Odisha News
-
40 మందికి శిరోముండనం
కులాంతర వివాహం.. రాయగడ: నేటి ఆధునిక ప్రపంచంలోనూ ఇంకా అనేక చోట్ల మూఢ నమ్మకాలు కొనసాగుతునఆనయి. కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో యువతి కుటుంబీకులు 40 మంది శిరోముండనం చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రాయగడ జిల్లా కాసీపూర్ సమితి గొరక్పూర్ పంచాయతీలో ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి, వేరే షెడ్యూల్ తెగకు చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లికి యువతి తరఫు బంధువులు, కుటుంబీకులు అంగీకరించలేదు. దీంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న యువ జంట తమ బంధువులు, కుటుంబీకులను కలసి ఆశీర్వాదం తీసుకునేందుకు గురువారం స్వగ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు ఊరికట్టుబాట్లను కాదని కులాంతర వివాహం చేసుకున్నందుకు శిక్ష విధించారు. గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి కుటుంబీకులను గ్రామ బహిష్కరణ చేశారు. ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే యువతి బంధువులు, కుటుంబీకులు శిరోముండనం చేసుకోవడంతో కర్మకాండలను నిర్వహించి మూగజీవాలను బలి ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు యువతి కుటుంబీకులు అంగీకరించారు. 40 మంది శిరోముండనం చేసుకుని మూగజీవాలను బలిచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించగా వారిని తిరిగి కులంలో కలుపుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వద్ద ఎటువంటి సమాచారం లేదు. -
మూడు గంటలు నరక యాతన!
కొరాపుట్: ప్రమాదం జరిగిన ట్రక్లో ఇరుక్కుని డ్రైవర్ మూడు గంటలు నరక యాతన పడ్డాడు. శుక్ర వారం వేకువ జామున 2.30 గంటల సమయంలో జయపూర్–నబరంగ్పూర్ మార్గంలో హరడాపుట్ గ్రామం వద్ద 26వ నంబర్ జాతీయ రహదారిపె నిలిపి ఉన్న ట్రక్ని పాల ట్యాంకర్ ఢీకొట్టింది. ఉమ్మర్కోట్ నుంచి విశాఖపట్నానికి పాల లోడుతో వెళ్తున్న ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ గురునాం సింగ్ తన సీటులో చిక్కుకు పోయాడు. పోలీసుల సమాచారంతో జయపూర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హైడ్రాలిక్ కుంబి టూల్స్ వినియోగించి సుమారు మూడు గంటల ప్రత్యేక ఆపరేషన్ ద్వారా డ్రైవర్ని బయటకు తీసి జయపూర్లోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు ఫైర్ స్టేషన్ అధికారి సురేష్ బారిక్ వెల్లడించారు. -
పతిత పావనుడికి పూజలు
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం సింహద్వారం ఆవరణలో కుడ్య ప్రతిమ పతిత పావనుడిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించాడు. రత్నవేదికపై కొలువుదీరిన మూల విరాటు అస్వస్థతతో తెరమరుగు కావడంతో జగన్నాథుని స్థానంలో అనంత నారాయణ్ చిత్రపటం నిత్య పూజలు అందుకుంటున్నాడు. మూల విరాటుల సహజ దర్శనం పునరుద్ధరించేంత వరకు పతిత పావనుని ఇలా దర్శించుకోవడం నిరవధికంగా కొనసాగుతుంది. పేదలకు నిత్యావసరాల పంపిణీ రాయగడ: స్థానిక రైతుల కాలనీలో గల నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలైన 40 మంది ఆదివాసీ మహిళలకు ఉచితంగా నిత్యావసరాల వస్తువులను శుక్రవారం పంపిణీ చేశారు. అన్నలక్ష్మీ పథకం కింద ప్రతి నెల బియ్యం, నూనె, బంగాళాదుంపలు, కందిపప్పు తదితర వస్తువులను పంపిణీ చేస్తున్నామని ట్రస్టు నిర్వాహకులు ఎం.నళిని తెలియజేశారు. ఇదిలాఉండగా ఈ సారి నిత్యవసరాల వస్తువులతో పాటు మామిడి పళ్లు, బిస్కెట్, రొట్టెలను పంపిణీ చేశామని ఆమె తెలిపారు. తిరుపతిలో గల నవజీవన్ ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీధర్ ఆచార్య ప్రతి నెల నిరుపేదలకు అన్న లక్ష్మీ పేరిట నిత్యావసరాల పంపిణీ చేస్తున్నారని, అదేవిధంగా రాయగడలో గల ట్రస్టు ఆధ్వర్యంలో ఎందరినో చదివిస్తున్నారని తెలిపారు.చంద్రపూర్లో ఇళ్ల పట్టాల పంపిణీ రాయగడ: జిల్లాలోని చంద్రపూర్ తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో 35 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను శుక్రవారం పంపిణీ చేశారు. అదనపు తహసీల్దార్ ఆశీష్ కుమార్ ప్రధాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ పాణిగ్రహి, సిబ్బంది మోతీలాల్ సామల్ తదితరులు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన వారిలో ఉన్నారు. లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.లారీ బోల్తా రాయగడ: కలహండి జిల్లా భవానీపట్నం నుంచి రాయగడకు అల్యూమిన పైపులతో వస్తున్న లారీ జిల్లాలోని అంబొదల సమీపంలో శుక్రవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలోని పైపులు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న అంబొదల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్, హెల్పరు సురక్షితంగా బయటపడ్డారు. తమ్ముడిపై దాడి ఘటనలోఅన్న అరెస్టు మల్కన్గిరి: కోరుకొండ సమితి బలిమెల పోలీసుస్టేషన్ పరిధిలో రాస్స్బేఢ పంచాయతీ పల్లంగూడలో ఈ నెల 8న భూమి విషయమై తమ్ముడు తిరుపతి ముదిలిని బాణంతో గాయపరిచిన అన్నహరి ముదిలిని బలిమెల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ తెలిపారు. తిరుపతి ప్రస్తుతం బరంపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
మంచినీటికి బదులు మురుగునీరు సరఫరా!
కొరాపుట్: ప్రజారోగ్య శాఖ పంపీణీ చేస్తున్న మంచినీటికి బదులు మురుగు నీరు (ఎర్రటినీరు) వస్తుంది. నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితి తుంబర్ల గ్రామ పంచాయతీ దన్సులి గ్రామంలో మంచినీటికి బదులు మురుగు నీరు రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. గత కొద్ది రోజులుగా ఈవిధంగా దుర్గంధంతో కూడిన నీరు సరఫరా అవుతున్నటుట స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని సర్పంచ్ దృష్టికి తెచ్చారు. సర్పంచ్ ఉన్నతాధికారులకు నివేదించినా వారు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయం గురువారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో అధికారులు గ్రామానికి పరుగులు తీసి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. -
నాగేశ్వరి గుహల్లో గేటు చోరీ
కొరాపుట్: వివాదాస్పద నాగేశ్వరి గుహల ప్రవేశ మార్గం గేటు చోరీకి గురయ్యింది. నందపూర్ సమితి నుంచి వెళ్లే ఈ మార్గంలో ప్రధాన గేటు చోరీ జరిగినట్లు స్థానికులు శుక్రవారం గుర్తించారు. సముద్ర మట్టానికి 1,300 మీటర్ల ఎత్తులో బల్దా నాగేశ్వరి గుహల పైభాగన విశాలమైన మైదానం ఉంది. అక్కడే పెద్ద సరస్సు, కింది వైపు నాగేశ్వరి గుహలు ఉన్నాయి. వీటిని తిలకించడానికి నిత్యం పర్యాటకులు తరలి వస్తుంటారు. మరోవైపు గుహల్లోని బాకై ్సట్ను తవ్వేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వీటిని వ్యతిరేకిస్తూ గిరిజనులు పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి ప్రవేశాలు నిషేధిస్తూ 2 నెలలు క్రితం స్థానికులు పెద్ద గేటు బిగించారు. దీనివల్ల గంజాయి స్మగ్లర్లకు కూడా ఇబ్బందిగా మారింది. ఈ నేపధ్యంలో గేటు చోరీ కావడం గమనార్హం. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
జాజ్పుర్ జిల్లాలో ప్రబలిన డయేరియా
భువనేశ్వర్: జాజ్పూర్ జిల్లాలో అతిసార పంజా విసిరింది. వ్యాధిలక్షణాలతో బాధపడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రధాన ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితిని క్షేత్ర స్థాయిలో సమీక్షించేందుకు కేంద్ర రెవెన్యూ అధికారి (ఆర్డీసీ) వి.దీన్ జాజ్పూర్ జిల్లాలోని ధర్మశాల, వ్యాసనగర్ ఆస్పత్రులతోపాటు జిల్లా ప్రధాన ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. చికిత్సపొందుతున్న రోగులతోపాటు బంధువులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అతిసార వ్యాప్తి చెందడానికి కారణాలను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ అధికారి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, ఆహార భద్రత శాఖ ప్రత్యేక కార్యదర్శి, జిల్లా కలెక్టర్, జిల్లా ముఖ్య వైద్య అధికారి, మండల అధికారి, వైద్యులతో మాట్లాడిసి పరిస్థితిపై ఆరా తీశారు. బాధిత ప్రజలకు తగిన వైద్య సేవలను అందించాలని ఆర్డీసీ ఆదేశించారు. వ్యాధిపై ఆర్డీసీ సమీక్ష -
రాష్ట్రం ఆదర్శం: సీఎం
శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025మహిళా సాధికారతలో..భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం సాధికారతతో మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలపరిచేందుకు కట్టుబడి ఉందని సీఎం మోహన్ చరణ్ మాఝీ అన్నారు. మహిళల స్వావలంబన కోసం సంకల్పించిన సుభద్ర యోజన విజయవంతం కావడం ఒక ప్రధాన ఉదాహరణ అని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ పాలన ఏడాది పూర్తి పురస్కరించుకుని కటక్ నగరం బలియాత్ర గ్రౌండులో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి నారీ శక్తి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మహిళలను గౌరవించడం రాజకీయ శిక్షణలో తొలి అంశంగా పేర్కొన్నారు. ఒడిశా నారీ శక్తిని అత్యుత్తమ శక్తిగా మార్చడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. లక్షాధికారి సోదరి (లఖ్యపతి దీదీ) ఆవిష్కరణలో ఒడిశా ప్రస్తుతం భారత దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో 16 లక్షలకు పైగా లక్షాధికారి సోదరిలను సృష్టించడం మహిళా సాధికారతకు నిలువెత్తు తార్కాణంగా అభివర్ణించారు. సుభద్ర యోజన ఒడిశా చరిత్రలో అతిపెద్ద మహిళా సంక్షేమ కార్యక్రమమని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, ప్రతి కుటుంబంతో ప్రభుత్వం ప్రత్యక్షంగా సంప్రదించి సమగ్ర సమాచారంతో వాస్తవ లబ్ధిదారుల్ని పరిగణనలోకి తీసుకుని పథకం ప్రయోజనం చేరదీయడం విశేషమన్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ మహిళల్ని చైతన్యపరచి పథకంలో చేర్చడం ప్రభుత్వం దృఢ సంకల్పానికి నిదర్శనమని తెలిపారు. ఏడాది పాలనలో అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా స్వయం సహాయక బృందాలకు రూ. 3 వేల 695 కోట్ల విలువైన వ్యాపార అవకాశాలను కల్పించాయని. రాష్ట్ర చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్గా పేర్కొన్నారు. 3.07 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకు రుణాలపై రూ. 300 కోట్ల వడ్డీని తిరిగి చెల్లించి వారి ఆర్థిక కలలను సాకారం చేయడంలో ప్రభుత్వం వారధిగా నిలిచిందన్నారు. ఈ ఏడాది మహిళల కోసం రూ. 89,861 కోట్ల నిధుల్ని బడ్జెట్లో కేటాయించి మహిళలకు పట్ట ప్రభుత్వ నిబద్ధత చాటుకుందని, మహిళా సాధికారతలో ఆదర్శ రాష్ట్రంగా ఒడిశా ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్ తన ప్రసంగంలో, మహిళా శక్తి అభివృద్ధి చెందిన, సంపన్నమైన, గర్వించదగిన ఒడిశా ఆవిష్కరణలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా మాట్లాడుతూ సమానత్వం, శ్రేయస్సు, పురోగతి రాష్ట్రంగా ఒడిశాను నిర్మించాలనే సంకల్పానికి ఈ కార్యక్రమం తొలి వేదికగా నిలుస్తుందన్నారు. వచ్చే ఏడాది సరికి రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో లక్షాధికారి సోదరి, ప్రతి పంచాయతీలో కోటీశ్వర మహిళల్ని ఆవిష్కరించడం తథ్యమని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి శాఖ అమలు చేసిన పోషణ్ అభియాన్లో అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్రంలోని వివిధ లిఖిత, ఫొటో చిత్రాలతో కూడిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి, ఇతర అతిథులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత శాఖ ఆధ్వర్యంలో విశేష కృషి చేసిన మహిళలను ముఖ్యమంత్రి సత్కరించారు. కటక్ లోక్ సభ సభ్యుడు భర్తృహరి మహతాబ్, జగత్సింగ్పూర్ లోక్ సభ సభ్యుడు బిభు ప్రసాద్ తొరై, కటక్ నియోజక వర్గం శాసన సభ సభ్యుడు ప్రకాష్ సెఠి, బొడొంబ నియోజక వర్గం శాసన సభ సభ్యుడు విజయ్ డాల్బెహెరా, నియాలి నియోజక వర్గం శాసన సభ సభ్యుడు అభిషేక్ మల్లిక్, మహాంగా నియోజక వర్గం శాసన సభ సభ్యుడు శారద ప్రసాద్ ప్రధాన్, జిల్లా మేజిస్ట్రేట్ దత్తాత్రేయ భౌసాహెబ్ షిండే, మహిళా సాధికారత శాఖ ప్రముఖ కార్యదర్శి శుభ శర్మ, డైరెక్టర్ మోనిషా బెనర్జీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూస్రీల్ -
ఇద్దరు మావోయిస్టులు అరెస్టు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో శుక్రవారం ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వినోద్ పటేల్ తెలిపారు. మత్తిలి పోలీసు స్టేషన్ పరిధిలోని సోడిగూడ వద్ద వీరిని పట్టుకున్నట్లు చెప్పారు. కొరాపుట్ నుంచి ఛత్తీస్గఢ్కు వెళ్తుండగా డీవీఎఫ్ జవాన్లకు పట్టుబడ్డారని తెలిపారు. వీరిద్దరూ ఆంధ్రా–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గాంగులూర్కు చెందిన రాకేష్ కుంజం అలియాస్ మున్న కుంజం, కేశు కబాసిగా గుర్తించారు. సుక్మా జిల్లా కాంగేర్ఘాటి ఏరియా కమిటీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న వీరిపై రూ.4లక్షలు చొప్పున మొత్తం రూ.8లక్షలు రివార్డు ఉంది. వీరి వద్ద నుంచి రెండు రివాల్వర్లు, సాహిత్యం, వాకీటాకీ బ్యాటరీ, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
75 మందికి సామాజిక బహిష్కరణ
కొరాపుట్: ఆధునిక సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా ఇంకా కొన్ని గ్రామాల్లో గిరిజనులు మూఢ విశ్వాసాలు, నిబంధనలు వీడటం లేదు. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా కొడింగా పోలీస్స్టేషన్ పరిధి లోని బంకులి గ్రామానికి చెందిన 15 కుటుంబాల పెద్దలు నబరంగ్పూర్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. చట్టపరంగా ఉన్న తమ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, దీనిపై న్యాయ పోరాటానికి దిగడంతో కక్ష కట్టి తమ 15 కుటుంబాలకు చెందిన 75 మందిని సామాజిక బహిష్కరణ చేశారని వాపోయారు. గ్రామంలో ఎవరూ తమతో మాట్లాడరని, దుకాణాలలో వస్తువులు విక్రయాలు చేయడం లేదని, బోర్ల వద్ద నీరు పట్టుకోనివ్వడం లేదని, కనీసం పశువులను కూడా చెరువుల వద్దకు రానివ్వకపోవడంతో నాలుగు రోజులుగా పశువులు ఆకలితో అలమటిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. తమ పిల్లలను కూడా ఇతర పిల్లలతో ఆడనివ్వడం లేదన్నారు. గ్రామస్తులు ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రు.500 జరిమానా విధిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై కొడింగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదన్నా రు. సమాచారం అందుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్నా త్రిపాఠి బాధితులను జిల్లా కేంద్రానికి రప్పించి ఎస్పీ ఫిర్యాదు చేయించారు. దీంతో ఎస్పీ సందీప్ సంపత్ తీవ్రంగా పరిగణించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, మున్నా త్రిపాఠి మీడియాతో మాట్లాడు తూ ఇటువంటి సంస్కృతిని ఆదిలోనే నిలిపి వేయాలన్నారు. లేదంటే ప్రతి గ్రామంలో బలవంతులు చట్టం తమ చేతిలోకి తీసుకొని పేదలను పీడిస్తారన్నారు. తక్షణం పోలీసు బలగాలు గ్రామానికి చేరుకొని నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశా రు. త్వరలోనే ఆ గ్రామాన్ని సందర్శిస్తామని త్రిపాఠి పేర్కొన్నారు. -
పరికరాలు ఉన్నా.. ప్రయోజనం సున్నా
● టెక్కలి జిల్లా ఆస్పత్రిలో సమస్యల కొలువు ● వేధిస్తున్న స్టాఫ్ నర్సుల కొరత టెక్కలి రూరల్: స్థానిక జిల్లా కేంద్రాస్పత్రి సమస్యలతో కునారిల్లుతోంది. నిత్యం 700 వరకు ఓపీ ఉన్న ఈ ఆస్పత్రిలో సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఇక్కడ చర్మవ్యాధి నిపుణులు లేకపోవడంతో చాలా మంది ఇక్కట్లు పడున్నారు. ఆస్పత్రిలో ప్రధానంగా స్టాఫ్ నర్సుల కొరత వేధిస్తోంది. గత ప్రభుత్వంలో స్టాఫ్ నర్సులు 43 మంది ఉండగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 కంటే తక్కువ మందే పనిచేస్తున్నారు. దీంతో ట్రామాకేర్, గైనిక్ వార్డు, జనరల్ వార్డులు, ఆర్థో వార్డుల్లో రోగులకు సరైన సమయంలో వైద్యం అందించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధాన సమస్యలివే.. ● ఆస్పత్రిలో రేడియోలజిస్టు లేక అల్ట్రా సౌండ్ స్కానింగ్ విభాగం మూతపడింది. ● రూ.లక్షలు విలువ గల వెంటిలేటర్లు ఉన్నా, వినియోగించేందుకు నిపుణులు లేక అవి కూడా మూలకు చేరాయి. ● రూ.లక్షలు విలువ గల హార్మోన్ ఎనలైజర్ యంత్రం ఉన్నా, దానికి సంబంధించిన రసాయనాలు లేక వినియోగంలో లేకుండా పోయింది. ● ఈసీజీ టెక్నీషియన్ లేకపోవడంతో ఉన్న సిబ్బందితో పూర్తిస్థాయి అవగాహన లేకుండా ఈసీజీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ● థైరాయిడ్ పరీక్షలకు సంబంఽధించిన యంత్రం ఉన్నా దానికి సంబంధించిన కెమికల్స్ లేకపోవడంతో థైరాయిడ్ పరీక్షలకు అక్కడ ఉన్న కొంతమంతి సిబ్బంది బయట ల్యాబ్లతో మాట్లాడి చేయిస్తున్న పరిస్థితి నెలకొంది. ● ట్రామాకేర్కు సంబంధించిన అంబులెన్స్ పాతజిల్లా ఆస్పత్రి ఆవరణలో మూలకు చేరింది. ● ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగి నెలలు గడుస్తున్నా నేటికీ నిర్వహించడం లేదు. దీంతో చాలా వరకు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ● ఆస్పత్రికి పూర్తిస్థాయిలో దోబీ వర్కర్ లేకపోవడంతో శానిటేషన్ వర్కర్లతో పనిచేయిస్తున్నారు. ● ఆస్పత్రిలో సరిపడా వీల్చైర్లు, స్ట్రెచర్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ● ఆస్పత్రిలో ఉన్న లిఫ్ట్ తరుచూ పాడైపోతోంది. ● రోగులకు అవసరమైన తాగునీరు, వాడుకనీరు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు. ● కాలువ వ్యవస్థ కూడా సరిగా లేదు. ● ఫ్రీజర్లు సరిగా లేకపోవడంతో మృతదేహాలను కిందనే ఉంచాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. స్టాఫ్నర్సుల కొరత వాస్తవమే.. ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుల కొతర వాస్తవమే. 17 మంది తక్కువగా ఉన్నారు. బదిలీలు జరిగాక కొత్త వారు వస్తారు. థైరాయిడ్, వెంటిలేటర్ పరికరాలు త్వరలోనే వినియోగంలోకి తీసుకువస్తాం. – బొడ్డేపల్లి సూర్యారావు, టెక్కలి జిల్లా ఆస్పత్రి సూపరిండెంటెంట్ -
వేర్వేరు చోట్ల గంజాయి స్వాధీనం
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో వేర్వేరు చోట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి కార్యాలయం సమీపంలో పోలీసులు తనిఖీ చేశారు. ఆర్జే 08 జీఏ 4204 నంబర్ గల ట్రక్ని ఆపి డ్రైవర్ పరారయ్యాడు. అందులో సురుమి గ్రామానికి చెందిన మోహనరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనం తనిఖీ చేయగా 1084 కిలోల గంజాయి దొరికింది. స్టేషన్ అధికారిణి మమతా పండా కేసు నమోదు చేసి, గంజాయితో పాటు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. జయపూర్ నుంచి విశాఖ పట్నం వెళ్తున్న కిరండోల్ రైలులో కొరాపుట్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ముగ్గురు మహిళా ప్రయాణికుల బ్యాగ్లలో 30 కిలోల గంజాయి దొరికింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు గంజాయి స్మగ్లర్లని తేలింది. దీని విలువ రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు ప్రకటించారు. ముగ్గురు నిందితురాళ్లు న్యూఢిల్లీకి చెందిన షర్మిలా,మౌనిక,రాధికగా పేర్కొన్నారు. ఈ గంజాయి విశాఖ నుంచి న్యూఢిల్లీ తీసుకెళ్తున్నట్లు తెలిపారు. -
గజపతి స్టేడియంలో వికాస్ మేళా నేడు
పర్లాకిమిడి: గజపతి స్టేడియంలో ఏర్పాటు చేసి న వికాస్ మేళాను మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శనివారం ప్రారంభించనున్నారు. ముందు గా బరంపురం నుంచరి పర్లాకిమిడి సర్క్యూట్ హౌస్కు చేరుకుని వికసిత్ జిల్లా.. వికసిత్ ఒడిషా కార్యక్రమంలో పాల్గొంటారు. వికాస్ మేళా లో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ పథకా లు, లబ్ధిదారులకు ప్రశంసాపత్రాలు, చెక్కులు పంపిణీ చేస్తారు. ఈ నెల 20 వరకూ వికాస్ మేళా కొనసాగనుంది. విద్యుదాఘాతంతో యువకుని మృతి రాయగడ: విద్యుత్షాకణతో యువకుడు ప్రాణాలు కోల్పోయా డు. ఈ సంఘటన జిల్లాలోని బిసంకటక్ సమితి హజారిడంగ్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. మృతుడు రంజన్ కుమార్ సాహుకా ర్ (22)గా గుర్తించా రు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీ నం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బిసంకటక్ కోర్టులో ఏపీఆర్గా విధులు నిర్వహిస్తున్న రంజన్కుమార్ ఎప్పటిలాగే ఉదయం స్నానం చేసిన తరువాత ఇనుప తీగకు సమీపంలో ఉన్న తువ్వాలను శరీరం తుడుచుకోవడానికి తీసుకుంటుండగా విద్యుత్ షాక్కు గురై ప్రాణా లు కోల్పోయారు. అందిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్కన్గిరి పూర్వ కలెక్టర్కు బెయిల్ మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా పూర్వ కలెక్టర్ మనీష్కుమార్ అగర్వాల్కు ఎస్డీజేఎం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. 2019లో మనీష్ కలెక్టర్గా ఉన్న సమయంలో ఆయన వద్ద పీఏగా ఉన్న దేవనారాయణ్ పండా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆయన భార్య వనజ పండా తన భర్తను కలెక్టర్, మరో ముగ్గురు సిబ్బంది కలిసి హత్య చేశారంటూ మల్కన్గిరి పోలీసుస్టేషన్లో ఫిర్యాధ్ చేసింది. ఆ కేసులో మనీష్కు బెయిల్ మంజూరైంది. వృద్ధురాలి మెడలో చైన్ చోరీ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని పీఎన్కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడలో చైన్ తెంపేసి బైక్పై ఉడాయించాడు ఓ యువకుడు. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పీఎన్ కాలనీ మూడో లైన్ కమల నివాస్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న కల్లేపల్లి ఈశ్వరమ్మ (62) తన సోదరితో కలసి ఫ్రెండ్స్ కాలనీలో బంధువులు చనిపోవడంతో పరామర్శకు వెళ్లారు. శుక్రవారం రాత్రి తిరిగి పీఎన్కాలనీ రెండో లైన్ చేరేసరికి ఓ 30 ఏళ్ల యువకుడు తలకు హెల్మెట్ ధరించి రయ్మని దూసుకొచ్చి నడుస్తున్న వృద్ధురాలి మెడలో మూడున్నర తులాల చైన్ తెంపేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె మెడకు గాయమైంది. దీనిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పీఎన్ కాలనీలో వరుసగా చోరీలు, చైన్ స్నాచింగ్లు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుస్తెలతాడు చోరీకి విఫలయత్నం మెళియాపుట్టి: మండలంలోని గోకర్ణపురం గ్రామానికి సమీపంలో అదే గ్రామానికి చెందిన గేదెల మహాలక్ష్మి అనే మహిళ రహదారి నుంచి గ్రామానికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో పుస్తెలతాడు తెంపుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. శుక్రవారం మహాలక్ష్మీ పెద్దలక్ష్మీపురం గ్రామానికి తన తండ్రి పెద్దకర్మకు వచ్చి తిరుగు ప్రయాణంలో గోకర్ణపురం గ్రామానికి వెళ్తుండగా..ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం పై వచ్చి మెడలో పుస్తెలతాడు లాగే ప్రయత్నం చేశారు. మహిళ కేకలు వేయడంతో వారు పారిపోయారు. అనంతరం మహిళ మెళియాపుట్టి పోలీసులకు సమాచారం అందించారని తెలియజేశారు. పిడుగుపాటుకు నాలుగు ఆవులు మృతి ఎచ్చెర్ల: లావేరు మండలంలోని బుడుమూరు గ్రామంలో శుక్రవారం ఒంటిగంట సమయంలో ఉరుములతో కూడిన వర్షానికి చెట్టుమీద పిడుగుపడి కిందనున్న నాలుగు ఆవులు మృతి చెందాయి. ఇదే గ్రామానికి చెందిన పిట్ట అప్ప య్య ఓ చెట్టు కింద ఆవులు కట్టి ఉంచారు. ఒక్కసారిగా పిడుగుపడి ఆవులు మృతిచెందడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. రెవె న్యూ సిబ్బంది, పశువైద్యాధికారులు సంఘట నా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నారు. -
ఆర్తులను కాపాడుదాం
శ్రీకాకుళం కల్చరల్: దాతలు కావాలి.. రక్త దాతలు ముందుకు రావాలి. జిల్లాలో రక్తల నిల్వలు నానాటికీ తక్కువైపోతున్నాయి. దాతలు ముందుకు రాకపోతే గర్భిణుల దగ్గర నుంచి ప్రమాద బాధితుల వరకు చాలా మంది ప్రాణాపాయ స్థితిలో పడతారు. రక్తదానంపై అవగాహన విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో రెడ్క్రాస్తో పాటుగా ప్రభుత్వ ఆస్పత్రులు, జిల్లా కేంద్రంలో 3 ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు, నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో బ్లడ్బ్యాంకులు ఉన్నాయి. వాటన్నింటి ద్వారా రక్త సేకరణ ఏడాదిలో కేవలం 16వేల యూనిట్లు మాత్రమే జరుగుతోంది. జిల్లాకు దాదాపు 60వేల యూనిట్లు అవసరం ఉంటుంది. దీనిపై రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు మాట్లాడుతూ ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సి ఉందని చెప్పారు. తమ బ్లడ్బ్యాంకులో కూడా కూడా రక్తం అందడం కష్టంగా ఉందన్నారు. అపోహలు వద్దు.. ● చాలా మంది రక్తదానం అంటే భయపడతారు. దీనిపై చాలా అపోహలు ఉన్నాయి. ● రక్తదాన ప్రక్రియలో కేవలం 300 మిల్లీలీటర్లు మాత్రమే సేకరిస్తారు. ● సాధారణంగా మనిషిలో సరాసరి 5లీటర్ల నుంచి 6లీటర్ల రక్తం ఉంటుంది. కేవలం 300 మిల్లీలీటర్ల రక్తం దానం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. సుఖప్రసవంలో తల్లి 700 మిల్లీలీటర్ల రక్తం కోల్పోతుంది. నేడు రక్తదాతల దినోత్సవం రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని రెడ్క్రాస్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు రక్తదానంపై ఆవశ్యకత కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తారు. అపోహలు వదలండి రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి. ఎవరైనా రక్తదానం చేయవచ్చు. ఆపద సమయంలో రక్తం ఎంతో అవసరం. దాన్ని గుర్తించండి. – పి.జగన్మోహనరావు, చైర్మన్, రెడ్క్రాస్ సాటి మనిషిని కాపాడాలనే.. నేను 49 సార్లు రక్తదానం చేశాను. ఏటా ఆగస్టు 15, మే 1, రిపబ్లిక్ డే, డిసెంబరు 25 పుట్టిన రోజున ఇస్తుంటాను. – కేకేవీ పురుషోత్తమరావు(కల్యాణ్), విశ్రాంత మెడికల్ రిప్రజెంటేటివ్, శ్రీకాకుళంప్రతి మూడు నెలలకు ఇస్తాను.. నేను ప్రతి మూడు నెలలకు ఓ సారి రక్తదానం చేస్తుంటాను. మొదట్లో నాకూ భయం ఉండేది. మా మేనేజర్ను చూసి స్ఫూర్తి పొందాను. రెడ్క్రాస్ పలుసార్లు అవార్డులు, సత్కారాలు కూడా చేశారు. – సీహెచ్ రమణమూర్తి, శ్రీకాకుళం జిల్లాకు ఏడాదికి దాదాపు 60వేల యూనిట్ల రక్తం అవసరమవుతుంది. కానీ సేకరిస్తున్నది మాత్రం కేవలం 16 యూనిట్లే. ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దడం చిటికెలో పని. కానీ ఎందుకనో ఆ పని జరగడమే లేదు. దాతలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి రక్తదానం చేస్తే కొరతను ఇట్టే అధిగమించవచ్చు. కానీ అవగాహన లేమి, భయం, సమాచార లోపం కారణంగా రక్తదానం చేసేందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. ఈ భయం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం అందకుండాపోతోంది. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం జిల్లాలో తగ్గుతున్న రక్త నిల్వలు దాతలు ముందుకు రావాలని స్వచ్ఛంద సంస్థల పిలుపు ఎవరు రక్తదానం చేయవచ్చు.. కాసింత దయాగుణం.. మరికాసింత ఆరోగ్యం.. ఈ రెండూ ఉంటే చాలు.. 18–60 ఏళ్ల వారెవరైనా 45 కిలోలకు పైగా బరువు ఉండి, 12 పాయింట్లు హిమోగ్లోబిన్ ఉంటే ఎంచక్కా రక్తదానం చేయవచ్చు. -
ఉపాధ్యాయులకు కంటి పరీక్షలో శిక్షణ
● రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటిభువనేశ్వర్: పిల్లల ఆరోగ్య సంరక్షణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ప్రధానంగా రక్త హీనత, దృష్టి సమస్యలపై ప్రత్యేక జాగ్రత్త అవసరమని, ఈ నేపథ్యంలో పిల్లల్లో కంటి చూపు లోపాల్ని ఆరంభ దశలో గుర్తించేందుకు వీలుగా ప్రాథమిక పాఠశాలలో కనీసం ఒక ఉపాధ్యాయునికి ప్రాథమి క కంటి పరీక్షలో శిక్షణ కల్పించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ప్రతిపాదించారు. స్థానిక రాష్ట్ర మహిళా, పిల్లల సంస్థ (ఎస్ఐడబ్ల్యూసీ)ను సందర్శించిన సందర్భంగా మహిళలు, కౌమారదశలో ఉన్న బాలికలలో రక్త హీనత, పిల్లల లో పెరుగుతున్న దృష్టి సమస్యలపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరిచేందు కు క్రమం తప్పకుండా పరీక్షలు, రోజువారీ ఆహారంలో క్యారెట్–బీట్రూట్ రసం, చిక్కీ వంటి పోషకాహార పదార్థాలను చేర్చాలని గవర్నర్ సూచించా రు. పాఠశాల పిల్లలలో కంటి చూపు సమస్యల పెరుగుతున్న ప్రాబల్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ముందస్తుగా గుర్తించేలా ప్రతి పాఠశాలలో కనీసం ఒక ఉపాధ్యాయుడికి ప్రాథమిక కంటి పరీక్షలో శిక్షణ ఇవ్వాలని డాక్టర్ కంభంపాటి ప్రతిపాదించారు. అన్ని సంబంధిత విభాగాలతో ఈ సమస్యలను వీలైనంత త్వరగా చర్చిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఎస్ఐడబ్ల్యూసీ సముదాయంలో మాలతి చౌదరి నివాస్, రెసిపీ అండ్ టొయాథాన్ డెమోన్స్ట్రేషన్ యూనిట్, ఆదర్శ అంగన్వాడీ కేంద్రం, యోగా కేంద్రం, లైబ్రరీతో సహా సౌకర్యాలను గవర్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణార్థులతో సంభా షించి వారి శిక్షణ, అందుబాటులో ఉన్న సౌకర్యా లు, వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పథకా లకు వారి ప్రాప్యత గురించి కూడా ఆయన వారిని అడిగారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల యొక్క అన్ని ప్రజానుకూల పథకాలను జాబితా చేసే బుక్లెట్ను సిద్ధం చేయాలని గవర్నర్ సూచించారు. వీటిని ట్రైనీలకు పంపిణీ చేయాలని తెలిపారు. పర్యటన సందర్భంగా మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రముఖ కార్యదర్శి శుభ శర్మ, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. -
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
జయపురం: సబ్డివిజన్ కుంధ్రలో కాంగ్రెస్ నేత తిరుపతి గురు స్మారక క్రికెట్ టోర్నమెంట్ను గురువారం సమితి అధ్యక్షురాలు పరమేశ్వరి పొరజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతి గురు జిల్లా పరిషత్ సభ్యునిగా ప్రజాలకు అనేక సేవలు అందించారని కొనియాడారు. ఆయన జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించటం ప్రశంసనీమన్నారు. క్రికెట్ కమిటీ ప్రతినిధి బుబులు పట్నాయక్ మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటున్నాయని, విజేత జట్టుకు రూ.30 వేలు, రన్నరప్కు రూ.20 వేలు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో సమితి వైస్ చైర్మన్ తరణీ సేన్ బిశాయి, కుంధ్ర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోకుల చంద్ర పట్నాయిక్, కార్యదర్శి ధైతేరీ మల్లిక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గురు, బ్లాక్ బీజేడీ అధ్యక్షుడు బృందావణ మల్లిక్, జిల్లా ప్రాథమిక ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు త్రినాథ్ హరిజన్, సమితి సభ్యులు దామోదర గోండ్, కమిటీ సభ్యులు సబుజ దాస్, నవీణ బిశాయి, అజయ ధను తదితరులు పాల్గొన్నారు. -
భువనేశ్వర్–అబుదాబి విమాన సేవలు ప్రారంభం
భువనేశ్వర్: యూఏఈ రాజధాని అబుదాబికి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి డైరెక్ట్ విమాన సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి గురువారం ప్రారంభించారు. భువనేశ్వర్ నుంచి అబుదాబికి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో ఇండిగో విమానం రాకపోకలు సాగిస్తుంది. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు ఇది 5వ విమాన సేవ కావడం విశేషం. చిరుత పులి పట్టివేత కొరాపుట్: నరమాంస భక్షక చిరుత పులిని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం నబరంగ్పూర్ జిల్లా సరిహద్దు రాయిఘర్ సమితికి కూతవేటు దూరంలో చత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా దుద్మా అటవీ ప్రాంతంలో పట్టుకున్నారు. 2024 నుంచి నేటి వరకు ఆరుగురు వ్యక్తులపై దాడి చేసింది. ఈ పులి వల్ల సరిహద్దు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 7వ తేదీ నుంచి అటవీ సిబ్బంది అనేక ప్రయాసలు పడి చిరుతని పట్టుకున్నారు. సుమారు 20 కెమెరాలు పలు చోట్ల అమర్చి ఈ నాలుగేళ్ల చిరుతని పట్టుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కాంకేర్ జిల్లా కేంద్రానికి తరలించారు. కొరాపుట్లో పలు రైళ్లకు అంతరాయం కొరాపుట్: కొరాపుట్ రైల్వే జంక్షన్లో శుక్రవారం నుంచి ఈ నెల 19 వరకు పలు రైళ్లకు హాల్టు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. జగదల్పూర్ నుంచి రౌర్కెలా, భువనేశ్వర్, హౌరా వెళ్లే ప్రయాణికులు కొరాపుట్ రైల్వేస్టేషన్కు రావద్దని సూచించారు. వీరు మనబార్, దమంజోడి స్టేషన్లకు చేరుకుని అక్కడి నుంచి ప్రయాణం సాగించాలన్నారు. కొరాపుట్–విశాఖపట్నం ఇంటర్ సిటీ, ప్యాసింజర్ రైళ్లు దమంజోడి వరకే నడుస్తాయని పేర్కొన్నారు. జగదల్పూర్–విశాఖపట్నం రైళ్ల రాకపోకలలో ఏ మార్పు లేదని, అవి కొరాపుట్ స్టేషన్లో ఆగుతాయని స్పష్టం చేశారు. కొరాపుట్–సుక్కు డబ్లింగ్ పనులు జరుగుతున్నందున రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుందని పేర్కొన్నారు. గృహ నిర్మాణ పథకంలో అవినీతి! మల్కన్గిరి: మల్కన్గిరి సమితి గౌడ్గూడ పంచాయతీ కలంగూడలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన నిధులను సమితి ఉపాధ్యక్షుడు నిరంజన్ హల్దార్ స్వాహా చేసి తమకు ఇళ్లు నిర్మించలేదని గ్రామస్తులు గురువారం ఆరోపించారు. ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రతి లబ్ధిదారుడి వద్ద రూ.40 వేలు తీసుకుని పని పూర్తి చేయలేదని, ఇప్పటికి ఆరు నెలలు గడిచినా దాటవేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై నిరంజన్ వద్ద ప్రస్తావించగా.. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మల్కన్గిరి కమ్యునిటీ వెల్ఫేర్ అధికారి మాట్లాడుతూ పంచాయతీరాజ్ అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. -
ఆదర్శ గ్రామాలుగా ప్రముఖుల జన్మ స్థలాలు : సీఎం
భువనేశ్వర్: రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో 21 మంది గొప్ప వ్యక్తుల విగ్రహాలను ప్రతిష్టించనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. విగ్రహాల ఆవిష్కరణ మాత్రమే కాదు, ఈ గొప్ప వ్యక్తుల జన్మస్థలాల్ని ఆదర్శ గ్రామాలుగా ఆవిష్కరిస్తామని ఆయన ప్రకటించారు. ఆయా గ్రామాల్లో స్మారక సంగ్రహాలయాలు, ఉపన్యాస కేంద్రాలు, పిల్లల పార్కులు, ఇతర అనుబంధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 నుంచి 150 గ్రామాల్లో పలువురు ప్రముఖులు జన్మించారు. అలాంటి ప్రముఖ వ్యక్తులు జన్మించిన గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. స్థానిక లోక్ సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్లో జాతీయ అవార్డు గ్రహీతలు, మేధావులు, స్వచ్ఛంద సేవకులతో జరిగిన ప్రతిస్పందన సదస్సులో ముఖ్యమంత్రి ఈ విషయం తెలిపారు. -
జాజ్పూర్ జిల్లాలో అతిసారం
● నలుగురు మృతి ● కలుషిత నీరు కారణం భువనేశ్వర్: జాజ్పూర్ జిల్లాలో అతిసారం వ్యాప్తి చెంది నలుగురి ప్రాణాలను బలిగొంది. మరో 300 మంది ఆస్పత్రి పాలయ్యారు. ప్రధాన జిల్లా వైద్య అధికారి (సీడీఎంఓ), ప్రకాష్ చంద్ర బాల్ మరణాలను ధ్రువీకరించారు. ధర్మశాల, వ్యాసనగర్, ధనొ గొడి, పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య సంక్షోభం నెలకొని ఉంది. కలుషితమైన నీరు, పారిశుద్ధ్య నిర్వహణ లోపం వల్ల ఈ వైపరీత్యం తాండవించిందని స్థానికులు ఆందోళన చెందుతున్నా రు. స్థానిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిర్వీర్యం అయిందనే ఆరోపణలు వ్యాపిస్తున్నాయి. వ్యాసనగర్లో 65 మందికి పైగా, జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రిలో 80 మంది పైబడి రోగులు చేరారు. 11 మంది పరిస్థితి విషమించడంతో కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీకి ఆస్పత్రికి తరలించారు. పలు ప్రాంతాల్లో స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కలుషిత నీరు కారణంగా అతిసార విజృంభించిందని స్పష్టమైంది. ప్రభావిత ప్రాంతాలలో కుళాయిల నుంచి బురద, దుర్వాసన వచ్చే నీరు సరఫరా అవుతుందని ఆరోపణలు ఉన్నాయి. జాజ్పూర్లో ప్రధానంగా సుకింద, ధర్మశాల, వ్యాసనగర్ ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీటి వనరులు కొరవడిన కారణంగా బావులు మరియు పైపులైన్లు వంటి శుద్ధి చేయని ప్రజలు వనరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నీరు తరచుగా మల కోలిఫామ్లు లేదా విబ్రియో కలరా వంటి వ్యాధికారకాలతో కలుషితం అవుతుంది. వేసవిలో నీటి ఎద్దడి ఈ పరిస్థితులకు మరింత ఆజ్యం పోసింది. సురక్షిత తాగు నీరు కొరతతో అందుబాటులో ఉన్న నీటి వినియోగానికి ప్రజలు అలవాటు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్లు, బావుల నీరు అపరిశుభ్రం కావడంతో ప్రాణాంతకంగా మారుతోంది. పరిస్థితి వికటించడంతో శుద్ధి చేసిన నీటి సరఫరా చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ఎస్ విభాగం కృషి చేస్తోంది. ప్రజలకు సురక్షిత తాగు నీరు సరఫరా చేయడంలో వ్యవస్థాగత నిర్వహణ సమస్యలు తొలగించనంత వరకు ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయట పడడం సాధ్యం కాదని స్థానికులు వాపోతున్నారు. పాడైన మామిడి పండ్లు, విందులు, వినోదాల్లో అపరిశుభ్రత నీటి వినియోగం కారణంగా అతిసార వ్యాప్తి చోటు చేసుకుందని జిల్లా ప్రధాన వైద్యాధికారి పేర్కొన్నారు. జిల్లా ఆహార భద్రతా విభాగం ఆహార కాలుష్యాన్ని పరిష్కరించడానికి చర్యలను అమలు చేస్తోంది. -
శ్రీ అనంత నారాయణుడి చిత్రపట దర్శనం
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరంలో చిత్ర పటాల దర్శనం గురువారం నుంచి ప్రారంభమైంది. జ్యేష్ట పూర్ణిమ నాడు మహా జలాభిషేకంతో శ్రీ జగన్నాథుడు అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స, వైద్యం కోసం తెరమరుగయ్యాడు. శ్రీ మందిరం రత్న వేదిక బోసిబోయింది. శ్రీ మందిరానికి విచ్చేసే భక్తులు, యాత్రికులకు ఈ ప్రాంగణంలో చిత్ర పటాల దర్శనం లభిస్తుంది. బలభద్ర స్వామి, దేవీ సుభద్ర మరియు శ్రీ జగన్నాథుని ప్రతీకగా 3 చిత్రపటాలు ఏర్పాటు చేశారు. పవిత్ర స్నాన పూర్ణిమ మర్నాటి నుంచి నవ యవ్వన అలంకరణ ముందు రోజు వరకు శ్రీ మందిరంలో నిరవధికంగా చిత్రపటాల దర్శనం కొనసాగుతుంది. తిరిగి స్వామి ఆరోగ్యంతో కోలుకుని యాత్రకు సిద్ధం అయ్యేంత వరకు తెర చాటున గోప్య సేవలు పొందుతాడు. పక్షం రోజులపాటు గోప్య సేవలు కొనసాగుతాయి. వాటితో కోలుకున్న స్వామి నవ యవ్వన అలంకారంతో చీకటి మండపం నుంచి వెలుపలకు ప్రత్యక్షమై భక్తులకు దర్శనం ఇచ్చేంత వరకు శ్రీ అనంత నారాయణుడి చిత్రపటం శ్రీ జగన్నాథుని ప్రతీకాత్మకంగా పూజలందుకుని భక్తులకు దర్శనం ఇస్తాడు. బలభద్ర స్వామి ప్రతీకగా వాసుదేవుడు, దేవీ సుభద్ర ప్రతీకాత్మకంగా భువనేశ్వరి చిత్ర పటాలు దర్శనం ఇస్తాయి. -
మాట నిలబెట్టుకున్నాం: సీఎం
● రాష్ట్రంలో బీజేపీ పాలన ఏడాది పూర్తి ● వికాస వాహనం ప్రచార కార్యక్రమానికి శ్రీకారం భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం తొలి వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వికాస వాహనం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వాహనం రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తుంది. మరో వైపు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరని ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అందించడంలో ఇది బలమైన పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. వాగ్దానాలు వాస్తవ కార్యాచరణ ఏడాది కిందట ఇదే రోజున జగన్నాథుని దయ, రాష్ట్ర ప్రజల నమ్మకం, మద్దతుతో రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ఇలా కొనసాగింది. ‘గొప్ప ఒడిశా రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాను. ప్రజలకు సేవ చేయడమే నా ఏకై క లక్ష్యం, ఉద్దేశం. కళాశాలలో చదువుతున్నప్పుడు నేను జాతీయ సేవ, ప్రజా సేవ యొక్క స్ఫూర్తిని నింపుకుని స్వచ్ఛంద సేవకుడిగా, ఉపాధ్యాయుడిగా, సర్పంచ్గా, ఎమ్మెల్యేగా, నేడు ముఖ్యమంత్రిగా ప్రజలు సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం పోరాడాను, పోరాడుతున్నాను. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో మేము అనేక విజయాలు సాధించాము. కానీ అట్టడుగు స్థాయిలో పనిచేసే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన పిల్లవాడు కూడా ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడనే ఆశ మాకు అతిపెద్ద విజయం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని మొట్టమొదట చెప్పాను. అందుకే నేను ఎల్లప్పుడూ మీ వద్దకు చేరి, అట్టడుగు స్థాయిలో మీ సమస్యలను అర్థం చేసుకుని, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. బాధ్యతలు స్వీకరించిన తర్వాత, తొలి మంత్రి మండలి సమావేశంలో 4 ప్రధాన వాగ్దానాలను నెరవేర్చాలని మేము నిర్ణయించుకున్నాము. ఆ నిర్ణయం ప్రకారం ముందుగా మహా ప్రభువు శ్రీ జగన్నాథుడు కొలువై ఉన్న శ్రీమందిరం 4 ద్వారాలను తెరిచాము. అలాగే ఆలయ అభివృద్ధి కోసం రూ. 500 కోట్ల కార్పస్ నిధిని సృష్టించాము. సుభద్ర యోజనను ప్రారంభించి కేవలం ఒక సంవత్సరంలో 1 కోటి పైబడి మహిళలకు సాధికారత సాధ్యం చేయగలిగాం. ఆహార దాతలకు రూ. 800 అదనపు సహాయంతో వరి కొనుగోలు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ. 3,100 అందుతోంది. ఏడాది పాలనలో 21 వాగ్దానాలలో 11 నెరవేర్చాము. నేడు ఒడిశా వాస్తవ అభివృద్ధి వైపు పయనిస్తోంది.ఈ ఒక్క సంవత్సరంలోనే సామాన్యులకు, ప్రభుత్వానికి మధ్య కృత్రిమ అడ్డంకిని తొలగించాం. నేడు, ఏ వ్యక్తి అయినా ముఖ్యమంత్రిని, మంత్రులను ఎలాంటి అడ్డంకులు లేకుండా కలవవచ్చు. ఈ సమయంలో, ప్రభుత్వం వివిధ రంగాలలో అద్భుతమైన విజయాల్ని సాధించి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వాస్తవంగా అమలు చేయడం విశేషం’ అని అన్నారు. ‘మేము చెప్పినది చేశాం. కొత్త ఉపాధి కల్పన, అంత్యోదయ గృహ యోజన కింద నిరాశ్రయులకు పక్కా ఇళ్లు, తునికాకు తుంచే కార్మికులకు సహాయం, ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా ఆరోగ్య సంరక్షణ, గిరిజన విద్యార్థులకు ఆర్థిక సహాయం, కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ) అమలు, రోడ్డు, రైలు, విమానయాన పథకాల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మొదలైనవి అభివృద్ధి చెందిన ఒడిశాకు పునాది వేస్తున్నాయి’ అని తెలిపారు. -
రూ.లక్షల విలువైన సామగ్రి చోరీ
జయపురం: జయపురం సునారి వీధిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆఫీసులో, గొదాంలో లక్షల రూపాయల విలువైన సామానులు చోరీకి గురైనట్లు హెచ్ఎం కె.సునీత పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాఠశాల గొదాంలో గల 50 కేజీల 24 బియ్యం బస్తాలు, 8 ఫ్యాన్లు, పుస్తకాలు ఉంచే ఇనుప అలమారా, వాటర్ మోటారు పైపు, మధ్యాహ్న భోజన వంట సామగ్రి, టీవీ, బెండింగ్ మిషన్, బియ్యం తూచే మిషన్, పిల్లలు ఆడుకొనే క్రీడా సామగ్రితోపాటు కొన్ని లక్షలు విలువ చేసే సామగ్రీ చోరికి గురైననట్లు ఆమె బుధవారం సాయంత్రం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం పాఠశాలకు వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీలు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వేసవి సెలవుల కారణంగా పాఠశాల మూసి ఉంచారు. అన్ని గదులతోపాటు పాఠశాల తలుపులకు తాళాలు వేశారు. ఈ నెల 18వ తేదీన పాఠశాల తెరవాల్సి ఉండగా.. ముందుగా పాఠశాల పరిశుభ్ర పరిచేందుకు పాఠశాలలో ఉన్న సామగ్రి, వస్తువులు పరిశీలించేందుకు హెచ్ఎంతోపాటు ఉపాద్యాయులు పాఠశాలకు వచ్చారు. పాఠశాల బయట గేటు తాళాలు వేసి ఉన్నాయి. గేటు తెరచి లోపలకు వెళ్లిన వారికి పాఠశాల ఆఫీస్ తలుపు తాళాలు విరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లిన వారికి బీరువా తెరిచి ఉండటం కనిపించింది. సామానులు చిందరవందరగా పడి ఉన్నాయి. పిల్లల పుస్తకాలు ఉంచే 2 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు గల ఇనుప అలమారా కనిపించ లేదు. బియ్యం నిల్వ ఉంచే మరో గది తాళాలు బయట పడి ఉన్నాయి. ఆ గది గోడ కొంత భాగం పడగొట్టి టిన్ రూఫ్ను తొలగించి 50 కేజీల బరువుగల 24 బియ్యం బస్తాలను దొంగిలించుకుపోయారు. పాఠశాలలో దొంగతనంగా బియ్యం బస్తాలను దొంగిలించుకుపోతుండటం బియ్యం గది పక్కన కూర్చొని మద్యం సేవిస్తున్న వారు చూచినట్లు వెల్లడైంది. పాఠశాలలో దొంగతనం జరిగిన సమాచారం అందిన జయపురం బ్లాక్ విద్యాధికారి చందన నాయక్ పరిస్థితిని తెలుసుకోవాలని సి.ఆర్.సి.ఎస్ విజయ లక్ష్మీ పాణిగ్రహిణి పంపారు. ఆమె పాఠశాలకు వచ్చి ప్రధాన ఉపాద్యాయురాలితోపాటు ఉపాద్యాయులందరితో చర్చించించారు. ఆ చర్చల్లో జయపురం సమితి ఉపాద్యాయ సంఘం సంఘ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ దాస్, వంట సిబ్బంది పాల్గొన్నారు. జయపురంలో ఇటీవల పాఠశాలల్లో దొంగతనాలు జరుగుతున్నాయని, కొద్ది రోజుల కిందట జయపురం జయనగర్ ఉన్నత పాఠశాలలో జరిగిన దొంగతనాన్ని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. 72 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన సునారి వీధి పాఠశాలలో దొంగతనం జరగటం ఇదే మొదటిసారి అని అంటున్నారు. పోలీసులు దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
చీకటి గదిలో జగన్నాథుడు
పర్లాకిమిడి: శ్రీజగన్నాధ స్వామికి దేవస్నానం జరిగిన అనంతరం గత రాత్రి చీకటి గదిలో స్వామివారిని ఉంచారు. దీంతో పురుషోత్తముడు పద్నాలుగు రోజులు ఉండి ఉక్కపోతకు గురౌతారు. లోయలో పడిన అంబులెన్స్ రాయగడ: జిల్లాల్లోని కెందుగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొయిబొందొ మలుపు వద్ద అంబులెన్స్ అదుపుతప్పి 30 అడుగుల లోతున ఉన్న లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అంబులెన్స్ సిబ్బందికి గాయాలయ్యాయి. బుధవారం రాత్రి అంబులెన్స్లో రోగిని బరంపురం తరలించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో గాయపడిన ఫార్మాసిస్ట్, డ్రైవర్, హెల్పర్ను అటువైపుగా వస్తున్న మరో అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. రాయగడ జిల్లా కేంద్ర ఆస్పత్రికి చెందిన అంబులెన్స్గా సమాచారం. పశువుల తరలింపు అడ్డగింత నరసన్నపేట: జాతీయ రహదారిపై అక్రమంగా గేదెలను తరలిస్తుండగా నరసన్నపేట పోలీసులు అడ్డుకున్నారు. బరంపురం నుంచి రాజమండ్రికి బొలెరే వ్యాన్లో ఐదు గేదెలను తరలిస్తుండగా మడపాం టోల్గేట్ వద్ద తనిఖీలు చేస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించా రు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో వాహనాన్ని సీజ్ చేశారు. గేదెలను అలమండ గోశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. నీలమణి దుర్గ హుండీ ఆదాయం రూ.4.95 లక్షలు పాతపట్నం: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి హుండీ కానుకల ద్వారా రూ.4,95,520 ఆదాయం లభించింద ని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు తెలిపారు. 30 రోజులకు ఈ ఆదాయం వచ్చిందన్నారు. ఆలయ హుండీని గురువారం లెక్కించామని, టెక్కలి గ్రూపు దేవాలయాలు కార్యనిర్వహణా ధికారి టి.పి.మనస్వి పర్యవేక్షించారన్నారు. కా ర్యక్రమంలో సుదర్శన్, శ్రీ వెంకటేశ్వరస్వామి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. తప్పిన ప్రమాదం కొత్తూరు: కొత్తూరులోని పాలకొండ రోడ్డులో త్రినాథ స్వామి ఆలయం వద్ద ఏర్పడిన భారీ గోతిలో గురువారం ఓ ఆటో దిగబడింది. వర్షం కారణంగా గోతుల్లో నీరు చేరడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పడిపోయిన సమయంలో ఆటో వెనుక ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ముగ్గురు తహశీల్దార్లకు బదిలీ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ముగ్గురు తహశీల్దార్లకు బదిలీ చేస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరే ట్ జి–సెక్షన్ సూపరింటెండెంట్ జి.ఎల్.శ్రీనివాస్ ను లావేరు తహశీల్దార్గా నియమించారు. పాతప ట్నం తహశీల్దార్ సనపల కిరణ్కుమార్ రణస్థలం మండలం బదిలీ అయ్యారు. రణస్థలం తహశీల్దార్ గా పనిచేసినఎం.ప్రసాదరావును పాతపట్నం తహశీల్దార్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు ఆలయాల్లో చోరీ శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కనుగులవానిపేట గ్రామంలో గల పొదిలాపు అమ్మవారి గుడితో పాటు పక్కనే గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత దొంగతనం జరిగింది. గురువారం ఉదయం ఆలయానికి వెళ్లిన పురోహితుడు తలుపులు బార్లా తెరిచి ఉండడడంతో గ్రామస్తులకు విషయం చేరవేశారు. వారు వెంటనే శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనంలో రూ.2వేలు నగదుతో పాటు ఇతరత్రా వస్తువులు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామస్తులురాలు కనుగుల అశ్విని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెగా ఉద్యోగ మేళాలో 263 మంది ఎంపిక
కాశీబుగ్గ: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ సూర్యతేజ జూనియర్ కళాశాల ఆవరణలో గురువారం మెగా జాబ్మేళా నిర్వహించారు. 763 మంది హాజరుకాగా అందులో 263 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి మాట్లాడుతూ జాబ్ మేళాకి హాజరైన ప్రతి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ పద్మాజీ కామేశ్వరరావు మాట్లాడుతూ యువతలో ఉండాల్సిన నైపుణ్యాల ప్రాముఖ్యత గురించి వివరించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ మాట్లాడు తూ ఏ రంగంలో ఉద్యోగ అవకాశం వచ్చినా సరే దూరంతో సంబంధం లేకుండా అభ్యర్థులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
కాటేసే కాలం
● ఖరీఫ్లో విషసర్పాలతో జాగ్రత్త ● వానాకాలంలో పాముల సంచారం ఎక్కువ హిరమండలం: పొలం పనులు మొదలైపోయాయి. వానలు పడుతుండడంతో రైతులకు పొలాలకు వెళ్తున్నారు. అయితే ఈ కాలంలో రైతులు పాముకాటుకు గురవుతుంటారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఈ నెల నుంచి దాదాపు నవంబర్ వరకు పాములు, ఇతర విష కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటించాలి ●పొలాల గట్లమీద వెళ్లేటప్పుడు కర్రచప్పుడు చేస్తూ నడవడం మంచిది. ●రాత్రిపూట పొలాలకు నీరు కట్టడానికి వెళ్లినప్పుడు టార్చిలైట్ తీసుకుని వెళ్లాలి. ●ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచాలి. ●పాము కాటు కంటే చాలామంది షాక్తోనే ప్రాణం మీదకు తెచ్చుకుంటారు. ●ఇంట్లో వారు ధైర్యం చెప్పాలి. ●పాముకాటు వేయగానే కొందరు ఆ గాయాన్ని మరింతగా కోస్తే రక్తం తో పాటు విషం వచ్చేస్తుందని కత్తితో, బ్లేడుతో గాటు పెడతారు అలా చేయకూడదు. ఒక్కోసారి పాము కాటుకన్నా ఈ ఆగాయం ప్రమాద కరంగా మారవచ్చు. పాముకాటు లక్షణాలు ●పాము కాటు వేసిన ప్రదేశంలో రెండు కోరల గాయం స్పష్టంగా కనిపించి నొప్పి తీవ్రంగా ఉంటుంది. ●నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. ●పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్టు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు అనిపిస్తాయి. ●కళ్లు మగతగా శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు పాములు విషప్రభావం కట్ల పాము: ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణా ల్లో కలుస్తుంది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. నాగుపాము: ఇది కాటేసిన 15 నిమిషాల్లో శరీరంలోకి విషం ఎక్కుతుంది. రక్తపింజర : ఇది కాటేసిన రెండు గంటల తర్వాత విషం శరీరంలోకి ఎక్కుతుంది. జెర్రిపోతు, నీరుకట్ట: ఇది కాటేసినా విషం ఉండదు. కానీ చికిత్స తీసుకోవడం అవసరం. అందుబాటులో వ్యాక్సిన్ పాముకాటు బారిన పడిన వారికి పీహెచ్సీల్లో చికిత్స అందుబాటులో ఉంటుంది. వారికి కావాల్సిన యాంటీస్నేక్వీనం ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. పాటుకాటుకు గురైన వ్యక్తి ఆందోళన, భయం చెంద కుండా నిర్భయంగా ఉండాలి. గాయంపై భాగాన్ని వస్త్రంతో గట్టిగా లాగి కట్టి ఉంచాలి. వెంటనే ప్రథమ చికిత్స చేసి గాయాన్ని బట్టి రెండు సార్లు స్నేక్వీనం డోస్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. పాము కరిచిన వెంటనే ఏదైనావాహనంలో ఆరోగ్య కేంద్రానికి చేర్చాలి. నడిపించకూడదు. – ఫారుక్ హుస్సేన్, వైద్యాధికారి, పీహెచ్సీ, హిరమండలం -
ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
మెళియాపుట్టి: రేగులపాడు ఆఫ్షోర్కు గ్రామాన్ని ఇచ్చిన చీపురుపల్లి నిర్వాసితులలకు న్యాయం జరగాలంటే ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆఫ్షోర్ నిర్వాసితులు చేపట్టిన నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరుకోవడంతో గురువారం చీపురుపల్లిలోని దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడు తూ హిరమండలం నిర్వాసితులకు ఇచ్చిన 460 జీఓ ప్రాప్తికి పూర్తిస్థాయి ప్యాకేజీలు ఇవ్వాలని కోరా రు. వలస కూలీలుగా పలు ప్రాంతాలకు వెళ్లిన 132 మంది నిర్వాసితులకు ప్యాకేజీలు లేవని అన్నారు. డీ పట్టా భూములకు సొమ్ములు చెల్లించాలని అన్నా రు. చెల్లింపుల్లో తేడాలు ఉన్నాయని వాటిని సవరించి ఇళ్లకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నిర్వాసితులందరూ ఏకతాటిపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరరావు, కొక్కిరి కిర ణ్, ఉమాశంకర్, వెంకటరమణ పాల్గొన్నారు. -
శ్రీమందిర్లో దీపకాంతులకు సన్నాహాలు
భువనేశ్వర్: పూరీ మందిరం దీపాలంకరణతో కొత్త రూపు దాల్చనుంది. శ్రీ మందిరం, ప్రధాన దేవస్థానం సముదాయంలో పార్శ్వ ఆలయాలు కొత్త కాంతులతో సిద్ధం కానున్నాయి. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) సహాయంతో ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయమై శ్రీమందిరం కార్యాలయంలో ప్రధాన పాలకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద కుమార్ పాడీ అధ్యక్షతన గురువారం ముఖ్యమైన సమావేశం జరిగింది. శ్రీమందిరం సీనియర్ ఇంజినీర్లు, ఏఎస్ఐ పూరీ సర్కిల్ అధికారులు, ఢిల్లీలోని ఏఎస్ఐ గుర్తింపు పొందిన సంప్రదింపుల సంస్థ ప్రతినిధి శిల్పి భరద్వాజ్ హాజరయ్యారు. వివిధ వారసత్వ ప్రాజెక్టుల కోసం చేసిన విద్యుద్దీప అలంకరణ పనులకు సంబంధించి సంబంధిత సంస్థలు వివరాల్ని ప్రదర్శించాయి. ప్రతిపాదిత దీపకాంతుల కోసం శ్రీమందిరం పాలకవర్గం కొన్ని నిర్ధిష్ట సూచనలను జారీ చేసింది. భారత పురావస్తు శాఖ సాంకేతిక సలహా, మార్గదర్శకత్వంతో వివరణాత్మక నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తోంది. పాలక మండలి ఆమోదం కోసం సకాలంలో నివేదిక దాఖలు చేయాలని సమావేశంలో చర్చించారు. తదనంతరం అవసరమైన అనుమతులు పొందిన తర్వాత ఆలయ సముదాయం విద్యద్దీప కాంతుల పనుల కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని నిర్ణయించారు. ఏఎస్ఐ ఆధ్వర్యంలో డీపీఆర్ రూపకల్పన -
ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన
కొరాపుట్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాజధాని భువనేశ్వర్లో జరిగిన ఆందోళనలో కొరాపుట్ జిల్లాల నేతలు కీలక భూమిక వహించారు. గురువారం ప్రతి పక్ష బీజేడి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అధికారంలోనికి వచ్చి ఏడాది పూర్తయినా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నరాష్ట్ర బీజేడి ఉపాధ్యక్షుడు రబినారాయణ నందో, రాష్ట్ర సాధారణ కార్యదర్శులు రమేష్ మజ్జి, ప్రదిప్ మజ్జి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మజ్జి, కౌసల్య హిక్కా తదితరులు అరెస్టయ్యారు. -
ఆదిత్యాలయ ఈఓ బాధ్యతల స్వీకరణ
అరసవల్లి: రాష్ట్ర దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయాలకు కొత్తగా ఆస్తులను సమకూర్చేలా చర్యలు చేపడతామని, తద్వారా ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని ఆలయ ఈఓ కేశవమఠం నాగవెంకట దుర్గా వరప్రసాద్ స్పష్టం చేశారు. అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వా మి ఆలయానికి కొత్త ఈఓ (డిప్యూటీ కమిషనర్)గా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కుటుంబసమేతంగా ఆదిత్యుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశ ర్మ ఆలయ సిబ్బంది కలిసి గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించా రు. అనంతరం కొత్త ఈఓ ప్రసాద్ మాట్లాడుతూ ఆలయాలకు సమీ పంలో అభివృద్ధికి ఆస్కారమున్న పరిసర ప్రాంతాలను రెవెన్యూ దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి, ఆలయ ఆస్తులను పెంచేలా చర్యలు చేపడతామన్నా రు. అరసవల్లి ఆలయానికి కూడా పరిసర ప్రాంతాల్లో భూముల కొనుగోలు అంశం పెండింగ్లో ఉన్నట్లు గా సమాచారం ఉందని, దీన్ని త్వరితగతిన పూర్తి చేయించి తద్వారా ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రకటించారు. భక్తులకు కూడా ఆలయ పరిసరాల్లో ఎక్కడైనా అసౌకర్యం కలిగితే నే రుగా తనను సంప్రదించవచ్చునని స్పష్టం చేశారు. -
బంద్ ప్రశాంతం
కొరాపుట్: రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించాలనే డిమాండ్తో జరిగిన రాయిఘర్ బంద్ ప్రశాంతంగా జరిగింది. గురువారం నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితిలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరవదిక బంద్ జరిగింది. ఈ సమితిలో 344 మంది రైతులు 14 వేల క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వానికి విక్రయించారు. వారికి రు.4.4 కోట్లు అకౌంట్లలో పడాల్సి ఉంది. సుమారు 3 నెలలు కావస్తున్నప్పటికీ వారికి ఒక్క రూపాయి కూడా అందలేదు. ఈ కుంభకోణంపై ప్రతిపక్ష బీజేడీ చాలా కాలంగా ఆందోళనలు చేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేడీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రబినారాయణ నందో, పార్టీ రాష్ట్ర సాధారణ కార్యదర్శులైన మాజీ ఎంపీలు రమేష్ చంద్ర మజ్జి, ప్రదిప్ మజ్జి బుధవారం రాత్రి ఆకస్మిక బంద్కు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నుంచి సరిహద్దు ఛత్తిస్గఢ్ రాష్ట్రం నుంచి రాకపోకలు నిలిపి వేశారు. బీజేడీ మాజీ ఎమ్మెల్యే సుభాష్ గోండో, తదితరులు రాయిఘర్ మెయిన్ రోడ్డులో ధర్నా చేశారు. వర్తక, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరవలేదు. -
గణనాథుని అవతారంలో జగన్నాథుడు దర్శనం
రాయగడ: ఈ నెల 27వతేదీన జరగనున్న రథాయాత్రలో భాగంగా బుధవారం జగన్నాథ, బలభద్ర, శుభద్ర దేవతామూర్తులకు దేవస్నాన కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. దేవతా మూర్తులను మందిరం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. దేవస్నానం అనంతరం దేవతామూర్తులైన జగన్నాథ, బలభద్రులకు గణనాథుని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చే సౌభాగ్యాన్ని కల్పించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తహసీల్దార్ ప్రియదర్శిన స్వయి, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో ఈనెల ఆరో తేదీ నుంచి జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. సుప్రభాత సేవ చూర్ణోత్సవం, వసంతోత్సవం, శ్రీవారి అష్టోత్తర శతనామావళి, 108 కలశాలతో జలాభిషేకం, చక్రతీర్థం, శాత్తుములై, హోమాల కార్యక్రమాలతో పాటు సాయంత్రం మహాపూర్ణహుతి, గరుడ ధ్వజ అవరోహణం, బలిహరణ, పుష్పాంజలి, శ్రీపుష్పయాగం, నీరాజన మంత్రపుష్పములు తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆద్వర్యంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నదిలో మునిగి వృద్ధురాలు మృతి మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ–79 గ్రామం పోలీసు స్టేషన్ పరిధిలోని గినిపల్లి గ్రామానికి చెందిన రామా కారమ్ తల్లి లీలా కారామ్ (66) మంగళవారం సాయంత్రం శభరి నదిలో స్నానానికి దిగి కాలుజారి పడిపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయింది. చీకటి పడినప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామాలో వెతికితప్పటికీ ఆచూకీ దొరకలేదు. బుధవారం ఉదయం స్థానికులు నది వద్దకు వెళ్లగా. నీటిలో లీలా కారామ్ శవమై తేలియాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహన్ని బయటకు తీసి కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గుట్కా తయారీ సామగ్రి స్వాధీనం రాయగడ: నిషేధిత గుట్కా తయారీ సామగ్రిని స్థానిక జీఎస్టి విభాగం కమిషనర్ నిహారిక జంకార్ స్వాధీనం చేసుకున్నారు. బరంపురం నుంచి కొరాపుట్ వైపు వెళ్తున్న పికప్ వ్యాన్ను జేకేపూర్ సమీపంలోని నాగావళి నదీ వద్ద జీఎస్టీ అధికారులు ఆపి తనిఖీ చేశారు. అందులో గుట్కా తయారీకి వినియోగించే 30 బస్తాల పనొమాధురి, జర్ధా వంటి వస్తువులు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు పది లక్షల రుపాయలు ఉంటుందని జీఎస్టీ కమిషనర్ మాధురి అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన దాడుల్లో రూ.4.50 కోట్లను జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.91 లక్షల జరిమానా విధించినట్లు సమకూరిందని వివరించారు. -
గణపతి స్వరూపుడిగా జగన్నాథుడు
భువనేశ్వర్: స్నాన యాత్ర కోసం విచ్చేసిన భక్తులు, యాత్రికులకు జగన్నాథుడు మహా గణపతి స్వరూపంలో దర్శన భాగ్యం కల్పించాడు. ఏటా జ్యేష్ట పూర్ణిమ సందర్భంగా మహా స్నానం అనంతరం నిత్యం శ్రీ మందిరం రత్న వేదికపై దర్శనం ఇచ్చే మూల విరాటులు గజానన అలంకరణలో శోభిల్లుతారు. స్థానిక రాఘవ దాసు మఠం క్రమంతప్పకుండా గజానన అలంకరణ సామగ్రి, సరంజామా ఏర్పాటు చేస్తుంది. స్నానోత్సవంలో ఈ దర్శనం అంతిమ ఘట్టం. ఐటీడీఏ సమావేశంలో ఆగ్రహావేశాలు కొరాపుట్: జిల్లాలో ఆశ్రమ పాఠశాలల పనితీరుపై బుధవారం నిర్వహించిన ఐటీడీఏ సమావేశంలో ప్రజా ప్రతినిధులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని డీఎన్కే సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాల్లో సమస్యలు తిష్ట వేశాయని, అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోతుందన్నారు. సీఎల్పీ నాయకుడు రాంచంద్ర ఖడం మాట్లాడుతూ కోట్లాది రూపాయలు ఖర్చులు చేస్తున్నా గిరిజన గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. సమావేశంలో కొరాపుట్ జిల్లా కలెక్టర్ వీ.కీర్తివాసన్, ఎమ్మెల్యే రఘురాం మచ్చో తదితరులు పాల్గొన్నారు. బొరిగుమ్మ విద్యార్థినికి 11వ ర్యాంక్ జయపురం: + 2 కామర్స్ 2025 పరీక్షలో బొరిగుమ్మ రోయల్ హయ్యర్ సెకెండరీ స్కూల్ విద్యార్థిని కె.వినీత రాష్ట్ర టాపర్లలో 11వ స్థానం సాధించింది. విద్యార్థిని 93.33 శాతం మార్కులు సాధించింది. రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంక్గా నిలిచినందుకు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, బంధువు, స్నేహితులు అభినందనలు తెలిపారు. -
క్రికెట్ అకాడమీ పేరిట రూ. 35 లక్షలు స్వాహా
జయపురం: fĶæ$-ç³#Æý‡… Ñ{MýSÐ]l$ {MîSyé OÐðl$§é-¯]l…ÌZ MìSPMðSsŒæ AM>-yýlÒ$ õ³Æý‡$™ø Æý‡* 35 ÌS„ýSË$ hÌêÏ {MîSyé çÜ…çœ$… ÝëÓà ^ólíÜ…§ýl° Ð]l*i {MîSyéM>-Æý‡$yýl$ VúÆý‡Ð]l çßæ™èl¢ BÆø-í³…-^éÆý‡$. Ð]l$…VýS-âýæÐéÆý‡… ÝëĶæ$…{™èl… Ò$yìlĶæ$ {糆-°«§ýl$-ÌS™ø BĶæ$¯]l Ð]l*sêÏ-yéÆý‡$. çÜ…çœ$… ^èlrt ÑÆý‡$§ýl®…V> °Æý‡Ó-íßæ…-^èl-º-yýl$-™èl$¯]l²-§ýl-°, HâýæÏ ™èlÆý‡-ºyìl C§ýlªÆý‡$, ¯]lË$-VýS$Æý‡$ MýS»êjÌZ {MîSyé çÜ…çœ$… ¯]lyýl$-Ýù¢…§ýl° B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. çÜ…çœ$ O»ñæÌê-¯ŒS¯]l$ A¯]l$çÜ-Ç…_ G°²MýSË$ °Æý‡Ó-íßæ…-^èl-r… Ìôæ§ýl-¯é²Æý‡$. E¯]l²™èl ¯éÅĶæ$ Ý릯]l… B§ól-Õ…-_¯é ç³sìæt…-^èl$-Mø-Ð]lyýl… Ìôæ§ýl-¯é²Æý‡$. {MîSyé AM>-yýlÒ$ HÆ>µr$ õ³Æý‡$™ø 35 ÌS„ýSË$ ÝëÓà ^ólÔ>Æý‡° BÆøí³…^éÆý‡$. C¯ŒSòܵ-MýStÆŠ‡ f¯]lÆý‡ÌŒæ B‹œ Çh-[-õÜt-çÙ¯ŒS O»ñæÌê¯]l$ ç³MýSP-MýS$-ò³sìæt, ¯]lMìSÎ O»ñæÌê¯]l$ AÐ]l$Ë$ ^ólçÜ$¢¯é²Æý‡° BÆø-í³…^éÆý‡$. VýS™èl 35 Hâ¶æ$ÏV> çÜ…çœ$… Mö¨ª Ð]l$…¨ Ð]lÅMýS$¢ÌS ^ól†ÌZÏMìS ÐðlãÏ´ù-Ƈ$$…-§ýl°.. A…§ýl$MóS G°²-MýSË$ °Æý‡Ó-íßæ…-^èlyýl… Ìôæ§ýl-¯é²Æý‡$. 2022 AMøt-ºÆŠ‡ Hyø ™ól©¯]l B¯ésìæ hÌêÏ MýSÌñæ-MýStÆŠ‡ Aº§ýl*ÌŒæ AMýS¢ÆŠ‡ hÌêÏ {MîSyé çÜ…çœ*°² Æý‡§ýl$ª ^ólÔ>Æý‡° VýS$Æý‡$¢ ^ólÔ>Æý‡$. JMýS f¯]l-ÝëÓÆý‡® MóSçÜ$ÌZ 2024 yìlòÜ…-º-ÆŠ‡ÌZ E¯]l²™èl ¯éÅĶæ$ Ý릯]l… ¯éË$VýS$ ÐéÆ>-ÌSÌZ çÜ…çœ$ G°²-MýSË$ fÆý‡-´ëÌS° B§ól-Õ…-_…§ýl° ^ðl´ëµÆý‡$. çÜ…çœ$… G°²-MýSË$ fÆý‡$VýS MýS$…yé¯ól JyìlÔ> {MìSMðSsŒæ AÝùíÜ-Äôæ$çÙ¯ŒS G°²MýS-ÌSÌZ çÜ…çœ$ {糆-°-«§ýl$-Ë$V> Kr$ ÐólÔ>Æý‡° BÆø-í³…-^éÆý‡$. Ò$yìlĶæ$ çÜÐ]l*-Ðól-Ôèæ…ÌZ çÜÐ]l*f õÜÐ]l-MýS$yýl$ MýS–çÙ~ MóSÔèæÐ]l Ú÷yýl…W ´ëÌŸY¯é²-Æý‡$. M>V>ీ çÜ…çœ$…Oò³ VúÆý‡Ð]l çßæŸ™èl¢ ^ólíܯ]l BÆø-ç³-׿ÌS¯]l$ {MîSyé çÜ…çœ$ E´ë-«§ýlÅ-„ýS$Ë$ A¯]l*‹³ MýS$Ð]l*ÆŠ‡ ´ë{™ø, fĶæ$-ç³#Æý‡… çÜ»Œæ-yìl-Ñ-f¯ŒS {MîSyé çÜ…çœ$ M>Æý‡Å-§ýlÇØ Æý‡¼ ¯éƇ$$-MŠSË$ ¡{Ð]l…V> Q…yìl…^éÆý‡$. VúÆý‡Ð]l Ð]lÅMýS$¢-ÌSOò³ BÆø-ç³-׿Ë$ ^ólçÜ*¢ ™èl¯]l¯]l$ ç³Ç-^èlĶæ$… ^ólçÜ$-Mö-¯ól…-§ýl$MýS$ VúÆý‡ÐŒæ {ç³Ä¶æ$™èl²… ^ólçÜ$¢-¯é²-Æý‡-¯é²Æý‡$. మాజీ క్రీడాకారుడు గౌరవ హత్త ఆరోపణ -
స్నానోత్సవం.. పులకించిన భక్తజనం
భువనేశ్వర్: పూరీ జగన్నాథ దేవస్థానంలో స్నాన పూర్ణిమ పురస్కరించుకుని నిర్వహించే స్నానోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. సోదర సోదరి సమేతంగా జగన్నాథుడు స్నాన మండపంపై బహిరంగంగా భక్తజనం సమక్షంలో మహాభిషేకం ఆచరించడం ఈ ఉత్సవం విశిష్టత. ఈ వేడుక ప్రత్యక్షంగా తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. బుధవారం తెల్లవారుజాము నుంచి మంగళహారతి మొదలుకొని ఒకొకాసొ, బింబ స్నానం వంటి దైనందిన ఆచారాల తరువాత రత్న వేదిక నుంచి మూల విరాటులను వరుస క్రమంలో (గొట్టి పొహొండి) స్నాన మండపానికి తరలించారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధమైన వాద్యనాదంతో శ్రీ మందిరం పరిసరాలు మారుమోగాయి. చందనం, కర్పూరం, కుంకుమ, మూలిక తైలాలు, సహజ పరిమళ ద్రవ్యాలతో ఇతరేతర సుగంధ పుష్పాది ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో నిండిన 108 కలశాల జలంతో చతుర్థా మూర్తులకు అభిషేకించారు. మూల విరాటుల పవిత్ర స్నానం పూర్తి కావడంతో పూరీ గజపతి మహారాజా దివ్యసింఘ దేబ్ పల్లకీలో స్నాన మండపానికి చేరి స్నాన మండపం శుద్ధి ఛెరా పొంహరా ఆచారాన్ని నిర్వహించారు. మూల విరాటులకు మంగళ హారతులు సమర్పించి పూజించారు. -
అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ–9 గ్రామంలో అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. ఎంవీ–79 గ్రామ క్రీడా మైదానంలో భారత్ జట్టు మాజీ మేనేజర్ సత్బీర్ సింగ్ పోటీలను ప్రారంభించారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 16 జట్లు పాల్గొన్నాయి. తొలిరోజున ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోంట, ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ జట్ల మధ్య పోటీ జరిగింది. ముందుగా టాస్ గెలిచిన కోంట జట్టు 112 పరుగులు చేయగా.. 113 పరుగులు చేయాల్సిన భువనేశ్వర్ జట్టు కేవలం 85 పరుగులకే ఆలవుట్ అయింది. దీంతో కోంట జట్టు విజయం సాధించింది. పోటీలకు ఎంవీ–79 గ్రామానికి చెందిన జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ కర్యకర్తలు దీపాక్ ధత్, పరితోష్ సర్కార్, శంభు బాగ్చి, సచీన్ సర్కార్, సినీయర్ క్రికెటర్ మానాస్ రంజాన్ ఆన్న పాల్గొన్నారు. -
పోలీసులకు చిక్కిన మత్తు ఇంజక్షన్ల విక్రేతలు
జయపురం: జయపురంలో మత్తు ఇంజక్షన్లు, మత్తు పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ పరిస్థితిలో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. మే నెల ఐదో తేదీన మత్తు ఇంజక్షన్ స్వాధీనంతోపాటు దీనితో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్టు చేసిన పట్టణ పోలీసులు మరోసారి చర్యలకు ఉపక్రమించారు. తాజాగా ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 513 పెంటాజొకెన్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నామని పట్టణ పోలీసు అధికారి ఉల్లాష్ చంధ్ర రౌత్ బుధవారం వెల్లడించారు. అరెస్టయిన వారిలో స్థానిక ఆదర్శనగర్కు చెందిన రాకేష్ పటా్నూక్, డొంగాగుడ వాసి రామ హరిజన్, సునాబెడకు చెందిన అభినవ ప్రధాన్, సెమిలిగుడ మెనార్ కేంప్ రోడ్లో నివసిస్తున్న త్రినాథ్ కొరబ, ధమంజొడి బెజాపుట్ సత్సంఘ్ కాలనీ వాసి సంజయ జెన ఉన్నారన్నారు. అరెస్టు అయిన నిందితుల నుంచి 513 పెంటాజొకెన్ ఇంజక్షన్ ఆంపిల్స్తో పాటు ఒక కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించినట్టు పోలీసు అధికారి ఉల్లాష్ చంద్రరౌత్ వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. ఈ నెల తొమ్మిదో తేదీ రాత్రి ఎస్సై గోవింద చందహంసద్, ఏఎస్సై దేవీ ప్రసాద్ పండల నేతృత్వంలో పోలీసులు పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో కొలాబ్ ప్రధాన కెనాల్ గాంధీ చౌక్, హెక్టాగుడ మార్గంలోని ఓ హోటల్ వద్దకు పోలీసులు చేరారు. ఆ సమయంలో ఒక కారు రోడ్డు పక్కన నిలిచి ఉంది. కారు వద్ద ఉన్న ఆరుగురు వ్యక్తులు పోలీసులను చూసి పరారవుతుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించి ఐదుగురిని పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారైనట్టు పోలీసులు చెప్పారు. కారుని తనిఖీ చేయగా డిక్కీలో ప్యాకెట్లలో ఉన్న మత్తుమందు ఇంజక్షన్లు బయట పడ్డాయాన్నారు. మెజిస్ట్రేట్, డ్రగ్ ఇన్స్పెక్టర్ల సమక్షంలో ఇంజక్షన్లను లెక్కించటం జరిగిందని వివరించారు. సిడ్యూల్– హెచ్ కేటగిరీకి చెందిన ఆ ఇంజక్షన్లను డాక్టర్ల ప్రిస్క్రిప్సన్ లేకుండా విక్రయించడం చట్టవిరుద్ధమన్నారు. ఈ సంఘటనపై ఎన్డీపీఎస్, డ్రగ్స్, కాస్మయోటిక్స్ 1940 చట్టం పరిధిలో కేసులు పెట్టినట్టు చెప్పారు. మత్తు ఇంజక్షన్లను యువతను దృష్టిలో పెట్టుకొని వాటిని తెప్పించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. పరారీలో ఉన్న వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఐదుగురు అరెస్టు 513 పెంటాజొకెన్ ఇంజక్షన్ స్వాధీనం -
నేటి నుంచి అలార్నాథ్ ఆలయ దర్శనం
భువనేశ్వర్: పవిత్ర స్నాన యాత్ర ప్రభావంతో జగన్నాథునితో సహా తోబుట్టువులు బలభద్ర స్వామి, దేవీ సుభద్ర జ్వరం బారిన పడ్డారు. స్నాన మండపం నుంచి మూల విరాట్లకు బుధవారం రాత్రి అనవసర మండపాని తరలించారు. శ్రీమందిరం రత్న వేదిక బోసిబోయింది. ఈ ప్రాంగణంలో భక్తులకు నిత్య దర్శనం తాత్కాలికంగా ముగిసింది. ఈ సందర్భంగా పూరీ నుంచి స్వల్ప దూరంలో బ్రహ్మగిరి ప్రాంతంలో కొలువై పూజలందుకంటున్న అలార్నాథ్ స్వామిని భక్తులు దర్శించుకుంటారు. గురువారం నుంచి ఈ దేవస్థానం భక్తులు, యాత్రికుల తాకిడితో కిటకిటలాడుతుంది. విస్తృత ఏర్పాట్లు.. ఈ సందర్భంగా స్థానిక యంత్రాంగం అలార్నాథ్ ఆలయం ప్రాంగణంలో విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు భారీ భద్రత ఏర్పాటు చేసింది. అదనపు పోలీసు సూపరింటెండెంట్, నలుగురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందితో సహా సీనియర్ అధికారులతోపాటు మొత్తం 7 ప్లాటూన్ల పోలీసులతో ఒక సెక్షన్ సాధారణ దుస్తుల పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. సులభ దర్శనం కోసం ఆలయం వద్ద ముందస్తుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిత్యం సర్వ దర్శనం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 26 వరకు అలార్నాథ్ స్వామి దర్శనం కోసం భక్తులు తరలివస్తారు. భారీ స్నానం ఆచరించడంతో అనారోగ్యానికి గురైన మూల విరాట్లు కోలుకునేందుకు పక్షం (15) రోజులు పడుతుంది. అంత వరకు ప్రధాన దేవ స్థానంలో మూల విరాట్ల దర్శనం ప్రాప్తించదు. ఈ నిడివిలో బ్రహ్మగిరిలో కొలువు దీరిని అలార్ నాథ్ స్వామిని దర్శించుకుంటే జగన్నాథుని దర్శించుకున్న మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. భద్రత కట్టుదిట్టం -
పూరీలో సేవాయత్ హత్య
భువనేశ్వర్: పవిత్ర స్నానోత్సవం భారీ స్థాయిలో జరుగుతుండగా పూరీ పట్టణంలో సీనియర్ సేవాయత్ దారుణ హత్య సంఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక గుడియా సాహిలో జరిగిన ఈ ఘటనలో మృతుడు మహి ప్రకాష్ మఠానికి చెందిన 84 ఏళ్ల జగన్నాథ్ దీక్షిత్గా గుర్తించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా నారాయణ్ పట్టజోషిని ప్రధాన నిందితునిగా గుర్తించి స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. పాత కక్షలు కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. శ్రీ జగన్నాథుని స్నానోత్సంలో తన వంతు పొంతిబొడు సేవ ముగించి తిరిగి వస్తుండగా జగన్నాథ్ దీక్షిత్ హత్యకు గురయ్యాడు. జగన్నాథ్ను తన ఇంటికి రమ్మని పిలిచి దారిలో రబేణి చౌరస్తా సమీపంలో నారాయణ్ పట్టజోషి హత్య చేశాడు. ఘటనా స్థలంలో మృతదేహాన్ని విడిచి పెట్టి నిందితుడు సైకిల్పై పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరి దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేశారు. -
ఘనంగా అష్టోత్తర కలశ మహాభిషేకం
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని మహాభిషేకం అంగరంగ వైభవంగా ముగిసింది. అశేష భక్త జనం మధ్య మూల విరాటులు సుగంధిత జలంతో మహా స్నానం ఆచరించారు. శ్రీ మందిరం సముదాయం ఉత్తర దిశలోని బంగారు బావి నుంచి తోడిన నీటిలో సుగంధిత పుష్ప, చందనాదులు ఇతరేతర సుగంధ ద్రవ్యాల్ని జోడించి బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుడు, సుదర్శనునికి జలాభిషేకం నిర్వహించారు. అష్టోత్తర కలశాలతో ఈ అభిషేకం నిర్వహించడం విశేషం. జగన్నాథుడు అత్యధికంగా 35 కలశాల జలంతో స్నానం ఆచరించగా 33 కలశాలతో బలభద్ర స్వామి, 22 కలశాలతో దేవీ సుభద్ర, 18 కలశాలతో సుదర్శన భగవానునికి సుగంధిత జలంతో స్నాన మండపంపై అభిషేకించారు. -
పిడుగుపాటుకు మూడు పశువులు మృతి
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి సికరపాయి పంచాయతీ తొలొసొజ్జ గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మూడు పశువులు మృతి చెందాయి. ఇవి గ్రామంలోని పాయికొ మినియాక, జగరావు మినియాకలకు చెందినవిగా గుర్తించారు. మేత మేస్తుండగా పిడుగు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులకు నష్టపరిహారం చెలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. యువకుడు ఆత్మహత్య మల్కన్గిరి: జిల్లాలోని మత్తిలి సమితిలో బుధవారం అజిత్ ముజుందర్ అనే యువకుడు తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులుగా తలుపులు తీయకపోవడంతో దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు తెరవగా అజిత్ ఓ గదిలో చీరతో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. -
● 14 నుంచి వికాస్ మేళా
పర్లాకిమిడి: స్థానిక గజపతి స్టేడియంలో ఈ నెల 14 నుంచి 20 వరకు జిల్లా స్థాయిలో వికాస్ మేళా, సుభద్రశక్తి పారంపర వంటల పోటీలు, మామిడి పండ్ల ప్రదర్శన వంటి 77 స్టాల్స్ మేగా అభివృద్ధి మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ బుధవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధిశాఖ అధికారి అంశుమాన్ మహాపాత్రో, ఓర్మాస్ డిప్యూటీ సీఈఓ సుభాల్ జనమని, డీపీఆర్ఓ ప్రదిప్త గురుమయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వికాస్ మేళా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. ఈ మేళాలో జిల్లాలో అమలు జరుగుతున్న అనేక ప్రభుత్వ పథకాలు, స్టాల్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. దీంతోపాటు గజపతి జిల్లాలో 199 గ్రామ పంచాయతీల వికాస్ వాహన యాత్ర జరుపుతామన్నారు. ఈ మేళాలో ప్రజలకు ఉచిత ఆధార్ కార్డు సేవలు, రెవెన్యూ పట్టాల పంపిణీ, కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ, ప్రధాన మంత్రి సూర్యజ్యోతి ఘర్ పథకం దరఖాస్తుదారుల ఆమోదం, పీఎం జనమనయోజనా, లేబర్కు జాబ్ కార్డులు, రేషన్ కార్డులు ప్రదానం, ఉజ్వల్ కృషి విభాగం ద్వారా ముఖ్యమంత్రి కిసాన్ యోజన పథకాలు అందిస్తామని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. -
ఉత్సాహంగా పిండివంటల పోటీలు
పర్లాకిమిడి: పట్టణంలోని బిజూ కల్యాణ మండపంలో బుధవారం జిల్లా స్థాయి సుభద్ర శక్తి పండివంటల పోటీలను మిషన్ శక్తి డి.పి.ఎం. టిమోన్ బోరా ఆధ్వర్యంలో నిర్వహించారు. సబ్కలెక్టర్ అనుప్ పండా, జిల్లా మహిళా సంక్షేమశాఖ అధికారి మనోరమా దేవి తదితరులు హాజరై వంటకాలను పరిశీలించారు. ఉపాధి రాగులు, కొర్రలు, ఇతర పిండివంటలు విక్రయం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన సాధించాలని సబ్కలెక్టర్ ఆకాంక్షించారు. ఏడు సమితిల నుంచి 26 డ్వాక్రా మహిళా గ్రూపుల మహిళలు హాజరై పాయసం, కోంకడాల పులుసు, బూరెలు, గారెలు తదితర వంటకాలు చేశారు. గుమ్మా బ్లాక్ ఝామి గ్రామానికి చెందిన అంజనా శక్తిదళ్, మోహనా, పర్లాకిమిడి గ్రూపులు తొలి మూడు స్థానాల్లో నిలిచాయని డీపీఎం తెలిపారు. విజేతలకు ఈ నెల 14న గజపతి స్టేడియంలో జరిగే మెగా వంటలు, పండ్ల ప్రదర్శనలో మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ సమక్షంలో బహుమతులు అందజేస్తామని చెప్పారు. -
శ్రీముఖలింగంలో మైనాకోత్సవం
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా జ్యేష్టమాసం ఐదో బుధవారం స్వామివారికి మైనాకోత్సవం ఘనంగా జరిగింది. గణపతి పూజతో ప్రారంభించి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి ముందుగా హోమం బలిహరణ అనంతరం పార్వతీ పరమేశ్వరులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అదే సమయంలో పార్వతీపరమేశ్వరుల వివాహ మహోత్సవం నచ్చని మైనాకుడు స్వామి గృహాన్ని దహనం చేస్తాడు. ఈ కార్యక్రమాన్ని మైనాకోత్సవంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన నాయకులు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, సాయిరాజ్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితుల్ని వివరించారు. అదే విధంగా విధంగా, వైఎస్సార్సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు మార్పు దుర్గాపృథ్వీరాజ్ కూడా జగన్మోహన్రెడ్డిని కలిశారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతమైందని పృథ్వీరాజ్ తెలియజేశారు. – కవిటి/గార -
అ‘పూర్వ’ సమ్మేళనం
పోలాకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1997–98 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు మంగళవారం అదే పాఠశాలలో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పిలిచి సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎంవీఏ నాయుడు, కూసెట్టి శ్రీను, గంగేటి సురేష్, మిరియాపల్లి వెంకట అప్పలనాయుడు, బరాటం ప్రసాద్, బరాటం సుమన్, పెద్దాడ వెంకట్, బచ్చు అప్పన్న, ఇప్పిలి ముద్దులు తదితరులు పాల్గొన్నారు. – పోలాకి -
భర్త ఇంటి ముందు భార్య నిరసన
శ్రీకాకుళం క్రైమ్ : కట్టుకున్న భర్తే రోడ్డుపై గెంటేశాడని.. కోర్టులో విడాకులు మంజూరు కాకుండానే వేరే మహిళను వివాహం చేసుకున్నాడని.. ఆ ఇంట్లో వెళ్లి ఉండాలని పోలీసులు చెప్పినా తనను రానీయకుండా అడ్డుపడుతున్నాడంటూ దొండపాటి మంజుశ్రీ అనే వివాహిత వాపోయారు. ఈ మేరకు మంగళవారం బలగలో తన భర్త ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బలగకు చెందిన దొండపాటి విశ్వనాధం, దమయంతిల కుమారుడు ఉమానవీన్కుమార్తో 2012 ఆగస్టులో తనకు వివాహం జరిగిందని, కొన్ని నెలలకే అదనపు కట్నంకోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయని చెప్పారు. బాబు పుట్టాక ఇంటి నుంచి గెంటేయడంతో కాకినాడలో ఉన్న తల్లి వద్దకు చేరానని, 2014 జనవరిలో సర్పవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. అనంతరం కోర్టును ఆశ్రయించానని చెప్పారు. 2018లో మెయింటెనెన్సు కేసు తనకు ఫేవర్ వచ్చిందని, అయినా డబ్బులు తక్కువగా ఇస్తూ, విడాకులైనా తీసుకోకుండా.. మరొక మహిళను పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. ఇటీవల ఎస్పీ మహేశ్వరరెడ్డిని కలవగా సీఐ ఈశ్వరరావు ద్వారా విచారణ నివేదిక కాగితం ఇచ్చారని, దానిని పట్టుకుని మంగళవారం బలగలోని తన భర్త ఉంటున్న నివాసం వద్దకు చేరితే మెడ పట్టుకుని కొడుకుతో సహా తనను గెంటేశారని వాపోయారు. -
ఇద్దరు అరెస్ట్
జయపురం: యువకునిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జయపురం సదర్ పోలీసు అధికారి సచిన్ ప్రధాన్ మంగళవారం తెలిపారు. అరెస్టు అయిన వారు జయపురం సమితి గొడొపొదర్ పంచాయతీ కొలాగుడ గ్రామం నవీణ ఖోశ్ల (32), కిశోర్ కుమార్ కులదీప్(31) అని వెల్లడించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచామని, వారికి బైలు మంజూరు కాక పోవటం వలన వారిని జైలుకు తరలించినట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన బొడొపొదర్లో జరిగిన బిరిపాణి జాతరలో ఇద్దరు యువకులు అల్లర్లు చేసి హంగామా సృష్టించారు. వారికి గొడొపొదర్ పెంటియ సాహిలో ప్రదీప్ కుమార్ రాయ్(34) అడ్డు చెప్పాడు. తరువాత రాయ్ ఇంటికి వెళ్లి పోయాడు. మరునాడు ఉదయం ఆ ఇరువురు ప్రదీప్ రాయ్ ఇంటికి వెళ్లి చంపుతామని హెచ్చరించి, కత్తితో దాడి చేశారు. రాయ్ నడుముపై పెద్ద గాయమైంది. రాయ్ను కత్తితో పొడిచిన దుండగులు పరారీ అయ్యారు. రాయ్ కుటుంబ సభ్యులు జిల్లా కేంద్ర హాస్పిటల్లో చేర్చారు. బరిణిపుట్ పోలీసు సంటి అధికారి ఏఎస్ఐ సుశాంత్ దలపతి కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. -
సాక్షి కార్యాలయం ధ్వంసంపై ఎస్పీకి ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని ఎచ్చెర్ల కేంద్రంగా ఉన్న ‘సాక్షి’ పత్రికా ప్రధాన కార్యాలయంపై ఈ నెల 9న కొంతమంది టీడీపీ నాయకులు, వారి మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. ఘటనపై ఫిర్యాదు ఇచ్చేందుకు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని సాక్షి బ్రాంచ్ మేనేజర్ జేజీవీఆర్ స్వామిబెహరా, జిల్లా బ్యూరో చీఫ్ కందుల శివశంకర్ మరికొంతమంది మీడియా ప్రతినిధులు కలిశారు. కార్యాలయంపై దాడి జరిగిన తీరును ఎస్పీకి వివరించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో సాక్షి టీవీ బ్యూరో సునీల్కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బాలు, వాసు, సాక్షి క్రైమ్ రిపోర్టర్ నరసింహ ఉన్నారు. పీజీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ నాలుగో సెమిస్టర్ ఫలితాలను ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయభాస్కర్ మంగళవారం విడుదల చేశారు. 19 కోర్సుల్లో 498 మంది పరీక్షలు రాయగా అందులో 426 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్, వర్శిటీ వెబ్సైట్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సందేహాలుంటే 15 రోజుల్లోగా రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు ఆహ్వానం శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం (పెదపాడు)లోని పీఎం కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండి లవకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 4వ తరగతిలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే సీట్లు ఉన్నాయని, 8, 9, 10వ తరగతులతో పాటు ఇంటర్మీడియట్లో కేటగిరి 1, 2 అభ్యర్థులకు మాత్రమే (సీబీఎస్ఈ అఫిలియేటెడ్లో చదివిన వారికి) ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు జూన్ 16లోగా దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి వివరాలకు పెదపాడు కేంద్రీయ విద్యాలయంలో సంప్రదించాలని కోరారు. హత్యాయత్నం కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష సోంపేట : బారువ గ్రామానికి చెందిన తెప్పల కృష్ణారావు 2016 జూలై 26న మరొక వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన నాయని యోగేశ్వరరావు వ్యక్తిగత కక్షలతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కృష్ణారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ముద్దాయి యోగేశ్వరరావు నేరం చేసినట్లు రుజువు కావడంతో నాలుగేళ్ల జైలుశిక్ష పడినట్లు సోంపేట సీఐ బి.మంగరాజు మంగళవారం తెలిపారు. లారీని ఢీకొన్న కారు ఎచ్చెర్ల: లావేరు మండలం బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లావేరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అరసవల్లి ఈఓగా కేఎన్వీడీ ప్రసాద్ అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి కొత్త ఈఓ (డిప్యూటీ కమిషనర్)గా కేఎన్వీడీ ప్రసాద్ను నియమిస్తూ మంగళవారం దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ఇంతవరకు విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఈఓగా పనిచేస్తూ అరసవల్లికి బదిలీ అయ్యారు. అక్కడ కూడా ఎఫ్ఏసీగా బాధ్యతలు కొనసాగించనున్నారు. కాగా ఇంతవరకు అరసవల్లి ఈఓగా పనిచేసిన వై.భద్రాజీని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఆలయ డిప్యూటీ ఈఓగా బదిలీ చేశారు. భద్రాజీ హయంలోనే ఆలయ పరిసరాల్లో కూల్చివేతలు జరిగాయి. అయితే తర్వాతి పరిణామాల్లో ఈయన వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్థానిక కూటమి ప్రభుత్వ పెద్దలే ఈయన్ను బదిలీపై వెళ్లిపోవాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇద్దరు ఈఓలకు బదిలీ జిల్లా దేవదాయ శాఖ పరిఽధిలో గ్రేడ్–2 ఈఓలుగా పాతపట్నం గ్రూప్ టెంపుల్స్లో పనిచేస్తున్న టి.వాసుదేవరావును పలాస గ్రూప్ టెంపుల్స్నకు, అలాగే పలాస గ్రూప్ టెంపుల్స్లో ఈఓగా పనిచేస్తున్న జి.గురునాధరావుకు టెక్కలి రావివలస ఎండల మల్లికార్జున స్వామి వారి ఆలయానికి బదిలీ చేశారు. -
యువతిని మోసగించిన యువకుడిపై కేసు
శ్రీకాకుళం రూరల్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీకాకుళం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేగిడి మండలం అంబాడ గ్రామానికి చెందిన దళిత యువతి, పాలకొండ మండలం రాజుపేటకు చెందిన రౌతు వెంకటేష్ జిల్లా కేంద్రం సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసేవారు. కులాలు వేరైనా ప్రేమిస్తున్నానంటూ వెంటపడటంతో యువతి సరేనంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా కాలయాపన చేస్తూ తప్పించుకుంటున్నాడంటూ రేగిడి పోలీస్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్నానని, పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు కాపీ శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్కు చేరగా.. ఎస్ఐ రాము మంగళవారం కేసు నమోదు చేశారు. యువతి ఆత్మహత్య మెళియాపుట్టి: సిరియాకండి గ్రామానికి చెందిన తోనంగి సునీత(19) అనే యువతి నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మెళియాపుట్టి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సునీత శ్రీకాకుళంలోని నారాయణ పారా మెడికల్ ఇన్స్టిట్యూట్లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతోంది. అక్కడే ఓ గదిలో నలుగురు స్నేహితురాళ్లతో కలిసి అద్దెకు ఉంటోంది. 40 రోజుల కిందట వేసవి సెలవుల కోసం గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నుంచి కుమార్తె కనిపించపోవడంతో మృతురాలి తండ్రి ప్రసాదరావు అన్నిచోట్లా వెతికారు. మంగళవారం గ్రామానికి దూరంగా ఉన్న నేలబావిలో మృతదేహం తేలడంతో నిర్ఘాంతపోయారు.తండ్రి ప్రసాద్ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రేమవ్యవహారం గానీ, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు ఎస్సై రమేష్బాబు తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్తో బీఎడ్ అభ్యర్థికి న్యాయం శ్రీకాకుళం పాతబస్టాండ్: తన సమస్య పరిష్కారం కోరుతూ శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించిన బీఈడీ చదివిన అభ్యర్థికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. శ్రీకాకుళం మండలం వాకలవలసకు చెందిన కూన హరిప్రసాద్ ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక బీఎడ్ కోర్సు పూర్తి చేశాడు. ఒరిజినల్ సర్టిఫికెట్ (ఓడీ), మార్క్షీట్ అందించాని 2022లో యూనివర్సిటీ అధికారులకు చలానా, ఇతర వివరాలను అందజేస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. మూడేళ్లు గడిచినా పట్టించుకోలేదు. దీంతో హరిప్రసాద్ జిల్లా కోర్టు ఆవరణలోని శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించాడు. చైర్మన్ జి.జ్ఞానసువర్ణ రాజు విచారణ చేపట్టి అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం వర్సిటీ అధికారులు హాజరై పత్రాలు అందించారు. -
4 నెలల్లో 505 ఫోన్లు రికవరీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో గడిచిన నాలుగు నెలల్లో బాధితులు పోగొట్టుకున్న రూ. 80 లక్షల విలువ చేసే 505 మొబైల్ ఫోన్లను కనిపెట్టి బాధితులకు అందజేస్తున్నామని, మరో 300 నుంచి 400 వరకు కనిపెట్టేందుకు సైబర్ సెల్ బృందం కృషి చేస్తోందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. పోగొట్టుకున్న మొబైళ్లను పొందేందుకు బాధితులు చేయాల్సిందల్లా గోల్డెన్ అవర్లో సీఈఐఆర్ పోర్టల్లో రిజిస్టరై ఫిర్యాదు చేయడమేనన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సీఈఐఆర్ పోర్టల్లో రిజిస్టరవ్వాలి.. ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు ముందుగా సిఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్, హెచ్టీటీపీఎస్://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సిఇఐఆర్.జిఒవి.ఐఎన్ అనే పబ్లిక్ వెబ్సైట్లో బ్లాకింగ్ అభ్యర్థన ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఫిర్యాదు ఆధారంగా మొబైల్ ఐఎంఈ నంబర్లు బ్లాక్ అయ్యాక ఆ రిక్వెస్ట్ను సైబర్సెల్ పోలీసులు రిసీవ్ చేసుకుని మొబైల్ను ట్రాక్ చేస్తారన్నారు. రికవరీ అయ్యాక మొబైల్ను అన్బ్లాక్ చేసి పోగొట్టుకున్న వ్యక్తికి అందజేస్తున్నామన్నారు. ఫోన్లు వాడే ప్రతి ఒక్కరూ ఫోన్లోనే సెక్యూరిటీ లాక్ వేసుకోవాలన్నారు. ప్రతిభకు ప్రశంసలు.. దూర ప్రాంతాలకు తరలిపోయిన ఫోన్లతో పాటు, అతి విలువైన మొబైళ్లను అతి తక్కువ కాలంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పర్యవేక్షణలో ఛేదించిన సైబర్, ఐటీ కోర్ సెల్ సీఐ టి.శ్రీను, సైబర్ నిపుణులు పైలా ఛక్రధర్ (ఛక్రి), గిరి, సుధీర్, సీసీఎస్ సీఐ చంద్రమౌళి, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు. -
ధాన్యం కొనుగోలు చేయాలి
జయపురం: మండీలకు రైతులు తీసుకువచ్చే ధాన్యంపై అభ్యంతరాలు చెప్పటం మాని, ధాన్యం కొనుగోలు చేయాలని ప్రొక్యూర్మెంట్ సంస్థలకు, అధికారులకు జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి విజ్ఞప్తి చేశారు. జయపురం సమితి జాముండ, కుములిపుట్లలో ఏర్పాటు చేసిన మండీలను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మండీలకు సంబంధిత అధికారులుఽ, ధాన్యం కొనుగోలుదారులు సకాలంలో రావాలని విజ్ఞప్తి చేశారు. రైతులను ఎవరు ఇబ్బంది పెట్టినా, కష్టం కలిగించినా క్షమించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో మండీలు సక్రమంగా నిర్వహించటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. మండీలలో ధాన్య కొనేందుకు వస్తున్న కలహండీ జిల్లా మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, మండీలు తెరచినా మిల్లర్లు సకాలంలో రావటం లేదన్న ఆరోపణలు వచ్చాయన్నారు. కలహండీ మిల్లర్లు ఎక్కడ ధాన్యం కొన్నా నాణ్యత లేవని అభ్యంతరం తెలుపుతూ క్వింటాకు 8 నుంచి 10 కేజీల ధాన్యం అదనంగా తీసుకుంటున్నారని, తమకు తెలిసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎటువంటి కటింగ్లు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని, నేడు అందుకు భిన్నంగా జరుగుతుందన్నారు. గతంలో కన్నా ఎక్కవ ఆంక్షలు విధించటం తగదన్నారు. మిల్లర్లతో ఫోన్లో మాట్లాడి రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మిల్లర్లు రైతుల నుంచి ధాన్యం కొనాలని ఆదేశించారు. ఆదేశాలను అమలు చేయకపోతే తగు చర్యలు తీసుకోవాలని తాము రాష్ట్ర ప్రభుత్వానికి కోరతానన్నారు. రైతులకు ఎటువంటి నష్టం కలిగినా సహించేది లేదన్నారు. జాముండ మండీలో మార్కెట్ యార్డును ప్రారంభించారు. -
రూ.25 లక్షల పరిహారం అందజేయాలి
జయపురం: కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల హాస్పిటల్లో ఇటీవల తప్పుడు ఇంజక్షన్తో మరణించిన ఆరుగురు వ్యక్తుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ బొయిపరిగుడ శాఖ డిమాండ్ చేసింది. మంగళవారం ఆ పార్టీ బొయిపరిగుడ బ్లాక్ కార్యదర్శి సూర్యనారాయణ బిశాయి జిల్లా ప్రధాన వైద్యాధికారికి రాసిన 4 డిమాండ్లతో ఉన్న లేఖను బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్ వైద్యాధికారికి అందజేశారు. ఆరుగురు మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. వైద్యుల నిర్యక్ష్యం వలన మరణాలు సంభవించాయని ఆరోపించింది. మరణించిన వారి కుటుంభాలకు పరిహారం చెల్లించటంతోపాటు తప్పుడు ఇంజక్షన్ ఇచ్చిన డాక్టర్కు కఠిన శిక్ష విధించాలని, సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల హాస్పిటల్, జిల్లా కేంద్ర హాస్పిటల్లో అగినంత మంది డాక్టర్లతోపాటు వైద్య సిబ్బందిని నియమించాలని, ఖాళీలు ఉన్న పదవులను వెంటనే భర్తీ చేయాలని, అత్యాధునిక వైద్య పరికరాలతోపాటు ప్రాణ రక్షక ఔషధాలను రోగులకు సమకూర్చాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ పార్టీ కార్యకర్తలు లక్షోమీ బారిక్, దశరథ ఖిలో, నవీన బారిక్, తదితరులు పాల్గొన్నారు. -
మీడియాపై దాడులు నశించాలి
టెక్కలి : ‘రాష్ట్రంలో మీడియాపై దాడులు నశించాలి.. సాక్షి కార్యాలయాలపై దాడులు అరికట్టాలి.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అక్రమ అరెస్టు ఖండించాలి..’ అంటూ టెక్కలిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే కౌన్సిల్ సభ్యుడు బెండి నరసింగరావు ఆధ్వర్యంలో టెక్కలి అంబేడ్కర్ జంక్షన్లో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అ నంతరం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి నిరసన ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ...మీడియా సంస్థలు, జర్నలిస్టులు ప్రజల పక్షాన అక్షరమే ఆయుధంగా పోరాటాలు చేస్తుంటారని, ఈ క్రమంలో రాజకీయంగా వేధింపులు సరికాదని అన్నారు. ఎన్నో ప్ర యాసలతో జర్నలిస్టులు ప్రజల కోసం సామాజికంగా పనిచేస్తున్నారని, అటువంటి జర్నలిస్టులు, మీడి యా సంస్థలపై దాడులు చేయడం మంచిది కాదన్నారు. టెక్కలిలో నిరసన చేస్తున్న మీడియా ప్రతినిధులు -
బంగారం కోసం వచ్చి.. ప్రాణాలు తీసి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం పెద్ద హరిచంద్రపురం గ్రామంలో మంగళవారం దుంపల దాలమ్మ(68) అనే వృద్ధురాలిని హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. దాలమ్మ తన ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్నారు. పిల్లలు విశాఖపట్నంలో ఉంటున్నారు. దాలమ్మ భర్తకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన కుమారుడి వద్ద ఉంటున్నారు. రోజూ మాదిరిగానే మంగళవారం ఉదయం 3గంటల సమయంలో ఆమె నిద్ర లేచి పనులు చేసుకుంటూ ఉండగా.. ఇంటి పెరటి నుంచి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమె మెడలో తాడు లాగబోయాడు. ఆ ప్రయత్నంలో తలపై కొట్టిన ఆనవాళ్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఆ ధాటికి దాలమ్మ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఉదయం పక్కింటి వాళ్లు చూసే సరికి దాలమ్మ రక్తపు మడుగులో కనిపించడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతురాలి కుమారుడు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
జయపురం: తలుపులు మూసి ఉన్న ఒక ఇంటిలో ఒక యువకుడు ఉరి పోసుకొని చనిపోయిన ఘటన బయటపడింది. మరణించిన యువకుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం సివన్ జిల్లా ఉగిలి గ్రామం లోకేష్ బైసావర్ అని గుర్తించారు. ఈ సంఘటనపై జయపురం సదర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ వెల్లడించారు. పోలీసులు సైంటిఫిక్ టీమ్లు సంఘటనా ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం తర్వాత మృత దేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పజెప్పినట్లు పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. సదర్ పోలీసు స్టేషన్ పరిధి గేట్గుడ గ్రామంలో సంజిత్ నాయిక్ హైడ్రోలిక్ గేరేజ్లో లోకేష్ గత 6 నెలల నుంచి మెకానిక్ హెల్పర్గా పనిచేస్తున్నాడు. గత ఏప్రిల్లో సెలవు తీసుకొని ఇంటికి వెళ్లాడు. ఈ నెల 7వ తేదీన ఇంటి నుంచి తిరిగి వచ్చిన పనిలో చేరాడు. సోమవారం 10 గంటల వరకు లోకేష్ గేరేజ్కు రాలేదు. అతడు రాకపోవడంతో లోకేష్ను పిలుచుకు రమ్మని ఒక వ్యక్తిని అతడి ఇంటికి పంపాడు. ఇంటి లోపల గెడ వేసి ఉండటంతో వెళ్లిన వ్యక్తి తలుపు తట్టి పిలిచాడు. తలుపు తెరవకపోవడంతో కిటికీ నుంచి చూడగా లోకేష్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని అతడు గేరేజ్ యజమాని సంజిత్కు తెలియజేశాడు. యజమాని సంజిత్ జయపురం సదర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
దారి కాచిన మృత్యువు
● రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి ● మృతులంతా ఒడిశా వాసులే టెక్కలి రూరల్: దైవ దర్శనానికి బయల్దేరిన వారికి చావు ఎదురైంది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఒడిశా వాసులు మృతిచెందారు. సింహాచలం అప్పన్న దర్శనానికి బయల్దేరగా.. కోటబొమ్మాళి మండలం వద్ద ప్రయాణం ముగిసిపోయింది. ఒడిశా రాష్ట్రం బ్రహ్మపురం రాధాకృష్ణ వీధికి చెందిన కొందరు బొలేరో వాహనంపై తమ గ్రామం నుంచి సింహాచలం దైవ దర్శనానికి బయల్దేరారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్దకు వచ్చే సరికి వాహనం రోడ్డుపక్కన ఆపి కిందకు దిగుతుండగా.. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లగేజీ బొలేరో వ్యాన్ వీరిని అమాంతం ఢీకొట్టింది. బొలేరో వాహనంలో ఉన్న ఒడిశాకు చెందిన 8 మంది వ్యక్తులు అందులో ఉండగా.. ఈ ప్రమాదంలో డ్రైవర్ గోకుల్ పండా(33), సుశాంత్ కుమార్ సబత్(44) అతని కుమార్తె సంతోషి సబత్(7) అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన లాగేజ్ వ్యాన్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై నందిగాం ఎస్ఐ మహ్మద్ ఆలీ కేసుమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
విజిలెన్స్ వలలో ఇద్దరు మహిళా ఇంజినీర్లు
కొరాపుట్: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఇద్దరు ప్రభుత్వ మహిళా ఇంజినీర్లు విజిలెన్స్ వలకు చిక్కారు. మంగళ వారం కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితిలో అసిస్టెంట్ ఇంజినీర్ సుచిస్మిత పరజా రూ.8 వేలు లంచం తీసుకొంటుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఘాట్ రోడ్డు లో కటింగ్ పనులు చేసిన కాంట్రాక్టర్ను లంచం అడగడంతో ఆయన విజిలెన్స్ను సంప్రదించగా మాటు వేసి పట్టుకున్నారు. మరో వైపు బరగడ్ జిల్లా గయిసిలేట్ సమితి లో జూనియర్ ఇంజినీర్ సుస్మితా ఓరం మంగళ వారం విజిలెన్స్ వలకు చిక్కారు. బిల్లులు విడుదల చేయడానికి కాంట్రాక్టర్ వద్ద నుంచి 10 శాతం కమిషన్ కావాలన్నారు. అందుకు తక్షణం రూ.32,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో కాంట్రాక్టర్ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయగా వారిచ్చిన రూ.8 వేలు తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. -
నడుస్తున్న కారు దగ్ధం
కొరాపుట్: నడుస్తున్న కారు నుంచి అకస్మాత్తుగా మంటలు రేగడంతో కారు డ్రైవర్ రెప్పపాటులో తప్పించుకున్నాడు. మంగళవారం నబరంగ్పూర్ జిల్లా డాబుగాం పోలీస్ స్టేషన్ పరిధి రాష్ట్ర రహదారి 39 పై ఆదర్శ విద్యాలయం ఎదుట ఒడి 08వి 3816 నంబర్ గల కారు దగ్ధమైంది. వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లడంతో ప్రమాదం జరిగి మంటలు రేగాయి. ఇది తెలిసి డాబుగాం నుంచి అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తెచ్చారు. కలహండి జిల్లా బడపడా గ్రామానికి చెందిన బినోద్ ఈ కారు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
సామూహిక ఉపనయనాలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో గల తిరుపతి బాలాజీ మందిరం ప్రాంగణంలో బ్రహ్మణ సేవా సమాజం ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు సామూహిక ఉపనయనాలు జరిగాయి. ఉచితంగా నిర్వహించిన కార్యక్రమంలో పది మంది బ్రహ్మచారులు ఈ దీక్షను పాటించారు. పండితులు ప్రకాష్ రథొ, నళినీ మహాంతిల పర్యవేక్షణలో జరిగిన ఉపపనయనాల కార్యక్రమం మంగళవారం ముగిసింది.చెట్టును ఢీకొట్టిన టిప్పర్ ● పలువురికి స్వల్పగాయాలు రాయగడ: టిప్పర్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటన జిల్లాలోని కొలనార సమితి గడ్డిశెశిఖాల్ పంచాయతీలొని కొలటిగుడ గ్రామసమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. టిప్పర్లో ప్రయాణించే హెల్పర్, డ్రైవర్లకు స్వల్పగాయాలు తగిలాయి. ప్రమా దం చోటు చేసుకున్న సమయంలో అక్కడ ఉన్న యువకులు టిప్పర్లో ఉన్న హెల్పర్ , డ్రైవర్లను బయటకుతీసి కొలనార ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంలో టిప్పర్ నుజ్జునుజ్జు అయింది.చోరీ కేసులో నిందితుడి అరెస్టు రాయగడ: మునిగుడ రైల్వే పోలీసులు సోమవారం నాడు అనుమానాస్పదంగా కనిపించిన ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశారు. అతని నుంచి తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అరెస్టయిన వ్యక్తి ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయిపూర్ ప్రాంతానికి చెందిన అజయమీ సాహు (25)గా గుర్తించారు. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ కె.స్వయం ప్రకాష్ తెలియజేసిన వివరాల ప్రకారం.. సొమవారం రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒకటో నంబరు ప్లాట్ఫారం వద్ద సాహు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీలు చేయగా స్మార్ట్ మొబైల్ ఫోన్లు తొమ్మిది కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతనిని విచారించగా వివిధ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల నుంచి వీటిని దొంగిలించినట్టు అంగీకరించాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. ఇంట్లో దొంగలు పడి రూ.20 లక్షలు చోరీ కొరాపుట్: కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణం నుంచి నందపూర్ వెళ్లే మార్గంలో కుశల ఆశ్రమ ప్రాంతంలో శత్రుఘ్న ప్రధాన్ అనే వ్యక్తి ఇంటిలో మంగళవారం వేకువజామున దొంగలు పడ్డారు. ఉదయం ఇంటికి వచ్చిన కుటుంబం దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఈ చోరీలో రూ.10 లక్షల నగదుత పాటు మరో రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు. వెంటనే బాధితులు సిమిలిగుడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. రైలు నుంచి జారిపడి యువకుడి మృతి రాయగడ: నడుస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందాడు. ఎల్లపి–ధన్బాద్ ఎక్స్ప్రెస్లో జార్ఖండ్కు చెందిన బిజయ్ భుయ్య (34) ప్రయాణిస్తున్నాడు. సోమవారం సాయంత్రం రాయగడ రైల్వే స్టేషన్లో ఐదో నంబర్ ప్లాట్ఫారంపైకి రైలు చేరుకుంటున్న సమయంలో భుయ్య దిగేందుకు ప్రయత్నించిగా ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో సంఘన స్థలం వద్దే ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వ్యాన్, బైక్ ఢీకొని ఒకరి మృతి
రాయగడ: ఆంధ్రప్రదేశ్ నుంచి భిలాయికి మామిడి పండ్ల లోడుతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ సంఘటనలో బైకు డ్రైవ్ చేస్తున్న బి.రాహుల్ (24) అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు స్థానిక మజ్జివీధికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. స్థానిక జగన్నాథ మందిరం సమీపంలో పికప్ వ్యాన్ అతివేగంగా నడుపుతూ మరో వాహనాన్ని తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న బైకును ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలకు గురైన రాహుల్ను అక్కడి వారు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వ్యాన్ డ్రైవర్ నకుల ప్రసాద్ వాహనాన్ని విడిచిపెట్టి పరారయ్యాడు. వ్యాన్ హెల్పర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చందిలి ఐఐసీగా ఉత్తమ కుమార్సాహు రాయగడ: జిల్లాలోని చందిలి పోలీస్స్టేషన్ ఐఐసీగా ఉత్తమ కుమార్ సాహు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గుణుపూర్ ఆదర్శ పోలీస్స్టేషన్లో ఐఐసీగా విధులు నిర్వహిస్తున్న సాహు బదిలీపై ఇక్కడకు వచ్చారు. చందిలి ఐఐసీగా విధులు నిర్వహించిన ప్రసన్న బెహరకు రాయగడ బదిలీ అయింది. బాధ్యతలు చేపట్టిన ఐఐసీ సాహుకు చందిలి పోలీస్ స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికి అభినందించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై చర్చ జయపురం: జయపురం సబ్డివిజన్ కోట్పాడ్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో పాల్గొనేందుకు వచ్చిన కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్, జయపురం సబ్కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డిలు వినతుల స్పీకరణ అనంతరం ఘుమర, బొబాయి, కుసుమి, కొట్పాడ్లలో ఏర్పాటు చేయనున్న మార్కెడ్ యార్డ్లను సందర్శించి పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం కోట్పాడ్ బీడీవో, ఇతర అధికారులతో మండీల నిర్వహణపై చర్చించారు. కాగా గ్రీవెన్స్సెల్కు 120 వినతులు వచ్చాయి. వీటిలో 30 వ్యక్తిగతం కాగా 90 గ్రామ సమస్యలపై ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. సీడీవో బేణూదర శబర, సీడీఎంవో రవీంద్ర నారాయణ మిశ్ర, తహసీల్దార్ ట్వింకిల్ సెట్టి, బడీవో సంధ్యా సమరత్ పాల్గొన్నారు. -
చేయి చేయి కలిపి రోడ్డు నిర్మించి..
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి జంగపాడు గ్రామస్తులు ఆదర్శంగా నిలిచారు. చేయి చేయి కలిపి శ్రమదానంతో ఏకంగా రోడ్డును నిర్మించుకొని కష్టాలను తీర్చుకున్నారు. ఈ గ్రామానికి సరైన రహదారి లేకపొవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడేవారు. దీంతో శ్రమదానం చేసి రోడ్డు నిర్మించుకోవాలని భావించి ఆలోచనను ఆచరణలో చేసి చూపించారు. రెండేళ్ల క్రితం సమితిలోని చాటికొన నుంచి పది కిలోమీటర్ల దూరంలో గల జంగపాడు గ్రామానికి రహదారి నిర్మించేందుకు సంబంధిత శాఖ టెండర్లను ఆహ్వానించింది. టెండరు ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇంతవరకు నిర్మాణం పనులు చేపట్టలేదు. అత్యవసర పరిస్థితిలో రాకపోకలకు చాలా కష్టంగా మారింది. రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపొవడంతో శ్రమదానం చేసుకుని మట్టి రోడ్డును నిర్మించుకున్నారు. చిన్నా,పెద్ద అంతా తలో చేయి వేసి పనులను పూర్తి చేసుకున్నారు. రెండు రోజుల్లో సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం పొడువున రహదారిని నిర్మించుకున్న గ్రామస్తులు సొమవారం నాటికి పూర్తిస్థాయి రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వచ్చేది వర్షాకాలం కావడంతో మట్టితో నిర్మించుకున్న రహదారి కొట్టుకుపొతే పరిస్థితి యథాస్థితికి చేరుతుందని ఆందోళన చెందుతున్ననుర. ఏదిఏమైప్పటికీ ప్రస్తుతం వాహన రాకపొకలకు మార్గం సుగమమం కావడంతో ఆనందిస్తున్నారు. అధికారులు ఇప్పటికై న స్పందించి పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఆదర్శంగా నిలిచిన జంగపాడు గ్రామస్తులు రెండురోజుల్లో నాలుగు కిలోమీటర్ల రోడ్డును నిర్మించుకున్న వైనం -
గంజాయి బాబుల ఆగడాలు ఆపండి
శ్రీకాకుళం క్రైమ్ : ‘గంజాయి బాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మా గ్రామాలను ఆనుకొని ఉన్న తోటల్లో, పొలాల్లోని నిర్మానుష్య ప్రదేశాలే స్థావరాలుగా చేసుకుంటున్నారు. పేకాట శిబిరాలు సైతం నిర్వహిస్తున్నారు. ఎవరైనా రాత్రి పూట బయ టకు వెళ్లాలన్నా.. బయటనుంచి ఊళ్లోకి రావాల న్నా.. రోడ్డు మీద ఎవరి మీద దాడి చేస్తారో.. ఏ ఒంటరి ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తారోనని భయంగా ఉంది’ అంటూ ఎచ్చెర్ల మండలంలోని ఐదు పంచాయతీల సర్పంచులు, ఓ ఎంపీటీసీ ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ధర్మవరం, పొన్నాడ, భగీరథపురం, ముద్దాడ, కొంగరాం గ్రామాల సర్పంచ్లు అల్లు కన్నబాబు, నేతింటి నీలం అప్పడు, నక్క కృష్ణమూర్తి, ముద్దాడ శంకరరావు, గుండ రవిలే కాక బొంతలకోడూరు ఎంపీటీసీ మాడుగుల జగదీష్లు, ఆయా గ్రామస్తులు ఎస్పీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఏముందంటే.. తమ గ్రామాల్లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలు, బళ్లు, వ్యానులలో వచ్చి గ్రామంలో పడి దేవాలయాల్లో ఉన్న వెండి, బంగారు ఆభరణాలు, పొలాల్లో మోటార్లు, ఆయిల్ ఇంజిన్లు, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు, ట్రాక్టర్లలో విలువైన పార్టులు, ఇళ్ల లో సామాన్లు, బంగారం, పాడి సంపదైన ఆవులు, గొర్రెలు, మేకలు ఎత్తుకుపోతున్నారని తెలిపారు. వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ధర్మవరంలో జగనన్న కాలనీలో మోటారును, శ్మశానంలో సర్వీసు వైరును ఎత్తుకుపోయారన్నారు. ఉగాది నాడు సింతు సత్యం అతని సోదరుడు ఇంట్లో సుమారు 12 తులాల బంగారం చోరీకి గురైందని ఇప్పటికీ జాడలేదని, పొన్నాడలో నాలుగు ట్రాక్టర్ల బ్యాటరీలు, ఓ ట్రాక్టర్ గేజ్వీల్స్, ముద్దాడ, భైరిపురం, ఎస్ఎంపురం గుళ్లల్లో ఆభరణాలు చోరీ చేశారన్నారు. కొన్ని స్థావరాల్లో.. పొన్నాడ కస్తూర్బా స్కూలు సమీపంలోను, కొంగరాం–పొన్నాడ లింకురోడ్డు సమీపంలోను తోటలు, పొలాలను గంజాయి బాబులు స్థావరాలుగా మార్చుకున్నారని తెలిపారు. మత్తు పదార్థాలు సేవించిన అనంతరం పొన్నాడ బ్రిడ్జి లింకు తోటపాలెం రూట్లో వాణి పబ్లిక్ స్కూలు సమీపంలో ఓ కిల్లీకొట్టు, నూడుల్స్కొట్టులో గడుపుతారని, బ్రిడ్జి దాటాక వరుసగా ఉన్న దాబాల్లో సైతం హల్చల్ చేసి రాత్రి 11 తర్వాత గ్రామాల్లో గ్రూపులుగా తిరుగుతారని విలేకరులతో అన్నారు. ఎస్పీని కలిసిన వారిలో సర్పంచులతో పాటు జి.ఎర్రనాయుడు, నక్క జగదీష్, కరగాన గణేషు, ఎర్ర వైకుంట తదితరులున్నారు. -
ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం
జయపురం: జయపురంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సోమవారం సాయంత్రం హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. స్థానిక అరవింద నగర్ విద్యామందిరం ప్రాంగణంలో నిర్వహించినన కార్యక్రమంలో పట్టణ ఆర్ఎస్ఎస్ ప్రతినిధి డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ అధ్యక్షత వహించారు. మహారాజ్ ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగిన రోజూను హిందూ సామ్రాజ్య దినంగా రాష్ట్రీయ స్వయ సేవక్ సంఘం పాటిస్తున్నదని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జయపురం అటవీ డివిజన్ అధికారి ప్రతాప్ చంధ్ర బెహర, ముఖ్యవక్తగా నవరంగపూర్ ఆర్ఎస్ఎస్ పట్టణ సంఘ సలక్ రాజేంద్ర కుమార్ భిశాయి, జయపురం పట్టణ సంఘ సలక్ ప్రేమానంద నాయిక్ పాల్గొన్నారు. సురేష్ నంద, అమృత బచన్ గంగాధర నాయిక్, ప్రధాన శిక్షకులు సుభ్రత పండలు దేశభక్తి గీతాలు ఆలపించారు. -
షైనింగ్ స్టార్ పట్టం
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సర్కారు విద్యార్థులకే పట్టం గత వైఎస్సార్సీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న ఆణి ముత్యాలు పేరిట ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న వారిని ప్రోత్సహించాలని టెన్త్క్లాస్, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు, నగదు ప్రోత్సాహకాలను అందజేశా రు. నాడు పాఠశాల/కళాశాల స్థాయి, మండలస్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి అంటూ ఐదుస్థాయిల్లో సత్కారాలు చేసి అవార్డులు, రివార్డులు అందజేశారు. శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలో కార్పొరేట్ విద్య ను స్వయంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. అక్క డ చదువుతూ టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు నజరానా అందజేసింది. ఇందుకు తాజాగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్ అవార్డుల ఎంపికే ఉదాహరణ. తాజాగా ముగిసిన 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో, ఇంటర్మీడియెట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను షైనింగ్ స్టార్ల కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. అంతవరకు బాగానే ఉన్నా.. అక్కడే తమ అస లు రంగు బయటపెట్టింది. ఎంపికచేసిన షైనింగ్ స్టార్ల జాబితాలో మెజారిటీ విద్యార్థులు కార్పొరేట్/ప్రైవేటు విద్యాసంస్థల వారే కావడం గమనార్హం. పురస్కారాలు అందజేసిన కేంద్రమంత్రి, ఇన్చార్జి మంత్రి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 80 అడుగుల రోడ్లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడుతో కలిసి విద్యార్థులకు రూ.20వేల చొప్పున పురస్కారాలను అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖపై ప్రత్యేకంగా దృష్టిసారించాయని కేంద్రమంత్రి అన్నారు. అంతకుముందు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అవార్డులకు ఎంపికై న విద్యార్థులను అభినందించారు. అంతకుముందు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు అతిథులకు వెల్కమ్ చెప్పి.. ఆహ్వానించే కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యార్థులతో కలిసి పంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, ఆర్డీఓ సాయిప్రత్యూష, ఇంటర్మీడియెట్ విద్య డీఐఈఓ ఆర్.సురేష్కుమార్, ఆర్ఐఓ పి.దుర్గారావు, డీఈఓ ఎస్.తిరుమల చైతన్య, విజయకుమారి, లియాకత్ ఆలీఖాన్, వివిద పాఠశాలలు, కళాశాలల ప్రతినిధులు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. టెన్త్క్లాస్లో 178, ఇంటర్లో 35 మంది ఎంపిక జిల్లా నుంచి షైనింగ్ స్టార్ అవార్డులకు పదో తరగతి విద్యార్ధులు మొత్తం 178 మంది ఎంపికయ్యారు. ఇందులో వివిధ ప్రభుత్వ యాజ మాన్య విద్యాసంస్థల విద్యార్థులు 93 మంది ఉండగా.. ప్రైవేటు విద్యార్థులే 85 మంది ఉండటం విశేషం. అలాగే ఇంటర్మీడియెట్ నుంచి షైనింగ్ స్టార్ అవార్డులకు మొత్తం 35 మంది ఎంపిక కాగా.. ఇందులో ప్రైవేటు కాలేజీ విద్యార్థులు ఏకంగా 23 మంది ఉండగా, ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. షైనింగ్ స్టార్ పేరుతో విద్యార్థులకు అవార్డుల అందజేత మెజారిటీ విద్యార్థులు కార్పొరేట్/ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన వారే కార్పొరేట్ను స్వయంగా ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం కేంద్రమంత్రి, ఇన్చార్జి మంత్రి చేతులమీదుగా పురస్కారాల అందజేత తప్పు పడుతున్న కూటమి నాయకులు.. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన అవార్డుల పంపిణీకి వచ్చిన టీడీపీ నాయకులను సైతం విద్యార్థుల జాబితా ఆశ్చర్యానికి గురిచేసింది. స్థానికంగా ఓ సీనియర్ నేత బాహాటంగానే విమర్శలు గుప్పించారు. తమ చినబాబు చేస్తున్న దుశ్చర్యల కారణంగా ప్రభుత్వ పరువు, ప్రతిష్ట రోజురోజుకీ దిగజారిపోతోందని పక్కన ఉన్న వ్యక్తులతో తన ఆవేదనను వ్యక్తం చేశారు. చినబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై కూటమి పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. -
అభివృద్ధిని ప్రజలకు వివరిస్తాం
రాయగడ: బీజేపీ అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పలు శాఖల అధికారులలో జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి సమీక్షించారు. సోమవారం డీఆర్డీఏ సమావేశం హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో జిల్లా పరిషత్ కార్యనిర్వాహక అధికారి అక్షయ్ కుమార్ ఖెముండొ, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నహాలు చేపట్టాలని కలక్టర్ సూచించారు. ఈ నెల 11 నుంచి జిల్లాలో గల 11 సమితుల్లో తిరిగేలా వికాస్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వాహనం అన్ని ప్రాంతాల్లో తిరిగి ఏడాదిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందన్నారు. ఆయా సమితుల్లో గల బీడీఏలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ వాహనాన్ని స్వాగతించి, ఆయా సమితి పరిధుల్లో తిరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వాహనం తిరిగే సమయంలో కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ, ఆధార్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయడంతోపాటు కళాకారులకు పింఛన్లు, అటవీ భూమి పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. రేపటి నుంచి సమితుల్లోకి వికాస్ వాహనం -
‘స్టీల్ప్లాంట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల పోరాటంపై పోలీస్ నిర్బంధాన్ని ఎత్తివేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. రా ష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, యాజ మాన్యం ఉక్కు కార్మికులపై కక్ష కట్టాయని, కార్మికులను తీవ్రంగా భయపెట్టి, తొలగించి, పోలీస్ నిర్బంధంతో ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల పోరాటంపై ఉక్కుపాదం మోపాయని అన్నారు. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకు సొంత గనులున్నా ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రమే సొంత గనుల్లేవని అన్నా రు. టీడీపీ, జనసేన నాయకత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలని కోరారు. -
వినతుల వెల్లువ
పర్లాకిమిడి: ఆర్.ఉదయగిరి బ్లాక్ డబరగుడ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, ఏడీఎం ఫల్గుణి మఝి, జిల్లా పరిషత్ ముఖ్య అభివృద్ధి అధికారి శంకర్ కెర్కెటా, తదితరులు హాజరయ్యారు. డబరగుడ, మహేంద్రగడ, చెలిగడ నుంచి 54 వినతులు అధికారులు స్వీకరించారు. వీటిలో 46 గ్రామ సమస్యలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరిష్కరించారు. దివ్యాంగునికి ట్రైసైకిల్ను అధికారులు అందజేశారు. ఆర్.ఉదయగిరి బీడీఓ లారీమన్ ఖర్సల్, తహసీల్దార్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. బలిమెలలో.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బలిమెల ఎన్.ఎ.సి పురపాలక కార్యాలయంలో జిల్లా కలేక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. బలిమెల ఎన్.ఎ.సి పరిధిలో ఉన్న పలు పంచాయతీల నుంచి 32 వినతులు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అభివృద్ధి పనులు ఏలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ కుమార్ సభరో, పోలీసు అధికారి, బలిమెల పురపాలక అధ్యక్షుడు ప్రదీప్ నాయక్, ప్రఽభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. -
ఉత్సాహంగా కంచమ్మ తల్లి సంబరాలు
కంచిలి: మండల కేంద్రం కంచిలిలో నిర్వహిస్తున్న కంచమ్మ తల్లి గ్రామదేవత సంబర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 8వ రోజైన సోమవారం కూడా అమ్మవారిని సాయంత్రం తిరువీధుల్లో ఊరేగించారు. అమ్మవారిని పీఠస్థానం నుంచి మఠం కంచిలి తీసుకొచ్చి, అక్కడి నుంచి మెయిన్రోడ్డు మీదుగా జాతీయ రహదారి కూడలి వరకు ఊరేగించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన వరకు జబర్దస్త్, ఢీ డ్యాన్స్ టీం యాక్టర్స్ అలరించారు. శ్రీముఖలింగంలో పండిత సదస్యం జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా జ్యేష్ట మాసం నాల్గో రోజు సోమవారం అంకురార్పణ, హోమం, పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి స్వామికి ప్రత్యేక పూజలు, ఏకవార అభిషేకాలు నిర్వహించారు. దీనికి ముందు స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే వారాహి అమ్మవారికి మహిళలు ఘనంగా పూజలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కవిటి: ఇచ్ఛాపురం పట్టణం ఉప్పలవీధికి చెందిన గేదెల నాగరాజు(32) అనే వ్యక్తి ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందా డు. ఘటనకు సంబంధించి కవిటి ఎస్ఐ వి.రవివర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. కంచిలిలో జరుగుతున్న అమ్మవారి పండుగల కోసం నాగరాజు మధ్యాహ్నం 1 గంటకు ఇచ్ఛాపురం నుంచి కంచిలి చేరుకున్నాడు. అక్కడ రోజంతా ఉండి రాత్రి 8 గంటలకు సొంతూరు ఇచ్ఛాపురానికి బయలుదేరాడు. ఈ తిరుగు ప్రయాణంలో కవిటి మండలం జాతీయ రహదారిలో సర్పంచ్ దాబా దాటిన తర్వాత జమేదారుపుట్టుగ జంక్షన్కు చేరుకునే సమయానికి బండి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబసభ్యులు ఘటన స్థలానికి వేకువజామున చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్టు ఎస్ఐ రవివర్మ తెలిపారు. ‘జిల్లా అభివృద్ధికి కార్యాచరణ’ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధికి స్పష్టమైన దిశ, కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు సోమవారం విజయవాడలోని సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ ద్వారా స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన చర్చలో కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రి మాట్లాడారు. కేంద్రాస్పత్రిలో పనిచేయని లిఫ్ట్ టెక్కలిరూరల్: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రిలో లిఫ్ట్ మూడు రోజులుగా పనిచేయడం లేదు. పై ఫ్లోర్లో డయాలసిస్ కేంద్రం ఉండడంతో మెట్లు ఎక్కి వెళ్లలేక కిడ్నీ వ్యాధి బాధితులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. మూడు రోజులవుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తక్షణం మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. -
యువకుని అనుమానాస్పద మృతి
రాయగడ: ఒక యువకుని మృతదేహాన్ని మునిగుడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించిన మృతదేహాన్ని గుర్తించిన కొందరు సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. సంఘటన స్థలం వద్ద ఒక బైకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. మృతుడు జిల్లాలొని తెరువలి ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ దేవ్ (30)గా గుర్తించారు. మృతదేహాన్ని బట్టి ఇది హత్యాలేక ఆత్మహత్యా అన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రీయ క్రిస్టియన్ మోర్చా నిరసన
పర్లాకిమిడి: ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్లపై దాడులు, హింస జరుగుతున్నాయని వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని కోరుతూ రాష్ట్రీయ క్రిస్టియన్ మోర్చా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్రీయ క్రిస్టియన్ మోర్చా అధ్యక్షుడు ప్రమోద్ నిషాంత్ మాట్లాడుతూ, మణిపూర్లో క్రిస్టియన్స్పై దాడుల వల్ల 250 మంది మైనార్టీలు చనిపోయారని, 360 చర్చిలు ధ్వంసం అయ్యాయని, 70 వేల మంది నిరాశ్రయులయ్యారని అన్నారు. వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని భారత రాష్ట్రపతి పేరిట రాసిన వినతిని గజపతి కలెక్టరేట్లో డిప్యూటీ కలెక్టర్కు వినతిని అందజేశారు. ఈ నిరసనలో అమోద్ కుమార్ బర్ధన్, ఇంద్రమోహాన్ నాయక్, ఇసాక్ బిశోయి తదితరులు ఉన్నారు. -
భర్త చేతిలో భార్య హతం
పర్లాకిమిడి: అనుమానపు భూతం ఆవహించడంతో భర్త భార్యను హతమార్చిన సంఘటన గజపతి జిల్లా గుమ్మసమితి గైబ గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాయగడ బ్లాక్ కెరడంగ గ్రామానికి చెందిన నరేంద్రపాయిక్ (31) 2019లో జి.మోనికాను (26) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒడియా–తెలుగు కుటుంబాలకు చెందిన ఇద్దరు గుమ్మాబ్లాక్ గైబలో తమ మామగారి వద్ద కిరాణా షాపు పెట్టి నివస్తున్నారు. ఇంతలో నరేంద్రపాయిక్కు హైదరాబాద్లోని కమర్షియల్ మాల్లో ఉద్యోగం వచ్చింది. వీరికి ఐదేళ్ల పాప ఉంది. అమ్మవారి సంబరాల కోసం ఇటీవల స్వగ్రామానికి వచ్చిన నరేంద్ర మోనికాను హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఇటీవలే గైబ గ్రామానికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆమైపె గొడ్డలిలో దాడి చేసి హతమార్చాడు. మెడలో ఉన్న రెండుతులాల బంగారం చైన్ లాక్కుని పారిపోయాడు. కుటుంబ సభ్యులు చూసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గైబ ఓ.ఐ.సి.రామకృష్ణదాస్, సెరంగో పీఎస్ అధికారి ప్రమోద్ ఖండువాల్, యస్.ఐ. కేదార్ పండా సంఘటనస్థలానికి వెళ్లి కేసు నమోదు చేశారు. నిందితుని కోసం సెరంగో పోలీసులు వెతుకుతున్నారు. -
కొలనార సమితిలో వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి సమావేశం హాల్లో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. జిల్లా కమెక్టర్ ఫరూల్ పట్వారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యవర్గ నిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఏడీఎం పబ్లిక్ హెల్త్ మమత సాహు, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన 21 వినతులను కలెక్టర్ పట్వారి ప్రజల నుంచి స్వీకరించారు. ఇందులో 14 వ్యక్తిగతమైనవికాగా మరో ఐదు వినతులు గ్రామసమస్యలుగా గుర్తించి వీటిని సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇద్దరి చికిత్స కోసం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 38 వేల రుపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మీనాజోలకు బస్ సేవలు ప్రారంభం రాయగడ: జిల్లాలోని అత్యంత వెనుబడిన సమితిగా గుర్తింపు పొందిన మీనాజోలకు బస్ సేవలు సొమవారం నుంచి ప్రారంభమయ్యాయి. పర్యాటక ప్రాంతమైన మీనాజోలలో ప్రముఖ పాతాలేశ్వర శైవక్షేత్రం ఉంది. ఇక్కడకు నిత్యం భక్తులు, పర్యాటకులు సందర్శిస్తుంటారు. అయితే సరైన రాకపొకలకు సంబంధించి బస్సు సౌకర్యాలు లేకపొవడంతో ఆటోలపైనే ఆధారపడేవారు. ఇటీవల జిల్లాలోని పర్యటించిన రాష్ట్ర రవాణా, వాణిజ్య, గనుల శాఖల మంత్రి బిభూతి భూషన్ జెన్న పర్యటించినప్పుడు మీనాజోల శైవక్షేత్రం వద్ద గల జనకల్యాణ ఆశ్రమానికి చెందిన స్వామి జనకా నంద గిరి సమస్యను మంత్రి దృష్టికి తీసకువెళ్లారు. స్పందించిన మంత్రి గుణుపూర్ వయా మీనాజోల వరకు బస్ సేవలు అందించాలని ఆర్టీవోకు ఆదేశించారు. దీంతో సోమవారం నుంచి ఇక్కడకు బస్ సేవలు ప్రారంభం కావడంతో మంత్రి జెన్నకు ధన్యవాదాలు తెలియజేశారు. తమ్ముడిపై అన్న దాడి మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి బోండఘాటీ పోల్లగూఢ గ్రామంలో అన్నదమ్ములు భూతగాదాలో కొట్టుకున్నారు. అన్న హర ముదిలి కోపంతో తమ్ముడు తిరుపతిపై బాణంతో దాడి చేశాడు. ఛాతీపై బాణం దిగడంతో అతడిని వెంటనే ఖోయిర్పూట్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కొరాపుట్ తరలించారు. విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగిసిన శిక్షణ మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో గత ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ఈత శిక్షణ సోమవారంతో ముగిసింది. ఉత్తమశిక్షణ దారులకు బహుమతులు అందజేశారు. చెరువుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నిరోధించడానికి శిక్షణ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు కొరాపుట్ నుంచి 30 మంది వచ్చారని, ఏడు సమితులకు చెందిన 300మందికి ఈత నేర్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ పాల్గొని విజేతల పిల్లలకు ప్రమాణ పత్రాలు అందజేశారు. -
ఘనంగా జానపద కళా సమ్మేళనం
మల్కన్గిరి : మల్కన్గిరిలో సోమవారం మహా సంకీర్తన, జానపద కళా సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. నగరం అంతటా హరేకృష్ణ హరేరామ నామ స్మరణ మార్మోగింది. ఒడిశా ప్రభుత్వ ఒడియా బాషా సాహిత్యం, సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు మల్కన్గిరి జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక జగన్నాథ్ మందిరం నుంచి సంకీర్తన బృందాలు బయల్దేరి స్థానిక మెయిన్ రోడ్డు మీదుగా డీఎన్కే క్రీడా మైదానం వరకు సాగాయి. ముగ్గురు జానపద కళాకారులను సత్కరించి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంధ్ర గౌడ్, జిల్లా ఎడిటర్ రామచంద్ర మాఝి, రాష్ట్ర సంకీర్తిన అధ్యక్షుడు నృసింగ్ చరణ్ సమంత్రయ తదితరులు పాల్గొన్నారు. -
ఈపీఎఫ్ పింఛన్ రూ. పది వేలకు పెంచాలి
జయపురం: తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కొరాపుట్ జిల్లా ఈపీఎఫ్ పింఛన్దారుల అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు స్థానిక యాదవ భవనంలో అసోసియేషన్ అధ్యక్షుడు నళిణీకాంత రథ్ అద్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. నళిణీ కాంత రథ్ మాట్లాడుతూ.. నిత్యావసర ధరలు చుక్కలను తాకుతుండడంతో పింఛన్దారులు తమ కుటుంబ పోషణ దుర్భర మౌతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ పింఛన్ను నెలకు రూ. తొమ్మిది వేలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదని వాపోయారు. అలాగే డీఏతో పాటు వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతున్నా చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందమే అవుతోందన్నారు. డిమాండ్ల సాధనకు జరుపుతున్న ఆందోళనను ఇక ముందు కూడా సాగించాలని పిలుపు నిచ్చారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల సమయంలో దేశంలో 70 లక్షలకు పైగా ఉన్న ఈపీఎఫ్ పెన్షనర్ల డిమాండ్లను పార్లమెంట్లో ప్రస్తావించేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐడీయూసీ) సాధారణ కార్యదర్శి అమరజిత్ కౌర్, సీఐటీయూ కార్యదర్శి తపన్ సేన్, భారతీయ మజుదూర్ సంఘ్ (బీఎంఎస్) నేత గిరీష్ చంద్ర, ఐఎన్టీయూసీ నేత పి.కె.రాజులతో పాటు పలువరు నాయకులతో ఈపీఎఫ్ జాతీయ నేతలు చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఈపీఎఫ్ పింఛన్దారులు పనులు చేసే సమయంలో వారి జీతం నుంచి పీఎఫ్ కట్ చేసి జమ చేసేవారని.. అందులో కొంత శాతం ఖర్చు చేసినా వృద్ధాప్య సమయంలో వారి జీవనానికి మంచి పింఛన్ పొందేవారని అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాలలో వృద్ధాప్య పింఛన్ మూడు వేల రూపాయల వరకు ఇస్తున్నాయని తెలిపారు. మోదీ ప్రభుత్వం ఎక్కువ పింఛన్ లభిస్తుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదని విమర్శించారు. సమావేశంలో అసోసియేషన్ సభ్యులు ఎన్.ఎస్.మూర్తి, అచ్యుత మాలీ, కేశవ చంద్రపండ, పి.గౌరీశంకర రావు, ఉమా రథ్, బసంత బెహర పాల్గొన్నారు. అసోసియేషన్ నాయకుల డిమాండ్ -
రోగులకు సముచిత వైద్యమే ప్రభుత్వ లక్ష్యం
జయపురం: రోగులకు సముచిత వైద్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర అన్నారు. జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ కమ్యూనిటీ ఆస్పత్రిలో నూతన అంబులెన్స్ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆస్పత్రిలో అంబులెన్స్ కొరత వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త అంబులెన్స్ రాకతో వారి కష్టాలు తీరుతాయని తెలిపారు. కేంద్రంలో ప్రధాన మంత్రి మోదీ ప్రజలకు ఉచిత వైద్య సౌకర్యం కోసం ఆయుష్మాన్భవ కార్డులు కూడా అందజేశారని తెలిపారు. అంబులెన్స్ ప్రారంభోత్సవంలో కమ్యూనిటీ హాస్పిటల్ అధికారి డాక్టర్ సారధీ ప్రసాద్ ముని, హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గజ వాహనంపై శ్రీవారు రాయగడ: స్థానిక బాలాజీనగర్లో గల కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో సోమవారం స్వామి వారు గజవాహనంపై తిరిగారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. -
ఉత్సాహంగా జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సీనియర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక పోటీలు సోమవారం జరిగాయి. ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు (వాసు), అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్)కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ఎంపికలకు హాజరైన అథ్లెట్స్కు 100, 200, 400, 800, 1600 మీటర్ల పరుగు పందాలు, 5కేఎం వాక్, రన్, లాంగ్జంప్, హైజంప్, షాట్పుట్, జావెలిన్త్రో, హేమర్త్రో వంటి అథ్లెటిక్స్ ఈవెంట్స్ జరిగాయి. ఇక్కడ ఎంపికై న అథ్లెట్స్ను ఈ నెల 14, 15 తేదీల్లో గుంటూరులో జరిగే ఏపీ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2025 పోటీలకు పంపిస్తామని కొన్న మధుసూదనరావు పేర్కొన్నారు. తొలుత క్రీడాకారులకు ఎంపికల తీరుతెన్నులు, విధివిధానాలపై సంఘ నాయకులు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, కె.హరిబాబు, కె.మాధవరావు, శ్రీనివాసరావు, పద్మలోచన, పీడీలు, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
సెమల వంతెన.. నాణ్యత ఇంతేనా..?
జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి భనసులి పంచాయతీ సెమల గ్రామంలో రూ.3కోట్ల 83 లక్షల వ్యయంతో రూరల్ డెవలప్మెంట్ విభాగం ద్వారా నిర్మిస్తున్న వంతెన పనుల్లో అప్రోచ్ రోడ్డు పనుల్లో నాణ్యత లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పనుల వద్ద కాంట్రాక్టర్ కానరావటం లేదంటున్నారు. నాణ్యతాహీనంగా పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని దుయ్యబడుతున్నారు. వారానికి ఒక సారి సమితి కార్యాలయానికి వచ్చి సంతకాలు చేసి అధికారులు వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై విజిలెన్స్ దర్యాప్తు చేయాలని మాజీ సర్పంచ్ నరేంధ్ర మఝి తో పాటు వార్డు సభ్యుడు త్రిపతి నాయిక్,తో పాటు కలియ నాయిక్,యాదవ నాయిక్,ధన్సింగ్ నాయిక్,సమురు పొరజ,లకుము సమరత్ తదితరులు కోరుతున్నారు. అయితే పనుల్లో అక్రమాలేవీ జరగలేదని జూనియర్ ఇంజినీర్ చెబుతున్నారు. జయపురం -
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి జిల్లాలో జి.సిగడాం మండలం ఎస్పీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన తేజోమూర్తుల ఫణికుమార్ కుటుంబ సభ్యులు రూ.లక్ష విరాళంగా ఆదివారం అందజేశారు. ఈ మేరకు ఆలయ ఈవో వై.భద్రాజీకి విరాళ చెక్కును అందజేసి, ఆలయం నుంచి రశీదును పొందారు. అంతకుముందు ఆదిత్యునికి అంతరాలయం దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులు పాల్గొన్నారు. యథేచ్ఛగా ఇసుక దందా కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు వేలాది టిప్పర్లు, లారీలతో నిత్యం యథేచ్ఛగా ఇసుక సరఫరా జరుగుతోంది. నాయకులు ప్రాంతాల వారీగా ఒప్పందం కుదుర్చుకుని ఇసుకను ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్, ఎకై ్సజ్, మున్సిపల్ ఇలా అన్ని శాఖల అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత ఇసుక అని చెప్పి సొమ్ము చేసుకుంటున్న తీరు బహిరంగంగా జరుగుతున్నా దీనిపై ఎవరూ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం. త్రుటిలో తప్పిన ప్రమాదం రణస్థలం: మండల కేంద్రంలోని రామతీర్థాలు కూడలి వద్ద విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు ముందు వెళ్తున్న లారీని వెనుకనుంచి వచ్చిన మరో లారీ ఢీకొంది. అదివారం మధ్యాహ్నం సమయంలో ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేకు వేయడంతో వెనుక వస్తున్న లారీ డ్రైవర్ క్షణాల్లో అప్రమత్తమై బ్రేకు వేసినా నెమ్మదిగా ఢీకొంది. దీంతో లారీ ముందరి భాగం బాగా దెబ్బతినడంతో చాలా సేపు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. డ్రైవర్ చిన్న, చిన్న గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జేఆర్పురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి గార: ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండలంలోని మొదలవలస గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన రావాడ ఆనందరావు(28), అతని స్నేహితుడు దూగాన గణపతి ఇరువురు కలిసి ఫొటోలు తీసేందుకు శ్రీకూర్మం వైపు వెళ్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం కోళ్లపేట జంక్షన్ సమీపంలోకి వచ్చేసరికి ప్రమాదం చోటుచేసుకుంది. రావాడ ఆనందరావు తల విద్యుత్ స్తంభానికి తగలడంతో అక్కడే మృత్యువాతపడ్డాడు. గణపతికి గాయాలవ్వగా 108 వాహ నం ద్వారా రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏఎస్ఐ తెలుగు చంద్రమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం బాటిళ్ల పట్టివేత ఎచ్చెర్ల: లావేరు మండలంలోని బుడుమూరు నుంచి కొత్తూరుపేటకు అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను లావేరు పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. మద్యం అక్రమంగా తరలిస్తున్న కింతలి లక్ష్మణరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదిత్యుని సన్నిఽధిలో ప్రత్యేక పూజలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఆదివారం విశేషంగా భక్తులు పూజలు జరిపించుకున్నారు. జ్యేష్ట మాస ఆదివారం సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చి స్వామికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో వై.భద్రాజీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. ఉచిత ప్రసాదాలను పంపిణీ చేయించారు. ఇక అంతరాలయంలో ప్రత్యేకంగా తులసీదళాలతో ఆదిత్యుని మూలవిరాట్టును అలంకరించి సర్వదర్శనాలకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ అనుమతించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులు దర్శనాలకు క్యూలైన్లలోకి వచ్చేశారు. ఆరోగ్యం కోసం భక్తులు సూర్య నమస్కారాల పూజలు చేయించుకుంటే.. మరికొందరు భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. ఇదిలా ఉండగా ఒక్కరోజులోనే వివిధ దర్శనాల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.4,15,200, విరాళాలు, పూజల ద్వారా రూ.91,388, ప్రసాదాల విక్రయాల రూపంలో రూ.1.98 లక్షల వరకు ఆదాయం లభించిందని ఈవో భద్రాజీ తెలియజేశారు. దర్శించుకున్న విజిలెన్స్ ఎస్పీ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని జిల్లా విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో వై.భద్రాజీ, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు ఆయనకు గౌరవంగా స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, డీ–1 ఏఈ సురేష్కుమార్, ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
లోక బాంధవ శతకం పుస్తకావిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక ఉపనిషన్మందిరంలో పైడి హరనాథరావు రచించిన లోక బాంధవ శతకం పుస్తకావిష్కరణ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రచయిత మాట్లాడుతూ ఈ శతక పద్యములను సమాజ శ్రేయస్సు కాంక్షించి రచించినట్లు పేర్కొన్నారు. ధాన్యం పండించే రైతు, మంచుకొండల్లో ప్రాణాలు పణంగా పెట్టిన సైనికుడుపై పద్యాల రచన జరిగిందన్నారు. కార్యక్రమంలో నారాయణమూర్తి, కోమలరావు, నిష్టల నరసింహమూర్తి, బలివాడ మల్లేశ్వరరావు, గుమ్మా నగేష్, శివరాం, విశ్వనాథం కామేశ్వరరావు, ఎం.శ్రీనివాసరావు, పట్నాయిక్, విశ్వేశ్వరరావు, రమణ, సూరిబాబు, సరస్వతి, లక్ష్మి, విజయలక్ష్మి, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. -
వెలగని దీపం..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన దీపం పథకం ఫలితం నీరుగారుతోంది. సుమారు రెండు నెలలైనా దీపం–2 రెండో విడత నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో అమలుపై అందోళన చెందుతున్నారు. తొలి విడతలో ఈ పథకం ద్వారా అరకొరగా నగదు విడుదల చేసినా, రెండో విడత ప్రారంభం నుంచే ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేసిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. 2024 నవంబర్లో దీపం–2 పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం 2025 మార్చి 31 వరకు స్కీమును అమలు చేసింది. మొదటి విడత కొంతవరకు నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. తర్వాత రెండో విడత 2025 ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. అయితే ఇప్పటికి రెండు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్క పైసా కూడా జమ కాలేదు. దీంతో లబ్ధిదారులు ప్రతిరోజూ బ్యాంకులు, గ్యాస్ ఏజెన్సీలు, అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫిర్యాదులు బుట్టదాఖలు దీపం పథకం ఉచిత సిలిండర్ రాయితీ నగదు అందలేదని చాలా మంది లబ్ధిదారులు పీజీఆర్ఎస్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వారి వద్ద నగదుకి సంబంధించి సమాచారం లేకపోవడం, గ్యాస్ కంపెనీలు తమ వద్ద ప్రభుత్వం నగదు లేదని స్పష్టం చేయడంతో ఫిర్యాదులను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు. రోజుకోమాట... ఉచిత గ్యాస్ పథకంలో రెండో విడత నగదు విడుదలపై కూటమి ప్రభుత్వం కప్పగంతులు వేస్తోంది. రోజుకోమాట చెబుతూ ప్రజలను మభ్యపెడుతోంది. ఒక రోజు అన్ని డబ్బులు త్వరలో వేస్తామని చెబుతున్నారు. మరోసారి ముందుగానే లబ్ధిదారులకు డబ్బులు అందజేస్తాము, వారు ఆ డబ్బులతో సిలిండర్ విడిపించుకోవాలని చెబుతున్నారు. మరోసారి ఈ పథకం నడపడం సాధ్యం కాదని లోలోపల సమాచారం అందిస్తున్నారు. ఇలా ఈ ఉచిత గ్యాస్ పథకంపై ప్రభుత్వం రోజుకోమాట చెబుతోంది. ఈ ఉచిత సిలిండర్ పథకం ద్వారా అందజేసే నగదు జిల్లాలోని సివిల్ సప్లయ్, జాయింట్ కలెక్టర్ కంట్రోల్లో లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది. తొలి విడతకు సంబంధించిన నగదు సంబంధిత గ్యాస్ (ఆయిల్) కంపెనీలకు జమ చేసింది. తొలి విడతకు సంబంధించి కొంత నగదు జమ చేయడంతో, ఆయిల్ కంపెనీలు ఆ నగదుని లబ్ధిదారులకు ఖాతాల్లో జమ చేశారు. అయితే రెండో విడతకు వచ్చేసరికి, ఈ నగదుని గ్యాస్ కంపెనీలకు ప్రభుత్వం జమ చేయలేదు. దీంతో లబ్ధిదారులకు సబ్సిడీ నగదు అందేలా కనిపించడం లేదు. రెండు నెలలైనా అందని దీపం– 2 సబ్సిడీ రెండో విడత సుమారు రూ.16,81,88,000ల బకాయిలు నగదు కోసం లబ్ధిదారుల ఎదురుచూపు ఇదీ విషయం... జిల్లాలో అన్ని గ్యాస్ కంపెనీలకు సంబంధించి 37 ఏజెన్సీలు ఉన్నాయి. ఽవీటిలో సింగిల్, డబుల్ సిలిండర్ల కనెక్షన్లు అన్ని కలిపి 6,92,825 ఉన్నా యి. వీటిలో ప్రతినెల సుమారుగా 88 వేలుకి పైగా లబ్ధిదారులు గ్యాస్ను విడిపించుకుంటున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేయాల్సింది. మొదటి విడతగా 2024 నవంబర్ ఒకటో తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు నిర్ణయించారు. ఈ విడతలో ఐదు నెలలకు గాను జిల్లావ్యాప్తంగా 4,40,278 మంది లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకొని విడిపించుకొన్నారు. వీరిలో 4,35,035 కనెక్షన్లకు మాత్రమే నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యింది. 5,241 మంది లబ్ధిదారులకు రూ.49,78,950లు బకాయిలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరు వరకు రెండో విడత గడువును నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన నిధులు ఇప్పటివరకూ లబ్ధిదారులకు అందలేదు. రెండో విడతకు సంబంధించి రెండు నెలలు అనగా ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో సుమారుగా 1,77,040 మంది గ్యాస్ను బుక్ చేసుకున్నారు. వారు ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు చెల్లించి గ్యాస్ను పొందారు. అయితే వీరికి గాను ప్రస్తుతం ఉన్న గ్యాస్ సిలెండర్ ధర ప్రాప్తికి సుమారుగా రూ.16,81,88,000లు చెల్లించాల్సింది. అయితే దీనికి అతిగతీ లేకుండా పోయింది. -
డ్వాక్రా సంఘంలో రూ.3 లక్షలు గోల్మాల్
సోంపేట: మండలంలోని గొల్లూరు పంచాయతీలోని గనగాలమ్మ ఎస్హెచ్జీ గ్రూప్ లో సుమారు రూ.3 లక్షలు గోల్మాల్ అయినట్లు సంఘ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రూపు సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గనగాలమ్మ గ్రూప్ సభ్యులు బారువ స్టేట్ బ్యాంక్లో బ్యాంక్ లింకేజి ద్వారా రూ.పదిలక్షల రుణం తీసుకున్నారు. అయితే సంఘ ఆర్గనైజర్ గజ్జి ఊర్వశి గత కొన్ని నెలలుగా సంఘ సభ్యుల వద్ద నుంచి సుమారు రూ.3 లక్షలు బ్యాంకుకు కడతానని తీసుకుని సొంత అవసరాలకు వాడుకున్నారు. ఆ డబ్బు బ్యాంకుకు కట్టలేదు. బ్యాంకు అఽధికారులు గ్రూపు సభ్యులను నిలదీయడంతో ఆర్గనైజర్ గోల్మాల్ వ్యవహారం బయటపడింది. దీంతో గనగాలమ్మ గ్రూప్ సభ్యులు గ్రామ సంఘం వీఓఏ వంకల మోహనరావును అడిగారు. దీంతో ఆర్గనైజర్ను బ్యాంకు లింకేజీ కట్టమని వీఓఏ చెప్పారు. అయితే డబ్బు వాడుకుని ఐదారు నెలలు గా చెల్లించకపోయినా వీఓఏ గ్రూపు సభ్యులకు తెలియజేయక పోవడం గమనార్హం. దీంతో గ్రూపు సభ్యులు బారువ పోలీసులను ఆశ్రయించారు. ఆర్గనైజర్ భర్త అధికార పార్టీ నాయకుడు కావడంతో ఓ నియోజకవర్గ నాయకుడు కేసు ను సద్దుమణిగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బారువ పోలీసులు సంఘ సభ్యులను సముదాయించి గోల్మా ల్ చేసిన నిధులు ఆర్గనైజర్ చెల్లిస్తారని హామీ ఇవ్వడంతో గ్రూప్ సభ్యులు వెనుదిరిగారు. అయితే ని ధులు గోల్మాల్ చేసిన ఆర్గనైజర్పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. గ్రామానికి చెందిన ఇంకో సంఘంలోనూ ఇలాగే జరిగింది. విషయం బయటకు రావడంతో డబ్బు చెల్లించారు. -
21 కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరి అరెస్టు రాయగడ: అబ్కారీ, రైల్వే పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనితో సంబంధం ఉన్న ఇద్దరి నిందితులను అరెస్టు చేశారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్లో ముంబాయికి గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు అబ్కారీ సిబ్బంది, రైల్వే పోలీసులు దాడులను నిర్వహించినట్లు అబ్కారీ శాఖ అధికారి సంతోష్ కుమార్ దళ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. రెండు లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించారు. -
ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలి
శ్రీకాకుళం క్రైమ్: నగరంలోని పాత శ్రీకాకుళంలో ఈనెల 10వ తేదీన జరిగే పెద్దమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి సిరిమాను ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. శ్రీకాకుళం పట్టణం, పాత శ్రీకాకుళం (మావూరు వీధి, కలెక్టర్ బంగ్లా, హరిజన వీధి, బాదుర్లపేట, కొత్తపేట, కునుకుపేట, దండివీధి, దేశర్ల వీధి, నక్కవీధి)లో పండగ నేపథ్యంలో రూట్మ్యాప్, బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి పర్యవేక్షించారు. జిల్లా పరిషత్, నక్కవీధి, సంతోషిమాత గుడి, కలెక్టర్ బంగ్లా తదితర రహదారి మార్గంలో కాలినడకన సందర్శించి భక్తుల దర్శనం, క్యూలైన్లను పర్యవేక్షించారు. సిరిమాను తిరిగే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారుల సాయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండ తీవ్రత ఆధారంగా మున్సిపల్ అధికారుల సమన్వయంతో మంచినీటి సదుపాయాన్ని ఇరువైపులా ఏర్పాటు చేయాలన్నారు. సిరిమాను తిరిగే ముఖ్య కూడళ్లు, గుడిలోపల, క్యూలైన్ల వద్ద సీసీ కెమెరాల నిఘా ఉండాలని, డ్రోన్ కెమెరాలు ఉపయోగించి భక్తుల రద్దీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలించాలని, రహదారి మార్గాలు సులువుగా తెలుసుకునేలా సూచికా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, సీఐలు పైడపునాయుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి -
ట్రాన్స్జెండర్స్కు సంక్షేమ బోర్డు ఏర్పాటు
పర్లాకిమిడి: ఒడిశాలో ఆదివారం భువనేశ్వర్లో ట్రాన్స్జెండర్స్ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కేసరి హోటల్లో సమావేశం జరిగింది. గజపతి జిల్లా నుంచి ట్రాన్స్ జెండర్స్ సంఘం కార్యదర్శి జాస్మిన్ షేక్, సభ్యురాలు లిన్ను సుబుద్ధి పాల్గొన్నారు. ఒడిశా ప్రభుత్వం తరఫున ట్రాన్స్జెండర్ప్కు వివిధ సంక్షేమ పథకాలు, ఉపాధి, విద్య, ఉచిత వైద్యం, ఇళ్ల పట్టాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సభ్యులు అధికారులను కోరారు. దీనిపై ఒడిశా అధికారులు సానుకూల వైఖరి అవలంబించినట్టు గజపతి జిల్లా ట్రాన్స్జెండర్స్ కార్యదర్శి జాస్మిన్ షేక్ తెలియజేశారు. -
గవర్నర్ పిలుపు
వ్యవసాయ స్వావలంబనకుభువనేశ్వర్: వ్యవసాయ రంగంలో లోటు అంశాలను గుర్తించి ఒడిశాను స్వయం సమృద్ధిగా మార్చేందుకు విధాన నిర్ణేతలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వ విద్యాలయం (ఓయూఏటీ), ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (ఐఎస్ఏఎం) సంయుక్తంగా స్థానిక ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఓయూఏటీ) నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రాయోజిత పథకాలను విద్యా పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరాన్ని తెలియజేశారు. తద్వారా ఎక్కువ మంది ముఖ్యంగా రైతులు వారికి అందుబాటులో ఉన్న ప్రయోజనాలను పొందగలుగుతారు. రైతులలో వ్యవస్థాపకతను పెంపొందించే మరియు ఆధునిక వ్యవసాయ వ్యాపార పద్ధతుల కోసం నైపుణ్యం ఆధారిత శిక్షణతో వారిని సన్నద్ధం చేసే సమగ్ర నమూనాను ఆవిష్కరించాలని విద్యావేత్తలు, విధాన నిర్ణేతలను కోరారు. రాష్ట్రంలో ప్రత్యేకమైన వ్యవసాయ వాతావరణ పరిస్థితులు, తీరప్రాంత మైదానాల నుంచి అటవీప్రాంత ఎత్తైన ప్రాంతాల వరకు విభిన్న వ్యవసాయ కార్యకలాపాలకు అనువైనవిగా ఉన్నాయి. రాష్ట్రంలో 50 శాతం కంటే ఎక్కువ జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ వ్యాపారం గ్రామీణ శ్రేయస్సు మరియు ఉపాధి కల్పనకు శక్తివంతమైన ఇంజిన్గా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ ఉత్పాదన, విలువల జోడింపు, శీతల గిడ్డంగులు వంటి చర్యలు పసుపు, మిల్లెట్లు, మామిడి, సముద్ర చేపలు, కూరగాయలు వంటి ఎగుమతి ఆధారిత వ్యవసాయంలో అధిక సంభావ్య పంటలు, పదార్థాల ఉత్పాదనకు దోహదపడతాయి. రాష్ట్రానికి గణనీయమైన ఆర్థిక వనరుల్ని సమకూర్చి స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు వారధిగా నిలుస్తాయన్నారు. వ్యవసాయ వ్యాపార వృద్ధికి స్థిరమైన మార్గాలను చర్చించడానికి పరిశోధకులు, విధాన రూపకర్తలు మరియు వాటాదారులు ఇక్కడ సమావేశం కావడం అభినందనీయమని గవర్నర్ ప్రశంసించారు. ఉద్యానం, మత్స్య సంపద, పాడి, మొక్కజొన్న, పప్పుఽ దాన్యాలు వంటి రంగాల పెరుగుదల ద్వారా రాష్ట్రం జీవనాధార వ్యవసాయం నుండి మార్కెట్ ఆధారిత వ్యవసాయానికి మారుతోందని అన్నారు. గ్రేడింగ్, ప్యాకేజింగ్, పంటకోత నిర్వహణలో శిక్షణ ఇవ్వడం ద్వారా రైతులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించాల్సిన అవసరాన్ని గవర్నర్ ప్రసంగంలో ప్రాధాన్యత కల్పించారు. క్లస్టర్ ఆధారిత నమూనాల ద్వారా ఎఫ్పీఓలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, చిన్న ఉత్పత్తిదారులను బలోపేతం చేయాలని తెలిపారు. ఐఎస్ఏఎం కార్యదర్శి డాక్టర్ టి.సత్యనారాయణ్, సంబల్ పూర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిధు భూషణ్ మిశ్రా, ఓయూఏటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రభాత్ కుమార్ రౌల్, ఓయూఏటీ వ్యవసాయ కళాశాల డీన్ ప్రొఫెసర్ హృషీకేష్ పాత్రో ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా అతిథులు సదస్సు జ్ఞాపిక సంచికను ఆవిష్కరించారు. -
ఆదివాసీల విశ్వాసానికి ప్రతీక బిరిపాణి జాతర
● భారీగా తరలివచ్చిన భక్తులు ● ఈ ఏడాది వర్షాలు ఎలా పడతాయో వెల్లడించిన పూజారులు జయపురం: ఆదివాసీ ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వారు జరుపుకునే పండుగలు వారి జీవన విధానంతో ముడిపడి ఉంటాయి. అలాంటి వాటిలో బిరిపాణి జాతర ఒకటి. ఈ జాతర ద్వారా వర్ష రుతువులో పడే వర్షాలపై అంచనా వేస్తారు. వర్షాలు బాగా పడతాయా, లేదా, ఈ కాలంలో ఎలాంటి పంటలు వేస్తే ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది మొదలగు విషయాలు తెలుసుకోవడానికి జయపురం సమితి గొడొపొదర్లో బిరిపాణి జాతర జరుపుకుంటారు. ఈ అశాసీ్త్రయ నమ్మకం శతాబ్దాల కాలం నుంచి ఆదివాసీల్లో ఉంది. శాస్త్రవేత్తలు రుతుపవనాల కదలికలు, వర్ష పాత సూచనలు తెలియజేస్తూ ఉంటారు. అయితే వారు గణాంకాలు కొన్ని సమయాలలో తప్పు కావచ్చు. కాని బిరిపిణి జాతార ద్వారా ఆదివాసీ శిశాలు, దిశారీలు రుతపవనాలపై వేసే అంచనాలు తప్పవని నమ్ముతారు. వర్ష రుతువులో వర్షాల ఏవిధంగా పడతాయి, పూజారి ఏమి చేపుతాడో తెలుసుకునేందుకు ఆదివాసీ గ్రామాల నుంచి శనివారం బిరిపాణి జాతర జరిగే జయపురం సమితి గొడపోదర్ గ్రామానికి తరలి వచ్చారు. ఈ పండుగ జయపురం సమితి గొడొపొదర్ గ్రామంలో ఏటా అంగరంగవైభవంగా జరుగుతుంది. శనివారం జరిగిన బిరిపాణి జాతరకు అనేక ప్రాంతాల నుంచి వేలాదిమంది ఆదివాసీలు వారి గ్రామ దేవతల లాఠీలతో తరలివచ్చారు. ముందుగా గ్రామ నచి బొడ్డున గల బిరిపాణి దేవి మందిరంలో పూజలు చేశారు. దేవికి కోళ్లు, మేకలు, గొర్రెలు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఇంటివద్ద గ్రామ దేవతల లాఠీలకు పూజలు చేయగా అచ్చట నుంచి గ్రామానికి దూరంలోని పర్వతంపైకి వెళ్లి అక్కడ ఉన్న దేవత విగ్రహాలకు పూజలు చేశారు. గ్రామ పూజారి కలుగులో చేయి పెట్టి అందులో ఉన్న నీటి మట్టాన్ని బట్టి వర్షపాతాన్ని అంచనా వేశారు. జాతరలో పాల్గొన్న భక్తులు బిలం నుంచి వచ్చే నీటిని బాటిళ్లలో పట్టుకొని తీసుకొని వెళ్లారు. అ నీటిని పొలాలలో చల్లితే పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం. 200 ఏళ్లుగా జాతర.. 200 ఏళ్లుగా ప్రసిద్ధ బిరిపాణి జాతర జరుగుతుంది. బిరిపాణి దేవి సత్యమైన తల్లి అని.. జయపురం మహారాజుల కాలం నుంచి ప్రజలు ఈ పండుగ జరుపుతున్నారని గ్రామ పంచాయతీ మందిర పూజారి వెల్లడించారు. అనాతిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం తాము ఈ పూజలు చేస్తున్నామని.. ఈ పూజ ద్వారా వర్షపాతం ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు. వర్షకాలంలో అతివృష్ట, అనావృష్ట లేక సాధారణ వర్షమా అని పూజారి చెబుతారని.. అందుకు తగ్గట్టుగా పంటలు వేసుకుంటామన్నారు. -
సమితి ఇంజినీర్ తీరుపై సభ్యుల ధ్వజం!
జయపురం: జయపురం సబ్డివిజన్ కోట్పాడ్ సమితి ప్రభుత్వ ఇంజినీర్ తీరుపై సమితి సభ్యులు ధ్వజమెత్తారు. కోట్పాడ్ సమితి ఛతర్ల పంచాయతీ డుమాజోడి గ్రామం గులిమి వద్ద సమితి సభ్యులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఇంజినీర్ సంతోష్ బాగ్సింగ్ను గత డిసెంబర్లో కోట్పాడ్ సమితి నుంచి బొరిగుమ్మ సమితికి బదిలీ చేశారని.. అయితే నేటి వరకు అతన్ని ఇక్కడ నుంచి రిలీవ్ చేయక పోవటంలో రహస్యం ఏమిటని ప్రశ్నించారు. ఇతనిపై పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నా వాటిని మాఫీ చేశారని ఆరోపించారు. బాగ్సింగ్ సమితి కార్యాలయంలో ఎప్పుడూ ఉండరని ఆరోపించారు. అవసరం నిమిత్తం ఫోను చేసినా ఎత్తకుండా కట్ చేస్తారన్నారు. గత నవంబర్ 25వ తేదీన ఆఫీసు ఆర్డర్ అయిన తరువాత అతడు కోట్పాడ్ సమితిలో ఏ బాధ్యతలు నిర్వహించటం లేదని చెబుతున్నారని.. అయితే కొన్నిసార్లు కార్యాలయానికి వస్తూ ప్రజా ప్రతినిధులు, కంట్రాక్టర్లపై అవమానకరంగా వ్యవహరిస్తున్నారని అరోపించారు. అలాగే సునారబెలి, నువాగాం, చిత్ర, ఘుమర బాధ్యతలు నిర్వహిస్తున్న జూనియర్ ఇంజినీర్ దాస్ ఆయా గ్రామాలకు సమితి కార్యాలయానికి గాని సక్రమంగా రావటంలేదని కొందరు ఆరోపించారు. అభివద్ధి పనులు నాణ్యత హీనంగా చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. సభ్యులు సమితిలో జరుగుతున్న అక్రమాలపై చర్చించారు. సమస్యలు పరిష్కరించక పోతే ఆందోళన చేపడతామని మీడియాకు తెలిపారు. సమావేంలో సమితి ఉపాధ్యక్షులు బాబులి పాణిగ్రహి, గురునాథ్ హరిజన్, ప్రతాప్ సాహు, శుఖదేవ్ బితార్,కాంచన బాగ్,మెలక జాయిఫూల్,జగదీష్ భొత్ర, శ్రీదేవీరావు పాల్గొన్నారు. -
రథాల పై అంతస్తు తయారీ ప్రారంభం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని యాత్ర కోసం రథాల తయారీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మధ్యంతర దశలో కలప దుంగలు తయారీ శాలకు చేరడంలో కొంత మేరకు ఆలస్యం జరిగినా తర్వాత పనులు ఊపందుకున్నాయి. సాధారణంగా స్వామి స్నానోత్సవం నాటికి పూర్తి కావాల్సిన రథాల పై అంతస్తు తయారీ పనులు దాదాపు 2 రోజులు ముందుగా పూర్తి కానున్నాయి. రథ చక్రాలకు ఇరుసుల అమరిక పూర్తయిన నాటికి పై అంతస్తు పనులు ఆరంభమై ముందస్తుగా సిద్ధమయ్యాయి. ఇరుసు, చక్రాల ఆధారంగా నిర్మితం అవుతున్న పై అంతస్తు భాగంపై భారీ రథం ప్రధాన భాగం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో దీని తయారీ అమరిక అత్యంత కీలకమని వడ్రంగి సేవకులు తెలిపారు. అనిమేష్ కుజుర్కు సీఎం అభినందనలు భువనేశ్వర్: తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ 2025లో పురుషుల 400 మీటర్ల రిలేలో ఒడిశాకు చెందిన అనిమేష్ కుజుర్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. భారత జట్టులో గుర్విందర్ సింగ్, అనిమేష్ కుజుర్, అమ్లాన్ బోర్గోహైన్ మరియు మణికంఠ హోబ్లిదార్ ఉన్నారు. భారత జట్టుకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభినందనలు తెలిపారు. ఈ జట్టులో భాగమైన యువ ఒడిశా రన్నర్ అనిమేష్ కుజుర్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మజ్జిగౌరి మందిరానికి పోటెత్తిన భక్తులు రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తులు బారులు తీరి క్యూలో వేచిఉండాల్సి వచ్చింది. అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టిందని భక్తులు తెలియజేశారు. అయితే వీఐపీ దర్శనం టిక్కెట్లు రూ.300 చెల్లించి దర్శనం కోసం వెళ్లిన భక్తులకు తిప్పలు తప్పలేదు. దీంతో విసుగెత్తిన భక్తులు కొంతమంది ఆరు బయటే అమ్మవారికి మొక్కుబడులు చెల్లించి ఇంటికి తిరిగి వెళ్లారు. రథయాత్రకు కోవిడ్ మార్గదర్శకాలు జారీ: ఆరోగ్య శాఖ భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్ర దగ్గర పడుతోంది. మరో వైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పుంజుకుంటోంది. కరోనా సంక్రమణ నియంత్రణపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరుకుంది. ప్రస్తుతం 7 మంది కోలుకోవడంతో 23 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ పాజిటివ్ రోగులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ నీలకంఠ మిశ్రా తెలిపారు. ఈ ఏడాది జరగనున్న రథయాత్ర కోసం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ 19 లక్షణాలతో అనారోగ్య పరిస్థితి ఉంటే రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ నీలకంఠ మిశ్రా ప్రజలను కోరారు. కోవిడ్ ఆంక్షలు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.అశ్వత్థి రథ యాత్రలో కోవిడ్ జాగ్రత్తల ఆచరణ, నివారణ కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. జలుబు, ఫ్లూ వంటి కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులు, వృద్ధులు లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు స్వామి యాత్రలో రథం లాగేందుకు అనుమతించరు. అదే విధంగా ఇతర తీవ్రమైన వ్యాధుల కారణంగా బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారిని ఉత్సవాలకు హాజరు కావద్దని కోరారు. యాత్రలో పాల్గొనదలిచే వారు మాస్క్లు ధరించి తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ తెలిపింది. శుభ్రమైన తాగునీటిని ఉపయోగించాలని కోరారు. పూరీ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయు) పనిచేస్తుంది. పడకల సంఖ్యను పెంచుతారు. అంబులెన్స్ సౌకర్యాలు, ఆరోగ్య అధికారులతో పాటు అన్ని అనుబంధ వైద్య, చికిత్స సరంజామా అందుబాటులో ఉంచుతారు. -
బిన్నీస్పూర్లో జ్వరాలు
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి గడిశెశిఖాల్ పంచాయతీలొని బిన్నీస్పూర్ గ్రామంలో జ్వరాలు ప్రబలుతున్నాయి. గత వారం రోజులుగా గ్రామంలో జనం తలనొప్పి, జ్వరం, కాళ్ల నొప్పులు వంటి వ్యాధులతో బాధ పడుతున్నారు. దాదాపు 50 మందికి పైగా మంచాన పడ్డారు. కొలనార ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ప్రత్యేక మెడికల్ టీం గ్రామానికి చేరుకుంది. శని, ఆదివారాల్లో ఆ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి వ్యాధితో బాధపడుతున్న వారి రక్తనమూనాలను సేకరించింది. శనివారం 35 మందికి రక్తపరీక్షలు చేయగా ఇందులో సునాయి పెద్దింటి, విశ్వనాత్ ముండుక, బొర్షాముండుకలకు మలేరియా సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన వైద్య శాఖ పరిస్థితి విషమించకముందే అదుపులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టింది. మలేరియా వ్యాధి లక్షణాలు ఉన్న వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ జ్యొత్సామయి రవుతొ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం గ్రామంలొ పర్యటించి గ్రామస్తులు వినియోగిస్తున్న తాగునీటి వనరులను పరిశీలించారు. మలేరియా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను ఆశా కార్యకర్తలు గ్రామస్తులకు వివరించడంతో పాటు దొమతెరలను పంపిణీ చేశారు. -
చికిత్సకు డబ్బుల్లేక..
జయపురం: మెరుగైన వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక మరో సేవాపేపరుమిల్లు కార్మికుడు మరణించినట్లు మిల్లు ప్రథమ యూనియన్ అధ్యక్షుడు ప్రమోద్కుమార్ మహంతి వెల్లడించారు. మరణించిన వ్యక్తి బలభధ్ర జెన అని వెల్లడించారు. నేటి వరకు 41 మంది సేవా కార్మికులు తగిన వైద్యం పొందలేక మరణించినట్లు మహంతి తెలిపారు. గత 10 నెలలుగా కార్మికులకు జీతాలు లేవని, మిల్లులో ఉత్పత్తి బందు అయిందని ఆయన పేర్కొన్నారు. ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు. మిల్లు అమ్మివేసి పునరుద్ధరణకు రెండు సార్లు రూ.200 కోట్లు అప్పు చేశారని, అయినా మిల్లు మూత పడి ఉందని, ఇది విచారకరమైన విషయమన్నారు. మరోసారి మిల్లు నడిపేందుకు పెట్టుబడి పెడుతున్న మరో సంస్థకు రుణం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయినా కార్మికుల విషయం ఎవరూ పట్టించుకోవటంలేదని కార్మిక నేత ప్రమోద్ మహంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై త్వరలో రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించనున్నట్లు తెలిపారు. -
శ్రీమందిరంలో డిజిటల్ హుండీకి సన్నాహాలు
భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయానికి విరాళాల ప్రక్రియను ఆధునీకరించేందుకు అనుబంధ యంత్రాంగం నడుం బిగించింది. ఈ నేపథ్యంలో సమర్పణ అనే డిజిటల్ హుండీ వ్యవస్థను ప్రారంభించాలని సంకల్పించింది. దేశ వ్యాప్తంగా బహుళ బ్యాంకు శాఖలలో ఈ వ్యవస్థని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదేశాల మేరకు న్యాయ శాఖ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పాలుపంచుకుంటుంది. ఈ సన్నాహాల్లో శ్రీ మందిరం పాలక మండలి సభ్యులు చురుకుగా పాలుపంచుకుంటున్నారు. ఆన్లైన్ విరాళాల ప్రక్రియను క్రమబద్ధీకరించి సరళీకృతం చేసేందుకు సమర్పణ డిజిటల్ చొరవ దోహదపడుతుందని భావిస్తున్నారు. దీని ద్వారా భక్తులు ఎక్కడి నుండైనా ఆలయానికి విరాళాలు ఇవ్వడానికి వీలు కలుగుతుంది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో, రాష్ట్రం వెలుపల ప్రత్యేక డిజిటల్ హుండీలను ఏర్పాటు చేస్తారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఆన్లైన్ విరాళాలు చెల్లించేందుకు వీలు అవుతుంది. భక్తులకు సౌకర్యం డిజిటల్ హుండీలను ప్రారంభించడానికి వివిధ బ్యాంకుల చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్లతో (సీఎండీలు) చర్చలు ప్రారంభించారు. భక్తులు యూపీఐ కోడ్లను స్కాన్ చేసి, వారి కానుకలను నేరుగా జగన్నాథ ఆలయ ఖాతాకు చెల్లించడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ డిజిటల్ విధానం పారదర్శకతను పెంపొందించి రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్న భక్తులు మతపరమైన వేడుకలు మరియు ఉత్సవాలు, యాత్రలు వంటి సందర్భాల్లో విరాళాలు ఇవ్వడానికి అనుకూలమైన సౌకర్యం కల్పించడం లక్ష్యంగా పేర్కొన్నారు. భద్రతా సమస్యల ప్రస్తావన మరోవైపు కొంతమంది మాజీ బ్యాంకర్లు నకిలీ స్కానింగ్ పరికరాలను ఉపయోగించి సైబర్ స్కామ్లు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు, దీనితో ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. సమర్పణ్ చొరవ జాతీయ, అంతర్జాతీయ భక్తులు జగన్నాథుడికి తమ విరాళాలను అందించడానికి ప్రధాన వారధిగా నిలుస్తుందని భావిస్తున్నారు. మాజీ బ్యాంకర్ల సూచన మేరకు క్యూఆర్ కోడ్లో కొన్ని భద్రతా చర్యలు తీసుకోవడం అనివార్యంగా పరిగణిస్తున్నారు. రాష్ట్ర న్యాయ శాఖ, సాంకేతిక సమాచార విభాగం సమన్వయంతో ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడానికి వివిధ భద్రతా చర్యలను పరిశీలిస్తున్నారు. గత మూడేళ్లలో శ్రీ మందిరానికి దాదాపు రూ. 113 కోట్ల విరాళాలు అందాయి. వాటిలో రూ. 59.67 కోట్లు బ్యాంకు డిపాజిట్ల ద్వారా జమ అయ్యాయి. ప్రతిపాదిత డిజిటల్ హుండీ వ్యవస్థ ఆన్లైన్ విరాళాలను గణనీయంగా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. -
కొట్పాడ్లో రబీ మండీలు ప్రారంభం
జయపురం: వర్షాకాలం ప్రారంభం కాక ముందే మండీలకు వచ్చిన ధాన్యాన్ని ఖరీదు చేయాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితిలో కొట్పాడ్, బొబాయి లలో శనివారం జయపురం రెగ్యులేటింగ్ మార్కెటింగ్ కమిటీ వారు రబీ ధాన్యం మండీలను ప్రారంభించారు. ఈ మండీల్లో బొబాయి, నువాగాం,ఘుమరా పంచాయతీల సర్పంచ్లు, రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు. బొబాయి మండీ వారంలో మూడు దినాలు ఉంటుందని, రోజుకు 3 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తామని ఆర్ఎంసీ అధికారులు వెల్లడించారు. క్వింటాల్ ధాన్యం రూ.3,100కు ఖరీదు చేస్తారని పేర్కొన్నారు. డీఎల్సీ సమావేశంలో మే 25 నుంచి మండీలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ధాన్యం బస్తాలు ఉంచేందుకు ప్లాట్ ఫారంలు లేని మండీలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై లేంప్స్, ఆర్.యం.సిలు దృష్టి సారించాలని రైతులు కోరారు. మండీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రైతులు, రైతు ప్రతినిధులు అధికారులను కోరారు. -
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా..
రణస్థలం: మండల కేంద్రం రణస్థలంలోని సూర్య స్కూల్ కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందింది. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కమ్మసిగడాం జంక్షన్లో నివాసముంటున్న తోరాడ సాయి(36) జె.ఆర్.పురం జగనన్న కాలనీలోని శుభకార్యానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బంధువు ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. సూర్య స్కూల్ జంక్షన్లో రోడ్డు క్రాస్ చేసేందుకు ఆగారు. ఆ సమయంలో విశాఖపట్నం వైపు నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురూ కిందపడిపోయారు. సాయి తలభాగం నుజ్జయిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సాయి కమ్మ సిగడాం జంక్షన్లో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. భర్త రామ్మూర్తి వంట పని చేస్తుంటారు. సాయి స్వగ్రామం దేవరాపల్లి. ఈమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. భర్త రామ్మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చిరంజీవి తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ మహిళ దుర్మరణం -
ధాన్యం సేకరణపై సమీక్ష
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం సేకరణను ఆహార సరఫరాలు మరియు వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్రో సమీక్షించారు. ఒడిశా రాష్ట్ర సరఫరా కార్పొరేషన్ సమావేశం హాల్ ప్రాంగణంలో అధికారులతో సమావేశమై మంత్రి సమీక్షించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆహార సరఫరా కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.సుదర్శన్ చక్రవర్తి ధాన్యం సేకరణ వివరాలను ప్రవేశపెట్టారు. ప్రస్తుత రబీ సీజన్లో రాష్ట్రంలోని దాదాపు 88 వేల మంది రైతుల నుంచి ఇప్పటివరకు దాదాపు 6 లక్షల 6 వేల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేశారు. అదనపు సాగు పెట్టుబడి మరియు కనీస మద్దతు ధర కింద రైతాంగం పొదుపు ఖాతాలకు సుమారు రూ.1,566 కోట్లు ప్రత్యక్షంగా బదిలీ చేశారు. సేకరణ వేగవంతం రుతు పవనాలు వస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. మండీల్లో రైతులు పోగు చేసిన ధాన్యం రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతుందన్నారు. వరి సేకరణ సమయంలో ఏవైనా అవకతవకలు జరిగాయని ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 214 గోడౌన్ల ఆధునీకరణ, సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు చేపట్టారు. దీంతో పాటు కార్పొరేషన్ కొత్త భవనాల నిర్మాణ పురోగతిపై కూడా సమీక్షించారు. సాధారణ పంపిణీ విభాగం జనరల్ మేనేజర్ సుధాకర్ సొబొరొ, ధాన్యం సేకరణ జనరల్ మేనేజర్ ఎలోరా సామల్, పాలనా విభాగం జనరల్ మేనేజర్ ప్రణతి ప్రియదర్శిని రౌత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
కొనసాగుతున్న కంచమ్మతల్లి ఉత్సవాలు
కంచిలి: మండల కేంద్రం కంచిలిలో కంచమ్మతల్లి గ్రామదేవత ఉత్సవాలు ఆరో రోజైన శనివారం వైభవంగా జరిగాయి. అమ్మవారిని పీఠస్థానం నుంచి నేరుగా రైల్వే క్టార్టర్స్, మల్లా క్వార్టర్స్ మీదుగా ఎస్.ఆర్.సి.పురం కాలనీలో ఊరేగింపు చేపట్టారు. పార్వతీపురానికి చెందిన నమో వెంకటేశాయ, తాడేపల్లిగూడెం నవదుర్గలు, శ్రీకాకుళం దాండియా, గోపాల్పూర్ ధూమ్ ధమాకా, స్థానిక కళాకారుల గ్రూప్ డ్యాన్స్, పద్మనాభపురం పాలబొమ్మలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఢిల్లీ ఈవెంట్స్ ప్రోగ్రామ్కు జనం పోటెత్తారు. మరోవైపు అమ్మవారి నమూనా విగ్రహం ప్రాంగణం వద్ద వచ్చిన భక్తులకు పలువురు దాతలు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. -
‘పనితీరును ప్రజలకు చెబుదాం’
రాయగడ: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు బీజేపీ చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, వాటి తీరుతెన్నుల విషయమై ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అందుకు రాష్ట్రంలో గల ప్రతి జిల్లా కేంద్రంలొ వికాష్ మేళా పేరిట ప్రదర్శనలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని రాష్ట్ర రవాణా, వాణిజ్య, గనుల శాఖల మంత్రి బిభూతి జెన్న అన్నారు. రాయగడలొ ఒక్కరొజు పర్యటనకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా స్థానిక డీఆర్డీఏ సమావేశం మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ నెల 12 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు స్థానిక గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రదర్శన మేళాను ఏర్పాటు చేయాలని, అందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలొ బీజేపీ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా చోటు చేసుకున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు స్టాల్లను ఏర్పాటు చేసి ప్రదర్శించాలని అన్నారు. గుర్తింపు పొందిన జిల్లాల్లో కృషక్ మేళా, నారిశక్తి , యువశక్తి, ఆదివాసీ మేళాలను విస్తృతంగా ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలొ కలెక్టర్ ఫరూల్ పట్వారి, జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, జిల్లా పరిషత్ కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న తదితరులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశం పూర్తయిన అనంతరం మంత్రి జెన్న విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలే భవిష్యత్లో పార్టీ మనుగడకు ఊపిరి పోస్తాయన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ కృషి చేస్తుందని అన్నారు. రాయగడలో గల ఔస్ఆర్టిసి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఉన్న బస్సులు పాతబడటంతో రద్దు చేయడంతో అందులో పనిచేసే సిబ్బంది, ఉద్యోగుల భవిష్యత్ అంధకారంగా మారిందన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ త్వరలో ప్రభుత్వం కొత్త బస్సులను ఏర్పాటు చేసి యథావిధిగా కొనసాగిస్తుందని అన్నారు. -
పట్టు పోగుల తరలింపు
ఆదివారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2025జగన్నాథుని కోసం..భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని అలంకరణ తదితర కార్యక్రమాల్లో వినియోగించే పట్టు పోగుల్ని శ్రీ మందిరానికి తరలించారు. స్థానిక షహీద్ నగర్లోని ఒడిశా సహకార టసర్, రేషమ్ మహాసంఘ్ (సెరిఫెడ్) కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రత్యేక వాహనంలో 350 కిలో గ్రాముల పట్టు పోగుల్ని పూరీ శ్రీ మందిరానికి తరలించారు. ఈ సందర్భంగా వాహన ప్రారంభం ప్రాంగణంలో లాంచనంగా పూజాదులు నిర్వహించారు. ధూపదీపాదులతో మంగళ హారతి సమర్పించి సాగనంపారు. రాష్ట్ర సహకార, చేనేత, హస్తకళల శాఖ మంత్రి ప్రదీప్ బొలొ సామంత జెండాను ఊపి పట్టు పోగుల రథాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో విభాగ అధికారులు భక్తి శ్రద్ధలతో పాలుపంచుకున్నారు. ఈ పట్టు పోగుల్ని రత్న వేదికపై కొలువు దీరిన బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుడు, సుదర్శనుని అలంకరణ కోసం వినియోగిస్తారు. రథ యాత్ర, రక్షా బంధన్ ఇతరేతర పండగ పబ్బాలు సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ఉత్సవాల్లో వినియోగిస్తారు. శ్రీ మందిరం పాలన వర్గం అభ్యర్థన మేరకు అవసరమైన పట్టు పోగుల్ని రవాణా చేస్తారు. 1981 సంవత్సరం నుండి, సెరిఫెడ్ శ్రీమందిరానికి ఈ పోగుల్ని నిరవధికంగా సరఫరా చేస్తోంది. ఈ ఏడాది 350 కిలోగ్రాముల పట్టు పోగుల్ని తరలించింది. ఈ పట్టు పోగుల్ని మల్బరీ పురుగుల నుంచి తయారు చేస్తారు. దీనిని ప్రధానంగా గజపతి జిల్లాలోని మోహన, ఆర్.ఉదయగిరి మండలాల్లో గిరిజన పట్టు రైతులు ఉత్పత్తి చేస్తారు. కొరాపుట్ జిల్లా నుంచి సేకరించిన కై తా పండ్ల గుజ్జుతో పోగులకు రంగు పూస్తారు. గిరిజనుల నుంచి సేకరించిన ముడి పట్టు పోగుల్ని కటక్ జిల్లా నువాపట్నా ప్రాంతంలో సిల్క్ ప్రొడక్షన్ – టెక్నికల్ అప్గ్రేడేషన్ సెంటర్లో అవసరానికి అనుగుణంగా పోగుల్ని తయారు చేస్తారు. ఈ పోగులను కేవలం శ్రీ మందిరంలో మూల విరాటుల సేవాదులకు మాత్రమే వినియోగిస్తారు. ఇతరేతర వ్యవహారాలు, ప్రయోజనాలకు ఏమాత్రం వినియోగించరని తెలిపారు. చేనేత వస్త్రాల శాఖ డైరెక్టర్ ప్రేమచంద్ర చౌదరి, హస్తకళల విభాగం డైరెక్టర్ ప్రణతి ఛొట్రాయ్, సంయుక్త కార్యదర్శి మధుమిత రథ్, సెరిఫెడ్ చైర్పర్సన్ భగీరథి నందా, సెరిఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమాదిత్య బారిక్ ఈ కార్యక్రమంలో ప్రముఖంగా పాల్గొన్నారు.న్యూస్రీల్ -
ప్రధాని మోదీ పర్యటన వాయిదా
భువనేశ్వర్: రాష్ట్రంలో తొలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి పురస్కరించుకుని వార్షికోత్సవం సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్ష హాజరు కోసం పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఇటీవలి ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ వార్షికోత్సవానికి హాజరు కావాలని భారత ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర పార్టీ ప్రముఖులను సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు కేంద్రం నుంచి పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వం వార్షికోత్సవానికి హాజరుకానున్నట్లు సమాచారం. ఈనెల 12వ తేదీన రాష్ట్రంలో బీజేపీ సర్కారు వార్షికోత్సవం నిర్వహణ కోసం భారీ సన్నాహాలు చేశారు. అయితే ఇంతలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రోజు హాజరు కాలేని పరిస్థితుల దృష్ట్యా, ఈ నెల 20న విచ్చేసేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. లోగడ ఈనెల 12వ తేదీన జరగబోయే వార్షికోత్సవానికి విచ్చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రధానమంత్రి పర్యటనలో మార్పు చోటు చేసుకుందని రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి తెలిపారు. అందువలన జూన్ 12న జరగాల్సిన ప్రధాన వార్షికోత్సవ కార్యక్రమాన్ని జూన్ 20కి వాయిదా వేశామని మంత్రి సురేష్ కుమార్ పూజారి తెలిపారు. -
పికప్ వ్యాన్ను ఢీకొన్న ట్యాంకర్
రాయగడ: కర్రల లోడుతో వెళుతున్న ఒక పికప్ వ్యాన్ను ట్యాంకర్ ఢీకొనడంతో కార్మికుడు తీవ్రగాయాలకు గురయ్యాడు. ఈ సంఘటన శనివారం సదరు సమితి పరిధిలో గల జేకేపూర్ సమీపంలో గల నాగావళి బ్రిడ్జి మధ్యలో చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తి పెంట గ్రామానికి చెందిన జారంగ జముకగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొలనార నుంచి కళ్యాణసింగుపూర్ వైపు కర్రల లోతుడో పికప్ వ్యాన్ వెళ్తోంది. ఈ క్రమంలో నాగావళి బ్రిడ్జి మధ్య వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో పికప్ వ్యాన్ బ్రిడ్జికి ఒక వైపుగా ఒరిగిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయుల ఆందోళన
ఆమదాలవలస: ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదికతో ఇటీవల జరిగిన చర్చలలో ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించడానికి అంగీకరించినప్పటికీ ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్య అని ఐక్యవేదిక సంఘాల ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆమదాలవలస మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వర్గాలకు ఆర్థికపరమైన అంశాలలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి మేలు చేయలేదని, కనీసం ఆర్థికేతర అంశాలైన బదిలీలు కూడా మాన్యువల్గా నిర్వహించలేని నిస్సహయస్థితిలో ఉండడం శోచనీయమన్నారు. సరైన సౌకర్యాలు లేని కారణంగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించలేమని చెప్పడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆదివారం డీఈఓ కార్యాలయ ముట్టడికి ఉపాధ్యాయులంతా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు టి.వి.టి.భాస్కరరావు, బొడ్డేపల్లి గోపీచంద్, తమ్మినేని సీతారాం, కింతలి చంద్రరావు, నూక అప్పలనాయుడు, మెండ శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు ప్రారంభం
పర్లాకిమిడి: రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగునీరు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రబినారాయణ నాయక్ గజపతి జిల్లాలో ఒక రోజు పర్యటించారు. ఆయన శనివారం వేకువ జామున పర్లాకిమిడి విచ్చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ శోబోరో మంత్రిని స్వాగతించారు. మంత్రి రబినారాయణ నాయక్ కాశీనగర్ సమితిలో శియ్యాలీ, అల్లాడ, పాలసింగిలో ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్న ’అమృత్ సరోవర్ పథకం’ పనులను పర్యవేక్షించారు. అనంతరం పలుచోట్ల మొక్కలు నాటారు. అలాగే కాశీనగర్ బ్లాక్ ఖండవ పంచాయతీలో పాలసింగిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ‘మెగా తాగునీటి పథకం’ పైపులు విరిగిపోవడం రాష్ట్ర మంత్రి దృష్టికి ప్రజలు, పార్టీ నాయకులు తీసుకువచ్చారు. దీంతో గ్రామీణ తాగునీరు, శానిటేషన్ శాఖ ఇంజినీర్లకు మంత్రి రబినాయక్ చీవాట్లు పెట్టారు. పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ద్వారా వికసిత్ గావ్, వికసిత్ ఒడిశా కింద పదకొండు గ్రామాలకు తాగునీరు, రోడ్లు నిర్మాణానికి రూ.55.50 లక్షలతో పనులకు ఆయన కలెక్టరేట్ వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్సు హాలులో జిల్లాలోని త్రాగునీరు, రోడ్లు–భవనాలు, గ్రామీణ శానిటేషన్, త్రాగునీరు, చిన్ననీటి పారుదలశాఖ, ఇంజినీర్లు అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. గజపతి జిల్లాలో అమృత్ సరోవర్ కింద సాగునీరు, తాగునీటి పథకాలు రుతుపవనాలు వచ్చే ముందే పూర్తిచేయాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పాలసింగి మెగా తాగునీరు, సాగునీటి ప్రాజెక్టుల్లో అవకతవకలు సరిదిద్దాలని కలెక్టర్తో అన్నారు. ఒడిషా ప్రాజెక్టుల ద్వారా పోరుగున వున్న ఆంధ్రప్రదేశ్ రైతులు వినియోగించుకుంటున్నారని, మన రైతులు సద్వినియోగం చేసుకోలేక పోతున్నారని సమీక్షా సమావేశానంతరం విలేకరులతో అన్నారు. అనంతరం దక్షిణ ఒడిషా వికాస్, శిక్షణ పొందిన 18 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగోతో పాటు కలెక్టర్, డీఎఫ్ఓ ఎన్.నాగరాజు, డీఆర్డీఏ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర్ కెరెకెటా, ఏడీఎం ఫాల్గుణ మఝి, అదనపు సీడీఎం ఫృధ్వీరాజ్ మండళ్ తదితరులు పాల్గొన్నారు. -
మూల్యం చెల్లించకతప్పదా!
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం కరోనా పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు పెరుగుతున్నా అందుకు తగ్గట్లు నివారణ చర్యలు చేపట్టకపోవడంతో తగిన మూల్యం చెల్లించాల్సివస్తోందేమోనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో కోవిడ్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న తరుణంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అప్పట్లో తానే ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా రాష్ట్రంలోకి వచ్చేదా అని ఓ బహిరంగ సభలో అనడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండగా కరోనా నివారణకు కనీస చర్యలు చేపట్టకపోవడం విచారకరం. శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్యశాఖ కోవిడ్ పరీక్షా కిట్ల కోసం ప్రభుత్వానికి నివేదించి పది రోజులు కావస్తున్నా నేటికీ సరఫరా కాలేదు. కిట్ల కోసం ఎదురుచూసినా రిమ్స్ అఽధికారులు విశాఖపట్నం నుంచి పదుల సంఖ్యలో కిట్లను కొనుగోలు చేశారు. వ్యాధి లక్షణాలున్న అందరికీ కాకుండా తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు జరుపుతున్నారు. కిట్ల కొరతే దీనికి కారణం. విజయనగరంలో కలకలం.. పొరుగు జిల్లా విజయనగరంలో వ్యాధి లక్షణాలతో వచ్చిన ఓ రోగిని ఆసుపత్రిలో చేర్చి నిమోనియాగా చికిత్స చేస్తూ వచ్చారు. వారం రోజులైనా లక్షణాలు తగ్గకపోవడంతో రోగి నుంచి శాంపిల్ను సేకరించి పరీక్ష కోసం విశాఖపట్నం పంపించగా అతనికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అప్పటికే ఆ రోగి పరిస్ధితి ఆందోళనకరంగా మారడంతో ఐసీయూలో ఉంచి చికిత్స జరుపుతున్నారన్న వార్త జిల్లాలో దావానంలా వ్యాపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, ప్రజలు కూడా జాగ్రత్త చర్యలు చేపట్టాలని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. మాస్కులు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం, జన సమూహాలున్న ప్రాంతాలకు తప్పనిసరైతే తప్ప వెళ్లకుండా ఉండటం వంటివి చేయాలని సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలుంటే తక్షణం వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఛాతిలో నొప్పితో ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి ఉంటే వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని సూచిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో.. ప్రభుత్వానికి కిట్ల విషయం నివేదించాం. ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశముంది. ర్యాపిడ్ కిట్లు 2500 వరకు ఉన్నాయి. – డాక్టర్ కె. అనిత, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి, శ్రీకాకుళం నేటికీ జిల్లాకు రాని కరోనా పరీక్ష కిట్లు పొరుగు జిల్లాలో ఓ వ్యక్తికి కరోనాగా నిర్ధారణ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నా చలించని సర్కారు -
నీలగిరి అడవిలో ఆత్మహత్య
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ పోలీసు స్టేషన్ పరిధిలో గల నీలగిరి అడవిలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కొంత మంది గ్రామస్తులు నీలగిరి అడవిలో ఒక చెట్టుకు గావంచాతో ఉరిపోసుకొని ఉండటం చూచి బొరిగుమ్మ పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి బొడొదుబులి గ్రామం సుకాంత గౌఢ(23) అని గుర్తించారు. వారి వివరణ ప్రకారం.. బొడొదుబులి గ్రామంలో నివిసిస్తున్న సుకాంత్ గౌఢ మానసిక రోగి అని, అతడు గత బుధవారం నుండి కనిపించటం లేదని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం బొడొదుబులి గ్రామానికి కిలోమీటరు దూరాన గల నీలగిరి అడవిలో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుని తండ్రి పోలీస్స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా ఏఎస్ఐ చందన ప్రసాద్ మఝి దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం పంపామని పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ బోల్తా–17 మందికి గాయాలు మల్కన్గిరి: ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో 17 మంది గాయపడ్డారు. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి నక్కమామ్ముడి పంచాయతీ బయ్యాపోడ ఘాటీ వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చోటుచేసుకుంది. కుడుములగూమ్మ పంచాయతీలో జరుగుతున్న వారపు సంతకు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవడానికి స్థానికులు ట్రాక్టర్పై వస్తుండగా బయ్యాపోడ ఘాటీ వద్ద అదుపుతప్పి బోల్తా పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన 17 మందిని స్థానికుల సహాయంతో కుడుములగుమ్మ ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పిందని.. లేకుండా పలువురు ప్రాణాలు కోల్పోయేవారని స్థానికులు తెలిపారు. కోడిపందాల శిబిరంపై పోలీసుల దాడి ● మేక, ద్విచక్ర వాహనాలు స్వాధీనం మల్కన్గిరి: మల్కన్గిరి సమితి గౌడిగూఢ పంచాయతీలో నిర్వహిస్తున్న కోడిపందాల శిబిరంపై పోలీసులు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. పందాలు నిర్వహిస్తున్నట్టు తెలుసుకొని ఎస్డీపీవో ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి మల్కన్గిరి ఐఐసీ రీగాన్ కీండో తన సిబ్బందితో దాడి చేశారు. అయితే పోలీసుల రాకను పసిగట్టిన నిర్వాహకులు అక్కడ నుంచి పరారయ్యారు. దీంతో పందాల్లో గెలిచే వారికి ఇవ్వటానికి తీసుకొచ్చిన మేక, ఏడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని మల్కన్గిరి స్టేషన్కు తరలించారు. నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోతే మేకను ఇచ్చేస్తామని.. లేకపోతే కోర్టుకు తరలిస్తామని పోలీసు ఐసీ రీగాన్ కీండో అన్నారు. అప్పటి వరకు పోలీసుల సంరక్షణలో మేక ఉంటుందన్నారు. వేసవి శిబిరం ప్రారంభం మల్కన్గిరి: జిల్లా కేంద్రానికి సమీపంలోని చలాన్గూడ పంచాయతీ ప్రధాన్గూడ గ్రామంలో ఉన్న ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో జిల్లా శిశు సంరక్షణ యూనిట్, జిల్లా అధికారుల సహకారంతో ఐదు రోజుల వేసవి శిబిరం శనివారం ప్రారంభించారు. హాస్టల్లో బయటకు వెళ్లలేని చిన్నారుల్లో చైతన్యం కోసం శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ వినోద్ పటేల్ హాజరయ్యారు. విద్యార్థులు జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించారు. -
ఫుల్బణిలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి: సీఎం
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శనివారం కంధమల్ జిల్లా ఫుల్బణి ప్రాంతంలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిని ప్రారంభించారు. జిల్లా సందర్శన పురస్కరించుకుని రూ. 750 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగా మరికొన్నింటిని ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో 100 సీట్లు, 650 పడకలు ఉన్నాయని ప్రకటించారు. కంధమల్ జిల్లా వాసుల చిరకాల ఆశ నెరవేరిందని, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను పొందాలనే వారి చిరకాల కల సాకారమైందని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. కంధమల్ ప్రాంతంలో ఈ వైద్య కళాశాల వైద్య విద్యను అందించడంతో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను కూడా అందిస్తుందన్నారు. పరిసర ప్రాంతాల ప్రజల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురావడానికి దోహద పడుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్య సేవా రంగంలో పేరుకు పోయిన పలు అవకతవకలు, అసమానతలను సవరించి వైద్య విద్యతో ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్య సేవలను నిరంతరం అందుబాటులో ఉండేలా చేయడం ప్రభుత్వ సంకల్పంగా పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్ది సుసంపన్నంగా మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాల ఆసుపత్రులు స్థాపించడంతో వైద్య పోస్టుల సంఖ్యను పెంచడం పట్ల ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సామాన్యుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని, రాష్ట్రంలో మెరుగైన ఆరోగ్య సేవలను అందించే దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ ఫుల్బణి ప్రాంతంలో కొత్త వైద్య కళాశాల ఆస్పత్రి ప్రారంభించడం సమగ్ర రాష్ట్రంలోనే ఆరోగ్య సంరక్షణలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించడం జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ఈ ఏడాది బడ్జెటులో ఆరోగ్య రంగానికి భారీగా రూ. 23,635 కోట్లు కేటాయించారని, ఇది బడ్జెట్ సమగ్ర పరిమాణంలో 8.2 శాతమని, ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధికమని పేర్కొన్నారు. ఫుల్బణి వైద్య కళాశాల ఆస్పత్రి కంధమల్, పరిసర ప్రాంతాల యువతకు వైద్య విద్యాభ్యాసంలో సరికొత్త అవకాశాలకు తలుపులు తెరిచిందన్నారు. 100 సీట్ల సామర్థ్యం గల ఈ కళాశాల నుంచి పట్టభద్రులైన తర్వాత వైద్య నిపుణులు భవిష్యత్లో ఒడిశాాలోనే కాకుండా జాతీయ స్థాయి ఆరోగ్య సేవలు కల్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాలని ప్రోత్సహించారు. మానవ సేవ మాధవ సేవ దృక్పథంతో విద్యాభ్యాసంలో అడుగిడి వైద్యునిగా ఎదిగి సమాజానికి నిరంతరం సత్వర సేవలు అందజేయడం కర్తవ్యంగా గుర్తించాలన్నారు. ఈ ఆస్పత్రితో కంధమల్ జిల్లాతో పొరుగున ఉన్న నయాగడ్, బౌధ్, కలహండి జిల్లాల ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. స్థానిక ఉపాధి, పరిశోధన, ఆర్థిక అభివృద్ధికి ఇది శక్తివంతమైన ఇంజిన్గా పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా కంధమల్ జిల్లా అభివృద్ధి కోసం సుమారు రూ.750 కోట్ల విలువైన 10 విభిన్న అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల్లోరూ. 655 కోట్లకు పైగా విలువైన 5 ప్రాజెక్టులను ప్రారంభించగా, రూ. 94 కోట్లకు పైగా విలువైన 5 ప్రాజెక్టులకు శంకు స్థాపన చేశారు. కంధమల్ జిల్లా జనాభాలో దాదాపు 54 శాతం మంది గిరిజన సమాజానికి చెందిన వారు ఉన్నారు. గిరిజనులకు అటవీ భూమి హక్కులను అందించడానికి జిల్లా యంత్రాంగం శ్రద్ధగా పని చేస్తోంది. అటవీ భూమి హక్కుల చట్టం కింద గత 6 నెలల్లో 20,000 పైబడి వ్యక్తిగత లీజులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇక నుంచి భూమిలేని వ్యక్తి ఉండకూడదనే లక్ష్యంతో రానున్న రోజుల్లో జిల్లాలోని స్థలం వారందరికీ స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, కంధమల్ లోక్ సభ సభ్యుడు సుకాంత్ కుమార్ పాణిగ్రాహి, ఫుల్బాణి నియోజక వర్గం శాసన సభ సభ్యుడు ఉమా చరణ్ మల్లిక్ పాల్గొన్నారు. -
ఏనుగుల బీభత్సం
రాయగడ: బిసంకటక్ సమితిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. కొద్ది రోజులుగా కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు ఎప్పుడు చొరబడి ఎటువంటి ఆపదను తీసుకువస్తాయోనన్న భయంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. శుక్రవారం రాత్రి సమితిలోని కుటురిగుడ అడవుల నుంచి ఏనుగులు సరాసరి గ్రామంలోకి చొరబడి నానా బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన నారాయణ హుయిక అనే ఆదివాసీ రైతుకు చెందిన పనస, అరటి తొటలను ధ్వంసం చేయడంతోపాటు అతను నివసించే పూరి గుడిసెను సైతం పాడుచేశాయి. ఏనుగుల రాకను గమనించిన హుయిక కుటుంబీకులు అక్కడి నుంచి పరుగులు తీసి తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. సమీపంలోని కుంభారోబడి గ్రామానికి వెళ్లి తలదాచుకున్నారు. ఇంటిని ధ్వంసం చేసిన ఏనుగులు అందులో ఉంచిన ధాన్యం, బియ్యం, చోడి తదితర వస్తువులను నేలపాలు చేశాయి. అలాగే ఇంటి బయట ఉన్న సోలార్ విద్యుత్ దీపాలను కుప్పకూల్చాయి. శనివారం ఉదయం అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానిక చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామార్శించారు. ఏనుగుల వల్ల కలిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేశారు. గ్రామస్తులు చెప్పిన ప్రకారం శుక్రవారం రాత్రి సుమారు 24 ఏనుగుల గుంపు ఒక్కసారిగా కుటురిగుడ గ్రామంలోకి చొరబడ్డాయి. వాటిలో కొన్ని అడవిలోనికి తిరిగి వెళ్లిపొగా కొన్ని మాత్రం బీభత్సాన్ని సృష్టించాయి. కొద్ది రోజుల క్రితం ఈ ఏనుగుల గుంపు కళ్యాణ సింగుపూర్ సమీపంలోని అడవుల్లో ఉండేవని ఆ గుంపే ఇక్కడకు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అడవులు అంతరిస్తుండటంతో ఏనుగులు తినేందుకు ఎటువంటి ఆహారం లభించకపొవడంతో ఆహారాన్ని వెతుకుంటూ గ్రామాల్లోకి చొరబడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటి బారినుంచి గ్రామస్తులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. పంటలు ధ్వంసం -
టెక్కలి రవీంద్రభారతి పాఠశాలకు తాళాలు
టెక్కలి: టెక్కలిలో రవీంద్రభారతి పాఠశాలకు శనివారం మండల విద్యా శాఖాధికారి దల్లి తులసీరెడ్డి తాళాలు వేశారు. విద్యాశాఖ నుంచి ఎటువంటి గుర్తింపు అనుమతులు లేకపోవడంపై పలుమార్లు హెచ్చరించినా సంబంధిత యాజమాన్యం స్పందించకపోవడంతో పాఠశాలను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్కేజీ నుంచి 7వ తరగతికి సంబంధించి విద్యా శాఖ నుంచి ఏటా అనుమతులు తీసుకోకుండా తాత్సారం చేశారని, దీనిపై పలుమార్లు హెచ్చరించినా స్పందించకపోవడంతో జిల్లా అధికారుల ఆదేశాలతో పాఠశాలను మూసివేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల బదిలీ సర్టిఫికెట్లు(టీసీ)లను తమ కార్యాలయం ద్వారా అందజేస్తామని తెలిపారు. కాగా, పాఠశాల మూసివేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చెరువులో ఆక్రమణలు అడ్డగింత నరసన్నపేట: స్థానిక నరసన్న చెరువును శ్రీరామనగర్ సమీపంలో కొందరు వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడగా రెవెన్యూ సిబ్బంది స్పందించి అడ్డుకున్నారు. మాజీ సైనికులకు 1991లో చెరువు గర్భంలో పట్టా ఇచ్చారంటూ కొందరు శనివారం చెరువు భాగంలో ఉన్న జంగిల్ను జేసీబీతో శుభ్రం చేయించారు. స్థానికులు స్పందించి తహసీల్దార్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి ఆర్ఐ సాయిరాంకు తగు సూచనలు చేశారు. ఈ మేరకు వీఆర్వో చెరువు వద్దకు వెళ్లి పనులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి పోలాకి : రాజపురం వద్ద మట్టి ట్రాక్టర్ ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. కోలకతాకు చెందిన నౌగాన ఆదిలక్ష్మి(54) బెలమర గ్రామంలో ఉన్న తన కుమార్తె ఇంటికి వచ్చింది. శనివారం సాయంత్రం గుల్లవానిపేట బీచ్కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి తిరిగి వస్తుండగా.. అటుగా మట్టి తీసుకొస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆదిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలాకి ఎస్ఐ రంజిత్ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో క్లీనర్ దుర్మరణం ఎచ్చెర్ల: చిలకపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమబెంగాల్కు చెందిన లారీ క్లీనర్ సుబకాస్ మర్మర్ (35) మృతిచెందగా.. అస్సాంకు చెందిన డ్రైవర్ అసింనాథ్ గాయాలపాలయ్యారు. గౌహతి నుంచి బెంగళూరు వెళ్తున్న కొరియర్ లారీ చిలకపాలెం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను 108 అంబులెన్సులో రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ క్లీనర్ మృతి చెందాడు. ఎచ్చెర్ల ఎస్సై ఎన్.కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు టెక్కలి రూరల్: మండలంలోని బర్మాకాలనీ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి నుంచి రావివలస వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చాకిపల్లి కొత్తూరు గ్రామానికి చెందిన పొన్నాడ రవి గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. లీజుకు ఆర్టీసీ ఖాళీ స్థలాలు శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో వివిధ బస్స్టేషన్లలో 6 ఖాళీ స్థలాలను 15 ఏళ్ల లీజుకు ఇచ్చే ప్రాతిపదికన టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజయకుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇచ్ఛాపురం, టెక్కలి, ఆమదాలవలస, ఎచ్చెర్లలో ఖాళీ స్థలాలకు సంబంధించి ఈ నెల 10న ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం డ్రైవర్ల శిక్షణా కళాశాలలో ప్రీ బిడ్డర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెండర్ డాక్యుమెంట్లు, స్థలాల వివరాలను డ్రాయింగ్ ఆర్టీసీ వెబ్సైట్లో పొందుపర్చినట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 93460 45369 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణ వేంకటేశ్వర మందిరంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. అభిషేకాలు, సుప్రభాత సేవ, విశేష పూజలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్జల ఏకాదశిని పురస్కరించుకుని శ్రీరామా సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల నేతృత్వంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 20కి రథాల నిర్మాణం ప్రారంభించాలి జయపురం: రథయాత్రకు 20వ తేదీలోగా రథ నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో రథాల పనులు జరుపుతున్నట్లు దేవాదాయ విభాగం సీనియర్ క్లర్క్ రథయాత్ర పర్యవేక్షకులు కృష్ణ చంద్రదాస్ వెల్లడించారు. జయపురంలో రథ నిర్మాణం చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. అక్షయ తృతీయ దినాన రథ నిర్మాణానికి పూజలు చేశామని వెల్లడించారు. జయపురం రథం పొడవు 44 అడుగులు ఉంటుందని తెలిపారు. శ్రీజగన్నాథ్, సుభధ్ర, బలభధ్రల దేవతా మూర్తుల కోసం నిర్మిస్తున్న పెద్ద రథంతో పాటు పతిత పావనునికి చిన్నరథం తయారు చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే జయపురం సమితి బాట జగన్నాథ్పూర్ గ్రామం రథం కూడా ఇక్కడ తయారు చేయనున్నట్లు వెల్లడించారు. పలిగుడ వడ్రంగి ధనుర్జయ కమర, పనసపుట్భగర కముల కమరల నేతృత్వంలో మరో ఆరుగురు రథాలను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎలుగు దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి గుమడ పంచాయతీలో ఒక రైతుపై ఎలుగుబంటి దాడి చేయగా ఆ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని రాధా చలాన్(60)గా గుర్తించారు. అందిన వివరాల ప్రకారం.. రాథా చలాన్ కొట్పాడ్ సమితి ప్రాంతంలో ఇంద్రావతి నది ప్రాంతంలో మొక్కజొన్న పంట వేశాడు. ప్రతిరోజూ అతడు మొక్క జొన్న పంటకు రాత్రిళ్లు కాపలా కాస్తుంటాడు. గురువారం రాత్రి కూడా తోటకు కాపలా కాశాడు. రాత్రి 4 గంటల సమయంలో అతడు నిద్రిస్తున్న సమయంలో సమీప చెరుకు మడి నుంచి ఒక ఎలుగు బంటి వచ్చి అతడిపై దాడి చేసింది. అతడి తల, ముఖంపై బలమైన గాయాలయ్యాయి. కేకలు విని పక్కన ఉన్న రైతులు రావడంతో వారిని చూసి ఎలుగు పారిపోయింది. తీవ్రంగా గాయపడిన రాధా చలాన్ను వెంటనే జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మత సామరస్యానికి ప్రతీక బక్రీద్ : ఎస్పీ శ్రీకాకుళం క్రైమ్ : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండగను కులమతాలకు అతీతంగా సోదరభావంతో శాంతియుతంగా జిల్లా ప్రజలు జరుపుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జగరకుండా అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. మసీదుల వద్ద ప్రశాంతంగా ప్రార్థనలు జరిగేలా, డ్రోన్స్, సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, గోవధ, పశువుల అక్రమ రవాణా చేసే వారి సమాచారాన్ని డయల్ 100, 112లకు, పరిధి పోలీస్స్టేషన్లకు అందించాలన్నారు. సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్నారు. -
కూటమి ప్రభుత్వంపై పోరాటం తప్పదు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కారం చేయలేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో గత ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపుతూ జీవో నెంబర్ 117 రద్దుచేసి పాఠశాల విద్య వ్యవస్థను సమూలంగా మారుస్తానని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 19, 20, 21 తీసుకొచ్చి ఉన్న పాఠశాలలను మూసివేసే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్, తల్లికి వందనం పథకాలు అమలు కాక విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకపోవతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈ.చందు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులకు చిక్కిన బైకుల దొంగ
శ్రీకాకుళం క్రైమ్ : ఏడాది క్రితం సారవకోట మండలం బుడితిలోని ఓ నివాసలో జరిగిన చోరీలో క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రలు ఆధారంగా జిల్లా పోలీసులు కీలక నిందితున్ని పట్టుకున్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన కొర్ల శివ అలియాస్ మున్నా (23) విజయనగరంలోని ఓ హోటల్లో పనిచేస్తుండేవాడు. స్థిరత్వం లేకపోవడంతో ఏ పనిచేసినా అక్కడ మానేసేవాడు. జల్సాలకు డబ్బులు లేకపోవడం, చెడు అలవాట్లు ఉండటంతో చోరీలు చేస్తేనే డబ్బులొస్తాయని నిశ్చయించుకున్నాడు. మున్నాకు బైక్లంటే పిచ్చి ఉండటంతో ముందుగా పార్కింగ్లో ఉన్న ద్విచక్ర వాహనాలను టార్గెట్గా చేసుకున్నాడు. కొన్ని వాహనాలను దొంగిలించాక.. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు చోరీ చేసిన బైక్తోనే వేరే చోటకు దొంగతనానికి వెళ్లి అక్కడికి కొద్ది దూరంలో ముందుగా తెచ్చుకున్న బైక్ను వదిలేసేవాడు. సమీపంలో ఉండే దేవాలయాలు, నివాస గృహాల్లో చోరీకి పాల్పడటం.. లేదంటే పార్కింగ్ చేసిన బళ్లను అక్కడి నుంచి అపహరించుకుపోవడం మున్నాకు అలవాటుగా మారింది. పట్టుబడ్డాడిలా.. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు బుడితి కమలప్రియ మోడరన్ రైస్ మిల్లు సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సారవకోట పోలీసులకు నడుచుకుంటూ వస్తున్న మున్నా కనిపించాడు. పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించగా ఎస్ఐ బి.అనిల్కుమార్ సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. మున్నా తెచ్చుకున్న సంచిలో రెండు పాలిథిన్ కవర్లలో బంగారు, వెండి వస్తువులు గుర్తించి విచారణ నిమిత్తం స్టేషన్కు తీసుకెళ్లగా నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు విచారించారు. అప్పటికే సమాచారమందుకున్న అడిషనల్ ఎస్పీ పి.శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐ చంద్రమౌళిలు ఆరా తీశారు. అనేక కేసుల్లో ముద్దాయి.. మున్నా ఫింగర్ప్రింట్ పరిశీలించగా ఏడాది క్రితం బుడితిలోని ఓ మహిళ నివసిస్తున్న గృహంలో జరిగిన చోరీలో మున్నాయే నిందితుడని, జిల్లాలోని అనేక పోలీస్స్టేషన్లలో నమోదైన 15 చోరీ కేసుల్లో ముద్దాయి మున్నానే అని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఎచ్చెర్ల పీఎస్లో ఐదు కేసులు, జె.ఆర్.పురం, శ్రీకాకుళం టూటౌన్, సారవకోటల్లో రెండేసి చొప్పున, జలుమూరు, లావేరు, నరసన్నపేటల్లో ఒక్కటేసి, విజయనగరం జిల్లా డెంకాడలో ఒక కేసు మున్నాపై నమోదయ్యాయి. మున్నా వద్ద నుంచి రూ.5.50 లక్షల విలువైన మూడు తులాల బంగారం, 11 తులాల వెండి, సుమారు 12 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితున్ని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సారవకోట పోలీసులను, సీసీఎస్ పోలీసులను ఎస్పీ అభినందించారు. చోరీ చేసిన బైక్లతోనే దొంగతనాలు దేవాలయాలు, ఇళ్లల్లో సైతం చోరీలు వేలిముద్రలు ఆధారంగా నిందితున్ని పట్టుకున్న పోలీసులు పోలీసులు స్వాధీనం చేసుకున్న బైకులు -
దారిలో ప్రసవం
డోలీలో ప్రయాణం..జయపురం: డోలీలో ఓ గర్భిణిని మోసుకు వెళ్తుండగా దారిలో ప్రసవమైన ఘటన జయపురం సమితి రొండాపల్లి పంచాయతీ రామగడ గ్రామ సమీపంలో జరిగింది. ఆమె ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. కొండపై గల కెందుగుడ గ్రామంలో గురువారీ పొరజ నివాసం ఉంటున్నారు. ఆమెకు శుక్రవారం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ వర్కర్కు చెప్పడంతో ఆమె అంబులెన్స్కు ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామానికి మార్గం లేక అంబులెన్స్ రాదని డ్రైవర్ తెలపటంతో గ్రామ ప్రజలు వెదురు బుంగలతో ఒక డోలీ కట్టి అందులో గర్భిణిని ఉంచి రెండు పర్వతాలు దాటించారు. ఆస్పత్రి మరో 3 కిలోమీటర్లు ఉందనగా.. గురువారీ పొరజకు ప్రసవమైంది. విషయం ఆశ వర్కర్ స్వర్ణలతకు తెలియజేసి తల్లీబిడ్డలను ఇంటికి తీసుకు వెలుతున్నట్లు తెలియజేశారు. స్వర్ణలత బైరాగి మఠం వద్ద వేచి ఉంది. అక్కడకు వచ్చిన బాలింతను ఆస్పత్రికి తీసుకెళ్దామని చెప్పినా వారు వినలేదు. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో ఇలా డోలీలు, మంచాలపై రోగులను మోసుకుంటూ వెళ్లాల్సి వస్తోందని, రోడ్డు వేయాలని వారు కోరుతున్నారు. -
పిడుగుపాటుకు మూగజీవులు మృతి
సారవకోట: రామకృష్ణాపురంలో సాధు అప్పలనాయుడుకు చెందిన ఆవు శుక్రవారం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. సుమారు రూ.60 వేలు విలువైన ఆవు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. పిడుగుపాటుకు రెండు మేకలు మృతి బూర్జ: లచ్చయ్యపేటలో దాసరి తాతారావు, దాసరి నీలం, దాసరి అసిరినాయుడులకు చెందిన మేకలు పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డాయి. ఉప్పినివలస గ్రామ పరిసరాలలో మేత మేస్తుండగా శుక్రవారం సాయంత్రం పిడుగు పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయాన్ని గుత్తావల్లి పశువైద్యాధికారి డాక్టర్ సువ్వారి కరుణ దృష్టికి తీసుకెళ్లారు. ఇంటిపై పిడుగు టెక్కలి రూరల్: స్థానిక గోపినాథపురం సమీపంలో హనుమంతువీరన్నగారి వీధిలో సత్తారు ధర్మారావు అనే వ్యక్తి ఇంటిపై శుక్రవారం సాయంత్రం పిడుగుపడింది. ఈ ఘటనతో గోడలు బీటలు వారి కింద ఉన్న కారుషెడ్ మరమ్మతులకు గురైంది. పలు విద్యుత్ గృహోపకరణాలు పాడయ్యాయి. -
కక్షకట్టి రోడ్డున పడేశారు..!
● దౌర్జన్యంగా ఫుట్పాత్ దుకాణం సామాన్లు పడేసిన పంచాయతీ సిబ్బంది ● వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండటమే కారణం టెక్కలి: కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. పేద, సామాన్య వర్గాలు, దళితులు వ్యాపారాలు చేసుకునే ఫుట్పాత్ దుకాణాలనూ వదలడం లేదు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారనే శుక్రవారం కోటబొమ్మాళి మెయిన్రోడ్లో ఓ ఫుట్పాత్ దుకాణాన్ని తొలగించి ఆ కుటుంబాన్ని నడిరోడ్డున పడేశారు. వివరాల్లోకి వెళితే..ప్రకాశ్నగర్ కాలనీకు చెందిన బచ్చు సంధ్య స్థానిక పాఠశాలకు ఎదురుగా ఓ టీ దుకాణం నిర్వహిస్తోంది. సుమారు 25 ఏళ్లుగా కుటుంబాన్ని పోషిస్తోంది. ఈమె వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండటంతో స్థానిక టీడీపీ నాయకులు కక్ష కట్టారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్న ఫుట్పాత్ దుకాణాన్ని తొలగించేందుకు పంచాయతీ ఈఓ చింతాడ శ్రీనివాసరావు, సహాయకుడు సన్యాసిరావు, పోలీస్ సిబ్బందిని ఉసిగొల్పారు. వారు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఫుట్పాత్ దుకాణంలో సామాన్లు నడిరోడ్డున పడేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. పాతికేళ్లుగా ఎవరికీ ఇబ్బందులు లేకుండా చిన్నపాటి దుకాణాన్ని నిర్వహిస్తున్న తన కుటుంబాన్ని ఈ విధంగా నడిరోడ్డున పడేయడం తగదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కోటబొమ్మాళిలో ఎంతో మంది ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, కేవలం తనపై మాత్రమే కక్ష కట్టారంటూ వాపోయింది. దివ్యాంగుడైన తన భర్తతో పాటు ఇద్దరు పిల్లల్ని పోషిస్తున్న తనపై ఈ విధంగా కుట్ర చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై పంచాయతీ సర్పంచ్ సంజీవరావు సైతం అధికారులకు చెప్పినా పట్టించుకోకుండా తొలగించారని వాపోయింది. -
వైభవంగా శ్రీముఖలింగేశ్వరుని కల్యాణోత్సవం
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పార్వతీ పరమేశ్వరుల కల్యాణ ఉత్సవం ఘనంగా జరిగింది. గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు, ఏకవార అభిషేకాలు నిర్వహించారు. ముత్తయిదువులు కొట్నం దంపు కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి క్షీరాభిషేకం జరిపించారు. అనంతరం ఉత్సవమూర్లును నంది వాహనంపై ఉంచి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు హారతిలిస్తూ పార్వతి పరమేశ్వరులను దర్శించుకున్నారు. ఈఓ పి.ప్రభాకరరావు ఎంపీటీసీ కె.హరిప్రసాద్, సర్పంచ్ టి.సతీష్కుమార్ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
పరిశ్రమల పేరిట ప్రకృతిని హరిస్తున్నారు
రాయగడ: పరిశ్రమలు ఏర్పాటైతే అభివృద్ధి సాధ్యమని ప్రజలను మభ్యపెట్టి ప్రకృతి సంపదలను హరించివేస్తున్నారని పర్యావరణ వేత్త ప్రఫుల్ల సామంతరాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని కాసీపూర్ కొంటామాల్ మైదానంలో పృకృతిక సురక్షా సమితి ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పృకృతిక సంపదలను ప్రైవేటు పరం చేస్తున్నాయని.. దీనిని కలిసికట్టుగా ఎదుర్కోగలిగితేన మన సంపదలను కాపాడుకోవచ్చన్నారు. అందుకు అందరూ ముందడుగు వేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. రోజురోజుకూ పర్యావరణం సమతుల్యం అంచులు దాటిపొతున్న సమయంలో ఉన్న ప్రకృతి సంపదలను పోగొట్టుకుంటే భావితరాలు పర్యావరణ పరంగా తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాసీపూర్ ప్రాంతం ప్రకృతి సంపదలకు పుట్టినిళ్లని.. వాటిని పోగొట్టుకుంటే మిగిలింది మనకు విషకాలుష్యమేనని భయాందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నారు.. పర్యావరణం కోసం పోరాడేందుకు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని ఇది ఎక్కడి విడ్డూరమని సామంతరాయ్ ప్రశ్నించారు. కొంటామాల్లో జరగనున్న సమావేశానికి హజరయ్యేందుకు వచ్చిన ప్రముఖ సమాజ సేవకురాలు, పర్యావరణ వేత్త మేధాపట్కేర్తోపాటు మరికొందరు ప్రముఖులను రాయగడలో పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని తిరిగి పంపించివేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాసినట్లేనని అన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ప్రకృతిని హరించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. తమ ఆందోళనలను, పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మాలిసురక్షా సమితి అధ్యక్షుడు సుభా మాఝి మాట్లాడుతూ.. పర్యావరణం గురించి శాంతి యుతంగా ఆందోళనలు చేపడితే యంత్రాంగం అడ్డుకోవడం విచారకరమని అన్నారు. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎన్ని అవరోధాలు ఎదురైనా తమ ఆందోళనలు కొనసాగించడం తధ్యమని అన్నారు. కార్యక్రమంలొ పృకృతి సురక్షా సమితికి చెందిన దిగంబర్ దురియా, సురేష్రావు, శుభేంద్ర ములిక, సంగ్రామ్ కేసరి, సనాతన్ ప్రధాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సమితి పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణ వేత్త ప్రఫుల్ల సామంతరాయ్ -
50 వంట గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
రాయగడ: సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న అదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ ఎన్ఫొర్స్మెంట్ విభాగం గురువారం పలు హోటళ్లలో ఆకస్మిక దాడులను నిర్వహించింది. ఈ దాడుల్లో 50 వంట గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నియమాలను ఉల్లంఘించి కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న 14 హోటళ్లలో దాడులను నిర్వహించి సిలిండర్లను సీజ్ చేశారు. జేకేపూర్, రాయగడలోని హోటళ్లలో విస్తృతంగా నిర్వహించిన ఈ దాడుల్లో ఏసీఎస్వో సుధాంశు భొయ్, పౌరసరఫరాల శాఖ రాయగడ సమితి ఇన్స్పెక్టర్ ప్రభంజన్ మహాంతి, మున్సిపాలిటీ సిబ్బంది మహేంద్ర రాయ్ పాల్గొన్నారు. -
పార్టీలో విభేదాల్లేవు
రాయగడ: బీజేడీ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, రానున్న పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకుంటామని మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షురాలు ప్రమీల మల్లిక్ అన్నారు. జిల్లాలోని బిసంకటక్, రాయగడ, గుణుపూర్ శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు శుక్రవారం ఆమెతో పాటు మాజీ మంత్రి పద్మనాభ బెహరలు రాయగడ వచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక తేజస్వీ హోటల్లో కార్యకర్తలు, సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రసంగించారు. గత ఎన్నికల్లో బీజేపీ ఏదో చేసేస్తుందనే ఆశతో గెలిపించారన్నారు. ఆ పార్టీ సంవత్సర కాలంలో చేసిందేమిటో అందరికీ అర్థమైందన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. అధికారంలోకి వస్తే 300 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా వినియోగదారులకు ఇస్తామని హామీ ఇచ్చారని, అలాగే చిట్ ఫండ్ మోసాలకు గురైన బాధితులకు అండగా నిలుస్తామని ఇచ్చిన హామీలో ్ల ఒక్కదాన్ని కూడా బీజేపీ నెరవేర్చలేదని అన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు విరక్తితో ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా బీఎస్కేవై (బిజు స్వాస్థ కళ్యాణ యోజన పథకం)ను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం యుష్మాన్ కార్డును ఇచ్చిందని.. అయితే ఈ కార్డు చూపిస్తే ఏక్కడా ఉచితంగా వైద్యం అందించడం లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి గెలిచిన ఆ పార్టీకి త్వరల్లో గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని మరోసారి నొక్కి చెప్పారు. కార్యకర్తలు ఎటువంటి నిరాశ చెందకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతా సైనికుల్లా కలసికట్టుగా పనిచేయాలని అన్నారు. రాష్ట్రంలో బీజేడీ పార్టీయే స్థిరమైనదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటుకుంటాం బీజేడీ పార్టీ నేత, మాజీ మంత్రి ప్రమిలా మల్లిక్ నెక్కంటి నేతృత్వంలో పార్టీ బలోపేతం.. సమావేశంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ కార్యకర్తలు, నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నెక్కంటి నేతృత్వంలో బీజేడీ ఈ జిల్లాలో మరింత బలొపేతం అవుతుందన్నారు. త్వరలో ప్రకటించనున్న బీజేడీ జిల్లా అధ్యక్షుడి పదవిని ఆయనకు ఇవ్వాలని కోరారు. పార్టీని ముందుకు నడిపించే సమర్ధమంతమైన నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగిన నెక్కంటికి తిరిగి పగ్గాలు చేపట్టే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, అనసూయా మాఝి, మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
శ్రీకాకుళం: జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరో ముందడుగు పడిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం రిమ్స్కు బోయింగ్ ఇండియా సంస్థ (సీఎస్ఆర్) ద్వారా సమకూర్చిన రూ.45 లక్షల విలువైన వైద్య పరికరాలను కేంద్రమంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం రిమ్స్ ఆసుపత్రి, కళాశాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, బోయింగ్ ఇండియా వైద్యులు ప్రవీణ్, రంజిత్, అమృత, రోహిత్, జీజిహెచ్, రిమ్స్ వైద్యుడు మురళీకృష్ణ, సూపరింటెండెంట్ డాక్టర్ అమూల్య, జైన్ తదితరులు పాల్గొన్నారు. -
రాత్రి దోపిడీలు
పగలు బొమ్మల వ్యాపారం.. ● హైవేల్లో ఆగి ఉన్న వాహనదారులపై దోపీడీ ● చీకటిలో దోపిడీ దొంగల వీరంగం ● పోలీసులకు చిక్కిన నలుగురు దొంగలు, ఒకరు పరారీ ● రోడ్డు పక్కన గుడారాల్లో నివాసాలు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం క్రైమ్ : హైవే పక్కన గుడారాల్లో నివాసం.. పగలు బొమ్మల వ్యాపారం.. రాత్రయితే దోపిడీ.. విశాఖ జిల్లా తగరపువలస నుంచి మన జిల్లా ఇ చ్ఛాపురం వరకు అంతా వీరి రాజ్యమే. జాతీయ రహదారి వెంబడి ఎక్కడైనా వాహనం ఆగి ఉంటే చాలు నగదు, మొబైళ్లు, పార్క్ చేసిన బైక్లు కూడా ఎత్తుకుపోతారు. జిల్లాలోనూ వీరి హస్తకళ చూపించారు. తాజాగా వీరిలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి ఈ రాజస్థానీ దొంగల వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఆదాయం చాలక.. జిల్లాలోని రణస్థలం మండలం కోష్ట ప్రాంతంలో గత మూడేళ్లు నుంచి రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన ఆదిత్య పవార్ అలియాస్ వర్షమ్ (22), అతని సోదరులు, మరికొందరు కుటుంబీకులు రోడ్డు ప క్క న గుడారాల్లో నివసిస్తున్నారు. పగటి పూట బొమ్మ లు, దుప్పట్లు అమ్ముకోవడమే వీరి జీవనాధారం. ఆ ఆదాయం సరిపోకపోవడం, ఇంటిల్లిపాదీ చెడు అలవాట్లకు బానిసలు కావడంతో రాత్రిపూట రోడ్డుపక్కన దొంగతనాలకు ఒడిగడుతున్నారు. ఆదిత్యనే ఈ గ్యాంగ్కు లీడర్. అతని సోద రులు బంగారం పవార్ (21), సుధీర్ పవార్ (19)లే కాక బావమరుదులు సంజు షిండే అలియాస్ పటేల్, మరో బాలుడు కూడా ఇదే పనిలో ఉన్నారు. మూడేళ్లుగా ఎవరికీ చిక్కక.. అర్ధరాత్రి వేళల్లో ఆగి ఉన్న లారీలు, వ్యాన్లలో నిద్రిస్తున్న వ్యక్తుల వద్దకు వెళ్లి వారికి తెలియకుండానే నగదు, ఫోన్లను తస్కరించి అక్కడి నుంచి పరారయ్యేవారు. గత ఆరు నెలల నుంచి ఆగి ఉన్న వాహనదారుల వద్దకు వెళ్లి కత్తులతో బెదిరించి.. వారిని కొట్టి డబ్బు, మొబైళ్లు లాక్కోవడం మొదలుపెట్టారు. అదే వారిని పట్టించింది. ఆమదాలవలసకు చెందిన బొడ్డేపల్లి సతీష్కుమార్, అతని స్నేహితుడు సేపీన బెనర్జీలు తమ బైక్పై గత నెల 18న నంది గాం మండలం కణితూరు గ్రామంలో జరిగే వివా హ వేడుకకు హాజరయ్యారు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి పయనమవ్వగా మార్గం మధ్యలో వర్షం కురవడంతో సరిగ్గా 12:50 గంటలకు టెక్కలి మండలం విక్రంపురం గ్రామం జేఎన్ బస్టాప్ (ఎన్హెచ్–16 సమీప) వద్ద ఆగి కాసేపు ఆగారు. పైన పేర్కొన్న నిందితుల్లో నలుగురు ఒక్క ఉదుటున వారివద్దనున్న కత్తులను తీసి సతీష్, బెనర్జీల గొంతుపై పెట్టారు. అంతటితో ఆగక పిడిగుద్దుల వర్షం కురిపించి ఏమేం ఉన్నాయో తీయండంటూ బెదిరించడంతో రూ. 6 వేల నగదు, రెండు మొబైళ్లు ఇచ్చేశారు. వెంటనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులు టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే కొన్ని చోట్ల ఇలాంటి దొంగతనాలు జరుగుతుండటంతో ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ ఎస్ఎస్ చంద్రమౌళి, టెక్కలి సీఐ విజయ్కుమార్ రెండు పోలీసు బృందాలుగా ఏర్పడి తీగ లాగారు. ఎలా పట్టుబడ్డారంటే.. ఈ నెల 5న సాయంత్రం 6 గంటల సమయంలో టెక్కలి మండలం శ్యామసుందరాపురం గ్రామం జగదిమెట్ట ఫ్లై ఓవర్ సమీపంలో కొంతమంది అనుమానంగా రెండు ద్విచక్రవాహనాలపై సంచరిస్తున్న విషయం టెక్కలి ఎస్ఐ కె.మధుసూధనరావుకు తెలియడంతో సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. వారిలో సంజు షిండే పరారయ్యాడు. వారి వద్ద నుంచి రూ.1,12,000 నగదు, రెండు ద్విచక్రవాహనాలు, ఎనిమిది మొబైళ్లు, ఆరు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టేషన్కు తీసుకెళ్లి విచారించడం, జిల్లాలో పలుచోట్ల వారు చేసిన నేరాలు బయటపడ్డాయి. ఎక్కడెక్కడ అంటే.. టెక్కలి, లావేరుల్లో ఒక్కొక్కటి చొప్పున, నందిగాం, నరసన్నపేట పీఎస్ల పరిధిలో రెండేసి చొప్పున వీరిపై కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా బాలుడిని జువైనల్ హోంకు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీసీఎస్, టెక్కలి పోలీసులను ఎస్పీ అభినందించారు. -
ఇదేం మద్దతు?
● అరకొరగా ధాన్యం మద్దతు ధర పెంపు ● క్వింటాల్కు రూ.69 మాత్రమే పెంచడంపై రైతుల్లో అసంతృప్తి ● అమాంతంగా పెరిగిన సాగు ఖర్చులు నరసన్నపేట: కేంద్ర ప్రభుత్వం 2025–26 ఖరీఫ్ సీజన్కు 14 రకాల పంటలకు ఇటీవల మద్దతు ధర ప్రకటించింది. ఇందులో ప్రధాన పంట వరితో పాటు పత్తి, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, రాగి, మొక్కజొన్న, పెసలు, కంది, మినుములకు కనీస మద్దతు ధర పెంచింది. మిగిలిన పంటల ధరల సంగతి అటుంచితే వరికి ప్రకటించిన మద్దతు ధరలపై రైతులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విత్తనాలతో పాటు ఎరువులు, కూలీలు తదితర ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా మద్దతు ధరల పెంపులేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో వరి ప్రధాన పంట. సుమారు ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. ధాన్యం దిగుబడి ఎకరాకు సరాసరి 25 బస్తాల వరకూ వస్తుంది. అధిక విస్తీర్ణంలో సాగు చేసే ఈ పంటకు మద్దతు ధర రూ.69 మాత్రమే పెంచడం పట్ల అన్నదాతలు అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న సాగు ఖర్చుల ప్రకారం బస్తాకు కనీసం రూ.200 అయినా పెంచితే బాగుంటుందని అంటున్నారు. పెంచిన ధరలను పునఃసమీక్షించాలని రైతులు కోరుతున్నారు. సాగు ఖర్చుల భారం.. కేంద్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధరలు ప్రకటిస్తూనే ఉంది. అయితే అనుకున్న మేర పెంచడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. కంటితుడుపుగా మాత్రమే మద్దతు ధరలను ప్రకటిస్తోందని, రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. 2018–19 నుంచి ఇప్పటి వరకూ ఏటా సగటున వరి ధాన్యంపై సరాసరి రూ.100 లోపే పెంచింది. మరోవైపు సాగు ఖర్చులు ఏటా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో రూ.1300 ఉండే కాంప్లెక్స్ ఎరువులు ఇప్పుడు రూ.1800కు చేరుకున్నాయి. డీజిల్, విత్తనాలు, దుక్కు ఖర్చులు, లేబరు ఖర్చులు, ఎరువులు, పురుగు మందులు ఇలా అన్ని రకాల ధరలూ భారీగా పెరిగాయి. మొత్తమ్మీద సాగు ఖర్చులు ఎకరాకు రూ.12 వేలు నుంచి రూ.16 వేలకు పెరిగాయి. దీంతో దీనికి తగ్గట్టుగా మద్దతు ధరలను పెంచాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. 2018 నుంచి వరికి కనీస మద్దతు ధరలు ఇలా.. సంవత్సరం సాధారణ రకం గ్రేడ్ఏ రకం (రూ.లలో) (రూ.లలో) 2018–19 1750 1777 2019–20 1815 1835 2020–21 1865 1888 2021–22 1940 1960 2022–23 2020 2060 2023–24 2183 2203 2024–25 2300 2320 2025–26 2369 2389 పెరిగిన సాగు ఖర్చులు పని గతేడాది ఇప్పుడు లేబరు (ఒకరికి) రూ.400 రూ.600 దుక్కికి (గంటకు) రూ.900 రూ.1100 రోటావేటర్(గంటకు) రూ.1200 రూ.1400 విత్తనాలు(30కేజీలు) రూ.900 రూ.1140 ఉడుపు రూ.3200 రూ.4000 ఆకుతీత(ప్యాకెట్) రూ.1800 రూ.2300 గాబుతీత రూ.3000 రూ.4200 కంబైండ్ హార్వెస్టెర్ రూ.2600 రూ.3000 గిట్టుబాటు కాదు.. నేను 20 ఏళ్లగా వ్యవసాయం చేస్తున్నా. పెరుగుతున్న సాగు ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలకు పొంతన ఉండటంలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పదేళ్ల క్రితమే ప్రకటించినా కేంద్రం మద్దతు ధరలు ఆశాజనకంగా లేకపోవడం రైతులకు నష్టాలకు గురి చేస్తుంది. వాతావరణంలో ఏమాత్రం తేడా వచ్చినా పెట్టినా ఖర్చంతా వృథాయే. – సురంగి నర్సింగరావు, చింతువానిపేట, నరసన్నపేట మద్దతు ధరలు పెంచాలి.. సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలు ప్రకటించడం వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంత తక్కువ మద్దతు ధర పెంచడంతో ఏ మాత్రం లాభం లేదు. అన్ని రకాల ఉత్పత్తుల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పునఃపరిశీలన చేసి ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలు ప్రకటంచాలి. – పోలాకి రమణయ్య, ఉర్లాం, నరసన్నపేట -
తనయకు తలకొరివి పెట్టిన తల్లి
ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని ఐజే నాయుడు కాలనీకి చెందిన కాయల కాళిదాసు కుమార్తె కె.జ్యోతి(కేతన) గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తండ్రి కాళిదాసు తీవ్రంగా గాయపడి జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమార్తెకు తలకొరివి పెట్టే పరిస్థితిలో లేకపోవడంతో తల్లి రాజేశ్వరి పుట్టెడు దుఃఖంతో అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ ఘటన చూసి కాలనీవాసులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, చిన్నారి సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు కంటతడి పెట్టారు. బాక్సింగ్ పోటీల్లో పతకాల పంట శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. విశాఖపట్నంలోని గాజువాక వేదికగా ఈ నెల 1, 2 తేదీల్లో జరిగిన 6వ ఏపీ రాష్ట్ర స్థాయి జూనియర్స్, పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్–2025 పోటీల్లో ఎస్.దేవి వరప్రసాద్ (54 కేజీల విభాగం) బంగారు పతకం, జి.సత్య భార్గవ్ (80+ కేజీల విభాగం) బంగారు పతకం, ఆర్.రామ్చరణ్ రెడ్డి (63 కేజీల విభాగం) రజత పతకం, పి.గణేష్ (75 కేజీల విభాగం) రజత పతకం, ఎస్.వినయ్ వరుణ్ (57 కేజీల విభాగం) కాంస్య పతకం, కె.యశ్వంత్ (46 కేజీల విభాగం) కాంస్య పతకం సాధించారు. వీరిని డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బీఏ లక్ష్మణదేవ్, వంగా మహేష్, కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు, సీనియర్ బాక్సర్లు అభినందించారు. -
17 కేజీల గంజాయితో వ్యక్తి అరెస్టు
ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి ముంబైకి 17.45 కిలోల గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా నిలంద్రిచంద్రపూర్ గ్రామానికి చెందిన చాబి సాహును శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఇచ్ఛాపురం సీఐ ఎం.చిన్నమనాయుడు తెలిపారు. ముందస్తు ఒప్పందం మేరకు శుక్రవారం 17.45 కిలోల గంజాయిని ఎనిమిది ప్యాకెట్లు రెండు బ్యాగులలో సిద్ధం చేసి ఒడిశా నుంచి ఇచ్ఛాపురం తీసుకురాగా. రైల్వేస్టేసన్ వద్ద పట్టణ పోలీసులు తనిఖీలలో గర్తించి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు. తనిఖీలలో పట్టణ ఎస్ఐ ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు. కొనసాగుతున్న ఐటీఐ కౌన్సెలింగ్ ఎచ్చెర్ల : ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియ రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగించారు. 284 మందికి గాను 128 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 83 మంది వివిధ కళాశాలల్లో సీట్లు పొందారని జిల్లా కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు తెలిపారు. శనివారం 563 నుంచి 858వ ర్యాంకు వరకూ కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కె.సుధ పర్యవేక్షిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే సలహా మండలి బోర్డు సభ్యుడిగా రాజేష్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఈస్ట్కోస్ట్ రైల్వే డివిజన్ సంప్రదింపుల సలహా మండలి సభ్యుడిగా ప్రముఖ విద్యా వేత్త, బీసీ నేత ప్రొఫెసర్ డాక్టర్ బుడుమూరు రాజేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, కొత్తగా రైళ్ల ప్రతిపాదన, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో సూచనలను ఈ నెల 24న జరిగే సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. రాజేష్ ప్రస్తుతం జేఎన్టీయూ పాలక మండలి సభ్యుడిగా, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. అంబులెన్సులో ప్రసవం మందస: టిక్కరి గ్రామానికి చెందిన నిండు గర్భిణి పుష్ప పాయకో పురిటినొప్పులతో బాధపడటంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వెంటనే మందస 108 అంబులెన్సు ఈఎంటీ ఉప్పాడ గోపాలకృష్ణ, పైలట్ ఎం.రామచంద్రారెడ్డిలు గ్రామానికి చేరుకున్నారు. అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే ప్రసవం చేయించింది. పుష్ప మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలను హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సచివాలయంలో చోరీ పలాస: టెక్కలిపట్నం గ్రామ సచివాలయంలో రెండు కంప్యూటర్ మానిటర్లు చోరీకి గురయ్యాయి. గురువారం రాత్రి కార్యాలయానికి తాళం వేసి శుక్రవారం ఉదయం చూసే సరికి మానిటర్లు కనిపించకపోవడంతో పంచాయతీ కార్యదర్శి రవి కాశీబుగ్గ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సూర్యనారాయణ చెప్పారు. కాగా, వేసిన తాళం వేసినట్టుగానే ఉందని, ఇందులో కార్యాలయం సిబ్బంది హస్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 9న అప్రెంటిస్ మేళా ఎచ్చెర్ల: ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 9న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఉదయం 9 గంటలకు బయోడేటా, ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు. నాగార్జున అగ్రికమ్, శ్యాంపిస్టన్స్, అరబిందో, ఎస్ఆర్ఎంటీ, అపోలోటైర్స్ తదితర కంపెనీల్లో అప్రెంటిస్ కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
తెలుగు ఉపాధ్యాయుల నిరసన
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఉపాధ్యాయుల బదిలీల్లో తెలుగు ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని డీటీఎఫ్, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లాశాఖ నాయకులు ఆరోపించారు. తప్పనిసరి బదిలీలు, రీ–అప్పోర్సన్కు గురైన తెలుగు ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సెలింగ్లో తీవ్ర అన్యాయం జరిగిందని స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ ర్యాంకు తర్వాత పెట్టిన పాఠశాలలకు బదిలీ అయినట్లు ఆర్డర్లు రావడంతో శుక్రవారం డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. వాస్తవానికి సీనియారిటీ నెంబర్కు ముందు ఉన్న పాఠశాలలకు మాత్రమే బదిలీ కావాల్సి ఉందన్నారు. ఈ మేరకు డీఈఓ తిరుమల చైతన్యకు వినతిపత్రం అందజేశారు. -
అకడమిక్ అంశాలపై దృష్టి సారించండి
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యాప్రమాణాలను పెంపొందించేందుకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు విద్యాసంబంధిత అంశాలతోపాటు అకడమిక్ అంశాలపై దృష్టి సారించాలని డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అకడమిక్ అంశాలపై జరుగుతున్న జిల్లాస్థాయి డీఆర్పీల మూడు రోజుల శిక్షణా తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ హెచ్ఎంలు, సబ్జెక్టు ఉపాధ్యాయులు అకడమిక్ అంశాలైన క్యాలెండర్, హ్యాండ్బుక్, అసెస్మెంట్, కరికులం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్ర పరిశీలకులు గిరిజా శంకర్ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మూడవ విడత ట్రైనింగ్లో ప్రతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు అకడమిక్ అంశాలపై శిక్షణ పొందాలన్నారు. ఈ నెల 9, 10, 11 తేదీలలో జిల్లాలో శ్రీకాకుళం, టెక్కలి, పలాస మూడు డివిజన్ల పరిధిలో ఉపాధ్యాయులకు తాజాగా శిక్షణ పొందిన డీఆర్పీలతో శిక్షణా తరగతులు ఉంటాయ ని పేర్కొన్నారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులంతా హాజరుకావాల్సిందేనని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్, ఉప విద్యాశాఖ అధికారులు ఆర్. విజయకుమారి, పి.విలియం, డీసీఈబీ సెక్రటరీ జి.రాజేంద్రప్రసాద్, వమ్మరవల్లి డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఎ.గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో కోవిడ్ నియమావళి అమలు
భువనేశ్వర్: రాష్ట్రంలో కోవిడ్–19 పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతోంది. మరోవైపు వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరిచే సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం అప్రమత్తం అయింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది కోవిడ్ సంక్రమణ బారిన పడకుండా నివారణ చర్యల కింద కోవిడ్ – 19 ఆరోగ్య నియమావళిని అమలు చేయనున్నట్లు మంత్రి నిత్యానంద గోండ్ గురువారం ప్రకటించారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరవడంతో కోవిడ్ నియమావళి అమలుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది కోవిడ్ – 19 భద్రతా చర్యలను పాటించాల్సి ఉంటుంది. జలుబు వంటి లక్షణాలు ఉన్న విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాలకు హాజరు కావలసి ఉంటుందన్నారు. తీవ్రమైన అనారోగ్య లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండి హోం క్వారంటైన్ పాటించాలని మంత్రి సలహా ఇచ్చారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ భువనేశ్వర్: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక రాజ్ భవన్ ప్రాంగణంలో గవర్నర్ దంపతులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఐఆర్ఎస్కు సాయిరాం ఎంపిక రణస్థలం: సివిల్ సర్వీస్– 2025 ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన రణస్థలం మండలం వెల్పురాయి గ్రామానికి చెందిన సేనా పతి సాయిరాం ఇండియ న్ రెవెన్యూ సర్వీస్కు ఎంపికయ్యారు. ఇతని తండ్రి సూర్యనారాయణ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సాయిరాం ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షేక్ రుక్సాద్కు ప్రతిభా అవార్డు ఇచ్ఛాపురం రూరల్: ఇంటర్మీడియట్ బైపీ సీ విభాగంలో ఉత్తమ మార్కులు సాధించిన షేక్ రుక్సాద్కు ప్రభు త్వం ప్రతిభా అవార్డు ను గురువారం అందజేసింది. ఈ మేరకు ఎం.తోటూరు ఆది త్యా కళాశాల సిబ్బంది విద్యార్థిని అభినందించారు. విద్యార్థి వెయ్యి మార్కులకు 982 మార్కులు సాధించారు. షేక్ రుక్సాద్ తండ్రి ఇచ్ఛాపురం పట్టణంలో టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రెండు తులాల బంగారం చోరీ కొత్తూరు: బలద గ్రామానికి చెందిన కంచరాం పురుషోత్తం ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. వివాహం నిమిత్తం బంధువుల ఇంటి కి వెళ్లి గురువారం ఉదయం వచ్చేసరికి తలుపు లు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. బీరువా తాళాలు విరగ్గొట్టి అందులో ఉన్న రెండు తులాల బంగారు వస్తువులను పట్టుకుపోయారు. అనంతరం బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ప్రసాదరావు, క్లూస్టీమ్ గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏఎస్ఐ కేసు నమోదు చేశారు. పిడుగు పాటుకు ఆవు మృతి నందిగాం: బడగాం పంచాయతీ కాశీరాజుకాశీపురంలో గురువారం పిడుగు పడి సనపల ముఖలింగంకు చెందిన ఆవు మృతి చెందింది. గ్రామ సమీప పొలాల్లో ఆవును మేతకు తీసుకువెళ్ల ఒక్కసారిగా పిడుగు పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వెటర్నరీ అసిస్టెంట్ సునీత ఘటనా స్థలాన్ని పరిశీలించి పశుసంవర్ధక శాఖ ఏడీ రవికృష్ణకు విషయం తెలియజేశారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు ఎచ్చెర్ల: లావేరు మండలం బుడుమూరులో పేకాట శిబిరంపై లావేరు పోలీసులు గురువారం దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, రూ.9,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. హెచ్సీ హెచ్.జోగారావు కేసు నమోదుచేశారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మల్కన్గిరి: మల్కన్గిరి సమితి తండకి పంచాయతీ బండిగూడలో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అటవీ, ఎకై ్సజ్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా లీగల్ అథారిటీ కార్యదర్శి న్యాయమూర్తి సంగీతా పాత్రో ఈ కర్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కల పెంపకంతో వచ్చే లాభాలు గూర్చి వివరించారు. జిల్లా అటవీశాఖ అధికారి ప్రతాప్ కోత్తపల్లి, మల్కన్గిరి ఎకై ్సజ్ అధికారి బింబధర్ పండా, మల్కన్గిరి అదనపు ఎకై ్సజ్ అధికారి టంకధర్ బోయి, ఇతర అధికారులు పాల్గొన్నారు. జయపురంలో.. జయపురం: పర్యావరణ పరిరక్షణే సమస్త జీవుల మనుగడకు శ్రీరామ రక్ష అన్నారు పలువురు ప్రముఖులు అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జయపురంలో పలు సంస్థలు కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. స్థానిక ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం సభాగృహంలో ఒడిశా అటవీ పర్యావరణం, జల వాయు పరివర్తన విభాగం, సహకారంతో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 50 మంది రైతులు పాల్గొన్నారు. స్వామినాథన్ పరిశోధన కేంద్రంలో వివిధ రకాల మొక్కలను నాటారు. జిల్లా జడ్జి, ప్రదీప్ కుమార మహంతి, జయపురం అటవీ విభాగ అధికారి ప్రతాప్ బెహర, జయపురం సబ్కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి, సివిల్ జడ్జి శ్రీమతి అలకానంద మహంతి, తదితరులు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాలలో.. జయపురం ప్రధాన మంత్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పాటించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాశ చంద్ర పట్నాయక్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ ప్రతాప్ కుమార్ బెహరా, అటవీ రేంజర్ సచ్చిదానంద పొరిడ పాల్గొని మొక్కలు నాటారు. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు విశ్వరంజన్ గౌడ, ప్రభాకర మహరాణ, అరుంధతి త్రిపాఠి, రశ్మితా నాహక్, సంతోషిణి పండా, రజణీ కాంత ఘొడాయి పాల్గొని మొక్కలు నాటారు. రాయగడలో.. రాయగడ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు జరిగాయి. మున్సిపాలిటీ యంత్రాంగం ఆధ్వర్యంలో పాలిథిన్ వినియోగానికి స్వస్థి పలకాలని గురువారం ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్, కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. జిసిడి వాకర్స్ క్లబ్, జేకే పేపర్ మిల్ ఉద్యోగులు మొక్కలు నాటారు. అటవీ శాఖ కార్యాలయంలో మొక్కలు నాటారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గుండిచా మందిరం నుంచి ఒక ర్యాలీని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా, అబ్కారీశాఖ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు, డీఈఓ డాక్టర్ మయాధర్ సాహు, పురపాలక ఈఓ లక్ష్మణముర్ము, పోలీసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు. ర్యాలీ అనంతరం మహేంద్రతనయ వద్ద ఉన్న బృందావన ప్యాలస్లో ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి కె.నాగరాజు ఆధ్యక్షతన బృందవన ప్యాలస్లో జరిగిన సాధారణ సమావేశంలో కలెక్టర్ దాస్, మ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు తదితరులు పాల్గొని మొక్కలను నాటారు. డి.ఎఫ్.ఓ. కె.నాగరాజు మాట్లాడుతూ ఈ ఏడాది 740 హెక్టార్లలో 3 లక్షల నర్సరీ పాప్లింగ్స్, మరో 5 లక్షల మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు. -
నాలుగు కేజీల గంజాయితో వ్యక్తి అరెస్టు
ఇచ్ఛాపురం టౌన్ : ఒడిశా నుంచి పూణేకు 4.18 కిలోల గంజాయి తరలిస్తున్న ఎలియా రైత అనే వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్టు సీఐ ఎం చిన్నంనాయుడు తెలిపారు. ఒడిశా రాష్ట్రం లుహకంటి గ్రామానికి చెందిన ఎలియా రైతా తన సోదరుడు జోహర్ రైతాతో కలిసి కుంజన ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి మహరాష్ట్రకు చెందిన రాఖేష్ సుదంప్లంజ్(చాచా)కు అమ్ముతుండేవారు. ఈ క్రమంలో ఎలియా రైతా రెండు ప్యాకెట్ల గంజాయితో బరంపురం నుంచి ఇచ్ఛాపురం వచ్చాడు. రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు తనిఖీ చేయగా గంజాయి గుర్తించడంతో అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు. -
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
రాయగడ: స్థానిక బాలాజీ నగర్లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవ్వనున్నాయి. ఉత్సవాలు ఈనెల 11వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు తెలియజేశారు. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు సుప్రభాత సేవ, శాత్తుమురై, వేద పారాయణం, నిత్య శేష హోమాలు, ఉదయం 9 గంటలకు సత్యనారాయణ స్వామివారి వ్రతములు, సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన ఆరాధన, రక్షాసూత్రధారణ, మత్య్సంగ్రహణం, వాస్తు యోగిశ్వర పూజలు, ప్రసాద వితరణ జరుగుతాయి. అదేవిధంగా 7వ తేదీన స్వామివారి వ్రతములు, గరుడ ధ్వజారోహణం, సాయంత్రం 5 గంటలకు ఎదర్కొలోత్సవం, 5.30 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, 8 గంటలకు శేష వాహనోత్సవం తదితర కార్యక్రమాలు జరుగుతాయి. -
ప్రాణాలు తోడేస్తూ!
ఇసుక తవ్వేస్తూ.. శ్రీకాకుళం రూరల్: ఇసుక అక్రమార్కులు నిబంధనలకు తూట్లుపొడుస్తున్నారు. నదిలో ఇష్టారాజ్యంగా యంత్రాలతోనే భారీ ఎత్తున తవ్వకాలు చేస్తున్నా రు. ఫలితంగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నా యి. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీరు ఆ గోతుల్లో చేరుతోంది. వాటిని గమనించని సామాన్యులు ప్రమాదవశా త్తు దిగి కూరుకుపోయి మృత్యువాతపడుతున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల శ్రీకాకుళం రూరల్ మండ ల పరిధిలో చోటు చేసుకుంది. ఆదేశాలు బేఖాతరు.. వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో అనుమతులకు మించి తవ్వకాలు చేస్తున్నా అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. జిల్లా కలెక్టర్ సైతం ఆక్రమ తవ్వకాలపై కన్నెర్ర చేసినా రెవెన్యూ, మైన్స్ అధికారులు తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. బైరి, కరజాడ పరిసర ప్రాంతా ల్లో పగలు రాత్రీ అనే తేడా లేకుండా ఇసుక దందా సాగుతోంది. నదిలో ఎక్కడికక్కడే భారీగా గోతులు తవ్వేస్తూ వదిలేస్తున్నారు. ఇప్పటికే ఇసుక తవ్వకా లు నిత్యం చేపట్టడంతో వ్యవసాయ బోరులు సైతం పాడైపోయాయని పరిసర ప్రాంత రైతులు ఆవేదన చెందుతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడికక్కడే తవ్వకాలు చేయడంతో గత నెలలో బైరి గ్రామానికి చెందిన గొర్లె రామారావు అనే వ్యక్తి వంశధార నదిలోకి స్నానానికి వెళ్లినప్పుడు భారీగా ఏర్పడిన గోతులో కూరుకుపోయి ప్రాణాలు పోగుట్టుకున్నాడు. ఇలాంటి గోతులే నదిలో ఎక్కడికక్కడ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైన్స్ అధికారులు మాత్రం అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అనుమతులకు మించి తవ్వకాలు చేయడం, ఎక్కడికక్కడే గోతులు ఏర్పడటం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయ ని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్ పలకలతో ఇసుక ర్యాంప్.. బైరి ర్యాంప్ను ఆనుకొని ఏకంగా నదీ గర్భంలోకే గ్రానైట్ పలకలతో కూడిన ర్యాంప్ను రోడ్డు మాదిరిగా వేసేశారు. దీని మీదుగా పెద్దపెద్ద వాహనాలు వెళ్తూ ఇసుక లోడింగ్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారంలో కూలీలతో ట్రాక్టర్లకు ఇసుక నింపాల్సి ఉండ గా 200 హైస్పీడ్తో కూడిన ప్రొక్లెయినర్లతో ఇక్కడ వినియోగిస్తున్నారు. ఫలితంగా నదీగర్భంలో ఎక్కడికక్కడే పెద్దపెద్ద గోతులు ఏర్పడి సామాన్యుల ప్రాణాలకు మీదకు వస్తోంది. వంశధార నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు ఎక్కడికక్కడే భారీగా గోతులు ప్రమాదవశాత్తు మృత్యువాతపడుతున్న సామాన్యులు పట్టించుకోని అధికారులు తవ్వకాలు వాస్తవమే.. బైరి ప్రాంతంలో ఇసుక తవ్వకాలు నిత్యం జరుగుతున్నాయి. ఈ ర్యాంపును శ్రీ వెంకటేశ్వర మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు నిర్వహిస్తున్నారు. నదిలోకి నేరుగా గ్రానైట్ పలకలతో కూడిన ర్యాంప్ వేశారు. ఇచ్చిన అనుమతులు కన్నా ఎక్కువగానే తవ్వేస్తున్నారు. – శ్రీనివాసరావు, బైరి వీఆర్ఓ అనుమతులకు మించి తవ్వకాలు బైరి గ్రామంలో అనుమతులకు మించి అక్రమంగా తవ్వకాలు చేయడంతో ఇటీవల మా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్నానానికి దిగి చనిపోయాడు. అయినా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. నదీ పరివాహక ప్రాంతంలో ఏదో ఒక మూల తవ్వేస్తూ ఉన్నారు. అధికారులు గానీ, సచివాలయ సిబ్బంది గానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. – ఎండి అసిరినాయుడు, ఉపసర్పంచ్, బైరి గ్రామం -
స్నానోత్సవానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు: ఐజీ
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్రకు 15 రోజుల ముందుగా స్నానోత్సవం జరగనుంది. ఏటా జ్యేష్ట పూర్ణిమ పురస్కరించుకుని శ్రీ మందిరం ప్రాంగణంలో భారీ స్థాయిలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీమందిరం ప్రహరి మేఘనాథ్ ప్రాంగణంలో బహిరంగ మండపంపై మూల విరాట్లకు స్నానోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏడాది జూన్ 11న శ్రీ జగన్నాథుని స్నానోత్సవం జరుగుతుంది. ఈ మేరకు పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సెంట్రల్ రేంజ్ ఇన్స్పెక్టరు జనరల్ (ఐజీ) ఎస్. ప్రవీణ్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు వినీత్ అగర్వాల్, అదనపు పోలీసు సూపరింటెండెంటు, ఇన్చార్జి ఇన్స్పెక్టర్ (ఐఐసీ), ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రథ యాత్ర పురస్కరించుకుని శాంతిభద్రతల స్థితిగతుల్ని సమీక్షించారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికపై లోతుగా చర్చించారు. త్వరలో జరగనున్న స్నాన యాత్రలో శాంతిభద్రతల పరిరక్షణతో భక్తుల రక్షణ కోసం ప్రత్యేకంగా పోలీసు బలగాల్ని మోహరించనున్నట్లు కేంద్ర ఐజీ తెలిపారు. ఈ ఉత్సవానికి సమగ్రంగా 70 ప్లాటూన్ల పోలీసు బలగాల్ని మోహరించనున్నారు. 4 మంది పోలీసు సూపరింటెండెంటు హోదా కమాండెంట్లు, 450 మంది ఇతర స్థాయి అధికారుల్ని నియమించనున్నారు. స్నాన యాత్ర సందర్భంగా పూరీ పట్టణంలో ప్రధానంగా యాత్ర ప్రాంగణం పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ప్రత్యేక ఆంక్షలు జారీ చేయనున్నారు. తాత్కాలికంగా వాహనాల కదలికని నియంత్రించనున్నట్లు తెలిపారు. ఈ నెల 9న ద్వితీయ సర్వ సభ్య సమావేశం జరగనుంది. రాష్ట్ర న్యాయ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్ అధ్యక్షతన ఈ సమావేవం జరుగుతుంది. పూరీ రథ యాత్ర ఏర్పాట్లుపై సమగ్రంగా ఈ సమావేశంలో సమీక్షిస్తారు. -
కారణమెవరు..?
శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025శోకానికి.. కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ కళాశాలలో వైద్యం వికటించి ఆరుగురు మృతి చెందారు. గురువారం రాష్ట్ర వైద్య మంత్రి ముఖేష్ మహాలింగ అత్యవసర పర్యటన చేశారు. రాజధాని నుంచి ఆగమేఘాల మీద వైద్య కళాశాలకు తరలి వచ్చారు. మంత్రి వస్తున్నారని తెలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున రక్షణ కల్పించింది. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద మంత్రితో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ మాట్లాడానికి ప్రయత్నం చేశారు. ఇది గమనించిన బీజేపీకి చెందిన కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో దాడికి ప్రయత్నించారు. నిమయ్ అప్రమత్తమై ఎమ్మెల్యేపై ఎదురు దాడికి దిగారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరిని విడదీశారు. అనంతరం మంత్రి వైద్య కళాశాలలో వివిధ వార్డులు సందర్శించారు. రోగులకు అందుతున్న చికిత్స అడిగి తెలసుకున్నారు. మందుల కౌంటర్ ని పరిశీలించారు. కళాఽశాలలో ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలు మరణాలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. సమావేశంలో కలెక్టర్ వీ.కీర్తి వాసన్, కొట్ పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర తదితరులు పాల్గొన్నారు. విచారణ జరిపిస్తున్నాం: మంత్రి ముఖేష్ ఇలాంటి మరణాలు విచారకరమని రాష్ట్ర వైద్య మంత్రి ముఖేష్ మహాలింగం ప్రకటించారు. వైద్య కళాశాల ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ప్రభుత్వ విచారణ జరుగుతుందన్నారు. తాను ఆస్పత్రిలో అన్ని వార్డులు పరిశీలించానన్నారు. పూర్తిస్థాయి సమీక్ష జరిగిందని మంత్రి ప్రకటించారు. వైద్య బృందం పరిశీలన.. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కటక్, బ్రహ్మపుర వైద్య కళాశాలలకు చెందిన వైద్య నిపుణుల బృందం తరలి వచ్చింది. ఆయా వైద్య నిపుణులు కళాశాలలో తమ విచారణ ప్రారంభించారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన బృందం కళాశాలలో పర్యటించింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు మీనాక్షి వాహీని పతి తదితరులు కళాశాలలో వివిధ వార్డుల్లో పర్యటించారు. రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి.. వైద్య కళాశాల మృతులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ చంద్ర ఖడం డిమాండ్ చేశారు. గురువారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఇవి ప్రభుత్వ హత్యలని అన్నారు. బాధిత కుటుంబాల గోడు వినలేదన్నారు. నర్సులు ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే రోగులు చనిపోయారని పేర్కొన్నారు. మంత్రితో మాట్లాడడానికి వచ్చిన తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ పై స్థానిక ఎమ్మెల్యే దాడి చేయడం సరికాదన్నారు. చేతకాని ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై బౌతిక దాడులు చేస్తుందన్నారు. ఇలాంటి దాడులతో ప్రజలను భయపెట్టలేరనని రాం చంద్ర ఖడం పేర్కొన్నారు. న్యూస్రీల్ కొరాపుట్ వైద్య కళాశాలలో.. నాయకుల పర్యటన -
హాస్టల్ ఏర్పాటు చేయాలి
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి పరిధి మునుష్గా పంచాయతీలోని కొడిగుడ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సౌకర్యార్థం హాస్టల్ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు రజత్ మదల కోరారు. ఈ మేరకు కార్యకర్తలతో కలిసి రాజధానికిలోని రాష్ట్ర ఆదివాసీ, హరిజన వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండొకు గురువారం వినతిపత్రం అందజేశారు. కాసీపూర్ సమితిలో విద్యావిధానం మరింత మెరుగుపరచాలని, అదేవిధంగా ఆస్పత్రి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రయాణికునికి ఫోన్ అప్పగింత భువనేశ్వర్: హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని ఎయిర్ కండిషన్డ్ బోగీలో ప్రయాణికుడు మరిచిపోయిన ఫోనుని భద్రంగా సంబంధీకులకు అప్పగించి టికెటు తనిఖీ సిబ్బంది సేవాభావం చాటుకున్నాడు. హౌరా నుంచి ఖుర్దారోడ్ వరకు టికెటు తనిఖీ విధులు నిర్వహించిన చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ లక్ష్మీధర మహంతి సత్వర స్పందనతో ఇది సాధ్యమైంది. ఎం–4 ఎయిర్కండిషన్ బోగీలో ప్రయాణించి వ్యక్తి విలువైన మొబైల్ ఫోను మర్చిపోయి జాజ్పూర్ కెంజొహర్ రోడ్ రైల్వే స్టేషనులో దిగిపోయాడు. రైలు బయల్దేరిపోవడంతో రైల్వే శాఖ సహకారంతో టికెటు తనిఖీ అధికారికి సమాచారం చేరదీయడంతో విధి నిర్వహణలో ఉన్న అధికారి తక్షణమే గాలించి ఆ వ్యక్తి ప్రయాణించిన సీటులో మొబైలు ఫోన్ గుర్తించి తెలియజేయడంతో తదుపరి రైల్వే స్టేషన్లో ఫోను మరిచిపోయిన ప్రయాణికుని బంధువు కటక్ రైల్వే స్టేషన్కు చేరి సంబంధిత చీఫ్ టికెట్ నుంచి మొబైల్ ఫోను తిరిగి పొందగలిగాడు. వివాహిత దారుణ హత్య జయపురం: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు పిన్ని వరుస మహిళను కామించి ఆమె నిరాకరించటంతో హత్య చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఈ సంఘటన జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ పోలీసు స్టేషన్ పరిధి జయంతగిరి–మినాగుడ మార్గంలో బుధవారం జరిగింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మినాగుడ గ్రామం డొంబు పెంటియ తనకు పిన్ని వరుస అయిన రుక్మిణీ పెంటియపై కన్నువేశాడు. శారీరక సంబంధం కోసం ఆమెను వేధించసాగాడు. బుధవారం రుక్మిణీ పెంటియ జయపురంలో బంగారు నగలు కొనేందుకు బయల్దేరింది. విషయం తెలుసుకున్న డుము పెంటియ జయంతిగిరి–మినాగుడ మార్గంలో ఆమెను అడ్డగించాడు. డొంబు కోరికను ఆమె నిరాకరించడంతో అతడు కోపంతో కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై ఆమె పడిపోయింది. స్థానికులు గమనించి ఆమెను కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య విద్యాలయ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. రుక్మిణి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై బొరిగుమ్మ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు బొరిగుమ్మ పోలీసు అధికారి శ్వేత పద్మ సెట్టి వెల్లడించారు. రుక్మిణి భర్త మానసిక రోగి కావటం వల్ల, ఆ అవకాశాన్ని తీసుకొని ఆమెను తన వశం చేసుకోవాలని డొంబు పెంటియ ప్రయత్నించి విఫలమై ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసు అధికారి తెలిపారు. -
పోలీసుల అదుపులో మేధా పాట్కర్
రాయగడ: పర్యావరణ వేత్త, ప్రముఖ సమాజ సేవకురాలు మేధా పాట్కర్ను రాయగడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రత్యేక వాహనంలో బరంపురం తరలించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆమె కాశీపూర్ పరిధి హొటొపొదొరొలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలి. గురువారం తెల్లవారున హిరాఖండ్ ఎక్స్ప్రెస్లో రాయగడ రైల్వే స్టేషన్కు చేరుకున్న ఆమెతో పాటు సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలు జరుగుతున్నాయి. మేధా పాట్కర్ ఆ ప్రాంతానికి వెళ్లి ప్రసంగిస్తే పరిస్థితులు అదుపు తప్పుతాయని భావించి ఆమెను అక్కడకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఆమెతో పాటు పర్యావరణ వేత్త ప్రఫుల్ల సామంత, కృషక్ నాయకుడు లింగరాజ్, నరేంద్ర మహాంతి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభివృద్ధికి వ్యతిరేకిని కాను.. తాను అభివృద్ధికి వ్యతిరేకిని కానని మేధా పాట్కర్ తెలిపారు. సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. శాంతి యుతంగా జరిగే ఇలాంటి కార్యక్రమాల్లో గతంలోనూ పాల్గొన్నానని పేర్కొన్నారు. పోలీసుల అదుపులో ఉన్న మేధా పాట్కర్ తాను ఓ పాత్రికేయుడిని కలవాలని కోరగా.. స్థానికంగా ఉంటున్న ప్రముఖ పాత్రికేయుడు కీర్తి చంద్ర సాహు ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఇంటిలో అల్పాహారం తీసుకున్న తర్వాత తిరిగి పోలీసులు ఆమెను ప్రత్యేక వాహనంలో బరంపురం తరలించారు. -
పేపర్ మిల్లు పునరుద్ధరణపై సమావేశం
జయపురం: స్థానిక గగణాపూర్లోని సేవా పేపరు మిల్లు పునరుద్ధరణపై జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అధ్యక్షతన ఒక సమావేశాన్ని పట్టణంలోని రుతురాజ్ కల్యాణ మండప ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మిల్లు పునః ప్రారంభించేందుకు పెట్టుబడులు పెట్టనున్న నూతన యాజమాన్యం త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు సంసిద్ధత ప్రకటించిందన్నారు. మిల్లులో ఉత్పత్తి సజావుగా జరిపేందుకు రెండు యూనియన్ల కార్మికులతో చర్చలు జరిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్సర్ అనే పెట్టుబడులు పెట్టే కంపెనీకి మిల్లు నడిపేందుకు పూర్తిగా సహకరించాలని కోరారు. ఈనెల 25 నాటికి రాష్ట్ర ప్రభుత్వంతో నూతన యాజమాన్యం ఎంవోయూ చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే కార్మికులకు గత 10 నెలల బకాయి వేతనాలు చెల్లించడంతో జూలై నుంచి అందరికీ నిబంధనల ప్రకారం జీతాలు చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో కంట్రాక్టర్ల ప్రతినిధి నరేంద్ర మహంతి, లాడి శ్రీనివాసరావు, 4వ నంబర్ యూనియన్ ప్రదీప్ కుమార్ రాయ్, సందీప్ మండల్, సునీల్ సాహు, ఉపేంద్ర జెన, 3వ నంబర్ యూనియన్ అధ్యక్షుడు ఉజ్విన్ నాయిక్, ఉమాశంకర పాణిగ్రహి, సుదర్శన సెట్టి తదితరులు పాల్గొన్నారు. -
విశ్రాంత కార్మికులకు బకాయి బాధ
జయపురం: జయపురం గగణాపూర్ సేవా పేపరుమిల్లు విశ్రాంత కార్మికుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అతడి కుటుంబ సభ్యులు జయపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చేర్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మరో చోటకు తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. కానీ అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో వారు ఏం చేయాలో తెలీక తల్లడిల్లుతున్నారు. సేవా యూనియన్ నేత ప్రమోద్ కుమార్ మహంతి వివరిస్తూ.. సేవా పేపరుమిల్లు విశ్రాంత కార్మికుడు బి.ముత్యాల రావు కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నాడని, ముత్యాల రావు కుమారులు తన తండ్రికి రావాల్సిన గ్రాడ్యుటీ, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని అభ్యర్థించారని, అయితే యాజమాన్యం కేవలం రూ.10వేలు మాత్రమే అందజేసిందన్నారు. రానున్న రెండు నెలల్లో బకాయిలు అందజేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ ముత్యాల రావు చికిత్సకు రూ.లక్షల్లో డబ్బు అవసరమవుతుందని, చాలా మంది విశ్రాంత కార్మికులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. సకాలంలో యాజమాన్యం విశ్రాంత కార్మికులకు బకాయిలు చెల్లించనందున తగిన వైద్యం అందక ఇటీవల 30 మందికి పైగా మరణించారని ఆయన వెల్లడించారు. ఇప్పటికై నా మిల్లు యాజమాన్యం విశ్రాంత కార్మికుల పట్ల మానవతా దృష్టితో తక్షణ సహాయం అందజేయాలని కోరారు. బకాయి ఉన్న డబ్బు వెంటనే చెల్లించి సహకరించాలని కోరారు. -
మరణ మృదంగం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 11 నుంచి బుధవారం వేకువజాము వరకు ఆరుగురు రోగులు మృత్యువాతపడ్డారు. వైద్యం వికటించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని బాధిత కుటుంబాలు ఆరోపణలు చేస్తుండగా.. అవన్నీ సహజ మరణాలు అయి ఉండవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషాద ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. మృతుల్లో నలుగురు ఐసీయూలో ప్రాణాలు వదలడం వివాదాస్పదంగా మారింది. మృతుల్లో భగవాన్ పరజా (68), శుక్ర మజ్జి (45), జగన్నాథ్ పూజారి (54), రుకుని పెంటియా (47), బాటి ఖురా(36), పుల్మతి మజ్జి (29)లుగా ప్రభుత్వం ప్రకటించింది. వీరందరూ అత్యవసర చికిత్స కోసం వచ్చారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు.దర్యాప్తుకు ఆదేశం..విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు రుపక్ తురుక్, మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ తదితరులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే పోలీసు బలగాలను మోహరించారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వీ.కీర్తివాసన్ కళాశాలకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరణాలపై పూర్తిస్థాయి విచారణ చేస్తామన్నారు. ఇవి సహజ మరణాలుగానే అనుమానం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుందన్నారు. తనకు వైద్య పరిజ్ఞానం లేదని, అందుకే ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు. కళాశాల సూపరింటెండెంట్ సుశాంత్ మాట్లాడుతూ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు.10 మంది వైద్య నిపుణులతో ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేస్తామన్నారు. మరోవైపు రోగుల బంధువులు మీడియాతో మాట్లాడుతూ ముగ్గురు నర్సులు వచ్చి ఇంజక్షన్లు చేశారని, ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఐదు నిమిషాలకు ఒక్కొక్కరూ మృతి చెందారని చెప్పారు. కాగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ.10 వేలు చొప్పున అందజేసింది. -
విజిలెన్స్ వలలో ఏఎస్ఐ
● రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం రాయగడ: పది వేల రుపాయల లంచం తీసుకుంటూ విజిలెన్స్ వలకు చిక్కారు బరంపురం మహిళా పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బబిత సునా. ఓ కేసుకు సంబంధించి మహిళను బరంపురం మహిళా పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసి ఉంచారు. ఈ కేసును బబిత విచారిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే అందుకు రూ.10 వేలు చెల్లించాలని, లేదంటే వేరే కేసులపై అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని బబిత చెప్పారు. బాధితురాలు ఈ మేరకు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించాడు. వల పన్నిన విజిలెన్స్శాఖ అధికారులు ఏఎస్ఐ లంచం తీసుకుంటుండగా బుధవారం పట్టుకున్నారు. ఆమైపె కేసు నమోదు చేశారు. -
గంజాయితో ఇద్దరు అరెస్టు
పర్లాకిమిడి: జిల్లా అబ్కారీ సూపరింటెండెంట్ ప్రదీప్కుమార్ సాహు ఆదేశాల మేరకు మొబైల్ యూనిట్ గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దీనిలో భాగంగా పర్లాకిమిడి కొత్త బస్టాండ్, భవానీ టాకీస్ వద్ద బైక్పై గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 52 కిలోల గంజాయి, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమార్ పటేల్, యసై మఝి శోబోరో, మోడల్ ఇన్స్పెక్టర్ మోనూ ఆయాల్ తదితరులు పాల్గొన్నారు. నాటుసారా తరలిస్తున్న ముగ్గురు అరెస్టు జయపురం: నాటుసారాను అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం అబ్కారీ అధికారి సుబ్రత కేశరీ హరిస్ బుధవారం తెలిపారు. అరెస్టయిన వారిలో జయపురం సమితి గొడొపొదర్ పంచాయతీ దుబులి గ్రామానికి చెందిన త్రినాథ్ పొరజ, జయపురం సబ్డివిజన్ నువాగుడ వాసి ఆకాశ హరిజన్, నువాపుట్ గ్రామ వాసి ఈశ్వర బిశాయి ఉన్నారన్నారు. వీరిని కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించినట్టు సుబ్రత్ కేశరీ హరిష్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఎకై ్సజ్ అధికారి హరిష్, ఏఎస్సై బలరాం దాస్లు తమ సిబ్బందితో పెట్రోలింగ్ జరుపుతుండగా నాటుసారా తీసుకెళ్తున్న ముగ్గురు పట్టుబడినట్టు పేర్కొన్నారు. వీరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. -
ఆవుల అక్రమ తరలింపునకు చెక్
జయపురం: ఆవుల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి బి.సింగపూర్ వద్ద మంగళవారం సాయంత్రం కొంతమంది అక్రమంగా గోవులను తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 75 ఆవులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసిటన్టు బుధవారం తెలిపారు. జయపురం సమితి జయంతిగిరి సంత నుంచి ఆవులను నడిపించుకుంటూ బొరిగుమ్మ రాణిగుడ మార్గం గుండా కొరాపుట్ వైపు తీసుకెళ్తుండగా బిసింగపూర్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో సెమిలిగుడ వ్యాపారి ఒకరు ఉన్నట్టు వెల్లడించారు. ఆవులను జయంతిగిరి వారపు సంత నుంచి బొరిగుమ్మ, రాణిగుడ మీదుగా కుందులి సంతకు వెళ్లి అచ్చట నుంచి ఆవులను ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు తీసుకెళ్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. జిల్లాలో గోవుల రవాణాపై అధికారులు ఆంక్షలు విధించినప్పటికీ అనేక మార్గాలలో వ్యాపారులు గోవులను తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కొరాపుట్ జిల్లాలో గోవులను సేకరించి వాటిని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. గత మే నెలలో పలుసార్లు గోవుల రవాణా చేస్తూ అనేక మంది పోలీసులకు చిక్కిన విషయం విదితమే. గత మే 27వ తేదీన పశువులు రవాణా చేసే కంటైనర్లను పట్టుకొని 210 పశువులను పట్టుకున్న సంఘటనలో 17 మందిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మరువక ముదే మంగళవారం సాయంత్రం 76 ఆవులతో ముగ్గురు పట్టు బడ్డారు. 76 ఆవులు స్వాధీనం ముగుర్గు అరెస్టు -
వైద్యుల నిర్లక్ష్యానికి బాలుడి మృతి
రాయగడ : వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలుడు మృతిచెందాడంటూ కుటుంబ సభ్యులు బ్లడ్బ్యాంక్ వద్ద ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బుధవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక న్యూకాలనీలో నివాసముంటున్న మధుసూదన్ టరికి కుమారుడు తొమ్మిదేళ్ల రాజీవ్ టకిరి రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. జ్వర తీవ్రత పెరగడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడికి రక్తం తక్కువగా ఉందనే, వెంటనే రక్తాన్ని ఎక్కించాల్సి ఉందని వైద్యులు సూచించారు. బాధితులు వెంటనే రక్త నిధికి వెళ్లగా నిల్వలు లేవని చెప్పడంతో కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోయారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు రక్తనిధి కేంద్రం డాక్టర్ గౌతం పట్నాయక్ వచ్చి అవసరమైన రక్తం ఉందని చెప్పి రాజీవ్కు రక్తం ఎక్కిస్తుండగా బాలుడు మృతి చెందాడు. దీంతో కోపోద్రుక్తులైన బాధిత కుటుంబీకులు రక్తం రాత్రి లేదని చెప్పి.. తెల్లవారే సరికి ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఆందోళనకు దిగారు. రాత్రే రక్తం ఎక్కిస్తే తమ కొడుకు బతికేవాడంటూ విలపించారు. స్థానిక సేవా సంస్థలు విరివిగా బ్లడ్ డొనేషన్ శిబిరాలు నిర్వహిస్తూ ఆయా సంస్థలు సేకరించిన రక్త యూనిట్లను ప్రభుత్వ రక్తనిధికి తరలిస్తుంటే.. ఇక్కడ రక్తం లేదని చెప్పడం తగదని మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు. -
తుపాకులు కలిగి ఉన్న ఇద్దరు అరెస్టు
పర్లాకిమిడి: అను మతి లేకుండా తుపాకులు కలిగి ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి ఆదర్శపోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రఫుల్ల జగరంగ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గుసాని సమితి తులసిపాడు, డాక్టర్ బంజిరి వద్ద ఇద్దరు వ్యక్తులు ఎస్బీఎంఎల్ (సింగిల్ బ్యారిల్ లోడింగ్) తుపాకులతో పట్టుబడ్డారు. వీరిని పోలీసులు విచారించగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని పర్లాకిమిడి ఆదర్శ పోలీసు స్టేషన్కు తరలించారు. అరెస్టయిన వారిలో రాయగడ జిల్లా పుట్టాసింగి పంచాయతీ రెజింగ్తల్ గ్రామానికి చెందిన అరుణ్ గోమాంగో, ప్రతాప్ గోమంగోగా పోలీసులు గుర్తించారు. వారిపై 112/2025, సెక్షన్.25(1)(ఎ) ఆర్మ్స్ చట్టం క్రింద అరెస్టు చేసి బుధవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. పబ్లిక్ రక్షణ కింద నిందితులను అదుపులోకి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు ఐఐసీ ప్రశాంత్ భూపతి తెలిపారు. -
దేశానికి బలం ప్రజలే
భువనేశ్వర్: రైతులు, స్వయం సహాయక బృందాల మహిళలు, యువత, ఉపాధ్యాయులు, చేతివృత్తులవారు.. ఇలా అన్ని వర్గాల ప్రజలే దేశానికి బలమపి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన ఉత్కర్ష్ నిమాపడా కాంక్లేవ్ ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సమ్మిళిత వృద్ధి, స్థానిక ఆకాంక్షలకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందన్నారు. ప్రజా కేంద్రీకృత అభివృద్ధికి అర్థవంతమైన ఆవిష్కరణకు దోహదపడే ఈ చొరవను కార్యరూపం దాల్చడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడాను ఆయన ప్రశంసించారు. ఈ ప్రాంతంలో యువతకు సాధికారత కల్పించి స్థానిక ప్రతిభను వెలుగులోకి తెచ్చే స్టార్టప్ల ప్రోత్సాహానికి ఇటువంటి కార్యక్రమాలు వారధిగా నిలుస్తాయని ప్రోత్సహించారు. వ్యవసాయ కార్యకలాపాల ఆధునికీకరణ, డిజిటల్ వృద్ధి విస్తరణతో సమగ్ర సామర్థ్యత ఆవిష్కరణకు మార్గం సుగమం చేస్తుందన్నారు. గత 11 నెలల్లో రాష్ట్రం సమగ్ర వృద్ధిలో వ్యవసాయం, పర్యాటకం, మహిళలు, పిల్లలు వంటి కీలక రంగాల అభివృద్ధి, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు గణనీయమైన పురోగతిని సాధించాయని వివరించారు. కార్యక్రమానికి సారథ్యం వహించిన ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిదా ఈ సమావేశాన్ని నిమాపడా పురోగతికి ఒక మేలుకొలుపుగా అభివర్ణించారు. 2036 నాటికి అభివృద్ధి చెందిన ఒడిశా రూపకల్పనకు నిమాపడా కీలక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు స్పష్టమైన ప్రణాళికను రూపొందించడంలో ఈ చర్చలు సహాయపడతాయని పేర్కొన్నారు. జగత్సింగ్పూర్ లోక్సభ సభ్యుడు బిభు ప్రసాద్ తొరాయ్ ఈ సభలో ప్రసంగించారు. పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వంయి, సత్యబాది నియోజకవర్గ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ మిశ్రా, పూరీ ఎమ్మెల్యే సునీల్ మహంతి, బ్రహ్మగిరి ఎమ్మెల్యే ఉపాసన మహాపాత్రొ, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రైతు చైతన్య రథం ప్రారంభం
జయపురం: జయపురం సబ్కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రైతు చైతన్య రథా న్ని సబ్కలెక్టర్ అక్కవరం శొశ్య రెడ్డి జెండా ఊపి ప్రారంభించార. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ఎలా విక్రయించాలో అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో సంచరిస్తుంది. ప్రతి సమితిలో మూడు రథాలు ఏర్పాటు చేస్తున్న ట్లు ఆమె వెల్లడించారు. రైతుల సౌలభ్యం కోసం మండీల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఏ మండీలో గిడ్డంగి సౌకర్యం లేదో అక్కడ ధాన్యం తడవకుండా తార్పలిన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షంనీరు నిల్వ ఉండకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్కలెక్టర్ వెల్లడించారు. టోకెన్ ఉన్న రైతులందరి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్ప చేశారు. రైతులు ధాన్యం శుభ్రపరిచి తీసుకు రావాలని సూచించారు. ధాన్యం అమ్మకంలో ఎటువంటి సమస్య ఎదుర్కొన్న వెంటనే కంట్రోలు రూంకు ఫోను ద్వారా తెలియజేయాలన్నారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్ఎంసీ కార్యదర్శి డైరెక్టర్లు బాలా రాయ్, దేవేంద్ర బాహిణీపతి, నవీణ నాయిక్ పాల్గొన్నారు. -
అక్రమాలపై ఎమ్మెల్యే ఆగ్రహం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి సమావేశం బుధవారం జరిగింది. సమితి అధ్యక్షులు దీప్తిమయి నాయిక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి పాలొన్నారు. ఈ సందర్బంగా ఆయన సమితిలో జరిగిన అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు నకిలీ బిల్లుల సమర్పించి నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. అటువంటి సంఘటనలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు నల్లబజారులో విక్రయిస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే నల్ల బజారుపై చర్యలు చేపట్టాలని వ్యవసాయ విభాగ అధికారులను ఆదేశించారు. అలాగే సమితి విద్యా వ్యవస్థపై ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు విద్యాధికారి సుభాష్ చంధ్ర మఝి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కమతా, బొరిగుమ్మ రైతులకు వెంటనే రెండు వేల బస్తాల డీఏపీ ఎరువులు సమకూర్చాలని ఫోన్ ద్వారా మార్క్ఫెడ్ అధికారిని ఆదేశించారు. 2020 నాటికి పూర్తి కావలసిన మెగా తాగునీటి ప్రాజెక్టు నేటికీ పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటర్ ప్రాజెక్టుపై సమితి సభ్యుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు నలుగురుతో ఒక టీమ్ను ఏర్పాటు చేయాలని బీడీవో సుకాంత కుమార్ పట్నాయక్ను ఆదేశించారు. సమావేశంలో నవరంగపూర్ ఎంపీ ప్రతినిధి రామేశ్వర జెన, కొరాపుట్ ఎంపీ ప్రతినిధి రామ చంధ్ర పాఢి, సమితి ఉపాధ్యక్షులు రాధాకాంత సామంతరాయ్, జిల్లా పరిషత్ సభ్యులు ప్రసాద్ బిడిక, నృశింహనాత్ శతపతి, బొరిగుమ్మ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ గంతాయిత్, డిక్టర్ దిలీప్ కుమార్ నాథ్, సీడీపీవో గాయిత్రీ బాహిణీపతి, ఇంజినీర్ సత్యనారాయణ సెటి పాల్గొన్నారు. -
బంగారం దుకాణం యజమానిపై దాడి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డులో ఉన్న ప్రసాద్ బంగారం దుకాణం యజమానిపై దాడి జరిగింది. దుకాణాన్ని ముసేవేసి బంగారంతో ఉన్న బ్యాగ్తో ఇంటికి వెళ్తున్న యజమాని ప్రసాద్ పేల్పై ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండుగులు దాడి చేశారు. అతని చేతిలో ఉన్న బ్యాగ్ను దుండగులు లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితుడు వెంటనే మల్కన్గిరి పోలీసుస్టేషన్లో ఫిర్యాధు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్డీపీవో దివ్యడలై, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గతంలో కూడా ప్రసాద్ ఇంట్లో బంగారం చోరీకి గురైంది. యాదవుల కలశ యాత్ర రాయగడ: జమ్మూకశ్మీర్ నుంచి బయలు దేరి రాయగడకు చేరుకున్న కలశయాత్రకు ఉత్కళ యాదవ సంఘం రాయగడ శాఖ సభ్యులు బుధవారం ఘనంగా స్వాగతం పలికారు. జమ్మూకశ్మీర్లో అఖిల భారతీయ యాదవ సంఘం చేపట్టిన ఈ కలశ యాత్ర ఊరేగింపులో భాగంగా ఇక్కడకు చేరుకొని ప్రధాన వీధుల మీదుగా రాయగడ కళాశాల సమీపంలోని రాధా కృష్ణ మందిరం వరకు కొనసాగింది. కార్యక్రమంలో గోపాల్ సంఘం యువ విభాగం అధ్యక్షుడు అమర్ గోపాల్, జిల్లా కార్యదర్శి ప్రతాప్ చంద్ర గౌడో, కోఆర్డినేటర్ గోపినాథ్ గౌడో పాల్గొన్నారు. మాదకద్రవ్యాలతో అనర్థం రాయగడ: మాదక ద్రవ్యాల వినియోగంతో యువత బంగారు భవిష్యత్ అంధకారమవుతుందని కలెక్టర్ ఫరూల్ పట్వారి అన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో బుధవా రం జిల్లా అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పది రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలను చైతన్యపరచనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అబ్కారీ శాఖ అధికారి సంతోష్కుమార్ ధల్, ఆర్టీఓ రాజ్కిషొర్ బెహరా, జిల్లా విద్యాశాఖ అధికారి రామ నాహ క్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ భవన నిర్మాణం అడ్డగింత కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కేటీ రోడ్లో పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా నిర్మితమవుతున్న అక్రమ భవన నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ బేఖాతరు చేసి సదరు బిల్డింగ్ యజమాని నిర్మాణ పనులను కొనసాగిస్తుండగా, కమిషనర్ నడిపిన రామారావు ఆదేశానుసారం పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ సిబ్బంది సదరు నిర్మాణ పనులను బుధవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ పురపాలక సంఘంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలను చేస్తే సదరు బిల్డింగ్ యజమానులపై కేసులు వేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. అక్రమ భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి, నిబంధనల మేరకు నడుచుకోవాలని హెచ్చరించారు. గుండెపోటుతో కళాకారుడు మృతి కంచిలి: గ్రామదేవత ఉత్సవాల్లో స్టేజీ ప్రోగ్రా మ్ ఇచ్చేందుకు వచ్చిన ఒక కళాకారుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన బుధవారం కంచిలిలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళ్తే.. బుధవా రం రాత్రి కంచిలి ఉత్సవాల్లో భాగంగా సినీ డూప్స్ స్టేజీ ప్రోగ్రాం ఇచ్చేందుకు కళాకారుల బృందం ఉదయమే వచ్చారు. వీరు మంగళవారం రాత్రి వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడలో ప్రదర్శన ఇచ్చి, అటునుంచి ఇక్కడికి వచ్చారు. ఉదయం కాలకృత్యాలు తీర్చుకోడానికి స్థానిక మఠం చెరువు వద్దకు వెళ్లారు. వీరిలో బాలకృష్ణ డూప్గా నటిస్తున్న సప్ప కల్యాణ్(65) చెరువు గట్టు మీద ఒక చెట్టుకింద కూర్చొని గుండెనొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఇతనిది విశాఖపట్నం జిల్లా గాజువాక పెద్దగంట్యాడ ప్రాంతం. తోటి కళాకారుడు మృతి చెందడంతో ఉత్సవ కమిటీ సభ్యులు ఈ ప్రదర్శనను రద్దు చేశారు. -
తులసీ పాహడ్లో కలెక్టర్ పర్యటన
మల్కన్గిరి: జిల్లాలోని మత్తిలి సమితి తులసీ పాహడ్లో కలుక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ తొలిసారిగా పర్యటించారు. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న ఈ పర్వత ప్రాంతాల్లో జనం భయంభయంగా బతికేవారు. ప్రస్తుతం మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంతో అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. ఇక్కడి పిల్లలు సైతం పాఠశాలల్లో చేరుతున్నారు. ఈ తరుణంలో కలెక్టర్ టెమురుపల్లి పంచాయతీ తులసీ, కీరమెట్ల, మారియా బెడా, చేరు కట్లా తదితర గ్రామాల్లో పర్యటించారు. పాఠశాలలను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. అంతకుముందు తులసీ పాహడ్ వద్ద బీఎస్ఎఫ్ క్యాంపును సందర్శించారు. కార్యక్రమంలో ఎస్పీ వినోద్ పటేల్, మత్తిలి గ్రామీణాభివృద్ధి విభాగం అధికారి కార్తీక్ నాయిక్, మత్తిలి బీడీఓ ప్రమోద్ కుమార్ బెహరా, సమితి ఈఈ హృదయ రంజన్ బాఘ్, ఏపీఓ లింగరాజ్ కరకరియా, సర్పంచ్ తుంబేశ్వర్ సమార్ద్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రిడ్జి నిర్మించారు.. రోడ్డు మరిచారు..!
రాయగడ: జిల్లాలోని కెరడ సమితి పరిధిలోని కిలిమిసిగుడ గ్రామస్తులు రాకపొకలకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామ ప్రజలు సమితి కేంద్రానికి రావాలంటే మధ్యలోని నాగావళి నదిని దాటుకుంటూ వెళ్లాల్సిందే. అయితే గ్రామస్తులు అవస్థలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టింది. అయితే బ్రిడ్జి పనులు పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా అందుకు సంబంధించి ఇంతవరకు అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టక పొవడంతో గ్రామస్తుల రాకపోకలు నరకంగా మారాయి. వర్షాకాలం ముందుగా రోడ్డు పనులు పూర్తి చేయకపొతే వీరికి నరకయాతన తప్పదు. అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మత్తుకు దూరంగా ఉండాలి
మల్కన్గిరి: మత్తుపదార్థాలకు దూరంగా ఉండాల ని అధికారులు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాల యం ప్రాంగణంలో కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ ఆదేశాల మేరకు ఎకై ్సజ్శాఖ సిబ్బంది మాదక ద్రవ్యాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన చైతన్యరథాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సోమనాఽథ్ ప్రధన్ బుధవారం ప్రారంభించారు. ఈ రథం ద్వారా మాదక ద్రవ్యాల వినియోగంతో వాటిల్లే నష్టంపై ఏడు సమితుల్లోని 111 పంచాయతీల్లో ప్రచారం చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి బింబధర్ పండా, సిబ్బంది పాల్గొన్నారు. -
రథచక్రాలు సిద్ధం
భువనేశ్వర్: పూరీ జగన్నాథ స్వామి యాత్రకు మూడు భారీ రథాల చక్రాల తయారీ పనులు పూర్తయ్యాయి. దీంతో శ్రీ మందిరం సింహద్వా రం అభిముఖంగా చేరేందుకు వీలుగా ఇరుసుకు అమరిన చక్రాల్ని సురక్షితంగా తరలించి క్రమ పద్ధతిలో నిలిపారు. రథాల తయారీ ప్రాంగణంలో నిత్యం రెట్టింపు ఉత్సాహంతో పనులు పుంజుకుంటున్నాయి. దశల వారీగా రథాల తయారీ పనులు నిరవధికంగా సాగుతున్నాయి. చక్రాల తయారీ తర్వాత ఇరుసుతో అనుసంధానం కీలకమైన దశ. తదనంతరం ఒక్కో ఇరుసుకు చక్రాల్ని అమర్చడం బృహత్ ప్రక్రియ. ఇదంతా ముగియడంతో తదుపరి పనులకు అనుకూలతకు అనుగుణంగా చక్రాల్ని క్రమ పద్ధతిలో సురక్షితంగా తరలించి సింహ ద్వారం ముంగిటకు చేర్చడం సవాలుతో కూడిన ప్రక్రియ. భోయ్, మహరణ, వర్గం సేవకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రక్రియని బుధవారం విజయవంతంగా ముగించారు. తొలుత బలభద్ర స్వామి తాళ ధ్వజం తరువాత జగన్నాథుని నందిఘోష రథం చివరగా దేవీ సుభద్ర దర్ప దళనం రథానికి వరుస క్రమంలో అన్ని చక్రాల్ని ఇరుసుకు జోడించారు. అనంతరం మూడు రథాల అధిపతి మహారణ, భోయ్ సర్దార్ రవి భోయ్ ఆధ్వర్యంలో మూడు రథాల చక్రాల తరలింపు దిశను నిర్ణయించారు. రథ యాత్ర ముందురోజున స్వామి ఆగమనం కోసం శ్రీ మందిరం సింహద్వారం ముంగిటకు ఎటువంటి అడ్డంకులు లేకుండా రథాల్ని తరలించేందుకు వీలుగా రథ తయారీ శాల ఆవరణ నుంచి తరలించారు. తదుపరి కార్యకలాపాలకు అంతరా యం తలెత్తకుండా చక్రాలు స్థిరంగా ఉండేందుకు వీలుగా పతి చక్రానికి ఇరు వైపులా మామిడి చెక్కల్ని అడ్డుగా ఏర్పాటు చేశారు. -
త్యాగం చేశాం.. న్యాయం చేయండి
● ఆప్షోర్ నిర్వాసితుల విన్నపం మెళియాపుట్టి: రేగులపాడు ఆప్షోర్ కోసం సర్వం త్యాగం చేసిన తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు కోరారు. చీపురుపల్లిలో నిర్వాసితులు చేపడుతున్న దీక్ష శిబిరాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తిలు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారికి నిర్వాసితులు వినతిపత్రాలు అందజేశారు. ప్రాజెక్టు కోసం సొంతూరు, స్థలాలు, పొలాలు, ఇళ్లు త్యాగం చేసిన తమ న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ప్రాజెక్టు ప్రారంభించి 16 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ నిర్వాసితులకు న్యాయం జరగలేదన్నారు. బడ్జెట్ ప్రతీ ఏడాది పెరుగుతున్నా.. నిర్వాసితుల సమస్యలు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం 460 జీవో ప్రకారం హిరమండలం నిర్వాసితులకు ఇచ్చిన ప్రాప్తికి ప్యాకేజీలు అందించాలని, ఇప్పటికీ కూడా 132 మందికి ప్యాకేజీలు పెండింగ్ ఉన్నాయన్నారు. సోషల్ ఎకనామిక్లో లేని 40 కుటుంబాలకు వెంటనే సర్వేచేసి పరిహారాలు అందజేయాలని వారి దృష్టికి తీసుకెళ్లారు. పునరావాస కాలనీల్లో ఇప్పటికీ రహదారులు, వీధిదీపాలు, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సర్పంచ్ యవ్వారి ఈశ్వరరావు, నిర్వాసితుల రాష్ట్ర కార్యదర్శి గంగారపు సింహాచలం, సీపీఐ కార్యదర్శి చాపర వెంకటరమణ, దొర విజయ్ కుమార్, కిరణ్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ భూమి
● ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి ● రెవెన్యూ వర్క్షాప్ ప్రారంభం భువనేశ్వర్: రెవెన్యు విభాగం పాలనా వ్యవస్థలో తహసీల్దార్లు వెన్నెముక వంటివారని, ప్రజా ఫిర్యా దులను త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించాల ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అన్నారు. తహసీల్దారు కార్యాలయం ప్రజలకు భయానక ప్రదేశంగా కాకూడదని, నమ్మకమైన ప్రదేశంగా ఉండాలని చెప్పారు. స్థానిక లోక్ సేవా భవన్లో బుధవారం రాష్ట్ర రెవెన్యూ అధికారుల సమావేశం, వర్క్షాప్ ప్రారంబించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భూముల నిర్వహణ వ్యవస్థని ఆధు నీకరించి ప్రజా ఆధారితంగా మార్చేందుకు ప్రభు త్వం కట్టుబడి ఉందని తెలిపారు. దీని ప్రకారం ఒడిశాలో ఎవరూ భూమి లేనివారుగా ఉండరని హామీ ఇచ్చారు. 4 డెసిమల్ కంటే తక్కువ భూమి ఉన్న వారిని కూడా భూమి లేనివారిగా పరిగణిస్తారని, ప్రభుత్వం వారికి సైతం భూమిని అందిస్తుందని చెప్పారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో రెవెన్యు అధికారుల పాత్ర కీలకమన్నా రు. విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉందని, అక్రమార్కుల నుంచి ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకుని సద్వినియోగపరచాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం రెవెన్యూ రంగాలలో అనేక సంస్కరణలను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. గిరిజనులు, షెడ్యూల్డ్ కులాల భూముల అమ్మకం, కొనుగోలులో తరచుగా అక్రమాలు జరుగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు నిర్ధారిత కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) ప్రకారం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి మాట్లాడుతూ విధి నిర్వహణలో సాధారణ పని పద్ధతులను మార్చుకు ని సరికొత్త ఆలోచనా విధానంతో ప్రజలకు సేవలందించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి దేవరంజన్ కుమార్సింగ్, కేంద్ర రెవె న్యూ కమిషనర్ బి.డెమిరియన్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మనో జ్ ఆహుజా, రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్, అన్ని జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.