breaking news
Odisha News
-
హైటెక్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
భువనేశ్వర్: వివాహ వేడుకలో ద్రవ నైట్రోజన్ పదార్థాలు, పానీయాలు సేవనంతో ఆకస్మిక అనారోగ్యానికి గురైన యువకుడిని హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం అరుదైన శస్త్ర చికిత్సతో ప్రాణాలు కాపాడారు. స్థానిక జగన్నాథ్ నగర్కు చెందిన సంజీవ్ త్రిపాఠి అనే 34 ఏళ్ల వ్యక్తి కడుపు వాపు వ్యాధితో హైటెక్ ఆస్పత్రి అత్యవసర విభాగంలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించి తక్షణమే ఐసీయూలో చేర్చి నిర్వహించిన సీటీ స్కాన్లో నైట్రోజన్ గ్యాస్ ప్రభావం కారణంగా అతని కడుపులో 3 నుంచి 4 సెంటీ మీటర్ల రంధ్రం ఏర్పడిందని తేలింది. ప్రాణాలు కాపాడేందుకు గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ ప్రేమానంద్ పట్నాయక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో చేసిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. కడుపులోని రంధ్రం మూసివేయడంతో ముప్పు తప్పింది. హైటెక్ వైద్య నిపుణుల బృందం సమయస్ఫూర్తితో తీసుకున్న చర్యలు అభినందనీయమని హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి హర్షం వ్యక్తం చేశారు. -
మావో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
● యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీ సంజీవ్ కుమార్ పండా రాయగడ: ఒడిశాను మావో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ విభాగం కృషి చేస్తుందని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుందని యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీ సంజీవ్ కుమార్ పండా అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం నాడు నాగావళి, జంఝావతి, ఘుంసుర దళాలకు చెందిన 15 మంది మావోయిస్టులు పోలీసుల సమక్షంలో లొంగిపొయారని వారిలో టాప్ లీడర్స్ ఉన్నారని తెలిపారు. మార్చి నెలఖరు నాటికి రాష్ట్రంలో సంపూర్ణంగా మావోలను కూకటి వేళ్లతొ పెకిలించివేస్తామని అన్నారు. అయితే ఇప్పటికే కొంతమంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసులు సమక్షంలో లొంగిపోవడం శుభపరిణామమని అన్నారు. రాయగడ, కంధమాల్, కలహండి వంటి జిల్లాల్లో కొంతవరకు మావో కదలికలు ఉన్నాయని ఆయన వివరించారు. కొరాపుట్, నువాపడ, నవరంగపూర్, బౌధ్, మల్కన్గిరి జిల్లాలను ఇప్పటికే మావో రహిత జిల్లాలుగా ప్రకటించామని అన్నారు. 1998లో తాను ఎస్పీగా ఉన్న సమయంలో ఎక్కువగా మావోల కదలికలు ఉండేవి, ప్రస్తుతం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో మావోల అణచివేత చర్యలకు విశేషంగా కృషి చేశానని అన్నారు. రాయగడ, కంధమాల్, కలహండి జిల్లాల్లో ఇప్పటికీ మావోల కదలికలు ఉన్నాయని ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కలసి సుమారు 35 నుంచి 40 వరకు మావోయిస్టులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు పోలీస్ శాఖ గుర్తించిందని అన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. లొంగిపోయిన వారి వివరాలు.. జగత్సింగ్పూర్కు చెందిన బలికుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని తెంతులిబిలరి గ్రామానికి చెందిన నిరంజన్ రౌత్ అలియాస్ నిహార్, ఆయన భార్య రస్మిత లెంక అలియాస్ అంకిత, ఇందు, చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వికాష్ అలియాస్ సునీల్, సుందర్ అలియాస్ గంపా ఒయం, ప్రదీప్ అలియాస్ సొను, రొషని అలియాస్ పల్లి మాడ్వి, అరుణ అలియాస్ ఆర్ణ, సుకి మాడ్వి, కుమారి అలియాస్ పొజికారం, దీపక్ అలియాస్ బమన్ బెకొ, రాకేష్ అలియాస్ జగా కవాసి, లలిత్ అలియాస్ సనకుంజామ్, రాజీ అలియాస్ ఛొటి ఉయ్క, మాలతి అలియాస్ ఇద్మి సొధిలు ఉన్నారు. లొంగిపొయిన మావోయిస్టుల నుంచి ఏకే47–రైఫల్ లు రెండు, ఎస్ఎల్ఆర్ రైఫల్–5, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్– 1, 303 రైఫిల్స్ –1, కార్బయిన్ రైఫిల్ 3, నాటుతుపాకీలు 3, 12 బొర్మసింగిల్ బారెల్ బ్రీచ్ లోడింగ్–1 లతొ పాటు తుపాకీ గుళ్లును మావోలు సమర్పించారు. సమావేశంలొ ఐజీ ఆపరేషన్స్ దీపక్ కుమార్, డిఐజి అఖిలేశ్వర్ సింగ్, డిఐజి నర్వర్ విశాల్, కంధమాల్ ఎస్పీ హరిష్ బిసి, కలహండి ఎస్పి దేవరకొండ నాగరాజ్, రాయగడ జిల్లా కలెక్టర్ అశుతొష్ కులకర్ణి, ఫిరొజ్ కుజూర్ కమాండెంట్, 4వ బెటాలియన్, రాయగడ పాల్గొన్నారు. -
సాంకేతికతపై శిక్షణ
పర్లాకిమిడి: అభివృద్ధి చెందుతున్న సాంకేతికతపై స్థానిక మహరాజా బాలుర ఉన్నత పాఠశాలలో ఐటీశాఖ ప్రభుత్వ ఒడిశా కంప్యూటర్ అప్లికేషన్ సెంటర్ (ఓకాక్) భువనేశ్వర్ నుంచి విచ్చేసిన నిపుణులు విద్యార్థులకు రోబోటిక్స్, కృత్రిమ మేధా, సైబర్ సెక్యూరిటీపై శనివారం అవగాహన కల్పించారు ఎమెర్జింగ్ టెక్నాలజీ శిక్షణలో ఓకాక్ గజపతి హెడ్ శ్రీకాంత్ మహంతి, అదనపు జిల్లా విద్యాధికారి ఎస్.గిరధర్, హెచ్ఎం మోనాలిసా దాస్ పాల్గొని మాట్లాడారు. దైనందిన జీవితంలో రోబోటిక్స్ ఎలా ఉపయోగపడతాయో వివిధ రోబోలను ప్రదర్శించారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు 120 మంది శిక్షణకు హాజరయ్యారు. కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీపై పలు అంశాలను క్షిరాబ్దితనయ పండా, అశుతోష్ శెట్టి, సూరజ్ స్వయి వివరించారు. ఉపాధ్యాయులు డి.శ్రీరామ్మూర్తి, శుభశ్రీదర్శిని, ఎం.సత్యనారాయణ, జగన్నాథ పట్నాయక్ పాల్గొన్నారు. -
బీజేడీ పార్టీ సంతోష్ మిశ్రా రాజీనామా
కొరాపుట్: ప్రతిపక్ష బీజేడీ పార్టీకి సీనియర్ నాయకుడు సంతోష్ మిశ్ర (పింటూ) రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్కి రాజీనామా లేఖను శనివారం పంపించారు. నబరంగ్పూర్ కి చెందిన పింటూ జనతాదళ్ పార్టీ విద్యార్థి విభాగం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. జనతాదళ్ ఒడిశాలో బీజేడీగా రూపాంతరం చెందినప్పడు పింటూ కూడా బీజేడీలో కొనసాగారు. 1998లో పార్టీ మద్దతుతో నబరంగ్పూర్ మహా విద్యాలయం విద్యార్థి విభాగం అధ్యక్షునిగా గెలుపొందారు. 2002–12 మధ్య కాలంలో పార్టీ జిల్లా యువ విభాగ ఉపాధ్యకునిగా, 2012–16 మధ్య నబరంగ్పూర్ పట్టణ అధ్యక్షునిగా పని చేశారు. సుమారు దశాబ్ద కాలంగా పార్టీ మద్దతుతో జిల్లా కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కొనసాగారు. ప్రస్తుతం విడుదలైన పార్టీ జిల్లా కార్యవర్గంపై అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన పేర్కొన్నారు. పింటూ తండ్రి ప్రకాష్ మిశ్ర పార్టీకి అవిభక్త కొరాపుట్ జిల్లాల జనరల్ సెక్రటరీగా పని చేశారు.పింటూ రాజీనామాతో పార్టీ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. 311 మంది వైద్య పరీక్షలు పర్లాకిమిడి: ఇండియాన్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐ.ఎస్.ఆర్.డి.), క్రాంతి స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా స్థానిక టౌన్హాల్లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు, ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా, ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హనగ శనివారం ప్రారంభించారు. ఈ శిబిరంలో పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి మినాతీకుమారీ దెయి, డి.సి.పి.ఓ అరుణ్ కుమార్ త్రిపాఠి, ప్రొటెక్షన్, ప్రోగ్రాం అధికారి సరలా పాత్రో అతిథులుగా హాజరయ్యారు. 311 మందికి క్యాన్సర్, ఇతర వ్యాధుల స్క్రీనింగ్ చేశారు. ఈ శిబిరంలో జగన్నాథ క్యాన్సర్ ఫౌండేషన్ కవితా మిశ్రా, క్యాన్సర్ నిపుణులు దిలీప్ కోరో, వైద్యులు సుర్జిత్ పాణిగ్రాహి, గిరిధర్ రవుతో, రోజాలినీ శతపతి, ఐ.ఎస్.ఆర్.డి డైరెక్టర్ నాగేశ్వర చౌదరి, క్రాంతి సంస్థ నిర్మలా మిశ్రా, ప్రీతిరాయ్, తదితరులు పాల్గొన్నారు. బోధన–అభ్యాసన ప్రక్రియపై ఆడిట్ ప్రభావం జయపురం: బోధన, అభ్యాసన ప్రక్రియ నాణ్యతపై అకాడమిక్ ఆడిట్ చూపుతుందని, అందువల్ల అకాడమిక్ ఆడిట్ అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక విక్రమదేవ్ విశవ్విద్యాలయంలో ఐక్యూ ఏసీ డైరెక్టర్ డాక్టర్ సుజిత్ కుమార్ దేహురి ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉషా పథకం పరిధిలో అకాడమిక్ ఆడిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విక్రమదేవ్ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర ప్రారంభించారు. బోధన–అభ్యాసన ప్రక్రియ నాణ్యతపై అకాడమిక్ ఆడిట్ ఎందుకు అవసరం, దాని ప్రభావం’ అన్న అంశాలపై చర్చ నిర్వహించారు. నిర్వహణ విక్రమదేవ్ విశ్వవిద్యాలయ రసాయనక శాస్త్రవిభాగ సహయ ప్రొఫెసర్ డాక్టర్ బ్రజబంధు నందా, రసాయన శాస్త్రవిభాగ సహాయ ప్రొఫెసర్ డాక్టర్ స్మిత్ సాగర్ శతపతి, తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీలో పలువురి చేరిక
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలో గల కళ్యాణ మండపంలో బీజేపీ కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.గోపి ఆనంద్ ముఖ్యఅతిథిగా, సీనియర్ నాయకులు శివశంకర్ ఉలక, పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు రామచంద్ర బెహరా, పార్టీ రాష్ట్ర శాఖ ఎస్సీ, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు కాళీరాం మాఝి, జిల్లా సాధారణ కార్యదర్శి భికారి నాహక్, ఉపాధ్యక్షుడు సుశీల్ సురాఫ్, దేవాశీస్ పండ, శాంతను సుబుద్ధి, వర్మిష్టా సామంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపీఆనంద్ మాట్లాడుతూ జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సమితి వారిగా సమావేశాలను నిర్వహించి, పార్టీ సిద్ధాంతాలు, ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించాన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కార్యకర్తలు పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన మిశ్రణ కార్యక్రమంలో బీజేడీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వంద మందికిపైగా కర్యాకర్తలు బీజేపీలో చేరారు. వీరికి గోపీఆనంద్ కండువాలు వేసి స్వాగతం పలికారు. అంతా కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. -
చట్టాలపై అవగాహన అవసరం
పర్లాకిమిడి: బాల్య వివాహాలు రద్దు, నల్సా చట్టాలపై ప్రజాచైతన్య శిబిరాన్ని జిల్లాలో గుసాని సమితి లావణ్యగడ పంచాయతీ కార్యాలయంలో జిల్లా న్యాయసేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రౌళో ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించారు. బాల్యవాహాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని బిమల్ రౌళో అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక మహిళా పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిబిరం జస్టీస్ కార్నర్ చారిటబుల్ ట్రస్టు, నల్సా జాగృతి యోజన ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా అదాలత్ సీనియర్ క్యాడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా, కిశోర్ న్యాయలయం బోర్డు సభ్యులు భాగ్యలక్ష్మీనాయక్, గారబంద పోలీసు ఎస్ఐ అంబికా బెనియా, ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ తపస్వినీ జెన్నా తదితరులు పాల్గొన్నారు. -
ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని మంగువారితోటకు చెందిన నానుబాల లలితారా ణి (72) మృతి చెందడంతో ఆమె నేత్రాల ను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కుమారుడు భవానీప్రసాద్, ఎ.వెంకటరమణ, డోలా వలసయ్యలు విషయాన్ని రెడ్క్రాస్కు తెలియజేయగా సిబ్బంది వచ్చి కార్నియాలు సేకరించారు. అనంతరం విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్ కోరారు. టెక్కలి: మార్చి నెలాఖరులోగా వివిధ రకాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గంలో కొత్తగా రెండు ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి , పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖాధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ అధికారి, అసిస్టెంట్ బీట్ అధికారి, దేవదాయ శాఖ ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్ గ్రేడ్ 3, తానేదర్ ఇన్ ఎ.పి. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 11 వర కు జరిగే ఈ పరీక్షలకుఅభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో హాజరుకావాలని కోరారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 1375 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, కాలేజీ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. పలాస: ఉద్దానం ప్రాంతంలో ఆదర్శ విప్లవకారుడు రాజాం గుణవంతు అని పలువురు వక్తలు కొనియాడారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన రాజాం గుణవంతు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో శనివారం సంతాప సభ నిర్వహించారు. బొడ్డపాడు యర్రయ్య అధ్యక్షతన జరిగి న ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ గుణవంతు నాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారని, పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వాన ఉద్దానం ప్రాంతంలో జరిగిన సముద్రం తీర ప్రాంత భూములు పంపిణీలోను, సారా వ్యతిరేక పోరాటంలో, జీడి రైతాంగ గిట్టుబాటు ధర ఉద్యమంలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు దాసరి శ్రీరాములు, తామాడ త్రిలోచన రావు, కిక్కర ఢిల్లీరావు, బొడ్డు సింహాద్రి, కోత ధర్మారావు, ప్రభాకర్, బొడ్డు దుష్యంతు, మద్దిల ధర్మారావు, సాలిన వీరాస్వామి, మెట్టూరు వీరాస్వా మి, పోతనపల్లి కుసుమ, నైగాపు గంగాధర్, బొడ్డు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస: జీడిమామిడి సాగుతో గిరిజన రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జి.శివన్నారాయణ అన్నారు. ఆమదాలవలస పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ కాష్యూ నట్ అండ్ కోకో డెవలప్మెంట్, కొచ్చిన్ వారి ఆర్థిక సహకారంతో జిల్లా స్థాయి జీడిమామిడి సదస్సును శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జీడిమామిడి గిరిజన రైతులకు ముఖ్య ఆదాయ వనరుగా మారిందని, సరైన సాగు యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. -
బాలల హక్కులు పరిరక్షించాలి
ఆమదాలవలస: బాలల హక్కులపై చట్టసభల్లో సుదీర్ఘ చర్చలు జరపాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం ఆమదాలవలసలోని తన కార్యాలయంలో చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కమిటీ రూపొందించిన 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల సంరక్షణ దేశానికి కీలకమన్న అంశాన్ని యావత్ సమాజంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తెరగాలన్నారు. బాలలపై లైంగిక దాడులు సిగ్గుచేటన్నారు. బాలల హక్కుల కమిషన్లపై రాజకీయ ఒత్తిళ్లు లేనప్పుడే సంపూర్ణ హక్కులు కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు గొండు ధనలక్ష్మి, చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం, తొగరాం పంచాయతీ సర్పంచ్ తమ్మినేని వాణి సీతారాం, వైఎస్సార్ సీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్, ఫోరం శ్రీకాకుళం ప్రతినిధులు కొత్తకోట శ్రీనివాస్, మొదలవలస వాసుదేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ శిక్షణ శిబిరం సందర్శన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 2026 పదవ తరగతి బోర్డు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు నిర్వహిస్తున్న రెండో విడత నివాస శిక్షణ కార్యక్రమాన్ని జగన్నాధపల్లి హైస్కూల్, బలిమెళాలోని పీఎంశ్రీ హైస్కూల్ను శనివారం సందర్శించారు. ఆయనతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి కూడా ఉన్నారు. ఈ నివాస శిక్షణలో తొలివిడతలో 200 మంది ఎంపికై న విద్యార్థులకు నాలుగు కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు ఉచిత భోజనం, విద్యాసామగ్రి, యోగాఅభ్యాసం, నిపుణులచే రోజు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదనపు కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు, బోధనపై ఆరాతీసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి సారించాలని శిక్షణ కేంద్ర నిర్వహికులు ఇ.ఈశ్వరరావుకు సూచించారు . -
పార్టీ బలోపేతమే ధ్యేయం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశాన్ని శనివారం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ పరిడా అధ్యక్షత వహించారు. జిల్లా ఇన్చార్జ్లు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు హాజరయ్యారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో కమిటీలను బలోపేతం చేయడం, శక్తి కేంద్ర ప్రధానులను నియమించడం, కొత్తగా గ్రామ స్థాయి ఏజెంట్లను ఎంపిక చేయడం, మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విస్తరించడం వంటి విషయాలను ప్రస్తావించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ సాహు మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి, చిత్రకొండ మాజీ ఎమ్మెల్యే డోంబుర్ సీశా, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు దశరథి పోడియమి, మాత్తిలి సమితి చైర్మన్ మహేశ్ బాక్క పాల్గొన్నారు. -
ముందుకు సాగాలి: ముఖ్యమంత్రి
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాంకేతిక పరిజ్ఞానంతో ● భారతీయ మజ్దూర్ సంఘ్ 21వ త్రైవార్షిక సమావేశంభువనేశ్వర్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్, క్వాంటం కంప్యూటింగ్ వంటి భవిష్యత్ సాంకేతికతలు కార్మిక రంగాన్ని మారుస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సాంకేతికత పోకడతో కొనసాగేందుకు కార్మిక శక్తిని తిరిగి నైపుణ్యపరచుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పూరీలో జరిగిన భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) 21వ త్రైవార్షిక సమావేశంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మాట్లాడుతూ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, కార్మికుల సంక్షేమం ద్వారా దేశ భవిష్యత్తు వృద్ధిని శక్తివంతం చేయడంలో ఒడిశా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో కార్మికులకు అత్యున్నత గౌరవం ఉందన్నారు. జగన్నాథుడి సంప్రదాయాన్ని ఉటంకిస్తూ ఈ తత్వ శాస్త్రం కార్మిక సంబంధాలను, విధాన రూపకల్పనను మార్గనిర్దేశం చేస్తుంది. కాబట్టి ఏ పనినీ చిన్నదిగా లేదా పెద్దదిగా పరిగణించబోమని ఆయన అన్నారు. భారత దేశం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద శ్రామిక శక్తిని కలిగి ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 13 మిలియన్ల మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) కారణంగా అనేక సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతున్నది వాస్తవం. నైపుణ్యాభివృద్ధి, సరికొత్త్త సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించి ఈ పరిస్థితిని అధిగమించాలని ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో, విద్య, పరిశ్రమల అవసరాల గురించి మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని స్వాగతించారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఐదేళ్లలో 500 అగ్ర స్థాయి కంపెనీలలో ఒక కోటి మంది యువతకు ఇంటర్న్షిప్లను అందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తుందన్నారు. గత 20 నెలల్లో రూ. 2.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరి కొద్ది కాలంలో దాదాపు రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడిని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి శిక్షణ పొందిన, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరం. పాత కార్మిక చట్టాలను సవరించి కార్మికులకు సామాజిక భద్రత, ఆరోగ్య సౌకర్యాలు, ఓవర్టైమ్ నిబంధనలను బలోపేతం చేసేందుకు 4 కార్మిక కోడ్లు జోడించారు. ఒడిశాలో కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఒడిశా భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కింద 5.1 మిలియన్లకు పైగా కార్మికులు లబ్ధి పొందుతున్నారు. వారి పిల్లలకు విద్య, వివాహ సహాయం, ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ. 6 లక్షల వరకు పరిహారం వంటి సహాయాలు అందజేస్తున్నారు. ఐటీఐ, డిప్లొమా కోర్సులకు స్కాలర్షిప్లు, పరిశ్రమల్లో గృహ సౌకర్యాలు, అసంఘటిత కార్మికులకు సంక్షేమ చర్యలు, అనేక జిల్లాల్లో 200 రోజుల ఉపాధి హామీ వంటి పథకాలు వలసలను అరికట్టడానికి సహాయపడుతున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. మారుతున్న కార్మిక రంగంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కార్మిక సంఘాలను అభ్యర్థించారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడుతు నైపుణ్యం పెంపొందించే కార్యక్రమాలకు చురుకుగా మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. 2036 నాటికి ఒడిశా సంపన్న రాష్ట్రంగా, 2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా పయనిస్తోంది. ఈ దార్శనికతను సాధించడంలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తారు. కార్మికుల గౌరవం, భద్రత, భవిష్యత్ను కాపాడటానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు హిరణ్మయి పాండ్యా, డిప్యూటీ జనరల్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ సురేంద్ర కుమార్ పాండే, ప్రధాన కార్యదర్శి రబీంద్ర హిమేతే, ప్రముఖ కార్మిక నేత యుకీ వట్సుజీ, వివిధ దేశాల నుండి వచ్చిన కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మర్రిగుడ దోపిడీ కేసు ఛేదన
పర్లాకిమిడి: గజపతి జిల్లా సెరంగో పోలీసుస్టేషన్ పరిధిలో మర్రిగుడ గ్రామంలో ఈనెల 25న జరిగిన పట్టపగలు చోరీని పోలీసుల బృందం ఛేదించి ముగ్గురు నిందితుల్ని పట్టుకున్నట్టు ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా శనివారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ దొంగతనంలో 300 గ్రాముల బంగారు వస్తువులు, 80 గ్రాముల వెండి వస్తువులు, నగదు ఒకలక్షా 89వేలు పట్టుబడినట్టు ఆర్.లక్ష్మీకళ్యాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. రాణిపేట పంచాయతీలోని డీపీఓ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దొంగతనానికి సంబంధించిన సమాచారం అందజేశారు. 300 గ్రాముల బంగారం విలువ సుమారు రూ.45లక్షలు ఉంటుందని ఎస్పీ పండా తెలియజేశారు. గత నెల 25వ తేదీని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి, ఆర్.లక్ష్మీ కళ్యాణీ తన కుటుంబసభ్యులతో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి మందిరానికి దర్శనానికి వెళ్లారు. తిరిగి అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో మర్రిగుడ తన ఇంటికి చేరుకోగా ఇంటిలో అల్మరా పగులగొట్టి బంగారం, నగదు కొల్లగొట్టినట్టు గుర్తించారు. జనవరి 26న గుమ్మా బ్లాక్ సెరంగో పోలీసు స్టేషన్లో ఆర్.లక్ష్మీకళ్యాణి ఫిర్యాదు చేశారు. దీనిపై హెడ్క్వార్టర్ డీఎస్పీ అమితావ్ పండా ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీమ్ను జిల్లా ఎస్పీ ఏర్పాటుచేసి పదిరోజుల్లో దొంగతనం మిస్టరీని ఛేదించారు. ఆర్.లక్ష్మీకళ్యాణీ ఇంటిలో పట్టపగలు వారి ఇంట్లోకి ముగ్గురు జొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. మూడో దొంగ బయటకాపలా కాశాడు. కాజేసిన బంగారం, వెండి వస్తువులు సమీపంలో అటవీ ప్రాంతంలో గొయ్యి తీసి పాతిపెట్టినట్టు ఎస్పీ జ్యోతింద్ర పండా తెలియ జేశారు. పోలీసులు దర్యాప్తు చేసి అనుమానంగా ఉన్న దొంగలను పట్టుకుని విచారించగా వారు దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. బంగారం, వెండి వస్తువులు శనివారం ఉదయం పాతిపెట్టిన స్థలంలో సెరంగో పోలీసులు సాక్షుల సహాయంతో బయటకు తీసుకొచ్చి విలేకరుల సమక్షంలో ప్రవేశపెట్టారు. మొత్తం బంగారం 300 గ్రాముల వస్తువులు, 80 గ్రాముల వెండి వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. నగదు విషయంపై నిందితులను తర్వాత విచారించనున్నట్టు పోలీసు అధికారులు తెలియజేశారు. నిందితులు ముగ్గురు మర్రిగుడకు చెందిన మరాటి గిరిబాబు, అరుణ్ కుమార్ ప్రధాన్, పరిడా గ్రామానికి చెందిన మురళీ నాయక్ను శనివారం జిల్లా కోర్టుకు తరలించారు. ఇంటి యజమాని ఆర్.లక్ష్మీకళ్యాణీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నది. ఈ దోపిడీకి పాల్పడి పదిరోజుల్లో మిస్టరీని ఛేదించిన జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండాను దుశ్శాలువతో కాశీనగర్ సమితి మాజీ చైర్మన్ ఛిత్రి సింహాఽద్రి, లక్ష్మీ కళ్యాణీలు సత్కరించారు. -
నాల్కో ఎదుట కాంగ్రెస్ ఆందోళన
కొరాపుట్: భారత ఆల్యూమినియ కేంద్రం (నాల్కో) ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. కొరాపుట్ జిల్లా దమంజోడిలోని నాల్కో ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర సీఎల్పీ నాయకుడు, పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర ఖడం మాట్లాడుతూ.. నాల్కో యాజమాన్య వైఖరిపై మండి పడ్డారు. ఇక్కడ నాల్కో పరిశ్రమ ఏర్పాటు కోసం వందలాది కుటుంబాలు నిర్వాసితులుగా మారారని.. అయితే వారిని నేటి వరకు ఆదుకోలేదన్నారు. ఇక్కడ యువతకి ఉపాధి లభిస్తుందనే లక్ష్యంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దీన్ని ప్రారంభించారన్నారు. కానీ నాల్కో మాత్రం నిర్వాసితులకు నేటి వరకు ఉపాధి కల్పించలేదన్నారు. ఇక్కడ ప్రజలకు చెందిన వనరులను నాల్కో తరలించుకుపోతుందని రాం చంద్ర ఆగ్రహవేశం వ్యక్తం చేశారు. ఆందోళనలో లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత, మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ తదితరులు పాల్గొన్నారు. -
గుప్తేశ్వర శైవ పీఠం అభివృద్ధికి రూ.23.93 కోట్లు మంజూరు
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో దక్షిణ ఒడిశాలో ప్రసిద్ధ శివ క్షేత్రం గుప్తేశ్వర్ సౌందర్యీకరణ, ఆ ప్రాంతాన్ని అత్యాధునికంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక విభాగం రూ.23.93 కోట్లు మంజూరు చేసింది. గుప్తేశ్వర్ మందిర ఆధునికీకరణతో పాటుగా ప్రాంతాన్ని అత్యంత సౌందర్యంగా తీర్చి దిద్దేందుకు, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులను పర్యాటకులను ఆకర్షించే విధంగా గుప్తేశ్వర్ను రూపొందిస్తారు. గుప్తేశ్వర్లో మహా శివలింగం దర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్ మొదలగు రాష్ట్రాల నుంచి ప్రతి రోజూ భక్తులు వస్తుంటారు. పర్వద పంక్తులల నడుమ ఒక గుహలో గల 6 అడుగుల పొడవు, 10 అడుగుల కై వారంతో గల అపూర్వ శివలింగం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. మంచినీటి సమస్యను పరిష్కరించండి రాయగడ: స్థానిక సాయిప్రియనగర్ 17, 18 లైన్లలో మంచినీటి సమస్య జఠిలమైంది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆ ప్రాంత మహిళలు సాయిప్రియ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు పొట్టాం రమాదేవితో కలిసి కోరారు. ఈ మేరకు పీహెచ్డీ అధికారిని శనివారం కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ రెండు లైన్లలో దాదాపు పది కుటుంబాలకు చెందిన 50 మంది వరకు నివసిస్తున్నారని.. ఉన్న ఒక్క కుళాయి ద్వారా కూడా రెండు నెలలుగా పనిచేయకపొవడంతో తామంతా సమస్యను ఎదుర్కొంటున్నామని అన్నారు. దీనిపై స్పందించిన అధికారి వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నూతన పాఠ్య పుస్తకాలపై ముగిసిన శిక్షణజయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి బొరిగుమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్షా అభిజాన్ ద్వారా బ్లాక్స్థాయి పాఠ్యక్రమ రూపు రేఖ 2026, నూతన పాఠ్యపుస్తకాలపై ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. బొరిగుమ్మ బ్లాక్ సహాయ విద్యాధికారి సుభాష్ చంద్రమఝి, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు టి.శైలజా దొరల పర్యవేక్షణలో ఐదురోజులు శిక్షణ ఇచ్చారు. నూతన పాఠ్యపుస్తక పాఠ్యాంశలపై శిక్షణ ఇచ్చినట్టు నిర్వాహకులు వెల్లడించారు. మొదటి విడతగా వందమంది ఉపాధ్యాయులు శిక్షణ పొందారన్నారు. మిగిలిన వారికి మరో విడత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని ఏబీఈవో సుభాష్ చంద్ర మఝి వెల్లడించారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. సీఆర్సీసీ ఆశిశ్ కుమార్హొత్త, బౌష్ణవనాథ్ బెహర, ఉపాధ్యాయులు రమేష్ కుమార్ నాయిక్, ఉపాధ్యాయురాలు సొనాలిస దాస్, ప్రీతిప్రాజ్ఞ సాహులు శిక్షణ ఇచ్చారు. -
వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం
● కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలురాయగడ: అమలాభట్ట సమీపంలోని శ్రీక్షేత్ర టౌన్షిప్లో వెలసియున్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి మందిర ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా ఈ నెల ఐదో తేదీ నుంచి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం స్వామి వారి కల్యాణోత్సవం వైభంగా నిర్వహించారు. వేదపండితులు అయ్యవార్లం శ్రీనివాస్ ఆచార్యులు, ఫణిహారం భాస్కరాచార్యులు, తంతిన మోహన క్రిష్ణ, లక్ష్మణ్ ఆచార్యులు, రమేష్ ఆచార్యులు, కాండూరి జగన్నాధ ఆచార్యులు, సాకేత్ ఆచార్యులు, ఆలయ అర్చకులు మంగనాథ ఆచార్యుల ఆధ్వర్యంలో జరిగిన కల్యాణోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అంతకు ముందు ఏకశిల ధ్వజస్తంభ పూజలను సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషశయనంపై స్వామి వారు దర్శనం ఇచ్చారు. అదేవిధంగా ఉత్సవ మూర్తిని ఊరేగించారు. పూజా కార్యక్రమాలను తిలకించేందుకు భక్తుల సందడి కనిపించింది. ఈ నెల పదో తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ తెలియజేశారు. ఆఖరి రోజున చూర్ణోత్సవం, కలశాభిషేకం, చక్రస్నానం, హోమ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా అన్న ప్రసాద సేవన కార్యక్రమానికి భక్తులు హాజరు కావాలని కోరారు. -
సెంచూరియన్లో మంజర్ 4.ఓ ‘డాటాథాన్’ పోటీలు
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో మేనేజ్మెంట్ ఫెస్ట్ ’మంజర్ 4.ఓ’ రెండో రోజును రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్రో ప్రారంభించారు. కార్యక్రమానికి అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ప్రజ్ఞా పాణి, డీన్ (స్టూడెంట్స్) డాక్టర్ సుశాంత్ పట్నాయిక్, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు యం.సుదర్శనరావు, తదితరులు పాల్గొన్నారు. మంజర్ 4.ఓ లో పర్లాకిమిడితో పాటు భువనేశ్వర్ సీఐటీఎం, విజయనగరం కళాశాల ఇంటెల్ విజ్, ఎంబీఏ, సెంచూరియన్ విద్యార్థులు ‘డేటాథాన్’ ప్రాజెక్టులను ప్రజెంట్ చేశారు. పోటీలో విజేతలకు రూ.5 వేలను సెంచూరియన్ వర్సిటీ మేనేజ్మెంట్ బహుమతిగా విజయనగరం క్యాంపస్ ఇంటెల్ విజ్ బృందానికి అందజేశారు. -
ముగిసిన శిక్షణ శిబిరం
భువనేశ్వర్: ప్రభుత్వ దైనందిన కార్యకలాపాలు, అధికారిక వ్యవహారాల్లో ఒడియా భాషను వినియోగించడంపై ప్రభుత్వ అధికారుల కోసం నిర్వహించిన రెండు రోజుల శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి శాఖ సమన్వయంతో ఒడియా భాష అకాడమీ ఈ శిబిరాన్ని నిర్వహించింది. ఒడియా రచనా నైపుణ్యాలు, వాక్య నిర్మాణం, అక్షరాలు మరియు గమనికల తయారీ, అధికారిక సంప్రదింపులు, ఆదేశాల తయారీ, పరిపాలనా పదాల ఎంపిక, పద దోష నివారణలో జాగ్రత్తలు, ఇంగ్లిష్ నుంచి ఒడియా అనువాదం తదితర పనులపై శిక్షణ కల్పించారు. 13 విభాగాల నుంచి 100 మందికి పైగా ప్రభుత్వ అధికారులు ఈ శిబిరంలో శిక్షణ పొందారు. ఒడిశా సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ చంద్ర శేఖర్ హత్తా ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు. డాక్టర్ కై లాస్ చంద్ర టికాయత్ రాయ్, సురేంద్ర కుమార్ దాస్ ప్రభుత్వ అధికారులకు పరిపాలనా పనిలో ఒడియా భాష వాడకం మరియు ఒడియా భాషలో అక్షరాలు మరియు గమనికల తయారీపై శిక్షణ ఇచ్చారు. -
బడ్జెట్పై సమాలోచనలు
● వివిధ రంగాలకు చెందిన 50 మందికి పైగా నిపుణులు హాజరు భువనేశ్వర్: ప్రభుత్వ బడ్జెట్ తయారీ ప్రక్రియ సచివాలయం నుంచి ప్రజల వద్దకు చేరుకుంది. ప్రజల నుంచి వారి విలువైన అభిప్రాయాలకు పట్టం గట్టే రీతిలో జాగ్రత్తగా పరిశీలించి, విశ్లేషించిన తర్వాత బడ్జెట్లో ప్రవేశ పెడుతున్నారు. ప్రభుత్వం ప్రజల బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఈ సన్నాహం చేస్తుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన అధ్యక్షతన బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశం జరిగింది. లోక్ సేవా భవన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశంలో పలు రంగాల నిపుణులు, పౌర సమాజం ప్రముఖులు, వివిధ రంగాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల గురించి చర్చించారు. ఇటీవల ప్రారంభించిన ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజనను ప్రజల అభిప్రాయం నుంచి సేకరించి అమలు చేసినట్లు ఉదహరించారు. అలాగే అమలు చేయబోయే శ్రీ జగన్నాథ్ దర్శన్ కార్యక్రమం, కటక్, భువనేశ్వర్, పారాదీప్, పూరీ ఆర్థిక ప్రాకారం ప్రాజెక్ట్ ప్రజా అభిప్రాయం నుంచి వెలుగు చూసిన అంశాలుగా వివరించారు. ప్రజా అభిప్రాయం ఆధారంగా విధానాలు, ప్రణాళిక కార్యక్రమాలలో అవసరమైన మార్పులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ వివిధ కార్యక్రమాలు, ప్రణాళికలు మరియు ప్రకటనలకు సంబంధించి పలు వర్గాల అభిప్రాయాలు, సూచనలను ఆహ్వానించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ, ఉద్యోగ సృష్టి, ఆర్థిక వృద్ధికి ఊతం పొందింది. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా ఆధారిత కార్యక్రమాలు, మహిళలు, రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచాయి. 2026–27 కేంద్ర బడ్జెట్లో కూడా రాష్ట్రంలో అనేక చర్యలు ప్రకటించారు. 2026–27 బడ్జెట్ తయారీకి వెబ్ పోర్టల్స్, ఈ–మెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా పెద్ద సంఖ్యలో ఆలోచింపజేసే సూచనలు వెల్లువలా దాఖలు అవుతున్నాయి. ప్రజా ప్రభుత్వంలో ప్రజల అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించనున్నారు. సమావేశంలో అందిన సూచనలన్నింటినీ రికార్డ్ చేసి లోతుగా ఆలోచించి పరిగణించాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. మాజీ ఆర్థిక మంత్రి ప్రఫుల్ల ఘొడై, నిరంజన్ పూజారి, మాజీ ఆర్థిక కార్యదర్శి అర్ధేందు షడంగి, ఏకే త్రిపాఠి, ఆర్ఎన్ శతపతి, ఒడిశా వ్యాపారవేత్తల సమాఖ్య, ఒడిశా యువ పారిశ్రామికవేత్తల సమాఖ్య, ఎన్జీఓ సభ్యులు, ఫిన్టెక్ సీఈఓలు, వివిధ రంగాలకు చెందిన సామాజిక కార్యకర్తలు, క్రెడాయ్ ఉపాధ్యక్షురాలు, సీనియర్ రాజకీయ నాయకులు శారద శతపతి, అనిల్ శర్మ, మనోజ్ మహా పాత్రో, వివిధ రంగాలకు చెందిన 50 మందికి పైగా ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా, ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, అభివద్ధి కమిషనర్ డీకే సింగ్, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శాశ్వత్ మిశ్రా, ఆర్థిక కార్యదర్శి సంజీబ్ కుమార్ మిశ్రా మరియు ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
మూఢ నమ్మకాలు ఇంకా మిగిలి ఉన్నాయి
పర్లాకిమిడి: కంప్యూటర్ యుగంలో కూడా చేతబడి, చిల్లంగి వంటి మూఢ నమ్మకాలు నమ్ముతున్నారని సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్ అన్నారు. చేతబడి చేస్తున్నారన్న వ్యక్తిపై కేసు పెట్టినా.. విచ్ హాంటింగ్ చట్టం కింద కేవలం మూడేళ్లు జైలు శిక్ష పడుతుందని, మరికొన్ని కేసుల్లో అస్సలు వారికి అరెస్టు కూడా చేయబోమని సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవా నంద నాయక్ అన్నారు. ఆయన స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా స్థాయి విచ్క్రాఫ్ట్ నిషేధ చైతన్య కార్యక్రమంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రెవెన్యూ ఏడీఎం మునీంద్ర హానగ, జిల్లా సంక్షేమశాఖ అధికారిని మనోరమా దేవి, జిల్లా న్యాయసేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవుళో, సీడీఎంఓ మానసిక నిపుణులు ప్రాణరంజన్ నాయక్, న్యాయవాది ప్రమోద్ రవుళో తదితరులు పాల్గొన్నారు. ఒడిషాలో కేందుఝార్, మయూర్భంజ్, కంధమాల్, రాయగడ, గజపతి జిల్లాలో మారుమూల గ్రామాల్లో చేతబడి పేరిట అనేక కుటుంబాలని గ్రామస్తులు హతమార్చిన సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయని, న్యాయశాఖ ఎన్ని చట్టాలు చేసినా ప్రజలు ఇంకా మూఢనమ్మకాలు విడిచి పెట్టడం లేదని రెవెన్యూ ఏడీఎం మునీంద్ర హానగా అన్నారు. చేతబడి, దెయ్యం పట్టడం అనేది అపోహా మాత్రమే అని.. అట్టాంటి రోగులు గత ఏడాది జిల్లాలో 1200 మందిని చికిత్సచేసి ఇంటికి పంపించామని జిల్లా మానసిక వైద్యులు ప్రాణ్ రంజన్ నాయక్ తెలిపారు. చేతబడి, చిల్లంగి వంటి మూఢవిశ్వాసాలుపై ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు వివిధ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులు కోరారు. ఈ జిల్లా స్థాయి చిల్లంగి నిషేధ సచేతన కార్యక్రమాన్ని జిల్లా ప్రోగ్రాం, ప్రొటెక్షన్ అధికారి సరలా పాత్రో అధ్యక్షత వహించగా, సీసీడీ స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ అడ్డాల జగన్నాధ రాజు, ఇతర మెడికల్ సిబ్బంది హాజరయ్యారు. -
‘అపేక్షా’ యూనిట్ సందడి
రాయగడ: స్థానిక వీక్ సెంట్రల్ హాల్లో ఒడియా చలన చిత్రం అపేక్షా ప్రీమియర్ షోను శుక్రవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పట్టణంలో సందడి చేసింది. ప్రేమకథా ఇతివృత్తతో వినూత్నంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు సంగీత దర్శకులు వైద్యనాథ్ దాస్ తెలియజేశారు. ప్రీమియర్ షోకు ప్రముఖ గాయకుడు హ్యూమన్ సాగర్ తల్లి సినిమా హాల్లొ రిబ్బన్ కట్ చేసి మొదటి టిక్కెట్ను కొనుగోలు చేశారు. ఈ సినిమాలొ హ్యూమన్ సాగర్ రెండు పాటలు పాడారు. చిత్రంలోని పాటలన్నీ తరంగ్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. ప్రీమియర్ షోకు హాజరైన నటీనటుల్లో చౌదరి వికాష్ దాస్, ప్రదీప్దేవ్, పుష్పాపండ, శక్తిబరాల్, సార్ధక్, శుభంగి, అలివా దాస్, స్థానిక కళాకారుడు టునాటన్ టన్ (ప్రభాకర్ మిశ్రో), సుశాంత్, కేసీ రథ్ ఉన్నారు. చిత్రాన్ని స్టూడియో త్రీ సిక్స్ ఫైవ్ బ్యానర్పై డాక్టర్ కె.తమన్న నిర్మించగా, ఆనంద కుమార్ దర్శకత్వం వహించారు. కథ, మాటలు అశుతోష్ బారిక్, నిర్మల్ నాయక్, అరుణ్ మన్సీర్ సాహిత్యాన్ని సమకూర్చారు. దివంగత గాయకుడు హ్యూమన్ సాగర్, ఆసిమా పండ, చిరా, ఇప్సితాసాహులు పాటలు పాడారు. ప్రీమియర్ షో ప్రారంభానికి ముందు నటీనటులు స్థానిక రిలియన్స్ మార్ట్ నుంచి సినిమా హాల్ వరకు ఊరేగింపు నిర్వహించారు . -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం
రాయగడ: జిల్లాలోని గుడారిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి గురువారం వర్చువల్గా దీనిని ప్రారంభించారు. స్థలాల క్రయ, విక్రయాలకు సంబంధించి ఇదివరకు గుడారి నుంచి 45 కిలోమీటర్ల దూరంలోని గుణుపూర్ వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై ఆ సమస్యకు తెరపడిందని తహసీల్దార్ స్నేహలత అన్నారు. కార్యక్రమంలో అదనపు తహసీల్దార్ సునీల్ కుమార్ సబర్, సెక్షన్ అధికారి రఘునాథ్ సబర్, సమితి అధ్యక్షుడు బిశ్వనాథ్ సబర్, న్యాయవాది సుదామ్ సబర్, ప్రసాద్ లిమ్మ తదితరులు పాల్గొన్నారు. 9 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు శ్రీకాకుళం: జిల్లాలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి పదో తరగతి వారికి ప్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఒకటి నుంచి తొమ్మి దో తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ–4 పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డీఈఓ రవిబాబు పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతికి సంబంధించిన ప్రశ్న పత్రాలను ఎమ్మార్సీ నుంచి క్లస్టర్ స్కూళ్లకు సరఫరా చేస్తారు. క్లస్టర్ పాఠశాలల్లో వాటిని భద్రపరుస్తారు. ఆరు నుంచి పదో తరగతి వరకు సంబంధించిన ప్రశ్న పత్రాలను ఎమ్మార్సీలోనే భద్రపరుస్తారు. ప్రశ్న పత్రాలను పరీక్ష ప్రారంభమయ్యే రోజున సరఫరా చేసేందుకు ము గ్గురు సభ్యులతో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ‘గిరిజన సమస్యలు ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం’ సారవకోట: జిల్లాలోని పలు మండలాల్లో గిరిజన గ్రామాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు గిరిజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ చౌదరి తెలిపారు. శుక్రవారం ఆయన సారవకోటలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్కు కేబినెట్ హోదా కల్పించడం శుభ పరిణా మమని, ఆయన దృష్టికి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్తామని తెలిపారు. ఈ నెల 8న రంపచోడవరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా నుంచి గిరిజనులు హాజరై ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లడానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. బ్రహ్మోత్సవాలకు సంసిద్ధం మందస: వాసుదేవుని ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానుండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ అర్చకులు దాస్కూర్మాచార్యులు తెలిపారు. మొదటి రోజు ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. స్వామిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగంలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. ఆయన శుక్రవారం ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. దర్శనం సులువుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నారు. 18వ తేదీన వంశధార నదిలో జరగనున్న స్వామివారి చక్రతీర్థ స్నానాలు కీలకమని, భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఆయనతోపాటు శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, డీఎస్పీ లక్ష్మణమూర్తి, ఏసీ ప్రసాద్ పట్నాయక్ తోపా టు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీముఖలింగ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిలతో ఫోన్ ద్వారా మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. -
ఉన్నత ప్రమాణాలపై పరిశోధనలు అవసరం
జయపురం: ఉన్నత ప్రమాణాలపై పరిశోధనలు అవసరమని వక్తలు అన్నారు. ‘ఉన్నత ప్రమాణాలపై పరిశోధన వ్యాసాలు, పరిశోధన ప్రతిపాదనలు రచించటానికి సమర్ధవంతమైన వ్యూహాలు’ అనే ఆంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగ్రాన్ని స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రం శుక్రవారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శ్రీలంక వాయింబ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కిర్తిసిరి సమరకూన్, ఒడిశా శిక్షా ఓ అనుసంధాన్ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ నిహారంజన్ మిశ్ర, కొరాపుట్ కేంద్రవిశ్వ విద్యాలయం ప్రొఫెసర్ శౌరభ గుప్త హాజరై.. పరిశోధనల రచన, ప్రచురణల వ్యూహాలు, పరిశోధన ప్రతిపాదనల తయారీలో అనుసరించాల్సిన విధానాలపై ప్రసంగించారు. కార్యక్రమాన్ని నిర్వాహక కార్యదర్శి డాక్టర్ దేవదత్త ఇండోరియ పర్యవేక్షించారు. విక్రమదేవ్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ దేవీప్రసాద్ మిఽశ్ర ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో నాణ్యమైన పరిశోధనలు అవసరమన్నారు. కార్యక్రమంలో జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ రిజస్ట్రార్ మహేశ్వరచంద్ర నాయిక్, పీజీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పి.కె.పాత్రో, డాక్టర్ సాగరిక మిశ్ర, విశ్వవిద్యాలయ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ సచిన్ కుమార్ నాయిక్, వివిధ కళాశాలల నుంచి 250 మందికిపైగా అధ్యాపకులు పాల్గొన్నారు. -
‘గోదాన్’కు పన్ను మినహాయింపు
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి భువనేశ్వర్లోని తన అధికారిక నివాసంలో హిందీ చలన చిత్రం గోదాన్ ప్రీమియర్ను వీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా పన్ను రహితంగా ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. త్వరలో ఒడిశాలో గో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గోదాన్ చిత్రం పూర్తి కుటుంబ చిత్రం. ఇది పిల్లలను వారి తల్లిదండ్రులతో అనుసంధానిస్తుంది. సనాతన ధర్మ విలువలను వివరించడానికి బలమైన సందేశాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఈ చిత్రం యొక్క ఇతివృత్తం, సామాజిక విలువలు, సాంస్కృతిక సంప్రదాయాలు మరియు కుటుంబ విలువలను ప్రశంసించారు. గోదాన్ వంటి సంబంధిత చిత్రాలు సామాజిక అవగాహనను సృష్టించడంలో, సాంస్కృతిక అవగాహనను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. సమాజంలో సాంస్కృతిక భావాలకు ప్రాధాన్యత కల్పించే దిశలో యువత ఈ చిత్రాన్ని పూర్తి స్థాయిలో చూడాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సినిమా ప్రీమియర్కు రాష్ట్ర గనులు, ఉక్కు శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా, చిత్ర దర్శకుడు, నిర్మాత వినోద్ కుమార్ చౌదరి, శాసనసభ్యులు మరియు ఇతర విశిష్ట అతిథులు హాజరయ్యారు. -
రిటైర్డు ఉద్యోగికి సత్కారం
జయపురం: జయపురం గోష్టీ విద్యాధికారి కార్యాలయంలో పదవీ విరమణ చేసిన గ్రూపు–4 ఉద్యోగిని సిబ్బంది ఘనంగా సన్మాణించారు. నాల్గొవ తరగతి ఉద్యోగి రమేష్ చంద్ర పాలక ఎంతో కాలంగా సేవలు అందించారని.. అతడి సేవలు మరువ లేనివని ముఖ్యఅతిథిగా పాల్గొన్న జయపురం గోష్టీ(బ్లాక్ విద్యాధికారి) విద్యాధికారి చందన్ కుమార్ నాయిక్ ప్రశంసించారు. కార్యక్రమంలో విద్యాఽవిభాగ అధికారి రాజేంద్రనారాయణ పాఢీ, బొరిగుమ్మ గోష్టి విద్యాధికారి పద్మేశ్వర బిశాయిలు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. సీనియర్ అసిస్టెంట్ శశిభూషణ దాస్ అధ్యక్షతన నిర్వహించబడిన సన్మాన సభలో ఉపాధ్యాయులు మహేశ్వర మిశ్ర, జగదీష్ మిశ్ర, ప్రదీప్ మిశ్ర, పురందర్ నాయిక్, త్రినాథ్ పాణిగ్రహి, జయపురంలోనిల అన్ని గోష్టీ సాధనా కేంద్రాల సమన్వయకర్తలు, బ్లాక్ సహాయ విద్యాధికారులు కె.గోపాల్, సోమనాథ్ గదబ, గోపీనాథ్ మహంతి, కృష్ణ చంద్ర పండ, ఎం.మురళి, రజణీకాంత ఘొడయి, అనేక మంది విద్యా విబాగ ఉద్యోగులు పాల్గొని విద్యోగ విరమణ చేసిన రమేష చంద్ర పాలకకు శాలువ కప్పి జ్ఞాపికలతో సన్మానించారు. -
19 మంది మావోల లొంగుబాటు
భువనేశ్వర్: రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాల పూర్తి నిర్మూలనలో ఘన విజయం సాధించామని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా విలేకర్లకు తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 లోపు రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా నివారించడం లక్ష్యంగా పేర్కొన్నారు. హింస మార్గాన్ని విడిచిపెట్టి సమాజంలో చేరడానికి సిద్ధంగా ఉన్న మావోయిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పునరావాస విధానాన్ని అమలు చేసింది. ఈ విధానం ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులు ప్రభుత్వ సౌకర్యాలు, భద్రత, గౌరవప్రదమైన భవిష్యత్కు అవకాశం పొందుతారు. హింస మార్గాన్ని విడిచిపెట్టి సమాజంలోని ప్రధాన స్రవంతిలో చేరి ఈ సదుపాయాలను పొందాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో, రాయగడ జిల్లా పోలీసుల ముందు 15 మంది మావోయిస్టులు, కంధమల్ జిల్లా పోలీసుల ముందు నలుగురు మంది మొత్తం 19 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. రాయగడ జిల్లా: రాయగడ జిల్లాలో వంశధార – ఘుముసర్ – నాగావళి (బీజీఎన్) డివిజన్కు చెందిన మొత్తం 15 మంది మావోయిస్టు కేడర్లు లొంగిపోయారు. వారిలో 2 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు నిఖిల్ అలియాస్ నిరంజన్ రౌత్ (జగత్సింగ్పూర్) మరియు అంకిత అలియాస్ రష్మిత లెంకా (టంగి, కటక్) ఉన్నారు. వారి పేర్లపై రూ. 55 లక్షల బహుమానం ప్రకటించారు. వీరితో పాటు బీజీఎన్ డివిజన్కు చెందిన మరో 13 మంది కేడర్లు కూడా లొంగిపోయారు. వారి నుంచి మొత్తం 14 ఆధునిక తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 2 ఏకే 47, 5 ఎస్ఎల్ఆర్, 1 స్టెన్, 1 ఐఎన్ఎస్ఏఎస్, ఒక 303 రైఫిల్, 4 సింగిల్ షాట్ గన్లు స్వాధీనం చేసుకున్నారు. రాయగడ, గజపతి, కంధమల్ ప్రాంతాల్లో నిఖిల్ అలియాస్ నిరంజన్ రౌత్ రెండు దశాబ్దాలకు పైగా మావోయిజం కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నాడని పేర్కొన్నారు. కంధమాల్ జిల్లా: కలహండి, కంధమల్, బౌధ్, నయాగఢ్ (కేకేబీఎన్) డివిజన్కు చెందిన 4 మంది పార్టీ సభ్యులు (పీఎం) మావోయిస్టు కార్యకలాపాలకు స్వస్తి పలికి హింసా మార్గాన్ని విడిచిపెట్టారు. వారంతా కంధమల్ జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయే సమయంలో వారు తమ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర వస్తువులను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన (కేకేబీఎన్) డివిజన్ పార్టీ సభ్యుల్లో (పీఎం) జిటెన్ అలియాస్ గంగా కుంజామి, సుమిత్ర అలియాస్ ముచాకి మాసే, శాంతిల అలియాస్ చోమాలి కుంజామి మరియు మాలతి అలియాస్ బంధి మాధవి ఉన్నారు. వారి నుంచి ఒక ఎస్ఎల్ఆర్, ఒక 12 బోర్ గన్, రెండు 303 రైఫిల్ సహా పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ ఠాణాల్లో వారిపై అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా వివిధ జిల్లాల్లో నిర్వహించిన ఆపరేషన్ల ద్వారా మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించారు. సీనియర్ కేడర్ మావోయిస్టుల అరెస్టు, లొంగిపోవడంతో పాటు భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వివరించారు. ఒడిశాను మావోయిస్టు రహితంగా మార్చే దిశగా ఒడిశా పోలీసుల ఈ కార్యాచరణ రాబోయే రోజుల్లో కూడా నిరవధికంగా కొనసాగుతుందని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
బెల్లం, వంటనూనెల తయారీ యూనిట్ల సందర్శన
జయపురం: fĶæ$-ç³#Æý‡… ™ðlË$VýS$ Ýë…çÜP–-†MýS çÜÑ$† °Æý‡Ó-íßæ-çÜ$¢¯]l² fĶæ$-ç³#Æý‡… íÜsîæ çE¯]l²™èl ´ëuý‡-Ô>ÌS ѧéÅ-Æý‡$¦Ë$ õÜ…{©Ä¶æ$ »ñæÌSÏ…, V>¯]l$-VýSÌS §éÓÆ> ¯]l*¯ðl E™èlµ†¢ ^ólõÜ Ä¶æÊ°-rϯ]l$ Ô¶æ${MýS-ÐéÆý‡… çÜ…§ýlÇØ…^éÆý‡$. õÜ…{©Ä¶æ$ Ð]lÅÐ]l-ÝëĶæ$…, ç³Æ>Å-Ð]lÆý‡×æ Æý‡íßæ™èl E™èlµ-™èl$¢ÌS Ñ«§é-¯éÌS {´ë«§éÅ-¯]lÅ™èlOò³ ѧéÅ-Æý‡$¦ÌZÏ AÐ]l-V>-çßæ¯]l MýSÍ-W…^ól…-§ýl$MýS$ D M>Æý‡Å-{MýSÐ]l$… ^ólç³-sêtÐ]l$° ´ëuý‡-Ô>ÌS CMø MýSϺ$¾ E´ë-«§ýlÅ„ýS$Ë$ {糙鋳 MýS$Ð]l*ÆŠ‡ ç³sê-²Ä¶æ$MŠS ÐðlÌSÏ-yìl…-^éÆý‡$. D M>Æý‡Å-{MýSÐ]l$… §éÓÆ> çÜ…{ç³-§éĶæ$, BàÆý‡ {´÷òÜ-íÜ…VŠæ Ñ«§é-¯]l…Oò³ ѧéÅ-Æý‡$¦ÌZÏ AÐ]lV>-çßæ¯]l MýSÍW…^èl-yýlÐól$ ™èlÐ]l$ E§ólª-Ôèæ-Ð]l$-¯é²Æý‡$. C…§ýl$ÌZ ¿êVýS…V> fĶæ$ç³#Æý‡… çÜÑ$† ¿ýæË$-VýS*yýl {V>Ð]l$…ÌZ° õÜ…{©Ä¶æ$ »ñæÌSÏ… ™èlĶæ*È MóS…{§é°² çÜ…§ýl-ÇØ…-^éÆý‡$. MóS…{§ýl… Ķæ$fÐ]l*° MýS–çÙ~^èl…{§ýl §é‹Ü ^ðlÆý‡$MýS$ ¯]l$…_ »ñæÌSÏ… ™èlĶæ*Æý‡$ ^ólõÜ Ñ«§é-¯é°² ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ ÑÐ]l-Ç…-^éÆý‡$. ^ðlÆý‡$MýS$ ¯]l$…_ Æý‡çÜ… ¡íÜ-¯]l-ç³µsìæ ¯]l$…_ MýSÇ-W…-^èlyýl…, A^èl$a-ÌSÌZ ´ùíÜ »ñæÌSÏ… ^èlMîSPË$ ™èlĶæ*Æý‡$ ^ólĶæ$-yé°² ^ðlేíÜ ^èl*í³…-^éÆý‡$. »ñæÌSÏ… ™èlĶæ*-ÈÌZ à°-MýS-Æý‡-OÐðl$¯]l Æý‡Ýë-Ƈ$$-¯éË$ Ѱ-Äñæ*-W…-^èlMýS$…yé Æý‡$_, ´ùçÙMýS ÑË$-Ð]lË$ VýSÌS »ñæÌSÏ… ™èlĶæ*-Ȱ ™ðlÍ-Ķæ$-gôæ-Ô>Æý‡$. ѧéÅ-Æý‡$¦ÌS çÜ…§ólà-ÌS¯]l$ ¡Æ>aÆý‡$. AÌêVóS V>¯]l$VýSÌZ ¯]l*¯ðl ¡õÜ Ñ«§é°² MýS*yé ѧéÅ-Æý‡$¦Ë$ {ç³™èlÅ-„ýS…V> ^èl*^éÆý‡$. ÐólÆý‡$-Ôèæ-¯]l-VýSË$, çÜ*Æý‡ÅM>…† W…fË$, BÐ]l W…fË$, JÍ-ÔèæË$ Ððl¬§ýlÌSVýS$ Ñ™èl¢¯éÌS ¯]l$…_ MøÌŒæz {ò³‹Ü, V>¯]l$-VýS$ÌS §éÓÆ> ¯]l*¯ól ¡õÜ Ñ«§é¯é°² Ðésìæ Ä¶æ$f-Ð]l*-¯]l$Ë$ ѧéÅÆý‡$¦-ÌSMýS$ ÑÐ]l-Ç…-^éÆý‡$. „óS{™èl ç³Æý‡Å-r¯]l ѧéÅ-Æý‡$¦ÌZÏ Mö™èl¢ E™éÞà°² C_a…§ýl° {糙鋳 ç³sê-²-Ķæ$MŠS ™ðlÍ-´ëÆý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ ´ëuý‡-Ô>ÌS íܺ¾…¨ MðS.ç³-§éÃ-§ólÑ, çÜ$íÜÃ-™é-´ë{™ø E¯é²Æý‡$. -
జాగరణ దర్శనం క్రమబద్ధీకరణకు సన్నాహాలు
భువనేశ్వర్: పవిత్ర మహా శివరాత్రి పురస్కరించుకుని స్థానిక ఏకామ్ర క్షేత్రంలో లింగ రాజ్ మహా ప్రభువు క్రమబద్ధమైన ఆచారాలు, ఆరాధనకు సంబంధించిన కార్యకలాపాల సన్నద్ధతని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ సమీక్షించారు. ఆమె అధ్యక్షతన లోక్ సేవా భవన్ సమావేశం గదిలో జరిగిన సమావేశంలో లింగ రాజ్ ఆలయంలో ఉత్సవ పూజాదుల్లో సమయ పాలన, భక్తులకు సులభ దర్శనం క్రమబద్ధీకరణ అంశాలపై చర్చించారు. ప్రధానంగా జాగర ఉత్సవాన్ని సజావుగా నిర్వహించడంపై ప్రధాన కార్యదర్శి అను గార్గ్ దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15న జాగర ఉత్సవం సమయంలో భారీ సంఖ్యలో జన సమూహం తరలి వచ్చే అవకాశం ఉందని, భగవంతుని ఆచారాలలో తేలికపాటి నిర్లక్ష్యం భక్త జన మృదయాలను తీవ్రంగా కలచివేస్తుందని అన్నారు. జాగరణ రోజున భక్తులందరికి లింగ రాజ్ దర్శనం కల్పించడంలో రద్దీ నియంత్రణ పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, అగ్నిమాపక దళం, లింగరాజు ఆలయ సేవకులు, స్వచ్ఛంద సేవకులు, ప్రజల ఉమ్మడి సమన్వయ, సహకారంతో నిర్వహించాలని కోరారు. క్రమబద్ధమైన దర్శనం కోసం రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఉత్సవ ఆచారాలను సకాలంలో పూర్తి చేసి ఆలయం లోపల తగినంత కాంతి, వాయు ప్రసరణతో ఉక్కిరి బిక్కిరి పరిస్థితి నివారించాలన్నారు. అగ్నిమాపక భద్రతా వ్యవస్థ, ఆకస్మిక అనారోగ్య పరిస్థితుల్లో తక్షణ చికిత్స కోసం అనుబంధ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి వివిధ టీవీ, రేడియో, దిన పత్రికలు మరియు మైక్ ద్వారా సమాచారాన్ని ప్రసారం చేయడం అవసరమన్నారు. సమావేశంలో న్యాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పవిత్ర మోహన్ సామల్, పోలీస్ కమిషనర్ ఎస్.దేవదత్త సింగ్, దేవాదాయ శాఖ కమిషనర్ లలాటేందు జెనా, అదనపు పోలీస్ కమిషనర్ నరసింహ భోల్, న్యాయ శాఖ అదనపు కార్య నిర్వాహక కార్యదర్శి శివ ప్రసాద్ మహా పాత్రో, భువనేశ్వర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రమేష్ కుమార్ జెనా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్రా సమితి కుంధ్ర గ్రామంలో ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం జయపురం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం 2026 గురువారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ కుంద్ర సమితి లిమ పంచాయితీ మహిళా రైతు మండియ రాణిగా గుర్తింపు పొంది పద్మశ్రీ అవార్డు పొంది అంతర్జాతీయ ఖ్యాతి పొందారని తెలిపారు. ఆదివాసీ మహిళ డాక్టర్ రొయిమతి ఘివురియ కుంధ్ర సమితికే కాకుండా రాష్ట్రానికే పేరు తెచ్చారని కొనియాడుతూ వ్యవసాయ రంగానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరుగురు ఆదర్శ మహిళా రైతులను సన్మానించారు. వ్యవసాయ రంగంలో ఆదర్శ మహిళా రైతులు సాధిస్తున్న విజయాలు మహిళా రైతులకు ఆదర్శంగా ఉంటాయన్నారు. వ్యవసాయ రంగంలో మహిళల కృషి, వారి నిరంతర శ్రమ, ప్రపంచ ఆహార భధ్రతలో వారు నిర్వహిస్తున్న కీలక పాత్ర కొనియాడదగినదని అన్నారు. కార్యక్రమంలో మహిళా రైతుల హక్కులపైన సామాజిక, ఆర్థిక రంగాల్లో వారికి కల్పించాల్సిన ప్రాధాన్యతపై ప్రసంగించారు. కార్యక్రమంలో కుంధ్ర సమితి బీడీఓ పి.మనశ్మిత, మహిళా శిశు అభివృద్ధి అధికారి ఆరతీ మహాపాత్రో, ఒడిశా జీవికా సమన్వయకర్త మాణిక్ పట్నాయిక్ లిమా పంచాయతీ సర్పంచ్ శ్రీమతి బానుమతి మాసియా, కుంద్ర సమితి ఉపాధ్యక్షుడు తరుణషేన్ బిశోయి పాల్గొన్నారు. -
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
జయపురం: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోట్పాడ్ ఎమ్మెల్యే రూపుబొత్ర అన్నారు. శుక్రవారం జరిగిన కోట్పాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం దమయంతి సాహు వార్షిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలిపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కోట్పాడ్ ఎన్ఏసీ చైర్మన్ ఎం.శంకరరావు, ఎంపీ ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర మఝి, పాఠశాల యాజమాన్య కమిటి అధ్యక్షుడు సుధీర్ చంద్ర మహంతి, కోట్పాడ్ బ్లాక్ విద్యాధికారి సర్వేశ్వర నాయిక్ తదితరులు పాల్గొన్నారు. సెల్ టవర్లు నిర్మించాలి కొరాపుట్: కొరాపుట్, రాయగడ జిల్లాలో వంద శాతం సిగ్నల్స్ వచ్చే విధంగా మొబైల్ టవర్లు నిర్మించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను గతంలో పార్లమెంట్లో వేసిన ప్రశ్నకి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారన్నారు. కొరాపుట్ జిల్లాలో 459 టవర్లు నిర్మించాల్సి ఉండగా 386, రాయగడ జిల్లాలో 700 నిర్మించాల్సి ఉండగా 546 టవర్లు నిర్మించారన్నారు. మిగతా నిర్మాణం చేయకుండా సాకులు చెబుతున్నారన్నారు. ఈ సమస్య వలన వెనుకబడిన ఈ జిల్లాల్లో సెల్ సిగ్నల్స్ లేక గిరిజన్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బాలలకు విద్య, అత్యవసరం వైద్య సహాయం కోసం అంబులైన్స్కి ఫోన్ చేయలేక, ప్రభుత్వ పథకాల కోసం తెలియక గిరిజనులు బాధలు పడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తానని ఎంపీ సప్తగిరి ఉల్క ప్రకటించారు. క్రీడలతో మానసిక ప్రశాంతత రాయగడ: క్రీడలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని స్థానిక కస్తూరీ నగర్లోని మదర్ థెరిస్సా విద్యా సంస్థలకు చెందిన డైరక్టర్ బి.సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం విద్యా సంస్థల్లో వార్షిక క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి పిల్లలు క్రీడలపై ఆసక్తి కనబరిచేలా పోటీలను నిర్వహించాలన్నారు. ప్రస్తుత పరిస్థితిలో పోటీతత్వం పెరుగుతోందని, అందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. క్రీడలతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రిన్సిపాల్ సూర్యనారాయణ హోత మాట్లాడుతూ రెండు రోజులు పాటు జరగనున్న క్రీడా పోటీల్లో వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హార్డ్వేర్ షాపులో అగ్ని ప్రమాదం రాయగడ: సదరు సమితి పరిధి కొమట్లపేట వద్ద పంచాయతీ కాంప్లెక్స్లో ఉన్న శ్రీరామ్ హార్డ్వేర్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.12 లక్షలు విలువ చేసే వస్తువులు, స్పేర్పార్ట్స్ దగ్ధమయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. షాపు నుంచి దట్టమైన పొగలు రావడంతో అటువైపుగా వెళ్లేవారు షాపు యజమానికి సమాచారం అందించారు. వెంటనే యజమాని మానస్ దళపతి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపు వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
కోర్టులకు బాంబు బెదిరింపు
● బెంబేలెత్తిన యంత్రాంగం భువనేశ్వర్: రాష్ట్రంలో కటక్, ఫుల్బణి, పూరీలోని జిల్లా జడ్జి కోర్టులకు బాంబు బెదిరింపు ఈమెయిల్లు అందడంతో రాష్ట్రంలో అనేక జిల్లా కోర్టులు శుక్రవారం భయాందోళనలకు గురయ్యాయి. బాంబు బెదిరింపుతో అనుబంధ యంత్రాంగం బెంబేలెత్తింది. బెదిరింపుల కారణంగా కోర్టులు వెంటనే ఖాళీ చేయించారు. తక్షణమే బాంబు నిర్వీర్య బృందాలు, స్నిఫర్ డాగ్లను మోహరించారు. కోర్టు ప్రాంగణంలో సమగ్ర భద్రతా తనిఖీలు చేశారు. కోర్టు సముదాయాల్లో బాంబులు అమర్చినట్లు అనామక ఈమెయిల్స్ పేర్కొన్నాయని సమాచారం. దీని వల్ల న్యాయ మూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, సందర్శకులలో తీవ్ర ఆందోళన నెలకొంది. భద్రతా కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో పోలీసులు కోర్టు భవనాలను ఖాళీ చేసి ప్రవేశాన్ని పరిమితం చేశారు. కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. పోలీసులు సత్వర చర్యలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ యూనిట్లు కోర్టు ప్రాంగణాల ప్రతి మూల విస్తృత తనిఖీలు నిర్వహించాయి. స్థానిక పోలీసు బృందాలు, క్రైమ్ బ్రాంచ్ నుండి సైబర్ సెల్ నిపుణులు ఈ విషయాన్ని చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులను గుర్తించడానికి బాంబు బెదిరింపు ఈ–మెయిల్ పంపినవారి ఐపీ చిరునామా, మూలాన్ని గుర్తించడంపై దర్యాప్తు వర్గాలు దృష్టి సారించాయి. బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే కోర్టు క్యాంపస్కు చేరుకుని కోర్టును ఖాళీ చేశారు. స్థానిక పోలీసులు, బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్లతో కోర్టు సముదాయంలో ప్రతి మూలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని వాహనాలను తనిఖీ చేశారు. క్యాంపస్ను శుభ్రపరిచారు. కోర్టు కార్యకలాపాలు నిర్భయంగా నిర్వహించేందుకు సకాలంలో అన్ని చర్యలు చేపట్టారని పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రతీక్ సింగ్ తెలిపారు. సోదాలు నిర్వహించిన ప్రాంతాల్లో ఎలాంటి అభ్యంతరకరమైన పదార్థాలు లేదా పేలుడు పదార్థాలు కనుగొనలేదని ఆయన స్పష్టం చేశారు. గత నెలలో రాష్ట్రంలో కోర్టులకు ఇలాంటి బెదిరింపులు అలజడి రేపాయి. జనవరి నెలలో కటక్, సంబల్పూర్, దేవ్గఢ్, ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులు ప్రసారం చేసి రేపిన అలజడి ఇదే తరహాలో తుస్సుమనిపోయింది. వరుసగా రెండోసారి ఇటువంటి బూటకపు బెదిరింపు సందేశాల ప్రసారం పునరావృతం కావడంపట్ల సర్వత్రా భయాందోళనలు పెరుగుతున్నాయి. -
పట్టాలు తప్పిన చైన్నె–న్యూ జల్పాయ్గురి ఎక్స్ప్రెస్
భువనేశ్వర్: చైన్నె – న్యూ జల్పాయ్గురి ఎక్స్ప్రెస్ రైలు గురువారం ఉదయం 8.51 గంటలకు జఖపురా యార్డ్ గుండా వెళ్తున్నప్పుడు పట్టాలు తప్పింది. యార్డ్ పరిధిలో ఒక ఏసీ కోచ్, 2 సాధారణ శ్రేణి బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో రైలు చాలా నెమ్మదిగా కదులుతుండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రాణ హని, ప్రయాణికులకు గాయాలు ఇతరేతర అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తూర్పు కోస్తా రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. మరో వైపు ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు. ప్రభావిత ప్రయాణికులకు తగిన సదుపాయాలు కల్పించారు. దుర్ఘటనలో దెబ్బతిన్న బోగీలను తొలగించి ప్రయాణికుల సౌకర్యార్థం అవసరమైన మేరకు అదనపు బోగీలు జోడించారు. భువనేశ్వర్, ఖుర్దా రోడ్ నుంచి ప్రమాద సహాయక రైలు (ఏఆర్టీ), ఖుర్దా రోడ్ నుండి ప్రమాద సహాయక వైద్య పరికరాల బృందం (ఏఆర్ఎంఈ) ఘటనా స్థలానికి సకాలంలో చేరి అనుబంధ సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. రైల్వే ఉన్నతాధికారులు సంఘటన స్థలంలో పునరుద్ధరణ, భద్రత సంబంధిత కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సంఘటనా స్థలంలో హెల్ప్ లైన్ నంబర్ 8114382367 ఏర్పాటు చేశారు. పట్టాలు తప్పిన బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించడంతో రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరాయి. ఈ పనులు సమగ్రంగా మధ్యాహ్నం 2.45 గంటలతో పూర్తి కావడంతో రైళ్ల రాకపోకలు యథాతథంగా కొనసాగాయి. -
గౌరీ శంకర్కు అభినందనలు
రాయగడ:బీజేడీ సీనియర్ నాయకుడు, అమో ఒడిశా – నవీన్ ఒడిశా కన్వీనర్, రాయగడ సమితి మాజీ వైస్ చైర్మన్ పట్నాన గౌరీ శంకర్ జిల్లా బీజేడీ వర్కింగ్ ప్రెసిండెంట్గా నియమితులవ్వడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మాజీ మంత్రి, జిల్లా బీజేడీ అధ్యక్షుడు జగన్నాథ సరక, రాయగడ పట్టణ యువ జనతా దళ్ అధ్యక్షుడు శారదీ పట్నాయక్, ఆ పార్టీ యువ నాయకుడు బినోద్ పొల్లాయ్ తదితరులు గురువారం జేకేపూర్లోని ఆయన నివాసానికి వెళ్లి అభినందించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. గుణుపూర్లో చోరీ రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో ఉన్న గాంధీ టెక్నాలజీ విశ్వవిద్యాలయం సమీపంలో నివసిస్తున్న ఒక అధ్యాపకుడి ఇంట్లో బుధవారం చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోని రెండు బంగారు గొలుసులు, రెండు ఉంగరాలను దొంగిలించారు. బాధితుడు డాక్టర్ దేవాశిష్ మహాపాత్రో గుణుపూర్ ఆదర్శ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సైంటిఫిక్, డాగ్ స్క్యాడ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. ఐఐసీ కేకేబీకే కుహోరో తెలియజేసిన వివరాల ప్రకారం.. గత శనివారం అధ్యాపకుడు సెలవులపై స్వగ్రామమైన బరంపురం వెళ్లారు. సెలవులు ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన అనంతరం అతడి బీరువాలో ఉంచిన బంగారు గొలుసులు, ఉంగరం కనిపించకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వ్యక్తి మృతదేహం లభ్యం మల్కన్గిరి: మల్కన్గిరి సమితి ఎంవీ 16 వద్ద గురువారం ఉదయం కెందు ఆకుల గోదాం వెనుక భాగంలో ఒక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ వినోద్ పటేల్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, మృతుడు ఉత్తమ్ విశ్వస్(35)గా గుర్తించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఉత్తమ్ రాత్రి తిరిగి ఇంటికి రాలేదు. అయితే మాల్యవంత్ ఉత్సవాల్లో ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. కాగా గురువారం ఉదయం విగతజీవిగా కనిపించడంతో రోధిస్తున్నారు. మృతదేహన్ని పరిశీలించి హత్యగా భావిస్తున్నారు. శుక్రవారం పోస్టుమాఠం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొన్న బస్సు మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి మోటు నుంచి మల్కన్గిరి వస్తున్న ఒక ప్రైవేటు బస్సు బుధవారం ఉదయం 6 గంటల సమయంలో అదుపు తప్పి పూషుగూడ కూడలి వద్ద ఒక చెట్టును ఢీకొంది. అయితే ప్రమాదంలో బస్సులో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు అవ్వకుండా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారు. అయితే బస్సు ముందరి భాగం దెబ్బతింది. -
అమొ సాథి యూనిఫైడ్ వాట్సాప్ చాట్ ప్రారంభం
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి లోక్ సేవా భవన్లో అమొ సాథి యూనిఫైడ్ వాట్సాప్ చాట్ను గురువారం ప్రారంభించారు. దీంతో రెవెన్యూ సేవలు చిటికెలో అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. పదే పదే తహసీల్ కార్యాలయానికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. రెవెన్యూ సేవలు వాట్సాప్ నంబర్ 9437292000లో అందుబాటులో ఉంటాయి. రెవెన్యూ సేవలు సులభతరం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో పలు చోట్ల 57 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రారంభించారు. గత ఏడాది పాలనలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవల రంగంలో భారీ సంస్కరణలు చేపడుతుంది. సుసంపన్న ఒడిశా, వికసిత్ భారత్ ఆవిష్కరణలో భాగంగా అట్టడుగు స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడం లక్ష్యంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమొ సాథీ యాప్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రం, వారసత్వ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, మ్యుటేషన్ కేసులు, భూమి లీజులలో వారసత్వ మార్పిడి మార్పిడి కేసు వంటి 11 ముఖ్యమైన రెవెన్యూ సేవలు అరచేతిలో అందుబాటులో ఉంటాయి. చట్టబద్ధమైన వారసులకు అనుకూలంగా భూమి రికార్డు నవీకరణతో వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను రైతులు పొందడం సులభతరమైంది. -
అప్పులు తీర్చేందుకు చోరీలు
శ్రీకాకుళం: అప్పులు తీర్చేందుకు శ్రీకాకుళం రూరల్ మండలం నందగిరిపేటలో జనవరి 30న చైన్ స్నాచింగ్కు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వివేకానంద తన కార్యాలయంలో గురువారం విలేకరులకు వెల్లడించారు. గత నెల 30న వేకువజామున 5 గంటల సమయంలో నందగిరిపేటలోని పాతిన భూదేవమ్మ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. నీరు కావాలని అడిగే క్రమంలో భూదేవమ్మ మెడలోని 32.4 గ్రాముల బంగారు పుస్తెలతాడును తెంచుకుని కారులో పారిపోయారు. ఈ మేరకు బాధితురాలి కుమారుడు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలించారు. గ్రామానికి రాకపోకల సాగించిన కార్లపై దృష్టిపెట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను బట్టి కారు నంబరును గుర్తించి యజమాని వివరాలను సేకరించారు. ఆమదాలవలసలోని మెట్టెక్కివలస ప్రాంతానికి చెందిన కారు యజమానిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నించగా తానే మరో ఇద్దరితో కలిసి నేరం చేసినట్లు అంగీకరించారు. చైన్ స్నాచింగ్కు పాల్పడిన వారిలో గుంట జగదీశ్వరరావు, గుంట ప్రమీలతోపాటు మెండ వెంకటరమణ ఉన్నారు. వీరి ముగ్గురూ ఆమదాలవలస పట్టణంలోని మెటక్కివలస హడ్కో కాలనీకి చెందినవారు. వీరిలో జగదీశ్వరరావు, ప్రమీల భార్యాభర్తలు కాగా, వెంకటరమణ వీరికి స్నేహితుడు. వీరంతా అప్పుల పాలు కావడంతో వాటిని తీర్చేందుకు దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నారు. 20 రోజుల పాటు నందగిరిపేటలో రెక్కీ నిర్వహించి ఒకటి రెండు సార్లు విఫలమయ్యారు. వేకువజామున అయితే ఎవరూ ఉండరని భావించి చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. నిందితుల వద్ద నుంచి 32.4 గ్రాముల బంగారం, సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును వారం రోజుల్లోనే ఛేదించిన శ్రీకాకుళం రూరల్ సీఐ కె.పైడపునాయుడు, ఎస్సై కె.రాములను ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు. సిబ్బందికి నగదు పారితోషకాలను డీఎస్పీ అందజేశారు ముగ్గురు చైన్స్నాచర్ల అరెస్ట్ 32.4 గ్రాముల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివేకానంద -
వెదురు హస్తకళల ద్వారా జీవనోపాధిపై వర్క్షాప్
జయపురం: స్థానిక నెహ్రూనగర్లో తెలుగు సాంస్కృతిక సమితి జయపురం సిటీ ఉన్నత పాఠశాలలో పర్యావరణ అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్), ఒడిశా అటవీ అండ్ పర్యావరణ విభాగం భువనేశ్వర్, సహకారంతో వెదురు కళలపై గురువారం వర్క్షాపు నిర్వహించారు. ఈ వర్క్షాపులో వెదురు కళా–హస్తకళల ద్వారా ప్రజలు ఎలా స్వయం ఉపాధి పొందవచ్చో వివరించారు. జయపురం, పరిసర ప్రాంతాల్లో అపారంగా ఉన్న వెదురు ఉత్పత్తులను వాణిజ్యీకరణకు వినియోగించాల్సిన అవసరాన్ని ఈ వర్క్షాపులో పాల్గొన్న ఇకో క్లబ్బు వెదురుకళా శిక్షకుడు నృశింగ ప్రసాద్ షొడంగి వివరించారు. వెదురు మన ప్రాంతానికి చెందిన సహజ వనరు అని, సంప్రదాయ వెదురు కళలను ప్రోత్సహించటం, అలాగే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఈ వర్క్షాపు ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఇకో క్లబ్బు ఉపాధ్యాయుడు ప్రతాప్ కుమార్ పట్నాయిక్ మాట్లాడుతూ ఈ వర్క్షాపు ద్వారా జయపురం ప్రాంతంలో వెదురు కళకు సమాజంలో తగిన గుర్తింపు తీసుకు రావటం, విద్యార్థుల్లో ఆసక్తి కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించటం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు కలుగుతుందని వర్క్షాపులో పాల్గొన్న వారికి ఉద్బోధించారు. శిక్షకులు నృిశింగ ప్రసాద్ షొడంగి, బేబీ మహాపాత్రోలు వెదురుతో పూల కుండీలు, దీపపు స్టాండ్లు పెన్ స్టాండ్లు, వెదురు బాటిళ్లు, కుర్చీలు, టేబుల్లు మొదలగు కళాత్మక వస్తువులను సులభంగా తయారు చేసే పద్ధతిని బోధించారు. వర్క్షాపులో పాల్గొన్న విద్యార్థులకు వెదురుతో వస్తువులు తయారు చేసే విధానం చూపుతున్న శిక్షకుడు వెదురుతో అందమైన పువ్వులు తయారు చేయటం నేర్పుతున్న శిక్షకుడు -
తండ్రిని హత్య చేసిన కుమారుడు
రాయగడ: కన్న కొడుకే తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తనమాట వినలేదని ఆగ్రహంతో గొంతుకోసి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 2వ తేదీన జిల్లాలో బిసంకటక్లోని బ్రాహ్మణ వీధిలో నివసిస్తున్న కై లాస్ చంద్ర సాహు అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతడి గొంతుకోసి హత్య చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన బిసంకటక్ పోలీసులు కొడుకే తండ్రిని హత్య చేసినట్లు గుర్తించి బుధవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కై లాస్ చంద్ర సాహు గత కొన్నాళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఆ వ్యాపారం తమకు అచ్చిరాదని అతని చిన్న కొడుకు శ్యామ సుందర్ సాహు వ్యతిరేకిస్తుండేవాడు. అయితే ఏదో వ్యాపారం చేయకపోతే జీవనోపాధి ఎలా కొనసాగించేదని కొడుకుని వారిస్తు వ్యాపారాన్ని కై లాస్ సాహు కొనసాగిస్తుండేవాడు. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పెరగడంతో ఆరోజు ఇంట్లో తన తండ్రి ఒక్కడే ఉండడం గమనించిన కొడుకు శ్యామ్ సుందర్ తండ్రిపై దాడి చేశాడు. అంతేకాకుండా ఒక గ్లాసులో బాత్రూమ్లను పరిశుభ్రం చేసే యాసిడ్ను తేనెలో కలిపి తండ్రికి బలవంతంగా తాగించాడు. అనంతరం తండ్రి గొంతును కత్తిపీట సాయంతో కోసి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని తండ్రి ఉంటున్న పై అంతస్తు గదిలోకి తరలించాడు. రక్తం మరకలు, హత్యకు వినియోగించిన కత్తిపీటను శుభ్రంగా కడిగిన తర్వాత ఎటువంటి ఆనవాలు లేవని నిర్దారణ చేసుకున్నాడు. అనంతరం సాయంత్రం ఇరుగుపొరుగు వారికి పిలిచి తన తండ్రిని ఎవరో హత్య చేశారని చెప్పాడు. తర్వాత పోలీసులకు సమాచారం అందించాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యకు కారకుడైన శ్యామ్ సుందర్ను అరెస్టు చేశారు. -
శివరాత్రికి మహారాజుకు ఆహ్వానం
జయపురం: నాలుగు వందల ఏళ్ల పురాతన చరిత్ర గల గగణాపూర్ బాలుకేశ్వర్ మహాదేవుని పీఠంలో కొత్తగా నిర్మించిన యజ్ఞమండప ప్రతిష్టాపన, మహా శివరాత్రి ఉత్సవాలకు జయపురం మహారాజు విశ్వేశ్వర చంధ్రచూడ్ దేవ్ను ఆలయ కమిటీ ఆహ్వానించింది. గురువారం ఆలయ పరిచాలన కమిటీ సభ్యులు పిలు దాస్, సురేష్ నందొ, జితు దొలాయి, సిద్ధు పాణిగ్రహి, సదాశివ పట్నాయిక్, పురుషోత్తమ పురోహిత్లు జయపురం రాజుగారి కోటకు వచ్చి మహారాజును ఆహ్వానించారు. యజ్ఞ మండపం ప్రారంభోత్సవం, శివరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించే అష్ట్రపహర నామ యజ్ఞం, రుద్రాభిషేకం, కలశ జాత్ర నిర్వహిస్తామని, కలశ జాత్ర జయపురం ఖజురి బంద ద్వారా జగన్నాథ్ ఆలయ మీదుగా సర్దార్ పటేల్ మార్గం మీదుగా గగణాపూర్ బాలుకేశ్వర్ మహాదేవుని ఆలయానికి చేరుతుందని ఆయా కార్యక్రమాలలో పాల్గొనాలని వారు ఆహ్వానించగా అందుకు ఆయన అంగీకరించారు. -
మహేంద్రగిరిపై శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు
పర్లాకిమిడి: మహేంద్రగిరి శిఖరానికి మహాశివరాత్రి పర్వదినం నాడు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు. అందుకు యాత్రికులకు అవసరమైన తాగునీరు, లైటింగ్, నడకదారిలో పోలీసుల భద్ర త, ఆహారం, వైద్య సదుపాయాలపై కలెక్టర్ అక్షయ సునీల్ అగార్వాల్ గురువారం కలెక్టరేట్లో అధికారులతో ముందస్తు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, ఎస్పీ జ్యోతీంద్ర కుమార్ పండా, జిల్లా ముఖ్య అటవీ శాఖ అధికారి కె.నాగరాజు, ఏడీఎం ఫల్గుణి మఝి, జిల్లా పరిషత్ అదనపు సీడీఓ పృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు హాజరయ్యారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు మహేంద్రగిరిపై మహాశివరాత్రి వేడుకలు, జాతర జరుగనున్న దృష్ట్యా భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని సౌకార్యాలు కల్పించాలని కలెక్టర్ అధికారులను కోరారు. రోడ్డు, భవనాల శాఖ రహదారులు మరమ్మతు చేయాలని కలెక్టర్ ఆర్అండ్బీ ఎస్ఈని ఆదేశించారు. యాత్రికులకు భద్రత కల్పించేందుకు పోలీసు బలగాలు మోహరించాలని, ప్రసాదం కేవలం రూ.10లకే భక్తులకు విక్రయించాలని అలాగే ఉచితంగా తాగునీరు, పార్కింగ్ స్థలం కేటాయించాలని ఆదేశించారు. మహేంద్రగిరిపై కుంతీ, యుధిస్టర మందిరాల వద్ద దర్శనం టిక్కెట్లు రూ.20లు వసూలు చేయాలని అటవీశాఖకు ఆదేశించారు. మహేంద్రంలో మద్యం, మత్తుపదార్థాలు పూర్తిగా నిషేధించాలని అధికారులను కోరారు. సమావేశంలో రాయగడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్, వైస్ చైర్మన్ జ్యోతి ప్రసాద్ పాణి, ఎస్డీపీఓ మాధవానంద నాయక్, అంతర్యామి గోమాంగో, రాయగడ తహసీల్దార్ సంతోష్ కుమార్ బారిక్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. -
వారి నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని అఫీషియల్ కాలనీకి చెందిన అనంత పట్నాయకుని రామ్మోహనరావు(65), గుజరాతిపేటకు చెందిన పొట్నూరు నిర్మల(45) మృతిచెందడంతో వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్క్రాస్కు సమాచారం అందించారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ–టెక్నీషియన్ పూతి సుజాత, నంది ఉమాశంకర్ల ద్వారా కార్నియాలు సేకరించి విశాఖ ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. సహకరించిన కుటుంబ సభ్యులకు చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్, సభ్యులు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు. -
సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష కోసం నిరీక్షణ
భువనేశ్వర్: రాష్ట్రంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ల నియామకం పరీక్ష ప్రక్రియ అర్ధంతరంగా స్తంభించిపోయింది. ఈ వ్యవహారంలో భారీ కుంభకోణం, అవినీతి, అక్రమాలు వెలుగు చూడడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీర్ఘ కాలం గడిచిన ఈ పరీక్ష తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టం కావడం లేదు. వయోపరిమితి మించిపోతున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని బాధిత వర్గం అభ్యర్థించింది. అవినీతి వ్యతిరేక వర్గం ఆధ్వర్యంలో స్థానిక దిగువ పీఎంజీ గాంధీ మార్గం నడి రోడ్డు మీద ఔత్సాహిక అభ్యర్థులు బైఠాయించి శాంతియుతంగా నిరసన ప్రదర్శించారు. అర్ధంతరంగా స్తంభించిన పోలీసు సబ్ ఇన్స్పెక్టరు భర్తీ పరీక్ష తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరీక్ష కుంభకోణం, అక్రమాలు, అవినీతిపై సీబీఐ దర్యాప్తు తాజా స్థితిగతుల్ని బహిరంగపరచాలని అభ్యర్థించారు. -
రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ముఖ్యమంత్రి మోహన్చరణ్ మఝి గురువారం వర్చువల్గా ప్రారంభించారు. మొత్తం ఒడిశాలో 57 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఒకేసారి ముఖ్యమంత్రి ప్రారంభించగా.. వాటిలో మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు గుమ్మా, నువాగడ, రాయఘడ బ్లాక్స్ ఉన్నాయి. రెవెన్యూ పట్టాలు, ఇళ్లు, భూ పట్టాలు సమితి స్థాయిలో కొనుగోళ్లపై రిజిస్ట్రేషన్ల లావాదేవీలు ఇకపై నిర్వహింవచ్చు. ప్రజలకు అతి సులువుగా రెవెన్యూ పట్టాలు అందించటంలో రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి మఝి తన ప్రసంగంలో వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవానికి మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, ఏ.డి.ఎం రెవెన్యూ మునీంద్ర హనగ, డిప్యూటీ కలెక్టర్ మిథాలీ మధుమితా పాడీ, అసిస్టెంట్ కలెక్టర్ త్రినాథ సాహు, తదితరులు పాల్గొన్నారు. -
మిస్సమ్మ బంగ్లా స్థలం పరిశీలన
టెక్కలి: టెక్కలి పాతబస్టాండ్లో మిస్సమ్మ బంగ్లా స్థలాన్ని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి గురువారం పరిశీలించారు.ఈ స్థలంలో కొన్నేళ్లుగా వివాదాలు చోటు చేసుకుని నిరుపయోగంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్డీఓ నేతృత్వంలో రెండు రోజులుగా జంగిల్ క్లియరెన్స్ చేస్తూ స్థలాన్ని శుభ్రం చేస్తున్నారు. సుమారు 1.75 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ స్థలాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా వాణిజ్య పరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన ఆక్రమిత స్థలాన్ని సైతం స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.సత్యం, డీటీ రవికుమార్ పాల్గొన్నారు. స్థలాన్ని పరిశీలిస్తున్న జేసీ, ఆర్డీఓ -
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రాయగడ: సదరు సమితి అమలాభట్ట సమీపంలో గల శ్రీక్షేత్రటౌన్ షిప్లో గల లక్ష్మీనరసింహ స్వామి ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా గురువారం నుంచి బ్రహ్మోమత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు మంగనాథ్ ఆచార్యులు, స్థానిక కళ్యాణ వేంకటేశ్వర స్వామి మందిర ప్రధాన అర్చకుడు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేపట్టారు. ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ స్వామి వారి సేవలో నిమగ్నమయ్యారు. స్వామి వారికి పూజా సామగ్రీని తీసుకువెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ట్రక్కును వెనుక నుండి ఢీకొన్న కారు డ్రైవర్ మృతి భువనేశ్వర్: ధామ్నగర్ నుంచి భద్రక్ వైపు వెళుతున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. భద్రక్ జిల్లా బిష్ణుపూర్ చౌరస్తా సమీపంలోని 16వ నంబరు జాతీయ రహదారిపై గురువారం ఈ విషాద సంఘటన జరిగింది. కారులో డ్రైవర్ మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందడంతో అగ్నిమాపక దళం ఘటనా స్థలం చేరి సహాయక చర్యలు చేపట్టింది. కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించి తక్షణమే ఆసుపత్రికి తరలించారు. యువకుడు ఆస్పత్రిలోనే మరణించాడని వైద్యులు ప్రకటించారు. ప్రమాదానికి గురైన కారులో మాంసం రవాణా అవుతున్నట్లు సమాచారం. దీనిపై ధామ్నగర్ ఠాణా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి రాయగడ: ఈ నెల 12వ తేదీన జరగనున్న దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జాతీయ స్థాయి ఉపాధ్యక్షుడు విష్ణు చరణ్ మహంతి పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక కపిలాస్ సమీపంలో గల రాయగడ మోటార్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం శ్రామిక సంఘాలకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ సమ్మె 24 గంటలపాటు నిర్వహిస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చందన హరిచందన్, మోటార్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సునీల్ కుమార్ కర్, కార్యదర్శి వై.స్వామి రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు పూర్ణ చంద్ర పాడి, కార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. -
మహిళా మావోయిస్టు లొంగుబాటు
కొరాపుట్: చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళా మావోయిస్టు కొరాపుట్ జిల్లాలో పోలీసులకు లొంగిపోయింది. గురువారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సదరన్ వెస్ట్రన్ రేంజ్ డీఐజి కన్వర్ విశాల్ సింగ్ ముందు మహిళా మావోయిస్టు మమతా పొడియామి లొంగి పోయారు. మావోయిస్టు పార్టీలో ఎసీఎం క్యాడర్లో మమతా కొనసాగుతున్నారు. తనతో పాటు ఎస్ఎల్ఆర్ రైఫిల్ తో పాటు 10 తూటాలు కూడా అప్పగించారు. మమతా ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అనేక విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నారు. ఈ ఘటనతో కొరాపుట్ జిల్లా మావోయిస్టు రహిత జిల్లాగా డీఐజీ ప్రకటించారు. ఆమెకి రాష్ట్ర ప్రభుత్వ మావోయిస్టు పునరావాస ప్రయోజనాలు అందుతాయన్నారు. ఆమైపె ఉన్న రు.5.50 లక్షల రివార్డు అందిస్తామన్నారు. అంతేకాక లొంగుబాటులో సమర్పించిన ఎల్ఎల్ఆర్ రైఫిల్ వల్ల మరో రు.1.75 లక్షలు, 36 నెలలు ఉపాధి శిక్షణ తో పాటు ప్రతి నెల రు.10 వేలు, గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలు అందిస్తామన్నారు. తక్షణ సాయం కింద రూ.50వేలు అందిస్తామని పేర్కొన్నారు. మమతా స్వస్థలం చత్తీస్గఢ్ రాష్ట్రం పామేడ్ జిల్లా లింగా పురం. ప్రస్తుత వయస్సు 24 ఏళ్లు అని డీఐజి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ వర్మ, పలువురు బీఎస్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం
రాయగడ: స్థానిక మహిళా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు క్లబ్ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు మిల్లర్స్ అసోసియేషన్ సమావేశం హాల్లో బుధవారం సాయంత్రం క్లబ్ అధ్యక్షురాలు పొట్టాం రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల మధ్య సైన్స్ డేను పురస్కరించుకుని ప్రదర్శన, శరీర భాగాలు వాటి ఉపయోగకరాలు అన్న అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయించారు. పట్టణంలో గల మా స్వగృహంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని తీర్మానించారు. నెల వారి సమావేశంలో భాగంగా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించి తమ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వస్తామని క్లబ్ అధ్యక్షురాలు రమాదేవి తెలియజేశారు. సమావేశంలో క్లబ్ కార్యదర్శి జి.మాధవి, కోశాధికారి నిర్మల పట్నాయక్, సభ్యులు పాల్గొన్నారు. -
రైతులసమస్యలు సీఎం పరిష్కరిస్తారు
● రాష్ట్ర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక శాఖ మంత్రి సంపద్ చరణ్ స్వయిని జిల్లా స్థాయి ధాన్యం సేకరణపై సమీక్ష సమావేశంలో కలెక్టర్, ఎమ్మెల్యే రూపేష్, మంత్రి సంపద్ చరణ్ స్వయిని, ఎమ్మెల్యే దాశరథి గోమాంగో పర్లాకిమిడి: రాష్ట్ర పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్, సాంకేతిక విద్యాశాఖ మంత్రి సంపద్ చరణ్ స్వయిని గురువారం మధ్యాహ్నం గజపతి జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఆయనకు బీజేపీ పార్టీ శ్రేణులు ఛిత్రి సింహాద్రి, ఎంపీ ప్రతినిధి దారపు చిట్టి తదితరులు సర్క్యూట్ హౌస్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఽఖరీఫ్ ధాన్యం ప్రొక్యూర్మెంట్ జిల్లాలో ఎంతవరకూ లక్ష్యం ఎంతవరకూ వచ్చిందో తెలుసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మోహన ఎమ్మెల్యే దాశరథిగో మంగో, జిల్లా పౌరసరఫరాల శాఖఅధికారి అనుప్ పండా, కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రి సంపద్ స్వయిని బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. గుసాని సమితిలో గారబంద, లావణ్యగడ ధాన్యం మండీలను పరిశీలించారు. అయితే రైతులు ఽధాన్యం కోనుగోళ్ల కేంద్రాల వద్ద ఆభియోగాలు ముందుంచారు. తప్పకుండా రైతు సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించి తగు పరిష్కారం చేస్తామని, రైతుల ఆదాయం పెంపుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి కట్టుబడి హున్నారని అన్నారు. ఇప్పటివరకూ గజపతి జిల్లాలో నాలుగు బ్లాక్లలో కాశీనగర్, రాయఘడ, గుసాని, గుమ్మలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేశామని, మరో 10వేల మంది రైతులు మండీల వద్ద రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని మంత్రి సంపద్ చరణ్ స్వయిని అన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి అధికారి స్మృతిరంజన్ సౌభాగ్య త్రిపాఠి, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన గంజాం జిల్లా సోన్పూర్కు వెళ్లిపోయారు. -
మహిళా సంఘాల నిరసన
పర్లాకిమిడి: ఒడిశాలో పూరిలో కిన్నెరను కొంతమంది హత్య చేసిన సంఘటను నిరసిస్తూ జిల్లా ట్రాన్స్జెండర్స్, ప్రగతి మహిళా సంఘటన్ ఆధ్వర్యంలో పాత కోర్టు జంక్షన్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. పూరీ జిల్లా పిప్పిలి గ్రామానికి చెంది కిన్నెర అంజలిని గుర్తుతెలియని కొంతమంది హత్య చేశారు. జిల్లాలోని కిన్నెరలంతా ఎకమై నిందితులను పట్టుకుని అరెస్టు చేసి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో జిల్లా కిన్నెరుల సంఘం అధ్యక్షురాలు మధు బోరాడో, కార్యదర్శి జాస్మిన్ షేక్, ప్రగతి మహిళా సంఘటన్ కార్యదర్శి తనూజా శతపథి, తదితరులు పాల్గొన్నారు. -
ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం
మెళియాపుట్టి: ఏకలవ్య గురుకుల పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ అధికారులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 30 మంది బాలురు, 30 మంది బాలికల సీట్లు భర్తీ చేసేందుకు ఏప్రిల్ 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 5 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. కోడిగుడ్ల లారీ బోల్తా ఎచ్చెర్ల : తూర్పుగోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి పశ్చిమబెంగాల్కు కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ గురువారం వేకువజామున ఎచ్చెర్ల సమీపంలోని బైపాస్ జాతీయ రహదారిపై బోల్తాపడింది. లారీ ముందు భాగంలోని టైరు పంక్చర్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు పది లక్షల విలువ చేసే గుడ్లు పాడయ్యాయి. ఈ ఘటనలో పశ్చిమబెంగాల్కు చెందిన లారీ డ్రైవర్ రోహిత్ ఖాజీ, క్లీనర్ షేక్ రోహిత్లు స్వల్పంగా గాయపడ్డారని ఎచ్చెర్ల ఎస్సై జి.లక్ష్మణరావు తెలిపారు. కబళించిన కిడ్నీ వ్యాధి నరసన్నపేట: తామరాపల్లికి చెందిన కోల చక్రవర్తి(30)ని కిడ్నీ వ్యాధి కబళించింది. ప్రైవేటు డ్రైవర్గా పనిచేస్తున్న చక్రవర్తి కొన్నాళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విధుల్లోకి ఉపాధ్యాయుడు టెక్కలి: కోటబొమ్మాళి మండలం మాసాహెబ్పేట పంచాయతీ కమలనాభపురం ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు గురువారం ఉపాధ్యాయుడు విధులకు హాజరయ్యారు. ఇదే పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయుడు గత నెల 31న పదవీ విరమణ పొందిన తరువాత కొత్తగా ఉపాధ్యాయుడిని నియమించినప్పటికీ అతను విధులకు హాజరుకాలేదు. ఈ విషయమై విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘ఏకోపాధ్యాయ ఎక్కడయ్యా...’ అనే కథనం గురువారం సాక్షిలో ప్రచురితమైంది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరయ్యారు. ఆదిత్యుని సన్నిధిలో పంచాయతీరాజ్ కమిషనర్ అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వి.ఆర్.కృష్ణతేజ గురువారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, అధికారులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ డి.సత్యనారాయణ, అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, సాందీప్శర్మ, ఫణీంద్రశర్మ, జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తి పాల్గొన్నారు. గడ్డి కుప్ప దగ్ధం ఆమదాలవలస: పురపాలక సంఘం పరిధిలోని 6వ వార్డు కె.మన్నయ్యపేటలో వరి గడ్డి కుప్పకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి కాల్చేశారు. దీంతో బాధితుడు అన్నెపు గోవిందరావు లబోదిబోమంటున్నారు. గత ఏడాది కూడా తన గడ్డి కుప్పను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారని వాపోయారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచూకీ తెలపండి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో, వివిధ సెక్షన్లకు సంబంధించి కేసులో ముద్దాయి ఆమదాలవలస మండలం బొడ్డేపలి గ్రామస్తుడు గొండు సురేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ ఎం.హరికృష్ణ కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొంతకాలంగా పైకేసులో వాయిదాలకు హాజరుకానందున కోర్టు ప్రోక్లమినేషన్ నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఎవరికై నా తెలిస్తే ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. -
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
● రైతులకు ద్రోహం చేస్తున్న బీజేపీ సర్కారు ● కలెక్టరేట్ వద్ద బీజేడీ శ్రేణుల ధర్నాపర్లాకిమిడి: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర బీజేపీ సర్కారు తీరుపై నిరసిస్తూ బుధవారం బీజేడీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ నాయక్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. తొలుత పర్లాకిమిడి పురపాలక సంఘం కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం మండీల వద్ద క్వింటాకు ఐదు కిలోల చొప్పున్న కట్నీ, చట్నీ కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. గజపతి జిల్లా ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారని, ఈ ఏడాది 73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే ప్రభుత్వం కేవలం 30.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. అందులోనూ కోతలు విధించడం భావ్యం కాదన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో బీజేడీ ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత పోరిచ్చా, కాశీనగర్ బ్లాక్ చైర్మన్ బల్ల శాయమ్మ, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు, మోహనా జెడ్పీటీసీ సునీల్ కుమార్ బిశోయి, గుమ్మా సమితి అధ్యక్షురాలు సునేమీ మండళ్, మధు (కాశీనగర్), బీజేడీ యువజన నాయకులు లెంక, బీజేడీ మాజీ అధ్యక్షుడు జగబంధు దాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది బడా వ్యాపారులకు అనుకూల బడ్జెట్
● కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ నేతల ఆరోపణ జయపురం: కేంద్ర ప్రభుత్వం 2026–27 బడ్జెట్ కేవలం బడావ్యారులకు లాభం కలిగించేదిగా ఉందని కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రూపక్ తురుక్ వ్యాఖ్యానించారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ భవనంలో కేంద్ర బడ్జెట్పై నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ పెద్ద, పెద్ద వ్యారులకు అనుకూలంగా, ఖనిజ సంపద దోచి పెట్టేందుకు వీలు కల్పించేందుకు సహకరిస్తుందని ఆరోపించారు. కొరాపుట్ జిల్లాలో పర్యాటకరంగా అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ.. ఒక్క ప్రదేశాన్ని బడ్జెట్లో చేర్చలేదన్నారు. మల్కన్గిరి, నవరంగపూర్ జిల్లాల రైల్వే లైన్ల అనుసంధానం కల్పించేందుకు బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయించలేదన్నారు. ఈ బడ్జెట్ మధ్య తరగతి కుటుంబాలపై కొరడా అని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్, పెట్రోల్, తదితర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మునిసిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి మాట్లాడుతూ.. అమెరికా విధించిన టారిఫ్ల నేపథ్యంలో స్వదేశీ వస్తువుల వినియోగంపై ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపునకు భిన్నంగా బడ్జెట్ ఉందన్నారు. స్వదేశీ వస్తువుల ప్రోత్సాహంపై ఎటుంటి ప్రస్తావన లేదన్నారు. మల్కన్గిరి మాజీ ఎమ్మెల్యే నిమయి చరణ్ సర్కార్, జయపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత నాయక్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్య పట్నాయక్, రామ నాయక్, ప్రణబ్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పారటీ కోశాధికారి నిహారంజన్ బిశాయి, తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ రూపకల్పనపై చర్చ భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూగర్గ్ అధ్యక్షత వహించిన అంతర్ విభాగ కార్యదర్శి స్థాయి సమావేశం ఖారవేల భవన్లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనపై లోతుగా చర్చించారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పథకాలు, కార్యక్రమాలను ఆవిష్కరించాలని అనూ గర్గ్ కార్యదర్శులకు సూచించారు. ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి, అంతర్ విభాగ సమస్యలను పరిష్కరించడానికి క్షేత్ర సందర్శనల ప్రాధాన్యతను ఆమె వివరించారు. బడ్జెట్ వ్యయం, ఆదాయ సేకరణ, ప్రాజెక్టు అమలుపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా గత ఏడాది జనవరి 31 నాటికి ఖర్చు, ఆదాయ సేకరణ స్థితిని కార్యదర్శులు సమీక్షించారు. వ్యవసాయం, మత్స్య సంపద, సామాజిక సేవల వంటి రంగాలలో గణనీయమైన పురోగతిని గుర్తించారు. పరిశ్రమలు, క్రీడలు, సైన్స్, టెక్నాలజీ, పర్యాటకం వంటి ముఖ్యమైన రంగాలపై దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. నిర్మాణాలు వేగవంతం చేసి ఆదాయ లక్ష్యాలను చేరుకోవాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. సమావేశంలో అభివృద్ధి కమిషనర్, అదనపు ప్రధాన కార్యదర్శి దేవ రంజన్ కుమార్ సింగ్, సాధారణ పాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్, వివిధ శాఖల అదనపు ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శులు, అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు, కమిషనర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. విద్యార్థిపై దాడి రాయగడ: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో చదువుతున్న విద్యార్థిపై మరో విద్యార్థి ఇనుప రాడ్డుతో దాడి చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రగాయాలకు గురైన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై గాయాలపాలైన విద్యార్థి పినతండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐటీఐలో వెల్డర్ గ్రేడ్లో విద్యాభ్యాసం చేస్తున్న మనోజ్ గౌడొ అనే విద్యార్థిపై అదే క్యాంపస్లో చదువుతున్న భువన్ లిమ్మ అనే మరో విద్యార్థి వెనుక నుంచి ఇనుప రాడ్డుతో దాడి చేసి తలపై గాయపరిచాడు. క్లాస్ ముగిసిన తరువాత తరగతి గది నుంచి తిరిగి వస్తుండగా దాడి చేశాడు. ఈ దాడిలో మనోజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పాత కక్షల కారణంగానే ఇద్దరి మధ్య గొడవలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ తెలియజేశారు. ప్రస్తుతం మనోజ్ పరిస్థి ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. -
రాజకీయాలపై యువత ఆసక్తి కనబరచాలి
● డీసీసీ అధ్యక్షుడు అప్పలస్వామి కడ్రకరాయగడ: ప్రస్తుత పరిస్థితిల్లో రాజకీయాలపై యువత ఆసక్తి కనబరచాలని డీసీసీ అధ్యక్షుడు, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అన్నారు. కళ్యాణసింగుపూర్ సమితి నారాయణపూర్లో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూడకుండా ఆసక్తి ఉన్న యువతీ, యువకులు రాజకీయాల్లో తమ సేవలను అందించాలని పిలుపునిచ్చారు. యువత దేశ భవిష్యత్ కాబట్టి వారు రాజకీయ రంగంలో రాణించగలిగితే స్వచ్ఛమైన పాలనను ప్రజలకు అందించే అవకాశం లభిస్తోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బిసంకటక్ ఎంఎల్ఏ నీలమాధవ హికక మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకుందని అన్నారు. యువతీ, యువకులు పార్టీ సిద్ధాంతాలు, నాయకులు చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీలొ చేరేందుకు ఆసక్తి కనబరుస్తుండటం హర్షనీయమని అన్నారు. అనంతరం సమితి పరిధిలోని ఏడు పంచాయతీలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పండ, సాధారణ కార్యదర్శి శంకర్షణ మంగరాజ్, చింతాలి నాగేష్ పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదాల నియంత్రణకు.. విస్తృత సన్నాహాలు
భువనేశ్వర్: వేసవిలో అటవీ ప్రాంతంలో సహజంగా రగిలే అగ్ని మంటల నివారణ పట్ల అటవీ విభాగం ముందస్తుగా సమాయత్తం అవుతోందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చీఫ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డాక్టర్ కె.మురుగేషన్ తెలిపారు. రాష్ట్రంలో రానున్న అటవీ అగ్ని సీజన్ను విజయవంతంగా ఎదుర్కొవడానికి అటవీ శాఖ సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయన్నారు. స్థానిక అరణ్య భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అటవీ అగ్ని ప్రమాదాల ప్రభావం ఎదుర్కొనేందుకు సాంకేతిక, క్షేత్రస్థాయి చర్యలను వివరించారు. మంటలు అడవులకు మాత్రమే కాకుండా వన్యప్రాణులు, అడవులపై ఆధారపడిన ప్రజల జీవనోపాధికి పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయన్నారు. గత సంవత్సరం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 29,709 అటవీ అగ్ని ప్రమాదాలను గుర్తించామన్నారు. ఈ సంఘటనలు పొడి వాతావరణం, అడవిలో పేరుకుపోయిన ఎండుటాకులు, మానవ నిర్లక్ష్యం కారణంగా సంభవించినట్లు ధృవీకరించారు. వీటిని ఉపగ్రహ ఆధారిత హెచ్చరికలు, అటవీ అధికారుల సత్వర చర్యలతో దాదాపు 99.7 శాతం సంఘటనలు నియంత్రించబడినట్లు పేర్కొన్నారు. ఈ చర్యలతో నష్టం గణనీయంగా తగ్గించడం సాధ్యమైందన్నారు. ఈ ఫలితాల ఆధారంగా ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అడవిలో మంటలు వ్యాపించకుండా నిరోధించడానికి దాదాపు 20,461 కిలో మీటర్ల సుదీర్ఘ అగ్ని మాపక హద్దులను (ఫైర్ లైన్) రూపొందించామన్నారు. సాంకేతిక నైపుణ్యతతో అడవి మంటల నివారణ.. ఈ సంవత్సరం అడవి మంటలను ఎదుర్కొవడానికి సాంకేతిక నైపుణ్యాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రారంభ దశలో మంటలను గుర్తించడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత కెమెరాలు, డ్రోన్లను ఉపయోగిస్తామన్నారు. దీనితో పాటు వివిధ శ్రేణులు, బీట్ స్థాయిలలో 334 ప్రత్యేక రక్షణ బృందాలను మోహరించి నిఘా పటిష్టపరుస్తామన్నారు. వీరికి 5,000 పైబడి లీఫ్ బ్లోయర్లు మరియు ఇతర అగ్నిమాపక పరికరాలు అందజేస్తామన్నారు. సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడానికి 631 పైబడి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 200 మంది జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందికి అడవి మంటల నివారణలో ప్రత్యేక శిక్షణ కల్పించామన్నారు. మరోవైపు అటవీశాఖ స్థానిక సమాజం, అటవీ ప్రాంతాలలో నివసించే ప్రజల సహకారం కోసం విజ్ఞప్తి చేసింది. అటవీ సంరక్షణ కమిటీలు మరియు పర్యావరణ అభివృద్ధి కమిటీల ద్వారా దాదాపు 336 గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. సాధారణ ప్రజల చురుకై న భాగస్వామ్యం లేకుండా ఈ సహజ వనరును రక్షించడం సాధ్యం కాదు. నిర్లక్ష్యంగా అడవికి నిప్పు పెట్టవద్దని అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. -
38 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో అక్రమ గంజాయి సాగుని సమూలంగా నివారించేందుకు పోలీసులు, రెవెన్యూ, అటవీ, అబ్కారి సిబ్బంది సంయుక్తంగా కృషి చేస్తున్నారు. విస్తృతంగా గ్రీన్ క్లీన్ అభిజాన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బొయిపరిగుడ సమితి మఝిగుడ పంచాయతీ మారుమూల అటవీ ప్రాంతంలోని భటాపడ గ్రామ సమీపంలో ప్రభుత్వ భూమిలో 38 ఎకరాల భూమిలో గంజాయి పంటను కనుగొన్నారు. వెంటనే గంజాయి మొక్కలను పొలాల నుంచి తొలగించి నిప్పు పెట్టి కాల్చివేసినట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురుదొర బత్రియ వెల్లడించారు. ఈ అభిజాన్లో గంజాయి మొక్కలు తొలగించేందుకు ఒక ప్లాటూన్ పోలీసు ఫోర్స్ను వినియోగించినట్లు వెల్లడించారు. ఈ అభిజాన్లో అటవీ విభాగ ిసిబ్బంది సహకరించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఇటీవల నక్సల్ ప్రభావిత ప్రాంతంలో సాగు చేసిన వందలాది ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినట్లు గుర్తు చేశారు.గంజాయి స్వాధీనం రాయగడ: జిల్లాలోని బిసంకటక్లో బుధవారం అబ్కారీ శాఖ అధికారులు తొమ్మిది కిలోల మూడు వందల గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడు కంధమాల్ జిల్లాలోని లండగా ముధథాబలి గ్రామానికి చెందిన శివ బేసార అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 93 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అబ్కారీ శాఖ సిబ్బంది బిసంకటక్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పట్టుకుని అతని వద్ద గల బ్యాగును తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. -
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
● క్యాన్సర్ అవగాహన ర్యాలీలో వక్తలుపర్లాకిమిడి: చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్యాన్సర్ రోగం నుంచి ప్రజలు విముక్తి పొందాలని వక్తలు పిలుపునిచ్చారు. మద్యపానం, గుట్కా, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలంటూ బుధవారం శ్రీజగన్నాథ మందిరం నుంచి ర్యాలీని జిల్లా న్యాయలయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా ప్రారంభించారు. ర్యాలీలో ప్రగతిశీల సంఘటన్ అధ్యక్షులు లోకనాథ మిశ్రా, కార్యదర్శి తనూజా శతపథి, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా జగన్నాథ మందిరం, ఇతర ప్రార్థనాలయాల వద్ద గుట్కా, మద్యం సేవించరాదని రాజేష్ కుమార్ మిశ్రా అన్నారు. ర్యాలీలో ప్రభుత్వ ఆడ్వకేటు సౌమ్యరంజన్ పట్నాయక్, బినోదిని సైన్స్ కళాశాల అధ్యక్షులు మనోజ్ పట్నాయక్, సమాజసేవక్ గిరీష్ పాలో, కై లాష్ బిశ్వాల్, హరిమోహన్ పట్నాయక్ నియాతీ, వీహెచ్పీ, భజరంగ్దళ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’లో గాంధీ పేరు తొలగించడం అన్యాయం
రాయగడ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈమేరకు బుధవారం రాయగడలో ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక నేతృత్వంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ పండ, శంకర్షన్ మంగరాజ్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్థానిక సర్క్యూట్ హౌస్ నుంచి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కడ్రక మాట్లాడుతూ.. గ్రామీణ భద్రతకు మూల స్తంభంగా ఉన్న మనోరేగ పథకం ప్రజలకు అందుబాటులో ఉండేదని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం పథకంలో గాంధీ పేరును తొలగించి రామ్ రామ్ జీగా మార్చడం విచారకరమని అన్నారు. ప్రభుత్వం స్పందించి మనోరేగ పథకాన్ని యథాస్థితిగా మార్చాలని.. లేని పక్షంలో కాంగ్రెస్ భవిష్యత్లో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తుందని అన్నారు. -
టూరిజం కారవాన్లు ప్రారంభం
భువనేశ్వర్: ఽరాష్ట్ర పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. నగరం శివారులోని ధౌలి పాద పీఠం నుంచి ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా బుధవారం మూడు టూరిజం కారవాన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాతి పరిడా మాట్లాడుతూ ఈ కారవాన్లలో పర్యాటకులు సహజ ప్రకృతి దృశ్యాలను ప్రశాంత వాతావరణంలో ఆస్వాదించగలుగుతారన్నారు. అనేక యూరోపియన్ దేశాలలో కారవాన్ పర్యాటకం ఆకర్షణీయ వ్యవస్థగా వెలుగొందుతోందన్నారు. భువనేశ్వర్ ఏకామ్రా ఎమ్మెల్యే బాబూ సింగ్, పర్యాటక శాఖ డైరెక్టర్ దీపంకర్ మహా పాత్రో మాట్లాడుతూ కారవాన్ టూరిజం సంప్రదాయ గమ్యస్థానాల పర్యటన అవధులు అధిగమించి సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడి సాంప్రదాయ పర్యాటక కేంద్రాలపై ఒత్తిడి తగ్గిస్తుందన్నారు. వ్యవస్థను పర్యాటక శాఖ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) మోడ్ కింద ప్రారంభించినట్లు ప్రకటించారు. కారవాన్ ఆధారిత పర్యాటక అనుభవాల కోసం హిరాకుద్, సిమిలిపాల్, దారింగ్బాడి, దేవ్మాలి, తల్సారి, పెంథా, మంగళజోడి, జిరంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర సహజ ప్రదేశాలు వంటి ముఖ్యమైన పర్యాటక సామర్థ్యం ఉన్న గమ్యస్థానాలను ఈ పర్యటనలో జోడించినట్లు వివరించారు. ప్రసాద్ పాఽఢి, అర్చన పాఽఢి తొలి టూరిజం కారవాన్ టికెటు కొనుగోలు చేసి పర్యటన ప్రారంభించారు. వీరివురు తొలి పర్యాటకులుగా బాలసోర్లోని తల్సారికి పర్యటనకు బయల్దేరారు. -
పూరీలో రాష్ట్రపతి ముర్ము
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూరీలో పూర్వీకులకు పిండ ప్రదానం చేశారు. బుధవారం తొలుత శ్వేత గంగలో సంప్రదాయబద్ధంగా పూర్వీకులకు పిండ ప్రదానం చేసిన అనంతరం జగన్నాథ ఆలయం సందర్శించారు. గర్భ గుడిలో మూల విరాటుల్ని దర్శించుకుని ర్నత వేదికకు ప్రదక్షిణం చేశారు. జగన్నాథుని ఆశీస్సులు పొందారు.ఆలయ సందర్శన సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఉన్నారు. శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో ముఖ్యమంత్రికి వీరంతా సాదరంగా స్వాగతించారు. రాష్ట్రపతి సందర్శన దృష్ట్యా భద్రతా ఏర్పాట్ల మధ్య దర్శనం సులభతరం చేసేందుకు ఉదయం 10 గంటల వరకు సాధారణ భక్తుల ప్రవేశం నివారించి సర్వ దర్శనం నిలిపివేశారు. పూరీలో కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత రాష్ట్రపతి ముర్ము భారత వైమానిక దళం హెలికాప్టర్లో మయూర్భంజ్ జిల్లాలోని తన స్వస్థలం రాయరంగ్పూర్కు బయలుదేరారు. తొలుత పూర్వీకులకు పిండ ప్రదానం అనంతరం శ్రీమందిరంలో జగన్నాథునికి పూజలు స్వాగతం పలికిన గవర్నర్, సీఎం -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
● కృషక్మంచ్ నాయకుల డిమాండ్ జయపురం: జిల్లాలో ధాన్యం మండీలలో నెలకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొరాపుట్ జిల్లా కృషక మంచ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కృషక్ మంచ్ కార్యదర్శి నరేంద్ర ప్రధాన్ నేతృత్వంలో రైతులు కొరాపుట్ జిల్లా సివిల్ సప్లయ్ జయపురం కార్యాలయ అధికారిని కలిసి జిల్లా కలెక్టర్కు ఉద్దేశించి వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మండీలలో ధాన్యం కొనేందుకు సిబ్బంది అనేక కారణాలు చూపుతున్నారని, మండీల్లో తగిన సౌకర్యాలు లేక పోవటం, మిల్లర్లు ధాన్యం కొనకపోవటంతో జిల్లాలోని అన్ని మండీలలో లక్షలాది క్వింటాళ్ల ధాన్యం పడి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు టోకెన్లు ఇచ్చే ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. రైతుల నిస్సహాయతను ఆసరాగా తీసుకొని మిల్లర్లు ధాన్యంలో నాణ్యత లేదనే కారణాన్ని చూపిస్తూ క్వింటాకు ఐదు నుంచి 15 కేజీలు వరకూ అదనంగా ధాన్యాన్ని తీసుకుంటున్నారని వినతి పత్రంలో వివరించారు. ధాన్యం రవాణా ఖర్చులు, హేండిలింగ్ ఖర్చులు, ఖాళీ బస్తాల పైకం చెల్లించాలని కృషక మంచ్ డిమాండ్ చేసింది. తాము చేసిన ఆరోపణలపై నిష్పక్షంగా దర్యాప్తు జరిపి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారులను కలిసినవారిలో కృషక్ మంచ్ జిల్లా కార్యదర్శితో పాటు రైతులు సిద్దార్థ త్రిపాఠీ, సంజయ బెహర, బిది భూషణ త్రిపాఠీ, రణేంద్రప్రసాద్హత్త, పూర్ణ చంద్రనాయిక్, పి.వెంకటరావు, పల్లి రాజు, రాజేంద్రనాయిక్ ఉన్నారు. -
మావోయిస్టు లొంగుబాటు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఎస్పీ వినోద్ పటేల్ ఎదుట బుధవారం ఛత్తీష్గఢ్ మావోయిస్టు సంస్థకు చెందిన శుక్రామ్ మాడాకం స్వచ్ఛందంగా లొంగిపోయాడు. అత్యాధునిక ఎస్ఎల్ఆర్ తుపాకీని ఎస్పీ అందజేశాడు. 12 సజీవ కార్ర్టిడ్జ్లు, రెండు ల్యాండ్మైన్లు, కోడెక్స్ వైర్లు, విద్యుత్ లైన్లు, మందులు, మావో దుస్తులను సమర్పించారు. ఛత్తీష్గఢ్ సుకుమా జిల్లా, మల్కన్గిరి మాత్తిలి సమితి దల్దలి ప్రాంతంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనల్లో కీలక పాత్ర వహించాడు. ఈయనపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.21 లక్షల రివార్డ్ ప్రకటించాయి. ప్రభుత్వ నియమం ప్రకారం లొంగిపోయిన మావోకు అందాల్సిన అన్ని సౌకర్యాలు త్వరలోనే అందజేస్తామని ఎస్పీ తెలిపారు. -
ఎం.ఎస్.ఎస్ ఫౌండేషన్, విక్రమ్ వర్సిటీల మధ్య ఎంవోయూ
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయం, ఎం.ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ జయపురం కేంద్రాల మధ్య విద్య, అనుబంధ సహకారాన్ని స్థాపించేందుకు (ఎంవోయూ) ఒప్పదం కుదిరింది. వర్సిటీ మూడవ ప్రతిష్టా దినోత్సవం సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం పరస్పర సహకారం అందించుకొనేందుకు ఉభయ వర్గాలు అంగీకారానికి వచ్చాయి. ఈ ఒప్పంద కార్యక్రమం వర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ డాక్టర్ దేవీప్రసాద్ మిశ్ర, రిజస్ట్రార్ మహేశ్వర్ చంద్ర నాయిక్ తదితర యూనివర్సిటీ అధికారులు, ఎం.ఎస్.స్వామినాథన్ రిసేర్చ్ ఫౌండేషన్ కేంద్ర డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడల సమక్షంలో బుధవారం జరిగింది.. ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం విద్య, పరిశోధన సహకారం, విద్యార్థుల మార్పడి కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు మరింత బలోపేతం చేయటం, పరస్పర విద్య, పరిశోధన ఆసక్తి గల రంగాలను గుర్తించటం, విద్య, పరిశోధనలు అభివృద్ధి పరిచేందుకు అవసరమైన యాజమాన్య సహకారాలు అందించాలని నిర్ణయించారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
–8లోuమల్కన్గిరి జిల్లాలో జరుగుతున్న జిల్లాస్థాయి మాల్యవంత్ ఉత్సవాలు మూడో రోజు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. మంగళవారం రాత్రి జరిగిన వేడుకల ప్రారంభానికి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టాంగులు, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు పతితపావన తదితరులు హాజరయ్యారు. ముందుగా శాశ్వత్ జోషి బృంధం ఒడిశీ, సంబల్పురీ నృత్యంతో అలరించింది. ఓలీవుడ్ గాయకులు కుల్దీప్ పట్నాయిక్, సచిన్ రావత్, గాయని శీతల్ కున్మున్ తదితరుల ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి. – మల్కన్గిరి గురువారం శ్రీ 5 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026గాయని శీతల్ప్రముఖ గాయకుడు కుల్దీప్ పట్నాయక్ -
శివరాత్రి ఉత్సవాలకు మూహూర్తపు రాట
రాయగడ: అత్యంత పురాతన మందిరంగా గుర్తింపు పొందిన స్థానిక బాలింకేశ్వర మందిరంలో ఈ నెల 16వ తేదీ నుంచి జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి బుధవారం మూహూర్తపు రాట పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ ప్రముఖులు పెద్దిన ఆనందరావు, గోపరంజన్ బక్షీపాత్రో, సస్మిత బక్షీపాత్రో, డాక్టర్ సౌదామిని ఆచార్య, హరిహర దాస్, దేవాశీష్ బక్షీపాత్రో, ప్రియాంక బక్షీ పాత్రో దంపతులు పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా మందిర ప్రాంగణంలో విశ్వశాంతి త్రయంబకం మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు వైభవంగా జరుగుతాయన్నారు.మధుసూదన్దాస్కు ఘన నివాళులు రాయగడ: స్థానిక రింగ్ రోడ్డులోని యూజీఎంఐటీలో ఉత్కళ గౌరవ్ మధుసూదన్ దాస్ 92వ వర్ధంతిని బుధవారం జరుపుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ కుమార్ ఖటువ, ఎంఎస్రావు, జిల్లా పారిశ్రామిక కేంద్ర విశ్రాంత అడ్మినిస్ట్రేటర్ సబ్యసాచి సాహు, లెక్చరర్ ప్రతిభా పాత్రో, శ్రీకాంత్ ఠాకూర్, కె.సుమన్రావు, గీతాంజలి పండ, దీపక్ కుమార్ నాయక్ తదితరులు మధుసూదన్ దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఒడిశా రాష్ట్రానికి మధుసూదన్ దాస్ చేసిన సేవలను వక్తలు కొనియాడారు. -
షరతులు అంగీకరిస్తే లొంగిపోతాం
రాయగడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ షరతులను అంగీకరిస్తే లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలిసిపోతామని మావోయిస్టు నేతలు బహిరంగ లేఖలో ప్రకటించారు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్లో సోమవారం ఈ లేఖను కొంతమంది పత్రిక విలేకర్లకు పంపించారు. ఒడిశా రాష్ట్ర సీపీఐ (మావోయిస్టు) కమిటీ సభ్యులు నిఖిల్ అలియాస్ నిరంజన్ రౌత్, ఇందు అలియాస్ రస్మిత లెంక పేరిట విడుదలైన ఈ లేఖలో సాయుధ పోరాట మార్గాన్ని తాము విడిచిపెట్టి, ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేసేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు. అయితే కొద్దికాలం క్రితం ప్రభుత్వానికి లొంగిపోయిన మావోయిస్టు నేతలు సవ్వసాచి పండ, ఆజాద్లను చాలా ఏళ్లుగా జైలులో ఉంచి ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభుత్వాలు విస్మరించాయని గుర్తు చేశారు. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తే తాము లొంగిపోయేందుకు ఏవిధంగా ఆలోచించమని లేఖలో ప్రస్తావించారు. అదేవిధంగా దళిత, పేద వర్గాలను అణిచి వేస్తున్న ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మావోయిస్టు నేతల బహిరంగ లేఖ -
విరజా పీఠంలో రాష్ట్రపతి పూజాదులు
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా జాజ్పూర్ విరజా శక్తి పీఠం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజాదుల్లో పాల్గొన్నారు. ముక్తి మండపం వేద పండితుల ఆశీర్వచనం పొందారు. పూజాదుల్లో ఆద్యంతం సంప్రదాయ రీతిలో రాష్ట్రపతి పాలుపంచుకోవడం విశేషం. ఈ సందర్భంగా విరజా శక్తి పీఠం సుగంధిత పుష్పాలంకరణతో గుబాళించింది. ముందస్తుగా ప్రకటించిన వేళల ప్రకారం భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ఉదయం 9.30 గంటలకు జాజ్పూర్లోని పరిపాలనా భవనంలోని హెలిప్యాడ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగారు. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి ప్రతినిధిగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రవి నారాయణ్ నాయక్, సహకార చేనేత, జౌళి మరియు హస్తకళల మంత్రి ప్రదీప్ బాల సామంత్, జాజ్పూర్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రవీంద్ర నారాయణ్ బెహెరా, జాజ్పూర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా కౌన్సిల్ చైర్పర్సన్, డీఐజీ పోలీస్ చరణ్ సింగ్ మీనా, రైల్వే మరియు కోస్తా రక్షణ విభాగం పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ అరుణ్ బోత్రా, సెంట్రల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పూనమ్ తపస్ కుమార్, జిల్లా కలెక్టర్ అంబర్ కుమార్ కొరొ, సెక్యూరిటీ సూపరింటెండెంట్ ఎస్.ప్రతాప్ శ్రీమల్ తదితరులు ఘన స్వాగతం పలికారు. పూర్వీకులకు పిండ ప్రదానం బిర్జా ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాభి గయలో పూర్వీకులకు పిండ ప్రదానం చేశారు. ఈ పూజా కార్యక్రమం దాదాపు గంట సేపు నిరవధికంగా కొనసాగింది. ఇందులో 4 మంది బ్రాహ్మణులు నిమగ్నమయ్యారు. అనంతరం ఆమె విరజా మాతను దర్శించుకున్నారు. ఆపై ప్రదక్షిణలు చేసి గంగేశ్వర్, ముక్తేశ్వర్, కాల భైరవుడు, 108 శివలింగాలు, పార్శ్వ దేవీ దర్శనం చేసుకుని ముక్తి మండప సభలో ఆశీస్సులు పొందారు. రాష్ట్రపతి ఆలయ సందర్శన సమయంలో పరిసరాలు వేద మంత్రాలు మరియు హలుహులి మంత్రోచ్ఛారణలతో మారుమోగాయి. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం రాష్ట్రపతికి బుద్ధ విగ్రహం మరియు ప్రసిద్ధ చేనేత తస్సా చీరను బహుమతిగా అందజేసింది. చివరగా ఆహ్వానించబడిన బ్రహ్మకుమారీలు రాష్ట్రపతిని కలిశారు. విరజా పీఠం పూజాదులు తదితర కార్యక్రమాలు పూర్తి కావడంతో ఉదయం 11.40 గంటలకు ప్రత్యేక విమానంలో బాలసోర్కు బయలుదేరారు. -
రైల్వేలైన్ నిర్మాణం ఇంకెన్నడు..?
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో రైల్వేలైన్ నిర్మాణంపై ప్రతిపక్ష బీజేడీకి చెందిన రాజ్యసభ ఎంపీ, ఒడియా సినీ హీరో మున్నా ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్లో ఈ సమస్యను లేవనెత్తారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్ధాలు అయినప్పటికీ నబరంగ్పూర్ జిల్లాలో రైల్వేలైన్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వంతో ఏంవోయూ కుదిర్చుకున్నట్లు గుర్తు చేశారు. జయపూర్ – నబరంగ్పూర్ల మధ్య మొత్తం కి.మీ.40 దూరం భూ సేకరణ మెత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, అంతేకాక రైల్వేలైన్ నిర్మాణంలో సగం ఖర్చులు భరించడానికి నవీన్ పట్నాయక్ అంగీకరించారని తెలిపారు. అప్పడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉందన్నారు. నాటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు, రాష్ట్రానికి చెందిన ఒకే ఒక బీజేపీ ఎంపీ జుయల్ ఓరం, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఎంవోయూ సమయంలో ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికి పదేళ్లు అయినా నిర్మాణానికి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ప్రస్తుత కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్టవ్ బీజేపీ సాయంతో రాజ్యసభ ఎంపీ కాలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తమ నాయకుడు నవీన్ ఆదేశాలతో బీజేడీ మద్దతుతో ఎంపీ అయ్యారని గుర్తు చేశారు. అలాంటిది కేవలం 40కి.మీ రైల్వేలైన్ పూర్తి చేయలేరా అని ధ్వజమెత్తారు. రాజ్యసభలో ప్రభుత్వంపై విమర్శలు -
పోలీసులపై న్యాయవాది ఫిర్యాదు
జయపురం: జయపురం పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్, ఏఎస్ఐలు తనను కొట్టి, అసభ్య పదజాలంతో దూషించి, చంపుతామని బెదిరించారని న్యాయవాది జి.రాజశేఖర్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గత నెల జనవరి 24వ తేదీన తన సోదరుడితో తనకు స్వల్ప వాగ్వాదం జరగగా తాను గాయాల పాలయ్యానని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాగ్వాదంపై ఫిర్యాదు చేసేందుకు పట్టణ పోలీసుస్టేషన్కు వెళ్లగా అక్కడ ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది తనపై తీవ్రంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో దూషించి, చంపుతామని భయపెట్టారన్నారు. కాగా న్యాయవాదిపై పోలీసు దాడిని జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సరోజ్ కుమార్ దాస్, కార్యదర్శి సచ్చిదానంద మిశ్రలు తీవ్రంగా ఖండించారు. పట్టణ పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఒడిశా రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా న్యాయవాది ఆరోపణపై స్పందించి పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్రరౌత్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పేకాటరాయుళ్లు అరెస్టు కొరాపుట్: పేకాటరాయుళ్లను నబరంగ్పూర్ జిల్లా కేంద్ర పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పట్టణ పోలీస్స్టేషన్ ఐఐసీ సంబిత్ బెహరా ఈ వివరాలు ప్రకటించారు. వేకువజామున నువాగుడ గ్రామ సమీపంలోని జీడితోటలో భారీ ఎత్తున పేకాట శిబిరం జరుగుతుందనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. అక్కడ పేకాడుతున్న 7గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.40,500ల నగదు సీజ్ చేసినట్లు ఐఐసీ ప్రకటించారు. నో ఫ్లయింగ్ జోన్గా పూరీ భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన పురస్కరించుకుని పూరీని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు రాష్ట్రపతి పూరీ పర్యటనలో పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం పూరీ చేరుకొని రాత్రి బస చేశారు. మర్నాడు బుధవారం స్థానిక శ్వేతగంగ తీరంలో పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తారు. అనంతరం శ్రీమందిరం సందర్శించి శ్రీజగన్నాథుడిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా పూరీ జిల్లా యంత్రాంగం భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేసింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నో ఫ్లయింగ్ జోన్ ఆంక్షలు అమలులో ఉంటాయి. పూరీ నగరానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించబడ్డాయి. ఈ పరిధిలో పట్టణ ప్రాంతం డ్రోన్ రహిత జోన్ లేదా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించబడింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా గౌరీ శంకర్ రాయగడ: జిల్లా బీజేడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాయగడ సమితి మాజీ వైస్ చైర్మన్ పట్నాన గౌరీ శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు శంఖ భవనం నుంచి ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ ఒక ప్రకటనలో మంగళవారం తెలియజేశారు. బీజేడీలో కీలక పాత్ర పోషిస్తున్న గౌరీ గతంలో అమో ఒడిశా – నవీన్ ఒడిశా జిల్లా కన్వీనర్గా నియమితులై సేవలు అందించారు. ఆయన నియామకంపై ఆ పార్టీ శ్రేణులు, జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక అభినందించారు. అదేవిధంగా గంజాం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్ణ చంద్ర స్వయి, భగవాన్ గంతాయిత్, మయూర్బంజ్ జిల్లాకు రాయిసేన్ ముర్ము, భద్రక్ జిల్లాకు బీజేడీ అధ్యక్షునిగా బ్యామకేష్ రాయ్లు నియమితులైనట్లు ప్రకటనలో వెల్లడించారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి బీజేడీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించడంతో పాటు పార్టీలో కీలకమైన వ్యక్తులకు పార్టీ పదవులను ఇస్తూ వారిని ప్రోత్సహిస్తోంది. -
ఆడబిడ్డ పెళ్లికి అండగా..!
● రాష్ట్రంలో సీఎం కన్యా వివాహ యోజన ఆరంభం ● పేదింటి పెళ్లికి ఆర్థిక సాయం ● వదువుకి రూ.51 వేల ఆర్థిక సాయంభువనేశ్వర్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన మంగళవారం నుంచి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గంజాం జిల్లాలోని మా తారా తరణి పీఠంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఠం ప్రాంగణంలో సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. ఈ మండపాలపై దాదాపు 200 జంటలు అగ్ని సాక్షిగా ఒకటయ్యాయి. ఈ పథకం కింద వరుడి వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య, వధువు వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటే వారి పెళ్లికి ప్రభుత్వ ఆర్థిక సాయం అందుతుంది. ప్రతీ వధువుకు రూ.51,000ల ఆర్థిక సహాయం లభిస్తుంది. అందులో రూ.35,000లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) వ్యవస్థ ద్వారా నేరుగా వధువు బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది. వివాహ సంబంధిత ఖర్చుల కోసం అదనంగా రూ.6,000లు కేటాయిస్తారు. మిగిలిన రూ.10,000లు బహుమతుల రూపంలో అందజేస్తారు. ఈ బహుమతి ప్యాకేజీలో చీరలు, గాజులు, కాలి మెట్టెలు, పారాణి, సింధూరం, వధువు సారె కింద ఇతర సాంప్రదాయ పెళ్లి అలంకరణలతో పాటు పాత్రలు వంటి గృహోపకరణ వస్తువులు అందజేస్తారు. సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణతో వివాహం ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ పథకం ఉద్దేశించబడిందని అధికారులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా... ఈ సందర్భంగా సీఎం మోహన్ చరణ్ మాట్లాడుతూ.. వివాహం అనేది ఒక పవిత్రమైన వ్యవస్థ అన్నారు. పెళ్లి వేడుకలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సాయం అందజేస్తున్నట్లు తెలియజేశారు. దీనివలన బాల్య వివాహాల నివారణ, వరకట్నం కట్టడి, వితంతు పునర్వివాహాల ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్ణీత తేదీల్లో సామూహిక వివాహ వేడుకలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ పథకం తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన బాలికలు, వితంతువులు మరియు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలు (పీవీటీజీ)కు చెందిన లబ్ధిదారులకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. -
ప్రజాభిప్రాయం మేరకే జీతాలు పెంచాలి
జయపురం: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలను ప్రజాభిప్రాయం మేరకే పెంచాలని ఒడిశా రాష్ట్ర యాంటీ కరప్షన్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సుభ్రత్ కుమార్ నందో అన్నారు. పట్టణంలోని ఒక ప్రైవేటు హోటల్లో పత్రికా సమావేశాన్ని జిల్లా ఆర్గనైజేషన్ అధ్యక్షులు జి.రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. జీతాలు, పెన్షన్లు పెంచేందుకు ప్రతిపాదన తీసుకు రావడం రాష్ట్ర ప్రభుత్వ చారిత్రక తప్పిదమన్నారు. రాష్ట్రంలో లోకాయుక్త చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తమ ఉద్యమంలో ప్రజలు, యువత మమేకమవ్వాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆర్గనైజేషన్ నవరంగపూర్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ ఈశ్వరరావు, కో–ఆర్డినేటర్, ఆదివాసీ నేత అర్జున్ బాగ్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమైనది
జయపురం: ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ చారిత్రాత్మకమైనదని ఒడిశా గణ విద్యామంత్రి నిత్యానంద గోండ్ అన్నారు. సోమవారం జయపురంలోని ఒక ప్రైవేటు హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ఒక లక్ష 20 వేల కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. గతేడాది రాష్ట్రానికి కేవలం 14 వేల కోట్లు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు. ఈ ఏడాది నిరుపేదలు, రైతులు, యువత, మహిళల ఆర్థిక ప్రగతికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. సమావేశంలో కోట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ, నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీ మఝి, కొరాపుట్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శివ ముదులి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ శాశ్వత సభ్యులు గౌతమ్ సామంతరాయ్, నవరంగపూర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కుంజు బిహారీ దాస్, జయపురం పట్టణ బీజేపీ అధ్యక్షుడు బాబు షొండంగి తదితరులు పాల్గొన్నారు. మంత్రి నిత్యానంద గోండ్ -
ఘనంగా విక్రమదేవ్ వర్సిటీ వార్షికోత్సవం
జయపురం: స్థానిక విక్రమదేవ్ యూనివర్సిటీ మూడో వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ డాక్టర్ ప్రభాకర మహంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మండియ రాణి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ రొయిమతి ఘివురియ, డాక్టర్ కర్నల్ దాస్, మాజీ ఎమ్మెల్యే గుప్త ప్రసాద్ దాస్లను సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర మహంతి మాట్లాడుతూ.. విక్రమదేవ్ విశ్వ విద్యాలయం బహుళ ఆదివాసీ ప్రాంతంలో విద్యా ప్రగతికి అందిస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం వర్సిటీ స్థాపన దినోత్సవంలో విశ్వవిద్యాలయ పత్రిక ‘విక్రమ్’ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బీజేడీ ఆధ్వర్యంలో వేడుకలు విక్రమదేవ్ విశ్వ విద్యాలయం వార్షికోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్కు అభినందనలు తెలుపుతూ బీజేడీ శ్రేణులు కార్యక్రమాన్ని చేపట్టాయి. వర్సిటీ ప్రధాన గేటు వద్ద బిజూ ఛాత్ర జనతా దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు చేపట్టారు. ఈ వర్సిటీ నవీన్ పట్నాయక్ కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేడీ కార్యవర్గ అధ్యక్షుడు దుర్గ మిశ్ర, జయపురం పట్టణ బీజేడీ అధ్యక్షుడు ఎ.శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కుని అధికారి, శివ పట్నాయిక్, పార్టీ కార్మిక విభాగ నేత బాలారాయ్, పట్టణ మాజీ అధ్యక్షుడు హరమిశ్ర తదితరులు పాల్గొన్నారు. -
చేతబడి నెపంతో వృద్ధుడి దారుణ హత్య
రాయగడ: చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వృద్ధుడిని దారుణంగా గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. జిల్లాలోని అంబొదల పోలీస్స్టేషన్ పరిధి శారదాపూర్ పంచాయతీలోని సొండిపొదొరొ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు చిచిరామ్ బాగ్(61)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సైంటిఫిక్ బృందంతొ పాటు డాగ్ స్కాడ్తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. సొండిపొదొరో గ్రామంలో నివసిస్తున్న బాగ్ గత కొన్నేళ్లుగా చేతబడి చేస్తున్నట్లు గ్రామస్తులు అనుమానిస్తుండేవారు. గతంలో పలుసార్లు ఇదే విషయమై గ్రామంలో అతనితో గ్రామస్తులు తగాదాలు పెట్టుకునేవారు. ఇదిలాఉండగా సోమవారం రాత్రి నిద్రిస్తున్న బాగ్పై గుర్తు తెలియని దుండగులు పదునైన కత్తులతో దాడి చేశారు. గుర్తుపట్టని విధంగా ముఖంపై బండరాయితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం కుటుంబీకులు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలం వద్ద పోలీసులు ఒక వేట కత్తి, కర్ర, టార్చ్లైట్ను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు సంబంధించి గ్రామస్తులు నోరు మెదపడం లేదు. చేతబడి నెపంతోనే కొందరు ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు సమాచారం. -
హాస్టల్ విద్యార్థి మృతి
రాయగడ: జిల్లాలోని సదరు సమితి పరిధిలోని బొడొఖిల్లాపదర్లో గల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి అస్వస్థతకు గురై మృతిచెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. మృతుడు ఆశ్రమ పాఠశాల హాస్టల్లో ఒకటొ తరగతి చదువుతున్న తొబిరొ మండంగిగా గుర్తించారు. అతని స్వగ్రామం పతక పాడు గ్రామంగా సమాచారం. వివరాల్లోకి వెళితే గత కొద్ది రొజులుగా తొబిరొ అస్వస్థతకు గురయ్యాడు. విద్యార్థి ఆరోగ్యం గురించి ఆరా తీసిన హాస్టల్ నిర్వాహకులు సమీపంలో గల ఏఎన్ఎం ద్వారా చికిత్స అందించారు. అయితే సోమవారం మధ్యాహ్నం తొబిరొ హాస్టల్లో కళ్లు తిరిగి కింద పడిపోయాడు. అనంతరం అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. తల్లి సునీత మండంగికి సమాచారం అందించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా మారి తొబిరొ మృతి చెందాడు. అయితే తన కొడుకు అస్వస్థతకు గురైన విషయం తనకు తెలియదని ఆరొగ్యం బాగొలేదు ఆస్పత్రిలో చేర్చామని సొమవారం నాడు హాస్టల్ నిర్వాహకులు తెలియజేశారని, వారి నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు మృతి చెందినట్లు తల్లి ఆరోపిస్తున్నారు. -
గ్రీవెన్స్సెల్కు వినతుల వెల్లువ
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్కు 38 వినతులు అందాయి. వీటిలో 27 వ్యక్తిగత, 11 సామాజిక వినతులు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ వినతులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ సందిప్ సంపత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోడియా సమితిలో 45 వినతులు.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియా సమితి కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 45 వినతులు అధికారులకు అందాయి. వీటిలో కొన్ని సమస్యలను అధికారులు అక్కడిక్కడే పరిష్కరించగా.. మరికొన్నింటిని పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్పటేల్, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్, సబ్ కలెక్టర్ దూర్యధన్ భోయి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మహిళల అభ్యున్నతే ధ్యేయం
రాయగడ: మహిళల అభ్యున్నతే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని రాష్ట్ర ముఖ్య మంత్రి మోహన్ చరణ్ మాఝి అన్నారు. స్థానిక జేఎస్కో మైదానంలో సొమవారం జిల్లా యంత్రాంగం నిర్వహించిన సుభద్ర మేళాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక సాధికారితకు ఎంతో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా యని పేర్కొన్నారు. స్వయం ఉపాధి మార్గాల కోసం బ్యాంకుల సాయంతో రుణాలు మంజూరు చేస్తున్నామని అన్నారు. రాయగడ జిల్లాలోని స్వ యం సహాయక బృందాలకు చెందిన మహిళలు స్వయం ఉపాధి మార్గాల ద్వారా అభివృద్ధి చెందిన గుర్తింపు పొందిన మహిళలను ప్రశంసించారు. వింద్యా వాసిని, సింగారి వడక, కుమారి కడ్రక, కున్ని పెడిసీ, సుశీల మండంగి అనే ఆదివాసీ మహిళలు స్వయం సహాయక బృందాల్లో చేరి స్వయం ఉపాధి మార్గంలో మహిళలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అనంతరం వారిని సన్మానించారు. పారిశ్రామిక హబ్గా రాయగడ.. ప్రకృతి వనరులు, ఖనిజ సంపదలకు నిలయంగా మారిన రాయగడ జిల్లా భవిష్యత్లో పారిశ్రామిక రంగంలో మంచి విప్లవాన్ని సాధించే విధంగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి మాఝి అన్నారు. ఈ జిల్లా పారిశ్రామిక హబ్గా మారే అవకాశం ఉందని అన్నారు. ఇంఫా, ఇండాల్, ఆదిత్యా బిర్లా, ఉత్కళఅలూమిన, జేకేపేపర్ మిల్ వంటి బృహత్తర పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయని అన్నారు. వాటితో పాటు రానున్న రొజుల్లొ సుమారు 1 లక్ష కోట్ల పెట్టుబడులతో మరికొన్ని బృహత్తర పరిశ్రమలు ఈ జిల్లాలో ఏర్పాటు కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు స్థానికంగా గల నిరుద్యోగ యువతీ,యువకులకు సుమారు 80 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగేలా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రాయగడలో మెడికల్ కళాశాల ఏర్పాటు వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్న ఈ జిల్లాలో అత్యధిక శాతం మంది ఆదివాసీ, హరిజను లు నివసిస్తున్నారని వారి సంక్షేమ దృష్ట్యా ఈ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. తమ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. ఇప్పటికే అన్ని సన్నాహాలు చేస్తున్నామని, త్వరలో ఈ జిల్లా ప్రజలు తీపి కబురు వింటారని అన్నారు. జిల్లాలో మౌళిక సౌకర్యా ల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా రహదారులు, తాగు,సాగు ,విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు. అంతకు ముందు జిల్లాలో సుమారు రూ.340 కోట్లతో చేపట్టనున్న 67 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన చేశారు. రిమోట్ బటన్తో వాటి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా మరో రూ.221 కోట్లతో పూర్తయిన 41 అభివృద్ధి పనులను జిల్లా ప్రజలకు అంకితం చేశారు. కార్యక్రమంలో రాయగడ, బిసంకటక్, గుణుపూర్ ఎమ్మెల్యేలు అప్పల స్వామి కడ్రక, నీలమాధవ హికక, సత్యజీత్ గొమాంగొలు వారి శాసనసభ పరిధుల్లో గల వివిధ సమస్యలకు సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్న ఈ ప్రాంత రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సాగు నీటి వనరులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకు ముందు రాయగడ కలెక్టర్ అశుతొష్ కులకర్ణి, ఎస్పీ స్వాతి ఎస్.కుమార్లు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు టి.గోపిఆనంద్, సీని యర్ నాయకులు బసంత ఉలక, కాళీరాం మాఝి పాల్గొన్నారు. -
పిప్పిలి సమీపంలో హిజ్రా దారుణ హత్య
భువనేశ్వర్: ఆదివారం రాత్రి భువనేశ్వర్ శివార్లు పిప్పిలి పోలీస్ ఠాణా పరిధిలోని సీఐఎఫ్ఏ సమీపంలో హిజ్రాను దారుణంగా హత్య చేశారు. మృత హిజ్రా సలేపూర్ నివాసి అంజలిగా గుర్తించారు. కొంత కాలంగా భువనేశ్వర్లో ఉంటుంది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు అంజలిపై దాడి చేశారు. వారు ఆమెను కత్తితో పొడిచి ప్రాణాపాయ స్థితిలో ఇసుక కుప్ప దగ్గర కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దశలో విడిచి పెట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అంజలి స్పృహలోకి రావడంతో ఓపిక కూడగట్టుకుని తోటి స్నేహితులకు ఫోన్ చేయగలిగింది. ఈ సమాచారంతో ఘటనా స్థలం చేరిన అంజలి సహచరులు ఆమె తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే ఆమెను క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఆమె మరణించినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలియగానే పిప్పిలి ఠాణా పోలీసులు రంగంలోకి దిగి హత్య వెనుక గల ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన ప్రదేశంలో సైంటిఫిక్ బృందం, సెర్చ్ డాగ్ సహాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు బాధితురాలి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా కాల్ రికార్డు వివరాలను తనిఖీ చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు సీఐఎఫ్ఏ, సమీప ప్రాంతాల నుండి సీసీటీవీ ఫుటేజ్లను కూడా తనిఖీ చేస్తున్నారు. హిజ్రాల ఆందోళన నడి రోడ్డుపై బైఠాయించి హిజ్రా వర్గం ఆందోళన చేపట్టింది. స్థానిక సిఫా సమీపంలో జరిగిన హిజ్రా హత్యకు నిరసనగా వీరంతా రోడ్డును దిగ్బంధించారు. దీంతో ఎయిర్పోర్ట్ స్క్వేర్, ఏజీ స్క్వేర్, క్యాపిటల్ హాస్పిటల్ స్క్వేర్ వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హంతకుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ క్యాపిటల్ హాస్పిటల్ సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. మృత హిజ్రా కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించి హత్య సంఘటనపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తును ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. -
ఉత్సాహంగా మాల్యవంత్ మహోత్సవాలు
మల్కన్గిరి : మల్కన్గిరిలో ఆదివారం రాత్రి మాల్యవంత్ మహోత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 5వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్, ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీ శాఖ అధికారి సాయి కిరణ్, మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కామి, అదనపు కలెక్టర్ వేద్బ్ర్ అతిథులుగా హాజరయ్యారు. ఇక్కడి చరిత్ర సంప్రదాయం, కళాసంస్కృతి జీవన విధానానికి ప్రతిబింబమే మాల్యవంత్ మహోత్సవం అని అతిథులు అన్నారు. అతిథులకు జిల్లా సమాచార ప్రజాసంబంధ శాఖ అధికారి ప్రమిళా మాఝి కృతజ్ఞతలు తెలిపారు. -
16 కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరు అరెస్టు రాయగడ: కొరాపుట్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల్లో సేకరించిన గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాయగడ అబ్కారీ శాఖ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరెస్టయిన వారిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పహల్వాన్, కేబత, అనితాబాయ్ లొధిలుగా గుర్తించారు. జిల్లా అబ్కారీ శాఖ అధికారి సంతోష్కుమార్ ధలసామంతరాయ్ తెలియజేసిన వివరాల ప్రకారం.. పొరుగు జిల్లా కొరాపుట్ నుంచి గంజాయిని తీసుకువచ్చి మధ్యప్రదేశ్ కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ప్రత్యేక స్క్వాడ్ను ఏర్పాటుచేసి దాడులు నిర్వహించామన్నారు. ఈ క్రమంలొ స్థానిక రైల్వే చెక్గేట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని పట్టుకుని వారి బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి పట్టుబడినట్టు పేర్కొన్నారు. అరెస్టయిన నిందితుల్లొ ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిపారు. సైకత స్వాగతం భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చతుర్థామ క్షేత్రాల్లో ఒకటైన పూరీ శ్రీ జగన్నాథుని దర్శనం, స్థానిక శ్వేత గంగ ఒడ్డున పితృదేవతలకు పిండప్రదానం చేసేందుకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత ఐకత యానిమేటర్ మానస్ సాహు 2 గంటలపాటు నిర్విరామంగా శ్రమించి భారత రాష్ట్రపతి పూరీ సందర్శన ఇతివృత్తంతో సైకత యానిమేషన్ చిత్రీకరించారు. ఈ చిత్రీకరణలో ఒడిశాలోని పూరీకి స్వాగతం అనే సందేశాన్ని జోడించి కళాత్మకంగా స్వాగతించారు. జాజ్పూర్లో పాఠశాలలకు సెలవు భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాజ్పూర్ విరజా పీఠం సందర్శించి పూజాదుల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈ నెల 3న మంగళవారం నాడు జాజ్పూర్ పట్టణంలోని అన్ని పాఠశాలలు మూసివేస్తున్నామని జిల్లా విద్యా అధికారి (డీఈఓ) ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ ప్రాంతం, పట్టణ పరిసరాల్లో అన్ని పాఠశాలలు మూసివేస్తారని మండల విద్యాధికారి (బీఈఓ) సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన పురస్కరించుకుని జాజ్పూర్ పట్టణ ప్రాంతంలో సమగ్రంగా 47 ప్రభుత్వ, ఇతర పాఠశాలలు మూతబడతాయి. -
అటవీ కార్యాలయంలో చోరీ
నరసన్నపేట: మండలంలోని తామరాపల్లిలో జాతీయ రహదారి పక్కన ఉన్న అటవీ రేంజర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. కార్యాలయ తాళాలు విరగొట్టి లోపలికి వెళ్లి బీరువాలో వస్తువులను చిందరవందర చేశారు. బీరువాల్లో ఉన్న కొంత నగదు పోయినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని పత్రాలు కనిపించడం లేదని అటవీ అధికారులు అంటున్నారు. సోమవారం ఉదయం ఆఫీస్కు వచ్చిన సిబ్బంది గమనించగా.. పై అధికారుల సూచనల మేరకు అటవీ శాఖ ఫారెస్టర్ శ్రీను నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ సభ్యులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. నరసన్నపేట ఏఎస్ఐ అసిరినాయుడు తదితరులు పరిశీలించారు. అలాగే మండలంలోని గోకయ్యవలసలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకుపోయారు. మైక్సెట్కు సంబంధించిన ఆంప్లిఫైర్ కనిపించడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఇక్కడ కూడా క్లూస్ టీమ్ వచ్చి వేలముద్రలు సేకరించింది. -
అందరి సొమ్ములు ఒకేసారి చెల్లించాలి
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పోస్టాఫీస్లో జరిగిన సుమారు రూ.2.78 కోట్ల భారీ స్కామ్లో 33 మంది బాధిత ఖాతాదారులు తమందరికీ సొమ్ములను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత ఖాతాదారులంతా సోమవారం స్థానిక పోస్టాఫీస్ వద్ద బైఠాయించి పోస్టల్ సిబ్బందిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఇటీవల ఖాతాదారులంతా డిసెంబర్ 15వ తేదీన ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో సంక్రాంతి నాటికి అందరి సొమ్ములను చెల్లించడం జరుగుతుందని జిల్లా పోస్టల్ అధికారి హామీ ఇచ్చారు. అయితే సంక్రాంతి అయిపోయినా ఇప్పటివరకు డబ్బులు చెల్లించకపోవడంతో మరోసారి ఆందోళన చేపట్టారు. దీంతో స్థానిక పోస్టల్ సిబ్బంది బాధితుల్లో 20 మందికి చెక్లను సిద్ధం చేశారు. కాగా బాధిత ఖాతాదారులంతా అందరికి ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఖాతాదారులంతా స్థానిక పోలీస్ సిబ్బందిని ఆశ్రయించడంతో సీఐ మీసాల చిన్నంనాయుడు జిల్లా పోస్టల్ అధికారితో ఫోన్ ద్వారా సంప్రదించారు. పోస్టల్ డివిజనల్ అధికారితో బాధిత ఖాతాదారులందరితో మాట్లాడించి, వారి సమస్య పరిష్కరానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల వరకు పోస్టల్ సిబ్బందిని కార్యాలయంలోకి విడిచిపెట్టకపోవడంతో పోస్టల్ సేవలు నిలిచిపోయాయి. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
జయపురం: జయపురం సమితి బరిణిపుట్ ప్రాంతీ య శివమందిర ప్రాంగణంలో కొరాపుట్ జిల్లా బి– క్లాస్, సి–క్లాస్, డి–క్లాస్ కంట్రాక్టర్స్ సంఘం ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. సంఘ అధ్యక్షుడు పద్మన్ హరిజన్ నేతృత్వంలో చేపట్టి న ఈ కార్మక్రమంలో సంఘ సభ్యులంతా పాల్గొని వివిధ రకాల మొక్కలు నాటారు. జయపురం హ న్నాగుడలో గల లైఫ్ ఫౌండేషన్లో ఉంటున్న విద్యార్థులతో కంట్రాక్టర్లు ఆత్మీయంగా ముచ్చటించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో వారిని మమేకం చేశారు. విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. -
కేసీసీ బ్యాంక్ కార్యదర్శిగా ఐశ్వర్య మహంతి
జయపురం: కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ జయపురం కార్యదర్శిగా సూర్యరత్న మహంతి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంక్ మాజీ కార్యదర్శి అతుల్య కుమార మల్లిక పదవీ విరమణ అనంతరం సహకార శిక్షణ కేంద్రంలో పని చేస్తున్న సూర్యరత్న మహంతిని రాష్ట్ర ప్రభుత్వం కేసీసీ బ్యాంక్ కార్యదర్శిగా నియమించింది. కేసీసీ బ్యాంక్ పరిచాలన కమిటీ అధ్యక్షుడు ఈశ్వర చంద్ర ప్రాణిగ్రహి, సీనియర్ డైరెక్టర్ రమాకాంత రౌళో, బ్యాంక్ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు దిగాంబర నాయిక్, అదనపు జనరల్ మేనేజర్ హరిశ్చంద్ర బానగాడి సమక్షంలోమాజీ కార్యదర్శి అతుల్య కుమార్ మల్లిక్ నూతన కార్యదర్శి మహంతికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన నవరంగపూర్ జిల్లా డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్స్ సదానంద దాస్ చిత్రపటం వద్ద సంతాపం తెలిపారు. సంతాప సభలో కేసీసీ బ్యాంక్ అధ్యక్షుడు పాణిగ్రహి, మాజీ కార్యదర్శి, నూతన కార్యదర్శి, బ్యాంక్ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పోషకాహారం అందించడమే లక్ష్యం
పర్లాకిమిడి: నీతి ఆయోగ్, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గజపతి జిల్లాలో సంపూర్ణతా అభియా న్ 2 ఓను జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సాయంత్రం లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్, కన్వర్జెన్స్, డిప్యూటీ డైరెక్టర్ ప్రకాశ్ రౌతో, జిల్లా పరిషత్ అదనపు కార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంశుమాన్ మహాపాత్రో తదితరులు హాజరయ్యారు. గజపతి జిల్లాలో ఆకాంక్ష సమితి కేంద్రాల్లో ఈ సంపూర్ణతా అభియాన్ 2ఓ కార్యక్రమం ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న ట్టు కలెక్టర్ తెలియజేశారు. ఆర్.ఉదయగిరి, గుమ్మా సమితి కేంద్రాల్లో అందరికీ ఆరోగ్యం, విద్య, కృషి, బాలలకు మంచి పోషక ఆహారం అందించాలని జిల్లాలోని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఐ.సి.డి.ఎస్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. గుమ్మలో 90.7 శాతం, ఆర్.ఉదయగిరిలో 78.9 శాతం మాత్రమే మౌలిక సదుపాయాలు అందిస్తు న్నారని, శత శాతం లక్ష్యం చేరుకోవాలని ఆదేశించారు. ఏప్రిల్ 14వ తేదీలోగా గుమ్మ, ఆర్.ఉదయగిరిలో సంపూర్ణతా అభియాన్ పూర్తిచేయాలని కలెక్టర్ అన్నారు. ప్రతీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, శానిటేషన్ పనులు త్వరితగతిని పూర్తి చేసి కేంద్ర నీతి ఆయోగ్ ద్వారా ఆవార్డు అందేందు కు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ముఖ్యశిక్షాధికారి డాక్టర్ మయాధర్ సాహు, జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి ఎం.ప్రకాశరావు, పిరమల్ ఫౌండేషన్ ప్రతినిధి దేబబ్రతా ఆచార్య, ఆకాంక్ష బ్లాక్ ఫెలో కన్హుచరణ్ పాణిగ్రాహి, గుమ్మా బప్పి కిశోర్ దిగాల్, రిసోర్స్ పర్సన్ దేవేంద్ర కోరో, డీడబ్ల్యూఓ రైకా, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ప్రారంభం
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక వైమానిక దళ విమానంలో సోమవారం సాయంత్రం స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఆమె ఆరు రోజుల రాష్ట్ర పర్యటన ఆరంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ రాష్ట్రపతిని గౌరవపూర్వకంగా స్వాగతించారు. రాష్ట్రపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి లోక్భవన్ చేరుకున్నారు. సోమ వారం రాత్రి లోక్ భవన్లో బస చేశారు. ఆమె ఈ పర్యటనలో భాగంగా మంగళవారం జాజ్పూర్ సందర్శించి విరజామాత ఆలయంలో పూజలు చేస్తా రు. అనంతరం నాభి గయ ప్రాంగణంలో తన పూర్వీకులకు పిండదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు గంటన్నరకు పైగా రాష్ట్రపతి ఆలయంలో గడుపుతారు. అక్కడ నుంచి బాలాసో ర్ సందర్శించి ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఆమె పూరీ చేరుకుని రాత్రికి బస చేస్తారు. ఈనెల 4 బుధవారం ఆమెను గజపతి మహారాజు మరియు అధికారులు శ్రీ జగన్నాథ ఆలయ సింహ ద్వారం ఆవరణలో స్వాగతిస్తారు. శ్రీ జగన్నాథుడిని ప్రార్థించిన తర్వాత రాష్ట్రపతి శ్వేత గంగ తీరంలో పితృదే వతలకు పిండ దానం చేస్తారు. అదే రోజు ఆమె మయూర్భంజ్లోని రాయరంగ్పూర్కు వెళ్లి బహి రంగ సభలో ప్రసంగించి, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. మరుసటి రోజు ఆమె రాయరంగ్పూర్లోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించి జషిపూర్ మీదుగా సిమిలిపాల్ పులుల అభయారణ్యం చేరి రాత్రికి బస చేస్తారు. ఈ సందర్భంగా సిమిలి పాల్ ప్రాంతానికి చెందిన గిరిజన మహిళలు,యువతతో రాష్ట్రపతి ముఖాముఖి సంభాషిస్తారు. నగరంలో భద్రత కట్టుదిట్టం భువనేశ్వర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రప తి ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆమె పర్యటన ముగిసేంత వరకు ఈ ఆంక్ష లు నిరవధికంగా కొనసాగుతాయి. రాష్ట్రపతి భద్ర తా ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర రాజధానిలో 30 ప్లాటూన్ల పోలీసు బలగాలతో 4 మంది డీసీపీ స్థాయి అధికారులు, 5 మంది అదనపు డీసీపీలు, 23 మంది ఏసీపీలు, 33 మంది ఇన్స్పెక్టర్లు, 121 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, సహాయ సబ్ ఇన్స్పెక్టర్లు స్థాయి సిబ్బందిని మోహరించారు. -
బడ్జెట్ ప్రజాప్రయోజనాలకు విరుద్ధం
జయపురం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026– 27 బడ్జెట్ దేశం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే స్థితిలో లేదని రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ కార్మిక నేత ప్రమోదకుమార్ మహంతి వ్యాఖ్యానించారు. సోమవా రం కేంద్ర బడ్జట్పై విలేకర్లతో మాట్లాడారు. ఇది దేశ ప్రజల ప్రయోజనాల కు విరుద్ధంగా, కార్మికులు, రెతులు, యువత, విద్యార్థుల వ్యతిరేక బడ్జెట్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ– ఆర్థిక అనిశ్చిత, వాణిజ్య అడ్డంకులు పెరుగుతున్న ఈ సమయంలో ఆర్థిక మంత్రి ప్రసంగం మన ఆర్థిక వ్యవస్థను రక్షించటానికి, ప్రజల జీవన భద్రతను కాపాడటానికి స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వలేక పోయిందన్నారు. స్పష్టతకు బదులుగా బడ్జెట్ అస్పష్టత నిండి ఉంద న్నారు. పథకాల వారీగా నిధులు కేటాయించడంలో పారదర్శకత లోపం కనిపిస్తుందని విమర్శించారు. దేశ అభివృద్ధికి ప్రధాన ఆధారం దేశీయ వినియోగ మని చెపుతున్న కేంద్ర ప్రభుత్వం, దేశీయ వినియోగం పెంచేందుకు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవని నిందించారు. గ్రామీణ జీవన భద్రతకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం నిర్వీర్యం చేస్తున్నార ని ఆరోపించారు. బడ్జెట్లో ప్రజల ఆరోగ్యం, విద్యా రంగాలను నిర్లక్ష్యం చేశారన్నారు. ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో మన దేశం ఎ–వన్ అనే పదాన్ని 11 సార్లు ప్రస్తావించినా అన్ని రంగా ల్లోనూ వెనుకబడే ఉందన్నారు. ప్రజావ్యతిరేక బడ్జెట్కు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన చేపడుతున్న అఖిల భారత్ సాధారణ సమ్మెను విజయవంతం చేయాలని తమ పార్టీ పిలుపునిచ్చిందని మహంతి వెల్లడించారు. -
ఒడిశాలో రైల్వేకు చరిత్రాత్మక కేటాయింపులు: మంత్రి
● రూ. 10,928 కోట్లు కేటాయింపు భువనేశ్వర్: 2026–27 కేంద్ర బడ్జెట్లో ఒడిశాలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ కోసం చారిత్రాత్మక కేటాయింపులు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి తూర్పు కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం నుంచి జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కేటాయింపులు తూర్పు భారత దేశంలో రైలు ఆధారిత అభివృధ్దిని వేగవంతం చేయడంలో భారత ప్రభుత్వం బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. 2026–27లో ఒడిశాకు వార్షిక సగటు రైల్వే కేటాయింపులు రూ. 10,928 కోట్లకు పెరిగిందని మంత్రి తెలియజేశా రు. రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలలో భారీ పరివర్తన లక్ష్యంగా ఏటా రైల్వే రంగంలో బడ్జె టు కేటాయింపులు గణనీయంగా పెంచుతున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ. 90,659 కోట్లకు పైగా పనులు పురోగతిలో ఉన్నా యన్నారు. వీటిలో కొత్త లైన్ నిర్మాణం, డబ్లింగ్, సామర్థ్యం పెంపుదల, స్టేషన్ పునరాభివృద్ధి, కీలకమైన భద్రతా మెరుగుదల తదితర ప్రాజెక్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఒడిశాలోని మారు మూల ప్రాంతాలకు మెరుగైన రైలు అనుసంధానంతో సమగ్ర వృద్ధి దిశలో రైల్వే శాఖ ప్రాధాన్యత కల్పి స్తుంది. ప్రయాణికుల కేంద్రీకృత కార్యక్రమాల్లో భాగంగా అమృత్ స్టేషన్ పథకం కింద ఒడిశాలో 59 స్టేషన్లను రూ. 2,439 కోట్ల పెట్టుబడితో సమగ్ర పునరాభివృద్ధి కోసం గుర్తించినట్లు ప్రకటించారు. ఆధునిక రైలు సేవలను ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో రైలు అనుసంధానం గుణాత్మక పురోగతిని సాధించిందని రైల్వే మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఒడిశాలో 6 జతల వందే భారత్ ఎక్స్ప్రెస్ మరియు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవి వేగవంతమైన, సురక్షితమైన మరియు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాలను ప్రజలకు అందిస్తున్నాయి. నెట్వర్క్ విస్తరణ కీలకమైన అంశంగా రాష్ట్రంలో 100 శాతం రైలు విద్యుదీకరణ పూర్తయ్యింది. ఇది ఇంధన సామర్థ్యం, పర్యావరణ స్థిరత్వానికి దోహదపడుతుందని మంత్రి అన్నారు. కవచ్ వంటి అధునాతన భద్రతా వ్యవస్థలు క్రమంగా అమలు జరుగుతున్నాయి. రైళ్ల నిర్వహణలో భద్రతను మరింత బలోపేతం చేఏందుకు రైల్వే శాఖ కట్టుబడి ఉందన్నారు. ఈ మైలురాయి చొరవలు ప్రపంచ స్థాయి రైలు మౌలిక సదుపాయాలు, మెరుగైన ప్రయాణికుల అనుభవం, లాజిస్టిక్స్ సామర్థ్యాల ద్వారా ఒడిశాను కీలకమైన వృద్ధి ఇంజిన్గా మార్చాలనే రైల్వేల దార్శనికతను అద్దం పడతాయని రైల్వే మంత్రి పేర్కొన్నారు. ఇది రాష్ట్ర దీర్ఘకాలిక సామాజిక ఆర్థిక అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒడిశాలో తూర్పు–పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ నిర్మితం అవుతుంది. ఈ కారిడార్ పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభమై ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ గుండా వెళుతుంది. ఏనుగుల భద్రత కోసం రైల్వే బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. రైలు ఢీకొనడం వల్ల ఏనుగుల మరణాలను నివారించడానికి రైల్వే శాఖ ఈ అడుగు వేసిందన్నారు. ఏనుగుల భద్రత కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత థర్మల్ కెమెరాలను ప్రారంభించబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్వని ౖవైష్ణవ్ తెలిపారు. ఏనుగుల సంచారం ప్రభావిత ప్రదేశాలలో ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటు అవుతుంది. ఏనుగుల సురక్షిత కదలిక కోసం భూగర్భ రోడ్లు నిర్మిస్తారు. దేశ వ్యాప్తంగా 200 ప్రదేశాలలో భూగర్భ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. -
శిష్టకరణ సంఘం ఆత్మీయ కార్యక్రమం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా శిష్ట కరణ సంఘం ఆత్మీయ కార్యక్రమం జరిగింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని నీలంబర్ గ్యాస్ కల్యాణ మండపంలో 30 ఏళ్ల అనంతరం తెలుగు కరణాలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా 10 మంది సీనియర్ సభ్యులను సత్కరించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. బాలలు, మహిళలకు పలు పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాలలో సంఘం అధ్యక్షుడు సతీష్ పట్నాయిక్, ఉపాధ్యక్షుడు కిషోర్ పట్నాయిక్, కార్యదర్శి మహేశ్వర్ పట్నాయిక్, సంయుక్త కార్యదర్శి అవనీ ప్రసాద్ పట్నయక్, కోశాధికారి చంద్ర శేఖర్ పట్నాయిక్, న్యాయ సలహాదారు అరవింద పట్నాయక్ పాల్గొన్నారు. -
ఆగని ఇసుక దందా
● బాహుదానదిని ఊడ్చేస్తున్న ఇసుకాసురులు ● ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా ● చోద్యం చూస్తున్న అధికారులు ఇచ్ఛాపురం: ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బాహుదా నది నుంచి అక్రమార్కులు ఇసుకను దోచేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ప్రజలు సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్నప్పుడు, వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మాత్రమే స్థానిక అధికారులు దాడులు చేస్తున్నారు. తర్వాత పట్టించుకోకపోవడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. దర్జాగా అక్రమ రవాణా చేసుకుంటూ జేబులు నింపుకొంటున్నారు. స్థానిక బాహుదానది నుంచి అక్రమార్కులు నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారు. నది సమీప ప్రాంతాలు, తోటల్లో డంప్ చేసుకొంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అనుమతులు లేకుండానే.. ఇచ్ఛాపురం మండలంలో బాహుదానది పరివాహక ప్రాంతంలో ఎక్కడా ఇసుక రీచ్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయలేదు. అయినప్పటికీ ప్రజల అవసరాల నిమిత్తం నిర్మాణం కోసం ఎడ్లబండి, ట్రాక్టర్లతో ఇసుకను తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఇదే అదునుగా అక్రమార్కులు నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నదిలో ఇసుక లేకపోతే భవిష్యత్లో సాగునీరు, వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని ముందుగానే గుర్తించిన బెల్లుపడ రైతులు నదీ దారుల్లో డిసెంబర్లో పెద్ద పెద్ద గోతులు తవ్వించారు. అయినప్పటికీ ఇసుకాసురులు కొత్త మార్గాలను అన్వేషిస్తూ తవ్వకాలు సాగిస్తున్నారు. నదిలో తవ్వకాలు చేపట్టకూడదని రెవెన్యు సిబ్బంది హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసినా ఫలితం లేకపోతోంది. అడిగే వారేరీ? బాహుదా నది నుంచి ఇసుకను తరలించేందుకు ఇసుకాసురులు ఉపయోగించే ట్రాక్టర్ ఇంజిన్కు గానీ, ట్రాక్టర్ తొట్టెకు గాని ఎటువంటి నంబర్లు ఉండవు. వీటికి ఎటువంటి అనుమతులు కూడా ఉండవు. ఇటువంటి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను నిత్యం పట్టణంలోని రెవెన్యు కార్యాలయం, పోలీస్ స్టేషన్ ముందుగానే తరలిస్తున్నా అడిగేవారే కరువయ్యారు. ఇప్పటికై నా మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ప్రకృతి సంపద తరలిపోకుండా, ప్రజలకు నీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
● 12న రాష్ట్ర వ్యాప్త సమ్మె
పర్లాకిమిడి: దేశంలో నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయాలని, మన్రేగా (మహాత్మా గాంధీ ఉపాధి పథకం) పేరు మార్పును వెనక్కి తీసుకోవాలని, మహిళా లేబర్ పది గంటల పనిని రద్దు చేయాలన్న డిమాండ్లతో ఈ నెల 12న సాధారణ సమ్మెకు జిల్లాలోని ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ మేరకు స్థానక దండుమాలవీధిలో సి.పి.ఎం కార్యాలయంలో దండపాణి రైతో (అఖిల భారత కిసాన్ సభ), కేదార్ శోబోరో (ఏఐ.కె.ఎం.ఎస్.), పైల మురళీకృష్ణ (టి.యు.సి.సి.), జోన్న సుభాష్ చంద్రరావు (బి.కె.ఎం.యు.), నర్సింగ మాలబిశోయి (ఏ.ఐ.టి.యు.సి.), ఎం.బంగారి (సీటు), శ్రీను బెహరా, సోమేష్ తదితరులు సమావేశమై సమ్మైపె చర్చించారు. -
పొందూరులో అగ్నిప్రమాదం
● ట్రేడర్స్ గొడౌన్ దగ్ధం ● రూ.94 లక్షల ఆస్టినష్టం పొందూరు: మండల కేంద్రం పొందూరులోని శ్రీసాయి సూర్య హర్షిని ట్రేడర్స్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాపు తెరిచే సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో యజమాని పోలాకి రవి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే గోదాంలో ఉన్న వివిధ వ్యవసాయ ఉత్పత్తుల బస్తాలు కాలి బూడిదైపోయాయి. శనివార రాత్రి విద్యుత్ షార్టు సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనలో సుమారు రూ.94 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. 217 టన్నుల మొక్కజొన్న బస్తాలు, 650 నువ్వుల బస్తాలు, 200 మిర్చి బస్తాలు, వేరుశెనగ యంత్రం, ఇతర వస్తువులు కాలిపోయినట్లు గుర్తించారు. -
నందన్కానన్ జూలో ఐదు మొసళ్లు మృతి
భువనేశ్వర్: నగరం శివారు బారంగ్ నందన్కానన్ జూలో మొసళ్ల మృతి ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది జనవరి 23 నుంచి 30 వరకు 8 రోజుల స్వల్ప వ్యవధిలో వరుసగా 5 మొసళ్లు మరణించినట్లు నందన్ కానన్ జూలాజికల్ పార్క్ అధికారులు తెలిపారు. మొసళ్ల మృత్యు సంఘటన వన్యప్రాణుల ప్రియులు, జూ అధికారులలో ఆందోళన కలిగిస్తుంది. మొసళ్ల వరుస మరణాలకు కచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది. జూ పార్కు అధికారులు మరణించిన మొసళ్లకు పోస్ట్మార్టం నిర్వహించారు. ఈ నివేదికల ఆధారంగా మరణానికి కచ్చితమైన కారణాన్ని వెటర్నరీ, ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడిస్తారని జూ అధికారులు ఆశిస్తున్నారు. నందన్ కానన్ జూలో మిగిలిన మొసళ్ల ఆరోగ్యాన్ని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ పార్క్ మొసళ్ల పరిరక్షణ, సంతాన ఉత్పత్తి, పెంపకం కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. మగ్గర్ మొసళ్లు (క్రోకోడైలస్ పలుస్ట్రిస్), ఘారియల్స్ వంటి జాతుల గణనీయమైన మొసలి సంతతి విస్తరణకు నందన్ కానన్ జూలాజికల్ పార్క్ పేరొందింది. రౌతుపురంలో ఏసుక్రీస్తు వార్షిక సభలు పర్లాకిమిడి: జిల్లాలో గుసాని బ్లాక్ ఘోర్ని పంచాయతీ రౌతుపురంలో ఎస్.బి.సి.ఎం.ఎస్ బెతానీ బంగళా (సెరంగో) ద్వారా జరిగిన ఏసుక్రీస్తు ఆరాధన సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేశారు. ఈ సభలో ఎమ్మెల్యేకు దిలీప్ శోబోరో, డికెన్ బిశోయిలు సత్కరించారు. ఈ సభకు మోహానా ఎమ్మెల్యే దాశరథి గోమంగో, జిల్లా పరిషత్తు మాజీ చైర్మన్ ఎరగాన రామచంద్రరావు, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, జెడ్పీటీసీ గుసాని ఎస్.బాలరాజు, తదితరులు పాల్గొన్నారు. యువకుడు ఆత్మహత్యాయత్నం టెక్కలి రూరల్ : స్థానిక తెంబూర్ రోడ్డులో రైల్వే ట్రాక్పై ఆదివారం ఉదయం ఓ యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి మండలం బందపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆదివారం టెక్కలి వచ్చి తాను ప్రేమించిన అమ్మాయికి ఫోన్ చేసి తనకు యాక్సిడెంట్ అయిందని, వెంటనే రావాలని ఫోన్ చెయ్యడంతో ఆ యువతి టెక్కలి వచ్చింది. అయితే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎందుకు అలా చెప్పావు.. ఏమీ కాలేదు కదా.. నేను తిరిగి వెళ్లిపోతానని చెప్పడంతో ఆ యువకుడు రైలు వస్తుండటం గమనించి ఇప్పుడు ప్రమాదం జరుగుతుంది చూడు అంటూ రైలు పట్టాలపై తలపెట్టాడు. ఇది గమనించి సమీప వసతిగృహ విద్యార్థులు ఆ యువకుడిని పట్టాలపై నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. దీంతో నౌపడ నుంచి గుణుపూర్ వైపు వెళ్లే రైలును కొంత సమయం నిలిపివేశారు. అనంతరం ఆ యువకుడిని పట్టాలపై నుంచి బయటకు తీసి స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబసభ్యులను రప్పించి వారికి అప్పగించారు. అయితే ఈ యువకుడు విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నట్లు తెలిపారు. -
విలువలతో కూడిన విద్య అందించాలి
పర్లాకిమిడి: పట్టణంలోని శివార్లలో ఉన్న అరవింద పూర్ణాంగ శిక్షణ కేంద్ర విద్యాలయ 27వ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ ఉత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా ముఖ్య శిక్షణాధికారి మయాధర్ సాహు, విశ్రాంత న్యాయాలయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా, బ్యాంకు విశ్రాంత ఉద్యోగి విశ్వనాథ పాణిగ్రాహి, జిల్లా సైన్స్ కోఆర్డినేటరు అంపోలు రవికుమార్ తదితరులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. అరవింద పూర్ణాంగ శిక్షణ కేంద్రంలో చదివిన విద్యార్థులు మన సంస్కృతితో పాటు విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వివిధ ఆటల పోటీలు, వక్తృత్వ, డ్యాన్సు పోటీల్లో విజేతలకు బహుమతులను రాజేష్ కుమార్ మిశ్రా అందజేశారు. అరవింద పూర్ణాంగ విద్యాలయం అధ్యక్షుడు గీతాంజలి దాస్ అతిథులను పరిచయం చేశారు. విద్యాలయం కమిటీ అధ్యక్షుదు రవీంద్రనాథ్ పాడీ వార్షిక పట్టికను చదివారు. అతిథులకు గౌరవ పురాస్కారాలను విద్యాలయం కమిటీ సభ్యులు అందజేశారు. బిజయ కుమార్ మున్ని సభికులకు ధన్యవాదాలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
టెక్కలి రూరల్ : టెక్కలి వలేసాగరం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రావివలసకు చెందిన విద్యుత్ లైన్మేన్ పి.రామచంద్రుడు ద్విచక్ర వాహనంపై టెక్కలి నుంచి వలేసాగరం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైపు వెళ్తుండగా అదుపు తప్పి సమీపంలో ఉన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో రామచంద్రుడికి తీవ్ర గాయాలు కావడంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.స్థానిక పోలీసులు వివరాలు సేకరించారు. పశువులు పట్టివేత రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం 7 గంటలకు అక్రమంగా తరలిస్తున్న ఐదు పశువులను పట్టుకున్నారు. శ్రీకాకుళం వైపు నుంచి రణస్థలం వైపు లగేజీ వ్యాన్లో తరలిస్తుండగా లావేరు ఎస్సై కె.అప్పలసూరి పట్టుకుని కేసు నమోదు చేశారు. గంజాయితో ఇద్దరు అరెస్టు వజ్రపుకొత్తూరు రూరల్: పూండి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం గంజాయి తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. ఒడిశా నుంచి సికింద్రాబాద్కు గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ బి.నీహర్ తన బృందంతో కలిసి పూండి రైల్వే స్టేషన్ వద్ద మాటువేశారు. ఒడిశా రాష్ట్రం రాయ్ఘడ్కు చెందిన ప్రమోద్, సరోజ్లు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని ప్రశ్నించగా గంజాయి తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారి వద్ద 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు హిరమండలం: ఎల్.ఎన్.పేట మండలం చిట్టిమండలం కాలనీ వద్ద అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమ్మువలస గ్రామానికి చెందిన ఎస్.పరశురాంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరశురాం కొమ్మువలస నుంచి సరుబుజ్జిలి వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ముందు వెళుతున్న బస్సును ఓవర్ టేక్ చెయ్యిబోయి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తీవ్రంగా గాయపడిన పరశురాంను స్థానికులు 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. -
జాతరలో భక్తుల సందడి
రాయగడ: కొలనార సమితి పరిధిలోని ముకుందపూర్ సమీపంలో గల మా కులబంధు ఠకురాణి జాతర ఆదివారం వైభవంగా జరిగింది. రెండేళ్లకొసారి ఈ అమ్మవారి జాతర జరుగుతుంది. అదేవిధంగా ఒక్కరోజు పాటు జరిగే ఈ అమ్మవారి జాతరను తిలకించేందుకు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఈసారి కూడా అమ్మవారి జాతరలో భక్తుల సందడి కనిపించింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కుబడులను తీర్చుకున్నారు. అక్కడే వంటావార్పులు ఆనందంగా గడిపారు. యాత్రలో 30 వేలకు పైచిలుకు భక్తులు ఈసారి హాజరయ్యారని నిర్వాహకులు అంచనా వేశారు. -
యువత నిబద్ధతతోనే వికసిత్ భారత్
● గవర్నర్ హరిబాబు కంభంపాటిభువనేశ్వర్: దేశ నిర్మాణంలో యువత నిర్ణయాత్మక పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి తెలిపారు. వికసిత్ భారత్ వైపు భారత దేశం ప్రయాణం సాఫల్యత యువ పౌరుల పాత్ర, సామర్థ్యం, నిబద్ధతపై ఆధారపడి ఉందని అన్నారు. న్యూ ఢిల్లీలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొన్న నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) బృందం కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. లోక్ భవన్ న్యూ అభిషేక్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఉత్సాహభరితమైన, క్రమశిక్షణ కలిగిన ఎన్సీసీ క్యాడెట్లను స్వాగతిస్తూ, డాక్టర్ కంభంపాటి లోక్ భవన్లో వారికి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ సందర్భం దేశభక్తి, ఐక్యత, యువత సంకల్పం యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఎన్సీసీ క్యాడెట్లను ఉద్దేశించి మీరు కేవలం క్యాడెట్లు కాదు, మీరు భారత దేశ గర్వానికి, మన దేశ భవిష్యత్కు మార్గదర్శకులు అని కొనియాడారు. గణతంత్ర దినోత్సవ పరేడ్లో వారు పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ క్యాడెట్ల అంకితభావం, క్రమశిక్షణ, జాతీయ సేవ పట్ల నిబద్ధతకు ప్రతీక అని గవర్నర్ అన్నారు. పరేడ్ కేడెట్ల చాతుర్యం, దోషరహిత కసరత్తు, అచంచలమైన స్ఫూర్తి, వ్యక్తిగత శ్రేష్టతను మాత్రమే కాకుండా ఎన్సీసీ శాశ్వత విలువలను ప్రదర్శించాయని ఆయన పేర్కొన్నారు. ఐక్యత, క్రమశిక్షణ అనే ఎన్సీసీ నినాదం యువతకు జీవితాంతం మార్గదర్శకంగా పని చేస్తుందన్నారు. ఎన్సీసీ శిక్షణ, శిబిరాలు, కవాతులకు మించి వ్యకిత్వ రూపకల్పన, నాయకత్వ లక్షణాల బలోపేతం, సమాజం పట్ల లోతైన బాధ్యతను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎన్సీసీ క్యాడెట్లతో సంభాషించారు. రక్షణ సేవలలో చేరడం, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యను కొనసాగించడం వంటి వారి ఆకాంక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాడెట్లు ఈ సంభాషణలో చురుకుగా పాలుపంచుకున్నారు. ఒడిశా ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కమోడోర్ విక్రమ్ సింగ్ ఈ సభలో ప్రసంగించారు. కార్యక్రమానికి క్రీడలు, యువజన సేవల శాఖ కమిషనర్, కార్యదర్శి సచిన్ రామచంద్ర యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి. -
మాల్యవంత్ కలశ యాత్ర
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాస్థాయి మాల్యవంత్ మహోత్సవాలు ఆదివారం నుంచి అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగా స్థానిక జగనాథ్ మందిరం నుంచి కలశ యాత్ర నిర్వహించారు. ముందుగా జగన్నాథ ఆలయంలో జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ప్రత్యేక పూజాలు జరిపించి ఉత్సవాలను ప్రారంభించారు. సంప్రదాయ ఆదివాసీ నృత్య ప్రదర్శనల మధ్య భారీగా కలశ యత్రాను డీఎన్కే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన మాల్యవంత్ ఉత్సవ్ మండపానికి చేరుకున్నారు. నృత్య బృందాలు జోడిశంఖ, వాయిద్యాలు, దుల్ధులిబాజా, బోండా, కోయా, పరజా, భూమియా, దురువా తదితర ఆదివాసీ తెగలకు చెందిన థింసా నృత్యాలతో రహదారులపై ఆనోందోత్సవాలు కనిపించాయి. జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్తోపాటు ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్, మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టంగులు, మల్కన్గిరి మున్సిపల్ చైర్మన్ మనోజ్ బారిక్, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, వేద్బ్ర్ ప్రధాన్, జిల్లా పరిషత్ సీఈవో దాశరధి సరాభు, జిల్లా సాంస్కృతిక అధికారి సంత్రాన్ నారాయణ పండా పాల్గొన్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
పర్లాకిమిడి: 1975 మెట్రిక్యులేషన్ పూర్వపు విద్యార్థులు ఆదివారం పర్లాకిమిడి బృందావన్ ప్యాలస్లో కలుసుకుని సమావేశమయ్యారు. మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో 1975లో చదివి వృత్తి రీత్యా హైదరాబాద్, బెంగళూరు, బలంఘీర్, జయపురం వంటి వివిధ రాష్ట్రాలల్లో స్థిరపడిన పూర్వపు విద్యార్థులు బీఎన్ ప్యాలస్లో కలుసుకుని తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం వారంతో తాము చదివిన మహారాజా బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ తమ గురువులు డి.సూరప్పడు, డి.కె.జెన్నా, ఉపేంద్ర పండాలను సన్మానించారు. కార్యక్రమాన్ని భక్తవత్సల మహాపాత్రో, వి.వరదరాజు, అట్టాడ అప్పారావు, పద్మనాభ హోతాత, సత్యన్నారాయణ పండా తదితరులు విజయవంతం చేశారు. -
ఘనంగా ఠాకూర్ అనుకూల చంద్రదేవ్ జయంత్యుత్సవం
రాయగడ: సదరు సమితి కొల్లిగుడ వద్ద గల జిస్ట్ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఆదివారం ఠాకూర్ అనుకూల చంద్రదేవ్ 138వ జయంతోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రారంభగీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కుహరో మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందిన ఠాకూర్ అనుకూల చంద్రదేవ్ ఆదర్శనీయుడని కొనియాడారు. అనంతరం శ్లోకాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు కొనసాగాయి. కొరాపుట్, గజపతి తదితర జిల్లాల నుంచి ఆయన ఆదర్శనీయులు కార్యక్రమంలొ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద బజార్ను కూడా ఏర్పాటు చేశారు. నిర్వాహకులు సురేష్ చంద్ర లెంక, దేవారజ్ మల్లిక్, బిక్రమ్ నాయక్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. ‘కేంద్ర బడ్జెట్ నిరాశాజనకం’కొరాపుట్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందని కాంగ్రెస్కు చెందిన కొరాపుట్ ఎంపీ ఎంపీ సప్తగిరి ఉల్క ప్రకటించారు. ట్రంప్ టారిఫ్స్ పై నష్ట పోయిన రంగాలకు చేయూత లేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి రంగంపై చేయూత లేదని అన్నారు. మధ్య, పేద తరగతులకు ఎలాంటి సహకారం అందలేదన్నారు. ఏడు రైళ్ల కారిడార్లలో ఒడిశాకు చోటు కల్పించలేదని పేర్కొన్నారు. బడ్జెట్ బాగుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల దేశం ముందుకు వెళ్తుందని బీజేపికి చెందిన నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి ప్రకటించారు. దేశంలో అన్ని రంగాల్లో పురోగతి సాధించాలంటే ఇలాంటి బడ్జెట్ ఉండాలన్నారు. శ్రీజగన్నాథ మందిరానికి రూ.3లక్షల విరాళం పర్లాకిమిడి: రాజవీధిలో శ్రీజగన్నాథ మందిర పునర్నిర్మాణం కోసం బట్టగౌడవీధికి చెందిన స్వర్గీయ లోకనాథ బెహారా కుమారుడు కాళీచరణ్ బెహారా రూ.3లక్షల 101 విరాళంగా ఆదివారం మందిరం ట్రస్టీకి అందజేశారు. ఈ విరాళం అందజేతలో వార్డు కౌన్సిలరు సంజుక్తా బెహారా, రాజుబెహారాలు ఉన్నారు. -
అన్ని వర్గాలకు బడ్జెట్ అనుకూలం: ముఖ్యమంత్రి
● బడ్జెట్ రాష్ట్ర ప్రయోజనాలకు దూరం: విపక్ష నేత ● యువతకు నిరుత్సాహం: పీసీసీ చీఫ్భువనేశ్వర్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2026 –27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రాష్ట్ర పర్యావరణ అనుకూల సరుకు రవాణా, పర్యాటక రంగాలకు అనుకూలంగా ఉంది. దీంతో రాష్ట్రంలో ఖనిజ ప్రాంతాలు, జల మార్గాలు, వన్యప్రాణుల పర్యాటకంతో రాష్ట్రం కొత్త వన్నె దిద్దుకుంటుంది. 2026–27 కేంద్ర బడ్జెట్ సుస్థిర గ్రీన్ లాజిస్టిక్స్, జీవన వైవిధ్యం ఆధారిత పర్యాటక రంగం వృద్ధికి మార్గం సుగమం చేసింది. హరిత పర్యావరణం పరిరక్షణతో ఆర్థికంగా బలోపేత చొరవలతో కేంద్ర బడ్జెట్లో ఒడిశా ఉనికి ప్రత్యేక గుర్తింపు సాధించింది. పర్యావరణ అనుకూల సరుకు రవాణా పురోగతికి రాష్ట్రంలో జాతీయ జల మార్గం (నేషనల్ వాటర్ వే) – 5 కొత్త బడ్జెట్లో చోటు చేసుకుంది. జాతీయ జలమార్గం 5 తాల్చేర్, అంగుల్, కళింగ నగర్లను అనుసంధానపరుస్తుంది. రానున్న ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అమలు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రకటించింది. ఈ కారిడార్ తాల్యేరు, అంగుల్ వంటి ఖనిజ కేంద్రాలను కళింగనగర్ వంటి పారిశ్రామిక సమూహాలు, పారాదీప్, ధామ్రా వద్ద ఓడరేవులతో అనుసంధానపరుస్తుంది. ఈ చర్య లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచి కార్బన్ కాలుష్యం తగ్గిస్తుంది. జాతీయ జల మార్గం పరిసర ప్రాంతాలు పారిశ్రామిక విస్తరణకు నోచుకుంటాయని భావిస్తున్నారు. పాత మాట ఖనిజ సంపన్న ప్రాంతాలు, పారిశ్రామిక కేంద్రాలను ఓడ రేవులకు అనుసంధానించడానికి జాతీయ జలమార్గాలు యోచన కొత్తదేమి కాదు. ఇది దశాబ్ద కాలం నాటి ప్రతిపాదన. ఇంత వరకు ఈ ప్రతిపాదన క్షేత్రస్థాయిలో ఎటువంటి పురోగతిని నోచుకోలేదని నవీన్ పట్నాయక్ గుర్తు చేశారు. ఒడిశాలో అరుదైన భూమి కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనను విపక్ష నేత స్వాగతించారు. రాష్ట్రం అనేక కీలక ఖనిజాల ఉత్పత్తిలో అగ్రగామిగా కొనసాగుతుంది. ఈ విలువైన వనరులతో దేశ నిర్మాణానికి ఎల్లవేళల్లో దోహదపడుతుందన్నారు. నగరాల మధ్య ఏడు హై–స్పీడ్ రైలు కారిడార్లను ‘గ్రోత్ కనెక్టర్లు’గా అభివృద్ధి చేయాలనే ప్రకటనలో ఒడిశాకు స్థానం కల్పించకపోవడం దురదృష్టకరం. ఈ చర్య రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించింది. భువనేశ్వర్ మెట్రో రైలు ప్రాజెక్టును రాష్ట్రంలో బీజేపీ సర్కారు రద్దు చేసింది. ప్రజల అవసరాలను నిర్లక్ష్యం చేయడం యథావిధిగా కొనసాగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రముఖ సర్క్యూట్ల ప్రస్తావన లేకపోవడం విచారకరం. వజ్ర త్రిభుజం సహా అనేక ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ, బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి కోసం పర్యాటక కేంద్రీకృత పథకంలో ఒడిశాను మినహాయించడం దురదృష్టకర చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలో సహజ వనరులను కొల్లగొట్టేందుకు మాత్రమే కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం వనరుల కేటాయింపు విషయానికి పూర్తిగా నీళ్ళొదినట్లు సమగ్ర పరిశీలనలో స్పష్టం అవుతుందని విపక్ష నేత తెలిపారు. బడ్జెట్ రాష్ట్ర ప్రయోజనాలకు దూరం: నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వం ఆది వారం సమర్పించిన 2026 బడ్జెట్ పై విపక్ష నేత నవీన్ పట్నాయక్ పెదవి విరిచారు. బడ్జెట్ ఒడిశా మరియు రాష్ట్ర ప్రజలకు చెప్పుకోదగ్గ ప్రయోజనాలను అందించలేదని నిరుత్సాహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, ఉద్యోగ సృష్టి, రాష్ట్రానికి రావాల్సిన అదనపు కేటాయింపులపై దృష్టి సారించి వృద్ధి వేగాన్ని పెంచుతుందనే ఆశ నీరు గార్చిందని వ్యాఖ్యానించారు. యువతకు నిరుత్సాహం: పీసీసీ చీఫ్ కేంద్ర బడ్జెట్ 2026 పై ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ యువతకు ఏమీ అందించలేదని పురోగతి రంగంలో విఫలమవుతుందని అన్నారు. పెట్టుబడిదారులు వెనుకడుగు వేస్తారు. ఈ బడ్జెట్లో సామాన్య ప్రజలకు ఏమీ లేదు. దిశానిర్దేశం లేకుండా దార్శనికత మరియు నిర్ధిష్ట విధానం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. కొత్త బడ్జెట్ రుణ భారం పెంచుతుందన్నారు. దేశాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. -
నేడు సీఎం రాయగడ పర్యటన
రాయగడ: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సోమవారం రాయగడలో పర్యటించనున్నారు. ఉదయం 9.55 గంటలకు సీఎం నివాసం నుంచి ఆయన బయలుదేరి పది గంటలకు బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం 11.30 గంటలకు స్థానిక జేఎస్కో మైదానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు వస్తారు. అక్కడ నుంచి 11.40 గంటలకు మైదానం సమీపంలో గల 108 కుండీల మహా విశ్వశాంతి యజ్ఞంలో పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12.20 గంటలకు శుభద్ర శక్తి మేళా–26ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మైదానంలోని శుభద్ర స్టాల్లను పరిదర్శించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించిన భూమి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా రాయగడ జిల్లా కలెక్టర్ అశుతోస్ కులకర్ణి, జిల్లా ఎస్పీ స్వాతి ఎస్ కుమార్లు వేదికను ఆదివారం పరిశీలించారు. పోలీస్ బందోబస్తుపై సమీక్షించారు. -
రేపు టెక్కలిలో ‘రెవెన్యూ క్లినిక్’
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తూ టెక్కలి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జిల్లా మొత్తానికి సోమవారం ప్రత్యేక ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. భూ సమస్యలు, మ్యుటేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాలు, భూ సర్వే వంటి దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ క్లినిక్ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. మధ్యవర్తిత్వంతో కేసులకు మోక్షం శ్రీకాకుళం పాతబస్టాండ్ : కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సత్వరమే పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఎంపిక చేసిన న్యాయవాదులకు ఐదు రోజులుగా నిర్వహిస్తున్న 40 గంటల ప్రత్యేక శిక్షణా తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వ ప్రక్రియలో మెలకువలు నేర్చుకోవడం వల్ల న్యాయవాదులకే కాకుండా, కక్షిదారులకు కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన న్యాయవాదులు ఈ ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించాలని, ఉభయ పక్షాల అంగీకారంతో కేసులను పరిష్కరించి ప్రజలకు భారం తగ్గించాలని సూచించారు. సీనియర్ ట్రైనర్లు వి.పి.తనకచన్, పి.జి.సురేష్లు పాల్గొని మధ్యవర్తిత్వంలోని న్యాయపరమైన చిక్కులు, వాటిని పరిష్కరించే విధానాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
రహదారి నిబంధనలు పాటించాలి
రాయగడ: ట్రాఫిక్ నియమ, నిబంధనలను పాటించాలని ఎస్డీపఓ గౌరహరి సాహు అన్నారు. స్థానిక బిజుపట్నాయక్ ఆడిటోరియంలో రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రమాదలు తగ్గుముఖం పట్టాలంటే హెలెట్ వినియోగం, సీటు బెల్టుల వంటివి వినియోగించాలన్నారు. రోడ్డు భద్రత అనేది అందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలిపొందిన వారికి బహుతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంతకుమార్ ప్రధాన్, ఏఎస్పీ గొసేన్ బల్లా, ఆర్టీఓ బినయ్ కుమార్ పాల్, తదితరులు పాల్గొన్నారు. తాగునీటి పథకం ప్రారంభం పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్లో ప్రధానమంత్రి కృషి సంచయి పథకం ద్వారా ప్రజలకు తాగునీరు అందుబాటులోకి తేవడానికి జలవనరుల మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కాశీనగర్ బ్లాక్లో గోరిబంద గ్రామంలో రూ.11.50 లక్షలతో తాగునీటి ప్రాజెక్టును నిర్మించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు చైర్మన్ గవర తిరుపతిరావు, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, వాటర్షెడ్ పథకాల అధికారి సురేష్ కుమార్ పట్నాయక్, ప్రభుత్వ ప్రాజెక్టు డైరెక్టర్ రశ్మిరేఖా నాయక్, ఏ.డి.ఎం ఫల్గుణి మఝి, కాశీనగర్ బీడీఓ డంభుధర మల్లిక్, తదితరులు పాల్గొన్నారు. 45 మందికి నేత్ర పరీక్షలు రాయగడ: జేకే పేపర్ మిల్ సంస్థ ఆధ్వర్యంలో గల రొషిణి ప్రాజెక్టులో భాగంగా కొల్లిగుడ వద్ద శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. స్థానిక పితామహాల్లో గల ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 45 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. ఇందులో 18 మంది కేటరాక్ట్ అవసరమని గుర్తించారు. కేటరాక్ట్ సమస్యలు ఉన్నవారికి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని పేపర్ మిల్ డిప్యూటీ మేనేజరు హరిహర్ ఖమారి తెలియజేశారు. బంగారం చోరీ కేసులో మహిళ అరెస్టు ఇచ్ఛాపురం : మున్సిపాలిటీ పరిధిలోని ఏఎస్పేటలో నివాసముంటున్న కదంబాల భాగ్యలక్ష్మి గత నెల 25న మార్కెట్లో సరుకులు కొనుగోలు చేస్తుండగా ఆరుంపావు తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ మేరకు బాధితురాలు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఆస్కా నువాపల్లి గ్రామానికి పులి సుభాషిణిని నిందితురాలిగా గుర్తించి శనివారం ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొన్నారు. ఆమె వద్ద నుంచి ఆరుంపావు తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. నిందితురాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ బషీర్ని సీఐ మీసాల చిన్నంనాయుడు, ఎస్సై ముకుందరావు అభినందించారు. ప్రొఫెసర్ సుజాతకు పేటెంట్ హక్కులు మంజూరు ఎచ్చెర్ల: యాంటీబయాటిక్ సమూహమైన ‘టెట్రాసైక్లిన్ అనలాగ్’పై పరిశోధనలకు గాను బి. ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ విభాగం సీనియర్ అధ్యాపకురాలు ప్రొఫెసర్ పి.సుజాతకు పేటెంట్ (చట్టపరమైన మేథో సంపత్తి హక్కు) మంజూరైంది. 2018 నుంచి ఇరవై ఏళ్లపాటు ఈ హక్కులను కల్పిస్తూ కేంద్ర ప్రధాన పేటెంట్ కార్యాలయం (కోల కత్తా) తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా సుజాతను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.ఆర్.రజని శనివారం అభినందించారు. -
విశ్వశాంతి దేవ మహాయజ్ఞం
అట్టహాసంగా 108 కుండీలరాయగడ: స్థానిక రైతుల కాలనీ సమీపంలో గల జేఎస్కో మైదానంలో శనివారం మిట్స్ ఇంజనీరింగ్ గ్రూప్ సంస్థల చైర్మన్ బాలు పండ, బీజేపీ సీనియర్ నాయకుడు యాల్ల కొండబాబుల ఆధ్వర్యంలో 108 కుండీల విశ్వశాంతి దేవ మహాయజ్ఞం అట్టహాసంగా ప్రారంభమైంది. మహిళల లలిత సహస్ర నామాల పారాయణంతో ప్రాంగణం ధ్వనించింది. అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మూడు రోజుల పాటుగా జరిగే ఈ మహాయజ్ఞం ఫిబ్రవరి రెండో తేదీన పూర్ణాహుతితో ముగుస్తుంది. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి హాజరవుతారని నిర్వాహకులు తెలియజేశారు. అందుకు ఇప్పటికే అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, గౌరవ అతిథిగా బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక లు హాజరయ్యారు. వేల సంఖ్యలొ మహిళలు పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు మిట్స్ గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ బాలు పండ మాట్లాడుతూ ఎప్పటి నుంచో ఇలాంటి తరహా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తన మనసులో ఉండేదని అందుకు బీజేపీ నాయకుడు యాల్ల కొండబాబు, ఆధ్యాత్మిక వేత్త చైతన్య రాంజీలు తనకు ఎంతగానో సహకరించారని అన్నారు. అంతకు ముందు యాల్ల కొండబాబు, చైతన్య రాంజీ, బాలు పండ అతిథులు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. -
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ‘లేబర్ కోడ్లు రద్దు చేసేవరకు పోరాడుదాం– ఫిబ్రవరి 12న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం‘ అనే పుస్తకాన్ని శనివారం శ్రీకాకుళం సీఐటీయూ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మికుల్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ల వల్ల కార్మికుల కొనుగోలు శక్తి పడిపోయి, మార్కెట్లు మరింత కుదేలవుతాయన్నారు. అలా కాకుండా ఉండాలంటే కార్మికులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పని బంద్ చేసి జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాలలో జరిగే ర్యాలీ, బహిరంగ సభలలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ కె.నాగమణి, జన విజ్ఞాన వేదిక జిల్లా వ్యవస్థాపక కార్యదర్శి కొత్తకోట అప్పారావు, ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆదినారాయణమూర్తి, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు, ఉద్యోగ సంఘ నాయకులు శ్రీనివాస్ యాదవ్, సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, శ్రీకాకుళం పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు, పెద్దలను గౌరవించాలి
రాయగడ: తల్లిదండ్రులు, పెద్దలను గౌరవించడం బాధ్యతగా గుర్తించాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరస్వతి మాఝి అన్నారు. స్థానిక డీఆర్డిఏ సమావేశం హాల్లో శనివారం తల్లిదండ్రుల రక్షణ, సీనియర్ సిటిజన్ల సంరక్షణ, సంక్షేమ చట్టం–2007పై జిల్లా స్థాయి అవగాహన శిబిరంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మన గుర్తింపు మన తల్లిదండ్రులేనని, అటువంటి వారికి మన స్వాస ఉన్నంత వరకు అండగా నిలవాలన్నారు. కుటుంబ వివాదాలు, వంటరితనం, ఆరోగ్య సమస్యలు వంటి వాటిపై శిబిరంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, జిల్లా పౌరసంబధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. జిల్లా సామాజిక భద్రత శాఖ అధికారి శ్రీకాంత్ కుమార్ పాణిగ్రహి అధ్యక్షత వహించారు. -
బెండి కొండపై ఆక్రమణల తొలగింపు
వజ్రపుకొత్తూరు రూరల్: పెద్దబొడ్డపాడు పంచాయతీ నారాయణపురం, తోటపల్లి సమీపంలో సర్వే నంబర్–252లో ఉన్న బెండి కొండపై ప్రభుత్వ భూమి ఆక్రమణలను శనివారం రెవెన్యూ అధికారులు తొలిగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెండి కొండను కొందరు నాయకులు రైతులతో కలిసి ఆక్రమించుకున్నారు. ఈ కబ్జాపై ‘10 మంది 100 ఎకరాలు..బెండి కొండపై అక్రమాల పర్వం ’ అనే శీర్షికతో గత నెల పదో తేదీన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కజ్జా పర్వంపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు శనివారం తహశీల్దార్ సీతారామయ్య సమక్షంలో యంత్రాల సాయంతో ఆక్రమణలు తొలగించారు. ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉప తహశీల్దార్ శ్రావణ్, ఆర్ఐ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
విలువలు లేని జ్ఞానం అసంపూర్ణం
● డ్రీమ్స్ ద్వితీయ స్నాతకోత్సవ సభలో రాష్ట్ర గవర్నర్ హరిబాబు కంభంపాటిభువనేశ్వర్: విలువలు లేని జ్ఞానం అసంపూర్ణమని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఉత్తీర్ణ విద్యార్థులకు ప్రబోధించారు. కటక్ నగరంలో శనివారం డ్రీమ్స్ విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అత్యున్నత విద్యార్హతలతో పట్టాలు పొందిన ఉత్తీర్ణులు వ్యక్తిత్వం, విద్యా నైపుణ్యానికి సమాన ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. నిజాయితీ, సానుభూతి మరియు బాధ్యత వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు మార్గనిర్దేశం చేస్తుందని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ వేడుక మార్గనిర్దేశిత అభ్యాసం నుంచి స్వతంత్ర బాధ్యత, విద్యార్థి జీవితం నుంచి వృత్తిపరమైన పౌర జీవన పరివర్తనను సూచిస్తుందన్నారు. భారత మాజీ విదేశాంగ కార్యదర్శి లలిత్ మాన్సింగ్ భారత దేశ విదేశాంగ విధానం, ప్రపంచ స్థాయికి ఆయన చేసిన విశిష్ట సహకారాన్ని గవర్నర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలైన తులసి ముండా, దమయంతి బేష్రాలకు గవర్నరు గౌరవ డాక్టరేటు ప్రదానం చేశారు. వీరివురు సేవ, విద్య, సామాజిక సంస్కరణ మరియు గిరిజన సంస్కృతి గుర్తింపు, పరిరక్షణకు స్ఫూర్తిదాయకమైన చిహ్నాలుగా అభివర్ణించారు. సాంకేతికత, కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పు, అభివృద్ధి చెందుతున్న సామాజిక వ్యవస్థలో నిర్మాణాల ద్వారా నడిచే వేగవంతమైన ప్రపంచ మార్పులను ప్రస్తావిస్తూ, నిరంతర అభ్యాసం, సత్వర సాధన, సమయ స్ఫూర్తితో బాధ్యతాయుతంగా వ్యవహరించే వారిదే భవిష్యత్తు అని యుతను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంలో, బహుళ విభాగ విద్య, నైపుణ్య అభివృద్ధి, నైతికత మరియు సమగ్ర వృద్ధితో యువతను 21వ శతాబ్దపు సవాళ్లకు సిద్ధం చేయడానికి జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020ని ఒక దార్శనిక చొరవగా పేర్కొన్నారు. నిరంతర అభ్యాసంతో వైఫల్యాలను సమర్థంగా ఎదుర్కొని వినయపూర్వక విజేతలుగా నైపుణ్యతను విస్తృత ప్రయోజనాలకు సద్వినియోగపరచడంతో వికసిత్ ఒడిశా, వికసిత్ భారత్ దార్శనికతకు దోహదపడాలని విద్యార్థులకు గవర్నర్ పిలుపునిచ్చారు. భారత మాజీ విదేశాంగ కార్యదర్శి లలిత్ మాన్సింగ్, డ్రీమ్స్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ప్రకాష్ కుమార్ హొత్తా ఈ సందర్భంగా ప్రసంగించారు. -
అంత్యక్రియలకు రాని సంతానం
కొరాపుట్: నవమాసాలు మోసి కన్న సంతానం తల్లి అంత్యక్రియలకు రాని విషాదకర ఘటన జరిగింది. శనివారం కొరాపుట్ జిల్లా దశమంత్పూర్ సమితి కేంద్రంలో నివసిస్తున్న రాజేశ్వరి నాయక్ (60) అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచింది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారిద్దరూ వివాహాలు చేసుకుని వేరే ఊళ్లలో నివసిస్తున్నారు. తల్లి మరణ వార్త గ్రామస్తులు కుమారుడు, కుమార్తెకు తెలియజేశారు. కానీ వారిద్దరూ తాము రాలేమని చెప్పేశారు. దీంతో గ్రామస్తులే రాజేశ్వరి మృతదేహానికి అంత్య క్రియలు నిర్వహించారు. -
మంత్రివర్గ ఆమోదం
12 ప్రతిపాదనలకు..భువనేశ్వర్: స్థానిక లోక్ సేవా భవన్ కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన శనివారం రాష్ట్ర మంత్రివర్గం 35వ సమావేశం జరిగింది. సమావేశం తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మీడియాకు వివరించారు. మంత్రి వర్గం ఆమోదం కోసం 10 విభాగాలు 12 ప్రతిపాదనలను సమావేశంలో ప్రవేశ పెట్టారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. వీటిలో ఒడియా భాష, సాహిత్యం మరియు సంస్కృతి శాఖ, పరిశ్రమల శాఖ, జలవనరుల శాఖ, కార్మిక, ఉద్యోగుల రాష్ట్ర బీమా శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యాయ, సహకార సంస్థలు, వాణిజ్యం, రవాణా, ఉక్కు, గనుల శాఖ, శాసన సభ వ్యవహారాల శాఖ నుంచి ఒక్కొక్కటి వంతున, ప్రజా పరిపాలన, ప్రజా ఫిర్యాదుల శాఖ నుంచి 2 ప్రతిపాదనలు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వీటిలో ఒక ప్రతిపాదన ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న 17వ శాసనసభ 6వ విడత ఆమోదానికి సంబంధించినది. మంత్రి వర్గం కీలక ఆమోదాలు రాష్ట్ర సహకార విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జల వనరుల శాఖ మళ్లింపు వ్యవస్థకు రూ. 362 కోట్లు మంజూరుకు మార్గం సుగమం చేసింది. సింగపూర్, దుబాయ్లకు విమానాలు ఈ ఏడాది మార్చి నెల వరకు కొనసాగుతాయి. తదుపరి సేవల పొడిగింపు, కొనసాగింపు విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని మంత్రి వర్గం తీర్మానించింది. రాష్ట్రంలో రక్షణ, అంతరిక్ష పరికరాలు నిర్మాణం కోసం ఢెంకనాల్ గొజొమొరా ప్రాంతంలో రూ. 17,250 కోట్ల పెట్టుబడితో 1100 ఎకరాల భూమిలో కళ్యాణి గ్రూప్ ఇంటిగ్రేటెడ్ న్యూ ఏజ్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ను నిర్మిస్తుంది. దీని ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా 20,000 మంది యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి వర్గం అభిప్రాయపడింది. కంబైన్డ్ టెక్నికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ రూల్స్, 2022 సవరణ, ఒడిశా యూనిఫామ్డ్ సర్వీస్ పర్సనల్ సెలక్షన్ కమిషన్ రూల్స్, 2026 ప్రకటన, ఒడిశా సుపీరియర్ జ్యుడీషియల్ సర్వీస్, జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్, 2007 సవరణకు మంత్రి వర్గం అంగీకరించింది. -
డయేరియాతో విద్యార్థిని మృతి
● మరో 30 మందికి అస్వస్థతరాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి చాటికొన పంచాయతీలో గల సింగులి గ్రామంలో ఉన్న నళిని విద్యామందిరం హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు డయేరియా బారిన పడ్డారు. శుక్రవారం రాత్రి విద్యార్థులు విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే వారిని బిసంకటక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు భోరుమంటూ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక విద్యార్థిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లిపోవడంతో శనివారం నాడు ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు విద్యామందిర్కు చెందిన ప్రధానోపాధ్యాయురాలు ఉర్మిల శతపతి తెలియజేశారు. మృతురాలు బాత్పూర్ పంచాయితీలోని కన్నతి గ్రామానికి చెందిన రాజేంద్ర ఉర్లాక కూతురు లగ్నా ఉర్లాక (9) మృతి చెందినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. అసలు ఆ రోజు రాత్రి ఏ ఆహారాన్ని విద్యార్థులు తిన్నారు అన్న ప్రశ్న తలెత్తుతుంది. -
‘కుష్టు రోగులపై వివక్ష తొలగించాలి’
పర్లాకిమిడి: ప్రపంచ కుష్టు రోగ నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక మెడికల్ రోడ్డులో గల మహారాజా డైమండ్ జుబ్లీ కుష్టురోగ పునరావాస కేంద్రంలో సెంచూరియన్ వర్సిటీ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ఎన్ సంధ్య, డైరెక్టర్ (అడ్మిన్) డాక్టర్ దుర్గాప్రసాద్ పాఢి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా జిల్లా ముఖ్యవైద్యాధికారి, డీపీహెచ్ఓ డాక్టర్ మహామ్మద్ ముబారక్ ఆలీ, రామకృష్ణ నాయుడు, శ్రీధర్ రావు వంటి ప్రముఖులు హాజరయ్యారు. కుష్టురోగాన్ని మల్టీ డ్రగ్థెరపీ సహకారంతో చికిత్స జరిపి నయం చేయవచ్చునని సీడీఎంఓ డాక్టర్ అలీ అన్నారు. రోగులపై సమాజంలో వివక్షను తొలగించాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేశారు. సెంచూరియన్ వర్సిటీ నర్సింగ్ విద్యార్థులు చేసిన కృషికి సీడీఎంఓ ఆలీ అభినందించారు. ఈ సందర్భంగా కుష్టు రోగ పునరావాస కేంద్రంలో ఉంటున్న రోగులకు పండ్లు డైరెక్టర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాఢి చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ కోఆర్డినేటరు శుభాశ్రీ పాణిగ్రాహి, బేబీ రాణి, స్టూడెంట్స్ కోఆర్డినేటర్ శుభశ్రీ పండా తదితరులు మార్గదర్శకాలు చేశారు. -
బిసంకటక్లో దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని బిసంకటక్లో గల బ్రాహ్మణవీధికి చెందిన కై లాస్ చంద్ర సాహు(49) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అతని గొంతు కోసి హత్య చేశారు. రక్తపు మడుగులో ఉన్న సాహుని బిసంకటక్లో గల క్రిష్టియన్ ఆస్పత్రికి వెంటనే తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఐఐఈ సూర్యచంద్ర పాఢి హత్య జరిగిన బ్రాహ్మణవీధికి సైంటిఫిక్ బృందంతో చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు. ఎందుకు హత్య చేశారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సముద్రంలో తల్లీ, కొడుకులు మృతిభువనేశ్వర్: పూరీ సముద్ర ప్రమాదంలో తల్తీ, కొడుకులు మృతి చెందారు. సముద్రంలో స్నానం చేస్తుండగా ఈ విషాదం చోటు చేసకుంది. స్నానం చేస్తుండగా కెరటాల్లో కొట్టుకుపోతున్న తల్లిని కాపాడబోయిన కొడుకు అలల్లో కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. మృతులు ఇరువురు జార్ఖండ్ రాంచీ ప్రాంతానికి చెందిన అంకిత్ గుప్తా, కుసుమ్ గుప్తాగా గుర్తించారు. పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రత్యక్షంగా ఘటనా స్థలం సందర్శించారు. దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీసు అధికారిని నియమించినట్లు తెలిపారు. ఒడ్డుకు చేర్చిన బాధితులకు సత్వర చికిత్స కల్పించేందుకు పూరీ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.భారీగా గంజాయి పంట ధ్వంసం జయపురం: సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి పరిధి జి.మఝిగుడ గ్రామ పంచాయతీ బలియపొదర్ ప్రాంతంలో దాదాపు 30 ఎకరాల్లో అక్రమంగా పండిస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు, ఎకై ్సజ్ సిబ్బంది ధ్వంసం చేశారు. దీనిలో భాగంగా బొయిపరిగుడ పోలీసులు 16 ఎకరాల్లో ధ్వంసం చేయగా.. బొయిపరిగుడ ఎకై ్సజ్ సిబ్బంది 14 ఎకరాల్లో గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. గ్రీన్ క్లీన్ అభిజాన్లో భాగంగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు వెల్లడించారు. రాయగడ: స్థానిక రామకృష్ణ నగర్ (ఆర్కే)లో నివాసముంటున్న నాల్గో వార్డు కౌన్సిలర్ సుకాంత పొరిడ ఇంటిలో శనివారం సాయంత్రం దోపిడీ జరిగింది. ఏడాది వయసు గల బాలిక మెడపై కత్తి పెట్టిన దుండగులు ఇంటిలోగల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. వివరాల్లొకి వెళితే.. సుకాంత ఇంటిలో తన భార్య, ఏడాది వయసు గల కూతురు ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇద్దరు ముసుగులు ధరించి ఇంటి లోపలకు వెళ్లి పాప మెడపై కత్తిపెట్టి బెదిరించారు. దీంతొ భయపడిన సుకాంత్ భార్య ఇంటిలో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి తదితరమైనవి దుండగులకు ఇచ్చింది. ఇంటిలో బంగారు,వెండి ఆభరణాలు దోచుకున్న దుండగులు పాపను వదిలి ఇంటి వెనుక నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని తన భర్త సుకాంత్ కు ఫోన్ చేసి చెప్పడంతో ఇంటికి చేరుకున్న అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. బాధితుని ఇంటికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులు మర్యాదపూర్వకంగా ఉండాలి: ఐజీ
భువనేశ్వర్: పోలీసు దళంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో యూనిఫామ్ను గౌరవించాలని, ప్రజల్లో మర్యాదపూర్వక సభ్యతకు ప్రాధాన్యత కల్పించాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రేంజ్) సత్యజిత్ నాయక్ అన్నారు. రాష్ట్రంలోని ఒక సీనియర్ పోలీసు అధికారి విభిన్నంగా ఎరట్రి జుట్టుతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టిని ఆకట్టుకుంది. తక్షణమే రంగు మార్చుకుని సహజ వర్ణ జుట్టుతో హాజరు కావాలని కోరారు. జగత్సింగ్పూర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రష్మీ రంజన్ దాస్ (49) ఎరన్రి రంగు వేసిన జుట్టుతో విధులకు హాజరు అవుతున్న ఫోటోలు ఆన్లైన్ వీక్షకులను విభిన్నంగా ఆకర్షించడంతో వెలుగులోకి వచ్చాడు. ఈ సంఘటనపై అతని ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. రష్మీ రంజన్ దాస్ జుట్టు రంగును మార్చుకోవాలని ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రేంజ్) సత్యజిత్ నాయక్ ఆదేశించారు. కేశాలంకరణకు సంబంధించి నిర్దిష్ట నియమం లేనప్పటికీ సిబ్బంది సాధారణ శైలి కొనసాగించాలని సీనియర్ అధికారులు భావిస్తున్నారు. రష్మీ రంజన్ దాస్ తన ప్రదర్శనను పునఃపరిశీలించుకోవాలని గతంలో అనధికారికంగా సలహా ఇచ్చిన పాటించలేదని అధికార వర్గాలు తెలిపాయి. యూనిఫాంలో ఉన్న వ్యక్తికి తగినట్లుగా, మర్యాదగా వ్యవహరించాలని, అతని కేశాలంకరణ సహజంగా ఉంచుకోవాలని అధికారికి నచ్చజెప్పమని జగత్సింగ్పూర్ పోలీసు సూపరింటెండెంట్ ఆదేశించినట్లు ఐజీ తెలిపారు. అధికారికి మర్యాదగా ఉండాలని మౌఖికంగా తెలియజేశారు. ప్రతీది లిఖితపూర్వక ఆదేశాల ప్రకారం జరగదు. కానిస్టేబుళ్ల నుంచి సీనియర్ అధికారుల వరకు పోలీసు సేవలోని ప్రతి ఒక్కరూ యూనిఫామ్ను గౌరవించాలని, మర్యాదకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయన అన్నారు. -
సామూహిక సత్యనారాయణ వ్రతాలు
కొరాపుట్: జగదల్పూర్ పట్టణంలోని వేంకటేశ్వర దేవాలయంలో గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వేద పండితుల సమక్షంలో శనివారం సామూహిక సత్యనారాయణ వత్రాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం ప్రతిష్ట జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నారు. సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో సుమారు 500పైగా దంపతులు పూజలు చేశారు. మధ్యాహ్నం సుమారు రెండు వేల మందికి ఉచిత అన్న ప్రసాద సేవనం జరిగింది. చత్తీస్ఘడ్ రాష్ట్ర బ్రూవర్సీస్ కార్పొరేషన్ చైర్మన్, ఆలయ ట్రస్టీ శ్రీనివాస్ మద్ది ప్రారంభ పూజల్లో పాల్గొన్నారు. -
పంచాయతీ సభ్యత్వానికి ఇద్దరు బిడ్డల సంతానం ముద్దు: హైకోర్టు
భువనేశ్వర్: పంచాయతీ సభ్యత్వానికి ఇద్దరు బిడ్డలు ముద్దు.. అంతకు పైబడిన సంతానం వద్దు అని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో లోగడ ఏక సభ్య ధర్మాసనం జారీ చేసిన ఉత్తర్వుల్ని ద్విసభ్య ధర్మాసనం గట్టిగా సమర్థించింది. పరిమిత సంతానం జనాభా నియంత్రణ యొక్క రాజ్యాంగ, సామాజిక ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తుంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న ఆరోపణతో పదవి కోల్పోయిన మాజీ గ్రామ పంచాయతీ సభ్యుడు దాఖలు చేసిన అప్పీల్ విచారణ పురస్కరించుకుని ఉన్నత న్యాయ స్థానం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. జస్టిస్ కృష్ణ శ్రీపాద దీక్షిత్, చిత్తరంజన్ దాష్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒడిశా గ్రామ పంచాయతీల చట్టం, 1964లోని సెక్షన్ 25(1)(5) ప్రకారం అప్పీలుదారుడి సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని సమర్థించింది. ఈ నిబంధన 2 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులను పంచాయతీ రాజ్ సంస్థలలో పదవులు నిర్వహించడానికి అనర్హులుగా పేర్కొంటుందని వివరించారు. మాజీ గ్రామ పంచాయతీ సభ్యుడు అనర్హతను సవాలు చేస్తూ దాఖలు చేసిన రిట్లోగడ ఏకసభ్య ధర్మాసనం పిటిషన్లను తోసిపుచ్చింది. 2025 డిసెంబర్ 5న ఈ మేరకు తీర్పు జారీ చేసింది. ఇద్దరు పిల్లల నిబంధన అమలుకు ముందు అప్పీలు దారుణానికి మూడు, నాల్గో సంతానం క్రమంగా 1993, 1994లో జన్మించారని పేర్కొంటూ అనర్హత నిబంధన నిబంధన కింద తనకు రక్షణ కల్పించాలని అప్పీలుదారు అభ్యర్థించాడు. ద్విసభ్య ధర్మాసనం ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇద్దరు పిల్లల నియమాన్ని ప్రవేశపెట్టే చట్టబద్ధమైన సవరణ 1994 ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. సవరణ అమలులోకి వచ్చిన తర్వాత అప్పీలుదారు అనుమతించదగిన పరిమితిని మించిపోయాడని కోర్టు గమనించింది. చట్టపరమైన సవరణ ప్రారంభించే సమయంలో లేదా ఆ తర్వాత ఒక సంవత్సరం లోపు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే వెసులుబాటు వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్పీలుదారు ఈ షరతులను పాటించనందున అతడి అనర్హతను తోసిపుచ్చలేమని ధర్మాసనం నిర్ధారించింది. ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో ఎన్నికై న ప్రజా ప్రతినిధులు కుటుంబ నియంత్రణ నిబంధనలను పాటించడంలో ఆదర్శంగా నిలవాలని ధర్మాసనం నొక్కి చెప్పింది. వారే స్వయంగా నియమాన్ని ఉల్లంఘిస్తే, వారు ప్రజల ముందు ఏ ఉదాహరణను ఉంచగలరు?‘ అని ఏక సభ్య ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పులను ద్విసభ్య ధర్మాసనం అభినందించింది. -
బీజేపీలోకి అశ్వినీ గొమాంగో
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో రాజకీయాలు కొత్త రంగులు మార్చుకుంటున్నాయి. అధికార బీజేపీ గుణుపూర్ శాసనసభ నియోజకవర్గంలో పట్టుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు గుణుపూర్లోని అగ్రనేతలు సైతం ఇదివరకే బీజేపీలో చేరారు. ఇదిలాఉండగా తాజాగా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు బిజయ కుమార్ గొమాంగో కుమారుడు అశ్వినీ గొమాంగో బీజేపీలో చేరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిజయ్ గొమాంగో, ఆయన సతీమణి కేతకి గొమాంగోలు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి కుమారుడు బీజేపీలో చేరడంతో గుణుపూర్లో రాజకీయాలు ఈసారి రసవత్తరంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. శుక్రవారం రాజధాని భువనేశ్వర్లోని బీజేపీ కార్యాలయంలో అశ్వినీ గొమాంగో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, రాయగడ జిల్లా ఇన్చార్జి కొడూరు నారాయణరావుల సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. యువ నాయకుడిగా గుణుపూర్లో గుర్తింపు పొందిన అశ్విని చేరిక శుభ పరిణామమని జిల్లా అధ్యక్షుడు టి.గోపి ఆనంద్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. స్వర్గధామ్ సేవకులకు సన్మానం రాయగడ: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి మహతి ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక సిరిగుడ సమీపంలోని స్వర్గధామ్లో సేవలు అందిస్తున్న తాల్ల లోకేశ్వరి, ఆమె సహచరుడు టి.లోకేష్ కుమార్లను శ్రీపతి చారిటబుల్ ట్రస్టు హెల్పింగ్ ఫర్ పూర్ అనే సంస్థ శుక్రవారం సన్మానించింది. సామాజిక సేవా రంగంలో వారు చేస్తున్న అమూల్యమైన కృషికి ఈ సన్మానం దక్కింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగో తరగతి ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తున్న లోకేశ్వరి మానవత్వానికి ప్రతీకగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆమె సొంత ఖర్చులతో సుమారు 100 మందికి పైగా అనాథ శవాలకు దహనం చేశారన్నారు. అదేవిధంగా ఆమె సహచరుడు టి.లోకేష్ కుమార్ చాలా కాలంగా ఈ మానవతా పనిలో సహకరిస్తూ తన వంతు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. -
జాజ్పూర్ సందర్శించనున్న ద్రౌపది ముర్ము
● ముస్తాబు అవుతున్న విరజా క్షేత్రంభువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరో 2 రోజుల్లో జాజ్పూర్ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన విరజా క్షేత్రం ఆమె సందర్శిస్తారు. విరజా మాతను దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ సముదాయంలో ఉన్న నాభి గయలో రాష్ట్రపతి పిత దేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి జాజ్పూర్ జిల్లా యంత్రాంగం రాత్రింబవళ్లు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రపతి రాక నేపథ్యంలో జాజ్పూర్ నగరంలో దీర్ఘకాలంగా ఉపేక్షించిన ప్రధాన రహదారులను పునరుద్ధరిస్తున్నారు. విరజా క్షేత్రం సందర్శించనున్న తొలి భారత రాష్ట్రపతి భారత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము జాజ్పూర్ విరజా క్షేత్రం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు మరే ఇతర రాష్ట్రపతి విరజా మాత దర్శనం లేదా ఇక్కడ పిండప్రదానం చేయడానికి రాలేదని స్థానిక అర్చక వర్గం సమాచారం. ఈ లెక్కన విరజా క్షేత్రం సందర్శించనున్న తొలి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కానున్నారు. భారత దేశంలోని తన బంధువులకు పిండ ప్రదానం చేసే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో జాజ్పూర్ విరజా క్షేత్రంలో నాభి గయ ప్రత్యేకమైనది. సర్వ దర్శనం నిలిపివేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శన సమయంలో విరజా మాత సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేస్తారని ప్రకటించారు. ఫిబ్రవరి 3న ఉదయం 5.30 గంటల నుంచి సర్వ దర్శనం నిలిపి వేస్తారు. రాష్ట్రపతి విరజా మాత పూజాదులు, నాభి గయలో పిండ ప్రదానం కోసం భద్రత దృష్ట్యా సర్వ దర్శనం మూసివేస్తారు. రాష్ట్రపతి ఆలయం నుండి తిరిగి వచ్చే వరకు ఈ ఆంక్షలు నిరవధికంగా కొనసాగుతాయని జాజ్పూర్ జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. -
స్కౌట్స్, గైడ్స్ క్యాంపు
ఉన్నత పాఠశాలలో..పర్లాకిమిడి: భారత్ స్కౌట్స్, గైడ్స్ క్యాంపు 2025–26 జిల్లాలో రాయగడ బ్లాక్ ప్రభుత్వ ఎస్ఎస్డీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. భారత్ స్కౌట్స్, గైడ్స్ ట్రైనింగ్ క్యాంపును మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగ్ ప్రారంభించగా, ట్రైనింగ్ క్యాంపును ఒడిశా రాష్ట్ర భారత స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర ముఖ్య కమిషనర్ డాక్టర్ కాళీప్రసాద్ పట్నాయక్ ఆవిష్కరించారు. భారత్ స్కౌట్స్, గైడ్స్ క్యాంపుకు స్కౌట్స్ 384 మంది, గైడ్స్ 162, స్కౌట్ మాస్టర్స్ 98, గైడ్ కెప్టెన్స్ 32 మంది, మొత్తం 476 మంది పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన స్కౌట్స్, గైడ్స్ క్యాంపునకు జిల్లా ముఖ్యవిద్యాధికారి డాక్టర్ మయాధర్ సాహు ఆదేశాలతో భారతీయ స్కౌట్స్, గైడ్స్ జిల్లా కార్యదర్శి పురేంద్ర కుమార్ పాత్రో, అదనపు డీఈఓ ఎస్.గిరిధర్, జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొని సహకారం అందజేశారు. -
సమావేశాన్ని బహిష్కరించిన మిల్లర్లు
పర్లాకిమిడి: ఖరీఫ్ఽ ధాన్యం కొనుగోళ్ల కేంద్రంలో రైతుల వద్ద నుంచి సంగ్రహిస్తున్న ధాన్యంపై సొసైటీ అధికారులు, మిల్లర్లు 3, 4 కిలోల ధాన్యం కట్ చేస్తూ రవాణా ఖర్చులు, ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 28న రస్తారోకో ఆందోళన చేసిన విషయం విదితమే. శుక్రవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్యక్షతన జిల్లా పరిషత్తు హాల్లో రైతులు, మిల్లర్లు, సోసైటీ అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో సి.ఎస్.ఓ ఇన్చార్జి అనుప్ పండా, జిల్లా కోపరేటివ్ సొసైటీస్ అధికారి హరిహర శెఠి, తదితరులు పాల్గొన్నారు. మిల్లర్లు ధాన్యం రవాణా ఖర్చులు ఇవ్వాల్సిందిగా నవనిర్మాణ్ కృషక్ సంఘటన్ అధ్యక్షులు రంజిత్ పట్నాయిక్ సబ్కలెక్టర్ వద్ద డిమాండ్ చేయగా.. మిల్లర్లు అందరూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ అత్యవసర సమావేశంలో జెడ్పీటీసీ ఎస్.బాలరాజు, గణేష్ బెహరా, పి.తిరుపతిరావు, రైతు సంఘం నాయకులు సూర్యనారాయణ పట్నాయక్ పాల్గొన్నారు. -
ఆలిండియా సాఫ్ట్బాల్ పోటీలకు నలుగురు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా స్కూల్గేమ్స్ అండర్–17 బాలబాలికల సాఫ్ట్బాల్ చాంపియన్షి ప్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ పోటీలు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ వేదికగా ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లా నుంచి బాలురు జట్టుకు సీహెచ్ జశ్వంత్, పి.శరత్కుమార్, పి.హర్షఅభిరామ్, బాలికల జట్టుకు ఎ.జ్యోత్స్న ఎంపికై న వారిలో ఉన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ బాలబాలికల జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు శుక్రవారం అభినందించారు. డిర్యక్రమంలో డిప్యూటీ ఈవో విలియ మ్స్, పీడీ–పీఈటీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ, స్కూల్గేమ్స్ సెక్రటరీ బీవీ రమణ, మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, జెడ్పీహెచ్ స్కూల్ కేశవరావుపేట పీడీ వై.కోటేశ్వరరావు, జి.మల్లేష్ పాల్గొన్నారు. -
రక్తదానం.. ప్రాణదానం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో గల గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజీనిరింగ్ అండ్ టెక్నాలజీ (జిఐఇటి ) విశ్వద్యాలయంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. భువనేశ్వర్లో గల ఐఎంఎంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ నవీన్ కుమార్ దల్ ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో సేవా భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి తరహా శిబిరాలు ఎంతో దొహదపడతాయన్నారు. యువత ముందుకు వచ్చి రక్తదానంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయం అధ్యాపకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ శిబిరంలో 455 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. విశ్విద్యాలయం కులపతి డాక్టర్ ఎ.వి.ఎన్.ఎల్.శర్మ, డాక్టర్ పి.విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఈ శిబిరం జరిగింది. రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.వి.జగన్నాథరావు, తదితరులు పాల్గొన్నారు. -
చిన్నతనంలోనే పెద్ద కష్టం
ఎచ్చెర్ల/జి.సిగడాం : నిరుపేద కుటుంబాలను ప్రాణాంతక వ్యాధులు వెంటాడుతున్నాయి. చిన్నతనంలోనే వారి బతుకులను చిదిమేస్తున్నాయి. ఏమీ చేయ లేని నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద తల్లిదండ్రులు పిల్లల బాధలను చూడలేక అల్లాడిపోతున్నారు. దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామానికి చెందిన కానూరి భద్రరావుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నకుమారుడు జ్ఞానేశ్వరరావు(7) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. మూడేళ్ల వయస్సులోనే తల్లిని కోల్పోయాడు. దీంతో తండ్రి కూలి పనులు చేసుకుంటూ జీవనం నెట్టుకోస్తున్నాడు. కొడుకు దీనావస్థను చూసిన తండ్రి తన వద్ద ఉన్నదంతా వైద్యానికి ఖర్చు చేశాడు. చివరికి ఇంటిని సైతం అమ్మేసి వైద్యం చేయించా డు. ఇప్పుడు గ్రామంలో ఓ స్కూల్లో కుటుంబంతో తలదాచుకుంటున్నాడు. వైద్యుల సూచన మేరకు జ్ఞానేశ్వరరావును అగనంపూడి క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్పించారు. బతకడానికే కష్టంగా ఉన్న ఆ కుటుంబానికి వైద్యం ఖర్చులు భరించ డం మరింత భారంగా మారింది. జ్ఞానేశ్వరరావు వైద్యం కోసం సాయం చేయాలనుకుంటే 8978820683 నంబర్ను సంప్రదించవచ్చు. -
ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం
పర్లాకిమిడి: స్థానిక కోమటివీధి వద్ద వేంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణ మహోత్సవం గురువారం రాత్రి కల్యాణ మండపంలో ఘనంగా జరిపించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు పైడిఘంటం భారతీ రామారావు దంపతులు, పి.మంగమ్మ ఆధ్వర్యంలో బరాటం గోపాలం, దంపతుల ఆధ్వర్యంలో భద్రం కృష్ణమోహనాచార్యులు, భద్రం శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో ఘనంగా జరిపించారు. పట్టణంలోని మహిళలు పెద్ద ఎత్తున వేంకటేశ్వర స్వామి పద్మావతిల కల్యాణ మహోత్సవం కనులారా చూసి తరించారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు పర్లాకిమిడి: స్థానిక తెలుగు సోండివీధి వద్ద గల సత్యనారాయణ మందిరంలో శుక్రవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలను పులఖండం ప్రసాద్ బాబ్జీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 25 మంది దంపతులు వ్రతాల్లో పాల్గొని స్వామివారి ప్రత్యే పూజలు చేశారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురిని రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియమిస్తూ శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీచేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా బరాటం నాగేశ్వరరావు, మైనార్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంఏ రఫీ, ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఐటీ విభా గం రాష్ట్ర కార్యదర్శిగా చినపాన సాయిసందీప్రెడ్డిలను నియమించారు. టెక్కలి: టెక్కలి ఆదిఆంధ్రావీధిలో భర్త చితికి భార్య తలకొరివి పెట్టిన ఘటన చోటు చేసుకుంది. జోగి మల్లేష్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందా డు. ఒక్కగానొక్క కుమారుడు గతంలోనే మృతి చెందడంతో భార్య సీతమ్మ అంత్యక్రియలు పూర్తి చేసింది. సంతబొమ్మాళి: తాళ్లవలసలో శుక్రవారం వరి కుప్పలు దగ్ధమయ్యాయి. దుబ్బాక శశిభూషణరావు, పురుషోత్తం, కామమ్మ, గున్న పాపారా వులకు చెందిన సుమారు ఐదు ఎకరాల వరి చేనుకుప్పలు కాలిపోవడంతో సుమారు రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. పారిశుద్ధ్య కార్మికు లు రోడ్డు ఇరువైపులా చెత్త పోగుచేసి ఒకేచోట మంట పెట్టారు. ఈ క్రమంలో పక్కన ఉన్న వరి కుప్పలకు అంటుకోవడంతో దగ్ధమయ్యా యని స్థానికులు అంటున్నారు. టెక్కలి అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశం కోసం సేవలందించిన మాజీ సైనికుల సంక్షేమం, వారి కుటుంబాల రక్షణే లక్ష్యంగా ‘నాల్సా వీర్ పరివార్ సహాయత యోజన–2025’ను ప్రవేశపెట్టినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పెద్దరెల్లి వీధిలో జిల్లా సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. నూతనంగా ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ క్లినిక్ని ప్రారంభించి, మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమ స్యలపై చర్చించారు. కార్యక్రమంలో స్పెషల్ జడ్జి (పోక్సో) ఎన్.సునీత, ప్యానెల్ అడ్వకేట్ వి.జ్యోతిర్మయి, పారా లీగల్ వలంటీర్ కె.ఆదిత్యకుమార్, కెప్టెన్ పి.ఈశ్వరరావు, జిల్లా సైనిక సంక్షేమ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం: పాత పీఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచినా 12వ పీఆర్సీ కమిటీని ఏర్పా టు చేయకపోవడం తగదని ఎస్టీయూ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పీఆర్ సీ జాప్యంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన ర్లలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఈ మేరకు ఎస్టీయూ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమణమూర్తి నేతృత్వంలో శ్రీకాకుళం తహసీల్దార్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ప్రకటిస్తామ ని, ఆర్థిక బకాయిల చెల్లింపులు చేస్తామని, పెన్షనర్లకు పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా మని హామీలిచ్చి ఇప్పుడు విస్మరించడం తగదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఫిబ్రవరి 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా, 25న ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాల ని నిర్ణయించామని, ఉపాధ్యాయులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. బరాటం నాగేశ్వరరావు చినపాన సాయిసందీప్రెడ్డి ఎంఏ రఫీ -
కొట్టేసేందుకు సిద్ధం!
నరసన్నపేట: నరసన్నపేట పట్టణం నడిబొడ్డున బజారులో ప్రభుత్వానికి చెందిన బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. కోటి రూపాయలకు పైగా విలువైన ఈ స్థలం కొట్టేయడానికి అధికార పార్టీకి చెందిన జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రికి సన్నిహితంగా ఉంటున్న ఓ వ్యక్తి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధికారుల గతంలో కట్టిన గోడను తొలగించి గురువారం రాత్రి రెండు జేసీబీలతో బోర్డు బంగ్లా స్థలాన్ని చదును చేయించారు. ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టేందుకు సిమెంట్ ఇటుకలు సైతం సిద్ధం చేశారు. ఈ సమాచారం శుక్రవారం ఉదయం వెలుగులోకి రావడంతో స్థలం కబ్జాకు గురి కావడం ఖాయమని స్థానికులు గుసగుసలాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆమదాలవలసకు చెంది న కొందరు వ్యక్తులు బొరిగివలస వారితో కలసి తమకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని, కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందంటూ స్థలం వద్దకు వచ్చి నానా హంగామా చేశారు. అయితే అధికారులు, పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి సమర్థంగా అడ్డుకుని ఈ స్థలాన్ని కాపాడుకోగలిగారు. అప్పటి తహసీల్దార్ సింహాచలం, ఎంపీ డీఓ మధుసూదనరావులు స్పందించి ఇది ప్రభుత్వ స్థలంగా బోర్డులు పెట్టడం, స్థలం రోడ్డువైపున గోడ కట్టడం వంటివి చేయించారు. తాజాగా ఆమదాలవలసకు చెందిన వ్యక్తులు సదరు స్థలాన్ని శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నాయకుడికి విక్రయించారని తెలుస్తోంది. వీరి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా సదరు నేత రాత్రిపూట వచ్చి పనులకు శ్రీకారం చుట్టారు. మంగళ, బుధవారాల్లో నరసన్నపేటకు వచ్చిన ఆయన స్థానికులతో మంతనాలు జరిపారని, టీడీపీ నాయకులు, అధికారులను సైతం కలిశారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే రాత్రి వచ్చి పనులు మట్టిని చదును చేయించారని సమాచారం. ఈ స్థలం 40 ఏళ్ల క్రితం నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. బ్రిటిష్ కాలంలో ఇక్కడ బోర్డు బంగ్లా పేరిట ఒక భవనం ఉండేది. ఇది జిల్లా పరిషత్కు చెందినది. సంబంధిత పత్రాలు సైతం ఉన్నాయని అధికారులు అంటున్నారు. అయితే ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ ఎవరో ఒకరు తమకు హక్కులు ఉన్నా యంటూ రావడం.. అధికారులు అడ్డుకోవడం జరుగుతోంది. గొట్టిపల్లి రెవెన్యూలో పరిధిలోని సర్వే నంబరు 219 బీ వన్లో ఉన్న ఈ 38 సెంట్లు (బోర్డు బంగ్లా) స్థలం ప్రభుత్వానిదేనని తహసీల్దార్, ఎంపీడీఓలు గతంలోనే స్పష్టం చేశారు. తప్పుడు పత్రా లు చూపించి తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, లింకు డాక్యుమెంట్లు సృష్టించుకోవడం చెల్లదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ తాజాగా ఈ స్థలంలో మట్టి చదును చేయడం.. దీని వెనుక కేంద్ర మంత్రి సన్నిహితుడు ఉన్నారనే ఆరోపణలు రావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికే పట్టణం, పరిసర గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న అధికార పార్టీ కార్యకర్తలు ఇప్పుడు దీనిపై కన్నేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై నరసన్నపేట పంచాయతీ ఈఓ ద్రాక్షాయిని వద్ద ప్రస్తావించగా సమాచారాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. బోర్డు బంగ్లా స్థలంలో రాత్రి ఎవరో వచ్చి జేసీబీల సహాయంతో మట్టి చదును చేశారని మా దృష్టికి వచ్చింది. ఎవరో తెలియకుండా రాత్రి సమయంలో వచ్చి పనులు చేయడం సరికాదు. మీ స్థలం అనుకున్నప్పుడు రాత్రి వచ్చి పనులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. పగలే చేయవచ్చుకదా? దీనిపై దృష్టి పెట్టాం. ఎవరు పనులు చేశారనేదానిపై ఆరా తీస్తున్నాం. – వెంకటేశ్వర ప్రసాద్, నరసన్నపేట ఎంపీడీఓ -
కలరా వ్యాప్తిపై అప్రమత్తం
రాయగడ: పట్టణంలో కలరా వ్యాప్తిపై వైద్యశాఖ అప్రమత్తమైంది. ఇటీవల తాగునీటి నమూనాలను సేకరించిన అధికారులు, తాజాగా ఆయా ప్రాంతాల్లోని ఫాస్ట్ఫుడ్ దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ స్టేప్టీ అధికారి ప్రకాష్ సొరేన్, సిబ్బంది దాడులను చేపట్టారు. ఇందిరానగర్, నెహ్రూ నగర్, ఆశోక్నగర్ తదితర ప్రాంతాల్లోని టిఫిన్ దుకాణాల్లో తనిఖీలను నిర్వహించారు. ఎటువంటి ఆరోగ్య భద్రత లేని ఆహారాలను తినడం వల్ల కూడా కలరా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయన్నారు. అందువల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నాణ్యమైన ఆహార పదార్థాలను విక్రయించే విషయమై వారికి అవగాహన కల్పించడమైందన్నారు. రాయగడలో కలరా వ్యాప్తి రాయగడ: పట్టణంలో గల ఇందిరానగర్, కస్తూరీనగర్, కొత్తురు ప్రాంతాల్లో కలరా వ్యాప్తి చెందుతోంది. దీనికి సంబంధించి కొరాపుట్లో గల పీహెచ్ ల్యాబ్ సీనియర్ మైక్రొబయాలజిస్ట్, ల్యాబ్ ఇన్చార్జి అలేఖ్ నాయక్ ఆధ్వర్యంలో ఒక బృందం రాయగడలో శుక్రవారం నాడు పర్యటించింది. కలరా వ్యాపించిన ప్రాంతంలో పర్యటించిన బృందం తాగునీటి ప్రాంతాలను సందర్శించారు. తాగునీటి నుంచి కూడా కలరా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఆ దిశగా అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో గల తాగునీటి నల్లాలను పర్యవేక్షించి వాటి నమూనాలను సేకరించారు. సేకరించిన తాగునీటి నమూనాలను అధునాతన పరికరాలను వినియోగించి ప్రయోగశాలలో పరీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. సేకరించిన నీటి నమూనాల నుంచి 28 రకాల పరీక్షలను నిర్వహించి నిర్ధారణ చేస్తామని వివరించారు. సేకరించిన నమూనాల్లో భాగంగా నీటిలో ఏమైనా ఇతర సమస్యలు ఉంటే అవి కూడా గుర్తిస్తామని ఆయన చెప్పారు. రాయగడలో కలరా వ్యాప్తికి సంబంధించి జిల్లా ముఖ్యవైధ్యాధికారి సూచనల మేరకు బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించింది. -
రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో ఒక రోజులో వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఓ బాలిక మృతి చెందింది. మల్కన్గిరి పోలీసు స్టేషన్ పరిధిలో గల ఎంవీ 42 గ్రామంలో గురువారం రాత్రి విషు దాస్ అనే వ్యక్తి ఇంటిలోకి ఓ కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి ముందు భాగం దెబ్బ తిన్నది. ఎవరికీ ప్రాణహాని జరగలేదు. డ్రైవర్ను మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం మల్కన్గిరి ఐఐసి రీగాన్కీండో కేసు నమోద్ చేసి ధర్యాఫ్త్ చేస్తున్నారు. అలానే పండ్రిపాణి గయరామం వద్ద శుక్రవారం ఉదయం కారు బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఐదేళ్ల బాలిక చనిపోయింది. తండ్రి బుదర పోడియామితో కలిసి శివాని పోడియమి (5) మార్కెట్కు వెళ్తుండగా ఘటన జరిగింది. తండ్రికి కూడా గాయాలయ్యాయి. వీరిని మల్కన్గిరి ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి రాయగడ పర్యటన
రాయగడ: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఫిబ్రవరి 2 వ తేదీన రాయగడలో పర్యటించనున్నారు. ప్రత్యేక హెలీకాప్టర్లో ఆయన రాయగడకు చేరుకుంటారు. స్థానిక జేఎస్కో మైదానం అందుకు సిద్ధమవుతోంది. మైదానంలో ఏర్పాటు చేసిన సుభద్ర మేళాను ఆయన ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 8 వ తేదీ వరకు జరిగే సుభద్ర మేళాలో మహిళలు, స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు పాల్గొంటారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఎంతగానో దోహదపడే సుభద్ర పథకం గురించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అదేవిధంగా సమీపంలో జరుగుతున్న 108 కుండీల విశ్వవైదిక విశ్వశాంతి దేవ మహాయజ్ఞ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడ జరిగే పూజల్లో పాల్గొంటారు. ఆయన పర్యటన వివరాలు అధికారికంగా ఇంకా ఖరారు కానప్పటికీ అందుకు సంబంధించిన సన్నాహాలు యుద్ధప్రాదిపదికన జరుగుతున్నాయి. -
దోపిడీ ప్రయత్నం భగ్నం
జయపురం: పెద్ద ఎత్తున దోపిడీ చేసేందుకు సన్నద్ధమైన దోపిడీ దొంగల ముఠా ప్రయత్నాన్ని జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఆరుగురు దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు బొరిగుమ్మ సబ్డివిజన్ పోలీసు అధికారి సత్యబ్రత లెంక వెల్లడించారు. దుండగుల నుంచి పెద్ద ఎత్తున మారణాయుధాలను స్వాధీన పరచుకున్నట్లు ఆయన పత్రికా ప్రతినిధులకు వెల్లడించారు. ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తులై దుండగులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారు పాత బొరిగుమ్మ నివాసి లయిచన్ హరిజన్, బాసు హరిజన్, బొరిగుమ్మ హటపొదర్ వాసి గగణ ప్రధాన్, శాంతూన్ మహంతి, కొలాగుడ వాసి పూర్ణ హరిజన్, హరిహర హరిజన్ అని వెల్లడించారు. జనవరి 29 వ తేదీన రాత్రి బొరిగుమ్మ పోలీసు స్టేషన్ ఏఎస్ఐ గోపాల హరిజన్, ఏఎస్ఐ బసంత నాగ్ల నేతృత్వంలో రాత్రి పెట్రోలింగ్ జరుపుతున్నారు. ఆ సమయంలో కొంత మంది దుండగులు కొశాగుడ కూడలి వద్ద దోపిడీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందగా వెంటనే వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసుల రాక చూసి దుండగులు పరుగులు తీశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు వారిని వెంబడించారు. మొదట ముగ్గురు దుండగులను పట్టుకున్నారు. మిగతా ముగ్గురు పారి పోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలించగా తెల్లవారు జాము నాలుగున్నర సమయంలో పారిపోయిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. వారి నుంచి కత్తులు, ఇనుప రాడ్లు, చాకులు కర్ర లాఠీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
5 నుంచి లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు
రాయగడ: సదరు సమితి అమలాభట్ట వద్ద గల శ్రీక్షేత్ర టౌన్షిప్ ప్రాంగణంలో ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు మంగానాథ్ ఆచార్యులు, ఫణి హారం భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 10 వ తేది వరకు కొనసాగుతాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 5 సాయంత్రం 6 గంటలకు అంకురార్పణం, శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్రపారాయణం, శ్రీ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, ఋత్విక్వరుణం, మృత్సంగ్రహణం,నీరనాజనం, మంత్రపుష్పముల పూజలు జరుగుతాయి. అదేవిధంగా 6 వ తేదీ న శాత్తుమురై, యాగశాలార్చన, వాస్తు యోగేశ్వర, మండపారాధన, మూర్తి, కుంభావహానం, ధ్వజప్రినిష్ట, నీరాజనం, మంత్రపుష్పములు, శేషవాహన సేవ, 7న విశేష హోమాలు, శ్రీసుదర్శన నారసింహ హోమం, 8న గజవాహన సేవ, 9న శ్రీలక్ష్మీ హోమం, శ్రీభూవరాహ ఇష్టి, నీరాజనం కలశారాధన, ,10న పూర్ణాహుతి, కలశాభిషేకం, చక్రస్నానం తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ తెలియజేశారు. -
దేవగిరి ఉత్సవాలకు సన్నాహక సమావేశం
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి ప్రముఖ శైవక్షేత్రం దేవగిరిలో ఈనెల 15వ తేదీన జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి సన్నాహక సమావేశం సమితి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. సర్పంచ్ గౌతమ్ బర్లి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు తహసీల్దార్ ఆనంద చరణ్ సబర్, డాక్టర్ అన్వభబ్ సాహు, సామాజిక కార్యకర్త సురేష్ కుమార్ మహంతి, పంచాయతీ అభివృద్ధి అధికారి శ్వేతాంబర్ ప్రధాన్, ఎస్ఐ దిలీప్ మాఝి తదితరులు హాజరయ్యారు. శివరాత్రి ఉత్సవాలు ప్రతీ ఏడాది దేవగిరి కొండపై భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. ఉత్సవాలను తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించి సమావేశంలో చర్చించారు. తాగునీటి సౌకర్యంతో భక్తులను అన్నదాన కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్ణయించారు. అదేవిధంగా భక్తులు దర్శనం చేసుకున్న సమయంలో భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అదనపు తహసీల్దార్ ఆనంద చరణ్ అన్నారు. ఈ ఏడాది భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అదేవిధంగా అందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుకు సమావేశంలో ప్రతిపాదించారు. త్వరలో కమిటీ వివరాలు వెల్లడిస్తామన్నారు. -
సెంచూరియన్ క్యాంపస్లో సేవ్ఫుల్ ఇండియా యాప్ ఆవిష్కరణ
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్లో శుక్రవారం ‘సేవ్ఫుల్ ఇండియా’ యాప్ను ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ కొత్త ఆవిష్కరణ వల్ల సామాజిక స్పృహ కలగడమే కాకుండా ప్రజలకు సామాజిక బాధ్యత కలిగేలా సేవ్ ఫుల్ ఇండియా యాప్ ఉంటుందని ఆస్ట్రేలియాకు చెందిన కిం మ్యాక్ డోనల్ అన్నారు. మనం కావాల్సిన దానికంటే ఎక్కువ ఆహారాన్ని వండి తర్వాత పారవేయడం కంటే వాటిని పేదలకు పంచడం, ఇంకా మిగిలితే కంపోస్ట్ చేయడం ద్వారా మనకు బాధ్యతాయుత స్థిరత్వం వస్తుందని యాప్ తయారుచేసిన ఆస్ట్రేలియా వాసులు తెలిపారు. యాప్ ఆవిష్కరణ ప్రారంభంలో ఆస్ట్రేలియాకు చెందిన మైక్ చట్టర్, మార్క్ హెల్డ్, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సునీతా పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం కూడా 2026 మార్చి 12న సేవ్ఫుల్ ఇండియా యాప్ను అధికారికంగా ఆవిష్కరిస్తారని కిం మ్యాక్ డోనల్ అన్నారు. -
మహాత్మా గాంధీజీ ఆదర్శాలు చిరస్మరణీయం
భువనేశ్వర్: జాతిపిత మహాత్మాగాంధీ ఆదర్శాలు సదా చిరస్మరణీయమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి నివాళులర్పించారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. గవర్నర్తో శాసన సభ స్పీకర్ సురమా పాఢి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర విశిష్ట ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యం, అహింస, దేశ సేవ అనే గాంధీజీ ఆదర్శాలకు పట్టం గట్టేందుకు నిబద్ధతతో కృషి చేస్తామని ప్రముఖులు సామూహిక సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.హాస్టల్ భోజనంలో పురుగులు భువనేశ్వర్: స్థానిక బీజేబీ కళాశాల హాస్టల్లో విద్యార్థులకు పంపిణీ చేస్తున్న భోజనంలో పురుగులు తేలుతున్నాయి. ఈ పరిస్థితిపై విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. హాస్టల్ సూపరింటెండెంట్ దృష్టికి ఈ విషయం తీసుకుని వెళ్లినా ప్రయోజనం శూన్యంగా పరిణమించిందని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో భోజనంలో పురుగులు తేలుతున్న విషయమై కళాశాల ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు.రోడ్డు ప్రమాదంలో డ్రైవర్కు గాయాలు భువనేశ్వర్: భువనేశ్వర్–ఖుర్ధా జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టొమాండో ప్రాంతం గోహిరియా చౌరస్తా సమీపంలో కంటైనర్ ట్రక్కు తారు తీసుకెళ్తున్న ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉన్నత చికిత్స కోసం క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమాన్యత దిగజారడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సంఘటనతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తారు తీసుకెళ్తున్న ట్యాంకర్లో వస్తువులు జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా తుల్లడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. టొమాండో పోలీసులు మరియు సహాయక బృందాలు సంఘటనా స్థలంలో ఈ పరిస్థితిని తొలగించి వాహనాల రవాణా పునరుద్ధరించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది. మార్చి 2 నుంచి అగ్ని గంగమ్మ జాతర రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న కొరాపుట్ జిల్లా నీలావడిలో వెలసి ఉన్న అగ్ని గంగమ్మ అమ్మవారి జాతర మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమవ్వనుందని ఆలయ కమిటీ సభ్యులు ప్రకటించారు. తొమ్మిది రోజుల పాటుగా జరిగే ఈ జాతరను తిలకించేందుకు అటు ఆంధ్ర, ఇటు ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు వేల సంఖ్యలో హాజరవుతారు. ప్రతీ ఏడాదిలా ఈసారి కూడా అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది. -
ఎమ్మెల్యేల జీతాలు తగ్గింపు
భువనేశ్వర్: రాష్ట్రంలో శాసన సభ సభ్యుల జీతభత్యాలు కుదించే అవకాశం ఉందని ఎమ్మెల్యే జీతాల కమిటీ చైర్మన్ భాస్కర్ మొఢై తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యేల జీతభతాల తగ్గింపు కోసం ముఖ్యమంత్రికి ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 9న శాసన సభలో ఎమ్మెల్యేల జీతభత్యాల పెంపు బిల్లు ఆమోదం పొందింది. ఎమ్మెల్యేల కనీస జీతం రూ. 3 లక్షల 45 వేలుగా ప్రకటించారు. ఒకేసారి ప్రజా ప్రతినిధుల జీతం 3 రెట్లు పెంచారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యేల జీతభత్యాల పెంపు పునఃపరిశీలించాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. జీతాల సమస్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని విపక్ష బిజూ జనతా దళ్ తెలిపింది. జీతాల బిల్లు ఆమోదించబడింది కానీ తర్వాత ఆగిపోయింది. ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా ఈసారి ముందస్తుగా చర్చిస్తుందని బీజేడీ ఎమ్మెల్యే మనోహర్ రణధరి ఆశాభావం వ్యక్తం చేశారు. జీతాల పెంపు గురించి బిల్లు సభ ఆమోదించిన తర్వాత పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దాశరథి గొమాంగో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం బిల్లును మళ్లీ అసెంబ్లీకి ఎందుకు తీసుకువస్తుందని ఆయన ఎదురు తిరిగారు. రాయగడ: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్ మేనేజర్ చిత్తరంజన్ మల్లిక్ అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్వనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో అధ్యక్షతన జరిగిన వ్యవస్థాపక ప్రోత్సాహక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. యువత ఉద్యోగాల గురించి ఎదురుచూసి తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవడం కంటే, స్వయం ఉపాధి మార్గాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంపై యువత ఆసక్తి కనబర్చాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, యువ పారిశ్రామికవేత్తలు ఎ.గోవిందరావు, నరీన్ కుముంధాన్ తదితరులు పాల్గొన్నారు. -
పౌరహక్కుల సంఘం నేతల సమావేశం
పర్లాకిమిడి: స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపతి రాయ్ జయంతి సందర్భంగా పర్లాకిమిడి ప్యాలస్లో యుటెక్ కంప్యూటర్ కేంద్రంలో భారతీయ పౌరహక్కుల సంఘం సమావేశం జరిగినది. ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా అధ్యక్షత వహించగా.. స్వాగత ఉపన్యాసం మానవహక్కుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఎల్.కె.పాఢి, జిల్లా కార్యదర్శి హరిమోహన్ పట్నాయక్ వ్యవహారించారు. సమావేశంలో పౌరహక్కులు, వాటి ఉల్లంఘించిన అధికారులపై తీసుకోవాల్సిన చర్యలపై రాజేష్ కుమార్ మిశ్రా వివరించారు. ఈ సందర్భంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ప్రశంసాపత్రాలు, ఽఐడీ కార్డులను మిశ్రా అందజేశారు. సంఘ సభ్యులు లోకనాథ మిశ్రా, సంగ్రాం మహారాణా, సుభ్రత్ కుమార్ మహారాణ సహకరించారు. గుర్తింపుకార్డులు అందజేస్తున్న ప్రతినిధులు -
సంక్షేమ పథకాలు సకాలంలో పూర్తిచేయాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని ఆరోగ్య పథకాలు, అంబులెన్స్ సేవలు ప్రతి గ్రామపంచాయతీలో ప్రజలకు అందించేందుకు పీహెచ్సీలు, సామాజిక ఆరోగ్యకేంద్రాల అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎలక్ట్రానిక్, వ్యాపారశాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుసాని సమితి కెరండీ పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ల కొరత తీర్చేందుకు పీజీ చదివిన ఎంబీబీఎస్ డాక్టర్లను నియామకాలు జరుపుతామని అన్నారు. అనంతరం మంత్రి జిల్లా కలెక్టరేట్ హాలులో ఉన్నతాధికారులతో వివిధ పథకాలపై సమీక్షించారు. సమావేశంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మోహానా ఎమ్మెల్యే దాశరథి గొమాంగో, జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగార్వాల్, జిల్లా ముఖ్య వైద్యాధికారి, డీహెచ్వో డాక్టర్ ఎం.ఎం.ఆలీ, ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ, జిల్లా పరిషత్ అధికారి పృథ్వీరాజ్ మండళ్ పాల్గొన్నారు. జిల్లాలో సుభద్ర, మంచినీటి పథకాలు గ్రామీణ ప్రాంతాలకు అందించాలని అన్నారు. దీని కోసం మెగా పైప్ లైన్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాల్లో సకాలంలో ధాన్యం సొమ్ములు జమచేయాలని, పీడీఎస్ రైస్ కూడా లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీకి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న విభిన్న పథకాలు పంపిణీ చేయాలని అన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అనుప్ పండా, రోడ్లు–భవనాల శాఖ ఎస్ఈ అభిషేక్ శెట్టి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన
పర్లాకిమిడి: ట్రాన్స్జెండర్స్, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై స్థానిక జిల్లా పరిషత్ హాలులో గురువారం ఉదయం జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవుళో ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జాతీయ లీగల్ ఎయిడ్ హెల్ప్లైన్ ‘15100’కు డయల్ చేసి ఉచిత న్యాయ సలహా పొందవచ్చని లీగల్ సర్వీసెస్ కార్యదర్శి బిమల్ రవుళో అన్నారు. కార్యక్రమంలో అదాలత్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార మిశ్రా, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు అలోక్ కుమార్ బోస్, న్యాయవాది ఇతిశ్రీ మహాపాత్రో, అఖిల భారత యువజనసేన సమితి అధ్యక్షులు కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొని వివిధ చట్టాలపై చర్చించారు. -
గుప్తేశ్వర్లో మహాశివరాత్రి ఉత్సవాలకు సన్నాహాలు
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో గల ప్రసిద్ధ శివ క్షేత్రం గుప్తేశ్వర్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిపేందుకు గుప్తేశ్వర ఉత్సవ కమిటీ సమావేశమైంది. జయపురం మున్సిపాలిటీ కౌన్సిల్ సభాగృహంలో జయపురం సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యారెడ్డి అధ్యక్షతన జరిగిన గుప్తేశ్వర్ మహాశివరాత్రి ఉత్సవాల సన్నాహక సమావేశంలో పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు కాబట్టి శాంతి భద్రతల రక్షణకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని సబ్ కలెక్టర్ పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. శివరాత్రి జాగరణ సమయంలో సాయంత్రం 7 నుంచి ప్రధాన గేటు మూసి వేసేందుకు నిర్ణయించారు. అర్ధరాత్రి 12 గంటలకు హరిహర భేట్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. స్వామి ప్రత్యేక దర్శనం కోసం రూ.500 వసూలు చేయాలని, బస్సు పార్కింగ్ కోసం రూ.100 చార్జీ వసూలు చేయాలని, జయపురం, ఇతర ప్రాంతాల నుంచి గుప్తేశ్వర్ వచ్చే బస్సులలో భక్తుల నుంచి గతంలో లాగనే చార్జీలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శివరాత్రి మూడు దినాలు రాత్రులందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయంచారు. సమావేశంలో మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, జయపురం సబ్డిబిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కాశ్యప్, జయపురం తహసీల్దార్ సబ్యసాచి జెన, అదనపు తహసీల్దార్ చిత్తరంజన్ పట్నాయిక్, శుభ లక్ష్మీ నాయిక్, ఏఎఫ్ఓ సురేష్ కుమార్ బారిక్ తదితరులు పాల్గొన్నారు. -
ఒడిశా శతాబ్ది ఉత్సవాలపై సెమినార్
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ‘సామాజిక విజ్ఞానంలో ఒడిశా శతాబ్ది కాల వికాశం, ప్రయోగం, సమస్యలపై జాతీయ సెమినార్ నిర్వహించారు. కొత్త విద్యా నీతిలో ప్రాంతీయ భాష ప్రాధాన్యత, మాతృ భాష వ్యవహారంపై అఽతిథులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ ఫిలాసఫీ అధ్యాపకులు కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో రచించిన పుస్తకం ‘ఫిలాసఫీ ఆఫ్ విట్జెనిస్ట్యిన్, లేంగ్వేజి, లాజిక్ అండ్ మైండ్’ని అతిథులు ఆవిష్కరించారు. విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఫ్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర, విశ్వవిద్యాలయ రిజిస్టార్ మహేశ్వర చంధ్ర నాయిక్,సి.ఎస్.టి.టి ప్రభుత్వ కమీషనర్ డాక్టర్ సంతోష్ కుమార్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో మొదలగు వారు పాల్గొన్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో నెహ్రూ యువకేంద్రం వేదికగా ఈనెల 31వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తు న్నట్టు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలి పారు. జాబ్మేళాలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కంపెనీ, జయభేరి ఆటోమోటివ్ సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నా రు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన సీ్త్ర, పురుషులు అర్హులన్నారు. కనీసం టెన్త్క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటలకు తమ బయోడేటా, ఆధార్కార్డు, సర్టిఫికెట్లు తీసుకురావాలని సుధ సూచించారు. అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర దేవదాయ శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజాశంకర్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు చేయించారు. ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలో ఆర్పీఎఫ్ బ్యారెక్స్ పక్కన సరుబుజ్జిలి మండలం, సవలాపురం జంక్షన్కు చెందిన కొల్ల సింహాచలం (58) మృతి చెందారు. మృతుడు బుధవారం ఉదయం ఆ ప్రాంతానికి వాష్ రూమ్ కోసం వెళ్లి అక్కడే పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు 108కు ఫోన్ చేసి చెప్పగా వారు వచ్చి పరిశీలించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారణ చేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ విషయం రైల్వే పోలీసులు దృష్టికి వెళ్లినప్పటికీ ఆ ప్రాంతం ఆమదాలవలస పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుందని వారు పట్టించుకోకుండా విడిచిపెట్టినట్లు తెలిసింది. పోలీసులకు సమాచా రం రావడంతో గురువారం ఎస్ఐ ఎస్.బాలరాజు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి మృతుని జేబు లో ఉన్న ఆధార్ కార్డు ద్వారా సమాచారం తెలుసుకొని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీమ్తో పరిశీల న జరిపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అభివృద్ధి చెందిన భారత్ దిశగా ధనిక్ భారత్ విద్యా ఉద్యమం జరుగుతోందని ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత అన్నారు. ధనిక్ అనే భావన కేవలం ఆర్థిక సంపదకే పరిమితం కాకూడదని అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆమె గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సులువుగా ఐఏఎస్ ఎలా అవ్వాలనే దానిపై అవగాహన కల్పించారు. ఒత్తిడి లేని విద్య ద్వారానే అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడం జరుగుతుందన్నారు. క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, జీవిత లక్ష్యం స్పష్టత పెంపొదించవచ్చన్నారు. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కేవలం చదువు మాత్రమే కాదని మేథస్సు నైతికత, భావోద్వేగ పరిపక్వత, జీవణ నైపుణ్యాల సమగ్ర వికాశమే ధనిక భారత్ లక్ష్యమన్నారు. -
భార్యను హతమార్చిన భర్త
రాయగడ: కుటుంబ కలహాలతో పడుకుని ఉన్న భార్యను గొడ్డలితో నరికి భర్త హతమార్చిన ఘటన జిల్లాలోని కుంభికోట పోలీస్స్టేషన్ పరిధి నకిటి పంచాయతీ ఇర్పిపూట్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలు మాలతి మెలక (51)గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. రఘు మెలక, మాలతీ మెలకలు భార్యాభర్తలు. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య చిన్న గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో బుధవారం రాత్రి గొడవపడ్డారు. అనంతరం నిద్రలో ఉన్న తన భార్య మాలతి తలపై రఘు గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రగాయాలకు గురైన ఆమె సంఘటన స్థలం వద్దే మృతి చెందింది. కుటుంబీకులు ఈ విషయమై కుంభికోట పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఎస్డీపీవో గౌరహర సాహు, రాయగడ ఐఐసీ ప్రసన్న కుమార్ బెహరలు చేరుకున్నారు. అనంతరం దాడికి పాల్పడిన మృతురాలి భర్త రఘును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అపవిత్ర రాజకీయంపై ఆధ్యాత్మిక విజయం
పాతపట్నం: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ కుట్రలేనని తేలిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. సీబీఐ దర్యాప్తులో నెయ్యిలో జంతువు ల కొవ్వు కలవలేదని తేలడంతో, సత్యం గెలిచినందుకు కృతజ్ఞతగా గురువారం స్థానిక శ్రీ నీలమణిదుర్గ ఆలయంలో పార్టీ నాయకులతో కలిసి రెడ్డి శాంతి అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో వాడిన నెయ్యిలో ఎలాంటి అపవిత్రత లేదని శాసీ్త్రయంగా తేలిపోయిందన్నారు. తన పాలనలోని వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఈ లడ్డూ డ్రామా ఆడారని, దానికి పవన్ కల్యాణ్ వత్తాసు పలకడం దురదృష్టకరమని విమర్శించా రు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు ఉర్లాన బాలరాజు, పార్టీ అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, మీసాల వెంకట రామకృష్ణ, పెనుమజ్జి విష్ణుమూర్తి, పోలాకి జయమునిరావు, గండివలస ఆనందరావులు, మాజీ ఎంపీపీ బాలరాజు, నాయకులు రెడ్డి రామారావు, ఎరుకొల వెంకటరమణ, మడ్డు తాతయ్య, ఏవీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
కమ్యూనిస్టు నేతల నిధుల సేకరణ
జయపురం: భారతీయ కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం, నిధుల సేకరణ కొరాపుట్ జిల్లా నాయకులు గురువారం నుంచి ప్రచారం చేపట్టింది. కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా కొరాపుట్ సబ్డివిజన్ దసమంతపూర్ సమితిలోను, జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితిలోను ప్రచారం ప్రారభించారు. కొట్పాడ్ సమితిలో బతాసన గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయంత్ దాస్, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రమోద్ కుమార్ మహంతి, కొరాపుట్ జిల్లాపార్టీ కార్యదర్శి రామకృష్ణ దాస్, జోనల్ కార్యదర్శి కురుమునాథ్ భొత్ర, పార్టీ నేతలు పూర్ణ చంద్ర సురు, గోవర్ధన్గోండ్, విఘ్నరాజ్ అమనాత్య పాల్గొన్నారు. -
వారధి.. భయపెడుతున్నది
మేఘవరం పంచాయతీలో బొరిగిపేట, మేఘవరం గ్రామాలకు వెళ్లే మార్గంలో వంశధార ప్రధాన కాలువ పై ఉన్న వంతెనలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ఆయా గ్రామాల ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. టెక్కలి నుంచి బొరిగిపేట గ్రామానికి వెళ్లే మార్గంలో వంశధార ప్రధాన కాలువ పై ఉన్న వంతెన నిర్మాణం చేపట్టి దశాబ్దాలు గడిచాయి. ఇదే మార్గంలో అనేక గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. మరో వైపు పదికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరడం, అంతే కాకుండా భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే మేఘవరం గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వంతెన సైతం ఇదే దుస్థితిలో ఉంది. ఇప్పటికై నా పాలకులు స్పందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – టెక్కలి -
అవస్థల నడుమ..
శ్వేతగిరిపై సంతాన వేణుగోపాలుడి సంబరం అంబరాన్ని తాకింది. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా కొండపై నుంచి భక్తజనధార జీవనదిలా కదిలి వంశధారలో లీనమైంది. చక్రతీర్థ స్నానం సందర్భంగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న నదికి రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలుడితో పాటు లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవమూర్తులు పల్లకిలో కన్నుల పండువలా కదిలి వెళ్లాయి. వేలాదిగా భక్తులు అక్కడే స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. భక్తులను అదుపు చేయలేకపోవడం, నదిలో బారికేడ్లు సక్రమంగా నిర్వహించకపోవడం వంటి లోపాలు కనిపించాయి. జాతరలో తోపులాటలూ తప్పలేదు. గుడి నుంచి కింద వరకు ఉన్న 300 మెట్లు నిండా భక్తులతో నిండిపోవడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. క్యూలైన్ సమీపంలోని మెట్లు వద్ద ఆరుగురు వృద్ధులు కింది పడిపోవడంతో హాహాకారాలు మిన్నంటాయి. ఇన్ని అవరోధాలు దాటుకుని భక్తులు స్వామిని దర్శించి తరించారు. – గార శాలిహుండం యాత్రలో సారవకోట గ్రామానికి చెందిన తూలుగు కాంతమ్మ మెట్ల మార్గం వద్ద కుప్పకూలింది. పోలీసులు వెంటనే ప్రాథమిక చికి త్స అందించగా, సమీపంలోనున్న కిమ్స్ సిబ్బంది వైద్య చికిత్స అందించారు. అరగంట తర్వాత స్వా మి దర్శనం చేయాలని పట్టుపట్టగా ఇప్పటికీ 90 బై 60 బీపీ ఉందని వెళ్లడం అంత మంచిది కాదని తెలిపారు. అదేవిదంగా కొండ మీద రాళ్ల దారుల గుండా ఇష్టానుసారంగా నడిచిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. తోపులాటలో మరికొంత మందికి స్వల్ప అస్వస్థతకు గురికాగా, పలు సంస్థల ఆరోగ్య శిబిరాల వద్ద చికిత్స పొందారు. మూడేళ్ల చిన్నారికి ఆరోగ్య సమస్య రావడంతో వెంటనే చికిత్స చేశారు. ● తీర్థస్నానం తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. ● గుడి నుంచి కింద వరకు ఉన్న 300 మెట్లు నిండా భక్తులతో నిండిపోవడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. ● క్యూలైన్ సమీపంలోని మెట్ల వద్ద ఆరుగురు వృద్ధులు కింద పడిపోవడంతో హహాకారాలు మిన్నంటాయి. తొక్కిసలాటలో పోలీసులు కూడా ఇరుక్కున్నారు. ● భక్తుల తాకిడితో ఉదయం 10.30 తర్వాత ఈ యాత్రకు కేటాయించిన బస్సులు కూడా ఆపేశారు. ● వంశధార నుంచి నడిచివచ్చిన భక్తులు ఎక్కువమంది ఉపవాసం ఉంటారు. కొండపైకి వచ్చాక తాగునీరు పంపిణీ ప్రారంభించలేకపోవడంతో భక్తులు మండిపడ్డారు. ● దాదాపు రెండు లక్షల మంది భక్తులకు ఒక్క మరుగుదొడ్డి కూడా ఏర్పాటు చేయలేదు. -
తవుడు ట్రక్కు బోల్తా
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి శుఖ్రి ఘాట్ రోడ్డులో తవుడు ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తృటిలో బయట పడ్డాడు. ఒక తవుడు లోడు ట్రక్కు జాజ్పూర్ నుంచి రాంచీ– విజయవాడ 326 జాతీయ రహదారి మీదుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయవాడ కు వెళ్తుండగా బొయిపరిగుడ సమితి శుఖ్రి ఘాట్ పై హఠాత్తుగా బ్రేక్ ఫెయిల్ అయింది. డ్రైవర్ ట్రక్కును అదుపు చేయలేక పోవటంతో అది బోల్తా పడింది. ఈ ప్రమాదం సమాచారం అందిన వెంటనే బొయిపరిగుడ పోలీసులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. -
నివేదిక సమర్పణ
ముఖ్యమంత్రికి 6వ రాష్ట్ర ఆర్థిక సంఘంభువనేశ్వర్: ఆరో రాష్ట్ర ఆర్థిక సంఘం తుది నివేదికను లోక్ సేవా భవన్లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝికి సమర్పించారు. కమిషన్ చైర్మన్ డాక్టర్ అరుణ్ కుమార్ పండా ముఖ్యమంత్రికి నివేదిక ముఖ్యాంశాలను వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమీక్ష పోర్టల్ను ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ), కేంద్ర ఆర్థిక సంఘం (సీఎఫ్సీ) గ్రాంట్ల కింద రోడ్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఉద్యానవనాలు, ప్రజా వినియోగాలు వంటి ప్రాజెక్టుల అమలు పురోగతి గురించి ఈ పోర్టల్ తాజా సమాచారాన్ని అందిస్తుంది. పౌరులు, ఎన్నికై న ప్రతినిధులు లేదా ఎవరైనా htt pr:// ramikrh ya.odirha.gov.in లింక్ ద్వారా పోర్టల్ను యాక్సెస్ చేయవచ్చు. ప్రాజెక్టుల అమలు పురోగతిని పర్యవేక్షించవచ్చు. సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక ప్రమాణాలను మెరుగుదల పంచాయతీ స్థాయి పటిష్టత, ప్రజల జీవన ప్రమాణాల పురోగతి, ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతం యొక్క పరిస్థితిని మెరుగుపరిచి సంపన్న ఒడిశా సంకల్పం బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. కమిషన్ సమర్పించిన నివేదికలో స్థానిక సంస్థల ఆర్థిక మౌలిక సదుపాయాలను నిర్ధారిత ప్రణాళిక ఆధారిత వ్యవస్థ ద్వారా బలోపేతం చేయడంపట్ల నివేదిక దృష్టి సారించింది. సమానత, ప్రాంతీయ అసమానతలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల విభిన్న అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని నివేదిక ప్రత్యేకంగా సూచించింది. స్థానిక సంస్థల సమగ్ర అభివృద్ధికి కమిషన్ ఆర్థిక మరియు ఆర్థికేతర సిఫార్సులను చేసింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, అభివృద్ధి కమిషనర్ దేవరంజన్ కుమార్ సింగ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి శాశ్వత్ మిశ్రా, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజీవ్ మిశ్రా, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక సమాచార శాఖ కార్యదర్శి విశాల్ దేబ్, పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ కార్యదర్శి గిరీష్ ఎస్. ఎన్. 6వ రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) సభ్యులు ప్రొఫెసర్ అసిత్ రంజన్ మహంతి, డాక్టర్ బిభు ప్రసాద్ నాయక్, సభ్య కార్యదర్శి డాక్టర్ సత్య ప్రియాంక రథ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సభ్యుడు, డైరెక్టర్ అరిందం డకువా కార్యక్రమానికి హాజరయ్యారు. -
రాయగడలో కలరా..?
● నీటి నమూనాలను సేకరించిన వైద్య బృందం ● పాజిటివ్ కేసులు లేవని వెల్లడి రాయగడ: పట్టణంలో కలరా వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. స్థానిక కస్తూరీనగర్, ఇందిరానగర్, సీఆర్పీఎఫ్ క్యాంప్ సమీపంలోని పలు ప్రాంతాల్లో కలరా వ్యాపించినట్లు సమాచారం. కలరా వ్యాధి వ్యాపించిన వారు స్థానిక ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్తున్నారు. అయితే రోగులకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు వైరల్ జ్వరాలుగా గుర్తిస్తున్నారు. అయితే కలరా వ్యాపించడంతో కొంతమంది వైద్యులను సంప్రదించకుండా నాటు వైద్యంపై ఆధారపడుతున్నట్లు తెలిసింది. కస్తూరీనగర్, ఇందిరానగర్ వంటి ప్రాంతాల్లో కలరా వ్యాధి 10 నుంచి 20 ఏళ్ల వయస్సుల్లో ఉన్నవారికి వ్యాపించినట్లు ఆయా ప్రాంతాలకు చెందినవారు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న వైద్య బృందం సభ్యులు రుమా మహాపాత్రో, డాక్టర్ శ్రీనివాస్ సాహు, డాక్టర్ సంగ్రామ్ కేశరి నిమాల నేతృత్వంలొ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటా తిరిగి వివరాలు సేకరించారు. వారు తాగేందుకు వినియోగిస్తున్న నీటి నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా డీపీహెచ్వో మహాపాత్రో మాట్లాడుతూ నీటి నమూనాలను సేకరించడం పూర్తయ్యిందని, వాటిని ల్యాబ్కు పంపించి, పరీక్షలు నిర్వహించిన తర్వాత వచ్చే ఫలితాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి కలరా వ్యాధికి సంబంధించి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ కలరా వ్యాధి వ్యాపించడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అంగరంగ వైభవంగా వేంకటేశ్వర దేవాలయ రజతోత్సవం
కొరాపుట్: వేంకటేశ్వర దేవాలయం రజతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒడిశా–తెలంగాణా రాష్ట్రాలకు త్రికోణ సరిహద్దులో చత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్ పట్టణంలో తిరుపతి బాలాజీ మందిరం 25వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 తేదీన ప్రారభమైన ఈ వేడుకలు ఫిబ్రవరి 1వ తేదీన ముగియనున్నాయి. వేలాది మంది తెలుగు ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. కోటి లలితా పారాయణ నిర్వహించారు. స్వామికి భారీ పుష్ప యాగం నిర్వహించారు. స్వామి తిరువీధిలో ఆ రాష్ట్ర మంత్రి కేదార్ కశ్యప్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న ఉత్సవాలు ముగింపు సందర్భంగా భారీ ఆనంద బజార్ నిర్వహిస్తున్నట్లు దేవాలయ ట్రస్టీ శ్రీనివాస్ మద్ది ప్రకటించారు. -
ఆడుకుందామని వెళ్లి.. ఇసుకలో పాతిపెట్టి
రాయగడ: ఆడుకుందామని నది వద్దకు తీసుకువెళ్లి ఇసుకలో పీకలోతు వరకు పాతిపెట్టిన అనంతరం దాన్ని వీడియో చిత్రీకరించి పైశాచిక ఆనందాన్ని పొందిన ఆరుగురు పిల్లలను గుణుపూర్ ఆదర్శ పోలీసులు గురువారం నాడు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ ఘటన జిల్లాలోని గుణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మెరింగి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లొకి వెళితే.. ఈ నెల 25 వ తేదీన మేరింగి గ్రామంలొ గల అజ్జు సబర్, మిటు సబర్, శుక్లాంగ సబర్ లతొ పాటు మరో ముగ్గురు పిల్లలు అదే గ్రామంలో ఉంటున్న ఒక ఆరేళ్ల కుర్రాడిని సమీపంలో గల నది వద్దకు తీసుకువెళ్లారు. నదిలో స్నానం చేసిన అనంతరం అంతా కలసి ఆ కుర్రాడిని ఇసుకలో గుంత తీసి పీకలోతు వరకు పాతి పెట్టారు. అలా పాతిపెట్టిన అనంతరం దాన్ని వీడియో చిత్రీకరించారు. ఊపిరాడటం లేదు నన్ను విడిచిపెట్టండని ఆ కుర్రాడు మొర పెట్టుకున్నా వారు అంగీకరించలేదు. అయితే ఇదే విషయం ఇంకెవరికీ చెప్పకూడదు, ఒకవేళ చెబితే ఇదేతరహా మరోసారి గుంతలో వేసి కప్పేస్తామని బెదిరించారు. అందుకు ఆ కుర్రాడు తాను ఎవరికీ చెప్పనని అనడంతో ఆరుగురు కలసి గుంతలొ పూడ్చిన వాడిని తిరిగి బయటకు తీశారు. ఈ వీడియో వైరల్ కావడంతో చూసిన బాధితుని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలోని పద్మపూర్ సమితి ఖెదాపడ గ్రామంలొ ఉంటున్న రమేష్ సొబొరొ అనే వ్యక్తికి చెందిన ఆరేళ్ల కొడుకు తన తాతగారు ఉంటున్న మేరింగిలో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో తన కొడుకును ఇసుకలో పూడ్చి పైశాచికత్వం పొందుతున్న వీడియోను చూసిన రమేష్ గురువారం నాడు గుణుపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు అందుకు సంబంధించి అజ్జు సబర్, మిటు సబర్, శుక్లాంగ్ సబర్ అనే ముగ్గురు యువకులతో పాటు మరో ముగ్గురుని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. తన కొడుకును ఇలా ఇసుకలో పూడ్చి పైశాచిక ఆనందాన్ని పొందిన వారిపై పొలీస్ స్టేషన్లొ ఫిర్యాదు చేశానని బాధితుడి తండ్రి రమేష్ సబర్ తెలియజేశారు. ఈ నెల 25 వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుందని అదే రోజు తన కొడుకు ఇంటికి చాలా ఆలస్యంగా వెళ్లాడని చెప్పాడు. అంతవరకు అంతా వెతికారని వివరించాడు. ఇంటికి వచ్చినా ఎవ్వరికీ తనకు జరిగిన సంఘటన గురించి సంబంధించి చెప్పలేదని అన్నారు. -
భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు
రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణవేంకటేశ్వర ఆలయంలొ భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని గురువారం విశేష పూజలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారికి సుప్రభాతసేవ, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమా సత్యసత్యనారాయణ వ్రత పూజలు కూడా చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. పర్లాకమిడిలో.. పర్లాకిమిడి: భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని కోమటివీధి శ్రీవేంకటేశ్వర ఆలయంలో గరుడ వాహానంపై తిరువీధి ఉత్సవం జరిగినది. ఈ ఉత్సవంలో వేంకటేశ్వర స్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు (రాజమండ్రి) డాక్టర్ పి.భారతీ రామారావు దంపతులు, పి.మంగమ్మ పాల్గొన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని భద్రంకృష్ణ మోహనా చార్యులు, భద్రం శ్రీనివాసాచార్యులు, చక్రధర్ నిర్వహించారు. శ్రీవారి వార్షిక కల్యాణ మహోత్సవాలు రాత్రి ఎనిమిది గంటల సమయలో జరిగాయి. అలాగే కేవుటి వీధి శ్రీ ప్రసన్న వేంకటేశ్వర ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి తిరువీధి ఉత్సవం జరిపారు. ఈ ఉత్సవంలో ప్రధాన అర్చకులు ఎ.రాజగోపాలచారి పాల్గొన్నారు. అలాగే రాజవీధి జగన్నాథ మందిరం వద్ద ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని భక్తులు దీపారాధన చేసి బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వాములను దర్శించుకున్నారు. ఈ రోజు నుంచి ప్రత్యేక యజ్ఞం ప్రారంభించారు. -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
రాయగడ: కళ్యాణ సింగుపూర్ పరిధిలోని బుడగుడ మండీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్నదాతలు కదం తొక్కారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ పేరిట బుడాగుడ ల్యాంప్ డైరెక్టర్కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. బుడాగుడ మండీలో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయని, రోజులు గడుస్తున్నా ఇంతవరకు టోకెన్లు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం విక్రయించి పదిహేను రోజులు కావస్తున్నా ఇంతవరకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని పలువురు మరికొందరు వాపోయారు.


