breaking news
Odisha News
-
ఆనందం..‘ఆహ్లాద్’కరం
టెక్కలి : టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఆహ్లాద్–2కే26 కార్యక్రమాలను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, కార్యక్రమాల కో ఆర్డినేటర్ డి.యుగంధర్ నేతృత్వంలో జ్యోతి ప్రజ్వళనతో కార్యక్రమాలు ప్రారంభించారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు రెండు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. శనివారం ముగింపు సందర్భంగా భారత మాజీ క్రికెటర్ ఎం.ఎస్.కె.ప్రసాద్, వర్ధమాన సినీ నటి రాశీసింగ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలు, కళాత్మక అభిరుచులు, వివిధ క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు తమ కళాశాలలో కొత్తగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు డైరెక్టర్ వెల్లడించారు. కళాశాలలో నిర్వహించిన ఆహ్లాద్ కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణంలో సందడి వాతావరణం చోటుచేసుకుంది. -
విద్యార్థుల భవిష్యత్తో కేంద్రం చెలగాటం
రాయగడ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, విద్యార్థుల భవిష్యత్తో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జియా హుల్ హక్ అన్నారు. స్థానిక సర్క్యూట్ హౌస్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో లక్ష్యం ఉంటుందని, ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవ్వడమే కాకుండా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలనుకునే విద్యార్థులకు కూడా అన్యాయం చేస్తోందని విమర్శించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుతున్న ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారని, వారికి తగిన ఫలితం అందకపోతే వారి పరిస్థిఽతి ఏంటని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈనెల 24, 25, 26 తేదీల్లో నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై అన్నిచోట్ల విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు శంకర్షన్ మంగరాజ్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు నిఖిల్ పట్నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నంది గౌరి తదితరులు పాల్గొన్నారు. -
మృత్తిక సంరక్షణపై శిక్షణ
జయపురం: జయపురం సమితి ఫూల్బెడలో గల ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రంలో జలం, మృత్తిక సంరక్షణ, యాజమాన్యం పై నిర్వహించిన రెండు రోజుల శిక్షణ శిబిరం నేడు ముగిసింది. ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం, జయపురం వారు బిజూ పట్నాయిక్ మెడికల్ ప్లాంట్ గార్డెన్ రీసెర్చ్ కేంద్రంలో నిర్వహించిన ఈ శిబిరంలో కొరాపుట్ జిల్లాలో కొరాపుట్, సెమిలిగుడ, నందపూర్, పొట్టంగి సమితుల నుంచి 50 మందికి పైగా వ్యవసాయంలో మంచి అనుభవం ఉన్న రైతులు పాల్గొన్నారు. శిబిరంలో స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ జయపురం కేంద్ర డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడ ఈ కార్యక్రమం లక్ష్యాలను, ఉద్దేశాలను రైతుకు క్షుణ్ణంగా వివరించారు. పర్లాకిమిడి సెంచూరియన్ యూనివర్సిటీ యొక్క స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ ఫ్రఫుల్ల కుమార్ పండ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన పంటలకు ఆధారమైన భూమి స్వరూపం, రిమోట్ సెన్సింగ్లపై రైతులకు వివరించారు. స్వామినాథన్ సంస్థ కోఆర్డినేటర్ నిరంజన్ గౌడ మట్టి, నీరు సంరక్షణలో చెక్డ్యామ్, చెరువుల, బండరాళ్ల పాత్రపై శిబిరంలో పాల్గొన్న రైతులకు వివరించారు. అలాగే సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కార్తీక చరణ్ లెంక వర్షపు నీరు సంరక్షణ, భూగర్భ జళాల పరిరక్షణలపై రైతులతో చర్చించారు. అనంతరం వ్యవసాయానికి సారవంతమైన భూమి, సాగునీరు అత్యంత ఆధారమైనవని వాటిపై రైతులకు అవగాహణ కలిగించేందుకు కార్యక్రమం నిర్వహించామని వెల్లడిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణలో సంస్థ ఉద్యోగులు దిలీప్ కుమార్ సుబుద్ది, దీప్తి సాహు, సంతోష్ కుమార్ సాహు, గోపీ గొల్లారి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర శాసన సభా సంఘాలు ఏర్పాటు
భువనేశ్వర్: శాసన సభ స్పీకర్ ఆమోదం మేరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సభా సంఘాలు ఏర్పాటు చేసింది. 10 స్థాయీ కమిటీలతో సహా 35కు పైగా కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నాయకురాలు ప్రమీలా మల్లిక్కు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)కి అధ్యక్షత వహించే బాధ్యతను అప్పగించారు. ఇతర కమిటీలలో పలువురు ఎమ్మెల్యేలకు స్థానాలు కల్పించారు. ప్రమీలా మల్లిక్ అధ్యక్షతన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)లో రామచంద్ర కదమ్, అరుణ్ కుమార్ సాహు, గణేశ్వర్ బెహరా, సనాతన్ బిసి వంటి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జయ నారాయణ్ మిశ్రా అధ్యక్షతన ఏర్పా టైన ప్రివిలేజెస్ కమిటీలో శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, న్యాయ శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్, ప్రభుత్వ చీఫ్ విప్ సరోజ్ ప్రధాన్ సభ్యులుగా ఉన్నారు. స్పీకర్ 10 స్థాయీ కమిటీలను ప్రకటించారు. 2026–27 సంవత్సరానికి ఆయా స్థాయీ కమిటీలకు శివ్ మహా పాత్రో, సంతోష్ ఖటువా, బాబూ సింగ్, బిభూతి ప్రధాన్, రామచంద్ర కదమ్, సనాతన్ మోక్ష, ఎమ్మెల్యే రణేంద్ర ప్రతాప్ స్వంయి ఛైర్మన్గా నియమితులయ్యారు. ఆకాష్ దాస్ నాయక్ గ్రంథాలయ కమిటీ చైర్మన్గా నియమితులు అయ్యారు. ఈ కమిటీలో సస్పెండ్ అయిన 11 మంది ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమించారు. గుణుపూర్లో భారీ అగ్ని ప్రమాదంరాయగడ: జిల్లాలోని గుణుపూర్ సమితి డంబసర గ్రామ సమీపంలో ఉన్న ఒక కిరాణా దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.40 లక్షలకు పైగా కిరాణా సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ మంటలతో దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. డంబసర సమీపంలోని కె.గురునాథ్రావు అనే వ్యక్తికి చెందిన దుకాణంలో తెల్లవారుజామున మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్మకుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఆయనకు సమాచారం అందించారు. అనంతరం పద్మపూర్, గుణుపూర్లకు చెందిన అగ్నిమాపక కేంద్రాల నుంచి మూడు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొదట దుకాణం షట్టరును తెరవలేకపోయారు. అనంతరం జేసీబీ సాయంతో షట్టరును పగులగొట్టి లోపలికి నీటిని చిమ్మి మంటలను పూర్తిగా అర్పేశారు. అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. -
కల్యాణ వైభోగమే..!
శ్రీకాకుళం కల్చరల్ : హిందూ సంప్రదాయంలో ఏ పని తలపెట్టిన శుభ ముహూర్తాలు చూసుకోవడం ఆనవాయితీ. కొత్త వస్తువులు, వాహనాలు కొనాలన్నా మంచి రోజులు ఉండాల్సిందే. అలాంటిది జీవితంలో అత్యంత ప్రధానమైన వివాహాలు, గృహప్రవేశాల విషయంలో నక్షత్ర, రాశి బలాలకు సరిపడా ముహుర్తాలపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉంటుంది. అయితే గత మే 14న అధిక జ్యేష్టమాసం ప్రారంభం కావడంతో నెల రోజులుగా శుభకార్యాలకు బ్రేక్ పడింది. తాళికట్టు శుభవేళ.. ఈ నెల 15తో శూన్యమాసం ముగిసింది. 16 నుంచి నిజ జ్యేష్టమాసం ప్రారంభమైంది. జూన్ 27, 28, జూలై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీలలో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లోనూ మంచి ముహుర్తాలు ఉన్నాయని అంటున్నారు. వ్యాపారాలు కళకళ.. నెలరోజులుగా ముహూర్తాలు లేకపోవడంతో కల్యాణ మండపాలు, కేటరింగ్, టెంట్ హౌస్లు, డెకరేషన్, పూల వ్యాపారులు, పురోహితులు, బంగారం షాపులు, వస్త్రవ్యాపారులు, ఫొటోగ్రాఫర్ల వ్యాపారాలు మందగించాయి. చాలా మంది కార్మికులకు ఉపాధి కరువైంది. జూన్ 19 నుంచి మళ్లీ సీజన్ ప్రారంభం కానుండటంతో ఈ అనుబంధ వ్యాపారాలన్నీ ఊపందుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు వేల వరకు వివాహాలు నెల రోజుల తర్వాత ముహూర్తాలు మొదలవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో వధూవరులకు కావలసిన వస్త్రాలు, పట్టుచీరలు కొనేందుకు తల్లిదండ్రులు, బంధువులు షాపులకు క్యూ కడుతున్నారు. కిరాణా దుకాణాలలో కూడా వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ‘బంగారం’ లాంటి చాన్స్ పెళ్లికి ముఖ్యమైనది బంగారం. దాని ఖరీదు పెరుగుతున్నా తప్పని సరిగా బంగారం పెట్టాల్సిందే. స్వర్ణాభరణాల ధరలు పెరుతున్నా పెళ్లికి అతిముఖ్యంగా కావలసిన తాళిబొట్టు, మట్టెలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో కొందరు బంగారం షాపుల వద్ద చేరి వీటిని ముందుగా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు. మరికొందరు బంగారం ముక్క కొనుగోలు చేసి తమకు తెలిసిన తయారీదారుని వద్ద వెళ్లి ఆర్డర్ ఇస్తున్నారు. జ్యేష్టమాసం విశేషమైంది జ్యేష్టమాసం అన్ని మాసాలలోకి విశేషమైంది. బ్రహ్మదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. నిజ జ్యేష్ట మాసంలో వివాహాది శుభ కార్యక్రమాలు యధావిధిగా నిర్వహిస్తారు. చాలా మంది వివాహాలు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం ముహూర్తాల కోసం వస్తున్నారు.. నెలరోజులుగా ముహూర్తాలు లేక చేతిలో పనులు లేవు. ఎట్టకేలకు శుభ ముహూర్తాలు మొదలు కావడంతో వివాహాది శుభకార్యాలు చేయించుకునేందుకు మావద్దకు వస్తున్నారు. తేదీలు ముందుగా బుక్ చేసుకుంటున్నారు. – పి.నర్సింహమూర్తి, పురోహితులు, శ్రీకాకుళం -
సీనియర్ జర్నలిస్ట్ శరత్ దాస్ కన్నుమూత
భువనేశ్వర్: సీనియర్ జర్నలిస్ట్ శరత్ దాస్ (83) స్థాని క ప్రైవేట్ ఆస్పత్రిలో చికి త్స పొందుతూ శుక్రవారం కన్ను మూశారు. ఆయన ఒడిశా మీడియా వర్గాలలో సుప్రసిద్ధ, గౌరవనీయ వ్యక్తిగా గుర్తింపు పొందారు. చాలా సంవత్సరాలు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒడిశా బ్యూరో చీఫ్గా పని చేశారు. తన విశ్వసనీయమైన, ప్రభావవంతమైన రిపోర్టింగ్తో ప్రత్యేకత చాటుకున్నారు. తన వృత్తి జీవితంలో పలువురు యువ విలేకరులకు మార్గదర్శకత్వం వహించి, ఒడిశాలో ఆంగ్ల, జాతీయ స్థాయి జర్నలిజానికి గణనీయమైన కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహోద్యోగులు, మీడియా నిపుణులు ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయం పట్ల ఆయనకున్న వృత్తి నైపుణ్యం, నిజాయితీ, నిబద్ధతను గుర్తు చేసుకున్నారు. రాయగడ: జిల్లాలొని కళ్యాణసింగుపూర్ సమితి కొత్తగూడ గ్రామంలోని కుంభారివీధిలో విషపూరిత పుట్టగొడుగులు తిని ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. అడవిలో నుంచి తీసుకువచ్చిన గుర్తు తెలియని పుట్టగొడుగులను ఇంట్లో పెద్దలు లేని సమయంలో చూసి చిన్నారులు వండి తిన్న అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. అస్వఽస్థతకు గురైన చిన్నారులను వెంటనే కళ్యాణసింగుపూర్ ఆర్యోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ప్రాథమిక చికిత్స అనంతరం ముగ్గురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. -
జెడ్పీ సభ్యుడు రంజన్ గొమాంగో అకాల మరణం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ ఏ–జోన్ జిల్లా పరిషత్ సభ్యుడుగా విధులు నిర్వహిస్తున్న రంజన్ గొమాంగో (45) శుక్రవారం అకాల మరణం చెందారు. కొద్ది నెలలుగా కిడ్నీ వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలియజేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు . ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రంజన్ గొమాంగో మృతికి పలువురు సంతాపాన్ని ప్రకటించారు.కొరాపుట్ డీఐపీఆర్వో మృతి కొరాపుట్: జిల్లా పబ్లిక్ రిలేషన్ అధికారి (డీఐపీఆర్వో) స్వరాజ్ సిసా (42) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వరాజ్ శుక్రవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాలకి తరలించారు. అయితే అప్పటికే స్వరాజ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అంత్యక్రియలు కోసం స్వస్థలం కుమిలి ప్రాంతానికి తరలించారు. ఈయన మృతిపై పాత్రికేయులు నివాళులర్పించారు. రైల్వేస్టేషన్ను పరిశీలించిన డీఆర్ఎంపర్లాకిమిడి: ఈస్టుకోస్టు రైల్వే డివిజన్, విశాఖపట్నం నుంచి ఒడిశాలో రాయఘడ రైల్వేడివిజన్ ప్రత్యేకంగా ఏర్పడిన తరువాత తొలిసారిగా రాయగడ రైల్వే డీఆర్ఎం అమితాబ్ సింఘాల్ శుక్రవారం గుణుపురం, పర్లాకిమిడి సేష్టన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. భారత్ అమృత్ స్టేషన్ల పునరుద్ధరణ పనుల నేపథ్యంలో పర్లాకిమిడి వచ్చినట్టు చెప్పారు. గుణుపురం, పూరీ, విశాఖపట్నం నుంచి గుణుపురం ప్యాసింజర్ రైలు కొన్నిరోజులుగా ఆలస్యంగా (రెండు, మూడు గంటలు) ఇక్కడికి చేరుతున్నాయని.. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ నౌపడ నుంచి గుణుపురానికి సింగల్ లైన్, చిన్న స్టేషన్లలో గేట్లు సిగ్నలింగ్ సరిగ్గా లేనందున ఆలస్యం అవుతుందన్నారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. అలాగే పర్లాకిమిడి, గుణుపురం నుంచి ఇక్కడి రైల్వేలైన్ రాయగడ డివిజన్ తెరువళ్లికి ఎప్పుడు కలుపుతారన్న ప్రశ్నకు బదులిస్తూ.. తెరువళ్లికి రైల్ లైన్ పొడిగింపునకు టెండర్లు పిలిచామన్నారు. సర్వే పనులు పూర్తయ్యినట్టు తెలియజేశారు. భూసేకరణ పూర్తయిన తరువాత రైల్వే లైను పొడిగింపు జరుగుతుందని అన్నారు. తెరువెళ్లికి రైల్వే లైను పోడిగింపుతో రాయపూర్, భిలాయికి కనెక్టు అవుతోందన్నారు. బూటకపు ఐఏఎస్ అధికారి అరెస్టు భువనేశ్వర్: తాను ఐఏఎస్ అధికారిని అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న బూటకపు ఐఏఎస్ అధికారిని షహీద్ నగర్ ఠాణా పోలీసులు శుక్ర వారం అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.నాటుసారాతో ముగ్గురు అరెస్టు జయపురం: చట్ట విరుద్ధంగా నాటుసారా అమ్ముతున్న ముగ్గురుని అరెస్టు చేసినట్లు జయపురం ఎకై ్సజ్ అధికారి సుబ్రత్ కేశరి హరిన్ తెలిపారు. అరైస్టెనవారిలో జయపురం సమితి టంకువ పంచాయతీ ఝింకురిగుడ గ్రామానికి చెందిన హరి పొర, ఘివురి, రాణిపుట్ గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గిరిపై కేసులు నమోదు చేశారు. -
రథయాత్రకు తాళ్లు సిద్ధం
భువనేశ్వర్: త్వరలో ప్రారంభం కానున్న పూరీ శ్రీ జగన్నాథ స్వామి యాత్ర కోసం రథాల తాళ్లు పూరీకి చేరాయి. 8 అంగుళాల వెడల్పు, 220 అడుగులు లేదా 67 మీటర్ల పొడవున్న ఈ తాళ్లు పూరీలోని వీర్ ప్రతాప్పూర్లో ఉన్న ఒడిశా సహకార పీచు కార్పొరేషన్ సరఫరా చేసింది. ఆలయ కార్యాలయానికి చేరిన రథాల తాళ్లను ఆలయ సీనియర్ సూపరింటెండెంట్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సురక్షితమైన ప్రదేశంలో భద్ర పరిచేందుకు తక్షణ ఏర్పాట్లు చేశారు. పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలో రథయాత్ర కోసం జగన్నాథ, బలరామ, సుభద్ర రథాల పనులు వేగవంతం అయ్యాయి. వచ్చే నెల పదో తేదీకి కొత్త రథాల పనులు పూర్తి చేయడా నికి ఎక్కువ మంది వడ్రంగులను నియమించామని, అటవీ శాఖ రథాలకు కావాల్సిన కలప ను కూడా సమకూర్చినట్టు రథయాత్ర కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇచ్ఛాపురం: ఆంధ్రా ఒడిశా సరిహద్దు ఇచ్ఛాపురం సమీపంలో సుర్లా వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన నిరంజన్ మహరణ(48) మృతిచెందాడు. ఒడి శా నుంచి ఇచ్ఛాపురం వస్తుండగా గుర్తు తెలి యని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన నిరంజన్ను స్థానికులు చికిత్స నిమిత్తం బరంపురం తరలించినా ఫలితం లేకపోయింది. ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. నిరంజన్ పట్టణంలోని దానంపేటలో ఈ–సేవా కేంద్రం, ఫ్లెక్సీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. భార్య సుజ్ఞాని, కుమారుడు శుభమ్ ఉన్నారు. నిరంజన్ మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతి టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం కుజ్జిపేట గ్రామ సమీపంలోని తాలిచెరువు గట్టుపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గురువారం ఉదయం గ్రామస్తులు ఉపాధి హామీ పనుల కోసం చెరువు గట్టుపై వెళ్తుడగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి మెడ చుట్టూ టవల్ చుట్టి ఉండటం, చెవులు, ముక్కు నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు గుర్తించారు. ఎవరైనా చంపి పడేశారా, ఇంకేదైనా కా రణముందా అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం టెక్కలి ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటబొమ్మాళి ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం అర్బన్ : వందేమాతర గేయం స్వాతంత్రోద్యమంలో భారతీయులకు స్ఫూర్తి జ్వాలగా నిలిచిందని గాంధీ మందిర కమిటీ వక్తలు పేర్కొన్నారు. బ్రిటీష్ పాలకుల దురాగతాలను ఎదిరించేందుకు వందేమాతరం నినాదం అందరినీ ఏకం చేసిందన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ మందిరం స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనంలో వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయ 188వ జయంతి శుక్రవారం నిర్వహించారు. విగ్రహదాత డాక్టర్ నిక్కు అప్నన్నతో పాటు గాంధీ మందిర ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పూలమాలలు వేసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో సురంగి మోహన్రావు, ఎం.ప్రసాదరావు, జామి భీమశంకర్, పైడి హరనాధరావు, చౌదరి రాధాకృష్ణ, కొంక్యాన మురళీధర్, కొంక్యాన వేణుగోపాల్, పొన్నాడ రవికుమార్, మహిబుల్లాఖాన్, పందిరి అప్పారావు, గుత్తు చిన్నారావు, జి.నాగేశ్వరరావు, పెంకి చైతన్యకుమార్, బుడుమశీరు సూర్యారావు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
పర్లాకిమిడి: మొహర్రం పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొహర్రం నుంచి ముస్లింలకు కొత్త లూనార్ క్యాలండర్ ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది జూన్ 16 నుంచి ముస్లిం కొత్త సంవంత్సరాది క్యాలండర్ను ప్రారంభించారు. మొహర్రం సందర్భంగా నూతన దుస్తులు ధరించి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొహర్రం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. స్థానిక ఉప్పరవీధిలోని జుమ్మా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పేదలకు వస్త్ర, అన్నదానం చేశారు. జయపురంలో.. జయపురం: మొహర్రంను జయపురంలో ముస్లింలు సంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు. ప్రధానంగా షియా ముస్లింలో వందలాది మంది మహిళలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు శోభాయాత్ర లోపాల్గున్నారు. సంప్రదాయ బద్ధంగా నల్లని దుస్తులతో శుభాయాత్రలో పాల్గొన్నారు. -
మహా నదిలో సర్ప విగ్రహాలు లభ్యం
భువనేశ్వర్: కటక్లోని ఓగల్పూర్ ప్రాంతంలో మహానదిలో వందలాది నాగ విగ్రహాలు లభ్యం కావడంతో ఆ ప్రాంతంలో భక్తి, ఉత్సాహ వాతావర ణం నెలకొంది. స్థానిక యువకులు ఆ విగ్రహాలను వెలికి తీసి, పూజల కోసం ఒక శివాలయంలో ప్రతి ష్టించారు. ఈ విగ్రహాల మూలం స్పష్టంగా తెలియనప్పటికీ వాటిని దొంగిలించి ఉంటారని లేదా మతపరమైన కారణాల వల్ల విసర్జించి ఉంటారని భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఓగల్పూర్కు చెందిన కొందరు యువకులు మహా నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో వారి కాళ్లకు, చేతులకు ఏదో గట్టి వస్తువు తగిలింది. వారు ఉత్సాహంగా దాన్ని ఎత్తడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దాన్ని ఎత్తడానికి తమతో ఉన్న మరో ఆరుగురు స్నేహితులను పిలిచారు. మొదట 3 నుంచి 4 అడుగుల పెద్ద నాగ మూర్తి ఒకటి లభ్యమైంది. ఆ తర్వా త అక్కడ సుమారు 100 చిన్న నాగ మూర్తులు దొరికాయి. ఆ విగ్రహాలను ఒడ్డుకు తరలించి ధూప, దీపాదులతో పూజార్చనలు చేశారు. అనంత రం వాటిని ఓగల్పూర్ సంభేశ్వర్ దేవ్ శివాలయానికి తరలించారు. ఎవరో ఈ విగ్రహాలను దొంగి లించి మహా నదిలో రువ్వేసి ఉంటారని భావిస్తున్నా రు. శివాలయంలో భద్ర పరిచిన నాగ మూర్తులను భవిష్యత్లో ఆలయ కమిటీకి అప్పగిస్తామని యువకులు తెలిపారు. -
విద్యాశాఖ మంత్రి స్వస్థలంలో ఆందోళన
కొరాపుట్: రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద గొండో స్వస్థలం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్లో ప్రతిపక్ష బీజేడీ పార్టీ ఆందోళన చేసింది. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్ కి దిక్సూచి వంటి ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణని విద్యాశాఖ గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ముద్రణలో అనేక తప్పులు దొర్లాయి. రాష్ట్ర ఖజానాకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఆ పుస్తకాలు పనికి రాకుండా పోయాయి. విద్యా మంత్రి అవినీతి పెరగడంతోనే ఈ అక్రమ ఒప్పందం జరిగిందని ప్రతిపక్ష బీజేడీకి చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేడీకి చెందిన విద్యార్థి, యువజన విభాగాలు తమ ఆందోళన కొనసాగిస్తాయని ప్రకటించారు. ఈ ఆందోళన నిత్యానంద గొండో రాజీనామా వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం ఉమ్మర్ మెయిన్ రోడ్డులో భారీ ర్యాలీ జరిగింది. అనంతరం రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మజ్జి, విద్యా మంత్రి నిత్యానంద గొండో, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ ఆందోళనలో మాజీ ఎంఎల్ఎలు సదాశివ ప్రదాని, సుభాష్ గొండో తదితరులు పాల్గొన్నారు. -
పాఠ్య పుస్తకాల్లో దోషాలు
● ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించిన కమిటీభువనేశ్వర్: పాఠశాల పాఠ్యపుస్తకాలలోని లోపాలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి తన నివేదికను సమర్పించింది. ముఖ్యమంత్రి నిర్దేశించిన ఏడు రోజుల గడువులోగా అభివృద్ధి కమిషనర్ నేతృత్వంలోని ఈ కమిటీ నివేదికను ఆయనకు అందజేసింది. తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికలోని అంశాలను సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాల పాఠ్య పుస్తకాల్లో అనేక తప్పులు కనుగొనడంతో, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ లోపాలకు బాధ్యులైన అధికారులు, ఏజెన్సీలను గుర్తించి, ఏడు రోజుల్లోగా తమ నివేదికను సమర్పించాలని అభివృద్ధి కమిషనర్ ఆధ్వర్యంలోని ఈ కమిటీని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాఠ్యపుస్తకాల తయారీ, సమీక్ష, ప్రచురణ సమయంలో జరిగిన పొరపాట్లకు బాధ్యులైన అధికారులు, సంస్థలను గుర్తించడం, అలాగే ఆ తప్పులు ఎలా జరిగాయో పరిశీలించడం ఈ కమిటీకి అప్పగించిన బాధ్యత నేపథ్యంలో కమిటీ నివేదికని ముఖ్యమంత్రికి దాఖలు చేసింది. తదుపరి పరిశీలన కోసం ఈ నివేదికను ముఖ్యమంత్రికి పరిశీలిస్తున్నారు. దోష పూరిత పాఠ్యపుస్తకాల ఉపసంహరణకు ప్రభుత్వ ఉత్తర్వులు 1 నుంచి 8 తరగతుల పాఠ్య పుస్తకాల్లో బయటపడిన తప్పుల వెనుక కుట్ర ఉంది. ముద్రణ దోషాలున్న పుస్తకాలు అన్నింటినీ వెనక్కి పంపించేస్తాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ మీడియాకు తెలియజేశారు. ప్రభుత్వం ఈ పొరపాటును తీవ్రంగా పరిగణించింది. గతంలోనూ తప్పులు జరిగాయి. కానీ ఈ సారి వాటి సంఖ్య అసాధారణంగా ఎక్కువగా ఉంది. పాఠ్యాంశాల రూపకల్పన, పరిశీలన నుంచి ముద్రణ వరకు సమగ్ర ప్రక్రియను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతోందన్న అనుమానం ఉంది. పాఠ్య పుస్తకాల్లో తప్పులపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికని పరిశీలించి ప్రమేయం ఉన్నట్లు తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి హెచ్చరించారు. దోషులను గుర్తించి ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు పంపిణీ చేసిన తప్పులతడక పాఠ్యపుస్తకాలన్నింటినీ వెనక్కి తీసుకుంటాం. కొత్త ప్రతులను ముద్రించి తిరిగి పంపిణీ చేస్తాం. కుట్రకు పాల్పడినట్లు ఆధారాలు లభిస్తే దోషుల నుంచి ముద్రణ ఖర్చులను వసూలు చేస్తాం అని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పుడు నివేదిక చేతికి అందినందున, పాఠ్యపుస్తకంలోని తప్పులకు బాధ్యులైన అధికారులు, సంస్థలపై చర్యలు ప్రారంభించే ముందు ప్రభుత్వం దానిలోని అంశాలను పరిశీలిస్తున్నారు. -
‘డ్రగ్స్కు అలవాటు పడితే అధోగతే’
పర్లాకిమిడి: మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని, సమాజంలో వారి ఉనికి కోల్పోతారని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి దయామయ పాఢి అన్నారు. స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హాల్లో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ శాఖ ఆధ్వర్యంలో ఉదయం స్థానిక మహారాజాబాలుర ఉన్నత పాఠశాల నుంచి ఒక సచేతన ర్యాలీని కలెక్టర్ వరకూ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ట్రాన్స్జెండర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రీతి ధారా నాయక్, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బి.కె.సుజాత సబ్ డివిజనల్ సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ అధికారి లక్కోజు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అతిగా తాగుడు వల్ల ఒడిషా పాపులర్ సినీ గాయకుడు హిమాంశు శేఖర్ అతి తక్కువ వయస్సులోనే మృతిచెందాడని, అలాగే తాగుడుకు బానిసై సొంత తల్లిని కొట్టి డబ్బులు తీసుకుని దుర్ఘటనకు గురైన ఘటనను కూడా దయామయ పాఢి తన ప్రసంగంలో తెలియజేశారు. అందువల్ల మాదక ద్రవ్యాలు, తాగుడు వల్ల సమాజంలో అనేక నేరాలకు కూడా దారి తీస్తుందని ఆయన అన్నారు. అనంతరం తాగుడు, జూదం, గంజాయికి అలవాటు పడినవారి జీవనవిధానంపై చిన్న రూపకాలు ప్రదర్శించారు. -
బీజేడీలో చేరిన సుజాత రౌత్ కార్తికేయన్
భువనేశ్వర్: మాజీ ఐఏఎస్ అధికారి సుజాత రౌత్ కార్తికేయన్ బిజూ జనతా దళ్ (బీజేడీ)లో చేరారు. గురువారం శంఖ భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకుల సమక్షంలో బీజేడీ నాయకులు సుజాతకు ఘన స్వాగతం పలికారు. బీజేడీ అధ్యక్షుడు, శాసన సభ విపక్ష నేత నవీన్ పట్నాయక్ సమక్షంలో లాంఛనంగా చేరారు. నవీన్ పట్నాయక్ పార్టీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తాను సుజాత పార్టీలో చేరిన అనంతరం ఆమె మాట్లాడారు. తాను ఒక సాధారణ కార్యకర్తలా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. నవీన్ పట్నాయక్ నాయకత్వంలో పార్టీ, రాష్ట్రం కోసం పనిచేస్తానన్నారు. అనంతరం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా పార్టీకి నాయ కత్వం వహిస్తానని ప్రకటించారు. బిజూ జనతా దళ్ తన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సుజాత ఒకప్పటి బీజేడీ నాయకుడు వీకే పాండియన్ భార్య. ఆమె కాలికట్ తొలి మహిళా కలెక్టర్. క్షేత్రస్థాయి నుంచి మహిళలను పైకి తీసుకురావడం, ఎస్ఎస్జీని ఎస్ఎంఈగా మార్చడం, ఈ–కామర్స్ ద్వారా గృహిణులకు వ్యాపారాలు కల్పించడం వంటి ఎన్నో పనులు ఆమె చేశారు. సుజాత రౌత్ నేరుగా నాయకత్వ పాత్రలోకి ప్రవేశించకుండా, పార్టీ పని ద్వారా సంస్థలో తన స్థానాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. -
‘ఇంతాలిగూడపై వేధింపులు సరికాదు’
రాయగడ: కల్యాణసింగుపూర్ గొడవకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ ఆదేశానుసారం కొరాపుట్ లొక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలో గురువారం నాడు ఒక బృందం సమితిలోని ఇంతాలిగుడ గ్రామంలో పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఎంపీ సప్తగిరి సమావేశమై అసలు విషయానికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామంలో గల పురుషులను పోలీసులు అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి అరెస్టు చేసి తీసుకుపోతున్నారని మహిళలు ఆరోపించారు. అసలు ఘటనకు సంబంధం లేని వారిని కూడా పోలీసులు అనుమానించి వారిని తీసుకు వెళ్లిపోవడం ఎంతవరకు సమంజసమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లాపాపలతో ఏం చేయాలో తెలీని స్థితిలో ఉన్నామని గ్రామానికి చెందిన రజిని ఉలక అన్నారు. మరో రెండు రోజుల్లో తన భర్తను పోలీసులు విడిచిపెట్టకపోతే తాను తన పిల్లలతో కలసి పోలీస్ స్టేషన్ వద్ద విషం తాగి ఆత్మహత్యకు పాల్పడతానని అన్నారు. తమకు వేరే గత్యంతరం లేదని, ఇప్పటికై న పోలీసులు దయతలచి తన భర్తను విడిచిపెట్టాలని ఆమె కోరారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో అసలు పుకార్లు సృష్టించిన దండపొదొరొ గ్రామస్తులను విడిచి పోలీసులు ఇంతాలిగుడ గ్రామ ప్రజలను అరెస్టుల పేరిట వేధించడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. అయితే నిందితులను తప్పకుండా శిక్షించాలని, కానీ అమాయకులు కూడా పోలీసుల బారిన పడి ఇబ్బందులకు గురవ్వడం విచారకరమని అన్నారు. ఇదే విషయాన్ని తాను సమగ్ర నివేదికను పీసీసీ అధ్యక్షునికి సమర్పించి గ్రామస్తులకు తగిన న్యాయం చేస్తానని అన్నారు. పుకార్లు విని మోసపోవద్దు.. అవిభక్త కొరాపుట్ జిల్లాలొ ఇదివరకు ఇలాంటి తరహా ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదని, శాంతికి ప్రతీకగా నిలిచే రాయగడ జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ప్రభుత్వ అసమర్థతకు మచ్చుతునకగా మారిందన్నారు. ఈ నిజ నిర్ధారణ బృందంలో ఉలక తొపాటు బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకర్షన్ మంగరాజ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నంది గౌరి తదితరులు పాల్గొన్నారు. -
అమానుషం
భువనేశ్వర్: సమాజంలో నానాటికీ మానవీయ విలువలు అడుగంటి పోతున్నాయి. బిడ్డల కులాంతర వివాహంతో వెలివేత కారణంగా వృద్ధ మహిళ మరణానంతరం అంతిమ యాత్రకు చేయూత ఇచ్చేందుకు ఇరుగు పొరుగు నిర్దాక్షిణ్యంగా నిరాకరించారు. మృతురాలి కుటుంబీకులు ఎంత ప్రాధేయపడిన ప్రయోజనం లేకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో వృద్ధ మహిళ అంతిమ యాత్ర సైకిల్పై నిర్వహించారు. ఈ అమానుష సంఘటన గురువారం వెలుగు చూసింది. పశ్చిమ ఒడిశా బర్గఢ్ జిల్లా పాయికమల్ మండలం కొంటపొడా గ్రామంలో ఇలాంటి హృదయ విదారక సంఘటన సభ్య సమాజానికి సిగ్గు చేటుగా నిలిచింది. కొంటపొడా గ్రామస్తురాలు జయంతి బొచ్ఛా అనే వృద్ధురాలు మరణించారు. తన బిడ్డలు కులాంతర వివాహం చేసుకోవడంతో వారిని కులం నుంచి వెలివేసిన కారణంగా కులస్తులు మృత దేహాన్ని మోయడానికి నిరాకరించారు. దీంతో మృతురాలి కోడలు యజ్ఞాసిని బొచ్ఛా, మనవడు శుభం బొచ్ఛా, మనవరాలు శివాని బొచ్ఛా మృత దేహాన్ని సైకిల్పై శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల జాడ కొరవడడం మరింత హృదయవిదారకంగా మారింది. దుఃఖ సమయంలో ఒక నిరుపేద, నిస్సహాయ కుటుంబానికి శవం తరలించేందుకు వాహనం వంటి ప్రాథమిక సేవని కూడా స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేయలేకపోవడం ప్రజా పాలన వ్యవస్థను నిలదీసింది. సైకిల్పై అంతిమ యాత్ర -
అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ఫోన్లు
జయపురం: జయపురం సమితి కార్యాలయంలో అధికారులు ముఖ్యమంత్రి జీవికా మిషన్ పథకంలో అంతర్భాగమైన ‘వికాశ ధారా ఒడిశా సారా’ కార్యక్రమం గురువారం నిర్వహించారు. దీనిలో భాగంగా 20 మంది అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ఫోన్లు ఉచితంగా అందజేశారు. అలాగే ఏడుగురు కార్మికులకు శ్రామిక కార్డులు, 20 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ కార్డులు, మరో 20 మంది మహిళలకు ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన కార్డులను ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జయపురం సమితి బీడీవో శక్తి మహాపాత్రో మాట్లాడుతూ.. రెండేళ్లలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియజేశారు. కార్యక్రమంలో జయపురం సమితి అధ్యక్షురాలు తిలోత్తమ ముదులి, జిల్లా పరిషత్ సభ్యుడు తిరుపతి పట్నాయిక్, జిల్లా మహిళా బీజేపీ అధ్యక్షురాలు స్వాతి హత్త, సీడీపీవో అంజన్ సండ, బిజయ కుమార్ నందో తదితరులు పాల్గొన్నారు. మహిళలకు టైలరింగ్లో శిక్షణ పర్లాకిమిడి: మహిళల స్వయం ఉపాధికి గజపతి జిల్లా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రంలో టైలరింగ్ శిక్షణలో భాగంగా 35 మంది మహిళలకు నెలరోజులపాటు శిక్షణ అందిస్తున్నారు. జిల్లాలోని మోహనా, ఆర్.ఉదయగిరి, రాయఘడ, నువాగడ, గుసాని, పర్లాకిమిడి నుంచి 35 మంది మహిళలు ఉచితంగా టైలరింగ్లో శిక్షణ పొందుతున్నట్లు డొమైన్ స్కిల్ ట్రైనర్ ఎ.బాలామణి అచారి తెలియజేశారు. వీరిని వసతి, భోజన సదుపాయాలు ఉచితంగా అందిస్తున్నారు. జూన్ 8 నుంచి జూలై 8 వరకు ఆర్.శెట్టి భవనంలో మహిళలు టైలరింగ్లో శిక్షణ పొందిన అనంతరం వారికి సర్టిఫికెట్లు అందజేసి, తగిన ఆర్థిక సహకారం యూనియన్ బ్యాంకు ద్వారా అందిస్తున్నట్లు యూనియన్ బ్యాంకు ఆర్శెట్టి డైరక్టర్ తెలియజేశారు. బాలాసోర్లో పట్టపగలు వ్యాపారవేత్త కాల్చివేత భువనేశ్వర్: బాలాసోర్లో గురువారం మధ్యాహ్నం పట్టపగలు నడి రోడ్డు మీద దారుణ హత్య చోటు చేసుకుంది. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఒక వ్యాపారవేత్తకు తుపాకీ గురి పెట్టి కాల్చి చంపారు. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అరడ్ బజార్లోని 2వ నంబరు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతుడిని కార్ యాక్సెసరీస్ వ్యాపారమైన ఫ్రీడమ్ ఫ్యాషన్ యజమాని ఎస్. కె. హమీద్గా గుర్తించారు. ఎస్. కె. హమీద్ తల, ముఖం, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి హమీద్ తన కారు దిగుతుండగా గురి పెట్టి అతనిపై కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. స్థానికులు హమీద్ను బాలాసోర్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిశీలనలో సీసీటీవీ ఫుటేజ్ కాల్పులకు ముందు నల్ల ముసుగు తొడిగిన ఇద్దరు వ్యక్తులు బాధితుడిని వెంబడిస్తున్నట్లు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తోందని దర్యాప్తు అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య ఈ కాల్పుల ఘటన జరిగిందని బాలాసోర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ప్రత్యూష్ దివాకర్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి బాధితుడిపై కాల్పులు జరిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 2 వేర్వేరు తుపాకులను ఉపయోగించి ఉండవచ్చని తెలుస్తోందని ఎస్పీ అన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన శాసీ్త్రయ బృందం సుమారు 8 ఖాళీ తూటాల కేసింగ్లను స్వాధీనం చేసుకుందని ఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం, పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు ఒక ప్రత్యేక బృందంతో 4 బందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. మొహర్రం వేడుకల దృష్ట్యా పోలీసులు బాలాసోర్ పట్టణంలో గస్తీని పెంచడంతో పాటు భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కాల్పులకు పాల్పడిన వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. -
పూరీ రథయాత్రకు ప్రత్యేక బస్సులు
● రథ యాత్రలో టోల్ ఫీజు మినహాయింపు భువనేశ్వర్: ప్రపంచ ప్రసిద్ధ పూరీ రథయాత్ర సందర్భంగా భక్తులకు సులభమైన రవాణా సేవలను అందించేందుకు రవాణా శాఖ ప్రత్యేక బస్సులు నడిపిస్తుందని ప్రకటించారు. యాత్రలో భాగంగా జరిగే శ్రీ గుండిచా యాత్ర, బహుడ యాత్ర రోజుల్లో పూరీ టోల్ వసూళ్లు నిలిపివేస్తారు. పిప్పిలి టోల్ ప్లాజా వద్ద బస్సులు, కార్లు, ఇతర ప్రైవేట్ లేదా వాణిజ్య వాహనాలతో సహా అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుందని రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. స్థానిక ఆర్టీఓ–1 కార్యాలయంలో రాష్ట్ర రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన సమన్వయ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ప్రస్తుతం ప్రతి రోజూ పూరీకి సుమారు 200 ప్రైవేట్ బస్సులు నడుస్తుండగా రథ యాత్ర సమయంలో ఇతర మార్గాల్లో తిరిగే మరో 200 బస్సులకు తాత్కాలిక అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ తాత్కాలిక అనుమతులను శ్రీ గుండిచా యాత్ర, బహుడ యాత్ర, స్వర్ణ అలంకార దర్శనం కోసం పరిమితం చేశారు. ఈ విధంగా సుమారు 400 ప్రైవేట్ బస్సులను నడపాలని ప్రణాళిక రూపొందించారు. దీనితో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓఎస్ఆర్టీసీ) మరియు సీఆర్యూటీ బస్సు సర్వీసులను పెంచాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. బస్సులో ఏ ప్రయాణికుడైనా అస్వస్థతకు గురైతే తక్షణ సహాయం అందించేందుకు అన్ని బస్సులలో ప్రథమ చికిత్స కిట్లను ఉంచాలని నిర్ణయించారు. ప్రధాన బస్ టెర్మినళ్లు, బస్ స్టాపులు, బస్సుల్లో ప్రయాణికుల కోసం తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఏర్పాటు చేస్తారు. రథ యాత్ర సమయంలో పూరీ, తలొబొణియా, రాష్ట్ర రవాణా ప్రధాన కార్యాలయంలో రాత్రింబవళ్లు పని చేసే సమాచార కేంద్రం, కంట్రోల్ ఏర్పాటు చేస్తారు. దీని కోసం ఒక ప్రత్యేక నంబర్ను జారీ చేస్తారు. మరో టోల్–ఫ్రీ నంబర్ కూడా పనిచేస్తుంది. ఇ–రిక్షా సౌకర్యం ప్రయాణికుల సౌకర్యానికి తలొబొణియా ప్రాంతంలో త్రాగు నీరు, విద్యుత్ సౌకర్యాలతో కూడిన విశ్రాంతి గృహాన్ని నిర్మించనున్నారు. దీనితో పాటు ఉచితంగా వండిన ఆహారాన్ని అందిస్తారు. అదే విధంగా అవసరాన్ని బట్టి మాలతీపట్టుపూర్లో ఏర్పాట్లు చేస్తారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే బస్సులకు ఈ ప్రాంతంలో ఆగేలా ఏర్పాట్లు చేసి అక్కడి నుండి భక్తుల కోసం ఉచిత షటిల్ సర్వీసును అందిస్తారు. అదే విధంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తలొబొణియా, ఇతర ప్రధాన పార్కింగ్ ప్రాంతాల నుంచి ఉచిత ఇ–రిక్షా సౌకర్యాలను కల్పిస్తారు. ఇందు కోసం 450 ఇ–రిక్షాలను నిర్వహిస్తారు. చార్జీల వసూలుపై నిఘా ప్రతి బస్సులో చార్జీల పట్టికలను ప్రదర్శించడం తప్పనిసరి చేశారు. రవాణా శాఖ, బస్సు యజమానుల సంఘంతో కలిసి పూరీలోని ఆటో రిక్షాల ఛార్జీలపై కూడా నిశితంగా పర్యవేక్షిస్తుంది. ప్రయాణికులు ఎలాంటి దోపిడీకి గురికాకుండా చూడటం ప్రధాన ప్రాధాన్యతగా ఉంటుంది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి భువనేశ్వర్–పూరీ రహదారిపై తగినన్ని క్రేన్లు, అంబులెన్సులు మోహరిస్తారు. ఇందుకోసం పోలీసు శాఖ, ఆరోగ్య శాఖల మధ్య నిరంతర సమన్వయం ఉంటుంది. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో తక్షణ చికిత్స అందేలా చూస్తారు. అదేవిధంగా, భువనేశ్వర్ – పూరీ, పూరీ – కోణార్క్ జాతీయ రహదారులపై ఏదైనా వాహనం పాడైతే, తక్షణ మరమ్మతు సేవలను అందించాలని వాహన తయారీదారులు, డీలర్లను కోరారు. వాహన తయారీదారులు, డీలర్లు కొన్ని కీలక ప్రదేశాలలో సహాయక శిబిరాలను ఏర్పాటు చేస్తారు. సమావేశానికి జంట నగరాలు భువనేశ్వర్, కటక్ డీసీపీలు, ట్రాఫిక్ డీసీపీ, పూరీ జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్, రాష్ట్ర రవాణా అథారిటీ (ఎస్టీఏ) అధికారులు, బస్సు యజమానుల సంఘం కార్యకర్తలు, ఓఎస్ఆర్టీసీ, సీఆర్యూటీ ప్రతినిధులు హాజరయ్యారు. పూరీ జిల్లా మేజిస్ట్రేట్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. -
గుమ్మ సమీపంలో దారి దోపిడీ
రాయగడ: సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తొలగుమ్మ సమీపంలో ఓ చిరు వ్యాపారిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అతడి వద్ద గల నగదు, మొబైల్ ఫోను దోచుకెళ్లారు. దుండగులు కారులో వేగంగా అక్కడి నుండి పారిపోతుండగా రోడ్డువైపుగా వస్తున్న చిన్నారిని ఢీకొట్టారు. దీంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. గ్రామాల్లో తిరిగి చిన్నచిన్న వస్తువులను విక్రయించి జీవనోపాధి పొందే ఒక చిరువ్యాపారి ఎప్పటిలా వెళుతుండగా తొలగుమ్మ వద్ద కారులో వస్తున్న కొంత మంది దుండగులు అడ్డగించి అతనిపై దాడి చేసి అతని వద్ద గల నగదు, మొబైల్ ఫోన్ దోచుకున్నారు. అదే సమయంలో అటువైపుగా వెళుతున్న ఒక చిన్నారి ని ఢీకొట్టిన కారు అదుపుతప్పి రోడ్డు పక్క బోల్తా పడిపోయింది. అనంతరం దుండగులు కారును అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆశ్రమ పాఠశాలలు కుదించే నిర్ణయాన్ని మార్చుకోవాలి
పలాస: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారనే నెపంతో వాటిని కుదించే నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్కు మార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సూదికొండ కాలనీలోని పీడీఎస్యూ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేషనలైజేషన్ పేరుతో విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో 8, 9, 10 తరగతులను కుదించి, వారిని సమీప పాఠశాలలకు పంపించాలనే ఆలోచన సరైనది కాదన్నారు. దీనివల్ల ఆర్థిక భారం వలన ఇతర పాఠశాలలకు విద్యార్థులు వెళ్లలేక మధ్యలో చదువుకు స్వస్తి పలికే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఆదివాసీ పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, వంటమనిషి, వాచ్మెన్ తదితర పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. -
శివకుమార్ను కఠినంగా శిక్షించాలి
పలాస: సోంపేట మండలం గొల్లూరు గ్రామానికి చెందిన శివకుమార్ను కఠినంగా శిక్షించాలని, అతని కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలకు తగిన న్యాయం చేయాలని పౌరహక్కుల సంఘం, ఇతర ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గొల్లూరులో జరిగిన దారుణ ఘటనపై అంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాల నాయకుల నిజ నిర్ధారణ కమిటీ మంగళవారం ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో జయరాం, రాజారావు, శివకుమార్ అనేవారు ముగ్గురు అన్నదమ్ములు. వీరికి తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి మూడున్నర ఎకరాలను సమానంగా పంచుకుందామని రెండోవాడు రాజారావు ప్రతిపాదించారు. ఈ విషయంపై అన్నదమ్ముల మధ్య ఏకాభిప్రాయం కుదురకపోవడంతో పోలీసుస్టేషన్, గ్రామ పెద్దల వరకు వెళ్లింది. రాజారావుకు వారసత్వం వాటా ఇవ్వడానికి మిగతా ఇద్దరు ఇష్టపడకపోవడంతో ఆయన మానసికంగా బాధపడుతూ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన రాజారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త చనిపోవడంతో ఆ కుటుంబానికి ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో గ్రామ పెద్దలు ముగ్గురికి ఆస్తిని సమానంగా పంచారు. అయితే వారికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికి మిగతా ఇద్దరు అన్నదమ్ములు అడ్డుతగిలారు. దీంతో రాజారావు భార్య ఊర్వశి కోర్టును ఆశ్రయించింది. వారికి కోర్టు నోటీసులు రావడంతో కక్ష గట్టిన శివకుమార్ ఒక రోజు ఇంట్లో ఉన్న ఊర్వశిని అతి దారుణంగా హత్య చేసి పారిపోయాడు. అందువలన నిందుతుడిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పత్తిరి దానేసు, జిల్లా కమిటీ నాయకులు సోమనాథం, వైకుంఠరావు, జోగారావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దిల ధర్మారావు, పుచ్చ దుర్యోధనరావు, సాలిన వీరాస్వామి, బొడ్డు నాగమణి, సరస్వతి, దాసరి శ్రీరాములు, వాసుదేవరావు, బొడ్డు జగన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొన్న కారు
మందస: మండలంలోని మకరజోల సమీపంలో జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న కారు మార్గమధ్యలో ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటో డ్రవర్కు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కళాశాల అభివృద్ధికి కృషి చేయాలి శ్రీకాకుళం న్యూకాలనీ: ఉత్తరాంధ్రకే ప్రఖ్యాతిగాంచిన శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులంతా సమష్టిగా కృషి చేయాలని కాలిజియేట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పీవీ కృష్ణాజీ పేర్కొన్నారు. బుధవారం కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం అధ్యాపకులతో కలిసి సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల పనితీరు, ఫలితాలు, అడ్మిషన్ల తీరు గురించి ప్రిన్సిపాల్ డాక్టర్ యాళ్ల పోలినాయుడును అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. కళాశాలలో అడ్మిషన్లు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రోణంకి హరిత, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ జి.రాజశేఖర్, అకడమిక్ కో–ఆర్డినేటర్ డాక్టర్ సంపతిరావు శశిభూషణ్, డాక్టర్ రామకృష్ణ, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించండి శ్రీకాకుళం పాతబస్టాండ్: అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కల్యాణి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 7న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. గ్రానైట్ క్వారీలో ప్రమాదం ● యువకుడు మృతి సారవకోట: మండలంలోని గోవర్ధనపురం రెవెన్యూ పరిధి అనవీర్ గ్రానైట్ క్వారీలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఒడిశాకు చెందిన యువకుడు జె.శ్రీకాంత్ రెడ్డి (23) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రానైట్ క్వారీలో ఎప్పటిలాగే బుధవారం విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ రెడ్డి ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో సమీపంలో ఉన్న రాయి నీడలో సేద తీరేందుకు కూర్చున్నాడు. అయితే అదే రాయి ప్రమాదవశాత్తు ఆయనపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది ఒడిశాలోని గంజాం జిల్లా నరసింగపూర్గా గుర్తించారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ అనిల్ కుమార్, క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి శవపంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి తరలించారు. మృతుడి తండ్రి సుబ్బారావు రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆదర్శనీయం ● తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించిన ఉపాధ్యాయుడు మందస: ప్రభుత్వ బడుల్లోని అనుభవం కలిగిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు, కొత్తపల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు గవ్వ భీమారావు కోరారు. ఈ మేరకు మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో తన చిన్న కుమారుడు గవ్వ తరుణ్ను 1వ తరగతిలో చేర్పించారు. పెద్ద కుమారుడు గవ్వ గిరీష్ కూడా అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. దీంతో ఆయనను పలువురు అభినందించారు. -
ఉత్త కోతలే..!
ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న పంపు హౌస్ 2 కూటమి ప్రభుత్వ వైఫల్యం ఈ రెండేళ్లలో ఎత్తిపోతల పథకం పూర్తిచేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉండడం దారుణం. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో వ్యవహరించి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో సగానికి పైగా పనులు కూడా పూర్తయ్యాయి. వాటిని సైతం పూర్తిచేయలేకపోయింది ఈ ప్రభుత్వం. ఇంతకంటే వైఫల్యం ఉంటుందా..? – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం హిరమండలం: ఆర్భాటం ఎక్కువ.. పని తక్కువ అన్నట్టు ఉంది కూటమి ప్రభుత్వం తీరు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తిచేయలేకపోయింది. బీఆర్ఆర్ వంశధార ఫేజ్–2 రిజర్వాయర్, ఎత్తిపోతల పథకం, ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం.. ఇలా ఏ పథకాన్ని కూడా రెండేళ్లలో పూర్తిచేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందించలేకపోయింది. ప్రధానంగా వంశధార ప్రాజెక్టు పరిధిలోని హిరమండలం ఎత్తిపోతల పథకం ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. దీంతో జిల్లాకు సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యం దెబ్బతినేలా ఉంది. ఇదీ జరిగింది... వంశధార ఫేజ్–2 రిజర్వాయర్కు నేరడి బ్యారేజీ నిర్మాణం కీలకం. దీనికోసం ఒడిశాతో జల వివాదం నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో వ్యవహరించారు. ఈ మేరకు అప్పటి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చర్చలు జరిపారు. వంశధార నదిలో హిరమండలం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించడానికి నిర్ణయించారు. గొట్టా బ్యారేజీ కుడి ప్రధాన కాలువ నుంచి 12 టీఎంసీల నీటిని వంశధార జలాశయంలోకి చేర్చడమే లక్ష్యంగా పనులు ప్రారంభించారు. ఇందుకుగాను రూ.176.35 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. రూ.140.17 కోట్లకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ వైఎస్సార్సీపీ హయాంలో శరవేగంగా పనులు ప్రారంభించారు. రెండేళ్లలో సగానికిపైగా పనులు పూర్తి చేశారు. కానీ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం మాటలతో కాలం గడిపిందే తప్ప.. పనులు మాత్రం సజావుగా ముందుకు తీసుకెళ్లలేకపోయింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధుల విడుదలలో తాత్సారం కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఎత్తిపోతల పథకానికిగాను విద్యుత్ సబ్స్టేషన్ అవసరం. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. గత నెలలో ఏపీ ట్రాన్స్కోకు సబ్స్టేషన్ నిర్మాణానికిగాను రూ.9.18 కోట్లు చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ ఇంకా సబ్స్టేషన్ పనులు మొదలుకాలేదు. 132 కేవీ విద్యుత్ లైన్లు సారవకోట, పాతపట్నం, హిరమండలం నుంచి మొత్తం 75 టవర్లు ఏర్పాటు చేసి సబ్స్టేషన్కు అనుసంధానం చేయాలి. వీటి ఏర్పాటుకు సంబంధించి భూములను గుర్తించాలి. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి. కానీ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. సబ్స్టేషన్ నిర్మాణాన్ని సైతం ప్రారంభించలేదు. దీంతో ఎత్తిపోతల పథకం నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రకటనలకే పరిమిత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 2026 ఖరీఫ్నకు రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమినిస్తే వచ్చే ఏడాది ఖరీఫ్నకు కూడా ఇది సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వచ్చి రిజర్వాయర్లో నీటిని స్థిరీకరిస్తే.. వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 2.11 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. నారాయణపురం ఆనకట్ట కింద 18,527 ఎకరాలు, హెచ్ఎల్సీ కింద ఉన్న 5 వేల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ జరుగుతుంది. ఆపై ఉద్దానం ప్రాజెక్టుకు 1.12 టీఎంసీల తాగునీరు అందించవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఎత్తిపోతల పథకం పూర్తయితే కానీ ఈ పనులు చేయలేం. కానీ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఎత్తిపోతల పథకంలో ఎడతెగని జాప్యం విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంపై నిర్లక్ష్యం ప్రచార ఆర్భాటంతోనే గడిపేసిన కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్లో వంశధార నీరు లేనట్టే -
తవ్వారు.. వదిలేశారు..!
కొత్తూరు: కూటమి ప్రభుత్వంలో హడావుడిగా నాయకులు రోడ్ల పనులను ప్రారంభించి.. సకాలంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రాయల గ్రామం నుంచి ఎర్రటిగూడ వరకు రోడ్డు పనులు మంజూరు చేశారు. దీంట్లో భాగంగా పనులు ప్రారంభించారు. ఈ రోడ్డు ఊరు చెరువు గట్టుపై నుంచి వెళ్లాల్సి ఉండడంతో చెరువు గట్టుకు రక్షణ గోడ నిర్మాణం కోసం మూడు నెలల క్రితం గాడిని తవ్వారు. అయితే అనంతరం గోడ నిర్మాణం చేపట్టకుండా వదిలేయడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. నెలలు గడుస్తున్నా రక్షణ గోడ నిర్మాణ పనులు చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు గాడిలో నీరు చేరుతోంది. ఫలితంగా చెరువు గట్టు బలహీనపడింది. ఈ చెరువు కొండల దిగువ భాగాన ఉన్నందున చిన్నపాటి వర్షాలకు చెరువులోకి నీరు చేరడం వలన గాడిలో నీరు ఎక్కువవుతోంది. దీంతో గట్టు పలుచోట్ల బలహీనపడడంతో కూలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ గట్టు కూలిపోయినట్లయితే చెరువులో నీరు పొలాల్లోకి చేరుతుంది. ఫలితంగా మొలక దశలో ఉన్న వరినారు, వరి వెదలు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు గాడి తవ్వడం వలన రోడ్డు మీద మట్టి నిండిపోవడంతో రోడ్డు మీద ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వర్షం కురిసే సమయంలో ఈ రోడ్డు నుంచి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు రైతులు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోతున్నారు. రోడ్డు పనుల కోసం చెరువు గట్టు తవ్వేశారు. అయితే సకాలంలో పూర్తి చేయకపోవడంతో గట్టు పూర్తిగా బలహీనపడింది. పలుచోట్ల బీటలు వారింది. వర్షాలకు చెరువులో ఎక్కువ నీరు చేరినట్లయితే చెరువు గట్టు కొట్టుకుపోయి పంట పొలాల్లోకి నీరుచేరే ప్రమాదం ఉంది. తవ్విన గాడి పూడ్చకపోతే ఈ ఏడాది పంట చేతికొచ్చే అవకాశం లేదు. – రాగాల సులోచన, ఆయకట్టు రైతు, రాయల గ్రామం -
నిధుల కాజేతే లక్ష్యం..!
ఇలా ఒత్తిళ్లు..! కొన్ని మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. గ్రామాల్లో చేయాల్సిన పనుల జాబితాలను నేతలే సిద్ధం చేసి అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ అనుచరులతో ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అతిక్రమించి నిధులు ఖర్చు చేస్తే భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో పలువురు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో పంచాయతీలో ఒక పనికి ఒకరిద్దరూ కాకుండా ఏకంగా కూటమిలోని నలుగురు, ఐదుగురు చొప్పున పోటీపడటంతో అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నిధులను ఎలాగైనా స్వాహా చేయాలని చూస్తున్న నేతల ప్రయత్నాలు, ఒత్తిళ్లుకు అధికారులు తలొగ్గకుండా నిధులను పరిరక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పనుల పేరుతో నిధులు కాజేసే ప్లాన్ గ్రామాల్లో మురుగు నీటి కాలువలు, రోడ్ల మరమ్మతులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య పనులు ఇలాంటి చిన్నపాటి పనులు పేరుతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి అవసరం లేని పనులను కూడా అత్యవసరంగా చూపించి నిధులు ఖర్చుచేసే మార్గాలు వెదుకుతున్నారనే విమర్శలొస్తున్నాయి. కొన్నిచోట్ల పనులు చేయకనే బిల్లు గురించి చర్చలు మొదలయ్యాయని, మరికొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. గ్రామ ప్రజల అవసరాలకంటే నేతలకు లబ్ధి కల్పించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. హిరమండలం: పంచాయతీల్లోని నిధులపై కూటమి నేతలు కన్నేశారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధులను ఏదో రూపంలో బయటకు తీయాలని కొందరు వ్యూహాలు రచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గ్రామాల అవసరాలకు వినియోగించాల్సిన నిధులను మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 912 పంచాయతీలున్నాయి. ఏప్రిల్తో గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం నిర్ణయాధికారం ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వచ్చింది. దీంతో గ్రామాల్లో రాజకీయ నాయకుల జోక్యం తగ్గుతుందని భావించినప్పటికీ.. పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. నేరుగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోయినా, అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి తమకు అనుకూలంగా పనులు మంజూరు చేయించుకోవాలనే ప్రయత్నాలు కూటమి నేతలు చేస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పంచాయతీలు, ప్రత్యేక అధికారుల మ్యాపింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో కొత్త పనులకు అనుమతులు, బిల్లుల చెల్లింపులు, నిధుల బదిలీల విషయంలో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి కొందరు కూటమి నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వినియోగించే అవకాశం లేకపోవడంతో, వాటిపై సరికొత్త వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. -
జూలై 11, 12 తేదీల్లో సాహితీ సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్: జూలై 11, 12 తేదీల్లో విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి, మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా రాష్ట్రస్థాయి సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఎంబీ విజ్ఞాన కేంద్రం బాధ్యులు గుండు నారాయణరావు, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావులతో కలిసి విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని జిల్లాల నుంచి ప్రసిద్ధ కవులు, రచయితలతో పాటు యువకులు, వర్దమాన రచయితలు సుమారు 300 మందికి పైగా ఈ సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రచయితలు, కవులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్, నెట్టిమి రమణారావు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం బాధ్యులు పి.సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో విస్తరిస్తున్న సారా వ్యతిరేక ఉద్యమం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమం క్రమేనా గ్రామాలకు విస్తరిస్తుంది. ఒక్కొక్క పల్లెలో జరుగుతున్న పరిణామా లు పరిశీలిస్తున్న గిరిజన మహిళలు తమ గ్రామాల్లోనూ అమలు చేయాలంటూ ఉద్యమ బాట పడుతున్నారు. పపడాహండి సమితిలో పలు గ్రామాలలో సారా విక్రయ దుకాణాలపై మహిళలు సామూహికంగా దాడులు చేస్తున్నారు. సారా ప్యాకెట్లను రోడ్లపై విసిరేసి ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు బీహారి మద్య తయారీ కేంద్రాల నుంచి తమ గ్రామాలకు సారా రాకుండా పహారా కాస్తున్నారు. సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనేందుకు వ్యాన్లు, ఆటోలలో మహిళలు తరలివస్తున్నారు. అయితే అటువంటి వాహనాలపై ఆర్టీఓ సిబ్బంది భారీ జరిమానాలు విధిస్తుండటం పట్ల మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి మండిపడ్డారు. హెల్ప్డెస్క్లపై వివాదం జయపురం: పట్టణంలోని విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో హెల్ప్ డస్క్ల ఏర్పాటుపై బీజేపీ, బీజేడీ విద్యార్థి సంఘాల నేతల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వర్సిటీలో యూజీ, పీజీలలో ప్రవేశించే విద్యార్థులకు సహాయం చేసేందుకు ఏబీవీపీ విద్యార్థులు, బీజేడీ విద్యార్థులు హెల్ప్ డస్క్లు(సహాయక కేంద్రాలు) నెలకొల్పటం వివాదాస్పదమైంది. విద్యార్థుల మధ్య వివాదానికి కారణమైన హెల్ప్ డస్క్లను తొలగించేందుకు వర్సిటీ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయక్ వచ్చి ఉభయ వర్గాల మధ్య సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఒక దశలో రిజిస్ట్రార్తో ఏబీవీపీ జయపురం నేత జ్యోతీ రంజన్ పాణిగ్రహి వాగ్వాదానికి దిగారు. రాజకీయ ఒత్తిడితో పనిచేస్తున్నారు, ఈ వివాదం పరిష్కరించటం మీ వల్ల కాదు, వైస్ చాన్సలర్ను పిలవండి అని నిలదీయటంతో వివాదం పెరిగి పరిస్థితి జఠిలమైంది. సకాలంలో పోలీసులు వచ్చి ఉభయవర్గాలకు సమాధానపరిచారు. రాయగడ: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక జాబితా సవరణ కార్యక్రమంలో జిల్లా విశేష విజయాన్ని సాధించింది. జిల్లాలో సేకరించిన ఓటర్లకు సంబంధించిన అన్ని వివరాలను 100 శాతం డిజిటలైజేషన్ చేయడంలో అధికారులు పూర్తిగా సఫలీకృతులయ్యారని జిల్లా కలక్టర్ అశుతోష్ కులకర్ణి ప్రసంశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రాష్ట్రంలోనే రెండో జిల్లాగా రాయగడ నిలవడం అందరి కృషి పలితమేనన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మే 30 నుంచి ఇంటింటా సర్వే ప్రారంభమైందని వివరించారు. బూత్ స్థాయి అధికారులు ప్రతీ ఓటరు ఇంటికి వెళ్లి వివరాలను సేకరించడం, ధ్రువీకరించడం, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ వంటి పనులు సక్రమంగా నిర్వహించడంతోనే ఈ ఫలితం దక్కిందన్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 895 మంది బీఎల్ఓలు విధులు నిర్వహించారన్నారు. 7,14,500 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారన్నారు. సేకరించిన అన్ని ఫారాలను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయడంతోపాటు వాటి ధ్రువీకరణ ప్రక్రియ కూడా విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఎన్నికల శాఖ సక్రమ నిర్వహణతో పాటు బీఎల్ఓలు, ఇతర ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ ఫలితం సాధ్యమైందన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో జూలై 5 నుంచి ఆగష్టు 4వ తేదీ వరకు ఓటరు జాబితాపై దావాలు, అభ్యంతరాలు, స్వీకరణ చేపట్టనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను సెప్టెంబర్ 2వ తేదీ నాటికి పరిష్కరించి, సెప్టెంబర్ 6వ తేదీన ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. -
ఘనంగా కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణవేంకటేశ్వర మందిరం 32వ వార్షికోత్సవంతో పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం సాయంత్రం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మందిర ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం విశ్వక్సేణ ఆరాధన, పుణ్యాహావచనం, పరిషత్, రుత్విక్ వరుణ, రక్షాసూత్రధారణ, మత్సంగ్రహణం, వాస్తు యోగీశ్వర పూజలు జరిగాయి. మందిరం పరిశీలన కమిటి అధ్యక్షులు చంద్రమౌళి కుముంధాన్, కార్యదర్శి శ్రీనివాస్ కుముంధాన్, సభ్యులు వడ్డాది శ్రీనివాస్ రావు, కొత్తకొట గౌరీశంకర్ పాల్గొన్నారు. నేటి పూజా కార్యక్రమాల వివరాలు ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం శాత్తుమురై, అంకురారొహణం, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, మూర్తి కుంభరాధన, పతాక ధ్వజ ప్రతిష్టాపనలు, గరుడధ్వజారోహణం, ఉదయం తొమ్మిది గంటలకు శ్రీసత్యానారాయణ స్వామి వ్రతములు, సాయంత్రం ఐదు గంటలకు ఎదుర్కోలోత్సవం, 5.30 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, రాత్రి ఎనిమిది గంటలకు శ్రీవారి శేషవాహనోత్సవం, విశేష హోమాలు, నీరజన మంత్రపుష్పములు, ప్రసాద సేవన కార్యక్రమాలు కొనసాగుతాయి. -
బాకై ్సట్ డంపింగ్ యార్డు మాకొద్దు
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి దహిఖాల్ గ్రామ సమీపంలో బహుళజాతి సంస్థ వేదాంత అల్యూమినా కంపెనీ ప్రతిపాదించిన బాకై ్సట్ డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. యార్డు ఏర్పాటుతో ప్రజల జీవనం, ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ఈ నెల 5 నుంచి హటొ దొహిఖాల్లో వద్ద శాంతియుత రిలే నిరసన చేపట్టారు. దీనిలో భాగంగా బుధవారం బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక శిబిరాన్ని సందర్శించి నిరసనకారులతో చర్చించారు. వారి సమస్యలు, డిమాండ్లను విన్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో జరిగే శాసనసభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ డంపింగ్ కార్యకలాపాల వల్ల భారీ వాహనాల రాకపోకలు పెరిగి ధూళి, వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్వాసకోస, చర్మ సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రజల జీవనోపాధి, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రతిపాదిత బాకై ్సట్ డంపింగ్ ప్రాజెక్టును నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పీసీసీ సాధారణ కార్యదర్శి దుర్గాప్రసాద్ పండా, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకర్షన్ మంగరాజ్, సమితి కాంగ్రెస్ అధ్యక్షుడు నీలాంబర్ బిభార్, ఎంపీ ప్రతినిధి నీలాంబర్ బెహరా, యువ కాంగ్రెస్ నాయకుడు బాదల్ బెహరా తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి బంద్
● రాయగడ ప్రధాన ఆస్పత్రిలో రెండు ప్లాంట్లలో నిలిచిన ఉత్పత్తి ● రోగుల్లో తీవ్ర ఆందోళన రాయగడ : కొవిడ్ మహమ్మారి సమయంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రధాన మంత్రి కేర్స్, ముఖ్యమంత్రి కేర్స్ నిధులతో రాయగడ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రెండు పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ప్రస్తుతం పనిచేయడం లేదు. దీంతో రోగులు, బంధువుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 2021 అక్టోబరు 7న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలోఈ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. ఆస్పత్రిలోని వివిధ వార్డులకు పైప్లైన్ల ద్వారా నిరంతర ఆక్సిజన్ సరఫరా చేయడమే వీటి ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం రెండు ప్లాంట్లలోనూ ఉత్పత్తి నిలిచిపొవడంతో ఆస్పత్రి యాజమాన్యం ఆక్సిజన్ సిలిండర్లను, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై ఆధారపడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఇటీవల జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశంలో కూడా ఆక్సిజన్ ప్లాంట్ల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లలేదని తెలుస్తోంది. రోగి సంక్షేమ సమితి నిధులను వినియోగించి మరమ్మతులు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో ఇద్దరు మెడికల్ మేనేజర్లు, ఒక సూపరింటెండెంట్ ఉన్నప్పటికీ ఇలాంటి దుస్థితి ఎలా ఏర్పడిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే సందర్శన.. విషయం వెలుగులోకి రావడంతో రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక మంగళవారం సందర్శించారు. ఏడీఎం (మెడికల్)తో కలిసి ఆక్సిజన్ ప్లాంట్ల పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించి ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను తనిఖీ చేశారు. 24 పడకల సామర్థ్యం ఉన్న ఈ కేంద్రంలో ప్రస్తుతం 20 మంది శిశువులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. రోగుల సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా వెంటనే చర్యలు తీసుకుని ఆక్సిజన్ ప్లాంట్లను తిరిగి పనిచేసేలా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సాంకేతిక లోపమే కారణమా.. డీఎంఓ, డీహెచ్హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత కుమార్ మిశ్రా మాట్లాడుతూ ఆక్సిజన్ ప్లాంట్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో సోమవారం రాత్రి పది గంటల నుంచి ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. అయితే ఆస్పత్రిలో సుమారు 20 రోజుల అవసరాలకు సరిపడే ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నందున సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. భువనేశ్వర్ నుంచి సాంకేతిక నిపుణుల బృందం వచ్చి మరమ్మతులు పూర్తి చేసిన వెంటనే ప్లాంట్ పూర్వ స్థితికి చేరుతుందన్నారు. -
విజిలెన్స్ వలలో ఆర్డీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
రాయగడ: బిల్లు చెల్లింపులు జరిపించేందుకు కాంట్రాక్టర్ నుంచి రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రాయగడ గ్రామీణాభివృద్ధి శాఖ (ఆర్డీ) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రసన్నకుమార్ పట్నాయక్ విజిలెన్స్ అధికారులకు మంగళవారం రాత్రి పట్టుబట్డారు. బిల్లు ఆమోదం కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో బాధిత కాంట్రాక్టర్ విజిలెన్స్ శాఖను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు కాంట్రాక్టర్ ఇంజినీర్ నివాసంలో లంచం మొత్తాన్ని అందజేస్తుండగా రాయగడ విజిలెన్స్ డీఎస్పీ సూర్యకాంతి టక్రి, అభయ ప్రధాన్ నేతృత్వంలో 10 మంది సభ్యుల బృందం దాడి చేశారు. రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆదాయానికి మించిన ఆస్తులపై అనుమానాల నేపథ్యంలో నయాగడ్ జిల్లాకిల్లా ప్రాంతంలోని ఆయన నివాసం, భువనేశ్వర్, ఇతర ప్రదేశాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉన్న ప్రసన్నకుమార్ పట్నాయక్ విజిలెన్స్కు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. -
గజపతి వికాసమే ధ్యేయం
● రాష్ట్ర న్యాయ, ప్రజాపనుల శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ● జిల్లా కేంద్రంలో వికసిత్ ఒడిశా సమ్మేళనంపర్లాకిమిడి: గజపతి జిల్లాలో రోడ్లు, భవనాలు, పర్యాటక కేంద్రాలు, విద్య, వైద్యం వికాసానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర అబ్కారీ, న్యాయ, ప్రజాపనుల శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం మందిరంలో వికసిత్ ఒడిశా సమ్మేళనం ‘వికాస్ ధారా, ఒడిశా సారా..’ కార్యక్రమం ప్రారంభించారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మోహనా శాసన సభ్యుడు దాశరథి గొమాంగో, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, ఎస్పీ మీనా, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, డీఎఫ్ఓ నాగరాజు, డీపీఓ ప్రకాష్రావు, ఎస్.డి.సీ.చైర్మన్ కామదేవ్ బోడోనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గజపతి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, అదే సమయంలో కలెక్టర్, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు సహకారం అందించాలని కోరారు. ప్రాజెక్టులకు నిధులు మంజూరు.. గజపతి జిల్లాలో రూ.2.09 కోట్లతో గండాహాతి, గుద్గురా, మంకడాడియా జలపాతాలు అభివృద్ధి చేస్తామని, పర్లాకిమిడి గుణుపురం, రాయగడ, తెలువళ్ళి రైల్వేలైను పొడిగిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రజల డిమాండ్ మేరకు పర్లాకిమిడి నుంచి గుమ్మగెడ్డ వరకూ బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లతో టెండర్లు పిలిచామని చెప్పారు.స్థానిక శ్రీజగన్నాథ మందిరం పునరుద్ధరణ పనులకు రూ.20 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోందని, కృష్ణచంద్ర గజపతి కళాశాలకు విశ్వవిద్యాలయం హోదా కల్పించాలని ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.పలువురు ప్రతినిధులను సత్కరించిన అనంతరం ఎస్.కె.సి.జీ.కళాశాలలో వికాస్రో ధారా, ఒడిషా సారా స్టాల్స్ను ఎమ్మెల్యేలు దాశరథి గొమాంగో, రూపేష్ పాణిగ్రాహిలు ప్రారంభించారు. -
ఆకలితో అలమటిస్తున్నా పింఛన్లు ఇవ్వరా?
కొరాపుట్: పేదలు పింఛన్లు అందక ఆకలితో చనిపోతున్నా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి బాధ్యత లేకుండాపోయిందని ప్రతిపక్ష బీజేడీకి చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి మండిపడ్డారు. బుధవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో ఆర్థిక రాజధాని వంటి గంజాంలో సావిత్రి దొర (66) అనే వృద్ధురాలు నెలవారీ పింఛన్ అందక ఆకలితో మృతిచెందడం బాధాకరమన్నారు. నబరంగ్పూర్ జిల్లాలో మూడు నెలలుగా పేదలకు పెన్షన్లు అందడం లేదన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా మూడు నెలల పెన్షన్ 15 రోజులలో పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చి గడువు ముగిసినా ఫలితం లేకపోయిందన్నారు. నబరంగ్పూర్ జిల్లాలో 1656 మంది దివ్యాంగులకు పింఛన్ అందడం లేదన్నారు. కేవలం వెయ్యి రూపాయలతో జీవనం సాగించే దివ్యాంగులు ఆ డబ్బులు కూడా అందక విలవిల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 17,130 మంది వితంతువులు తమ బాధ ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఎక్కడైనా పింఛన్దారులలో మృతి చెందితే ఆ స్థానంలో మాత్రమే కొత్త పింఛన్ మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఇది సరికాదన్నారు. ఎన్ఎస్ఏపీ పథకం కింద అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాలన్న నిబంధన తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పపడాహండి సమితిలో పద్మన్ బిసోయి విధి నిర్వాహణలో చనిపోతే నేటికీ ప్రభుత్వ పరంగా సాయం అందలేదన్నారు. దాంతో అతని భార్య బబితా బిసోయి వృద్ధాప్య పెన్షన్ రు.1000పై ఆధారపడి జీవిస్తోందన్నారు. ఆ పెన్షన్ కూడా మూడు నెలలుగా అందడం లేదన్నారు. వారం రోజుల్లోగా ఆమెకు న్యాయం జరగకపోతే కలెక్టర్ నివాసం ముందు ఆందోళన చేస్తామని ప్రదీప్ మజ్జి హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, మాజీ జెడ్పీ ప్రెసిడెంట్ మంజులా మజ్జి, బీజేడీ నాయకులు భీమో పూజారి, ప్రమోద్ రథ్, లల్లూ త్రిపాఠి, నాగేంద్ర పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
హెల్ప్ డెస్క్ ప్రారంభం
కొరాపుట్: కాలేజీల ప్రాంగణాల వద్ద ప్రతిపక్ష బీజేడీ పార్టీ హెల్ప్ డెస్క్లు ప్రారంభమయ్యాయి. కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో ప్లస్ 2, ప్లస్ 3 విభాగాలకు బోధనా తరగతులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా విద్యార్థులు కళాశాలలకు చేరుకుంటున్నారు. వీరికి పట్టణాల్లో పరిస్థితులు, తరగతులు, ముఖ్య విభాగాలపై అవగాహన అంతగా ఉండదు. అటువంటి వారికి అవగాహన కల్పించడానికి బీజేడీ యువ, విద్యార్థి విభాగాలు ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని డి.ఎ.వి కళాశాల ఎదుట జెడ్పీ ప్రెసిడెంట్ సస్మితా మెలక ఈ శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలెటెందు రంజన్ శెఠి, మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్, తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే నిర్వాసితులకు రూ. 153 కోట్ల పరిహారం పంపిణీ
కొరాపుట్: నబరంగ్పూర్–జయపూర్ మధ్య నిర్మిస్తున్న రైల్వే ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులుగా మారినవారికి పరిహారం పంపిణీ కొనసాగుతుంది. మంగళవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రాధమిక విద్య, మైనారిటీ శాఖా మంత్రి నిత్యానంద గొండో మూడో విడత కార్యక్రమంలో భాగంగా 144 మందికి 153 కోట్ల రూపాయల పరిహారాన్ని పంపిణీ చేశారు. నందాహండి తాహసీల్ పరిధిలో భూములు కోల్పోయిన వారికి ఈ విడత పరిహారాలు అందాయి. ఈ ప్రాంతంలో 108 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. కార్యక్రమంలో పాల్గొన్న నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి మాట్లాడుతూ.. కేంద్రం బడ్జెట్లో రాష్ట్రం రైల్వే అభివృద్ధికి పది వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో రైల్వే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. 460 కిలోమీటర్ల పొడవుతో జునాఘడ్–నబరంగ్పూర్, నబరంగ్పూర్–జయపూర్, జయపూర్–మల్కన్గిరి, మల్కన్గిరి–భద్రచలం నిర్మాణం దేశంలో రెండవ అతి పెద్ద రైల్వే నిర్మాణంగా గుర్తింపు తెచ్చుకుంటుందని ఎంపీ బలబద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో నబరంగ్పూర్ ఎంఎల్ఎ గౌరీ శంకర్ మజ్జి, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ పాల్గొన్నారు. -
నాల్కో టౌన్షిప్లో కీచకపర్వం
కొరాపుట్ : కొరాపుట్ జిల్లా దమంజోడిలో భారత అల్యూమినియ కేంద్రం (నాల్కో)లో ఓ మహిళపై కీచక పర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 18న ఓ ఉద్యోగి కుటుంబానికి చెందిన మహిళ రోడ్డుపై వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె భయంతో కేకలు వేయడంతో వారు పారిపోయారు. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు దమంజోడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో మంగళవారం ఉదయం నాల్కో ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగుల కుటుంబాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టారు. నాల్కో టౌన్షిప్ వద్ద ప్రతి రోజూ బయట వ్యక్తులు వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భద్రత పెంచాలని, అనుమానితులను ఈ ప్రాంతంలోకి అనుమతించవద్దని, రోడ్లపై లైటింగ్ పెంచాలని, సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నాల్కో హెచ్ఆర్ విభాగానికి అందజేశారు. -
ముమ్మరంగా యువతిపై దాడి కేసు దర్యాప్తు
● ఇప్పటికే 24 మంది అరెస్టు ● పరారీలో ఉన్నవారి గురించి గాలింపు రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ ప్రాంతంలో ఓ యువతిపై జరిగిన దాడికి సంబంధించిన కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనను అత్యంత సున్నితమైన రెడ్ ప్లాగ్ కేసుగా గుర్తించి క్రైం బ్రాంచ్కు చెందిన మహిళా, శిశు నేరాల విభాగం పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఈ కేసు దర్యాప్తును పరివేక్షిస్తున్న ఏడీజే ఎస్. పైనీ సోమవారం భువనేశ్వర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఘటనలో పాల్గొన్న ఒక్క నిందితుడ్ని కూడా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. చట్టప్రకారం కఠినతరమైన శిక్షలు పడేలా చూస్తామన్నారు. ఒడిశా ప్రతీకకు మచ్చ కళ్యాణసింగుపూర్లో జరిగిన ఘటన రాష్ట్రం, సమాజం సిగ్గుపడేలా చేసిందని ఏడీజే సైనీ వ్యాఖ్యానించారు. ఒడిశా ఇలాంటి ఘటనలు జరిగే రాష్ట్రం కాదని అన్నారు. అయితే ఇటువంటి తరహా ఘటనలు భవిష్యత్లో పునరావృత్తం కాకుండా పోలీస్ యంత్రాంగం పూర్తి చర్యలు చేపడుతుందని ఆకాంక్షించారు. అదేవిధంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా తమవంతు ప్రయత్నాన్ని చేయాలని పిలుపునిచ్చారు. బాధితురాలిని ప్రమాదం నుంచి రక్షించిన వ్యక్తికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే బాధితురాలికి రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కోర్టు విచారణను పర్యవేక్షిస్తాం ఈ కేసు దర్యాప్తు మాత్రమే కాకుండా, కోర్టులో విచారణ జరిగే దశలో కూడా పోలీస్ శాఖ పర్యవేక్షణ కొనసాగుతోందని సైనీ వెల్లడించారు. నిందితులకు గరిష్ట శిక్షలు పడేలా పటిష్టమైన ఆధారాలను సమర్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించిన సామాజిక సంస్థ యువతిపై దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ నేపథ్యంలో న్యాయం కోసం పోరాటం కుటుంబం అనే సంస్థ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుబ్రత్ కుమార్ దాస్ జాతీయ మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. ఘటనపై ఎన్హెచ్ఆర్సీ స్వయంగా జోక్యం చేసుకుని ఒడిశాకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పంపించాలని కోరారు. అదేవిధంగా బాధితురాలికి తగిన పరిహారం అందించడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిటిషన్లో రాయగడ కలెక్టర్, ఎస్పీ, డీజీపీ, హోం సెక్రటరీ, ముఖ్యమంత్రి, గవర్నర్లను కూడా పక్షాలుగా చేర్చినట్లు సమాచారం. ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి పిల్లల అపహరణ అనుమానంతోపాటు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎవరిపై కూడా దాడులు చేయడం తగదని పోలీసులు కోరుతున్నారు. ఏమైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని ఏడీజీ సైనీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వదంతులు, అనుమానాల ఆధారంగా మూకదాడులకు పాల్పడటం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ఎస్పీ ప్రత్యేక దర్యాప్తు యువతిపై అమానుష దాడికి సంబంఽధించి వాస్తవాలు తెలుసుకునేందుకు ఎస్పీ రాజ్ ప్రసాద్ స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని, దాడి సమయంలో ఉన్న వారిని కలిసి వివరాలు సేకరించారు. అలాగే ఘటన జరిగిన సమయంలో పోలీసుల పాత్ర ఎలా ఉండేది, ఎంతవరకు స్పందించారు అనే విషయాలను ఆయన క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం ఇంతాలిగుడ గ్రామానికి వెళ్లిన ఎస్పీ ఆ గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. వారు చెప్పిన మాటలను,వివరాలను సేకరించారు. -
శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘనంగా నివాళులు
కొరాపుట్: జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని మంగళవారం బీజేపీ నాయకులు నిర్వహించారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని మజ్జి గుడలో ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాం ప్రసాద్ చిత్రపటానికి ప్రముఖులు నివాళులర్పించారు. దేశ ఐక్యత కోసం శ్యాం ప్రసాద్ కన్న కలలను రాష్ట్ర ప్రాథమిక విద్య, మైనారిటీ శాఖ మంత్రి నిత్యానంద గొండో గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పాల్గొన్నారు. ● ఝార్సుగుడలో మొబైల్ హ్యాండోవర్ మేళా రాయగడ: పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫొన్లను గుర్తించి వాటిని అసలు యజమానులకు తిరిగి అందించే లక్ష్యంతో ఝార్సుగుడ పోలీసులు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలొ నాలుగో విడత మొబైల్ హ్యాండోవర్ మేళాను నిర్వహించారు. ఆపరేషన్ నేత్ర కింద చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ విడతలో మొత్తం 55 సెల్ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుని సంబంధిత యజమానులకు అప్పగించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ జి.ఆర్.రాఘవేంద్ర పాల్గొని మోబైల్ యజమానులకు వాటిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇదివరకు నిర్వహించిన మూడు విడతల మోబలై హ్యాండోవర్ మేళాల్లో 269 ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని సంబంధిత వ్యక్తులకు అందించినట్లు వివరించారు. నాలుగో విడతలో లక్ష్మణ్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అత్యధికంగా 13 మోబైల్ ఫోన్లు, ఝార్సుగుడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఫోన్లను రికవరీ చేయగా మిగిలిన ఫోన్లు బ్రజరాజ్నగర్, బడ్మాల్, ఓరియంట్, బెల్పహార్, బన్హార్పాలి, లపైకెరా, కొలాబిరా, రెంగాలి, ఎయిర్పొర్టు పోలీస్ స్టేషన్ల పరిధిలో గుర్తించబడ్డాయని తెలిపారు. ఇదిలాఉండగా మోబైల్ ఫోన్లు పోయినా లేదా చొరీకి గురైన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. -
పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
రాయగడ: జిల్లా కేంద్రాస్పత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపొవడంతో ఆందొళన చేపట్టారు. బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా స్తంభించింది. రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి 2023 నవంబర్ నుంచి వేతనాలు సకాలంలో అందడం లేదని, ప్రస్తుతం వరుసగా మూడు నెలల జీతాలు బకాయిలు ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందిన వారంతా వివరించారు. ఈ విషయమై పలుసార్లు జిల్లా యంత్రాంగం, ఔట్సోర్సింగ్ సంస్ధ అధికారులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని వాపొయారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు జిల్లా ప్రధాన వైద్యాధికారికి మసోసారి వినతిపత్రం సమర్పించి వెంటనే బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 57 మంది పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026
● నబరంగపూర్లో మహిళల ఆందోళన ● కలెక్టర్,ఎస్పీ కార్యాలయాల ముట్టడినబరంగ్పూర్ కలెక్టరేట్ వైపు ఆందోళనగా వెళ్తున్న మహిళలు, ప్రజాప్రతినిధులు కొరాపుట్ : సంపూర్త మద్య నిషేధం కోరుతూ వేలాది మంది మహిళలు మంగళవారం నబరంగ్పూర్లో ఆందోళనకు దిగారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను ముట్టడించారు. మహిళలు తమ సంప్రదాయ ఆయుధాలు, కర్రలతో ర్యాలీగా వచ్చి మద్యం మహమ్మారికి వ్యతిరేకంగా నినదించారు. గత కొన్ని రోజులుగా పపడాహండి సమితి మైదల్పూర్ ప్రాంతంలో బీహారీ మద్యం తాగి గిరిజన యువకులు పెద్ద ఎత్తున్న చనిపోతున్నారు. దాంతో ఆ ప్రాంత మహిళలు బీహారి మద్యం, ప్రభుత్వ మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. అప్పట్లో ప్రభుత్వం గిరిజన మహిళలపై కేసులు పెట్టింది. విషయం తెలుసుకున్న మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మా ఘరో మహిళా స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ కాదంబని త్రిపాఠి నేతృత్వంలో కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో ఆ ప్రాంతంలో తాత్కాలికంగా మద్యం దుకాణాలు మూసి వేశారు. ఈ ఉద్యమం మరలా ప్రారంభం కావడంతో ప్రతిపక్ష బీజేడీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దాంతో మహిళలు ఆయుధాలతో సహా ర్యాలీ చేపట్టారు. తొలుత కలెక్టరేట్ను ముట్టడించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి మహిళలతో చర్చలు జరిపారు. అక్రమ దేశీ తయారీ మద్యం బట్టీలు, దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మహిళలు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేపట్టారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా మహిళలు ఆయుధాలతో రావడంతో పోలీసులు వారిని శాంతింపజేశారు. ఎస్పీ పార్దవ్ కశ్యప్ బయటకు వచ్చి మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే నిరసనలో పాల్గొన్న డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. కొందమాల్ జిల్లాలో గిరిజన ప్రజల డిమాండ్పై జిల్లా వ్యాప్తంగా మద్య నిషేధం కొనసాగుతుందన్నారు. అదే విధంగా షెడ్యూల్డ్ జిల్లా నబరంగ్పూర్లో కూడా మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి మాట్లాడుతూ రెండేళ్లలో జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదన్నారు. నిరసన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు, మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతరాయగడ: దేశంలో 12 ఏళ్లు, రాష్ట్రంలో రెండేళ్లు పూర్తి చేసుకుని విజయపరంపరగా ముందుకు అడుగులు వేస్తున్న బీజేపీ ప్రజల ఆదరణాభిమానాలను మరింత సమీకృతం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకుడు యాళ్ల కొండబాబు అన్నారు. పార్టీ విజయోత్సవాలను సదరు సమితి బాయిసింగ్ పంచాయతీలొ మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కొసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రజల దరికి చేరేలా అంతా కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలపై అవగాహన కలిగించడంతో పాటు అభివృద్ధి ఒడిశా, సమృద్ధి చెందిన భారత నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. అనంతరం అంత్యోదయ గృహాల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండబాబుకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలుకుతున్న పార్టీశ్రేణులు -
రాయగడలో జిల్లాస్థాయి జనకల్యాణ మేళా
రాయగడ: రాష్ట్ర ప్రభుత్వ గృహ, పట్టణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో మంగళవారం జనకల్యాణ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. వీధి వ్యాపారులను వివిధ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలతో అనుసంధానించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. జన కల్యాణ మేళాలో వీధి వ్యాపారులను ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలు, ప్రధానమంత్రి శ్రమ యోగి మాంధన్, జనధన్ యోజన, మాతృ వందన యోజన తదితర మొత్తం ఎనిమిది ముఖ్య సంక్షేమ పథకాలతో అనుసంధానం చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా 123 మంది కొత్త వీధి వ్యాపారులను గుర్తించారు. తాజాగా రుణాలు మంజూరైన ఇద్దరు వ్యాపారులకు చెక్కులు అందజేశారు. అలాగే మరో పది మంది కొత్తవీధి వ్యాపారులను సన్మానించారు. వీధి వ్యాపారుల నైపుణ్యాభివృద్ధి, సురక్షిత ఆహార విక్రయాలను ప్రొత్సాహించే లక్ష్యంతో ఆహర భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శిక్షణ కల్పించారు. కార్యక్రమంలో రాయగడ మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్, ఎస్డీసీ వైస్ చైర్మన్ మంజుల మినియాక, మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల కౌన్సిలర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు. -
బైక్ల చోరీ కేసులో నిందితుడు అరెస్టు
● 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం పలాస: మండలంలోని పెదంచల గ్రామానికి చెందిన నాతిమిరి రఘునాథన్ను బైకుల చోరీ కేసులో అరెస్టు చేసినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కాశీబుగ్గ పోలీసుస్టేషన్ ఆవరణలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. రఘునాథన్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువు మానేసి వెల్డింగ్ పనులు నేర్చుకున్నాడు. అనంతరం బెంగాల్, అబుదాబిలో పనిచేసి 2019లో విశాఖపట్నం చేరుకున్నాడు. పరవాడ ప్రాంతంలోని ఒక ఫార్మా కంపెనీలో వెల్డింగ్ పనులను 2021 వరకు చేశాడు. ఈ సమయంలో ఇతను చెడు అలవాట్లుకు బానిసయ్యాడు. ఆర్థిక పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోవడంతో బైకుల దొంగతనాలకు పాల్పడ్డాడు. కొన్ని బైకులు అతని సొంతానికి వాడుకున్నాడు. ఈ క్రమంలోనే పలాసలోని ఒక ఇంటి ముందు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ను గత నెల 30వ తేదీన దొంగలించాడు. సోమవారం మరో బండిని దొంగతనం చేయడానికి వస్తుండగా కాశీబుగ్గ పోలీసులు పలాస మండలం కంబిరిగాం కూడలి వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా చిక్కాడు. మొత్తం 18 కేసులు పట్టుబడిన రఘునాథన్ను విచారించగా అతనిపై మొత్తం 18 కేసులు ఉన్నట్లు స్పష్టమయ్యాయి. బైకుల దొంగతనం కేసుల్లో ఆమదాలవలస, అనకాపల్లి, విజయనగరం, పరవాడ తదితర పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. 2024 సెప్టెంబర్ 29న పర్లాకిమిడిలో అరైస్టె.. విశాఖపట్నం సెంట్రల్ జైలుకు వెళ్లి తిరిగి ఈ ఏడాది జనవరి 8న బయటకు వచ్చాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత మరలా దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పలాసలో బైకు దొంగతనం చేయడానికి వస్తూ పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐలు ఆర్.నర్సింహమూర్తి, ఎన్.సునీల్, సీసీసీ ఎస్ఐ భరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధే సర్కారు లక్ష్యం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి కార్యాలయం ప్రాంగణంలో సోమవారం కేంద్ర ప్రభుత్వానికి 12 ఏళ్లు, రాష్ట్ర ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘వికాస్ ధారా.. ఒడిశా సా రా’ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శా ఖల సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు ప్రయో జనాలను పంపిణీ చేశారు. సమితి అధ్యక్షుడు విఘ్న కిర్సాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమితి అభివృద్ధి అధికారి అర్పిత మహంతి, అతిథులు కలిసి గిరిజనులకు భూ పట్టాలు, పింఛన్లు మంజూరు పత్రాలు, అంత్యోదయ గృహ పథకం కింద ఇళ్ల కేటాయింపు, అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్లు, చేపల పెంపకం కోసం లబ్ధిదారులకు ఆర్థిక సహయం అందజేశారు. మిషన్శక్తి మహిళ సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను అధికారులు సందర్శించారు. సమితి అదనపు అభి వృద్ధిశాఖ అధికారి కార్తిక్ నాయక్, ఖోయిర్పూట్ సర్పంచ్ దైమతి గోల్పేదా, దుష్మంత్ బెహరా పాల్గొన్నారు. -
కలిమెల గ్రీవెన్స్లో 32 వినతులు స్వీకరణ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మల్లావారం పంచాయతీలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్క్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా 32 వినతులను అధికారులు స్వీకరించి కొన్నింటి అక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని పరిశీలించి పరిష్కరిచాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గిరిజనుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అభివృద్ధి అధికారి దశరాఽథి సరబు, కలిమెల సమితి ఉద్యోగులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ వర్కర్లకు సెల్ఫోన్ల అందజేత
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి కార్యాలయంలో సోమవారం జాయింట్ గ్రీవెన్స్ సెల్కు మంచి స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి దయామయ పాఢి, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు పాల్గొన్నారు. గుసాని సమితిలో పలు పంచాయితీల నుంచి 32 అభియోగాలు రాగా, అందులో వ్యక్తిగతం 18, గ్రామ సమస్యలకు సంబంధించినవి 14 ఉన్నాయి. వీటన్నిటినీ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అదేశించారు. గుసానిసమితి కార్యాలయం వద్ద పది మంది వృద్దులకు మధుబాబు పింఛన్లను, పది మంది అంగన్వాడీ వర్కర్లకు సెల్ఫోన్లను అందజేశారు. రైతులకు మట్టి పరీక్ష కార్డులును అందించారు. గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, బీడీవో గౌరచంద్ర పట్నాయక్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
జయపురం: వృక్ష సంపద లేనిదే జీవరాశికి మనుగడ లేదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఒడిశా జర్నలిస్ట్స్ యూనియన్ కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు, జయపురం సబ్ డివిజన్ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి రబి నాయక్ పిలుపునిచ్చారు. జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి కమతా గ్రామం మా మాణికేశ్వరి స్పోర్స్, కమతా కల్చెరల్ యూత క్లబ్లు సంయుక్తంగా సోమవారం చేపట్టిన వృక్షారోపణ కార్యక్రమంలో రబి నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రబినాయక్ మాట్లాడుతూ గతంలో కొరాపుట్ జిల్లా అటవీ సంపదకు ఆలవాలమై ఉండేదన్నారు. పలు ప్రాజెక్టుల వలన కాల క్రమేణా జిల్లాలో అడవులు కనుమరుగు అవుతున్నాయన్నారు. దీనివలన పర్యావరణానికి ముప్పు ఏర్పడిందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. కమతాలో కొత్తగా నిర్మిస్తున్న స్టేడియం చుట్టూ మామిడి, ఉసిరి, పనస, తదితర పండ్ల మొక్కలతోపాటు పలు రకాల ఔషధ మొక్కలు నాటారు. కమతా స్టేడియం పూర్తి చేసేందుకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గౌరవ అతిథి బీజేపీ నేత భాస్కర్ భట్ మాట్లాడుతూ.. కమతా స్టేడియం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర క్రీడా మంత్రితో సంప్రదించి సమకూర్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఓజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి శంకర మహాపాత్రో, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సలహాదారు కె.సికిల్ దొర, సునీల్ షొడంగి, దయానిధి పట్నాయక్, ఉపాధ్యక్షులు సుజిత్ కుమార్ పండా, సుశాంత పండా, టుటు పట్నాయక్, యూత్ క్లబ్ అధ్యక్షుడు పద్మనాభ శనాపతి, ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్ శతపతి, ఆశిష్ కుమార్ హోత్త, ప్రధాన కార్యదర్శి ముకుంద మురారీ మిశ్ర, సహాయ కార్యదర్శులు రిపున్ హోత్త, రోహణ షొడంగి, కోశాధికారి హరిశంకర శతపతి, గ్రామ యువత పాల్గొన్నారు. -
మావోయిస్టుల డంప్ స్వాధీనం
కొరాపుట్: మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నట్లు కొరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ ప్రకటించారు. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించారు. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారం మేరకు జిల్లాలోని బొయిపరిగుడ పోలీస్ స్టేషన్ పరిధి బడిపహడ్ పర్వత ప్రాంతంలోని దండకారణ్యంలో డీవీఎఫ్ దళాలు గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం డంప్ను గుర్తించినట్టు చెప్పారు. ఇందులో ఒక ఇన్సాస్ రైఫిల్, ఆరు కంట్రీ మేడ్ గన్స్, ఒక క్లైమర్ మైన్, కేజీ బరువు ఉండే పది టిఫిన్ బాక్సు బాంబులు, ఆరు ఐఈడీ బాంబులు, మావోయిస్టు కిట్ బ్యాగ్, మావోయిస్టు సాహిత్యం, మందులు, నిత్యావసర వస్తువులు లభించినట్టు ఎస్పీ చెప్పారు. ఈ డంప్ ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీకి చెందినదిగా పేర్కొన్నారు. ప్రస్తుతం దండకారణ్యంలో డీవీఎఫ్, ఎస్వోజీ దళాలు గాలింపులు కొనసాగిస్తున్నాయని ఎస్పీ రోహిత్ వర్మ వెల్లడించారు. -
యువతిపై దాడి అమానుషం
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్లొ దొంగ తనం అనుమానంతో ఓ యువతిపై జరిగిన దారు ణదాడిని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అత్యంతదారుణమైనదని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టాన్ని ఎవ్వరూ తమ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదన్నారు. ఘటనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యులైన వారిపై నిష్పాక్షికంగా, కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. ఘటన జరిగిన రోజే ఎస్పీ స్వయంగా అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని వివరించారు. ఇదిలాఉండగా తాను ఆదివాసీ ప్రజాప్రతినిధి అయినప్పటికీ చట్టం అందరికీ సమానమనే నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు. నిర్ధోషులను వేధించకుండా, అసలు నిందితులను గుర్తించి త్వరితగతిన శిక్షించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా విస్కృత కార్యక్రమాలను ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
పర్యావరణాన్ని పరిరక్షించాలి
జయపురం: జయపురం మున్సిపాలిటీ పరిధి కుంభారి సాహీలో గల లక్ష్మణ బాలాజీ మంది రం ప్రాంగణంలో సోమవారం విద్యార్థులు వివిధ రకాల మొక్కలు నాటారు. జయపురం తెలుగు సాంస్కృతిక సమితి వారు నిర్వహిస్తు న్న జయపురం సిటీ స్కూల్ విద్యార్థులు ఆల య ప్రాంగణంలో పలు రకాల పూల, ఫల మొ క్కలు నాటారు. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాల కల్చరల్ ఉపాధ్యాయుడు ప్రతాప్ కుమార్ పట్నాయక్ నేతృత్వంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆలయానికి వచ్చిన భక్తులు ప్రశంసించారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో అర్హులైన చేతులు లేని దివ్యాంగులను గుర్తించి, ఆగస్టు 16న విజయనగరంలో జరిగే ఉచిత కృత్రిమ చేతుల అమరిక శిబిరానికి వారిని పంపించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.దేవరాజుతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు. విజయనగరం వెళ్లే ముందు జిల్లాలో ఒక స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి, మోచేతి దిగువన నాలుగు అంగుళాల చేయి ఉన్నవారిని గుర్తించేందుకు స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు. -
కేసులు ఎత్తివేయాలని డిమాండ్
రాయగడ: జిల్లాలొని కల్యాణసింగుపూర్ సమితి పర్సాలి పంచాయతీ కార్యాలయం సమీపంలో నియమగిరి ప్రాంతానికి చెందిన డొంగిరియా కొంధొ తెగకు చెందిన ఆదివాసీలు భారీ సమావేశాన్ని నిర్వహించారు. జల్–జంగల్–జమీన్ (నీరు ,అడవి, భూమి) అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న ఆదివాసీ నాయకులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న డొంగిరియా యువకులు మాట్లాడుతూ అడవులు, భూములు, ప్రకృతి సంపదల రక్షణ కొసం ఉద్యమిస్తున్న ఆదివాసీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వారిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని అన్నారు. ప్రధానంగా నియమగిరి సురక్షా సమితి కన్వినర్ లొద్ద సికక పేరుపై వారెంట్, నోటీసు జారీ చేయడంతో పాటు ఆయన ఆస్తులను జప్తు చేయమని కళ్యాణసింగుపూర్ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ చర్యల కారణంగా నియమగిరి ప్రాంత ప్రజల్లో అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. నిమయగిరి అడవులే నా అసలైన ఆస్తి నియమగిరి కొండలు, అడవులు, నీరు, గాలి, వన్యప్రాణులు ,ప్రకృతి సంపద పరిరక్షణే తన అసలైన ఆస్తులని డొంగిరియా కొందొ ఆదిమతెగకు చెందిన నాయకుడు లొద్ద సికక అన్నారు. తన ఇంటిలో కేవలం కొసల మండియా (రాగులు) కందులు, జునుములు, వంటి సంప్రదాయ ధాన్యాలే ఉన్నయని, అవసరమైతే అధికారులు తన ఇంటిని తనిఖీ చేయవచ్చని, అందుకు తను పూర్తి సహకారం ఉంటుందని వివరించారు. నియమగిరి అడవులు, కొండలు, భూములు డొంగిరియా కొంధొల జీవనాధారాలని అన్నారు. అవి వారి సంసృతి, సంప్రదాయాలతో విడదీయరాని బంధమని అన్నారు. ఈ ప్రాంత రక్షణ కోసం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు ఉద్యమకారులపై వివిధ రకాల ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. పోలీసు చర్యలు నిలిపివేయాలని డిమాండ్ సమావేశంలో మాట్లాడిన కొందరు ప్రముఖులు నిరపరాధ డొంగిరియా కొంధొలపై అనవసర పోలీసు చర్యలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆదివాసీల రాజ్యంగబద్ధ హక్కులు, అటవీ హక్కుల చట్టాన్ని గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఆదివాసీ నాయకులపై వేధింపులు, కేసులు కొనసాగితే భవిష్యత్లొ భారీస్థాయిలో ప్రజా ఉద్యమాలు చేపట్టి రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. సమావేశం ద్వారా నియమగిరి ప్రాంత ప్రజలు తమ హక్కుల పరిరక్షణ కొసం పొరాటాన్ని మరింత ఉద్ధృతం చేసే సంకేతాలు ఇచ్చారు. -
రెడ్క్రాస్ నిధులతో ఆర్థిక సహాయం
రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన కొలనార సమితి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో నలుగురికి రెడ్ క్రాస్ నిధుల నుంచి 28 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే సమితిలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదుల రూపంలొ వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొత్తం 46 వినతులను అధికారులు స్వీకరించారు. ఇందులో 25 వ్యక్తిగత, 22 సామూహిక గ్రామ సమస్యలుగా గుర్తించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ కెముండో, ఏఎస్పీ గొసానార్ బర్లా, జిల్లా అటవీ శాఖ అధికారి అన్నాసాహెబ్ ఆహోలే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెద్దపులి చర్మం స్వాధీనం కొరాపుట్: విక్రయం జరుగుతున్న పెద్ద పులి చర్మాన్ని నబరంగ్పూర్ జిల్లా అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.పెద్ద పులి చర్మం విక్రయం జరుగుతుందనే సమాచారంతో నబరంగ్పూర్, డాబుగాం, పపడాహండి, కొడింగాలకు చెందిన అటవీ శాఖ సిబ్బంది పపడాహండి సమితి జఠాబల్ గ్రామ సమీపంలో పత్రి అటవీ ప్రాంతంలో గాలింపులు చేపట్టారు. ఇదే సమయంలో అటవీ సిబ్బంది దాడులు చేయడంతో ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. పత్రి గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని అదుపు లో తీసుకున్నారు. అతని నుంచి పెద్ద పులి చర్మం స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్మం జార్సుగుడ అడవుల నుంచి తీసుకొని వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. దీని విలువ కనీసం రూ.15 లక్షలు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతుందని అటవీ సిబ్బంది ప్రకటించారు. విలు విద్య కోచ్ రాజేష్ హస్థాక్ మృతి మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లాకు చెందిన విలువిద్య కోచ్ రాజేష్ హస్థాక (49) ఆదివారం మృతి చెందారు. జిల్లాలో సతాలి తెగకు చెందిన ఆదివాసీ యువకుడు ఈ క్రీడలో జిల్లా స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్లాడు. ఈ నెల 18వ తేదీన ఆయన ఆరోగ్య క్షీణించడంతో కుటుంబ సభ్యులు భువనేశ్వర్ తరలించారు. అక్కడ కిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. సోమవారం క్రీడాశాఖ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు మల్కన్గిరి : హత్య కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తికి మల్కన్గిరి జిల్లా సెషన్స్ న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2020లో మల్కన్గిరి జిల్లా బలిమెల పోలీసుస్టేషన్ పరిధిలో తర్లాకోట గ్రామానికి చెందిన సుభాష్ భూయాన్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన బాజా మడ్కామి అనే వ్యక్తి విల్లుతో బాణం సంధించి హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు బాజా మడ్కామిని అరెస్టు చేశారు. అతడిపై అభియోగ పత్రం దాఖలు చేశారు. 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, వాదనలు పరిశీలించిన తర్వాత జిల్లా సెషన్స్ న్యాయమూర్తి రాజలక్ష్మి పట్నాయక్ నిందితుడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు, రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అదనంగా మృతుడు సుబాష్ భూయాన్ భార్యకు పరిహారంగా రూ.5 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
కొనసాగుతున్న అరెస్టులు
రాయగడ: కల్యాణ సింగుపూర్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ నెల 16 వ తేది అర్ధరాత్రి ఢిల్లీలోని ఆజాద్పూర్ ప్రాంతానికి చెందిన అర్పిత సుతారియా, గుజరాత్లోని సూరత్ ప్రాంతానికి చెందిన సుమన్ ఝా అనే ఇద్దరు యువతీ, యువకులపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పిల్లలు ఎత్తుకెళ్లేవారంటూ గ్రామస్తులు అనుమానించి వారిపై దాడికి పాల్పడ్డారు. మహిళ అని చూడకుండా ఆమెను వివస్త్రను చేసి దాడి చేయడం కలకలం రేపింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టినప్పటికీ యువతి వస్త్రాలను చించివేయడం వంటి చర్యలకు తీవ్రంగా స్పందించిన పోలీస్ శాఖ ఈ ఘటనను రెడ్ ఫ్లాగ్ గా గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే యువతీ, యువకులపై దాడి చేసిన ఘటనలో పోలీసులు అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి 24 మందిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఇదిలాఉండగా కల్యాణసింగుపూర్లో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం నాడు పోలీసులు ప్లాగ్మార్చ్ నిర్వహించారు. క్రైం బ్రాంచ్ దర్యాప్తునకు ఆదేశాలు ఈ ఘటనకు సంబంధించి స్పందించిన రాష్ట్ర పోలీస్ శాఖ డీజీ జొగేష్ బహదూర్ ఖురానియా ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు క్రైం బ్రాంచ్ మహిళ, శిశు అపరాధ నివారణ శాఖకు దర్యాప్తు కోసం ఆదేశించినట్లు సమాచారం. ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కల్యాణసింగపూర్, ఘటన చోటు చేసుకున్న ఇంతాలిగుడ ప్రాంతంలో త్వరలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసుల అప్రమత్తమయ్యారు. ఒకవైపు ప్లాగ్ మార్చ్ మరొవైపు దాడికి పాల్బడిన నిందితులను అరెస్తు చేసే ప్రక్రియలను వేగవంతం చేశారు. యువతీ, యువకుల దాడికి సంబంధించి అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో కల్యాణసింగుపూర్ కు సమీపంలొ గల ఇంతాలిగుడ గ్రామంలో పురుషులంతా పరారైపోయారు. మరికొందరిని అరెస్టు చేశారు. సుమారు 60 కుటుంబాలకు పై బడి ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం ఒక్క యువకుడు కూడా కనిపించడం లేదు. దీంతో గ్రామంలో నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ గ్రామప్రజలు వారి కుటుంబాలకు చెందిన యువకులను ఒక్కొక్కరిని అరెస్టు చేసి తీసుకువెళ్లడంతో భయాందోళనలకు గురవుతున్నారు. కల్యాణసింగుపూర్ ఐఐపీగా శివాజీ పండా కల్యాణ సింగుపూర్లొ వరుస ఘటనల నేపథ్యంలో ఐఐసీగా విధులు నిర్వర్తించే కల్పన బెహరను పోలీస్ శాఖ బదిలీ చేసింది. దీంతో ఆ స్థానంలో ఐఐసీగా శివాజీ పండ బాధ్యతలు చేపట్టారు. రాయగడ సైబర్ పోలీస్ స్టేషన్ ఐఐసీగా విధులు నిర్వహించే పండ ను శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా కల్యాణసింగుపూర్ ఐఐసిగా పోలీస్ శాఖ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలేమైంది..? కంధమాల్ జిల్లా దారింగిబడి జిల్లాలో ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న సుమన్ ఝా, అర్పిత సుతారియాలు తమ విధుల్లో భాగంగా ఈ నెల 16 వ తేదీన దారింగిబడి నుండి కలహండి జిల్లా థువామూల్ రాంపూర్కు వెళ్లేందుకు స్కూటీలో బయల్దేరారు. గూగుల్ మ్యాప్పై ఆధారపడడంతో థువామూల్ రాంపూర్కు వెళ్లే ప్రక్రియలో దారితప్పి కల్యాణసింగుపూర్ ప్రాంతానికి రాత్రి సమారు 8.30 గంటల ప్రాంతంలొ చేరుకున్నారు. అయితే దారిలొ కొందరు అల్లరిమూక వారిని పిల్లలు ఎత్తుకు వెళ్లేవారిగా చిత్రీకరించి వారిని వెంబడించారు. ఈ క్రమంలో వారి బారి నుంచి బయటపడేందుకు కల్యాణసింగుపూర్ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే వారు పిల్లలను ఎత్తుకు వెళ్లే గ్యాంగ్ అని వారిని పట్టుకోండని కేకలు వేయడంతో సమీప ప్రాంతాల ప్రజలు వారిపై దాడికి తెగబడ్డారు. యువతి వస్త్రాలను చించే ప్రయత్నం చేయడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన తీవ్రరూపం దాల్చింది. -
● తాత మనవడి ఆఖరి ప్రయాణం
పూసపాటిరేగ: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కంచిలి నుంచి విశాఖపట్నానికి సోమవారం ఉదయం కారులో బయలుదేరారు. తాత, అమ్మమ్మ, మనవలు, కుమార్తె కబుర్లలో మునిగిపోయారు. అల్లుడే డ్రైవింగ్ కావడంతో నిశ్చింతగా ప్రయాణిస్తున్నారు. భోగాపురం మండలం పోలిపల్లి ఫ్లైఓవర్పై కనురెప్పపాటులో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఆవలవైపు ఉన్న రోడ్డుపైకి చేరింది. అంతే... అదే సమయంలో శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ కారును బలంగా ఢీకొని 80 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. ప్రమాదంలో తాతా మనవడు దుర్మరణం చెంద గా, నలుగురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం... కంచిలి గ్రామానికి చెందిన మన్యాల సూరిబాబు (60), లక్ష్మి ఇంటికి అల్లుడు రాపాక కిశోర్కుమార్, కుమార్తె ఉమామహేశ్వరి, మనవడు రాపాక సాత్విక్ రిహాన్సుహాసన్ (ఏడాదిన్నర), మరో మనవరాలు, అనకాపల్లి జిల్లా పాయకరా వుపేటకు కొయ్య నేహశ్రీ ఇటీవల కారులో వచ్చారు. అక్కడ పనులు ముగించుకుని రాజమండ్రిలో శుభకార్యానికి హాజరయ్యేందుకు అందరూ బయల్దేరారు. తొలుత విశాఖపట్నం మధురవాడలో నివసిస్తున్న అల్లుడు కిశోర్కుమార్ ఇంటికి చేరుకోవాలనుకున్నారు. మరో అరగంట సమయంలో ఇంటికి చేరుకుంటారనగా.. పోలిపల్లి వద్ద జాతీయరహదారిపై ఉన్న ఫ్లై ఓవర్పై జరిగిన ప్రమాదంలో సూరిబాబు, మనవడు సాత్విక్రిహాసుహాసన్ దుర్మరణం చెందారు. మిగిలిన నలుగురు గాయపడ్డారు. -
● రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రి..
పలాస: పలాస మున్సిపాలిటీకి చెందిన కుమ్మరి రామారావు(60) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాశీబుగ్గ పోలీసులు, బంధువులు ఇచ్చిన వివరాలు ప్రకారం.. ఆయన పలాస–కాశీబుగ్గ పట్టణంలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నా రు. ఉదయం పూట కూలీలను తీసుకొని వెళ్లి పనికి అప్పగించి ఇంటికి ప్రతి రోజు వస్తుంటారు. సాయంత్రం వేళల్లో మళ్లీ వారు పనిచేసే చోటకు వెళ్లి పరిశీలించి తిరిగి ఇంటికి వస్తుంటారు. రోజూ మాదిరిగానే సోమవారం కూడా కాశీబుగ్గ నుంచి తిరిగి బైకుపై వస్తుండగా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఒక బ్రాందీషాపు వద్ద మున్సిపాలిటీకి చెందిన చెత్తను సేకరించే ట్రాక్టరు ఆగి ఉంది. ఆ ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించి ఆ పక్కనే ఉన్న పండ్ల దుకాణం వద్ద నిలబడి ఉన్నాడు. రామారావు ఆ ట్రాక్టర్ను బలంగా ఢీకొన్నారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను అంబులెన్స్లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తు ప్రాణాలు తీసినట్లు చెబుతున్నారు. -
జేకేపూర్లో రక్తదాన శిబిరం
రాయగడ: జేకే గ్రూప్ మాజీ చైర్మన్, దివంగత హరిశంకర్ సింఘానియా 93వ జయంతిని పురస్కరించుకుని జేకేపూర్లోని జేకేపేపర్ మిల్లు ప్రాంగణంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. రాయగడ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరంలో మిల్లు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని మొత్తం 166 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. శిబిరాన్ని జేకేపేపర్ మిల్స్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ (వర్క్స్) వినయ్ ద్వివేది ప్రారంభించారు. కార్యక్రమంలొ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్) విశ్వజీత్ ద్వివేది, జనరల్ మేనేజరు (హెచ్ ఆర్ అండ్ డెవలప్మెంట్) సందీప్ పాండే, జేకే డిస్పెన్సరీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేవీ రావ్, డాక్టర్ కె.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రక్తసేకరణ ప్రక్రియను రాయగడ బ్లడ్ బ్యాంక్ వైద్య బృందం సమర్ధవంతంగా నిర్వహించింది. ఈ బృందంలో డాక్టర్ సుదీప్త కుమార్ రమ్, డాక్టర్ కె.నవీన్, ఉమాకాంత మిశ్రా, జగన్ రాజ్ పట్నాయక్, ఉషారాణి బెవురియా పాల్గొన్నారు. సామాజిక బాధ్యత, ప్రజా సంక్షేమం పట్ల జేకే పేపర్ మిల్స్కు ఉన్న నిబద్దద్ధను ఈ రక్తదాన శిబిరం మరోసారి చాటి చెప్పిందని వైస్ ప్రెసిడెంట్ వినయ్ ద్వివేది అన్నారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే మహోన్నత సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
ఊర్వశిది హత్యే
● ఆస్తి గొడవలతో హత్య చేసిన మరిది ● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులుసోంపేట: మండలంలోని గొల్లవూరు గ్రామంలో ఈనెల 18వ తేదీన పిన్నింటి ఊర్వశిని ఆస్తి గొడవల కారణంగా మరిదే హత్య చేసినట్లు కాశీబుగ్గ డీఎస్సీ టి.భవానీ వెల్లడించారు. సోంపేట సర్కిల్ పోలీస్స్టేషన్లో స్థానిక సీఐ బి.మంగరాజుతో కలిసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ టి.భవానీ మాట్లాడుతూ.. మందస మండలం రట్టి గ్రామానికి చెందిన గోకర్ల లోకనాథం తన రెండో కుమార్తె పిన్నింటి ఊర్వశి మృతిపై అనుమానం ఉందని బారువ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోకనాథం ఫిర్యాదు మేరకు బారువ ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేశారు. సోంపేట సీఐ బి.మంగరాజు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం జరిగిందన్నారు. మృతురాలి భర్త రాజారావుకు అన్న జయరాం, తమ్ముడు శివకుమార్ ఉన్నారు. రాజారావు కుటుంబానికి, మిగతా కుటుంబ సభ్యులకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. పెద్దల సమక్షంలో సమావేశాలు నిర్వహించినా మృతురాలి మరిది శివకుమార్ పెద్దల తీర్పునకు అంగీకరించలేదు. ఈ క్రమంలో మృతిరాలి భర్త మూడు నెలల క్రితం మృతి చెందాడు. అప్పటినుంచి ఆస్తుల గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల మృతురాలు ఊర్వశి భూ సమస్యల పరిష్కారం కోసం బావ జయరాం, మరిది శివకుమార్, తోటికోడలు పిన్నింటి యశోదకు లాయర్ నోటీసులు పంపించింది. అవి వారికి 17వ తేదీన అందాయి. దాడిచేసి హత్య నోటీసులు రావడంతో మృతురాలి మరిది శివకుమార్ కక్ష పెంచుకుని 18వ తేదీ ఉదయం మృతురాలిని ఏమైనా చేస్తానని గ్రామ పెద్దల వద్ద బెదిరించాడు. అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో మృతురాలి ఇంటి నుంచి కంగారుగా వస్తూ పారిపోయినందున శివకుమార్ను పోలీసులు అనుమానితుడిగా గుర్తించారు. 22వ తేదీన మందస మండలంలోని జిల్లుండి వద్ద శివకుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో 18 తేదీన ఉదయం 9.10 గంటల నుంచి 9.30 గంటల ప్రాంతంలో మృతురాలిపై దాడిచేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆమె మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో మంచంపై మృతదేహాన్ని వదిలి పారిపోయినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ముద్దాయి నుంచి నేరం చేసిన సమయంతో ధరించిన రక్తం మరకల దుస్తులు, ఉపయోగించిన స్కూటీ, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుండడం విశేషం. సమావేశంలో బారువ ఎస్ఐ ఎస్.హరిబాబు నాయుడు ఉన్నారు. -
ఉత్సాహంగా బిరిపాణి జాతర
జయపురం: జయపురం సమితి గొడొపొదర్లో సోమవారం బిరిపాణి జాతర వైభవంగా జరిగింది. బిరిపాణి జాతర వ్యవసాయానికి సంబంధించినది. ఈ జాతర ద్వారా వర్షాలు బాగా పడి పంటలు పండాలని వారు కోరుతారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వేలాదిమంది ఆదివాసీ ప్రజా సమూహంతో గ్రామ దేవతల సంబరం జరిగింది. గొడొపొదర్ గ్రామంలో బిరిపాణి జాతర అంగరంగ వైభవంగా దిశారీలు కలిసి జరిపారు. ముందుగా గ్రామ నడి బొడ్డున గల బిరిపాణి దేవి మందిరంలో వివిధ గ్రామ ప్రాంతాల నుంచి వచ్చిన అమ్మవార్ల లాఠీలను మందిరం వద్ద ఉంచి దేవికి కోళ్లు, మేకలు, గొర్రెలు బలి ఇచ్చి జాతర ప్రారంభించారు. ప్రతి ఇంటి వద్ద గ్రామ దేవతల లాఠీలకు పూజలు చేయగా అక్కడి నుంచి గ్రామానికి దూరంలోగల పర్వతంపైకి వెళ్లి పర్వతంపై గల కలుగు వద్ద దేవిని అధిష్టించి పూజలు చేసి.. కలుగులో చేయి పెట్టి ఆ కలుగులో ఉన్న నీటి మట్టాన్ని బట్టి వర్షపాతాన్ని అంచనా వేశారు. జాతరలో పాల్గొన్న భక్తులకు బిలం నుంచి వచ్చే నీటిని ఇస్తారు. ఆ నీటిని పొలాల్లో చల్లుతారు. బిరిపాణి దేవి సత్యమైన తల్లి అని జయపురం మహారాజుల కాలం నుంచి తమ గ్రామ ప్రజలు ఈ పండగ జరుపుతున్నారని గ్రామ పంచాయితీ సర్పంచ్, పూజారి వెల్లడించారు. -
పోక్సోపై అవగాహన
పర్లాకిమిడి: జిల్లా న్యాయసేవా ప్రాధికరణ అధికారి, జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహంతి ఆదేశానుసారం గుసాని సమితి గురండి గ్రామంలో ఉన్న శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాలలో సోమవారం పోక్సో, కిశోర న్యాయం, సీపీసీ, పోక్సోలో చట్టం అనుసారం బాధితులకు నష్టపరిహారం ఎలా లభిస్తుంది అనే విషయంపై డీఎల్ఎస్ఏ కార్యదర్శి బిమర్ రౌళో అవగాహన కల్పించారు. ఆయనతో పాటు జిల్లా సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్కుమార్ మిశ్రా కూడా పోక్సో కేసులో బాధితులకు న్యాయం చేయగలిగేలా చట్టాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ న్యాయ సేవా ప్రాధికరణ సదస్సులో గురండి అసిస్టెంటు బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి ఎన్.విమల్, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అలాగే మహిళా స్వశక్తీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల వివరాలు కూడా ప్రజలకు వివరించారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
జయపురం: రాష్ట్రంలో సీఎం మోహణ చంద్ర మఝి నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కార్ రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని కొట్పాట్ బీజేపీ ఎమ్మెల్యే రూపు బొత్ర అన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి కార్యాలయ సభాగృహంలో ‘వికాశర ధార, ఒడిశా సారా’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే రూపు భోత్ర ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్ల బీజేపీ పాలనలో అనేక అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత, గౌరవం ఇచ్చిందన్నారు. బొరిగుమ్మ సమితి అధ్యక్షురాలు దీప్తి మయీ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జయపురం ఎమ్మెల్యే ప్రతినిధి అశోక్ కుమార్ గంతాయిత్, కొరాపుట్ ఎంపీ ప్రతినిధి శ్రీనివాస రావు, బీడీఓ సుకాంత కుమార్ పట్నాయక్, సీడీపీఓ లక్ష్మీప్రియ మఝి, తదితరులు పాల్గొన్నారు. స్వయం సహాయ గ్రూపు మహిళలు, ఆరోగ్య, శిశు సంక్షేమ విభాగాలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఒడిశా జీవికా మిషన్ తరఫున మహిళలకు సహాయ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒడిశా జీవిక మిషన్ అధికారి దేవేంద్ర పండా, జీపీడీఓ స్వాగతిక గోపాల్, బీఎస్ఎస్ఓ చంద్రికా ఖండేల్కర్, తదితరులు పాల్గొన్నారు. -
● అర్ధరాత్రి మృత్యుకేళి
వజ్రపుకొత్తూరు: ఎప్పుడో తోడును కోల్పోయిన ఆ తల్లికి కొడుకు మాత్రమే ఆధారం.. కొడు కు సంపాదనే బతుకు బండిని నడిపిస్తోంది. ఒకే ఒక్క ప్రమాదం ఆ అమ్మను అనాథను చేసింది. ఒక రోజు కిందటే ఇంటికి వచ్చిన మరో యువకుడి భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేసి ఆ కుటుంబానికి శోకం మిగిల్చింది. ఉత్సవాలు చూద్దామని ఉత్సాహంగా వెళ్లిన ఆ ఇద్దరు యువకులు శవాలై ఇంటికి చేరారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం గోపీ నాథపురానికి చెందిన కర్ని తులసీరావు (కోదండరావు) (27), కొండవూరు పంచాయతీ గర్తంవానిపేటకు చెందిన గర్తం మణికంఠ(24) ఆదివారం రాత్రి మండలంలోని సైనూరులో జరుగుతున్న చింతలపోలమ్మ తల్లి ఉత్సవాలు చూద్దామని వెళ్లారు. రాత్రి అక్కడ పల్సర్ బైక్ ఝాన్సీ కార్యక్రమం జరగడంతో అది తిలకించి తిరిగి వస్తుండగా.. ఉద్దానం రామకృష్ణాపురం రహదారిలో పాతటెక్కలి వద్ద స్కూటీతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం రాత్రి సుమారు 12 నుంచి 2.30 గంటల సమ యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముళ్లపొదల్లో పడి ఉన్న యువకుల మృతదేహాలను సో మవారం తెల్లవారు జామున గుర్తించిన స్థానికులు వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబాల్లో కన్నీరు.. కోదండరావు తండ్రి మోహనరావు చాలా ఏళ్ల కిందట మృతి చెందగా తల్లి రాజేశ్వరి ఉన్నారు. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లే కోదండరావు మృతితో ఆ తల్లి గుండెలవిసేలా రోదించారు. మణికంఠ ఒక రోజు కిందటే నెల్లూరు నుంచి వచ్చాడు. అతడికి తల్లిదండ్రులు గంగాధర్, నీలవేణిలతో పాటు ఓ తమ్ముడు ఉన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్ ఇద్దరు యువకుల దుర్మరణం పెద్దమ్మ తల్లి ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘటన -
విస్తరణకు అంగీకారం
కొడింగమాలి బాకై ్సట్ గని ● స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తిరాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి కొడింగమాలి బాకై ్సట్ గనుల విస్తరణకు ఆ ప్రాంత వాసులు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. అయితే తమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని, గని యజమాన్యాన్ని కోరారు. ప్రస్తుతం 3.6 మిలియన్ టన్నులగా ఉన్న బాకై ్సట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.0 మిలియన్ టన్నులకు పెంచే ప్రతిపాదనపై ఆదివారం స్థానిక అశోక్ కళ్యాణ మండపలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. కాసీపూర్ సమితి పరిధిలోని పొడాపడి, బంకంబా గ్రామ పంచాయతీలకు చెందిన ఏడు గ్రామాల ప్రజలు సమావేశంలో పాల్గొన్నారు. గని విస్తరణకు అనుకూలంగా 26 మంది గ్రామస్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, మరో 23 మంది లిఖితపూర్వకంగా మద్దతు తెలియజేశారు. అలాగే కంసారిగుడ, పొడాపడి, కిందిరిపదర్, పుల్జబ, ఉపర్ కొడింగ, బంకంబా, బజర్గడ్ గ్రామాలకు చెందిన 500 మందికిపైగా ప్రజలు హాజరై గని విస్తరణకు సమ్మతించారు. అయితే గని విస్తరణతో పాటు తమ ప్రాంతంలో తాగునీరు, రహదారులు, పాఠశాలలు, వృధ్యాప్త భత్యాలు, వైద్య సదుపాయాలు మెరుగు పరచాలని గ్రామస్తులు కోరారు. స్థానిక యువతకు ఉద్యోగఅవకాశాలు కల్పించడంతో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొడింగమాలి బాకై ్సట్ గని కొరాపుట్ జిల్లాలోని లక్ష్మీపూర్, రాయగడ జిల్లాలొని కాసీపూర్ తహసీల్స్ పరిధుల్లోని 428.075 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఈ గనిలో వార్షిక ఉత్పత్తిని 3.6 మిలియన్ టన్నుల నుంచి 6.0 మిలియన్ టన్నులకు పెంచే ప్రతిపాదనపై ప్రజా విచారణ నిర్వహించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రాయగడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) నిహారి రంజన్ కుహరో అధ్యక్షత వహించగా, ప్రాంతీయ కాలుష్య నియంత్రణ శాఖ అధికారి అశోక్భొయ్ సమన్వయం చేశారు. గుణుపూర్ సబ్ కలెక్టర్ దిలీప్ దూదూల్ అభిషేక్, రాయగడ సబ్ కలెక్టర్ రమేష్ చంద్ర జెన్న తదితర అధికారులు హాజరయ్యారు. శాంతి భద్రతల దృష్ట్యా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నగదుతో పరారైన మహిళ అరెస్టు
పర్లాకిమిడి: అనేక ఆర్థిక మోసాలకు పాల్పడి పరారీలో ఉన్న మహిళ ఝిల్లీ సాహును శనివారం పర్లాకిమిడి ఆదర్శ ఠాణా పోలీసులు రాయగడ బ్లాక్లో ఆమె కన్నవారి ఇంట్లో అరెస్టు చేశారు. రెండేళ్లుగా ఈమె పర్లాకిమిడి, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలువురిని కలిసి అధిక వడ్డీలు ఇస్తామని లక్షలాది రూపాయలు తీసుకుని పరారైంది. ప్రాథమిక సమాచారం మేరకు 2023–24 సంవత్సరంలో ఆమె 25 మందిని మోసం చేసి 1.38 కోట్ల రూపాయల నగదుతో పాటు 500 గ్రాముల బంగారం, వెండి వస్తువులు కాజేసినట్టు ఆదర్శ పోలీసు ష్టేషన్ అధికారి ప్రశాంత భూపతి తెలియజేశారు. ఆర్ధిక మోసాలకు పాల్పడిన ఝిల్లి సాహు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఇతరుల బంగారం వస్తువులు కుదువపెట్టి డబ్బులు తీసుకున్నట్టు దర్యాప్తులో తేలినట్టు ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. ఝిల్లి సాహుతో పాటు భర్త ఉదయనాథ్ సాహు అక్కౌంట్లో రూ. 10 లక్షల లావేదేవీలు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. వారిపై పలు కేసులు పోలీసు స్టేషన్లో నమోదు అయ్యాయి. -
యువతిని రక్షించిన యువకుడు..!
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితిలో ఇటీవల పిల్లలను అపహరించే వారంటూ అనుమానంతో జరిగిన మూకుమ్మడి దాడి ఘటనలో బాధిత యువతిని రక్షించిన ఇంటాలిగుడ గ్రామానికి చెందిన పురుష సికక అనే ఆదివాసీ యువకుడు వెలుగులోకి వచ్చాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి యువతిని రక్షించిన ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో విడుదలైన వీడియోల్లో స్పష్టమైంది. ఆగ్రహంతో ఉన్న గుంపు యువతిపై దాడి చేస్తున్న సమయంలో సికక నేరుగా జన సమూహంలోకి వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. గుంపు దాడిలో యువతి దుస్తులు చించివేశారు. తన వద్ద ఉన్న తువ్వాలను ఆమైపె కప్పి మానవత్వాన్ని చాటుకున్నాడు. యువతిని రక్షించే క్రమంలో గుంపు తీవ్రంగా గాయపరిచినప్పటికీ అతను వెనుకాడకుండా ఆమెను సురక్షింతంగా బయటకు తీసుకువచ్చాడు. ఈ సమయంలో యువతి కొన్ని వస్తువులు కిందపడిపోవడంతో వాటిని ఏరుకునే ప్రక్రియలో మరో యువకుడు బలరామ్ బాగ్ ఆ యువతిని పోలీసు వాహనంలో కూర్చొబెట్టి తన టీ–షర్టును ఆమెకు అందించిన వీడియోలు సమాజిక మాధ్యమాల్లో కనిపించాయి. తనపై దాడి కారణంగా ఇప్పటికీ శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పురుష సకిక తెలిపాడు. సంఘటన జరిగిన రోజు ఇద్దరు స్వచ్ఛంధ సేవకులను ప్రశ్నిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు, సమీపంలోని ఒక డాబా వద్ద మద్యం సేవించిన యువకులు వారిపై దాడి చేయడంతో పరిస్థితి అదుపుతప్పిందన్నారు. పోలీసుల పాత్రపై ప్రశ్నలు ఈ ఘటన అనంతరం ఇంటాలిగుడ, సాయినగర్ తదితర పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన స్థలానికి కేవలం రెండు కిలో మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ, సమాచారం సకాలంలో పోలీసులకు అందలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సుమారు 500 మందికి పైగా గుంపు అక్కడకి చేరుకున్నప్పటికీ.. కళ్యాణసింగుపూర్ పోలీసుల స్పందన ఆలస్యమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన గంట తరువాత ఐఐసీ కల్పనా బెహర సంఘటన స్థలానికి చేరుకున్నారని, అప్పటికీ గుంపులోకి వెళ్లి పరిస్థితిని అదుపు చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెడ్ ప్లాగ్ కేసుగా గుర్తింపు ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ రాజ్ ప్రసాద్ ఈ కేసును రెడ్ ప్లాగ్ కేసుగా పరిగణలోకి తీసుకుంటున్నామని శనివారం రాత్రి విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఇప్పటికి 20 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసును రెడ్ ప్లాగ్గా పరిగణించాలని పోలీసులు ప్రతిపాదించగా.. క్రైం బ్రాంచ్ కూడా దర్యప్తులో సహకరిస్తుందన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన వారిపై ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. గ్రామస్తులు మాత్రం ఈ ఘటనలో పలువురు వ్యక్తుల ప్రమేయం ఉన్నప్పటికీ.. కేవలం ఇంటాలిగుడ గ్రామాన్నే లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయం
● 49,443 మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమరాయగడ: రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడత నిధుల విడుదల కార్యక్రమం శనివారం స్థానిక బిజుపట్నాయక్ ఆడిటోరియంలో నిర్వహించారు. పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతుల ఖాతాల్లో నిధులను జమచేశారు. ఈ కార్యక్రమాన్ని రాయగడలోని రైతులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. జిల్లా ప్రధాన వ్యవసాయ అధికారి ఎహెసాన్ షేక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ సమితులకు చెందిన రైతులు పాల్గొన్నారు. ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా వీక్షించిన రైతులు తమ ఖాతాల్లో నిధులు జమకావడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. పీఎం–కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి మూడు విడతలుగా రెండు వేల రుపాయల చొప్పున మొత్తం రూ.6 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్పర్ (డిబిటి) విధానంలో ఈ నిధులు జమ అవుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన వ్యవసాయ శాఖ అధికారి ఎహెసాన్ షేక్ మాట్లాడుతూ రాయగడ జిల్లాలో మొత్తం 49,443 మంది పీఎం–కిసాన్ లబ్ధిదారుల ఖాతాల్లో 23వ విడతగా రెండు వేల రుపాయలు చొప్పున జమ జరిగినట్లు తెలియజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 100 మంది లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
● అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్న భక్తులు ● సిబ్బంది చేతివాటంపై భక్తుల అసంతృప్తి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భానుసప్తమి పర్వదినం సందర్భంగా భక్తుల సందడి కనిపించింది. స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకబృందం రూ.300 వీఐపీ టికెట్లు కొనుగోలు భక్తులకు అంతరాలయ దర్శనాన్ని చేయించారు. ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ఏఈవో అప్పలనాయుడు ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించారు. సీఎంఆర్ గ్రూప్ యాజమాన్యం ఉచితంగా పరమాన్నం, పెసల -
రైతు బేజార్లు
ప్రజలకు తక్కువ ధరలకే కూరగాయలు అందించాలన్న ఉద్దేశంతో నేరుగా రైతుల ద్వారానే విక్రయాలు జరిపేందుకు పట్టణాల్లో ఏర్పాటు చేసిన రైతుబజార్లు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. అటు విక్రేతలతో పాటు ఇటు కొనుగోలుదారులు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రైతుబజారు ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతున్నా సదుపాయాలు మాత్రం కల్పించడం లేదు. ఆమదాలవలస మున్సిపాలిటీలో నిర్వహణ కొరవడి రైతుబజారు మూతపడింది. ఇక, పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో రైతుబజారు కలగానే మిగిలిపోయింది. ● మున్సిపాలిటీలో కూరగాయల కొనుగోలుకు తప్పని పాట్లు ● శ్రీకాకుళంలో ఆదాయం సమకూరుతున్నా కానరాని సౌకర్యాలు ● ఆమదాలవలసలో ఆదరణ లేక మూసివేత ● పలాసలో ప్రతిపాదనలకే పరిమితం ● ఇచ్ఛాపురంలో డైలీ మార్కెట్లోనే విక్రయాలు ఆదాయం ఫుల్..అభివృద్ధి నిల్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా కేంద్రంలోని రైతు బజారులో మొత్తం 96 షాపులున్నాయి. అందులో సుమారు 25 వరకు అద్దెలు వచ్చే షాపులున్నాయి. వాటి ద్వారా ప్రతి నెలా రూ.1,73,640 సొమ్ము అద్దె రూపేనా వస్తోంది. ఏటా సుమారు రూ.20లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుంది. ఇంత మొత్తం వస్తున్నా ప్రభుత్వం రైతు బజారులో సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. సరైన సదుపాయాలు లేక ఇప్పటికే సగానికి పైగా షాపులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం రెండు గేట్లకు ఎదురుగా ఉండే 20 షాపుల్లోనే పూర్తిస్థాయిలో కూరగాయలు అమ్మకాలు జరగుతున్నాయి. మిగిలిన షాపుల యజమానులకు వ్యాపారాలు లేక అసలు దుకాణాలే తియ్యడం లేదు. కనీస సౌకర్యాలు కరువు.. రైతుబజారులో వ్యాపారుల నుంచి అద్దెలు వసూలు చేస్తున్నప్పుడు వారికి కావాల్సిన కనీస -
జాతీయ పెన్కాక్ సిలాట్ పోటీలకు ఎంపిక
టెక్కలి: నాసిక్లో ఈ నెల 26 నుంచి 28 వరకు జరగనున్న జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్ మార్షల్ ఆర్ట్స్ పోటీలకు కోటబొమ్మాళి గౌతమ్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు ఎంపికై నట్లు కోచ్ సామ గౌతమ్ ఆదివారం తెలిపారు. ముంగి అర్జున్, గొండు భవి భాస్కర్నాయుడు తదితరులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. వీరిని అసోసియేషన్ ప్రతినిధులు ఆర్.దయామయ, ఎన్.లక్ష్మణ్నాయుడు, ఎం.గౌతమి అభినందించారు. వైన్షాపులో చోరీ హిరమండలం: మేజర్ పంచాయతీ హిరమండలంలో ఎస్బీ వైన్ షాపులో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షాపులోకి ప్రవేశించి రూ.2.30 లక్షల నగదు దోచుకుపోయారు. ఉదయం సిబ్బంది వచ్చి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న హిరమండలం పోలీసులు, క్లూస్టీమ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. హెచ్సీ సర్వేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను ఢీకొన్న బైక్ రణస్థలం: లావేరు మండలం రావివలస సమీపంలో ఆదివారం ఉదయం ఆటోను ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న షేక్ షాయిబ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో రణస్థలం సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బైక్లో ఉన్న గొర్రె చర్మాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కాంప్లెక్స్ కిటకిట శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు, పలువురు ప్రయాణికులతో కాంప్లెక్స్ కళకళలాడింది. సరిపడా బస్సులు లేక నిరీక్షణ తప్పలేదు. బస్లు ఫుట్పాత్ వద్దకు చేరుకున్న వెంటనే సీట్ల కోసం ఎగబడ్డారు. మాస్టార్లూ..అభినందనలు.. మందస: మందస మండల కేంద్రంలోని శ్రీ రాజా శ్రీనివాస స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తమ పిల్లలను కూ డా అదే బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారని ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు అన్నారు. తోటి ఉపాధ్యాయులు డి.నాగేశ్వరరావు, జ్ఞానేశ్వర్ గౌడ, డి.ఢిల్లీ, అరుణ్కుమార్ పాడి, కిషోర్గౌడ్లు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించడం మిగిలిన వారికీ స్ఫూర్తిగా ఉంటుందని అభినందించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యా బోధన అందుతుందని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి రణస్థలం: గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట(నదీ ప్రవాహం)లో పోతిరెడ్డి మురళి(24) అనే యువకుడు సరదాగా ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో స్వగ్రామం లావేరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళి హైదరాబాద్లోని విప్రో కంపెనీలో సాఫ్ట్వేరు ఇంజినీర్గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడి సోదరికి నీట్ పరీక్ష కేంద్రాన్ని విజయవాడలో కేటాయించారు. దీంతో ముగ్గురూ విజయవాడ వచ్చాడు. ఆదివారం ఆమె పరీక్ష రాసేందుకు వెళ్లగా.. పక్కనే కరకట్టలో ఈత కొట్టేందుకు మురళి దిగాడు. ప్రమాదవశాత్తు మునిగిపోయి చనిపోయాడు. స్థానికులు గమనించి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో స్వగ్రామం లావేరులో విషాదఛాయలు అలముకున్నాయి. మురళి తండ్రి వెంకటరమణ ఉప్పు వ్యాపారం చేస్తుంటారు. తల్లి సరళ గృహిణి. సోదరి ప్రసన్నకు వివాహం నిశ్చయమైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ బయలుదేరి వెళ్లారు. -
అంతర్జాతీయ యోగా దినోత్సవం
మల్కన్గిరి: మల్కన్గిరిలో జిల్లా పరిపాలన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో యోగా మహోత్సవ సమితి ఒడిశా సహకారంతో స్థానీక బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిధిగా మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కామి హాజరయ్యారు. కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే కూడా పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా దోహదపడుతుందని వక్తలు తెలిపారు. జయపురంలోని సంస్థల ఆధ్వర్యంలో.. జయపురం: జయపురంలో పలు సంస్థలు అంతర్జాతీయ యోగా దినోత్సవాలను నిర్వహించాయి. వాటిలో సోషియల్ ఎన్విరాన్మెంటల్, ఎడ్యుకేషనల్, వెల్ఫేర్ అసోషియేషన్(సీవా)సభ్యులు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బిజూ స్మృతి కమిటీ వారు బిజూ భవణంలో యోగా శిబిరం నిర్వహించారు. స్థానిక పతంజలి యోగా సంస్థ వారు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించారు. జయపురం జిల్లా న్యాయ స్థానం ప్రాంగణంలో కొరాపుట్ జిల్లా జడ్జి ప్రదీప్ కుమార్ మహంతి పర్యవేక్షణలో అన్ని కోర్టుల జడ్జిలు న్యాయవాదులు కోర్టుల సిబ్బంది పాల్గొని యోగా చేశారు. జయపురంలో.. జయపురం: తెలుగు సాంస్కృతిక సమితి వారు జయపురం సిటీ ఉన్నత పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయురాలు రీటా సామంతరాయ్ పర్యవేక్షణలో జరిగిన యోగా శిబిరంలో ఆమె యోగా గురించి వివరించారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొని యోగాభ్యాసం చేశారు. గజపతి జిల్లాలో.. పర్లాకిమిడి: పర్లాకిమిడి గజపతి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉదయం అధికారులు ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. యోగా చేయడం అలవర్చుకోండి... ఆరోగ్యంగా ఉండండి.. కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ అన్నారు. ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి దయామయ పాఢి, జిల్లాముఖ్య అటవీ శాఖా అధికారి కె.నాగరాజు, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా చెలిగడకు చెందిన యోగా భ్యసకులు లోకనాథ్ దండసేన, పతంజలి యోగా సమితి సభ్యులు సురేంద్ర రథ్, మహిళా యోగా శిక్షకులు ఆశాలతా అమ్మన్న, సి.సి.డి. సంస్థ ఎ.జగన్నాధ రాజులు పాల్గొన్నారు. చంద్రగిరి వద్ద జిరంగో టిబెటియన్ మానాస్ట్రీ వద్ద బౌధ్ధ మందిరం వద్ద యోగా దినోత్సవం జరుపుకున్నారు. రాయగడలో.. రాయగడ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని స్థానిక అంబాగుడలో గల బిజుపట్నాయక్ ఇండోర్ స్టేడియంలొ జిల్లా యంత్రాంగం ,క్రీడా శాఖ సంయుక్తంగా నిర్వహించిన యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, గౌరవ అతిథిగా ఎస్డీసీ ఉపాధ్యక్షురాలు మంజుల మినియాక, జిల్లా క్రీడాధికారి షేక్ ఆలీనూర్, జిల్లా సమాచార, ప్రజాసంబంధాల శాఖ అధికారి దేవరాజ్ టక్రీ తదితరులు హాజరయ్యారు. వారు యోగా ప్రాముఖ్యతను వివరించారు. -
ఎలుగు మృతి కేసులో ఐదుగురు అరెస్టు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి అటవీ శాఖ పరిధిలో గల డైగూడా గ్రామం జూన్ 18 న ఒక ఎలుగుబంటి వాహనాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. స్థానికులు దాన్ని రాళ్లతో కొట్టారు. అటవీ శాఖ వారు ఎలుగును పట్టుకుని చికిత్సకు తరలించగా శనివారం మృతి చెందింది. దీంతో దానికి పోస్టుమార్టం నిర్వహించగా.. రాళ్ల దెబ్బలతో మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జిల్లా అటవీ శాఖ అధికారి సాయి కిరణ్ వీడియో ఫుటేజ్ల ఆధారంగా రాళ్లతో కొట్టిన ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి పై కేసు నమోదు చేశారు. పేరుకుపోయిన చెత్త.. పర్లాకిమిడి: పర్లాకిమిడి సరిహద్దులోని పాతపట్నం మహేంద్ర తనయ నది బ్యారేజ్ వద్ద పాతపట్నం మండల పారిశుద్ధ్యశాఖ ప్రతిరోజూ చెత్తను పారబోస్తుండంతో పాతపట్నం, పర్లాకిమిడికి రాకపోకలు సాగిస్తున్న పాదచారులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఒకపక్క వంతెన దిగువన శ్మశానం వచ్చే దుర్ఘంధం, ఆవలి వైపు పాతపట్నం ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఉన్నాయి. ప్రజాఫిర్యాదుల మేరకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం పాతపట్నం, పర్లాకిమిడి మధ్య ఉన్న మహేంద్రతనయ నది వద్ద పేరుకుపోతున్న చెత్తపై పురపాలక సంఘం ఈఓ లక్ష్మణ ముర్ముకు చూపించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శ్రీకాకుళం మున్సిపల్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే రూపేష్ ఫోన్ చేసి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రగతి మహిళా సంఘటన్ ఆధ్వర్యంలో పితృ దినోత్సవం పర్లాకిమిడి: బిడ్డల పెంపకంలో తల్లి సాంగత్యం ఎటువంటిదో, ఉన్నత చదువులు చదివించి విద్యాబుధ్ధులు నేర్పించే తండ్రి కూడా అంతే బాధ్యత వహిస్తాడని దయామయ పాఢి అన్నారు. స్థానిక మహారాజా ప్యాలస్లో యుటెక్ కంప్యూటర్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జిల్లా పరిషత్ సీడీఓ దయామయ పాఢి విచ్చేసి అంతర్జాతీయ పితృదినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాల రీడర్ కమల్ సిఖా మల్లిక్, ముఖ్యవక్తగా ఇతిశ్రీ మహాపాత్రో, గౌరవ అతిథిగా విశ్రాంత బ్యాంకు అధికారి హారిమోహాన్ పట్నాయిక్ విచ్చేయగా, ప్రగతి మహిళా సంఘటన్ కార్యదర్శి తనూజా శథపతి, లోకనాథ్ మిశ్రా ఆధ్వర్యంలో జరిగింది. వృధ్ధాప్యంలో తండ్రిని చూసుకునే బాధ్యత మగబిడ్డలు కంటే..ఆడపిల్లలే ఎక్కువగా వారి ఆరోగ్యంపై శ్రధ్ధ వహిస్తారని జిల్లా పరిషత్ అధికారి దయామయా పాఢి అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు -
355 మందికి వైద్య పరీక్షలు
రాయగడ: సదరు సమితి కొత్తపేటలో కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం జరిగింది. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు అంధవరపు గౌరి శంకర్, పవన్ సేనాపతి హాజరై 355 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కొత్తపేట పరిసర ప్రాంతాల్లో గల వివిధ గ్రామాల నుంచి ప్రజలు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన వైద్య శిబిరం సాయంత్రం వరకు కొనసాగింది. కొత్తపేట కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడు కొత్తకొట శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగా ఆవిర్భవించిన ఈ సంఘం ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు కొరపాన శ్రీనివాస్రావు, కార్యదర్శి పెద్దిన నాగేశ్వరరావు, సహకార్యదర్శి మద్ది సురేష్ కుమార్, పెద్దిన మురళి, తదితరులు సహకరించారని శ్రీధర్ తెలియజేశారు. -
ఆదరణ కరువై..
ఆమదాలవలస: సుమారు రెండున్నర దశాబ్దాల కిందట ఆమదాలవలసలో బస్టాండ్ సమీపంలో రైతుబజార్ ఏర్పాటు చేశారు. తాజా కూరగాయలు లభించడంతో ప్రారంభంలో బాగానే కొనుగోళ్లు జరిగాయి. తర్వాత ప్రధాన రహదారిపై కొంతదరు వ్యాపారులు కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే అమ్మకాలు జరపడంతో రైతుబజారుకు వెళ్లే వారు కరువయ్యారు. క్రమంగా ఆదరణ కరువైంది. తొలుత 28 దుకాణాలతో ప్రారంభమైనా.. ఇప్పు ఒక్క దుకాణం కూడా తెరుచుకోక పూర్తిగా మూతపడింది. 2015లో కొంతభాగం అన్న క్యాంటీన్కు కేటాయించడంతో మిగిలిన దుకాణాలు మూతపడ్డాయి. రైతుబజారుకు నిధులు కేటాయించి పున:ప్రారంభిస్తే బాగుంటుందని రైతులు, పట్టణవాసులు కోరుతున్నారు. -
కళింగాంధ్ర తొలి దళిత ఆత్మఘోష ‘ఈర్నం’
శ్రీకాకుళం కల్చరల్ : ‘తెలుగు సాహిత్యరంగానికి నాయకత్వం వహించే స్థాయిలో కళింగాంధ్ర ఉంది. దళిత కవితాత్వికతలో చాలా వెలితి కన్పించేది. కలమట దాసు బాబు తాజాగా రచించిన ‘ఈర్నం’ చదివిన తర్వాత అది భర్తీ చేసే తరం ప్రారంభమైందన్న సంతృప్తి కలిగింది’ అని ప్రముఖ కవి, విమర్శకుడు గుంటూరు లక్ష్మీనరసయ్య అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో శ్రీకాకుళ సాహితీ, సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో ఈర్నం కవితా సంకలనం ఆవిష్కరించారు. పుస్తక ప్రచురణ బాధ్యత స్వీకరించిన చిగురుపల్లి చంద్రకళ స్మారక వేదిక చైర్మన్ సీహెచ్.ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు సంకలనాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఈ కవితా సంపుటిపై ప్రముఖ కవి బాల సుధాకర్ ‘దళిత కళింగం’ పేరుతో రచించిన పరిశీలనాత్మక వ్యాసాన్ని ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో దాసరి రామచంద్రరావు (కథా నిలయం), చీకటి దివాకర్, కె.శ్రీనివాస్ (సాహితీ స్రవంతి), అల్లాడ లక్ష్మి (ఐద్వా), నల్లి ధర్మారావు, సిరికి స్వామినాయుడు (అరసం), పక్కి రవీంద్రనాథ్ (స్నేహ కళా సాహితి, పార్వతీపురం), పి.వి.నరసింహులు( విశ్వసాహితి, ఆమదాలవలస), అల్టి మోహనరావు (రాజాం రచయితల వేదిక) తదితరులు పాల్గొన్నారు. -
కేరళలో వలస కార్మికుని దారుణహత్య
● మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తిరాయగడ: ఉపాధి కోసం కేరళకు వెళ్లిన జిల్లాకు చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్తులను విషాదంలోకి ముంచెత్తింది. మృతుడు జిల్లాలోని కాసీపూర్ సమితి దొరాగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డొంగాసిలి గ్రామానికి చెందిన ధనపతి నాయక్ (28)గా గుర్తించారు. అందిన సమాచారం మేరకు.. ధనపతి నాయక్ సుమారు ఐదు సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ నగరంలో ఏంజీ రోడ్డు వద్ద ఉన్న ఓ రెస్టారెంట్లో పనిచేస్తూ జీవననం సాగిస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఉపాధి కోసం స్వగ్రామాన్ని విడిచి కేరళకు వెళ్లాడు. ఈ నెల 18వ తేదీన విధులకు సెలవు తీసుకుని స్నేహితులతో కలసి బయటకు వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అసోంకు చెందిన కొందరు యువకులతో పాటు ఒడిశాకు చెందిన మరికొందరు యువకులు, యువతులు కలిసి ధనపతిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ధనపతి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనపై త్రిసూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్కడి ఆస్పత్రిలో భద్రపరిచారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. ఈ విషాద సమాచారం డొంగాసిలి గ్రామానికి చేరడంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది. ధనపతి కుటుంబం తీవ్రఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో కేరళ నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడం తమవల్ల కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు జిల్లా పరిపాలన, కార్మిక శాఖ అధికారులు సహకరించాలని కుటుంబ సభ్యులు, గ్రామవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలాఉండగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కార్మిక శాఖ అధికారులు ధనపతి పనిచేసిన రెస్టారెంట్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. ప్రత్యేక ఆంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కార్మిక శాఖ అధికారి రవీంద్రనాధ్ త్రిపాఠి తెలిపారు. -
నాలుగు కేసుల్లో నిందితుల అరెస్టు
జయపురం: జయపురం పట్టణ పోలీసులు పట్టణంలో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్డివిజనల్ పోలీసు అధికారి(ఎస్.డి.పి.ఓ)అర్చిత మిత్తల్ ఆదివారం పత్రికాల వారికి వెల్లడించారు. జయపురం పట్టణంలో దేవాలయాలలోను, వ్యాపార సంస్థలు విద్యాలయాలు మొదలగు ప్రాంతాలలో ఇటీవల జరిగిన దొంగతనాలకు సంబంధించి నిందితులను అరెస్టు చేసినట్లు ఆమె వెల్లడించారు. అరెస్టయిన నిందితులు స్థానిక ఒడియ మేదరి వీది రింకు బాగ్(20)గోపబందునగర్ నివాసి రవీంధ్ర బాగ్(32) లు వెల్లడించారు. స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ హాస్టల్లో, ఇనుప మంచాలు, చెక్క కుర్చీలు, ప్లాస్టిక్ కుర్చీలతో పాటు ఒక ఆటోను సీజ్ చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. స్థానిక విక్రమ దేవ్ విశ్వవిద్యాలయ హాస్టల్ నుంచి దొంగతనం చేసిన కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా బంకేశ్వర మహాదేవ్ మందిరం, గోపీనాధ్ మందిరాల్లో హుండీలను పగులగొట్టి డబ్బు, రెండు వెండి కిరీటాలను దొంగిలించిన కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నగదు, దొంగిలించిన సామానులు స్వాధీన పరచుకున్నట్లు పోలీసు అథాకారి వెల్లడించారు. స్థానిక మహాత్మాగాంధీ జంక్షన్లో ఒక స్పేర్ పార్ట్స్ దుకాణంలో దొంగతనం చేసిన ఇద్దరు మైనర్ బాలురును అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి వారు దొంగిలించిన నగదు, ఒక కేష్ టోకెన్ను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. అలాగనే జయపురం కెనాల్ రోడ్డులో ఒక దుకాణం నుంచి దొంగిలించిన రూ.6 లక్షల85 వేలలో ఇద్దరు నిందితుల వద్ద నుంచి రూ.2 లక్షల 75 వేల 500 లు స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్ బాలురనివారిని అరెస్టు చేసినట్లు ఎస్డీపీఓ వెల్లడించారు. -
కాగితాలకే పరిమితం..
సౌకర్యాలు కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కంప్యూటర్ కాటాలకు చార్జింగ్ పెట్టుకునేందుకు ప్లగ్పిన్లు కూడా లేవు. ఫ్యాన్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు షాపులకు ఒక లైటుతో చాలీచాలనీ విద్యుత్ కాంతితో చీకటిపడితే వ్యాపారాలు చేయలేని పరిస్థితి. మరుగుదొడ్ల పరిస్థితి మరింత దారుణం. పురుషులకు ఆరు మరుగుదొడ్లకు గాను రెండు మాత్రమే తెరిచి ఉన్నాయి. మహిళల మరుగుదొడ్లదీ అదే పరిస్థితి. చినుకుపడితే చెరువే.. రైతుబజారును ఎత్తుచేయాలని, మార్కెట్ మధ్యలో నిలిచిపోయిన వర్షం నీరు బయటకు వెళ్లేలా చేయాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో పలుమార్లు నిధులు మంజూరు చేయడం..అరకొర పనులు చేసి నిధులు స్వాహా చేయడం వంటివి చేస్తున్నారు. గతంలో రైతుబజారు ఆధునికీకరణ పేకట సుమారు రూ.40లక్షలు నిధులు ఖర్చుచేసి నాణ్యతలేని పనులు చేసి మమా అనిపించేశారు. దీంతో కొద్దిపాటి వర్షం కురిసినా రైతుబజారులోకి వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతుబజారు అభివృద్ధిపై దృష్టి సారించాలని రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు కోరుతున్నారు -
● ఉజ్వల్ గ్యాస్ సిలిండర్ల రాయితీలో కోత ● ఇకపై నాలుగు సిలిండర్లకే సబ్సిడీ ● అదనపు సిలిండర్లకు పూర్తి పైకం చెల్లించాల్సిందే
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేద, మధ్య తరగతి కుటుంబాలు వంట చెరకు కష్టాల నుంచి విముక్తి పొందాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల్ గ్యాస్ రాయితీ పథకంలో మార్పులు చేపట్టారు. ఇప్పటి వరకు ఏటా తొమ్మిది సిలిండర్ల రాయితీ ధరపై అందించేవారు. ఆ భారం కేంద్ర ప్రభుత్వం భరించేది. ఇకపై రాయితీ సిలిండర్లను నాలుగు మాత్రమే తీసుకోవాలని, అదనంగా కావాలంటే అదనపు మొత్తం చెల్లించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేద, మధ్య తరగతికి చెందిన ఉజ్వల గ్యాస్ వినియోగదారులు ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. ఇటీవల పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలు, ఇతర ఆర్థికపరమైన కారణాల వలన రాయితీ సిలిండర్లు తగ్గించినట్టు ప్రభుత్వం పేర్కొంటుంది. ఇప్పటి వరకు ఉజ్వల పథకం వినియోగదారులు మొదట్లో ఏడాదికి 12 సిలిండర్లు వరకు రాయితీ పొందేవారు. తర్వాత ఆ సంఖ్యను తొమ్మిదికి తగ్గించారు. తాజాగా 4 సిలిండర్లకు కుదించడంతో వినియోగదారులపై భారం పడనుంది. ఒక్కో సిలిండర్ రాయితీ రూ.300 చొప్పున ఏటా రూ.3600 అందాల్సిన ప్రయోజనం ఇకపై రూ.1200 మాత్రమే దక్కనుంది. మరీ నాలుగేనా? ఉజ్వల పథకం గ్యాస్ కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి సగటున ఎనిమిది, అంతకంటే ఎక్కువ సిలిండర్లు అవసరమవుతాయి. కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఇందులో నాలుగింటికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది. మిగిలిన నాలుగు సిలిండర్లుకు పూర్తి మొత్తం చెల్లించాల్సిందే. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.968.50 ఉంది. ఈ లెక్కన వినియోగదారులపై భారీగా భారం పడనుంది. కొత్త కనెక్షన్లు నిల్.. ఉజ్వల పథకంలో కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడం లేదు. గతంలో ఈ పథకం కింద పేద, మధ్య తరగతి కుటుంబాల వారు తెలుపు రేషన్ కార్డు ద్వారా దరఖాస్తు చేసుకొంటే వెంటనే మంజూరు చేసేవారు. ప్రస్తుతం ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రభుత్వం ఉజ్వల పథకం గ్యాస్ సిలిండర్లపై రాయితీని కుదించడం అన్యాయం. పేదలందరూ గ్యాస్ వినియోగించునే లక్ష్యంతో గతంలో ప్రభుత్వమే ఈ పథకాన్ని తీసుకొచ్చి.. ఇప్పుడు కోత విధించడం తగదు. ఉన్నత లక్ష్యంతో తీసుకొచ్చిన పథకాన్ని నిర్వీర్యం చేయడం తగదు. – బి.వి.రమణ, గ్యాస్ వినియోగదారుడు, శ్రీకాకుళం ఉజ్వల పథకం వినియోగదారులకు ఏడాదికి 4 సిలిండర్లు వరకు మాత్రమే రాయితీ వర్తించేలా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. అంతకంటే ఎక్కువ సిలిండర్లు వినియోగించే వారు పూర్తి మొత్తం చెల్లించాలి. అటువంటి వాటికి రాయితీ వర్తించదు. – జి.సూర్యప్రకాశరావు, డీఎస్వో -
రెండేళ్లలో ఎన్నో విజయాలు సాధించాం
కొరాపుట్: గత రెండేళ్ల పాలనలో ఎన్నో విజయాలు సాధించామని నబరంగ్పూర్ జిల్లా ప్లానింగ్ బోర్డు చైర్మన్, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పేర్కొన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ రెండేళ్ల పాలనలో విజయాలపై వికసిత్ భారత్–వికసిత్ ఒడిశా కార్యక్రమం శనివారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో వికసిత్ భారత్, వికసిత్ ఒడిశా సాధ్యమైందన్నారు. ఆర్థిక, వైద్య, సంక్షేమ, విద్యా రంగాల్లో ఘననీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. మారుముల గిరిజన గ్రామాలకు కూడా అభివృద్ధి చేరిందని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు అవార్డులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో జొరిగాం ఎమ్మెల్యే నర్సింగ్ బోత్ర, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, జెడ్పీ చైర్మన్ సస్మిత మెలక, కలెక్టర్ సత్యవాన్ మహాజన్, కోట్పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పథకాలు అందజేత రాయగడ: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సదరు సమితి కార్యాలయంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా లబ్ధిదారులకు పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు శనివారం అందజేశారు. మహిళా సాధికారత, ఆరోగ్యం, ఆహార భద్రత, స్వయం ఉపాధి, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి సంబంధించిన అనేక పథకాల కింద సహాయాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ప్రత్యేక అభివృద్ధి మండలి ఉపాధ్యాక్షురాలు మంజుల మినియాక, సమితి ఉపాధ్యాక్షుడు హరప్రసాద్ హెప్రుక, మాజీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్, బీడీవో సుజిత్ కుమార్ మిశ్రో, సీడీపీవో పానమణి హంసద, ఏబీడీ కాలు చరణ్ నాయక్, పశుసంవర్ధక శాఖ అధికారి సుబ్రత్ దాస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు సెల్ఫోన్లు అందజేశారు. అదేవిధంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 40 మందికి అంత్యోదయ అన్న యోజన పథకం కింద రేషన్ కార్డులు అందజేశారు. అలాగే మరికొందరికి పథకాలు అందజేశారు. -
స్వచ్ఛంద సేవకులపై దాడి అమానుషం
రాయగడ: వాస్తవాలు తెలుసుకోకుండా పిల్లల్ని ఎత్తుకెళ్లేవారని అనుమానించి ఇద్దరు యువతీ, యువకులపై దాడి చేసిన ఘటన అమానుషమని ఎస్పీ రాజ్ ప్రసాద్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించి శనివారం రాత్రి స్థానిక డీపీవో కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఘటనను చాలా సెన్సేషన్గా పరిగణలోకి తీసుకుని స్వయంగా తానే దర్యాప్తు చేస్తున్నానని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఇప్పటికే 20 మందిని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని చెప్పారు. ఘటనలో భాగంగా యువతిపై దాడి చేసే సమయంలో తీసిన వీడియోలు వైరల్ అయ్యిందని అన్నారు. యువతిపై దాడి చేసే సమయంలో ఆమైపె కొందరు అమానుషంగా ప్రవర్తించి మహిళ అని చూడకుండా, వివస్త్రను చేసే విధంగా వీడియోలు ప్రచారం కావడం చాలా విచారకరమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం చట్టపరమైన నేరమని హెచ్చరించారు. దీనిపై సైబర్ క్రైం శాఖ సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇటువంటి తరహా వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ కేసులో నిందితులుగా ఉండే ఎవరినీ విడిచిపెట్టేది లేదని, వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని తెలిపారు. -
యోగాతో ఆరోగ్యకర సమాజం
శ్రీకాకుళం కల్చరల్: ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాసనాలను జీవితంలో భాగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు అన్నాదొరై పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కార్గిల్ పార్కులో గిరిజన సంక్షేమ శాఖ, ఏపీఈపీడీసీఎల్ శాఖల ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ సమన్వయంతో ప్రత్యేక యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జీఎన్ ప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం యోగాసనాలు సాధన చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటుందన్నారు. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్రాజ్ రాణా మాట్లాడుతూ రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో యోగా, ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సునీల్కుమార్ అరెస్టు అక్రమం
కంచిలి : మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు, బీసీ యువ నాయకుడు సునీల్ను అక్రమంగా అరెస్టు చేయడం తగదని ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆరోపించారు. కంచిలిలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం శోచనీయమన్నారు. కారుమూరి సునీల్కుమార్ను అరెస్ట్ చేయటం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి వైఎస్సార్ సీపీ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యం విక్రయాలు పారదర్శకంగానే జరిగాయని చెప్పారు. 2014–19 మధ్య కాలంలో రాష్ట్రంలో అంతులేని మద్యం అక్రమాలు జరిగాయని, వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రస్తుతం లేని మద్యం స్కామ్ సృష్టించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ లాకప్డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య, డీఎస్సీ–25లో అంతులేని అక్రమాలు, అవినీతి, అమరావతిలో వేలాది మంది రైతుల్లో వ్యతిరేకత, ఆక్వా రైతుల ఉద్యమాలు.. ఇలా టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు నీచ రాజకీయాలకు తెగబడ్డారని మండిపడ్డారు. టీడీపీ అక్రమ అరెస్టులు ఆపకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ నేతలు రామదాసు తదితరులు పాల్గొన్నారు. -
34 బెల్టుషాపులపై కేసులు
● 40.32 లీటర్ల అనధికార మద్యంసీజ్ ● బహిరంగంగా మద్యం సేవిస్తున్న 9 మందిపై కేసులు శ్రీకాకుళం క్రైమ్ : సాక్షి దినపత్రికలో ఈ నెల 19న వచ్చిన ‘నేతలు.. మేతలు’ కథనానికి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ యంత్రాగం స్పందించింది. మద్యం ఎమ్మార్పీపై అదనపు వసూలు, బెల్టుషాపుల్లో విక్రయాలు, అడుగడుగునా అక్రమ మద్యం, అక్రమ వసూళ్లు, నేతలు దర్జాగా దోచేస్తున్న వైనంపై శనివారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా 34 బెల్టుషాపులపై ఎకై ్సజ్ శాఖ కేసులు నమోదు చేశారు. 40.32 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న 9 మందిపై కేసులు నమోదు చేశారు. నెలాఖారువరకు స్పెషల్ డ్రైవ్.. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశాలతో ఈ నెలాఖరు వరకు అనధికార మద్యం అమ్మకాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్రెడ్డిత తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు పర్యవేక్షణలో జిల్లా ఎకై ్సజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ జరుగుతుందన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలకు ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా చర్చలు, సమావేశాలు, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. -
30 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయ త్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. మహారాష్ట్ర అహిల్యనగర్ జిల్లా, జామ్ఖేద్ కి చెందిన శంకర్ చంద్రకాంత్ పవార్, నవీముంబై థా నే జిల్లా, భుతవాలీగామ్ కి చెందిన సునీత విజయ్ కాలే అనే మహిళ ఇద్దరూ కలసి లగేజి బ్యాగ్లతో ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కి వస్తుండగా తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి ఆర్థి క పరిస్థితి బాగులేకపోవడంతో ముంబైలో గంజా యి వ్యాపారం చేసే దీపక్ అశోక్ పవార్ అనే వ్యక్తిని ఆశ్రయించారు. ఒడిశా నుంచి గంజాయి వ్యాపారి సూచించిన వ్యక్తి వద్ద నుంచి గంజాయి తీసుకొచ్చి తనకి అందజేస్తే తీసుకొచ్చిన ప్రతి సారి రూ.10 వేలు ఇస్తానన్నాడు. దీనికి నిందితులు ఇద్దరూ అంగీకరించి ఒడిశాలో మార్షల్ లిమ్మా అలియాస్ రాజే ష్ వద్ద నుంచి గంజాయిని తీసుకెళ్లి ఇప్పటికే మూ డు సార్లు గంజాయి వ్యాపారికి అందజేశారు. ఇదే క్రమంలో ఈనెల 12 వ తేదీన గంజాయి కోసం విశాఖపట్టణం చేరుకున్నారు. అక్కడి నుంచి గంజా యి సరఫరా చేసే వ్యక్తికి ఫోన్ చేయగా బరంపురంలో పోలీసులు తనిఖీలు ఎక్కువగా ఉన్నాయని 20 వ తేదీన ఇచ్ఛాపురంలో ఉంటే అక్కడికి తీసు కొచ్చి సరుకు అందజేస్తానని చెప్పాడు. దీనికి వీరు విశాఖపట్టణంలో ఐదు రోజులు ఉండి అక్కడి నుంచి బ రంపురం చేరుకున్నారు. బరంపురంలో రెండు రోజులు బస చేసి శనివారం ఇచ్ఛాపురం చేరుకున్నా రు. వీరు గంజాయి సరఫరా చేసే వ్యక్తి రాజేష్కి ఫో న్ చేయగా ఉదయం ఒక లగేజి బ్యాగ్, రెండు చేతి బ్యాగ్లతో 30.600 కిలోల గంజాయిని ఎల్సీగేట్ వద్ద అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీరిద్ద రూ లగేజ్తో రైల్వేస్టేషన్కి వస్తుండగా పట్టణ పోలీసులకు తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు సెల్ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
పారదర్శక ఓటరు జాబితా లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)–2026 కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు ఇంటింటా సర్వేలు చేసి కచ్చితమైన ఓటరు జాబితా రూపొందించేందుకు కృషి చేయాలని శ్రీకాకుళం రెవెన్యూ డివిజినల్ అధికారి కె.సాయిప్రత్యూష అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై 14 వరకు సర్వే కొనసాగుతుందన్నారు. ఓటర్లకు ఫారాలు అందించి నిబంధనల ప్రకారం వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జూలై 21న ఉంటుందని, తర్వాత అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు. అభ్యంతరాలపై జిల్లా ఎన్నికల అధికారి, ప్రధాన ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో అర్బన్ ఏపీసీ జానకి, ఎన్నికల డీటీ జి.కె.శ్రీనివాసరావు, నాయకులు ఐ.టి.కుమార్, రమేష్, పైడి వేణుగోపాల్, ఈశ్వరి, పి.ఎం.జె.బాబు, శంకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ శాఖ సేవలు భేష్
శ్రీకాకుళం పాతబస్టాండ్: కాగితంపై ఉండే వివరాలు, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను సరిగ్గా బేరీజు వేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావడంలో రెవెన్యూ వ్యవస్థ సమర్థంగా పని చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్లో రెవెన్యూ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, ఫలితాల ఆధారిత సేవలందించడమే ప్రతి రెవెన్యూ ఉద్యోగి లక్ష్యంగా ఉండాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ మాట్లాడుతూ బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జి.జయదేవి, సివిల్ సప్లయ్ డీఎం వేణుగోపాల్, కలెక్టరేట్ పరిపాలన అధికారి సూర్యనారాయణ, రిటైర్డ్ జేసీ–2 రజనీకాంతరావు, రిటైర్డ్ ఆర్డీఓ పీఎంజే బాబు, సెక్షన్ సూపరింటెండెంట్ నాగేశ్వరరెడ్డి, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు గణపతిరావు, తదితరులు పాల్గొన్నారు. -
జీవనాధారమే ప్రాణం తీసింది
● గొర్రెలను రక్షించబోయి కాపరి మృతి ● ప్రాణాలు కోల్పోయిన 30 గొర్రెలు ● రెడ్డిపేటలో విషాద ఛాయలు పొందూరు: జీవనాధారమే ఆ కాపరి ప్రాణాలు పోయేలా చేసింది. 40 ఏళ్లుగా గొర్రెల పెంపకాన్ని నమ్ముకుని బతుకుతున్న ఆ వ్యక్తి ఆ గొర్రెలను రక్షించే క్రమంలో తన ప్రాణాలు కోల్పోయారు. పొందూరు– జి.సిగడాం మండలాల సరిహద్దు రైలు పట్టాలకు సమీపంలో ఉన్న గొర్రెల మందలో నుంచి కొన్ని గొర్రెలు అకస్మాత్తుగా రైలు పట్టాలపైకి వెళ్లడంతో శనివారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు, గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. పొందూరు మండలంలోని రెడ్డిపేట(పుల్లాజీపేట) గ్రామానికి చెందిన శనగల పోతయ్య(47) గొర్లె కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. సుమారు 4 దశాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్నారు. ఎప్పటిలాగానే ఆయన శనివారం గొర్రెల మందను వాండ్రంగి సమీపంలోని రైలు పట్టాల వద్దకు మేత కోసం తీసుకెళ్లారు. అకస్మాత్తుగా కొన్ని గొర్రెలు రైలు పట్టాలమీదకు వెళ్లిపోయాయి. అదే సమయంలో అతివేగంగా వస్తున్న రైలును గమనించి పోతయ్య పరుగు పరుగున పట్టాలపైకి వెళ్లారు. గొర్రెలను రక్షించే క్రమంలో తన సంగతి మర్చిపోయాడు. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 30 గొర్రెలూ చనిపోయాయి. మృతునికి భార్య మంగమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోతయ్య మృతి విషయాన్ని తెలుసుకున్న భార్య కుమారులు పట్టాల వద్దకు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. -
ఉపాధి వేతనదారులపై తేనెటీగల దాడి
సంతబొమ్మాళి : నౌపడలో ఒరేమాడు చెరువులో శనివారం ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా 16 మంది వేతనదారులపై తేనెటీగలు దాడి చేశాయి. బాధితులను నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించగా స్టాఫ్ నర్సులు ధనలక్ష్మి, అమర వైద్యం అందించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి పలాస: పలాస రైల్వే స్టేషన్ పరిధిలో గుణుపూర్–కటక్ ప్యాసింజర్ రైలులో గుర్తు తెలియని వ్యక్తి శనివారం ప్రయాణిస్తూ ఆకస్మికంగా మృతిచెందాడు. మృతుడి వయస్సు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందని, ఎరుపు టీ షర్ట్, నలుపు ఫ్యాంట్ ధరించాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గాలివాన బీభత్సం హిరమండలం: ఎల్.ఎన్.పేట, హిరమండలం మండలాల్లో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. పొలాల్లో భారీగా నీరు చేరింది. ఇప్పటికే ఖరీఫ్లో జల్లిన విత్తనాలు నీట మునిగాయి. దబ్బగూడలో పూరిల్లు నేలకొరిగింది. ఎంటీఎస్ టీచర్లను ఇబ్బందిపెట్టొద్దు శ్రీకాకుళం : డీఎస్సీ–2008, 1998 ఎంటీఎస్ టీచర్ల నియామకం జరిగినప్పటి నుంచి రాష్ట్ర విద్యాశాఖ ప్రతి సంవత్సరం వారిని వర్క్ అడ్జెస్ట్మెంట్, బదిలీల పేరుతోనూ స్థాన చలనం చేయడం తగదని డీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పూజారి హరిప్రసన్న, ఎన్ని వెంకటప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనూ జూన్ 22లోపు వారి స్థాన చలనం కోసం రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అభ్యంతరం చేశారు. ప్రతిసారీ సుదూర ప్రాంతాల పాఠశాలలకు పంపించడంతో వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మొదట్లో నియామకం చేసినప్పుడు వారి సొంత మండలంలోనే పోస్టింగ్ ఇచ్చారని, ఆ తర్వాత పక్క మండలాలు, డివిజన్ కూడా దాటి పంపించడం సరికాదన్నారు. విద్యా శాఖ అవసరాన్ని బట్టి జిల్లాలో ఎక్కడికి వేస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన చెందుతున్నారని, వారికి ఇచ్చే జీతం తక్కువ కావడం, మిగిలిన సర్వీస్ కూడా తక్కువే ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి సాయం శ్రీకాకుళం క్రైమ్ : గుండెపోటుతో మరణించిన ఇచ్ఛాపురం హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని ప్రసాద్ కుటుంబానికి జిల్లా పోలీస్ అసోసియేషన్ డెత్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కృష్ణంనాయుడు ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు శనివారం నగరంలోని సంపత్బాలాజీనగర్లో నివాసముంటున్న ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. సతీమణి లక్ష్మికి ధైర్యం చెబుతూ అసోసియేషన్, జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ట్రెజరర్ కె.భుజంగరావు పాల్గొన్నారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి పాతపట్నం: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా 3వ అదనపు జడ్జి వివేక్ ఆనంద్ శ్రీనివాస్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి(డీఎల్ఎస్ఏ) కె.హరిబాబు అన్నారు. శనివారం పాతపట్నం సబ్ జైల్ను పాతపట్నం కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ఎం.రోషిణితో కలిసి సందర్శించారు. ఖైదీల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదిని నియమించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని ముద్దాయిలకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని చెప్పారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. జూలై 11న లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీపడేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సబ్జైలర్ ఎం.సన్యాసినాయుడు, న్యాయవాదులు, జైల్ సిబ్బంది పాల్గొన్నారు. -
కబళిస్తున్న క్షయ..!
రాయగడ: క్షయ వ్యాధి నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్ఎల్ఈసీ) అమలు చేస్తున్నప్పటికీ.. రాయగడ జిల్లాలో ప్రతిఏటా కొత్త క్షయ రోగులు వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగేళ్లలో జిల్లాలో మొత్తం 159 మంది క్షయవ్యాధికి గురైనట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. జిల్లాలోని కాసీపూర్ సమితిలోనే అత్యఽ దిక కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం 2022– 23లో 68 కేసులు నమోదు కాగా, 2023–24లో 42, 2024–25లో 36, 2025–26లో 49 కేసులు గుర్తించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఇప్పటికే 4 నుంచి 5 కేసులు నమోదైనట్లు సమాచారం. క్షయవ్యాధిపై సమాజంలో ఇప్పటికీ అపోహాలు, మూఢనమ్మకాలు కొనసాగుతుండడంతో బాధితులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆరోగ్య శాఖ సిబ్బంది పేర్కొంటుంది. ఈ వ్యాధి బ్యాక్టీరియా వలన సంక్రమిస్తుంది. 2007కు ముందు లెప్రా అనే స్వచ్ఛంద సంస్థ కేంద్ర ప్రభుత్వ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అవగాహన, చికిత్స, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించేది. అనంతరం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఆరోగ్య శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. గతంలో క్షయవ్యాధి నియంత్రణ కోసం ప్రత్యేక మల్టీపర్పస్ వర్కర్లు పనిచేసేవారు. ప్రస్తుతం పురుష, మహిళా ఆరోగ్య కార్యకర్తలే ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితేవారు ఇతర ఆరోగ్య కార్యక్రమాల్లో కూడా నిమగ్నమై ఉండడంతో క్షయ నిర్మూలనకు అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా చాలామంది ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాధిపై ప్రత్యేక శిక్షణ లేకపోవడం వల్ల కొత్త రోగుల గుర్తింపు, చికిత్స పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చికిత్స విధానం క్షయ వ్యాధి ప్రారంభ దశలో ఉంటే ఆరు నెలలపాటు మల్టీడ్రగ్ థెరాఫీ (ఎండీటీ) మందులు తీసుకోవాలి. వ్యాధి తీవ్రత ఎక్కువైతే ఏడాది వరకు చికిత్స కొనసాగించాల్సి ఉంటుంది. మందులను క్రమం తప్పకుండా వాడకపొతే పూర్తిస్థాయిలో కోలుకోవడం కష్టమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాయగడ వంటి గిరిజన, దూర ప్రాంతాల్లో రోగులు ప్రతిరోజూ మందులు తీసుకుంటున్నారా లేదా అన్నది పర్యవేక్షించేందుకు తగిన సిబ్బంది కొరత ఉందని సమాచారం. జిల్లాలోని కాసీపూర్తో పాటు రాయగడ పట్టణ ప్రాంతం, జిమిడిపేట, మునిగుడ, బిసంకటక్ ప్రాంతాల్లో క్షయవ్యాధి రోగులను గుర్తిస్తున్నారు. అయితే ఆరోగ్య శాఖ క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక సర్వేలు, వైద్య శిబిరాలు నిర్వహించి ముందస్తు గుర్తింపు చర్యలను మరింత బలొపేతం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రాయగడ జిల్లాలో ప్రతిఏటా కొత్త కేసులు నాలుగేళ్లలో 159 కేసులు గుర్తింపు అత్యధికంగా కాసీపూర్లో నమోదు -
టాటా విఫలం
విద్యుత్ సేవలందించడంలో జయపురం: రాష్ట్రంలో టాటా పవర్ విద్యుత్ సరఫరా కంపెనీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ కంపెనీ ప్రజలకు సంతృప్తికరమైన విద్యుత్ సేవలు అందించడంలో పూర్తిగా విఫలమైందని బీజేడీ నాయకులు ఆరోపించారు. ముఖ్యంగా అప్రకటిత విద్యుత్ కోతల వలన ప్రజలు ఇబ్బందులు ఏర్పడుతున్నా కంపెనీ పట్టించుకోవడం లేదన్నారు. స్మార్ట్ మీటర్లు ద్వారా ప్రజలపై అధిక భారం మోపుతున్నారని మండిపడ్డారు. అనంతరం భారీ ర్యాలీ చేపట్టి, విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ విభాగ అధికారికి వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి రబినారాయణ నందో మాట్లాడుతూ టాటా విద్యుత్ కంపెనీపై నిప్పులు చెరిగారు. టాటా కంపెనీ విద్యుత్ సరఫరాలో నియమాలు ఉల్లంఘిస్తూ నియంతగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వెంటనే విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బీజేడీ కార్యనిర్వాహక అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ మిశ్ర, కొరాపుట్ మాజీ ఎమ్మెల్యే రఘురామ్ పడాల్, జయపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సూర్యనారాయణ రథ్, బీజేడీ మహిళా నాయకురాలు ఇందిరా నందో, నాగరాజు దొర, మాజీ కౌన్సిలర్ ఎ.శ్రీనివాసరావు, ధర్మేంధ్ర అధికారి, జయపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బి.సునీత, సుషమ మహాపాత్రో, బాదల్ శాంతపాత్రో, జి.అరుణ, కౌన్సిలర్లు దేవేంద్ర చౌదరి, ఎన్.లక్ష్మీనారాయణ, శిల్పపాణి తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతోనే సమస్యలు పరిష్కారం
రాయగడ: అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని రాయగడ మున్సిపల్ చైర్మన్ మహేష్ కుమార్ పట్నాయక్ అన్నారు. స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో మున్సిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో పట్టణ ప్రజా సంబంధాలు – పౌర భాగస్వామ్యం అనే అంశంపై శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ సమస్యలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవడంతో పాటు, సమన్వయంతో వ్యవహరించి అధికారులకు సహకరిస్తే సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం, వారి సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి పరిష్కార మార్గాలను సూచించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దీనిలో భాగంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0, గృహపన్ను, వాణిజ్య లైసెన్సులు, భవన నిర్మాణ ప్రణాళికల అనుమతులు, సహయోగ్ పథకం తదితర అంశాలపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులు వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారికి సంఘటన స్థలం వద్దే దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. అందుకు ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వివిధ వార్డులకు చెందిన కౌన్సిలర్లు, కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ల మహా సంఘం ఆందోళన
రాయగడ: ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలో మహాకాళపడ సమితి తిఖిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ చామేలి ఓఝాపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో రాయగడ జిల్లా సర్పంచ్ల మహాసంఘం కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. అనంతరం ఏడీఎం నవీన్ చంద్ర నాయక్కు వినతిపత్రం అందజేశారు. ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. తిఖిరి గ్రామ పంచాయతీకి చెందిన మహిళ సర్పంచ్ చామేలి ఓఝా ఈనెల 11వ తేదీన తన పంచాయతీ అభివృద్ధి పనులపై చర్చించేందుకు మహాకాళపడ సమితి బీడీవో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరుగుతున్న సమయంలో.. బీడీవోతో పాటు మరి కొందరు అధికారులు ఆమైపె అనుచిత వ్యాఖ్యలు చేశారని సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. అనంతరం బీడీవో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిష్కరించాల్సిపోయి.. పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశారని ఆరోపించారు. చామేలి ఓఝాను బలవంతంగా పోలీసులు వాహనంలో ఎక్కించి స్టేషన్కు తరలించారని, ఆ సమయంలో ఆమె సెల్ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు శారీరకంగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమైపె తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు సంఘం ప్రతినిధులు ఆరోపించారు. మానసిక, శారీరక వేధింపుల కారణంగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని, ప్రజా ప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించారని సర్పంచ్ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో చట్ట వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటోందని పేర్కొంటూ గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. హలువ సర్పంచ్ తమ్మారావు బిడిక నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. సర్పంచ్లు, మహిళా సర్పంచ్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసను వ్యక్తం చేశారు. -
పిల్లల దొంగలనే అనుమానంతో దాడి
● మహిళా స్వచ్ఛంద సేవకురాలి దుస్తులు చించివేసి అమానుషం ● ఘటనలో 21 మంది నిందితులు అరెస్టురాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ ప్రాంతంలో పిల్లల దొంగలంటూ అనుమానించి ఇద్దరు స్వచ్ఛంద సేవకులపై గ్రామస్తులు అమానుషంగా దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటనలో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా మహిళా స్వచ్ఛంద సేవకురాలిపై జరిగిన దౌర్జన్యం, ఆమె దుస్తులు చింపివేయడం వంటి దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ధామునిపంగ పంచాయతీ పరిధి కందులగూడ గ్రామానికి చేరుకున్న ఇద్దరు స్వచ్ఛంద సేవకులను గ్రామస్తులు పిల్లల దొంగలుగా అనుమానించి ప్రశ్నించారు. దీంతో భయాందోళనకు గురైనవారు అక్కడి నుంచి వెళ్లిపోతుండగా గ్రామస్తులు ఇతర గ్రామాలకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పుకార్లు వేగంగా వ్యాపించి సాయినగర్, ఇంటాలిగుడ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది దాడి సాయినగర్ సమీపంలోని ఒక దాబా వద్ద వందలాది మంది యువకులు వారిని అడ్డగించి దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో వారు సమీపంలోని ఒక భవనంలోకి వెళ్లినా గుంపు అక్కడికి చేరుకుని దాడి కొనసాగించింది. పోలీసుల సమక్షంలో స్థానిక యువకుడు బలరామ్ బాగ్ మహిళ స్వచ్ఛంద సేవకురాలిని రక్షించి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు వారిని కల్యాణ సింగుపూర్ సీహెచ్సీకి తరలించగా.. అగ్రహంతో అక్కడికి చేరుకున్న గుంపు ఆస్పత్రి తలుపులు, సామగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజ్ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 16 మందిని పోలీసులు అరెస్టు చేయగా, శుక్రవారం మరో ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అరైస్టెనవారి సంఖ్య 21కు చేరుకుంది. అయితే ఈ దాడికి కారణమైన తప్పుడు ప్రచారం, పుకార్లను వ్యాప్తి చేసిన వ్యక్తులను గుర్తించడంలో పోలీసులు ఇంకా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ అధికారి ప్రతినిధి మనీషా తీవ్రంగా స్పందించారు. మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆమె సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఐఐసీ బదిలీ ఇటీవల కాలంలో పలు వివాదస్పద ఘటనలతో వార్తల్లో నిలిచిన కల్యాణ సింగుపూర్ పోలీస్స్టేషన్ ఐఐసీ కల్పన బెహరను బదిలీ చేశారు. ఆమెను కలహండి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసినట్లు అధికారిక సమాచారం వెలువడింది. గ్రామస్తుల ఆందోళనలు, మీడియా ప్రతినిధులతో వివాదాలు, తాజాగా స్వచ్ఛంద సేవకులపై దాడి ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దక్షిణ–పశ్చిమ రేంజ్ డీఐజీ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమె బదిలీ అమల్లోకి వచ్చింది. -
పీఎం కిసాన్ వేడుకలు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం హాల్లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పీఎం కిసాన్ వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ మునీంద్ర హానగ విచ్చేసి ప్రారంభించగా, ఇతర అతిథులుగా జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి ఎం.ప్రకాశరావు, జిల్లా కృషి అధికారి రవీంద్ర కుమార్ అథెక్, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరక్టర్ శశాంక శేఖర్ సాహు, ఆర్.ఉదయగిరి కృషి విజ్ఞాన కేంద్రం వైజ్ఞాణికులు జన్నురియాస్ ఖుజుర్ తదితరులు పాల్గొన్నారు. -
నీతి అయోగ్ బృందం పర్యటన
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో నీతి అయోగ్ బృందం శనివారం పర్యటించింది. డాబుగాం, తెంతుకుంటి సమితుల్లో నీతి అయోగ్ కేంద్ర ఇన్చార్జి మీరా మహంతి క్షేత్ర పర్యటన చేశారు. తెంతులకుంటి సమితిలోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లీ, బిడ్డలకు అందిస్తున్న పౌష్టికాహారం, విద్య, ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్న ఆరోగ్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతర ఇంద్రావతి డ్యామ్ను పరిశీలించారు. నబరంగ్పూర్ జిల్లాలో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు, మొక్కజొన్న పరిశ్రమ ఏర్పాటు వంటి నిర్మాణాల పురోగతి పరిశీలించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన పెంచాలని అధికారులను సూచించారు. పర్యటనలో నబరంగ్పూర్ జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక వైద్య పరికరాలు ప్రారంభం
జయపురం: కొరాపుట్ జిల్లాలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు జయపురం, కొరాపుట్ ఆస్పత్రుల్లో ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అత్యాధునిక మెషిన్లను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, కలెక్టర్ మనోజ్ మహాజన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాహిణీపతి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో నూతన యంత్రాలు నెలకొల్పడం ఆనందదాయకమన్నారు. కలెక్టర్ మనోజ్ మహాజన్ మాట్లాడుతూ ఈ నూతన యంత్రాల ద్వారా ఒకే నమూన సేకరణతో దాదాపు 1700 కంటే ఎక్కువ రకాల పరీక్షలు చేయవచ్చని, అందువలన రోగ నిర్ధారణ ప్రక్రియ మరింత వేగంగా, ఖచ్చితంగా ఉంటుందన్నారు. పరీక్ష జరిపిన 5 నుంచి 10 నిమిషాల్లో రోగి సెల్ఫోన్కు రిపోర్ట్ పంపించడం జరుగుతందన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో నిరసన జయపురం: భారతీయ నౌకపై అమెరికా సైనికులు కాల్పులు జరిపడంతో ముగ్గురు భారతీయ నౌకా సిబ్బంది మృత్యవాత చెందడంపై భారతీయ కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు జయపురం ప్రధాన కూడలి వద్ద కమ్యూనిస్టు పార్టీ నేతలు శనివారం ఆందోళన చేపట్టారు. ముగ్గురు భారతీయ నౌకా సిబ్బందిని అమెరికా సైనికులు హత్య చేసినా, కేంద్ర ప్రభుత్వంలో కనీసం స్పందన లేదని దుయ్యబట్టారు. ఈ ఘటనపై నిరసన తెలుపలేదు సరికదా.. కనీసం ఖండించకపోవడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ క్షేత్రస్థాయి నుంచి ప్రజా ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఆందోళనలో జిల్లా కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి జుధిస్టర్ రౌళో, దామోదర రొ ణ, సురేష్ గౌడ, భీష్మ నాయిక్, ఉత్తమ మల్లిక్, నంద హరిజన్ తదితరులు పాల్గొన్నారు. వాహనాలు సమకూర్చాలని వినతి జయపురం: జయపురం సదర్ పోలీసుస్టేషన్ పరిధి జయపురం సమితి అంబాగుడ పోలీసు పంటికి వాహనాలు సమకూర్చాలని అంబాగుడ గ్రామస్తులు కోరారు. ఈ మేరకు సామాజిక కార్యకర్త బి.హరిరావు నేతృత్వంలో ఆ గ్రామ యువకులు జయపురం సబ్ కలెక్టర్ జాదుమణి నాయిక్ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. అంబాగుడ పోలీసు పంటి లో గతేడాది నుంచి నాలుగు చక్రాల వాహనం లేదని, అందువలన ఎక్కడ నేరాలు జరిగినా పోలీసులు సకాలంలో వెళ్లలేకపోతున్నారని తెలిపారు. అందువలన నాలుగు చక్రాలు వాహనాలు సమకూర్చాలని విన్నవించారు. లక్క బొమ్మల తయారీ కేంద్రం పరిశీలన కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని సుంకారి వీధిలో సరళ హస్త కళల తయారీ కేంద్రాన్ని ఎస్పీ పర్ధవ్ కశ్యప్ జగదీష్ శనివారం తల్లిదండ్రులతో కలిసి సందర్శించారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న లక్క బొమ్మలు తయారు చేసే విధానం పరిశీలించారు. సుంకారి జాతి మహిళలు తమ చేతి గోళ్ల మీదుగా లక్క కాల్చి తీగలుగా మార్చి అందమైన బొమ్మలు తయారు చేస్తారు. వీటికి దేశ విదేశాల్లో ప్రాచూర్యం ఉంది. లక్క బొమ్మల తయారీలో అనేక బహుమతులు పొందిన ప్రభాతి పాత్రో బొమ్మలు చేస్తుండడం చూసి ఎస్పీ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. అనంతరం కొన్ని బొమ్మలు కొనుగోలు చేశారు. -
ఆక్రమణలు తొలగించాలి
జయపురం: జయపురం సమితి ఉమ్మిరి గ్రామ పంచాయతీ మొకాపుట్ గ్రామ రోడ్డును, ప్రభుత్వ స్థలాలను కొంతమంది ఆక్రమించి ఇళ్లు, వ్యక్తిగత దుకాణాలు నిర్మించుకుంటున్నారని, దీనివలన తాము ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జయపురం సబ్ కలెక్టర్ జాదుమని నాయిక్కు ఫిర్యాదు చేశారు. ఆక్రమణలు వలన స్థలం లేకపోవడంతో స్థానికులు పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారని ఆరోపించారు. కనీసం అంబులెన్స్, అగ్నిమాపక వాహనం వచ్చేందుకు కూడా వీలు లేకుండా పోయిందని వాపోయారు. ఆక్రమణలు అడ్డుకోవాలని వెళ్తే తమను భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన వెంటనే గ్రామంలో జరుగుతున్న ఆక్రమణలను తొలగించి గ్రామానికి రోడ్డు వేయాలని కోరారు. కార్యక్రమంలో పంకజ హరిజన్, మంగళధన్ హరిజన్, కుముటి ఖోశ్ల, జీరు బాగ్, సునీల్ ఖోశ్ల, సుభాష్ హరిజన్, సొన ఖోశ్ల, సుశాంత ఖోశ్ల తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా వినాయక ఆలయ వార్షికోత్సవం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని రాజువీధిలో ఉన్న సిద్ధి వినాయక దేవాలయ 15వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు సూర్యాఆరాధనతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేయి నామ యజ్ఞాలు, హోమాలు జరిపారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. 15 ఏళ్లుగా వార్షికోత్సవాన్ని కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పెద్దఎత్తున భక్తులు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు.వైభవంగా శివ పార్వతుల కల్యాణం జయపురం: స్థానిక రాజుసాహి పంచానన శైవపీఠం అష్టశంభు క్షేత్రంలో శివ పార్వతుల కల్యాణాన్ని వైభవంగా గురువారం సాయంత్రం నిర్వహించారు. మందిర సాంప్రదాయం ప్రకారం ముందుగా మంగళ పూజలు, పంచ దేవతల పూజలు జరిపారు. మహా శివుడిని శివ మందిరం నుంచి అందమైన పల్లకీలో పట్టణంలో ఊరేగించారు. కార్యక్రమంలో పూజా కమిటీ సభ్యులు, మందిర ప్రధాన పూజారి చంద్రశేఖర భటమిశ్ర, సేవాయత్ సత్యనారాయణ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. విజిలెన్స్ దాడులు జయపురం: సబ్ డివిజన్ పరిధి కోట్పాడ్ సమితిలో అదనపు కార్య నిర్వాహక ఇంజినీర్ సత్యనారాయణ సెఠి ఆస్తులపై ఒడిశా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఇంజినీర్ సత్యనారాయణ సెఠిపై రావడంతో విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. ఏకకాలంలో శ్రీసెఠికి సంబంధించిన ఆస్తులు ఉన్నటువంటి ఏడుచోట్ల దాడులు జరుపుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ దాడుల్లో ఏడుగురు విజిలెన్స్ డీఎస్పీలు, 9 మంది విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు, 11 మంది సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. దీనిలో భాగంగా అక్రమ ఆస్తులు, నగదు, బంగారు ఆభరణాలు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.నాటుబాంబు పేలుడు భువనేశ్వర్: ఢెంకనాల్ జిల్లా గండతైల గ్రామంలో నాటు బాంబు పేలడంతో యువకుడు రెండు అరచేతులు కోల్పోయాడు. జంతువుల వేట కోసం బాంబు సిద్ధం చేస్తుండగా అకస్మాత్తుగా బాంబు పేలినట్లు సమాచారం. ఆ సమయంలో అతడికి చేరువలో ఉన్న మరో 2 మంది యువకులు గాయపడ్డారు. వారిరువురు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. బాధితుడు గండతైల దళిత బస్తీకి చెందిన బీరేంద్ర నాయక్గా గుర్తించారు. పర్జంగ్ ఠాణా పోలీసులు, దిహాడోల్ ఫారెస్టర్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు భువనేశ్వర్: రాజధాని నగరంలో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.108.81లుగా, డీజిల్ ధర లీటరుకు రూ.100.52లుగా శుక్రవారం నమోదైంది. గత 24 గంటల్లో ఇంధన ధరలు రూ.0.41 పైసలు తగ్గాయి. కటక్ నగరంలో గత 24 గంటల్లో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.109.35గా, డీజిల్ ధర లీటరుకు రూ.101.04లుగా ఉంది. గత 24 గంటల్లో ఇంధన ధరలు 0.20 పైసలు పెరిగాయి. -
కళాత్మక విన్యాసం
భువనేశ్వర్: ఒడిస్సీ, సంబల్పురి, జానపద, ఒడిస్సీ నృత్య బ్యాలే ప్రదర్శనలతో నృత్యంవద కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఒడిశా డ్యాన్స్ అకాడమీ 38వ వార్షిక నృత్యోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ సంస్థ విద్యార్థులు ఈ ప్రదర్శనల్లో కళాప్రతిభని చాటుకున్నారు. అకాడమీకి చెందిన సీనియర్ కళాకారులు, గురువులు, సభ్యులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మృదంగ వాద్యకారులు గురు ధనేశ్వర్ స్వంయి, ప్రముఖ వయోలిన్ విద్వాంసులు సురమణి రమేష్ చంద్ర దాస్, ఒడిశా సంగీత నాటక అకాడమీ ఉపాధ్యక్షులు మన్మథ శతపథి, ఒడిశా డ్యాన్స్ అకాడమీ కార్యదర్శి గురు డాక్టర్ అరుణా మహంతి, సంయుక్త కార్యదర్శి మధుస్మిత మహంతి తదితర ప్రముఖులు హాజరయ్యారు. నృత్యంవద కార్యక్రమం గురు అరుణా మహంతి దర్శకత్వంలో తొలి నృత్యం ప్రదర్శించారు. తదుపరి అంశంగా ఒడిశా మో ఒడిశా అనే జానపద నృత్యం ఉత్సాహభరితంగా సాగింది. ఒడిశా సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు, కళాత్మక నైపుణ్యాన్ని సంగీత ప్రధాన జానపద నృత్యం చాటి చెప్పింది. ఒడిశా గిరిజన ప్రజల మధురమైన పాటలు, శాసీ్త్రయ, జానపద సంగీతం ద్వారా ఒడియా భాష, సాహిత్యం, పండుగలు, దేవాలయాలు, నదులు మరియు ప్రజల ఉల్లాసభరితమైన జీవనశైలి సౌందర్యం వేదికపై ప్రతిబింబించింది. స్నేహం, ఐక్యత, సంతోషాల ఉల్లాసభరితమైన వేడుకగా సఖి సంగీ జానపద నృత్యం సమైక్యతకు అద్దం పట్టింది. మహువా పాని సంబల్పురి నృత్య ప్రదర్శన పశ్చిమ ఒడిశా జానపద వారసత్వం, ప్రకృతి మరియు దైనందిన జీవితానికి మధ్య ఉన్న ఆనందకరమైన అనుబంధాన్ని ప్రతిబింబించింది. భైరవ రాగం, జాతి తాళంలో కూర్చిన నవ దుర్గ నృత్య రూపకం దుర్గా దేవి తొమ్మిది దివ్య రూపాలను ప్రతి రూపం సీ్త్ర శక్తి, రక్షణ, దయ యొక్క ప్రత్యేక కోణాన్ని భావయుక్తమైన అభినయ ప్రదర్శనగా నిలిచింది. పంచరసి సంబల్పురి నృత్య ప్రదర్శన సంబల్పూర్ ప్రాంతపు స్ఫూర్తి, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించింది. పండుగల యొక్క ఉత్సాహభరితమైన లక్షణాల చిత్రీకరణతో జాతర బారొమాసి ఒడిస్సీ నృత్య బ్యాలే తుది మెరుపుగా ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
పర్లాకిమిడి: బాలకార్మిక, కౌమారదశ కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ఆదనపు జిల్లా కలెక్టర్ ఫల్గునీ మఝి అన్నారు. స్థానిక జిల్లా కలెక్టరెట్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయి బాల, కౌమరదశ కార్మిక వ్యవస్థ నియంత్రణ, నిర్మూళనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 ఏళ్లలోపు వయోపరిమితి కలిగిన బాలబాలికలను జీడి, రొట్టెలు, గ్రానైట్, హోటళ్లలో పనికి పెట్టడం నేరమని డివిజనల్ లేబర్ కమిషనరు బాబుచరణ్ పాత్రో అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల హోటళ్లలో దాడులు జరిపి బాలకార్మికులను రక్షించగలిగామన్నారు. పోలీసు, జిల్లా శిశు సంరక్షణ అధికారుల సహకారం అవసరం ఎంతైనా ఉందని డీఎల్వో పాత్రో అన్నారు. గజపతి జిల్లా వ్యాప్తంగా బాలకార్మికుల నిర్మూళనకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో డివిజనల్ లేబర్ కమిషనర్ బాబూచరణ్ పాత్రో, జిల్లా శ్రామిక అధికారి అమిత్ నాయక్, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారిని మనోరమా దేవి, సీడీఎంవో డాక్టర్ మంజురాణి జెన్నా, వివిధ హోటళ్ల యజమానులు, గారబంద, హాడ్డుభంగి, కాశీనగర్ జీడిప్యాక్టరీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
2040 నాటికి సికిల్ సెల్ వ్యాధి నిర్మూలన
రాయగడ: భారత ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ సికిల్ సెల ఎనీమియా నిర్మూలన మిషన్ కింద 2040 ఏడాది నాటికి దేశంలో ఈ వ్యాధిని ప్రజారోగ్య సమస్యగా పూర్తిగా తొలగించే లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక జిల్లా ముఖ్యవైద్యాధికారి కార్యాలయం సమావేశం హాల్లో శుక్రవారం ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వివిధ స్థాయిల్లో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఆదివాసీ, హరిజన ప్రాంతమైన జిల్లాలోని గిరిజన ప్రాంతాలు, గ్రామాలు విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు స్క్రీనింగ్ శిబిరాలు, సలహా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వ్యాధి లక్షణాలు, నివారణ, చికిత్సపై సమచార కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల్లో వ్యాధి గురించి పూర్తి అవగాహన కలిగించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ నగేంద్ర నాథ్ మహాపాత్రో మాట్లాడుతూ.. వ్యాధి ముందస్తు గుర్తింపు, క్రమబద్ధమైన చికిత్స, ప్రజా చైతన్యం, సామాజిక భాగస్వామ్యమే సికిల్సెల్ వ్యాధి నియంత్రణకు ప్రధాన మార్గాలని అభిప్రాయపడ్డారు. అనంతరం వ్యాధికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలొ డాక్టర్లు రుమామహాపాత్రో, మమత గౌధరి, జిల్లా ప్రొగ్రామ్ మేనేజరు లక్ష్మీధర్ మహాపాత్రో పాల్గొన్నారు. -
డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు
రాయగడ: స్థానిక కపిలాస్ కూడలి వద్ద ఒక కారు అదుపుతప్పి ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ సమీపంలోని డివైడర్ను ఢీకొట్టింది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ బ్రిడ్జి పైనుంచి రైల్వే స్టేషన్ రోడ్డు మార్గం వైపు వెళుతున్న సమయంలో కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అక్కడి వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కారును బయటకు తీసే ప్రయత్నం చేశారు. వేగంగా కారును నడపడంతోనే ప్రమాదం జరిగి ఉంచవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఐఏఎస్ కేడర్లో స్వల్ప మార్పులుభువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారుల స్థాయిలో స్వల్ప మార్పులు చేపట్టింది. 2 మంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. సాధారణ పాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కార్మిక – ఈఎస్ఐ శాఖ, సైన్స్–టెక్నాలజీ శాఖలో అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ గోపబంధు అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో డైరెక్టర్ జనరల్, ట్రైనింగ్ కోఆర్డినేషన్గా కూడా పనిచేస్తున్న 1995 సంవత్సరపు ఐఏఎస్ అధికారి చిత్ర అరుముగంను గోపబంధు అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో డైరెక్టర్ జనరల్, ట్రైనింగ్ కోఆర్డినేషన్గా నియమించారు. ఆమె సైన్స్–టెక్నాలజీ శాఖలో ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు కొనసాగిస్తారు. కేంద్ర డిప్యుటేషన్ నుంచి తిరిగి వచ్చిన 2001 సంవత్సరపు ఐఏఎస్ అధికారి దొడ్డ వెంకట స్వామి ప్రభుత్వ కార్మిక, ఈఎస్ఐ శాఖకు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. -
27న రెడ్క్రాస్ వార్షిక సమావేశం
శ్రీకాకుళం కల్చరల్: ఇండియన్ రెడ్క్రాస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న జెడ్పీ సమావేశ మందిరంలో వార్షిక సమావేశం నిర్వహిస్తున్నట్లు రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి సభ్యులంతా హాజరుకావాలని కోరారు. విరాళాలు అందచేసిన దాతలకు, రక్తదాన శిబిరాలు నిర్వాహకుల కు, నేత్ర మోటివేటర్లకు, వలంటీర్లకు సేవా ప తకం, అవార్డులు అందిస్తామని పేర్కొన్నారు. చెట్టు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు టెక్కలి రూరల్: పెద్దరోకళ్లపల్లి గ్రామానికి చెందిన రాంప్రాతుని చంద్రశేఖర్ అనే యువకుడు శుక్రవారం చెట్టు పైనుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు తీస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడటంతో కుడిచెయ్యి విరిగిపోయింది. వెంటనే బాధితుడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలే శరణ్యంశ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగుల హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలే శరణ్యమని ఏపీ అమరావతి జేఏసీ జిల్లా అధ్యక్షుడు బీవీఎన్ రాజు అన్నారు. ఉద్యోగులంతా ప్రభుత్వంపై ఉద్యమబాటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా శుక్రవారం జిల్లా సర్వే ఉద్యోగుల సంఘం, గణాంక శాఖ ఉద్యోగుల సంఘం, ట్రెజరీ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు జేఏసీ అధ్యక్షుడిని కలిసి మద్దతు ప్రకటించారు. సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.జగన్, కార్యవర్గ సభ్యులు, గణాంక శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.సుధాకరరావు, కార్యవర్గ సభ్యులలు, ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ట్రెజరర్ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పి.వి.రమణ తదితరులు మద్దతు తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి సోంపేట: సోంపేట – బారువ రైల్వేస్టేషన్ల పరిధిలో సుమారు 50 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నలుపు ఫుల్హ్యాండ్ షర్ట్, నీలం జీన్స్ ఫ్యాంటు ధరించి ఉన్నాడని చెప్పారు. మృతదేహన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. వివరాలకు రైల్వే కానిస్టేబుల్ ఎం.సోమేశ్వరరావు (9492250069)ను సంప్రదించాలని కోరారు. పిడుగుపాటుకు ఆవు మృతి కవిటి: జగతి గ్రామంలో పూడి వంశీమోహన్కు చెందిన ఆవు పిడుగుపాటుకు గురై మృతి చెందింది. శుక్రవారం మధ్యాహ్నం తోటలో ఆవు మేస్తుండగా పిడుగు పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పశుసంవర్థఖ శాఖాధికారులు ఆవును పరిశీలించి పిడుగు పాటు కారణంగా మృతి చెందినట్లు నిర్థారించారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కుటుంభ సభ్యులు కోరారు. గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి శ్రీకాకుళం క్రైమ్ : ఇచ్ఛాపురం టౌన్ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని ప్రసాద్(56) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకు చెందిన ప్రసాద్ పీఎన్కాలనీ సంపత్బాలాజీనగర్లో భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. కుమార్తె ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు సంతోష్ లా చదువుతున్నారు. కొన్నేళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్న ప్రసాద్ సాధారణ బదిలీల్లో భాగంగా గత జూన్లో ఇచ్ఛాపురం చేరారు. తనకు అనారోగ్యమని, డయాలసిస్కు ఇబ్బంది అవుతుందని, కుటుంబానికి దగ్గరగా ఉండేలా బదిలీ చేయమని ఎస్పీని పలుమార్లు వేడుకున్నట్లు పోలీసువర్గాల సమాచారం. 22న చేనేత కార్మికుల ధర్నా రణస్థలం: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు లావేరులో చేనేత కార్మికులతో కలిసి ధర్నా కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు నేతన్న నేస్తం కింద సంవత్సరానికి రూ.25వేలు ఎప్పటిలోగా అమలు చేస్తారో నేతన్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డి.వెంకట్, యు.శంకరయ్య, ఎ.గడ్డియ్య, యు.పెంటలింగ, ఏ.ఉమా, కె.జాంబ, ఎన్.రుద్రయ్య, యు.కాశి, ఏ.వేణు తదితరులు పాల్గొన్నారు. -
యువత సృజనాత్మక శైలితో ఎదగాలి
భువనేశ్వర్: విద్యాభ్యాసంతో నైపుణ్యాభివృద్ధి సాధించి సరికొత్త ఆవిష్కరణలతో అందరికీ మార్గదర్శకంగా స్వావలంబనతో ఎదగడం అలవరచుకోవాలని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ప్రబోధించారు. ఈ దిశలో ఉపాధ్యాయులు, బోధకులు, అధ్యాపకులు విద్యార్థుల్ని ప్రోత్సహించాలని కోరారు. స్థానిక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్–టెక్నాలజీ (సిపెట్), సెంట్రల్ టూల్ రూమ్–ట్రైనింగ్ సెంటర్ (సీటీటీసీ)లను సందర్శించిన సందర్భంగా ఆయన విద్యార్థులలో వ్యవస్థాపకతను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ పర్యటన సందర్భంగా, గవర్నర్ రెండు సంస్థల అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులతో సంభాషించి సృజనాత్మకతతో భావి జీవితాన్ని ఆదర్శప్రాయంగా ఆవిష్కరించుకోవాలని కోరారు. యువతను ఉద్యోగాన్వేషకులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దాలని గవర్నర్ అధికారులను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై సమాచారంతో వివిధ ఉత్పత్తుల కోసం వ్యక్తిగత ప్రాజెక్ట్ ప్రొఫైల్లను సిద్ధం చేయాలని సంస్థలకు సూచించారు. తద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ సొంత సంస్థలను స్థాపించుకోవడానికి అందుబాటులో ఉన్న ఆర్థిక, సాంకేతిక సహాయం గురించి తెలుసుకోగలుగుతారన్నారు. ఈ పర్యటన సందర్భంగా గవర్నర్ ఆయా సంస్థల్లో వివిధ ప్రయోగశాలలను సందర్శించి, అధ్యాపకులు, అధికారులతో సంభాషించారు. కొనసాగుతున్న పరిశోధన, పరీక్షా కార్యకలాపాల గురించి ఆరా తీసి సామాజిక అవసరాలను తీర్చే ఉత్పత్తులు, సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు. -
ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన
కొరాపుట్: బీజేపీకి చెందిన నబరంగ్ఫూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి జిల్లా కేంద్రంలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని మున్సిపల్ పార్క్ సమీపంలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం, గాయిత్రి ఆలయంలో అదనపు భవనం నిర్మాణం, మహిమా ధర్మ ఆశ్రమంలో మరామ్మతులు, భగవతివీధిలో మరమ్మతులు, చైతన్య మందిరం అభివృద్ధి, గౌడవీధిలో దుర్గామండపం ప్రహరీ, దసరా పొదలో శాంతి యువజన సంఘం సామాజిక భవనం, గాయత్రి మందిరంలో పారాయణ భవనం, బినోద్ ప్యాలెస్ వెనక శివ మందిరం నిర్మాణానికి భూమి పూజలు చేశారు. ప్రతి నిర్మాణం కోసం ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి రూ. 6 లక్షలు చొప్పున మంజూరు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కును నాయక్, కౌన్సిలర్ ఎ.సతీష్, బీజేపీ నాయకులు సురేష్ శాస్త్రి, సంజీవ్ నందా పాల్గొన్నారు. -
అభివృద్ధికి ప్రజలు సహకరించాలి
● మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమిమల్కన్గిరి: అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి అన్నారు. బీజేపీ రెండేళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని సంస్కృతి భవన్లో వికాస్ ధారా –ఒడిశా సారా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మల్కన్గిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరేలా చూస్తామన్నారు. దీనికి ప్రజలు, అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి ఎంతోకృషి చేస్తున్నామన్నారు. మల్కన్గిరి జిల్లా అంటే గతంలో అత్యంత దుర్భరంగా ఉండేదన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. మారుమూల గ్రామాలకు సైతం మౌలిక సదుపాయాలు సమకూరాయన్నారు. గిరిజన యువత సైతం విద్య, వైద్య రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల ప్రతినిధులను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సోమానాథ్ ప్రధాన్, వేద్బ్ర్ ప్రధాన్, అభివృధి శాఖ అధికారి దశరాథి సరబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
పర్యవేక్షణ శూన్యం..!
సీజనల్ భయం..చాలని పాడి రైతులు కోరుతున్నారు. పశువులకు సక్రమించే వ్యాధులు చిటుకు వ్యాధి గొర్రెల్లో చిటుకువ్యాధి అధికంగా వస్తుంది. ఇది బ్యాక్టీరియా వలన వస్తుంది. ఉన్నటుండి గాలిలో ఎగిరి గొర్రెలు చనిపోతాయి. దీని నివారణకు ముందుగా నీరసంగా ఉన్న గొర్రెలను మంద నుంచి వేరుచేయాలి. వ్యాధి నివారణకు పెన్సిలిన్ వేయించాలి. వ్యాధి సోకని వాటికి వ్యాక్సిన్ వేయించాలి. నీలి నాలుక నీలి నాలుక గొర్రెలు, మేకల్లో వస్తుంది. ఈ వ్యాధి సోకిన జీవాలకు జ్వరం అధికంగా వస్తుంది. నోటి నుంచి చొంగ కారుస్తూ, గిట్టలకు పుండ్లు ఏర్పడతాయి. ఈ వ్యాధి నివారణకు యాంటీ బయాటిక్స్, లివర్ టానిక్ ఉపయోగించాలి. జీవాలను మంద నుంచి వేరు చేయాలి. గొంతువాపు వ్యాధి ఈ వ్యాధి అన్ని వయస్సుల ఆవులు, గేదెల్లో కనిపిస్తుంది. 105 నుంచి 108 డిగ్రీల జ్వరం వస్తుంది. నోటి నుంచి చొంగలు కారి, నోటి నుంచి గాలి పీల్చుకుంటాయి. గొంతవద్ద వాపు వలన మేత తీసుకోలేవు. నివారణకు సల్పాడిమిడిన్ వాడుతూ, 4 నెలలు దాటిన జీవాలకు వ్యాక్సినేషన్ చేయించాలి. గాలికుంటు వ్యాధి ఇది అన్ని జీవాల్లో కనిపిస్తుంది. నోటి, గిట్లల్లో పుండ్లు, ఎక్కువగా జ్వరం ఉంటుంది. నివారణకు బోరిక్ గ్లిజరిన్ ఆయింట్మెంట్ను నోటిలో పూత పూయాలి. పీపీ ద్రావణంతో కాలిగిట్ల మధ్య కడగాలి. ప్రతిఏటా ముందస్తుగా ఏప్రిల్, మే నెలల్లో వ్యాక్సిన్ వేయించాలి. -
బయో ప్రాసెసింగ్ యంత్రాలకు నిప్పు
రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరానికి సమీపంలో గల వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులో గుర్తు తెలియని దుండగులు యంత్రాలకు నిప్పుపెట్టి తగులబెట్టారని బాధితుడు సదరు పోలీస్ స్టేషన్లో శుక్రవారం నాడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. రాయగడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును జానేశ్వర్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ నిర్వహిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన బయో ప్రాసెసింగ్ యంత్రంలో భాగమైన కన్వేయర్ బెల్టులు, కేబుళ్లు తదితర భాగాలను తెల్లవారు 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు తగులబెట్టినట్లు సంస్థ సైట్ ఇన్చార్జి ఎన్.శ్రీకాంత్ సదరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే యంత్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇదివరకు ఒకసారి ఇలానే తగులబెట్టారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతుండటంపై అసూయతో కొందరు వ్యక్తులు ఈ దుశ్చర్యలకు పాల్పడి ఉండవచ్చని ఫిర్యాదులో వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అగ్నిప్రమాదం వెనక ఉన్న కారణాలు, దుండగుల వివరాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఐఐసి ప్రసన్న కుమార్ తెలియజేశారు. -
ఇంటి నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు
సంతబొమ్మాళి : ఇంటి నిర్మాణం చేయకుండా అడ్డుకుంటున్నారని.. తమ స్థలంలో చెట్లను జేసీబీతో తొలగించి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఉమిలాడ గ్రామానికి చెందిన బాధితులు మైలపిల్లి ఓంకార్, తల్లి లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామ పెద్దలను కలిసి గోడు వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామం పక్కన ఉన్న పోలాకి మండలం గుప్పెడుపేట పంచాయతీ చిన్నకొరివిపేటలో పూర్వం నుంచి సొంత ఆస్తులు ఉన్నాయని, పూరిల్లు కూలిపోవడంతో కొత్త ఇల్లు నిర్మాణం చేయడానికి ప్రయత్నించగా అధికార పార్టీ కార్యకర్తలు సురపతి నీలయ్య, మెరుగు చిరంజీవి, పొన్నాడ లక్ష్మణరావు, సురపతి లక్ష్మణరావు, పొన్నాడ తాతారావు, కొమర జంగమయ్య, గుంటూ పోలరావు, చోడుపిల్లి దుర్గారావులు అడ్డుకున్నారని చెప్పారు. దౌర్జన్యం చేసి జేసీబీతో చెట్లు తొలగించి ఇసుక తరలించుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నీలయ్య అనే టీడీపీ కార్యకర్త ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడి చంపుతానని బెదిరించాడని వాపోయారు. ఈ విషయమై పోలాకి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, తిరిగి తనపైనే బైండోవర్ నమోదు చేస్తామని చెప్పడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశామని బాధితులు వివరించారు. -
శబరి శ్రీక్షేత్ర రథాల నిర్మాణం ప్రారంభం
కొరాపుట్: దక్షిణ ఒడిశాలో పూరీ క్షేత్రంతో సమానంగా భక్తులు కొలుస్తున్న కొరాపుట్ శబరి శ్రీక్షేత్రంలో రథాల నిర్మాణం ప్రారంభమైంది. శుక్రవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో సునాబెడా రోడ్డులో జాతీయ రహదారిపై జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్ ప్రారంభ పూజలు చేశారు. రానున్న రథయత్ర లోపు ఈ రథాలు నిర్మాణం పూర్తి చేసుకోనున్నాయి. కొరాపుట్లో రథయాత్రలో జగన్నాథ, సుభద్ర, బలభద్రలకు వేర్వేరుగా రథాలు నిర్మించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రాంతంలో సవరలు అత్యంత భక్తిశ్రద్ధలో జగన్నాథుడిని కొలుస్తారు. -
నబరంగ్పూర్ ఎస్పీని కలిసిన కిన్నెరలు
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాకు నూతనంగా వచ్చిన ఎస్పీ పార్ధవ్ కశ్యప్ని కిన్నెర సంఘం ప్రతినిధులు గౌరవ ప్రదంగా కలుసుకున్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కిన్నెరలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సామాజిక కార్యకర్త షర్మిష్ట దేవ్ నేతృత్వంలో ఎస్పీకి తమ సమస్యలు విన్నవించారు. ప్రస్తుతం సమాజంలో గౌరవంగా వివిధ వృత్తులలో జీవనం సాగిస్తున్నామన్నారు. జిల్లాకు వచ్చిన ఉన్నతాధికారులు తమ భద్రత కోసం అనేక విధాలుగా సహకరించారన్నారు. జిల్లాలో కిన్నెరలు సామాజిక భద్రత తో జీవించడానికి ఎస్పీ సహకరించాని విజ్ఞప్తి చేశారు. -
స్వస్థలానికి చేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరారు. రెండు రోజుల ఒడిశా పర్యటన నిమిత్తం రాష్ట్రపతి తన స్వస్థలమైన రాయరంగపూర్కు శుక్రవారం విచ్చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆమె విమానంలో కాకుండా రోడ్డు మార్గంలో వచ్చారు. ప్రతికూల వాతావరణం వల్ల రాష్ట్రపతి పర్యటనలో స్వల్ప మార్పుతో ఆలస్యం జరిగింది. నిర్ణీత సమయం కంటే సుమారు 2 గంటలు ఆలస్యంగా స్వస్థలం చేరుకున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి హెలికాప్టర్ మధ్యాహ్నం 3.45 గంటలకు రాయరంగ్పూర్లోని దండ్ బోస్ ఎయిర్ స్ట్రిప్లో దిగాల్సి ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పశ్చిమ బెంగాల్లోని కలైకుండలో దిగారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో రాయరంగ్పూర్ వైపు బయలుదేరారు. రాష్ట్రపతి కాన్వాయ్ కలైకుండ నుంచి బయలుదేరి బంగిరిపోషి, బిషోయి మీదుగా రాయరంగపూర్లోకి ప్రవేశించింది. రాష్ట్రపతి రెండు రోజుల పర్యటనపై స్థానికుల్లో ఉత్సాహం నెలకొంది. ఆమె పర్యటన ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. -
సీనియర్ ఐపీఎస్ అధికారి దయాల్ గంగ్వార్ సస్పెండ్
భువనేశ్వర్: రాష్ట్రంలో సేవలు అందిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి దయాల్ గంగ్వార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హోం శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పని చేస్తున్న దయాల్ గంగ్వార్ను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సస్పెండ్ చేశారు. బలియంత ప్రాంతంలో సౌమ్యరంజన్ హత్య కేసుకు సంబంధించి ఆ ఐపీఎస్ అధికారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 128 మంది వైద్యులపై క్రమశిక్షణా చర్యలు భువనేశ్వర్: దీర్ఘకాలంగా విధులకు దూరంగా ఉంటూ ఆస్పత్రులకు గైర్హాజరైన వైద్యులపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కఠిన చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆస్పత్రులలో 128 మంది వైద్యాధికారులు, దంత వైద్యులు ఐదేళ్లకు పైగా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వారికి తెలియజేస్తూ వార్తా పత్రికలలో ప్రకటనలు ప్రచురించారు. అనధికారికంగా గైర్హాజరైనందుకు వారిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖను ఆదేశించారు. కొత్త ఆస్పత్రులను ప్రారంభించడం, ఉన్న వాటిని ఆధునీకరించడం, కొత్త వైద్య కళాశాలలను స్థాపించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సేవలకు ప్రాధాన్యత కల్పిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. చాలా మంది వైద్యులు నియమితులైన తర్వాత గైర్హాజరవుతూ విధులను నిర్వర్తించడంలో విఫలం అవుతున్నారన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ముఖ్యమంత్రి అన్నారు. పలాస : కాశీబుగ్గలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి తప్పుడు ధ్రువపత్రాలతో బ్యాంకు రుణాలు పొందిన ఇద్దరి కి పలాస జూనియర్ సివిల్ జడ్జి యు.మాధురి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ చెప్పారు. శ్రీకాకుళం మండలం పాత్రునివలసకు చెందిన కొండల మన్మధరావు, నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన తమ్మినేని జోగినాయుడు, మరో నలుగురు తప్పుడు పత్రాలు సమర్పించి కాశీబుగ్గ ఏపీజీవీబీ నుంచి వ్యవసాయ పాడి పంటల రుణాలు పొందారు. అప్ప టి బ్యాంకు మేనేజరు పైల కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు మేర కు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికిఏడాది జైలు శిక్ష, రూ.2వేలు జరిమా నా విధిస్తూ సివిల్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.రమేష్ వాదనలను వినిపించారు. గార: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన యోగా పోస్టర్ రూపకల్పనలో గెలుపొందిన విద్యార్థులకు వమరవల్లి డైట్ ప్రిన్సిపాల్ ఏ.గౌరీశంకరరావు బహమతులు అందజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జనాభా విద్యా ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో శ్రీకాకుళం ఏపీఎంజేపీ స్కూల్ టి.గాయత్రి ప్రథమస్థానం, వప్పంగి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి.ఉష ద్వితీయ, టెక్కలి ఏపీఎంజేపీ పాఠశాల విద్యార్థిని పి.జ్యోత్స్న తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి సర్టిఫికెట్తో పాటు నగదు బహుమతులు అందజేసారు. పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి ఏ.రవిబాబు పరిశీలించారు. కార్యక్రమంలో యోగా జిల్లా కో ఆర్డినేటర్ ఎస్.ప్రసాద్, పి.కృష్ణ పాల్గొన్నారు. -
వాస్తవాలు వెలుగులోకి రావాలి
ఇచ్ఛాపురం రూరల్: విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన విషాదకరమైన ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. గురువారం ఆయన ఇచ్ఛాపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. తన కొడుకును చంపేస్తే కనీసం శవమైనా ఇవ్వండీ, లేకపోతే బూడిదైనా ఇవ్వండి అని ఒక తల్లి వేడుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, దోషులు ఎవరైనా చట్టం ముందు నిలబెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో సామాన్యులకు భద్రత లేకుండా పోయిందని, రెడ్బుక్ రాజ్యాంగంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. సోంపేట : గొల్లూరు గ్రామానికి చెందిన పిన్నింటి ఊర్వశి (38) గురువారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. గురువారం రాత్రి 7 గంటల సమయంలో మంచంపై విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది మార్చి 13న ఊర్వశి భర్త పిన్నింటి రాజారావు అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఇప్పుడు ఊర్వశి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. బారువ ఎస్ఐ హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపంచనామా అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఊర్వశి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీకాకుళం : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, జిల్లాలో కలెక్టర్గా సేవలందించిన ఎస్ఈ శేఖర్బాబు మృతి పట్ల విశ్రాంత ప్రణాళిక శాఖ అధికారి డాక్టర్ వి.మహీపాల్, విశ్రాంత సీనియర్ రెవిన్యూ అధికారి పీఎంజే బాబు, జర్నలిస్టుల సంఘం నాయకులు నల్లి ధర్మారావు తదితరులు గురువారం సంతాపం వ్యక్తం చేశారు. 1990 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన శేఖర్బాబు 1998–99 మధ్య శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. శ్యామ్ పిస్టన్ పరిశ్రమ లాకౌట్ సమయంలో విశేష అధికారాలు ఉపయోగించి తెరిపించడం ఆ రోజుల్లో సంచలనం. శ్రీకాకుళం పట్టణం నడిబొడ్డున ప్రెస్క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయించడంలో ఆయనదే ప్రధాన పాత్ర. బదిలీ తరువాత పంచాయతీరాజ్ కమిషనర్గా, సమాచార కమిషన్ కార్యదర్శిగా పనిచేసి 2012లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. శ్రీకాకుళం: జిల్లాలో జోరుగా సాగుతున్న ఇసుక, గ్రావెల్, గ్రానైట్ అక్రమ రవాణాను అరికట్టి ప్రకృతి వనరులను పరిరక్షించాలని యునైటెడ్ జనతాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతినాయుడు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు, నలుగురు ఎమ్మెల్యేల డైరెక్షన్లో అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. ఇందులో కొందరు పోలీసులు, అధికారుల పాత్ర ఉందన్నారు. కలెక్టర్, ఎస్పీలు స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. సమావేశంలో జేడీయూ జిల్లా కార్యదర్శి అంధవరపు మనోహర్, జిల్లా మహిళా కన్వీనర్ మామిడి తేజోవతి, బురగాపు లక్ష్మి పాల్గొన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా కేంద్రంలో శుక్రవా రం నిర్వహించనున్న జిల్లా స్థాయి ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం‘ (దీపం–2.0 థీమ్) ప్రగతి సంబరాలను విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్పుండ్కర్ కోరారు. ఈ మేరకు గురు వారం ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతి, వివిధ రంగాలలో సాధించిన విజయాలను ప్రజల కు వివరించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసిందన్నారు. సుమారు 5,000 మంది లబ్ధిదారులతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని తెలిపారు. ఏడు రోడ్ల కూడలి సమీపంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో ఉదయం 10:30 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. -
‘సర్’ గడువులోగా పూర్తిచేయండి
రాయగడ: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్ ) ప్రక్రియను వేగవంతంగా, తప్పులు లేకుండా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అశుతోష్ కులకర్ణి అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఫారాల భర్తీ పరిశీలన, డిజిటలైజేషన్ పనులు పురోగతిని గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. 140 రాయగడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రాయగడ పట్టణ ప్రాంతాన్ని సందర్శించారు. ఫారాల సేకరణ, ధ్రువీకరణ, డేటా డిజిటలైజేషన్ ప్రక్రియలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్ధేశిత గడువులోగా పనులను నాణ్యతతో పూర్తిచేయాలని సూచించారు. ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకొకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో ఎన్నికల నమోదు అధికారి, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్నా, సహాయ ఎన్నికల నమోదు అధికారి, రాయగడ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్తో పాటు సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఓటరు జాబితా నవీకరణకు సంబంధించిన ఈ కీలక కార్యక్రమాన్ని సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని అధికారులు తెలిపారు. -
దాడి కేసులో 16 మంది అరెస్టు
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్లో పిల్లలను ఎత్తుకెళ్లే వారంటూ ఢిల్లీలోని ఆజాద్పూర్ ప్రాంతానికి చెందిన సుమన్ ఝా, గుజరాత్లోని సూరత్ ప్రాంతానికి చెందిన అర్చిత సుతారియాలపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు. గురువారం నిందితులను కోర్టుకు తరలించారు. కళ్యాణసింగుపూర్ ప్రాంతంలో పిల్లలను ఎత్తుకెళ్లే వారని అనుమానించి యువతీ, యువకునిపై గ్రామస్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్రగాయాలకు గురైన ఇద్దరూ హాస్పిటల్ పాలయ్యారు. ఈ మేరకు బాధితులు తమపై అమానుషంగా దాడి చేశారంటూ గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదును ఆధారంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి 16 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరి కొందరు ఉన్నారని భావిస్తున్న పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. కంధమాల్ జిల్లాలోని దారింగిబడిలో స్వచ్ఛంద సేవా సంస్థలో యువతి, యువకుడు పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఏదో పనిపై స్కూటీపై బయలుదేరి కలహండి జిల్లా తువామూల్ రాంపూర్కు వెళ్లారు. అటువైపుగా రహదారి లేదని చెప్పడంతో తిరిగి వస్తుండగా కొందరు వారిని అడ్డగించారు. దీంతో స్కూటీ వేగాన్ని పెంచి వెళ్లే క్రమంలో జిల్లాలోని కళ్యాణసింగుపూర్లో గల విద్యుత్ కార్యాలయంలో ప్రాణభయంతో దాక్కున్నారు. అది గమనించి వీరిని వెంబడించినవారు పిల్లలను ఎత్తుకెళ్లేవారు ఇక్కడ తిరుగుతున్నారని ప్రచారం చేసి కేకలు పెట్టారు. దీంతో గ్రామస్తులు చేరుకుని ఇద్దరిని తీవ్రంగా గాయపరిచారు. -
జాతీయ స్కిడ్ స్కేటింగ్లో ఐదుగురికి కాంస్య పథకాలు
పర్లాకిమిడి: జాతీయ స్కిడ్ స్కేటింగ్ చాంపియన్షిప్–2026 కోల్కోతాలో జరిగిన పోటీలలో గజపతి జిల్లా స్కేటర్స్ ఐదు కాంస్య పతకాలు సాధించారు. గురువారం విజేతలు రాజ్యరాణి ఎక్స్ప్రెస్లో పర్లాకిమిడి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కోత్తాలో రోలర్ స్కేటర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈనెల 12 నుంచి 15 వరకూ జరిగిన ఓపెన్ నేషనల్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీలలో గజపతి జిల్లా పర్లాకిమిడికి చెందిన స్కిడ్ స్కేటర్స్ అత్యంత ప్రతిభ చూపించారు. ఐదు కాంస్య పఽథకాలు 6 స్థానాల్లో సాధించారు. విజేతలు వీరేః– బోరోణ్య రయితో, సీనియర్ విభాగం, 100 మీటర్లలో కాంస్య పఽథకం, తెంబూరు రితీష, 10వేల మీటర్లు విభాదం (15 – 18 ఏళ్లు) కాంస్య పథకం, బిశ్వాస్కుమార్ గౌడోలో కాంస్య పథకం 750మీటర్ల స్కేటింగ్లో సాధించారు. ఇవికాక మరో ముగ్గురు ఆటగాళ్లు పి.కార్తీక్, సాంభవీ సాహు, పి.ధమేష్లకు జూనియర్ విభాగంలో నాలుగు, ఆరు స్థానాల్లో నిలిచారని ప్రశిక్షకులు సుకాంత్ దలబెహారా తెలియజేశారు. -
సర్పంచ్ల నిరసన
పర్లాకిమిడి: ఒడిశాలో కేంద్రపడా జిల్లా తికిరి పంచాయతీలో మహిళా సర్పంచ్ చమేలీ ఓజాపై బ్లాక్ అధికారులు, పోలీసులు దుర్భాషలాడం, చేయి చేసుకోవడాన్ని నిరసిస్తూ గజపతి జిల్లాలో ఉన్న మహిళా సర్పంచ్లు కలెక్టరేట్ ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏడీఎం ఫల్గుణి మఝిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. బ్లాక్ అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే గజపతి జిల్లా 149 పంచాయతీల్లోని సర్పంచ్లంతా కలిసికట్టుగా రస్తారోకో, ఆందోళన చేపడతామని జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు సంఘమిత్రా శోబోరో అన్నారు. రాయఘడ, గుసాని, నువాగడ, మోహనా, ఆర్ఉదయగిరి సర్పంచ్లు నిరసనలో పాల్గొన్నారు. -
సమితి కార్యాలయం ముట్టడి
రాయగడ: అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని, లబ్ధిదారులకు గత మూడు నెలలు పెన్షన్ అందించాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు గురువారం జిల్లాలోని బిసంకటక్ సమితి కార్యాలయాన్ని ముట్టడించారు. వందలాది మంది కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. గత మూడు నెలలుగా పెన్షన్ కోసం కాళ్లరిగేలా సమితి కార్యాలయానికి, బ్యాంకులకు తిరిగినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పార్టీ జిల్లా అధ్యక్షుడు పూర్ణ చంద్ర టకిరి అన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా చొరవ తీసుకుని గత మూడు నెలలుగా బకాయి ఉన్న పెన్షన్ను తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. అంతకు ముందు బిసంకటక్లో ర్యాలీగా సమితి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఆందోళనలో బీఎస్పీ నాయకులు రామదాస్ టక్రీ, శివ ప్రస్కా, భీమా పిడిక, నీలాంచల్ హిమిరిక, తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగంలో సౌర శక్తి బహుళ ప్రయోజనకారి
భువనేశ్వర్: వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగం బహుముఖ ప్రయోజనకారిగా అక్కరకు వస్తుంది. సాగు కార్యకలాపాల్లో నీటిపారుదల ఖర్చులు తగ్గించి అదనపు ఆదాయ వనరులను ప్రేరేపిస్తుంది. మరో వైపు రాష్ట్ర పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు చేయూతగా నిలుస్తుందన్నారు. లోక్ భవన్ న్యూ అభిషేక్ హాల్లో జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో సమగ్రంగా చర్చించిన సందర్భంగా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో నీటిపారుదల వ్యవహారాల్లో వ్యవస్థలను సౌరశక్తి వినియోగంపై రైతులను ప్రోత్సహించాలని అధికారులను కోరారు. ఈ చొరవ వల్ల ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేయడంతో రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందన్నారు. సంప్రదాయ విద్యుత్ పంపుల నుంచి సౌరశక్తి ప్రత్యామ్నాయాలకు మారే ప్రక్రియను సులభతరం చేయడానికి పీఎం కుసుమ్ పథకంపై అవగాహన ప్రచారాలను ముమ్మరం చేసి వ్యూహాలను రూపొందించాలని సంబంధిత విభాగానికి సూచించారు. రాష్ట్ర బడ్జెట్లో జలవనరుల శాఖకు రూ.14,500 కోట్లు కేటాయించడం నీటి పారుదల మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి రైతులకు నీటి భద్రతను కల్పించడానికి దోహదపడుతుందన్నారు. వ్యవసాయ క్షేత్రాలకు నీరు సరిగ్గా చేరని నీటి పారుదల వ్యవస్థలను చేపల పెంపకం అవకాశాల అన్వేషణపై ఆసక్తి ప్రేరేపించాలన్నారు. ఈ చర్యతో రైతులకు అదనపు ఆదాయ వనరును అందించి గ్రామీణ జీవనోపాధి మెరుగుదలకు సద్వినియోగ పరచుకోవాలన్నారు. ఈ సమావేశంలో నదీ ప్రవాహంలోని నీటి నిల్వ నిర్మాణాలు, ప్రధాన, లఘు నీటి పారుదల ప్రాజెక్టులు, సాగు నీటి సామర్థ్యంపై గవర్నర్ సమాచారం కోరారు. కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి వేగవంతమైన అమలుతో రైతులకు, గ్రామీణ సమాజాలకు గరిష్ట ప్రయోజనాలను చేకూర్చాలని గవర్నర్ పిలుపునిచ్చారు. సమావేశానికి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శుభా శర్మ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు మరియు లోక్ భవన్ అధికారులు హాజరయ్యారు. -
విద్యార్థులకు బయోమెట్రిక్
పర్లాకిమిడి: వేసవి సెలవులు పూర్తయి తిరిగి గజపతి జిల్లాలో అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభం అవ్వడంతో డీఈఓ మయాధర్ సాహు ఆదేశాల మేరకు మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ (యం.బి.యు) కార్యక్రమం 5 నుంచి 17 ఏళ్ల వయస్సు గల విద్యార్థులకు గురువారం నిర్వహించారు. రాణిపేట (కాశీనగర్ బ్లాక్), గుసాని సమితి జాజిపూర్ ప్రభుత్వ యు.జి. పాఠశాలల్లో బయోమెట్రిక్ అప్డేట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యు.ఐ.డి.ఏ.ఐ. (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ అధార్) భువనేశ్వర్ నుంచి విచ్చేసిన అసిస్టెంట్ మ్యానేజరు అధర్స్ పట్నాయక్, ఆధార్ జిల్లా మ్యానేజరు పి.శ్యాం కుమార్, బ్లూమ్స్ సోల్యూషన్, రాణిపేట ప్రభుత్వ యు.జి. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు దుర్గాసి శ్రీరామ్మూర్తి, కాశీనగర్ బ్లాక్ సి.ఆర్.సి.సి. ప్రదీప్ కుమార్ పలక, జాజిపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎం సిద్ధార్థ్ శంకర్ పతి, మోహన్ కుమార్ నాయక్లు పాల్గొన్నారు. ఈ యం.బి.యు కార్యక్రమం జూన్ 22 నుంచి తిరిగి అన్ని పాఠశాలల్లో ప్రారంభమవుతుంది. -
ఆరోగ్య మంత్రికి తప్పిన ప్రమాదం
భువనేశ్వర్: రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆయన మయూర్భంజ్కు వెళ్తుండగా 49వ నంబరు జాతీయ రహదారిపై తెల్కోయి జగ్మోహన్ పూర్ సమీపంలో ఒక ప్రమాదం జరిగింది. ముందున వెళ్తున్న పైలట్ కారు అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక నుంచి వస్తున్న మంత్రి కారు బలంగా ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జు అయింది. అదృష్టవశాత్తు మంత్రి ప్రాణాలతో బతికి బయటపడగలిగారు. అనంతరం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మరో వాహనంలో మయూర్భంజ్కు వెళ్లారు. -
జూన్ 30 నాటికి రథయాత్ర సన్నాహాలు పూర్తి
భువనేశ్వర్: పూరీలో జరగనున్న వార్షిక రథయాత్ర సన్నాహాలను ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ సమీక్షించారు. ఆమె అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రథయాత్ర సజావుగా జరిగేందుకు మిగిలిన పనులను జూన్ 30 లోగా పూర్తి చేయాలని ఆమె అన్ని శాఖలను ఆదేశించారు. ఏప్రిల్లో జరిగిన మునుపటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షిస్తూ ఈ ఏడాది జూలై 16న జరగనున్న శ్రీ గుండిచా యాత్రకు ముందు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అనూ గర్గ్ తెలిపారు. సమన్వయంతో సమర్థంగా పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసేందుకు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. రథాల నిర్మాణం ప్రణాళిక ప్రకారం పురోగమిస్తోంది. మూడు రథాలకు అవసరమైన కలప నిర్దేశిత కాలపరిమితిలోగా పూరీకి చేరుకుంటుందని ఎస్.జే.టీ.ఏ తెలియజేసింది. పూరీ కలెక్టర్ దివ్యజ్యోతి పరిడా, పోలీస్ సూపరింటెండెంట్ ప్రతీక్ సింగ్ వివిధ సన్నాహక పనుల స్థితిపై వివరణాత్మక నివేదికలను సమర్పించారు. ప్రధాన కార్యదర్శి పూరీ, గ్రాండ్ రోడ్ (బొడొ దండొ)లను కలిపే రహదారి అభివృద్ధి ప్రాజెక్టులు, పార్కింగ్ సౌకర్యాలు, తాత్కాలిక పారిశుధ్య మౌలిక సదుపాయాలు, తాగు నీటి సరఫరా, విద్యుత్ ఏర్పాట్లు, రవాణా నిర్వహణ, జనసందోహం నియంత్రణ చర్యలు, శాంతి భద్రతల ఏర్పాట్లను సమీక్షించారు. సంబంధిత శాఖలకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. రథయాత్ర సమయంలో అత్యవసర రాకపోకలను సులభతరం చేసేందుకు ప్రత్యేక అంబులెన్స్ మార్గం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. బొడొ దండొ వెంబడి హై మాస్ట్ లైట్ల ఏర్పాటు జరుగుతుండగా శ్రీ గుండిచా ఆలయం వద్ద సుందరీకరణ పనులు, సముద్ర తీర రహదారి వెంబడి రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టులు పురోగమిస్తున్నాయి. యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నందున వారికి వసతులు కల్పించేందుకు పరిపాలన యంత్రాంగం సమంగ్లో బయో టాయిలెట్లతో పాటు పార్కింగ్ సౌకర్యాలను కూడా అభివద్ధి చేస్తోంది. ఆరోగ్య శాఖ పడకలతో కూడిన అదనపు తాత్కాలిక ఆరోగ్య కేంద్రాల కోసం ప్రదేశాలను గుర్తించగా, పనుల శాఖ, పూరీ మున్సిపల్ కార్పొరేషన్ తాత్కాలిక పార్కింగ్ జోన్లను కేటాయించి, అభివృద్ధి చేయడం ప్రారంభించాయి. బొడొ దండొ వెంబడి దశల వారీగా ఆక్రమణల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీటిని నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేస్తామని పూరీ జిల్లా యంత్రాంగం తెలిపింది. 1,600 తాత్కాలిక మరుగు దొడ్ల ఏర్పాటుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. యాత్రకు ముందే ఈ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ప్రధాన డ్రైన్లు, వాటికి అనుసంధానమైన మురుగు నీటి కాలువల్లో పూడికతీత పనులు త్వరలో పూర్తి కానున్నాయని అధికారులు తెలిపారు. వార్షిక రథ యాత్ర సందర్భంగా పూరీని సందర్శించే లక్షలాది మంది భక్తులకు సురక్షితమైన, క్రమబద్ధమైన, అవాంతరాలు లేని రథ యాత్ర అనుభవాన్ని అందించడానికి వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని సమావేశం నొక్కి చెప్పింది. లోక్ సేవా భవన్లో జరిగిన ఈ సమావేశానికి అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) హేమంత్ శర్మ, శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (ఎస్ జేటీఏ) ప్రధాన నిర్వాహకుడు, అదనపు ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ) డాక్టర్ అరవింద కుమార్ పాఢి, పోలీస్ డైరెక్టర్ జనరల్ వై. బి. ఖురానియా, అగ్ని మాపక సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాన్షు షడంగి, తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండల అధికారి డీఆర్ఎమ్ డి.సునీల్, సీనియర్ ప్రభుత్వ కార్యదర్శులు, పోలీసు అధికారులు, పూరీ జిల్లా పరిపాలన అధికారులు హాజరయ్యారు. -
ఘనంగా మందిర ప్రతిష్టాపన
జయపురం : కొరాపుట్ ఆదివాసీలకు 12 నెలల్లో 13 పండగలు అన్నది నానుడి. జయపురం సమితి కుడిపి గ్రామంలో కుడిపి గ్రామంలో గ్రామ దేవతకు కొత్త మందిరం నిర్మించిన సందర్భంగా ఆ గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి పాల్గొని ప్రజల్లో తానూ ఒకరై భజనలు చేశారు. గ్రామ దేవతకు సంప్రదాయ పూజలు జరిపారు. గ్రామ దేవత గంగదేయి ఠకురాణి నూతన మందిర ప్రతిష్టాపన మహోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వహించిన అష్ట్రపహరీ నామయజ్ఞ కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులను ఉత్సాహ పరచారు. అమ్మవారికి భక్తితో ఘనంగా పూజలు చేశారు. ఈ సందర్బంగా తాను ప్రసంగిస్తూ ఈ పూజలు, పండగలు మన పూ ర్వీకులు మనకు అందించిన గొప్ప వరాలన్నారు. వాటిని పరిరక్షించుకుంటామని అన్నారు. -
కొరాపుట్ జిల్లాలో ఎంపీ సప్తగిరి ఉల్క పర్యటన
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉల్క కొరాపుట్ జిల్లాలోని కొరాపుట్, పొట్టంగి నియోజకవర్గాల్లో గురువారం పర్యటించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు, పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర ఖడంతో కలిసి ఈ పర్యటన జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లని సందర్శించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పలుచోట్ల కార్యకర్తలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి రానున్న పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని దిశా నిర్దేశం చేశారు. పర్యటనలో ఆయనతో పాటు కొరాపుట్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రుపక్ తురుక్ ఉన్నారు. బైక్ సైలెన్సర్లు ధ్వంసం కొరాపుట్: శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న బైక్ సైలెన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణంలో పలుచోట్ల రహస్యంగా మాటువేసి ద్విచక్ర వాహనాలు తనిఖీ చేశారు. ఇందులో 32 వాహనాలని సీజ్చేసి కోర్టుకి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు సైలెన్సర్లని తొలగించి రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. ఇదే ఘటనలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మరో 12 మందిపై రూ.10 వేలు చొప్పున జరిమాన విధించామని ఐఐసీ సంబిత్ బెహరా ప్రకటించారు. హత్య కేసులో నిందితుడు అరెస్ట్ కొరాపుట్: మహిళపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నబరంగ్పూర్ జిల్లా ఎస్పీ పార్ధవ్ కశ్యప్ ఈ కేసు వివరాలు ప్రకటించారు. జిల్లాలోని కొడింగా పోలీస్స్టేషన్ పరిధి చంచర్గుడ గ్రామంలో చంద్ర బోత్ర (22)ని గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన విషయంపై ఆమె సోదరుడు పులిషింగ్ బోత్ర కొడింగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్, సైంటిఫిక్ బృందాలు తమ పరిశోధన చేశాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మృతురాలి పక్కింటికి చెందిన దశరథి మజ్జిని అదుపులో తీసుకున్నారు. సంఘటన స్థలంలో దొరికిన అధారాలతో దర్యాప్తు చేశారు. పోలీసులు వద్ద నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. వెంటనే నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జైలుకి తరలించారు. విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి భువనేశ్వర్: వేసవి సెలవులు పూర్తి కావడంతో గురువారం పలు చోట్ల పాఠశాలలు తెరిచి తరగతుల నిర్వహణ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి నిత్యానంద గోండ్ ప్రభుత్వ పాఠశాల సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. ఈ సందర్శనలో భాగంగా ఉమర్కోట్లో భలుగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కొంత సమయం గడిపారు. పిల్లలకు బాగా చదువుకోవాలని ప్రోత్సహించారు. పాఠశాలలోని బోధన, ఇతర సంబంధిత ఏర్పాట్ల గురించి ఉపాధ్యాయులతో వివరంగా చర్చించారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాలకు తిరిగి వచ్చిన విద్యార్థులలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం, ఆసక్తి కనబడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. అనుకూలమైన పర్యావరణంలో బాలలకు నాణ్యమైన విద్య బోధనకు ఉన్నత సౌకార్యలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి ప్రకటించారు. -
భద్రత కవచాలు
సురక్షిత రైలు ప్రయాణానికి ..భువనేశ్వర్: రాష్ట్రంలో రుతు పవనాల ప్రవేశంతో ఘాటీ ప్రాంతాల్లో సురక్షిత రైలు ప్రయాణం కోసం భద్రత, రక్షణ చర్యల్లో తూర్పు కోస్తా రైల్వే తలమునకలై ఉంది. వర్షా కాలంలో కొండవాలు ప్రాంతాలు, సొరంగాల గుండా రైళ్ల రవాణా కత్తి మీద సాములా సాగుతుంది. ఆయా మార్గాల్లో ఏ క్షణంలో కొండ చరియలు జారి పడతాయో చెప్పలేం. ఈ అవాంఛనీయ సంఘటనల నివారణకు తూర్పు కోస్తా రైల్వే ముందస్తు కార్యాచరణతో ప్రయాణికులకు విశ్వసనీయమైన రక్షణ, భద్రత కల్పించేందుకు కృషి చేస్తుంది. తూర్పు కోస్తా రైల్వే కొత్తవలస–కిరండల్ (కేకే), కొరాపుట్–రాయగడ (కేఆర్), రాయగడ–విజయనగరం (ఆర్వి) రైల్వే సెక్షన్లలోని సంక్లిష్టమైన మలుపులు, సొరంగాల గుండా సురక్షిత రైలు రవాణాకు ముందస్తు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారు. ఆయా మార్గాల్లో కొండ చరియలు విరిగిపడటం, నేల కోత, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు గురయ్యే సమస్యాత్మక ఘాట్ సెక్షన్లలో ఈ పనులు జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాల భద్రత, విశ్వసనీయ రక్షణ పెంపుదలకు రాక్ ఫాల్ బారియర్స్, రాక్ బోల్టింగ్, వైర్ మెష్ నెట్టింగ్, జియోమాట్ ఏర్పాటు, సొరంగాలను బలోపేతం, ఆధునిక వాలు స్థిరీకరణ చర్యలను ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేస్తున్నారు. కేకే–1 సెక్షన్లో గణనీయమైన పురోగతి కేకే–1 సెక్షన్లో ఈ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో మొత్తం 910 మీటర్ల రాక్ ఫాల్ బారియర్ పని పూర్తయింది. 29,776 చదరపు మీటర్ల వైర్ మెష్ నెట్టింగ్, 22,197 మీటర్ల రాక్ బోల్టింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 346 రంధ్రాలు తవ్వి 40 రంధ్రాలకు గ్రౌటింగ్ వంటి క్షేత్రస్థాయి కార్యకలాపాలు చేపట్టారు. దీంతో పాటు, అదనపు వాలు రక్షణ కోసం ప్రమాదకర ప్రదేశాలలో 300 చదరపు మీటర్ల రాంబాయిడల్ మెష్ మరియు 730 చదరపు మీటర్ల మోనో ఓరియంటెడ్ మెష్ను పరిచారు. కేకే – 2 సెక్షన్లో రక్షణ పనులు కేకే – 2 సెక్షన్లో లక్ష్య నిర్ధారిత రక్షణ కార్యకలాపాలు పూర్తి చేశారు. ఈ మార్గంలో 120 మీటర్ల రాక్ ఫాల్ బారియర్ పని పూర్తి చేశారు. ఈ సెక్షన్ లోని బలహీనమైన కొండ కోతల నుంచి రక్షణ కోసం 4,200 చదరపు మీటర్ల వైర్ మెష్ నెట్టింగ్ పనులు చేపట్టారు. కేఆర్ సెక్షన్లో సుస్థిర పురోగతి కొరాపుట్ – రాయగడ (కేఆర్) సెక్షన్ లో రక్షణ పనులు నిరవధికంగా కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో 300 మీటర్ల రాతిపతన నిరోధక పనులు, 1,600 మీటర్ల రాతి బోల్టుల పనులు పూర్తి చేయడంతో రెండు విభాగాలలోనూ 100 శాతం ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేసినట్లు ప్రకటించారు. అదనంగా 10,000 చదరపు మీటర్ల వైర్ మెష్ నెట్టింగ్ కూడా పూర్తయింది. కొండ వాలు మార్గాల గుండా కొనసాగే రైళ్ల కార్యకలాపాల్లో అవాంతరాలు తొలగించేందుకు వదులుగా ఉన్న రాళ్ల కదలికలను పటిష్టపరిచేందుకు వైర్ మెష్ నెట్టింగ్ చేశారు. ఆర్వీ సెక్షన్ లో రక్షణ పనులు రాయగడ–విజయనగరం (ఆర్వి) సెక్షన్ లో లంజిగఢ్ రోడ్, రాయగడ మధ్య ఉన్న ప్రమాదకరమైన మలుపుల్లో రక్షణ పనులు ప్రాధాన్యత ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ నెల 30 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యం నిర్ధారించారు. కేఆర్ సెక్షన్ లో సొరంగాల పటిష్టత కేఆర్ సెక్షన్ పరిధిలోని సొరంగాలలో భద్రతను పటిష్టత కార్యకలాపాలు చేపట్టారు. ఈ మార్గంలో 3 సొరంగాలను బలోపేతం చేసేందుకు టెండర్ కేటాయించారు. పనులు కొనసాగే సమయంలో అవాంఛనీయ సంఘటనలు నివారించేందుకు రైళ్ల రవాణా, ఈ మార్గంలో రైలు విద్యుద్దీకరణ నియంత్రణ వంటి జాగ్రత్తలకు ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యయనాలపై శ్రద్ధ ప్రమాదకరమైన ప్రదేశాలలో దీర్ఘకాలిక భద్రత కోసం సుస్థిరమైన నివారణ చర్యలను గుర్తించడానికి భూగర్భ, భూభౌతిక అధ్యయనాల పట్ల దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేకే, కేఆర్ సెక్షన్లలోని ఇతర ప్రమాదకరమైన మలుపుల్లో భూగర్భ సర్వే రైల్వే శాఖ ప్రారంభించింది. తన కీలకమైన ఘాట్ విభాగాలలో ఉభయ ప్రయాణీకులు, సరుకు రవాణా రంగాల్లో సురక్షిత నిరంతరాయ రైలు కార్యకలాపాల కోసం మౌలిక సదుపాయాల భద్రత, ఆధునీకరణ, విపత్తు సన్నద్ధతకు తూర్పు కోస్తా రైల్వే అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుంది. -
జైల్లో ఆకస్మిక తనిఖీలు
రాయగడ: ఝార్సుగడ జైలులో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయడంతో పాటు ఖైదీల వద్దకు నిషేధిత వస్తువులు చేరకుండా నిరోధించేందుకు ఝార్సుగుడ జిల్లా ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో జైలు ప్రాంగణంలోని బ్యారక్లు, సాధారణ ప్రదేశాలు, ఖైదీల వ్యక్తిగత సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా ఖైదీల వద్ద నుంచి బీడీలు, పొగాకు ఉత్పత్తులు, గుట్కా ప్యాకెట్లు, అగ్గిపెట్టెలు, రేజర్ బ్లేడ్లు, లైటర్ వంటి నిషేధిత వస్తువులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులు జైలు నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో అధికారులు వాటిని వెంటనే జప్తు చేశారు. అదేవిధంగా జైలులో అమలవుతున్న భద్రతా చర్యలు, సీసీ టీవీ కెమెరాల పనితీరు, ఖైదీల నిర్వహణ విధానం, సందర్శకుల పర్యవేక్షణ వ్యవస్థలపై కూడా సమగ్ర సమీక్ష చేపట్టారు. జైలు భద్రతతో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జైలు అధికారులను ఎస్పీ రాఘవేంద్ర పలు సూచనలు చేశారు. జైల్లో అక్రమ కార్యకలాపాలకు అవకాశం లేకుండా చేయడం, ఖైదీల భద్రతతో పాటు శాంతి భద్రతలను పరరిక్షించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్లోనూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగించి జైలు భద్రతను మరింత పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి గర్భిణి మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఎం.వి.21 గ్రామానికి చెందిన బందన మండాల్ (30) అనే గర్భిణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బుధవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో బందనకు కడుపు నొప్పి రావడంతో వాంతులయ్యాయి. ఆమె ఉంటున్న గదిలోనే విష సర్పం ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పామును చంపేశారు. అనంతరం బందనను మల్కన్గిరి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వాంతులు తగ్గేందుకు మాత్రమే మందులు ఇచ్చారు తప్ప పాము కాటు వేసిన విషయాన్ని పట్టించుకోలేదు. బుధవారం ఉదయానికి పరిస్థితి విషమించడంతో బందన మృతిచెందింది. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ డాక్టర్పై దాడి చేశారు. విషయం తెలుసుకున్న మల్కన్గిరి పోలీసు ఐఐసీ రీగాన్కీండో ఆస్పత్రిని చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
వృద్ధులను గౌరవించాలి
భువనేశ్వర్: వయోవృద్ధులను గౌరవించడం కుటుంబ సంస్కరణను ప్రతిబింబిస్తుందని హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు.వృద్ధులు సమాజానికి నాయకులని, వారిని నిర్లక్ష్యం చేయడం సమాజాన్ని నిర్లక్ష్యం చేయడమేనని భువనేశ్వర్ లోక్సభ సభ్యురాలు అపరాజిత షడంగి అన్నారు. ఒడిశా రాష్ట్ర వయోవృద్ధుల సంఘం భువనేశ్వర్, హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంయుక్త సహకారంతో ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం బుధవారం నిర్వహించారు. ఒడిశా వయోవృద్ధుల సమాఖ్య అధ్యక్షుడు మధుమాధవ్ జెనా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాజంలో వృద్ధుల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యం, వేధింపులను ఎలా నివారించాలి, వారికి సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని ఎలా అందించాలి అనే అంశంపై మేధావులు, సభ్యులు చర్చించారు. సమాజంలో వయోవృద్ధుల భద్రత, హక్కుల పరిరక్షణ పట్ల విస్తృత అవగాహన కల్పించేందుకు ఒడిశా రాజ్య వయోవృద్ధుల మహాసంఘ్, హై టెక్ మెడికల్ కాలేజ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కార్యక్రమంలో డాక్టర్ శ్వేతా దాస్, డాక్టర్ సంగీతా అగర్వాల్, మాజీ ఎమ్మెల్యే ప్రియదర్శి మిశ్రా, రుద్ర సామంత్రాయ్, జుయెల్ కిషోర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు తలెత్తకుండా చూడాలి
వర్షాకాలంలో ● జయపురం సిటిజన్ కమిటీ విజ్ఞప్తిజయపురం: వర్షా కాలంలో సంభవించే తుఫా న్లను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జయపురం సిటిజన్ కమిటీ సభ్యులు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక శిర్డీసాయినగర్లోని సిటిజన్ కమిటీ కార్యాలయంలో కమిటీ అధ్యక్షురాలు బినోదిణి సాంతపా త్రో అధ్యక్షతన సభ్యులు సమావేశమయ్యారు. ముందుగా కార్యదర్శి జి.వెంకటరెడ్డి ,గత తీర్మానాలు.. వాటి అమలుకు చేపట్టిన చర్యలు వివరించారు. అనంతరం పట్టణ సమస్యలపై చర్చించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో పెద్దచెట్ల కొమ్మలు నరకి వేయాలని, కాలువల్లో పూడికలు తొలగించాలని, రాత్రి వేళల్లో కూడా పోస్టాఫీసు, పోస్టాఫీస్లోని రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ తెరవాలని, పూరీ–కొరాపుట్ రైలును జయపురం వరకు నడపాలని, జయపురం ప్రధాన రోడ్లలో ఆధునిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి సభ్యుడు నెల చందా చెల్లించాలని సమావేశ విజ్ఞప్తి చేసింది. సమావేశంలో కార్యనిర్వాహక సభ్యులు సత్యబాన్ పండ, పరమేశ్వర పాత్ర, యాదవ సుబుద్ధి రత్నాకర చౌధురి, కమిటీ మాజీ అధ్యక్షులు మీన కేతన దాస్, ఉభాష్ పండ, రబినారాయణ నందో, జయపురం దేవోత్తర కమిటీ అధ్యక్షులు దేవేంద్ర బాహిణీపతి, భీమ్సేన్ అగర్వాల్, తులసీ రావు, రామనాథ్ పండ పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
రాయగడ: సామాజిక పింఛన్ కోసం వేలాది మంది లబ్ధిదారులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వృద్ధాప్యం, వైకల్యం, భర్తను కోల్పోయిన వారు.. ఇలా అనేక మంది జీవనాధారం కోసం ప్రభుత్వ భత్యాలే ఆశగా నిరీక్షిస్తున్నా పాలకులు కరుణ చూపడం లేదు. స్వాతంత్య్రానికి ముందే జన్మించిన 82 ఏళ్ల హసాయ్ బాగ్ (అంబొదళ గ్రామం ఇంద్రాపడ వీధి), రాయగడ పట్టణానికి చెందిన వితంతువు విష్ణుప్రియ బాగ్, మునిఖాల్ , కళ్యాణసింగుపూర్ సమితిలోని దివ్యాంగురాలు రుక్మిణి, బొనిత్ మహంతి, సురుగాలి సొమేశ్వరరావు, కారశిక గ్రామానికి చెందిన సుదర్శన్ వంటి వేలాది మంది అర్హులు సంవత్సరాల పాటు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో పాటు పెరుగుతున్న జీవన వ్యయాలు పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ భత్యాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు. జిల్లా కలెక్టర్ ప్రజా ఫిర్యాదుల విభాగం నుంచి సమితి కార్యాలయాలు, సర్పంచ్ల వరకు పలుమార్లు తిరిగినా సమస్యలకు పరిష్కారం లభించడం లేదని బాధితులు వాపోతున్నారు. వైద్యబోర్డు, సామాజిక భద్రత, దివ్యాంగుల సాధికారత శాఖల ధ్రువీకరణ పూర్తయినప్పటికీ, ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి జిల్లాలో మొత్తం 9,462 మంది అర్హులైన లబ్ధిదారులు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. సమితుల వారిగా కాసీపూర్లో అత్యధికంగా 2,699 మంది, కొలనారలో 1,705 మంది, రాయగడలో 1656 మంది, బిసంకటక్లో 697 మంది, గుణుపూర్లో 538 మంది, కళ్యాణసింగుపూర్లో 508 మంది, మునిగుడలో 412 మంది, గుడారిలో 351 మంది, పద్మపూర్లో 262 మంది సామాజిక పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు. ఇక మున్సిపాలిటీ పరిధిలోనే 434 మంది ప్రభుత్వ కరుణ కోసం వేచి ఉన్నారు. సీఎం ప్రకటించినా.. గత బడ్జెట్లో అర్హులైన ప్రతి లబ్ధిదారుకీ వెంటనే పింఛన్ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి గతంలో ప్రకటించారు. అయినప్పటికీ ఆ హామీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పంపిణీ జరుగుతున్న పింఛన్లలోనూ పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. మరణించిన వ్యక్తులు, అనర్హుల పేరిట కూడా పింఛన్లు విడుదలవుతున్నాయని రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా సంబంధిత శాఖ మంత్రి వెల్లడించారు. అర్హులను గుర్తించి భత్యాలు అందించడంతో పాటు అక్రమ లబ్ధిదారులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించినా ఆ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రస్తుతం రాయగడ జిల్లాలో జాతీయ సామాజిక సహాయం పథకం కింద 70 వేల మందికి పైగా, మధుబాబు పెన్షన్ పథకం కింద 82 వేల మందికిపైగా లబ్ధిదారులు ఉన్నట్లు సామాజిక భద్రత శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ సామాజిక పింఛన్లు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. పింఛన్ కోసం ఆశగా లబ్ధిదారుల నిరీక్షణ రాయగడ జిల్లాలో 9,462 మంది అర్హులకు అందని సామాజిక భద్రత -
సుదర్శన్ పట్నాయక్కు గవర్నర్ అభినందనలు
భువనేశ్వర్: రష్యాలోని కలినిన్ గ్రాడ్ ప్రాంతంలో జరిగిన అంతర్జాతీయ సైకత శిల్పకళా ఉత్సవంలో ప్రతిష్టాత్మకమైన రష్యన్ గ్రాండ్ సాండ్ మాస్టర్ కప్–2026ను గెలుచుకుని తిరిగి వచ్చిన పద్మశ్రీ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ను గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి లోక్ భవన్లో బుధవారం సత్కరించారు. ఈ విజయం ఒడిశాకు, దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టిందని, ప్రపంచ వేదికపై కళలు, సంస్కృతి రంగంలో భారత దేశ ఖ్యాతిని మరింత పెంచిందని గవర్నరు కొనియాడారు. ప్రపంచ సవాలుగా నిలిచిన వాతావరణ మార్పులు మానవాళిపై చూపుతున్న ప్రభావాన్ని ప్రతిబింబించిన సైకత కళాఖండంతో సుదర్శన్ పట్నాయక్ అవార్డు గెలుచుకోవడం పట్ల ప్రశంసించారు. సామాజిక, పర్యావరణ సందేశాలను తెలియజేయడానికి, తీవ్రమైన ప్రపంచ సమస్యలపై అవగాహన కల్పించడానికి కళను ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవడంలో శిల్పి చేస్తున్న నిరంతర ప్రయత్నాలను గవర్నరు ప్రశంసించారు. పండిత గోపబందు దాస్కు నివాళులుజయపురం: సమాజ సేవకుడు, న్యాయవాది, స్వాతంత్య్ర సమర యోధుడు, రాజనీతిజ్ఞుడు పండిత గోపబందు దాస్ 98వ వర్ధంతిని జయపురంలో పలు సంస్థలు బుధవారం నిర్వహించాయి. ఈ సందర్భంగా స్థానిక పూజ్య పూజా సంసద్ సంస్థ ఆధ్వర్యంలో దాస్కు ఘన నివాళులర్పించారు. స్థానిక రాజనగర్ కూడలిలోని గోపబందు దాస్ ప్రతిమకు పూజ్య పూజ సంసద్ ఉపాధ్యక్షులు తపణ కిరణ త్రిపాఠీ పూల మాలలు వేసి నివాళులర్పించాచారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రత్యేక ఉత్కళరాష్ట్ర ఉద్యమంలో స్వర్గీయ దాస్ భూమిక చిరస్మరణీయమన్నారు. అతడు న్యాయవాదిగా, సమాసేవిగా, ఉపాధ్యాయుడిగా, సంఘసంస్కర్తగా రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో సంసద్ సభ్యులు కై ళాశ చంధ్ర బిశ్వాల్, నవీణ చంధ్ర మఝి పాల్గొన్నారు.24 నుంచి బ్రహ్మోత్సవాలు రాయగడ: ఈ నెల 24వ తేదీ నుంచి స్థానిక బాలాజీ నగర్లో పూజలందుకుంటున్న కల్యాణ వేంకటేశ్వర స్వామి మందిరం 32వ వార్షికోత్సవంతోపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మందిరం ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, అర్చకులు రాంజీ ఆచార్యులు ఆధ్వర్యంలో కొనసాగే ఈ ఉత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు జరుగుతాయి. 24వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవాచనం, తదితర పూజలు, నీరాజన, ప్రసాద వితరణ, 25వ తేదీ ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, పతాక ధ్వజ ప్రతిష్టాపనలు, గరుడధ్వజారోహణం, ఉదయం 9 గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతాలు, సాయంత్రం 5 గంటలకు ఎదుర్కొలు ఉత్సవం, సాయంత్రం 5.30 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, రాత్రి 8 గంటలకు శ్రీవారి శేషవాహనోత్సవం, 26వ తేదీన ఉదయం 5.30 గంటలకు సుప్రభాత సేవ, పూజా కార్యక్రమాలు, ఉదయం 9 గంటలకు శ్రీలక్ష్మీ ఇష్టి, సాయంత్రం 6 గంటలకు శ్రీవారి హనుమంత వాహనోత్సవం, రాత్రి 8 గంటలకు సహస్ర దీపాలాంకృత ఊంజల్ సేవ, నీరాజన మంత్ర పుష్పములు, 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు గజవాహనోత్సవం, వేంకటేశ్వర స్వామి వ్రతాలు, తదితర పూజలు, 28వ తేదీ సాయంత్రం గరుడ వాహనోత్సవం, 29వ తేదీ ఉదయం 7 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, శ్రీవారి అష్టోత్తర, కలశాభిషేకం, చక్రతీర్థం, తదితర పూజాలతో ఉత్సవాలు ముగుస్తాయి. -
డిప్యూటీ స్పీకర్ సంతకం ఫోర్జరీ
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ సంతకం, నకిలీ అధికారిక పత్రం (లెటర్హెడ్) ఫోర్జ రీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అధికారిక బదిలీలను ప్రభావితం చేసే ప్రయత్నంలో డిప్యూటీ స్పీకర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం, నకిలీ లెటర్హెడ్ను ఉపయోగించడం వంటి ఆరోపణలకు సంబంధించి స్థానిక పోలీస్స్టేషన్ లో కేసు నమోదైంది. దీని ఆధారంగా కమిషనరేట్ పోలీసులు ప్రభుత్వ ఇంజనీర్ను అదుపు లోకి తీసుకున్నారు. ఈయన కెంజొహర్ జిల్లా హరిచందన్పూర్లో పని చేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణ్ హెంబ్రమ్గా గుర్తించా రు. విచారణ నిమిత్తం అతడిని రాజధాని పోలీసులు భువనేశ్వర్కు తీసుకువచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీని సిఫార్సు చేస్తున్నట్లుగా నకిలీ అధికారిక లేఖపై రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ భవానీ శంకర్ భోయ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణతో ఈ కేసు నమోదైంది. కేసు లో మరో పాత్రధారి కెంజొహర్ జిల్లా బన్సపాల్ మండలం జూనియర్ ఇంజనీర్ మోనాలిసా బెహరా కోసం దర్యాప్తు బృందం అధికారులు గాలిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ పేరును దుర్వినియోగం చేసి అధికారిక సమాచారాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ ఆయన వ్యక్తిగత కార్యదర్శి స్థానిక క్యాపిటల్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ఊపందుకుంది. విజిలెన్స్ వలలో ఆర్ఐ జయపురం: జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ తహసీల్దార్ పరిధి కొశాగుడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శైలబాలా నాయక్ లంచం తీసుకుంటూ రాష్ట్ర విజిలెన్స్ వలలో పడ్డారు. చేపల చెరువుల పథకంలో లబ్ధిదారుడైన రైతు సబ్సిడీ పొందేందుకు అవసరమైన చెరువు స్థలం ట్రేస్ మ్యాప్ కావాల్సి ఉంది. ట్రేస్ మ్యాప్ ఇచ్చేందుకు శైలబాలా నాయక్ రూ.4 వేలు లంచం అడిగిందని ఆరోపణ. ఈ విషయం ఆ రైతు విజిలెన్స్ అధికారులకు తెలియజేశాడు. మంగళవారం రైతు రెవెన్యూ ఇన్స్పెక్టర్కు రూ.4 వేలు లంచం ఇస్తున్న సమయంలో విజిలెన్స్ సిబ్బంది దాడి చేశారు. ఆమెను డబ్బుతో పట్టుకొని అరెస్టు చేశారు. ఆమెకు చెందిన రెండు ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ దాడికి సంబంధించి కొరాపుట్ రీజన్ విజిలెన్స్ కార్యాలయం, జయపురంలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు విజిలెన్స్ ఎస్పీ ఎస్.సుశ్రీ బుధవారం వెల్లడించారు. యువకుడి అనుమానాస్పద మృతిభువనేశ్వర్: భీంపూర్ కాలువలో యువకుడి మృతదేహం కలకలం రేపింది. మృతుడు అనంతపురం గ్రామానికి చెందిన ప్రభాత్ బెహెరాగా గుర్తించారు. మృతుడి తల, ముఖంపై బలమైన గాయాల గుర్తులు ఉండటంతో హత్యాకాండగా భావిస్తున్నారు. మృతదేహం సమీపంలో ప్లాస్టిక్ పైపు, పగిలిన మద్యం సీసా లభ్యమయ్యాయి. కొంత దూరంలో స్కూటీ పడి ఉంది. పొహలా స్టేషన్ పోలీసులు, క్లూస్టీం బృందం సంఘటనా స్థలానికి చేరి దర్యాప్తు చేపట్టింది. మంగళవారం రాత్రి 12 గంటలకు టెన్నిస్ పాత్రో అనే ఇసుక వ్యాపారి తమ కుమారుడిని ఇంటి నుంచి తీసుకువెళ్లాడని ప్రభాత్ కుటుంబ సభ్యులు తెలిపారు. మద్యం సేవించిన తర్వాత అతడిని హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు. కాలువ గట్టు వద్ద యువకుడి మృత దేహం లభ్యం కావడంతో ఉద్రిక్తత నెలకొంది. నొఖొరా – నియాలి రహదారిని గ్రామస్తులు దిగ్బంధించారు. ఇరువైపులా వందలాది వాహనాలను నిలిపివేశారు. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు రహదారి దిగ్బంధించారు. యువకుడి హత్య ఆరోపణలపై పోలీసులు హైవా యజమానిని, అతని సోదరుడిని విచారిస్తున్నారు. -
● 132 కేంద్రాల్లో ‘నీట్’
భువనేశ్వర్: ఈ నెల 21న జరగనున్న నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పరీక్ష ప్రక్రియను అవాంతరాలు తలెత్తకుండా పూర్తి చేసేందుకు పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తోందని, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 132 కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాలకు మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లా పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు. ఈ మేరకు స్థానిక క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, సీసీటీవీ నిఘా, బ్యాంక్ లాకర్లలో ప్రశ్నపత్రాల భద్రత, కేంద్ర ప్రాంగణం లోపల, వెలుపల శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర ప్రతిస్పందన ఏర్పాట్లపై సమీక్షించారు. తప్పుడు సమాచారం, పుకార్ల వ్యాప్తిపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని డీజీపీ ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లను ముందుగానే పరీక్షించి, ధృవీకరించుకోవాలని అధికారులను కోరారు. పరీక్ష తర్వాత పరీక్షా కేంద్రాల నుంచి ఓఎంఆర్ షీట్లను సేకరించి నిర్దేశిత సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు సంబంధించిన సూచనలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షకు సంబంధించి ఎలాంటి అవకతవకలు, అవినీతి కార్యకలాపాలు లేదా భద్రతా లోపాలను సహించబోమని డీజీపీ స్పష్టం చేశారు. ఎస్పీలందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో క్రైమ్ బ్రాంచ్ డీజీ బినయతోష్ మిశ్రా, శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్, ఐజీ సెంట్రల్ డాక్టర్ సత్యజిత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
100 కిలోల గంజాయి స్వాధీనం
● నలుగురు అరెస్టుమల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితిలోని పోత్కాల్ కాలనీ వద్ద దుప్పట్ల వ్యాపారం పేరుతో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురు వ్యక్తులు దుప్పట్ల వ్యాపారం కోసం ఇక్కడకు వచ్చారు. అయితే వ్యాపారం ముసుగులో గంజాయిని సేకరించి రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి సహకారంతో అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనిపై కలిమెల పోలీసులకు పక్కా సమాచారం చేరడంతో ఐఐసీ ప్రభుదత్తు తన సిబ్బందితో బుధవారం ఆకస్మిక దాడి చేసి నలుగురిని పట్టుకొని రవాణాకు సిద్ధంగా ఉన్న గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని తూకం వేయగా వంద కిలోలు ఉంది. దీని విలువ రూ. పది లక్షలు ఉంటుందని ఐఐసీ ప్రభుదత్తు విలేకరులకు తెలిపారు. నిందితులకు కలిమెల సమితి దారగూఢ గ్రామానికి చెందిన ఇర్మ పడియామి అనే వ్యక్తి సహకరించడంతో అతన్ని కూడా అరెస్టు చేశామన్నారు. అరెస్టయిన వారిలో ఉత్తరప్రదేశ్కు చెందిన జీసాన్ మహ్మద్, అవతాబ్ అలీ, అర్మాన్ ఖాన్ ఉన్నారు. వీరివద్ద నుంచి మూడు బైక్లు, సేల్ఫోన్లు స్వాధీనం చేసుకోని కేసు నమోదుచేసి కోర్టుకు తరలించామని ఐఐసీ ప్రభుదత్తు తెలిపారు. -
మెరుగైన విద్య అందించాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా సరస్వతీ శిశు విద్యామందిర్ పర్యవేక్షణ సమితి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. పర్యవేక్షణ సమితి అధ్యక్షులు బికారీ చరణ్బెహరా అధ్యక్షతన సమావేశం జరిగింది. పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. ఈ విద్యా సంవంత్సరంలో విద్యార్థులకు మెరుగైన విద్య, ఉపాధ్యాయుల బాధ్యయుత శిక్షణ, మెట్రిక్ పరీక్ష ఫలితాల మెరుగుకు కృషి చేయాలని బెహరా అన్నారు. విద్యాలయంలో తరగతి గదుల అభివృద్ధి పనులు కూడా జరిగేలా చూడాలని అధ్యక్షులు సూచించారు. ఈ సమావేశంలో పర్యవేక్షణ కమిటీ సభ్యులు పూర్ణచంద్ర దోళాయి, మధుసూదన పాడీ, బృందావన సామంతరాయ్, ఉపాధ్యక్షులు కేదార్ పట్నాయక్, సహా కార్యదర్శి బబులా సెఠి, కోశాధికారి జిత్తు మిశ్రా, అజిత్ పాత్రో, ప్రధాన ఉపాధ్యయులు ఆరతీ పాడీ, సుధాంశు శేఖర్ పాణిగ్రాహి పాల్గొన్నారు. -
పిల్లలను ఎత్తుకెళ్లే వారంటూ..
● యువకుడు, యువతిపై గ్రామస్తుల దాడి ● ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రాజ్ ప్రసాద్రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ ప్రాంతంలోని ఓ గ్రామంలో పిల్లలను ఎత్తుకెళ్లే వారని అనుమానిస్తూ ఓ యువకుడు, యువతిపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఆజాద్పూర్ ప్రాంతానికి చెందిన సుమన్ ఝా, గుజరాత్లోని సూరత్ ప్రాంతానికి చెందిన అర్పిత సుతారియాలు కొన్నాళ్లుగా కంధమాల్ జిల్లా దారింగిబాడిలో ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి పనిమీద గూగుల్ మ్యాప్ సహాయంతో దారింగిబడి నుంచి స్కూటీపై కలహండి జిల్లా థువామూల్రాంపూర్ వెళ్లారు. అయితే అటువైపుగా రహదారి సరిగ్గా లేదని కొందరు చెప్పడంతో తిరిగి అదే దారిలో వస్తుండగా కొందరు అడ్డగించారు. పిల్లలను ఎత్తుకెళ్లే గ్యాంగ్కు చెందిన వారని ప్రచారం చేస్తూ సుమారు 12 కిలోమీటర్లు వెంబడించారు. కళ్యాణసింగుపూర్ ప్రాంతానికి మంగళవారం రాత్రి చేరుకున్న సమయంలో దాడి చేసేందుకు ప్రయత్నించగా ప్రాణభయంతో ఇద్దరూ కల్యాణసింగుపూర్ విద్యుత్ కార్యాలయంలో దాక్కున్నారు. పిల్లల చోరీ గ్యాంగ్ ఇక్కడికి వచ్చిందని వెంబడించిన వారు కేకలు వేయడంతో గ్రామస్తులంతా అక్కడకు చేరుకుని ఇద్దరిపైనా దాడి చేశారు. అనంతరం కొందరు విడిపించి బాధితులను కళ్యాణసింగుపూర్ పీహెచ్సీకి తరలించారు. అక్కడికి కూడా గ్రామస్తులు చేరుకుని నానా రభస సృష్టించారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ రాజ్ప్రసాద్, ఎస్డీపీఓ గౌరహరి సాహు, కళ్యాణసింగుపూర్ ఐఐసీ కల్పన బెహరా ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అనంతరం యువతీ, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
వైభవంగా ధ్యాన మందిరం ప్రారంభోత్సవం
రాయగడ: స్థానిక డైలీ మార్కెట్లో గల ధ్యానాంజనేయ మందిరం ప్రాంగణంలో నిర్మించిన శ్రీకృష్ణ ధ్యానమందిరం ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీచైతన్య రాంజీ నేతృత్వంతో ప్రత్యేక పూజా కార్య క్రమాలను చేపట్టారు. విగ్రహ, మందిర ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. ఉదయం విష్ణు సహస్రనామాల పారాయణం, జలాభిషేకం తదితర పూజలను చేపట్టారు. సీర అప్పయ్యమ్మ, సీర పోలయ్యల జ్ఞాపకార్థం ఈ మందిరాన్ని నిర్మాంచారు. రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరావు, తదితర ప్రముఖులు మందిరాన్ని సందర్శించి శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీర్వచనాలు పొందారు. -
23 వినతుల స్వీకరణ
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో కాశీనగర్ బ్లాక్ బూదర పంచాయతీలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి బుధవారం గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేశారు. ప్రజావినతుల కార్యక్రమానికి జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, కాశీనగర్ సమితి చైర్పర్సన్ బల్ల శాయమ్మ తదితరులు హాజరయ్యారు. మొత్తం 23 వినతులు ఎమ్మెల్యేకు అందాయి. వాటిలో ముఖ్యంగా రేష న్ కార్డులు, రోడ్లు, గృహానిర్మాణాలు (పి.ఎం.ఎ.వై), పలు సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. వీటిని కాశీనగర్ బీడీఓ డంబుధర మల్లిక్కు ఫోన్ చేసి పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. -
పాఠ్యపుస్తకాల్లో తప్పులు!
● ఉన్నతస్థాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం ● ఏడు రోజుల్లో నివేదికభువనేశ్వర్: పాఠశాల పాఠ్య పుస్తకాలలో భారీస్థాయిలో తప్పులు చోటు చేసుకున్నాయి. దీని పట్ల ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో గుర్తించిన తప్పులపై ఉన్నత స్థాయి విచారణకు బుధవారం ఆదేశించారు. లోక్ సేవా భవన్న్లో జరిగిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి ఈ తప్పిదంపై విచారణకు ఆదేశించడంతో ముగ్గురుతో కూడిన త్రిసభ్య ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. అభివృద్ధి కమిషనర్ అధ్యక్షతన ఈ కమిటీ పాఠ్య పుస్తకాల్లో దొర్లిన తప్పులపై విచారణ జరపనున్నట్టు ప్రకటించారు. పాఠ్యపుస్తకాల తయారీ, ముద్రణ, ప్రచురణ ప్రక్రియ మొత్తాన్ని పరిశీలించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఈ తప్పులకు బాధ్యులైన అధికారులు, విభాగాలు లేదా ఏజెన్సీలను గుర్తించడంతో పాటు, ఈ లోపాలకు దారితీసిన విధానపరమైన లేదా పర్యవేక్షణా వైఫల్యాలను కూడా ఈ కమిటీ అంచనా వేస్తుంది. ఏడు రోజుల్లో నివేదికను సమర్పించాలని కమిటీని సీఎం ఆదేశించారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.ఈ సమావేశానికి పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద గోండ్, ముఖ్య కార్యదర్శి అనూ గర్గ్, ఇతర ఉన్నతాధికారులు వర్చువల్గా హాజరయ్యారు. ప్రభుత్వం సూచించిన పాఠ్యపుస్తకాలలో తప్పులు బయటపడటంపై ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ఆ లోపాలను సరిదిద్ది, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) వర్గాలు తెలిపాయి. పాఠ్యపుస్తకాలలో కనిపించిన తప్పులకు ఏ అధికారులు, విభాగాలు లేదా సంస్థలు బాధ్యత వహించాయో నిర్ధారించే బాధ్యతను విచారణ కమిటీకి అప్పగించారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం కమిటీ నివేదికలోని అంశాలు తదుపరి చర్యలకు ప్రాతిపదికగా లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలలో 1,678 తప్పులు దొర్లినట్లు ప్రచారం కావడంతో పలువురి దృష్టిని ఆకట్టుకుంది. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పాఠ్యపుస్తకాల ప్రతులను పరిశీలన కోసం సమర్పించాలని అధికారులను కోరారు. ఒడిశా పాఠ్యప్రణాళిక – 2025 మరియు జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ – 2020)కు అనుగుణంగా ఎస్సీఈఆర్టి ఒడిశా తయారుచేసిన పాఠ్యపుస్తకాలలో గుర్తించిన 1,678 తప్పులు కేవలం అక్షర దోషాలకే పరిమితం కాలేదు. వాటిలో వాస్తవ దోషాలు, భౌగోళిక వక్రీకరణలు, ప్రముఖుల పేర్ల తప్పుల స్పెల్లింగ్ మరియు తప్పుడు ఫోటోలు ముద్రితం కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అయింది. ఉదాహరణకు కర్ణాటక శాసన సభ ఫోటోను ఒడిశా శాసన సభగా ముద్రించడం, నియమగిరి కొండలను జార్ఖండ్లో ఉన్నట్లుగా తప్పుగా వర్ణించడం, గంజాంలోని బెర్హంపూర్ను నగరం బదులుగా జిల్లాగా పేర్కొనడం మరియు సర్ ఐజాక్ న్యూటన్ను విచిత్రంగా ‘గొప్ప పైలట్‘అని వర్ణించడం వంటివి ఉన్నాయి. ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకాలలో అత్యధిక సంఖ్యలో తప్పులు దొర్లాయి. సంస్కృతం, సాంఘిక శాస్త్రం, సాహిత్యం, ఆంగ్లం మరియు గణితం వంటి సబ్జెక్టులలో కలిపి 705 తప్పులు ఉన్నాయి. ఇలాంటి లోపాలు విద్యార్థులను వారి చరిత్ర, భౌగోళికం, సంస్కృతి మరియు గుర్తింపు గురించి తప్పుదారి పట్టించగలవని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సమావేశానికి పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం కార్యదర్శి ఎన్. తిరుమల నాయక్, ఓఎస్ఈపీఏ డైరెక్టర్ అనన్య దాస్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ మధుస్మిత సాహు తదితరులు హాజరయ్యారు.విద్యార్థులకు సరఫరా అవుతున్న బోధనా సామగ్రి నాణ్యతపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులలో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కమిటీ విచారణ ఫలితం జవాబుదారీతనాన్ని నిర్ధారించి తరగతి గది బోధనపై మరింత ప్రభావం చూపకముందే ప్రభావితమైన పాఠ్యపుస్తకాలలో దిద్దుబాట్లకు మార్గం సుగమం చేస్తుందని ఈ అధికారులు భావిస్తున్నారు. -
నీట్ రీ ఎగ్జామ్ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం
రాయగడ: ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ (యూజీ) రీ ఎగ్జామినేషన్ –2026లో పాల్గొనే విద్యార్థుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు పరీక్షార్థుల కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉచిత బస్సు సేవలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని దూర ప్రాంతాలు, సమితులు, గ్రామ పంచాయతీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. వీరందరికీ పరీక్ష కేంద్రంగా రాయడలోని కేంద్రీయ విద్యాలయం పాఠశాలను నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం విడుదల చేసిన రూట్ మ్యాప్ ప్రకారం గుణుపూర్, పద్మపూర్, కొలనార, కాసీపూర్ ,మునిగుడ, రాయగడ పట్టణం నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పెర్కొన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఉదయం వేళల్లోనే బస్సులు బయలుదేరనున్నాయి. పరీక్షా ముగిసిన 30 నిమిషాల తరువాత తిరుగు ప్రయాణానికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. బస్సుల తిరుగు సమయాలు.. గుణుపూర్ నుంచి రామనగుడ మార్గంలో ఉదయం 7 గంటలకు, గుముడ మార్గంలో ఉదయం 8 గంటలకు బస్సులు బయలుదేరి ఉదయం 10.30 గంటలకు, 11.30 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకుంటాయి. పద్మపూర్ నుంచి గుముడా మార్గంలో ఉదయం7 గంటలకు బయలుదేరే బస్సు 10.30 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరకుంటుంది. కొలనార నుంచి జేకేపూర్, రైల్వే స్టేషన్ మార్గంగా ఉదయం 8 గంటలకు బయలుదేరే బస్సు 10.30 గంటలకు చేరుతుంది. కాసీపూర్ నుంచి టికిరి మార్గంగా ఉదయం 7 గంటలకు బయలుదేరే బస్సు 10 గంటలకు కేంద్రీయ విద్యాలయానికి చేరుతుంది. మునిగుడ నుంచి బిసంకటక్ మార్గంగా ఉదయం 7 గంటలకు బయలుదేరే బస్సు కూడా 10 గంటలకు చేరుకుంటుంది. రాయగడ పట్టణం నుంచి రైల్వే స్టేషన్ మార్గంగా ఉదయం 10 గంటలకు, 11 గంటలకు రెండు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు యంత్రాంగం వెల్లడించింది. ఇవి వరుసగా 10.30 గంటలకు, 11.30 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకుంటాయి. పరీక్ష ముగిసిన అనంతరం 30 నిమిషాల తరువాత అన్ని బస్సులు తిరిగి ఆయా ప్రాంతాల నుంచి బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు. పర్లాకిమిడిలో భారీ వర్షం పర్లాకిమిడి: పట్టణంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు కుండపోత వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. రెండు రోజులుగా ఉక్కపోతతో సతమవుతున్న సమయంలో ఉదయం గంట సమయం వర్షం కురవడంతో వాతావరణంలో మార్పు కనిపించింది. రాయఘడ, జిరంగో, కోయిపూర్, మహేంద్రంలో వర్షం కురిసింది. మహేంద్రతనయ నదిలో వర్షం నీరు చేరింది. నదిలో బియ్యం బస్తాల ట్రక్ బోల్తా ● రూ. 5 లక్షల సరుకు నీటిపాలు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి పంగం గ్రామం వద్ద ఉన్న నదిలో బుధవారం బియ్యం లోడ్తో వెళ్తున్న ట్రక్ బోల్తా పడింది. మల్కన్గిరికి చెందిన కనకదుర్గ రైస్మిల్ నుంచి జయపురం ఎఫ్సీఐ గొడౌన్ 580 బియ్యం బస్తాలతో ట్రక్కు వెళ్తుంది. అయితే వంతెన వద్ద అదుపుతప్పి నదిలో బోల్తా పడ్డింది. ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంగా ప్రాణాలతో బయటకు దూకేశాడు. విషూయాన్ని తన యజమాని పి.సాయికు తెలియజేశాడు. ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ట్రక్ను బయటకు తీయించే ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న మాత్తిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. కాగా నీట మునిగిన బియ్యం పూర్తిగా నానిపోవడంతో సుమారు. రూ. 5 లక్షలు నష్టవాటిల్లిదని మిల్లు జయమాని తెలిపారు. జూద శిబిరాలపై దాడి పర్లాకిమిడి: పట్టణంలో ఆదర్శ పోలీసు స్టేషన్ అధికారులు జూదశిబిరాలు, పబ్లిక్ స్థలాల్లో మద్యపానం, బైక్ చోరీలపై దాడులు చేపట్టారు. మోడల్ పోలీసు స్టేషన్ అధికారి (ఐఐసి) ప్రశాంత్ భూపతి మంగళవారం రాత్రి ఆంధ్ర– ఒడిశా సరిహద్దు కెరండీ గ్రామం సమీపంలో డాలింబపూర్ అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న జూద శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. మరో 20 మంది పోలీసుల రాక గమనించి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రూ. 17,800, మూడు ఫోన్లు, మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పర్లాకిమిడి పరిధిలో శాంతి భద్రతలు విఘాతం కల్పిస్తున్న కొంతమంది మహేంద్ర తనయ నది ఒడ్డున బి.ఎన్.ప్యాలస్ వద్ద రాత్రి మద్యపానం చేస్తున్నవారిపై పెట్రోలింగ్ సిబ్బంది దాడులు జరిపి పది మందిని అరెస్టు చేశారు. వారిని కూడా ఆదర్శ పోలీసు ష్టేషన్కు తీసుకువచ్చి హెచ్చరించి రాతపూర్వక లేఖలు తీసుకుని విడిచిపెట్టామని ఐఐసీ తెలియజేశారు. -
ప్రత్యేక టాస్క్ఫోర్స్
బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026‘ఎల్ నినో’ ఎదుర్కోవడానికి .. నీట్ పునఃపరీక్ష సజావు నిర్వహణకు సన్నాహాలు భువనేశ్వర్ : ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలానికి సన్నద్ధత, ఎల్ నినో వల్ల సంభవించే ప్రభావాన్ని ప్రభుత్వం సమీక్షించింది. ఈ సందర్భంగా ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా నీటి లభ్యతను కోసం ముందస్తు ప్రణాళిక, సమన్వయ చర్యలు చేపట్టాలని అన్ని శాఖలను ఆదేశించారు. ఆమె అధ్యక్షతన లోక్ సేవా భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నైరుతి రుతు పవన వర్షాల పరిస్థితి, ఈ సీజన్కు సంబంధించిన అంచనాలు, ఎల్ నినో పరిస్థితుల వల్ల తలెత్తే ఏవైనా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన ఆకస్మిక చర్యలపై చర్చించారు. భారత వాతావరణ శాఖ (ఐఎమ్డీ) ప్రకారం రుతు పవనాలు కోస్తా ఒడిశా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు తాకాయి. ఇతర ప్రాంతాల్లో వర్షపాతానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఎల్ నినో కారణంగా దేశ వ్యాప్తంగా సాధారణం కంటే కొద్దిగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ గత విశ్లేషణ ప్రకారం ఒడిశాపై దీని ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. ఎల్ నినో పరిస్థితులు పొంచి ఉన్నప్పటికీ రాష్ట్రంలో వర్షపాతం సాధారణం, సాధారణం కంటే కొంచెం తక్కువగా లేదా సాధారణం కంటే ఎక్కువగా కూడా ఉండవచ్చని అధికారులు తెలియజేశారు. అయితే వర్షపాతం లోటు ఏర్పడే ఏ పరిస్థితిని అయిన పూర్తిస్థాయి సన్నద్ధతతో ఎదుర్కోవాలని ప్రముఖ కార్యదర్శి అధికారులకు తెలియ జేశారు. ముందస్తు ఆకస్మిక ప్రణాళికల్లో భాగంగా వర్షపాత సరళి, జలాశయాల నీటిమట్టాలు, వ్యవసాయ కార్యకలాపాలు, నీటి వనరులను నిరంతరం పర్యవేక్షించాలని ఆమె శాఖలను ఆదేశించారు. సమావేశంలో ప్రస్తుత వ్యవసాయ సీజన్లో నీటి సంరక్షణ, సూక్ష్మ నీటిపారుదల, జలాశయాల సమర్థవంతమైన నిర్వహణకు సంబంధించిన వ్యూహాలను కూడా సమీక్షించారు. భూ గర్భ జలాల సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో భూగర్భ జలాల పునరుజ్జీవనం, అవగాహన కల్పన కోసం ప్రత్యేకంగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వర్షపాతం లోటు ఏర్పడిన సందర్భంలో తెగుళ్లు, వ్యాధుల నిర్వహణ చర్యలను పటిష్టం చేయడంలో అనుబంధ యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలవనరుల శాఖ నోడల్ శాఖగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లకు నీటి పారుదల ప్రణాళికను రూపొందించడం ఈ కమిటీ ప్రధాన కార్యాచరణ. నీటి పారుదల సామర్థ్యం పెంపు, సమర్థవంతమైన నీటి వినియోగంపై రైతులలో అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తుంది. నీటి లభ్యత, నీటి పారుదల, జల వనరుల నిర్వహణ కార్యకలాపాలు నిరంతరం సమీక్షిస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 57.88 లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యం. ఇందులో 39.04 లక్షల హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి సచిన్ రామచంద్ర యాదవ్ తెలిపారు. ఈ సీజన్లో 2,66,780 క్వింటాళ్ల విత్తనాల సరఫరా ప్రణాళికలో భాగంగా 1,18,787 క్వింటాళ్లకు పైగా విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు అదనంగా 14,350 క్వింటాళ్ల విత్తనాలను నిల్వ అందుబాటులో ఉంచారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు రాష్ట్రానికి 11.43 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. ఈ మేరకు అన్ని జిల్లాల్లో నిల్వలు పుష్కలంగా ఉన్నాయని సహకార శాఖ తెలియజేసింది. ఎరువుల పంపిణీలో అవకతవకల నివారణకు నిరంతర పర్యవేక్షణతో సమీక్షిస్తారు. జిల్లా, మండల స్థాయిలలో నిఘా బృందాలు పని చేస్తాయి. ప్రస్తుత సీజన్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద సుమారు 25 లక్షల మంది రైతులను చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద కుమార్ పాఢి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శుభా శర్మ, వ్యవసాయ,రైతు సాధికారత శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి సచిన్ రామచంద్ర యాదవ్, సహకార శాఖ కమిషనర్ కమ్ సెక్రటరీ, ప్రత్యేక సహాయ కమిషనర్ రాజేష్ ప్రభాకర్ పాటిల్, ఐఎండీ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ మనోరమ మహంతి, ఒడిశా వ్యవసాయ మరియు సాంకేతిక విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్, వివిధ శాఖల సీనియర్ అధికారులు హాజరయ్యారు. -
విజయోత్సవ సభకు ఏర్పాట్లు
భువనేశ్వర్: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పన్నెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19, 20 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ ఉన్నత స్థాయి పర్యటన పురస్కరించుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక లోక్ సేవా భవన్లో మంగళ వారం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన బ్లూప్రింట్, భద్రతా ఏర్పాట్లపై వివరంగా చర్చించారు. ముఖ్యంగా భారీ బహిరంగ సభ, వీవీఐపీల రాకపోకల సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రపతి జన్మ దినోత్సవం ముఖ్యమంత్రి సమీక్ష ప్రకారం ఈ నెల 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంత జిల్లా మయూర్భంజ్ 2 రోజుల పర్యటనకు రానున్నారు. జూన్ 20 భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జన్మ దినం సందర్భంగా రాష్ట్రపతి తన జన్మస్థలం, తొలి కర్మ క్షేత్రం అయిన రాయరంగపూర్ పర్యటించడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వస్థలంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20న రాయరంగపూర్కు విచ్చేసి చారిత్రాత్మక రాష్ట్ర స్థాయి భారీ కార్యక్రమంలో రాష్ట్రపతితో కలిసి పాల్గొంటారు. జాతీయ స్థాయిలో ఇద్దరు అగ్ర స్థాయి నాయకులు రాష్ట్రంలో ఒకే వేదికపై ప్రసంగించడం గొప్ప విశేషంగా ముఖ్యమంత్రి తెలిపారు. మయూర్భంజ్ జిల్లా రాయరంగ్పూర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో భారత రాష్ట్రపతి మరియు ప్రధాన మంత్రి సంయుక్తంగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సంయుక్త పర్యటన రాష్ట్ర అభివృద్ధి వేగాన్ని మరింత పెంచుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేదిక నుంచే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఇద్దరూ కలిసి ఒడిశా, మయూర్భంజ్ జిల్లాల కోసం వేల కోట్ల రూపాయల విలువైన ముఖ్యమైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించనున్నారు. మరో వైపు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైల్వే ప్రాజెక్ట్, మెగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 19న రాయరంగ్పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సలహాదారు ప్రకాష్ మిశ్రా, ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా, అభివృద్ధి కమిషనర్ డీకే సింగ్, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శాశ్వత్ మిశ్రా, హోం శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖల అదనపు ప్రధాన కార్యదర్శులు హేమంత్ శర్మ, ఇంటెలిజెన్స్ డీజీ బినయతోష్ మిశ్రా హాజరయ్యారు. -
మళ్లీ అదే దైన్యం..!
సాగుకు సన్నద్ధం..● ఏరువాకకు ముందే యూరియా గుబులు ● ఖరీఫ్కు తగినంత అందించలేమంటున్న ప్రభుత్వం ● అన్నదాతలో ఆందోళన నిబంధనలు ప్రకారమే సరఫరా ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రైతులకు యూరియా సరఫరా చేయడం జరుగుతుంది. ఈ ఏడాది యూరియా దిగుమతి తగ్గే అవకాశం ఉంది. అధిక ధరలకు విక్రయించినవారిపై చర్యలు తీసుకుంటాం. – ఎం.మోహనరావు, వ్యవసాయశాఖాధికారి, ఆమదాలవలస మండలం తగిన యూరియా అందించాలి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూడడం సరికాదు. రైతులకు కావాల్సిన ఎరువులు అందించకపోవడం వల్ల చిన్న, సన్నకారు రైతులే కాకుండా ముఖ్యంగా కౌలు రైతులూ ఇబ్బందిపడే ప్రమాదం ఉంది. దీంతో అధిక నష్టం జరుగుతుంది. అందువలన ప్రభుత్వం ఆలోచించి తగిన యూరియా అందించేందుకు చర్యలు తీసుకోవాలి. – పి.రాము, రైతు, వంజంగిపేట, ఆమదాలవలస ఆమదాలవలస రూరల్: అన్నదాత గుండెల్లో యూరియా గుబులు మొదలయ్యింది. వచ్చే ఖరీఫ్ సీజన్కు తగిన యూరియా అందించలేమని ప్రభు త్వం చేతులెత్తేయడంతో సాగుపై భయం నెలకొంది. ఎకరానికి ఒక బస్తా లేదా ఎకరాన్నరకు ఒక బస్తా చొప్పున మాత్రమే ఈ ఏడాది యూరియా అందించగలమని అధికారులు ముందే చెప్పడంతో గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఈ ఏడాది పంటలు ఎలా పండించాలోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తొలకరి వర్షాలు ప్రారంభమవ్వడంతో ఏరువాకకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి మన ప్రాంతంలో ఎకరానికి రెండు లేదా మూడు బస్తాల యూరియాతో పాటు తగిన కాంప్లెక్స్ ఎరువులు వేస్తే కానీ పంట దిగిబడులు వచ్చే అవకాశం లేదు. అయితే అధికారులు ముందుగానే రైతులకు తగిన యూరియా అందించలేమని చెప్పడంతో అన్నదాతలు భయాందోళన చెందుతున్నారు. భారీగానే నిల్వలు వాస్తవంగా జిల్లాకు పలు కంపెనీల నుంచి ఏజెన్సీలు ఉన్నాయి. రైల్వే వ్యాగన్లు ద్వారా ఆమదాలవలస పట్టణానికి యూరియా దిగుమతి అవుతోంది. అయితే ఈ ఏడాది యూరియా కొరత ఉండవచ్చని ముందుగానే గ్రహించిన ఏజెన్సీలు ముందు నుంచి భారీ నిల్వలకు ప్రణాళికలు చేశారు. పలు ప్రభుత్వ గోదాంలతో పాటు అనేక ప్రైవేటు గోదాంలు లీజ్కు తీసుకొని భారీ నిల్వలు వేస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలో చెందిన వ్యాపారులకు పలు ఏజెన్సీల నుంచి అందించడం జరుగుతుంది. అయితే ముందస్తుగానే నిల్వలు పెంచుకొని రైతులు నుంచి భారీ వసూళ్లకు ఏజెన్సీదారులు, వ్యాపారులు కుమ్మక్కు అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృత్రిమ కొరతతో దోపిడి స్థానికంగా ఉండే కొందరు వ్యాపారులు ఏజెన్సీదారులతో కలిసి ఇప్పటినుంచే కృత్రిమ కొరత సృష్టించి అన్నదాతల నుంచి భారీ దోపిడీకి పాల్పడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బస్తాకు మీకు ఇంత.. మాకు ఇంత అని వ్యాపారులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇంకా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే ప్రభుత్వ ధర ప్రకారం రూ.278 లకు విక్రయించాల్సిన యూరియా బస్తా రూ.500ల నుంచి రూ.550ల వరకు ధర పలుకుతోంది. అంటే ఇక ఖరీజ్ సీజన్ ప్రారంభమైతే బస్తా ధర ఏ స్థాయిలో ఉంటుందో అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారుల కళ్లెదుటే ఈ వ్యవహారం జరుగుతున్నా చోధ్యం చూస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందువలన ఇప్పటికై నా వ్యవసాయశాఖ విజిలెన్స్ అధికారులు రంగ ప్రవేశం చేసి ఽయూరియాపై ధరలు నియంత్రణ చేయకపోతే, అన్నదాతలకు అవస్థలు తప్పవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సీడ్ బాల్స్ తయారీ
రాయగడ: పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ, అటవీ విస్తరణ లక్ష్యంగా జిల్లాలోని కుంభికోట పంచాయతీ ఉదయపూర్ గ్రామంలో సాలార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6 వేల సీడ్బాల్స్ తయారీ కార్యక్రమం విజయవంతమయ్యింది. వర్షాకాలంలో వీటిని కొండ ప్రాంతాలు, బంజరు భూములు, అడవి పరిసర ప్రాంతాల్లో విసరడం ద్వారా మొక్కలు మొలకెత్తే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సాలార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ పండ మాట్లాడుతూ.. ప్రకృతి మనిషికి జీవనాధారమైన గాలి, నీరు ఆహారాన్ని అందిస్తుందని, అందువల్ల ప్రకృతి సంరక్షణ ప్రతీ ఒక్కరి నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం సీడ్ బాల్స్ తయారీ విధానం, వాటి ఉపయోగాలు, వర్షాకాలంలో వాటిని ఎలా వినియోగించాలో గ్రామస్తులకు వివరించారు. అదేవిధంగా స్థానిక స్వయం ప్రతిపత్తి కళాశాలకు చెందిన ఆరుగురు ఇంటర్న్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సిబ్బంది స్వర్ణలత పాణిగ్రహి, దీప్తిమయి నాయక్, రంజన్ మండంగి, నర్సి కులసిక తదితరులు పాల్గొన్నారు. -
అరణ్య కథా పఠనం
జయపురం: రొజ్జో సంక్రాంతి ముగిసిన దినాన జయపురం భగ్రా అడవిలో ‘అరణ్య కథా పఠన కార్యక్రమం’ నిర్వహించారు. ఒడిశా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కథా రచయితలు పాల్గొన్నారు. బరగడ్ జిల్లాపైకమాల్ బిజయ కుమార్ ఆహ్వానం మేరకు రుద్ర ప్రసన్న బిశ్వాల్, గేయ రచయిత మీణా స్వైన్, కార్యక్రమ సమన్వయకర్త విజయలక్ష్మీ పాణిగ్రహి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆహ్లాదకరమైన అడవి వాతావరణంలో కథకులు సచిదానంద ప్రధాన్, ప్రదేశీ బారిక్, బిజయ ప్రధాన్, సావిత్రీ పురోహిత్, ప్రీతి నందా పాణిగ్రహి, సునీతా దేవత, పుస్పా నారాయణ్, అభా ఆర్య వంటి ప్రముఖ ఒడియా కథారచయితలు పాల్గొన్నారు. స్థానిక కథా రచయితలు మీణా స్వైన్, రుధ్ర ప్రసన్న బిశ్వాల్, రమేష్ సాహు, రవి శతపతి, శుభ నారాయణ్ స్వైన్, నిరంజన్ పాణిగ్రహి, విజయలక్ష్మీ పాణిగ్రహి, పుష్పలత ముదులి, పంకజ్ మహంతి, సమర్పితా పాణిగ్రహి, నివేదిత పాణిగ్రహి తమ స్వీయ కథలను చదివి వినిపించారు. పలు జిల్లాల నుంచి వచ్చిన కథా రచయితలకు ‘కొరాపుటియ మండియా సూప్’ కొరాపుట్ కాఫీలు కొరాపుట్ జిల్లా కమ్మని వంటకాలతో నిర్వాహకులు విందునిచ్చారు. -
కాశీనగర్ గ్రీవెన్స్లో 20 వినతుల స్వీకరణ
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామ ముఖిపరిపాలన, స్పందన కార్యక్రమానికి 20 వినతులు అందాయి. ఆదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫల్గునీ మఝి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి దయామయ పాఢి, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ పాల్గొన్నారు. కాశీనగర్, గొరిబోంద, ఖండవ, పురుటిగుడ పంచాయతీల నుంచి 20 వినతులు అందాయి. వాటిలో గ్రామసమస్యలకు సంబంధించినవి పది, వ్యక్తిగతానికి సంబంధించి పది ఉన్నాయి. జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం ద్వారా ఎనిమిది మందికి మధుబాబు పింఛన్ పథకం కింద డబ్బులు అందజేశారు. అలాగే దివ్యాంగునికి ప్రభుత్వ వివాహా ప్రోత్సాహకం క్రింద రూ. 2.50 లక్షల చెక్కును లబ్థిదారునికి అందజేశారు. కాశీనగర్ బీడీవో డంభుధర మల్లిక్, సీడీఎంవో, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పూరీ బ్లూ ఫ్లాగ్ బీచ్లో చత్తీస్గఢ్ బాలుడు మృతి
భువనేశ్వర్: పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన అలల ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయిన మైన ర్ బాలుడు మృతి చెందాడు. మృతుడు చత్తీస్గఢ్కు చెందిన పర్యాటకుడు పియూష్ కుమార్గా గుర్తించారు. సహాయం కోసం కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు విని విధుల్లో ఉన్న లైఫ్గార్డ్ తక్షణమే స్పందించి నీటి లోకి దూకి ఆ బాలుడిని రక్షించాడు. ఒడ్డుకు చేర్చిన బాధిత బాలుని పూరీ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు అతడు మరణించినట్లు ప్రకటించారు. పోస్ట్మార్టం పూర్తి చేసి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ఎదురెదురుగా వచ్చిన ట్రాలర్లు ఢీ భువనేశ్వర్: సుందర్గఢ్ జిల్లా 10వ నంబర్ జాతీయ రహదారి కొంయితర సమీపంలో 2 ట్రాలర్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో వాటిలో మంటలు చెలరేగాయి. మంటల్లో 2 ట్రాలర్లలోని ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం అయ్యారు. ఝార్సుగుడ నుంచి సుందర్గఢ్ వైపు వెళ్తున్న ట్రాలర్ అదుపు తప్పి రోడ్డు డివైడర్ను దాటడంతో.. ఎదురుగా సుందర్గఢ్ నుంచి ఝార్సుగుడ వైపు ఎదురుగా వస్తున్న మరో ట్రాలర్ను ఢీకొంది. ఆ ధాటికి ఒక ట్రాలర్లో డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో చెలరేగిన మంటలు అతి వేగంగా రెండు వాహనాలను చుట్టుముట్టాయి. స్వల్ప వ్యవధిలో రెండు వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, భస్మ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రెండు వాహనాల ఇద్దరు డ్రైవర్లు లోపలే చిక్కుకుపోయి అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మృతి చెందిన ఇద్దరు డ్రైవర్ల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి మరిన్ని వివరాల కోసం విచారిస్తున్నారు. మునిగుడలో వినతుల స్వీకరణ రాయగడ: జిల్లాలోని మునిగుడలో ఏడీఎం నవీన్ చంద్ర నాయక్ అధ్యక్షతన వినతుల స్వీకరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఎస్పీ రాజ్ ప్రసాద్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ కెముండో, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనిల్ తదితర అధికారులు పాల్గొన్నారు. సమితిలోని వివిధ ప్రాంతాల నుంచి 81 వినతులను స్వీకరించారు. గ్రామ సమస్యలను పరిగణలోకి తీసుకుని త్వరితగతిన సమస్యలను పరిష్కరించేలా, సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏడీఎం నవీన్ చంద్ర నాయక్ ఆదేశించారు. ఘాట్ రోడ్డులో రెండు బస్సులు ఢీ పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ మెట్టిఅంబ గ్రామం ఘాటీ మలుపు వద్ద మంగళవారం రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ముగ్గురు ప్రయాణికులు గాయపడగా, మరో 50మంది ప్రయాణికులు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆర్.ఉదయగిరి పోలీసుల సమాచారం మేరకు.. గంజాం జిల్లా నుంచి ఆర్.ఉదయగిరికి వస్తున్న ప్రైవేటు బస్సు బాలకుమారి బస్సు, రాయగడ జిల్లా నుండి చికిటీ మీదుగా వస్తున్న గిరిధరి బస్సు మెట్టి అంబ గ్రామం వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయని ఆర్.ఉదయగిరి పోలీసులు అధికారి రాకేష్ కుమార్ సాహు తెలియజేశారు. ఈ సంఘటన జరిగిన అనంతరం స్థానికుల సహాయంతో గాయపడిన ముగ్గురిని చంద్రగిరి ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించారు. ఘాటీ రోడ్డులో తరచూ ఇలాంటి ప్రమాదాలకు గురిచేస్తున్న రోడ్డు ప్రక్కల ఆర్.అండ్ బీ అధికారులు భద్రత హెచ్చరికల బోర్డులు ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు. -
దళితుడి స్థలంపై దౌర్జన్యం
● యంత్రాలతో రేకుల షెడ్డును కూల్చేసిన అధికారులు టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలో దళితులపై భౌతిక దాడులు, దళితుల ఆస్తులపై దౌర్జన్యాలు మితి మీరిపోతున్నాయి. ఇటీవల మాసాహెబ్పేట గ్రా మంలో దళిత, గిరిజన యువకులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన మరువక మునుపే అదే మండలం కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఓ దళితుడి ఇంటి స్థలంపై అధికారులు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీకి సానుభూతి పరుడిగా ఉన్నాడనే కారణంతో టీడీపీ నాయకుల ప్రోద్బలంతో గ్రామానికి చెందిన బాధ లక్ష్మీనారాయణ అనే దళితుడి ఇంటికి ఆనుకుని ఉన్న స్థలంలో అతనికి చెందిన రేకుల షెడ్డును యంత్రాలతో తొలగించేసి ఇంట్లో సామాన్లు, ఫలసాయం చిందరవందర చేసేశారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. కొత్తపల్లి గ్రామంలో దళితుడు బాధ లక్ష్మీనారాయణ ఇంటికి ఆనుకుని తన స్థలంలో ఎప్పటి నుంచో రేకుల షెడ్డును వేసుకున్నాడు. ఈయన వైఎస్సార్ సీపీకి సానుభూతి పరుడిగా ఉన్నాడనే కక్షతో అది ప్రభుత్వ స్థలం అని చూపిస్తూ గ్రామానికి చెందిన కొంత మంది టీడీపీ కార్యకర్తలు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఎలాంటి నోటీసులు, సమాచారం, సమయం ఇవ్వకుండా మంగళవారం హఠాత్తుగా కొంత మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు కొత్తపల్లి గ్రామానికి చేరుకుని యంత్రాలతో లక్ష్మీనారాయణకు చెందిన రేకుల షెడ్డును కూల్చేశారు. కుటుంబ సభ్యులంతా మొరపెట్టుకున్నప్పటికీ షెడ్డులో సామాన్లు, ఫలసాయం మొత్తంగా చిందర వందర చేసేశారు. గ్రామంలో సాగునీటి కాలువను కొంత మంది టీడీపీ కార్యకర్తలు కబ్జా చేస్తున్నారంటూ ఇటీవల కొంత మంది రైతులు అధికారులకు ఫిర్యాదు చేశా రు. దానిపై కక్ష సాధింపు చర్యగా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు కొంత మంది గ్రామస్తులు చెబుతున్నారు. తనపై గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కోరాడ సుబ్రహ్మణ్యం, శిమ్మ సింహాచలం, రెడ్డి మోహన్, రెడ్డి సింహాచలం, రెడ్డి లక్ష్మీనారాయణ తదితరులు కక్ష పెంచుకుని, ఇలా తన రేకుల షెడ్డును కూల్చేశారని బాధిత దళితుడు లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. -
కాలువపై విద్యుత్ తీగలు
హిరమండలం: వంశధార కుడి ప్రధాన కాలువ వద్ద నుంచి విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమా దం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో ఉంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయం చెంతనే వంశధార కుడి ప్రధాన కాలువ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ కాలువ మీదుగా 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ వెళుతోంది. అయితే వైర్లు వేలాడడంతో పాటు గాలికి రాపిడికి గురై నిప్పులు ఎగసిపడుతున్నాయి. చేతికి అందేంత ఎత్తులోనే తీగలు ఉన్నాయి. వంశధార కాలువ పొడవునా రేవులు ఉన్నాయి. స్థానికులు స్నానాలతో పాటు ఇతర అవసరాలకు అటువైపుగా వెళుతుంటారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనతో ఉన్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించింది వైర్లను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలం దృష్ట్యా త్వరగా మరమ్మతు పనులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతదేహం గుర్తింపు పొందూరు: మండలంలోని పెనుబర్తి, బొడ్డేపల్లి గ్రామాల మధ్య రైల్వే పట్టాలపై మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో మృతదే హం గుర్తు పట్టలేని విధంగా తయారైంది. ప్రమాదం ఏ విధంగా జరిగిందీ అనేది తెలియదని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ముగిసిన టెన్నిస్ వేసవి శిబిరాలు శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 50 రోజులుగా నిర్వహించిన టెన్నిస్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఉన్న టెక్నాస్ అకాడమీ వేదికగా నిర్వహించిన ఈ శిక్షణ శిబిరాలకు ఉదయం, సాయంత్రం 30 మందికి పైగా పిల్లలు హాజరయ్యారు. ఆఖ రి రెండు రోజులపాటు లీగ్ మ్యాచ్లు నిర్వ హించి విజేతలుగా నిలిచిన బాలబాలికలకు బ హుమతులు ప్రధానం చేశారు. శిక్షణలో పా ల్గొన్న ప్లేయర్స్ అందరికీ ప్రాతినిధ్యపు సర్టిఫికెట్లను అందజేశారు. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్వీఎస్ఆర్కే నేతాజీ, ఉపాధ్యక్షుడు మూల వెంకటరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.విజయ్కృష్ణ తదితరులు హాజరై మాట్లాడుతూ జిల్లాలో లాన్టెన్నిస్ క్రీడాభివృద్ధికి పనిచేస్తున్నామన్నారు. ఆటో నుంచి జారి పడి మహిళ మృతిసరుబుజ్జిలి: వెన్నెలవలస గ్రామానికి చెందిన సవన మీన (38) అనే మహిళ ఆటో నుంచి జారి పడి మృతి చెందినట్లు హెచ్సీ తిరుపతిరావు తెలిపారు. హెచ్సీ అందించిన వివరాలు ప్రకారం.. మంగళవారం ఆమదాలవలస నుంచి స్వగ్రామమైన వెన్నెలవలస ఆటోలో వస్తుండగా మార్గం మధ్యలో ఏబీ రోడ్డు చిన్న షళంత్రి జంక్షన్ వద్ద ఆటో నుండి జారిపడి రోడ్డుపై పడిపోయారు. తలకు బలమైన గాయమైంది. వెంటనే చిన్న జొన్నవలస ఏరియా ఆస్పత్రికి వైద్యం నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతురాలు భర్త ముకుందరావు నెల్లూరులో వలస కూలీగా వెళ్లారని, మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. టెక్కలి రూరల్: స్థానిక అయ్యప్ప నగర్లో గల ఒక హార్డ్వేర్ షాపులో మంగళవారం చోరీ జరిగింది. ఈ మేరకు షాపు యజమాని, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మంగళవారం షాపు యజ మాని తిరుమల రావు షాపులోకి వెళ్లే సమయానికి షాపు వెలుపలి భాగంలో తలుపులు తెరిచి ఉండటం గుర్తించి లోపలకి వెళ్లి పరిశీలించగా క్యాష్ కౌంటర్లు తెరిచి ఉన్నాయి. ఒక కౌంటర్లో ఉన్న సుమారు రూ.1లక్ష50 వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. షాపు వెలుపలి సీసీ కెమెరాలకు గుడ్డలతో కప్పేసి షాపులోని సీసీ కెమెరాలు కట్ చేసి ఉండటం గుర్తించారు. అనంతరం పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే గత కొద్ది రోజులుగా టెక్కలి పరిధిలో జరుగుతున్న చోరీలతో ప్రజలు భయపడుతున్నారు. కొద్ది రోజుల కిందట వేంకటేశ్వర కాలనీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అది మరువక ముందే స్థానిక సంతోషిమాత ఆలయంలో చోరీ జరిగింది. -
వ్యవసాయం నిర్వీర్యం చేయడానికి కుట్ర
● మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాను దోచేస్తున్నారు ● దుమ్మెత్తిపోసిన వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ టెక్కలి: జిల్లాలో దశాబ్దాల కాలంగా దోపిడీలు, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పెద్ద దోపిడీదారుడు వెన్నుపోటు పార్టీకి చెందిన మంత్రి అచ్చెన్నాయుడు అని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. టెక్కలి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వెన్నుపోటు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతం కావడంతో అది తట్టుకోలేక మంత్రి అచ్చెన్నాయుడు మైక్ పట్టుకుని ఉన్మాదిగా మాట్లాడుతున్నారని తిలక్ దుయ్యబట్టారు. ఈ జిల్లాలో కింజరాపు కుటుంబం గ్రానైట్, ఇసుక, మద్యం, చివరకు ఊకలో సైతం అక్రమాలకు పాల్పడిందని తెలిపారు. ఒకరు భోగాపురం పోర్టు, మరొకరు మూలపేట పోర్టుతో పాటు ఇద్దరు సోదరులు విజిలెన్స్ అధికారం, మైన్స్, ధాన్యం, ఊకలో అక్రమాలు చేసుకుంటున్నారని తిలక్ దుయ్యబట్టారు. ఇటీవల జిల్లాలో సుమారు 11 కోట్ల రూపాయలతో సీఎంఆర్ బియ్యం అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ ఎందుకు వేయ లేదని తిలక్ ప్రశ్నించారు. సీఎంఆర్ బియ్యం, ఊక అక్రమాల్లో కింజరాపు కుటుంబానికి ఎంత వాటాలు చేరాయని తిలక్ నిలదీశారు. ఎన్నికల మునుపు ఇచ్చిన హామీల్లో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, పూర్తి స్థాయి బస్సుల్లో ఉచిత ప్ర యాణం, లబ్దిదారులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేకపోయారని, అందుకే వెన్నుపోటు పార్టీగా పిలుస్తున్నారని తిలక్ గుర్తు చేశారు. వ్యవసాయ శాఖకు అచ్చెన్నాయుడు మంత్రిగా ఉండడం పెద్ద అరిష్టంగా మారిందన్నారు. రైతులు వరి వేయొద్దని చెప్పడం సిగ్గుచేటుగా లేదా అని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని నిర్వీ ర్యం చేయడానికి కుట్ర పన్నుతున్నారని అన్నా రు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కాకుండా సొసైటీల ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన ఆదేశాల వెనుక పెద్ద అవినీతి జరగబోతోదని తిలక్ పేర్కొన్నా రు. మోంథా తుఫాన్ బాధితులకు రూపాయి పరిహారం ఇవ్వలేదన్నారు. ఓటర్ల జాబితా సమ గ్ర సర్వే పారదర్శకంగా నిర్వహించాలన్నారు. టెక్కలి నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు మ్యాపింగ్ చేశారని ఇందులో ఆర్డీఓ తన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, నాయకులు సంపతిరావు హేమసుందర్రాజు, కిల్లి అజయ్కుమార్, చిన్ని జోగారావు, ఎస్.జనార్ధన్రెడ్డి, బడ్డ రాజేష్, ఎస్.వినోద్, కె.జీవన్ తదితరులు ఉన్నారు. -
ముగిసిన రొజ్జో ఉత్సవాలు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో చివరి రోజైన మంగళవారం రొజ్జో ఉత్సవాలను జిల్లాకు చెందిన ఓ జంట ఆఔమా గురుకులంలో విద్యార్థులతో కలిసితో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా రత్నకర్ దాస్ జంట తమ వివాహ వార్షికోత్సవాన్ని పిల్లలతో జరుపుకున్నారు. రొజో చివరి రోజు ఇక్కడ పిల్లలకు స్వీట్స్ ఇచ్చి ఊయలు ఊగి వారితో కలిసి ఉత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. ఇక్కడ నివసిస్తున్న పిల్లలు అనాథులు. అందుచేత ఈ జంట తమ ఇంట ఏటువంటి చిన్న పండగ జరిగిన వేడుక జరిగిన ఇక్కడ పిల్లలతో జరుపుకుంటారు. అలాగే రత్నకర్ దాస్ ఆయన భార్య సుచిత్ర దాస్ల 36వ వివాహ మహోత్సవాన్ని కూడా పిల్లలతో ఆనందంగా జరుపుకున్నారు. ఆఔమా గురుకులం స్థాపికుడు వినస్ మిశ్రో పాల్గొన్నారు.


