రైతుల సమస్యలు పరిష్కరించాలి
రాయగడ: కళ్యాణ సింగుపూర్ పరిధిలోని బుడగుడ మండీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్నదాతలు కదం తొక్కారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ పేరిట బుడాగుడ ల్యాంప్ డైరెక్టర్కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. బుడాగుడ మండీలో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయని, రోజులు గడుస్తున్నా ఇంతవరకు టోకెన్లు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం విక్రయించి పదిహేను రోజులు కావస్తున్నా ఇంతవరకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని పలువురు మరికొందరు వాపోయారు.


