breaking news
Odisha News
-
గుప్తేశ్వరంలో కొనసాగుతున్న రద్దీ
కొరాపుట్: దండకారణ్యంలో వెలసిన సహజ సిద్ధ పుణ్యక్షేత్రం గుప్తేశ్వరంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రావణ మాసం సోమవారం శివుడిని దర్శించుకోవడానికి బోల్ భం భక్తులు పోటెత్తారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మంగళవారం ఉదయం వరకు వందలాది భక్తులు గుప్తేశ్వరం నుంచి బయటకు రాలేకపోయారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వందలాది వాహనాలు రామగిరి–గుప్తేశ్వరం మధ్య నిలిచిపోయాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా వేలాది జనం ముందు నిలువ లేక పోయాయి. సుమారు 40 వేల మంది పైగా భక్తులు తరలి వచ్చారు. దాంతో భక్తులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. పాత్రో పుట్ సమీపంలో బ్రిటిష్ వంతెన వద్ద పుణ్య జలం కోసం పూజలు చేశారు.వర్షం వల్ల ఆ ప్రాంతం బురదగా మారింది. జాతీయ రహదారి దిగి నది వద్దకు వెళ్లడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక మంది రాతి మెట్లు ఎక్కతూ కిందకు పడి పోయారు. రామగిరి నుంచి గుప్తేశ్వరం వరకు మార్గంలో విద్యుత్ స్తంభాలు లేవు. దాంతో రాత్రి పూట నడిచే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు సమాజ సేవకులు కిరోసిన్ దీపాలు చెట్లకి అమర్చారు. ఆ వెలుగు లోనే వందలాది మంది భక్తులు నానా బాధలు పడుతూ పాద యాత్ర చేశారు. మరో వైపు వేలాది మంది కాలకృత్యాలు తీసుకోవడానికి శబరి నది వద్దకు రావడం తో ఆ ప్రాంతం దుర్గంధంగా మారింది. సీ్త్రలు కాలకృత్యాల కోసం అనేక బాధలు పడ్డారు. గుప్తేశ్వరం దర్శించుకోవడానికి గుహ గుండా దిగే మార్గం చాలా చిన్నది. దాంతో గుహ బయట నంది విగ్రహం వద్ద భక్తులు తోపులాటకి గురయ్యారు. రానున్న సోమవారం వేలాది మంది భక్తులు గుప్తేశ్వరానికి రానున్న సందర్భంలో ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. -
ఇంతింటా ఆదాయం..!
● కొండ చీపుర్ల తయారీతో ఆర్థిక స్వావలంబన ● ఆదర్శంగా నిలుస్తున్న సీతానగరం మహిళలు ● ప్రోత్సహిస్తే మరింత వృద్ధి సంతబొమ్మాళి: చీపురు కడుతున్న చేతులు.. తమ కుటుంబాల భవిష్యత్ను తీర్చిదిద్దుతున్నాయి. ఒకప్పుడు ఒక్కరి తో మొదలైన కొండ చీపుర్ల తయారీ.. ఇప్పుడు పలువురి మహిళలకు ఆదాయ వనరుగా మారింది. మండలంలోని సీతానగరం మహిళలు ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకు ని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. గ్రామానికి చెందిన బత్సల ధనలక్ష్మి దగ్గర కొండ చీపుర్ల తయారీని నేర్చుకొని, సొంతిట్లోనే వాటిని తయారు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కుటీర పరిశ్రమ ఏర్పాటుతో స్వశక్తిపై జీవిస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ.. మగవారికి ఏమాత్రం తీసుపోని ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. సీతానగరం గ్రామానికి చెందిన బత్సల ధనలక్ష్మి పన్నెండేళ్ల క్రితం బతుకుతెరువు కోసం అండమాన్ వలస వెళ్లింది. అక్కడ ఉపాధి నిమిత్తం పలు ప్రాంతాల్లో తిరిగి ఒక కుటీర పరిశ్రమలో మూడు నెలలపాటు చీపుర్ల తయారీ నేర్చుకుంది. అనంతరం స్వగ్రామానికి తిరిగి వచ్చి చీపురుతోనే జీవనాధారం పొందాలనుకుంది. తన భర్త సోమేశ్వరరావు ప్రోత్సాహంతో సొంత గ్రామంలోనే దీనిని చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభించింది. మొదట్లో కాస్త పెట్టుబడి పెట్టి శ్రీముఖలింగం, మెళియాపుట్టి ప్రాంతాల నుంచి వీటికి కావాల్సిన కుంచె, నార, తాడును తెచ్చి చీపుర్లు కట్టేది. అది చూసిన చుట్టుపక్కల మహిళలు ఆసక్తితో అమె ఇంటికి వెళ్లి అమెతో పాటు పనిచేస్తూ చీపుర్లు కట్టడం నేర్చుకున్నారు. అనతికాలంలోనే ఆ చీపుర్లుకు మంచి గిరాకీ లభించడంతో ఈ కుటీర పరిశ్రమ ఎంతో మందికి జీవనాధారంగా మారింది. స్వయం సహాయక సంఘాల రుణాలు, సీ్త్ర నిధి రుణాలతో స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన దిశగా మగువలు అడుగులు వేస్తున్నారు. గ్రామంలో 280 కుటుంబాలు ఉండగా.. ప్రస్తుతం 70కు పైగా కుటుంబాల మహిళలు చేతివృత్తిలా నిత్యం పని చేస్తుంటారు. ఒక చీపురు ధర రూ.70ల నుంచి రూ.100ల వరకు పలుకుతోంది. రోజుకు 20 నుంచి 30 చీపుర్లు సులువుగా కట్టి, ఖర్చులు పోను రూ.700లకు పైబడి సంపాదిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 150 మందికి పైగా చీపుర్లు తయారు చేస్తున్న మహిళలు ఉన్నారు. వీరు తయా రు చేసిన చీపుర్లు మంచి ఆకర్షణతో పాటు నాణ్యత గా ఉండడంతో బయట మార్కెట్ల్లో మంచి గిరాకీ ఏర్పడింది. వీటిని మన జిల్లాతో పాటు విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రానికి ఎగుమతి చేసి అమ్ముతుంటారు. సీజన్తో సంబంధం లేకుండా నిత్యం పెట్టుబడి పెట్టాల్సిన పరిశ్రమ కాబట్టి బయ ట నుంచి అప్పులు తెస్తే అర్థిక భారం అవుతుంది. అందువలన ఈ పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా తయారైన ఉత్పత్తులను ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్కెటింగ్ సదుపా యం కల్పించాలని విన్నవిస్తున్నారు. తద్వారా ఈ పరిశ్రమతో మరింత మందికి ఉపాధి కలిగి వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అండమాన్లోని ఒక కుటీర పరిశ్రమలో చీపుర్లు తయారు చేయడం నేర్చుకున్నాను. మా గ్రామంలో 150 మంది వరకు చీపుర్లు కట్టడం నేర్పించాను. ఇంటి వద్దనే ఉంటూ రోజువారి ఆదాయం సంపాదించుకుంటున్నాను. ఆసక్తిగా ఉన్న మహిళలను ప్రోత్సహించి నేర్పిస్తున్నాను. ఇంకా ఎవరికై నా ఆసక్తి ఉంటే చీపురు కట్టడం నేర్పిస్తాను. అవసరమైన ముడి సరుకుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో పెట్టుబడి గతం కంటే ఎక్కువ అయ్యింది. ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించాలి. – బచ్చల ధనలక్ష్మి, చీపురు తయారీదారు, సీతానగరం సీతానగరంలో చీపుర్లు కడుతున్న మహిళలకు పొదుపు సంఘాలు, సీ్త్ర నిధి ద్వారా తక్షణ రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాము. దీనిని అర్హులైన మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. గతంలో రెండు పర్యాయాలు శ్రీకాకుళంలో జరిగిన డ్వాక్రా బజారుకు మండలం నుంచి మహిళలు వెళ్లి చీపుర్లు అమ్మడం జరిగింది. – శ్రీనివాసరావు, వెలుగు ఏపీఎం, సంతబొమ్మాళి -
రఘునాథ పాణిగ్రాహికి గాన నివాళి
పర్లాకిమిడి: స్థానిక నగరపాలక హాల్లో మంగళవారం సాయంత్రం ప్రముఖ చలనచిత్ర గాయకులు పద్మశ్రీ రఘునాథ పాణిగ్రాహి 95 జయంతి ఉత్సవాన్ని ఒడిశా సంగీత నాటక అకాడమీ (భువనేశ్వర్), భక్తి నైవేద్యం సంస్థ ఆధ్వర్యంలో ఒడియా భాష, సంస్కృతి విభాగం ఆధ్వర్యంలో జరిగింది. ఈ నృత్య, సంగీత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్కలెక్టర్ అనుప్ పండా, అతిథులుగా దూరదర్శన్ కంఠశిల్పి రఘునాథ పాత్రో, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, ఆదర్శదాస్, తదితరులు హాజరయ్యారు. 1932 ఆగస్టు 10న గుణుపురం వద్ద లివురిగ్రామంలో పుట్టిన పండిత రఘునాథ పాణిగ్రాహి తెలుగు, తమిళ, ఒడియా భాషల్లో అనేక పాటలు పాడారు. తెలుగులో 1956లో వచ్చిన ఇలవేల్పు సినిమాలో ఓ గీతాన్ని పి.సుశీలతో కలిసి పాడారు. పండిత నీలమణి పాణిగ్రాహివద్ద సంగీతం నేర్చుకుని అనంతరం విజయనగరం సంగీత విద్యాలయంలో ప్రముఖ సంగీతవిద్యాంసులు ద్వారంపూడి వెంకయ్యనాయుడు సహాకారంతో పాఠశాలలో చేరారు. అనంతరం పండిత నరసింహా శర్మ, పండిత రఘునాథ దాస్ వద్ద సంగీత శిక్షణ అభ్యసించి అనతికాలంలో అనేక తెలుగు, ఒడియా భాషాల్లో చలనచిత్రాలకు పాటలు పాడారు. ఆయనకు 1968లో సురమణి సమ్మాన్, 1982లో ఫ్రాన్స్ ప్రభుత్వం గ్రాండ్ పిక్స్ ఆవార్డులు లభించాయి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం 2008లో జయదేవ్ సమ్మాన్ ఆవార్డు, కేంద్ర ప్రభుత్వం 2010లో పద్మశ్రీ ఆవార్డును రఘునాథ పాణిగ్రాహికి అందజేసినట్టు పండిత రఘునాథ పాత్రో తెలియజేశారు. ఆయన ప్రతిభకు గౌరవసూచకంగా భక్తి నైవేద్య సంస్థ, ఇతర గాయకులు ఒడిస్సీ సంగీతం, నృత్యం విభావరిని నిర్వహించారు. -
జాలర్లకు సిరులు కురిపించిన ఇలిసి చేపలు
భువనేశ్వర్: ఒడిశా, పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని దిఘా నదీ ముఖ ద్వారం వద్ద వల పన్నిన జాలర్లకు ఇలిసి (హిల్సా) చేపలు సిరులకు కురిపించాయి. మత్స్యకారుల వలలో 30 టన్నులకు పైగా హిల్సా చేపలు పడడంతో ఆనందం వెల్లివిరిసింది. మార్కెట్లో అధిక విలువ కలిగిన 30 టన్నులకు పైగా (300 క్వింటాళ్లకు సమానమైన) హిల్సా చేపలను వారు పట్టుకున్నారు. హిల్సా చేపకు మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. చేప పరిమాణం, బరువును బట్టి కిలో గ్రాముకు రూ. 600 నుంచి రూ. 1300 వరకు ధర పలుకుతుంది. వ్యాపారులలో పెద్ద పరిమాణంలో ఉన్న ఇలిసి చేపలకు అధిక డిమాండ్ ఉంది. హిల్సా చేపలు అధికంగా చిక్కడం వల్ల స్థానిక మార్కెట్తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాలకు చేపల సరఫరాకు ప్రయోజనం చేకూరింది. మత్స్యకారుల కథనం ప్రకారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, అనుకూలమైన వాతావరణం కారణంగా లోతైన సముద్రంలోని ఇలిసి చేపలు ఒడ్డుకు వస్తాయి. ముఖ్యంగా నదీ ముఖద్వారం వద్ద నది నీరు, సముద్రపు ఉప్పునీటితో కలిసే చోట పోషకాలతో నిండిన ఉప్పు నీరు ఉండటం వల్ల పెద్ద సంఖ్యలో ఇలిసి చేపలు గుడ్లు పెట్టడానికి అక్కడికి వస్తాయి. మత్స్యకారులు దీనిని ప్రస్తుత సీజన్ లో అత్యుత్తమ చేపల వేట అని కూడా పేర్కొన్నారు. -
శ్రావణం.. శుభప్రదం
● రేపటి నుంచి శ్రావణ మాసం ● పూజలకు ఆలయాలు ముస్తాబు శ్రీకాకుళం కల్చరల్: శుభాలకు నిలయం శ్రావణ మాసం అంటారు. ఈ మాసంలో శుభకార్యాలతో పాటుగా, శుభ ముహుర్తాలు, వ్రతాలు, పూజలు చేస్తుంటారు. శ్రావణ మాస శోభ ప్రతి ఇంటా కనిపిస్తుంది. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు, మంగళవారాలకు ఒక ప్రత్యేకత ఉంది. దీంతో ఆలయాల్లో కూడా మహిళలు పూజలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణంలో 5 శుక్రవారాలు, 4 మంగళవారాలు వస్తున్నాయి. 14న మొదటి శుక్రవారం సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాలు, ఇళ్లల్లో పూజల కోసం మార్కెట్లో కొనుగోళ్లు చేస్తున్నారు. ఆలయాలు సన్నద్ధం శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని పలు అమ్మవారి ఆలయాలు, దేవీ పీఠాల్లో మహిళా భక్తులు సామూహిక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం విద్యుత్ దీపాలు, రంగులతో అలంకరణలు చేశారు. నగరంలో గుజరాతీపేటలోని రాజరాజేశ్వరీ మహాత్రిపుర సుందరీ దేవి పీఠంలో, కత్తెర వీధిలోని రాజరాజేశ్వరీ దేవీ పీఠంలో పూజలు జరగనున్నాయి. శ్రావణంలో పండగలు ఇవే... శ్రావణ మాసంలో శుక్రవారాలు, మంగళవారాల్లో పూజలు, నోములు, వ్రతాలు నిర్వహిస్తారు. వీటితో పాటుగా ముఖ్యమైన పండగలు కూడా ఉన్నాయి. ఈనెల 14న మొదటి శుక్రవారం కాగా, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 21న వరలక్ష్మీ వ్రతం, 17న తొలి మంగళవారంతో నోములు ప్రారంభమవుతాయి. 28న శ్రావణ పూర్ణిమ, రాఖీ పండుగ, సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి, 11న ఆఖరి శుక్రవారం పండుగలు ఉన్నాయి. మార్కెట్లో సందడి మార్కెట్లో కూడా వస్తువులు అమ్మకాల కోసం ప్రదర్శన చేస్తున్నారు. అమ్మకానికి అమ్మవారి ముఖాలు, కలశాలు ఏర్పాటు చేసుకునే విధంగా అమ్మవారి ఆకారం, అమ్మవారి కాళ్లు, చేతులు, అమ్మవారిని అలంకరించేందుకు ఆభరణాలు, అమ్మవారిని ప్రతిష్టించేందుకు కలువ పూలు కూడా అమ్ముతున్నారు. వీటి ఖరీదు సైజుల బట్టి రూ.1,000ల నుంచి రూ.2000ల వరకు అమ్ముతున్నారు. శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవికి విశేష పూజలు, కుంకుమార్చనలు మహిళలంతా కలిసి సామూహికంగా ఆలయాల్లో, ఇళ్ల వద్ద చేస్తారు. దీనికోసం ఎక్కువగా పూలు ఉపయోగిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో చామంతులు కేజీ రూ.800లు, గులాబీలు కేజీ రూ.600లు, బంతిపూలు కేజీ రూ.500లు, విరజాజులు కేజీ రూ.వెయ్యి, కొబ్బరికాయ ఒకటి రూ.30లు, అరటిపండ్లు పెట రూ.80లుగా అమ్ముతున్నారు. -
సాక్షి ఫొటో జర్నలిస్టుకు నేషనల్ ఫొటో కాంటెస్టు అవార్డు
శ్రీకాకుళం క్రైమ్ : ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఫొటో కాంటెస్ట్–2026 అవార్డుల్లో శ్రీకాకుళం ‘సాక్షి’ సీనియర్ ఫొటో జర్నలిస్ట్ కుప్పిలి జయశంకర్కు జనరల్ న్యూస్ విభాగంలో కన్సొలేషన్ అవార్డు దక్కింది. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. ఆమె నేత్రాలు సజీవం శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం పట్టణం దరిలో ఉన్న పొన్నాడ గ్రామానికి చెందిన ఇప్పిలి లక్ష్మి(74) మంగళవారం ఆకస్మికంగా చనిపోయారు. దీంతో ఆమె నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఇప్పిలి కుమార్ రాజు, ఇప్పిలి మురళి కృష్ణ, ఇప్పిలి లక్ష్మణరావులు రెడ్క్రాస్ నేత్ర సేకరణ కేంద్రానికి సమాచారం ఇచ్చారు. జిల్లా రెడ్క్రాస్ సమన్వయంతో మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు పూతి సుజాత, బి.మనుకుమార్లు కార్నియాలను సేకరించి, వాటిని విశాఖలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. నేత్రదానానికి సహకరించిన కుటుంబ సభ్యులను రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్లు కృతజ్ఞతలు తెలిపారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321 నంబర్ను సంప్రదించాలని కోరారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం కోటబొమ్మాళి రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పలాస జీఆర్పీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు 45–50 సంవత్సరాల మధ్యలో ఉంటుందని, ఆ వ్యక్తి సిమ్మెంట్ రంగు షార్ట్, నీలం రంగు, తెలుపు చెక్స్ ఉన్న షర్ట్ వేసుకుని ఉన్నాడని తెలిపారు. అయితే ఈ వ్యక్తి మంగళవారం గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి శవపంచనామ నిమిత్తం తరలించారు. మృతుని వివరాలు తెలిసినట్లయితే పలాస జీఆర్పీ ఎస్ఐ డి.శ్రీనివాసరావు ఫోన్ 92475 85743 నంబర్కు తెలియజేయాలని కోరారు. కిడ్నాప్కు యత్నంపై ఫిర్యాదు టెక్కలి రూరల్: మండలంలో లింగాలవలస గ్రామంలోని పీహెచ్సీకి సమీప వెల్నెస్ సెంటర్లో కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్న ఒక మహిళతో, గార మండలం బందరవానిపేటకు చెందిన వారాది రాంబాబు అనే వ్యక్తి మంగళవారం ఆమె పనిచేస్తున్న స్థలానికి వచ్చి గొడవకు దిగాడు. అనంతరం ఆమెను బలవంతంగా తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్కు షెడ్యూల్ విడుదల ఎచ్చెర్ల: ఏపీఈఏపీ సెట్–2026 బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్కు షెడ్యూల్ విడుదల చేశారు. విద్యార్థులు అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్ కోర్సులతో పాటు డీఫార్మసీ, పార్మా–డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యాశాఖ ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసినట్లు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, సహాయ కేంద్రం జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె.నారాయణరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్లో రుసుము చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు. ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకూ ఆన్లైన్లో ధ్రువపత్రాలను అప్లోడ్ చేసి పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కళాశాలలు, కోర్సుల ఎంపికకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. 20వ తేదీన ఆప్షన్స్ మార్పునకు అవకాశం ఉంటుందన్నారు. కళాశాలలు, కోర్సుల కేటాయింపు జాబితా 23వ తేదీన వెల్లడించనున్నామని చెప్పారు. సీటు పొందిన విద్యార్థులు 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆయా కళాశాలలో రిపోర్ట్ చేయాలని తెలిపారు. -
సృజనాత్మకతకు ప్రోత్సాహం
రాయగడ: విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడంతోపాటు వారిలో సృజనాత్మకతను వెలికితీయాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ రాయగడ అపరాజిత సంస్థ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందని వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సంస్థ ఆధ్వర్యంలో మహార్షి విద్యాలయం విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. స్వాతంత్య్ర వేడులను పురస్కరించుకుని.. నిర్వహించిన ఈ పోటీల్లో 100 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లయన్స్ డిస్ట్రిక్ట్ 322–సి 4 జిల్లా గవర్నర్ అశ్విన్ కుమార్ దాస్ హాజరై ప్రసంగించారు. రచన, చిత్రకళ ద్వారా తమ ఆలోచనలు, దేశభక్తి భావాలను వ్యక్తికరించేందుకు విద్యార్థులకు ఈ తరహా పోటీలను సంస్థ నిర్వహించడం అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ అపరాజిత అధ్యక్షురాలు పి.కల్యాణి మాట్లాడుతూ విద్యార్థులకు ఇటువంటి పోటీలు వారిలో ఆలోచన శక్తి కలుగుతుందన్నారు. క్లబ్ కార్యదర్శి ఎస్.శ్రావణి, కోశాధికారి రంజిత్ బిశోయ్, ఉపాధ్యాక్షురాలు కె.శరణ్య సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. జోన్ చైర్పర్సన్ జి.రామకృష్ణ, తదితరులు సహకరించారు. పోటీలకు న్యాయనిర్ణేతగా మాణిక్యరావు మాస్టారు వ్యవహరించారు. విజేతలకు పంద్రాగస్టు వేడుకల్లో బహుమతులు అందజేస్తామని అపరాజిత క్లబ్ కార్యదర్శి శ్రావణి తెలియజేశారు. -
వరకట్న వేధింపులు చట్టరీత్యా నేరం
పర్లాకిమిడి: వరకట్నం వేధింపులకు పాల్పడ్డ కుటుంబ సభ్యులైనా, కట్టుకున్న భర్త అయినా చట్టప్రకారం శిక్షార్హులే అని ఏడీఎం మునీంద్ర హానగ మంగళవారం అన్నారు. స్థానిక కలెక్టరేట్ హాల్–2లో వరకట్న నిషేధ నియమావళి 1961 చట్టం, జిల్లాస్థాయి ప్రశిక్షణ కేంద్రంలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. చైల్డ్ వెల్ఫేర్ కమిషన్, చైర్మన్ అమియ గౌడో మాట్లాడుతూ.. వరకట్నం వేధింపులకు పాల్పడ్డ వ్యక్తులకు చట్టప్రకారం ఆరు నెలలు జైలు శిక్ష, రూ. 30 వేలు జరిమానా పడతుందని అన్నారు. శిక్షణ శిబిరంలో డీఎస్పీ నిరంజన్ బెహారా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, సీనియర్ ఆడ్వకేటు ప్రమోద్ రవుళో, జిల్లా ప్రోటెక్షన్ అధికారిణి సరలా పాత్రో, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీవోలు, సఖీ ఒన్స్టాప్ సెంటర్, బ్లాక్ స్థాయి అధికారులు, ఎన్జీవో సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదగాలి
● గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ రాయగడ: విద్యార్థుల్లో విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించి భవిష్యత్లో అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదిగితే జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమం నిర్వహణ సార్ధకమైనట్టేనని గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్ ఆకాంక్షించారు. జిల్లాలోని గుణుపూర్ ఉన్న గాంధీ ఇన్స్టిటూట్ అఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వవిద్యాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ అంతరిక్ష దినోత్సవాలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంచుకుని భవిష్యత్లో దేశానికి సేవలందించే శాస్త్ర వేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ధానేకు చెందిన ఏయోనిక్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి బి.ఎన్.రావు గౌరవ అతిథిగా మాట్లాడుతూ.. జాతీయ అంతరిక్ష ప్రాధాన్యత గురించి వివరించారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యాక్షుడు డాక్టర్ చంద్ర ధ్వజ్ పండ విద్యార్థులు అంతరిక్ష శాస్త్రంపై మరింత జ్ఞానం సంపాదించడంతోపాటు భవిష్యత్లో శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కృషి చేయాలని అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవ నిర్వహణ కమిటీ గుణుపూర్ అధ్యక్షుడు ఆశీష్ పట్నాయక్, కార్యదర్శి అశోక్ కుమార్ మెహెర్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్యఅతిధిగా హాజరైన దుదూల్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. -
తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన
సారవకోట: మండలంలోని అలుదు గ్రామానికి చెందిన చెట్టు రామారావు కుటుంబ సభ్యులు స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో భూ రికార్డులు తారుమారు చేశారని మంగళవారం నిరసన తెలియజేశారు. తమకున్న సర్వే నంబర్ 413–3, 395–16, 394–12లో 98 సెంట్లు ఉండేదని, ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్–బీ ఆన్లైన్లో తీస్తే అలాగే వచ్చిందని తెలిపారు. అయితే ఇటీవల మరోసారి తీసిన వన్–బీలో 344–10లో 22 సెంట్లు భూమి తమకున్నట్లు అదనంగా నమోదు చేశారన్నారు. తమది కానీ భూమిని తమ రికార్డులో నమోదు చేయడంతో తహసీల్దార్ కార్యాలయంలో డీటీ రవికి ఫిర్యాదు చేసినా ఫిర్యాదు తీసుకోలేదన్నారు. దీంతో ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదునే మార్చారని ఆరోపించారు. ప్రస్తుతం 22 సెంట్లు అదనంగా నమోదు కావడంతో డిజిటల్ సంతకం కావడం లేదని, దీనివలన తమ భూమిని అమ్ముకునేందుకు అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితులు బాగులేక వైద్య ఖర్చుల నిమిత్తం అమ్ముకునేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని, సంబంధిత అధికారులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దీనిపై డిప్యూటీ తహసీల్దార్ రవిని వివరణ కోరగా.. 22 సెంట్లుకు సంబంధించి చెట్టు రామారావు ఒక స్టేట్మెంట్ ఇస్తే, దాని ఆధారంగా ఆర్డీవో లాగిన్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. -
అమ్మవార్లకు ఆషాఢం సారె సమర్పణ
సారె సమర్పిస్తున్నారు. సంప్రదాయాలకు పెద్ద పీట తెలుగు సంప్రదాయంలో భాగమైన అమ్మవార్లకు సారె సమర్పించే విషయంలో ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని అందుకు తనవంతు కృషి చేస్తానని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. స్థానిక రైతుల కాలనీ ప్రజలు మంగళవారం తుబాటి రాము ఆధ్వర్యంలో అమ్మవార్లకు సారె సమర్పించే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహిళలు సారె ఊరేగింపుగా తీసుకువస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. మజ్జిగౌరీ మందిరంలొ ప్రత్యేక పూజలు చేసి సారె సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందిన మన రాష్ట్రంలో వాటిని తు.చ. తప్పకుండా పాటించాలన్నారు. భిన్న సంస్కృతులు గల మన రాష్ట్రంలో వారి వారి సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించి భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. రాయగడ: పట్టణ ప్రజలు తమ ఇంటి ఆడపడుచుగా భావించి అమ్మవార్లకు ఆషాఢ మాసం సారె సమర్పణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఆషాఢ మాసం ముగిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు పోటాపోటీగా సారెలను సమర్పించడంలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా స్థానిక రైతుల కాలనీ, మంకడజోల ప్రాంతం, సంపత్ వినాయక్ నగర్ కాలనీలకు చెందిన మహిళలు అమ్మవార్లకు అత్యంత ప్రీతికరమైన రోజుగా భావించే మంగళవారం పట్టణ ప్రజల ఇలవేల్పు, గ్రామదేవతగా పూజలందుకుంటున్న బురదల పోలమ్మ, ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం మజ్జిగౌరీ అమ్మవార్లకు సారెను సమర్పించారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవార్లకు సారె సమర్పించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తామంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవార్లకు -
ఏనుగుల సంచారం
నాలుగు సమితుల్లో రాయగడ: జిల్లాలో ఏనుగుల సంచారం ఇటు రైతులకు, అటు గ్రామీణ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలోని కళ్యాణసింగుపూర్, మునిగుడ, బిసంకటక్, గుణుపూర్ సమితుల్లోనిల వివిధ గ్రామాల్లో దాదాపు 17 ఏనుగులు సంచరిస్తున్నట్లు బాధితులు తెలిసారు. ఆహారం కోసం అడవులు, కొండ ప్రాంతాల నుంచి సరాసరి జనవాసాల్లోకి చొరబడుతున్న గజరాజుల గుంపులు ఆయా ప్రాంతాల్లో గల పంటలను, నిల్వ ఉంచుకున్న సామగ్రిని ధ్వంసం చేస్తున్నాయి. ప్రధానంగా వేరుశనగ, అరటి, వరి, పత్తి తదితర పంటలను ఇవి యథేచ్ఛగా ధ్వంసం చేస్తూ రైతుల కంట కన్నీరు మిగులుస్తున్నాయి. నియమగిరి పర్వత ప్రాంతాల్లో ఏనుగుల సంచారం అధికంగా ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 13 ఏనుగులు సంచరిస్తుండగా ఆహారం కోసం అవి తరచూ కళ్యాణసింగుపూర్, బిసంకటక్ ప్రాంతాల్లో ఉన్న దిగువ గ్రామాల్లోకి చొరబడి నానా రభస సృష్టిస్తున్నాయి. గత కొద్ది రొజుల క్రితం అర్ధరాత్రి నియమగిరిలోని కృషముయి గ్రామ సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నుంచి రెండు ఏనుగులు విడిపొయి కళ్యాణసింగుపూర్ సమితిలోని కేశవ్ నాయక్గుడ, నువాసాహి, ఘగుడిమాల్, లహరి ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. గ్రామ సమీపంలో హఠాత్తుగా ఏనుగులు కనిపించడంతో గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు. కేశవ్నాయక్గుడ రైతులు సాగు చేస్తున్న పత్తి, శనగ పంటలను ఏనుగులు తొక్కి ధ్వంసం చేయగా, ఘాగుడిమాల్ లహారాసాహిలో నాటిన వరి పొలాల్లోకి ప్రవేశించి భారీ పంట నష్టాన్ని కలిగించాయి. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ ఫారెస్టర్ భగవాన్ సరకతొ పాటు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పంట నష్టాన్ని పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున సహాయం అందించేందుకు హామీ ఇచ్చారు. గుణుపూర్ అటవీ ప్రాంతంలోని కుకురుగుడా పరిసరాల్లో మరొ నాలుగు ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఇందులో మూడు ఆడ ఏనుగులు, ఒక మగ ఏనుగు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఈ గుంపు గజపతి జిల్లా కాశీనగర్ ప్రాంతంలో సంచరించగా, అనంతరం ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లినట్లు సంబంధిత శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఆహారం కోసం అవి తిరిగి ఈ ప్రాంతానికి చేరుకున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఏనుగుల సంచారం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. -
జయపూర్ సేవా పేపర్ మిల్లు ఉద్యోగుల ఆకలి కేకలు
కొరాపుట్: కలెక్టరేట్ ఎదుట జయపూర్లోని సేవా పేపర్ మిల్లు ఉద్యోగులు ఆందోళన చేశారు. రెండేళ్ల క్రితం జయపూర్ వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేడియంలో సుభద్ర యోజన పథకం ప్రారంభించారు. అదే సమయంలో మూతపడిన సేవా పేపర్ మిల్లు ఉద్యోగుల బాధలు తాము సీఎంకి వివరించామన్నారు. త్వరలో పేపర్ మిల్లు తెరిపిస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రెండేళ్లు ముగిసినా సీఎంలో స్పందన లేదన్నారు. నేటికి 70 మంది కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. అయినా సీఎంలో స్పందన లేదన్నారు. తమ సమస్య మరో సారి ప్రభుత్వ దృష్టిలో పెట్టడానికి కలెక్టర్ని కలిశామని ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కరించక పోతే మిగతా ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో పేపర్ మిల్లు ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రమొద్ మహాంతి, సీపీఐ జిల్లా కార్యదర్శి జుదిష్ట రవులో తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం రాయగడ: జిల్లాలోని కాశీపూర్ సమితి టికిరి ప్రాంతంలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కటక్ ప్రాంతానికి చెందిన కున్న (24) గా మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం కున్న అనే యువకుడు రాయగడకు సమీపంలో గల జేకేపూర్లో నివసిస్తున్నాడు. ఏదో పని మీద సోమవారం ఉదయం తన స్నేహితుడితో కలసి బైకు పై టికిరి వెళ్లాడు. తన పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో టికిరి సమీపంలో గల ఒక పెట్రోల్ బంకు వద్ద గుర్తు తెలియని వాహనం అతని బైకుని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైకును నడుపుతున్న కున్న తీవ్రగాయాలకు గురై సంఘటన స్థలం వద్దే మృతి చెందగా బైకుపై ఉన్న అతని స్నేహితుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పికప్ వ్యాన్ బోల్తా : ఒకరు మృతి భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా జలేశ్వర్ ప్రాంతంలో కార్మికుల్ని రవాణా చేస్తున్న వాహనం బోల్తా పడింది. 57వ నంబరు రాష్ట్ర రహదారి తొలొబొణియా సమీపంలో ఈ విచాకర సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా 25 మందికి పైగా కూలీలు గాయపడ్డారు. భొగొరాయిలో వ్యవసాయ పనులు ముగించుకుని వీరు మయూర్భంజ్కు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అశ్లీల వీడియోలు పోస్టు చేసిన యువకుడి అరెస్టు రాయగడ: ఒక యువతికి సంబంధించిన అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినందుకు పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి బొడొసందుబడి గ్రామానికి చెందిన సంతొష్ ముటికగా గుర్తించారు. జిల్లాలోని శెశికాల్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం బొడొసందుబడి గ్రామానికి చెందిన ఒక యువతిని సంతోష్ ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న సమయంలో ఆ యువతి ఫొటోలను తన మొబైల్లో చిత్రీకరించాడు. అయితే తనను పెళ్లి కోవాలని యువతి సంతోష్ను కోరింది. కానీ సంతోష్ ఒప్పుకోకుండా గ్రామం విడిచి వెళ్లిపోయాడు. తాను పెళ్లి చేసుకోను, ఇంకెవ్వరినీ చేసుకోనివ్వను అంటూ వేధించసాగాడు. యువతి కుటుంబీకులు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో సంతోష్ ఆ యువతి అశ్లీల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీంతో ఆ యువతి తండ్రి పూర్ణ మండంగి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
ఓంకార నాదం
దండకారణ్యంలో ..కొరాపుట్: దండకారణ్యంలో సహజ సిద్ధ పుణ్య క్షేత్రం గుప్తేశ్వరం బోల్ భం నినాదాలతో మార్మోగింది. శ్రావణ మాస సోమవారం కావడంతో ఒడిశాతో పాటు ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ బోయిపరిగుడ సమితి సమితి లోని దండకారణ్య ప్రాంతం సుమారు 50 కిలోమీటర్ల దూరం రోడ్డు మొత్తం పాదచారులతో నిండిపోయింది. నదుల వద్ద పూజలు చేసి పవిత్ర జలాలను కావిడితో పట్టుకొని, కాషాయ వస్త్రాలు ధరించి, కాలికి చెప్పులు లేకుండా నడిచారు. వీరు గుప్తేశ్వరం చేరుకొని శబరి నది వద్ద స్నానాలు చేసి తాము తెచ్చిన పవిత్ర జలాలతో స్వామిని అభిషేకం చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. వెల్లి విరిసిన మానవీయత బొయిపరి గుడ నుంచి గుప్తేశ్వరం వరకు మార్గ మధ్యంలో వందలాది సేవకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. గతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఈ విడత సేవలు అందిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం రాత్రి వరకు ప్రతి చోట భక్తులకు ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్నారు. అల్పాహారం, భోజనాలు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. అనేక చోట్ల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి ప్రజలు తరలి వచ్చి ప్రత్యేక టీ క్యాంప్లు ఏర్పాటు చేసి గ్లూకోజ్, బిస్కట్లు, పళ్లు ఉచితంగా అందిస్తున్నారు. యువత బైక్లపై తిరుగుతూ భక్తులకు కాళ్లు నొక్కడం, ఆయింట్మెంట్లు పూయడం చేస్తున్నారు. ఉచిత ఆహార పంపిణీ కూడా చేపట్టారు. మరికొందరు లైట్లు వేసి దారి చూపించారు. జయపూర్కి చెందిన రుద్ర సేవాదళ్ సంస్థ సభ్యులు సేవలు అందజేశారు. ప్రభుత్వ చర్యలు గుప్తేశ్వరం వద్ద వేలాది మంది భక్తులు గూమి గూడడంతో ప్రభుత్వం కూడా సేవలు అందజేస్తుంది. శబరి నది వద్ద ప్రత్యేక విద్యుత్ కాంతులు ఏర్పాటు చేసింది. అగ్ని మాపక సిబ్బందిని మోహరించింది. రెవెన్యూ విభాగం సిబ్బంది గుడిలో దర్శనాలు తీరు పర్యవేక్షించారు. జయపూర్ ఎస్డీపీఓ అర్చితా మిట్టల్ తాను ఒక ఐపిఎస్ అధికారిణి అనే విషయం పక్కన పెట్టి మహిళలకు సేవలు అందజేశారు. అంతా భక్తి మయం ఎవరూ ఊహించని విధంగా సోమవారం వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. కుండ పోతగా రోజంతా వర్షం పడుతున్నప్పటికీ భక్తులు కాషాయ వరద వలే తరలి వచ్చారు. గుప్తేశ్వరంలో నించోవడానికి ప్రదేశం లేని పరిస్థితి ఏర్పడింది. అత్యధికులు తమ సమస్యలు తీరడానికి, మరి కొందరు తమ కోరికలు తీరినందుకు పవిత్ర జలం మోస్తున్నామని పేర్కొన్నారు. -
శబరి శ్రీక్షేత్రంలో నూతన అధ్యక్షుడు పర్యటన
కొరాపుట్: దక్షిణ ఒడిశా పూరీ ధాంగా పిలువబడుతున్న కొరాపుట్ శబరి శ్రీ క్షేత్ర ఆధ్వర్యంలో ఉన్న విభాగాలలో నూతన అధ్యక్షునిగా ఎన్నికై న జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి సోమవారం పర్యటించారు. ట్రస్ట్ అధ్యక్ష పదవి స్వీకరించిన అనంతరం మందిరంలో నడుస్తున్న ఆనంద బజార్లో పని తీరు పరిశీలించారు. ఇందులో రోజూ 700 నుంచి 800 మంది మధ్యాహ్న భోజనాలు చేస్తారు. అందుకు తగ్గ వంటశాల, సామగ్రి, సిబ్బంది ఉన్నారు. భోజనాలు చేసే భక్తుల సంఖ్య పర్వదినాలలో వేల సంఖ్యలో ఉంటుందని సిబ్బంది తెలియజేశారు. క్షేత్రం ఆధ్వర్యంలో ఐదు వసతి గృహాలు ఉన్నాయి. వీటిని తాత్కాలిక రుసుంతో భక్తులకు గదులు కేటాయిస్తున్నారు. వీటి పరిశుభ్రత, పనితీరు పరిశీలించారు. అంతకు ముందు ట్రస్ట్ సభ్యులతో సమావేశమయ్యారు. శక్తి వంతమైన ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన సమయంలో సభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ వర్మని మర్యాద పూర్వకంగా కలిసి చర్చించారు. -
బొగ్గు లారీ బోల్తా
రాయగడ: బొగ్గులోడుతో విశాఖపట్నం నుంచి రాయిపూర్ వెళ్తున్న బొగ్గు లారీ సదరు సమితి పరిధిలోని పత్రాపూర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. సోమవారం వేకువజామున చోటు చేసుకున్న ఈ ఘటన వల్ల ఒడిశా ఆంధ్ర రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సుమారు ఆరు గంటల పాటు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవరు తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన బొగ్గును తొలగించే పనులు చేపట్టారు. అనంతరం రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. పద్మపూర్లో వినతుల స్వీకరణ రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితి కార్యాలయం సమావేశం హాల్లో వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి వినతులను స్వీకరించారు. సమితిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 61 మంది వినతులను అందజేశారు. వీటిలో 49 వ్యక్తిగత సమస్యలుగా కాగా..మరో 12 సామూహిక గ్రామ సమస్యలుగా గుర్తించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలొ జిల్లా ఎస్పీ రాజ్ప్రసాద్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, డీఎఫ్వో అన్నా సాహెబ్ అహాలే, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్, గుణుపూర్ ఎస్డీపీవో బబులి నాయక్, గుణుపూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అజయ్ కుమార్ ప్రధాన్ పాల్గొన్నారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి రాయగడ: ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. జిల్లాలోని బిసంకటక్ పోలీస్స్టేషన్ పరిధి సనోగొతిగుడ గ్రామానికి చెందిన రమాకాంత్ పిరిసిక కూతురు మమత పిరిసిక (18)గా గుర్తించారు. ఆమె బిసంకటక్లోని మా మార్కమా కళాశాలలో ఇంటర్ చదువుతుండేది. ఈ ఘటనకు సంబంధించి కుటుంబీకులు, స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఈ నెల ఒకటో తేదీన సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అస్వస్థకు గురయ్యింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు బింసటకటక్లోని ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు. దాదాపు వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి రామాకాంత్ బిసంకటక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు అసహాజ మరణంగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. అయితే ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కిటకిటలాడిన మల్లికేశ్వర్ ఆలయం మల్కన్గిరి : జిల్లా కేంద్రంలో పాత్రోగూడ గ్రామం వద్ద కొండ పైన వున్న మల్లికేశ్వర్ స్వామి ఆలయం సోమవారం శ్రావణ మాసం రెండో సోమవారం సందర్భంగా కిటకిటలాడింది. స్వామికి కావిళ్లతో నీటిని తెచ్చి అభిషేకించారు. బోల్భం భక్తులతో పాటు సామాన్యులు కూడా కొండపైకి ఎక్కి శివుడిని దర్శించుకున్నారు. -
సొంత ఖర్చుతో వంతెన నిర్మాణం
రాయగడ: ప్రభుత్వాలు ఆదుకోలేదు. అధికారులు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు తమ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో తమ గ్రామాలకు వంతెన నిర్మాణం కాకపొవడంతో చివరకు ఓ దంపతులు మానవతా ధృక్పథంతో ముందుకు వచ్చారు. తమ సొంత ఖర్చుతో సుమారు రూ.3.70 లక్షలు వెచ్చించి వంతెన నిర్మించి ఏడు గ్రామాల ప్రజలకు రాకపోకల కష్టాలను కొంత మేర తీర్చారు. జిల్లాలోని కాశీపూర్ సమితి గొడిబల్లి పంచాయతీ పరిధిలోని పణసగుడ–పుషఘాటి గ్రామాల మధ్య దుయిముహ నందిపై ఈ వంతెన నిర్మించారు. ఈ పంచాయతీలోని పణసగుడ, కుటింగ, పుషగాటి, గొరిలిమా, ఘురిచర, గాడరాముహి గ్రామాలతొ పాటు కళ్యాణసింగుపూర్ సమితిలొని సింగపటా గ్రామాలకు ఈ వంతెన ఉపయోగపడుతుంది. ఇక్కడ వంతెన లేక స్థానికులు ఏళ్లుగా ఇబ్బంది పడుతుండడంతో పణసగుడ గ్రామానికి చెందిన దంపతులు శ్యామధర్ మాఝి, వసంతి మాఝిలు సొంత ఖర్చుతో వంతెన నిర్మించారు. శ్యామధర్ మాఝి రాయగడలో సమితి గుమ్మ పంచాయతీలో ఏడీఈఒగా విధులు నిర్వహిస్తుండగా అతని భార్య వాసంతి మాఝి కాశీపూర్ సమితి గొడిబాలి పంచాయతీలో ఎంబీకేగా పనిచేస్తున్నారు. గ్రామస్తులు కూడా శ్రమదానం చేశారు. వాసంతీ మాఝి శ్యామ్ ధర్ మాఝి -
ఆకట్టుకున్న రాకెట్ల నమూనా ప్రదర్శన
రాయగడ: ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని గుణుపూర్లో గల గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏడాది రాష్ట్రంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల నిర్వహణకు ఎంపికై న ఏకై క విద్యాసంస్థగా జీఐటీటీ విశ్వవిద్యాలయం నిలిచింది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్రోకు చెందిన వివిధ రాకెట్ల నమూనాలతోపాటు చంద్రయాన్–3 విజయవంతమైన ప్రయోగం, అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన అంశాలతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇస్రో ప్రత్యేక శాస్త్రవేత్త, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టి.వి.రమణా రెడ్డి, జీఐఈటీ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డాక్టర్ చంద్రధ్వజ పండా ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని మెగా ఆడిటోరియంలో ప్రారంభోత్సవ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ రమణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో శాస్త్రవేత్తల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు చంద్రధ్వజ పండా మాట్లాడుతూ.. భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందేలా ఇస్రో అనేక మైలరాళ్లను సాధించిందని పేర్కొన్నారు. ఉపకులపతి డాక్టర్ గౌతం ఘోష్ ఆధునిక సమాజంలో శాస్త్రవేత్తల ఆవిష్కరణలు, నూతన ఆలోచనల ప్రాధాన్యతను వివరించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్త దేవాశీస్ మహాపాత్రో స్వాగత ప్రసంగం చేశారు. స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ కె.మురళీగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇస్రోకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు వర్చువల్గా పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి అంతరిక్ష పరిశోధనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ (భౌతిక శాస్త్రం ) ప్రొఫెసర్ ఎ.వి.ఎన్.ఎల్.శర్మ , ప్రొఫెసర్ వైస్ చాన్సలర్ (కంప్యూటర్ సైన్స్) డాక్టర్ బాలకృష్ణ త్రిపాఠి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.వి.జె.రావు తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శనను గుణుపూర్ ప్రాంతంలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా సందర్శించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరిచుకుని వివిధ విద్యాసంస్థల విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. -
రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. మంగళవారం నుంచి జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు సమ్మె చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్ రిమ్స్ సూపరింటెండెంట్, ఇన్చార్జి ఆర్ఎంవో, అన్ని విభాగాధిపతులతో సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ప్రతి విభాగం నుంచి ఆయా విభాగాధిపతి ద్వారా రోజూ వచ్చే రోగుల సంఖ్య, ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లు, పీజీలు, హౌస్ సర్జన్ల వివరాలను తీసుకున్నారు. వీరంతా మంగళవారం నుంచి సమ్మెకు వెళ్తే అవసరమైన అదనపు వైద్యులను ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై చర్చించారు. సీనియర్ స్టాఫ్ నర్సుల సేవలను ఉపయోగించుకోవాలని, పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో అదనంగా ఉన్న వైద్యులను రిమ్స్కు పంపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమస్య తీవ్రమైన పక్షంలో వైద్యులను తాత్కాలిక పద్ధతిన సమకూర్చుకునేందుకు రాష్ట్ర అధికారులతో మాట్లాడతామని చెప్పా రు. జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉన్నంతకాలం డాక్టర్లు అదనపు సమయం పని చేయాలని సూచించారు. అలాగే రిమ్స్లోని జూనియర్ డాక్టర్లతో కూడా ఆయన మాట్లాడారు. ఇది రాష్ట్రవ్యాప్త నిర్ణ యం కావడంతో తాము సమ్మెలో పాల్గొంటున్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. సమావేశం అనంత రం కలెక్టర్ వెళ్లిపోతున్న సందర్భంలో కాంట్రాక్ట్ స్టాప్ నర్సులు తమకు ఐదు నెలలుగా జీతాలు లేవని తెలపగా, మంగళవారం తన కార్యాలయాని కి వస్తే మాట్లాడదామని తనకు అత్యవసర సమా వేశం ఉందని చెప్పి వెళ్లిపోయారు. సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ సౌమిని, ఇన్చార్జి ఆర్ఎంవో డాక్టర్ సీపీ శ్రీదేవి, విభాగాధిపతులు ప్రసన్న కుమార్, పార్వతి, సునీల్ నాయక్, జేడీ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగా ఓటరు జాబితా
మల్కన్గిరి: ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితిలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజాశిర్క సందర్శించి క్షేత్రస్థాయి పనులపై సమీక్ష నిర్వహించారు. చిత్రకొండ సమితిలో బూత్ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆన్లైన్ పత్రాల ఆప్లోడ్ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. ఓటర్ల క్లెయిమ్లు, అభ్యంతరాలపై విచారణ ప్రక్రియను పూర్తి చేసిన నేపథ్యంలో.. దీనికి సంబంధించిన వివరాలపై స్పష్టత అవసరమని సహాయ ఓటరు నమోదు అధికారులకు సూచించారు. ఓటు హక్కును ప్రతీ ఒక్కరు వినియోగించాలి, పూర్తి స్థాయిలో ఈ పనులు వేగవంతం చేయాలన్నారు. చిత్రకొండ తహసీల్దార్, జిల్లా విద్యాశాఖ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నాగు పామును కొరికేసిన వ్యక్తి
భువనేశ్వర్: ఝార్సుగుడ జిల్లా లో ఆదివారం వింత సంఘటన జరిగింది. ప్రమాదవశాత్తు కాలు కింద పడిన నాగు పామును ఓ వ్యక్తి కొరికేశాడు. ఈ వింత సంఘటన ఝార్సుగుడ జిల్లా కర్మపొడా గ్రామంలో చోటు చేసుకుంది. పామును కొరికి విసిరేసిన వ్యక్తిని ధరం సింగ్ ఖడియాగా గుర్తించారు. అతడిని పొరుగున ఉన్న సంబల్పూర్ జిల్లా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ధరం సింగ్ ఖడియా చెప్పిన ప్రకారం.. అతను పొలానికి వెళ్తుండగా దారిలో నాగు పామును ప్రమాదవశాత్తు తొక్కాడు. ఆ పాము పడగ పైకి ఎత్తగానే దాన్ని పట్టుకుని కొరికేసి పక్కకు విసిరేశాడు. ‘ఆ పాము నన్ను కాటు వేయలేదు. నేను దాన్ని కాటు వేసి పారేశాను. అది ఒక నాగుపాము,’ అని చెప్పాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఖడియా భయపడి తన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వారు అతడిని చికిత్స కోసం సంబల్పూర్ జిల్లా గోవింద్పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)కి హుటాహుటిన తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స తర్వాత ధరం సింగ్ ఖడియా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ అతడిని 24 గంటల పాటు పర్యవేక్షణలో ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. ఈ అసాధారణ సంఘటన స్థానిక నివాసితులను దిగ్భ్రాంతికి గురి చేసింది. విషయం తెలుసుకున్న తర్వాత చాలా మంది ఆ ప్రదేశానికి చేరుకున్నారు. -
సోంపేట కోర్టులో బెయిల్ పిటిషన్
సోంపేట: రాష్ట్ర మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు బెయిల్ కోసం 3వ సారి సోంపేట కోర్టులో న్యాయవాది సోమవారం పిటిషన్ వేశారు. గత రెండుసార్లు న్యాయమూర్తి డిస్మిస్ చేయడంతో మూడోసారి వేయడం జరిగిందని పేర్కొన్నారు. మంగళవారం న్యాయమూర్తికి వాదనలు వినిపించనున్నట్లు తెలియజేశారు. హిరమండలం: వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె రెడ్డి వేదిత (ఏజీఎంయూటీ) 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉండి ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలోని మహిళ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన బాధ్యతలు స్వీకరించిన వేదిత రెడ్డికి పాతపట్నం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు అభినందనలు తెలియజేశారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: సమాజంలో పేదలు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలోనూ, క్షేత్ర స్థాయిలో చట్టాలపై ప్రజలకు చైతన్యం తేవడంలోనూ పారా లీగల్ వలంటీర్ల పాత్ర అత్యంత కీలకమైనదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం పారా లీగల్ వలంటీర్లకు ప్రత్యేక క్రమబద్ధమైన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు న్యాయ విభాగానికి మధ్య వలంటీర్లు వారధిగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా వలంటీర్ల క్షేత్రస్థాయి కార్యకలాపాలు, పనితీరు మెరుగుదల, క్రమం తప్పకుండా అధికారులకు నివేదికలు సమర్పించే విధానాలపై క్షుణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మందస: మండలంలోని మత్స్యకార గ్రామమైన గెడ్డవూరు గ్రామానికి చెందిన కోడ బలరాం స్వామి తనయుడు కోడ దిజే ష్ జాతీయ స్థాయిలో మెరిశాడు. న్యూఢిల్లీలోని టాకటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన 20వ ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ కప్ కరాటే చాంపియన్షిప్లో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. కుమారు డి విజయంపై తండ్రితో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాలుడు అండమాన్లోని ఓ స్కూల్లో నాల్గో తరగతి చదువుతున్నాడు. కంచిలి: పశుగ్రాసం పెంపకంతోనే పాడిరైతులకు మేలు కలుగుతుందని ఆత్మ ఏపీడీ డాక్టర్ ఎం.రవిక్రిష్ణ అన్నారు. గోకర్ణపురం, జె.నారాయణపురం గ్రామాల్లో ఆత్మ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఇందులో పాడి రైతులకు పశుగ్రాసాల పెంపకం, వాడటం వల్ల ఉపయోగాలు, పీఎండీఎస్లో పశుగ్రాసాల సాగుతో కరువు పరిస్థితిలో కూడా పశు సంపదను కాపాడుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా 200 పశువులకు ముద్ద చర్మపు వ్యాధి నివారణ టీకాలు వేశారు. సోంపేట పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ కె.అప్పలస్వామి, మండల పశువైద్యాధికారిణి డాక్టర్ టి.శిరీష, సిబ్బంది హరీష్, రాజేష్, ప్రకృతి వ్యవసాయం సిబ్బంది శీర కామరాజు ఉన్నారు. వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్యమాలతోనే ఉపాధ్యాయుల హక్కుల సాధన సాధ్యమని యూటీఎఫ్ నాయకులు అన్నారు. వజ్రపుకొత్తూరులో సోమవా రం యూటీఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలువురు ఉపాధ్యా య సంఘ నాయకులు మాట్లాడుతూ యూటీఎఫ్ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడు తుందని, పోరాట ఫలితంగా ఉపాధ్యాయుల హక్కులను, ప్రయోజనాలను సాధించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అనేక హామీలిచ్చి అధికారం చేపట్టి 2 ఏళ్లు దాటినా, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నేరవెర్చలేదని విమర్శించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు రూ.25 వేల కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు గుంటు కోదండరావు, జిల్లా కార్యదర్శి కంచరానరమేష్, మండల శాఖ అధ్యక్షుడు రత్నాల సురేష్ కుమార్, సీనియర్ నాయకులు పైల సంజయ్కుమార్, ప్రధా న కార్యదర్శి చొక్కర ధర్మారావు, చంద్రశేఖర్, అనందరావు, శంకర్రావు, జయరాం, సుందరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రాయగడలో శ్రామిక నాయకుల ఆందోళన
● కార్మికుల హక్కులను కాపాడాలని డిమాండ్ ● కేంద్రం తీరు మార్చుకోవాలని నినాదాలు రాయగడ: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, వ్యవసాయ విధానాలను వ్యతిరేకిస్తూ శ్రామిక నాయకులు రాయగడలోని కపిలాస్ కూడలి వద్ద జైల్ భరో ఆందోళన కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు, మహిళలు ఐక్యంగా పోరాటం చేయాలని ఐఎన్టీయూసీ, ఆలిండియా కృషక్ మోర్చా నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళనలొ శ్రామిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ప్రజా పనుల శాఖ బంగ్లా నుంచి ఆందోళనకారులు ర్యాలీగా కపిలాస్ కూడలికి చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐఎన్టీయూసీ నాయకుడు భవాణీ జెన్న, ఆలిండియా కృషక్ మోర్చా నాయకులు తిరుపతి గోమాంగో ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో భాగంగా స్థానిక ఫ్లై ఒవర్ బ్రిడ్జి వద్ద బైఠాయించారు. దీంతో ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలు సుమారు గంటన్నర నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి విరమించాలని విజ్ఞప్తి చేశారు. యితే తాము చేస్తున్నది ప్రజల కోసమేనని అందుకు సహాకరించాలని జెన్న పోలీసులను కోరారు. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఫ్లై ఓవర్బ్రిడ్జిపై వందలాది వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్కు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆందోళనను విరమించాలని పోలీసులు పట్టుబట్టారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళన కారులమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకుడు భవాణీ జెన్న మాట్లాడుతూ.. దేశంలోని కార్మికులు తమ హక్కులు, ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రత కోసం చాలాకాలంగా పోరాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాల్లో మార్పులు చేయడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ప్రాధాన్యమిస్తుందని అన్నారు. జూలై 25 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్మిక సమ్మేళనాలు, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలిండియా కృషక్ మోర్చా నాయకులు గొమాంగో కోరారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
11 కిలోల గంజాయి స్వాధీనం
పర్లాకిమిడి: పట్టణంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా.. పోస్టాఫీసు సమీపంలోని బట్టగౌడో వీధి వద్ద ఓ యువకుడు బస్తాతో నిలబడి అనుమానాస్పదంగా కనబడటంతో సోదా చేయగా గంజాయి బయటపడింది. గంజాయితో పట్టుబడిన యువకుడు సదాశివ పాణిగ్రాహి (45)గా పోలీసులు గుర్తించారు. అనంతరం గంజాయిని తూకం వేసి సుమారు పదకోండు కిలోటు ఉంటుందని నిర్ధారించారు. నిందితుడు సదాశివ పాణిగ్రాహిని మోడల్ పోలీసు ష్టేషన్ అధికారులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. పెట్రోలింగ్ ఎస్ఐ ప్రపుల్ల జోగోరోంగో, పోలీసులు పాల్గొన్నారు. -
ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీ ర్యాంకుకు పదోన్నతి
భువనేశ్వర్: రాష్ట్రంలో తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నియామకంపై షికారు చేస్తున్న ఊహాగానాల మధ్య ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు సోమవారం డైరెక్టర్ జనరల్ (డీజీ) ఆఫ్ పోలీస్ హోదాకు పదోన్నతి పొందారు. వారిలో సంజీబ్ పండా మరియు యశ్వంత్ కుమార్ జెట్వా ఉన్నారు. ఈ ఇరువురు అధికారులను అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) హోదా నుంచి డైరెక్టర్ జనరల్ (డీజీ) గ్రేడ్కు పదోన్నతి కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆమోదం తెలిపారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ మార్పునకు సిద్ధం అవుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రస్తుత డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా పదవీ కాలం ఈ నెల 16తో ముగియనుంది. తాజా పరిణామంతో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) హోదాకు పదోన్నతి కీలకమైన పరిస్థితుల్లో సంజీబ్ పండా, యశ్వంత్ కుమార్ జెట్వా డీజీపీ స్థాయి పదోన్నతికి ఖరారు కావడంతో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి ఆమోదంతో ఈ ఇద్దరు అధికారులు లాంఛనంగా డీజీ గ్రేడ్లోకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుత డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా ఆగస్టు 16న పదవీ విరమణ చేసేందుకు ఇప్పటికే అనుమతి మంజూరైంది. 1990 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి అయిన ఆయన పదవీ విరమణకు సంబంధించి హోం శాఖ ఇంతకు ముందే ఒక అధికారిక ప్రకటనను జారీ చేసింది. పదవీ విరమణ తర్వాత ఖురానియా తన పదవీ కాలాన్ని మరింత పొడిగించుకోవడానికి ఇష్టపడలేదని సమాచారం. జిల్లాస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ పోటీలు మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజన్ పాణిగ్రాహి ఆదేశాల మేరకు స్థానిక ప్రభుత్వ సైన్స్ ఉన్నత మాధ్యమిక పాఠశాల ఆడిటోరియంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. 207 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
జయపూర్లో రైతుల ఆందోళన
కొరాపుట్: ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం జయపూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణానికి వందలాది రైతులు తరలి వచ్చారు. కార్యాలయం లోపల కొరాపుట్ కలెక్టర్ సత్యవాన్ మహాజన్ ఉన్నారని తెలిసి వచ్చామని సిబ్బందికి తెలియ జేశారు. వందల సంఖ్యలో ఉన్న రైతులు లోపలకి రావడానికి వీలు కాలేదు. దీంతో రైతులు ఆందోళన నిర్వహించారు. తక్షణం ప్రభుత్వం తమ నూతన రైతాంగ విధానం వెనక్కి తీసుకోవాలని కృషక్ కళ్యాణ్ మంచ్ డిమాండ్ చేసింది. అనంతరం కలెక్టర్ బయటకు వచ్చి రైతులతో మాట్లాడారు. -
నబరంగ్పూర్ నెత్తిన న్యూక్లియర్ పిడుగు
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా ప్రజల నెత్తిన కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో పిడుగు వేశాయని బీజేడీకి చెందిన మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో గ్లేజ్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. జిల్లాలో తెంతులకుంటి సమితి పూజారిగుడ సమితి నువాగుడ ప్రాంతంలో లక్షా 50 వేల కోట్ల రూపాయల వ్యయం తో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తుందని ప్రకటించారు. అందుకోసం అన్ని ప్రయత్నాలు పూర్తయ్యాయన్నారు. ఈ ప్లాంట్ నిర్మాణం వల్ల జిల్లా మరుభూమిగా మారుతుందన్నారు. అప్పర్ ఇంద్రావతి హైడ్రో పవర్ ప్లాంట్ రిజర్వాయర్ ఉన్న ఖాతీ గుడ డ్యామ్ సమీపంలో ఈ ప్లాంట్ నిర్మిస్తారన్నారు. అందుకు తగ్గ ప్రభుత్వ రికార్డులు సమావేశంలో విడుదల చేశారు. ఈ ప్లాంట్ వలన 6000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. మోదీ–అదానీల రహస్య ఒప్పందం ఈ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ, గౌతం అదానీల మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. వారు చెప్పిందే రాష్ట్ర ముఖ్యమంత్రి మొహన్ చరణ్ మజ్జి, మరో మంత్రి కనక వర్ధన్ సింగ్లు వినాలన్నారు. ఈ ప్లాంట్లో ప్రమాదం జరిగితే 30 కిలోమీటర్ల దూరంలో ప్రజలు జీవించడం అసాధ్యమని తెలిపారు. మూడు దశాబ్దాల పాటు రేడియేషన్ ప్రభావం ఉంటుందన్నారు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు వీటిని సముద్రంలో నిర్మిస్తున్నాయన్నారు. మా అనుమతి తీసుకోలేదు తమ ప్రాంతం లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణం పై బాధిత గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ అధికారులు తమ ప్రాంతం లో మట్టి సామర్థ్యం కోసం పరీక్షలు చేస్తున్నప్పుడు తాము అనుమానంతో గతంలో ప్రశ్నించామన్నారు. ఇవి బోర్ వెల్ పరీక్షలు అని సమాధానం ఇవ్వడంతో వెనుదిరిగామని తెలిపారు. ఇదే విషయమై కలెక్టర్, తహసీల్దార్లను అడిగితే సరైన సమాధానం రాలేదని తెలిపారు. తమ ప్రాంతంలో 50 కిలో మీటర్ల పరిధిలో 120 మీటర్ల లోతులో సుమారు 10 చోట్ల డ్రిల్లింగ్ జరిగినట్లు ప్రభుత్వ నివేదికలు వెలువడ్డాయన్నారు. బాధిత 11 గ్రామాల్లో పల్లె సభ,గ్రామ సభల కోసం ఇంత వరకు అధికారులు రాకుండా పరీక్షలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరిట అన్యాయం జరుగుతుందని డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి ఆరోపించారు. ఈ ప్రాంతంలో రైల్వే నిర్మాణం త్వరగతిన ముందుకు సాగడం పట్ల వెనుక ఉన్న ఉద్దేశ్యం న్యూక్లియర్ ప్లాంట్ నిర్మాణం కోసమే అన్నారు. గ్రామ గ్రామాన ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికీ ప్లాంట్ వలన జరిగే నష్టం వివరిద్దామని మున్నా త్రిపాఠి ప్రకటించారు. ఇదే సమావేశం లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ లిఫికా మజ్జి మాట్లాడుతూ మరో జెన్–జీ ఉద్యమం చేస్తామన్నారు. -
సందడిగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు
కొరాపుట్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలు సోమవారం సందడిగా జరిగాయి. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రాధమిక విద్య, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నిత్యానంద గొండో ప్రారంభించారు. జిల్లా కేంద్రం మెయిన్ రోడ్డులో ర్యాలీ జరిగింది. మార్గమధ్యలో స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, బీజేపీ పరిశీలకురాలు పూర్ణిమా నాయక్ ఉన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్, ఎమ్మెల్యే రఘురాం మచ్చో, జెడ్పీ ప్రెసిడెంట్ సస్మితా మెలక, మున్సిపల్ చైర్మన్ లలెటెందు రంజన్ శెఠి ఉన్నారు. -
గ్రీవెన్స్ సెల్కు వినతుల వెల్లువ
పర్లాకిమిడి: గజపతి జిల్లా నువాగడ సమితి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు వినతులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, జిల్లా ఎస్పీ ప్రహ్లాద సహాయ్ మీనా, జిల్లా పరిషత్ అదనపు కార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు హాజరయ్యారు. 30 వినితులు అందాయి. వీటిలో 10 వ్యక్తిగతం, 20 గ్రామ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. రెండు అభియాగాలను కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కరించగా.. మిగతా వినతులను సంబంధిత శాఖ అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.20వేల ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ అందజేశారు. ఏడుగురు వృద్ధులకు జిల్లా సామాజిక, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం ద్వారా మధుబాబు పింఛన్లను కలెక్టర్ అందజేశారు. నువాగడ పంచాయతీ సమితి చైర్మన్ మాలతీ ప్రధాన్, బీడీఓ లోకనాథ శోబోరో, తహసీల్దార్ మొనాలిసా ఆచారి, డి.ఎస్.ఎస్.ఓ ఉత్సర్గితా బోడోరయి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. 63 వినతుల స్వీకరణ.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితి బేజాగూడ పంచాయతీ కార్యాలయంలో సోమవారం జిల్లా కలేక్టర్ ప్రధమేశ్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ ముఖ్య అభివృద్ధి శాఖ అధికారి దశరథి సరాబు అధ్యక్షతన గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. 64 వినతులు స్వీకరించారు. 23 వ్యక్తిగత, 41 సాముహిక సమస్యలకు సంబంధించిన వినతులు అందాయి. ఒక ఫిర్యాదుఅక్కడికడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఎస్పీ వినోద్ పటేల్, సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, మాత్తిలి సమితి అధికారి ప్రమోద్ కుమార్ బెహర, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
వామపక్షాల ఆందోళన
పర్లాకిమిడి: ఉత్తర్ప్రదేశ్లోని లక్ష్మీపూర్ ఖేరీలో 2021లో జరిగిన ఘటనపై కేంద్రం చర్యలు చేపట్టాలని, రైతుకూలీ సంఘం, అఖిల భారత కిసాన్ సభ, వామపక్షాలు ఆధ్వర్యంలో జైల్ భరో ఆందోళన సోమవారం పర్లాకిమిడి జిల్లా కేంద్రం కాలేజ్ జంక్షన్ వద్ద నిర్వహించారు. ఈ ఆందోళనలో ఎ.ఐ.కె.యం.యస్.జిల్లా అధ్యక్షులు కేదార్ శోబోరో, ఆదివాసీ మహాసంఘం, రాష్ట్రకమిటీ సభ్యులు దోండపాణి రైయితో, గజపతి జిల్లా రైతుకూలీ రైతు సంఘం కన్వీనర్ రోక్కం లోకనాథం, కార్మికనాయకుడు శ్రీను బెహరా, అఖిలభారత కిసాన్ సభ నాయకులు ముచ్చి బంగారయ్య, అంబేడ్కర్ వీకర్ సెక్షన్ నాయకులు బాలకృష్ణ, అనోమో మందర్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతులకు వరి, మొక్కజోన్న మద్దతుధర, కార్మికులకు ధరలు పెరుగుదల కారణంగా రోజువారీ కూలీ పెంచాలని, వచ్చే ఎన్నికల్లో ఈ.వి.యం.ఓటింగ్ యంత్రాలు రద్దుచేసి బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వాహించాలని వామపక్షనేత దండపాణి రయితో డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర డబుల్ ఇంజిన్ సర్కారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా కార్పొరేటర్లకు భూములు ధారాదత్తం చేయడం మానుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. -
సరళా దేవి విగ్రహం ఆవిష్కరణ
అసెంబ్లీ ప్రాంగణంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. భువనేశ్వర్: ఒడిశా తొలి మహిళా ఎమ్మెల్యే, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు సరళా దేవి నిలువెత్తు విగ్రహాన్ని ఆదివారం రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ స్వాతంత్య్ర పోరాటం, మహిళా సాధికారత, సామాజిక సంస్కరణలకు ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. శాసన సభ ప్రాంగణంలో విగ్రహాన్ని ఆవిష్కరించి సరళా దేవిని మహిళా సాధికారతకు, ఒడిశా సామాజిక, రాజకీయ చైతన్యానికి ప్రతీకగా అభివర్ణిస్తూ ఆమెకు నివాళులర్పించారు. సరళా దేవి ఒడిశా తొలి మహిళా శాసనసభ్యురాలు మాత్రమే కాకుండా స్వాతంత్య్ర ఉద్యమానికి, మహిళల హక్కుల సాధనకు కూడా గణనీయమైన కృషి చేశారని అన్నారు. మహిళల విద్య, సామాజిక భద్రత కోసం ఆమె కృషి అనన్యంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పీకర్ సురమా పాఢి, ఉప ముఖ్యమంత్రులు కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడా, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ సరోజ్ కుమార్ ప్రధాన్, ఏకామ్ర భువనేశ్వర్ నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, మహాకలుపడా నియోజక వర్గం ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ దినోత్సవం
ఘనంగా అంతర్జాతీయ ..కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో ఆదివారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో చమిరియా గుడ నుండి మజ్జి గూడ జంక్షన్ వరకు వేలాది మంది ఆదివాసీలు ర్యాలీ జరిపారు. అనంతరం బహిరంగ సభ జరిగింది. అటవీ భూముల పై పూర్తి హక్కులు తమకున్నాయని ఆదివాసీ నేతలు నొక్కి చెప్పారు. ప్రభుత్వాలు మారినా ఆదివాసిల జీవితాలు మారలేదని ఆవేధన వ్యక్తం చేశారు. గిరిజన సంప్రదాయ ఆయుధాలు ధరించి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో బీజేపికి నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, జొరిగాం ఎమ్మెల్యే నర్సింగ బోత్ర, మాజీ ఎంపీ పరశురాం మజ్జి, బీజేడీకి చెందిన డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ ఎంపీలు రమేష్ చంద్ర మజ్జి, ప్రదిప్ మజ్జిలు, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రదాని, కాంగ్రెస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే భుజభల్ మజ్జి పాల్గొన్నారు. నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితి కేంద్రంలో గొండో సమాజ్ నేతృత్వం లో భారీ ర్యాలీ నిర్వహించారు. కొరాపుట్ జిల్లా కేంద్రం లో జరిగిన భారీ ర్యాలీలో జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి, మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్, కొట్పాడ్ లో జరిగిన ర్యాలీ లో కొట్పాడ్ ఎమ్మెల్యే రుపు దర్ బోత్ర, మాజీ ఎమ్మెల్యే చంద్ర శేఖర్ మజ్జిలు పాల్గోన్నారు.జయపూర్ రాజానగర్ నుండి మెయిన్ రోడ్డులో ఆదివాసి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. మల్కన్గిరి : మల్కన్గిరిలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లా ఆదివాసీ సంఘాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక బస్టాండ్ నుంచి డీఎన్కే గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. గిరిజన సంప్రదాయ ప్రదర్శనలు ఆకర్షించాయి. పర్లాకిమిడి: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని కాశీనగర్ బ్లాక్ పర్తాడ పంచాయతీ యస్.బురడ ఆదివాసీ గ్రామంలో అఖిల భారత ఆదివాసీ మంచ్ (ఏ.ఐ.టి.ఎఫ్.) ఆధ్వర్యంలో శోభాయాత్ర, ఆదివాసీల సభ ఆదివారం జరిగింది. ఏ.ఐ.టి.ఎఫ్ కన్వీనరు కేదార్ శోబోరో అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశంలో ఆదివాసీ ప్రజల పరిస్థితిపై ఆయన మాట్లాడారు. రాయగడ జిల్లా సిజ్జిమల్లి నుంచి ప్రారంభమై సుందర్ఘడ్ జిల్లా లంజిబెర్నా వరకూ అన్నిటా ఆదివాసీలపై అణచివేతలు, తప్పుడు తీర్పులు, తుపాకీ గొట్టం ద్వారా మంత్రులు, అధికారం అమలుచేస్తున్నారని కేదార్ శోబోరో అన్నారు. ఆదివాసీల జమ్మి, జంగిల్, పర్వతాలు కూడా వదలకుండా త్రవ్వకాలు చేపట్టడం, క్యాపిటలిస్టులకు అటవీ భూలు ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధర్మం పేరుతో ఆదివాసీలను విభజన చేస్తున్నారని కేదార్ శోబోరో ఆరోపించారు. రాయగడ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాయగడలో సంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలు, పాటలు మార్మోగాయి. స్థానిక తహసీల్దార్ కూడలిలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న ఆదివాసీలు అనంతరం గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన సభా వేదికకు ఊరేగింపుగా చేరుకున్నారు. అనంతరం జరిగిన సభలో ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి ఆధారిత జీవన విధానాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని వివరించారు. ఆదివాసీల భాష, లిపికి రాజ్యాంగపరమైన హక్కులు కల్పించడం లేదని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అభివృద్ధి పేరుతో సహజ వనరుల దోపిడీ జరుగుతోందని విమర్శించారు. తప్పుడు గ్రామ సభలు నిర్వహించి కంపెనీలకు భూములు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నాయకులు విమర్శించారు. జల్, జంగిల్, జమీన్ హక్కులను దెబ్బ తీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, మాజీ ఎమ్మెల్యే మకరంద ముదులి, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ పువ్వల, రిటైర్డ్ ఓఏఎస్ అధికారి గొపినాథ్ సరక, సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక, రావాల మాఝి, చక్రధర్ బిడిక తదితరులు ఉన్నారు. -
బడుగులపై పిడుగు
ఒక ఇంటికి ఆ తల్లే ఆధారం. భర్తను కోల్పోయినా ఉన్నగానొక్క ఒక్క కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. కూలీనాలీ చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. ఇప్పుడు పిడుగు పాటు ఆ అమ్మాయికి అమ్మను దూరం చేసింది. రేపటి భవిష్యత్ను అంధకారం చేసింది. మరో ఇంటిది ఇంకో విషాద గాథ. కళ్లు లేని భర్తను, దివ్యాంగురాలైన కుమార్తెను ఆ ఇల్లాలే చూసుకుంటున్నారు. కూలి పనులకు వెళ్తూ కాసిన్ని రాళ్లు సంపాదిస్తూ ఇంటిని పోషిస్తున్నారు. పిడుగు పాటు ఆ కుటుంబాన్ని ఇప్పుడు సంకట స్థితిలో పడేసింది. తల్లి దూరం కావడంతో దివ్యాంగురాలైన కుమార్తె, భార్య దూరం కావడంతో చూపులేని భర్త దిక్కుతోచని స్థితికి వెళ్లిపోయారు. మందస: బడుగుల జీవితాలపై పిడుగు పడింది. వరి నాటేందుకు పొలంలోకి దిగితే పిడుగుపాటు బతుకులను చీకటి చేసింది. మందస మండలం పెడంగో గ్రామంలో ఆదివారం పిడుగు పడి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు మహిళలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుడార్సింగి సమీపంలోని పొలాల్లో ఉభాలు జరుగుతున్నాయి. ఇదే పంచాయతీ పెండగో గ్రా మానికి చెందిన కట్ట సోముద్రి (45), పాతకోట గ్రామానికి చెందిన సవర జోర(44).. నాట్లు వేసేందుకు పనికి కుదిరారు. వీరితో పాటు మరికొంత మంది కూడా పొలం పనికి వచ్చారు. పనులన్నీ పూర్తయ్యి ఇంకాసేపటి తర్వాత ఇంటికి వెళ్లిపోతామనగా.. నిండుగా మబ్బులు కమ్ముకున్నాయి. ఉన్నట్టుండి పిడుగు పడడంతో కట్ట సోముద్రి, సవర జోర ఆ ధాటికి పొలంలోనే ప్రాణాలు వదిలేశారు. వారితో పాటు పనిచేస్తున్న వారిలో మజ్జి దేవకి, బోయ పోరోమి, కమార్ నీల, కట్ట సుస్మిత గాయపడ్డారు. వీరిని స్థానికులు 108 వాహనంలో హరిపురం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. మృతుల్లో కట్ట సోముద్రికి భర్త భాస్కర్ చనిపోగా పదహారేళ్ల కుమార్తె ఉన్నారు. తల్లి మరణంతో ఆ కుమార్తె ఒంటరైపోయింది. అలాగే సవర జోర భర్త అంధుడు. పాప గాయత్రి దివ్యాంగురాలు. జోర మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యింది. మందస పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం హరిపురం ఆస్పత్రికి తరలించారు. శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలో సాఫ్ట్బాల్ క్రీడను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా అన్ని జిల్లాల సాఫ్ట్ బాల్ సంఘాల ప్రతినిధులు, కోచ్ లు, వ్యాయామ ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం లోని క్రిస్టల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వేదిక జరుగుతున్న రెండు రోజుల స్టేట్ లెవెల్ సాఫ్ట్ బాల్ సెమినార్ కం ఎంపైర్స్ క్లినిక్–2026 కార్యక్రమం ఆదివారం రాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి సూర శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని సాఫ్ట్బాల్ క్రీడకు గణనీయమైన ఆదర ణ లభిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ మొజ్జాడ వెంకటరమణ, జగదీశ్వర్ రెడ్డి, కోశాధికారి సామంత్ రెడ్డి పర్యవేక్షణలో సుమారు 120 మంది కోచ్లు, ఔత్సాహిక సీనియర్ క్రీడాకారులు, పీడీ–పీఈటీలకు సాఫ్ట్బాల్ గేమ్ పై అంపైర్లుగా శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ అనంతరం ముఖేష్ దేశ్ పాండే ఆధ్వర్యంలో శిక్షణకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు. -
‘ఆదివాసీల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ’
వజ్రపుకొత్తూరు రూరల్: ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానా న్ని పరిరక్షించడంతో పాటు వారి అభ్యున్నతికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయని కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పలాస రైల్వే గ్రౌండ్లో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరా జు పేరు పెట్టడం ద్వారా ఆదివాసీలకు మరింత గౌరవం పెరిగిందన్నారు. జిల్లాలో 16 మండలాల్లో సుమారు 90 వేల మంది సవర గిరిజనులు నివసిస్తున్నారని వీరందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పఽథకాలు అందిస్తున్నాయని అన్నా రు. ఐటీడీఏ పరిధిలో 268 ప్రభుత్వ పాఠశాలు ఉండగా వాటిలో సుమారు 20 వేల మంది చదువుతున్నారని తెలిపారు. అటవీ ఉత్పత్తులకు ‘అమోఘం’ బ్రాండ్తో విస్తృత మార్కెట్ కల్పించి గిరిజనుల ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు. ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ శ్రీకాకుళం ఆదివాసీ ప్రాంతాలకు 5వ షెడ్యూల్ అమలు చేయాలని, ఆదివాసీ ప్రాంతంలో ఆక్రమ మైనింగ్, సహజ వనరుల దోపిడీని అరికట్టాలని కోరారు. ఆదివాసీ హక్కుల సాధన పోరాటాలతోనే సాధ్యమని, తమ హక్కుల పరిరక్షణ, వాటి సాధన కోసం ఐకమత్వంగా పోరాటాలు చేయాలని ఆదివాసీ నాయకులు పిలుపునిచ్చారు. -
రాష్ట్రంలో ‘ఇంటింటా త్రివర్ణ పతాకం’ ప్రచారం ప్రారంభం
భువనేశ్వర్: క్రాంతి దినోత్సవం పురస్కరించుకొని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ భువనేశ్వర్లో చారిత్రాత్మక ‘ఇంటింటా త్రివర్ణ పతాకం’ ప్రచారాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆగష్టు 9 నుంచి 17 వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పంచాయతీ, నగరం, ఇల్లు, పాఠశాల, కార్యాలయంలో నాలుగున్నర కోట్ల ఒడిశా ప్రజలు జాతీయ పతాకాన్ని గర్వంగా ఎగురవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన ప్రసంగంలో ఒడిశా స్వాతంత్య్ర సమరయోధులకు, ధైర్యవంతులైన అమరవీరులకు, అమర పుత్రులకు ప్రగాఢ నివాళులర్పించారు. 1942 ఆగస్టు 9న ముంబైలోని ఆగష్టు క్రాంతి మైదాన్ నుంచి ప్రారంభమైన ‘క్విట్ ఇండియా’ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటానికి కొత్త దిశానిర్దేశం చేసిందని ముఖ్యమంత్రి అన్నారు. త్రివర్ణ పతాకం కేవలం మూడు రంగుల సముదాయం మాత్రమే కాదు. అది 14 కోట్ల మంది భారతీయుల గర్వానికి, వైభవానికి, ఆకాంక్షలకు ప్రతీక. కేసరి రంగు ధైర్యానికి, త్యాగానికి, తెలుపు రంగు శాంతికి, సత్యానికి, ఆకుపచ్చ రంగు శ్రేయస్సుకు ప్రతీకగా పేర్కొన్నారు. మధ్యలో ఉండే అశోక చక్రం నిరంతర కర్తవ్య పాలన బోధిస్తుందన్నారు. ఈ పవిత్ర జాతీయ పండుగను పూర్తిగా పర్యావరణహితంగా మార్చేందుకు ప్లాస్టిక్ జెండాలను పూర్తిగా నిషేధించి కేవలం వస్త్ర జెండాలను మాత్రమే ఉపయోగించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇంటింటా త్రివర్ణ పతాకం ప్రారంభంలో భాగంగా భారీ ఊరేగింపును నిర్వహించారు. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని క్రమబద్ధంగా కవాతు చేశారు. ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాంస్కృతిక బృందాలు తమ సంప్రదాయ జానపద నత్యాలు, కళలను ప్రదర్శించాయి. ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు, ప్రముఖ క్రీడాకారులు, వేలాది మంది విద్యార్థులు ‘వందేమాతరం‘, ‘భారత్ మాతా కీ జై‘ అనే నినాదాలు చేస్తూ ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడా, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి, వాణిజ్య, రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా, పాఠశాలలు, సామూహిక విద్య శాఖ మంత్రి నిత్యానంద్ గోండ్, ఉన్నత విద్య, ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
రాయగడలో రక్తదాన శిబిరం
రాయగడ: ప్రముఖ తెలుగు సినీ నటుడు మహేష్బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక డైహార్డ్ ఫ్యాన్స్, డాక్టర్ అబ్దుల్ కలామ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆదివారం జిల్లా కేంద్రాస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం పదికి ప్రారంభమైన శిబిరం సాయంత్రం ఐద గంటల వరకు జరిగింది. రక్తనిధి అధికారి డాక్టర్ కె.నవీన్కుమార్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బొగిలి రాజేష్ కుమార్ కార్యక్రమాన్ని పరివేక్షించారు. వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. చిన్న అడుగు ఒక ప్రాణాన్ని కాపాడగలదు అనే నినాదంతో నిర్వహించిన ఈ శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా 24 యూనిట్ల రక్తాన్ని సేకరించారు -
తల్లిదండ్రులపై దాడి చేయించిన కుమారుడు అరెస్టు
వజ్రపుకొత్తూరు రూరల్: మందస మండలం వీరభద్ర గ్రామంలో జూలై 31న జరిగిన ఘటనలో ఆస్తి కోసం తల్లిదండ్రులపై దాడి చేయించిన కుమారు డు ఇప్పిలి వివేక్ను పోలీసులు అరెస్టు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ తెలిపిన వివరాలు మేరకు.. 31వ తేదీ రాత్రి వీరభద్ర గ్రామానికి చెందిన ఇప్పిలి రాఘవరావు తన భార్యతో కలిసి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ఇంటికి తిరిగి వచ్చా రు. ఇంటి గేటు వద్ద రాఘవరావు వాహనంపై కూర్చొని ఉండగా ఆయన భార్య ఇప్పిలి స్వర్ణలత ఇంటి గేటు తీస్తున్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు రాఘవరావుపై దాడి చేశారు. భర్తపై జరుగుతున్న దాడిని గమనించిన స్వర్ణలత తన భర్తపై ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించగా నిందితులు ఆమెను భయపెట్టి పక్కను నెట్టేసి ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై అదే రోజు రాత్రి మందస పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఆగస్టు 8న మందస పోలీసు స్టేషన్ ఎస్ఐ, సిబ్బంది హరిపురం గ్రామంలో గల ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడిందన్నారు. ఫిర్యాదుదారుడితో కుమారుడు ఇప్పిలి వివేక్కు గతంలో గొడవలు ఉన్న నేపథ్యంలో సుపారీ గ్యాంగ్తో ఈ దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులైన మందస మండలం మకరజోల గ్రామానికి చెందిన యానాది జ్యోతిరాజు, పలాస మున్సిపాలిటీ లేబర్ కాలనీకి చెందిన చీకటి అభిరామ్, వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన గురుబిల్లి అనిల్ కుమార్తో పాటు తల్లిదండ్రులపై దాడికి ప్రేరేపించిన ఇప్పిలి వివేక్లను పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్కు తరలించినట్లు మీడియా సమావేశంలో ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఆమెతో పాటు కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు ఉన్నారు. -
బ్రిటిష్ జైలుని స్మారక స్థూపంగా అభివృద్ధిగా చేయాలి
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని బ్రిటిష్ జైల్ని స్వాతంత్య్ర సమర యోధుల స్మారక స్థూపంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబ సభ్యుల సంఘం అధ్యక్షుడు మున్నా త్రిపాఠి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న బ్రిటిష్ జైలు వద్ద క్రాంతి దివాస్ వేడుకలలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. 1942లో ఇదే రోజు మహాత్మాగాంధీ పిలుపు మేరకు క్రాంతి ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇదే జైలులో అనేక మంది స్వాతంత్య్ర సమర యోధులు కన్ను మూశారని పేర్కొన్నారు. జైలుతో పాటు పపడాహండిలో సాయుధ స్థూపాన్ని కూడా ప్రభుత్వం స్మారక స్థూపంగా అభివృద్ధి చేయాలని మున్నా త్రిపాఠి విజ్ఞప్తి చేశారు. అనంతరం జాతీయ జెండా ఎగుర వేసి, గాంధీ చిత్ర పటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, జెడ్పీ మాజీ ప్రెసిడెంట్ మంజులా మజ్జి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కనుదాస్, మాఘరో సంస్థ కన్వీనర్ కాధంబని త్రిపాఠి ఉన్నారు. -
పాముకాటుకు గురైన చిన్నారికి ఆర్థిక సాయం
కవిటి : ‘చిన్నారికి ప్రాణాపాయం.. దాతలపైనే భారం’ అనే శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచు రితమైన కథనానికి దాతలు స్పందించారు. ఆదివారం మండలంలోని మడియరిపుట్టుగకు చెందిన హారతి అనే చిన్నారి కుటుంబానికి శ్రీరేయమ్మతల్లి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆప న్న హస్తం అందించింది. ఈ మేరకు బాధితురాలి కుటుంబానికి రూ.10,000 నగదు అందించారు. చిన్నారి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని, మిగిలిన వారూ సాయం చేయాలని వారు కోరారు. ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాల యం ప్రహరీ కూలిపోయింది. వెంకటేశ్వర కళాశాలకు పక్కన ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లే రహదారిని ఆనుకుని ఉన్న గోడ ఆదివారం కూలి పోయింది. వర్సిటీ రక్షణ గోడ మొత్తం ఇలానే తయారైంది. ఎప్పుడు ఎక్కడ కూలిపోతుందో తెలీని పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శిష్టకరణాలను ఓబీ సీ జాబితాలో కలపాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23న చలో విశాఖపట్నం నిర్వహించనున్నట్లు శిష్టకరణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలుమహ ంతి ఉమామహేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో శిష్టకరణ సంఘ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విశాఖపట్నంలోని సింహాచలంలో సమావేశం నిర్వహించనున్నామని, అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో శిష్టకరణ కులస్తులు హాజరు కావాలని కోరారు. సమావేశంలో జిల్లా శిష్టకరణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు డబ్బీరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సదాశివుని కృష్ణ, కోశాధికారి బలివాడ శివప్రసాద్, బలివాడ మల్లేశ్వరరావు, డాక్టర్ శ్రీనివాసపట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని రాగో లు జెమ్స్లో గల బొల్లినేని మెడిస్కిల్స్లో నూ తన నైపుణ్య కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపా రు. పదో తరగతి, ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు చైల్డ్కేర్ టేకర్, కేర్ గివర్, ఎల్డర్లీ కేర్ టేకర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 18 నుంచి 30ఏళ్లలోపు గల యువతీ యువకులు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపా రు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ జారీ చేస్తూ ఆయా సంస్థల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించను న్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు కో సం 76809 45357, 9121999654 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. శ్రీకాకుళం న్యూకాలనీ, టెక్కలి రూరల్: హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన తైక్వాండో గ్రూప్ ఈవెంట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి మొట్టమొదటి వ్యక్తిగా తైక్వాండో సీనియర్ ప్లేయర్ బి.చిరంజీవి ఈ రికార్డుని సాధించుకున్నారు. కష్టతరమైన మెలకువలు జయంత్ రెడ్డి వద్ద నేర్చుకోవడం వల్లే ఇది సాధ్యమైందని చిరంజీవి తెలిపారు. అలాగే టెక్కలి ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రానికి చెందిన తైక్వాండో క్రీడాకారులు మెండ తపస్వీ, తమిరే జ్ఞానదీప్, అట్టాడ మహీంధర్ కూడా పాల్గొన్నారు. -
మహనీయుల త్యాగం చిరస్మరణీయం
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి రాసూరు గ్రామం వద్ద జగన్నాథ నికేతన్ అనాథ ఆశ్రమంలో ‘మహారాజా త్యాగం’ అనే విద్యా కార్యక్రమాన్ని బాలముకుంద కేంద్రం కో ఆర్డినేటరు నిత్యానంద చౌదరి ఆదివారం నిర్వహించారు. అనాథ బాలలకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం స్వాతంత్య్ర సమర యోధులు, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి మహానీయులు దేశం కోసం చేసిన సేవలను బాలలకు తెలియజేశారు. ఆగస్టు 3న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జగద్గుర కృపాలు విశ్వవిద్యాలయాన్ని (జె.కె.యు) ప్రారంభించారన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు భువనేశ్వర్: ఒడిశా హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వివిధ హైకోర్టులలో న్యాయ మూర్తులను పునర్వవ్యవస్థీకరించే చర్యలో భాగంగా కొలీజియం ఈ సిఫారసు చేసింది. ఈ నెల 6న జరిగిన సమావేశంలో కొలీజియం జస్టిస్ మానష్ రంజన్ పాఠక్, జస్టిస్ కృష్ణ రామ్ మహా పాత్రోల బదిలీని సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఒడిశా హైకోర్టులో పని చేస్తున్న జస్టిస్ మానష్ రంజన్ పాఠక్ను గుజరాత్ హైకోర్టుకు, జస్టిస్ కృష్ణ రామ్ మహా పాత్రోను ఛత్తీస్గఢ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేటలో చెరువుల ఆక్రమణలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. చెరువుల వద్ద ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఒక వైపు నరసన్నపేటలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు గతంలో సహకరించిన అధికారులు, వీఆర్వోలపై క్రమ శిక్షణ చర్యలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా మరో వైపు ఆక్రమణలు పదేపదే జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. మెయిన్ రోడ్డుపై జామియా మసీదు పక్కన ఉన్న పాలకర్ర చెరువు వద్ద గొట్టిపల్లి సర్వే నంబర్ 178/2సీలో ఉన్న స్థలం స్వాధీనానికి స్థానిక హడ్కో కాలనీకి చెందిన ఒకరు మట్టి కప్పారు. ఈ స్థలం పక్కనే ఉన్న ఫీడర్ చానెల్ కూడా కప్పేస్తున్నారు. విలువైన ఈ స్థలంలో పక్కాగా భవనం నిర్మించాలని ప్లాన్ వేసుకున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం నుంచి పలు ట్రాక్టర్లలో మట్టి తరలించారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా దీనిపై తహసీల్దార్ కార్యాలయం సూపరింటెండెంట్ పొది లాపు శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లగా ఈ ఆక్రమణలపై నరసన్నపేట ఎస్ఐకు సంబంధిత వీఆర్ఓ శ్యామ్ సుందరరావు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. -
విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు
రాయగడ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శిష్టకరణాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హోటల్ స్వాగత్ సమీపంలో గల కొదండ రామ మందిరం ప్రాంగణంలో చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన 72 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ పట్నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంఘం చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలతోపాటు చదువుపై విద్యార్థులకు ఆసక్తి కనబరిచే విధంగా పలు అంశాలను చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు మంచి ఆసక్తిని కనబరచడం హర్షించదగ్గ విషయమన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతగా ప్రముఖ కళాకారుడు మానిక్యరావు మాస్టారు వ్యవహరించగా సంఘం కార్యదర్శి మహేష్ పట్నాయక్, సాంస్కృతిక కార్యదర్శి బాలకృష్ణ పట్నాయక్, కొండవలస కృష్ణమూర్తి పట్నాయక్, జనార్దన్ పట్నాయక్, గజలక్ష్మీపట్నాయక్, గిరీష్ పట్నాయక్ తదితరులు పోటీలను పర్యవేక్షించారు. విజేతలకు పంద్రాగస్టు రోజున బహుమతులు అందజేయనున్నట్లు కార్యదర్శి మహేష్ పట్నాయక్ తెలియజేశారు. -
పూరీ–కొరాపుట్ రైల్ను జయపూర్ వరకు పొడిగించాలి
కొరాపుట్: పూరీ నుంచి కొరాపుట్ వరకు నడుస్తున్న పగటి పూట రైల్ని జయపూర్ వరకు పొడిగించాలని జయపూర్ జాగరణ పరిషత్ డిమాండ్ చేసింది. అందుకు తగ్గ లేఖని జయపూర్ రైల్వే స్టేషన్ మేనేజర్ రోషన్ దాస్కి పరిషత్ సభ్యులు అందజేశారు. పూరీ–కొరాపుట్ రైలు రాత్రి 11.30కి కొరాపుట్ చేరుతుందన్నారు. ఆ రాత్రి పూట జయపూర్, నబరంగ్పూర్, మల్కన్గిరి ప్రాంతాల ప్రయాణికులు రవాణా వసతి లేక రైల్వే స్టేషన్లో గడపాల్సి వస్తుందన్నారు. అంతేకాక ఉదయం ఐదు గంటలకు కొరాపుట్లో ఈ రైలు బయలు దేరుతుందన్నారు. ఆ సమయంలో కొరాపుట్ చేరడానికి రవాణా సౌకర్యాలు లేవన్నారు. అందుకే ఈ రైలు జయపూర్ వరకు పొడిగిస్తే అన్ని ప్రాంతాల ప్రజలకు సేవలు అందుతాయన్నారు. ఈ లేఖని ఈస్ట్ కోస్ట్ జనరల్ మేనేజర్కి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ బృందంలో శ్రీనివాస్ బాలారాయ్, రాజేంద్ర గౌడ, వై.ప్రసాద్, గుప్త చంద్ర గౌడ, జగదీష్ పాఽడీ, ప్రమెద్ మహంతి, సుదర్శన్ బిసోయి ఉన్నారు. -
రెండు ఇసుక లారీలు స్వాధీనం
రాయగడ: అర్ధరాత్రి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి రాయగడ వైపు ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను శేషికాల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించిన ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు, వే బిల్లులు లేకపోవడం గుర్తించిన పోలీసులు లారీలను సీజ్ చేశారు. అయితే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మరో ఇసుక లారీ రోడ్డుపైనే ఇసుకును అన్లోడ్ చేసి అక్కడ నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న రెండు లారీలు కాసీపూర్ సమితి పరిధిలోని టికిరి పారిశ్రామిక ప్రాంతం వైపు వెళుతున్నట్లు పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. జిల్లాలోని నాగావళి నది నుంచి ఇసుక తవ్వకాలకు జిల్లా యంత్రాంగం ఆంక్షలు విధించడంతో కొన్ని పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్లోని కొమరాడ ప్రాంతంలోని రీచ్ల నుంచి ఇసుక కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే నాగావళి నది పరిసర ప్రాంతాల నుంచి సేకరించిన ఇసుకను కొందరు వ్యాపారులు ఆంధ్రప్రదేశ్లోని కొమరాడ ప్రాంతంలో నిల్వ ఉంచి వర్షాకాలంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. రైతులను వేధించడం తగదు కొరాపుట్: రైతులను లేనిపోని నింబంధనలతో వేధించడం తగదని ప్రతిపక్ష బీజేడీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రబినారాయణ నందో అన్నారు. ఆదివారం జయపూర్ మెయిన్ రోడ్దులోని లలిత్ మహాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొంత భూమి కలిగి సుదూర ప్రాంతాలలో ఉన్న రైతులు ఇబ్బందులు పెరిగాయన్నారు. రైతు సంక్షేమ పథకాలు అందాలంటే స్వయంగా భూ యజమానులు స్వస్థలాలకు రావల్సి వస్తుందన్నారు. గతంలో కుటుంబంలో మిగతా సభ్యులకు భూహక్కులు తాత్కాలికంగా లిఖిత పూర్వకంగా ఇచ్చి ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లేవారన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అటువంటి వారు కూడా స్వస్థలాలకు వచ్చి వివరాలు నమోదు చేసుకోవాలనే కొత్త నిబంధనలు తెచ్చిందని రబినందో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతుకు కేవలం నిబంధనలు మాత్రమే అమలు చేస్తున్నారని.. సంక్షేమ పథకాలను మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు. సమావేశంలో బీజేడీ నాయకులు దుర్గా మిశ్ర, బి.బాలంకేశ్వర్ రావు ఉన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి అదృశ్యం రాయగడ: విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, క్రమశిక్షణకు పెద్ద పీట వేయాల్సిన రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజుల కిందట కొలనార సమితి రివల్కోన ఎస్ఎస్డీ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులపై పదో తరగతి విద్యార్థులు ర్యాగింగ్ చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే డంగసరడ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థి కునాల్ సబర్ గత వారం రోజులుగా కనిపించకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. డంగసరడ హాస్టల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కునాల్ సబర్ అనే విద్యార్థి గత వారం రోజులుగా కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతని స్వగ్రామం డంగసరడ సమీపంలో గల యుగాపదర్గా సమాచారం. తన కొడుకు వారం రోజులుగా కనిపించకపోయినా హాస్టల్ సిబ్బంది తమకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు డంగసరడ ఉన్నత పాఠశాలకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికే విద్యార్థి హాస్టల్లో లేకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసు స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినప్పటికీ విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం తన కొడుకు ఆచూకీ తెలియజేయాలని హాస్టల్ నిర్వాహకులపై వత్తిడి తీసుకువచ్చారు. -
సీఎం హామీకి ఏడాది
కొరాపుట్: రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి హామీ ఇచ్చి ఏడాదైనా పేపర్ మిల్లు తెరచుకోలేదని సీపీఐ కొరాపుట్ జిల్లా కార్యదర్శి జుధిష్ట రవులో ఆరోపించారు. ఆదివారం గగనాపూర్లోని బిల్ట్ సేవా పేపర్ మిల్లు ఆవరణలో జరిగిన సభలో ప్రసంగించారు. గత ఏడాది ఇదే రోజున జయపూర్ వచ్చిన సీఎం త్వరలో మిల్లు తెరిపిస్తామని తమకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ నేటికీ ఆ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వందలాది కార్మికులు ఆకలి కేకలు వేస్తున్నారన్నారు. రిటైర్ అయిన కార్మికులకు ఇంతవరకు పరిశ్రమ నుంచి బకాయిలు రాలేదన్నారు. నెలల తరబడి కార్మికులకు జీతాలు లేవన్నారు. ఈ సమస్యపై తాము మరోసారి ఉద్యమిస్తామని జుదిష్ట రవులో హెచ్చరించారు. సమావేశంలో కార్మిక నాయకులు ప్రమోద్ మహంతి, సుదర్శన్ పాల్గొన్నారు. -
14 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్గిరి: బలిమెల పోలీసు స్టేషన్ పరిధిలోని ఎం.వి.37 గ్రామం కూడలి వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో ఎకై ్సజ్ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వేగంగా రావడంతో అనుమానం ఆపి తనిఖీ చేయగా ఓ బస్తాలో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. చత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమ జిల్లాకు గంజాయిని తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ లక్షన్నర రూపాయలు ఉంటుందని ఎకై ్సజ్ పోలీసు ఇన్స్స్పెక్టర్ తెలిపారు. నిందితుడు బిక్రమ్ ఖిల్లాపై కేసు నమోదు చేసి సోమవారం కోర్టుకు తరలిస్తామని చెప్పారు. రైల్వే స్టేషన్లో 4 కిలోలు.. రాయగడ: కొరాపుట్ నుంచి రౌర్కెలా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లోని జనరల్ భోగీలో సుమారు నాలుగు కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి ట్రైన్ రాయగడకు చేరుకునే సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో చివరి భోగీలొ పరిశీలించగా ఒక బ్యాగు అనుమానాస్పదంగా కనిపించింది. దీనిని తెరిచి తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. అయితే బ్యాగు ఎవరిదో పోలీసులు విచారించినప్పటికీ ప్రయాణికుల నుంచి సరైన సమాధానం లేకపొవడంతో నిందితుడు పరారైనట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎచ్చెర్ల: అరిణాం అక్కివల స గ్రామంలో జాతీయ రహదారి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎచ్చెర్ల పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మండలంలోని కేశవరావు పేట గ్రామానికి చెందిన మెట్ట గణపతి (25) లావే రు మండలం బొంతుపేట గ్రామంలో ఓ శుభకా ర్యానికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా అరిణాం అక్కివలస వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో తీవ్ర గాయాలైన గణపతిని అంబులెన్స్లో శ్రీకాకుళం రిమ్స్కు తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. మృతుడు రెండేళ్ల నుంచి పైడి భీమవరం రెడ్డీస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయనకు తల్లి, చెల్లి ఉన్నారు. చెల్లికి వివాహం జరిగింది. తల్లి కూలి పనిచేస్తుంటారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వినియోగదారుల రక్షణకు కొత్త చట్టం
శ్రీకాకుళం అర్బన్: వినియోగదారుల రక్షణకు పాతచట్టం 1986కు బదులుగా 35/2019గా కేంద్ర ప్రభుత్వం కొత్తచట్టం తీసుకువచ్చిందని మేధావుల ఫోరం అధ్యక్షుడు, విశ్రాంత జిల్లా జడ్జి పప్పల జగన్నాథరావు తెలిపారు. శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీలోగల నారాయణ తిరుమల మహా మండపంలో ఆదివారం మేధావుల ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కొత్తచట్టం గురించి వివరించారు. మధ్యవర్తిత్వం సెల్ ద్వారా పరిష్కారం వైపు పనిచేయవచ్చునని, జిల్లాస్థాయి అధికారి పరిధి రూ.20లక్షల నుంచి రూ.50లక్షల ఫిర్యాదులు తీసుకోవడానికి పెంచార ని తెలిపారు. ఫిర్యాది ఉన్న జిల్లా కన్స్యూమర్స్ కమిషన్లో లేక స్టేట్, నేషనల్ పరిధిలో నివశించే ప్రదేశంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
స్థలం మంజూరు చేయాలని వినతి
పర్లాకిమిడి: స్థానిక గజపతి స్టేడియం వద్ద ఉన్న ఆరబిందో పూర్ణాంగ శిక్ష కేంద్రంలో ఆదివారం గజపతి జిల్లా మాజీ సైనికుల సంఘ సమావేశం జరిగింది. తొలిత మాజీ సైనిక ఉద్యోగులు అరబిందో, భారత్ మాత చిత్రపటాలకు జ్యోతిని వెలిగించి సమావేశం ప్రారంభించారు. ఈ సమావేశానికి అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.సి.డాష్ అధ్యక్షత వహించారు. అధ్యక్షుడు లెఫ్టినెంట్ వై.మురళీధర్, మాజీ అధ్యక్షుడు కెప్టెన్ మల్లికార్జున పట్నాయక్, ఉపాధ్యక్షుడు సుబేదార్ బి.కృష్ణారావు, కోశాధికారి సార్జెంట్ భవానీ శంకర్ ఆచార్య తదితరులు హాజరయ్యారు. ఈ సమావేఽశంలో మాజీ సైనికుల కోసం కార్యాలయాలు, యుద్ధ స్మారక స్తంభాల కోసం స్థలం మంజూరు చేయాలని, మాజీ సైనిక ఉద్యోగుల కోసం ఈ.సి.ఎస్.హచ్ హెల్త్ క్లినిక్లు జిల్లాలో ఏర్పాటుచేయాలని మాజీ సైనికుడు మనోజ్ దాస్ కోరారు. మాజీ సైనికుల కుటుంబాల కోసం కేంద్ర, రాష్ట్ర మాజీ సైనికులు సంక్షేమ సంఘాలు పంపించిన పలు లేఖలను చదివి వినిపించారు. -
కొరాపుట్ నా పుట్టినిల్లు
● జెన్–జీతో సహా అందరికీ అభినందనలు ● ఎంపీ అపరాజిత కొరాపుట్: జెన్–జీతో సహా అందరికీ అభినందనలు అని బీజేపీకి చెందిన భువనేశ్వర్ ఎంపీ అపరాజితా షడంగి అన్నారు. కొరాపుట్ జిల్లాలోని సిమిలిగుడ కాలేజీలో శనివారం జరిగిన వార్షికోత్సవ సభలో ప్రసంగించి ఆశ్చర్య పరిచారు. బీజేపీ నేతల నోట పలకని జెన్–జీ పదాన్ని అపరాజిత ఉటంకించారు. తాను జెన్–జీతో పాటు వారికన్నా చిన్న వారికి కూడా అభినందనలు తెలియజేశారు. 26 ఏళ్ల క్రితం కొరాపుట్ జిల్లా కలెక్టర్గా పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ రోజు తాను కొరాపుట్ జిల్లాకు రావడం పుట్టింటికి వచ్చినట్లయిందన్నారు. 1999–20 మధ్య తాను కొరాపుట్ జిల్లాలోని 14 సమితుల్లో కలియ తిరిగానని గుర్తు చేసుకున్నారు. తాను రాజకీయాలలో ఉన్నప్పటికీ కొరాపుట్ ప్రజల కుటుంబ సభ్యురాలినేనన్నారు. విద్యార్థులు దేశ భవిష్యత్ నిర్మాతలన్నారు. పుస్తకాలు చదవాలని యువతకి నిర్ధేశించారు. తన పిల్లలకు కూడా కఠోర పరిశ్రమ నేర్పించానన్నారు. సిమిలిగుడలో సీతం ఇంజినీరింగ్ కాలేజీలో 2000 మందికి పైగా విద్యార్థులు చదువుతుండడం అభినందనీయమన్నారు. భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాక్రిష్టన్ ముందుతరాలకు విద్య కోసం బాటలు వేశారన్నారు. విద్య క్రమశిక్షణకు ముందు మార్గమన్నారు. యువత పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు. ధమంజోడిలోని భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) కూడా ఈ ప్రాంతంలో విద్యకి సహకరించాలన్నారు. సిమిలిగుడ కాలేజీలో తాను లేబరోటరీ సందర్శించానన్నారు. నాల్కో పెద్ద మనసు చేసుకొని కాలేజీ లెబరోటరీకి ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. తాను 24 ఏళ్లు ఐఏఎస్గా ఏన్నో ప్రాంతాల్లో పని చేసినట్టు పేర్కొన్నారు. భువనేశ్వర్ నుంచి రెండుసార్లు లోక్సభకి ఎన్నికయ్యాన్నారు. తన తల్లిదండ్రులు కూడా సామన్య ఉపాధ్యాయులేనని గుర్తు చేసుకున్నారు. తరగతిలో ఉపాధ్యాయులు ఒక పిరియడ్లో 45 నిమిషాల బోధన దేశ భవిష్యత్పై ఆధారపడి ఉందన్నారు. అందుకే ఉపాధ్యాయులు తరగతి గదిలో బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. తన మిత్రులలో తెలుగు కూడా ఉన్నారన్నారు. అనేక భాషలపై పట్టు సాధించాలని యువతకి సూచించారు. ఇంగ్లిష్ అవసరమే గానీ ఒడియాకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అపరాజీత పేర్కొన్నారు. అంతకు ముందు దమంజోడి రైల్వే స్టేషన్లో అపరాజితాకి బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్మికుల సమావేశంలో మొక్కలు నాటారు. సిమిలిగుడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. పలు చోట్ల పార్టీలకు అతీతంగా ప్రజలు స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో సునాబెడా మున్సిపల్ చైర్మన్ రాజేంద్ర కుమార్ పాత్రో పాల్గొన్నారు. -
మందుల కొరత లేకుండా చర్యలు
టెక్కలి రూరల్: స్థానిక జిల్లా ఆస్పత్రిలో మందుల కొరతపై ఈనెల 7వ తేదీన సాక్షి పత్రికలో ప్రచురితమైన ఎమర్జెన్సీ డ్రగ్ కొరత అనే వార్తకు ఆస్పత్రి సూపరిండెంటెంట్ బి.సూర్యారావు శనివారం స్పందించి ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిలో భాగంగా ఇకపై మందుల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిరోజూ 600లకి పైగా ఓపీలు రావ డం వలన ఆ ఇంజక్షన్ అందుబాటులో లేకుండా పోయిందని, ఇకపై అలాంటి పొరపాటు రాకుండా, రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని తెలిపారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): డ్రైవర్లకు నష్టం చేసే 2023 నూతన మోటార్ యాక్ట్ను సవరించాల ని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్టు వర్క ర్స్ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం ఎన్జీవో హోమ్లో టి.తిరుపతిరావు అధ్యక్షతన డ్రైవర్ల ప్రథమ మహాసభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా వామనమూర్తి మాట్లాడు తూ.. డీజీల్, పెట్రోల్ ధరల మీద వేసిన వ్యాట్ జీఎస్టీ, సెస్ పన్నులు రద్దు చేయాలని.. జరిమానాలు పెంచే జీవో నంబర్ 21, 31 రద్దు చేయాలన్నారు. ఆటోలు, వ్యాన్లు, కార్లు, జీపులపై ఉన్న పోలీస్ ఆర్టీవో ఈ చలనాలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జరిగే జైల్ భరో కార్యక్రమంలో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నా రు. గౌరవ అధ్యక్షులుగా ఈ.తిరుపతిరావు, కన్వీనర్గా వి.ఎస్.సురేష్, కో–కన్వీనర్గా డి. యోగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా రాము, సూరాల గోపి, రమణమూర్తి, రాజు, సూరిబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కవిటి: మండలంలోని జాడుపుడి జంక్షన్ సమీపంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమా దం తప్పింది. స్థానికులు అందించిన సమాచా రం ప్రకారం.. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న లాంగ్ లగేజీ లారీని అదేమార్గంలో వెళ్తున్న బొలేరో పికప్ వాహనం ఢీకొంది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో బొలేరో వాహనం టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో వాహనం అదుపుతప్పి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ రూటు మారి డివైడర్ పైకి ఎక్కేసింది. దీంతో లారీపై ఉన్న లగేజీ చెల్లాచెదురుగా పడ్డాయి. రోడ్డును క్లియర్ చేసే క్రమంలో రోడ్డుపై పడిన సామగ్రిని ప్రొక్లెయిన ర్ల సాయంతో తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు వెంటవెంటనే ప్రారంభించా రు. కవిటి పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హిరమండలం: ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులో నాబార్డు భాగస్వామ్యం అయ్యిందని సీజీఎం గోపా ల్ తెలిపారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు తాగునీటిని అందించేందుకు ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.700 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు నాబార్డు రూ.124 కోట్లు సమకూర్చింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనుల పనితీరును సీజీఎంతో కూడిన అధికారుల బృందం శనివారం పరిశీలించింది. వంశధార రిజర్వాయర్ వద్ద చేపడుతున్న ఇంటెక్ వెల్, పంపు హౌస్, 529 మీటర్ల అప్రోచ్ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్తో పాటు అక్కడి నిర్మాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీజీఎం గోపాల్ మాట్లాడుతూ పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో కిడ్నీ వ్యాధుల దృష్ట్యా సురక్షిత నీటిని అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకం మంజూరైన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి పథకంలో నాబార్డు భాగస్వామ్యంగా ఉన్నందున ఆనందం వ్యక్తం చేశారు. వారితో పాటు స్థానిక వంశధార అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన యోగా పోటీలు
నరసన్నపేట: జిల్లాస్థాయి యోగా పోటీలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక ప్రైవేటు కల్యాణ మండపంలో జిల్లాస్థాయి యోగాసన చాంపియన్–2026 ఐదో క్రీడా పోటీలు శనివారం యోగాసన స్పోర్ట్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ట్రెడిషన్ యోగా, ఆర్టిస్పిక్ యోగా, రిథమిక్ యోగా అంశాల్లో ఆరు విభాగాల్లో పోటీలు జరిగాయి. మొత్తం 310 మంది పోటీల్లో పాల్గొనగా ఒక్కో విభాగం నుంచి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు మెడల్స్, ధ్రువపత్రాలు అందజేశారు. ఇక్కడ గెలుపొందినవారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నేషనల్ యోగా స్పోర్ట్ ఫెడరేషన్ (ఎన్వైఎస్ఎఫ్) ప్రతినిధి తంగి స్వాతి, కార్యదర్శి కేదారినాథ్, పతంజిలి యోగా రాష్ట్ర అధ్యక్షుడు దంపల చిన్నబాబు, వివేకనంద ధ్యాన యోగా సమితి అధ్యక్షుడు కింజరాపు రామారావు, యోగా గురువులు సదాశివుని రవి, వండాన సుప్రజ, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. -
పెంపొందించుకోవాలి
విజ్ఞానాన్ని.. విజ్ఞాన ప్రదర్శనకు విచ్చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పర్లాకిమిడి: విద్యార్థులు ప్రాథమిక దశనుంచే విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వక్తలు అన్నారు. పట్టణంలోని సొండివీధి వద్ద ఉన్న సరస్వతీ శిశు విద్యామందిర్లో శనివారం జ్ఞాన విజ్ఞాన మేళాను నిర్వహించారు. ఎస్కేసీజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ (కెమిస్ట్రీ) డాక్టర్ సునశ్రీ మిశ్రా రిబ్బన్ కట్చేసి మేళాను ప్రారంభించారు. ముఖ్యవక్తగా ఎస్కేసీజీ కళాశాల అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టర్ సౌరభ్ మహాంత, మహాంత రామానంద్ దాస్, శిశుమందిర్ విద్యాకమిటీ కార్యదర్శి చంద్రశేఖర్ పట్నాయక్, ఉపాధ్యక్షులు సంజయ్ జెన్నా, మాజీ బీఈవో బాలక్రిష్ణ మఝి పాల్గొన్నారు. విద్యాలయ కమిటీ అధ్యక్షులు సుభాష్ చంద్ర జమాదార్ అధ్యక్ష వహించారు. జ్ఞాన విజ్ఞాన మేళాలో ముఖ్యఅతిథి మాట్లాడుతూ.. విద్యార్థులు విజ్ఞాన మేళాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రాజెక్టులు ప్రదర్శించడానికి దోహదపడుతోందని డాక్టర్ సునశ్రీ మిశ్రా అన్నారు. ఈ సందర్భంగా సౌరశక్తి, పవన్ శక్తి, జలవిద్యుత్, భూకంపాలు ఏర్పడినప్పుడు తట్టుకునే ఇళ్ల నిర్మాణం, భవిష్యత్తులో సూర్యరశ్మితో విద్యుత్ ప్రాజెక్టులు, సాగునీరు అందించే యంత్రాలు తదితర 130 ప్రాజెక్టులను వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించారు. వాటన్నిటిని న్యాయనిర్ణేతలు, ప్రొఫెసర్లు సందర్శించి వాటి ఉపయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుది ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులు ప్రాజెక్టులు ఈనెల 22న గంజాం జిల్లా హింజిలికాటు విద్యాలయంలో జరగనున్న ఫైనల్స్ పోటీలకు అర్హత సాధించినట్టు విద్యాలయం ప్రధాన ఆచార్యులు సరోజ్ పండా తెలిపారు. కార్యక్రమంలో ఏడుగురు సైన్స్ ఉపాధ్యాయులకు ముఖ్యఅతిథి చేతులమీదుగా దుశ్శాలువతో సన్మానించారు. సీనియర్ ఉపాధ్యాయులు శ్రద్ధామయ పాఢి సమన్వయకర్తగా వ్యవహారించారు. -
పెన్షన్ వాలిడేషన్ బిల్లును రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వాలిడేషన్ బిల్లును వెంటనే రద్దు చేయాలని పెన్షన ర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో బొడ్డేపల్లి జనార్ధనరావు అధ్యక్షతన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రధాన కార్యద ర్శి మణికొండ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ .. ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, కార్మికు లు దాచుకున్న సుమారు రూ.13 లక్షల కోట్ల ఈపీఎఫ్ ఫండ్ను కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం దారాదత్తం చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభు త్వం వెంటనే 12వ పీఆర్సీని నియమించి, 30 శాతం ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు దొంతం పార్వతీశం, కోశాధికారి పి.సుధాకర్, ఉపాధ్యక్షుడు బి.నర సింహరావు, కార్యదర్శులు కె.చంద్రశేఖరరావు, బి. సూర్యనారాయణ, బి.లక్ష్మణరావు, ఎల్.అనంతరా వు, సీహెచ్ శ్రీనివాసరావు, సీహెచ్ సూర్యనారాయ ణ, బి.సూర్యరావు, పి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర వివరాలు వెల్లడించాలి
కొరాపుట్: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్ నుంచి ఒకేసారి 180 మంది విద్యార్థులు వీడడంపై సమగ్ర వివరాలు ప్రభుత్వం వెల్లడించాలని ప్రతి పక్ష బీజేడీకి చెందిన మాజీ ఎంపీ రమేష్ చంద్ర మజ్జి డిమాండ్ చేశారు. శనివారం నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితి బొడ టెమర గ్రామ పంచాయతీ సన్న టెమర గ్రామంలో బీజేడీ బృందం పర్యటించింది. హాస్టల్ని సందర్శించింది. హాస్టల్లో ఉన్న విద్యార్థులతో రమేష్ మజ్జి సంభాషించారు. హాస్టల్లో గదుల పైభాగం నుంచి వర్షం నీరు రావడం గమనించారు. అనంతరం విద్యార్థులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పరిశుభ్రత లోపం, మరుగుదొడ్ల దుస్థితిని పరిశీలించారు. అనంతరం గ్రామస్తులు కూడా విద్యార్థులు పడుతున్న కష్టాలను వివరించారు. రెండు గదులలో 180 మంది విద్యార్థులకు వసతి కల్పించడం పట్ల రమేష్ ఆశ్చర్య పోయారు. అనంతరం విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం సునిత దృష్టి సారించాలన్నారు. వారి కష్టాలను అడిగి తెలుసుకుని సమస్య పరిష్కరించాలన్నారు. జిల్లాలో ప్రతీ హాస్టల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. జిల్లా పరిషత్ సభ్యులు, సర్పంచ్లు, సమితి చైర్మన్లు, సమితి సభ్యులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. -
సరుకు రవాణా 81.40 మిలియన్ టన్నులు
● కొత్త ఆర్థిక సంవత్సరంలో తూర్పు కోస్తా రైల్వే ఘనత భువనేశ్వర్: కొనసాగుతున్న 2026–27 ఆర్థిక సంవత్సరంలోని మొదటి 4 నెలల్లో తూర్పు కోస్తా రైల్వే గణనీయంగా సరుకు రవాణా చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు తూర్పు కోస్తా రైల్వే సమగ్రంగా 81.40 మిలియన్ టన్నుల సరుకు లోడింగ్ను నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై మధ్య జోన్ వ్యాప్తంగా వివిధ మండలాల వారీగా సరుకు రవాణాలో ఖుర్దా రోడ్ మండలం అగ్ర స్థానంలో నిలిచింది. కొత్తగా ఏర్పాటైన రాయగడ మండలం ధీటైన పని తీరుని ప్రదర్శించింది. ఖుర్దారోడ్ మండలం 59.02 మిలియన్ టన్నులు, రాయగడ మండలం 13.71 మిలియన్ టన్నులు, సంబల్పూర్ మండలం 8.67 మిలియన్ టన్నుల సరుకు రవాణాను నిర్వహించాయి. రాయగడ మండలం సాఫల్యం కీలకం.. కొత్తగా ఏర్పాటైన రాయగడ రైల్వే మండలం తూర్పు కోస్తా రైల్వే సరుకు రవాణా రంగంలో గణనీయమైన పాత్ర పోషించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈ మండలం 13.71 మిలియన్ టన్నుల సరుకును లోడ్ చేసింది. పునర్వ్యవస్థీకరించిన రైల్వే నెట్వర్క్లో సరుకు రవాణా పరంగా రాయగడ మండలం ప్రాముఖ్యతను చాటుకుంది. కేవలం జూలై నెలలో రాయగడ మండలం 3.14 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. ఈ మండలం ప్రధానంగా సరుకులలో ఇనుప ఖనిజం రవాణా చేసింది. జూలై నెలలో అత్యధికంగా 2.28 మిలియన్ టన్నుల లోడింగ్ చేయగా 0.19 మిలియన్ టన్నుల బాకై ్సట్ లోడింగ్ నమోదు కావడం విశేషం. జోన్ వ్యాప్తంగా అధికారులు, సిబ్బంది అంకితభావంతో తూర్పు కోస్తా రైల్వే గణనీయంగా సరుకు రవాణా చేయడం సాధ్యమైందని జనరల్ మేనేజర్ అభినందించారు. -
వర్షాలపై ఆందోళన వద్దు
● హెచ్చరిక స్థాయి కంటే దిగువనే నదుల నీటిమట్టాలు ● మంత్రి సురేష్ కుమార్ పూజారి ● వరద నష్టాలు వేగవంతంగా అంచనా వేయాలని ఆదేశం భువనేశ్వర్: రాష్ట్రంలో వర్షాల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నదుల్లో నీటి మట్టాలు హెచ్చరిక స్థాయిల కంటే దిగువన కొనసాగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి శనివారం తెలిపారు. స్థానిక లోకసేవా భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకస్మిక విపత్తు నిర్వహణ కోసం సహాయక సంస్థలను అప్రమత్తంగా ఉంచామన్నారు. శనివారం ఉదయం నయాగడ్ జిల్లా కేంద్రాపడాలో అత్యధికంగా 137 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. సంబల్పూర్ జిల్లా కుచిందాలో 115 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, డెరాబిష్లో 108 మిల్లీ మీటర్లు, జాజ్పూర్ జిల్లా బొడొచొణ ప్రాంతంలో 96 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దేవ్గడ్, కెందుఝర్, కటక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సుమారు 59 నుంచి 60 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. వర్షాలతో ముప్పు లేదు ఈ వర్షాల వల్ల తక్షణ ముప్పు ఏమీ లేదని మంత్రి సురేష్ కుమార్ పూజారి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇటీవలే వరదల నుంచి కోలుకుంటున్న ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర, మధ్య, దక్షిణ ఒడిశా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారిక సూచనలను పాటించాలన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రజలు సమీపంలోని తహసీల్ కార్యాలయం, మండల అభివృద్ధి అధికారి లేదా జిల్లా కలెక్టర్ను సంప్రదించాలన్నారు. జాజ్పూర్, బాలేశ్వర్, భద్రక్లలో ఇటీవలి వరదల నీరు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఆయా ప్రాంతాల్లోని ప్రధాన నదుల్లో నీటి మట్టాలు హెచ్చరిక స్థాయిల కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. మహానది, నరాజ్ బ్యారేజీ నీటిమట్టం హెచ్చరిక స్థాయి కంటే తక్కువగా ఉందన్నారు. కుశభద్ర, దేవి, బ్రాహ్మణి, బైతరణి, బుఢాబొలొంగొ, సువర్ణ రేఖ, జలకా, రుషికుల్య, వంశధార నదుల్లో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రెండు రోజుల్లో నష్ట నివేదిక రాష్ట్రవ్యాప్తంగా వరద నష్ట అంచనా తుది నివేదికల దాఖలు వేగవంతం చేయాలని మంత్రి సురేష్ కుమార్ పూజారి జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు. వరద నీరు ఇంకా పూర్తిగా తగ్గని కొన్ని జిల్లాల నుంచి పరిస్థితులు మెరుగుపడిన వెంటనే తమ అంచనాలను సమర్పించాలన్నారు. నష్టం అంచనాలను ఆలస్యం లేకుండా పూర్తి చేసి నష్ట పరిహారం చెల్లింపులను వేగవంతం చేసి తుది నివేదికలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన నిధుల నుంచి ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయాలన్నారు. ఇప్పటివరకు అందిన ప్రాథమిక అంచనా ప్రకారం వరదల వల్ల దాదాపు 23 జిల్లాలు పాక్షికంగా ప్రభావితమై 3,567 ఇళ్లు దెబ్బతిన్నాయి. సుమారు 37,297 హెక్టార్ల వ్యవసాయ భూమి నష్టపోయినట్లు నివేదికలు దాఖలు అయ్యాయి. మిగిలిన ప్రాంతాల నుంచి నివేదికలు అందిన తర్వాత నష్ట పరిమాణం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విద్యుత్, మహిళా, శిశు అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలతో పాటు ఇతర శాఖలను కూడా రంగాల వారీగా నష్ట నివేదికలను సమర్పించాలని సూచించారు. సమావేశానికి ప్రత్యేక సహాయ కమిషనర్ రాజేష్ ప్రభాకర్ పాటిల్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శుభా శర్మ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
చేనేత వస్త్రాలను ఆదరించండి
భువనేశ్వర్: జాతీయ చేనేత దినోత్సవం(12వ)లో భాగంగా ఒడిశా చేనేత వస్త్రధారతణతో నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రేక్షకులను ఔరా అనిపించింది. చేనేత సంప్రదాయం, నేత కార్మికుల విశిష్ట నైపుణ్యత ఆధునిక దృక్పథాన్ని ఈ కార్యక్రమంలో ప్రదర్శించడం విశేషం. రాష్ట్ర చేనేత, వస్త్ర మరియు హస్తకళల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలోని సాంప్రదాయ నేత కార్మికులను ఆధునిక ఫ్యాషన్ పోకడలతో అనుసంధానపరచి చేనేత కార్యకలాపాలు ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ర్యాంప్ షోను, భువనేశ్వర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ’ (నిఫ్ట్), ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన లివా వర్గాలు 4 సీక్వెన్సులలో వస్త్రధారణ ఒంపుసొంపుల్ని ప్రదర్శించారు. నిఫ్ట్ భువనేశ్వర్ ప్రదర్శించిన మొదటి రెండు సీక్వెన్సులలో జీఐ ట్యాగ్ సాధించిన చేనేత వస్త్రాలతో తయారు చేసిన రెడీమేడ్ వస్త్రధారణ ఆకర్షణని ప్రదర్శించారు. దీని తర్వాత ఆదిత్య బిర్లా గ్రూప్ వారి ‘లివా’ బృందం సభ్యులు సంప్రదాయ చేనేత, సమకాలీన ఫ్యాషన్ యొక్క విశిష్టమైన సమ్మేళనాన్ని ప్రదర్శించారు. ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమం మగ్గం సమాజాన్ని గౌరవించి ప్రాంతీయ హస్తకళా సమూహాల ప్రోత్సాహంతో ఒడిశా చేనేత వస్త్రాలను ప్రపంచ ఫ్యాషన్ రంగంలో ఉనికిని బలపరిచే దిశలో ప్రభుత్వం నిరంతర నిబద్ధతను ప్రతిబింబించింది. -
వ్యవసాయాధికారులు కఠిన నిర్ణయం
● మహాలక్ష్మి ట్రేడర్స్ ఎరువుల విక్రయ లైసెన్స్ రద్దు ● 740 బస్తాల అమ్మోనియం సల్ఫేట్ స్వాఽధీనం రాయగడ: వ్యవసాయశాఖాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాయగడ పట్టణంలోని మహాలక్ష్మి ట్రేడర్స్లో అక్రమంగా అమ్మోనియం సల్ఫేట్ ఎరువులను నిల్వ చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై చర్యలు చేపట్టారు. సంస్థ ఎరువుల విక్రయ లైసెన్స్ను నెల రోజూలు రద్దు చేయడంతో పాటు పాయింట్ ఆప్ సేల్ (పీవోఎస్) యంత్రాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి అందిన సమాచారం మేరకు.. జూలై 31వ తేదీన వ్యవశాయ శాఖ అధికారులు మహాలక్ష్మి ట్రేడర్స్కు సంబంధించి పలు గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాయగడ సమీపంలోని అన్నపూర్ణ రైస్ మిల్లులోఉన్న స్టాక్ పాయింట్ నుంచి 740 బస్తాల అమ్మోయం సల్ఫేట్ ఎరువులను అధికారులు గుర్తించారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకపొవడంతో విక్రయానికి సంబంధించి అక్రమాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లొ భాగంగా ఛత్తీస్గఢ్లొని భిలాయ్కు చెందిన సంబంధిత తయారీ సంస్థను అధికారులు సంప్రదించగా మహాలక్ష్మి ట్రేడర్స్కు తాము ఈ రకమైన ఎరువులను విక్రయించలేదని తేలింది. దీంతో వ్యవహారాన్ని వ్యవసాయ శాఖ అధికారులు మరింత తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా శుక్రవారం సమితి వ్యవసాయ శాఖ అధికారి శ్యామ్ ముర్ము నేతృత్వంలోని అధికారులు మహాలక్ష్మి ట్రేడర్స్కు చేరుకుని యజమాని కె.రమేష్ పేరిట ఉన్న లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ (రద్దు) కాలంలో సంస్థ ఎలాంటి ఎరువులను కొనుగోలు చేయడం, విక్రయించడం చేయరాదని స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న పీవోఎస్ యంత్రాన్ని వ్యవసాయ శాఖ ఆధీనంలో ఉంచారు. జిల్లాలో ఎరువుల అక్రమ నిల్వలు, నల్లబజారును ఏమాత్రం సహించబోమని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి స్పష్టం చేశారు. అక్రమ రవాణా, నల్లబజారును అరికట్టేందుకు ప్రత్యేక ఎన్ఫొర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు ఎరువులతో ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు చెప్పారు. ఇదిలాఉండగా జిల్లాలోని బిసంకటక్ సమితిలోని ఓ ఎరువుల గొదాముపైనా అధికారులు దాడి చేశారు. సంబంధిత సంస్థకు ఎరువులు విక్రయించేందుకు అనుమతి లైసెన్స్ లేకపోయినప్పటికీ అక్కడా ఎరువుల బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. అవి మార్క్ఫెడ్ నుంచి సరఫరా అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతుంది. మహాలక్ష్మి ట్రేడర్స్ వద్ద లభించిన ఎరువులు ఎక్కడ నుంచి వచ్చాయి, గొదాముకు ఎలా చేరాయి, రైతులకు విక్రయించారా, మార్క్ఫెడ్ నుంచి లైసెన్స్ లేని సంస్థ వద్దకు ఎరువులు ఎలా చేరాయి, సరఫరా వ్యవస్థలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా అనే అంఽశంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎరువుల అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యల వల్ల నేరుగా రైతులపై ప్రభావం పడుతుందని రైతు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి అక్రమాలకు, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కొరుతున్నారు. -
నకిలీ ఉద్యోగ నియామక ప్రకటన
● ఒకరు అరెస్టు మల్కన్గిరి: జిల్లాలో ఇటీవల వైరల్ అయిన నకిలీ ఉద్యోగ నియామక ప్రకటన వ్యవహారంలో పోలీసులు ఒకరిని శనివారం అరెస్టు చేశారు. ఎస్డీపీవో దివ్యరంజాన్ దలై తెలిపిన వివరాల మేరకు.. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మంచిన వ్యక్తి ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా భువనేశ్వర్కు చెందిన విశ్వజీత్ జెనాగా గుర్తించారు. శనివారం పోలీసులు నిందితుడు విశ్వజీత్ను మల్కన్గిరికి తీసుకొచ్చారు. ఆయన వద్దనుంచి 3 సెల్ఫోన్లు, బ్యాంక్ పాస్పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని ఐఐసీ దేవదత్తు మల్లిక్ తెలిపారు. -
జ్వరంతో కేజీబీవీ విద్యార్థిని మృతి
● సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి దుర్గిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే విద్యాలయం సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలు లాంజిపదర్ గ్రామానికి చెందిన పూర్ట గంట కుమార్తె భూమిక గంటా (17)గా గుర్తించారు. భూమికకు ఈ నెల ఐదో తేదీన జ్వరం రావడంతో వార్డెన్ ఆమెను దుర్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. అనంతరం కేజీబీవీ వసతి గృహానికి తీసుకువచ్చారు. అయితే ఈ నెల ఆరో తేదీ అర్ధరాత్రి సమయంలో భూమికకు జ్వరంతో పాటు విరేచనాలు, వాంతులు కావడంతొ మరోసారి దుర్గి ఆరోగ్య కేంద్రంలో చేర్పించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్న అనంతరం భూమికను బిసంకటక్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు.. అక్కడ నుంచి స్థానిక క్రిస్టియన్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భూమిక శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారంగానే తమ కుమార్తె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పాఠశాల నిర్వాహకులు కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అనంతరం భూమిక మృతదేహాన్ని ఆంబులెన్స్లో స్వగ్రామమైన లాంజిపదర్ గ్రామానికి తరలించారు. కమిషనరేట్ పోలీసులకు రాష్ట్రపతి పతకాలు భువనేశ్వర్: ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పతకాలకు కటక్, భువనేశ్వర్ జంట నగరాల కమిషనరేట్ పోలీసులు ఎంపికయ్యారు. వారిలో విశిష్ట సేవకు భువనేశ్వర్ ఓఎస్ఏపీ 7వ బెటాలియన్, డీసీపీ (సాయుధ) ప్రఫుల్ల కుమార్ సింగ్, మెరిటోరియస్ సేవకు కటక్ కమిషనరేట్ పరిధిలో బారంగ్ పోలీస్ ఠాణా ఏఎస్ఐ నిగమానంద మహా పాత్రో ఎంపిక కావడం విశేషం. వీరికి భువనేశ్వర్, కటక్ జంట నగరాల పోలీస్ కమిషనర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వారి అచంచలమైన అంకిత భావం, అసాధారణ నాయకత్వం, కర్తవ్యంపై వారి నిబద్ధత, ఆదర్శప్రాయమైన సేవ స్ఫూర్తినిస్తాయని అభినందించారు. నీటిలో మునిగి బాలుడు మృతి మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 పోలీస్ స్టేషన్ పరిధిలో లచ్చిపేటలో శనివారం తల్లిదండ్రులతో కలిసి పొలానికి మూడేళ్ల బాలుడు అమాన్ మాడీ (3)ని తీసుకెళ్లారు. పొలానికి సమీపంలోని నీటిగుంతలో మునిగి బాలుడు మృతి చెందాడు. లచ్చా మాడీ, సుఖీ మాడీ పొలం పనులు చేసుకొని లచ్చాపేటలో నివాసిస్తున్నారు. వారికి మూడేళ్ల కుమారుడు అమాన్ మాడీ, నాలుగు నెలాల బాబు ఉన్నారు. శనివారం ఉదయం ఇద్దరినీ పొలం పనుల వద్దకు వెంట తీసుకెళ్లారు. బాబును చూడమని గట్టుపైన ఉన్న పాక వద్ద ఉంచారు. అమాన్ సమీపంలో నీటిగుంత వద్దకు వెళ్లాడు. అక్కడ ఆడుతూ అందులో పడిపోయాడు. నీరు ఉండటంతో మునిగిపోయాడు. కొంత సమయానికి అమాన్ కనిపించకపోవడంతో తల్లి సుఖీ చుట్టు పక్కల వెతికింది. జాడ లేకపోవడంతో అక్కడే ఉన్న గుంత వద్ద వెతికారు. అందులో అమాన్ తేలుతూ కనిపించాడు. తండ్రి లచ్చా మాడీ వెంటనే దిగి బాబును బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. సమీపంలో ఉన్న గ్రామస్తులు అంతా వచ్చి ఎంవి 79 పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అర్జున్ బాంక సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
సహకార అర్బన్ బ్యాంకు అభివృద్ధికి కృషి
పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని కోపరేటివ్ అర్బన్బ్యాంకుకు ఇప్పటివరకూ సొంత భవనం లేనందున తక్షణమే నిర్మాణం చేయాలని బ్యాంకు మాజీ అధ్యక్షులు అభిమన్యు పండా కోపరేటివ్ బ్యాంకు శతవార్షిక సమావేశంలో ప్రస్తావించారు. అలాగే ప్రజలకు హౌసింగ్ లోన్, బడ్జెట్, ఆర్బీఐ. రిపోర్టు, ఆర్థిక లావేదేవీలు కూడా ఆయన ప్రస్తావించారు. ఈ శతవార్షిక సమావేశంలో స్థానిక జంగంవీధి సింహాద్రి ఫంక్షన్ హాలులో శనివారం ఉదయం జరిగింది. పురాతన అర్బన్ కోపరేటివ్ బ్యాంకు శతవార్షిక సమావేశంలో అప్పటి మాజీ అధ్యక్షులు స్వర్గీయ ఐ.సాంబశివరావు, మాజీ అధ్యక్షులు ఎ.శంకర్ రావుల సంస్మరణార్ధం ఐదు నిమిషాలు సభ్యులు మౌనం పాటించారు. బ్యాంకు యువ డైరెక్టర్ ఆదర్శదాస్ అతిధి పరిచయం, స్వాగత ఉపన్యాసం చేయగా, ఈవో, కార్యదర్శి పంకజ నాయక్ బ్యాంకు వార్షిక పట్టిక, ఆదాయం, వ్యయం చదివి వివరించారు. ప్రస్తుతం బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగైందని అన్నారు. మాజీ డైరెక్టర్లు ప్రదీప్ నాయక్, దిలీప్ దాస్, వి.వి.రమణమూర్తి పంతులు, అభిమన్యుపండా, దేవేంద్రదాస్లను బ్యాంకు అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలరు, ఉపాధ్యక్షులు ఎ.అమ్ములమ్మ, డైరెక్టర్ జమాదార్ పట్నాయక్, లక్ష్మీకాంత పోరిచ్చా, డి.అప్పారావు, గీతాంజలి పండా ఉన్నారు. -
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
పర్లాకిమిడి: మొక్కలతోనే పర్యావరణ పరిక్షణ సాధ్యమని వక్తలు అన్నారు. కాశీనగర్ బ్లాక్ రాణిపేట వద్ద నియాతీ మానసిక దివ్యాంగుల విద్యాలయంలో ప్రగతి మహిళా సంఘటన్, వినోదినీ సైన్స్, ఆర్ట్స్ ప్లస్టు కళాశాలలోని రెడ్క్రాస్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వన మహోత్సవం శనివారం చేపట్టారు. పర్లాకిమిడి ఆదర్శ పోలీసుస్టేషన్ ఐఐసీ ప్రశాంత భూపతి పాల్గొని మొక్కలను నాటారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మనోజ్కుమార్ పట్నాయక్, కో–ఆర్డినేటర్ రవీంద్ర పాణిగ్రాహి, యువ రెడ్క్రాస్ కో–ఆర్డినేటర్ కల్పలా పండా తదితరులు పాల్గొన్నారు. -
వదినపై మరిది దాడి
రాయగడ: వ్యవసాయ భూమి వివాదం ఒక కుటుంబంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూతగాదా చివరకు వదినపై దాడికి దారితీయడంతో ఆమె తీవ్రగాయాలపాలయ్యింది. ఈ ఘటన జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి ధమునిపంగ పంచాయతీ కొత్తగుడ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూర్ణ పలక అనే మహిళ తన వ్యవసాయ భూమిలో పనులు నిర్వహిస్తుండగా ఆమె మరిది పతి పాలక కుటుంబీకులు పొలం వద్దకు చేరుకుని పూర్ణ పాలకపై వాగ్వాదానికి దిగారు. భూమి తనదేనంటూ పతి పాలక పట్టుబట్టడంతో ఇరువురి మధ్య వాదన చోటుచేసుకుంది. దీంతో కోపొద్రేక్తుడైన పతి పాలక తన వదిన పూర్ణ పాలకపై దాడి చేశాడు. అనంతరం ఆమెను పొలంలోకి నెట్టివేశాడు. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు వెంటనే పొలం వద్దకు చేరుకుని, గాయాలతో పడివున్న పూర్ణ పాలకను హాస్పిటల్కు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. -
శివార్
పోలాకి: ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాలు లేకపోవటంతో శివారు కాలువల పరిధిలో సాగునీటి కష్టాలు తప్పటం లేదు. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లతో వంశధార అధికారులు పైనున్న ఆయకట్టుకు నీటితడి అందకుండానే కిందకు తరలించే ప్రయత్నాలు చేయడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందులోనూ వంశధార సాగునీటి ప్రాజెక్టు తీర్మానాలతో నిర్మాణం చేపట్టిన డ్రాపులు పగలగొట్టి కిందకు నీటిని తరలించడంతో మేఘవరం చానెల్పై రేగుపాడు బూసయ్య డ్రాపు వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. డీఎల్పురం చానెల్, 16ఆర్ (ప్రియాగ్రహారం) తోపాటు దాదాపు 8వేల ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు అందించటంలో ఈ డ్రాపు ప్రధానమైంది. అలాంటి డ్రాపును జేసీబీతో వంశధార సిబ్బంది తొలగించటంపై రైతుల్లో ఆగ్ర హం కట్టలు తెంచుకుంది. కేవలం మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోని శివారు గ్రామాలకు నీరందించాలనే అధికారులు పనిచేస్తున్నారని రైతులు ఆరోపణలు చేశారు. ఆయకట్టు పరిధిలోని రైతులు అక్కడకు చేరుకుని డ్రాపు తొలగించిన చోటే తాత్కాలిక ఇనుప రేకుతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుని నీటిని నిలువరించారు. ఈ పరిణామాన్ని వంశధార అధికారులు ఊహించలేదు. దీంతో కిందనున్న రైతుల నుంచి అధికారులపై ఒత్తిడి పెరిగింది. దీంతో పోలాకి తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ రంజిత్ అక్కడకు చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. డ్రాపును మళ్లీ నిర్మించేందుకు వంశధార సిబ్బంది హామీ ఇచ్చారని చెప్పటంతో శాంతించారు. -
పేరు ‘సమగ్ర’ం.. తీరు అసమగ్రం
● సమగ్ర శిక్షా ప్రాజెక్టులో లెక్కల చిక్కులు ● రెండు నెలలుగా జీతాలు, బిల్లులు చెల్లించలేని దుస్థితి శ్రీకాకుళం: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు ఏర్పాటైన సమగ్ర శిక్షా ప్రాజెక్టు.. అధికారుల నిర్లక్ష్యం వల్ల అసమగ్రంగా తయారైంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఈ ప్రాజెక్టు జిల్లాలో ని పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. ఇలాంటి ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన రాష్ట్ర అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రాజెక్ట్ రెన్యువల్ ఆలస్యమైంది. కేంద్రం ఈ ప్రాజెక్టుకు విడుదల చేసిన నిధులకు సంబంధించిన లెక్కలను ఏటా ఏప్రిల్, మే నెలలో కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది. రాష్ట్ర సమగ్ర శిక్షా అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి జూన్ నెలలో కూడా నివేదిక పంపకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర శిక్షా ప్రాజెక్టు రెన్యువల్ను నిలుపుదల చేసింది. దేశంలో ఐదు రాష్ట్రాలు రెన్యువల్ కాకుండా ఉండిపోగా అందులో మన రాష్ట్రం కూడా ఉంది. కేంద్ర నిధులు విడుదల కాకపోవడంతో గడిచిన రెండు నెలలుగా సమగ్ర శిక్షాలో లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. ఉద్యోగులకు జీతాలు, వెండర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జూన్లో పిల్లల ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. జీతాలు పడకపోవడంతో అప్పులు చేసి నెట్టుకురావాల్సి వస్తోంది. పెరిగిన నిత్యావసర ధరలు అనునిత్యం వీరికి పరీక్ష పెడుతున్నాయి. ఎట్టకేలకు జూన్ మూడో వారంలో కేంద్రానికి లెక్కలను చెప్పడంతో సమగ్ర శిక్ష ప్రాజెక్టును మరో ఐదేళ్లకు రెన్యువల్ చేసింది. దీంతో నిధులు విడుదలకు మార్గం సుగ మం అయినప్పటికీ కేంద్ర నిధులు విడుదల కాలే దు. దీంతో జూలైలోనూ ఇబ్బందులు తప్పలేదు. -
● ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు
కొరాపుట్: మౌలిక వసతులు లేని కారణంగా 180 మంది విద్యార్థులు హాస్టల్ వీడిన ఘటనపై ప్రభుత్వం రంగంలోకి దిగింది. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితి బొడ టెమెర గ్రామ పంచాయతీ సన్న టెమర గ్రామంలో దర్యాప్తు చే పట్టారు. జిల్లా ప్రణాళికా సంఘం చైర్మన్ హోదాలో ఉన్న బీజేపీకీ చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, జిల్లాస్థాయి సాంఘిక సంక్షేమ, విద్యాశాఖ అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోపణలు నిజమేనని వాంగ్మూలం ఇచ్చారు. హాస్టల్ వంట సిబ్బంది మాట్లాడుతూ వర్షాలు పడితే గదుల పైభాగం నుంచి నీరు వస్తున్నాయని చెప్పారు. హాస్టల్ కోసం నిల్వ చేసిన బియ్యం గోదామ్ను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. మరోవైపు హాస్టల్ వార్డెన్ రాజ్యలక్ష్మి మహరణతో అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. ఆమైపె వచ్చిన ఆరోపణలపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డెన్పై చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులకు నివేదించారు. -
బంగాళాఖాతంలో అల్పపీడన సంకేతం
● మయూర్భంజ్కు రెడ్ వార్నింగ్ భువనేశ్వర్: రాష్ట్రంలో 29 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎమ్డీ) రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతంలో గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వరకు ఉంటుందనే ముందస్తు సమాచారంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. గంగా నది తీర పశ్చిమ బెంగాల్, దాన్ని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్పై ఏర్పడిన తుఫాను వలయం ప్రభావంతో రాగల 24 గంటల్లో వాయువ్య బంగాళా ఖాతం, పరిసర పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 8, 9 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మయూర్భంజ్ జిల్లాకు రెడ్ హెచ్చరిక జారీ అయ్యింది. ఆరెంజ్ హెచ్చరిక బాలాసోర్, భద్రక్, కటక్, సుందర్గడ్, అనుగుల్, ఢెంకనాల్, కెందుఝొర్, సువర్ణపూర్, బౌధ్, బొలంగీర్, కలహండి, కంధమల్, గజపతి మరియు గంజాం సహా 14 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచనతక్ష ఆరెంజ్ హెచ్చరిక జారీ అయ్యింది. పసుపు హెచ్చరిక జాజ్పూర్, కేంద్రాపడా, పూరీ, ఖుర్దా, నయాగఢ్, జగత్సింగ్పూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్గిరి, నవరంగ్పూర్, నువాపడా బర్గడ్, సంబల్పూర్, ఝార్సుగుడ మరియు దేవగడ్లతో సహా 15 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం సంకేతంతో పసుపు హెచ్చరిక జారీ అయ్యింది. ఒడిశా తీరం వెంబడి గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలో మీటర్లు ఉండగా గరిష్టంగా గంటకు 60 కిలో మీటర్ల వరకు ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఆగస్టు 7 నుంచి 8 వరకు సముద్రం అల్లకల్లోలంగా లేదా అత్యంత అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ వ్యవధిలో సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. -
మెరుగు పేరుతో మోసం
కొత్తూరు: కొత్తూరు మండలం కర్లెమ్మ పంచాయతీ పరిధి అఫీషియల్ కాలనీ కి చెందిన ఓ మహిళ మెరుగు బ్యాచ్ చేతిలో మోసపోయారు. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 6వ తేదీన అఫీషియల్ కాలనీకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బంగారం మెరుగు పెడతామని వచ్చారు. కాలనీలోని పొట్నూరు శివకుమారి ఇంటికి వెళ్లి బంగారు ఆభరణాలకు మీ ఇంటి వద్దే, మీ సమక్షంలో మెరుగు పెడతామని చెప్పగా ఆమె ఒప్పకోలేదు. అయినా వారు వినకుండా ఆమెకు నచ్చజెప్పారు. అప్పటికి శివకుమారి ఇంటిలో సామాన్లు సర్దుతు న్నారు. ఓ రాగి బిందెకు వారు మెరుగు పెట్టడంతో.. అది బాగుందని సామాన్లు సర్దుతున్న మనీషా, రాధలకు చెందిన వెండిపట్టీలు మెరుగుకు ఇచ్చారు. అవి బాగా మెరుగు పెట్టడంతో శివకుమారి తన రెండు తులాల బంగారు పుస్తెలతాడు మెరుగు పెట్టాలని దుండగులకు ఇచ్చారు. రాగి బిందెలో పుస్తెలతాడు వేసి కొన్ని రకాల రసాయనాలు వేసి వేడి చేయాలని శివకుమారికి దుండగులు చెప్పారు. తానే వేడి చేస్తానని శివకుమారి చెప్పి తన ఇంటి వంట గదిలోకి రాగి బిందెను తీసుకెళ్లారు. ఆమెతో పాటు దుండగుల్లో ఒక రు వంట గదికి వెళ్లారు. రాగి బిందెలో ఒక రకం పౌడర్ వేయాలని ఆమెకు చెప్పి చాకచక్యంగా ఆమెను వెనక్కి నెట్టి బిందెలో ఉన్న పుస్తెల తాడు తీసుకుని బయటకు వచ్చేశాడు. బిందెలో ఉన్న పుస్తెల తాడు కొంత సమయం అలాగే ఉంచాలని చెప్పి ఇద్దరూ జారుకున్నారు. కాసేపటి తర్వాత ఆమె బిందెను చూడగా అందులో పుస్తెలతాడు లేకపోవడంతో అవాక్కయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు శివకుమారి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు శుక్రవారం స్థానిక ఏఎస్ఐ గోవిందరావు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
నరసన్నపేట: స్థానిక మెయిన్ రోడ్డులో పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ఎదురుగా డివైడర్కు ద్విచక్ర వాహనం ఢీ కొన్న ప్రమాదంలో స్థానిక హ డ్కో కాలనీకి చెందిన గుడ్ల శ్రీనివాసరావు(55) మృతి చెందారు. గురువారం రాత్రి ప్రమాదం జరగ్గా స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో 108 వాహనంలో మృతి చెందారు. ఈ ప్రమాదంపై శ్రీనివాసరావు బార్య గుడ్ల శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కార ణంగా భావిస్తున్నారు. శ్రీనివాసరావు మృతిపై వైఎస్సార్ సీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు పొట్నూరు సాయి ప్రసాద్, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు దండి జయప్రకాశ్ సంతాపం వ్యక్తం చేశారు. కంబకాయ వాసి.. నరసన్నపేట: కంబకాయకు చెందిన లింగిబైరి వైకుంఠరావు(19) రోడ్డు ప్రమాదంలో గాయ పడి చికిత్స పొందుతూ కేజీహెచ్లో శుక్రవారం మృతి చెందాడు. కాకినాడ పీఆర్ కళాశాలలో బీఎస్సీ మూ డో సంవత్సరం చదువుతున్న వైకుంఠరావు తన స్నేహితులతో కలసి బొలేరే వాహనంలో ఒక ఫంక్షన్కు జూలై 29న బయల్దేరారు. ప్రయాణంలో వా హనం బోల్తా పడి తలకు బలమైన గాయం కా వడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, హేమలత కన్నీరు మున్నీరయ్యారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని..శ్రీకాకుళం రూరల్: సింగుపురం పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి వద్ద శుక్రవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని పచ్చళ్ల వ్యాపారి చిన్నారి సత్యనారాయణ (74) మృతి చెందారు. పిఠాపురానికి చెందిన సత్యనారాయణ శ్రీకాకుళం నగరంలో పచ్చళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నా రు. తీవ్రంగా గాయపడిన ఆయనను 108లో రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. రూరల్ ఎస్ఐ రామారావు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆషాఢం సారె సమర్పణ
అమ్మవార్లకురాయగడ: పట్టణంలోని అమ్మవార్లకు ఆషాఢ మాసం సారెను భక్తులు సమర్పించారు. స్థానిక రాణిగుడఫారంలో ఉంటున్న మహిళలు శుక్రవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్కళ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు ఆధ్వర్యంలో రాణిగుడఫారం వద్ద గల మజ్జిగౌరీ అమ్మవారి మండపం ఈ మేరకు ప్రత్యేక పూజలను నిర్వహించి సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. పట్టణ ప్రజల ఆరాధ్య దైవం, గ్రామ దేవతగా స్థానిక భైరవీధిలో పూజలందుకుంటున్న బురదల పోలమ్మ, ఉత్కళాంధ్రుల కోర్కెలు తీర్చే చల్లని తల్లి మజ్జిగౌరీ అమ్మవార్లక సంప్రదాయ బద్ధంగా ఆషాఢమాసం సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ముందుగా రాణిగుడఫారం వద్ద ఉన్న మజ్జిగౌరీ మండపం నుంచి వందలాది మంది మహిళలు సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లి గ్రామదేవత బురదల పొలమ్మకు సమర్పించారు. యాళ్ల కొండబాబు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా తీసుకువచ్చిన పూలమాలను సమర్పించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మజ్జిగౌరీ మందిరానికి చేరుకున్న వీరంతా అక్కడ అమ్మవారికి పూజలు చేసి తమ వెంట తీసుకువచ్చిన సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లే ఆడపడుచులు పట్టణ ప్రజలను చల్లగా చూస్తున్న మజ్జిగౌరీ, బురదల పోలమ్మ అమ్మవార్లను తమ ఇంటి ఆడపడుచులుగా భావించి ఏటా ఆషాఢ మాసంలో సారెను సమర్పిస్తుండటం ఆనవాయితీగా వస్తుందని కొండబాబు తెలిపారు. ప్రతీ ఇంటి నుంచి ఒక్కో రకం వంటకాన్ని మహిళలను తీసుకువచ్చి సారెగా సమర్పించారని అన్నారు. అలాగే పసుపు, కుంకుమ, పూలు, గాజులు, చీర, జాకెట్టు వంటివి అమ్మవారికి సమర్పించారు. అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో పూజిస్తే తమకు ఎల్లవేళలా అండగా నిలుస్తారని అదేవిధంగా వారి చల్లని కరుణా,కటాక్షాలు తమకు ఉంటాయని గట్టినమ్మకంతో మూడేళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని వివరించారు. రైతన్నలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా పేర్కొన్నారు. అమ్మవార్లకు ఈతరహా సారె సమర్పిస్తే వర్షాలు సకాలంలో కురవడంతొ పాటు పంటలు పుష్కలంగా పండి అంతా సుభిక్షంగా ఉంటుందన్న గట్టినమ్మకంతో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎస్డీసీ వైస్ చైర్మన్ మంజుల మినియాక, ప్రముఖ న్యాయవాది బ్రజసుందర్ నాయక్, వీరబాబు పాల్గొన్నారు. -
ఆచార్య బిజయ మిశ్రకి నివాళి
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ చరిత్ర పరిశోధకుడు ఆచార్య బిజయ మిశ్ర అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డులోని ఒక ప్రైవేటు హోటల్లో ఆయన సంస్మరణ సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి, సంఘ సేవకుడు జగన్నాథ మహాపాత్రో తదితరులు బిజయ మిశ్ర సేవలు గుర్తు చేసుకున్నారు. సాహితీ రంగం, చారిత్రాత్మక పరిశోధన, అధ్యాపక వృత్తి, రచనలతో ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పలువురు కవులు, విద్యావేత్తలు, సంఘ సేవకులు పాల్గొన్నారు.చట్టాలపై అవగాహన అవసరం జయపురం: ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన అవసరమని కొరాపుట్ జిల్లా న్యాయసేవా ప్రదీకరణ జయపురం సభ్యులు పేర్కొన్నారు. స్థానిక అరవింద నగర్ ఇరిగేషన్ కాలనీ సాయి అరవింద ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రాంగణంలో చట్టాలపై అవగాహన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చట్టాలపై జిల్లా న్యాయసేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యోమయీ సుజాత వివరించారు. అలాగే విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చైల్డ్ లీగల్ బోర్డు ప్రిన్సిపాల్ మెజిస్ట్రేట్ మధుస్మిత జెన, లీగల్ డిఫెన్స్ చీఫ్ కౌన్సిల్ ప్రమోద దాస్, రచనా రౌత్, లీగల్ ఎయిడ్ అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ ఉదిత్ నారాయణ ప్రసాద్, అరవింద ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సెంటర్ హెచ్ఎం సుశ్మిత మహంతి తదితరులు పాల్గొన్నారు. గుమ్మ బ్లాక్లో వర్షాభావ పరిస్థితులు పర్లాకిమిడి: గజపతి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు గుమ్మాబ్లాక్లో స్పష్టంగా కనిపిస్తున్నా యి. గుమ్మాబ్లాక్లో అంబాజరి గ్రామంలో వరి నారు కాపాడుకోవడానికి భార్యా, భర్తలు పక్కన ఉన్న నూతి నుంచి నీటిని తోడి నారుమడికి అందజేసిన ఘటన రైతుల్లో ఆందోళన కనిపిస్తుంది. అంబాజరి గ్రామంలో దీపక్ గో మాంగో, డంబురు గోమాంగో, సరసునీ గోమాంగో బావిలో నీటిని తోడి నారుమళ్లు వేస్తున్నట్టు తెలియజేశారు.పాముకాటుకు ఇద్దరు బలి పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ బ్లాక్ జోల్లోంగో గ్రామ పంచాయతీ కడంతోలో గ్రామంలో గురువారం రాత్రి విషసర్పాలు కరిచి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గురువారం రాత్రి కడంతోలో గ్రామంలో అజయ్కుమార్ బోడోరయితో తన భార్య లలితా, కొడుకు అమిత్కుమార్ బోడోరయితో, రెండేళ్ల కూతురు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రెండు విషసర్పాలు ఇంట్లోకి వచ్చి భార్య, కొడుకు చేతిపై కాటేశాయి. వారిద్దరూ నురగలు కక్కుతుండగా తండ్రి అజయ్ కుమార్ లేచి చూడగా రెండు విషసర్పాలు కరిచి వెళ్లిపోతుండం గమనించాడు. వాటిని చంపి భార్య లలితా, కొడుకు అమిత్ కుమార్ (7)లను వారి బంధువుల సాయంతో తొలుత రాయగడ బ్లాక్ ఆరోగ్యకేంద్రానికి తరలించాడు. అయితే అక్కడ వైద్యం లభించకపోవడంతో వెంటనే పర్లాకిమిడి ప్రభుత్వ మెడికల్కు తరలించాడు. చికిత్స చేస్తుండగానే వారు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
వర్షాభావంలో ఆరుతడి పంటలే మేలు
కంచిలి: ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేయడమే శ్రేయస్కరమని శ్రీకాకుళం జిల్లా రైతు శిక్షణ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ వెంకటరావు పేర్కొన్నారు. మండలంలోని కొల్లూరు రైతుసేవ కేంద్రం పరిధిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న మీ కోసం కా ర్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఇప్పటికే వరి వేసి ఉన్న పంట పొలాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఆత్మ పథకంలో భా గంగా కొల్లరు గ్రామంలో ఎల్నినో ప్రభావం, పంటల మార్పిడిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్, వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలు శాస్త్రవేత్త డాక్టర్ ఉదయబాబు, మండల వ్యవసాయాఽధికారి కొంకేన సురేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
ఫాస్ట్ఫుడ్ సెంటర్లో కొట్లాట
టెక్కలి రూరల్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఒక ఫాస్ట్ఫుడ్ సెంటర్లో శుక్రవారం కొట్లాట జరిగి ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరినీ ఆస్ప త్రిలో చేర్చారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. నందిగాం మండలం ఆకుల రఘునాథపురం గ్రామానికి చెందిన కె.కేశవరావు(ఆర్మీ ఉద్యోగి) అనే వ్యక్తి టెక్కలి ఫాస్ట్ఫుడ్ సెంటర్లో తిన్న తర్వాత అక్కడ బిల్లు కట్టే విషయంలో ఆ సెంట ర్లో పనిచేస్తున్న మహ్మద్ రాజ్ అనే వ్యక్తితో గొడవ జరిగింది. గొడవలో కేశవరావు అక్కడ ఉన్న సిబ్బందిపై దాడి చేశాడు. ఈ క్రమంలో మహ్మద్ రాజ్ తలపై కొట్టడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో అతడిని హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇదే గొడవలో కేశవరావుకి సైతం చిన్నపాటి గాయం తగలడంతో ఆ వ్యక్తిని సైతం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం హిరమండలం: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం నుంచి బత్తిలి వెళ్తున్న బస్సు గురువారం రాత్రి పాత హిరమండలంలోని కొత్త గౌడవీధి వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది. వర్షం పడుతున్న సమయంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. మట్టిలో కూరుకుపోయి నిలిచిపోయింది. ఆ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా కుదుపునకు గురికావడంతో ఆందోళనకు గురయ్యారు. మట్టిలో కూరుకుపోయి నిలిచిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. శుక్రవారం జేసీబీ సాయంతో గ్రామస్తులు బస్సును గోతి నుంచి బయటకు తీశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలం మర్రిపాడు గ్రామ సమీప రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సంతబొమ్మాళి మండలం విష్ణుచక్రం గ్రామానికి చెందిన ఎన్.రవి అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై పలాస వైపు బయల్దేరారు. కొల్లిపాడు పంచాయతీ గంటపేట గ్రామానికి చెందిన ఎస్.కృష్ణారావు తన భార్యతో కలసి ద్విచక్రవాహనం పై వస్తుండగా పెద్దమర్రిపాడు వద్ద ఈ రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రవి, కృష్ణారావులకు తీవ్ర గాయాలు కావడంతో టెక్కలి జి ల్లా ఆస్పత్రికి తరలించారు. నౌపడ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘వ్యవసాయానికి నీరు ఇవ్వలేం’ రణస్థలం: తోటపల్లి కాలువలకు నీరు వచ్చినా తా గునీటికి ప్రాధాన్యత ఇవ్వగలం తప్ప వ్యవసాయానికి అందించలేమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రణస్థలం మండలంలోని వెల్పురాయి గ్రామంలో రైతన్నా మీ కోసం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల్లో రెండు తప్ప అన్నీ ఇచ్చేశామన్నారు. వర్షపాతం రాష్ట్రంలో 55శాతం లోటు ఉందని, రణస్థలం మండలంలో 49శాతం ఉందని, రణస్థలంలో భూగర్భ జలాలు అట్టడుగున ఉన్నాయని తెలిపారు. తొలుత వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీ, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్లు మాట్లాడుతూ నవ ధాన్యాలు సాగు చేయాలని సూచించారు. నేడు, రేపు రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ సెమినార్ శ్రీకాకుళం న్యూకాలనీ: సాఫ్ట్బాల్ క్రీడలో సరికొత్త విధి విధానాలు, నియమ నిబంధనలను క్రీడాకారులకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీకాకుళంలోని క్రిష్టల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వేదికగా శని, ఆదివారాలు ఏపీ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ సెమినార్ కమ్ అంపైర్ క్లినిక్ నిర్వహించనున్నారు. రాష్ట్ర నలుమూలల ప్రతినిధులతోపాటు క్రీడాకారులు హాజరుకానున్నట్టు ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ మొజ్జాడ వెంకట రమణ తెలిపారు. జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల జాబితా వెల్లడి శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల జాబితాను ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి వెల్లడించారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ క్రీడామైదానం వేదికగా ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2026 పోటీల్లో పాల్గొనే 76 మంది క్రీడాకారుల జాబితాను ప్రకటించారు. అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 బాలబాలికల వయో విభాగాల్లో జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే అథ్లెట్స్ ఈనెల 9వ తేదీన రాత్రి 9 గంటలకు తమ లగేజీతోపాటు పత్రాలు, మూడు పాస్ ఫొటోలతో ఆమదాలవలస రైల్వేస్టేషన్ వద్ద సంఘ ప్రతినిధులు కె. మాధవరావు, చల్లా తవిటిరాజుల వద్ద రిపోర్ట్ చేయాలని మధుసూదన్, సాంబమూర్తి కోరా రు. మరిన్ని వివరాలకు 8500271575 నంబర్ ను సంప్రదించాలని వారు సూచించారు. -
● కష్టపడితేనే ఫలితం
రాయగడ: విద్యార్థులు తమ భవిష్యత్ను ఉజ్వలంగా తీర్చిదిద్దుకొవాలంటే కష్టపడాలని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాఢి అన్నారు. కష్టపడితే తానంతట అదే ఫలితం వస్తోందని.. విద్యార్థులు ఈ విషయాన్ని గట్టిగా నమ్మకొని శ్రద్ధంగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక పితామహాల్లోని వర్సిటీ ప్రాంగణంలో సెంచూరియన్ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం జరిగిన స్వాగత కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం ముందుగా ఉపాధ్యాయులు ద్వీపప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీబీఎస్ఈ, సీహెచ్ఎస్ఈ బోర్డులకు చెందిన 150 మంది ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. పోటీ ప్రపంచంలో క్రమశిక్షణ, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యం ఉందని పాఢి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాత్మక ఆటలు నిర్వహించి కొత్త విద్యార్థులను ఆకట్టుకున్నారు. అనంతరం కేక్ కట్చేసి ఆస్వాదించారు. -
చేనేత వస్త్రాలు ధరించండి: గవర్నర్
వారానికి ఒక్కసారైనాభువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది నేత కుటుంబాలకు మద్దతుగా చేనేతను జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారానికి కనీసం ఒక్కసారైనా చేనేత వస్త్రాలను ధరించాలని ఒడిశా ప్రజలకు గవర్నర్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఈ చర్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది నేత కుటుంబాలకు మద్దతునిచ్చే ఒక శక్తివంతమైన ఉద్యమంగా మారగలదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చేనేత వస్త్రం నినాదంతో స్థానిక ఇడ్కో ప్రదర్శన మైదానంలో ఈ ఏడాది జరుపుకుంటున్న 12వ రాష్ట్ర స్థాయి జాతీయ చేనేత దినోత్సవ ప్రారంభోత్సవం పురస్కరించుకుని గవర్నర్ ప్రసంగించారు. 1905 నాటి స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ దినం భారత దేశ నాగరికత, సంస్కృతి, శతాబ్దాల దేశ నేత వారసత్వాన్ని పరిరక్షించిన నైపుణ్యం గల చేతులకు నివాళి అని గవర్నర్ అభివర్ణించారు. ప్రతి చేనేత వస్త్రం నైపుణ్యం, పట్టుదల, కుటుంబ సంప్రదాయం, మానవ సృజనాత్మకత పెన వేసుకుని ఉంటుందని గవర్నర్ అన్నారు. సంబల్పురి బొంధొ, ఒడిశా ఇక్కత్, బొంకై , ఖండూవా, కోట్పాడ్, హబస్పూరి, బరంపురం పట్టు, గోపాల్పూర్ తస్సర్ వంటి ఒడిశా యొక్క ప్రఖ్యాత చేనేత ఉత్పత్తులు కళాకారుల అంకితభావాన్ని, వ్యక్తిగత స్పర్శను ప్రతిబింబిస్తాయి. చేనేత ఉత్పత్తి కొనుగోలు ఒక కుటుంబానికి మద్దతు ఇచ్చి గ్రామీణ ఉపాధిని బలపరుస్తుంది. మహిళలకు సాధికారత పరిరక్షణతో సంప్రదాయ జ్ఞానం పరిరక్షణ, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందన్నారు. డిజైన్ ఆవిష్కరణ, డిజిటల్ మార్కెటింగ్, పర్యాటక అనుసంధానాలు, సంస్థాగత మద్దతు, సాంకేతికత ఆధారిత ఉత్పత్తుల ఉనికిని గుర్తించడం వంటి వాటి ద్వారా ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి చేపట్టిన కార్యక్రమాలను గవర్నర్ అభినందించారు. రాష్ట్ర చేనేత పురస్కారాల గ్రహీతలను అభినందిస్తూ నేత కార్మికులు అమూల్యమైన సాంస్కృతిక వారసత్వానికి సంరక్షకులని గవర్నర్ కొనియాడారు. ఒడిశా చేనేత రంగం నిరంతరం ప్రపంచ వేదికపై రాష్ట్ర గుర్తింపు, సృజనాత్మకత మరియు శ్రేష్ఠతను ప్రదర్శిస్తూనే ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుసుమ్–అంతరించిపోయిన వస్త్ర పునరుద్ధరణ, కరుణా సిల్క్ పై వీడియోలను ప్రదర్శించారు. జగత్సింగ్పూర్లోని కస్తా హ్యాండ్లూమ్ భవన్, జాజ్పూర్లోని సుకిందలో ఓఎంబీఏడీసీ ఆధ్వర్యంలోని టసర్ సిల్క్ పార్క్ ఫేజ్–1, టసర్ ఫెసిలిటీ సెంటర్కు శంకుస్థాపన చేయగా, ఖోర్ధాలోని రౌత్పడాలో ఉన్న ఫ్యాబ్రిక్ క్యాలెండరింగ్ యూనిట్ను గవర్నర్ వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రాసిమ్ ఇండియా లిమిటెడ్, సుస్థిర ఫ్యాషన్ కోసం జూబీస్ డిజైనర్ స్టూడియో, అమెజాన్ కరిగర్లతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా చేనేత, వస్త్ర మరియు హస్తకళల శాఖకు చెందిన 2025–26 వార్షిక కార్యాచరణ నివేదికను గవర్నర్ ఆవిష్కరించారు. సహకార, చేనేత, వస్త్ర మరియు హస్తకళల శాఖ మంత్రి ప్రదీప్ బాల్ సామంత ఈ సభను ఉద్దేశించి ప్రసంగించారు. చేనేత, వస్త్ర, హస్తకళల శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి గుహా పూనమ్ తాపస్ కుమార్, వస్త్ర మరియు చేనేత శాఖ డైరెక్టర్ సూర్య నారాయణ్ పట్నాయక్ కార్యక్రమంలో ప్రసంగించారు. -
చిన్నారికి ప్రాణాపాయం.. దాతలపైనే భారం
కవిటి: అతను ఓ రోజు కూలి. ఏ రోజు పని చేస్తే ఆ రోజు కడుపు నిండే పరిస్థితి. కష్ట పడడం కడుపు నింపుకోవడం తప్ప పొదుపు అంటూ లేని దుస్థితి. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు పాము కా టు బారిన పడింది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో ఉంది. కన్న బిడ్డ అలా కదల్లేని స్థితిలో ఉండడం చూసి తండ్రికి కాళ్లు చేతులు ఆడడం లేదు. వివరాల్లోకి వెళితే.. కవిటి మండలం మడియారపుట్టుగకు చెందిన దుక్క రాజు కుమార్తె హారతి పా ము కాటుకు గురైంది. ప్రస్తుతం శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రిలో అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు. కానీ చికిత్స ఖర్చును భరించే స్థోమత రాజుకు లేదు. రోజు కూలిగా పనిచేస్తున్న తనకు వైద్యం ఖర్చు భరించడం తలకు మించిన భారమవుతోందని, దాతలు స్పందించి తన కూతురి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. సాయం చేయదలచుకున్న వారు 9515977206 నంబర్ను సంప్రదించాలని కోరుతున్నారు. -
ఎలుగుబంటి దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలు
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో ఇటీవల ఎలుగుబంట్ల బెడద ఎక్కువగా ఉంది. అవి ఎప్పుడు వస్తాయో ఎలా దాడులు జరుపుతాయోనని ఎలుగుబంటి ప్రభావిత గ్రామాల ప్రజలు భయంతో వణుకుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బొయిపరిగుడ సమితి ఎలుగుబంటి ఖొరాగుడ, కదమగుడ, బొడొగుడ గ్రామాలపై గురువారం సాయంత్రం దాడి చేసి ఆరుగురు వ్యక్తులను తీవ్రంగా గాయపరచినట్లు సమాచారం. గాయపడిన వారు ఖొరాగుడ గ్రామం కృష్ణ బొడొనాయిక్, ఘాశీ బొడొనాయిక్, హరి తొలియ, రతన్ మఝి ఉన్నారు. కదమగుడ గ్రామంలో ఎలుగుబంటి దాడిలో సునాదర పూజారి, బొడొగుడ గ్రామంలో హరి గాయపడ్డారు. గ్రామస్తుల వివరణ ప్రకారం ఖొరాగుడ గ్రామ సమీపంలోగల పంట భూములలో రైతులు దుక్కులు దున్ను తున్న సమయంలో ఎలుగు బంటి దాడి జరిపి వారిని తీవ్రంగా గాయపరచింది. ఎలుగు బంటి దాడి జరిపి గ్రామస్తులను గాయపరచటం చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గాయపడిన వారందరినీ బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారికి డాక్టర్లు ప్రాథమిక చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. -
స్కూల్ గోడ కూలి ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
కొరాపుట్: స్కూల్ గోడ కూలి ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాలయ్యాయి. గురు వారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి కశంధి పంచాయతీ కేంద్రంలో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ప్రధాన ద్వారంతో పాటు గోడ కూలింది. గోడ శిధిలాలు కింద ఒకటి, రెండవ తరగతి విద్యార్థులు చిక్కుకు పోయారు. వెంటనే స్థానికులు బాలలలను వెలికి తీశారు. వారిలో బుల్ ఖిల్, ఆయుష్ ఖిల్ అనే ఇద్దరు బాలలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీప నందపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయంపై స్కూల్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. -
రాష్ట్ర సంగ్రహాలయం సందర్శన
భువనేశ్వర్: భువనేశ్వర్లో జరుగుతున్న బ్రిక్స్ విద్యా సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన చైనా, ఇరాన్ ప్రతినిధి బృందాల సభ్యులు గురు వారం ఒడిశా రాష్ట్ర సంగ్రహాలయం సందర్శించారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్ర సంగ్రహాలయం డైరెక్టర్ డాక్టర్ భారతి పాల్ వారికి సాదరంగా స్వాగతం పలికి ఒడిశా ఘన చరిత్ర, వారసత్వం, వాస్తు శిల్పం, సాహిత్యం, కళలు, సంస్కృతి గురించి చైనా, ఇరాన్ ప్రతినిధి బృందం సభ్యులకు వివరించారు. ప్రతినిధులు ఇక్కడ సంగ్రహించి భద్ర పరిచిన పురాతఽన వస్తువులు, తాళపత్ర గ్రంథాలు, శాసనాలు, నాణాలు, ఆయుధాలు, కుండలు, హస్త కళలు, అనుభవ్ హెరిటేజ్ గ్యాలరీ మొదలైనవాటిని సందర్శించారు. వారు ఒడిశా పురావస్తు శాస్త్రాన్ని, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన వారసత్వాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్ర మ్యూజియం తరపున టైమ్లెస్ టేల్ (ఒడిశా రాష్ట్ర మ్యూజియం గురించిన పుస్తకం) అనే పుస్తకాన్ని చైనా, ఇరాన్ ప్రతినిధులకు డైరెక్టర్ డాక్టర్ భారతి పాల్ బహుకరించారు. -
వికసిత్ భారత్ సంకల్ప్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తిరుపతి పాణిగ్రాహి
భువనేశ్వర్: వికసిత్ భారత్ సంకల్ప్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడైన డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సంస్థ కార్మికుల సంక్షేమం, ఆరోగ్య సంరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తుంది. రాష్ట్ర శాఖ ఏర్పాటు నేపథ్యంలో గురువారం భారతీయ జనతా మజ్దూర్ మంచ్ ఆధ్వర్యంలో హై టెక్ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడైన డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ఒడిశా శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. హై టెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చాలా సంవత్సరాలుగా పేదలకు, నిస్సహాయులకు, కార్మికులకు, రోగులకు సేవ చేస్తుండగా వికసిత్ భారత్ సంకల్ప్ సంస్థకు అన్ని రకాల సహకారం అందిస్తుందని తిరుపతి పాణిగ్రాహి హామీ ఇచ్చారు. -
చేయని నేరానికి 22 ఏళ్ల జైలు జీవితం
కొరాపుట్: చేయని నేరానికి 22 ఏళ్లు జైలు జీవితం గడిపిన యువకుడు సుప్రీం కోర్టు జోక్యంతో విడుదలయ్యాడు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని నువా హిర్లి ప్రాంతంలో అర్జున్ జానీ విషాద గాధ ఇది. 2004 లో పాత డైలీ మార్కెట్ లో సుధా టీ స్టాల్ పని చేస్తున్న బాలుడు టున్ టున్ (అర్జున్ జానీ) గా సుపరిచితుడు. అప్పట్లో మైనారిటీ తీరిన కొద్ది రోజుల్లో అతను నివసిస్తున్న ప్రాంతంలో ముగ్గులు మహిళలు హత్యకి గురయ్యారు. ఈ హత్యలు టున్టున్ చేసాడని పోలీసులు ఆరోపణ. ఒక వ్యక్తి హత్యలు జరిగిన ప్రాంతంలో టున్టున్ని చూశాడనే సాక్ష్యంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దెబ్బలకు టున్టున్ నేరం ఒప్పుకోవాల్సి వచ్చింది. దీంతో టున్టున్ కి కోర్టు జీవిత శిక్ష విధించింది. టున్టున్కి నా అనేవాళ్లు లేకపోవడంతో న్యాయ పోరాటం చేయలేక పోయాడు. దీంతో కొరాపుట్ జిల్లా జైలులో 22 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఈ కేసు ఇటీవల సుప్రీం కోర్టు దృష్టికి రావడంతో టున్టున్ను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో అతడు విడుదలై నబరంగ్పూర్ తిరిగి వచ్చాడు. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందింది. నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి టున్టున్ వద్దకు వెళ్లి అతని నూతన జీవితం ముందుకు సాగడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. -
దొరికిన ఇంటి దొంగ
పర్లాకిమిడి: ఆర్.ఉదయగిరి బ్లాక్ క్రిష్టియన్వీధిలో ఈనెల 5న జంపి రైతా వ్యాలెట్ బ్యాగు నుంచి 1.5 తులాల బంగారు నగ, చెవుల జుంకాలు, వేలాడే జిలికా (12 అణాలు) దొంగిలించిన కేసులో తన సమీప బంధువు మరిది సమీర్ లిమ్మా (28) అరెస్టయినట్లు ఆర్.ఉదయగిరి సబ్డివిజనల్ పోలీసు అధికారి అమితావ్ పండా తెలియజేశారు. ఆర్.ఉదయగిరి ఐఐసీ కల్పలతా ప్రధాన్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 5 బుధవారం ఆర్.ఉదయగిరి క్రిష్టియన్ వీధికి చెందిన జంపి రైతా తండ్రి ఆరోగ్యం క్షీణించిందనే సమాచారంతో భర్తలో కలిసి దగ్గరలో ఉన్న లుహాకుటి గ్రామానికి ఉదయం బయలు దేరారు. ఆమె తన బంగారు నగ, జుంకాలను తన బ్యాగులో వేసుకుని వెళ్లారు. అయితే లుహాకుటి గ్రామంలో తన తండ్రిని బాగోగులు పరామర్శించిన సమయంలో అక్కడ తన ఆడపడుచు బెత్లీ లిమ్మా, ఆమెభర్త సమీర్ లిమ్మా ఉన్నారు. తండ్రిని పరామర్శించిన తర్వాత తిరిగి తన స్వగ్రామానికి బయల్దేరుతుండగా తన వ్యాలెట్ దాచి ఉంచిన బ్యాగులో బంగారునగ, చెవుల జుంకాలు, పేట కనిపించకుండాపోయాయి. దీంతో ఆమె బంధువులకు అడిగిన అనంతరం అక్కడ తన ఆడపడుచు, మరిది సమీర్ లిమ్మా కనబడకపోవడంతో వారిపై జంపి రైతా అనుమానంతో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసును వెంటనే దర్యాప్తుచేశారు. చివరకు పోలీసులు జంపిరైతా మరిది సమీర్ లిమ్మాను అరెస్టు చేసి దర్యాప్తు చేయగా దొంగిలించిన బంగారు నగ 18.75 గ్రాములు, చెవి జుంకాలు సెట్ 12 అణాలు నిందితుడు వద్ద నుంచి స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. -
ప్రభుత్వ హాస్టల్ను వీడిన 180 మంది విద్యార్థులు
కొరాపుట్: ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 180 మంది విద్యార్థులు హాస్టల్ విడిచి వెళ్లడం కలకలం రేపింది. గురువారం నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితి సన్న టెమరా గ్రామంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో 180 మంది విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఉదయం లేచాక హాస్టల్ సిబ్బందికి ఒక్క విద్యార్థి కూడా కనిపించకపోవడంతో బెంబేలెత్తిపోయారు. ఈ విషయం ప్రధానోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మీ మహారాణకి సమాచారం ఇచ్చారు. దాంతో ఉన్నతాదికారులు ఉరుకులు పరుగులతో హాస్టల్కు వచ్చారు. వసతులు లేకే నిరసన.. విద్యార్థులంతా ముందు రోజు రాత్రి మూకుమ్మడిగా ఇళ్లకు వెళ్లి పోవాలని నిర్ణయం చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మూటాముల్లె సర్దుకొని ఇళ్లకి పయనమయ్యారు. సుమారు 15 కిలోమీటర్ల దూరంలో వీరి స్వగ్రామాలు ఉండడంతో నడక మార్గం కొనసాగించారు. మార్గ మధ్యంలో వీరిని చూసిన పలు గ్రామాల గిరిజనులు ఈ విషయం సోషల్ మీడియాలో పెట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకీ పయనం..? వీరిని అడ్డగించిన మీడియా ముందు విద్యార్థులు తమ గోడు వెళ్ల బుచ్చుకున్నారు. హాస్టల్లో సుమారు 180 విద్యార్థులు ఉన్నారని వారందరినీ రెండు గదుల్లో ఉంచారని తెలిపారు. ఆ గదులు కూడా వర్షం వస్తే కారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు వినియోగించడానికి వీల్లేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. నీళ్ల పప్పు, పురుగుల అన్నం పెడుతున్నారని, క్రీడా సామగ్రి ముట్టుకోనివ్వడం లేదని తెలిపారు. వీటిని ముడితే హెడ్ మాష్టర్ రాజ్యలక్ష్మి మహారాణ తీవ్రంగా దూషిస్తున్నారన్నారు. తమ సమస్యలు చెబితే ఎదురు దాడి చేస్తున్నారన్నారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. దాంతో అక్కడ ఉండలేక తామందరూ ఇళ్ల కు పోతున్నామని పేర్కొన్నారు. అడ్డగించిన విధ్యాధికారులు విద్యార్థుల ఆచూకీ తెలుసుకున్న విద్యాధికారులు పలు చోట్ల వారిని అడ్డుకున్నారు. సమీప ప్రభుత్వ హాస్టల్లోకి చేర్చి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తిరిగి వారిని హాస్టల్కు తీసుకెళ్లడం ప్రారంభించారు. -
ర్యాగింగ్ ఘటనపై కఠిన చర్యలు
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి రివల్కొన ఎస్ఎస్డి ఉన్నత పాఠశాల వసతి గృహంలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటనపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ఆధారంగా వెంటనే అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న 10వ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులను ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టిసి) ఇచ్చి పాఠశాల నుంచి బహిష్కరించారు. వారిపై చందిలి పోలీస్ స్టేషన్లో చట్టపరంగా కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఈ నెల 1వ తేదీన క్రికెట్ ఆటను కేంద్రంగా చేసుకుని విద్యార్థుల మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు, మరుసటి రోజు అర్ధ రాత్రి జానియర్ విద్యార్థులపై కొందరు సీనియర్ విద్యార్థులు శారీరక దాడికి పాల్పడినట్లు తేలింది. ఆగస్టు 4వ తేదీన బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేయడంతో పాఠశాల యాజమాన్యం వె వెంటనే అధికారులకు సమాచారం అందించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆసీమారావ్ బాధిత విద్యార్థులను కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలల సంక్షేమ కమిటీ కూడా స్వతంత్రంగా విచారణ జరిపి బాధితుల వాంగ్మూలాలు నమోదు చేసింది. అనంతరం బీడీఓ, డబ్ల్యూఈఓ, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సమక్షంలో ఘటనపై సమీక్ష నిర్వహించారు. ఈ విచారణలో ఏడుగురు విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు స్పష్టమవ్వడంతో వారిని టీసీ ఇచ్చి పంపించారు. ఇదిలా ఉండగా బాధిత విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి మానసిక సహాయం, కౌన్సెలింగ్ అందించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నట్లు అదేవిధంగా వసతి గృహంలో సాధరణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అదేవిధంగా పాఠశాలలో 265 మంది విద్యార్థులకు కేవలం ఐదుగురు ఉపాధ్యాయులే ఉండటంతో బొధనతోపాటు వసతి గృహ నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విచారణలో తేలింది. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా హాస్టళ్లలో కౌన్సెలింగ్, ర్యాగింగ్ నిరోధక అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల భద్రత, గౌరవం విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమారావ్ తెలియజేశారు. -
రైలు ఢీకొని ఉపాధ్యాయుడు దుర్మరణం
కొరాపుట్: రైలు ఢీకొన్న ఘటనలో ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. కొరాపుట్ జిల్లా కేంద్రానికి చెందిన పృద్వికుమార్ స్వయ్ (45) లమ్తాపుట్ సమితిలో రిజర్వాయర్ సమీపంలోని కటాఫ్ ప్రాంతం కుమార్ గంధన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. విధి నిర్వాహణ అనంతరం తన బైక్పై సుక్కు వంతెన దాటుతుండగా రైలు కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పృద్వికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్పీఎఫ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం కొరాపుట్ తరలించారు. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొరాపుట్: కేరళలోని శబరిమలలో ఉన్న అయ్యప్పస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అన్నసంతర్పణ కోసం కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల అయ్యప్ప భక్తులు ముందుకు వచ్చారు. విశాఖపట్నానికి చెందిన గురుస్వామి డాక్టర్ పైలా ఆదిమోహన్ రెడ్డి నేతృత్వంలో అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ గత ఏడాది శబరిమల సమీపంలో పంపావ్యాలీ గ్రామం వద్ద భక్తులకు ఉచిత అన్న ప్రసాద సేవనం ఏర్పాటు చేసింది. గత ఏడాది అయ్యప్ప స్వాముల సీజన్లో రెండు నెలల పాటు వేలాది మంది భక్తులకు తెలుగు సంప్రదాయ భోజనాలు, అల్పాహరం ఉచితంగా అందజేసింది. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడంతో ప్రతి నెల శబరిమల తేరిచే రోజులలో ఈ అన్నసంతర్పణ కొనసాగుతుంది. ఆగస్టు నెలలో కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి జోలాపుట్కి చెందిన 40 మంది భక్తులు సేవకు వెళ్లడానికి సిద్ధం అయ్యారు. ఈ నెల 16 తేదీ నుంచి 12 రోజులు అక్కడ వీరు వంటలు చేయడం, భక్తులకు వడ్డించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం చేస్తారు. ట్రస్ట్ ఒడిశా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న పొడుగు గుప్తేశ్వరరావు వీరందరికీ స్వంత ఖర్చులతో సేవకు తీసుకొని వెళ్తున్నారు. మరో వైపు ట్రస్ట్ నబరంగ్పూర్ జిల్లా అధ్యక్షుడు ఎన్.జనార్దన్రావు నేతృత్వంలో కందిపప్పు, పెసర పప్పు, చింతపండు, జిలకర్ర తదితర నిత్యావసర వస్తువులు గుప్తేశ్వరరావుకి గురువారం అందజేశారు.ఈ వస్తువులు అన్న సంతర్పణ కార్యక్రమంలో వినియోగించనున్నారు. 320 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్టు మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి బేజాంగవాఢ పంచాయతీ బదిలిగూఢ గ్రామం వద్ద బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కలిమెల పోలీసులకు వాహనంలో తరలిస్తున్న గంజాయి దొరికింది. దీంతో వాహనాన్ని అదుపులోకి తీసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిద్దరూ ఎంవి 72 గ్రామానికి చెందిన బబ్లు దత్త, ప్రధీప్ దత్తగా తెలిసింది. గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిపారు. గంజాయిని తహసీల్దార్ రాజీవ్ బెహరా ఆధ్వర్యంలో తూకం వేయగా 320 కిలోలు ఉందని, రూ.25 లక్షల వరకు విలువ ఉంటుందని తెలిసింది. -
మల్కన్గిరి జిల్లాలో బసంత్ ప్రధాన్ పర్యటన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో సమాచార, ప్రజసంబంధాల శాఖ ఐపీఆర్ దక్షణాంచాల ఉపనిర్ధశీకుడు బసంత్ ప్రధన్ గురువారం జిల్లాలో పర్యటించి డిఐపీఆర్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఆ శాఖ పనుల పురోగతిపై సమీక్షించారు. ఆయనకు జిల్లా సమాచార, ప్రజాసంబంధాల అధికారి ప్రమిళా మాఝి స్వాగతం పలికారు. సమావేశంలో బసంత్ ప్రధన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరే విషయమై ప్రత్యక దృష్టి పెట్టాలని సూచించారు . ప్రజాలకు ప్రభుత్వ పథకలపై సరైన సమాచారం అందించడం, ప్రభుత్వ, ప్రజలకుమధ్య వారధిగా వ్యవహరించడం, సమాచార ప్రజసంబంధల శాఖ బాధ్యత అని అన్నారు. నయగాడ్ మాజీ డీఐపీఆర్ ఓ జ్యోత్సా ్నమయి ఆచార్య , కార్యలాయ సిబ్బంది సత్యానారాయణ్ ప్రధాన్, హరేకృష్ణ కీర్తనీయా, రంజాన్ మాసంతి ఉన్నారు. -
ఎరువుల గోదాముల్లో తనిఖీలు
రాయగడ: గుణుపూర్లోని వివిధ ల్యాంప్స్ పరిధిలో ఉన్న ఎరువుల గొదాంలను సహకార సంఘాల రిజిస్ట్రార్ మనీష్ అగ్రవాల్ పరిశీలించారు. గుణుపూర్ ల్యాంప్స్ పరిధిలోని లిమామడ, సమీపంలోని ఎరువుల గొదాంలను, పద్మపూర్లోని గొదాంలను తనిఖీ చేసి ఎరువుల నిల్వల పరిస్థితిని సమీక్షించారు. తనిఖీల సందర్భంగా యూరియా, పొటాస్, తదితర ఎరువుల నిల్వలు, పంపిణీ విధానం, ఆర్థిక లావాదేవీలపై అధికారులతో చర్చించారు. రైతులు ఎరువుల ధరలు, అందుబాటులో ఉన్న నిల్వల వివరాలు సులభంగా తెలుసుకునేలా ప్రతీ గొదాంలో ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. ఎరువులకు సంబంధించిన అన్ని వివరాలను ఒడియా భాషలో అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు నారు, వరిసాగు పనుల్లో నిమగ్నమై ఉండటంతో యూరియా ఎరువుకు డిమాండ్ పెరిగిందన్నారు. అవసరమైన యూరియా అందడం లేదని కొందరు రైతులు చేసిన ఫిర్యాదులను ఆయన సీరియస్గా తీసుకుని, ఎరువుల సరఫరా వ్యవస్థను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో రాష్ట్ర ప్రభుత్వ అదనపు క్యాదర్శి సంగ్రామ్ కేసరి రౌత్, గుణుపూర్ బజారు నియంత్రణ కమిటీ కార్యదర్శి దళపతి కార్యి, డీఆర్సీఎస్ యజ్ఞమేజయ మహాపాత్రో, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
శ్రీకాకుళం క్రైమ్: జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ జంక్షన్ సమీప ఆర్ట్స్ కళాశాల మార్గంలో బుధవారం అర్ధరా త్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ వి.రామారావు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండ లం వీఆర్ గూడేంకు చెందిన యారా డ గిరిధర్రావు (55)కు వివాహం జరగకపోవడంతో అతని సోదరుడే బాగోగులు చూసుకుంటున్నాడు. అయితే అతనికి మతిస్థిమితం సరిగా లేకపోతుండడంతో అప్పుడప్పుడూ ఇంట్లో చెప్పకుండా బయట కు వెళ్లిపోతుంటాడు. ఈక్రమంలో ఈనెల 4వ తేదీ న ఇంటి నుంచి బయటకు వచ్చేశా రు. అనంతరం బుధవారం రాత్రి ఆర్ట్స్ కళాశాల మార్గంలో రోడ్డు మధ్యలో పడుకునిపోయాడు. సరి గ్గా 11.30 గంటల ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీకి చెందిన బస్సు ఉద్యోగులను దించే క్రమంలో అటువైపుగా వచ్చి డ్రైవర్ గమనించకపోవడంతో గిరిధర్రావు పైనుంచి వెళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడిని కుటుంబీకులు గుర్తించడంతో పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు. -
బాబా ఆలయంలో చోరీ
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ పరిధి వింజాంపాడు గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగినట్లు అలయ అర్చకులు బంకుపల్లి శాస్త్రి గుర్తించారు. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వింజాంపాడు గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి గురువారం ఉదయం ఆలయ అర్చకుడు వెళ్లేసరికి అలయం ముందు ఉన్న రెండు హుండీలు తెరిచి ఉండడం గుర్తించారు. అనంతరం అలయం లోపలికి వెళ్లి చూసేసరికి బాబా విగ్రహం పైనున్న కిరీటం సైతం చోరీకి గురైనట్లు తెలిసింది. దీంతో వెంటనే కోటబొ మ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎస్ఐ సింహాచలం ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించా రు. గుర్తు తెలియని వ్యక్తి దుప్పటి కప్పుకుని వచ్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. సుమా రు రూ.40 వేలు విలువ కలిగిన వెండి కిరీటంతో పాటుగా కొంత మొత్తంలో నగదు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అయితే ఇదే గ్రా మంలో వరుసగా చోరీలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. నరసన్నపేట: స్థానిక శ్రీరాంనగర్లో ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లిన బమ్మిడి దేవ కుమార్ గాయప డి స్థానికులకు చిక్కాడు. వివరా ల్లోకి వెళ్తే.. గురువారం వేకువజామున శ్రీరాంనగర్లోని ఒక ఇంట్లో దొంగతనం చేసేందుకు దేవకుమార్ ప్రయత్నించాడు. ఇంతలో ఇంట్లో అలికిడి రావడంతో భయపడి పై అంతస్తు నుంచి కిందికి దూకాడు. పరిగెత్తి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ కాలికి గాయమవ్వడంతో కదలలేకపోయాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఏరి యా ఆస్పత్రిలో అతడికి చికిత్స చేయించారు. కాలికి గాయమైందని కట్టు వేయాలని వైద్యు లు సూచించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నరసన్నపేట ఎస్ఐ బి. గణేష్ తెలిపారు. ఇచ్ఛాపురం: రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా విద్యార్థులున్న పాఠశాలలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు తెలిపారు. స్థానిక పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించా రు. ఈ సందర్భంగా పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గతంకంటే అధికంగా ఉత్తీర్ణత సాదించాలని సూచించారు. మిషన్ మార్చ్ కార్యక్రమంలో ప్రతీ విద్యార్థి తప్పక హాజరై పరీక్షలు రాయాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని లైబ్రరీలు, ల్యాబ్, కిచెన్ షెడ్ల ను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని నిబంధనలకు అనుగుణంగా అందించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉపవిద్యాశాఖా ధికారి విలియమ్స్, మండల విద్యాశాఖాధికారి కె.సూర్యారావు, పాఠశాల సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని వివిధ గ్యాస్ కంపెనీలకు సంబంధించిన వినియోగారులు తప్ప నిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని భారత ప్రభు త్వ పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈకేవైసీ ఈనెల 15 తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత గ్యాస్ సంస్థలకు ఆదేశించింది. సకాలంలో ఈకేవైసీ ధ్రువీకరణ పూర్తిచేయకపోతే ఎల్పీజీ సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయచ్చునని పేర్కొన్నారు. -
దొంగ దొరికాడు
● నిర్మాణ సామగ్రి స్వాధీనం రాయగడ: సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నమోదైన చోరీ కేసుకు సంబంధించి పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఈ నెల 4వ తేదీ అర్ధ రాత్రి జరగిన ఈ ఘటనకు సంబంధించి గుర్తుతెలియని కొందరు దుండగులు తాళం పగుల గొట్టి నిర్మాణ పనులకు ఉపయోగించే కాంక్రీట్ బ్రేకర్ మిషిన్, రాడ్ కట్టింగ్ మిషిన్తోపాటు ఇతర నిర్మాణ సామగ్రిని అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి చోరీకి గురైన కాంక్రీట్ బ్రేకర్ మిషిన్, రాడ్ కట్టింగ్ మిషిన్తో పాటు ఇతర నిర్మాణ సామగ్రీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టుకు తరలించారు. నూతన కార్యవర్గం ఏర్పాటు రాయగడ: స్థానిక సంస్కృతి మహిళా సంస్థకు నూతన కార్యవర్గం ఏర్పాటైంది. సంస్థ అధ్యక్షురాలిగా సరస్వతి సాహు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదివరకు సాము సంస్థలో క్రీయాశీల సభ్యురాలిగా, కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండేవారు. అదేవిధంగా సంస్థ ఉపాధ్యక్షురాలిగా అమూల్య కుమారి మిశ్రా, కార్యదర్శిగా సంతోషి సేనాపతి, సహా కార్యదర్శిగా సుజాత మండంగి, కోశాధికారిగా లక్ష్మీ దేయాలను సభ్యులు ఎన్నుకున్నారు. సుజాత పాలో, మాజీ కోశాధికారి శ్రమిత పాడీ, పద్మాలయ మిశ్రా బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో భవిష్యత్లో సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ప్రచార రథం ప్రారంభం రాయగడ: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం–26ను పురస్కరించుకుని జిల్లా ఆదివాసీ సమాజ్ ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని గురువారం ప్రారంభించారు. స్థానిక మజ్జిగౌరి మందిరం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించిన ఆదివాసీ నాయకులు ఈ మేరకు ప్రచార రథానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను మరింత వైభవంగా, విజయవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ ప్రచార రథాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లాలో గల వివిధ ప్రాంతాల్లో ఈ రథఽం తిరిగి ఉత్సవాల వివరాలను తెలియజేస్తుంది. ఆదివాసీ నాయకులు బసంత కుమార్ ఉలక, హరప్రసాద్, గోపీనాథ్ సరక, అశోక్ పుయాల, మీనారావు హిమిరిక పాల్గొన్నారు. పాముకాటుతో వ్యక్తికి అస్వస్థత జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి జి.మఝిగుడ గ్రామ పంచాయతీ నగియగుడ గ్రామానికి చెందిన చైతన్య గౌఢ (45) పాము కాటుకు గురికావడంతో తీవ్ర అస్వస్థతకుగురయ్యారు.అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. లభించిన సమాచారం.. ప్రకారం చైతన్య గౌఢ గురువారం మధ్యాహ్నం తన సొంత ఆవులు, గొర్రెలు మేపేందుకు గ్రామ సమీప అడవి లోనికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చూసుకోకుండా పొరపాటున పాముపై కాలు వేయడంతో కాటు వేసింది. అది చూచిన కొంతమంది వెంటనే అతడి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు వచ్చి గ్రామస్తుల సహకారంతో బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక వైద్యం అందజేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో అచ్చట నుండి జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేశారు. హుండీల ఆదాయం రూ.2.06 లక్షలు శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని గుడివీధిలో వేంచేసిన ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయం హుండీల ఆదాయం రూ.2,06,931లు వచ్చిందని ఆలయ ఈవో ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. నోట్ల రూపేనా రూ.1,88,310లు, చిల్లర రూపేనా రూ.18,621లతో కలిపి మొత్తం రూ.2,06,931 వచ్చిందని వెల్లడించారు. పర్యవేక్షకులుగా ఏసీ ఆఫీసు నుంచి సూపర్వైజర్ ఎస్.నాగేశ్వరరావు, ఆలయ అర్చకులు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ, చైర్మన్ పాండ్రంకి దేవేంద్ర నాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, లలితా మండలి సభ్యులు, భక్తుల సమక్షంలో హుండీలు తెరవడం జరిగిందన్నారు. -
చోరీకి వెళ్తే ప్రాణం పోయింది
జయపురం: దొంగతనం చేసేందుకు వెళ్లి గ్రామస్తులు పట్టుకునేందుకు వెంబడించగా దొంగ చెక్ డ్యామ్లో పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఉదంతం జయపురం సమితి తెలియ గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఒక వ్యక్తి తెలియ గ్రామంలో పద్మణ సోమరత్ ఇంటిలో ప్రవేశించి బంగారు ఆభరణాలతో పాటు రూ.10 వేల నగదు దొంగిలించాడు. అయితే ఆ సమయంలో పద్మణ అతడి కుటుంబ సభ్యులు మేల్కొన్నారు. వారిని చూసిన దొంగ భయంతో పరుగు తీసి పారిపోవటానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అతడు సమీపంలో చెక్ డ్యామ్లో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. చెక్ డ్యామ్లో పడి ఉన్న దొంగను బయటకు తీసి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న సమయంలో అతడు మరణించినట్లు డా క్టర్లు ప్రకటించారు. గుర్తు తె లియని ఆ వ్యక్తి బంధువులు వస్తే వారికి మృతదేహం అప్పగిస్తామని తెలిపారు. -
క్లీనిక్లపై అధికారుల దాడులు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఆక్రమంగా క్లీనిక్లు నిర్వహిస్తున్న వాటిపై జిల్లా యంత్రాంగం మరోసారి కొరఢా ఝలిపించింది. సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిల్లీప్, డిప్యూటీ కలెక్టర్ సుబ్రస్నాత్ రౌత్ బుధవారం మధ్యాహ్నం పాత గుణుపూర్ కూడలిలో ఉన్న ఎంఎం క్లీనిక్, విజయలక్ష్మీ క్లీనిక్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో ఈ రెండు క్లీనిక్లలోనూ రోగులను చేర్చి సైలెన్లు ఎక్కిస్తూ చికిత్స అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అధికారులు వస్తున్న సమచారాన్ని తెలుసుకున్న మరికొన్ని క్లీనిక్ల యజమానులు రోగుల సైలెన్ పెపులను తొలగించి క్లీనిక్ వెనుక ద్వారం గుండా వారిని బయటకు పంపించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సబ్ కలెక్టర్ దిల్లీప్.. జిల్లా ముఖ్యవైద్యాధికారికి నివేదిక పంపించారు. సంబంధిత క్లీనిక్ల అనుమతులు, ఇతర పత్రాలను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఆరోగ్య శాఖను కొరినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కొద్ది నెలల క్రితమే గుణుపూర్ ప్రాంతంలోని పలు అక్రమ క్లీనిక్లపై సబ్ కలెక్టర్ వరుసగా దాడులు నిర్వహించి హెచ్చరించారు. ముఖ్యంగా ఎంఎం క్లీనిక్పై ఇప్పటికే రెండుసార్లు తనిఖీలు జరిగినప్పటికీ, అక్కడ మళ్లీ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు గుర్తించడం గమనార్హం. -
రాజధానిలో తెరిపి లేని వాన
భువనేశ్వర్: రాజధాని భువనేశ్వర్తో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గురువారం రాత్రి తెరిపి లేకుండా వాన కురిసింది. అర్ధ రాత్రి నుంచి ఉదయం 5.30 గంటల వరకు సగటున 97.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి, ఇళ్లు జలమయమయ్యాయి. కటక్ నగరంలో కూడా అర్ధ రాత్రి నుంచి వర్షం కొనసాగుతోంది. మధుసూదన్ నగర్లో అత్యధిక వర్షపాతం నగరంలో మధుసూదన్ నగర్లో అత్యధికంగా 107 మిల్లీ మీటర్లు, నయాపల్లిలో 97.2 మిల్లీ మీటర్లు, జగ్మోహన్ నగర్లో 90.4, లక్ష్మీ సాగర్లో 90, షాహిద్నగర్లో 83.2, ఖండగిరిలో 73.2, ఖారవేల నగర్లో 59.4, చంద్రశేఖర్పూర్లో 50.34, పటియాలో 6 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో రాష్ట్ర స్థాయిలో తాల్చేర్లో అత్యధికంగా 80 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ సమాచారం. దక్షిణ ఒడిశాకు భారీ వర్ష సూచన బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన వ్యవస్థ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గతంలో ఉత్తర ఒడిశాపై ప్రభావం చూపిన అల్పపీడన వ్యవస్థకు భిన్నంగా ఈసారి దక్షిణ ఒడిశా ప్రాంతాలు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కోనున్నాయి. ఈ వ్యవస్థ కదలికను బట్టి ఈ నెల 13 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగవచ్చు అని స్థానిక ప్రాంతీయ వాతావరణ కేంద్రం సమాచారం. మల్కన్గిరిలో కుండపోత వర్షం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం కుండపోత వాన కురిసింది. రోడ్డుపైకి వరద రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు చోట్ల కొండ చరియలు పడి రహదారులు మట్టితో నిండిపోయాయి. -
పర్లాకిమిడిలో బేటీ బచావ్.. బేటీ పడావ్
పర్లాకిమిడి: బేటీ బచావ్.. బేటీ పడావ్ జిల్లా స్థాయి కర్మశాలను అదనపు జిల్లా మేజిష్ట్రేటు ఫల్గునీ మఝి గురువారం కలెక్టరేట్ హాల్లో ప్రారంభించారు. ఆయనతో పాటు సబ్కలెక్టర్ అనుప్ పండా, శిశు సంక్షేమం ప్రొటెక్షన్ ఆఫీసర్ సరళా పాత్రో, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారి మనోరమా దేవి, డీఎస్పీ సరితా బెవురియా తదితరులు పాల్గొన్నారు. ఈ కర్మశాలలో సోషల్ వర్కర్లకు మొబైల్ ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలను ఎలా అరికట్టవచ్చో డీఎస్పీ సరితా బెవురియా తెలియజేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాలో మన ప్రోఫైల్ లాకింగ్, పాస్ వర్డు జతచేయడం, ఫిషింగ్, స్పామ్ కాల్స్ను నిర్బంధించడానికి చరవాణుల్లో సెట్టింగ్స్లోకి వెళ్లి మార్చుకోవాలని డీఎస్పీ సరితా బెవురియా తెలియజేశారు. అలాగే యువతుల ఉన్నత విద్యకు బ్యాంకులు అతి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తుందని సరితా పాత్రో తెలియజేశారు. మానవ అక్రమరవాణా, పడతులపై అత్యాచారాలు, మోసాలపై వుమెన్స్ హెల్ప్లైన్ 181, చైల్డ్ హెల్ప్లైన్ 1098, సైబర్ క్రైం మోసాలకు 1930 లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలని చైల్డ్ ప్రోటెక్షన్ ఆఫీసర్ సరితా పాత్రో సూచించారు. అనంతరం వివిధ పాఠశాలల బాలికలు బేటీ బచావ్, బేటీ పడావ్ ఉద్దేశ్యంపై డ్యాన్సు రూపంలో నృత్యం చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. -
తొలి టీకా కీలకం
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026నవజాత శిశువుకు ..భువనేశ్వర్: మహిళా, శిశు అభివృద్ధి శాఖ గురువారం రాష్ట్ర స్థాయిలో ప్రపంచ చనుబాల వారోత్సవాలు 2026ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి మహిళా, శిశు అభివృద్ధి శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి డాక్టర్ మృణాలిని దరస్వాల్ అధ్యక్షత వహించారు. విభాగం డైరెక్టర్ మోనిషా బానర్జీ స్వాగతోపన్యాసం చేశారు. సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ దరస్వాల్ మాట్లాడుతూ చనుబాలు బిడ్డకు తొలి టీకా, అత్యంత పోషకమైన ఆహార వనరుగా పేర్కొన్నారు. చనుబాలు పట్టడం యొక్క ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేశారు. బిడ్డ శారీరక, మానసిక మరియు అభిజ్ఞా వికాసం కోసం, పుట్టిన గంటలోపే చనుబాలు పట్టడం ప్రారంభించాలని, తొలి 6 నెలల పాటు కేవలం చనుబాలు మాత్రమే పట్టేలా శ్రద్ధ వహించాలని తెలిపారు. బిడ్డకు రెండేళ్ల వరకు అనుబంధ ఆహారంతో పాటు చనుబాలు కూడా కొనసాగించాలని ఆమె చెప్పారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల, సంపూర్ణ అభివృద్ధిని నిర్ధారించడంలో తండ్రులు, కుటుంబ సభ్యుల కీలక పాత్రను ఆమె వివరించారు. ప్రపంచ వ్యాప్త లాభాపేక్షరహిత సాంకేతిక సంస్థ అయిన వధ్వానీ ఫౌండేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై మొబైల్ ఫోన్ వీడియో ద్వారా పిల్లల బరువు, ఎత్తు, తల చుట్టుకొలత, ఛాతీ చుట్టుకొలత, మధ్య–పై చేయి చుట్టుకొలత (ఎంయూఏసీ)లను కొలవడానికి వీలు కల్పించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వ్యవస్థ ప్రదర్శించారు. కమిషనర్ ఈ చొరవను అభినందించి దాని కచ్చితత్వం, వినియోగం, సమర్థతను మెరుగుపరచడానికి కొన్ని మార్పులు సూచించారు. ఏఐ ఆధారిత పిల్లల పెరుగుదల పర్యవేక్షణ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న రాష్ట్రాలలో ఒడిశా కూడా ఒకటి కావడం గమనార్హం. బాల్యంలో సరైన పోషకాహారం, సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ కార్యక్రమానికి హాజరైన 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల తల్లిదండ్రులను పోషకాహార పండ్ల బుట్టలు మరియు శిశు సంరక్షణ కిట్లతో సత్కరించారు. కార్యక్రమంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ సీనియర్ అధికారులు, అధికారులు, సలహాదారులు కూడా పాల్గొని చనుబాలను ప్రోత్సహించడం, తల్లి మరియు పిల్లల పోషణను మెరుగుపరచడం, ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. -
పదో తరగతి విద్యార్థుల జీవితంలో కీలకం
రాయగడ: పదో తరగతి బోర్డు పరీక్షలు విద్యార్థుల జీవితంలో కీలకమైన మలుపు అని, భయం లేకుండా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, లక్ష్య సాధనతో కృషి చేస్తే విజయానికి చేరువవుతారని ఝార్సుగుడ జిల్లా ఎస్పీ జి.ఆర్.రాఘవేంద్ర అన్నారు. జిల్లా విద్యాశాఖ, టాటా క్రొసాకి రిఫ్రాక్టరీస్ లిమిటెడ్ సంయుక్తంగా బెల్పహర్లో నిర్వహించిన ఉన్మేషా– సపొర్టీవ్ లెర్నింగ్ ప్రాగ్రామ్లో ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడారు. పదో తరగతి బోర్డు పరీక్షలను సానుకూల దృక్పథంతో ఎదుర్కొవాలని, లక్ష్యంపై పూర్తి దృష్టిపెట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కష్టపడి చదవడం, పట్టుదల, మంచి వ్యక్తిత్వం, పరీక్షల సమయంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా విజయానికి ఎంతో తొ దొహదపడుతుందన్నారు. విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా జరిగిన ఈ ఇంటారాక్టివ్ కార్యక్రమాన్ని వారికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. -
చిరిగిన నోటు తెచ్చిన చేటు
● ఇరువర్గాల మధ్య గొడవ ● ఒకరికి గాయాలు సంతబొమ్మాళి: చిరిగిన రూ.500ల నోటు విషయంలో గొడవ జరగడంతో ఒకరు గాయపడిన ఘటన మండలంలోని మలగాం గ్రామంలో చో టు చేసుకుంది. స్థానికు లు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పది మంది డ్వాక్రా సభ్యుల లోన్ డబ్బులు ప్రతినెలా ఒక సభ్యురాలు కట్టాల్సి ఉంటుంది. జూలై నెలకు సంబంధించి సభ్యురాలు మామిడి పున్నమ్మ వంతు వచ్చింది. దీంతో లోన్ డబ్బులు రూ.20 వేలు తీసుకొని బ్యాంకుకు వెళ్లింది. అయితే అందులో ఒక రూ.500ల నోటు చిరిగిపోవడంతో అధికారులు తిరస్కరించారు. దీంతో తన వద్దనున్న మరొక రూ.500ల నోటును ఇచ్చి లోన్ డబ్బులు కట్టడం జరిగింది. సభ్యుల్లో చిరిగిన రూ.500ల నోటు ఎవరిచ్చారు అనేది చూసుకోలే దు. బ్యాంకుకు వెళ్లిన తర్వాత తెలియడంతో వేరేచో ట చిరిగిన రూ.500ల నోటు ఇస్తే రూ.100లు కమీషన్ తీసుకొని రూ.400లు ఇచ్చారని మిగతా సభ్యులకు పున్నమ్మ చెప్పింది. దీంతో వచ్చేనెల అదనంగా రూ.10 లు చొప్పున ఇస్తామని కొంతమంది సభ్యులు అంగీకరించారు. అయితే కావాలనే చిరిగి న రూ.500 నోటు ఇచ్చి అందరి మీద వసూలు చేయడం ఏమిటని ఒక సభ్యురాలు నౌపడ ఆదిలక్ష్మి ప్రతిరోజూ పున్నమ్మతో వాగ్వావాదం చేసేది. ఈ క్రమంలో బూతులు తిట్టుకోవడంతో ఇరువురి మధ్య తగాదా జరిగింది. ఈ తగాదాలో పున్నమ్మ, అమె భర్త అప్పయ్యపై కర్రలతో నౌపడ రాంబాబు, జోగారావు, చిన్నయ్య, అదిలక్ష్మి, రాజు, లక్ష్మిలు దా డి చేశారు. ఈ దాడిలో అప్పయ్య చేయి విరిగిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో టెక్కలి జిల్లా అస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీనిపై సంతబొమ్మాళి పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. -
స్టేషన్కు పిలిస్తే.. చచ్చిపోతా
పోలాకి: ప్రతి రోజూ పోలీసులు స్టేషన్కు పిలుస్తున్నారని ఆవేదనతో ఓ యువకుడు వంద అడుగుల ఎత్తు గల ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి పోలీసులనే బెదిరించాడు. ‘స్టేషన్కు పిలిస్తే నేను చచ్చిపోతా’ అంటూ ఖాకీలకు షాకిచ్చిన ఘటన పోలాకి మండలం బెలమర గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పాలబోయిన శివ దుర్గారావు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నాడని పోలాకి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ కోసం పోలీసులు పలుమార్లు స్టేషన్కు పిలిచారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు బెలమర సచివాల యం పక్కనే ఉన్న ఓవర్హెడ్ ట్యాంక్ ఎక్కి అక్కడ నుంచి దూకి చనిపోతానంటూ బెదిరించాడు. దాదాపు రెండుగంటల తర్వాత పోలాకి ఎస్ఐ రంజిత్ నేతృత్వంలోని పోలీసులు సాహసోపేతంగా యువకుడిని కాపాడారు. కిందకు దిగిన తర్వాత కుటుంబ సభ్యులు, గ్రామపెద్దల సమక్షంలో యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. -
కలయిక.. కలే ఇంకా
● వంశధార–నాగావళి అనుసంధానంపై నీలినీడలు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● ఆందోళనలో రైతులు హిరమండలం, బూర్జ: వంశధార–నాగావళి అనుసంధానం.. దశాబ్దాలుగా నాయకుల నోట నలుగుతున్న మాట ఇది. ఎన్నికల ముందు వినిపించినంతగా ఎన్నికల తర్వాత ఈ మాట వినిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా ఈ రెండు నదుల కలయికను సాధ్యం చేసేందుకు ఒక్క అడు గు కూడా వేయలేకపోయింది. ఇక వంశధార–బాహు దా నదుల అనుసంధానం ఊసెత్తడమే మర్చిపోయారు. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలు ఎండిపోతున్నాయి. నదు ల అనుసంధానం జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎత్తిపోతలదీ అదే పరిస్థితి.. జిల్లాలో జీవనాడులుగా వంశధార, నాగావళి నదులు ఉన్నాయి. ఇప్పటికే వంశధారపై నిర్మించిన గొట్టా బ్యారేజీ జిల్లాలో సగం మండలాలను సస్యశ్యామలం చేస్తోంది. అయితే వంశధార నదిలో వృథా నీటిని ఒడిసిపట్టేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి తలపెట్టారు. ఒడిశాతో జల వివాదాల నేపథ్యంలో వంశధారలో వరద నీటిని డైవర్షన్ స్కీమ్ ద్వారా రిజర్వాయర్లోకి పంపించి కాలువల ద్వారా నీటిని అందించాలని పరితపించారు. అలా ప్రారంభమైన ఆయన ప్రయత్నాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశా యి. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఒక వైపు ఒడిశాతో జల వివాదాలకు పరిష్కారం చూపుతూనే గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. ప్రధాన పనులను పూర్తిచేయగలిగారు. కానీ కూటమి వచ్చి రెండేళ్లవుతున్నా ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. దురదృష్టకరం.. నదుల అనుసంధానంపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం దురదృష్టకరం. వంశధార–నాగావళి నదుల అనుసంధానంతో జిల్లాకు ఎంతో మేలు జరుగుతుంది. అయినా ప్రభుత్వం దృష్టిసారించకపోవడం అన్యాయం. ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. – పెనుమజ్జి విష్ణుమూర్తి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, ఎల్ఎన్ పేటకదలిక లేదు.. వంశధార–నాగావళి నదుల అనుసంధానానికి ఎలాంటి ముందడుగు పడలేదు. కనీసం ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. 2017లో కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ నదుల అనుసంధానానికి ప్రతిపాదించింది. కానీ పనులను సకాలంలో ప్రారంభించలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలంటే కచ్చి తంగా మరోసారి టెండర్లు పిలవాలి. గజ్జిలి గెడ్డ వద్ద ఉన్న రోడ్డు కింద నుంచి కాలువ తీసి ఆరు కిలోమీటర్ల మేర మట్టి తవ్వకాలు చేపట్టాలి. 30 స్ట్రక్చర్ల నిర్మాణాలు పూర్తిచేయాలి. ఇందుకుగాను 49.23 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందుకు గాను రూ.8.26 కోట్లు చెల్లించాలి. 7.50 ఎకరాల దేవాదాయ శాఖ భూ సమస్యను పరిష్కరించాలి. అనుసంధానం పనులు పూర్తిచేస్తే ఎల్ఎన్పేట, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో ఐదు వేల ఎకరాలకు, నారాయణపురం ఆనకట్ట ప్రధాన కాలువ కింద ఉన్న 18,527 ఎకరాలను స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది. -
ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి వివల్కొన రెసిడెన్సియల్ పాఠశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటన అత్యంత బాధాకరమైందని బిజు జనతాదళ్ పేర్కొంది. విద్యాలయాలు, వసతి గృహాల విద్యార్థులకు భద్రత, విద్య, సంస్కారాలను అందించే పవిత్రమైన ప్రదేశాలుగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం విచారకరమని తెలిపింది. ఈ మేరకు వాస్తవాలు తెలుసుకునేందుకు బీజేడీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ్ సరక నేతృత్వంలో ప్రతినిధుల బృందం పాఠశాలను సందర్శించింది. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, హెచ్ఎంతో సమావేశమైంది. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై వివరాలు తెలుసుకుంది. అనంతరం టీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్తోపాటు జిల్లా సంక్షేమ శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై తక్షణమే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఒక్క పాఠశాలకు మాత్రమే పరిమితమైన సమస్య కాదన్నారు. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, అవగాహన కార్యక్రమాలు, క్రమం తప్పని పర్యవేక్షణ, ర్యాగింగ్ నిరోధక వ్యవస్థలకు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సరక డిమాండ్ చేశారు. ప్రతీ విద్యార్థి సురక్షిత వాతావరణంలో విద్యను అభ్యసిండం వారి మౌలిక హక్కు అని, పిల్లల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. -
చరిత్ర పరిశోధకుడు బిజయ్ మిశ్ర మృతి
కొరాపుట్: ప్రముఖ చరిత్ర పరిశోధకుడు బిజయ్ మిశ్ర (65) అనారోగ్యంతో మృతి చెందారు. నబరంగ్పూర్కు చెందిన బిజయ్ మిశ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ విశాఖ పట్నంలో కన్ను మూశారు. కొరాపుట్ జిల్లాలో స్వాతంత్య్ర పోరాటాల చరిత్ర పై బిజయ్ మిశ్ర అనేక పరిశోధనలు చేశారు. అనేక పుస్తకాల రచయితగా, ప్రముఖ పత్రికలలో కాలమిస్ట్గా, విద్యా వేత్తగా రాష్ట్ర వ్యాప్తంగా పేరొందారు. జిల్లాలో విద్యారంగంలో చేసిన సేవలు పేరు తెచ్చాయి. మృతదేహం నబరంగ్పూర్ చేరుకున్న వెంటనే బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి, మాజీ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ మంజులా మజ్జి, మాఘరో కన్వీనర్ కాధంబని త్రిపాఠి, పలువురు కవులు, రచయితలు, విద్యా వేత్తలు బిజయ్ మిశ్ర మ్రత దేహం వద్ద నివాళులు అర్పించారు. -
రాజకీయ జోక్యం తగదు
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026వర్సిటీ వ్యవహారాల్లో..● రెవెన్షా ఉపాధ్యాయుల నిరసనభువనేశ్వర్: కటక్ రెవెన్షా విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం (ఆర్యూటీఏ) బుధవారం వైస్ చాన్స్లర్ కార్యాలయం వరకు శాంతియుత ప్రదర్శన నిర్వహించింది. ఉపాధ్యాయులు నిరసనకు దిగడంతో క్యాంపస్లో ఉద్రిక్తత తీవ్రమైంది. విశ్వవిద్యాలయ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం జరుగుతోంది. ఉపాధ్యాయులకు గౌరవం, సంస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సెవెన్ పిల్లర్స్ ఆఫ్ విజ్డమ్ నుంచి ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు. విశ్వ విద్యాలయ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం నివారణ, ఉపాధ్యాయుల గౌరవానికి రక్షణ, వైస్ చాన్స్లర్ పదవికి, సంస్థకు గౌరవం అనే 4 ప్రధాన డిమాండ్లతో కూడిన స్మారక పత్రాన్ని సమర్పించారు. హాస్టల్ సంబంధిత సమస్యపై విద్యార్థుల ఆందోళన సందర్భంగా ఆగస్టు 3న విద్యార్థుల సమక్షంలో చీఫ్ వార్డెన్ పదవిలో ఉన్న ఒక సీనియర్ ప్రొఫెసర్పై అనుచితంగా ప్రవర్తించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఉపాధ్యాయ సంఘం ప్రధానంగా ఆరోపిస్తుంది. ఆగస్టు 3న విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పుడు వైస్ చాన్స్లర్, చీఫ్ వార్డెన్, వార్డెన్ విద్యార్థులను బుజ్జగించి దాదాపుగా శాంతింపజేయడంతో సమస్య పరిష్కారమైంది. ఆ సమయంలో కటక్ సదర్ ఎమ్మెల్యే అక్కడికి వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టారని నిరసనకు దిగిన ఉపాధ్యాయుల వర్గం ఆరోపణ. సీనియర్ ప్రొఫెసర్ అయిన చీఫ్ వార్డెన్తో ఆమోదయోగ్యం కాని రీతిలో ప్రజా ప్రతినిధి ప్రవర్తించారు. ఆయనపై కఠినమైన భాషాజాలం ప్రయోగించారు. ఈ విషయంలో రాజకీయ జోక్యం అనవసరం అని ఉపాధ్యాయ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరో వైపు తాము ఎమ్మెల్యేను క్యాంపస్కు పిలవలేదని విద్యార్థులు కూడా స్పష్టం చేశారు. వైస్ చాన్స్లర్తో ముందస్తు సంప్రదింపులతో విశ్వవిద్యాలయ విషయానికి సంబంధించి చొరవ కల్పించుకోవడం మర్యాదపూర్వక ప్రవర్తనగా పేర్కొన్నారు. అలా కాకుండా అప్రమేయంగా చొరవ కల్పించుకుని విద్యార్థుల ముందు సీనియర్ ప్రొఫెసర్లను అవమానించడం సమగ్ర సంస్థ గౌరవాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం అవుతుంది. వివాదం నేపథ్యంలో మంగళ వారం హాస్టల్ వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లు అందరూ సామూహికంగా రాజీనామాలు సమర్పించారని ఓ అధ్యాపకుడు తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి వైస్ చాన్స్లర్ 7 రోజుల సమయం తీసుకున్నారు. ఈ వ్యవధిలో ఆయన ప్రొఫెసర్లతో కూడా చర్చలు జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని నిరసనకు దిగిన ఉపాధ్యాయ వర్గానికి హామీ ఇచ్చారు. వేధింపులు, హాస్టల్ గదులకు తాళాలు వేయడం వంటి ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ వార్డెన్ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రెవెన్షా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ నెల 2 నుంచి చేపట్టిన నిరాహార దీక్షను నిరవధికంగా కొనసాగిస్తున్నారు. -
నకిలీ నియామక పత్రాలు వైరల్
భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయ రక్షణ సిబ్బంది నియామకానికి సంబంధించి నకిలీ నియామక పత్రాలు వైరల్ అవుతున్నాయి. ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సంతకంతో ఉన్నట్లు ఒక నకిలీ నియామక పత్రం వైరల్ అయ్యింది. ఈ మేరకు ఆలయ పరిపాలన విభాగం సింహద్వార్ పోలీస్ ఠాణాలో ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ఆ లేఖ పూర్తిగా నకిలీదని పేర్కొంది. జోరుగా పుట్టగొడుగుల విక్రయాలు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని డీఎన్కే మార్కెట్లో శ్రవణ పుట్టగొడుగుల విక్రయాలు జోరుగా బుధవారం ప్రారంభమయ్యాయి. వర్షాలు కురిస్తే అడవుల్లో పుట్టగొడుగులు వస్తాయి. వీటిని గిరిజనులు తీసుకొచ్చి స్థానికంగా అమ్ముతారు. ఎంతో రుచికరమైన వీటిని ప్రజలు భారీగా కొనుగోలు చేస్తారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి కొరాపుట్: కొరాపుట్ జిల్లా కుందిలి సంత ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి సంచరిస్తూ అనారోగ్యం పాలయ్యారు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స కోసం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కొరాపుట్ పోలీసులు ఆయన ఫొటోను విడుదల చేశారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే ఆస్పత్రికి రావాలని సూచించారు. పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య కొరాపుట్: చెట్టుకి ఉరి వేసుకొని 10వ తరగతి విద్యా ర్థిని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితి చచ్చా గ్రామ పంచాయితీ గబగుడ గ్రామానికి చెందిన సుందర్ సింగ్ మెహర్ కుమార్తె గిరిజ మెహర్ (15) తన ఇంటి ముందు మామిడి చెట్టుకి తన ఓణీతో ఉరి వేసుకుంది. ముందు రోజు కుటుంబ సభ్యులతో పొలం పనిచేసి వచ్చి రాత్రి వంట కూడా చేసింది. అందరిలో కలిసి భోజనం చేసి ఇంటిలోనే నిద్రపోయింది. ఉదయం చూసే సరికి చెట్టుకు మృతదేహమై వేలాడుతూ కనిపించింది. జొరిగాం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జొరిగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గిరిజ సమీప ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. చెరువును బాగు చేస్తాం పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మాబ్లాక్ జోగిపాడు గ్రామంలో బోడోబోందో (చెరువు) వర్షాభావం వల్ల ఎండిపోయి పిచ్చిమొక్కలు పేరుకుపోయింది. గ్రామంలో వంద ఎకరాలకు ఖరీఫ్లో సాగునీరు అందివ్వలేకపోయింది. రైతుల ఫిర్యాదు మేరకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి బుధవారం జోగిపాడు గ్రామం సందర్శించి బోడోబోందోను పరిశీలించారు. గతంలో ఈ చెరువు వల్ల వందల ఎకరాలకు ఖరీఫ్లో సాగునీరు అందించే సౌకర్యం కలిగించేదని రైతులు ఎమ్మెల్యేతో అన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు మరోపక్క ప్రభుత్వ ఎత్తిపోతల శాఖ ఇంజినీర్లు మరమ్మతులు చేయకపోవడం వల్ల చెరువు ఎండిపోయిందన్నారు. సంబంధిత శాఖ అధికారులకు ఎమ్మెల్యే రూపేష్ ఫోన్చేసి మరమ్మతుల కోసం అడిగి తెలుసుకున్నారు. దీనికి లిఫ్టు ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు చెరువు పుణరుద్ధరణ పనులు త్వరితగతిన ప్రారంభిస్తామని చెప్పినట్టు ఎమ్మెల్యే తెలియజేశారు. గుమ్మాబ్లాక్ ఉపాధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు, సర్పంచ్ ఎడంగా శోబోరో, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నందాహండిలో కలెక్టర్ పర్యటన
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా నందాహండి సమితి కేంద్రంలో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి.. అక్కడ రోగులకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది కొందరు గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నిశ్నాహండిలో ప్రభుత్వ పాఠశాల సందర్శించారు. అక్కడ విద్యార్థుల కోసం వండుతున్న వంటలు పరిశీలించారు. వాటి నాణ్యత, రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు జిల్లా ఉన్నతాధికారులు ఉన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి అటవీ సిబ్బంది దొంగతనంగా తరలిస్తున్న విలువైన కలప చెక్కలను పట్టుకున్నారు. మంగళవారం రాత్రి బొయిపిరిగుడ సమితి మఠపొడ అటవీ సెక్టార్ ప్రాంతంలో ఆ ప్రాంత రేంజర్ అనిల్ దాస్ నేతృత్వంలో అటవీ సిబ్బంది పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో ఒక బైక్ పై ఒక వ్యక్తి విలువైన గుగ్గులం కలప చెక్కలు తీసుకు వెళ్తుండగా వారి కంట పడ్డాడు. అటవీ సిబ్బందిని చూచి బైక్ విడచి పరారయ్యాడు. అటవీ అధికారుల వివరణ ప్రకారం అటవీ సిబ్బంది బొయిపరిగుడ సమితి దొరాగుడ జంక్షన్లో పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో వస్తున్న బైక్ చూచిన సిబ్బంది, దాన్ని ఆపేందుకు ప్రయత్నించగా అటవీ సిబ్బందిని చూసిన బైకిస్ట్ బైక్తో పాటు కలప చెక్కలను విడిచి పరారయ్యాడు. రేంజర్ అనిల్ దాస్ బైక్ వద్దకు వెళ్లి చూడగా బైక్పై 11 కలప చెక్కలు కనుగొన్నారు. కలప తోపాటు బైక్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కలప ఎవరు ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు. ఎక్కడకు తరలిస్తారనే విషయాలు తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతామని అటవీ విభాగ అధికారి సంధీప్ కుమార్ పాణిగ్రహి వెల్లడించారు. సీజ్ చేసిన కలప, బైక్లను బొయిపరిగుడ అటవీ కార్యాలయానికి తీసుకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. -
స్వాతంత్య్ర వేడుకలకు సన్నాహాలు
పర్లాకిమిడి: ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ అక్షయ సునిల్ అగర్వాల్ ఽఆధ్వర్యంలో సన్నాహక సమావేశం బుధవారం నిర్వహించారు. దీనిలో భాగంగా డీపీఆర్వో ప్రదీప్త గురుమయి అధ్యక్షతన గజపతి స్టేడియంలో ఉదయం 9.15 గంటలకు జాతీయ జెండా ఎగురవేయడానికి నిర్ణయించారు. అలాగే విద్యార్థులకు ఈనెల 10న వక్తృత్వ, డ్రాయింగ్, సంగీతం, వ్యాస రచన పోటీలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ బిరంచీ బేగ్, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, ఉత్కళ హితేషినీ అధ్యక్షుడు పూర్ణచంద్ర మహాపాత్రో, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, జిల్లా మెడికల్ ఆఫీసర్ ప్రఫుల్ల కుమార్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. -
రాయగడ–ఎంసీఎల్ మధ్య ఒప్పందం
● పీవీటీజీ గ్రామాలకు రూ.10.29 కోట్లతో గ్రామీణ రహదారులురాయగడ: జిల్లాలొని దుర్భేద్యమైన పీవీటీజీ (ప్రత్యేక బలహీన గిరిజన వర్గాలు ) ప్రాంతాలకు అన్ని కాలాల్లో రాకపొకలు సులభంగా ఉండేలా గ్రామీణ రహదారుల నిర్మాణానికి కీలక అడుగు పడింది. జిల్లా యంత్రాంగం చేపట్టిన ఆమ్ రస్తా–2025–26 పథకం కింద జిల్లా యంత్రాంగం, మహానది కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసిఎల్) మధ్య అవగాహన ఒప్పందం (ఎంఒయు ) కుదిరింది. ఈ మేరకు మునిగుడ సమితి గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఎంసీఎల్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) నిధుల నుంచి రూ.10.29 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది. కలెక్టర్ అశుతొష్ కులకర్ణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంసీఎల్ సిఎస్ఆర్ జనరల్ మేనేజరు జ్మొతిర్మయి సిన్హా , జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ తొ పాటు పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మునిగుడ సమితిలోని శిరిపదర్, మున్డొల్ గ్రామపంచాయతీల పరిధిలో రక్సర్పాడి, రకట, సుతానగుణి, బర్డబర్డా, గరాట, ముండా, త్రాహాలీ, సర్గిపాయి గ్రామాలకు చెందిన 564 మంది పీవీటీజీ ప్రజలు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఆమ రస్తా–2025–26 పథకం ప్రధాన లక్ష్యం బిసంకటక్ ,గుణుపూర్, కళ్యాణసింగుపూర్, మునిగుడ సమితుల్లొ దూర ప్రాంత గిరిజన గ్రామాలకు మూడు మీటర్ల వెడల్పుతో అన్ని కాలాల్లో ఉపయోగించగల పక్కా రహదారులతొ ప్రధాన రహదారి నెట్వర్క్ కు అనుసంధానం చేయడం. దీంతో అంబులెన్స్ సేవలు, వైద్య సదుపాయాలు, విద్యా, గ్రామీణ మార్కెట్లు, మొబైల్ నెట్వర్క్, పీఎం–జన్మన్ గృహాల నిర్మాణ సామగ్రి రవాణా వంటి సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి. మునిగుడ సమితికి సంబంధించిన డీపీఆర్ ప్రకారం 8 గ్రామీణ రహదారి ప్రాజెక్టులు అమలు చేయనున్నారు. వీటిలొ 10.36 కిలోమీటర్ల పక్కా రహదారులు, 24 కల్వర్టులు, 2980 మీటర్ల డ్రైనేజీ వ్యవస్థ నిర్మించారు. వర్షాకాలంలో కూడా రహదారులు దెబ్బ తినకుండా, వర్షపు నీటి పారుదల సక్రమంగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. జిల్లా యంత్రాంగం రూపొందించిన సమగ్ర ప్రణాళిక ప్రకారం బిసంకటక్లో 11, గుణుపూర్లో 10, కళ్యాణసింగుపూర్లో 16, మునిగుడలో 8 కలిపి మొత్తం 45 రహదారి ప్రాజెక్టులు ప్రతిపాదించారు. వీటి ద్వారా 82.82 కిలోమీటర్ల రహదారులు, 6958 మీటర్ల డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టుల అంచనా వ్యయం రు.56.34 కోట్లు కాగా మునిగుడ సమితికి సంబంఽధించి 8 ప్రాజెక్టుల కోసం రూ.10.29 కోట్లు కేటాయించారు. ఈ ఒప్పందంలో జిల్లా యంత్రాంగం, ఎంసీఎల్ సంయుక్తంగా పీవీటీజీ ప్రాంతాల్లొ నాణ్యమైన రహదారి మౌలిక సదుపాయాలు కల్పించి, ఆరోగ్యం, విద్య, ఉపాధి, మార్కెట్ అనుసంధానం వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధికి బాటలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ
● రైతు నుంచి రూ. 20వేలు లంచం డిమాండ్ ● రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు రణస్థలం: లావేరు మండలంలోని లోపెంట పంచాయతీ గ్రామ రెవెన్యూ అధికారి అరుబారికి మల్లేశ్వరరావు ఒక రైతు నుంచి రూ. 20వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్ గా బుధవారం పట్టుకున్నారు. శ్రీకాకుళం అవినితి నిరోధక శాఖ డీఎస్పీ కెంబూరి సత్యనారాయణరావు తెలిపిన వివరాలు ప్రకారం.. ఎచ్చెర్ల మండలంలోని అజ్జరాం గ్రామానికి చెందిన కొయ్యి సత్యనారాయణ అనే రైతుకు లావేరు మండలంలోని లోపంట, సహాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో భూములు ఉన్నాయి. అతని భూములు మ్యుటేషన్ చేసేందుకు, పట్టాదారు పాసుపుస్తకం జారీ చేసేందుకు వీఆర్ఓ రూ. 20వేలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై రెండు రోజుల కిందట రైతు ఏసీబీని సంప్రదించారు. వారి ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం రూ.20వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అలాగే వీఆర్ఓ స్వగ్రామం మురపాకలో తన ఇంటిలో కూ డా సోదాలు నిర్వహించారు. మల్లేశ్వరరావు వీఆర్ఏ నుంచి వీఆర్వోగా ఉద్యోగోన్నతి పొందా డు. 2023 నుంచి లోపెంటలోనే పని చేస్తున్నాడు. అంతకుముందు రణస్థలం మండలంలోని తెప్పలవలసలో వీఆర్వోగా పని చేశారు. ఆ సమయంలో తెప్పలవలస పంచాయతీలో వివాదాస్పద భూము లు సరి చేస్తామని, ప్రభుత్వ భూములు రైతుల పేరున ఎక్కిస్తామని చెప్పి రైతుల నుంచి లక్షల్లో సొ మ్ములు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతులు తిరగబడడంతో కొంతవరకు పెద్దమనుషుల సమక్షంలో సొమ్ములు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రైడ్లో ఏసీబీ సీఐ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
గజపతి కలెక్టరేట్ సందర్శన
పర్లాకిమిడి: గజపతి కలెక్టరేట్ను భువనేశ్వర్ నుంచి అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం సందర్శించింది. తొలుత కలెక్టర్ కార్యాలయంలో ఏడీఎం మునీంద్ర హానగ అధ్యక్షతన జరిగిన అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ బినాయక్ రౌళో, కలెక్టర్ జగన్నాథ పాఢి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ అసిస్టెంట్ సెక్షన్ అధికారులకు పరిపాలన విభాగంలో వివిధ సెక్షన్లలో సిబ్బందితో ఎలా పని చేయించాలి, వారి విధులు, కంప్యూటర్లో పరిజ్ఞానం, ఫైల్స్ నిర్వహణ పై ప్రత్యేక కర్మశాలను నిర్వహించారు. అనంతరం 50 మంది అధికారుల బృందం ప్రత్యేక బస్సులో బి.ఎన్.ప్యాలస్, గజపతి ప్యాలస్, శ్రీజగన్నాథ మందిరాన్ని సందర్శించారు. కొత్తగా ప్రొమోషన్ పొందిన ఈ అసిస్టెంటు సెక్షన్ అధికారులు పలు జిల్లాల్లో కలెక్టరేట్లు పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు అధ్యయనం చేస్తున్నారు. -
‘విధి’ వక్రీకరించి..
● తల్లికి బదులుగా పనికి వెళ్లిన కుమారుడు ● విద్యుదాఘాతంతో మృతి కవిటి: స్థానిక పోలీస్స్టేషన్లో ప్రైవేట్ స్వీపర్గా 17 ఏళ్లుగా పనిచేస్తున్న లిమ్మా యి రుక్మిణికి ఆరోగ్యం బాగోలేదని ఆమె బదులుగా కొడుకు లిమ్మాయి మోహనరావు(39) విధి నిర్వహణకు హాజరు కాగా.. విద్యుత్షాక్ తగిలి మరణించాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కవిటి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తల్లి అనారోగ్యం కారణంగా పోలీస్ స్టేషన్ శుభ్ర పరిచేందుకు మోహనరావు వెళ్లాడు. అక్కడ స్టేషన్ గదులను శుభ్రం చేశాడు. ఆ తర్వాత తనకు ఖర్చుల కోసం కొబ్బరికాయలు తీసి అమ్మకం చేసేందుకు స్టేషన్ పరిసరాల్లో ఉన్న కొబ్బరి చెట్టు నుంచి ఇనుప గజంతో కాయలు తీసే ప్రయత్నంలో చెట్టు సమీపంలో వెళుతున్న విద్యుత్ తీగలకు ఆ ఇనుప గజం తాకి షాక్కు గురయ్యాడు. దీంతో అతడిని వెంటనే కవిటి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యంలోనే మోహనరావు మృతిచెందాడని పోలీసులు తెలిపారు. మృతునికి భార్య లిమ్మాయి ప్రమీల, కొడుకు ఉజ్వల్, కూతురు అనూజ ఉన్నారు. చెట్టంత కొడుకు మరణించడంతో తల్లి, భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు కవిటి ఎస్ఐ వి.రవివర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● ఫోన్లు అప్పగింత
రాయగడ: పోయిన, చోరీకి గురైన ఫోన్లను గుర్తించి యజమానులకు తిరిగి అందజేసే కార్యక్రమంలో భాగంగా ఝార్సుగుడ జిల్లా పోలీసులు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ హ్యాండోవర్ మేళా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి.ఆర్.రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 89 ఫోన్లను వాటి యజమానులకు అందజేశారు. ఝార్సుగుడ సైబర్ సెల్తోపాటు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో సమన్వయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ల వారిగా స్వాధీనం చేసుకున్న పోన్లలో ఝార్సుగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యధికంగా 29, బడ్మాల్లో 11, బెల్పహార్ పాళీలో 7, బ్రజరాజ్నగర్, సదర్, మణ్పూర్, సిసి అండ్ ఈఓ పోలీస్ స్టేషన్లలో చెరో 6, ఓరియంట్లో 5, లైకేరా, కొలాంబిరాలో చెరో 4, రెంగాలిలో 3, ఎయిర్పోర్టు, బెల్పహార్లో చెరో ఒఓ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎప్పీ తెలిపారు. ఫోన్లు పోయినా, చోరీకి గురైన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదును నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఝార్సుగుడ పోలీసులు ఐదు విడతల్లో నిర్వహించిన మొబైల్ మేళాల ద్వారా మొత్తం 413 ఫోన్లను గుర్తించి వాటిని యజమానులకు అందజేశామని తెలిపారు. -
నిరుద్యోగులకు టోపీ
సోంపేట: సోంపేట పరిసర గ్రామాల నిరుద్యోగులకు పట్టణంలో వెలసిన ఓ ప్రైవేటు శిక్షణ కేంద్రం కుచ్చుటోపీ పెట్టింది. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించడానికి శిక్షణ అందజేస్తామ ని నమ్మబలికి సోంపేటలో ఆరు నెలల కిందట బస్టాండు సమీపంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పా టు చేశారు. శిక్షణ కేంద్రంలో వందలాది మంది విద్యార్థులను చేర్చుకున్నారు. రైల్వే, బ్యాంక్, డీఎస్సీ, ఉద్యోగాలతో పాటు ఎంసెట్ ర్యాంకులు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఉద్యోగం ఇచ్చేవరకు శిక్షణ అందజేస్తామని చెప్పి నిరుద్యోగుల వద్ద లక్షల రూపాయలు ఫీజు వసూ లు చేశాడు. అలాగే పట్టణంలో పలు దుకాణాల్లో మౌలిక వసతుల కోసం పలు వస్తువులు, కిరాణా తెచ్చి వారికి నగదు ఇవ్వకుండా బోర్డు తిప్పినట్లు తెలుస్తుంది. రాత్రికి రాత్రి శిక్షణ కేంద్రానికి తాళాలు వేయడంతో శిక్షణకు ఫీజులు కట్టిన విద్యార్థులు, నిరుద్యోగులు ల బోదిబోమంటున్నారు. సుమారు కోటి రూపాయలు వరకు నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మెయిన్ డ్రాప్ కూల్చివేతపై రైతుల ఆందోళన సంతబొమ్మాళి: పాలతలగాం వద్ద వంశధార కాలువలో వేసిన మెయిన్డ్రాప్ పిల్లర్ కూల్చివేతపై రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. మెయిన్డ్రాప్ పిల్లర్ కూల్చివేయడంతో సాగునీరు ఈ ప్రాంతానికి అందదని, సు మారు 1500 ఎకరాలు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు అంటున్నారు. గతంలో వంశధార అధికారులే డ్రాప్ను ఏర్పాటు చేసి ఇప్పుడు అ అధికారులే కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. దీనిపై వంశధార జేఈ అప్పలరెడ్డిని సంప్రదించగా.. మెయిన్ డ్రాప్ వల్ల దిగువన ఉన్న వేల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఉందని, దీంతో కూల్చేశామని తెలిపారు. ‘డ్రగ్స్ నియంత్రణకు యుద్ధానికి సిద్ధం’ అరసవల్లి: బంగారు భవిష్యత్ను అంధకారంలో పడేస్తున్న డ్రగ్స్ నిర్మూలనపై యువతే ముందడుగు వేసి యుద్ధానికి సిద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో మై భారత్ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ న మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ వికాస్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందని వివరించారు. డ్రగ్స్ వినియోగిస్తూ ఎందరో అమాయక యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వినియోగంతో కలిగే అనర్థాలను తెలిసేలా అవగాహన కలిగించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మత్తు పదార్థాల నియంత్రణ–యువత పాత్రపై జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. పోటీల అనంతరం విజేతలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.సుధ, డీఎల్డీఓ భాస్కరరావు, సెట్శ్రీ సీఈ ఓ అప్పలనాయుడు, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. ఆమదాలవలసలో లాయర్ల విధుల బహిష్కరణ ఆమదాలవలస: గత నెల 30వ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విధుల్లో ఉన్న బార్ అసోసియేషన్ సభ్యు లు, లాయర్ దానేటి రామ్మోహన్రావును క్రైమ్ నంబర్ 117/2026 లో నిందితుడిగా ఎ–8 గా చేర్చడం సరికాదని ఆమదాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మిబాయి తోపాటు బార్ అసోసియేషన్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు. వైఎస్ జగన్ జిల్లా పర్యటనలో మహిళా ఎస్ఐపై అస భ్యంగా ప్రవర్తించిన ఆరోపణలపై కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆ సమయంలో కోర్టు విధుల్లో ఉండడాన్ని అందరం గమనించామన్నారు. అందుకే విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు. -
బ్యాడ్మింటన్ చాంపియన్లుగా లక్ష్మివైశాక్, నవ్య
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలో నాలుగురోజులపాటు కన్నులపండువలా సాగిన సీనియర్స్ బ్యాడ్మింటన్ స్టేట్మీట్ బుధవారంతో ముగిసింది. శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడి యం వేదికగా జరిగిన పోటీల్లో విశాఖపట్నం, కృష్ణ, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం షట్లర్లు సత్తా చాటి జయకేతనం ఎగురవేశారు. విజేతల వివరాలు ఇవి.. ● పురుషుల సింగిల్స్లో ఎం. లక్ష్మివైశాక్ (విశాఖపట్నం) చాంపియన్గా నిలవగా, టి.హర్షణ్ (కృష్ణ) రన్నరప్గా నిలిచాడు. ● పురుషుల డబుల్స్ విభాగంలో వి.హరికృష్ణ (తూర్పుగోదావరి)–టి.చరణ్రామ్ (చిత్తూరు) జంట విజేతగా నిలవగా, సాయిపవన్ కర్రి (తూర్పుగోదావరి)–ఎం.ధర్మాఘ్న(గుంటూరు) జంట రన్నరప్గా నిలిచారు. ● ఇక మహిళల సింగిల్స్ చాంపియన్గా కందేరి నవ్య (చిత్తూరు)నిలవగా, కె.దుర్గా ఇషా (తూర్పుగోదావరి) రన్నరప్గా నిలిచింది. ● మహిళల డబుల్స్ విభాగంలో డి.దీపిక (గుంటూరు)–డి.శ్రవంతి(గుంటూరు) జంట విజయదుందుబి మోగించగా, కె.సరియు(ప్రకాశం)– వి.వైష్ణవి(విశాఖపట్నం) జంట రన్నరప్గా నిలిచారు. ● మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కర్రి సాయిపవన్ (తూర్పుగోదావరి)–దండు పూజ (చిత్తూరు) జంట విజేతగా నిలవగా, బి.అభిషేక్ (తూర్పుగోదావరి)–గగనశ్రీ చౌదరి కె (కృష్ణ) రన్నరప్తో సరిపెట్టుకున్నారు. జాతీయ పోటీల్లో సత్తాచాటాలి.. ఏపీ సీనియర్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులంతా సౌత్జోన్ నేషనల్స్, ఆలిండియా నేషనల్స్ పోటీల్లో నూ ఇదే స్ఫూర్తితో రాణించి విజయదుందుబి మోగించాలని ఏపీ బ్యాడ్మింటన్ సీఈఓ, ఏఎస్పీ ఈగల్ టీం విశాఖపట్నం చుక్కా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నాలుగు రోజుల జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ముగింపు, బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు నిర్వహణ కమిటీ ప్రతినిధులతో కలిసి టైటిల్స్, ప్రసంశాపత్రాలను అందజేశారు. సిక్కోలు ఆతిథ్యం భేష్ స్టేట్మీట్కు హాజరైన వివిధ జిల్లాల క్రీడాకారులు సిక్కోలు ఆతిథ్యాన్ని మరువలేమని సంతోషం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకపోయినా నిర్వాహకులు క్రీడాకారులకు చక్కటి సదుపాయాలు కల్పించి గొప్పగా చూసుకున్నారు. -
రెవెన్యూ శాఖలో అలజడి
● నరసన్నపేటలో భూ ఆక్రమణలపై 19 మంది ప్రభుత్వ సిబ్బందిపై చర్యలకు ఉత్తర్వులు నరసన్నపేట: నరసన్నపేటలో ఆక్రమణలతో సంబంధం ఉన్న ఏడుగురు తహసీల్దార్లు, 12 మంది వీఆర్వోలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ఉద్యోగులపై చర్య లు తీసుకోవడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో రెవె న్యూ శాఖ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏడుగురు తహసీల్దార్లలో కె.ప్రవళ్లిక ప్రియ, యూవీ రమణ, ఎం.సురేష్ కుమార్, పొదిలాపు శ్రీనివాసరావు, ఎస్.సుధాసాగర్, జల్లేపల్లి రామారావు, వై.శ్రీనివాసరావు ఉన్నారు. అలాగే 12 మంది వీఆర్వోలు జ్ఞానేశ్వరరావు, కోటేశ్వరరావు, జెల్ల శ్రీనివాసరావు, లుకలాపు శ్రీనివాసరావు, ఎం. శ్రీనివాసరావు, ఎం.సంధ్య, టి.లక్ష్మణరావు, చౌ దరి చక్రవర్తి, మురళీ కృష్ణం నాయుడు, శ్యామ్, చిన్న వెంకటరావు ఉన్నారు. ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు వీరికి షోకాజ్ నోటీసులు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. 2009 నుంచి జరిగి న ఆక్రమణలపై 2018లో నివేదిక ప్రభుత్వానికి ఇవ్వగా ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అప్పటి తహసీల్దార్లలో ఒకరు పదవీ విరమణ పొందగా ఒకరు ఆర్డీఓ స్థాయి అధికారిగా ఉన్నారు. వీఆర్వోల్లో ఒకరిద్దరు పదవీ విరమణ పొందగా మి గిలిన వారు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఉత్తర్వులతో రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది. రైల్వేట్రాక్పై భారీ సర్పంకంచిలి: జాడుపూడి గ్రామం సమీపంలో రైల్వేట్రాక్ మధ్యలో బుధవారం ఉదయం భారీ సర్పం అక్కడ పనులు చేస్తున్న ట్రాక్మ్యాన్ దృష్టిలో పడింది. సుమారు పది అడుగులు ఉండే పాము హఠాత్తుగా ట్రాక్ వద్ద కనబడటంతో ట్రాక్మ్యాన్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ సర్పాన్ని తన మొబైల్ ఫోన్ కెమెరాలో బంధించాడు. -
బ్యాంక్కు తాళాలు
కొరాపుట్: సకాలంలో వడ్డీలు కట్టకపోతే ఖాతాదారుల భవనాలకు బ్యాంక్లు తాళాలు వేయడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ బ్యాంక్కే భవన యజమాని తాళాలు వేసిన ఘటన జరిగింది. మంగళవారం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ పట్టణంలో డీఎన్కే కాలనీ బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయానికి తాళాలు పడ్డాయి. ఈ బ్యాంక్కి సుధీర్ చౌదరి తండ్రి భవనాన్ని అద్దెకి ఇచ్చారు. తర్వాత సుధీర్ తండ్రి చనిపోయారు. అద్దె అగ్రిమెంట్ కూడా ముగిసిపోయింది. సుధీర్ తన అగ్రిమెంట్ ని పునరుద్ధరించాలని బ్యాంక్ను కోరారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో లీగల్ నోటీస్ పంపించినా ఫలితం లేకపోయింది. గత 6 నెలలుగా అద్దె చెల్లించక పోవడం తో యజమాని విసిగి బ్యాంక్కి తాళాలు వేసి ధర్నాకి దిగారు. ఖాతాదారులు బ్యాంక్ వద్దకు వచ్చి వెనుదిరుగుతున్నారు. సీఎంఓ ఫైళ్ల గల్లంతుపై విచారణ భువనేశ్వర్: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి నాయుడు కమిషన్ నివేదిక అదృశ్యంపై ఒడిశా క్రైమ్ బ్రాంచ్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో సాంకేతిక దర్యాప్తు కొనసాగుతోందని, ఆధారాలు లభించిన కొద్దీ మరికొంత మందిని ప్రశ్నించే అవకాశం ఉందని క్రైం శాఖ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి క్రైమ్ బ్రాంచ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) వినయ్తోష్ మిశ్రా మాట్లాడుతూ గల్లంతైన ఫైల్కు సంబంధించిన పరిస్థితులను వెలికితీసేందుకు సాంకేతిక, శాసీ్త్రయ పద్ధతులను ఉపయోగించి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ రాబోయే రోజుల్లో మరికొంత మందిని ప్రశ్నించే అవకాశం ఉందని డీజీ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలిన వారెవరైనా దర్యాప్తుకు సహకరించి దర్యాప్తు సంస్థ జారీ చేసిన అధికారిక నోటీసులకు స్పందించాల్సి ఉంటుందని అన్నారు. దర్యాప్తు ఇంకా కీలక దశలోనే ఉంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ధారణలకు రాకూడదు. వివరణాత్మక దర్యాప్తు క్రమంలో సేకరించిన అన్ని సాక్ష్యాలు, వాంగ్మూలాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫైలు అదృశ్యం వెనుక ఉన్న నిజం వెలుగులోకి వస్తుందన్నారు. నోటీసులు అందుకున్న వారు విచారణ నుంచి తప్పించుకోలేరని క్రైం శాఖ హెచ్చరించింది. దర్యాప్తు అవసరాలను బట్టి వివిధ వ్యక్తులకు దశల వారీగా నోటీసులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభ దశలో ఉంది. హోం శాఖ నుంచి మొదలుకొని ప్రధాన కార్యదర్శి కార్యాలయం మీదుగా ముఖ్యమంత్రి కార్యాలయం వరకు ఫైలు కదలికతో సమగ్ర ప్రక్రియను దర్యాప్తు బృందం అధ్యయనం చేసింది. గల్లంతు అయిన ఫైలు వివిధ ప్రక్రియలు మరియు దానిని ఎలా నిర్వహిస్తున్నారనే దానిపై దర్యాప్తు బృందం ఆ మూడు శాఖల కార్యాలయాలకు లేఖలు రాసింది. దర్యాప్తుకు సహాయపడటానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని ఈ లేఖలో కోరినట్లు క్రైమ్ శాఖ డైరెక్టర్ జనరల్ అన్నారు. రాణిపేటలో తిరంగ పతాక యాత్ర పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ కె.సీతాపురం పంచాయతీ రాణిపేట గ్రామంలో మంగళవారం బీజేపీ మండల సమావేశం, తిరంగా పతాక యాత్రను జిల్లా సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో ఆధ్యక్షతన జరిగింది. ఈ మండల సమావేశంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు పాల్గొని మాట్లాడారు. సర్ ఓటరు జాబితా బూత్ లెవల్లో తప్పులుంటే సరిదిద్ది ఓటర్లు జాబితా నుంచి మాయమవ్వకుండా చూడాలన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. అనంతరం రాణిపేట గ్రామం నుంచిగుమ్మ రోడ్డు వరకు తిరంగ పతాకంతో పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సమితి చైర్మన్ ఛిత్రి సింహాద్రి, నృసింహా చరణ్ పట్నాయక్, జెడ్పీటీసీ సభ్యురాలు (కాశీనగర్) రోక్కం రాజ్యలక్ష్మి, బాబూరావు, మండలాధ్యక్షుడు కె.జీవన్, యువజన నేత పిన్నింటి కిరణ్, దివాకర్, తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డుపై హత్యాయత్నం కేసులో ముగ్గురు అరెస్టు
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ పోలీసు స్టేషన్ పరిధిలో హోంగార్డ్ ప్రసాద్ పూజారి పై జరిగిన హత్యా ప్రయత్నంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి(ఎస్డిసిఓ)కుమారి అర్చిత మిత్తల్ మీడియాకు తెలిపారు. జయపురం జయపురం సదర్ పోలీసుస్టేషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె హోంగార్డ్పై హత్యాయత్నాన్ని వివరించారు. పూర్వ శతృత్వం వల్లనే నిందితులు హత్య చేసేందుకు దారి కాచి దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఆమె వెల్లడించారు. డ్యూటీలో ఉన్న హోంగార్డ్ ప్రసాద్ పూజారి తన స్వగ్రామం గుమ్మకు వెళ్లి తిరిగి బొయిపరిగుడ వస్తున్న సమయంలో దుండగులు ముందుగా వేసుకున్న పథకం దాడి జరిపారని వెల్లడించారు. ఈ సంఘటనపై బొయిపరిగుడ పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేందుకు ఒక ప్రత్యేక పోలీసు టీమ్ను ఏర్పాటు చేశారని వెల్లడించారు. పోలీసులు దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాలు, ఆధారాలు, వైజ్ఞానిక ప్రమాణాలు, ఇతర ఆధారాలతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు. అరెస్టు అయిన వారు బొయిపరిగుడ సమితి పూజారిగుడ గ్రామం అజయ హరిజన్, అజిత్ సాగరియ, మాధవ మఝి అని వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరు పరచినట్లు కుమారి మిత్తల్ వెల్లడించారు. బొయిపరిగుడ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారని వెల్లడించారు. -
తప్తపాణిలో రాష్ట్రపతి పూజలు
జూనియర్లపై సీనియర్ల దాడి రివల్కోన హైస్కూల్లో జూనియర్లపై సీనియర్లు దాడి చేశారు. ఇది సంచలనం రేకెత్తించింది. –8లోuశ్రీమందిరం ఆదాయం లెక్కింపు భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం మంగళవారం లెక్కించారు. ఇందులో నగదు రూ.3,83,480లు, బంగారం 680 మిల్లీగ్రాములు, వెండి 51 గ్రాములు వచ్చాయని అధికారులు తెలిపారు. బుధవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2026పర్లాకిమిడి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గంజాం జిల్లాలో రెండురోజుల పర్యటనకు మంగళవారం విచ్చేశారు. రాష్ట్రపతి ఉదయం 11.10 గంటలకు బరంపురం రైల్వే స్టేషన్కు చేరుకోగా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి ఘనస్వాగతం పలికారు. వారితో పాటు రాష్ట్ర ఉక్కు, రవాణా శాఖ మంత్రి బిభూతీ భూషణ్ జెన్నా, రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి గోకులానంద మల్లిక్, ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి, బరంపురం ఎమ్మెల్యే కె.అనిల్కుమార్, దక్షిణ మండళం ఆర్డీసీ సంగ్రాంకేసరి మహాపాత్రో, సదరన్ రేంజ్ ఐ.జీ (పోలీసు) నితిశేఖర్, గంజాం కలెక్టర్ వి.కార్తివాసన్, బరంపురం ఎస్పీ డాక్టర్ శరవణ వివేక్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పులి వేషం, గిరిజన నృత్యాలు, సంకీర్తనలు, జానపద నృత్యాలతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గంజాం, గజపతి జిల్లాలో సరిహద్దులో ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతం తప్తపాణికి బయల్దేరారు. ప్రత్యేక పూజలు వేడినీటి బుడగలో ఉన్న మాకందునీ దేవి పీఠం ఒక పవిత్ర క్షేత్రం. శ్రావణమాసంలో ఈ క్షేత్రాన్ని సందర్శించిన తొలి భారత రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము చరిత్రలో నిలిచి పోతారని ప్రధాన పూజారి ప్రశాంత్ కుమార్జానీ విలేకరులతో అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ ప్రధాన పూజారి ఘనంగా స్వాగతం పలికారు. తప్తపాణిలో మాకందునీ దేవికి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేయించారు. ఆమె సమీపంలోని మహాదేవ ఆలయాన్ని కూడా సందర్శించి పవిత్ర హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్తపాణికి దారి పొడవునా వివిధ పాఠశాలల విద్యార్థులు, ప్రజలకు అభివాదం తెలుపడమే కాకుండా మీనాక్షినగర్ (బరంపురం) వద్ద చిన్నారులకు చాక్లెట్లు పంచిపెట్టి, సెల్ఫీలు దిగారు. రాష్ట్రపతికి ఎస్కార్టుగా ప్రత్యేక సెక్యూరిటీ, గవర్నరు పేషీ, ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారుల కార్లు తప్తపాణికి చేరుకున్నాయి. -
గ్రామాల అభివృద్ధికి సహకరిస్తాం
రాయగడ: గ్రామాభివృద్ధికి తమవంతు సహకరిస్తామని ఆదివాసీ యువశక్తి సంఘం (ఆయూస్) ప్రతినిధులు వెల్లడించారు. సదరు సమితి పరిధిలోని బాయిసింగ్ గ్రామంలో ఆదివాసీ గ్రామ సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులతో ఆయూస్ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఏడు ప్రధాన సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి దశలవారీగా చర్యలు చేపడతామని సంఘం ప్రతినిధులు తెలిపారు. సదస్సుకు సంఘం వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త విజయ కుమార్ మెలక అధ్యక్షతన వహించగా, సహ వ్యవస్థాపకుడు కామేశ్వర్ బిడిక సహకరించారు. గ్రామానికి చెందిన యోహన్ తాడింగి, రంగపాలక్, గురునాఽథ్ తాడింగి, నరి తాడింగి, మణికంఠ తాడింగి, లొకేష్ తాడింగి, విక్రమ్ తాడింగి, గిరపా తాడింగి, లదా సిరిక, జామ తాడింగి స్వఛ్చందంగా ఆయూస్ గ్రామ కమిటీలొ సభ్యత్వం స్వీకరించారు. నూతన సభ్యులకు సంఘం లక్ష్యాలు, విధివిధానాలు, బాధ్యతలపై త్వరంలో శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం సంఘం వ్యవస్థాపకుడు విజయ కుమార్ మెలక ఆధ్వర్యంలో సభ్యులు గొప్యతను కాపాడుతూ సంఘం ఆదర్శాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆదివాసీ యువశక్తి (ఆయూస్ ) 2026 మే ఒకటో తేదీన ఆన్లైన్ వేదికగా ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో 30 మంది జీవితకాల సభ్యులుగా ఉన్నారని, ఒడిశా వ్యాప్తంగా లక్షమంది సభ్యులను చేర్చుకోవడమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని వెల్లడించారు. ఆదివాసీ భాషలు, సాహిత్యం, సంస్కృతి, అలాగే సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల పరిరక్షణ, అభివృద్ధి కోసం కృషి చేయడం సంఘం ప్రధాన ఉద్యేశమని ప్రతినిధులు వెల్లడించారు. గ్రామం నుంచి ఐక్యత–ఐక్యతతో అభివృద్ధి అనే నినాదంతో గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 10 జిల్లాలకు జిల్లా సమన్వయకర్తలు ఎంపిక చేసిన ఆయూస్, దశల వారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు విశేషంగా కృషి చేస్తుందని వివరించారు. ఆదివాసీ యువశక్తి సంఘం ప్రతినిధులు -
సెంచూరియన్లో ‘తేజాస్’
పర్లాకిమిడి: ఒడిశా స్టార్టప్స్ను ప్రారంభించడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న అనువైన రాష్ట్రంగా ఉందని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. ఆయన ఆర్.సీతాపురంలో సెంచూరియన్ వర్సిటీలో తేజాస్ (ట్రాన్స్ఫార్మింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ జర్నీ ఎక్రాస్ స్టేట్స్ మరియు జిల్లాలు)ను కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీపీఐఐటీ సీఈఓ స్మృతి రంజన్ప్రధాన్, మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, జిల్లా పరిషత్తు అధ్యక్షులు గవర తిరుపతి రావు, పురపాలక శాఖ చైర్మన్ నిర్మలా శెఠి, సెంచూరియన్ వర్సిటీ ప్రోవీసీ అజయ్కుమార్ నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్రో, డైరెక్టర్ దుర్గాప్రసాద్ పాడి తదితరులు పాల్గొన్నారు. యువ పారిశ్రామిక వేత్తలు గురించి రూపేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ, యువత ఆత్మనిర్భర్ భారత్ సాధనకు మూలాధారం తేజాస్ అని అన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆశించకుండా ప్రతి ఒక్కరూ మెంటర్షిప్, దక్షత, మార్కెటింగ్ లింక్, ప్రభుత్వ సబ్సిడీల వినియోగించుకుని కొత్త స్టార్టప్లు ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకుల కోసం బ్యాంకు రుణాలు అందిస్తుందని, ప్రతి చదువుకున్న విద్యార్థి పరిశ్రమలు, స్టార్టప్స్ ప్రారంభించడానికి ముందుకు రావాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, సీఈఓ స్మృతిరంజన్ ప్రధాన్కు జ్ఞాపికతో విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ అజయ్కుమార్ నాయక్ సత్కరించారు. -
ఒడిశా పోలీసులు, ఎన్ఎఫ్ఎస్యూ మధ్య అవగాహన ఒప్పందం
భువనేశ్వర్: ఒడిశా పోలీసుల సీఐడీ క్రైమ్ శాఖ, భువనేశ్వర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ (టెన్ఎఫ్ఎస్యూ) మధ్య మంగళవారం ఐదేళ్ల అవగాహన ఒప్పందం కుదిరింది. సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కొనే దిశలో డిజిటల్ ఫోరెన్సిక్స్ సామర్థ్యం పటిష్టత, శాసీ్త్రయ దర్యాప్తు వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఈ ఒప్పందం లక్ష్యంగా పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా సమక్షంలో క్రైమ్ శాఖ డీజీపీ వినయతోష్ మిశ్రా, ఎన్ఎఫ్ఎస్యూ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ పూర్వి పోఖరియాల్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ పేరుతో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఒడిశా పోలీసుల ఆధునీకరణ, అభివృద్ధి బాటలో ఈరోజు చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ 5 ఏళ్ల అవగాహన ఒప్పందం ఇరు సంస్థల మధ్య బలమైన పునాదిని ఏర్పరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం రాష్ట్ర సైబర్ పోలీసింగ్ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది అని ఆయన అన్నారు. ఈ రోజుల్లో నేరాల స్వరూపం వేగంగా మారుతోంది. దాదాపు ప్రతి నేరంలోనూ డిజిటల్ సాక్ష్యం ఒక ముఖ్యమైన అంశంగా మారింది. మ్యూల్ ఖాతాలు, ఆన్లైన్ పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్త క్రిమినల్ చట్టం ఫోరెన్సిక్ సైన్స్ను దర్యాప్తులో కేంద్ర బిందువుగా చేసింది. బలమైన ఎలక్ట్రానిక్ సాక్ష్యాల సేకరణ, భద్రత నిర్వహణ ప్రతి పోలీస్ అధికారికి ప్రాథమిక నైపుణ్యంగా ఉండాలని డీజీపీ తెలిపారు. సైబర్ నేరాల సవాలును ఎదుర్కోవడానికి రాష్ట్రంలో 20 కొత్త సైబర్ క్రైమ్, ఆర్థిక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఆయా ఠాణాలకు సుమారు రూ. 15 కోట్ల విలువైన ఆధునిక హార్డ్వేర్, సాఫ్ట్వేర్లను అందించారు. ఈ సాధనాల వినియోగానికి నాణ్యమైన శిక్షణ అవసరమన్నారు. ఎన్ఎఫ్ఎస్యూతో కుదిరిన అవగాహన ఒప్పందం కేవలం శిక్షణకు మాత్రమే పరిమితం కాదు. క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, ఉన్నత విద్య, ఉమ్మడి పరిశోధన, ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక కన్సల్టెన్సీ వంటి అనేక రంగాలను కూడా ఇది కవర్ చేస్తుందని డీజీపీ తెలిపారు. కార్యక్రమంలో క్రైం శాఖ డీజీపీ వినయతోష్ మిశ్రా మాట్లాడుతూ ఎన్ఎఫ్ఎస్యూతో భాగస్వామ్యం కారణంగా పోలీస్ శాఖలోని అన్ని స్థాయిల ఉద్యోగులకు, అధికారులకు ఉన్నత నాణ్యత గల సాంకేతిక శిక్షణను అందించడం సాధ్యమవుతుందని అన్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి రాష్ట్రంలోని 34 పోలీస్ జిల్లాలు, క్రైమ్ శాఖలకు చెందిన మొత్తం 480 మంది అధికారులు, ఉద్యోగులకు 16 బ్యాచ్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు డీజీపీ వినయతోష్ మిశ్రా తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రతి బ్యాచ్లో 30 మంది పాల్గొంటారు. కానిస్టేబుల్ నుండి డీఎస్పీ వరకు ఉన్న అధికారులు ఈ శిక్షణలో భాగమవుతారని ఆయన తెలిపారు. 6 రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో 5 రోజులు ఎన్ఎఫ్ఎస్యూ క్యాంపస్లో, ప్రయోగశాల ఆధారిత శిక్షణ, మరో రోజు సైబర్ కాంప్లెక్స్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు. మొదటి బ్యాచ్ను ఉద్దేశించి డీజీపీ మాట్లాడుతూ సర్టిఫికెట్లు సాధించడంతో ఈ శిక్షణ పరిమితం కారాదని, కచ్చితమైన డిజిటల్ సాక్ష్యాల సేకరణ, శాసీ్త్రయ దర్యాప్తు నిర్వహణ, న్యాయ స్థానాల్లో ఆమోదయోగ్యమైన సాక్ష్యాలను ప్రవేశ పెట్టడం వంటి నైపుణ్యాలను పొందడంలో కూడా ఉందని అన్నారు. శిక్షణ తర్వాత తమతమ జిల్లాలకు తిరిగి వెళ్లి, ఈ జ్ఞానాన్ని తమ సహోద్యోగులతో పంచుకోవాలని డీజీపీ శిక్షణార్థులను కోరారు. ఎస్ఎఫ్ఎల్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ బాలా, ఎన్ఎఫ్ఎస్యూ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ పూర్వి పోఖారియాల్, ఇనస్పెక్టర్ జనరల్ (క్రైమ్) డాక్టర్ సార్థక్ షడంగి, ఎన్ఎఫ్ఎస్యూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విశ్వకల్యాణ్ డాష్ మంగళ వారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పశువుల వాహనం సీజ్
రాయగడ: జిల్లాలో అక్రమ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జనతా గ్రామం సమీపంలో ఆరు పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. జనతా గ్రామం నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఘాట్ రోడ్డు ప్రాంతంలో అనుమానస్పదంగా ఎరువుల లోడుతో వెళ్తున్నలారీని ఆపి తనిఖీ చేశారు. ప్రాథఽమిక పరిశీలన అనంతరం ఆ లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రెండు వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యలు కోసం రాయగడ పోలీసులకు అప్పగించారు. అక్రమ రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఇలాంటి ఆకస్మిక తనిఖీలు, దాడులు భవిష్యత్లో కూడా కొనసాగుతాయన్నారు. మండుతున్న ఎండలు పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పర్లాకిమిడిలో గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. శ్రావణ మాసంలో ఇంతటి ఉక్కపోత ఎప్పుడూ చూడలేదని ప్రజలు అంటున్నారు. పర్లాకిమిడిలో పగటి ఉష్ణోగ్రతులు 36 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం కొద్దిపాటి వర్షం కురిసినా ఉక్కపోత తగ్గలేదు. ఎండలు పెరగడంతో కలెక్టరేట్ వద్ద నిర్మాణుష్యంగా కనిపించింది. వివాహితపై భర్త, కుటుంబ సభ్యుల దాడి మెళియాపుట్టి: మండలంలోని చాపర గ్రామానికి చెందిన వివాహిత తమిరి మాధవిపై తన భర్తతోపాటు కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ మేరకు మాధవి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హెచ్సీ ఢిల్లేశ్వరరావు కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. చాపరకు చెందిన దారపు ధనుంజయరావు, తమిరి మాధవికి 2010లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. ఇటీవల ధనుంజయరావు ఆర్మీలో పదవీ విరమణ పొందాడు. పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చిన సొమ్ము మొత్తం మాధవి భర్త ధనుంజయ.. అతని అన్న లక్ష్మీనారాయణకు అప్పజెప్పడంతో మాధవి ప్రశ్నించింది. దీంతో ఆమైపె తన భర్తతోపాటు అత్త మామలు, బావ లక్ష్మీనారాయణ దాడికి పాల్పడ్డారు. వివాహం అయిన తర్వాత ఎటువంటి కట్నం, భూమి తీసుకురాలేదు, నీకు ప్రశ్నించే హక్కులేదని నలుగురూ కలిసి దాడి చేశారని తెలిపారు. అదేవిధంగా వరకట్నం తీసుకురావాలి, లేదంటే విడాకులకు అంగీకరించాలని ఒత్తిడికి గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన నలుగురిపై గృహహింస, వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నేడు జిల్లాస్థాయి పోటీలు అరసవల్లి: కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు మై భారత్ కేంద్ర (ఎన్వైకే) ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లుగా జిల్లా యూత్ ఆఫీసర్ ఎన్.కృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు మై భారత్ పోర్టల్ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. వివిధ అంశాల్లో జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. -
పాతపట్నంలో ఆధ్యాత్మిక శోభ
పాతపట్నం: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవమైన పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు మహిళలు భారీగా తరలిరావడంతో నగరంలో మంగళవారం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పలు వీధుల్లో ఆషాఢమాస ఆవేటి వారాల పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగర వాసులు తమ ఇళ్ల నుంచి బయల్దేరి ఘటాలను తీసుకుని ఊరేగింపుగా నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం వరకు మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో వెళ్లారు. మహిళలు అమ్మవారికి ముర్రాటాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం అషాఢ మాసం మొదటి పౌర్ణమి తర్వాత తొలి మంగళవారం ఆవేటి పండుగ నిర్వహించడం ఆనవాయితీ అని ఈవో టి.వాసుదేవరావు, ఆలయ చైర్మన్ అక్కందర సన్యాసిరావులు తెలిపారు. ఎటుంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ కిల్లి వెంకటరావు పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
పాముకాటుతో మహిళా రైతు మృతి
రణస్థలం: లావేరు మండలంలోని రాయిలింగారిపేట గ్రామానికి చెందిన గొర్లె భవాని(45) గత నెల 31వ తేదీన వ్యవసాయ పనులకు పొలానికి వెళ్లగా పాటుకాటు వేసింది. దీంతో ఆమెను చికిత్స కోసం రణస్థలం సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆమె మృతి చెందింది. ఈమెకు భర్త భానోజీరావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లావేరు ఎస్ఐ వి.సందీప్ కుమార్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కిడ్నీ వ్యాధితో మహిళ మృతి నందిగాం: మండలంలోని దిమ్మిడిజోలకు చెందిన కొల్లి భాగ్యవతి(40) కిడ్నీ వ్యాధితో మృతి చెందింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. భాగ్యవతి గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఆరేళ్ల క్రితం ఆమె తల్లి అనసూయమ్మ ఒక కిడ్నీని కుమార్తె భాగ్యవతికి ఇవ్వడంతో కిడ్నీ మార్పిడి చేశారు. భాగ్యవతి భర్త సాంబమూర్తి రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భాగ్యవతి తన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి టెక్కలిలోని సాయిచంద్రనగర్లో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఆమె తీవ్ర ఆయాసంతో అస్వస్థతకు గురి కావడంతో బంధువులు టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. పంద్రాగస్టు వేడుకలకు పక్కా ఏర్పాట్లు శ్రీకాకుళం పాతబస్టాండ్: స్వాతంత్య్ర దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన జిల్లా అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా శాఖలు ప్రభుత్వ పథకాల పై శకటాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ సందేశం తయారు చేయాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి చెన్నకేశవరావును ఆదేశించారు. వేదిక ఏర్పాట్లు ఆర్అండ్బీ ఎస్ఈ చూడాలన్నారు. ఉద్యోగంలో ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులకే సర్టిఫికెట్కు ప్రతిపాదించాలన్నారు. అక్రమంగా చెరువు గట్టుపై రహదారి నిర్మాణం..? ఆమదాలవలస: శ్రీకాకుళం రూరల్ మండలం, ఆమదాలవలస మున్సిపాలిటీ నాదానపురం గ్రామ సమీపంలోని చిట్టివాని చెరువు గట్టుపై ఎటువంటి అనుమతులు లేకుండా రహదారి నిర్మాణ పనులు ఆ గ్రామానికి చెందిన ఒక టీడీపీ కార్యకర్త చేపడుతున్నారని గ్రామానికి చెందిన కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల చింతాడ గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్ గ్రీవెన్స్లో వినతిపత్రం ఇచ్చారు. చెరువు వెనుక భాగంలో సుమారు 12 ఎకరాల భూమి ఉండడంతో ఆ భూములను రియల్ ఎస్టేట్గా మార్చుకోవడం కోసం అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే అతనికి శ్రీకాకుళం, ఆమదాలవలస ఎమ్మెల్యేల అండదండలు ఉన్నాయని చెబుతున్నట్లు తెలుస్తోంది. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. టిడ్కో కాలనీలో రెచ్చిపోతున్న బైక్ రైడర్లు శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పాత్రునివలస టిడ్కో కాలనీలో పలువురు బైక్ రైడర్లు రెచ్చిపోతున్నారని అదే కాలనీకి చెందిన పలువురు మంగళవారం రాత్రి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో రోడ్లపై బైక్ రైడర్లు పందెలు వేసుకుంటూ ద్విచక్ర వాహనాలతో నానా హంగామా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం చిన్నారులకు బైక్లతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులకు వివరించారు. ఇదే విషయాన్ని బైక్ రైడర్లను ప్రశ్నించగా బూతులు తిడుతూ వాగ్వాదానికి దిగారని తెలిపారు. దీంతో రూరల్ పోలీసులు బైక్ రైడర్లను స్టేషన్కు పిలిపించి నలుగురిపై బైండోవర్ కేసుల నమోదు చేశారు. -
రాష్ట్రపతి ముర్ముకు ఆడపడుచు సత్కారం
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం లోక్ భవన్ నుంచి బరంపురానికి బయలుదేరారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, జయశ్రీ కంభంపాటి దంపతులు రాష్ట్రపతిని ఆడపడుచు లాంఛనాలతో సాదరంగా సత్కరించారు. జీఐ ట్యాగ్ పొందిన సంబల్పురి సంప్రదాయ చేనేత చీర, ప్రసిద్ధ పిప్పిలి ఆప్లిక్ ఉత్తరీయం, ఆకట్టుకునే కటక్ సిల్వర్ ఫిలిగ్రీ గణేష్ ప్రతిమని కానుకగా సమర్పించి ఆత్మీయత పంచుకున్నారు. గవర్నర్ దంపతుల ఆత్మీయత పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆనందం వ్యక్తం చేశారు. -
ఘనంగా వాణిజ్య దినోత్సవం
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో వాణిజ్య దినోత్సవాన్ని మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో కామర్స్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్నాతకోత్తర వాణిజ్య విభాగ అధికారి డాక్టర్ దేవ దత్త ఇండోరియ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాణిజ్య విద్య ప్రాముఖ్యత, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి, నైతిక వ్యాపారాల విలువలపై వివరించారు. వర్సిటీ వాణిజ్య విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ సచిన్ కుమార్ నాయక్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక రంగం స్థిరమైన వృద్ధి, పారిశ్రామికీకరణ, ఆర్థిక సమ్మిళతంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. విద్యార్థుల్లో వాణిజ్య విద్య ప్రాధాన్యత గుర్తించే అవకాశం, తమ ప్రతిభను ప్రదర్శించటానికి, ఆలోచనలు పెంచుకోవటానికి, వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, అకౌంటింగ్, మార్కెటింగ్, పన్నుల వ్యవస్థ, డిజిటల్ వాణిజ్య రంగంలోని కొత్త పోకడల గురించి తెలుసుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో వాణిజ్యం జాతీయ అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఆర్థికవృద్ధి మొదలగు వాటిపై విద్యార్థులతో చర్చించారు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు వాణిజ్య అంశాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు సుశాంత కుమార్ సాహు, జి.మౌనిక, డాక్టర్ మర్శీ మౌసిమ టక్రీ, సొనాళీ భోయ్ పాల్గొన్నారు. -
జూనియర్లపై సీనియర్ల దాడి
● క్రికెట్ మ్యాచ్లో వివాదం ● విద్యార్థుల మధ్య కొట్లాటకు దారితీసిన వైనం రాయగడ: జిల్లాలోని కొలనార సమితి పరిధిలో గల రివల్కొన ప్రభుత్వ ఉన్నత పాఠశాల వసతి గృహంలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు అత్యంత దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తలెత్తిన వివాదం నేపథ్యంలో తొమ్మిదో తరగతి విద్యార్థులను పదో తరగతి విద్యార్థులు కొబ్బరి మట్టలు, కర్రలతో కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతొ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ నెల 1వ తేదీన జరిగిన క్రికెట్ మ్యాచ్ అనంతరం సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై జూనియర్ విద్యార్థులు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయడంతో సీనియర్లను ఉపాధ్యాయులు మందలించారు. దీంతో ఆగ్రహించిన పదో తరగతి విద్యార్థుల్లో కొందరు ఆదివారం రాత్రి తొమ్మిదో తరగతి విద్యార్థులను హాస్టల్పై అంతస్తులోని గదికి ఒకొక్కరిని పిలిచి అసభ్య పదజాలాలతో దూషిస్తూ కర్రలతో దాడి చేసినట్లు వీడియోలో కనిపించింది. భయంతో బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని పాఠశాల నిర్వాహకులకు చెప్పకుండా దాచిపెట్టారు. ఓ విద్యార్థి ఫోన్లో ఈ ఘటనకు సంబంధించి తీసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో మంగళవారం వెలుగుచూసింది. పాఠశాల హెచ్ఎం ప్రతాప్ చంద్ర సావుంత చందిలి పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా గోపినాథ్ అనే మారుపేరుతో పేర్కొన్న విద్యార్థితోపాటు మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. హోస్టల్ సహాయ ప్రధానోపాధ్యాయుడు డంబురుధర్ త్రిపాఠి ఈ విషయమై మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యులైన విద్యార్థులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని, వారిని పాఠశాల నుంచి బహిష్కరించే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఇదిలా ఉండగా ఘటనపై సమాచారం అందుకున్న కొలనార సమితి వెల్ఫేర్ ఎక్స్టన్స్ అధికారి దేవాశీస్ ముండా పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్ కూడా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలను కలెక్టర్కు నివేదించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో హోస్టల్ విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. ఘటన సమయంలో హాస్టల్ భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశంతో పాటు వార్డెన్, రాత్రి గస్తీ నిర్లక్ష్యం జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. ఈ ఘటనపై రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక స్పందించారు. ఆదివాసీ సంక్షేమ శాఖ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానన్నారు. భవిష్యత్లో ఇటువంటి తరహా ఘటనలు ప్రభుత్వ సంక్షేమ శాఖ హాస్టళ్లల్లో జరగకుండా తగిన చర్యలు చేపట్టేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. -
‘కొత్త వ్యవస్థకై ’ ఆవిష్కరణ
జయపురం: జయపురం రచయిత, పాత్రికేయుడు సింహాద్రి శ్రీనివాసరావు రచించిన ‘కొత్త వ్యవస్థకై ’ కవితా సంకలనాన్ని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గల శ్రీశ్రీ కళావేదిక వారు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, శ్రీశ్రీ కళా వేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణ్, జాతీయ ప్రణాళిక అధికారి డాక్టర్ టి.పార్థసారధి, జాతీయ కో ఆర్డినేటర్ కె.శ్రీనివాస రావు, కార్యదర్శి, విశాఖపట్నం జిల్లా శ్రీశ్రీకళా వేదిక అధ్యక్షుడు రామ్జగన్నాథ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శైలా భవానీ పాల్గొని శ్రీనివాసరావు రచించిన ‘కొత్త వ్యవస్థకై ’ కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. శ్రీనివాసరావు ప్రతిభను కొనియాడారు. పాత్రికేయుడైన శ్రీనివాసరావు సమాజంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి, వాటిని ప్రజల హృదయాలకు ఆకట్టుకొనేలా కవితల రూపంలో పొందుపరచారని ప్రశంసించారు. ఈ కవితా సంకలనం నేటి సమాజ పరిస్థితులకు అద్దం పడుతూ.. ప్రజలను చైతన్య పరచేవిగా ఉన్నాయన్నారు. శ్రీనివాసరావు రచననలో సామాజిక స్పృహ, మానవీయ విలువలు, బాధ్యాయుతమైన ఆలోచనలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. భవిష్యత్లో తెలుగు సాహిత్యంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు. -
గుర్తు తెలియని వ్యక్తి ఆకస్మిక మృతి
కొరాపుట్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో గుర్తు తెలియని వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందారు. కొరాపుట్ జిల్లా నందపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో కుమార గంధాన గ్రామ పంచాయతీలో కిరండోల్–కొత్తవలస రైల్వే లైన్లో పలిబా రైల్వేస్టేషన్ వెలుపల గుర్తు తెలియని వ్యక్తి (60) చనిపోయారు. మూడు రోజులుగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ రాత్రి పూట రైల్వేస్టేషన్లో నిద్రిస్తున్నాడు. స్టేషన్ బయట సంచరిస్తున్నప్పుడు ఒక్కసారిగా రక్తం కక్కుకుంటూ కుప్పకూలిపోయాడు. ఇది చూసిన స్థానికులు 108 కి ఫోన్ చేయగా అంబులైన్స్లో నందపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిక్షీంచిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాలకి తరలించారు. నందపూర్ పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని తండేవలసకు వెళ్లే రహదారిలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోన ఉషారాణి (44) అనే మహిళ మృతి చెందింది. రూరల్ ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల మేరకు.. ఆమదాలవలసలోని గుట్టిముడి గ్రామానికి చెందిన ఉషారాణి స్వీపర్గా ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. సోమవారం రాత్రి డ్యూటీ అనంతరం రాత్రి 9 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన చింతాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం మీదుగా వెళ్తుండుగా.. స్థానిక ఆర్టీవో కార్యాలయం పరిసర ప్రాంతంలో వాహనం అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న ఉషారాణి పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో వెంటనే శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ఆమె మృతి చెందిందని ఎస్ఐ తెలిపారు. మృతురాలి తల్లి గడ్డెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగి ఉన్న ట్యాంకర్ను ఢీకొని... రణస్థలం: మండలంలో పైడిభీమవరం పంచాయతీలోని పారిశ్రామికవాడలో పాలవలస దగ్గర డాక్టర్ రెడ్డీస్ సెజ్ పరిశ్రమ గేటు సమీపంలో ఆగివున్న ట్యాంకర్ను ద్విచక్ర వాహనంతో ఇద్దరు వ్యక్తులు బలంగా ఢీకొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో ద్విచక్ర వాహనంతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతివేగంగా ట్యాంకర్ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వెనుకకూర్చున్న మండలంలోని వెంకటరావుపేట గ్రామానికి చెందిన బూర్లె రమణ(32) అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవింగ్ చేస్తున్న పతివాడపాలెం గ్రామానికి చెందిన పతివాడ రాంబాబుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రమణ మరణ వార్తతో వెంకటరావుపేట గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఘనటపై ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మత్తుతో జీవితాలు చిత్తు
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఎల్–2 సభాగృహంలో ‘మత్తు లేని యువత, భారత్ అభివృద్ధి సంకల్ప అభిజాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేశారు. విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ హృషికేష్ శనాపతి, సీపీజీసీ డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో అతిథిలుగా హాజరయ్యారు. మత్తు లేని సమాజం, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో యువత భూమికపై ప్రసంగించారు. కులపతి ప్రొఫెసర్ శనాపతి మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. డాక్టర్ ప్రశాంత్ కుమార్ పాత్రో మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయన్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, వైఆర్సీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయం ప్రారంభం
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి ముకుందానంద, రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ దేశంలో విశ్వ విద్యాలయాలు యువత తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడంతో తమ కలలు, ఆకాంక్షలను సాకారం చేసుకోగలిగే వాతావరణాన్ని కల్పించాలని అన్నారు. విలువలతో కూడిన భవిష్యత్ నాయకులను తయారు చేయడంలో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయం ఏర్పాటు ఒక ముఖ్యమైన ముందడుగు చర్యగా రాష్ట్ర గవర్నరు డాక్టరు హరి బాబు కంభంపాటి తెలిపారు. జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం ఉన్నత విద్య, పరిశోధన, నైతిక నడవడిక నిర్మాణంలో ఒక ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా రాష్ట్రానికి వన్నె తెచ్చే ఒక కొత్త ప్రయాణం అని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఆనందం వ్యక్తం చేశారు. జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయం విశిష్టత జగద్గురు కృపాలు మహారాజ్ ఆధునిక యుగానికి చెందిన ఒక మార్గదర్శక సాధువు. ఆయన భారత దేశపు వేద జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ప్రేమ, భక్తి సందేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేశారు. ఆయన యొక్క అపారమైన పాండిత్యం, మానవతావాద తత్వం మరియు నిస్వార్థ సేవాభావం ప్రేరణతో ప్రతి పౌరునికి సామాజిక బాధ్యతతో పాటు ఆధ్యాత్మికతను ఈ సంస్థ బోధిస్తుంది. -
మోక్షకు ప్రైడ్ ఆఫ్ ఇండియా 2026 పురస్కారం
భువనేశ్వర్: గ్రీన్ ఉద్యోగ్, పర్యావరణ పరిరక్షణ రంగాలలో అసాధారణ కృషికి గాను ఒడిశాకు చెందిన 13 ఏళ్ల వాతావరణ కార్యకర్త మోక్ష ధరణి పాణిగ్రాహికి ప్రతిష్టాత్మక ప్రైడ్ ఆఫ్ ఇండియా 2026 పురస్కారం లభించింది. ఆమె ఈ పురస్కారాన్ని ‘గ్రీన్ స్టార్టప్’ విభాగంలో అందుకున్నారు. కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి జీతన్ రామ్ మాంఝీ, ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు, సీషెల్స్ హైకమిషనర్ సమక్షంలో న్యూఢిల్లీలో జరిగిన ’ప్రైడ్ ఆఫ్ ఇండియా లీడర్షిప్ సమ్మిట్ 2026’ సందర్భంగా మోక్షకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీత మోక్ష ధరణి పాణిగ్రాహి గజపతి జిల్లా, పర్లాఖిముండి ఎమ్మెల్యే రూపేష్ కుమార్ పాణిగ్రాహి, హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డైరెక్టర్, ట్రస్టీ మధుస్మిత త్రిపాఠి దంపతుల పెద్ద కుమార్తె. మోక్ష 2018లో తన గ్రామంలో ఒక వాతావరణ ఉద్యమంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె చిన్నప్పటి నుంచే వాతావరణం, పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం గళం విప్పుతోంది. ప్రస్తుతం ఆమె దేశ వ్యాప్తంగా పర్యావరణ అవగాహన కల్పిస్తూ ‘ఎర్త్ ఎగైన్ మూవ్మెంట్’, ‘ది చైల్డ్ మూవ్మెంట్’, ‘సీటీబీటీ యూత్ గ్రూప్’లలో సభ్యురాలిగా చురుకై న పాత్ర పోషిస్తోంది. ఆమె కేవలం అవగాహన కల్పించడమే కాకుండా గొప్ప మార్పు తీసుకురావడానికి క్షేత్ర స్థాయిలో విశేషంగా కృషి చేస్తుంది. హై టెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ను తూర్పు భారత దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఆస్పత్రిగా తీర్చిదిద్దడంలో ఆమె నాయకత్వం కీలక పాత్ర పోషించింది. విస్తృతమైన వృక్షారోపణ, వ్యర్థాల పునర్వినియోగం, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఆమె ముఖ్య పాత్ర పోషించింది. మోక్షకు లభించిన ఈ జాతీయ స్థాయి గుర్తింపు ఒడిశా రాష్ట్రం మొత్తానికి గర్వకారణం అవుతుంది. ఇది ఆరోగ్యకరమైన, పచ్చని, సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించే దిశగా యువతకు ఖచ్చితంగా స్ఫూర్తినిస్తుంది అని హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి, మేనేజింగ్ ట్రస్టీ సురేష్ పాణిగ్రాహి, డైరెక్టర్ డాక్టర్ రాకేష్ పాణిగ్రాహి అన్నారు. హై టెక్ బృందం అభినందన జాతీయ పురస్కారం అందుకున్న వాతావరణ కార్యకర్త మోక్ష ధరణి పాణిగ్రాహికి హై టెక్ గ్రూపు అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. మోక్ష ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ రంగంలో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని వారంతా శుభాకంక్షలు తెలిపారు. -
కాలువలో కొట్టుకుపోయి బాలుడి మృతి
రాయగడ: కాలువో పడి బాలుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధి లిటిగుడ గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు అదే గ్రామానికి చెందిన దీనబంధు సియునా కొడుకు అలోక్ సియున (12)గా గుర్తించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అలోక్ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలసి లిటిగుడ హరిశంకర్ వైవక్షేత్రం సమీపంలో కాలులోకి స్నానానికని దిగారు. స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం ఎక్కువవ్వడంతో పట్టుతప్పి కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులు గ్రామస్తులకు తెలియజేశారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి చేరవేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం అలోక్ సియున మృతదేహం కాలులోని ఓ రాయి ఇరుకున కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటిలో దూరిన చిరుత పులి కొరాపుట్: ఒక ఇంటిలోకి దూరిన చిరుత పులి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. నబరంగ్పూర్ జిల్లా సరిహద్దులో సమీప చత్తీస్గఢ్ రాష్ట్రం దంతేరిలో ఈ విచిత్ర ఘటన జరిగింది. వేకువ జామున ఒక ఇంటిలోకి చిరుత పులి ప్రవేశించింది. అక్కడ ఉన్న ధరం నేతం, గాంధీ నేతం అనే వ్యక్తులపై దాడి చేసింది. బాధితుల అరుపులతో గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భయపడిన పులి వేరే గదిలోనికి దూరింది. వెంటనే గ్రామస్తులు ఆ గదిని మూసి వేశారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బాధితులను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంతలో చేరుకున్న అటవీ సిబ్బంది పరిశీలించి చూడగా ఆ గదిలో చిరుత మరణించి పడి ఉంది. దీంతో కంగుతున్న సిబ్బంది పశుసంవర్ధక శాఖ సిబ్బందితో పరీక్షలు నిర్వహించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ పులి ఎలా చనిపోయిందో అధికారులు అయెమయంలో పడ్డారు. మరో వైపు ఆస్పత్రిలో బాధితులు కూడా తీవ్ర గాయాలపాలవ్వడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. పులిని పోస్టు మార్టం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టు మార్టం నివేదిక వస్తే గానీ పులి మరణంపై స్పష్టత రాదని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. రాయగడలో 83 వినతుల స్వీకరణ రాయగడ: జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ సమావేశం హాల్లొ సోమవారం జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి 83 వినతులను స్వీకరించారు. ఇందులో 17 ఫిర్యాదులను అక్కడిక్కకే పరిష్కరించారు. స్వీకరించిన వినతుల్లో 58 వ్యక్తిగతమైనవి, 17 సామూహిక ఫిర్యాదులను నమోదు చేసుకున్నారు. అదేవిధంగా రెడ్ క్రాస్ నిధి నుంచి అవసరమైన ఎనిమిది మందికి 1.27 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మిగిలిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఎఫ్వో అన్నాసాహెబ్ అహలే, ఎస్పీ రాజ్ప్రసాద్, ప్రజారోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రశాంత్ కుమార్మ మిశ్రా, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి పాల్గొన్నారు. -
పోలీసు క్రీడాకారులకు సత్కారం
భువనేశ్వర్: ఇటీవల ముగిసిన జాతీయ స్థాయి క్రీడా పోటీలలో ఒడిశా పోలీసు క్రీడాకారులు వివిధ విభాగాల్లో విజేతలుగా రాణించారు. 12 మంది క్రీడాకారులు వివిధ అఖిల భారత స్థాయి పోటీలలో అద్భుతమైన విజయాన్ని సాధించి ఒడిశా పోలీసు విభాగం, రాష్ట్రానికి కీర్తిని సాధించారు. ఈ సందర్భంగా స్థానిక కమిషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన ప్రత్యేక సత్కార కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా విజేత క్రీడాకారులను సత్కరించారు. ఈ ఏడాది జూలై 23 నుండి 30 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ (2026–27), జూలై 08 నుంచి11 వరకు మహారాష్ట్రలోని పూణేలో జరిగిన 5వ సీనియర్ జాతీయ భారత తైక్వాండో పూమ్సే చాంపియన్ షిప్ 2026 పోటీలలో ఒడిశా పోలీసులకు చెందిన ఉషు, తైక్వాండో, కరాటే, పెంచక్ సిలాట్ జట్లుగా పాల్గొన్న క్రీడాకారులు వివిధ విభాగాలలో పతకాలను గెలుచుకున్నారు. వీరంందరినీ డీజీపీ అభినందించారు. వారి అసాధారణ ప్రతిభను, పట్టుదలను ప్రశంసించారు. క్రీడాకారుల విజయం ఒడిశా పోలీస్ దళానికి, యావత్ రాష్ట్రానికి కీర్తిని తెచ్చిపెట్టిందని డీజీపీ అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ క్రీడాకారులు ఒడిశా పోలీసుల ప్రతిష్టను మరింత పెంచుతారని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ రజత పతక విజేతకు రూ. 4,000, కాంస్య పతక విజేతకు రూ. 3,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. పతకాలు గెలుచుకున్న ప్రముఖ క్రీడాకారులు డబ్ల్యూసీ/27 శాస్వతి నాయక్ (టైక్వాండో): 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్లో రజత పతకం,5వ సీనియర్ నేషనల్ టైక్వాండోలో కాంస్య పతకం. సి/45 సత్యప్రకాష్ మహంతి (టైక్వాండో): 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ మరియు 5వ సీనియర్ నేషనల్ టైక్వాండో రెండింటిలోనూ కాంస్య పతకం. కరాటే (11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్): రజత పతకం విజేతలు: డబ్ల్యూసీ/968 బ్రతతి విశ్వప్రభా పతి (వ్యక్తిగత మహిళల విభాగం), సీ/136 రజనీ బిస్సి, సీ/159 డి. భగవాన్ రెడ్డి మరియు సీ/135 రితేష్ రే (వ్యక్తిగత పురుషుల విభాగం). కాంస్య పతకం (వ్యక్తిగతం) విజేతలు: ఏఎస్ఐ(ఎ) యోగేష్ బొరిహా, డబ్ల్యూసీ/968 బ్రతతి విశ్వప్రభాపతి కాంస్య పతకం టీమ్ విజేతలు: ●మహిళల టీమ్ : డబ్ల్యూసీ/968 బ్రతతి విశ్వప్రభ పతి, డబ్ల్యూసీ/397 అనుపమ స్వంయి, డబ్ల్యూసీ/168 మోనాలి సాహు, డబ్ల్యూసీ/389 సుష్మిని పలటాసింగ్. ●డబ్ల్యూసీ/397 అనుపమ స్వంయి, డబ్ల్యూసీ/395 సింధు తనయ ఖుంటియా మరియు డబ్ల్యూసీ/238 అనురాధ పాత్రో. ఒడిశా పోలీస్ క్రీడాదికారి నీలమాధవ్ స్వంయి అధ్యక్షతన జరిగిన జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పతక విజేతలుగా నిలిచిన పోలీసు సిబ్బంది సత్కార సభ కార్యక్రమానికి అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శాంతిభద్రతలు) సంజయ్ కుమార్, కటక్, భువనేశ్వర్ జంట నగరాల పోలీస్ కమిషనర్ డాక్టర్ దేబ్దత్ సింగ్ హాజరై విజేత క్రీడాకారులను ప్రోత్సహించారు. -
‘విలేకరులే మార్గదర్శకులు’
భువనేశ్వర్: మీడియా సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని, ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రెండూ కచ్చితమైన, నిష్పక్షపాతమైన వార్తలను అందించడం ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉండాలని ఫైనాన్షియల్ న్యూస్ భువనేశ్వర్ ఎడిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసన సభ స్పీకరు సురమా పాఢి అన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు ఆర్థిక విశ్లేషణపై కూడా దృష్టి సారించిన హై టెక్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి మాట్లాడుతూ అభివృద్ధిలో ఆరోగ్య సంరక్షణ ఒక అంతర్భాగమని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజం ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థకు బలమైన వారధిగా నిలుస్తుందన్నారు. స్వేచ్ఛను అనుభవిస్తున్నప్పుడు, తమ విధులు, బాధ్యతల పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలని పీఐబీ ఏడీజీ అఖిల్ కుమార్ మిశ్రా అన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు సుధర్ కుమార్ పండా మాట్లాడుతూ ఫైనాన్షియల్ న్యూస్ త్వరలోనే ఒడిశాలో ప్రతి ఇంటి పేరుగా మారుతుందని అన్నారు. అదే విధంగా ఫైనాన్షియల్ న్యూస్ ఎడిటర్ అశోక్ కుమార్ పండా మాట్లాడుతూ విశ్వసనీయత, పారదర్శకతే మీడియాకు నిజమైన ఆస్తులని అన్నారు. అనేక వార్తాపత్రికల మధ్య తనదైన ప్రత్యేకతను సృష్టించుకోవడం కచ్చితంగా ఒక సవాలుగా నిలుస్తుందన్నారు. అందుకు తమ బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చైర్మన్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సీతారాం మహాపాత్రో మంచి ఆరోగ్యం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై ప్రసంగించారు. -
కక్ష సాధిస్తే బంగాళాఖాతంలో కలపడం ఖాయం
వజ్రపుకొత్తూరు రూరల్: మత్స్యకారులు, మత్య్సకార నాయకులను అణచివేసేందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలపడం ఖాయమని మత్య్సకార ఐక్యవేదిక నాయకులు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న కక్షపూరిత రాజకీయ చర్యల్లో భాగంగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు తిర్రి రాజారావు ఆధ్వర్యంలో అప్పలరాజును విడుదల చేయాలని కోరుతూ సోమవారం వజ్రపుకొత్తూరు మండలంలోని గుణుపల్లి తీరంలో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకార కులాన్ని గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో రాజకీయల్లోకి వచ్చిన సీదిరి అప్పలరాజు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయ డం దారుణమన్నారు. మత్స్యకారులను అణగదొక్కితే ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాల్లా న్యాయ పోరాటాలు చేస్తారని హెచ్చరించారు. కూటమి ప్రభు త్వం ఇప్పటికై నా కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఎన్నికల హామీల అమలుకు చర్యలు తీసుకో వాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ వంక రాజు, ఎంపీటీసీ తిర్రి గుణ, తాజా, మాజీ సర్పంచ్ తిర్రి కామేశ్వరి, వైఎస్సార్సీపీ నియోజకవర్గం గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు ఇరోతు హేమంత్, మండల ఉపాధ్యక్షుడు దున్న బాలరాజు, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు కొమర దేవరాజు, అంబటి అనంద్, గూడ ఈశ్వరరావు, వడ్డి కరుణాకర్, బత్తిని లక్ష్మీనారాయణ, చింత హేమరావు, జిల్లా యువజన విభాగం కార్యదర్శి కర్ని శ్రీను, చౌదాల వెంకన్న, తిర్రి లక్ష్మీనారాయణ, సూరాడ మాధవరావు పాల్గొన్నారు. -
విద్యార్థి హత్య.. ఇద్దరు అరెస్టు
జయపురం: జయపురం సమితి భరిణిపుట్ గ్రామ పంచాయతీ అప్పర్ కొలాబ్ ప్రాజెక్ట్ ఉన్నత పాఠశాలలో గత నెల 31 వ తేదీన జరిగిన విద్యార్థి హత్య కేసులో జయపురం సదర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ నేడు వెల్లడించారు. అరెస్టయిన వారు అప్తాల్ హియాల్, కాగా మరొకరు మైనర్ బాలుడని వెల్లడించారు. జయపురం ఎస్డీపీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె సంఘటన వివరా లు వెల్లడిస్తూ జూలై 31 వ తేదీన మధ్యాహ్న భోజనాల అనంతరం విరామం సమయంలో పాఠశాల విద్యార్థులకు బయట కుర్రవాళ్లకు వాగ్వాదం జరిగిందని, ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు ఒక విద్యార్థి వెళ్లి ఉభయవర్గాలకు సమాధాన పరుస్తున్న సమయంలో ఒకడు అతడిని పట్టుకోగా మరొకరు పదునైన కత్తితో అతడి కడుపులో పొడిచాడని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని వెంటనే ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్చారు. డాక్టర్ అతడిని పరీక్షించి మృతి చెందినట్లు ప్రకటించారని పోలీసు అధికారి వెల్లడించారు. సమాచారం అందిన జయపురం సదర్ పోలీసులు సంఘటన ప్రాంతానికి వెళ్లి విచారణ జరిపి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని వెల్లడించారు. కేసు దర్యాప్తు అధికారి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. -
775 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ పోలీసులు గంజాయి అక్రమ నిల్వల గుట్టును రట్టుచేశారు. అక్రమంగా బయట రాష్ట్రాలకు తరలించేందుకు నిల్వ చేసిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిత్రకొండ డ్యాం సమీపంలో ఈ నెల ఒకటో తేదీ రాత్రి పెట్రోలింగ్ నిర్వహించిన సమయంలో అటవీ ప్రాంతంలో జూట్ సంచుల్లో దాచ్చిన గంజాయిను శనివారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం గంజాయిని ఎస్సై సర్వేశ్వర్ బోయి, చిత్రకొండ తహసీల్దార్ ప్రశాంత్ కుమార్ భత్రా సమక్షంలో తూకం వేయగా 775 కిలోలు ఉంది. దీని విలువ 75 లక్షల రూపాయల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే గంజాయి ఎవరిదో తెలియరాలేదని.. దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. -
పొగురు తొలగించాలి
మత్స్యశాఖ అధికారులు పొగురు( ఇసుక మేటలు)తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. లేకపోతే తుపాను అనంతరం కూడా జెట్టీ నుంచి మెకనైజ్డ్ బోట్లు వేటకు వెళ్లలేని పరిస్థితి ఎదురవుతుంది. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన బోట్లు పాడైపోతాయి. వలలు, ఐస్బాక్స్లు, బోట్లు సబ్సిడీపై అందించాలి. – కె.సింహాచలం, మత్స్యకారుడు, మంచినీళ్లపేట చేప చిక్కడం లేదు గత ఏడాది ఈ సీజన్లో అడపా దడపా చేపలను అమ్ముకున్నాం. కానీ ఈ ఏడాది చేప మాత్రం చిక్కడం లేదు. అలలు ఎగసి ప డుతున్నాయి. అలల ధాటికి తీ రం కోతకు గురైంది. వేటలేక పస్తులు ఉంటున్నా. – సీహెచ్ భీమారావు, మత్స్యకారుడు, మంచినీళ్లపేట తున్నారు. చిరిగిన వలలకు మరమ్మతులు చేసుకుంటున్నామని తెలిపారు. మత్స్య సంపద బాగా తగ్గిపోయిందని, సీజన్లో పడాల్సిన చేపలు వలకు చిక్కడం లేదన్నారు. వేట నిషేధం అనంతరం ఏటా ఈ సీజన్లో విలువైన రొయ్యిలు, కానాగత్తలు ఇతర చేపలు వలకు చిక్కాలి. కానీ ఆ పరిస్థితి లేదు. నెలలో రూ. 20వేలు వరకు డీజిల్ ఖర్చు చేసి వేటకు వెళ్లినా మదుపు రావడం లేదని వాపోతున్నారు. దీంతో యువకులు కాండ్లా, గుజరాత్, గోవాతో పాటు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. -
● డోరు.. అమర్చరా సారూ..
నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలో ఘోరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మహిళా రోగులు వినియోగించే మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆపరేషన్ చేయించుకున్న మహిళల వార్డుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడం బాధాకరం. ఇటీవల ఆస్పత్రిలో హెచ్డీఎఫ్ ఫండ్స్ రూ. 50 లక్షలకు పైగా వెచ్చించి డాక్టర్ల రూమ్లకు ఏసీలు, ఆస్పత్రి సిబ్బంది గదులకు అదనంగా గాజు డోర్లు వేయించారు. ఇవన్నీ చేసి మరుగుదొడ్లకు తలుపులు బిగించడం మర్చిపోయారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. – నరసన్నపేట -
సరుకు రవాణాలో రాయగడ రైల్వే డివిజన్ రికార్డు
రాయగడ: తూర్పు తీర రైల్వే పరిధిలోని రాయగడ రైల్వే డివిజన్ సరుకు రవాణాలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2026 జూలై నెలలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సరుకు లోడింగ్లో 13.45 శాతం, రేక్ లోడింగ్లో 11.32 శాతం వృద్ధిని నమోదు చేసి తన నిర్వహణ సామర్ాధ్యన్ని మరోసారి నిరూపించింది. ముఖ్యంగా ఇనుప ఖనిజం, బాకై ్సట్ రవాణాలో గణనీయమైన పెరుగుదల నమోదు కావడం డివిజన్ పనితీరుకు బలం చేకూర్చింది. రైల్వే డివిజన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2025 జూలైలో మొత్తం 787 రేక్లను లోడ్ చేయగా, ఈ ఏడాది జూలైలో ఈ సంఖ్య 707గా ఉంది. దీంతో 80 రేక్లు అధికంగా లోడ్ చేయబడగా 11.32 శాతం వృద్ది నమోదయ్యింది. అలాగే సరుకు లోడింగ్ 2.75 మిలియన్ టన్నుల నుంచి 3.12 మిలియన్ టన్నులకు పెరగింది. అంటే 13.45 శాతం వృద్ధి సాధించింది. డివిజన్లో ప్రధానంగా ఇనుప ఖనిజం రవాణానే అత్యధికంగా కొనసాగుతుంది. జూలై 2026లో ఇనుప ఖనిజం లోడింగ్ 2.28 మిలియన్ టన్నులకు చేరుకొగా, గత ఏడాదితో పోలిస్తే 0.40 మిలియన్ టన్నులు, అంటే 21.3 శాతం పెరుగుదల నమోదయ్యింది. బాకై ్సట్ లోడింగ్ కూడా 0.17 మిలియన్ టన్నుల నుంచి 0.19 మిలియన్ టన్నులకు పెరిగి 11.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రయాణికుల సేవల పరంగా కూడా డివిజన్ మెరుగైన పనితీరును కనబరిచింది. జూలై నెలలొ ట్రైన్–ఆన్ –డిమాండ్ 9టిఒడి) ప్రత్యేక కోచ్ రైళ్లను విజయవంతంగా నడిపి ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు కల్పించింది. -
సాగని వేట.. గడవదు పూట
● మత్స్యకారులకు చిక్కని చేప ● నెల రోజులుగానే అరకొర వేట ● పొగురుతో వేట సాగక అవస్థలు వజ్రపుకొత్తూరు: గంగ పుత్రులకు నెల రోజులుగా బెంగ పట్టుకుంది. సంద్రంలో వేట సరిగ్గా సాగకపోవడంతో పూట గడవడం లేదు. అటు శ్రీలంక నుంచి ఇటు విశాఖపట్నం వరకు పెద్ద ఎత్తున మర పడవలు గంగపుత్రుల సముద్ర సంపదను ఎత్తుకు పోతున్నా యి. కోస్ట్ గార్డు, ఇతర నిఘా విభాగాలు అటుగా దృష్టి సారించకపోవడంతో అపారమైన మత్స్య సంపద స్థానికులకు అందకుండా పోతోంది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలతో కుస్తీ పట్టి సంద్రంలోకి వెళ్తున్న మత్స్యకారులు ఖాళీ వలలతో ఇంటికి వస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి ఇటు రణస్థలం తీరం వరకు మత్స్యకారులకు ఇదే పరిస్థితి. వేట సాగేది ఎలా..? వేట నిషేధ కాలంలో మర పడవల దొంగ వేట, కర్మాగారాల నుంచి విడుదలయ్యే విష జలాలు, కలుషితమవుతున్న నదీ జలాలు సంద్రంలో కలుస్తుండడం వల్ల చేపల పునరుత్పత్తి తగ్గుతోంది. విష జలాలు, మర పడవల కారణంగా చేపల గుడ్లు వి చ్ఛిన్నమై సంతతి అభివృద్ధి తక్కువైపోతోంది. దీంతో సీజన్లో దొరకాల్సిన రొయ్యిలు, కానాగత్తలు, కవ్వళ్లు, మొరవలు, ట్యూనా, కోనేం, నెత్తళ్లు, మాగ లు తదితర చక్కటి ఆదాయాన్నిచ్చే చేపలు దొరకం లేదు. గత ఏడాది జిల్లాలో దాదాపు 520 టన్నుల వరకు రొయ్యిలు, 1320 టన్నుల వరకు కానాగత్త లు లభించాయి. కానీ నేడు అందులో సగం కూడా రాలేదని మత్స్యకారులు చెబుతున్నారు. గత ఏడాది కోనేం అస్సలు కనిపించకపోగా.. ఈ ఏడాదీ అదే దుస్థితి దాపురించింది. దీంతో వేటపైనే ఆధారపడుతున్న ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థ లం మండలాల పరిధిలోని దాదాపు 27 వేల మంది మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది. కోతకు గురవుతున్న తీరం తుపానులు, సముద్రం కల్లోలంగా ఉన్న సమయాల్లో తీరం పెద్ద ఎత్తున కోతకు గురవుతోంది. ఇది ప్రధానంగా మంచినీళ్లపేట, దేవునల్తాడ, అక్కుపల్లి, గుణుపల్లి, డోకులపాడు తీరాల్లో అలల ధాటికి తీరం కోతకు గురవుతోంది. మంచినీళ్లపేట, నువ్వలరేవు మత్యకారులకు ఏటా పొగురు (తీరంలో ఇసుక మేటలు) జీవన్మరణ సమస్యగా పరిణమించింది. ఏటా రూ.3లక్షలు వరకు ఖర్చు చేస్తున్నా శాశ్వత పరిష్కారం లభించడం లేదు. సముద్ర తీరానికి ఫిషింగ్ జెట్టీకి మధ్య ఇసుక మేటలు పేరుకుపోయి ఉండడంతో మంచినీళ్లపేట ఫిషింగ్ జెట్టీ వద్ద లంగరు వేసి 76 మెకనైజ్డ్ బోట్లకు మరో 100 సంప్రదాయ తెప్పలు వేటకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయాయి. దీని ప్రభావంతో వేటపై ఆధార పడుతున్న సుమారు 350 మంది మత్స్యకారులు 20 రోజులుగా వేట లేక అవస్థలు పడుతున్నారు. అంతంత మాత్రంగా వేట సముద్రంలో గత నెల రోజులుగా జరుగుతున్న వాతావరణ మార్పులు కారణంగా వేట సాగడం లేదని మత్స్యకారులు కొమర సింహాచలం, సీహెచ్ భీమారావు, కొర్లయ్య, దానయ్య, తదితరులు చెబు -
నూతన కార్యవర్గం
రాయగడ: ఉత్కళాంధ్ర బ్రాహ్మణ సేవా సమాజానికి కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. సంఘం అధ్యక్షుడిగా సీనియర్ సభ్యులు మట్నూరు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివా రం రాత్రి స్థానిక రామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం ఉపాధ్యక్షుడిగా అవసరాల సత్యనారాయణమూర్తి, కార్యదర్శి బుర్రా శ్రీనివాస్ రావు, కొశాధికారిగా ముట్నూరు రామగొపాల్, సహా య కార్యదర్శిగా కర్నా వేణుగొపాల్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు సీనియర్ న్యాయవాది సంస్థ న్యాయ సలహాదారుడు వి.ఎస్.ఎన్.రాజు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో కార్యవర్గం సభ్యుల వివరాలను వెల్లడించారు. సంఘం సలహాదారుడిగా రేజేటి శ్రీనివాస్ శర్మ, తెన్నేటి శ్రీరామ్మూర్తి, మాజీ కార్యదర్శి భళ్లమూడి నాగ రాజు సభా నిర్వహణ చేశారు. సభ్యులు హాజరయ్యారు. ప్రతీ రెండేళ్లకొసారి ఈ కార్యవర్గం ఎన్నికల జరగనున్నట్లు న్యాయ సలహాదారు డు, న్యాయవాది రాజు తెలియజేశారు. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో ఉన్న మల్కన్గిరి కళాశాల వాణిజ్య విభాగం ఆధ్వ ర్యంలో ప్రపంచ వాణిజ్య దినోత్సవాన్ని సోమ వారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ చిత్తరంజన్ బారిక్, జిల్లా వ్యాపార సంఘ అధ్యక్షుడు సురేష్ సోమాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య వక్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మల్కన్గిరి శాఖ మేనే జర్ వినోద్కుమార్ బిశోయి మాట్లాడారు. బ్యాంకింగ్ వ్యవస్థకు వాణిజ్య రంగంతో విడదీయరాని సంబంధం ఉందన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. ప్రతీసంవత్సరం ఆగస్టులో తొలి సోమవారం వాణిజ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్య రంగంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను గౌరవించడం జరుగుతుందన్నా రు. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, వాణిజ్య అభివృద్ధిని కార్యక్రమంలో వివరించారు. ఈ కర్యక్రమంలో ఇప్సితా దాస్, దీప్తిరేఖ మిశ్రో, మానాస్ కుమార్ పాడీ, వాణిజ్య విభాగ విద్యార్థులు పాల్గొన్నారు. పోరాటాలకు సిద్ధమవ్వండి నందిగాం: ఆఫ్షోర్ రిజర్వాయర్ కోసం సమరశీల పోరాటాలకు సన్నద్ధమవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు కోనారి మోహనరావు, జిల్లా కమిటీ సభ్యుడు పి.ప్రసాద్, నంబూరు షణ్ముఖరావులు పిలుపునిచ్చారు. సోమవారం సీపీఎం పార్టీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ సాధన పోరాట కమిటీ ప్రతినిధుల బృందం మండలంలోని పెద్దలవునిపల్లి, కంచిఊరు, కామధేనువు గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఎందుకు ఆఫ్షోర్కు నిధులు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అచ్చెన్నాయుడు నిధులు విడుదల చేయించడంలో విఫలం అవుతున్నారని ఆరోపించారు. అచ్చెన్నాయుడికి రైతాంగంపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ఆఫ్షోర్ రిజర్వాయర్ సాధన పోరాట కమిటీ సభ్యులు పి.ధర్మారావు, వజ్జ సింహాచలం, పిన్నింటి కృష్ణమూర్తి, సాయి, కణితి ధీనబందు, పాపారావు, కిల్లి దుర్వాసులు, వజ్జ విద్యాసాగర్, పినకాన తులసయ్య, సీపీఏం నాయకులు కొల్లి ఎల్లయ్య, హనుమంతు ఈశ్వరరావు, పాలిన సాంబమూర్తి, బగాది వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
కోట్ల విలువైన దగ్గు సిరప్ స్వాధీనం
రాయగడ: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కొనసాగుతున్న నషా ముక్త్ అభియాన్ ఒడిశాలో భాగంగా ఝార్సుగుడ జిల్లా బడ్మాల్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి వాణిజ్య పరిమాణంలో అక్రమ కొడైన్ ఆధారిత దగ్గు సిరఫ్ ను స్వాధీనం చేసుకుని అందుకు సంబంధించి ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర విలేకర్లకు సొమవారం నాడు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు తుండెకెలా సమీపంలోని ఫ్లై యాస్ ఇటుకల కర్మాగారం వద్దకు అక్రమ కొడైన్ దగ్గు సిరఫ్తో కూడిన లారీ రానున్నట్లు తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, స్వతంత్ర సాక్షుల సమక్షంలో తనిఖీలు చేపట్టారు. తుంబెకెల వద్ద లారీతొ పాటు హుండాయ్ కారును అడ్డగించి తనిఖీ చేయగా 197 సీల్ట్ కార్టన్లలో 23,640 విన్సెరెక్స్ కొడైన్ ఫాస్పెట్ అండ్ ట్రిపోలిడిన్ హెడ్రొక్లోరైడ్ దగ్గు సిరఫ్ బాటిళ్లు లభ్యమయ్యాయి. మొత్తం 2,364 లీటర్ల సిరప్ స్వాధీనం చేసుకోగా, ఇది ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం వాణిజ్య పరిమాణంగా గుర్తించారు. ఈ కేసులో బిహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ అప్సాన్ ,పశ్చిమ బెంగాళ్లోని బర్ధమాన్ ప్రాంతానికి చెందిన రిజ్వాన్ అన్సారి లను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నిందితుల నుంచి అక్రమ దగ్గు సిరప్ బాటిళ్లతో పాటు రూ.2.44 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. -
ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి
జయపురం: వెనుకడిన తరగతుల కమిషన్ను ఏర్పాటు చేయాలని కొరాపుట్ జిల్లా వెనుకబడిన తరగతుల ఫోరం (ఓబీసీ) డిమాండ్ చేసింది. స్థానిక యాదవ భవనంలో సోమవారం నిర్వహించిన ఓబీసీ ఫోరం సమావేశంలో వివిధ వెనుకబడిన తరగతుల కులాల ప్రతినిధులు పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా యాదవ మహాసభ కార్యదర్శి రాజేంద్ర కుమార్ గౌడ సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రముఖ న్యాయవాది, జిల్లా యాదవ మహాసభ అధ్యక్షుడు మదన్ మోహన్ నాయక్ మాట్లాడుతూ.. 2024 జనవరి 1 నుంచి ఒడిశాలో వెనుకబడిన తరగతులు కమిషన్ పదవీ కాలం ముగిసిందని అందువలన రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న వెనుకబడిన తరగతుల ప్రజలు తమ రాజ్యాంగపరమైన హక్కును నిరూపించుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పరమైన హక్కులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే వెనుకబడిన తరగతుల కమిషన్ను ఎర్పాటు చేయాలని కొరాపుట్ జిల్లా ఓబీసీ ఫోరం తరఫున డిమాండ్ చేశారు. జిల్లా యాదవ మహాసభ ప్రతినిధి రాజేంఽద్ర కుమార్గౌడ, బారిక్ సమాజ్ ప్రతినిధి తులసీ బెహ రా, జిల్లా బొడేయి సమాజ ప్రతినిధి సాహేబ్ మహరాణ, జయపురం కాపు సమాజ్ ప్రతినిధి వై.ప్రసా ద్, తదితరులు ఓబీసీ కమిషన్ లేకపోవటం వలన కలుగుతున్న సమస్యలను వివరించారు. ఈ సమా వేశంలో నరేష్ మహాకుడ్, రబినారాయణ గౌడ, దండాసి గౌడ, నారాయణ గౌడ, భాస్కర్ గౌడ, సుదర్శన గౌడ, కవిరాజ్ పరమేశ్వర పాత్రో, తదితరులు పాల్గొన్నారు. -
హర హర మహాదేవ్
భువనేశ్వర్: సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాలు, పరిసర కాలి బాట ప్రాంతాలు హర హర మహాదేవ్ నినాదాలతో ప్రతిధ్వనించాయి. శ్రావణ మాసం పురస్కరించుకుని బోల్ భం దీక్షతో శివ భక్తులు కాలి నడకన ఒక ప్రాంతంలోని జలాశయం నుంచి సేకరించిన పవిత్ర జలంతో మరో జలాశయం తీరాన ఉన్న ఆలయంలో శివునికి అభిషేకించడం ఈ దీక్ష ఇతివృత్తం. దారి పొడవునా కావడి నేల మీద మోపకుండా సుదీర్ఘంగా పాద యాత్ర చేసి గమ్యం చేరడం వంటి కఠోర నియమాల్ని కట్టుదిట్టంగా ఆచరిస్తారు. శ్రావణ మాసం నెల పొడవునా ప్రతి సోమవారం శైవ క్షేత్రాల్లో మహా దేవునికి జలాభిషేకం చేయడం దీక్షగా కొనసాగిస్తారు. ఈ సందర్భంగా శైవ క్షేత్రాలు శివ నామ స్మరణతో మారుమోగుతాయి. ప్రధాన జలాశయాల తీరాల్లో నీట మునగడం వంటి ప్రమాదాల నివారణ దృష్ట్యా ఒడ్రాఫ్, అగ్ని మాపక దళం, పోలీసు దళాల్ని మోహరిస్తారు. లింగరాజ్, ధవళేశ్వర్ తదితర ప్రముఖ శైవ క్షేత్రాల్లో బోల్ భం దీక్షకుల సౌకర్యం కోసం ప్రత్యేక దర్శనం, జలాభిషేకం ఏర్పాట్లు చేసి ఆదరిస్తారు. వారి ఆగమనంతో శైవ పీఠాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతున్నాయి. -
రాయగడలో భారీ పరిశ్రమల ఏర్పాటుపై అదానీ దృష్టి
రాయగడ: దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ, డైరక్టర్ కరణ్ అదానీ లు ఆదివారం జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రొఎల్లోయిస్ (ఇంఫా ) సంస్థకు చెందిన ప్రత్యేక హెలీకాప్టర్లో ఇక్కడికి చేరుకున్న పారిశ్రామిక దిగ్గజాలు కలెక్టర్ అశుతొష్ కులకర్ణి, ఎస్పీ రాజ్ ప్రసాద్లతో దాదాపు గంట సమయం వరకు చర్చించారు. అదానీ ఎంటర్ప్రైజెస్, యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్ రిసొర్సెస్ హోల్డింగ్ (ఐఆర్హెచ్) సంయుక్తంగా రాష్ట్రంలో సుమారు 1.08 లక్షల కోట్లతో సమగ్ర అల్యూమినియం ఎకొ సిస్టమ్ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో వార్షిక 4 మిలియన్ టన్నుల అల్యూమినియం రిఫైనరీ, 2 మిలియన్ టన్నుల అల్యూమినయి స్మెల్టర్, 1 మిలియన్ టన్నుల డౌన్స్ట్రీమ్ అల్యూమినియం పార్క్, 4 వేల మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్, 400 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. రాయగడ, కొరాపుట్ జిల్లాలో ప్రపంచ స్థాయి బాకై ్సట్ నిక్షేపాలు ఉండడంతో రాయగడలోనే సుమారు రూ.41,650 కోట్లతో 4 మిలియన్ టన్నుల సామర్థ్యం గల అల్యూమిన రిఫైనరీ, అనుబంధ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఈ భారీ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే రాయగడతో పాటు దక్షణ ఒడిశాలో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రాంతీయ ఆర్ధికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణకు కొత్త ఊపు లభిస్తుందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. -
వినతుల వెల్లువ
పర్లాకిమిడి: జిల్లా కలెక్టరేట్లో సోమవారం జాయింట్ గ్రీవెన్స్ సెల్కు వినతులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, ఏడీఎం మునీంద్ర హానగ, అదనపు ఎస్పీ బిరంచి బేగ్, తదితరులు హాజరయ్యారు. 150 వినతులు అందాయి. వీటిలో గ్రామ సమస్యలకు సంబంధించినవి 16, వ్యక్తిగతం 134 ఉన్నాయి. ఇద్దరు దివ్యాంగులకు జిల్లా సామాజిక, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం అధికారులు ల్యాప్టాప్లు కలెక్టర్ ద్వారా అందజేశా రు. సీడీఎంఓ డాక్టర్ మంజురాణి జెన్నా, గుసాని బీ డీఓ గౌరచంద్ర పట్నాయక్, పలువురు అధికారులు పాల్గొన్నారు. 36 వినతుల స్వీకరణ.. మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి తెల్రాయి పంచాయతీలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రధమేశ అర్వింద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. కలిమెల సమితి పరిసర ప్రాంతాలు నుంచి 36 వినతు లు అందాయి. 13 వ్యక్తిగత వినతులు, 23 సామూహిక వినతులున్నాయి. వీటిలోని పలు సమస్యలను గ్రీవెన్స్లోనే కలెక్టర్ పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. నిశా ముక్త్ భారత్ అభియా న్ కోసం సామూహిక ప్రతిజ్ఞ నిర్వహించారు. ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవిశాఖ అధికారి సాయికిరణ్, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి దశరథి సరాబు, అధికారులు పాల్గొన్నారు. -
బ్యాగ్ పెయిన్..!
● బడి పిల్లలపై బ్యాగుల భారం ● అధిక పుస్తకాలతో వెన్నెముకపై ఒత్తిడి ● నొప్పులతో సతమతమవుతున్న చిన్నారులు ● పట్టించుకోని అధికారులు హిరమండలం: ఆటపాటలతో సాగాల్సిన చిన్నారుల బాల్యం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల పుణ్యమా అని మోయలేని పుస్తకాల భారంతో నలిగిపోతోంది. జిల్లావ్యాప్తంగా 2,612 ప్రభుత్వ, 402 ప్రైవేటు పాఠశాలల్లో కలిపి 2.5 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే చాలా ప్రైవేటు పాఠశాలల్లో 1–5 తరగతులకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలతో పాటు సొంత మెటీరియల్ అంటగడుతున్నారు. అలాగే ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలు ధనార్జనే ధ్యేయంగా ఒలింపియాడ్, జేఈఈ, నీట్ స్టడీ మెటీరియల్ అంటూ భారీగా పుస్తకాలను ఇస్తున్నారు. దీంతో బండెడు పుస్తకాలను బ్యాగులో వేసుకుని నేటితరం బాల్యం నిత్యం నరకయాతన అనుభవిస్తోంది. దాదాపు రెండు నుంచి నాలుగు వరకు అంతస్తుల్లో ఉన్న తరగతి గదులకు మెట్లు మీదుగా చేరలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫలితంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. అమలు కాని ‘స్కూల్ బ్యాగ్ పాలసీ’ విద్యాహక్కు చట్టం–2009 యశ్పాల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం స్కూల్ బ్యాగ్ పాలసీని ఆరేళ్ల క్రితం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం 1, 2 తరగతుల వారికి తెలుగు, ఆంగ్లం, గణితం.. 3, 4, 5 తరగతులైతే ఆ మూడింటికి తోడు పరిసరాల విజ్ఞానం, 6 నుంచి 10 తరగతులైతే ఆరు పుస్తకాలే ఇవ్వాలి. కానీ స్కూల్ బ్యాగ్ పాలసీని ప్రైవేటు పాఠశాలల్లో సక్రమంగా అమలు చేయడం లేదు. వేర్వేరు పేర్లతో అధికంగా పుస్తకాలు కట్టబెడు తున్నారు. దీంతో బాల్యంపై మోయలేని పుస్తకాల భారం పడుతోంది. స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం విద్యార్థి శరీర బరువులో 10 శాతానికి మించి స్కూల్ బ్యాగు బరువు ఉండకూడదనేది ప్రాథమిక సూత్రం. అయితే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ర్యాంకుల ఉచ్చు, అదన పు సిలబస్ మార్కెట్ వ్యూహాల వల్ల ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కేస్తున్నారు. ప్రభుత్వాలు జీవోలు జారీ చేయడం, అధికారులు అప్పుడప్పు డు తనిఖీలు చేయడం మినహా క్షేత్రస్థాయిలో శాశ్వత పరిష్కారం లభించడం లేదు. పాఠశాల విద్యార్థులు తమ శరీర బరువులో 10 శాతానికి మించి బరువు లు మోయడం అత్యంత ప్రమాదకరం. లేత వయస్సులో ఎముకలు, వెన్నెముక పూర్తిగా ఎదుగు దల దశలో ఉంటాయి. అలాంటి సమయంలో ప్రతిరోజూ ఎక్కువ బరువును వీపుపై మోస్తూ బస్సులు, మెట్లు ఎక్కడం వల్ల వెన్నుపూసపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. చిన్న వయస్సులోనే నడుము నొప్పి, మెడ నొప్పి, భుజాల కండరాలు పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి. స్కూల్ బ్యాగుల బరువు తక్షణమే తగ్గించకపోతే భావితరం శారీరకంగా బలహీన పడుతుంది. – పి.సాయికుమార్, పీహెచ్సీ వైద్యాధికారి, హిరమండలం -
రాయగడలో అదాని గ్రూప్ చైర్మన్ పర్యటన
● ఇంఫా కర్మాగారంలో కీలక సమావేశంరాయగడ: జిల్లా పరిధిలోని కొలనార సమితి తెరువలి ప్రాంతంలో ఉన్న ఇండియన్ మెటల్సఅండ్ ఫెర్రో ఎల్లాయిస్ (ఇంఫా ) కర్మాగారాన్ని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కుమారుడు కరణ్ అదానీలు ఆదివారం హెలీకాప్టర్లో సందర్శించారు. కర్మాగారంలో సుమారు గంటపాటు జరిగిన కీలక సమావేశంలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ పర్యటనతో రాయగడ జిల్లాలో పారిశ్రామిక రంగానికి సంబంధించి కొత్త పరిణామాలపై చర్చ మొదలైంది. ఇప్పటికే కాసీపూర్ సమితిలో బాకై ్సట్ గనుల లీజు ఆదానీ గ్రూప్కు లభించగా కళింగ అల్యూమినియం లిమిటెడ్ పేరుతో రాయగడలో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. గతంలో కొలనార సమితిలొ సుమారు 1700 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన వచ్చినప్పటికీ, ప్రభుత్వ భూమి కంటే ప్రైవేట్ భూమి ఎక్కువగా ఉండటంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇక కేంద్రాపడ ఎంపీ, ఇంఫా కర్మాగారం యజమాని బైజయంత్ పండ ఆధ్వర్యంలో ఇంఫా ప్లాంట్లో జరిగిన సమావేశం స్ధానికంగా ఆసకి రేకెత్తిస్తొంది. భవిష్యత్లో ఇంఫా సంస్థను అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకుంటుందా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సమావేశం సందర్భంగా మీడియాకు అనుమితి ఇవ్వకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, జిల్లా ఎస్పీ రాజ్ ప్రసాద్ తదితర అధికారులు సమావేశానికి హాజరైన వారిలో ఉన్నారు. అదానీ గ్రూప్ హెలీకాప్టర్లో కాసీపూర్ సమితితోపాటు జిల్లాలోని పలు ప్రాంతాలను గగనతల వీక్షణ చేసినట్లు సమాచారం.


