూటీఎఫ్(ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కార్యాలయంలో యూటీఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి వర్ధంతి శనివారం నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సంఘ నాయకులు రాము, రమేష్ పట్నాయక్, తిరుపతినాయుడు, ప్రసాద్, రాజారావు, శంకరరావు, సూర్యారావు, శ్రీదేవి, వెంకటరావు, సత్యనారాయణ, నిర్మల తదితరులు హాజరై వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ విద్య బలోపేతానికి ఆయన చేసిన కృషిని వక్తలు కొనియాడారు. గ్యాస్ కష్టాలురాజాం: వంట గ్యాస్ కోసం పట్టణంలోని మూడు హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలకు చెందిన వినియోగ దారులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందక అవస్థలు పడుతున్నారు.ఆన్లైన్లో బుక్ చేసినా గ్యాస్ సిలిండర్ ఇంటికి రాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్దకు వెళ్లి గంటలతరబడి నిరీక్షిస్తున్నారు. రాజాంలోని పాలకొండ రోడ్డులో ఓ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం వద్ద రాజాం పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన పలువురు వినియోగ దారులు శనివారం గ్యాస్ సిలిండర్ల కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. అంతకు ముందు సకాలంలో ఏజెన్సీ కార్యాలయం తెరవకపోవడంతో కార్యాలయం ఎదుట ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. -
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
నెల్లిమర్ల రూరల్: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని పెద్దబూరాడపేటలో కొత్తగా నిర్మించిన శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ హాజరై ఆలయాన్ని సందర్శించి, ఆంజనేయస్వామికి పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలంతా నిత్యం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా దీవించాలని భగవంతుడిని వేడుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక బాట పట్టాలని, అప్పుడే గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని తెలిపారు. రోజులో ఎంతో కొంత సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయిస్తే శారీరక శ్రమ, మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. అనంతరం పరిసర గ్రామాల్లో పర్యటించి, అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అడవులను సంరక్షించాలి
● లేదంటే మానవ మనుగడ కష్టమే ● ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ● ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవంపర్లాకిమిడి: ప్రకృతికి వ్యతిరేకంగా మనం నడుచుకుని అడవులు ధ్వంసం చేయడం వల్లే ఇప్పుడు వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. ప్రతిఒక్కరూ ఒక్కో మొక్కను నాటడంతోపాటు అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పర్లాకిమిడి ఫారెస్టు డివిజన్ డీఎఫ్వో కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహించగా.. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో గౌరవ అతిథిగా జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతిరావు, కాశీనగర్ సమితి చైర్మన్ బల్ల శాయమ్మ, డీఎఫ్వో కె.నాగరాజు, ఏసీఎఫ్ అరున్ కుమార్ సాహు, ఏసీఎఫ్ శైనీశ్రీ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీనగర్ సమితి చైర్మన్ శాయమ్మ మాట్లాడుతూ..కాశీనగర్ వంశధార పరీవాహక ప్రాంతాలైన వన్న, గౌరి, పురుటిగూడ తదితర పన్నెండు గ్రామాల్లో నాలుగేళ్లుగా అటవీ ఏనుగులు పంటలొలాలు నాశనం చేస్తున్నాయన్నారు. దీనికి అటవీ అధికారులు తగు పరిష్కారం చూపాలన్నారు. ఏనుగుల వల్ల కలిగిన పంట నష్టం రూ. 10 వేల నుంచి 20 వేల రూపాయలకు పెంచాలని కోరారు. ఏనుగులు కాశీనగర్ ప్రాంతంలో విచ్చలవిడిగా తిరుగుతున్నా ప్రజలు ఎటువంటి హాని తలపెట్టడం లేదని అయితే రాత్రయితే కరెంటు కోత విధిస్తున్నారని జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతిరావు అన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కాశీనగర్ బ్లాక్లో 22 సోలార్ లైట్లను శియ్యాళి పంచాయతీ సర్పంచ్ రాంప్రసాద్ పట్నాయక్, పురుటిగుడ మాజీ సమితి సభ్యులు రోక్కం సతీష్, బాబూరావులకు డీఎఫ్వో అందజేశారు. గజపతి జిల్లాలోని మోహానా అటవీ డివిజన్ అధికారి లక్ష్మీకాంత బిశోయి, రామగిరి రేంజ్ అధికారి పీయూస్ పట్నాయక్, దేవగిరి ఫారెస్టర్ వెంకటరమణ, ప్రసాద్ నాయక్లకు మెమెంటోలు, ప్రశంపాపత్రాలతో సత్కరించారు. అటవీశాఖ, ఎకానమీపై ప్రసంగించిన విద్యార్థులకు ఎమ్మెల్యే రూపేష్పాణిగ్రాహి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఏసీఎఫ్. అరుణ్ కుమార్ సాహు అతిథులకు ధన్యవాదాలు తెలియజేశారు. మొక్కలతోనే మానవమనుగ జయపురం: మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని వక్తలుఅన్నారు. జయపురం అటవీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీజగత్ జననీ మందిరం కూడలి నుంచి విక్రమ దేవ్ ఉన్నత మాధ్యమిక పాఠశాల వరకు ఆవగాహన ర్యాలీ చేశారు. ర్యాలీలో నర్సింగ్ విద్యార్థినులు, హెల్త్ వర్కర్లు, అటవీ విభాగ సిబ్బంది ప్లకార్డులతో పాల్గొన్నారు. పాల్గున్నారు. జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారిణి అర్చితా మిత్తల్, అటవీ విభాగ అధికారి ప్రతాప్ చంధ్ర బెహర పచ్చ జెండాలు -
ప్రసవ వేదన
కొరాపుట్: గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో నిండు గర్భిణిని సుమారు 3 కి.మీ డోలీపై తరలించిన బాధాకరమైన ఘటన శనివారం చోటుచేసుకుంది. నబరంగ్పూర్ జిల్లా తెంతులకుంటి సమితి బరాజోడి గ్రామానికి చెందిన హేడు జానీ భార్య సేను జానీకి పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆశా కార్యకర్తకి సమాచారం ఇచ్చారు. అమె వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్కి సమాచారం ఇచ్చింది. అయితే ఆ గ్రామానికి రోడ్డుమార్గం లేకపోవడంతో వాహనం రాలేకపోయింది. దీంతో చేసేదేమీలేక గ్రామస్తులు మంచంపైనే గర్భిణీని ఉంచి తెంతులకుంటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
పింఛన్ పునరుద్ధరించాలని దివ్యాంగురాలు వినతి
జయపురం: దివ్యాంగు పింఛన్ను పునరుద్ధరించి ఆదుకోవాలి ఆదివాసీ మహిళ తులసీ బారిక్ కోరుతున్నారు. జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి దసమంతపూర్ గ్రామ పంచాయితీ మహంతపుట్(రామ గుడ)గ్రామానికి చెందిన తులసి బారిక్ దివ్యాంగురాలు. ఆమె ఎడమ కాలు ముడుచుకు పోవడంతో నడవలేరు. వైద్య విభాగం అధికారులు ఆమెకు దివ్యాంగ ధ్రువ పత్రం మంజూరు చేయడంతో కొన్నేళ్లుగా దివ్యాంగు పింఛన్ ప్రతినెల వచ్చేది. అయితే గత ఏడాది నుంచి పింఛన్ను నిలిపివేశారు. తన పింఛన్ను పునరుద్ధరించాలని కోరుతూ ఆమె పంచాయతీ, సమితి అధికారులు కలుస్తూ కోరుతున్నారు. అయినప్పటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి దివ్యాంగు పింఛన్ను పునరుద్ధరించి ఆదుకోవాలని తులసి బారిక్ వేడుకుంటున్నారు. -
రాత్రి వేళ గస్తీతో నేరాల నియంత్రణ
బొబ్బిలి: అవాంఛనీయ సంఘటనలు,దొంగతనాలు, జరగకుండా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు బొబ్బిలి పట్టణంతో పాటు మండలంలోని పలు కూడళ్లు, కళాశాలలు, వసతి గృహాలు ఉన్న ప్రాంతాల్లో నిరంతరం రాత్రి వేళ గస్తీ కాస్తున్నామని బొబ్బిలి సీఐ కె.నారాయణరావు తెలిపా రు.శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ కేవలం ఎస్ఐలు, సిబ్బంది మాత్రమే కాకుండా తానూ రాత్రి 12 గంటల వరకు గస్తీ నిర్వహిస్తున్నట్టు చెప్పా రు. నిత్యం నైట్ రౌండ్లు తప్పనిసరి చేయడం వల్ల సత్ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. ఇటీవల చర్చి సెంటర్లోని ఎస్బీఐ ఏటీఎమ్ నుంచి నగదు బయటకు వచ్చి ఉండడాన్ని నైట్ రౌండ్స్లో ఉన్న సిబ్బంది గుర్తించి సమాచార మందించగా, ఏఎస్ఐ కొండలరావును పంపించడంతో పాటు ఎస్బీఐ సిబ్బందికి తెలియజేసి నగదును ఏటీఎం థర్డ్పార్టీ ఏజెన్సీ నిర్వాహకులకు అందజేశామని తెలిపారు. రాత్రివేళ ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తుండ డం వల్ల దొంగతనాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. కళాశాలలు, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో సిబ్బందికి షిఫ్ట్ల వారీగా డ్యూటీలు వేస్తున్నామని వివరించారు. గంజాయి,డ్రగ్స్,మద్యం వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. -
ముగిసిన చారిదేవా దేవీ యాత్ర
మల్కన్గిరి: జిల్లాలోని పోడియా సమితి కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన చారిదేవా దేవీ అమ్మవారి బడాయాత్ర శనివారంతో ముగిసింది. చివరి రోజు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. యాత్రలో భాగంగా ప్రతిరోజూ అన్నదానం ఏర్పాటు చేశారు. యాత్రకు స్థానికులతో పాటు ఆంధ్ర, చత్తీష్ఘడ్ నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. అలాగే అగ్నిమాపక, వైద్య బృందాలను ఏర్పాటు చేశారు.పట్టుబడిన చోరీకి గురైన వాహనం రాయగడ: స్థానిక రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆర్టీవో సిబ్బంది శనివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో చోరీకి గురైన ఒక ద్విచక్ర వాహనాన్ని సిబ్బంది పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా ఆర్టీవో సిబ్బంది విస్తృతంగా వాహన తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఒక దొంగతనానికి గురైన ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. నంబర్ ప్లేట్ మార్చి వాహనాన్ని నడిపుతున్నట్లు గుర్తించారు. కలహండి జిల్లాకు చెందిన వాహనంగా గుర్తించిన సిబ్బంది, ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. అయితే వాహన చోదకుడు తాను ఒక సెకండ్ హ్యాండ్ షోరూంలో ఈ వాహనాన్ని ఖరీదు చేసినట్లు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారుల నుంచి రూ.70 వేలు జరిమానా కింద వసూలు చేశారు. -
బస్సుకు నిప్పు.. తప్పిన పెనుముప్పు
శనివారం తెల్లవారు జామున 3 నుంచి 3.30 గంటల సమయంలో రామభద్రపురం గ్రామం ముందు ప్రయాణికులు టాయిలెట్స్ కోసం బస్సుఆపారు. వారంతా టాయిలెట్స్కు వెళ్లి మరలా బస్సు ఎక్కారు. రామభద్రపురం గ్రామం దాటాక బస్సు ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించింది. కాలిన వాసన రావడంతో వెంటనే బస్సును పక్కకు నిలిపి దిగి చూడగా మంటలు కనిపించాయి. వెంటనే బస్సులోని ప్రయాణికులందరినీ అప్రమత్రం చేశాను. ప్రయాణికులందరూ బస్సు దిగిపోయారు. కాసేపటికే బస్సులో ఉన్న ఎయిర్ బెలూన్స్ పేలిపోవడంతో వచ్చిన గాలికి బస్సంతా మంటలు చెలరేగాయి. భయపడిపోయాను. అందరూ మేల్కొని ఉండడంతో ప్రమాదం తప్పింది. – సుఖదేవ్ బరిక్, ట్రావెల్ బస్సు డ్రైవర్ రామభద్రపురం: ఆ ప్రయాణికుల పాలిట డ్రైవరే దేవుడు... ఆయన ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా... బస్సులో రేగిన అగ్నికీలలు గమనించకపోయినా ప్రమాదం ఊహకు అందేదికాదు. ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యేతో పాటు 32 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్కు చెందిన ఆరెంజ్ (నీలకంఠేశ్వర) ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు రామభద్రపురం, సాలూరు మీదుగా 32 మంది ప్రయాణికులతో మల్కన్గిరి వెళ్తోంది. ప్రయాణికుల్లో అధికమంది ఒడిశా రాష్ట్రానికి చెందిన వారే. మల్కన్గిరి, చెములగుడ, దామన్జోడి, జయపూర్ తదితర ప్రాంతాల్లోని బంధువుల ఇంటికి, స్వగ్రామాలకు వెళ్తున్నారు. 26వ జాతీయ రహదారిపై వెళ్తుండగా రామభద్రపురం మండలం తారాపురం సమీపంలోని పూడివారి కళ్లాల వద్దకు వచ్చేసరికి శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో బస్సు టైరు పేలినట్లు డ్రైవర్కు అనిపించింది. డ్రైవర్ సఖదేవ్ బరక్ వెంటనే బస్సును పక్కకు నిలిపి కిందకు దిగి చూశాడు. అప్పటికే బస్సు వెనుక మంటలు చెలరేగాయి. వెంటనే ఆయన అప్రమత్తమై ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. కిందకు దిగిపోవాలంటూ గట్టిగా కేకలు వేశాడు. అప్పటికి ఒక గంట ముందు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సును రామభద్రపుం ముందు నిలపడంతో ప్రయాణికులందరూ మేల్కొని ఉన్నారు. డ్రైవర్ కేకలకు వెంటనే బస్సు దిగిపోయారు. బస్సుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే, బస్సు ఎయిర్ బెలూన్లు పేలిపోవడంతో క్షణాల్లో మంటలు బస్సంతా వ్యాపించాయి. ప్రయాణికులతో పాటు డ్రైవర్, క్లీనర్ భయంతో వణికిపోయారు. వీరి హాహాకారాలకు ఘటనా స్థలానికి సమీపంలోని తారాపురం గ్రామస్తులు పలువురు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వి.ప్రసాదరావు బాడంగి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. వారు వచ్చి మంటలను అదుపుచేశారు. సాలూరు ఫైర్ స్టేషన్కు ఫోన్చేసినా స్పందించలేదని స్థానికులు వాపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ ప్రమాద స్థలాన్ని బొబ్బిలి డివిజన్ ఆర్డీఓ రామ్మోహనరావు పరిశీలించారు. ప్రమాద ఘటనతో పాటు ప్రయాణికుల వివరాలు, అందరూ సురక్షితంగా బయటపడిన అంశాలను సీఐ, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. క్లూస్టీం పరిశీలన.. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు టైరు పేలి ప్రమాదం జరిగిందా? లేదంటే ఏమైనా షార్ట్సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విజయనగరం నుంచి వచ్చిన క్లూస్టీం ఆధారాలు సేకరించింది. బస్సులోని పలు వస్తువులతో పాటు విద్యుత్ వైర్లు కొన్ని పట్టుకెళ్లారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కళ్లముందే తాము ప్రయాణిస్తున్న బస్సు కాలిపోవడాన్ని చూసి ప్రయాణికులు హాహాకారాలు చేశారు. తమ సామగ్రి కాలిపోతోందంటూ ఘొల్లుమన్నారు. రూ.10లక్షల విలువైన బంగారు హారం, చేతిగాజులు, ఉంగరాలు, రూ.7వేలతో కూడిన బ్యాగు కాలిపోతోందంటూ శాంతిలత అనే ప్రయాణికురాలు కన్నీరుపెట్టింది. అయితే... మంటలు పూర్తిగా ఆర్పాక బూడిదలో చెవిదిద్ది మినహా మిగిలిన బంగారు ఆభరణాలు లభించడంతో సంతోషం వ్యక్తంచేసింది. ఆభరణాలు అప్పగించిన సీఐ, ఎస్ఐకు కృతజ్ఞతలు తెలిపి బంధువుల సాయంతో సెములగూడకు పయనమైంది. చాలామంది ప్రయాణికుల విలువైన సామగ్రి కాలిపోవడంతో కట్టుబట్టలతో మిగిలారు. అదే బస్సులో మల్కన్గిరి వెళ్తున్న ఒడిశా రాష్ట్రం చిత్రకొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్(ఐ) ఎమ్మెల్యే మంగం ఖిల్లా ప్రమాదం నుంచి బయటపడి, వేరే ట్రావెల్ బస్సులో మల్కన్గిరి చేరుకున్నారు. రామభద్రపురం వద్ద దగ్ధమైన ఒడిశా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బస్సులో ప్రయాణిస్తున్న ఒడిశా ఎమ్మెల్యేతో పాటు 32 మంది ప్రయాణికులు సురక్షితం డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆధారాలు సేకరించిన క్లూస్టీం -
పాఠశాలలో స్వచ్ఛభారత్
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి యం.వి.90 గ్రామం వద్ద ఉన్న గొప్పబంధు మాధ్యమిక పాఠశాల విద్యార్థులు శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కలిమెల సమితిలో కమ్యునిటీ హెల్త్ సెంటర్ ఔషధ వృక్షవాటిక, దాని పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. కార్యక్రమానికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్చార్జి డాక్టర్ దీనబంధు మహానందియా హాజరై మాట్లాడుతూ.. ఇలాంటి సేవా కార్యక్రమాలు మనిషి జీవితాన్ని సార్థకం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ హిమాన్షు శేఖర్ వైద్య, ఇతర ఉపాధ్యాయులు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. అధికసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. -
చాటిచెప్పాం
మిస్, మిసెస్ ఉగాది విజేతలకు బహుమతులు అందజేస్తున్న వైష్ణవీ చైతన్యకోల్కతా కళాకారుల నృత్యప్రదర్శనరాయగడ: ఉగాది వంటి జన వేదికలో మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే అవకాశం కలిగిందని జిల్లా ఉత్కళ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు అన్నారు. రెండు రోజులుగా కొల్లిగుడ మైదానంలో సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లుగా ఉగాది ఉత్సవాలను జిల్లా తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు వరుణుడి వల్ల ఉత్సవాల ప్రారంభోత్సవం కాస్త ఆలస్యమైనప్పటికీ ప్రజలు ఉత్సవాలను తిలకించేందుకు భారీ ఎత్తున తరలిరావడం సంతోషకరమన్నారు. అందరి ఆదరాభిమానాలతో ఇంత ఉన్నత స్థాయికి చేరుకున్నానని, నిరంతరం అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని కొండబాబు అన్నారు. రాయగడలో తెలుగు, ఒడియా అన్న బేధభావనలకు తావులేకుండా కలసిమెలసి ఇటువంటి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అలరించిన కార్యక్రమాలు.. ముగింపు ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ప్రముఖ గాయకుడు స్వరాగ్ కీర్తన్ పాటలతో ఉర్రూతలూగించారు. టాలీవుడ్ హీరొయిన్ వైష్ణవి చైతన్య ప్రేక్షకులతో మమేకమై తన సినీరంగ ప్రవేశం గురించి వివరించి ముచ్చటగొలిపించారు. జబర్దస్త్ సద్దాం బృందం తన హాస్యంతో ప్రేక్షకులని మైమరరించారు. ఇండియన్ ఐడల్ బ్యాండ్ సాయి పవన్ తన మ్యూజిక్తో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. వాటర్ బాటిల్, సూట్కేసుల సహాయంతో మ్యూజిక్ వినిపించి అందరినీ ఆకర్షించారు. కోల్కతాకు చెందిన పాపులర్ నృత్య బృందం ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి. ప్రముఖులకు సన్మానం.. ప్రముఖ వేద పండితులు రేజేటి శ్రీనివాస్ శర్మ, రేజేటి శ్రీరామశర్మలను వేదికపై ఉత్సవ కమిటీ ఘనంగా సన్మానించింది. ఉగాదిని పురష్కరించుకుని మహిళా విభాగం నిర్వహించిన మిస్ ఉగాది, మిసెస్ ఉగాది పోటీల్లో గెలుపొందిన విజేతలకు నటి వైష్ణవీ చైతన్య బహుమతులు అందజేశారు. అనంతరం వైష్ణవీ చైతన్యను ఉత్కళ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు, సమాఖ్య సభ్యులు ఘనంగా సన్మానించారు. -
రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహణపై సన్నాహక సమావేశం
రాయగడ: ఏప్రిల్ ఒకటో తేదీన జరగనున్న రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్రనాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సబ్కలెక్టర్ రమేష్ కుమార్నాయక్, జిల్లా సంస్కృతి విభాగం అధికారి సుచిత్ర బౌరి, సీనియర్ సిటిజన్లు, పట్టణ ప్రముఖులు సమావేశంలో పాల్గొన్నారు. పట్టణంలోని వివిధ కూడళ్లలో ఉన్న వరపుత్రులు విగ్రహాలకు పూలమాలలు వేయడంతో పాటు ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనే విధంగా జిల్లా పౌరసంబంధాల శాఖ ప్రచారం చేయాలని నిర్ణయించారు. -
బీజేపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలిగా షర్మిష్టా దేవ్
కొరాపుట్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలిగా నబరంగ్పూర్ జిల్లా కేంద్రానికి చెందిన షర్మిష్టాదేవ్ నియమితులయ్యారు. ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిలర్గా కొనసాగుతున్న షర్మిష్ట గతంలో పార్టీ జిల్లా స్థాయిలో అనేక పదవులు నిర్వహించారు. ఈమె నియామకం పట్ల నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి తదితరులు అభినందనలు తెలియజేశారు. ఘనంగా జయపురం రాజమాత జన్మదిన వేడుకలు జయపురం: జయపురం రాజమాత మహారాణి సారిక దేవి 56వ జన్మదిన వేడుకలు స్థానిక రాజమహల్లో శనివారం ఘనంగా జరిగాయి. రాజమహల్ దర్బారు హాలులో మహారాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది అభిమానులు తరలివచ్చారు. రాజ సేవకులు ఛత్రం పట్టి వింజారామాలతో మహారాణి వెంట బయటకు వచ్చారు. ప్రజలు పూలు చల్లి మహారాణికి శుభాకాంక్షలు తెలియజేశారు. -
వసంత నవరాత్రులు ప్రారంభం
భువనేశ్వర్: జట్నీ కుదియారి గ్రామ దేవత జగులాయి మాత వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 27 వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. గ్రామ పరిక్రమ అనంతరం రాజ పుష్కరణిలో సేకరించిన పవిత్ర జలంతో నింపిన పూర్ణ కలశాలను ఊరేగింపుగా తరలించి ఉత్సవ ప్రాంగణంలో ప్రతిష్టించారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం పూట మహా స్నానం ఆచరించి అమ్మ వారిని రోజుకో అలంకరణ చేస్తారు. తొలి రోజున దేవి శైల పుత్రి అలంకారంలో అర్ధరాత్రి వరకు భక్తులకు దర్శనం ఇచ్చారు. షోడశోపచార పూజలు, శప్త సతీ చండీ ఆహుతి, హారతి, పుష్పాంజలి సమర్పించారు. -
చద్దన్నంతో మెరుగైన ఆరోగ్యం
● ప్రగతి మహిళా సంఘటన్ ఆధ్వర్యంలో ప్రపంచ పఖాల్ దివస్పర్లాకిమిడి: పఖాలన్నం శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా ఒడిశావాసుల సంప్రదాయ ఆహారమని జిల్లా మైనింగ్ అధికారి దిపెన్పరిడా అన్నారు. శుక్రవారం రాజవారి ప్యాలస్లో యుటెక్ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో ప్రపంచ పఖాల్ దినోత్సవాన్ని నిర్వహించగా.. ముఖ్యఅతిథిగా దిపెన్పరిడా ప్రారంభించారు. క్యార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్చార్జి రాజేష్ కుమార్ మిశ్రా, ముఖ్యవక్తగా బినోదినీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ మనోజ్కుమార్ పట్నాయక్, విశ్రాంత ఉద్యోగి రామచంద్ర పాఢి, ప్రగతి మహిళా సంఘటన్ అధ్యక్షులు లోకనాథ మిశ్ర, సుభ్రత్ మహారాణా, ఉపాధ్యక్షులు బిచిత్రానంద బెబర్తా పాల్గొన్నారు. పూరీలో శ్రీజగన్నాథునికి శుక్రవారం ప్రసాద సేవనంలో పకాలన్నం, తోటకూర, ఘంటకూర నైవేద్యంగా అందిస్తారని, ఒడిశా సంప్రదాయ వంటకం పకాలన్నం అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా అన్నారు. విజేతలు వీరే.. ఈ సందర్భంగా మహిళలకు పకాలన్నం, బెసరా, వక్తృత్వ పోటీలను ప్రగతి మహిళా సంఘటన్ కార్యదర్శి తనూజా శతపథి నిర్వహించారు. ప్రథమ బహుమతి విజయలక్ష్మీ పట్నాయక్, ద్వితీయ బహుమతి లల్లి ఖడగరాయ్, తృతీయ బహుమతి జోరణా పట్నాయక్, బబితా పండాలు గెలుచుకున్నారు. అలాగే కంజి వంటకం పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు బిజయలక్ష్మీ పట్నాయక్, ఝోరణా పట్నాయక్, ప్రమితా పట్నాయక్ లు గెలుచుకున్నారు. బెసర వంటకం తయారీ పోటీ లో ప్రథమ బహుమతి బిజయలక్ష్మీ పట్నాయక్, ద్వితీయ స్థానంలో బబితా పండా, తృతీయ స్థానంలో లిప్సితా పాఢిలు నిలిచారు. వీరికి ముఖ్యఅతిథి దిపెన్పాఢి చేతులమీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం అతిథులకు, విజేతలకు చద్దన్నం, తోటకూర, ఇతర వంటకాలు అందజేశారు. -
150 కిలోల గంజాయి పట్టివేత
● ఒకరి అరెస్టు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బాలిమెల పోలీసులు శుక్రవారం మధ్యాహ్న సమయంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సమయంలో ఆటోను తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. పోలీసులను ఒకరు పరారవ్వగా బలిమెలకు చెంది దుర్యోధన్ మోరియాను అరెస్టు చేశారు. గంజాయిని ఛత్తీస్గఢ్ తరలిస్తున్నటుట నిందితుడు చెప్పినట్టు పోలీసులు వెళ్లడించారు. చిత్రకొండ ఏరియాలో గంజాయని కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ఐఐసీ దీరాన్ పట్నాయక్ పట్టుబడ్డ నిందితుడిపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తూకం వేయగా 150 కిలోలు ఉన్నట్టు తేలింది. దీని విలువ రూ. 25 లక్షలు ఉంటుందని పోలీసు అధికారి వెల్లడించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కార్గిల్ పార్కు పనుల పరిశీలన శ్రీకాకుళం : జిల్లా పరిషత్ రోడ్డులోని సుడా కార్గిల్ పార్కులో జరుగుతున్న పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం పరిశీలించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫొటో సెషన్, స్పీచ్ పాయింట్ల వద్ద ప్రాక్టికల్ డెమో విధానంలో ఫొటోలు తీయించి పరిశీలించారు. పబ్లిక్ టాయిలెట్లు సైతం పరిశీలించారు. పెండింగ్ పనులను టీములు వారీగా ఏర్పాటు చేసి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పార్కు ప్రారంభోత్సవం నాడు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో సుడా ఎస్ఈ సుగుణాకర్, మున్సిపల్ కార్పొరేషన్ ఎం.ఈ. శర్మ, ఎంహెచ్ఓ సుధీర్, సైనిక్ వెల్ఫేర్ అధికారి ఎ.శైలజ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, డీఎస్డీఓ మహేష్, సుడా ఏఈలు పాల్గొన్నారు. ఒకేసారి మూడు కొలువులు హిరమండలం: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే చాలా కష్టంగా ఉన్న రోజులివి. అటువంటిది ఒకేసారి మూడు బ్యాంకు కొలువులను సాధించాడు హిరమండలం మండలంలోని పిండ్రువాడ గ్రామానికి చెందిన కురమాన జగదీష్. ఇటీవల విడుదలైన స్టేట్బ్యాంక్ క్లర్క్, యూనియన్ బ్యాంకు క్లర్క్, ఆర్ఆర్బీ క్లర్క్ పోస్టులకు ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు నాగేశ్వరరావు, సత్యవతి సాధారణ వ్యవసాయ కూలీలు. జగదీష్ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే జరిగింది. ఈ సందర్భంగా జగదీష్ను గ్రామస్తులు అభినందించారు. ముగ్గురికి రిమాండ్ హిరమండలం: పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడిచేసిన ముగ్గురికి కోర్టు రిమాండ్ విధించింది. హిరమండలం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనా వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 18న రాత్రి 112 అత్యవసర విభాగానికి వచ్చిన ఫిర్యాదును విచారించేందుకు కానిస్టేబుళ్లు ఇద్దరు హిరమండలం ప్రధాన రహదారికి వెళ్లారు. అయితే దంత తేజేశ్వరరావు, అల్లాడ మధుబాబు, నీలంశెట్టి మిన్నారావు అసభ్యకరంగా ప్రవర్తించారు. దాడిచేసే ప్రయత్నం చేశా రు. దీనిపై కానిస్టేబుళ్లు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ముగ్గుర్ని అరెస్టు చేసి కొత్తూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్కు ఆదేశించడంతో జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్ఐ హేమంత్ కళ్యాణ్ తెలిపారు. -
నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి
పర్లాకిమిడి: నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని వక్కలు అన్నారు.సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఆడిటోరియంలో శుక్రవారం ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని స్కూల్ ఆఫ్ నర్సింగ్, డాక్టర్ సల్లాన శరత్ కుమార్ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. పంటి సమస్యలు, నోటి దుర్వాసన, సాధారణ నోటి సమస్యలను ముందుగానే కనిపెట్టి ముందుగానే చికిత్స తీసుకోవాలని పంటి నిపుణులు డాక్టర్ సల్లాన శరత్కుమార్ (పాతపట్నం) అన్నారు. నోటిలో పుచ్చిపళ్లు, నోటి దుర్వాసన వల్ల వస్తుందని వాటిని వెంటనే డాక్టర్ వద్ద పరీక్షించుకోవాలని అన్నారు. శిబిరంలో 122 మంది నర్సింగ్ విద్యార్థులు, నర్సింగ్ ఫ్యాకల్టీ శుభశ్రీ పాణిగ్రాహి, కె.లహరి, మిలాన్ కుమార్ ముదులి పాల్గొన్నారు. -
జయపురంలో ప్రేమచంద్ర చౌదరి పర్యటన
జయపురం: మత్స్య, పశు సంపద వికాస విభాగ కార్యదర్శి, కొరాపుట్ జిల్లా నోడల్ కార్యదర్శి ప్రేమచంద్ర చౌదరి జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితిలో శుక్రవారం పర్యటించారు. దీనిలో భాగంగా బొరిగుమ్మ సమితి నువాగాం ఎస్ఎస్డీ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఆయనతో పాటు కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యభాను మహాజన్, సీడీవో బేణూధర్ శబర్, జయపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ తృప్తి బరాయి, జిల్లా మంగళ అధికారి సునీల్ కుమార్ తండి, జిల్లా విద్యాధికారి కరుణ కుమార్ భొయె తదితరులు ఉన్నారు.ఉపకార వేతనాలకు రూ.2 లక్షల విరాళం పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి (స్వయం ప్రతిపత్తి) కళాశాల 1973 అల్యుమినీ బ్యాచ్ కళాశాల ప్రిన్సిపాల్ రాధాకాంత భుయ్యాన్ను శుక్రవారం కలిసి విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.2 లక్షల విరాళాన్ని శుక్రవారం అందజేశారు. ప్రిన్సిపాల్ను కలిసినవారిలో విశ్రాంత ఉత్కళ్ బ్యాంకు అధికారి అభిమన్యు నాయక్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.సత్యనారాయణ రాజు, వి.సోమలింగం, కామేశ్వర్ బిశ్వాల్, ఎం.ఉమామహేశ్వరరావు, కె.నాగేశ్వరరావులు ఉన్నారు. -
సంచార రథం ప్రారంభం
జయపురం: జయపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో హౌసింగ్ మరియు అర్బన్ డవలప్మెంట్ వారి శ్రమ యోగీ మానధన్ పథకంలో భాగంగా సంచార సహాయక రథాన్ని మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి శుక్రవారం ప్రారంభించారు. స్థానిక బాబా సాహెబ్ కల్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రథం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు తెలియజేయడంతో పాటు వారికి అవసరమైన సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బి.సునీత, మున్సిపల్ అదనపు కార్య నిర్వాహక అధికారి పూజా రౌత్, జయపురం లేబర్ అధికారి చైతన్య మఝి, కౌన్సిలర్లు జైపాల్ సింగ్, గోపీనాథ్ మహంతి తదితరులు పాల్గొన్నారు.పరామర్శ కొరాపుట్: ప్రతిపక్ష బీజేడీకి చెందిన నబరంగ్పూర్ జిల్లా డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారిని మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి భువనేశ్వర్లో శుక్రవారం పరామర్శించారు. గత కొంతకాలంగా రంధారి చక్కెర వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ప్రమాదం వలన దెబ్బతిన్న పాదానికి ఇన్స్పెక్షన్ సోకింది. దీంతో కళింగ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేసుకున్నారు. గత 20 రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారని తెలుసుకొని కలిశారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు కొరాపుట్: కారు అదుపుతప్పి చెట్టుని ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం వేకువజామున కొరాపుట్ జిల్లా నందపూర్ నుంచి పాడువా వైపు వెళ్తున్న కారు నందపూర్ సమీపంలో మామిడి చెట్టుని ఢీకొంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులైన లబఖోర (35), అనంత పంగి (40)లను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.రైలు పట్టాలపై వృద్ధుడి మృతి రాయగడ: జిల్లాలోని బిసంకటక్ పోలీస్స్టేషన్ పరిధి జిరిడి పంచాయతీ నిగుండి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రత్నాలు (70) ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బుధవారం ఎటో వెళ్లిపోయాడు. కుటుంబీకులు అతని ఆచూకీ కోసం వెతికారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గురువారం రాయగడ రైల్వే పోలీసులు బిసంకటకట్ రైలు పట్టాలపై గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం బిసంకటక్ పోలీసులకు సమాచారం అందించారు. మృతుని జేబులో ఉన్న ఫొటో ద్వారా కుటుంబీకులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న కుటుంబీకులు మృతదేహాం లక్ష్మణ్దేనని నిర్దారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబీకులకు అప్పగించారు.పిడుగుపాటుకు పశువులు మృతి రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి రెంగ పంచాయతీ సెమిలిగుడ గ్రామంలో గురువారం పిడుగుపాటుకు నాలుగు పశువులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన బత్ర మాఝి, కుముద్మాఝి, లింగన్న మాఝి, మాలకీ మాఝిలకు చెందిన పశువులు ఎప్పటిలాగే ఇంటి బయట పనస చెట్టు కింద కట్టి ఉన్నాయి. సాయంత్రం వర్షంతో కూడిన పిడుగులు పడడంతో పశువులు మృతి చెందాయి. తమకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితులు కోరారు. -
పోలీసు అధికారులకు సత్కారం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి క్షేత్రాలను గుర్తించి అరికట్టడం, గంజాయి అక్రమ తరలింపును అడ్డుకున్న పోలీసు అధికారులను ఒడిశా డీజీపీ వైబీ ఖురానియా శుక్రవారం ఒడిశా పోలీసు భవన్లో సత్కరించారు. మెమెంటోలు, పురస్కారం అందుకున్న వారిలో జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, చంద్రగిరి ఎస్సైలు సునీల్ శెఠి, పంకజ్ దాస్, సందీప్ హేంబ్రమ్ ఉన్నారు. గజపతి జిల్లాలో పోలీసులు ఆర్.ఉదయగిరి, మోహానా, ఆడవలో 2025లో 750 ఎకరాల్లో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేయగా 168 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. -
ఉత్కళ దినోత్సవ సన్నాహక సమావేశం
జయపురం: స్థానిక యాదవ భవనంలో ఉత్కళ సమ్మిళిని కొరాపుట్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉత్కళ దినోత్సవాల సన్నాహక కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు మదన మోహన్ నాయిక్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ఉత్కళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ఉత్కళ సమ్మిళిని జిల్లా కార్యదర్శి నవీన్ మదల మాట్లాడుతూ.. ఎప్పటిలాగే ఉత్కళ దినోత్సవాలు రాజనగర్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్వతంత్ర ఉత్కళ ప్రదేశ్ నిర్మాణానికి కృషి చేసిన ప్రముఖుల విగ్రహాలకు ఉత్కళ దినోత్సవం రోజున నివాళులర్పించాలని.. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు రాజనగర్ కూడలి వద్ద సాధారణ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సమావేశంలో డాక్టర్ సుదర్షన గౌడ, కవిరాజ్ పరమేశ్వర పాత్రో, బాలారాయ్, మీన కేతన పరచ, చంద్రకాంత సుతార్, సత్యనారాయణ పరిచ, రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ నవమి సన్నాహక సమావేశంజయపురం: పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సభాగృహంలో శ్రీరామ నవమి వేడుకల సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఎప్పటిలాగే అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. భక్తులను దృష్టిలో పెట్టుకొని భారీ రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను పట్టణ పోలీసులకు అప్పగించారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, రెండు అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. అలాగే అత్యవసర సేవల కోసం రెండు అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య విభాగ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మద్యం దుకాణాలపై ఎకై ్సజ్, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి, తహసీల్దార్ సవ్యసాచి జెన, అదనపు పోలీసు అధికారి అభిషేక్ పాణిగ్రహి, ప్రొబెషనరీ పోలీసు అధికారి వి.రామసదన్, సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్, అగ్నిమాపక విభాగ అధికారి సురేష్ కుమార్ బారిక్ తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో 9 మంది అరెస్టు
కొరాపుట్: పిల్లల దొంగ అనే నెపంతో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన ఘటనలో 9 మంది అరెస్టు అయ్యారు. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్ర పోలీస్స్టేషన్ ఐఐసీ సంబిత్ బెహరా ఈ కేసు వివరాలు ప్రకటించారు. ఈనెల 16వ తేదీన కెందుగుడ గ్రామ సమీపంలోని చికిల్పొదర్ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మతిస్థిమితం లేని వ్యక్తి (57) సంచరిస్తున్నాడు. అతను పిల్లల దొంగ అనే అనుమానంతో గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనని స్థానిక యువకులు సెల్ఫోన్ల లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది చూసిన పోలీసులు వీడియోలు ఆధారంగా విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా ఈ ఘటనకి పాల్పడిన దేవేంద్ర కుమార్ బోత్ర, మాన్సింగ్ బోత్ర, పరమానంద బోత్ర, మచింద్ర బోత్ర, గధాదర్ పట్లి, డొము బోత్ర, సితారం బోత్ర, ధనుపతి రంధారి, ఫకీర్ మెహన్ నాయక్లను అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. -
ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా చేయాలి
● సభను కుదిపేసిన ఎస్సీబీ అగ్నిప్రమాద దుర్ఘటనభువనేశ్వర్: కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి (ఎస్సీబీఎంసీహెచ్)లో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రాజకీయ వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ రాజీనామా చేయాలని శాసనసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ సంఘటనపై సాంకేతిక నిజ నిర్ధారణ పరిశీలన బందాన్ని ఏర్పాటు చేయడం, అధికారులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించడం (సస్పెండ్) చేయడం వంటి తక్షణ చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 13 మంది ప్రాణాలు బలిగొన్న విచారకర సంఘటన జరిగి ఐదు రోజులు గడిచినా ప్రభుత్వంలో జవాబుదారీతనం కొరవడిందని విపక్ష బిజూ జనతాదళ్ పార్టీ ఎమ్మెల్యే గౌతమ్ బుద్ధ దాస్ విమర్శించారు. ఎస్సీబీఎంసీహెచ్లో 13 మంది మరణానికి కారణమైన ఘోర ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికే ఐదు రోజులు గడిచినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం ఎవరికి భయపడుతోంది? అని ప్రశ్నించారు. ఇంతటి పెద్ద సంఘటన జరిగిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ దాస్ ఎద్దేవా చేశారు.ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకోవడానికి నిందను ఇతరులపై మోపుతోందన్నారు. నిజంగా బాధ్యులైన వారిని ప్రభుత్వం ఇప్పటికీ కాపాడుతోంది. కేవలం నష్ట పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుని మౌనంగా ఉండటాన్ని అంగీకరించలేమని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. అలాగే కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి సూపరింటెండెంట్ను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. ఈ విషాదం తీవ్రమైన రాజకీయ ప్రతిచర్యలను రేకెత్తిస్తూనే ఉంది. దీంతో అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. -
రాయగడను తీర్చిదిద్దుతాం
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026ఉత్తమ జిల్లాగా..● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల్ ● కొనసాగుతున్న ఉగాది ఉత్సవాలురాయగడ: ఖనిజ వనరులతో పాటు ప్రాకృతిక సంపదలకు నిలయమైన రాయగడ జిల్లాను రాష్ట్రంలొనే ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్నివిధాల కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సామల్ అన్నారు. జిల్లా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు నేతృత్వంలో స్థానిక కొల్లిగుడ వద్ద నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాకృతిక, ఖనిజ సంపదలు ఉన్న ఈ జిల్లా రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఎంతగానో దోహదపడుతోందన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్నివిధాల కృషి చేస్తోందన్నారు కొత్త పరిశ్రమలు జిల్లాలో నెలకొల్పేందుకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందితే ప్రజల ఆర్థిక, సామాజిక రంగాలు తదనుగుణంగా మెరుగుపడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నో బృహత్తర పరిశ్రమలు ఉన్నాయని అన్నారు. అయితే బాకై ్సట్ నిక్షేపాలు ఉన్న కారణంగా వాటిని సద్వినియోగపరిచాలని అందుకు పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులను ఆహ్వానించడం అనివార్యమని వివరించారు. తెలుగు వారి నుంచి ఎంతో నేర్చుకొవాలి భిన్న సంస్కృతి, సంప్రదాయాలు ఉన్న రాష్ట్రంలో తెలుగు సంప్రదాయానికి ఎంతో గొప్పతనం ఉందన్నారు. అవిభక్త కొరాపుట్ జిల్లాతో పాటు పశ్చిమ ఒడిశాలో కూడా తెలుగు వారు అత్యధికంగా నివసిస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో వారి నుంచి ఈ ప్రాంత రైతులు ఎంతో నేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. సంబల్పూర్ జిల్లాలోని అత్తాబిర తదితర తెలుగు ప్రాబల్యం గల ఆయా ప్రాంతాల్లో తెలుగు వారు వారి ప్రధాన వృత్తి వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నారని అన్నారు. కొత్త తరహా వ్యవసాయ విధానాలను అవలంబించి ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తుండడం గర్వకారణమని అన్నారు. కష్టే ఫలిగా నమ్మే వారి ఆచార, వ్యవహారాలు అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. ఉగాది ఉత్సవాలకు ఆహ్వానంపై ఆనందం తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాదికి తనను ఆహ్వానించడం చాలా అనందంగా ఉందని ఎంపీ సామల్ అన్నారు. ఉగాది వంటి ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించడం రాష్టంలోనే రాయగడ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇంత ఆర్భాటంగా ఉత్సవాలను నిర్వహించడం తాను ఇదే మొదటిసారి చూడడమని అన్నారు. ఎంతో ఆదరాభిమానాలతో తనను ఆహ్వానించడంపై సంతోషం వ్యక్తం చేశారు. సంస్కృతిని కాపాడుకోవాలి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఉగాది వంటి గొప్పదినాన్ని మనమంతా ఒకే వేదికపై నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు అన్నారు. మూడేళ్లుగా జిల్లా తెలుగు సమాఖ్య పేరిట ఈ ఉత్సవాలను నిర్వహిస్తుండటం.. దానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండడం అందరి ఆదరాభిమామానాలకు నిదర్శనమని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరిక్షించుకోవాలనే తపనతో ఉత్కళ తెలుగు సమాఖ్య పేరిట ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. సమైఖ్యతతో నిర్వహిస్తున్న ఉత్సవాలు అందరినీ అలరించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఉత్సవాలకు గౌరవ అతిథిగా బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు, పర్లాకిమిడి మాజీ ఎమ్మెల్యే కొడూరు నారాయణరావు, ఆర్ఎస్ఎస్కు చెందిన చిత్త రంజన్ మహాంతి, బీజేపీ రాష్ట్రశాఖ సాధారణ కార్యదర్శి పూర్ణిమ నాయక్, సరోజ్కర్ తదితరులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉగాది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జబర్ధస్త్ యాంకర్ సౌమ్యారావ్ కార్యక్రమానికి యాంకరింగ్ చేశారు. తెలుగ చలనచిత్ర నేపథ్య గాయని లిప్సిక, విఘ్నేష్లు తమ మధురమైన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇదిలాఉండగా ఉగాది ఉత్సవాల్లో భాగంగా ర్యాలీ ముగిసిన అనంతరం వర్షం గంటసేపువర్షం కురవడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. అయితే ఆతరువాత వర్షం తగ్గుముఖం పట్టడంతో తరువాత కార్యక్రమాలు యథావిధిగా జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.కార్యక్రమంలో పాల్గొన్న సంఘం సభ్యులు, ప్రతినిధులురాయగడ: స్థానిక కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సంఘం అధ్యక్షుడు కింతలి అమర్నాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో భాగంగా ఉదయం పంచాంగ పఠనం జరిగింది. సాయంత్రం సంఘం కార్యాలయ ప్రాంగణంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ నటి, గాయని అనురాధ పాణిగ్రహి పాల్గొని తెలుగు పాటను పాడి ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. కార్యక్రమంలో సంఘానికి చెందిన చంద్రమౌళి కుముందాన్, సూరి అప్పలస్వామి, వడ్డి మురళి, చక్రధర్ పాత్రుడు, స్పందన సాహితీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గుడ్ల గౌరి ప్రసాద్, టి.జయరాం తదితరులు పాల్గొన్నారు. -
భారీగా గంజాయి పట్టివేత
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ ఎకై ్సజ్ సిబ్బంది 120 కేజీల గంజాయిని శుక్రవారం పట్టుకున్నారు. నందపూర్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ సాహు నేతృత్వంలో బొయిపరిగుడ ఎకై ్సజ్ అధికారి అజయ్ కుమార్ నాయిక్, ఏఎస్ఐ సరోజ్ కుమార్ బెహర, కానిస్టేబుల్ రఘునాథ్ సాంత, మహేష్ కుమార్ బెహరలు గంజాయి మాఫియాపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా గంజాయి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బొయిపరిగుడ సమితి చిపాకూర్ గ్రామ పంచాయతీ ఝిలోగుడ గ్రామంలో ఒక వ్యక్తి గంజాయిని ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు బస్తాల్లో నింపుతున్న సమాచారం నందపూర్ ఎకై ్సజ్ అధికారికి వచ్చింది. దీంతో వెంటనే ఒక బృందం ఝిలోగుడ గ్రామానికి బయల్దేరింది. సనియ అండాల్ అనే వ్యక్తి రహదారిలో గంజాయి బస్తాల్లోకి నింపుతుండగా దాడి చేశారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి 120 కేజీల గంజాయితో పాటు బొయిపరిగుడ పోలీసుస్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రాయగడ: జిల్లాలోని గుణుపూర్ ఆదర్శ పోలీస్స్టేషన్ సిబ్బంది గురువారం రైల్వేస్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి ఒక మహిళతో పాటు మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. ఐఐసీ కేకేబీకే కుహరో తెలిపిన వివరాల మేరకు.. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు గుణుపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో పోలీస్ సిబ్బంది తనిఖీలను నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఒక బృందాన్ని ఆపి వారి బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. ఈ కేసులో అరైస్టెన నిందితులు గజపతి జిల్లాల్లోని ఆర్.ఉదయగిరి ప్రాంతానికి చెందిన బబులి నాయక్, ఆకాష్ కొరడగా గుర్తించగా.. మరో ముగ్గురు బీహార్కు చెందిన మహాంతమనియార్ ప్రాంతంలోని చందాదేవి, రాయిన్పఖొరి గ్రామానికి చెందిన ఛొటు సాని, రాజు కుమార్లు ఉన్నారు. నిందితుల నుంచి ఒక ద్విచక్ర వాహనం, రూ.11 వేల నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ రాష్ట్రానికి గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. -
ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి
● కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలుభువనేశ్వర్: రాష్ట్రంలో ఇటీవల ముగిసిన రాజ్యసభ ఎన్నికలు పలు సంచలనాత్మక రాజకీయ పరిణామాలకు ఆజ్యం పోస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంమంది సభ్యులు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. దీంతో వారిపై చర్యలకు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నడుం బిగించింది. ఈ దిశలో ఇద్దరు ఎమ్మెల్యేల పదవుల రద్దు కోరుతు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర శాసనసభ స్పీకర్కు లిఖిత పూర్వకంగా అభ్యర్థించింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ డాక్టర్ సి.ఎస్.రాజెన్ ఎక్కా స్పీకర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ పిటిషనులో సభ్యుల పదవుల రద్దుకు సంబంధించిన బలమైన ఆధారాలు, కారణాలు వివరించారు. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) కింద సోఫియా ఫిర్దౌస్ (బారాబటి కటక్), దాశరథి గొమాంగో (మోహన)లను అనర్హులుగా ప్రకటించాలని వినతులో పేర్కొన్నారు. -
సమష్టి పురోగతి సాగిద్దాం
భువనేశ్వర్: స్థానిక లోక్ భవన్లో గురువారం పరాభవ నామ ఉగాది, గుడి పడ్వా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు సంస్కృతి, ఆత్మీయత, నూతన ఆరంభాల ఉమ్మడి స్ఫూర్తితో నిండిన హృద్యమైన అనుభవం. తెలుగు, కన్నడ, మరాఠీ వర్గాల సభ్యులతో సంభాషించడం మన వైవిధ్యమే మన గొప్ప బలం అనే నమ్మకాన్ని మరింత బలపరిచిందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి తెలిపారు. నూతన సంవత్సరంలోకి అడుగిడిన ఈ శుభ తరుణంలో సామరస్యం, కృతజ్ఞత, సమష్టి పురోగతిని స్వీకరిద్దాం అని ప్రోత్సహించారు. ప్రతి ఒక్కరూ శాంతి, శ్రేయస్సు, సంతోషంతో వర్ధిల్లాలని గవర్నరు శుభాకాంక్షలు తెలిపారు. -
శ్రీరామ కల్యాణానికి పందిరి రాట
జయపురం: స్థానిక జమాల్ వీధి(రామాలయం వీధి)లో వేంచేసి ఉన్న శ్రీరామమందిరంలో ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామ నవరాత్రి కల్యాణ సామ్రాజ్య పట్టాభిషేకానికి గురువారం ఉగాది ముహూర్తపురాట ప్రతిష్టాపన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఆలయ పరిచాలన కమిటీ కార్యదర్శి సానా జగదీశ్వర రావు, జయపురం కళింగ వైశ్య కుల పెద్ద వారణాశి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాన్ని ఆలయ పురోహితులు గన్నవరపు కోటేశ్వర వర ప్రసాద్ శర్మ, ఎలిమిరి నాగేశ్వర రావు శాస్త్రోక్తంగా నిర్వహించారు. క్యాలెండర్ ఆవిష్కరణ రాయగడ: స్థానిక బాలాజీ నగర్లో ఉన్న కల్యాణ వేంకటేశ్వర మందిరంలో ఉగాదిని పురస్కరించుకుని గురువారం వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యులు, ప్రసన్నలతో పాటు ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షుడు చంద్రమౌళి కుముంధాన్, శ్రీనివాస్ కుముంధాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శైలపుత్రి రూపంలో మజ్జిగౌరి రాయగడ: చైత్రమాసం నవరాత్రిలో భాగంగా మజ్జిగౌరి అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు మంగళవారం దర్శనమిచ్చారు. అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి బారులుతీరారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జయపురం: స్థానిక వల్లభ నారాయణ మందిరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రీయ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా న్యాయవాది హరిష్ ముదులి పాల్గొన్నారు. వేడుకల్లో పట్టణ సంఘ చాలక్ ప్రేమానందనాయిక్, డాక్టర్ నిరంజన్ మిశ్ర, ముఖ్యవక్తగా కేంద్రీయ విశ్వవిద్యాలయ సహాయ ప్రొఫెసర్ డాక్టర్ సీతారామ్ రాయగురు నూతన సంవత్సరంపై ప్రసంగించారు. -
ఉగాది వేడుకలు
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026సందడిగా ..రాయగడ: జిల్లా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ముందుగా ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం మజ్జిగౌరి మందిరంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మజ్జిగౌరి మందిరంలో కొండబాబు, గజపతి జిల్లా పర్లాకిమిడి మాజీ ఎమ్మెల్యే కొడూరు నారాయణరావులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో నిలిపిన కలశానికి పూజా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం కలశ యాత్రను నిర్వహించారు. మజ్జిగౌరి మందిరం నుంచి ప్రారంభమైన కలశయాత్ర, ర్యాలీ కొల్లిగుడ వద్ద ఉన్న సభా వేదిక వరకు కొనసాగింది. ర్యాలీలో డప్పు వాయిద్యాలు, వివిధ వేషాధారణలు, ట్రాక్టర్లపై వేంకటేశ్వర, శ్రీరామ, వినాయక తదితర అలంకారాలతో వేషాధారణలు ఆకట్టుకున్నాయి. అడుగడుగునా బాణసంచాతో కొనసాగిన ర్యాలీ పట్టణం మెయిన్రోడ్డు గుండా ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా సభా వేదిక వరకు కొనసాగింది. ఇదిలా ఉండగా జిల్లా తెలుగు సమాఖ్య కన్వీనర్ వీరబాబు ఆధ్వర్యంలో ఉదయం సభా వేదిక వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు శ్రీరేజేటి శ్రీనివాస్ శర్మ, రేజేటి శ్రీరామ శర్మల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ పఠనం జరిగింది. జయపురంలో.. జయపురం : జయపురం తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో గురువారం ఉగాది కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన తెలుగు సంప్రదాయ వస్త్రధారణ పోటీలు ఆకట్టుకున్నాయి. తెలుగు సాంస్కృతిక సమితి వారి సిటీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో నిర్వహించిన వంటల పోటీల్లో అనేక మంది మహిళలు పాల్గొన్నారు. ఐసా గౌఢ ప్రథమ స్థ్నాంలో నిలవగా, ఎం.ఇందుమతి రెండోస్థానం, పి.శ్రావణి మూడో స్థానంలో నిలిచారు. వంటల పోటీల్లో ఎస్.సాయిశ్రీ ప్రథమ బహుమతి పొందగా, ఎస్. రమ్య రెండో బహుమతి, వి.హామినీ రెడ్డి మూడో బహుమతి సాధించారు. -
ఘనంగా సీఆర్పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం
కొరాపుట్: కేంద్ర బలగాలలో ప్రధానమైన సీఆర్పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. గురువారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని జానకీనగర్లో సీఆర్పీఎఫ్ 12వ బెటాలియన్ కేంద్రంలో 87వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. కమాండెంట్ నంద కిశోర్ కుమార్ ప్రసాద్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమర జవానులకు నివాళులర్పించారు. దేశ తొలి ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఈ దళం ఏర్పాటైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐసీ కేకే సింగ్, డిప్యూటీ కమాండెంట్ రాజీవ్ కుమార్, ఏసీ అనీల్ కుమార్, ఇన్స్పెక్టర్ సాహు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సభలో ఎస్సీబీ రభస
భువనేశ్వర్: కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి అగ్ని ప్రమాదంపై ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ రాజీనామా చేయాలని బిజూ జనతా దళ్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో రాష్ట్ర శాసన సభలో గురువారం గందరగోళంతో స్తంభించిపోయింది. సోమవారం జరిగిన విషాద ఘటనపై బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు దాడిని తీవ్రతరం చేస్తూ, ప్రముఖ ఆస్పత్రిలో భద్రతా ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపణతో చేసిన నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ నైతిక విలువలకు కట్టుబడి మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్కు బిజు జనతా దళ్ (బీజేడీ), కాంగ్రెస్ సభ్యులు కట్టుబడి ఉన్నారు. రాష్ట్రంలో ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి అగ్ని ప్రమాదం రాజకీయ వేడిని పెంచుతుండగా ప్రతిపక్షాలు ఈ విషయంపై శాసన సభలో గందరగోళం నిరవధికంగా కొనసాగుతుంది. ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సష్టించడంతో, పదేపదే వాయిదాలు పడటంతో సభా కార్యకలాపాలు విపరీతంగా ప్రభావితం అవుతున్నాయి. మంత్రి రాజీనామా చేసే వరకు సభలో ఈ పరిస్థితి కొనసాగుతుందని బిజూ జనతా దళ్ శాసన సభ్యులు హెచ్చరించారు. ప్రతికూల పరిస్థితుల్లో సభా కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలు కాక స్పీకర్ సురమా పాఢి సభలో శాంతియుత వాతావరణం పునరుద్ధరించే ప్రయత్నంలో సభను పలుమార్లు వాయిదా వేశారు. తొలుత ఉదయం 11.30 గంటలకు, తర్వాత మధ్యాహ్నం 1 గంటకు, ఆపై సాయంత్రం 4 గంటల వరకు సభను వాయిదా వేశారు. అప్పటికి సభలో విపక్షాల వేడి చల్లారక పోవడంతో సభ స్తంభించిపోయింది. సభలో సాధారణ పరిస్థితిని పునరుద్ధరించే ప్రయత్నంలో స్పీకర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం నిర్వీర్యమైంది. ఎలాంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు. స్పీకర్ ప్రయత్నం నీరు గారిపోయింది. -
చట్టాలపై అవగాహన అవసరం
పర్లాకిమిడి: మహిళలు పని చేసే స్థలంలో ఎదుర్కొంటున్న లైంగిక దాడులు, వేధింపులపై గజపతి జిల్లాలో అతి తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని, దీనికి మహిళల బలహీనత, సంఘంలో పేరుప్రతిష్టలకు ఆటంకం కలుగుతాయని వెనక్కి తగ్గుతున్నారని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో కార్యాలయాల్లో పనిచేసే మహిళలపై దాడులు, వాటి నివారణపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును జిల్లా ఎస్పీ పండా గురువారం ప్రారంభించారు. ఒడిశా జీవనోపాదులశాఖ, మిషన్శక్తి శాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఇన్చార్జి సీడీఓ పృథ్వీరాజ్ మండల్, సబ్కలెక్టర్ అనుప్ పండా, జిల్లా ప్రజాఆరోగ్యశాఖ డాక్టర్ ప్రదీప్ కుమార్ మహాపాత్రో, జ్యువెనెల్ జస్టీస్ ప్యానల్ న్యాయవాది భాగ్యలక్ష్మీ నాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ సరలా పాత్రో, ఐ.డబ్ల్యూ.ఏ డైరెక్టర్ మినాతి పాడీ, మిషన్ శస్తి, డి.పి.ఎం టిమోన్ బోరా తదితరులు హాజరయ్యారు. మహిళలు పని చేసే స్థలంలో లైంగిక వేధింపులకు గురైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చన్నారు. గృహా వేధింపులపై జిల్లా జడ్జి కోర్టులో ప్రత్యేక న్యాయస్థానం ఉన్నంని సబ్ కలెక్టర్ అనుప్ పండా అన్నారు. లైంగిక వేధింపులపై పోష్ చట్టం 2013, బాలికలపై అత్యాచారానికి పాల్పడితే పోస్కో చట్టం, బాల్యవివాహాలపై చట్టాలున్నాయని, వీటిపై అవగాహన కలిగి ఉండాలని స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు మినాతీ పాడీ అన్నారు. ట్రాన్స్జెండర్స్ జాస్మిన్, మధుబోరాడో, ఐ.సి.డి.ఎస్ అధికారి కోమలాంగి, తదితరులకు మెమొంటోలతో జిల్లా మిషన్ శక్తి ఆధ్వర్యంలో అందజేశారు. -
ఏప్రిల్ 1న ఉత్కళ దివస్
పర్లాకిమిడి: ఏప్రిల్ ఒకటో ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, ఉత్కళ దివాస్, మహారాజా కృష్ణచంద్ర గజపతి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు స్థానిక జిల్లా పరిషత్తు కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సాయంత్రం ఏ.డి.ఎం. (రెవెన్యూ) మునీంద్ర హనగ అధ్యక్షతన ముందస్తు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఇన్చార్జి అధికారి పృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, డి.పి.ఆర్.ఓ ప్రదీప్త గురుమయి, పురపాలక సంఘం ఈఓ లక్ష్మణ ముర్ము, తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 1న పట్టణంలో కుమ్మరి వీధి వద్ద ఉన్న మహరాజా విహార పార్క్ వద్ద మహరాజా కృష్ణచంద్ర గజపతి సమాధి వద్ద నివాళులర్పిస్తామన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు చిత్రకారవీధి, కొత్త బస్టాండ్, మార్కెట్ వరకు శోభాయాత్ర చేపడతామన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద రాజావారి విగ్రహానికి పూలమాలలు వేస్తామన్నారు. ప్రతి పాఠశాలలో ఉత్కళ రాష్ట్రం కోసం పోరాడి సాధించిన పర్లాకిమిడి మహరాజా కృష్ణచంద్రగజపతికి నివాళులర్పించాలన్నారు. ఏప్రిల్ 26న కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ జయంతి వేడుకలు కూడా నిర్వహించాలని మునీంద్ర హనగా కోరారు. రహదారి పనుల ప్రారంభం పర్లాకిమిడి: జిల్లాలో కాశీనగర్ బ్లాక్ కె.సీతాపురం పంచాయతీలో బిసిరింగి గ్రామానికి పది లక్షల రూపాయలతో పక్కా రోడ్డు పనులను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి గురువారం ప్రారంభించారు. గ్రామానికి మూడు కల్వర్టులు, డ్రెయిన్, చెరువు పుణరుద్ధరణ పనులకు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. కె.సీతాపురం నుంచి దేవుదళ గ్రామానికి రూ.5లక్షలతో పక్కా రోడ్డు పనులకు ఎమ్మెల్యే పాణిగ్రాహి శంకుస్థాపన చేశారు. -
చైత్రంలో మేఘ సందేశం
చైత్రం ఆగమనం నాడే మేఘాలు ఇలా పలకరించాయి. ఉగాది నాడు వాతావరణం చల్లగా మారిపోయింది. సందె వేళకు మబ్బులు ముసురుకున్నాయి. జి.సిగడాంలో కమ్ముకున్న మేఘ మాలికలు ఇలా కనువిందు చేశాయి. – జి.సిగడాం వేడుకగా ఉగాది.. పర్లాకిమిడి: దక్షిణ భారత బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది వేడుకలు స్థానిక ప్రవాసాంధ్రులు జంగం వీధి జంక్షన్ ఎస్.ఎ కళ్యాణ మండపంలో గురువారం ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు డాక్ట్ ఆర్.ఆర్.రవి అధ్యక్షత వహించారు. కన్వీనరు వెల్లంకి కూర్మనాథం, చెట్టి వేంకటేశ్వర్లు అతిథి పరిచయం చేశారు.వేదంభట్ల వేంకటరమణ మూర్తి, భాస్కరభట్ల రవి ఉగాది పంచాంగ పఠనం చేశారు. అనంతరం వారిని డాక్టర్ ఆర్.ఆర్.రవి సన్మానించారు. విశ్రాంత ఫిజిక్స్ రీడర్ ఎం.ఎన్.మూర్తి, రాయఘడ బీ.ఈ.ఓ టి.కిశోర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని, మన సంప్రదాయాలను పరిరక్షించాలన్నారు. బ్రాహ్మణ సంఘం సభ్యులు పులఖండం రాంబాబ్జీ శర్మ, వేమూరి నరసింహ మూర్తి, సీతామహాలక్ష్మి, నాట్యశారద హిమగిరికి డాక్టర్ రవి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాస్కరభట్ల అమంత భక్తి పాటలతో అలరించింది. అనంతరం హిమగిరి నేతృత్వంలో శిష్యబృందం నాట్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ నుంచి ఉర్లాం రైల్వే స్టేషన్ వెళ్లే మార్గ మధ్యంలో గురువారం రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారని శ్రీకాకుళం రోడ్డు జీఆర్పీ ఎస్ఐ ఎం.మధుసూదన రావు తెలిపారు. రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి శ్రీకాకు ళం సర్వజన ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించామని తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని, సమాచారం తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ కోరారు. బంగారం కొనుగోలులో గందరగోళం కొత్తూరు: ఉగాది నాడు కొత్తూరులో బంగారం కొనుగోలుదారులు గందరగోళానికి గురయ్యారు. ఉగాది నాడు బంగారం కొనుగోలు చేయడం చాలా మందికి సంప్రదాయం. ఉగా ది రోజు ఉదయం ఒక గ్రాము బంగారం ధర రూ.15,800 చూపించింది. సాయంత్రానికి రూ.14,900కు తగ్గింది. అయితే కొత్తూరులోని పలు షాపుల్లో తగ్గిన ధర కాకుండా ఉదయం ధరకే బంగారం విక్రయించారు. కొనుగోలుదారులు తర్వాత విషయం తెలుసుకుని నష్టపోయామని లబోదిబోమన్నారు. ఒకే ఊరిలో ఒక్కో షాపులో వేరు వేరు ధరలతో బంగారం విక్రయాలు జరగడంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గేట్లో ఆల్ ఇండియా 248వ ర్యాంక్ పొందూరు: మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన మొదలవలస రాజ్కుమార్ గేట్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచాడు. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గేట్ ఫలితాలలో ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంక్ 248 పొందాడు. ప్రస్తుతం రాజ్కుమార్ ఐఐటీ ధన్బాద్లో కృత్రిమ మేథస్సు, డేటా సైన్స్ విభాగంలో పరిశోధనలు చేస్తున్నారు. రాజ్కుమార్ తండ్రి మొదలవలస గోవిందరావు మెడికల్ బిజినెస్ చేస్తుంటారు. తల్లి మొదలవలస జయసుధ గృహిణి. గేట్లో 544వ ర్యాంకు సంతబొమ్మాళి: బోరుభద్ర పంచాయతీ గొదలాం గ్రామానికి చెందిన పిలక పవన్కుమార్ గేట్ ఎంట్రన్స్టెస్ట్లో ఆల్ ఇండియాలో 544వ ర్యాంకు సాధించారు. ప్రాథమిక విద్య బోరుభద్రలోని ప్రైవేటు పాఠశాలల్లో, వెన్నెలవలస నవోదయలో ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. ఫిబ్రవరి 8న జరిగిన గేట్ ఎంట్రన్స్ లో ఆల్ ఇండియా ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు రమేష్బాబు, కళావతమ్మ గ్రామస్తులు అభినందించారు. టెక్కలి: కోటబొమ్మాళి మండలం కురుడు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ లఖినేని కిరణ్కుమార్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పశు వైద్యాధికారిగా ఎంపికై గురువారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అవార్డును అందుకున్నారు. పశువుల పునరుత్పత్తి విభాగంలో 2012 – 2026 వరకు కృత్రిమ గర్భధారణ లక్ష్యాలను పూర్తి చేయడంలో కిరణ్కుమార్ చేసిన సేవలకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాతో పాటు టెక్కలి డివిజన్ పరిధిలో గల పశు సంవర్ధక శాఖ సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు. -
ఈ ఏడాది నీటి కష్టాలు తప్పవా..?
● ఏడాదిగా మరమ్మతులకు నోచుకోని ఆర్వో ప్లాంట్ ● టెక్కలి ఆస్పత్రిలో రోగులకు తప్పని తాగునీటి కష్టాలు టెక్కలి రూరల్: ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ టెక్కలి జిల్లా ఆస్పత్రిలోని ఉన్న ఆర్వో ప్లాంట్ గత ఏడాదిగా పని చేయడం లేదు. ఆస్పత్రికి వస్తున్న రోగులు తాగునీటికి తంటాలు పడు తున్నారు. ఎప్పటికప్పుడు దీనిపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ దాన్ని బాగు చేయకపోవడంతో ఈ ఏడాది సైతం నీటి కష్టాలు తప్పేలా లేవని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వేసవిలో ఆర్వో ప్లాంట్ మరమ్మతులకు గురైంది. ఆ ఏడాది ఆస్పత్రికి వచ్చే రోగులు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. నీటి బాటి ల్స్ కోనుగోలు చేసుకుని తాగేవారు. కొంత మంది తమ ఇళ్ల నుంచి నీరు తెచ్చుకునే వారు. అప్పట్లో ‘సాక్షి’లో వచ్చిన వార్తలకు స్పందించి రోగులకు క్యాన్లతో నీటిని ఏర్పాటు చేశారు. అయినప్పటికి పూర్తిస్థాయిలో రోగులకు తాగునీరు అందివ్వలేకపోయారు. ఈ ఏడాది అయినా ఆర్వో ప్లాంట్ మరమ్మతులు చేయించి రోగులకు తాగునీరు అందిస్తారనే ఆశ ఉన్నప్పటికీ ఇంత వరకు ఆర్వో ప్లాంట్ మరమ్మతులు చేయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు స్పందించి ఆర్వో ప్లాంట్ మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు. -
‘కళ’హండి కట్టప్ప
● ప్రదర్శనల్లో అలరిస్తున్న సునీల్ మహానంద ● నటుడిగా, ఫోక్ డ్యాన్సర్గా, గాయకునిగా రాణింపు ● కేరమ్స్లో నేషనల్ ప్లేయర్గా గుర్తింపు కలహండి కట్టప్ప వేషధారణలో సునీల్ మహానంద కంచిలి: ఉత్తరాంధ్రలో ఎక్కడ జాతర జరిగినా విచిత్ర వేషధారణతో ఓ వ్యక్తి కనిపిస్తాడు. ఆడు తూ, ఆట పట్టిస్తూ హుషారుగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటాడు. భారీ కాయంతో జాతర కు సెంటర్ఆఫ్ అట్రాక్షన్గా మారుతాడు. జనం అతడిని ‘కలహండి కట్టప్ప’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ వేషధారణ హాస్యానికే అయినా.. అతడు జానపద గీతాలను అద్భుతంగా పాడగలడు. అంతకుమించి ఆటను రక్తి కట్టించగలడు. జాతీయ స్థాయి కేరమ్స్ పోటీల్లోనూ రాణించాడు. పుట్టుక ఒడిశాలోని కలహండే అయినా మన తెలుగు వారికి అందులోనూ సిక్కోలు వారికి చిర పరిచితుడు. ఈ కట్టప్ప అసలు పేరు సునీల్ మహానంద. స్వస్థలం ఒడిశా రాష్ట్రం. ఇటీవల కంచిలిలో జరిగిన జాతరలో ఈ కలహండి కట్టప్ప తళుక్కున మెరిశాడు. ఓ 20 మందిని వెంటబెట్టుకుని 350 కిలోమీటర్లు ప్రయాణించి కంచిలిలో ప్రదర్శన ఇచ్చాడు. తెలుగు ప్రాంతాల్లో ఎక్కడ జాతర జరిగినా అతడు బండి కట్టి రావాల్సిందే. సునీల్ మహానంద తన గురువు ప్రమోద్కుమార్ నాయక్ వద్ద నాటక రంగంలో శిక్షణ పొందారు. 15 ఏళ్లుగా ఈ వృత్తినే ఎంచుకొని ప్రయా ణం కొనసాగిస్తున్నారు. ఇతడు నటనతోపాటు నేషనల్ ఫోక్ డ్యాన్సర్గాను, గాయకునిగా కూడా రాణిస్తున్నారు. మరోవైపు కేరమ్స్లో నేషనల్ ప్లేయర్గా కూడా రాణిస్తున్నారు. ఇతని స్వగ్రామం కలహండి జిల్లా భవానీపట్నం. కలహండి కట్టప్ప ప్రదర్శనను సంబర మహోత్సవాల్లో స్ట్రీట్ షోలతోపాటు, స్టేజి ప్రదర్శనలు కూడా ఇస్తారు. 20 మంది బృంద సభ్యులతో ఈ ప్రదర్శనలిస్తున్నారు. ఇప్పటి వరకు ఒడిశా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోను, పక్క రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చారు. సినిమాల్లోనూ రాణింపు సునీల్ మహానంద వీధి ప్రదర్శనలతోపాటు స్టేజి షోలను చేస్తున్నారు. ప్రస్తుతం వీటితోపాటు ఒడి యా సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేశారు. అలాగే షార్ట్స్ ఫిల్మ్లను కూడా చేస్తున్నారు. సమాజానికి అవసరమైన మెసేజ్ ఇచ్చే షార్ట్ ఫిల్మ్లను కూడా తీస్తుంటారు. వీటితోపాటు ‘నృత్యగాన సాంస్కృతిక అనుస్టాన్’ పేరుతో భవానీపట్నంలో ఫోక్ డ్యాన్స్ అకాడమీని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ‘కలహండి కట్టప్ప’ అనే పేరుతో యూట్యూబ్ చానెల్ను కూడా నిర్వహిస్తున్నారు. -
‘తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత’
శ్రీకాకుళం కల్చరల్: తెలుగు భాషా పరిరక్షణ అందరి బాధ్యత అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వీసీ డాక్టర్ కేఆర్ రజిని అన్నారు. తెలుగు రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో శుక్రవారం ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన ఉగాది సంబరాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రజిని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ తెలుగు కవులు, జర్నలిస్టులు, రచయితలు తెలుగు భాషా సాహిత్య సంస్థల ద్వారా తెలుగు భాషను పరిరక్షిస్తున్నారని పేర్కొన్నారు. రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల ప్రచారానికి తెరవే చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. తెరవే సభ్యుడు తోట గోపాలరావు రచించిన తోట వారి కథలు, స్పందన కవితా సంపుటి పుస్తకాలను వైస్ చాన్స్లర్ కేఆర్ రజిని ఆవిష్కరించి పంపిణీ చేశా రు. స్పందన కవితా సంపుటిని డాక్టర్ ముట్నూరు ఉపేంద్ర శర్మ సమీక్షించగా, తోట వారి కథలు పుస్తకాన్ని పీఎస్ నాగరాజు సమీక్షించారు. కవి సమ్మేళనలో కిల్లాన శ్రీనివాస్, భోగిల ఉమామహేశ్వరరావు, ఇద్ది పాపయ్యల నిర్వహణలో 50 మంది కవులు పాల్గొని స్వీయ కవితలను వినిపించారు. భోగిల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఐఎన్డీ ప్రసాద్, ఇద్ది పాపయ్యలు తొలుత ప్రతిస్పందన అనే నాటికను ప్రదర్శించారు. -
వంటలు భేష్
● బయో గ్యాస్.. ● గ్యాస్ కష్టాలను అధిగమిస్తున్న హరేకృష్ణ అక్షయపాత్ర ● రోజుకు 30వేలకు పైగా భోజనాల పంపిణీ ● కేవలం బాయిలర్లతోనే భోజనాల తయారీ బయో గ్యాస్ ద్వారానే వంట.. అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటకాలకు గాను రోజుకు పది సిలిండర్లు అవసం కాగా కేవలం ఐదు సిలెండర్లను వాడుతూ మిగిలినది పునరుత్పాదక ఇంధనాల ద్వారానే వంట చేస్తోంది. ప్రధానంగా మిగిలిపోయిన కూరగాయలు, మిగిలిన భోజనాలు ఈ బయోగ్యాస్ ప్లాంట్లో ఉపయోగించి రోజుకు 15 నుంచి 20 కిలోల గ్యాస్ను ఉత్పత్తి చేస్తోంది. పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి కేవలం నీటి ఆవిరి ద్వారానే పప్పు, అన్నం, కూరగాయల కు సంబంధించి వంటను తయారు చేస్తోంది. వీటన్నింటికీ బ్రికెట్స్ బాయిలర్ ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేస్తూ వంట చేస్తోంది. వీటితో పాటు అదనంగా చెక్కపొడి, కొబ్బరిపీసు, వేరుశనగ పొట్టుతో కలిసి పునరుత్పాదక శక్తి వనరుల ద్వారానే అక్షయపాత్రలోని వంటకాలు నిర్విరామంగా తయారు చేస్తున్నారు. ఈ దిమ్మలను బాయిలర్లో వేడి చేయడం ద్వారా వచ్చే వేడితో వంట చేస్తున్నారు. అలాగే సోలార్ ద్వారా రోజుకు 450 యూనిట్ల కరెంటు ఉత్ప త్తి చేస్తూ వంటశాలకు నిర్వహిస్తున్నారు. పాఠశాలలకు భోజనాలు సరఫరా చేసే వాహనాలను సైతం ఎలక్ట్రికల్ వెహికిల్స్నే వాడుతున్నారు.శ్రీకాకుళం రూరల్: ప్రపంచమంతా సిలిండర్ భారాన్ని మోస్తుంటే హరేకృష్ణ సంస్థకు చెందిన అక్షయ పాత్ర మాత్రం గ్యాస్ కష్టాలు దరి చేరకుండా వండి వారుస్తోంది. కేవలం బాయిలర్లతోనే భోజనాలు తయారు చేస్తోంది. శ్రీకాకుళం మండల పరిధిలోని సింగుపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 312 మంది విద్యార్థుల కోసం అప్పట్లో అక్షయ పాత్ర మొదలుపెట్టారు. నేడు శ్రీకాకుళంతో పాటు, గార, ఆమదావలస పాఠశాలకు సైతం 18వేల మంది విద్యార్థులకు నిత్యం భోజనాలు అందిస్తోంది. వీటితో పాటు హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో 9 అన్న క్యాంటీన్లకు గాను పదివేలు భోజనాలు సైతం ఈ సంస్థే సరఫరా చేస్తోందని సంస్థ పర్యవేక్షకులు తిలారి శ్రీనివాస్ తెలిపారు. -
రౌడీషీటర్ ఘాతుకం.. యువకుడి హత్య
● కత్తిపోట్లకు 19 ఏళ్ల యువకుడు బలి ● మరొకరి పరిస్థితి విషమం ● ఇసుకతోటలో దారుణం ఎంవీపీకాలనీ: నగరంలోని ఇసుకతోట రామాల యం సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాతకక్షల నేపథ్యంలో బొచ్చు వెంకటేష్(19) అనే యువకుడు రౌడీషీటర్ చేతిలో దారుణ హత్యకు గురవగా, బాకీ సంతోష్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో రౌడీషీటర్ పల్లా అనీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. నిత్యం రౌడీషీటర్లను పర్యవేక్షిస్తున్నా, తరచూ కౌన్సిలింగ్లు ఇస్తున్నా.. ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. రణస్థలం, పూసపాటిరేగ ప్రాంతాలకు చెందిన బొచ్చు వెంకటేష్, బాకీ సంతోష్ వరుసకు అన్నదమ్ములు. ఉపాధి నిమిత్తం వీరిద్దరూ విశాఖలో ఉంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్లా అనీల్పై ఎంవీపీకాలనీ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. గతంలో ఇతని ఆగడాలు మితిమీరడంతో పోలీసులు నగర బహిష్కరణ కూడా చేశారు. కొంతకాలం రణస్థలంలో ఉన్న అనిల్, ఇటీవల మళ్లీ నగరానికి చేరుకున్నాడు. రణస్థలంలోనే అనీల్కు, వెంకటేష్కు పరిచయాలు ఉన్నాయి. కాగా.. వెంకటేష్ భార్య విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా తగాదాలు నడుస్తున్నాయి. దీనిపై గతంలోనే వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మూడు నెలల కిందట పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా వీరి మధ్య వివాదం సద్దుమణగలేదు. ఇటీవల మరోసారి గొడవ జరగడంతో ‘చూసుకుందాం రా’ అంటూ వెంకటేష్ సవాల్ విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాత్రి అర్ధరాత్రి సమయంలో ఇసుకతోట రామాలయం వద్ద వెంకటేష్, అనీల్ తర ఫు వాళ్లు తలపడ్డారు. ముందస్తు పథకం ప్రకారం కత్తితో సిద్ధంగా వచ్చిన అనీల్, ఒక్కసారిగా వెంకటేష్, సంతోష్లపై దాడి చేశాడు. బలమైన కత్తిపో ట్లు తగలడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సంతోష్ తీవ్ర గాయాలపాలవగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నైట్ బీట్ పోలీసులు అక్కడికి చేరుకుని సంతోష్ను వెంటనే కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనలో సుమారు 12 మంది యువకులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ నరసింహమూర్తి గురువారం తెలిపారు. రౌడీషీటర్ అనీల్ వెంకటేష్(ఫైల్) -
21న అమరవీరుడు అప్పలసూరి వర్ధంతి
నరసన్నపేట: శ్రీకాకుళం నక్సల్బరీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అమరవీరుడు మామిడి అప్పలసూరి అని సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. కోమర్తిలో అమరవీరుల స్థూపం వద్ద 21న కోమర్తిలో 29 వ వర్ధంతి సభ నిర్వహిస్తున్నామని, దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోమర్తిలో గురువారం ఉదయం ఈ మేరకు కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పలసూరి చూపించిన పోరాట మార్గాన్ని అనుసరించి నూతన ప్రజాస్వామిక విప్లవ సాధన కోసం ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపు నిచ్చారు. సమస్యల పరి ష్కారానికి పోరాటమే సరైన మార్గమని అన్నారు. 21న ఉదయం 10 గంటల నుంచి కోమర్తిలో వర్ధంతి సభ నిర్వహిస్తామని పార్టీ కార్యకర్తలు, అప్పలసూరి అభిమానులు, కోమర్తి ప్రజలు అదిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనసెట్టి రాజశేఖర్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకురాలు సవలాపురం కృష్ణవేణి, న్యూ డెమొక్రసీ జిల్లా నాయకులు నేతింటి నీలం రాజు, ఏఐకెఎంఎస్ జిల్లా నాయకులు బగ్గు భాస్కరరావు, కోమర్తి కాలనీ వాసులు కొల్లి చిన్నబాబు, పెదలాపు దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే నివాస సముదాయ పనుల పరిశీలన
భువనేశ్వర్: రాజధాని భువనేశ్వర్లో కొనసాగుతున్న ఎమ్మెల్యే నివాస సముదాయం నిర్మాణం పనుల పురోగతిని సమీక్షించేందుకు న్యాయ, ప్రజా పనులు, అబ్కారీ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరిచందన్ మొత్తం ప్రాంతాన్ని తనిఖీ చేసి, మిగిలిన పనులను వేగవంతం చేయాలని సీనియర్ అధికారులకు, కాంట్రాక్టు ఏజెన్సీకి ఆదేశించారు. 6 టవర్లతో కూడిన ఈ నివాస సముదాయంలో మొత్తం 300 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో 105 టైప్ 7 ప్లాట్లు కాగా, 195 టైప్ 6 ప్లాట్లు ఉన్నాయి. ఈ సముదాయంలో 130 మంది ఎమ్మెల్యేలు, 170 మంది సీనియర్ అధికారులు నివసిస్తారు. దీనితో పాటు, ప్రాంగణంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం, భూగర్భ జలాల పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపేందుకు పెద్ద చెట్లను నాటనున్నారు. అదేవిధంగా, అతిథుల కోసం 50 గదులతో కూడిన క్లబ్ హౌస్ నిర్మాణంపై చర్చలు జరిగాయి. ఈ నిర్మాణం పనులు ఈ ఏడాది జూన్ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్ధారించారు. సమావేశానికి ఎమ్మెల్యే బాబూ సింగ్, నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ సింగ్, ఓబీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ సాహాతో పాటు సీనియర్ శాఖ అధికారులు, చీఫ్ ఇంజనీర్లు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ అధికారులు హాజరయ్యారు. -
శబరి నదిలో అస్తి పంజరం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి బదుడి పర్వత సమీపంలోగల నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ కుటుంబంలో నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు మాత్రమే కనుగొన్నారు. మిగతా ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. ఆ సంఘటన జరిగిన నెలన్నర తర్వాత శబరి నదిలో మంగళవారం మధ్యాహ్నం ఒక అస్తి పంజరం కనిపించింది. సమాచారం అందిన వెంటనే కొరాపుట్ వాడ్రాప్ టీమ్ అక్కడకు చేరుకుని బదుడి పర్వత ప్రాంతం శబరి నది ఘాట్కు వెళ్లి నదిలో తేలియాడుతున్న అస్తి పంజరాన్ని బయటకు తీశారు. ఈ అస్తిపంజరం నాడు గల్లంతైన వారిలో ఒకరిదిగా అనుమానిస్తున్నారు. గత ఫిబ్రవరి 1వ తేదీన దండాబెడ గ్రామంలో లలిత పూజారి తన భార్యబిడ్డలతో గుప్తేశ్వర్ సమీప బదుడి పర్వత సమాప శబరి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాలేదు. వారి బంధువులు ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు వాడ్రాఫ్ టీమ్తో చేరుకుని గాలించారు. ఎట్టకేలకు లలిత పూజారి అతడి చిన్న కుమార్తెల మృతదేహాలు కనుగొన్నారు. భార్య, కుమారుల ఆచూకీ తెలియ లేదు. ఆనాడు గల్లంతైన లలిత పూజారి భార్యదే ఈ అస్తిపంజరం అని అనుమానిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరం సమీపంలో గల చెక్గేట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని సదరు సమితి తొలగుమ్మ గ్రామానికి చెందిన కాసాన కంజాక (24) గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐఐసీ ప్రసన్నకుమార్ బెహరా తెలియజేసిన వివరాల ప్రకారం.. బుధవారం కాసాన బైక్పై పితామహల్ వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో చెక్గేట్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన అతడిని అక్కడ గల ఆటో డ్రైవర్లు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం అందజేత
రాయగడ: సమస్యలను పరిష్కరించాలని స్థానిక డొండ్ సమాజం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణిని తన కార్యాలంయలో బుధవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గల ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న డొంబ్ తెగకు చెందిన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, డొంబ్ సమాజ్ సంస్కృతికి అద్దం పట్టే వాయిద్యాలను పంపుగ, శుభ కార్యాలయాల్లో వినియోగించే విధంగా ప్రోత్సాహించాలని పేర్కొన్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో డొంబ్ సమాజానికి చెందిన భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని విన్నవించారు. ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ పాఠశాలలో పది శాతం సీట్లను డొంబ్ కులాలకు చెందిన విద్యార్థుల కోసం రిజర్వేషన్లను ఏర్పాటు చేయాలని కొరారు. వినతిపత్రం సమర్పించిన వారిలొ డొంబ్ సమాజం జిల్లా అధ్యక్షుడు ధనీరాం నాయక్, సాధారణ కార్యదర్శి జనార్దన్ గొరడ, త్రినాథ బీభర్, చిత్రసేన్ సునా, బృందావన్ నాయక్, రామ గొరడియా, బిసు ఖొసల పాల్గొన్నారు. -
తుబాటి రాము చారిటబుల్ ట్రస్టు ప్రారంభం
రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని జెమ్స్ మిలీనియం పబ్లిక్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ తుబాటి రాము పేరిట అతని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ‘తుబాటి రాము చారిటబుల్ ట్రస్టు’ను ప్రారంభించారు. సమాజసేవతో పాటు అంకితభావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడమే ట్రస్టు ముఖ్య ఉద్దేశమని అధ్యక్షులు రాము తెలిపారు. అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా వారిలో మంచి మార్పును తీసకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ పతివాడ వనిత, ప్రముఖ సమాజ సేవకురాలు సుజాత, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. -
కాలుష్య నియంత్రణ, బాల్యవివాహాలపై చైతన్యం
పర్లాకిమిడి: స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో గజపతి జిల్లా న్యాయసేవా ప్రాధికరణ అధ్యక్షులు, జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహాంతి ఆదేశాల మేరకు కోర్టు రిజిస్ట్రార్ ప్రసన్న కుమార్ బెహారా ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ, బాల్యవివాహాలపై చైతన్య కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటుచేశారు. హాజరైన జిల్లా న్యాయాలయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా, డీపీసీవో అరుణ్ కుమార్ త్రిపాఠి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధాకర్ పట్నాయక్ మాట్లాడారు. వేసవిలో కాలుష్యం నివారణకు చెట్లను నాటాలని రాజేష్ కుమార్ మిశ్రా అన్నారు. అలాగే బాల్యవివాహాలు వల్ల అనేక మంది ఆడపిల్లలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని జిల్లాశిశుసంరక్షణ అధికారి అరుణ్కుమార్ త్రిపాఠి అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంటు పీపీ యడ్ల శివకుమార్, జిల్లా ఆదనపు శిక్షాధికారి ఎస్.గిరిధర్రావు, గుసాని బ్లాక్ శిక్షాధికారి సోమేశ్వరరావు, బాయ్స్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మోనాలిసా దాస్ పాల్గొన్నారు. -
వృద్ధురాలిపై దాడి
● చెవి దిద్దులు తెంపివేత రాయగడ: వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి బంగారు చెవి దిద్దులను తెంపుకుపోయారు. ఈ ఘటన జిల్లాలోని కళ్యాణసింగుపూర సమితి మజ్జిగుడ పంచాయతీలోని కొత్తగుడ గ్రామంలో మంగవారం చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితురాలు సతాయి హికక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం మజ్జిగుడ సంతకు వెళ్లిన సీతాయి కూరగాయలు కొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు బైకుపై వచ్చి ఆమెను అడ్డగించి చెవిదిద్దులు తెంపుకుని వెళ్లిపొయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మహత్య చేసుకుంటానని..
● యువకుడి హల్చల్ రాయగడ: ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు హల్చల్ చేశాడు. చెట్టు ఎక్కి తాడు సహాయంతో ఉరి వేసుకుని చనిపోవడానికి ప్రయత్నించిన యువకుడిని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని బుజ్జగించి చెట్టు పైనుంచి కిందకు దింపి పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లారు. అనంతరం ఎందుకు చనిపోవాలో గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని రామనగుడ పోలీస్ స్టేషన్కు సమీపంలోని తోటలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. చెట్టు ఎక్కిన యువకుడుని బిసంకటక్ పంచాయతీలోని దండాపాడ గ్రామానికి చెందిన రమేష్ కొలకగా గుర్తించారు. రమేష్ కొన్నాళ్లుగా అదే గ్రామానికి చెందిన ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. తననే పెళ్లి చేసుకుంటానని అందుకు తన ప్రేమను అంగీకరించమని యువతిని ప్రాధేయపడ్డాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై రామనగుడకు వెళ్లి అక్కడ ఓ తోటలో ఉన్న చెట్టును ఎక్కి చనిపోవడానికి ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కుదియారి డోలా మేళా ఒడియా వారసత్వానికి ప్రతీక
భువనేశ్వర్: ఖుర్దా జిల్లా జట్నీ మున్సిపాలిటి కుదియారి ప్రాంతంలో దశ డోలా మేళ అత్యంత ఆనందోత్సాహాలతో జరిగింది. స్థానిక ఝాడేశ్వరి పూజా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన 39వ కుదియారి దశ డోలా మేళాలో హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టరు తిరుపతి పాణిగ్రాహి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన వేదికపై ప్రముఖ గాయకుడు బాబుల్ సుప్రియ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు దశ డోలా మేళా చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత రంగరించుకుని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహితో సుదర్శన్ సుందర్ రాయ్, విశ్వరంజన్ బొడొజెనా, ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ రౌత్రాయ్ పాల్గొని కుదియారి దశ డోలా మేళా చరిత్రపై ప్రసంగించారు. ఈ మేళా యువతలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడానికి సహాయపడుతుందని వారు తెలిపారు. -
దోపిడీ దొంగల భయం.. గ్రామస్తుల పహారా
రాయగడ : జిల్లాలోని శేశిఖాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వివిధ గ్రామాల్లో దోపిడీలు, దొంగతనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. జంగిలి గ్రామంలో ఈ మేరకు పొలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా జంగిలి గ్రామం ఆ పరిసర గ్రామాల్లో చోరీలు, దొంగతనాలు పెరిగిపోతుండడంతో యువకులు ప్రతి రోజూ రాత్రిళ్లు కర్రలు, ఇతర మారణాయుధాలు పట్టుకుని పహారా కాస్తున్నారు. కొద్ది రొజుల క్రితం గ్రామానికి చెందిన రమేష్ మండంగి తల్లి అప్పాలి మండంగి గ్రామం నుంచి ఏదో పనిమీద కొద్ది దూరం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బైకుపై గుర్తు తెలియని దుండగులు ఆమైపె దాడి చేసి చెవిదుద్దులు దొంగిలించుకుపోయారు. ఇదే విషయమై శెశిఖాల్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. అదే తరహా తరచూ దొపిడీలు జరుగుతున్నా పోలీసుల పెట్రొలింగ్ ఏమాత్రం లేకపొవడంతో భయాందోళనలకు గురైన గ్రామస్తులు అంతా కలసి సమావేశమయ్యారు. ప్రతి రోజూ దొంగల బెడద నుంచి గ్రామాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో బృందాలుగా ఏర్పడి రాత్రుళ్లు గ్రామ పొలిమేరలో కాపలా కాసేందుకు నిర్ణయించారు. -
సభలో ఎస్సీబీ సెగ
భువనేశ్వర్ : రాష్ట్ర శాసన సభలో కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రిలో సోమ వారం సంభవించిన అగ్ని ప్రమాదం సెగతో సభ వేడెక్కింది. ఈ విచారకర సంఘటనపై విపక్ష బిజూ జనతా దళ్, కాంగ్రెస్ పార్టీలు సభలో మంగళవారం గందరగోళం సృష్టించాయి. ఈ విచారకర సంఘటనపై నైతిక విలువలు పాటిస్తూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టరు ముఖేష్ మహాలింగ్ పదవికి రాజీనామా చేయాలని ప్రధాన విపక్షం బీజేడీ డిమాండ్ చేసింది. ఎస్సీబీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 12 మంది ప్రాణాలు కోల్పోయిన విచారకర పరిస్థితుల్లో ఆరోగ్య శాఖ మంత్రి సభలో నవ్వుతూ వ్యంగ్య ప్రదర్శన చేస్తున్నారని విపక్షాలు వ్యాఖ్యానించాయి. ఎస్సీబీ వైద్య కళాశాలలో దారుణమైన ఆరోగ్య సేవల పరిస్థితి అడుగంటిపోయింది. ఐసీయూలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పని చేయడం లేదు. ఈ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ పట్ల రాష్ట్ర ప్రజల విశ్వాసం దెబ్బతింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి. రాష్ట్రంలో ఆరోగ్య సేవలు మెరుగుపడే వరకు నిరసన కొనసాగుతుందని బీజేడీ హెచ్చరించింది. ఈ అంశంతో సభలో నిరవధికంగా గందరగోళం నెలకొనడంతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభని సాయంత్రం 4 గంటల వరకు నిరవధికంగా వాయిదా వేసినట్లు స్పీకరు సురమా పాఢి ప్రకటించారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ భువనేశ్వర్: రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల తుది ఫలితాలతో రాజకీయ శిబిరాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా 4వ స్థానం ఫలితాల అంచనాలు బాహాటంగా చేయి దాటిపోవడంతో విపక్షాల శిబిరంలో వాతావరణం వేడెక్కింది. బిజూ జనతా దళ్, కాంగ్రెస్ ఓటర్లు క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఆయా పార్టీల నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసు సభ్యులు సోఫియా ఫిర్దౌస్, రమేష్ చంద్ర జెనా, దాశరథి గోమాంగో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. సోఫియా ఫిర్దౌస్ దాశరథి గోమాంగో రమేష్ చంద్ర జెనా -
కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
రాయగడ: స్థానిక కళింగ వైశ్యసంఘం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలను నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు కింతలి అమర్నాథ్ మంగళవారం తెలిపారు. సంఘం కార్యాలయం ప్రాంగణంలో ఈ నెల 19న ఉదయం పంచాంగ శ్రవణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ నటి, కళాకారిణి, ఒడియా సినీనేపథ్య గాయని డాక్టర్ అనురాధ పాణిగ్రహి పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నీటి పైపు పగిలినా పట్టించుకోరా? రాయగడ: స్థానిక ప్రధాన రహదారి (మెయిన్ రోడ్డు) వద్ద మంచినీటిని సరఫరా చేసే పైపు పగిలిపోయి గుంతగా మారింది. రెండు నెలలుగా పైపు పగిలిపోయినప్పటికీ పట్టించునే నాథుడే కరువయ్యాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై పైపులైన్ పగిలిపోయి నీరు లీకవుతుండడంతో రోడ్డంతా బురదమయంగా మారుతుంది. అలాగే గుంత కూడా రోజురోజుకూ పెద్దది అవుతుండడంతో వాహన చోదకులు ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పటికై నా ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఉపాధ్యాయుడు అనుమానాస్పద మృతి! రాయగడ: జిల్లాలోని పద్మపూర్ ప్రధాన బజారు వీధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్న ఉపాధ్యాయుడు రంజిత్ కుమార్ ప్రధాన్ (28) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈయన పద్మపూర్లోని బిజయానంద ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తుండేవారు. ఈ నెల 16వ తేదీన విధులకు హాజరు కాలేదు. దీంతో తోటి ఉపాధ్యాయులు అదే రోజు సాయంత్రం అతని ఇంటికి వెళ్లి తలుపుతట్టి చూశారు. దీంతో ఇరుగురు పొరుగువారిని పిలిచి తలుపులను కష్టంగా పగలగొట్టి చూడగా రంజిత్ కుమార్ ప్రధాన్ అచేతన స్థితిలో పడి ఉన్నారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించారు. ఇంటిపై ఏనుగు దాడి భువనేశ్వర్: పూరింటిపై ఏనుగు దాడి చేసింది. దీంతో గోడ కూలిపడడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన జలేశ్వర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కెందు ఖుంటా గ్రామంలో ఏనుగుల దాడితో ఇంటి గోడ కూలడంతో బాలుడు మృతి చెందాడు. రైబొణియా ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టికిరి అటవీ ప్రాంతంలో పులి సంచారం
రాయగడ: జిల్లాలోని టికిరి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుంది. అటవీ రేంజ్ పరిధిలోని శంకరడ, డులుకాబహాల్ తదితర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా మేకలు, కోళ్లను తినేస్తున్నట్లు ప్రజలు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అటవీ శాఖ సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లి పులి ఆచూకీని పరిశీలిస్తున్నారు. డులుకాబహాల్ అటవీ ప్రాంతంలో పులి అడుగు జాడలను గుర్తించిన సిబ్బంది ఈ మేరకు పులి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని రాత్రి సమయంలో బయటకు రాకూడదని హెచ్చరించారు. టికిరి అటవీ శాఖ రేంజర్ అనిల్ కుమార్ పాణిగ్రహి నేతృత్వంలో ఒక బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. 480 లీటర్ల నాటుసారా స్వాధీనం రాయగడ: అబ్కారీ శాఖ అధికారి సంతోష్ కుమార్ ధల్సామంత నేతృత్వంలో జిల్లాలోని గుడారిలో వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో 480 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోవడంతో పాటు సారా తయారీకి వినియోగించే 3,200 కిలోల విప్పపువ్వును స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడారి సమీపంలోని సునారపల్లి ప్రాంతంలో నాటుసారా తయారీ, రవాణా జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు అబ్కారీ సిబ్బంది ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా, విప్పపువ్వుతో పాటు 74 డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. అయితే అబ్కారీ శాఖ దాడులను నిర్వహిస్తున్నట్లు గుర్తించిన సారా తయారీ ముఠా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. 22 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 90 గ్రామం వద్ద ఆదివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో కలిమెల పోలీసులు ఓ బైక్ను ఆపి తనిఖీ చేశారు. అందులో 22 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసి ఐఐసి ప్రభుదత్త విశ్వాల్ సోమవారం విచారించారు. ఈ ఇద్దరు ఆంధ్రా అన్నమయ్య జిల్లాకు చెందిన కె.శివ ప్రసాద్, ఎ.లక్ష్మీపతి అని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి వారి బైక్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇసుకతో ట్రాలీఆటో బోల్తా పర్లాకిమిడి: స్థానిక పురపాలక సంఘం కార్యాలయానికి ఆనుకొని ఉన్న 13వ వార్డు భవానీ టాకీస్ వీధి ఎంట్రన్స్లో సోమవారం ఇసుకను తీసుకొని వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, హెల్పర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భవానీ టాకీస్ వీధి ప్రవేశంలో పురపాలక సంఘం వేసిన కాలవ మరీ ఎత్తు పెంచడంతో ఇక్కడ తరచూ వాహనాలు అదుపుతప్పి బోల్తాపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీన్ని సరిచేయించేలా చూడాలని 13వ వార్డు కౌన్సిలర్కు స్థానికులు అనేకమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై న పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి దృష్టిసారించి వీధి వద్ద పెంచిన ఎత్తును తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
సకాలంలో చేరిన ‘ఓటర్లు’
భువనేశ్వర్: సోమవారం రాజ్య సభ ఎన్నికల తంతు సకాలంలో కొనసాగింది. ప్రధానంగా ఈ ఎన్నికలో సిగపట్లు పడుతున్న అధికార భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసు పార్టీలు తమ ఎమ్మెల్యే ఓటర్లకు రాజధాని నగరం వెలుపల విడిది ఏర్పాటు చేసింది. పారాదీప్లో అధికార బీజేపీ ఓటర్లు, బెంగళూరులో కాంగ్రెసు ఓటర్లు గత 3 రోజులుగా తీరిగ్గా గడిపారు. ఆయా పార్టీల రాష్ట్ర ప్రముఖులు ఓటర్ల విడిది వ్యవహారం పర్యవేక్షించారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, కాంగ్రెసు ఎంపీ సప్తగిరి ఉల్క ఆధ్వర్యంలో వారికి చెందిన ఓటర్లని సకాలంలో రాజధాని నగరానికి తరలించారు. ఇదిలా ఉండగా గుండె సంబంధిత అనారోగ్యం చికిత్స కోసం న్యూ ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ రాజ్యసభ పోలింగ్కు ముందు రోజు రాత్రి నగరానికి చేరారు. ఆయన చేరడంతో ముఖ్యమంత్రి తన వంతు బాధ్యతగా పరామర్శ ముసుగులో రాజ్యసభ వ్యవహారాలపై అవగాహన కల్పించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర శాసన సభ సముదాయంలో 54వ నంబరు గదిలో సోమవారం ఉదయం 9 గంటలకు రాజ్య సభ ఎన్నిక పోలింగ్ ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ తెలిపారు. -
ఉపాసన ఓటు ఆమోదం అప్రజాస్వామికం: నవీన్ పట్నాయక్
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026 కటక్ ఎస్సీబీ ట్రామా కేర్ ఐసీయూ వార్డులో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆవరణలో బెంబేలెత్తిన జనం కటక్ ఎస్సీబీ ట్రామా కేర్ ఐసీయూ వార్డులో అగ్ని ప్రమాదంతో దగ్ధమైన సరంజామా భువనేశ్వర్: కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని ట్రామా కేర్ యూనిట్ మరుభూమిలా మారింది. ఇక్కడి ఐసీయూలో ఆదివారం అర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రామా కేర్ మొదటి అంతస్తు వార్డులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. మొత్తం 23 మంది రోగులు ఐసీయూ లోపల చిక్కుకున్నారు. అగ్ని ప్రమాదం తర్వాత ఐసీయూలో పరిస్థితి విషమంగా మారింది. ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు అటూఇటూ పరుగులు తీశారు. ఐసీయూ నుంచి రోగుల తరలింపు సమయంలో ఏడుగురు మరణించారు. తరలింపు తర్వాత మరో ముగ్గురు రోగులు మరణించారని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఒక రోగిని ఐసీయూ నుంచి ప్రాణాపాయ స్థితిలో రక్షించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అగ్ని మాపక దళం తక్షణమే రంగంలోకి దిగి మంటలను నివారించింది. ఈ ప్రమాదంలో 11 మంది ఆస్పత్రి సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షి కథనం కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీలో ఆదివారం అర్ధరాత్రి 2.40 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మొదట ఓల్టేజి హెచ్చుతగ్గులతో విద్యుద్దీపాలు, ఫ్యాన్లు ఆగిపోయాయి. కాసేపటి తర్వాత మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. 10 మంది మృతులు ఈ అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. వారిలో రమేష్ పరిడా, దశృ ముండా, మహ్మద్ నూమ్, గౌరంగ్ బారిక్, షేక్ అబ్దుల్ సత్తార్, మధుసూదన్ దొలై, కృష్ణచంద్ర బిస్వాల్, రవీంద్ర దాస్, చెరు పరిడా, మేనకా రౌత్ ఉన్నట్లుఽ ధ్రువీకరించారు. భారత రాష్ట్రపతి సానభూతి కటక్ ఎస్సీబీ ఆస్పత్రిలో జరిగిన విషాదకరమైన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె హృదయపూర్వక సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. గవర్నర్ దిగ్భ్రాంతి కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని ట్రామా కేర్ ఐసీయూలో జరిగిన విషాదకరమైన అగ్నిప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటి విచారం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి సంతాపం ఒడిశాలోని కటక్లోని ఒక ఆస్పత్రిలో జరిగిన ప్రమాదం తీవ్ర బాధాకరమని, తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని సంతాప సందేశం జారీ చేశారు. మరణించిన ప్రతి ఒక్కరి బంధువులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సాయం అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతిపక్ష నేత సంతాపం ఎస్సీబీ అగ్ని ప్రమాదంపై ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. సత్వర సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకోవాలని స్థానిక ఎమ్మెల్యే, కటక్ నగర మేయరుకు ఆయన సూచించారు. ఉగాది ఉత్సవాలకు రాయగడ ముస్తాబు ముఖ్యమంత్రి సమీక్ష ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సంఘటనా స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆయనతో పోలీసు కమిషనర్, ఆరోగ్య కార్యదర్శి ఉన్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించిన తర్వాత ముఖ్యమంత్రి స్పందిస్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో 23 మంది రోగులు ట్రామా కేర్ ఐసీయూలో ఉన్నారు. వారందరినీ తరలిస్తుండగా 10 మంది మరణించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల వంతున సానుభూతి సాయం ప్రకటించారు. ఈ విషాద సంఘటనపై ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. -
వయోజనులకు ఉల్లాస్ పరీక్ష
మల్కన్గిరి: ఉల్లాస్–నవ భారత్ అక్షరస్యత కార్యక్రమం ద్వారా ఆదివారం మల్కన్గిరి జిల్లా కేంద్రంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ను (ఉల్లాస్) నిర్వహించారు. జిల్లాలో సుమారు 865 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం ఉల్లాస్ ప్రధాన లక్ష్యం. జిల్లా విద్యా అధికారి చిత్తరంజన్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. మల్కన్గిరి జిల్లాలో అక్షరాస్యుల లక్ష్యం 35,000 మంది కాగా.. ఈ రోజు సమారు 9,603 మంది పరీక్ష రాశారన్నారు. అదనపు జిల్లా విద్యా అధికారి మంజులత భోయి పరీక్ష కేంద్రలను పర్యవేక్షించారు -
పోలేరు వంతెన నిర్మాణ పనుల పరిశీలన
● త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమేళా సమితిలో నిర్మాణంలో ఉన్న పోలేరు వంతెన పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ప్రధమేశ్అర్వింద్ రాజేశిర్కే ఆదివారం పరిశీలించారు. పనుల గురించి స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ వంతెన కేవలం రవాణా సౌకర్యానికి మాత్రమే కాకుండా ఈ ప్రాంత ప్రజల భావోద్వేగాలు, సంస్కృతితో అనుబంధమై ఉందన్నారు. ముఖ్యంగా ప్రసిద్ధ బడా యాత్ర సమయంలో ఈ మార్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండటాన్ని గుర్తించారు. ప్రజల సౌకర్యం, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. వంతెన నిర్మాణం పనులు రానున్న బడా యత్ర సమాయానికి పూర్తిచేయాలని అదేశించారు . పోలేరు వంతెన స్థానిక ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపే కీలక వంతెనగా ఉందన్నారు. ఇది పూర్తయితే వేలాది మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. రవాణా సౌకర్యాల్లో కూడా పెద్ద మార్పు వస్తుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం వివిధ ధార్మిక ప్రదేశాల మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా కలెక్టర్ దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా పోలేరు ప్రాంతంలోని ప్రసిద్ధ మౌలిమాత ఆలయం, మన్యంకొండ గ్రామంలోని ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ప్రాంతాభివృద్ధి కోసం అధికారులతో చర్చించారు. కలెక్టర్ వెంట కలిమెల సమితి జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, సమితి వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారు. -
నేడు రాజ్యసభ ఎన్నికల పోలింగ్
● ఒడిశాలో ఓటుకు నోటు ● పట్టుబడిన నిందితులు భువనేశ్వర్: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఓటుకు నోటు వ్యవహారం బట్టబయలైంది. ఈ ఎన్నికల ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో పెను మలుపులను సూచిస్తుంది. సోమ వారం రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. 4 స్థానాల కోసం ఐదుగురు పోటీదారులు బరిలో ఉన్నారు. ప్రధానంగా 4వ స్థానం కోసం స్వతంత్ర అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి మధ్య సిగపట్లు పోటీ నెలకొని ఉంది. వీరి గెలుపు అధికార భారతీయ జనతా పార్టీ, విపక్ష బిజూ జనతతా దళ్, కాంగ్రెసు తాత్కాలిక పొత్తుకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఓటుకు నోటు బట్టబయలు అన్ని పార్టీలు ఓటింగ్ కోసం తుది దశ సన్నాహాల్లో తలమునకలై ఉఒడగా కాంగ్రెసు ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు అధికార భారతీయ జనతా పార్టీ ఓటుకు నోటు అందజేసినట్లు పొక్కిన వార్తలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఒక్కో ఎమ్మెల్యేకి రూ. 5 కోట్లు కానుక ఎరగా పన్నిన వల చెదిరింది. 4వ స్థానం కోసం పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థిని గెలిపించేందుకు భారతీయ జనతా పార్టీ ఈ అప్రజాస్వామ్య చర్యకు పాల్పడిందని ఆరోపణలు బలపడ్డాయి. ఈ విపత్తు నుంచి దూరంగా ఉంచేందుకు కాంగ్రెసు ఎమ్మెల్యేలకు కర్ణాటకలో (బెంగుళూరు) విడిది ఏర్పాటు చేసి తరలించారు. కొనుగోలు కోసం బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రే వర్గాలు కాంగ్రెసు ఎమ్మెల్యేల విడిదికి గుట్టుగా చేరుకుంది. ఈ వ్యవహారం బెడిసి కొట్టింది. కాంగ్రెసు ఎమ్మెల్యేల్ని ప్రలోభపరిచేందుకు బ్లాంక్ చెక్ లు అందజేసిన బీజేపీ నాయకులు పట్టుబడ్డారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ బహిరంగపరిచారు. నీరుగారిన బెంగుళూరు లాబీ బెంగళూరులో ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నంలో ఒడిశా నుంచి తరలి వచ్చిన 4 మందిలో ఇద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారిలో 2 మంది తప్పించుకోగా, మిగిలిన 2 మంది పట్టుబడ్డారు. 2 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి శివకుమార్ తెలిపారు. రాజ్యసభ ఓట్ల కోసం 5 కోట్లు కానుకగా అందజేయడాన్ని వారు అంగీకరించారు. పోలీసులకు ఫిర్యాదు కాంగ్రెసు ఎమ్మెల్యేలను ప్రలోభాల ఉచ్చులో బిగించేందుకు విఫలయత్నం చేసిన అభ్యర్థుల వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉల్క తెలిపారు. ఒక్కో ఎమ్మెల్యే రూ. 5 కోట్ల నగదు కానుకతో ప్రలోభపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బెంగుళూరు విడిదిలో బస చేసిన ఎమ్మెల్యేల 8 ఓట్లు, భువనేశ్వర్లో మరో 6 ఓట్లు సురక్షితంగా ఉన్నాయని ఉలాకా గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. రాజ్య సభ ఎన్నికల్లో 4వ స్థానం చేజిక్కించుకునే సత్తా లేని భారతీయ జనతా పార్టీ అనైతికంగా ప్రలోభ రాజకీయాల్ని ప్రేరేపిస్తుంది. ఈ చర్య ప్రజాస్వామ్య ఖూనీగా విపక్ష నేత, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ముందస్తుగా బహిరంగపరిచిన విషయం విదితమే. పోలింగు ఏజెంట్లు వీరే రాజ్యసభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య ద్విముఖ పోటీ తీవ్రంగా కొనసాగుతుంది. పోలింగు పురస్కరించుకుని ఆయా పార్టీలు తమ ఏజెంట్ల పేర్లను ప్రకటించాయి. ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్, న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్అధికార భారతీయ జనతా పార్టీ పోలింగు ఏజెంట్లుగా నియమితులయ్యారు. సీనియర్ ఎమ్మెల్యే ప్రతాప్ కేశరి దేబ్ విపక్ష బిజూ జనతా దళ్ ఎన్నికల ఏజెంట్గా వ్యవహరిస్తారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెసు కమిటి అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ కాంగ్రెస్ పార్టీ తరపున పోలింగు ఏజెంట్గా ఉంటారు. క్రమశిక్షణ తాఖీదులు జారీ రాజ్య సభ 4వ స్థానం కోసం రాష్ట్రంలో ప్రలోభ రాజకీయాలు ఊపందుకోవడంతో విపక్ష బీజేడీ, కాంగ్రెసు వర్గాలు తమ సభ్యులపట్ల డేగ కన్ను నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎవరి తరహాలో వారు అనుక్షణం సంప్రదింపుల్లో తలమునకలయ్యాయి. ఈ క్రమంలో ఉభయ పార్టీల నుంచి కొంత మంది ఎమ్మెల్యేల జాడ కొరవడింది. వీరి దాగుడు మూతలు పార్టీ అధిష్టానానికి పెను సవాలుగా ఎదురు తిరగడంతో క్రమశిక్షణ చర్యల కింద జాడ కొరవడిన పరిస్థితులపై వివరణ కోరుతు ఉభయ బీజేడీ, కాంగ్రెసు వారి ఎమ్మెల్యేలకు తాఖీదులు జారీ చేశాయి. కాంగ్రెసు ఎమ్మెల్యే దాశరథి గొమాంగోకు పీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు పార్టీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. స్వయంగా హాజరై సమాధానం ఇవ్వాలని ఆదేశంలో కోరారు. సమయానికి రాకున్న, సంతృప్తికరమైన వివరణ దాఖలు చేయకున్న చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే బిజూ జనతా దళ్ బలిగుడ నియోజక వర్గం ఎమ్మెల్యే చక్రమణి కంవర్, జయదేవ్ నియోజక వర్గం ఎమ్మెల్యే నబ కిషోర్ మల్లిక్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ విప్ జారీ చేసినప్పటికీ గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ముఖ్యమైన సమావేశాలకు వారిద్దరూ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆది వారం రాత్రి 9 గంటలలోపు నవీన్ నివాసానికి చేరుకోవాలని నోటీసులో పేర్కొన్నట్లు బీజేడీ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ తెలిపారు. -
మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారు..
● కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క కొరాపుట్: తమ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని ఆ పార్టీకి చెందిన కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉల్క ఆరోపించారు. బెంగుళూరు నుంచి కొరాపుట్ పార్లమెంట్ పరిధిలోని మీడియా ప్రతినిధులకు తన సందేశం పంపించారు. 4వ రాజ్యసభ అభ్యర్థిని కాంగ్రెస్, బీజేడీ పార్టీలు సంయుక్తంగా గెలిపించుకుంటాయన్నారు. తమ ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి తాము బెంగుళూరులో క్యాంప్తో ఉన్నామన్నారు. కానీ బీజేపి మద్దతుతో ఉన్న 4వ అభ్యర్థి దిలీప్ రాయ్ అనుచరులు తమ ఎమ్మెల్యేలను రహస్యంగా సంప్రదించడానికి వచ్చి పట్టుబడ్డారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి రూ.5 కోట్లు ఇవ్వడానికి బ్లాంక్ చెక్లు తెచ్చారన్నారు. తమ ఎమ్మెల్యేలు వినకపోతే ఒడిశాలోనికి రానివ్వమని బెదిరించారన్నారు. వారి ఫోన్లలలో దిలిప్రాయ్ పేరు ఉందన్నారు. వారిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. నిందితులలో నలుగురిలో ఇద్దరు అరెస్టయ్యారన్నారు. ఒడిశాకి వచ్చిన తమ ఎమ్మెల్యేకి ఏమైనా జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్చరణ్ మజ్జిదే పూర్తి భాద్యత అని హెచ్చరించారు. రాజకీయాలలో ఇటువంటి పరిణామాలు విచారకరమని ఎంపీ సప్తగిరి ఉల్క ప్రకటించారు. ఎంపీ వెంట ఒడిశా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు జెట్టి కుసుం కుమార్ (హైదరాబాద్) ఉన్నారు. కొరాపుట్దే కీలకం.. రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలలో కొరాపుట్దే కీలకమైంది. మొదట ముగ్గురు అభ్యర్థులు బీజేపీ, బీజేడీ సునాయాసంగా గెలుచు కొనునన్నాయి. నాల్గో అభ్యర్థి విషయంలో బీజేపీ ఒకవైపు, బీజేడీ, కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయి. రాష్ట్రంలో కేవలం కొరాపుట్ పార్లమెంటరీ పరిధిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలో కాంగ్రెస్కి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండడంతో ఈ ప్రాంతంపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టిసారించాయి. కొరాపుట్ జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క బెంగుళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. -
సరస్వతీ శిశు విద్యామందిర్ ప్రాంతీయ ఆచార్యుల సదస్సు
పర్లాకిమిడి: స్థానిక సరస్వతీ శిశుమందిర్లో ఆదివారం ప్రధాన ఆచార్యుల రెండు రోజుల సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పుల్భానీ, గంజాం, గజపతి జిల్లాల నుంచి సరస్వతీ శిశు మందిర్ అంతర్భాగ ప్రధానాచార్యులు 72 మంది పాల్గొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆర్థిక పథకం, జాతీయ విద్యావిధానంపై పలువురు చర్చించారు. ముఖ్యఅతిథిగా సుభాష్ జమాదార్ హాజరవ్వగా.. దక్షిణమండలం నుంచి ప్రకాష్చంద్ర త్రిపాఠి, గౌరంగో పాణిగ్రాహి, దేవీ మఠం మహాంత రామానంద దాస్, శిక్షవికాస్ సమితి ప్రాంతీయ సంచాలకులు అశ్వినీ కుమార్ నాయక్, ఖగేశ్వర్ దాస్, పుల్భానీ, గంజాం కోఆర్డినేటర్లు పద్మనాభ సామల్, సరోజ్ పట్నాయక్లు ప్రసంగించారు. కార్యక్రమాన్ని సరస్వతీ శిశు మందిర్ ప్రధాన అచార్యులు సరోజ్పండా పర్యవేక్షించారు. విద్యార్థులకు బంపర్ ఆఫర్ కొత్తూరు: కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తర గతి విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం ఎ.గోవిందరావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పబ్లిక్ పరీక్షలో పదో తరగతి విద్యార్థులు 590 మార్క్లు సాధిస్తే.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను తన సొంత ఖర్చులతో విమానంపై హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడి ప్రసిద్ధ ప్రాంతాలను చూపిస్తామన్నారు. తిరుగు ప్రయాణం కూడా విమానంలోనే తీసుకు వస్తానని హెచ్ఎం ప్రకటించారు. తాను ఉద్యోగ విరమణ పొందినంత వరకు ఇలా చేస్తానని పేర్కొన్నారు. ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు అధ్వానం టెక్కలి: టెక్కలి మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికోన్నత పాఠశాల, ఆర్సీఎం, ఐజేహెచ్ఎస్, తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్ తదితర పాఠశాలల్లో పదోతరగతి పరీక్ష కేంద్రాలను కేటాయించారు. 5 పరీక్షా కేంద్రాల్లో రెగ్యులర్, ఓపెన్, ప్రైవేట్ విద్యార్థులు కలిపి సుమారు 993 మంది పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. టెక్కలి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూత్ర శాలలు మరమ్మతులకు గురి కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఎచ్చెర్లలో 15 సిలిండర్లు సీజ్ ఎచ్చెర్ల: మండల కేంద్రంలో ఉన్న హోటల్స్ను ఆదివారం విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. ఈ సోదాల్లో ఎల్పీజీ 15 డొమెస్టిక్ సిలిండర్లను గుర్తించి సీజ్చేశారు. వీరి నుంచి రూ.3,5018 ఆపరాధ రుసుం వసూలు చేశారు. ఇలాంటి సిలిండర్లు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణం, మండలంలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి 6 పరీక్ష కేంద్రాల్లో 1140 మంది పరీక్షలు రాయనున్నారు. తొగరాం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పట్టణంలోని సెయింట్అన్స్, ఎస్వీఎస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్తో పాటు లక్ష్మినగర్ మున్సిపల్ హైస్కూల్, గేటులోగల మున్సిపల్ హైస్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలు కేటాయించారు. అయితే గేటులోగల మున్సిపల్ హైస్కూల్ను ఇటీవల ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయడంతో ఆ పాఠశాల తరగతి గదులు ఇరుగ్గా ఉన్నాయి. గదులు ఇరుగ్గా ఉన్నా సరే ఆ పాఠశాలకు 120 మంది విద్యార్థులను కేటాయించారు. బడిలో ఐదు గదులను కేటాయించారు. ఇవి 120 మందికి వినియోగించాలని ఆదేశించారు. ఆ గదుల్లో బెంచీలు వేసేందుకు సరిపోయినన్ని లేకపోవడంతో చింతాడ గ్రామంలోగల మున్సిపల్ హైస్కూల్నుంచి బెంచీలు తీసుకువచ్చి సర్దారు. గదులు చిన్నవిగా ఉండడంతో నిర్వాహకులు తలలు పట్టుకున్నారు. ‘వంద శాతం అక్షరాస్యతే లక్ష్యం’ శ్రీకాకుళం: జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత దిశగా నడిపించడమే మన లక్ష్యం కావాలని, ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన ’అక్షర ఆంధ్ర – ఉల్లాస్’ కార్యక్రమం ఎంతో కీలకమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో ఏర్పాటు చేసిన ప్రాథమి క స్థాయి అక్షరాస్యత పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యాసకుల హాజరును, పరీక్ష జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,462 కేంద్రాల్లో 1,13,102 మంది అభ్యాసకులు ఈ పరీక్షకు హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అభ్యాసకులు సాధించిన మార్కులను గ్రామ, వార్డు సంక్షేమ సహాయకులు తక్షణమే ‘అక్షర ఆంధ్ర’ యాప్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
22న ఉగాది వేడుకలు
పర్లాకిమిడి: చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఉగాది వేడుకలు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు జంగంవీధి జంక్షన్ సింహాద్రి ఫంక్షన్ హాల్లో నిర్వహించేందుకు చైతన్య కార్యవర్గం ఆదివారం నిశ్చయించింది. శ్రీధర్నగర్లో చైతన్య కార్యదర్శి బి.జనార్దనరావు స్వగృహంలో చైతన్య కార్యవర్గ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. పరాభవ నామ సంవంత్సరం ఉగాది పంచాంగ శ్రవణం స్థానిక వేంకటేశ్వర దేవాలయంలో కళ్యాణ మండపంలో ఉదయం పంచాంగ శ్రవణం ఉంటుందన్నారు. 22న జరుగు ఉగాది వేడుకల్లో మహిళల ప్రత్యేక ఫ్యాషన్ షో, ఉగాది పాటల వల్లరి, కూచిపూడి, భరత నాట్యం, అనేక మంది ఔత్సాహిక గాయనీ గాయకులు పాల్గొంటారని కార్యదర్శి బర్నాల జనాఽర్దనరావు తెలిపారు. అదేరోజు చైతన్యసమితి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందని చైతన్య కన్వీనర్ డాక్టర్ రహమతుల్లా తెలియజేశారు. నూతన కార్యవర్గం.. చైతన్య సమితి నూతన అధ్యక్షుడిగా కోండా రామారావు, ఉపాధ్యక్షులుగా ఎం.శేఖర్రావు, జవ్వాది సూర్యారావు, కార్యదర్శిగా బి.జనార్దనరావు, సహాయ కార్యదర్శిగా జి.నానాజీ, కోశాధికారిగా బి.వాసుదేవరావు, కన్వీనర్గా డాక్టర్ సయ్యద్ రహమతుల్లా, కో కన్వీనర్గా ఇసై వెంకట్రావు, గౌరవ అధ్యక్షుడిగా ఆనందరావును ఎన్నుకున్నట్టు తెలియజేశారు. -
గ్యాస్ కృత్రిమ కొరత..!
పర్లాకిమిడి: పలు దేశాల్లో యుద్ధాలు జరుగుతుండడంతో గజపతి జిల్లా పర్లాకిమిడిలో వ్యాపారులు, డీలర్లు కృత్రిమ గ్యాస్ కొరత సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పర్లాకిమిడి శివార్లలో ఉన్న మహేంద్రతనయ నది వద్ద ఎల్.పి.జీ. గ్యాస్ వినియోగదారులు సిలిండర్లు పట్టుకుని క్యూ కడుతున్నారు. గృహా వినియోగదారుల గ్యాస్ 15 కిలోల ధర రూ.60 పెరిగి వెయ్యి రూపాయలు చేరడంతో వినియోగదారులు గ్యాస్ను బుక్ చేసుకుని భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ కంపెనీల గోడౌన్లకు పరిగెడుతున్నారు. గతంలో గ్యాస్ బుక్చేసిన ఇరవై నాలుగు గంటల్లో వినియోగదారుడు ఇంటికి చేర్చేవారు. కొందరు వంటగ్యాస్ను బ్లాక్లో రూ.2,000లకు అమ్మి సోమ్ము చేసుకుంటున్నారు. కమర్షియల్ గ్యాస్ 19 కిలోలు విడుదల ఆపివేయడంతో హోటళ్లు, రోడ్డు పక్కల బజ్జీ వ్యాపారులు బ్లాక్లో వంట గ్యాస్ను కొనుగోలు చేస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు చూసి చూడనట్టుగా ఉండండంతో ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. వినియోగాదారులు ఇళ్ల వద్ద అందుబాటులో లేకపోతే గ్యాస్ డెలివరీ బాయ్స్ నల్లబజారులో అమ్ముకుని డబ్బులు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పర్లాకిమిడి భారత్ గ్యాస్ కంపెనీ డీలర్కి మొత్తం 30,432 వినియోగదారులు ఉండగా, 180 కమర్షియల్ గ్యాస్ సిలెండర్లు విడుదల చేస్తున్నారు. హెచ్పీ గ్యాస్ కంపెనీ డీలరుకు 39,075 వినియోగదారులు ఉండగా.. 453 కమర్షియల్ వినియోగదారులు ఉన్నారు. గజపతి జిల్లాలో గ్యాస్ నిల్వలు స్థిరంగా ఉన్నాయని వివిధ కంపెనీల గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. వినియోగదారులకు గ్యాస్ అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పలువురు దుకాణదారులు గృహ వినియోగదారుల గ్యాస్ సిలెండర్లనే వినియోగించడంతో ప్రజలకు గ్యాస్ లభించక, కృత్రిమ గ్యాస్ కొరత సృష్టిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ హోటళ్లు, వివిధ రెస్టారెంట్లు, వివిధ గోడౌన్లను చెక్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
తాండవం
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026కాలవైశాఖి..కంధమల్, మయూర్భంజ్ జిల్లాల్లో దుమ్ము రేపిన కాల వైశాఖి భువనేశ్వర్: రాష్ట్రంలో కంధమల్, మయూర్భంజ్ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కాలవైశాఖి దుమ్మురేపింది. దీని ప్రభావంతో కంధమల్ ప్రాంతంలో వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వాన చూసి చిన్నపిల్లలు, యువత ఉత్సాహంగా ఉన్నారు. ఘుముసర్ ఉదయగిరి ప్రాంతంలో వడగళ్ల వాన తీవ్ర ప్రభావం చూపింది. పెను గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాల వైశాఖితో నేల రాలిన వడగళ్లు కాశ్మీర్ హిమపాతం తలపింపజేసిందని స్థానికులు తెలిపారు. మయూర్భంజ్లో కాలవైశాఖి విధ్వంసం మయూర్భంజ్ జిల్లా కరంజియా ప్రాంతంలో కాలవైశాఖి ప్రభావంతో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షం కురిసింది. బామన్ఘాటి ఉప జిల్లాలో పూరిళ్లు కుప్పకూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 10 మందికి పైగా గాయపడ్డారు. 70 కి పైబడి ఇళ్లు కుప్పకూలాయి, 10 కి పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. గాలికి ఒక ఆటో 50 అడుగుల దూరం ఎగిరిపోయింది. -
పికప్ వ్యాన్ బోల్తా
రాయగడ: బియ్యం లోడుతో వస్తున్న ఓ పికప్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. జిల్లాలోని బిసంకటక్ సమితి డుకుం పంచాయతీలోని కచపాకు గ్రామసమీపంలో శనివారం రాత్రి ఘటన జరిగింది. ఘటనలో మృతి చెందిన వారిలో డ్రింజు సరక (32), మదన్ సరక (43) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బిసంకటక్ క్రిస్టియన్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పీహెచ్సీకి పంపించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కచుపాకు గ్రామానికి చెందిన కొందరు పికప్ వ్యాన్లో సమీపంలో గల ధాన్యం మిల్లులో ధాన్యం ఆడించిన అనంతరం వాటిని బస్తాల్లోకి ఎక్కించి వ్యాన్లో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కచపాక గ్రామానికి సమీపంలో వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వ్యాన్ లోపల, వ్యాన్ మీద కూర్చున్న వారు కిందపడిపోయారు. వీరిలో డ్రింజు, మదన్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. -
‘అగ్నివీర్’పై అవగాహన
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయలో 15వ ఒడిశా బెటాలియన్ ఎన్సీసీ జయపురం తరఫున అగ్నివీర్ పథకంపై ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్సీసీ క్యాడెట్లు, యువత భారత సైన్యంలో చేరేందుకు కావాల్సిన అర్హతలు ఇతర అంశాలను అధికారులు వివరించారు. ఎన్సీసీ, సైన్యాధికారులు హాజరై క్యాడెట్లకు అగ్నివీర్ పథకంలో అర్హతలు, ఎంపిక ప్రక్రియ, శిక్షణ, భవిష్యత్ అవకాశాలను తెలియజేశారు. ఏఆర్వో గోపాలపూర్ నుంచి సుబేదార్ మేజర్ సంతోష్కుమార్, హవల్దార్ సుభాష్ ఘోష్, ఎంటీఎస్ సుధీర్కుమార్ రాణా, కొరాపుట్ జిల్లా నియామక కార్యాలయ అధికారి యుగల్ కిశోర్ కుశ్రాహే, సీవో లెఫ్ట్నెంట్ కర్నల్ ప్రీతి రంజన్ దాస్, సుబేదార్ జగదీష్ ప్రసాద్ యాదవ్, అమన్దీప్ సింగ్, 15వ ఒడిశా బెటాలియన్ ఎన్సీసీ జయపురం హవల్దార్ విక్రమ సింగ్ అగ్నివీర్ పథకంపై క్షుణ్ణంగా వివరించారు. యువత దేశసేవ అవసరాన్ని వివరిస్తూ అ గ్నివీర్పథకం ద్వారా భారతీ సైన్యంలో చేరి దేశ భద్రతకు తమవంతు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొని అగ్నివీర్ పథకంలో చేరేందుకు ఆసక్తి కనబర్చారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు అలుమ్ని శ్రీనివాస పట్నాయక్, విక్రమదేవ్ విశ్వవిద్యాలయం కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో, లెప్టెనెంట్ సంతోషి ముండ పాల్గొన్నారు. -
రాష్ట్ర గవర్నర్ ఢిల్లీ పర్యటన
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి న్యూ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర సమాచార–ప్రసార మరియు ఎలక్ట్రానిక్స్–సమాచార సాంకేతిక, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. ఈ సందర్భంగా ఒడిశాకు సంబంధించిన కీలక అభివృద్ధి అంశాలపై వీరివురు సంభాషించారు. రాష్ట్ర వృద్ధి, కనెక్టివిటీకి దోహదపడే మౌలిక సదుపాయాల బలోపేతం కార్యకలాపాలను వేగవంతం చేయడంపై ఈ సంభాషణ దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రికి పరామర్శ రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసి న్యూఢిల్లీ అఖల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సందర్శించి పరామర్శించారు. ఆరోగ్యం త్వరగా కోలుకుని రాష్ట్రానికి తిరిగి రావాలని శుభాకాంక్షలు తెలిపారు. -
జయపురంలో ఉగాది వేడుకలు
జయపురం: జయపురం తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఆదివారం జయపురం సిటీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొదలైన పోటీలతో ఉగాది సందడి ప్రారంభమైంది. నేడు మహిళలకు ముగ్గుల పోటీలు, నృత్య పోటీల్లో మహిళలు, కళాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీలను తిలకించేందుకు వచ్చిన ప్రజలతో పాఠశాల ఆవరణం కళకళలాడడంతో నాలుగు దినాల ముందుగానే ఉగాది పండగ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు బిరేష్ పట్నాయిక్ మాట్లాడుతూ నేడు జరిగిన నృత్య పోటీల్లో పట్టణంలోగల వివిధ డ్యాన్స్ అకాడమీలకు చెందిన కళాకారులు తెలుగు పాటల ఆధారంగా సోలో, డ్యూయెట్, గ్రూపు డ్యాన్స్ విభాగాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఇక్కడ ఎంపికై న టీమ్లు ఈ నెల 19 వ తేదీ ఉగాది పండగ దినాన జరిగే కార్యక్రమంలో పాల్గొంటాయని వెల్లడించారు. మహిళల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో 15 మంది పాల్గొన్నారని విజేతలుగా నిలిచన కె.వసుంధర, తులసి నాయిక్, పి.ఉమలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వంటల పోటీలు కూడా నిర్వహించామన్నారు. -
వాటర్షెడ్ ప్రాజెక్టు సందర్శన
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి పలిగుడ వాటర్షెడ్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు పొందుతూ పంటలు పండిస్తున్న అటలగుడ గ్రామాన్ని కొరాపుట్ వాటర్ ప్రాజెక్టు డైరెక్టర్ శివ చరణ జెట్టి ఆదివారం సందర్శించారు. అటలగుడ గ్రామంలో రివార్డ్ కార్యక్రమంలో ఎల్ఆర్ఐ మట్టి పరీక్షలు జరిపి వైజ్ఞానిక పద్ధతిలో 20 ఎకరాల్లో సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించిన డైరెక్టర్ పంట అధికోత్పత్తి ఇచ్చేందుకు తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన అటలగుడ గ్రామంలో ఆ గ్రామ రైతులతో సమావేశమై ప్రాజెక్టు ద్వారా రైతులకు కలిగే సౌకర్యాలను వివరించారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఐ అండ్సీబీ అనంత కిశోర్ సాహు, బొయిపరిగుడ సెక్టర్–1 పిఐఎ నరశింగ నాయిక్, అనిరుద్ద దలసామంత, సమర మహంకుడ, అజిత్ స్వైయ్, తుషార కాంత నాయిక్, అనిరుద్ధ దలసామంత, ఎస్జీ ఫౌండేషన్ కార్యకర్త జగత్ దొర, నజియ సుల్తాన, బసంత లెంక, బిశ్వజిత్ మిశ్ర, అనిత పాత్రో, లావస్ ఎన్జిఓ టీమ్ లీడర్ లోకనాధ్ మహంతి తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. దుకాణం లోపల తండ్రీకొడుకులు సజీవ దహనం భువనేశ్వర్: ఖుర్దా జిల్లా బెగుణియా సన్నొపొదొరొ ప్రాంతంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని ఒక దుకాణం లోపల తండ్రీకొడుకులు సజీవంగా దహనమయ్యారు. తండ్రి రాజేష్ కుమార్ సాహు, కుమారుడు లక్ష్మీధర్ సాహు మృతి చెందినట్లు గుర్తించారు. రాత్రి పూట దుకాణంలో నిద్రిస్తున్నప్పుడు వారు సజీవ దహనమయ్యారు. మంటలు చెలరేగిన తర్వాత వారు దుకాణం నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఈ విషాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలం సందర్శించి దుకాణం దగ్ధం అయ్యేందుకు ప్రేరేపించిన కోణంలో దర్యాప్తు చేపట్టారు. తండ్రీ కొడుకుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలో అకాల వర్ష సూచన భువనేశ్వర్: రాష్ట్రంలో ఈ నెల 22 వరకు వివిధ ప్రాంతాల్లో కాల వైశాఖి వాతావరణం (గాలివాన) ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం పూట కాల వైశాఖి వర్షం పడే అవకాశం ఉందని ఈ కేంద్రం సమాచారం. 9 జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల వడగండ్ల వాన పడే అవకాశం ఉంది. ఈ 9 జిల్లాల్లో బాలాసోర్, భద్రక్, మయూర్భంజ్, కెంజొహర్, గంజాం, గజపతి, రాయగడ, కంధమల్ మరియు కలహండి జిల్లాలు ఉన్నాయి. కంటైనర్లో 81 పశువుల పట్టివేత మల్కన్గిరి : మల్కన్గిరి సమితి చాంపఖారి కూడలి వద్ద ఆదివారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మల్కన్గిరి పోలీసులు ఓ కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న 81 ఆవులను రక్షించారు. అక్రమ పశువుల రవాణా ఆరోపణలపై వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో ఐఐసీ రీగడ్ కీండో ఆదేశాలతో ఓ బృందం చాంపాఖారి వద్ద ఆదివారం తెల్లవారుజాము నుండే మాటు వేసి కంటైనర్ను నిలిపివేశారు. అందులో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. -
● కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు కింతలి అమర్నాథ్
రాయగడ: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు భావితరాలకు వాటిని అందించే విధంగా అందరూ కృషి చేయాలని కళింగ వైశ్య సంఘం, జిల్లా జ్యూయలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కింతలి అమర్నాథ్ అన్నారు. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక బురదల పోలమ్మ మందిరం ప్రాంగణంలో ఆదివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీలను ముఖ్యఅతిథిగా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. ఉగాది ఉత్సవాలను కళింగవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య సంఘం కార్యాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని అన్నారు. అందరూ ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘం తరఫున ఇటువంటి తరహా పోటీలను నిర్వహించి మహిళలను ప్రోత్సహిస్తుండడం అభినందనీయమని అన్నారు. విజేతల వివరాలు ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతిని ఎన్.సొనాలి, ద్వితీయ బహుమతిని ప్రీతి, తృతీయ బహుమతిని ఆర్.కీర్తనలు దక్కించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా సీహెచ్ కళ్యాణి, కె.పద్మావతి పట్నాయక్ వ్యవహరించగా పోటీలను చిన్నారి చక్రధర్ పర్యవేక్షించారు. పాత్రికేయుడు, స్పందన సాహితీ సంస్థ సాంస్కృతిక విభాగం కార్యదర్శి కె.కె.ఎం.పట్నాయక్ అధ్యక్షత వహించారు. విజేతలతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ ప్రొత్సాహక బహుమతులను నిర్వాహకులు అందించారు. ముగ్గులు వేస్తున్న మహిళలు -
రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి రెవెన్యూ మంత్రి సిద్ధం
భువనేశ్వర్: రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి ఆరోగ్యం కోలుకుంది. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఆదివారం రాత్రి 8.30 గంటలకు భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇటీవల ఛాతీ నొప్పితో చికిత్స కోసం స్థానిక ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచి ఉన్నత చికిత్స కోసం న్యూ ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు. అక్కడి వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో మంత్రి సురేష్ కుమార్ పూజారికి బైపాస్ శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకోవడంతో న్యూఢిల్లీ నుండి భువనేశ్వర్కు తిరిగి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన హాజరు అత్యంత కీలకం. రాజ్యసభ ఎన్నికలకు ఒక రోజు ముందుగానే మంత్రి విచ్చేయడంతో పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నెల 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆయన ఓటు కీలకం. ఈ పరిస్థితుల్లో ఆయన ఒక రోజు ముందుగా చేరడం విశేషం.చెరువులో మునిగి 2వ తరగతి విద్యార్థిని మృతి మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మన్యంకొండ పంచాయతీ బాంజిగూడ గ్రామానికి చెందిన ముతా జాలి కుమార్తె శివాని (8) కొండమల్లి ప్రాథమిక పాఠశాలలో 2 వ తరగతి చదువుతోంది. ఇంటి నుంచి పాఠశాల దూరం సుమారు 3 కిలోమీటర్లు ఉండటంతో పాటు అడవి, కొండల మార్గం ఉండటంతో పాఠశాల ఉపాధ్యాయుడు ప్రతిరోజు ఈ గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులను తన మోటార్ సైకిల్ పై పాఠశాలకు తీసుకెళ్లి తిరిగి గ్రామానికి చేర్చేవాడు. అలాగే శనివారం ఉదయం 6 గంటలకు ఉపాధ్యాయుడు విద్యార్థులను తీసుకెళ్లి, పాఠశాల అనంతరం 11గంటల సమయంలో తిరిగి గ్రామంలో దింపి తన ఇంటికి వెళ్లిపోయారు. గ్రామానికి వచ్చిన శివానీ తోటి పిల్లలతో కలిసి చెరువుకు వెళ్లింది. అక్కడ స్నానం చేస్తూ మునిగిపోయింది. తోటి బాలికలు అరుస్తుండగా కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకొన్ని బయటకు తీసి రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలిసింది. మోటు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. -
లోక్ అదాలత్లో 2,498 కేసులు పరిష్కారం
పర్లాకిమిడి: స్థానిక జిల్లా కోర్టులో జాతీయ న్యాయసేవా ప్రాధికరణ, ఒడిశా రాష్ట్ర న్యాయసేవా ప్రాధికరణ (కటక్) ఆదేశాల మేరకు పర్లాకిమిడిలో రాష్ట్రీయ లోక్ అదాలత్ను జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రాధికరణ అధ్యక్షులు జగదీష్ ప్రసాద్ మహాంతి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. పర్లాకిమిడి, ఆర్.ఉదయగిరి, మోహానా, ఆర్.ఉదయగిరిలలో మొత్తంగా రాష్ట్రీయ లోక్ అదాలత్లో 3,835 కేసులకు 2,498 కేసులు విచారించి పరిష్కరించారు. వివిధ జరిమానాలు, నష్టపరిహారాలు ద్వారా రూ. 8,42,425 రూపాయల ఆదాయం సమకూరింది. లోక్ అదాలత్లో ఫ్యామిలీ కోర్టు జడ్జి డాక్టర్ జీవనజ్యోతి రథో, ఆదనపు జిల్లా సెషన్సు జడ్జి బిభూప్రసాద్ పండా, సత్యన్నారాయణ పాత్రో, ఆదనపు జిల్లా జడ్జి, మహిళా అదాలత్లో విష్ణుప్రియా సామంతరాయ్, సత్యసిత్ పాణి (జేఎంఎఫ్సీ), సౌదామినీ శెఠి (జేఎంఎఫ్సీ ఆర్.ఉదయగిరి) శుభజిత్ బెహారాలు పాల్గొన్నారు. రాయగడలో 178 కేసులు.. రాయగడ: జిల్లా కోర్టు ప్రాంగణంలోని సివిల్ కోర్టులొ శనివారం లోక్అదాలత్ నిర్వహించారు. బిసంకటక్, కాసీపూర్, మునిగుడ, గుణుపూర్, పద్మపర్ కోర్టుల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 178 కేసులను పరిష్కరించి జరిమానా కింద 45,42,681 రూపాయలను వసూలు చేశారు. రెవెన్యూ సంబంధిత 39,916 కేసులతోపాటు మరో 18 ప్రీలిటిగేషన్ కేసులను పరిష్కరించిన కోర్టు జరీమనా కింద 2,46,016 రూపాయలను వసూళ్లు చేశారు. జిల్లా జడ్డి సత్యనారాయణ షడంగి నేతృత్వంలో జరిగిన లోక్ అదాలత్లో ఫ్యామిలీకోర్టు జడ్డి సస్మిత మిశ్రా, ఏడీజే అల్పనా మహాపాత్రో, రాయగడ బార్ అసొసియేషన్ అధ్యక్షులు దేవి ప్రసాద్ పట్నాయక్ పాల్గొన్నారు. -
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఉగాది
రాయగడ: జిల్లా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు ఆధ్వర్యంలో స్థానిక కొల్లిగుడ సమీపంలో గల మైదానంలో ఈ నెల 19, 20 వ తేదీల్లో జరగనున్న ఉగాది ఉత్సవాలను పురష్కరించుకుని శనివారం లయన్స్ క్లబ్ ప్రాంగణంలో మిస్ ఉగాది పోటీలను నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడేళ్లుగా జిల్లా తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అందుకు అందరి సహకారంతో కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగాయని ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా అదే తరహా అందరి ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా ఉగాది వేడుకల్లో మహిళలు ఎంతో ఆసక్తిగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఇటు మహిళలకు ఆసక్తికరమైన పోటీలను నిర్వహించడంతో పాటు ఉగాది ఆహ్వాన పత్రికలను పంపిణీ చేయడంలో వారు అందిస్తున్న అంకితభావం హర్షణీయమన్నారు. మన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఉగాది వేడుకలు అందరూ ఊహించని విధంగా నిర్వహిద్దామని అన్నారు. భారీ ఎత్తున ర్యాలీ గత ఏడాదిలా ఈ సారి కూడా ఉగాది వేడుకల్లో భాగంగా ఉగాది రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్థానిక మజ్జిగౌరి మందిరం నుంచి నిర్వహించే భారీ ర్యాలీలో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలొ యువతీ, యువకులతొ పాటు మహిళలు కూడా పాల్గొనాలన్నారు. మిస్ ఉగాది పోటీల్లో మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా రుబి కుండు, ఎన్.లక్ష్మీ, ఎన్.శారద వ్యవహరించారు. ఆధునిక దుస్తులతో కొందరు, సంప్రదాయ దుస్తులతో మరికొందరు పాల్గొన్నారు. సంబల్పూరి నృత్యాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. -
బంగారు నగల దొంగతనం కేసులో ముగ్గురు అరెస్టు
జయపురం: మూడు నెలల కిందట జరిగిన దొంగతనం కేసులో జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.2.50 లక్షలు స్వాధీన పరచుకున్నారు. నగదుతో పాటు ఒక మోటారు బైక్, ఇనుప రాడ్డు స్వాధీన పరచుకున్నట్లు బొరిగుమ్మ పోలీసు ఎస్ఐ దోణాచార్య బాగ్ శనివారం పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితులు కొరాపుట్ పట్టణంలో స్టేడియం కాలనీ వాసి చందన బెహర (23), జయపురం పట్టణం ఒడియ మేదరి వీధికి చెందిన అజయ్ అలియాస్ రింకు నాయిక్(30), మూడో వ్యక్తి జయపురం చందనబెడ బంగారు వర్తకుడు ఎం.శిశ(45) అని వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం 2025 డిసెంబర్ 20 వ తేదీన బొరిగుమ్మ పట్టణం నవరంగపూర్ రోడ్డులో ఉంటున్న బినాయక పాడి కుటుంబం, తమ పర్సనల్ కారణాల వల్ల బయటకు వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేరని తెలుసుకున్న దుండగులు ఆ ఇంటిలోకి వెళ్లి ఒక బంగారు నెక్లెస్, బంగారు కాన్పూసలు మొదలగు 95 గ్రాముల బంగారు వస్తువులు, రెండు లక్షల నగదు దోచుకు పోయారు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయినా కేసు పరిష్కారం కాకపోవడంతో బినాయక పాడి కుమార్తె అంజలీ పాఢి, ఆమె కుటుంబీకులు బొరిగుమ్మలో కలెక్టర్ నిర్వహించిన అభియోగ సునానీలో ఈ విషయం పై ఫిర్యాదు చేశారు. తర్వాత కొరాపుట్ ఎస్.పి, జయపురం, బొరిగుమ్మ పోలీసులతో ఒక టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసు టీమ్ తమ దర్యాప్తులో నిందితులను గుర్తించారు. వారిని అదుపు లోనికి తీసుకొని విచారించగా వాస్తవాలు బయట పడ్డాయి. దొంగిలించిన సామగ్రిని జయపురంలో ఒక బంగారు వ్యాపారికి ఇచ్చారు. బంగారు వ్యాపారి వారికి రూ.50 వేలు ఇచ్చాడు. కేసు చిక్కుముడి విప్పిన పోలీసులు ఇద్దరు నిందితులతో పాటు బంగారం కొన్న బంగారు వ్యాపారిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. -
ఐఐటీ భువనేశ్వర్లో రక్తదాన శిబిరం
భువనేశ్వర్: స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ)కు చెందిన జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) బృందం శనివారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించింది. క్యాంపస్ కమ్యూనిటీ సెంటర్లో సంజీవన్ ఆరోగ్య కేంద్రం సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 122 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమానికి డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీపాద్ కర్మల్కర్ విచ్చేసి రక్తదాతలు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లను ప్రోత్సహించారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ శివయ్య బత్తుల సారథ్యంలో ఈ శిబిరం నిర్వహించారు. సంస్థకు చెందిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, నివాసితులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. -
బాగ్రాగుడలో గాయత్రీ దీప మహాయజ్ఞం
జయపురం: జయపురం సమితి బాగ్రాగుడ గ్రామ దేవత మందిరంలో 251 కుండీయ గాయత్రీ దీప మహాయజ్ఞం శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ధనపూర్, తరగొయి, కలియగాం, సిరాగుడ, తటిబెడ, ఝిలిమిలి, గాడుగుడ గ్రామా ల ప్రజలు అత్యంత భక్తితో ఆరాదించే గ్రామ దేవత గాయత్రీ మహాయజ్ఞంలో వందలాది మంది మహి ళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామ ప్రముఖులచే భూమిపూజ జరిపించి దీప ప్రజ్వళన చేసి సత్సంగ్ శుభారంభం చేశారు. గా యత్రీ దీప మహాయజ్ఞం ప్రధానంగా జాతి, ధర్మం, వర్ణం, కులం, మత, ప్రాంతాల, భాషా భేదాలు లేకుండా 251 గ్రామాల నుంచి 1008 మంది దేవ దంపతులు, సజ్జనులు సంఘిటితమై 251 కుండీయ గాయిత్రీ మహాయజ్ఞం కొరకు శుభ మూహూర్తపు రాట ప్రతిష్టించారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా గాయత్రీ పరివార్ సమన్వయ కర్త రుతుద్వార పాత్రో, నిరంజన్ పాణిగ్రహి, సత్యనారాయణ పాత్రో, గంగాధర పాణిగ్రహి, బాజీ సెట్టి, రశ్మిత శివ, లుకుభొయిలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలు విజయవంతంగా జరిగేందుకు బాగ్రాగుడ గ్రామ ప్రజలు సహకరించారు. పూజలలో బాగ్రాగుడ వార్డు మెంబర్ పి.బొడొనాయిక్, నిశికాంత పాఢి, ఆయుస్మాన్ మహాపాత్రో పాల్గొన్నారు.మహాయజ్ఞంలో భక్తులు -
బిజూ స్వాభిమాన్ మంచ్ కీలకం
● రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావురాయగడ: రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీజూ స్వాభిమాన్ మంచ్ కీలకపాత్ర పోషిస్తోందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీజూ స్వాభిమాన్ మంచ్ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరరావు అన్నారు. స్థానిక తేజస్వీ మైదానంలోని పార్టీ కార్యాలయంలో ఈ మేరకు సదరు సమితీలోని 27 పంచాయతీలకు చెందిన సర్పంచులు, సమితి సభ్యులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో భవిష్యత్ ప్రణాళికపై కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కొద్ది నెలల క్రితం బీజేడీ పార్టీకి గుడ్బై చెప్పిన నెక్కంటి అనంతరం తన అనుచరులతో కలిసి బిజూ స్వాభిమాన్ మంచ్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన మద్దతుదారులు, అభిమానులతో మమేకమై బీజేడీకి రాజీనామా చేసి ఆయన వెంట నడిచారు. అయితే తనను నమ్ముకున్న వారి కోసం తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని అన్నారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని అన్నారు. తనను నమ్ముకుని ఉన్నవారికి సరైన మార్గాన్ని చూపించడం కోసమే బిజూ స్వాభిమాన్ మంచ్ పేరిట సంస్థను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. స్వాభిమాన్ మంచ్లో కార్యకర్తలుగా కొనసాగుతున్న వారిలో అందరి అనుమతితో అభ్యర్థులను ఎంపిక చేసి వారికి పంచాయతీ ఎన్నికల్లో మంచ్ తరఫున పోటీ చేసేందుకు తాను పూర్తి సహకారాన్ని అందిస్తానని అన్నారు. కేవలం రాయగడలో కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తమ మంచ్ ఉనికిని చాటుకునే విధంగా నిర్వీరామంగా కృషి చేస్తానన్నారు. భవిష్యత్లో జరిగే ఎన్నికల పోరులో మంచ్ కార్యకర్తలు దూసుకెళ్తారని.. అందులొ ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది వేరే పార్టీలో చేరారని అన్నారు. ఎవ్వరినీ తన వెంట ఉండాలని ఏనాడు కోరడం లేదని.. ఎవరు తనపై ఆదరాభిమానాలు చూపిస్తున్నారో అటువంటి వారితో తన భవిష్యత్ ప్రణాళికను రూపొందించి ముందుకు కొనసాగుతానని స్పష్టం చేశారు. సమావేశంలొ మాజీమంత్రి లాల్ బిహరి హిమిరిక, రాయగడ సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక, ఉపాధ్యక్షుడు హరప్రసాద్ హెప్రుక, తిరుపతి భనగాటి పాల్గొన్నారు. -
అంతర్జాతీయ వేదికపై ఒడిశా విద్యార్థుల ప్రతిభ
భువనేశ్వర్: టోక్యో గ్లోబల్ ఫైనాన్షియల్ ఫోరంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన ఒడిశా విద్యార్థులు అంతర్జాతీయ వేదికపై వారి అద్భుతమైన ప్రతిభని ప్రదర్శించారు. ఈ బృందం రాష్ట్ర ఉన్నత విద్యా విభాగం మంత్రి సూర్య బన్షి సూరజ్ను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఫోరంలో రాష్ట్ర విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ, వ్యవస్థాపక ప్రాజెక్టు ప్రదర్శనలు విశేష గుర్తింపు సాధించడం రాష్ట్రానికి గర్వకారణం. సాధారణ స్రవంతిలో చదువుతున్న విద్యార్థులు డిగ్రీల సాధనకు పరిమితం కాకుండా వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో తమ సృజనాత్మకతను సమయోచితంగా ప్రయోగించేందుకు ఈ విజయం అద్దం పడుతుందని మంత్రి ప్రసంశించారు. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ – ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ ఫైనాన్స్, గ్లోబల్ ఫైనాన్స్ – టెక్నాలజీ నెట్వర్క్ సహకారంతో రాష్ట్రంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థుల కోసం ఫిన్టెక్, ఇన్సర్టెక్లో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 195 మంది విద్యార్థులు వివిధ క్యాప్స్టోన్ ప్రాజెక్టులలో పాలుపంచుకున్నారు. వారిలో అగ్రస్థానంలో నిలిచిన 7 మంది సభ్యుల బృందం టోక్యో గ్లోబల్ ఫైనాన్షియల్ ఫోరంలో తమ ప్రాజెక్ట్ను ప్రదర్శించడానికి ఎంపికై ంది. ఈ బృందం సభ్యులలో రెవెన్షా విశ్వవిద్యాలయం నుంచి బి.సిమ్రాన్, రాజేశ్వరి బెహెరా, పుష్పాంజలి బెహెరా, మనీషా లెంకా మరియు సౌమ్య రంజన్ బైత, ఉత్కళ విశ్వవిద్యాలయం నుండి శివాన్షి నాయక్, సాలేపూర్ అటానమస్ కళాశాల నుండి అర్నిబన్ కొరొ ఉన్నారు. విద్యార్థులు ‘ట్రాంచిఫై – తదుపరి తరం ఎస్ఎంఈలకు ట్రస్ట్–బేస్డ్ వర్కింగ్ క్యాపిటల్ ప్లాట్ఫామ్‘ అనే ప్రాజెక్ట్ను ప్రదర్శించారు. చిన్న, మధ్య తరహా సంస్థలు ( ఎస్ఎంఈ) వర్కింగ్ క్యాపిటల్ను యాక్సెస్ చేయగల, బ్యాంకు రుణాలను మరింత సులభంగా పొందగల ప్రక్రియను సరళీకృతం చేయడం, డిజిటలైజ్ చేయడం ఈ ఫిన్టెక్ సొల్యూషన్ లక్ష్యంగా పేర్కొన్నారు. ఫిన్టెక్, ఇన్సర్టెక్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఆర్థిక మరియు సాంకేతిక రంగాలలో ఆవిష్కరణ, వ్యవస్థాపకత, నైపుణ్యాభివృద్ధికి సహాయపడిందని విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చే శారు. ఒడిశా ప్రభుత్వం యొక్క చొరవ అంతర్జాతీయ వేదికపై తమ ప్రాజెక్ట్ను ప్రదర్శించడానికి వీలు కల్పించిందన్నారు. రెండో దశ త్వరలో ప్రారంభం కానుంది. తదుపరి దశకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని ఉన్నత విద్యా విభాగం తెలిపింది. -
హైటెక్లో అత్యాధునిక సీబీసీటీ దంత చికిత్స సదుపాయం
భువనేశ్వర్: హైటెక్ డెంటల్ (దంత) కళాశాల మరియు ఆస్పత్రిలో అత్యాధునిక సీబీసీటీ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల దంత వైద్య నిపుణులు, అధ్యాపకులను సంస్థ అధ్యక్షుడు డాక్టరు తిరుపతి పాణిగ్రాహి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ యంత్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల సంక్లిష్ట దంత సంబంధిత రోగ నిర్ధారణ, కచ్చితమైన చికిత్స రంగంలో ఈ వ్యవస్థ విప్లవాత్మక మార్పు ఆవిష్కరిస్తుందని హై టెక్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. ఈ అత్యాధునిక యంత్రం అతి తక్కువ రేడియేషన్తో సంక్లిష్ట వ్యాధులను నిర్ధారించే సామర్థ్యం కలిగి ఉంది. పేద, మధ్య తరగతి రోగులు చాలా తక్కువ ఖర్చుతో ఈ సౌకర్యాన్ని పొందవచ్చని డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. డెంటల్ కాలేజీ, హాస్పిటల్ తాత్కాలిక చైర్మన్ మధుస్మిత త్రిపాఠి మాట్లాడుతూ రోగులు, విద్యార్థులు ఇలాంటి అధునాతన దంత నిర్ధారణ యంత్రాల నుంచి మరింత ప్రయోజనం పొందుతారన్నారు. ఓరల్ మెడిసిన్, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ దేబాజ్యోతి వర్ధన్ మాట్లాడుతూ, ఈ అత్యాధునిక సీబీసీటీ యంత్రం అతి తక్కువ సమయంలో వ్యాధులను కచ్చితంగా నిర్ధారిస్తుందన్నారు. చికిత్సా పద్ధతిని అంచనా వేయడం సులభతరం అవుతుంది. హైటెక్ డెంటల్ కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసాద్ పాత్రో కృషితో ఈ యంత్రం ఏర్పాటు జరిగింది. సంక్లిష్టమైన ఆర్థోడాంటిక్, ఎండోడాంటిక్ వ్యాధులను నిర్ధారించడంలో సీబీసీటీ యంత్రం చాలా సహాయకారిగా ఉంటుందని వైస్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ సుబాష్ చంద్ర నాయక్ అన్నారు. డెంటల్ ఇంప్లాంట్లు, మాక్సిల్లోఫేషియల్ ట్రామాను నిర్ధారించడంలో ఈ యంత్రం ఉపయోగకరంగా ఉంటుందని ప్రొఫెసర్ డాక్టర్ అభిలాష్ దేవి అన్నారు. -
ఆరని గ్యాస్ మంటలు
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో నిత్యం వేలాది ప్రజలు గ్యాస్ బుకింగ్ కౌంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. గ్యాస్ ఏజన్సీలు కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గ్యాస్ బుకింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ గ్యాస్ భయాందోళనలు కొనసాగుతున్నాయి. మూత పడ్డ చిన్న చిన్న హోటల్స్ ఇంత వరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమం గా వినియోగించుకున్న వారు నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తుండడంతో గ్యాస్ లేక హోటల్స్ మూత పడ్డాయి. ఇరు జిల్లాల్లో వందలాది చిన్న తరహా హోటల్స్ మూత పడ్డాయి. కొనడానికి కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడం, బ్లాక్ లో డొమెస్టిక్ గ్యాస్ లభించకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. దీంతో వేలాది హోటల్ కార్మికులు ఉపాధి కోల్పోయారు. శనివారం కొరాపుట్ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు పూర్తిస్థాయిలో పని చేసినప్పటికీ ఫలితం లేక పోయింది. కాంగ్రెస్ నిరసనలు కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సమస్య పై తన నిరసనలు కొనసాగిస్తోంది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద ఖాళీ సిలెండర్లతో కాంగ్రెస్ ఆందోళన చేసింది. ఈ ఆందోళనలో డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ లిఫీక మజ్జి, మున్నా త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ భారీ ఆందోళన చేసింది. రోడ్డు మీద కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసి ప్రజల దృష్టి ఆకర్షించింది. కఠిన చర్యలు తీసుకుంటాం: కొరాపుట్ కలెక్టర్ గ్యాస్ అక్రమం నిల్వలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొరాపుట్ కలెక్టర్ సత్యవాన్ మహాజన్ హెచ్చరించారు. శనివారం కలక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. గ్యాస్ అక్రమ నిల్వల పై ఉక్కు పాదం మెపుతామన్నారు. ఇప్పటికే ప్రత్యేక స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు. అక్రమంగా సిలిండర్లు నిల్వ చేస్తే తక్షణం సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అవసరమైన గ్యాస్,పెట్రోల్ నిల్వలు జిల్లాలో ఉన్నాయన్నారు. -
లోక్ అదాలత్లో 8,912 కేసులు పరిష్కారం
● కొరాపుట్ జిల్లాలో 8,912 కేసులు పరిష్కారంజయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు శనివారం కొరాపుట్ జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జాతీయ న్యాయ సేవా ప్రదీకరణ, రాష్ట్ర న్యాయ సేవా ప్రదీకరణల ఆదేశాల మేరకు నిర్వహించిన అదాలత్లో 8,912 కేసులు పరిష్కరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహంతి పర్యవేక్షణలో జయపురం, కొరాపుట్, కొట్పాడ్, బొరిగుమ్మ, సెమిలిగు, దసమంతపూర్ లమతాపుట్, లక్ష్మీపూర్లోని అన్ని న్యాయస్థానాల్లో, తహసీల్దార్ కార్యాలయాల్లో అదాలత్ జరిగింది. 8,912 కేసులు పరిష్కరించగా.. 3 కోట్ల 54 లక్షల 95 వేల 124 రూపాయలను జరిమానా రూపంలో వసూలు చేశారు. జిల్లా జడ్జితో పాటు ఫ్యామిలీ కోర్టు జడ్జి నిశిత్ మహంకుడో, ప్రధాన విచార విభాగ జడ్జి ఎస్.విజయలక్ష్మీ, సీనియర్ సివిల్ జడ్జి స్వయం ప్రకాశ దాస్, మహిళా కోర్టు జడ్జి అలకానందన్ మహంతి, సివిల్ కోర్టు రిజస్టార్ విష్ణుప్రసాద్ దేవత, సబ్డివిజన్ల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సంతోష్కుమార్ బారిక్, ప్రథమ శ్రేణి జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.


