breaking news
Odisha Latest News
-
ఆర్ఎస్ఎస్ శత వార్షికోత్సవాలు ప్రారంభం
జయపురం: రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతవార్షిక వేడుకలను జయపురం ఆర్.ఎస్.ఎస్ శాఖ శనివారం ఘనంగా నిర్వహించింది. స్థానిక భూపతి వీధి కనకదుర్గ మందిర ప్రాంగణంలో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాల్లో జయపురంలో పాణినాళ వీధి, రాధామాధవ వీధి, కెల్లా వీధికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శత వార్షిక వేడుకల్లో పాల్గొన్నారు. న్యాయవాది, మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బిరేష్ పట్నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బిరేష్ పట్నాయక్ దీప ప్రజ్వలన చేసి శత వార్షిక ఉత్సవాన్ని ప్రారంభించారు. ముఖ్యవక్తగా అధ్యాపకులు, గ్రామ వికాశ కార్యకర్త బిజయకుమార్ భట్, పట్టణ ఆర్ఎస్ఎస్ సంఘ పరిచాలకులు డాక్టర్ నిరంజన్ మిశ్ర వేదికపై ఆశీనులయ్యారు. వక్తలు ఆర్ఎస్ఎస్ గత వందేళ్లుగా దేశానికి అందిస్తున్న సేవలను వివరించారు. ఆర్ఎస్ఎస్ సంఘం జాతి, కుల, మతాలకు ఎటువంటి ప్రాధాన్యత నీయలేదని వెల్లడించారు. ఎవరు ఏ ధర్మం వారైనా దేశ భక్తి, హిందూ దేశ నిర్మాణం పట్ల ఆసక్తి ఉన్న వారెవరైనా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హిందూ రాష్ట్ర నిర్మాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచేందుకు కార్యకర్తలు సమైఖ్యంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సుభ్రత పండా, సత్యనారాయణ మిశ్ర, కార్యదర్శి సురేష్ నందా, శుభం పండాలు ఆర్ఎస్ఎస్ ప్రార్థన గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు ప్రేమానంద నాయక్, నారాయణ మిశ్ర, ప్రపుల్ల రాయ్, బలరాం పాడీ, సుధాంశు పాడీ, తేజశ్వీ చౌదరి, జితు దొలాయ్, గుప్త పాహిగ్రహి, వై.ఎస్.ఖన్నతోపాటు 50 మందికి పైగా పాల్గొన్నారు. -
అమోనియా కంటైనర్ బోల్తా
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలంలోని జర్జంగి గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఒక భారీ కంటైనర్ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా నుంచి శ్రీకాకుళం వైపు అమోనియా లోడ్తో వెళ్తున్న భారీ కంటైనర్ జర్జంగి గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైర్ను ఢీకొని బోల్తాపడింది. సమాచారం అందుకున్న కోటబొమ్మాళి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. అరసవల్లి: రాష్ట్రంలో మన జిల్లాను స్వచ్ఛంగా మార్చుకుందామని కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. మూడో శనివారం పురస్కరించుకొని వాయు కాలుష్య నివారణ థీమ్తో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అరసవల్లి ఇంద్ర పుష్కరిణి వెనుక భాగంలో కాజీపేట కూడలి వద్ద చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యకర సమాజాన్ని రూపొందించవచ్చన్నారు. అనంతరం కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే గొండు శంకరరావు, కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, అరసవల్లి ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖాధికారి ఎన్.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస: ఇటీవల కొన్ని పత్రికలు, ఛానళ్లలో వచ్చిన వార్త కథనాలు పూర్తి అవాస్తవమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తనకు ఎటువంటి గ్యాంగ్లు లేవని, తన బలం ప్రజలేనని తెలిపారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మవద్దని కోరారు. కొంతమంది వ్యక్తులు బాధితులను ఉసుగొల్పి తప్పుడు ఆరోపణలు చేయించారన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులకు తన సాను భూతి తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. వార్తలు ప్రచురించే ముందు ధ్రువీకరించుకోవాలని మీడియా ప్రతినిధులకు సూచించారు. ఇచ్ఛాపురం రూరల్: భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్వగ్రామం లొద్దపుట్టిలో విషాదచాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని లొద్దపుట్టి గ్రామం అంబుగాం వీధికి చెందిన పిట్ట మోహనరావు, కుమారీల కుమారుడు పిట్ట వసంత్(32) కాకినాడలో చార్టర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తండ్రి మోహనరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ భారాన్ని మోస్తున్న వసంత్, ఈ ఏడాది మార్చి 7న ఇచ్ఛాపురం బెల్లుపడకు చెందిన సంధ్య ఉరఫ్ ఇందును వివాహం చేసుకున్నాడు. శనివారం అరకు విహార యాత్ర కోసం తన ద్విచక్ర వాహనంపై భార్య సంధ్యను తీసుకొని వెళ్తుండగా, ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంజరిగింది. ఈ ప్రమాదంలో వసంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలై చికిత్స పొందుతోంది. జాతీయ రహదారిపై ధర్మవరం గ్రామ సమీపంలో రొయ్యల మేత తీసుకెళ్తున్న వ్యాన్ మరమ్మతులకు గురికావడంతో నిలిపివేశారు. ఆగి ఉన్న వ్యాన్ను వసంతకుమార్ బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నవ దంపతులను మృత్యువు విడగొట్టిందని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. -
భారీగా మందుగుండు నిల్వలు సీజ్
కంచిలి: మండలంలో అనుమతి పొందిన నాలుగు మందుగుండు దుకాణాల్లో అధిక మొత్తంలో టపాసులు నిల్వలు ఉన్నాయనే కారణంతో పోలీసులు ఆ సరుకును సీజ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో వివరాలు తెలియజేశారు. కంచిలిలో బలియాపుట్టుగ వద్ద తెల్లి వైకుంఠరావుకు చెందిన రూ.2,69,470ల సరుకు, అంపురం వద్ద సుంకర మణికంఠకు చెందిన రూ.1,71,900ల సరుకు, జాడుపూడిలో దూపాన సునీల్కు చెందిన రూ. 1,16,497లు విలువ కలిగిన సరకు, అదే గ్రామంలో దూపాన శ్రీనివాసరెడ్డికి చెందిన రూ.1,15,300 లు విలువ గల సరకును సీజ్ చేసినట్లు వెల్లడించారు. సారవకోట: మండలంలోని కొమ్ముసరియాపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ సిబ్బంది రూ.50 వేలు విలువ కలిగిన బాణసంచా స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన పైల సుశీల, లుకలాపు తిరుపతిరావు బాణసంచాతో పాటు బాణసంచా తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకులు కలిగి ఉండడంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది వారి ఇళ్లపై దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బాణసంచాను సారవకోట పోలీసుస్టేషన్కు అప్పగించారు. దీంట్లో పైల సుశీల వద్ద నుంచి రూ.30 వేలు విలువ కలిగిన బాణసంచా, లుకలాపు తిరుపతిరావు నుంచి రూ.20 వేలు విలువ కలిగిన బాణసంచా స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేశారు. -
మధ్యాహ్న భోజనం అపహాస్యం
కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ పంచాయతీ మహాసింగిగూడ ఆర్ఆర్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం అపహ స్యం చేసేవిధంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏకోపా ధ్యాయ పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. 18 మంది పిల్లలకు పాఠశాల అవరణలో వంట చేయడం లేదు. ఇంటి వద్ద వంట చేసి పాఠశాలకు వంట ఏజెన్సీ సభ్యురాలికి బదులు ఆమె భర్త ప్రతిరోజూ తీసుకొచ్చి విద్యార్థులకు వడ్డన చేస్తుంటారు. శనివారం మధ్యాహ్నం భోజనాన్ని పాఠశాలలో కేవలం నలుగు విద్యార్థులు మాత్రమే చేశారు. అయితే నలుగు విద్యార్థులకు కేవలం అన్నం, కూర పెట్టారు తప్ప, చారు మాత్రము తీసుకు రాలేదు. చారులేక పోవడంతో విద్యార్థులు భోజనం చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. మిగిలిన 14 మంది విద్యార్థులు గ్రామంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి హాజరైనట్లు పాఠశాల ఉపాధ్యాయుడు తెలిపారు. పాఠశాల వద్ద గదులు సక్రమంగా లేకపోవడం వలన ఇంటి వద్ద వంట చేయిస్తున్నట్లు చెప్పారు. -
ఘనంగా దీపావళి
పర్లాకిమిడి: స్థానిక సరస్వతీ శిశు విద్యామందిర్లో శనివారం సాయంత్రం దీపావళి పండను ముందస్తుగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవీ మఠం మహాంత రామానంద దాస్ విచ్చేశారు. విద్యాలయం పర్యవేక్షణ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర పట్నాయక్ జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించేందుకే ఈ పండగ నిర్వహిస్తారన్నారు. భారత త్రివిధ దళాలు సాధించిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని పలువురు కోనియాడారు. కాశ్మీర్లో పెహల్గాం వద్ద ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు శ్రద్ధాంజలి తెలిపారు. అనంతరం 2000 దీపాలు పాఠశాల ఆవరణలో భారత్ మాత ఆకారంలో వెలిగించి దీపావళిని ఆనందోత్సవాలతో నిర్వహించారు. అనంతరం విద్యార్థులు పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు శిశుమందిర్ ప్రధాన ఆచార్యులు సరోజ్ పండా ఆధ్వర్యంలో జరిగాయి. -
వ్యాధుల నివారణకు సమగ్ర చర్యలు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశం హాల్లో వేక్టర్ వ్యాధి (దోమల ద్వారా వచ్చే వ్యాధులు) నివారణకు శనివారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ సమగ్ర చర్యలు ప్రారంభించారు. మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటి వ్యాధుల ఉధృతిని నియంత్రించేందుకు ప్రతి సమితిలో ప్రత్యక శిబిరాలను ఏర్పాటు చేసి అవగాహన కర్యక్రమాలు నిర్వహస్తామని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ దోలామణి ప్రధాన్ అన్నారు. వర్షకాలంలో దోమలు ఎక్కువగా ఉన్నందున్న ప్రతి గ్రామంలో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. దోమ తెరలు వాడాలని, జిల్లా కేంద్రం ప్రతీరోజు ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా నిల్వ నీటిని తొలగించాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, మాలేరియశాఖల వైద్యులు పాల్గొన్నారు. -
నువాపడా ఉప ఎన్నిక హోరు
● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు భువనేశ్వర్: బిజూ జనతా దళ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేంద్ర ఢొలొకియా అకాల మరణంతో నువాపడా శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఏడాది నవంబర్ 11న ఈ ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నికకు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్ దస్తావేజులు శనివారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గిరిజన నాయకుడు, కాంగ్రెస్ అభ్యర్థి ఘసిరామ్ మాఝీ ఆయన అనుచరులతో భారీ ఊరేగింపులో పాల్గొన్నారు. బడుగు, గిరిజన వర్గాలతో బలమైన సంబంధాలకు పేరుగాంచిన ఘసిరామ్ మాఝీ గత 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. భూమి హక్కులు, గిరిజన వర్గాల సంక్షేమం వంటి కీలకమైన స్థానిక సమస్యలను పరిష్కరించడంలో తన నిబద్ధతను నొక్కి చెప్పారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జయ ఢొలొకియా నువాపడా సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, మంత్రులు గణేష్ రామ్ సింగ్ ఖుంటియా, రబి నారాయణ్ నాయక్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బసంత్ పండా, జిల్లా అధ్యక్షుడు కమలేష్ దీక్షిత్, ఇతర పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సైబర్ మోసాలపై అవగాహన
పర్లాకిమిడి: రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలు అరికట్టడానికి ‘సైబర్ సేఫ్టీ ప్రచారం 2025’ను కళింగ స్టేడియంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారాన్ని సెంచూరియన్ వర్సిటీలోని ఓపెన్ స్టేడియంలో శనివారం ప్రసారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, అదనపు ఎస్పీ సునీల్ కుమార్ మహంతి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, ఐఐసీ (పర్లాకిమిడి) ప్రశాంత భూపతి, గురండి పోలీసు అధికారి ఓంనారయణ పాత్రో, అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. స్టాప్, వెరిఫై, సెక్యూర్ పేరిట 16 జిల్లాలో సైబర్ రథాలు ప్రచారంలో పాల్టొంటాయని అధికారులు తెలియజేశారు. నెల రోజులపాటు ప్రజల్లో సైబర్ నేరాలు, నెట్ బ్యాంకింగ్ సేవల్లో జాగ్రత్త వహించడం, ఏ.టి.ఎంలో సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ఎస్పీ జ్యోతింద్ర పండా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెంచూరియన్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరెక్టర్ (అడ్మిన్) దుర్గాప్రసాద్ పాడీ, సోయెట్ డీన్ డాక్టర్ ప్రపుల్ల కుమార్ పండా, తదితరులు పాల్గొన్నారు. -
అనుమతులెలా ఇచ్చారు..?
టెక్కలి: జనావాసాలు, విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలకు ఎలా అనుమతులిచ్చారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ టెక్కలి అగ్నిమాపక అధికారి సూర్యారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలిలో ప్రత్యేక పారిశుద్ధ్య పనుల పరిశీలన కోసం విచ్చేసిన ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఏర్పాటు చేసిన బాణసంచా విక్రయ దుకాణాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిశీలన, స్థానిక అభ్యంతరాలు చూడకుండా కేవలం పత్రాలు చూసి అనుమతులు ఇచ్చారా అని నిలదీశారు. తక్షణమే అభ్యంతరకంగా ఉన్న దుకాణాన్ని మార్పు చేయాలని ఆదేశించారు. ఆయనతో పాటు టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్ బి.సత్యం, డీఎల్పీవో ఐ.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
జయపురం: జయపురం మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు శనివారం ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో గల 10 ట్రాక్టర్లలో పని చేస్తున్న 30 మంది, 20 టాటా ఏస్ వాహనాలలో పని చేస్తున్న 40 మంది పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. జీతాలు ఇచ్చేంత వరకు వాహనాలు నడిపేదే లేదన్నారు. కంట్రాక్టర్ వచ్చి నెల జీతం చెల్లించటంతో ఆందోళన విరమించి పనుల్లోకి చేరారు. మున్సిపాలిటీ నిబంధన ప్రకారం పారిశుద్ధ్య కార్మికులను కంట్రాక్టర్ ప్రతి నెలా జీతాలు చెల్లించకపోతే.. మున్సిపాలిటీ చెల్లించాలన్నారు. రెండు రోజుల్లో దీపావళి ఉన్నా కంట్రాక్ట్ కంపెనీ జీతాలు ఇవ్వకపోవటంతో ఆందోళనకు దిగినట్లు డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. ఈపీఎఫ్, ఈఎస్ఐలు ప్రతి నెలా సకాలంలో జమ చేయటం లేదని ఆరోపించారు. ఒప్పందం ప్రకారం వీటిని ప్రతి నెలా కంట్రాక్టర్ జమ చేయాలని, లేకపోతే జరిమానా పడుతుందన్నారు. మున్సిపాలిటీ కంట్రాక్ట్ సంస్థకు పట్టణ పారిశుద్ధ్యం నిమిత్తం నెలకు రూ.76 లక్షలకు పైగా బిల్లు చెల్లిస్తుందన్నారు. మున్సిపాలిటీలో గల 28 వార్డులను 4 జోన్లుగా విభజించి 371 మంది పారిశుద్ధ్య స్వీపర్లను నియమించింది. వీరిలో ఆందోళన చేపట్టిన 70 మంది వాహనాల్లో పని చేస్తున్నారు. -
మోసం చంద్రబాబు నైజం
జలుమూరు: ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేయడమే చంద్రబాబు నైజమని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. మండలంలోని కరవంజ – టెక్కలిపాడు క్లస్టర్ సమావేశంలో శనివారం మాట్లాడారు. పేదలకు వైద్యం దూరం చేయడమే చంద్రబాబు ధ్యేయమన్నారు. అందుకు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడన్నారు. దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాలు కార్యక్రమం తలపెట్టామని తెలియజేశారు. అన్నమయ్య జిల్లాలోని మునకల చెరువుతో పాటు నరసన్నపేట నియోజకవర్గంలో బుడితి వద్ద అవలింగి గ్రామంలో మినీ పరిశ్రమ పెట్టి టీడీపీ నాయకులు మద్యం కల్తీ చేస్తున్నారని మండిపడ్డారు. నరసన్నపేటలో ఎమ్మెల్యే రమణమూర్తిదే సిండికేట్ అని, వారి కుటుంబ సభ్యుల పేరిట మద్యం షాపులు ఉన్నాయని వివరించారు. అవలింగిలో కల్తీ జరిగిన మద్యం పట్టుకున్న అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరించాలన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, రైతు పండించిన పంటలకు మద్దతు ధర లేదని మండిపడ్డారు. అనంతరం డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరించి, కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, జిల్లా కార్యదర్శి ఎం.శ్యామలరావు, సర్పంచ్ జుత్తు నేతాజీ, గొల్లంగి జగన్నాథరావు, జిల్లా బూత్ లెవెల్ అధ్యక్షుడు దామ మన్మథరావు, రకావాడ చందనబాబు, ధర్మాన జగన్, ధర్మాన బువాజీ, తర్ర జీవరత్నం, కె.కూర్మారావు, బండి ఎర్రన్న, బలగ లక్ష్మీ, అర్జున్, ఎస్వీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి కుమార్ ధముని కూడలిలో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి లారీ బలంగాఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనచోదకుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. డుమురిగుడ పంచాయతీ పొరొడిగుడ గ్రామానికి చెందిన కపిల్భొయ్ అనే యువకుడు బైక్పై వెళ్తుండగా కుమారఖర్ధముని వద్ద మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు సకాలంలో బైక్ నుంచి దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బైకు లారీ కిందకు దూసుకుపోవడంతో నుజ్జునుజ్జయ్యింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన లారీ డ్రైవర్ను స్థానికులు నిలదీశారు. మునిగుడలో శిశు మహోత్సవాలు రాయగడ: జిల్లాలోని మునిగుడ ప్రభుత్వ నోడల్ ఉన్నత పాఠశాలలో శిశుమహోత్సవం సురభి–25 పేరిట శనివారం ఉత్సవాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు సుభాష్ కొర, అక్షయ రోదోల ఆధ్వర్యంలొ జరిగిన ఉత్సవాల్లో బీఈవో గణేష్ సొబొరో, ఏబీఈవో సుభాష్ సింగ్, సురభీ పాల్గొన్నారు. కార్యక్రమ ఉద్దేశాన్ని బీఈవో సొబొరో వివరించారు. విద్యార్థుల్లో కళారంగంపై ఉన్న ఆసక్తిని.. వారి ప్రతిభను బయటకు తీసేందుకు ఇటువంటి తరహా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో 16 క్లస్టర్ విద్యాలయాలకు చెందిన 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకోగా విద్యార్థుల మధ్య నిర్వహించిన చిత్రలేఖనం, వక్తృత్వ, క్విజ్ తదితర పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. షణ్ముఖపాత్రోకు ఎమ్మెల్యే నివాళి కొరాపుట్: ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు షణ్ముఖ పాత్రో ఇటీవల మృతి చెందారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి.. నందాహండి సమితి సొరుగుడ గ్రామంలో గోవిందాలయ ఆశ్రమంలో షణ్ముఖ పాత్రో భౌతికకాయానికి శనివారం నివాళులర్పించారు. షణ్ముఖపాత్రో సేవలు గుర్తు చేశారు. జిల్లాకి చెందిన షణ్ముఖ సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గోవిందాలయ స్వచ్ఛందసంస్థను ఏర్పాటు చేసి అంబులైన్స్, గిరిజనులకు విద్యాబోధన తదితర సేవలు అందజేసేవారు. గంజాయి స్వాధీనం కొరాపుట్: గంజాయి తరలిస్తున్న వారిని కొరాపుట్ రైల్వే పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కొరాపుట్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. పాండిచేరికి చెందిన ప్యాసింజర్లు ఎం.ప్రభాకర్, అజయ్ కదలికలు అనుమానంగా ఉండడంతో వారి బ్యాగులు పరిశీలించగా.. అందులో నాలుగు కిలోల గంజాయి పట్టుబడింది. తమ దుస్తుల మధ్య గంజాయి దాచి పెట్టారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి గంజాయి సీజ్ చేశారు. -
విద్యుత్ భద్రతపై అవగాహన యాత్ర
జయపురం: విద్యుత్ వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగుల రక్షణ, భద్రతపై అవగాహనకు టీపీఎస్ఓడీఎల్ (టాటా పవర్ సప్లయ్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్) ఉద్యోగి ఇ.సౌమ్యరంజన్ లెంక జయపురం విద్యుత్ ఇంజినీరింగ్ విభాగ కార్యాలయం నుంచి శనివారం సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఆయన జయపురం నుంచి వయా బరంపురం మీదుగా బలంగీర్ వరకు సైకిల్ యాత్ర చేస్తారు. జయపురం సర్కిల్ హెడ్ మన్మథనాథ్ మిశ్ర, దేబేస్ పండ, బిశ్వజిత్ మెండులి విద్యుత్ సురక్షా అధికారి ప్రమోద్ కుమార్ బెహరలు పచ్చ జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు. విద్యుత్ వినియోగం, విధి నిర్వహణలో ఎల్లప్పుడూ రక్షణ జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. సైకిల్ యాత్ర మధ్యలో గ్రామాలు, పట్టణాలు, విద్యాలయాలలో సౌరశక్తి సద్వినియోగం, విద్యుత్ సురక్షలపై పాదయాత్ర, సభలు, నిర్వహించి ప్రజలను, విద్యార్థులను సచేతనులను చేసేందుకు ప్రయత్నిస్తానని సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న లెంక వెల్లడించారు. కార్యక్రమంలో ఎంఈఆర్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతోష్ కుమార్ మహంతి, చందన రెడ్డి, రాజేష్ కుమార్ సాహు, పరిమల పాల్, బిచిత్ర కుమార్ బెహర, రంధీర్ సింగ్ పాల్గొన్నారు. -
మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాలి
రాయగడ: మునిగుడ సమితి పరిధిలోని వివిధ గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రజా ప్రతనిధులు కృషి చేయాలని వారి వారి ప్రాంతాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే అవకాశం కలుగుతుందని బీడీవో కృష్ణ చంద్ర దళపతి అన్నారు. స్థానిక సమితి సమావేశం హాల్లో పంచాయతీ సర్పంచ్లు, సమితి, వార్డు సభ్యులతో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. పంచాయతీల్లో వికసిత గ్రామం, వికసిత ఒడిశా పథకాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలన్నారు. గ్రామాలకు అనుసంధానించే రహదారులు, విద్య, వైద్యం అవాస్ గృహాలు వంటి మౌలిక సౌకర్యాలు అందరికీ అందేలా సహకరించాలని అన్నారు. గ్రామీణ గృహ నిర్మాణ యోజన పథకంలో భాగంగా లబ్ధిదారులు సులువుగా పథకాన్ని పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమితి అధ్యక్షురాలు దుఖిని నుండ్రుక అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సంతోష్ సున, జిల్లా పరిషత్ సభ్యులు మాధవీ కొంధొపాణి, సమితి ఉపాధ్యక్షులు ఆదర్శ కులసిక, ఎంపీ ప్రతినిధి రజనీకాంత్ పడాల్ పాల్గొన్నారు. -
హత్యా నేరంపై ముగ్గురు అరెస్టు
మల్కన్గిరి: హత్యా నేరంపై ముగ్గురు అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితిలో ఈ నెల నాలుగో తేదీన నమడాగూఢ గ్రామ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. దర్యాప్తు చేసిన మాత్తిలి పోలీసులు మృతుడు విష్ణు నాయక్గా గుర్తించారు. ఆయన తంత్రి విజయ్ నాయక్ తన బిడ్డను ఎవరో హత్య చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాపు చేశారు. మృతుడి ఫోన్ నంబర్ ఆధారంగా సాకేతిక డేటా, పరిసర పరిస్థతులను పరిశీలించి హత్యతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ముగ్గురిని శనివారం అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితులుగా దీపక్ ఓరా, శంకర్ ఇడియా, సాగర్ సునాం, మనోజ్ గౌడ్లను అరెస్టు చేయగా.. దీపక్ పరారీలో ఉన్నట్టు మాత్తిలి ఐఐసీ దీపాంజలి ప్రదాన్ తెలిపారు. నిందితులను కోర్టుకు తరలించినట్టు పేర్కొన్నారు. మృతుడు తండ్రి మాట్లాడుతూ.. నిందితులకు కఠిన శిక్ష వేయాలని వేడుకున్నారు. -
పర్యావరణంపై చైతన్యం అవసరం
జయపురం: పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం అవసరమని వక్తలు అన్నారు. జయపురం తెలుగు సాంస్కృతిక సమితి నిర్వహిస్తున్న సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలల్లోని పాఠశాలల విద్యార్థులతో కలిసి పర్యావరణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమాలకు శనివారం శ్రీకారం చుట్టారు. సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైకిళ్లపై జయపురం సమితి గొడొపొదర్ గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య పరిరక్షణలో గ్రామస్తులను మమేకం చేసి వారిచే మొక్కలు నాటించటం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని సూచించారు. ఉభయ పాఠశాలల విద్యార్థులు పర్యావరణంపై ముఖాముఖి చర్చించుకుని ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకున్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శణలతో అలరించారు. సిటీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతాప్ పట్నాయక్ పర్యావరణ ఆవశ్యకతను వివరించారు. గొడొపొదర్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దిలీప్ పండ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థులు చేపట్టిన కార్యక్రమం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమానికి షోషియల్, ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంటల్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా) అధ్యక్షులు సుధాకర పట్నాయక్, సీనియర్ సభ్యులు కె.మోహనరావు, జి.వెంకటరెడ్డి సహకరించగా సిటీ స్కూల్ ఉపాధ్యాయులు జి.సాయిశేఖర్, ధనపతి భొత్రలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
అమ్మో భయం!
చెట్టు మీద దెయ్యం.. కొరాపుట్ : కొరాపుట్ జిల్లాలో రెండు రోజులుగా గిరిజనుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఆత్మ చెట్టు (హంటర్ ట్రీ) కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఎటువంటి వివాదాలకు తావులేకుండా పోలీసులే ప్రజాప్రతినిధుల సమక్షంలో చెట్టును దగ్ధం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సిమిలిగుడ సమితి సుభయ్ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆందోళనకు గురైన గ్రామస్తులు మంత్రగాడి వద్దకు వెళ్లారు. అతను పూజలు చేసి గ్రామ శివారులోని చెట్టుపై ఆత్మ ఉందని, చెట్టు కొట్టేసి నదిలో నిమజ్జనం చేయాలని సూచించాడు. దాంతో గ్రామ యువకులు చెట్టును కొట్టేసి ట్రాక్టర్లో వేసి నదిలో వేయడానికి వెళ్లారు. నదిని ఆనుకుని ఉన్న ప్రతి గ్రామంలోనూ స్థానికులు తమ పరిధిలో చెట్టుని నిమజ్జనం చేయడానికి వీళ్లేదని ప్రతిఘటించారు. పలుచోట్ల తమ సంప్రదాయ ఆయుధాలు పట్టుకొని పహారా కాశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాక్టర్ను స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. అన్ని గ్రామాల ప్రజలను రప్పించి ప్రజాప్రతినిధుల సమక్షంలో మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు. అనంతరం సునాబెడా పోలీస్ స్టేషన్ పరిధిలోనే దగ్ధం చేశారు. -
ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
కొరాపుట్ : పలక, బలపం పట్టుకోవాల్సిన చేతులు కత్తిపట్టాయి. ప్రాణం అంటే కూడా ఏంటో తెలియని వయసులో మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. ఓ వ్యక్తితో ఉన్న వైరం అతని కుమారుడిని చంపే వరకు వెళ్లింది. ఈ దారుణ ఘటన శనివారం నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితి తెంతులికుంట్ పంచాయతీ క్రిష్టగుడ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ మహురియా కుమారుడు మజేష్ మహురియా(5) శనివారం ఉదయం నుంచి కనిపించలేదు. దీంతో తండ్రి అన్నిచోట్లా వెతికాడు. చివరికి పాడుబడిన ఓ ఇంట్లో మజేష్ మృతదేహం కనిపించింది. శివ రాక చూసి నిందితుడు వెంటనే పక్క గదిలోకి వెళ్లి దాక్కున్నాడు. మృతదేహం పక్కన కత్తి పడి ఉండటాన్ని గుర్తించి వెంటనే గ్రామస్తులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆరా తీయగా ఈ దారుణ ఘటనకు పాల్పడినది సమీప బంధువైన 14 ఏళ్ల బాలుడిగా గుర్తించారు. అనంతరం నిందిత బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. శివకు, నిందితుడికి మధ్య ఇటీవల వివాదం జరిగింది. ఆ కక్ష పెట్టుకుని శివ కుమారుడిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందిత బాలుడిని తీసుకెళ్తున్న పోలీసులు మజేష్ మృతదేహం ఘటనా స్థలంలో కత్తి -
ఆశా కార్యకర్తల ఆందోళన
రాయగడ: ఆల్ ఒడిశా ఆశా కార్యకర్తల మహాసంఘం పిలుపు మేరకు జిల్లా ఆశా కార్యకర్తల సంఘం శనివారం ఆందోళన చేపట్టింది. కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని ఏడీఎం రమేష్ చంద్రనాయక్కు వినతిపత్రం అందజేశారు. ముందుగా గాంధీ పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. సంఘం రాయగడ శాఖ అధ్యక్షురాలు తమల్ సాహుకార్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జోగేశ్వర్ దాస్, సభ్యుడు అరుణ్కుమార్ లెంక తదితరులు పాల్గొన్నారు. కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం మండయ్–2025 డిసెంబర్ 12వ తేదీ నుంచి ప్రారంభవుతాయని రాష్ట్ర గిరిజన, ప్రాధమిక విద్యా, మైనారిటీ శాఖా మంత్రి నిత్యానంద గొండో ప్రకటించారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని మిషన్ శక్తి సమావేశ మందిరంలో శనివారం జరిగిన మండయ్ సన్నాహక సమావేశంలో ప్రసంగించారు. ఈ ఉత్సవాలు డిసెంబర్ 16వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. మండయ్ శుభారంభం నవంబర్ 25వ తేదీన ఉమ్మర్కోట్ డివిజన్ డోడ్ర సమీపంలో పుడాఘఢ్ వద్ద ప్రారంభ పూజలు జరుగుతాయన్నారు. అనంతరం పంచాయతీ, సమితి, జిల్లా స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల కళాకారులు ముగింపు వేడుకలలో తమ ప్రదర్శనలు ఇస్తారని మంత్రి గొండో ప్రకటించారు. సమావేశంలో నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, వివిధ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు. -
రెండు బైక్లు ఢీ
మల్కన్గిరి : కోరుకొండ సమితి టెక్బేడ రహదారిలో శనివారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మల్కనన్గిరికి చెందిన రామ్కుమార్ (35), యమున సర్థార్ (28) ద్విచక్ర వాహనంపై బయలుదేరి మల్కన్గిరి–బలిమెల ప్రధాన రహదారిలో టెక్బేడ వద్దకు వచ్చేసరికి ఎదురుగా కోరుకొండ సమితిలోని ఇందిరా ఆవాస్ కాలనీకి చెందిన మోహన్ మాఝి (23), మధు జానీ బైక్పై వచ్చి ఢీకొట్టారు. ఈ ఘటనలో రామ్కుమార్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. స్థానికులు వెంటనే స్పందించి కోరుకొండ పోలీసులకు సమాచారం అందించడంతో ఐఐసీ హిమాన్షు శేఖర్బారిక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్సులో తరలించగా యమున, మోహన్ చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
● ఘనంగా శిశు మహోత్సవం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి దండాబడి పంచాయతీ సాధనా కేంద్రం వారి ఆధ్వర్యంలో శిశు మహోత్సవం సురభి–2025 నిర్వహించారు. సురభి జిల్లా కోఆర్డినేటర్ గోపీనాత్ సెఠి అధ్యక్షతన గురువారం దండాబడి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగింది. కార్యక్రమంలో నిర్వహించిన సాహిత్యం, సంస్కృతి, సంగీతం, నృత్య, చిత్ర కళా పోటీల్లో విద్యార్థులు చూపిన ప్రతిభను నిర్వాహకులు ప్రశంసించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొయిపరిగుడ సమితి ఉపాధ్యక్షుడు పూర్ణిమ బారిక్ ఫాల్గుని మాట్లాడుతూ సురభి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. గౌరవ అతిథులుగా దండాబడి గ్రామ పంచాయతీ సర్పంచ్ చెండియ ఖిలో, చిపాకూర్ పంచాయతీ సర్పంచ్ రాజు ఖిలో సమితి సభ్యులు బిమళ ఖిలో, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుధీర్ కుమార్ ప్రధాన్ పాల్గొన్నారు. శిశు మహోత్సవం సురభి–2025 పోటీల్లో 16 పాఠశాలల నుంచి అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రమేష్ సాహు
● జనరల్ సెక్రటరీగా పూర్ణిమా ప్రియ దర్శిని కొరాపుట్: అధికార భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రమేష్ సాహు నియమితులయ్యారు. నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్ కోట్ పట్టణానికి చెందిన రమేష్ పార్టీ ఆవిర్భాం నుంచి కొనసాగుతున్నారు. గతంలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు రాష్ట్ర పదవులు నిర్వర్తించారు. అలాగే కొరాపుట్ జిల్లాకి చెందిన పూరి ్ణ మా ప్రియ దర్శిని నాయక్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. పూర్ణిమా కొరాపుట్ జిల్లాలో బీజేపీ పటిష్టానికి కృషి చేశారు. గతంలో జిల్లా స్థాయిలో మహిళా విభాగంలో పార్టీకి సేవలు చేశారు.ఉచిత నేత్రవైద్య శిబిరం రాయగడ: సదరు సమితి పరిధిలోని పారిశ్రామిక ప్రాంతమైన జేకే పేపర్ మిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సీఎస్ఆర్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రాజెక్టు రోషిని ద్వారా గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పితామహాల్లోని ఎల్.వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరంలో జేకేపూర్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు పరీక్షించి 23 మందికి క్యాటరాక్ట్, 27 మందికి దష్టిలోపం ఉన్నట్టు వైద్యులు గుర్తించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం వారికి ఎల్.వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్లో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. శిబిరంలో విజన్ టెక్నిషియన్ జగదీస్ కొండగొరి, జేకే పేపర్ మిల్ అసిస్టెంట్ మేనేజర్ హరిహర ఖమారి పాల్గొన్నారు. కార్యాలయాల సందర్శన పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్ మధుమిత శుక్రవారం పర్లాకమిడిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. జిల్లా ట్రెజరీ, ఆర్టీవో, ఆదర్శ పోలీస్స్టేషన్లను సందర్శించి రికార్డులు పరిశీలించారు. స్థానిక మోడల్పోలీస్స్టేషన్లో సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, ఐఐసీ ప్రశాంత భూపతితో క్రైం రేటుపై సమీక్షించారు. పౌష్టికాహారంపై అవగాహన కొరాపుట్: పౌష్టికాహారంపై మహిళలకు అవగాహన ఉండాలని నబరంగ్పూర్ మహిళా మహా విద్యాలయం అధ్యాపకురాలు డాక్టర్ సంజుక్త పండా పేర్కొన్నారు. శుక్రవారం మహా విద్యాలయం ఆవరణలో పౌష్టికాహారంపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆహార అలవాట్లపై లోపంతో మహిళలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న మిల్లెట్ల వినియోగం పెరగాలన్నారు. సమావేశం లో ప్రిన్స్పాల్ మల్లేశ్వరి సాహు, ప్రొఫెసర్ సునితా పాత్రో, ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ సౌర పాల్గొన్నారు. ల్యాప్టాప్ దొంగల అరెస్టు పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్లో మిషన్ శక్తి కార్యాలయంలో రెండు రోజుల కిందట ల్యాప్టాప్ను కొందరు దొంగిలించారు. మోహన పోలీసు సిబ్బంది దర్యాప్తు చేసి మోహ న బ్లాక్ సంతోషినగర్కు చెందిన ఇద్దరు యువ కులు అంకిత్ నాయక్, అభిజిత్ పాత్రోలను అరెస్టు చేసి శుక్రవారం మోహన కోర్టుకు తరలించినట్టు ఐఐసి శుభ్రాంత్ పండా తెలియజేశారు. -
మార్కెట్ జంక్షన్ వద్ద బీజేపీ శ్రేణుల సందడి
పర్లాకిమిడి: స్థానిక మార్కెట్ జంక్షన్ శ్రీ క్రిష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ విగ్రహం పా ర్క్ వద్ద బీజేపీ శ్రేణులు సాయంత్రం సందడి చేశాయి. తమ నేత కోడూరు నారాయణ రావు కు బిజేపీ పార్టీ ఉపాధ్యక్షుని పదవికి నామినేట్ అవ్వడంతో హర్షాతిరేకాలతో గజపతి విగ్రహానికి పూల మాలలు వేసి బాణసంచా కాల్చి ముఖ్యమంత్రి మోహాన్ మఝికి జేజేలు పలికా రు. ఈ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు నబకిశోర్ శోబోరో, సాధారణ కార్యదర్శి జగన్నాధ మహాపాత్రో, రోక్కం సతీష్, బల్ల ధనుంజయ తదితరులు ఉన్నారు. 300 గ్రాముల వెండి చోరీ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని చినబొందిలీపురం సమీపంలో బాయన్నతోటలో నివాసముంటున్న రిటైర్డ్ డైట్ లెక్చరర్ ఇంట్లో 300 గ్రాముల వెండి చోరీకి గురైంది. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న సంపతి పురుషోత్తం తన పెద్ద బావమరిది ఇంట్లో జరిగే శుభకార్యానికి భార్యతో కలిసి విశాఖపట్నం వెళ్లారు. కుమార్తె, కుమారులు పుణేలో జాబ్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం వీరి నివాసగృహం మేడ మీద అద్దెకుంటున్న వ్యక్తి కిందకొచ్చి చూడగా తలుపుల తాళాలు పగలగొట్టడాన్ని గమనించి పురుషోత్తంకు ఫోన్లో సమాచారమందించారు. ఇంటికి చేరిన పురుషోత్తం బీరువా అరలో వెండి పోవడాన్ని గమనించాడు. లోపలి లాకర్లలో బంగారు వస్తువులు, నగదు భద్రంగానే ఉన్నాయి. కాగా ఈ చోరీ గురువారం అర్ధరాత్రి 1:30 నుంచి 4:20 గంటల మధ్య జరిగినట్లు సమీప సీసీ ఫుటేజీలో దృశ్యాలు కనిపించాయని స్థానికులు అనుకుంటున్నారు. పక్కనే మరో రెండు గృహాల్లోనూ చోరీకి యత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. సీఐ ఈశ్వరరావు, హెచ్సీ శివాజీ, క్లూస్టీమ్ ఘటనా స్థలికి చేరి పరిసరాలను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూకే స్కాలర్షిప్కు అనూష ఎంపిక పాతపట్నం: బూరగాం గ్రామానికి చెందిన పోలాకి అనూష యునైటెడ్ కింగ్డమ్లోని చెస్ట ర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ హెల్త్ సర్వీసెస్ మేనేజ్మెంట్లో చదివేందుకు వైస్ చాన్స్లర్ స్కాలర్షిప్కు ఎంపికై ంది. దీనిలో భాగంగా మొదటి ఏడాది 6,500 పౌండ్లు (రూ.7,67 లక్షలు), రెండో ఏడాదికి ప్లెస్మెంట్ పొందింది. ఐఈఎల్టీఎస్ పరీక్షలో మంచి స్కోర్ సాధించింది. అనూష తండ్రి పోలాకి గణపతి రైతు, తల్లి పోలాకి వరలక్ష్మి గృహిణి. అనూష జెమ్స్లో బీఎస్సీ నర్సింగ్, నాగార్జున యూనివర్సిటీలో డిప్లమా ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చదివింది. అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు పలాస: ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా అర్జీలు పరిష్కారానికి పోలీసు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి చెప్పారు. కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో శుక్రవారం ప్రజాగ్రీవెన్స్ నిర్వహించా రు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కాశీబుగ్గ, టెక్కలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ గ్రీవెన్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. పౌర సంబంధాలు, కుటుంబ, ఆస్తి గొడవలు, మోసపూరితమైనవి ఇతరత్రా అంశాలపై పలు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లా డి పరిష్కరించామని తెలిపారు. -
కొర్ని కుర్రాడి ‘పవర్’
● పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాణిస్తున్నరాజశేఖరరావు ● జాతీయ స్థాయి పోటీల్లో పతకాల కై వసం గార : సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కుర్రాడు జాతీయ స్థాయిలో ‘పవర్’ చూపిస్తున్నాడు. ఓవైపు ఉద్యోగ సాధనలో నిమగ్నమవుతూనే.. మరోవైపు ఎక్కడ పోటీలు జరిగినా పతకం రావాల్సిందే అన్నట్లుగా ప్రతిభ కనబరుస్తున్నాడు. గార మండలం కొర్ని గ్రామానికి చెందిన చమల్ల రాజశేఖరరావు జిల్లాలో విద్యాభ్యాసం పూర్తి చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా రాజమండ్రిలో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఓవైపు చదువుతూనే, మరోవైపు వ్యాయామం పట్ల ఆసక్తి ఉండటంతో అక్కడే భారతీయ వ్యాయామ కళాశాలకు వెళ్లి రెండు పూటలా వ్యాయామం చేసేవాడు. అక్కడ వివిధ రకాలైన కోచ్ల పరిచయంతో క్రీడాపోటీలకు కూడా శిక్షణ తీసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు స్పోర్ట్సు కోటా కూడా ఉండటంతో ఆసక్తి మరింతగా పెరిగింది. రెండు సంవత్సరాలుగా పలు పోటీల్లో పాల్గొన్న రాజశేఖర్ జాతీయ స్థాయి పోటీల్లో మెరిసాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన నేషనల్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్–2015 పోటీల్లో ఫుల్పవర్ లిఫ్టింగ్, ఫుష్పుల్, బెంచ్ప్రెస్ మూడు విభాగాల్లో స్వర్ణ పతాకాలు సాధించాడు. గతంలోనూ జంషెడ్పూర్లో ఇండియన్ పవర్లిప్టింగ్ ఫెడరేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాడు. తూర్పుగోదావరి జిల్లా స్థాయి పోటీలు, రాష్ట్ర చాంపియన్షిప్ పోటీల్లో మూడు సార్లు పాల్గొని ప్రథమ స్థానం సాధించాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం.. చంద్రశేఖర్ పదో తరగతి వరకు కొర్ని హైస్కూల్, ఇంటర్మీడియెట్ గురజాడ, డిగ్రీ ఆదిత్య కళాశాలలో చదివాడు. మావయ్యలు మళ్ల యేగీశ్వరరావు, మళ్ల లక్ష్మీనారాయణల ప్రోత్సాహం, అన్నయ్య చమల్ల కృష్ణారావు, సుమలత ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ సూచనలు చంద్రశేఖర్కు ఉపయోగపడ్డాయి. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి పోటీల్లో రాణించడంపై గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
స్క్రీన్పై పాఠాలు!
ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యంపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నాం. వివిధ కారణాల వల్ల పాఠశాలలకు రాని వారు ఈ యాప్ ద్వారా పుస్తకాలపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాఠ్యాంశాలు సులభంగా చదువుకోవచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – బి.ధనుంజయ్, ఎస్జీటీ, రాళ్లపాడు ఎంపీపీ స్కూల్, పోలాకి మండలం విద్యార్థుల సౌలభ్యం కోసం దీక్షా యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలపై కూడా క్యూఆర్ కోడ్ ముద్రించారు. యాప్ ద్వారా పాఠ్యాంశాలపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే విద్యార్ధులు సులువుగా పాఠాలు చదవవచ్చు. – యు.శాంతారావు, ఎంఈఓ, నరసన్నపేట నరసన్నపేట : అనారోగ్యంతో పాఠశాలకు వెళ్లకున్నా.. ఒకవేళ వెళ్లినా పాఠాలు సరిగ్గా అర్ధం కాకున్నా విద్యార్థులు చదువులో వెనుకబడిపోతున్నారు. అలాంటి విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం దీక్ష యాప్ అందుబాటులోనికి తెచ్చింది. అందులో ఎన్సీఈఆర్టీతో పాటు స్టేట్ సిలబస్ పుస్తకాలను కూడా పొందుపరిచారు. విద్యార్థులు సులువుగా పాఠ్యాంశాలను మొబైల్ ఫోన్ స్క్రీన్ ద్వారా చదువుకునేలా రూపకల్పన చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే.. జిల్లాలో 2955 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 264804 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సరఫరా చేసిన అన్ని పాఠ్య పుస్తకాలపైనా క్యూఆర్ కోడ్ను ముద్రించారు. పాఠ్యాంశంపై విద్యార్థులు పూర్తి పట్టు సాధించేందుకు నిపుణుల ద్వారా దీక్షా యాప్ను పొందుపరిచారు. యాప్ను సెల్ఫోనులో డౌన్ లోడ్ చేసుకొని పుస్తకాలపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అర్ధంకాని పాఠ్యాంశాన్ని సులువుగా అవగాహన అయ్యేలా రూపొందించారు. ఆడియో, వీడియో, క్విజ్, అసైన్మెంట్ వంటి సౌకర్యాలు కల్పించారు. ముఖ్యంగా ప్రత్యేక అవసరాల పిల్లలకు ఆడియో పాఠాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. యాప్ డౌన్లోడ్ ఇలా.. సెల్ఫోన్లో ప్లేస్టోర్ నుంచి దీక్షా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.అందులోకి వెళ్లి వివరాలు నమోదు చేయాలి. అనంతరం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలపై ఉన్న క్యూఆర్ కోడ్ను సెల్ఫోన్తో స్కాన్ చేస్తే వెంటనే పాఠ్యాంశం తెరపై కనిపిస్తుంది. క్యూఆర్ కోడ్తో ఉన్న పాఠ్య పుస్తకాలు -
సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఐఈఈఈ దినోత్సవం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో అంతర్జాతీయ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డేను ఘనంగా ఓపెన్ ఆడిటోరియంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ దేవేంద్రకుమార్ సాహు స్వాగత ఉపన్యాసం ఇవ్వగా, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ ప్రఫుల్ల కుమార్ పండా మాట్లాడారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో ఇటీవల నూతన ఆవిష్కరణలు, పరిశోధన, వివిధ సాఫ్ట్వేర్, హార్డువేర్ రంగాల్లో ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, వైస్ చాన్స్లర్ డాక్టర్ సుప్రియా పట్నాయిక్, విశ్రాంత ఐటీఆర్ (భుభనేశ్వర్) డైరక్టర్ హెచ్కే రథ్, డీఆర్డీఓ, ఐఐటీ, భుభనేశ్వర్ డాక్టర్ ప్రద్యుత్ కె.బిశ్వాళ్ తదితరులు ఐఈఈఈ పై అనర్గళంగా మాట్లాడారు. -
చెరువులో ఆక్రమణలు కూల్చివేత
పొందూరు: లోలుగు గ్రామంలో చెరువు గర్భంలో ఆక్రమణలను రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లోలుగు గ్రామంలోని 111 సర్వే నంబర్లో 5.44 ఎకరాల్లో కూర్మగుండం చెరువు ఉంది. అందులో సుమారు 25 సెంట్లలో 17 మంది షెడ్డ నిర్మాణంతో పాటు కొంతభాగం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. చెరువు గర్భం ఆక్రమణపై కొందరు గ్రామస్తులు పొందూ రు తహసీల్దార్ కార్యాలయంతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఆరు నెలలు క్రితం పొందూరు రెవెన్యూ అధికారులు, సర్వే అధి కారులు సర్వే నిర్వహించారు. ఇందులో 17 మంది 25 సెంట్ల స్థలం ఆక్రమించినట్లు గుర్తించారు. ఆక్ర మణలు తొలగించాలని రెండు నెలల క్రితం పొందూరు తహసీల్దార్ ఆర్.వెంకటేష్ నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందన లేకపోవడంతో శుక్రవారం పోలీసుల సమక్షంలో ఆక్రమణలను తొలగించారు. ఈ సమయంలో బాధితులు మాట్లాడుతూ తాము ఈ స్థలాలను 15 ఏళ్ల క్రితం కొనుగోలు చేశామని, వాటిని ఎలా తొలగిస్తారంటూ అధికారులను నిలదీశారు. సంబందిత స్థలాన్ని కొనుగోలు చేసి షెడ్డును నిర్మించుకుని పిండిమిల్లు పెట్టుకుని జీవ నం సాగిస్తున్నామని అధికారులకు పిసిని శ్యామలరావు తెలిపారు. ఇదే షెడ్డును తొలగించాలని తమకు ఇబ్బంది పెడుతూ, దౌర్జన్యం చేస్తున్నారని, కలెక్టర్ గ్రీవెన్సులో సైతం ఫిర్యాదు చేశానని చెప్పా రు. తొలగింపుల్లో వివక్షత చూపుతున్నారంటూ బాధితులు వాదించారు. చెరువు గర్భాలలో చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని తొలగించా రా అని నిలదీశారు. ఈ సమయంలో తీవ్ర వాగ్వా దం చోటు చేసుకుంది. తమ విధులకు అడ్డుపడితే చర్యలు తప్పవని తహశీల్దార్ వెంకటేష్, సీఐ సత్యనారాయణలు ఆక్రమణదారులను హెచ్చరించారు. ఎస్సై వి.సత్యనారాయణ, జి.బాలరాజు, సర్వేయర్ గణపతి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో ముగ్గురు నిందితులకు రెండేళ్ల జైలు
రాయగడ: చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ రోడ్డు సమీపంలోని మందుల షాపులో రూ.15 వేల నగదు, మొబైల్ ఫోన్ చోరీ చేసి అరెస్టయిన ముగ్గురు నిందితులకు సంబంధించి ఎస్డీజేఎం వర్షా దాస్ శుక్రవారం విచారించి రెండేళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు. 2024 అక్టోబరు 17వ తేదీ రాత్రి బిసిస రోడ్డు వద్ద గల బాలాజీ మెడికల్ స్టోర్లో చోరీ జరిగింది. దీనికి సంబంధించి బాధితుడు చందిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు హేమంత్ కుమార్ రావు, ఎస్కే భాషా, బి.వెంకటేష్లను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కేసు విచారణ చేపట్టిన ఎస్డిజేఎం వర్షాదాస్ 9 మంది సాక్షులను విచారించి అనంతరం తీర్పునిచ్చారు. అదేవిధంగా పదేసి వేలు జరిమానా కింద చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. చెల్లించకుంటే అదనంగా మరో 6 నెలల పాటు జైలు శిక్షను అనుభవించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిపై దాడి ● ఇద్దరు వ్యక్తులు అరెస్టు రాయగడ: రాష్ట్రపతి అవార్డు గ్రహీత, బిలేసు ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు ద్వితిచంద్ర సాహుపై దాడి చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను భువనేశ్వర్ కమిషనరేట్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో భువనేశ్వర్ బుద్ధనగర్ ప్రాంతానికి చెందిన అర్జున్ ప్రధాన్, పీడబ్ల్యూడీ బస్తీ పరిధి కొదలి గోదాం ప్రాంతంలో నివసిస్తున్న సునీల్ నాయక్లుగా గుర్తించారు. నిందితుల నుంచి పోలీసులు మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. గత సోమవారం ఉపాధ్యాయుడు భువనేశ్వర్లో జరిగే ఒక సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ రైల్వేస్టేషన్ 6వ నంబర్ ప్లాట్ఫారంలో దిగి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతనిపై దుండగులు దాడిచేసి సెల్ఫోన్ లాక్కెళ్లారు. ఈ ఘటనలో ఉపాధ్యాయుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ఆయన లక్ష్మీసాగర్ పోలీస్స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. -
దాతలే దిక్కు..!
అరసవల్లి: ఆరేళ్ల క్రితం జరిగిన బస్సు ప్రమాదం ఆ ఇంటి యజమాని కాళ్లను చచ్చుబడేలా చేసి మంచానికే పరిమితం చేసింది. అలాంటి స్థితిలో ఉన్న భర్త, పిల్లల బాగోగులు చూసుకుంటూ కుట్టుమిషనే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్న ఆ ఇల్లాలికి విధి మరో సమస్యను తెచ్చిపెట్టింది. దీంతో దాతల సాయం కోసం ఆమె ఎదురుచూస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. అరసవల్లి ఆదిత్యనగర్ కాలనీలో పేద కుటుంబానికి చెందిన కళ్లేపల్లి రమేష్, సుజాత దంపతులు. రమేష్ ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసేవారు. ఆరేళ్ల క్రితం ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడటంతో రెండు కాళ్లకు ఆపరేషన్ చేశారు. సుమారు రూ.15 లక్షల వరకు వైద్యానికి ఖర్చు అయినప్పటికీ నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. ఇక ఇంటర్ చదువుతున్న కుమారుడు లీలా సాయికృష్ణకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ స్థాయి అధికమవ్వడంతో రక్తవాంతులతో బాధపడుతున్నాడు. ఈ కుర్రాడికి బ్రాన్కోసిస్ సమస్య ఉండటంతో బ్రాన్కోస్రోప్ పరీక్షలు చేయించాల్సి ఉంది. ఈ పరీక్షలకు విశాఖపట్నం ఆసుపత్రిలో సుమారు రూ.లక్ష వరకు అవుతుందని.. అంతటి ఆర్ధిక స్థోమత తమకు లేదని వాపోతున్నారు. భార్య కళ్లేపల్లి సుజాత ఎంతో కష్టపడి లేడీస్ టైలరింగ్ నేర్పిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంతటి దీన పరిస్థితిలో ఉన్న తమను దాతలెవరైనా ఆదుకుని (ఫోన్పే నంబర్ 9381442744) కాపాడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. అరసవల్లిలో దయనీయ స్థితిలో పేద కుటుంబం మంచానికే పరిమితమైన తండ్రి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కుమారుడు వైద్యఖర్చులకు సాయం కోసం ఎదురుచూపులు రమేష్కు సదరం సర్టిఫికెట్ ద్వారా 66 శాతం అంగవైకల్యం ఉన్నట్లు వైద్యులు ధృవీకరించినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు పింఛన్ మంజూరు చేయలేదు. రెండు కాళ్లకు ఆపరేషన్ జరిగి మంచానికే పరిమితమైనప్పటికీ సర్కార్ పెద్దలు దృష్టి సారించడం లేదు. నెలనెలా పింఛన్ వస్తేకుటుంబానికి కొంత భరోసా దక్కుతుందని, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పింఛన్ మంజూరు చేయాలని రమేష్ కోరుతున్నారు. -
ఆస్పత్రి సిబ్బంది దురుసు ప్రవర్తన
రాయగడ: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రోగిని తీసుకొచ్చిన ఆశా కార్యకర్తపై హస్పిటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించాని ఆశా కార్యకర్త అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని కాసీపూర్ సమితి డంగలొడి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త పుష్పాంజలి బెవుర ఈనెల 10వ తేదీన అదే గ్రామంలో నివాసముంటున్న రవీంద్ర నాగవంశి భార్య లఖాబతితో పాటు ఆమె నాలుగు నెలల బిడ్డను చికిత్స కోసం స్థానిక జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకొచ్చారు. ప్రాథమిక వైద్యమందించిన వైద్యులు రక్త పరీక్షలను చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రక్త నమూనాలను ల్యాబ్లో సిబ్బందికి ఇచ్చారు. వాస్తవానికి అదేరోజు రక్త పరీక్షలకు సంబంధించి రిపోర్టును ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ల్యాబ్ సిబ్బంది మరుసటి రోజు రమ్మని పంపించారు. వారు చెప్పినవిధంగా మరుసటి రోజు యథావిధిగా రిపోర్టు కోసం ఆస్పత్రికి వచ్చారు. అయితే ల్యాబ్లో కొన్ని రిపోర్టులు గల్లంతయ్యాయని చెప్పి తిరిగి పంపించారు. దీంతో రిపోర్టు విషయంపై ల్యాబ్ సిబ్బందిని ఆశా కార్యకర్త ప్రశ్నించగా, సరైన బదులు చెప్పలేదు సరికదా.. దురుసుగా ప్రవర్తించారని వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆస్పత్రి ముఖ్యవైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రోను వివరణ కోరగా ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని, అందుకు సంబంధించి దర్యాప్తు చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. -
గౌరిగుడలో ఏనుగుల తిష్ట
పర్లాకిమిడి: ఆంధ్రలోని పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం నుంచి కాశీనగర్ రేంజ్ శియ్యాళీ పంచాయతీ గౌరిగుడ గ్రామంలోకి శుక్రవారం సాయంత్రం నాలుగు అటవీ ఏనుగులు ప్రవేశించాయి. దీంతో గ్రామస్తులు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధాన్యం, అరటి ఇతర కాయగూరల పంటలు కాస్తున్నాయి. దీంతో శియ్యాలీ అటవీ బీట్ గౌరిగుడ చేరుకుని ప్రజల ప్రాణాలకు ఎటువంటి హాని జరుగకుండా మైక్ద్వారా ప్రచారం చేస్తున్నారు. టాటా పవర్ డి స్ట్రిబ్యూషన్, రైల్వే సిబ్బందితో అటవీ అధికారులు కలిసి రాత్రి వేల పెట్రోలింగ్ జరుపుతున్నారు. గౌరిగుడ చుట్టుపక్కల గ్రామాల్లో ఏనుగులు వల్ల పంటనష్టం కలిగిస్తే ప్రభుత్వం అనుకంప పథకం వర్తించనున్నట్టు ఏసీఎఫ్ షైనీశ్రీ దాస్ తెలిపారు. -
సెక్షన్ ఆఫీసర్ను చుట్టుముట్టి..
పర్లాకిమిడి: అక్టోబరు రెండున భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి అనేక విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రాయఘడ బ్లాక్లో పెక్కట, రంగలా సింగి, భన్నడ, బరబ, పరాజీ వంటి పలు గ్రామాల్లో గత పదిహేను రోజులుగా ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. అనేకసార్లు గ్రామస్తులు విద్యుత్ పునరుద్ధరణకు విన్నవించినా టాటా పవర్ డిస్ట్రిబ్యూషన్ అధికారులు స్పందించకపోవడంతో శుక్రవారం పెక్కట గ్రామానికి విచ్చేసిన విద్యుత్ సెక్షన్ ఆఫీసర్ను ప్రజలు చుట్టుముట్టి రాత్రి చాలాసేపు గ్రామంలో ఉంచారు. పలు గ్రామాల ప్రజలు జూనియర్ ఇంజినీరు (ఎలక్ట్రికల్) చుట్టుముట్టి నిలదీయడంతో... చివరకు విద్యుత్ రెండు రోజుల్లో పునరుద్ధరణ చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు అక్కడి నుంచి విడిచిపెట్టారు. -
స్వచ్ఛంద సేవకుడు షణ్ముఖ పాత్రో మృతి
కొరాపుట్: ప్రముఖ గోవిందాలయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు షణ్ముఖ పాత్రో (50) మృతి చెందారు. శుక్రవారం వేకువజామున న్యూఢిల్లీలోని తన నివాసంలో గుండె పోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించే సరికి తుది శ్వాస విడిచినట్లు ప్రకటించారు. మృతదేహాన్ని నబరంగ్పూర్ జిల్లాకి రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. నబరంగ్పూర్ జిల్లా నందాహండి సమితి సొరుగుడ గ్రామానికి చెందిన షణ్ముఖ ప్రాతో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. నబరంగ్పూర్ జిల్లాలో ప్రజల కోసం గోవిందాలయ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా అంబులైన్స్ సేవలు, గిరిజన విద్యార్థులకు ఉపాధి రంగాలలో శిక్షణ అందిస్తున్నారు. కాగా షణ్ముఖ సూచించిన విధంగా తన మరణాంతరం అంత్యక్రియలు సొరుగుడలోని గోవిందాలయ ప్రాంగణంలో జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈయన మృతి పట్ల రాష్ట్ర ప్రాధమిక విద్య, సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి నిత్యానంద గొండో, నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జిలు వేర్వేరు ప్రకటనలలో సంతాపం ప్రకటించారు. శనివారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని గోవిందాలయ వర్గాలు ప్రకటించాయి. -
ఉప ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లు
కొరాపుట్: నువాపడ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేడీకి చెందిన స్టార్ కాంపైయినర్ల జాబితాను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ జాబితాలో నబరంగ్పూర్ జిల్లాకి చెందిన నలుగురు నేతలు ఉన్నారు. జిల్లాకి చెందిన రాజ్యసభ ఎంపీ, ఒడియా సినిమా హీరో మున్నా ఖాన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారీ, మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జిలు ఉన్నారు. ఈ నలుగురు నేతలు నువాపడ ఉప ఎన్నికలు ముగిసేంత వరకు అక్కడే మకాం వేయనున్నారు. దీంతో ఆయా నాయకులు తమ తమ అనుచరులతో నువాపడా బయల్దేరుతున్నారు. -
ఆదర్శ విద్యాలయ గేటుకు తాళాలు
జయపురం: జయపురం సమితి జయంతిగిరి ఒడిశా ఆదర్శ విద్యాలయ ప్రధాన గేటుకు విద్యార్థులు తాళాలు వేశారు. విద్యాలయ ఆంగ్ల ఉపాధ్యాయిని వ్యవహార శైలిపై నిరసనగా వారు గేటుకు తాళాలు వేశారు. టీచర్కు వ్యతిరేకంగా రాసిన ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. టీచర్ జబాపూర్వబి నాగేశ్ విద్యార్థులపై అవమానకరంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 11వ తరగతిలో గల 17 మంది విద్యార్థులను క్లాస్ నుంచి బయటకు పంపారని వారు ఆరోపించారు. గతంలోనూ ఆమైపె పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. అందుకే ప్రధాన గేటుకు తాళాలు వేసి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు. కలెక్టర్తో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ప్రిన్సిపాల్ సెట్టి వెల్లడించారు. -
మత్స్యకార సామగ్రి దగ్ధం
రణస్థలం: కొవ్వాడ గ్రామంలో బడె మహందాతకు చెందిన కమ్మల షెడ్ శుక్రవారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. తహసీల్దార్ సనపల కిరణ్కు మార్, బాధితుడు మహందాతకు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వాడ తీరంలోని సముద్రం ఒడ్డున తాటి, కొబ్బరి కమ్మలతో షెడ్ ఉంది. అందులో మత్స్యకారులకు చెందిన 12 పెద్ద వలలు, మర బోటు, ఇంజన్ బోటు, తాళ్లు ఉన్నాయి. ఈ షెడ్కు విద్యుత్ సరఫరా లేదు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు గ్రామస్తులు చూసేసరికి కమ్మల షెడ్ కాలిపోయి కనిపించింది. గుర్తు తెలియని వ్య క్తులు షెడ్ కాల్చి వేసి ఉంటారని బాధితుడు అను మానిస్తున్నాడు. సుమారు రూ.25 లక్షలు వరకు నష్టం చేకూరిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఘటనా స్థలాన్ని ఎఫ్డీవో గంగాధర్, జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి పరిశీలించారు. -
శుభ్రమైన చేతులే.. ఆరోగ్యానికి హేతువులు
జయపురం: జయపురం సమితి కొట్పాడ్ సమితి నువాగాం గ్రామంలో గ్లోబల్ హ్యాండ్వాష్ దినం పాటించారు. అమరజ్యోతి ఫౌండేషన్, రేకెట్ డెటో ల్ స్కూల్ హైజిన్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ సహకారంతో ఒడిశా కొరాపుట్ జిల్లా జయపురం సబ్డివిజన్ కుంధధ్ర సమితి నువాగాంలో చేతులు శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. చేతుల పరిశుభ్రత ఒక ఆరోగ్య కరమైన సమాజం ఏర్పాటుకు దోహదపడుతుందని కొరాపుట్ జిల్లా కోఆర్డినేటర్, అమర జ్యోతి ఫౌండేషన్ తాపస హొత్త వెల్లడించారు. శుభ్రమైన చేతులు మన ఆరోగ్యానికి దోహద పడతాయ ని ముఖ్యవక్తగా పాల్గొన్న ఆయన అన్నారు. ప్రస్తు తం ఒడిశాలో 4400 పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పద్మశ్రీ గోవర్ధన పొనిక, పాఠశాల ప్రధాన ఉపాద్యాయురాలు, జాతీయ పురస్కారం పొందిన మహిళ జెమ పొచిక, రాకెట్ కార్పొరేషన్, కార్పొరేట్ వ్యాపార విభాగ డైరెక్టర్ రభి భటనాగర్, అమర జ్యోతి ఫెడరేషన్ అధ్యక్షుడు బిధు భూషణ పండ పాల్గొన్నారు. -
వలస కార్మికుల కుటుంబాలకు నష్ట పరిహారం
పర్లాకిమిడి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ బ్లాస్టింగ్లో ప్రాణాలు కోల్పోయిన ఒడిశాకు చెందిన మోహనా బ్లాక్ వలస కార్మికులు భాస్కర్ బిసాయి, టుకునా దొళాయి కుటుంబాలకు బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి గురువారం మోహనా పంచాయతీ సమితి కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.4 లక్షల చొప్పున్న పరిహారం అందజేశారు. ఆగస్టు 3వ తేదీన కాకినాడలో ఒడిశాకు చెందిన వలస కార్మికులు ఒక బ్లాస్టింగ్లో మృతి చెందిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అనుప్ పండా, మోహనా బీడీవో రాజీవ్ దాస్, మోహనా సమితి చైర్మన్ రాజీవ్ శోబోరో తదితరులు పాల్గొన్నారు. -
భూమి లాక్కుంటున్నారు..
ఆమదాలవలస: తన భూమిని లాక్కునేందుకు జనసేన పార్టీ ఎంపీటీసీ అంపిలి విక్రమ్ అనే వ్యక్తి నాలుగేళ్లుగా తనను వేధిస్తున్నారని ఆమదాలవలస పట్టణానికి చెందిన మహిళ చింతు విజయ ఆరోపించారు. ఆమె గురువారం ఆమదాలవలసలో విలేకరులతో మాట్లాడారు. తాను బూర్జ మండలం కొల్లివలస గ్రామంలో 20 సెంట్ల భూమిని కొనుగోలు చేశానని, అదే భూమిని చేజిక్కించుకోవాలని అంపిలి విక్రమ్, వాళ్ల బావ పాండ్రంకి తారక్లు నాలుగేళ్లుగా తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆమె చెప్పారు. సరుబుజ్జిలి తహసీల్దార్ రమణారా వు భూమి కొలతలకు వచ్చినప్పుడు కూడా వారిద్ద రూ పెట్రోలు పోసి సైట్ ఖాళీ చేయాలని బెదిరించా రని పేర్కొన్నారు. కారుతో వెంబడించడం, రాత్రిళ్లు ఇంటి వద్ద రాళ్లు వేయించడం వంటి పనులు చేశార ని ఆరోపించారు. తాను కోర్టును ఆశ్రయించగా, కోర్టు తనకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని, ఆ ఆర్డర్ను తహసీల్దార్ కార్యాలయానికి, పోలీస్ స్టేషన్కు సమర్పించానన్నారు. అయినా వేధింపులు ఆగడం లేదని చెప్పారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. -
సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాల కొరత
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఎం నగర కన్వీనర్ ఆర్.ప్రకాశరావు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లను సీపీఎం ప్రతినిధి బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా విద్యార్థులు అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో ఎస్సీ హాస్టల్స్ 31, బీసీ హాస్టల్స్ 78, ఎస్టీ హాస్టల్స్ 60 ఉన్నాయని, వీటిల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించని వారు జిల్లాలో విమానాశ్రయాలు నిర్మిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తక్కువ మెనూ చార్జీలతో అరకొర భోజన సదుపాయాలు అందుతున్నాయన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు జిల్లా మంత్రులకు పట్టవా అని ప్రశ్నించారు. వర్షం పడితే ఎస్సీ హాస్టల్ మొత్తం నీటితో నిండిపోతుందని, ఎస్సీ హాస్టల్ విద్యార్థులు ఎస్టీ హాస్టల్కి వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎస్టీ హాస్టల్లో గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లో ఒక్కో హాల్ ఉన్నాయని, అందులోనే 200 మంది విద్యార్థులందరూ సామూహికంగా నిద్రించడం, భోజనం చేయడం, చదువుకోవడం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం ప్రతినిధి బృందం నాయకులు ఎం.గోవర్ధనరావు, పి.సుధాకర్, కె.సూరయ్య, ఎల్.మహేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
‘విద్యా ప్రమాణాల పెంపునకు కృషి’
కంచిలి: గురుకుల విద్యాలయాల్లో విద్యా ప్రమాణా లు మునుపటి కంటే పెంచడానికి ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా గురుకుల విద్యాసంస్థల సమన్వయకర్త వై.యశోదలక్ష్మి పేర్కొన్నారు. మండల కేంద్రం కంచిలిలో గల డాక్టర్ బీఆ ర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాన్ని ఆమె గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆమె పాఠశాల భవనాలను, డార్మిటరీ భవనా న్ని పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి, వారి అవసరాలను తెలుసుకొన్నారు. అనంతరం గురుకులంలో సేవలందిస్తున్న అధ్యాపకులు, ఉపాధ్యాయు లు, ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావుతోనూ మాట్లాడా రు. గురుకుల సమస్యలను కలెక్టర్కు నివేదిస్తానని తెలిపారు. భోజనశాలలో పనిచేస్తున్న సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఆమెకు గురుకుల ప్రిన్సిపా ల్ పి.శ్రీనివాసరావు సహకరించారు. -
ఘనంగా నవీన్ పట్నాయక్ పుట్టినరోజు
రాయగడ: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ సుప్రీం నవీన్ పట్నాయక్ పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ శ్రేణులు గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జగన్నాథ సరక, మాజీ అధ్యక్షుడు సుధీర్ దాస్ నేతృత్వంలో స్థానిక ప్రభుత్వ హాస్పటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. అనంతరం శాంతి ర్యాలీని నిర్వహించారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యంగా ఉండాలని జగన్నాథ, మజ్జిగౌరమ్మ మందిరాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు అనసూయా మాఝి, రాయగడ మున్సిపల్ చైర్మన్ మహేష్ కుమార్ పట్నాయక్, ఉదయ్ హిమిరిక తదితరులు పాల్గొన్నారు. జల్లాల్లోని గుణుపూర్లో మాజీ ఎమ్మెల్యే రఘునాఽథ్ గొమాంగొ ఆధ్వర్యంలో గుణుపూర్ సబ్ డివిజన్ హాస్పటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. -
ఒడిశా ఉత్తరప్రదేశ్
● 208.7 కిలోల గంజాయితో పట్టుబడిన ఉత్తరప్రదేశ్ వాసులు ● రూట్ మార్చి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు ● గంజాయి తరలిస్తున్న కారు అద్దాలపై ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ ట్యాగ్స్ వయా శ్రీకాకుళం శ్రీకాకుళం క్రైమ్ : ఉత్తరప్రదేశ్లో ఉన్న ఓనరు ఆదేశిస్తాడు.. వీరు పాటిస్తారు. ఎవరి దగ్గరకు వెళ్లాలి.. ఎక్కడ గంజాయి కొనాలి.. ఎలా తిరిగి రావాలి.. చెక్పోస్టులు ఉంటే ఎలా తప్పించుకోవాలి.. ఇలా అన్ని ప్లాన్లు ఓనరే వేస్తాడు. అతను చెప్పింది చెప్పినట్లు వీరు పాటిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీరు ఖాకీల నుంచి తప్పించుకోలేకపోయారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్, మీరట్లకు చెందిన సునీల్ (38), విశాల్ (28)లు ఒడిశాలోని కొరా పుట్ నుంచి టొయోటో కారులో 208.79 కిలోల గంజాయిని చెక్పోస్టులు తప్పించి.. రూట్ మార్చి మళ్లించే యత్నంలో చిలకపాలెం వద్ద ఎచ్చెర్ల పోలీ సులకు పట్టుబడ్డారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎప్పటి నుంచో.. మీరట్లోని డౌట్లో స్పై హోటల్ నడుపుతున్న గౌర వ్ వద్ద సునీల్, విశాల్లు కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఎప్పటి నుంచో వీరు గంజాయి క్రయవిక్రయాల్లో సిద్ధహస్తులు. ఈ క్రమంలో ఒడిశాలోని కొరాపుట్ జిల్లా దంతపురి సమీప లంపటాఫుట్ గ్రామానికి చెందిన సమర మాటం అలియాస్ డొంబురు వద్ద ఈనెల 14న 40 ప్యాకెట్లలో 208.7 కిలోల గంజాయిని తీసుకున్నారు. శ్రీకాకుళం చెక్పోస్టులను తప్పించి దారి మళ్లించి విశాఖ చేరేందుకు వీరు టొ యాటో కారులో కొరాపుట్ నుంచి బయల్దేరారు. కారుపై ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ స్టిక్కర్లు వీరు ప్రయాణిస్తున్న కారుపై ఢిల్లీ హైకోర్టు బార్ కౌన్సిల్, జాతీయ చిహ్నం గుర్తుతో అడ్వకేట్ 2019, అడ్వకేట్ 2021 స్టిక్కర్లు ఉండటంతో అనుమానం వచ్చి లోపల తనిఖీ చేయగా 40 ప్యాకెట్లలో గంజా యి పట్టుబడింది. వీరు చిలకపాలెం నుంచి విశాఖ చేరి అక్కడి నుంచి విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా నాగపూర్ హైవేకు చేరి అక్కడి నుంచి మీర ట్ వెళ్లి తమ ఓనరుకు అప్పగిస్తామని విచారణలో పేర్కొన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం గంజాయిని వీరికి అందించిన ఒడిశా సమరమాటం, అతనికి సహకరించిన మరో వ్యక్తి పరారీలో ఉన్నారని, మీర ట్ ఓనర్ అయిన గౌరవ్ వద్దకు పోలీసులను పంపించామని, వీరేకాక మరో ముగ్గురిని నిందితులుగా గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. రూట్ మార్చారిలా.. ఒడిశా కొరాపుట్ నుంచి చత్తీస్గఢ్ రాష్ట్ర బోర్డర్ ఆనుకొని ఉన్న సిమిలిగుండ మీదుగా పొత్తంగి వద్ద అడ్డుదోవ తీసుకుని సమీపంలోని ఒడిశా సుంకి చెక్పోస్టును తప్పించారు. అక్కడి నుంచి విజయనగరం జిల్లా సాలూరు నుంచి రామభద్రాపురం, రాజాం, పొందూరులు దాటి చిలకపాలెం జంక్షన్ వద్దకు వచ్చి పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. అప్పటికే ఎచ్చెర్ల ఎస్ఐ వి.సందీప్కు ఈగల్టీమ్ సమాచారం ఉండటంతో కారును తనిఖీ చేశారు. -
ముగిసిన జిల్లాస్థాయి స్కూల్ క్రికెట్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: పది రోజుల పాటు కన్నుల పండువలా సాగిన జిల్లాస్థాయి అంతర్ పాఠశాలల క్రికెట్ పోటీలు ముగిశాయి. శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జెడ్సీఎస్ స్కూల్గేమ్స్ హర కేశవ మెమోరియల్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ 2025 సీజన్–1 చాంపియన్ ట్రోఫీని ఏపీ మోడల్ స్కూల్ పురుషోత్తపురం కై వసం చేసుకుంది. రన్నరప్గా శ్రీకాకుళంలోని మహాలక్ష్మినగర్కాలనీలో ఉన్న శ్రీచైతన్య (బ్రాంచ్–1) నిలిచింది. శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం మైదానం వేదిక గా జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్ పర్యవేక్షణలో ఈ నెల 8వ తేదీన ఈ పోటీ లు మొదలయ్యాయి. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీచైతన్య స్కూల్ 66 పరుగులు మాత్రమే చేయగా, ప్రతిగా బ్యాటింగ్ మొదలుపెట్టిన ఏపీఎంఎస్ పురుషోత్తపురం మూడు వికెట్లు కోల్పోయి విజ యం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో రాణించిన శ్యామ్సుందర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపిక య్యాడు. అలాగే టోర్నీలో అత్యద్భుతమై ఆటతీరు తో రాణించినవారిలో బెస్ట్ బౌలర్గా హరికృష్ణ, బెస్ట్ బ్యాటర్గా సాత్విక్, బెస్ట్ ఫీల్డర్గా లిలిత్, మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా శ్రీరామ్ ప్రత్యేకంగా బహుమతులు అందుకున్నారు. విజేతలకు ట్రోఫీలు, బహుమతులను జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, విద్యుత్ట్రాన్స్కో అధికారి రామకృష్ణ, ప్రసన్నకుమార్ బహూకరించారు. -
పాఠశాల పరిశీలన
కొరాపుట్: హిందాల్కో ప్రైవేట్ సంస్థ ఆర్థిక సహాయంతో ఎక్స్ బోర్డు స్కూల్లో మరమ్మతులు చేస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత ప్రకటించారు. గురువారం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ నియెజకవర్గం కన్సారి గుడ గ్రామంలో ప్రభుత్వ స్కూల్ను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాడైన బెంచీలు, కుర్చీలను ఎమ్మెల్యేకు విద్యార్థులు చూపించారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. హిందాల్కో సహాయంతో బాగు చేయిస్తామని హామీ ఇచ్చారు. వైద్యుడి బదిలీని రద్దు చేయాలి పర్లాకిమిడి: ఆర్.ఉదయగిరి బ్లాక్ రామగిరిలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ బ్రజరాజ్కర్ను ఉద్దేశపూర్వకంగా పర్లాకిమిడి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ చేశారని, ఆ బదిలీని రద్దు చేయాలని తబార్సింగి, మరో రెండు గ్రామాల ప్రజలు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి ఏడీఎం ఫల్గుణి మఝికి గురువారం వినతిని అందజేశారు. డాక్టర్ బ్రజరాస్ కర్ మంచి వైద్యుడని, ఆయన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. రామగిరి సీడీపీఓ, ఇతర సిబ్బంది ఆయనపై అభియోగాలు మోపి ఐదు నెలల జీతం ఇవ్వకుండా చేశారని, చివరకు పర్లాకిమిడి కేంద్ర ఆస్పత్రికి బదిలీ చేశారన్నారు. వెంటనే ఆయన బదిలీని రద్దుచేసి, రామగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఫరూల్ పట్వారీపై దర్యాప్తు రాయగడ: జిల్లా కలెక్టర్గా ఇదివరకు విధులు నిర్వహించిన ఫరూల్ పట్వారీపై జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమారావ్ చేసిన ఫిర్యాదు మేరకు దక్షిణాంచల్ ఆర్డీసీ సంగ్రామ్ కేసరి మహాపాత్రో దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన బుధవారం రాయగడలో పర్యటించారు. ప్రస్తుత కలెక్టర్ అశుతోష్ కులకర్ణితో చర్చించిన ఆయన ఎస్డీసీ (స్పెషల్ డవలప్మెంట్ కౌన్సిల్)లో చోటుచేసుకున్న ఆర్థిక కుంభకోణంపై ఆరా తీశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమారావ్ను ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. అందుకు సంబంధించి కొన్ని ఫైళ్లను కూడా తనిఖీ చేశారు. ఫరూల్ పట్వారీ రాయగడ కలెక్టర్గా విధులు నిర్వహించే సమయంలో వివిధ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన సామాన్లను ఖరీదు చేసే విషయంలో ఆదేశించిన ఫైల్స్ను పరిశీలించారు. కవిటి: మండలంలోని ఎన్హెచ్–16 హైవే పై శిలగాం ఫ్లైఓవర్ దాటి న తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి ఆది ఆంధ్ర వీధికి చెందిన వాడపల్లి శ్రీను(39) మృతి చెందాడు. టెక్కలి పట్టణం ఆది ఆంధ్ర వీధికి చెందిన వాడపల్లి శ్రీను ఉదయం టెక్కలి నుంచి తన ద్విచక్రవాహనంపై ఇచ్చాపురం మండలం సంతపేట గ్రామంలో ఉన్న బావమరిది పెండ్ర ముకేష్ ఇంటికి ప్రయాణిస్తున్నాడు. ప్రయాణం మధ్యలో కవిటి మండలం జమేదార్ పుట్టుగ గ్రామం దగ్గరలో ఎన్హెచ్ 16 రహదారి పై బండి అదుపు తప్పి హైవే డివైడర్ను గుద్దుకుని తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించి ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కవిటి ఎస్ఐ వి.రవివర్మ విలేకరులకు తెలియజేశారు. -
వంతెన బాగుచేయాలని వినతి
జయపురం: జయపురం సమితి పాత్రో ఫుట్ గ్రామ సమీప కొలాబ్ నదిపై గల 94 ఏళ్ల కిందట నిర్మించిన ఇనుప వంతెనకు తగిన రక్షణ, పర్యవేక్షణ లేక ప్రమాదస్థికి చేరుకుంది. వారం రోజులుగా వంతెన మరమ్మతులు చేపట్టాలని, దాని పక్కన మరో వంతెన నిర్మాణం వెంటనే పూర్తిచేయాలని, లేకపోతే ఆందోళన చేపడతామని పాత్రో ఫుట్ వంతెన సురక్షా సమితి సభ్యులు తెలిపారు. జయపురం సబ్కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ ఇనుప వంతెన విజయవాడ–రాంచీ 326వ జాతీయ కారిడార్ మార్గం పాత్రో ఫుట్ సమీపంలో ఉందని, వంతెన మీదుగా జయపురం నుంచి బొయిపరిగుడ, లమతాపుట్, మాచ్ఖండ్ మల్కనగిరి, ఒడిశాలోని పలు ప్రాంతాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీష్గఢ్ రాష్ట్రాలకు వేలాది వాహనాలు రాకపోకలు చేస్తున్నాయని వెల్లడించారు. ప్రమాద స్థితిలో ఉన్న వంతెనపై రాకపోకలు బందు చేసే ముందు దాని పక్కనే మరో వంతెన నిర్మాణం నిర్మించేందుకు పనులు చేపట్టి, కంట్రాక్టర్ ఆ పనులు నిలిపివేసి వెళ్లిపోయాడని ఆరోపించారు. వంతెన పనులు జరిపేందుకు నేషనల్ హైవే అధికారులు మరో టెండర్ పిలిచేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. అధికారులు వెంటనే దృష్టి సారించాలన్నారు. వినతిపత్రం అందించిన వారిలో పాత్రోఫుట్ వంతెన సురక్షా సమితి సభ్యులు కేథార గౌరీదాస్, సంతోష్ పట్నాయక్, కృష్ణ కేశవ షొడంగి, బినయవజిత్ నాయక్, జితు నాయక్, జగన్నాథ్ రౌత్, రామనాథ్ దండసేన, సత్యనారాయణ సాహు, హేమంత ఖెముండు, తదితరులు పాల్గొన్నారు. -
‘మౌలిక వసతులు కల్పించాకే తరలిస్తాం’
సంతబొమ్మాళి: పోర్టు నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులు కల్పించిన తర్వాతే మూలపేట గ్రామం ఖాళీ చేయించి మిమ్మల్ని తరలిస్తామని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి అన్నారు. గురువారం పోర్టు నిర్వాసితులకు నౌపడలో కేటాయించిన ఆర్అండ్ ఆర్ కాలనీలో నిర్వహించిన లాటరీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 506 పీడీఎఫ్లకు గా ను ప్రతి పీడీఎఫ్కు 5 సెంట్లు ఇంటి స్థలం ప్రభు త్వం కేటాయించిందన్నారు. ఆ స్థలం ఎక్కడ, మీ స్థలం ఏదీ అని తెలుసుకోవడానికి మాత్రమే లాటరీ తీస్తున్నామని అన్నారు. లాటరీ ద్వారా తీసిన నంబ ర్ ప్రకారం మీకు ఐదు సెంట్లు స్థలం చూపించడానికి 15 రోజుల సమయం పడుతుందన్నారు. సుడా అనుమతి పొందిన తర్వాతే లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తున్నామని, ఇది మార్చే అధికారం తనకు గానీ తహసీల్దార్కు గానీ లేదన్నారు. 586 ప్లాట్లను ఆరు బ్లాక్లుగా విభజించి ఎర్త్ ఫిల్లింగ్ ఇతర పనులు చేపడుతున్నామని అన్నారు. ఐదుకోట్ల 50 లక్షల రూపాయిలతో మరో రెండు అడుగులు ఎత్తు చేయడానికి ఎర్త్ ఫిల్లింగ్ పనులు చేపడుతున్నామని తెలిపారు. మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గుడి నిర్మాణానికి కూడా అన్ని చర్య లు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆయనతో పాటు తహసీల్దార్ హేమసుందరరావు, స్థానిక సర్పంచ్ జీరు బాబురావు, మాజీ సర్పంచ్ జీరు భీమారావు, కోట నారం నాయుడు, జీరు శివ, రోహిణీరావ్, జీరు రాంబాబు తదితరులు ఉన్నారు. -
అధికారుల తనిఖీలు.. బెంబేలెత్తిన వ్యాపారులు
సారవకోట: మండల కేంద్రంలో గురువారం విశాఖపట్నం నుంచి ఫుడ్ కంట్రోలర్ ఎస్.ఈశ్వరి, జిల్లాకు చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో వ్యాపారులంతా బెంబేలెత్తారు. రోడ్డు పక్కనే ఉన్న దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారని తెలిసి అందరూ దుకాణాలు మూసివేశారు. తాము పరిశీలించిన దుకాణాల్లో తేదీల లేపా లు లేవని వారు తెలిపారు. వ్యాపారాలు చేసుకునే వారు స్వలాభం తగ్గించుకుని ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉన్న వస్తువులు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. టెక్కలి రూరల్: టెక్కలి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం రైలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని నర్సింగిపల్లి గ్రామానికి చెందిన సింహాద్రి చలపతిరావు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైల్వే గేటు నుంచి టెక్కలి రైల్వే స్టేషన్ మధ్యలో పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళ్తుండగా రైలు వచ్చి ఢీ కొట్టడంతో పక్కనున్న పొదల్లోకి తుళ్లిపోయాడు. ప్రమాదం గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన చలపతిరావును తీసుకువెళ్లేందుకు 108 వాహనం రాగా అప్పటికే ఆయన మృతి చెందాడు. పలాస: పలాస రైల్వే స్టేషన్ పరిధిలోని రెండో ప్లాట్పారం లైన్లో వంతెన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద జారి పడి మృతి చెందినట్టు పలాస జీఆర్పీ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మృతుడికి సుమా రు 45 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. శరీరంపై నాచురంగు గల ఫాంటు, నీలం రంగు గల టీ షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440627567 సంప్రదించాలని ఆయన కోరారు. కొల్లవానిపేటలో.. నరసన్నపేట: మండలం కొల్లవానిపేట సమీపంలో రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించామని ఆమదాలవలస రైల్వే ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢీకొని బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఒడిశా వాసిగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. -
ముఖ్యమంత్రిని కలిసిన గవర్నర్
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధికారిక నివాస భవనంలో మర్యాదపూర్వకంగా సందర్శించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గవర్నర్ను సాదరంగా స్వాగతించారు. వెలుగుల పండగ పురస్కరించుకుని ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్శన సందర్భంగా ఇరువురు ప్రముఖులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న, ప్రారంభం కానున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. బాణసంచా పేలుడులో వాహనం దగ్ధం భువనేశ్వర్: స్థానిక ఆచార్య విహార్ ఓవర్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో స్కూటర్ దగ్ధమైంది. పేలుడుతో చెలరేగిన మంటల్లో చిక్కుకుని ఈ దుర్ఘటన సంభవించింది. ఈ విచారకర సంఘటనలో ఒక బాలునితో సహా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్కూటర్ డిక్కీలో బాణసంచా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దవిడిగాం వద్ద అక్రమ బాణసంచా గోదాము సీజ్ పర్లాకిమిడి: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గుసాని సమితి కెరండి పంచాయతీ దవిడిగాం వద్ద లైసెన్సు లేకుండా అక్రమంగా గోదాముల్లో దాచి ఉంచిన మందుగుండు సామాన్లను పర్లాకిమిడి ఆదర్శ పోలీసు ష్టేషన్ అధికారి ప్రశాంత భూపతి, ఎస్డీపీఓ మాధవానంద్ నాయక్ గురువారం సాయంత్రం దాడులు జరిపి సీజ్ చేశారు. ఆకులమ్మ ఫైర్ వర్క్స్లో అక్రమ బాణసంచా సుమారు రూ. 15 లక్షల స్టాకును పట్టుకుని దుకాణం సీజ్ చేశారు. యజమాని డి.సురేష్ (పర్లాకిమిడి)పై ఎక్స్ప్లోజివ్ చట్టం కింద కేసు పెట్టారు. -
మహిళా సాధికారతపై దిశా నిర్దేశం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మిషన్ శక్తి ద్వారా పలు ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్నాయని, గ్రామ వికాస్ సంస్థ గ్రామాల్లో విద్య, తాగునీరు, ఇతర కార్యక్రమాలు 1982 నుంచి చేపడుతుండడం మంచి విషయమని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (రెవెన్యూ) మునీంద్ర హానగ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మహిళా సాధికారతపై గ్రామ వికాస్ సంస్థ జిల్లా స్థాయి కన్వర్జెన్స్ కర్మశాలను ఏడీఎం మునీంద్ర ప్రారంభించారు. కర్మశాలలో జిల్లా పరిషత్ సీడీఓ, కార్య నిర్వహణాధికారి శంకర కెర్కెటా, గ్రామ వికాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిబి పి.జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మొక్కజొన్న అమ్మకాలకు మార్కెటింగ్ లభించడం లేదని, రైతులను ప్రభుత్వ అధికారులు, ఎన్జీఓ సంస్థలు ఆదుకోవాలని గ్రామ వికాస్ డైరక్టర్ లిబి పి.జాన్సన్ కోరారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలు మహిళల వికాసానికి లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎన్జీఓ సంస్థలు కలిసి పనిచేయాలని జిల్లా పరిషత్ సీడీఓ శంకర కెరకెటా అన్నారు. వర్క్షాపులో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సునారాం సింగ్ మాట్లాడుతూ, గజపతి జిల్లాలో మైక్రో, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు మార్గదర్శకాలు వివరించారు. వర్క్షాపులో మిషన్శక్తి డైరక్టర్ టిమోన్ బోరా, సి.సి.డి. స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎ.జగన్నాథ రాజు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆశా వర్కర్ల ఆందోళన
పర్లాకిమిడి: అఖిల భారత ఆశా వర్కర్ల మహాసంఘం ఆదేశాల మేరకు గజపతి జిల్లా కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ఆశా వర్కర్ల సంఘం వారు గురువారం ఆందోళన చేశారు. జాతీయ స్వాస్థ్య మిషన్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, ఆశా వర్కర్లకు నెలసరి జీతం రూ. 18 వేలకు పెంపు, ప్రతి హెడ్ క్వార్టర్ ఆస్పత్రిలో ఆశా వర్కర్లకు విశ్రాంత భవనం, ఈఎస్ఐ, ఈపీఎఫ్ నిధిలో జమ, అర్హత కలిగిన ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలుగా పదోన్నతి వంటి పలు డిమాండ్లతో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం భారతీయ మజ్దూర్సంఘ్ గజపతి అధ్యక్షులు సుజిత్ ప్రధాన్, ఆశా వర్కర్ల సంఘం కార్యదర్శి సమీక్షా గోమాంగో, అధ్యక్షురాలు నమితా గోమాంగో, రాష్ట్ర ఆశా వర్కర్లు ప్రతినిధి కామిని సింగ్ తదితరులు కలిసి అదనపు కలెక్టర్కు ముఖ్యమంత్రి పేరిట రాసిన వినతిని అందజేశారు. -
సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి
రాయగడ: మన సంస్కృతీ, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెమండొ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం సమీపంలో జిల్లా యంత్రాంగం, ఓర్మాస్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన దీపావళి సామాన్ల విక్రయ స్టాల్ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆనందాలకు, సంతోషాలకు దీపావళి వంటి పండగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అభిప్రాయపడ్డారు. ఓర్మాస్ ద్వారా ఈ ఏడాది దీపావళి సామాన్ల విక్రయ స్టాల్ను ఏర్పాటు చేశామని ఓర్మాస్ అధికారి జి.లక్ష్మణ్ తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఈ స్టాల్లో స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు సొంతంగా రూపొందించే వివిధ రకాల దీప ప్రమిదలు, కొవ్వొత్తులు, అగరబత్తులు తదితర వస్తువులు లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఇక్కడ తక్కువ ధరకు లభించే సామగ్రి కొనుగోలు చేసి ప్రోత్సాహించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి శ్వాస వరకు ఒడిశా తల్లికి సేవ చేస్తాను: నవీన్
● ప్రజల మధ్య నవీన్ పట్నాయక్ 79వ పుట్టినరోజు భువనేశ్వర్: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, విపక్ష నేత నవీన్ పట్నాయక్ గురువారం తన 79వ పుట్టిన రోజు వేడుకలను ప్రజల మధ్య సందడిగా జరుపుకున్నారు. స్థానిక ఎస్ఓఎస్ గ్రామంలో ఆబాలగోపాలంతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఏకామ్ర నియోజక వర్గంలోని గంగ నగర్ బిజూ ఆదర్శ్ కాలనీలో జరిగిన ప్రజా పరస్పర స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక బీజేడీ కార్యకర్తలు, నివాసితులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్ర ప్రజలకు తన జీవితకాల నిబద్ధతను నవీన్ పట్నాయక్ పునరుద్ఘాటించారు. ‘నా చివరి శ్వాస వరకు నేను ఒడిశా తల్లికి సేవ చేస్తాను అని ప్రకటించారు. సేవా దృక్పథం బిజూ జనతా దళ్ తత్వంగా పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజలతో తమ బంధాన్ని బలోపేతం చేసుకుని ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ప్రయత్నాలు కొనసాగించాలని కోరారు. పిల్లలు ఆయనను ఆటపాటలతో స్వాగతించారు. పిల్లలు తయారు చేసిన కేక్తో నవీన్ పట్నాయక్ జన్మదిన వేడుకల్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా పిల్లలకు చాక్లెట్లు, బహుమతులు అందజేసి వారితో సంభాషించి కొంత సమయం గడిపారు. మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత నవీన్ పట్నాయక్కు రాష్ట్ర గవర్నరు డాక్టరు హరి బాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి వంటి ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూరీ సాగర తీరంలో సైకత శిల్పి పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ భారీ ఆకర్షణీయ సైకత శిల్పం ఆవిష్కరించి అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రాయగడ: రోడ్డు ప్రమాదంలో గుడారికి చెందిన చిత్తరంజన్ పట్నాయక్ (56) అనే వ్యక్తి బుధవారం మృతి చెందాడు. తన స్కూటీపై పని మీద రాయగడ వస్తుండగా లబాగుడ వద్ద ఎదురుగా వస్తున్న ఒక పికప్ వ్యాన్ను అదుపుతప్పి ఢీకొంది. ఈ ఘటనలో అతడు తీవ్రగాయాలకు గురవ్వగా అక్కడి కొందరు అతడిని రామనగుడ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలకు గురైన అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఢీకొని వెళ్లిన పికప్ వ్యాన్ను గాలిస్తున్నారు. స్కూల్ బస్ అతి వేగం.. ఒకరు మృతి కొరాపుట్: స్కూల్ బస్ అతి వేగం వల్ల ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. గురువారం నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితి తురిడి పంచాయితీ కేంద్రం నుంచి బిజూ పట్నాయిక్ స్కూల్ బస్ రాయిఘర్ వైపు వెళ్తుంది. ఇదే సమయంలో తురిడికి చెందిన సోమార్ గొండో (60) తన ద్విచక్ర వాహనంతో ఇంటికి వస్తున్నాడు. బస్సు వేగంగా దూసుకు రావడంతో అతడి బైక్ ఢీ కొని అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో సోమార్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. బస్సులో ముగ్గురు చిన్నారులు గాయ పడ్డారు. రాయిఘర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాయిఘర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కలిమెల సమితిలో మావో డంప్ స్వాధీనం మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా పోలీసులు కూంబింగ్లో గురువారం కలిమెల సమితి మధుమాల్, చిలకలమామ్మిడి అటవీ ప్రాంతంలో ఓ డంప్ను జవాన్లు గుర్తించి దాన్ని బయటకు తీశారు. ఆ డంప్లో తుపాకీ తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలు, ఇతర మావో సామగ్రి ఉన్నాయి. ఈ డంప్ ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ మావోయిస్టులకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. డంప్లో 3ఐఇడి బాంబులు, 5 డిటోనేటర్లు, 4 మీటర్ల కోడెక్స్ తీగ, జనరేటర్, వెల్డింగ్ మెషీన్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జవాన్లు ఆ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోడూరు నారాయణరావు పర్లాకిమిడి: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గజపతి జిల్లాకు మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావును బీజేపీ రాష్ట్ర సాధారణ కార్యదర్శి మానస కుమార్ మహంతి గురువారం నియమించారు. మొత్తం పది జిల్లాలకు రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రతినిధులుగా నియమించారు. ఆయన నియామకంపై గజపతి జిల్లా బిజేపీ అధ్యక్షులు నబకిశోరో శోబోరో, ఎంపీ ప్రతినిధి దారపు చిట్టి, రొక్కం వేణుగోపాలరావు, రోక్కం సతీష్ (కాశీనగర్) పురుటిగుడ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రత్యర్థుల్ని గౌరవించడం క్రీడాస్ఫూర్తి
భువనేశ్వర్: స్థానిక కళింగ స్టేడియంలో గురువారం 28వ ఐటీటీఎఫ్–ఏటీటీయూ ఆసియా టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్షిప్స్ 2025 ముగింపు కార్యక్రమం జరిగింది. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి మాట్లాడుతూ పతకాలను సాధించడంతో విజయం పరిమితం కాకుండా క్రీడా స్ఫూర్తితో ప్రత్యర్థులను గౌరవించడం ఇతరులను ప్రేరేపించడంలో దోహద పడుతుందన్నారు. ఈ పోటీ నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని, మొదటిసారిగా ఒడిశా ఈ ప్రతిష్టాత్మక చాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చిందని, క్రీడల రాజధానిగా కళింగ స్టేడియం మరోసారి ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తెచ్చిందని అభినందించారు. గత 5 రోజులుగా కళింగ స్టేడియం అంతర్జాతీయ నైపుణ్య స్ఫూర్తి ఉత్సాహంతో ప్రతిధ్వనించడం తార్కాణంగా పేర్కొన్నారు. చాంపియనన్షిప్లో పురుషులు, మహిళల జట్ల టైటిళ్లను గెలుచుకోవడం ద్వారా చైనా మరోసారి ప్రపంచ టేబుల్ టెన్నిస్లో తన సత్తా ప్రదర్శించింది. ఈ సందర్భంగా లండన్లో జరగనున్న 2026 ఐటీటీఎఫ్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్షిప్లకు అర్హత సాధించిన జట్లను గవర్నర్ ప్రశంసించారు. టేబుల్ టెన్నిస్ ధైర్యం, స్థితిస్థాపకత, పట్టుదల నేర్పుతుందని డాక్టర్ కంభంపాటి అన్నారు. ఒక పాయింట్ కోల్పోయినప్పుడు కూడా, ఉత్తమ ఆటగాళ్లు ప్రశాంతమైన దృఢ సంకల్పంతో తిరిగి పుంజుకుంటారు. ఈ పట్టుదల జీవితంలో తిరిగి ఎదగ గలిగే మనోస్థైర్యం ప్రేరణకు ఉదాహరణగా పేర్కొన్నారు. క్రీడలు, యువజన సేవలు, ఒడియా భాష, సాహిత్యం – సంస్కృతి, ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్, క్రీడలు, యువజన సేవల విభాగం కమిషనర్, కార్యదర్శి సచిన్ జాదవ్, క్రీడలు మరియు యువజన సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ యెద్దుల విజయ ఈ సందర్భంగా మాట్లాడారు. -
సైబర్ మోసాలపై అవగాహన
రాయగడ: సైబర్ మోసగాళ్ల బారినపడి ఎంతో మంది మోసపోతున్నారని, సైబర్ నేరగాళ్ల బారి నుంచి రక్షించడంతోపాటు ఆయా నేరాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. బుధవారం వర్చువల్ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, ఎస్డీపీఓ గౌరహరి, సైబర్ సెల్ డీఎస్పీ అవినాష్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైబర్ నేరాల బారి నుంచి అమాయక ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించి సైబర్ నేరస్తుల బారి నుంచి ప్రజలను రక్షించడం మన కర్తవ్యంగా భావించాలన్నారు. సైబర్ నేరాలను అదుపులోకి తీసుకురావాలంటే విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయి నుంచి సమితి స్థాయి వరకు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా సైకల్ ర్యాలీలు, వివిధ రకాల పోటీలను నిర్వహించాలన్నారు. -
భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి నలగంఠి పంచాయతీ ఎం.వి 72 గ్రామంలో భర్త ఇంటి ముందు భార్య బుధవారం ధర్నాకు దిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తాపన్ మండల్ అనే వ్యక్తి బీఎస్ఎఫ్ జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. 2022లో ఎం.వి 61 గ్రామానికి చెందిన కరిష్మా విశ్వస్ను ప్రేమించాడు. తల్లిదండ్రుల అంగీకారంతో మల్కన్గిరిలోని మల్లికేశ్వర్ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులు మల్కన్గిరిలో ఓ అద్దె ఇంటిలో కాపరం పెట్టాడు. అక్కడ నుంచి తరచూ తాపన్ తల్లిదండ్రులు సునంద మండల్, తుషార్ మండల్ వచ్చి కోడుకు, కోడలు మధ్య గోడవలు పెట్టేవారు. దీంతో భార్యను విడిచిపెట్టి తపాన్ విధులకు వెళ్లిపోయాడు. రెండేళ్లు గడిచిన తరువాత ఎం.వి 79 పోలీసు స్టేషన్లో తనకు భర్త వదిలేశాడని కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి తపాన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. భర్యాభర్తలు కలిసి ఉండాలని కోర్టు ఆదేశించింది. కరిష్మాను తపాన్ భర్యగా, అత్తమామలు కోడలిగా అంగీకరించడం లేదు. దీంతో కరిష్మా భర్త ఇంటి ముందు వివాహ, కోర్టు ఇచ్చిన పత్రాలతో ధర్నాకు దిగింది. న్యాయం కోసం పోరాడుతోంది. కరిష్మాతోపాటు తల్లి కూడా ఉంది. -
ప్రభుత్వమే ఆదుకోవాలి
● జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావుపర్లాకిమిడి: దివ్యాంగులకు బస్సుల్లో, ట్రైన్లలో ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తోందని జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు అన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రపంచ వైట్ క్యాన్ డేను స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హాల్లో ఘనంగా నిర్వహించారు. సైట్ సేవర్స్ సంస్థ, సమర్థ్ వికలాంగుల పునరావాస కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ వైట్ క్యాన్డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సామాజిక భద్రతా అధికారి లక్కోజు సంతోష్ కుమార్, సమర్థ్ సంస్థ అధ్యక్షుడు నిరంజన్ బెహరా, పి.చిన్నారి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 మందికి అంధులకు తెల్లని స్టిక్లు జిల్లా పరిషత్ చైర్మన్ అందజేశారు. వైట్ క్యాన్ అంటే వికలాంగుల చిహ్నం, ఒడిశాలో వికలాంగులకు 60 శాతం, 80 శాతం అంగవైకల్యమని సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అలా లేదని, దీనిని ప్రభుత్వం సరిదిద్దాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 6433 మంది దివ్యాంగులు ఉండగా.. కేవలం 3050 మందికి నెలసరి భృతి రూ.3500లు లభిస్తుందని సీసీడీ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎ.జగన్నాథ రాజు అన్నారు. ముగింపు సభలో దివ్యాంగుడు, సమర్థ్ సంస్థ కార్యదర్శి సంతోష్ మహరాణా అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. -
సిక్కోలు పుస్తక మహోత్సవం లోగో ఆవిష్కరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో నవంబర్ 11 నుంచి 20 వరకు జరగనున్న సిక్కోలు పుస్తక మహోత్సవం సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక సంబరాలు విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ ఆకాంక్షించారు. ఈ మేరకు తన చాంబర్లో సిక్కోలు పుస్తక మహోత్సవం లోగోను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహోత్సవం కన్వీనర్ కె.శ్రీనివాసు, సాంస్కతిక వైజ్ఞానిక కన్వీనర్లు పి.సుధాకరావు, గొంటి గిరిధర్, కామినాయుడు, దొంతం పార్వతీశం, కె.కూర్మారావు, పి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. నాచు పెంపకంపై అవగాహన ఎచ్చెర్ల: బుడగట్లపాలెం సముద్రతీరంలో కఫ్పా ఫైకాస్ జాతి సముద్ర నాచు పెంపకంపై స్థానిక మత్స్యకార స్వయం సహాయక సంఘాల మహిళలకు బుధవారం మత్స్యశాఖ అధికారులు శిక్షణ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపికచేసి నాచు పెంపకం చేపడుతున్నట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు వై.సత్యనారాయణ తెలిపారు. 50 మంది మహిళలకు 10 మంది మత్స్యకారులు శిక్షణ పొందుతున్నారని చెప్పారు. నాచు కొనుగోలు చేసే బాధ్యత మత్స్యశాఖ తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అల్లుపల్లి రాంబాబు, మత్స్యశాఖ ఎఫ్డీవో రవి, జీఎఫ్ ప్రతినిధి శామ్యూల్, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు చీకటి శ్రీరాములు, మహిళలు, మత్స్యకారులు పాల్గొన్నారు. పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల్లో న్యాయవిజ్ఞానం విస్తృతంగా వ్యాప్తి చెందడానికి, చట్టాలపై అవగాహన పెంచడానికి పారా లీగల్ వలంటీర్లకు సమగ్ర శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పారా లీగల్ వలంటీర్లకు మ జిల్లా న్యాయ సేవా సదన్లో నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ బుధవారం ప్రారంభించారు. వివిధ పథకాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, న్యాయవాదులు అన్నెపు భువనేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. బైక్ అదుపుతప్పి యువకుడు మృతి బూర్జ: ఆమదాలవలస–పాలకొండ ప్రధాన రహదారిలో నీలాదేవిపురం మలుపు వద్ద ద్విచక్ర వాహనం ముందుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి గోతులో పడటంతో యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు విజయనగరం జిల్లా గరివిడి మండలం చేరిపేటకు చెందిన కె.సంతోష్గా గుర్తించారు. అదే బైక్పై వెనుక కూర్చున్న నమ్మి కనకరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వీరు బుధవారం సాయంత్రం పార్వతీపురంలో ఓ శుభకార్యం ఫొటోషూట్ తీసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. హెచ్సీ ఉమామహేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. పుస్తెలతాడు చోరీ సంతబొమ్మాళి: బోరుభద్ర గ్రామంలో మార్పు అప్పన్నమ్మకు చెందిన రెండు తులాల బంగారు పుస్తెలతాడు చోరీకి గురైనట్లు సంతబొ మ్మాళి ఎస్ఐ వై.సింహాచలం తెలిపారు. బుధవారం ఉదయం అప్పన్నమ్మ తన కన్నవారిల్లు ఉన్న నగిరిపెంట గ్రామానికి వెవెళ్లింది. తిరిగి బోరుభద్ర వచ్చేందుకు నగిరిపెంట జంక్షన్ వద్ద బస్సు కోసం వేచి ఉండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలో పుస్తెలతాడు తెంచుకుని పారిపోయారు. బాధితురాలు కేకలు వేసినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
నువాపడా ఉప ఎన్నికలో బీజేడీ నవీన వ్యూహం
● బీజేడీ అభ్యర్థి స్నేహాంగిని చురియాభువనేశ్వర్: నువాపడా నియోజక వర్గం ఉప ఎన్నిక పురస్కరించుకుని రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ దాఖలు ఘట్టం ఆరంభం కావడంతో అభ్యర్థుల ఎంపిక పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ బీజేడీ ఫిరాయించిన జయ ఢొలొకియాను అభ్యర్థిగా ప్రకటించింది. మరో వైపు కాంగ్రెస్ ఘసిరాం మాఝీని బరిలోకి దింపింది. విపక్షం బిజూ జనతా దళ్ చిట్ట చివరి క్షణం వరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఆశావహుల శీర్షికతో ఊహాగానాలు బలం పుంజుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నవీన్ నివాసంలో అంతరంగిక సమావేశాలు నిరవధికంగా కొనసాగాయి. ఎప్పటి మాదిరిగానే నవీన్ పట్నాయక్ తుది నిర్ణయం విశ్లేషకుల్ని సైతం ఖంగు తినిపించింది. నువాపడాలో గెలుపు గుర్రం అన్వేషణ కోసం నియమించిన స్నేహంగిని చురియా నువాపడా ఉప ఎన్నికకు బీజేడీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు ప్రకటించారు. నవీన్ పట్నాయక్ నువాపడా ఉప ఎన్నికకు స్నేహంగిని చురియాను ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పశ్చిమ ఒడిశాకు చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు స్నేహంగిని చురియా ప్రస్తుతం బిజూ మహిళా జనతా దళ్ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. షెడ్యూల్డ్ కుల సమాజానికి చెందిన ఆమె సామాజిక సమ్మిళితత్వం, మహిళా సాధికారత రెండింటినీ సూచిస్తుంది. బీజేడీ రాజకీయ విజయ గాథలో ఈ రెండు ప్రధాన అంశాలు కావడంతో ఆమె అభ్యర్థిత్వం ధీటైనదిగా పరిగణించారు. పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలలో ఆమె ఏకై క మహిళా అభ్యర్థి. పోటీలో ఆమెకు ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. మహిళలపై పెరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా స్థిరమైన వైఖరికి పేరు గాంచిన స్నేహంగిని చురియా రాష్ట్ర వ్యాప్తంగా బీజేడీ మహిళా విభాగంలో ముందంజ నాయకురాలిగా పేరొందింది. ఆమె క్షేత్ర స్థాయి సంబంధాలు, బీజేడీ మహిళా కార్యకర్తలను ఉత్తేజపరిచే సామర్థ్యం నువాపాడలో పార్టీ ప్రచారానికి శక్తినిస్తుందని భావిస్తున్నారు. నవీన్ పట్నాయక్ ఎంపిక నువాపడా ఉప ఎన్నికలో లింగ, ప్రాంతీయ, సామాజిక ప్రాతినిధ్యం వ్యూహాత్మక సమతుల్యతను ప్రతిబింబిస్తుంది. ఈ చర్య బీజేడీ మహిళా నాయకత్వంపై ప్రాధాన్యతను కూడా పునరుద్ఘాటిస్తుంది. -
నృత్య పోటీలకు విశేష స్పందన
పర్లాకిమిడి: స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో జిల్లా ముఖ్య శిక్షా కార్యాలయం, రాష్ట్ర ఉపాధ్యాయ ట్రైనింగ్, ఉన్నత విద్యామండలి (ఎస్.సి.ఈ.ఆర్.టి) ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నృత్య పోటీలు బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ముఖ్యశిక్షాధికారి మాయధర్సాహు మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నృత్య పోటీల విజేతలకు రాష్ట్ర స్థాయికి పంపుతామన్నారు. అదనపు డీఈఓ గిరిధర్, డాక్టర్ ముర్ము, జిల్లా సైన్సు కోఆర్డినేటరు అంపోలు రవికుమార్, అంతర్జాతీయ ఒడిశా నృత్య కళాకారిణి డి.ప్రియాంక, హెచ్ఎం పూర్ణచంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. మనో డ్యాన్సు, ఒడిస్సీ, సంబల్పురి నృత్యాలు అలరించాయి. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ఆదర్శ దాస్, డి.ప్రియాంక, డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ వ్యవహరించారు. విజేతలకు డీఈఓ మాయాధర్ సాహు బహుమతులు అందజేశారు. -
ఆన్లైన్లో అన్న ప్రసాదంపై వివాదం
భువనేశ్వర్: ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ రాష్ట్రంలో అత్యంత ప్రముఖ దేవాలయాల నుంచి అన్న ప్రసాదం అమ్మకం, ఇంటి ముంగిట డెలివరీ ప్రకటనలు ప్రసార చేసి వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ప్రకటన పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయం నుంచి అన్న మహా ప్రసాదం (ఒబొడ) మాత్రమే కాకుండా కెంజొహర్ జిల్లా ఘొటొగాంవ్ మా తరిణి, బాబా అఖండలమణి, ఇతర ప్రముఖ దేవాలయాల అన్న ప్రసాదాలను కూడా ఆన్లైన్లో బట్వాడా చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కో సెట్ ప్రసాదం ధర రూ. 49కు పరిమితంగా పేర్కొంది. ఈ ఆఫర్ కార్తీక మాసం పురస్కరించుకుని ఈ ప్రత్యేక సౌలభ్యం కల్పించినట్లు ప్రకటన ప్రసారం చేసింది. కార్తీక మాసం నెల రోజులపాటు ఈ సౌలభ్యం చెల్లుబాటు అవుతుందని తెలిపింది. ఈ చర్య విస్తృత విమర్శలకు దారి తీసింది. పవిత్ర శ్రీ జగన్నాథ మహా ప్రసాదం లభ్యతని ఇలా దిగజార్చడం భక్తుల పట్ల విశ్వాస ఘాతం. భక్తుల మనోభావాలను సొమ్ము చేసుకుని నిలువునా దోచుకునేందుకు వినూత్న ప్రయత్నంగా విమర్శలు వ్యాపించాయి. ఆధ్యాత్మిక, ధార్మిక సంప్రదాయ విలువల్ని దిగజార్చే ఇటువంటి చర్యల పట్ల అధికార యంత్రాంగం కఠినంగా స్పందించాలని భక్తజనం అభ్యర్థిస్తుంది. ఇలాంటి ప్రకటనలు ఆలయ ప్రసాదాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతను దెబ్బతీస్తాయని సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతుంది. భగవంతుని ఆశీర్వాదంగా భావించే పవిత్రమైన అన్న ప్రసాదాన్ని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టే వస్తువుగా పరిగణించరాదని పలువురు మత పండితులు, ఆలయ నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక సంప్రదాయాలను వ్యాపారాత్మకంగా మార్చడం ఎంత మాత్రం తగదని అభ్యర్థిస్తున్నారు. ఆన్లైన్ ఆహార డెలివరీ ఏజెంట్లు మాంసాహార ఆహార పదార్థాలతో కలిపి భగవంతుని అన్న ప్రసాదాల్ని డెలివరీ చేయడం ఆధ్యాత్మిక, ధార్మిక విలువల్ని నీరుగార్చడమే అవుతుందంటున్నారు. తక్షణమే ఈ దుశ్చర్యపై శ్రీ మందిరం పాలక మండలి స్పందించి ఆన్లైన్లో మహా ప్రసాదం విక్రయ ప్రకటనలకు కట్టడి చేయాలని కోరారు. -
బొణై మాజీ ఎమ్మెల్యే మృతి
భువనేశ్వర్: సుందరగడ్ జిల్లా బొణై నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే హేమేంద్ర ప్రసాద్ మహాపాత్రో (92) ఖుటుగాంవ్లో బుధ వారం మరణించారు. అతడు 1961, 67, 71లో వరుసగా 3 సార్లు స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా శాసన సభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈనెల 29న జాతీయ కార్యవర్గ సమావేశం రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో ఈనెల 29వ తేదీన అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్టు రెండో జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ట్రస్టు సభ్యులు, గుణుపూర్ ధర్మశాస్త అయ్యప్ప మందిరం సభ్యులు జి.అనంతరావు గురుస్వామి ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అయ్యప్ప స్వామి మందిర ప్రాంగణంలో జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీష్ఘడ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ ఏడాది తొలిసారిగా శబరిమల సమీపంలోని పంబ, నీలక్కాల్ మధ్య ట్రస్టు తరుపున అయ్యప్ప భక్తులకు ఉచిత అన్నప్రసాద సేవనం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నవంబర్ నుంచి మకర జ్యోతి దర్శనం వరకు అక్కడకు వచ్చే భక్తులకు ఈ సౌకర్యం లభిస్తుందని తెలిపారు. -
ఐసీడీఎస్ భవనం ప్రారంభం
రాయగడ: గుణుపూర్లో కొత్తగా నిర్మించిన ఐసీడీఎస్ కార్యాలయ భవనాన్ని సబ్ కలెక్టర్ అభిషేక్ దుదూల్ అనిల్ మంగళవారం ప్రారంభించారు. సమగ్ర శిశు వికాసానికి ఎంతగానో దోహదపడుతున్న ఐసీడీఎస్ సంస్థలో ఉన్న కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల సద్వినియోగానికి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా కోవిడ్ వంటి ఆపద కాలంలో వారు అందించిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి మీనతీ దేవ్, సీడీపీవో సుశుమా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం రాయగడ: పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ అన్నారు. స్థానిక సమితి కార్యాలయం సమావేశ మందిరంలో జాతీయ స్థాయి పౌష్టికాహార మాసోత్సవాలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులకు సకాలంలో సమతుల్యమైన ఆహారాన్ని అందివ్వాలని సూచించారు. ప్రాజెక్టు అధికారి మీతారాణి దాస్ మాట్లాడుతూ మంచి ఆహారం తీసుకోకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. అనంతరం పౌష్టికాహార వంటలను ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి తదితరులు పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణాపై కొరడా రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో వంశధార నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై సబ్ కలెక్టర్ అభిషేక్ దుదూల్ అనిల్ కొరడా ఝులిపించారు. మంగళవారం ఆయన వంశధార నది వద్ద ఇసుక రీచ్లపై ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఆయన దాడులు నిర్వహిస్తున్న సమయంలో దాదాపు 80పైగా ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అక్కడకు వెళ్లి పరిస్థితిని అధ్యయనం చేశారు. అయితే ఇసుకను తరలించేందుకు ఎటువంటి అనుమతులు లేవని గమనించిన 22 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. చిత్రకొండ సమితిలో భారీ కలప పట్టివేత మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి గాజులమాముడి పంచాయతీ పరిధిలోని సింగారం అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి చిత్రకొండ అటవీ శాఖ రేంజర్ బలరామ్ నాయిక్ తన సిబ్బందితో కలపను పట్టుకున్నారు. ముంచిగ్పుట్ ప్రాంతానికి చెందిన సునధర్ ఖిలోను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు తుమ్మాలమమిడి గ్రామానికి చెందిన త్రినాథ్ హంతాల్గా తెలిపింది. ఆయన పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలంలో 119 కలప చెక్కలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో టేకు ఎక్కువగా ఉందని రేంజర్ తెలిపారు. -
తుపాకీ, పిస్టల్, 350 కిలోల గంజాయి
జయపురం: కొరాపుట్ జిల్లాలో నేరాలు నియంత్రిస్తున్నామని ఎస్పీ రోహిత్ బర్మ బుధవారం తెలిపారు. జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న అపరాధి నిరోధక అభిజాన్లో జిల్లా పోలీసులు 350 కిలోల గంజాయితో పాటు తుపాకీ, ఒక పిస్టల్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ నెలలో 17కుపైగా కేసుల్లో నిందితులతో పాటు ఒక హార్డ్కోర్ నిందితుడిపై నాసా చట్టంలో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్తో పాటు గంజాయి మాఫియా, హార్డ్కోర్ నేరస్తుడు లాల్ బహుదూర్ దర్జీని అరెస్టు చేశామని, అతడిపై గతంలో 20 కి పైగా కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. అతడి నుంచి ఒక తుపాకీ, ఒక పిస్టల్, 350 కేజీల గంజాయి పట్టుకున్నట్టు వెల్లడించారు. ఆయుధాలపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఒక పోలీసు టీమ్ను బీహార్కు పంపించినట్లు వెల్లడించారు. గతంలో ఒక బట్టీ ఆదాయ నేరస్తుల వ్యతిరేకంగా హెల్ప్లైన్ ప్రారంభించామని వెల్లడించారు. ఆ హెల్ప్లైన్ నంబర్ 94389 16918 జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కాశ్యప్ కార్యాలయంలో ఉందని వెల్లడించారు. ఈ హెల్ప్లైన్ను సద్వినియోగం చేస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీప్ కశ్యప్, జయపురం సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్,పాడువ పోలీసు అధికారి అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
సర్వే పూర్తి చేయాలి’
‘గుణుపూర్–తెరువలి ..రాయగడ: గుణుపూర్–తెరువలి కొత్త రైల్వే నిర్మాణంలో భాగంగా సంబంధిత శాఖ అధికారులు చేపడుతున్న సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణం పనులు ప్రారంభించాలని దిశ చైర్మన్, కొరాపుట్ లోక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గుణుపూర్ నుండి తెరువలి కొత్త రైల్వే నిర్మాణంలో భాగంగా నయిరా మీదుగా గుడారి వరకు రైల్వే లైన్ అనుసంధానించి రాయగడకు కలపాలన్న ప్రతిపాదన గుర్తించి ప్రస్తావించారు. రాయగడ రైల్వే డివిజన్గా గుర్తింపు పొందినప్పటికీ అందుకు సంబంధించిన సౌకర్యాలు ప్రజలు పొందలేకపోతున్నారని ఉలక అన్నారు. అత్యవసర సమయంలో తాత్కాల్ టిక్కెట్ల కొరత తీవ్రంగా ఉందని సమావేశంలొ ప్రస్తావించి, దీనిపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించాలని కోరారు. కొరాపుట్–రాయగడ రైల్వే లైన్లో గల టన్నెల్ల వద్ద తరచూ మట్టి పెల్లలు జారిపడటం వంటి సమస్యలు తరచూ చోటు చేసుకుంటుండటంపై సమీక్షించిన ఆయన అందుకు మార్గంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమత, దుర్గి–రాయిపూర్ ప్యాసింజర్ రైళ్లకు జమిడిపేటలో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. సదరు సమితి గుమ్మ ఘాటి మలుపులొ తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గుమ్మ వద్ద టన్నల్ ఏర్పాటు చేస్తే ఈ ప్రమాదాలను కొంతమేర నివారించే అవకాశం ఉంటుందని, అందుకు సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపాలని అన్నారు. అదేవిధంంగా కై లాస్పూర్ ఘాటీ మలుపు కూడా అదే తరహా ఉందని అయితే ఈ ఘాట్ రోడ్డు వద్ద విద్యుద్దీకరణ చేస్తే ప్రమాదాల సంఖ్య అరికట్టవచ్చని కోరారు. రాయగడ నుండి కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ వరకు గల రహదారిని మెరుగుపరచాల్సి ఉందని ఉలక అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లొ మొబైల్ సేవలు జిల్లాలొ గల 11 సమితుల పరిధుల్లో ఉన్న 136 గ్రామాలకు మొబైల్ సేవలు లేవని ఈ గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ సేవలు ప్రారంభించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఉలక అన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
భటగుడలో యువకుడి దారుణ హత్య
రాయగడ: జిల్లాలొని బిసంకటక్ సమితి పరిధిలో గల భటగుడ గ్రామంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని దిలీప్ లెహర (24)గా గుర్తించారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. భటగుడ గ్రామంలో మెగా తాగునీటి ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పనులను చేసేందుకు కాంట్రాక్టర్ వద్ద పనిచేసేందుకు లంజిఘట్కు చెందిన కొందరు కూలీలు ఇక్కడకు వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అంతా భోజనాలు చేసి పడుకునే సమయంలో ఒకే గదిలో దిలీప్ లెహర, కునాల్ లెహరలతొ పాటు లలిత్ మాఝిలు ఉన్నారు. వారిలో ఏదో విషయమై వాగ్వాదాలు కొనసాగాయి. దీంతొ కునాల్ అనే యువకుడు కోపోద్రిక్తుడై ఒక గొడ్డలి సాయంతో దిలీప్పై దాడి చేశాడు. అడ్డుకున్న లలిత్ను కూడా గాయపరిచాడు. తీవ్రగాయాలకు గురైన దిలీప్ సంఘటన స్థలం వద్దే మృతి చెందగా తీవ్ర గాయాలతో లలిత్ బయటపడ్డాడు. తోటి కూలీలు అక్కడ జరిగిన ఘటనను తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం హత్య చేసిన కునాల్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కునాల్లు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకాశ్ పడియామీకి ఘన స్వాగతం
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కొయా తెగకు చెందిన ఆదివాసి యువకుడు ఆకాశ్ పడియామీ అంధుల ఫుట్బాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాడు. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 4 వరకు కేరళలో జరిగింది. అంతర్జాతీయ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలో భారత్ తరఫున ఈ గిరిజన యువకుడు ఆడాడు. మొత్తం ఆరు దేశాలు పాల్గొన్న పోటీల్లో పాల్గొన్నాడు. మంగళవారం స్వస్థలం అయిన మల్కన్గిరి చేరుకున్న ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఆకాశ్ తన సొంత ఊరు అయిన గోరఖుంటా పంచాయతీ కృష్ణవార్డ్కు వెళ్లారు. అక్కడ ఆదివాసీలు నృత్యాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్ పదియే కబాసీ, మాజీ సర్పంచ్ ఎరా పడియామీ, సమితి సభ్యులు దేవే మాడీ, అడమా మాడీ, సోమా మడ్కమి, సామాజిక కార్యకర్త దుర్గా త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి శిశు మహోత్సవం
పర్లాకిమిడి: వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు మన సంస్కృతి, ఆటలు, పాటలు మరిచిపోకుండా ఏటా నిర్వహిస్తున్న శిశు మహోత్సవాన్ని స్థానిక బిజూ కల్యాణ మండపంలో జిల్లా శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ శిశు మహోత్సవం మహాక్, ఉత్సాహ్ పేరిట నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఫాల్గుణీ మఝి విచ్చేసి ప్రారంభించగా, ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ, సీడబ్ల్యూసీ చైర్మన్ అశ్వినీ మహాపాత్రో, జిల్లా శిశు సంరక్షణ అఽధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ బాలాశ్రమాలు, అనాథాశ్రమంలో వుంటూ చదువుకుంటున్న విద్యార్థులు కూడా పలు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తంగా రోజంతా 22 పోటీలను నిర్వహించారు. విజేతలకు ఏడీఎం మఝి బహుమతులను అందజేశారు. వీరిని రాష్ట్రస్థాయికి పంపిస్తామని డీసీపీయూ అరుణ్ కుమార్ త్రిపాఠి తెలియజేశారు. -
తప్పుడు సమాచారం తగదు: సీఈఓ
ఓటర్ల జాబితా సవరణలో.. భువనేశ్వర్: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)–2026 ప్రక్రియలో తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారంపై అనుబంధ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్. ఎస్. గోపాలన్ తెలిపారు. ఎస్ఐఆర్ – 2026 సన్నాహాల్లో భాగంగా ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి ఆర్ఎస్ గోపాలన్ అధ్యక్షతన ఆన్లైన్ వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సీఈఓ కార్యాలయం నుండి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా సమాచార, ప్రజా సంబంధాల అధికారులు, మీడియా నోడల్ అధికారులు, సోషల్ మీడియా నోడల్ అధికారులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా గోపాలన్ ఎస్ఐఆర్ చొరవ లక్ష్యాలు, ప్రాముఖ్యతను అనుబంధ యంత్రాంగానికి వివరించారు. ఈ ప్రక్రియలో స్పష్టత, పారదర్శకతను నిర్ధారించేందుకు సమన్వయంతో కూడిన ప్రయత్నాలకు పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం ఈసీఐ నిష్పాక్షికంగా, అంకిత భావంతో పని చేయడంతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. ఆ ఖ్యాతిని నిలబెట్టుకోవడానికి, తప్పుడు, తప్పుదారి పట్టించే సమాచారాన్ని సమర్థంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యమని సీఈఓ అన్నారు. అర్హులైన ఏ ఓటరు పేరును జాబితా నుంచి తొలగించకూడదు. అనర్హుల పేర్లను చేర్చకూడదని ఆయన పునరుద్ఘాటించారు. డిప్యూటీ సీఈఓ లక్ష్మీ ప్రసాద్ సాహు బీహార్ నుండి ఉదాహరణలను ఉటంకిస్తూ సవరణ ప్రక్రియలోని కీలక అంశాలను ప్రస్తావించారు. బూత్ స్థాయి అధికారుల తప్పులు, నకిలీ జోడింపులు లేదా తప్పు దారి పట్టించే సమాచారాన్ని గుర్తించి తక్షణమే సరిదిద్దాలని అధికారులను కోరారు. అట్టడుగు స్థాయిలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక, డిజిటల్ వేదికల ద్వారా సీఈఓ కార్యాలయం నుండి ధృవీకరించిన సమాచారం, క్రమం తప్పకుండా పత్రికా ప్రకటనలను చురుకుగా వ్యాప్తి చేయాలని ఆయన జిల్లా సమాచారం, ప్రజా సంబంధాల శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రం అంతటా పారదర్శకత, కచ్చితత్వాన్ని కొనసాగించడానికి ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రణాళికబద్ధంగా సకాలంలో అమలు చేయాలని సీఈఓ ఆర్.ఎస్. గోపాలన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను సెప్టెంబర్ 26న ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
సెంచూరియన్ వర్సిటీ ఆధ్వర్యంలో థ్రాంబోసిస్ దినోత్సవం
పర్లాకిమిడి: రాణిపేట గ్రామంలోని ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ థ్రాంబోసిస్ దినోత్సవం సందర్భంగా సెంచూరియన్ వర్సిటీ నర్సింగ్ విద్యార్థులు ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించారు. కాళ్ల రక్తనాళాల్లో గడ్డ కట్టడాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. కొన్నిసార్లు ఇది తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. దీని వల్ల గడ్డలు విరిగిపోయి ఊపిరితిత్తులు లేదా గుండె వంటి అవయవాలకు చేరవచ్చు అని వక్తలు అన్నారు. కార్యక్రమం ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా, డీఎస్పీ అమితా పండా సహకారంతో జరిగింది. శిబిరంలో పోలీసు సిబ్బందికి ఽథ్రాంబోసిస్ నివారణ కోసం కాలి వ్యాయామాల ప్రదర్శన నిర్వహించారు. 30 మంది పోలీసు సిబ్బందికి రక్తపోటు, బాడీ మస్ ఇంటెక్స్, ఎత్తు, బరువు వంటి పరీక్షలు కూడా నిర్వహించారు. సెంచూరియన్ వర్సిటీ రిజిస్ట్రార్ అనితా పాత్రో, డైరక్టర్ (అడ్మిన్) డాక్టర్ దుర్గాప్రసాద్ పాఢి, డాక్టర్ ఎస్పీ నందా, నర్శింగ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు వడ్డీ రహిత కారు రుణం
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం ‘అమొ సువాహక యోజన’ కింద మహిళల స్వయం సమృద్ధి సాధనకు కారు కొనుగోలుకు సహాయం చేయనుంది. నాలుగేళ్లలో కారు కొనడానికి అంచెలంచెలుగా 1,100 మంది మహిళలకు ఈ సౌలభ్యం కల్పిస్తుంది. మొదటి సంవత్సరంలో 200 మంది మహిళలు, రెండో సంవత్సరంలో 250 మంది, మూడో సంవత్సరంలో 300 మంది, నాల్గో సంవత్సరంలో 350 మంది మహిళలు ప్రయోజనం పొందుతారు. వీరిలో ఒక్కొక్కరికి రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ప్రభుత్వం అందజేస్తుంది. ఈ వ్యయ ప్రణాళిక అంచనా రూ. 46.66 కోట్లు. ఈ సదుపాయం పొందిన మహిళలు కారును టాక్సీలుగా వినియోగించాల్సి ఉంటుంది. వారు ఐదేళ్ల నిడివిలో సమాన వాయిదాలలో ప్రధాన రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడం నిబంధన. రుణ మొత్తంపై 11 శాతం వార్షిక వడ్డీ రేటుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా చెల్లిస్తుంది. వాణిజ్యం, రవాణా శాఖ ప్రతిపాదించిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు పరిమితమైన 21 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని రాష్ట్ర వాణిజ్య, రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా మంగళ వారం తెలిపారు. డిసెంబర్ 2023లో ప్రారంభించిన సువాహక్ చొరవ విస్తరణగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని నాలుగు డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లలో శిక్షణ పొందిన 6,000 మందికి పైగా మహిళలకు ఈ పథకం కింద ప్రోత్సాహం లభిస్తుంది. రాగల 4 ఆర్థిక సంవత్సరాల్లో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కోసం సహాయపడటం ఈ పథకం లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ బస్సులు నడపడంలో నిమగ్నమై ఉన్న మహిళలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు సుభద్ర లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడానికి, విద్యుత్ వాహనాలను (ఈవీ) ఎంచుకునే మహిళలకు రాష్ట్ర ఈవీ విధానానికి అనుగుణంగా రూ. 2 లక్షల ప్రోత్సాహకం లభిస్తుంది. రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి మినహాయింపులు లభిస్తాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి సడక్ సురక్ష మౌళిక అభివృద్ధి యోజన కింద బడ్జెట్ కేటాయింపుల నుంచి నిధులు సర్దుబాటు చేసే యోచన ఉన్నట్లు తెలిపారు. -
తరలిపోతున్న రుతు పవనాలు
భువనేశ్వర్: రాష్ట్రం నుంచి రుతు పవనాలు క్రమంగా వెడలిపోతున్నాయి. పశ్చిమ, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో పలు జిల్లాల నుంచి రుతు పవనాలు తరలిపోయాయి. ఝార్సుగుడ, సుందర్గఢ్, బర్గఢ్, కెంజొహర్, మయూర్భంజ్ జిల్లాల నుంచి రుతుపవనాలు మంగళవారం తరలిపోయినట్లు వాతావరణ శాఖ సమాచారం. మనేంగులు గ్రామాన్ని పంచాయతీగా గుర్తించాలి రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి పుటాసింగి పంచాయతీలో ఉన్న మనేంగులు గ్రామాన్ని పంచాయతీగా గుర్తించాలని 12 గ్రామాలకు చెందిన ప్రతినిధులు సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. పుటాసింగి పంచాయతీ పరిధి కుభులంసి, గాయులంగి, గుణుడురుబ, పొడలకిపాయి, రుడిసిన్, ఆబాసి, లింగియార్, జంగ్జంగ్, బాసేంగొగొరొజాంగొ, సొలాడంసి, లయిబ గ్రామాల ప్రజలు పంచాయతీ కేంద్రానికి చేరుకోవాలంటే 15 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. అందువల్ల మనేంగులు గ్రామాన్ని పంచాయతీగా గుర్తించగలిగితే తాము ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కుతామని వివరించారు. అదేవిధంగా గ్రామాలు కూడా అభివృద్ధి చెంది మౌలిక సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు. డాక్టర్ తిరుపతి పాణిగ్రాహికి ఐసీఎఫ్ఏఐ జీవన సాఫల్య పురస్కారం భువనేశ్వర్: హైటెక్ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహికి ఐసీఎఫ్ఏఐ విశ్వవిద్యాల యం జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చే సింది. సిక్కిం గ్యాంగ్టక్లోని ఇనిస్టి్ూట్యట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్టిస్ ఆఫ్ ఇండి యా (ఐసీఎఫ్ఏఐ) విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం, సిక్కిం 50వ వార్షికోత్సవం పురస్కరించుకుని హై టెక్ గ్రూప్ వ్యవస్థాపకు డు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహికి ఈ పురస్కా రం ప్రదానం చేయడం విశేషం. ఒడిశాలో వి ద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక పరివర్తనకు, జీవితకాల అంకితభావానికి గాను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నట్లు ఐసీఎఫ్ఏఐ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ తెలిపా రు. ఈ సందర్భంగా భారత దేశంలోని అనేక మంది ప్రముఖులను సత్కరించనున్నారు. అన్నని హత్య చేసిన తమ్ముడు అరెస్టు కొరాపుట్: అన్నని హత్య చేసిన తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్ర పోలీస్స్టేషన్ ఒక ప్రకటనలో ఈ వివరాలు ప్రకటించింది. ఈనెల 11వ తేదీన సింధిగుడ గ్రామంలో ధనుర్జయ హరిజన్ (40)ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని అతని సోదరుడు రాజు హరిజన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు గ్రామంలో పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. దీంతో మృతుడి మరో తమ్ముడు మఖర హరిజన్ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ధనుర్జయ ముఖంకి వస్త్రం కప్పి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు తేలింది. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరం అంగీకరించాడు. నిందితుడు మఖర్ హరిజన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. -
మెరుపుల సమయంలో గ్రానైట్ బ్లాస్టింగ్లు వద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో గ్రానైట్ బ్లాస్టింగ్ చేయకూడదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. గ్రానైట్ యాజమాన్యాలతో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రానైట్ ఇండస్ట్రీలో భద్రత, రక్షణ ముఖ్యమన్నారు. కార్మికుల భవిష్యత్కు భరోసాగా గ్రూపు ఇన్సూరెన్సు ఉండాలన్నారు. బ్లాస్టింగ్ చేసే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు. గ్రానైట్ ఇండస్ట్రీస్పై ట్రైనింగ్ సెంటర్కు భూమి కేటాయిస్తానన్నారు. ఈఎస్ఐలో ఉంటే అంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ దినేష్ కలెక్టర్కు వివరించారు. ఈఎస్ఐ పెట్టుకునేందుకు డిసెంబర్ 31 వరకు సమయం ఉన్నట్టు చెప్పారు. గ్రానైట్ కార్మికుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు 10 సెంట్లు భూమి కావాలని గ్రానైట్ అసోసియేషన్ కోరగా భూమి ఇవ్వాలని టెక్కలి ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. లైసెన్సులు లేని క్రషర్స్ ఉంటే ఆపివేయాలన్నారు. వాతావరణ కేంద్రం జారీ చేసిన వాతావరణ పరిస్థితుల ఆధారంగా తక్షణమే సైరన్ వేయాలని చెప్పారు. భూ గర్భ గనుల శాఖ ఉప సంచాలకులు మోహనరావు మాట్లాడుతూ గ్రానైట్ కార్మికులకు కార్మిక శాఖ బీమా కల్పించాలని, అన్ని అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. లైసె న్సు ఉన్న వారితోనే బ్లాస్టింగ్ చేయించాలన్నారు. -
గంజాయితో పట్టుబడిన కంటైనర్
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి లావణ్యగడ వద్ద మంగళవారం ఎకై ్సజ్ శాఖ ఒక కంటైనర్లో సోదాలు చేయగా, అందులో గంజాయి ప్యాకెట్లు బయటపడినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమార్ పటేల్ తెలియజేశారు. వెంటనే కంటైనర్ డ్రైవర్, హెల్పర్ పారిపోగా.. అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిలో జిరంగో గ్రామానికి చెందిన సుమేష్ లిమ్మా, ఆర్.ఉదయగిరికి చెందిన జోథామ్ లిమ్మా ఉన్నారు. ఈ పార్శిల్ కంటైనర్ హర్యానా రాష్ట్రం నుంచి వస్తువులు జిల్లాకు చేరవేసి, తిరిగి వెళ్లే సమయంలో గంజాయిని తరలిస్తున్న వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం దాడులు చేసి పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 41.5 క్వింటాళ్లు ఉండగా.. దీని విలువ సుమారు రూ.45 లక్షలు ఉంటుందని వెల్లడించారు. గజపతి జిల్లా ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగినట్లు ఎకై ్సజ్ అధికారి కె.బాలాజీరావు తెలిపారు. దాడుల్లో విజయకుమార్ మల్లిక్, నీలాంబర నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి ఔదార్యం
రాయగడ: రోడ్డుపై తనకు దొరికిన 11 గ్రాముల బంగారాన్ని పోలీసు అధికారి సమక్షంలో బంగారం పోగొట్టుకున్న వ్యక్తికి ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు ఒక యువకుడు. స్థానిక రింగ్ రోడ్డు సమీపంలో గల మంగళామందిరం వద్ద నివసిస్తున్న ఎం.రమేష్ అనే యువకుడు రహదారిలో నడుస్తున్న సమయంలో బంగారం దొరికింది. దీంతో అతడు సరాసరి పోలీస్ స్టేషన్కు వెళ్లి తనకు దొరికిన బంగారం గురించి చెప్పాడు. ఇదిలాఉండగా గత ఆదివారం నాడు సుమంత్ మహారాణ అనే పాత్రికేయుడు తాను ఖరీదు చేసిన 11 గ్రాముల బంగారం ఇంటికి తీసుకువస్తుండగా ఎక్కడో పడిపోయిందని ఫిర్యాదు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఐఐసీ ప్రసన్న కుమార్ బెహరా అన్ని ఆధారాలు పరిశీలించిన మీదట బంగారం పోగొట్టుకున్న సుమంత్ని పోలీస్ స్టేషన్కు పిలిపించి మంగళవారం రమేష్ సమక్షంలో బంగారాన్ని తిరిగి ఇచ్చారు. ఈ సందర్భంగా రమేష్ను పోలీసులు అభినందించారు. చిత్రకూట్ జలపాతం సందర్శన కొరాపుట్: ఇండియా నయాగార జలపాతంగా పేరుపొందిన చిత్ర కూట్ జలపాతాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క సందర్శించారు. మంగళ వారం సమీప ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ ప్రాంతంలో ఉన్న చిత్రకూట్ జలపాతాల అందాలను తిలకించారు. తాను గతంలో విన్నట్లు ఇది ఇండియా నయాగరా జలపాతమఅని అభివర్ణించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిశీలన కోసం ఏఐసీసీ ఆదేశంతో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో బస్తర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కుంకుమ పూజలు జయపురం: స్థానిక రాజనర్ కూడలి వద్ద గజలక్ష్మీ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం గజలక్ష్మీ దేవికి కుంకుమార్చనలు నిర్వహించారు. వేద పండితులు కృష్ణచంద్ర దాస్ మహిళలతో పూజలు జరిపించారు. పూజా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొట్లాట ఘటనలో జరిమానా వజ్రపుకొత్తూరు రూరల్: ఒంకులూరు గ్రామంలో 2016లో ఇరు వర్గాల మధ్య జరిగిన కొట్లాట ఘటనపై అదే గ్రామానికి చెందిన బడే సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై పలాస సివిల్ జ్యుడీషియల్ కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. ఈ మేరకు ముద్దాయిలైన దాసరి ధనలక్ష్మీ, సండుపల్లి సావిత్రిలకు రూ.1000 జరిమానా విధించింది. జరిమాన కట్టకపోతే 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు కోర్టు తీర్పు విధించింది. ప్రధాన నిందుతుడు దాసరి ప్రదీప్పై తీర్పు పెండింగ్లో ఉన్నట్లు ఎస్సై బి.నీహర్ తెలిపారు. -
క్యాపిటల్ ఠాణా ముట్టడి
దారి పొడవునా స్తంభించిన వాహనాలుభువనేశ్వర్: స్మార్ట్ సిటీ ఆన్లైన్ ఆటో డ్రైవర్ల సంఘం మంగళ వారం క్యాపిటల్ ఠాణాను చుట్టుముట్టింది. ఠాణా ముందు ఆటోలు దారి పొడవునా బారులు తీరాయి. రాజ్మహల్ కూడలి నుంచి ఏజీ చౌక్ వరకు రవాణా స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రోజుల కిందట ఆన్లైన్ స్మార్ట్ సిటీ ఆటో డ్రైవర్ల సంఘం సభ్యుడిని స్టేషన్ ఆటో డ్రైవర్ల సంఘం నుంచి కొంత మంది సభ్యులు కొట్టినట్లు ఆరోపణ. ఈ ఆరోపణ కింద సోమవారం క్యాపిటల్ ఠాణా పోలీసులు ఇరు వర్గాల సభ్యులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు దోషులను అరెస్టు చేయకుండా అమాయకులను అరెస్టు చేశారని ఆన్లైన్ స్మార్ట్ సిటీ ఆటో డ్రైవర్ల సంఘం మంగళవారం విజృంభించి ఠాణా ముట్టడికి పాల్పడ్డారు. -
నష్టపరిహారం చెల్లించాలని రాస్తారోకో
రాయగడ: జిల్లాలోని రామనగుడ సమితి పాలుపాయి వద్ద సోమవారం నాడు ట్యాంకర్, బైకు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో మృతి చెందిన ఇద్దరు యువకుల కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రామనగుడ ప్రధాన రహదారి వద్ద మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాయగడ, గుణుపూర్, బరంపురం ప్రాంతాలకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న రామనగుడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులతో చర్చించారు. వారు అంగీకరించకపోవడంతో గుణుపూర్ ఎస్డీపీఓ బబులా నాయక్, బీడీఓ ప్రద్యుమ్న మండల్, తహసీల్దార్ ప్రాణకృష్ణ పాణిగ్రహి, ఐఐసీ సునీత బెహర తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించేందుకు ప్రయత్నించారు. కానీ సుమారు నాలుగు గంటల సమయం వరకు పరిస్థితి అదుపులోకి రాలేదు. అనంతరం బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో పరిస్థితి కుదుటపడింది. -
శ్రీ మందిరం భద్రతా ఉప కమిటీ సమావేశం
● త్వరలో వాకీ టాకీ వ్యవస్థ– మొబైల్ ఫోన్లు పూర్తిగా నిషేధం భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరం భద్రతా వ్యవస్థ పటిష్టపరిచే దిశలో కదలిక ఆరంభమైంది. శ్రీ మందిరంలోనికి మొబైల్ ఫోన్లు పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. భద్రత ఉప కమిటీ ప్రముఖుడు గిరీష్ చంద్ర ముర్ము అధ్యక్షతన నీలాద్రి భక్త నివాసంలో మంగళవారం ప్రత్యేక సమావేశం జరిగింది. పూరీ జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్, సీనియర్ అధికారులు, సేవాయతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో భక్తులకు సురక్షిత దర్శనం మరియు శ్రీ మందిరం భద్రతపై ప్రధానంగా చర్చించారు. శ్రీ మందిరంలో వాకీ టాకీ వ్యవస్థ అమలు అవుతుంది. శ్రీ మందిరంలో మొబైల్ ఫోన్లు పూర్తిగా నిషేధించబడతాయి. పోలీసులు, సేవా సిబ్బంది కూడా ఫోన్లు తీసుకెళ్లలేరని సమావేశం తర్వాత భద్రతా ఉప కమిటీ అధ్యక్షుడు గిరీష్ ముర్ము తెలిపారు. ఆలయ అంతర్గత మరియు బాహ్య భద్రతపై చర్చించినట్లు తెలియజేశారు. ఇతర దేవాలయాల భద్రత వ్యవస్థను పరిశీలించిన తర్వాత శ్రీ మందిరం భద్రత వ్యవస్థని పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
నందిగాం: మండల పరిధిలోని కవిటి అగ్రహరం వద్ద రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పలాస రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పలాస మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వయసు 35 ఏళ్లు ఉంటుందని, ఎడమ చేతిపై ఇంగ్లిష్లో సుశాంత అని పచ్చబొట్టు ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ పోలీసులను సంప్రదించాలన్నారు. పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య పాతపట్నం: గంగువాడ గ్రామానికి చెందిన రావలవలస ధర్మారావు(52) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారావు ఈ నెల 12న మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య నిలదీసింది. దీంతో మనస్తాపం చెందిన ధర్మారావు పంట పొలాలకు కొట్టే పురుగుల మందును తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో అనుబంధ విభాగాల నియామకం త్వరితగతిన చేపట్టాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్సీ, పాతపట్నం నియోజకవర్గ పరిశీలకుడు పాలవలస విక్రాంత్, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల పరిశీలకుడు కరిమి రాజేశ్వరరావు, ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిశీలకుడు దుంపల లక్ష్మణరావు, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల పరిశీలకుడు శాడి శ్యాంప్రసాద్రెడ్డి కోరారు. తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో నాయకులను, పార్టీ కార్యకర్తల్ని సమన్వయపరచాలని కోరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. రెవెన్యూ సేవల్లో వేగం పెంచాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మం దాకా చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్డీసీ, కేఆర్ఆర్సీ, పీజీఆర్ఎస్ వంటి రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు, కోర్టు కేసులు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ నెల 18లోగా ఈ పంట వివరా ల నమోదు ప్రక్రియ నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో లక్ష్యాన్ని చేరుకున్న లావేరు మండల బృందాన్ని అభినందించారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద 11 గ్రామాలు ఎంపికయ్యాయని వాటిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన వాహనాల గురించి ఆరా తీశారు. వారంలోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలను డిమాండ్ ఉన్న చోట్ల ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ చెప్పారు. చికిత్స పొందుతూ మహిళ మృతి నందిగాం: నర్సిపురం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందింది. ఆదివారం రాత్రి ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. వీరిని 108 వాహనం, నేషనల్ హైవే అంబులెన్స్లలో టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అందులో ఐదుగురిని మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పిట్ట రాధమ్మ(60) మంగళవారం మృతి చెందింది. ఈమె స్వస్థలం ఇచ్ఛాపురం మండలం ధర్మపురం. ఒడిశా రాష్ట్రం రాయగడలో మజ్జి గౌరమ్మని దర్శనం చేసుకొని తిరిగి గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ‘ఎదుగుదల ఓర్వలేకే నిందలు’ ఇచ్ఛాపురం: రాజకీయంగా తన ఎదుగుదల చూడలేకే కొంతమంది కూటమి నేతల సహకారంతో వ్యక్తిగతంగా నిందారోపణలు చేస్తున్నారని ఇచ్ఛాపురం జనసేనపార్టీ ఇన్చార్జి దాసరి రాజు అన్నారు. మంగళవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు, మామయ్యకు మధ్య పెనుగులాట మాత్రమే జరిగిందని, తాను ఎవరిపైనా దాడిచేయలేదని స్పష్టం చేశారు. -
రోడ్డు పనులు పూర్తి చేయండి
జయపురం: స్థానిక మహాత్మా గాంధీ రోడ్డు(ఎం.జి.రోడ్డు) పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జయపురం మునిసిపాలిటీ కౌన్సిలర్లు జయపురం రోడ్డు భవన విభాగ సూపరింటెండెంట్ ఇంజినీర్ ప్రియదర్శి బెహరాను మంగళవారం కలిసి విజ్ఞప్తి చేశారు. మునిసిపాలిటీ ఉపాధ్యక్షురాలు బి.సునీత నేతృత్వంలో బీజేడీ కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. పట్టణంలో ప్రధాన మార్గంలో ఒకటైన ఎం.జి రోడ్డు పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది నవరంబర్ 14వ తేదీన అధికారుల నిర్ణయం మేరకు మునిసిపాలిటీ 40 అడుగుల రోడ్డు ఏర్పాటు కోసం రెండు వైపులా ఆక్రమణలను తొలగించటం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం ఆర్అండ్బీ విభాగం టెండర్ పిలిచి కంట్రాక్టర్కు పనులు ఇచ్చిందన్నారు. డ్రైన్ పనులు చేపట్టారని, ఇంతవరకు 90 శాతం డ్రైన్ పనులు పూర్తయ్యాయన్నారు. రోడ్డు పనులు నేటికీ చేపట్టలేదని, రోడ్డు మధ్యన ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించలేదన్నారు. డ్రైన్ పనులు పూర్తికాకపోవటం వలన రోడ్డుపైనే నీరు ప్రవహిస్తోందన్నారు.విద్యుత్ స్తంభాల నుంచి లైట్లు తీసివేయటం వలన వెల్కమ్ జంక్షన్ నుంచి కమళా మెడికల్ వరకు అంధకారంగా ఉందన్నారు. వెంటనే రోడ్డు పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లు బి.విష్ణువర్దన్ రెడ్డి, జస్పాల్ సింగ్, శశిరేఖ పొరజ, తదితరులు పాల్గొన్నారు. -
● నేషనల్ యూత్ వలంటీర్లగా పనిచేసేందుకు ఆహ్వానం ● ఎంపికై తే పారితోషికం ● దరఖాస్తులకు నేడే ఆఖరు తేది
శ్రీకాకుళం న్యూకాలనీ: సమాజంలో కోసం ఏదైనా మంచి పని చేయాలని ఉందా ? సేవా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆసక్తి ఉందా ? అయితే కేంద్ర ప్రభుత్వం మీకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. నేషనల్ యూత్ వలంటీర్గా సమాజ సేవ చేసేందుకు ఆసక్తి గల యువత నుంచి దరఖాస్తులను ఆహానిస్తోంది. ఒకవైపు సేవ చేస్తూనే మరోవైపు ప్రతినెలా పారితోషికాన్ని పొందవచ్చు.అక్టోబర్ 15లోగా ‘ఎన్వైకెఎస్.ఎన్ఐసీ.ఇన్’ వెబ్పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానం ఇలా.. దరఖాస్తుదారులకు శ్రీకాకుళం జిల్లాలోని మేరా యువభారత్ (నెహ్రూ యువకేంద్రం) కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థుల వయస్సు అక్టోబర్ ఒకటి నాటికి 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం పదో తరగతి ఉత్తీర్ణత కలిగినవారు అర్హులు. డిగ్రీ అర్హతను కలిగి కంప్యూటర్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, ఈ–బ్యాంకింగ్, డిజిటల్ వంటి వివిధ యాప్లలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. మై భారత్ అనుబంధ యువజన సంఘాల సభ్యులు, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వివరాలకు 08942–222028, 9133095646 నంబర్లను సంప్రదించవచ్చు. ఎంపికై తే స్టైఫండ్ ఇలా.. వలంటీరుగా ఎంపికై నవారు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికై నవారికి నెలకు రూ.5వేల స్టైఫండ్ చెల్లిస్తారు. విధులు ఇలా.. వలంటీర్లకు ప్రత్యేకంగా బ్లాకులను కేటాయిస్తారు. రెండు మండలాలను కలిపి ఒక బ్లాక్గా గుర్తిస్తారు. వలంటీర్లు యువజన, మహిళా సంఘాలను స్థాపించడం, సంఘాలను సమన్వయం చేసుకుని క్రీడలు, ఆరోగ్యం, అక్షరాస్యత, పారిశుద్ధ్యం, పచ్చదనం–పరిశుభ్రత, మహిళా సాధికారిత, లింగవివక్ష, ఇతర సామాజిక అంశాలపై ప్రజలను చైతన్యపరచడం, తదితర అంశాలో ప్రగతి సాధన కోసం పనిచేయాల్సి ఉంటుంది. సమాజ సేవ చేయాలన్న ఆసక్తి కలిగినవారు మాత్రమే దరఖాస్తులు చేయండి. ఎంపికై నవారు తమకు అప్పగించిన బ్లాకుల్లో సామాజిక, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. బుధవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలి. – కె.వెంకట్ ఉజ్వల్, మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీకాకుళం -
మూఢ నమ్మకాలతో అరాచకాలు సృష్టిస్తే చర్యలు
కొరాపుట్: మూఢ నమ్మకాలతో సమాజంలో సాటి వ్యక్తులను హింసిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాడువా పోలీసులు ప్రకటించారు. మంగళవారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలో పంతుంగ్ గ్రామ పంచాయతీ మారిపుట్ గ్రామ ప్రజలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ గ్రామంలో లక్ష్మణ్ కిలో కుటుంబం చేతబడి చేస్తుందనే నెపంతో అతని సోదరుని కుమారులు దాడులు చేశారు. లక్ష్మణ్ ఇంటిపై దాడి చేసి పెంపుడు జంతువులైన కుక్కలు, మేకలు, కోళ్లును హింసించి చంపారు. ఆ ఇంట్లో ఉన్న పసి పిల్లలతో సహా 14 మందిని కొట్టి గ్రామం నుంచి వెలివేశారు. బాధితులు సమీప గ్రామంలో తల దాచుకున్నారు. ఈ ఘటనపై ఐఐసీ ఆశోక్ బిశోయి గ్రామస్తులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇటువంటి ఘటనలను చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇతర శాఖల సిబ్బందితో కలిసి నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. అనంతరం బాధిత కుటుంబానికి గట్టి భద్రత మీద తిరిగి వారి స్వగృహాలకు తెచ్చి వదలిపెట్టారు. గ్రామస్తులతో భవిష్యత్లో ఇటువంటి పనులకు పాల్పడబోమని ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గ్రామ ప్రజలకు అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు -
కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొస్తాం
● డీసీసీ అధ్యక్షుడు అప్పలస్వామి కడ్రకరాయగడ: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షుడు, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో డీసీసీ అధ్యక్షునిగా నియమితులైన ఆయనకు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్కు జిల్లాలో ఎంతగానో ఆదరించారని, దీని ఫలితంగానే జిల్లాలోని మూడు శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగలిగారన్నారు. అదేవిధంగా కొరాపుట్ లోక్సభ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కై వసం చేసుకుందని పేర్కొన్నారు. భవిష్యత్లో పార్టీ మరింత బలం పుంజుకునేందుకు తాను కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు డీసీసీ పదవిని ఇచ్చిందన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసి అందరి సహకారంతో ముందుకు నడిపిస్తానని వెల్లడించారు. అనంతరం లోక్సభ ఎంపీ సప్తగిరి ఉలక మాట్లాడుతూ.. పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకుల సలహాలు తీసుకొని పార్టీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కార్యకర్తలంతా సమష్టిగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుణుపుర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, సీనియర్ నాయకురాలు రత్నమణి ఉలక తదితరులు పాల్గొన్నారు. -
భరతజాతి ముద్దుబిడ్డ అంబేడ్కర్
సరుబుజ్జిలి: భరతజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ, రాజ్యాంగా సృష్టికర్త డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని మాజీ స్పీకర్, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. పాలవలసలో ఏర్పాటుచేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అనంతరం దంతపురి బౌధ్దక్షేత్రంలో 69వ దమ్మదీక్ష దినోత్సవ బౌద్ధ సమ్మేళనంలో స్పీకర్ పాల్గొన్నారు. బుద్ధుడి ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ ఇండియన్ మిషన్ రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్షులు కంఠ వేణు, తైక్వాండో శ్రీను, పీఎస్ఎన్ మూర్తి, కె.కె.రాజా, బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షుడు హరిబాబు, సామాజిక పోరాట సమితి అధ్యక్షుడు కల్లేపల్లి రాంగోపాల్, గొల్లపల్లి సురేష్, యడ్ల ఈశ్వరరావు, అదపాక గౌరినాయుడు, ఇల్లాకుల సూర్యప్రకాశరావు, కొంచాడ సూర్యనారాయణ,గొల్లపల్లి నందేష్,, బొత్స వెంకటరమణ పాల్గొన్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
జయపురం: జయపురం సమితి స్థాయి శిశు మహోత్సవం సురభి–2025 కార్యక్రమం స్థానిక జయనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని హెచ్ఎం మీనతి పట్నాయక్, ప్రారంభించారు. జయనగర్ ఎస్.ఎస్ ప్రభుత్వ పాఠశాల, సునారి సాహి ఉన్నత పాఠశాల విద్యార్థులు సంగీతం, నృత్యంతో అలరించారు. సీఆర్సీసీ విజయలక్ష్మీ స్వై పర్యవేక్షణలో ప్రథమ శ్రేణి నుంచి పదో శ్రేణి విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, చిత్ర లేఖన, నృత్య, సంగీత, హస్తాక్షర, క్విజ్, తదితర పోటీలను సీనియర్, జూనియర్ విభాగల్లో నిర్వహించారు. సీనియర్లు, జూనియర్లకు 26 పోటీలు నిర్వహించగా 180 మంది పాల్గొన్నారు. ఉత్తమ విజేతలుగా 25 మంది ఎంపికయ్యారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి చందన కుమార్ నాయక్, అదనపు విద్యాధికారి కె.గోపాల్, బీఈఓ కార్యాలయ సెక్షన్ అధికారి శశిభూషణ దాస్, జయపురం ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు దేవీ ప్రసాద్ దాస్, సీఆర్సీసీ రుద్ర ప్రసాద్ పాణిగ్రహి, రామేశ్వర పండా పాల్గొన్నారు. -
‘కిరణ్’తో అక్షర జ్ఞానం
జయపురం: ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లో నిరక్ష్యరాస్యత ఎక్కువగా ఉంది. బడి మెట్లు ఎక్కని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. పశువులు కాయటం, అటవీ ఉత్పత్తులు సేకరణలో జీవితాలను గడుపటం పరిపాటి. అటువంటి పిల్లలకు అక్షర జ్ఞానం కల్పించేందుకు గోపబందు సేవా పరిషత్ అనే స్వచ్ఛంద సంస్థ నడుం బిగించింది. ఆదివాసీలలో నిరక్ష్యరాస్యతను రూపుమాపేందుకు ఆ సంస్థ ఉద్యమిస్తోంది. జిల్లాలో అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితిలో గోపబందు సేవా పరిషత్ ‘కిరణ్’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఆ సంస్థ కార్యకర్తలు మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు, డ్రాపౌట్ విద్యార్థులకు చదువు చెబుతున్నారు. ఆ సమితిలో డుమునిజోల, గొయల్జొడి, చిలిమల, పొటైపొదర్, సిలిమాల గ్రామాల్లోని 15 ఏళ్ల లోపు పిల్లలకు చదువు చెప్పే కార్యక్రమం చేపట్టారు. ఇంతవరకు 120 మంది పిల్లలకు చదువు చెబుతున్నామని గోపబందు సేవా పరిషత్ సభ్యులు తెలిపారు. కోటపొడ పంచాయతీ డుమునిజొల, చంచల ఖొర, ఉరదబ ఖొర, గొయల్జొడి, దొయితారి ఖిలో గ్రామాల్లో చదువు కునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. గోపబందు సేవా పరిషత్ అధ్యక్షుడు ప్రదీప్ మహరణ మాట్లాడుతూ ఆదివాసీ మారుమూల గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన లేదని, పిల్లల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాస్టల్ సౌకర్యం గురించి వారికి తెలియదన్నారు. మారుమూల దుర్గమ ప్రాంతాల్లో పాఠశాలలు లేకపోవటం వలన చిన్న పిల్లలు చదువుకునే అవకాశాలు లేవని, అందువల్ల కిరణ్ పాఠశాల ద్వారా అటువంటివారికి ఉత్తమ భవిష్యత్ను కల్పించేందుకు తాము నడుంబిగించామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గుంజీ అనుస్థాన్, దీపబందు ఫౌండేషన్లు సహకరిస్తున్నాయన్నారు. పిల్లలకు ఉచిత విద్యాభోదనతోపాటు పాఠ్య పుస్తకాలు, అవసరమైన పరికరాలు సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. విద్యాధికారానికి దూరం అయిన పిల్లలకు విద్యాధికారం కల్పిస్తున్న గోపబందు సేవా పరిషత్ వారి కిరణ్ కార్యక్రమం ప్రశంసనీయమని జిల్లా పరిషత్ సభ్యులు రాజేష్ మహురియ అన్నారు. -
దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియ సమితిలో దొంగతనం కేసులో ఉన్న ఇద్దరు నిందితులను పోడియా ఐఐసీ రామేశ్వర్ ప్రధాన్ సోమవారం అరెస్టు చేశారు. గత ఏడాది కలిమెల సమితి ఉండ్రుకొండ పంచాయతీ అడవి మార్గంలో ఫైనాస్స్ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి కత్తులు చూపి కలెక్షన్ చేసిన నాలుగు లక్షల రూపాయల నగదును దొంగలించారు. కేసు నమోద్ చేసి దర్యాప్తులో ఉంది. ఆదివారం రాత్రి నిందితులు రవి దళపతి, రవీంద్ర దళపతిగా గుర్తించారు. ఈ ఇద్దరు బలిమెల ప్రాంతానికి చెందిన వారు అని తెలుసుకున్న పోడియా పోలీసులు వారిని అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించారు. వీరిపై కేసు నమోదు చేసి వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలిస్తామని ఐఐసీ తెలిపారు. -
కళ్యాణసింగుపూర్లో వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి సమావేశం హాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ అశుతోస్ కులకర్ణి ఆధ్వర్యంలో వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి లక్షయ కుమార్ కెముండో, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిష్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజిని దేవి తదితరులు హాజరయ్యారు. సమితి పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 75 వినతులు కలెక్టర్ దృష్టికి వచ్చాయి. ఇందులో 63 వ్యక్తిగత సమస్యలు కాగా ఎనిమిది గ్రామ సమస్యలుగా గుర్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కులకర్ణి నలుగురికి వైద్య ఖర్చుల నిమిత్త ం రెడ్ క్రాస్ నిధుల నుంచి 60 వేల రుపాయలను మంజూరు చేశారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
చర్యలు తీసుకోరు..?
● ఎచ్చెర్ల సీడీపీవోపై కాంట్రాక్టర్ ఫిర్యాదు ● లంచం అడిగారని ఆరోపణ ● జీసీకి నివేదికలు ఇవ్వని ఐసీడీఎస్ పీడీ ● చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు నివేదికలు ఇవ్వరు..శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎచ్చెర్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ సెంటర్లకు బాలామృతం ప్యాకెట్లు సరఫరా చేసే రవాణా కాంట్రాక్టును పైడి వెంకటరమణ చేస్తున్నాడు. ఈ అగ్రిమెంట్ 2026 మార్చి వరకు ఉంది. ప్రాజెక్టు పరిధిలో 116 అంగన్వాడీ సెంటర్లకు ఈయనే కాంట్రాక్టర్. ప్రభుత్వం రవాణా చార్జీ కింద ఒక్కో ప్యాకెట్కు రూ.5లు చొప్పున చెల్లిస్తోంది. ఇటీవల 14 నెలల బిల్లులు సుమారు రూ.1,75,000లు విడుదలయ్యాయి. వీటిలో ప్యాకెట్కు రూ.0.75 పైసలు వంతున.. అంటే సుమారు రూ.40 వేలు లంచంగా ఇవ్వాలని సీడీపీవో డోల పాపినాయుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. దీంతో వీరిరువురిపై పూర్తి ఆధారాలతో ఈనెల 22న కలెక్టరేట్ గ్రీవెన్స్లో కాంట్రాక్టర్ పైడి వెంకటరమణ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసి 15 రోజులైనా... మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఎచ్చెర్ల చైల్డ్ డవలప్మెంట్ ప్రాజెక్టు అధికారి (సీడీపీవో) డోల పాపినాయుడుపై ఫిర్యాదు వచ్చి 15 రోజులు పూర్తయినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. సీడీపీవో అవినీతిపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తన చాంబర్లో నేరుగా దర్యాప్తు చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పూర్తి నివేదిక వెంటనే అందజేయాలని, అనంతరం ఆయనపై సస్పెన్షన్ వేటు ఉంటుందని ఆ సమావేశంలోనే ఐసీడీఎస్ పీడీకి స్పష్టం చేశారు. అయినా ఇప్పటివరకు ఐసీడీఎస్ పీడీ నివేదికలు జేసీ కార్యాలయానికి ఇంతవరకు అందజేయలేదు. ఒకసారి షోకాజ్ నోటీసుకి సమాధానం తెలిపినా.. దానిపై జేసీ సంతృప్తి చెందలేదు. స్పష్టమైన నివేదిక అందజేయాలని ఆదేశించారు. మరలా ఫిర్యాదు 15 రోజుల ముందు చేసిన ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో వెంకటరమణ మరలా గతవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరలా పీడీ కార్యాలయం నుంచి విచారణకు జేసీ పిలిపించారు. అయితే పీడీ కార్యాలయం వారు జేసీ లేని సమయంలో వెళ్లి, ఆయన లేరని దాటవేస్తున్నారు. వారంలో రోజులుగా జేసీని వారు కలవలేదు. జేసీ ఆదేశాల మేరకు అక్కడ పనిచేస్తున్న సీడీపీవో పాపినాయుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఐసీడీఎస్ పీడీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆయన వీరిద్దరినీ కాపాడుతున్నారని తెలుస్తోంది. వెంకటరమణ చేసిన ఫిర్యాదుపై చర్యలు లేకుండానే ఇటీవల ఐసీడీఎస్ పీడీ కార్యాలయం ఆ సమస్య పరిష్కారమైనట్లు ఎండార్సుమెంట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం గమనార్హం. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని రామనగుడ సమితి గొసాయిగులుముండ పంచాయతీలోని పొలుపాయి గ్రామ మలుపులో సోమవారం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను రామనగుడ పీహెచ్సీకి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులు బైక్పై రేఖాగుడ గ్రామం నుంచి రాయగడ సమితి గుమ్మ గ్రామానికి తమ బంధువుల ఇంటికి వెళుతున్న సమయంలో పొలుపాయి మలుపులో ఎదురుగా వస్తున్న ట్యాంకర్ను అదుపు తప్పి ఢీకొనడంతో పక్కనే గల లోయలోకి పడిపోయారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈపీఎఫ్ పెన్షనర్ల డిమాండ్లు నేరవేర్చాలి
జయపురం: ఈపీఎఫ్ పింఛన్దారుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఆందోళనలు చేస్తామని కార్మిక నేత, సేవా పేపరు మిల్లు కార్మిక సంఘ అద్యక్షులు ప్రమోద్ కుమార్ మహంతి అన్నారు. సోమవారం స్థానిక యాదవ భవనంలో కొరాపుట్ జిల్లా ఈపీఎఫ్ పెన్సనర్ల అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు నళినీకాంత రథో అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈపీఎఫ్ పెన్సన్ దారులకు నెలకు కనీసం తొమ్మిది వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని, ఉచిత వైద్య సేవలు సమకూర్చాలని, డీఏ పెంచాలని ఎన్నో ఆందోళనలు జరుపుతున్నప్పటికీ ప్రయోజనం లేదన్నారు. నవంబర్ 16వ తేదీన దేశ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లలకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు. సమా వేశంలో జిల్లా ఆర్గనైజర్ దుర్గప్రసాద్ దాస్, సభ్యు లు పి.గౌరీశంకరరావు, బసంతరావు, జి.ప్రసాదరా వు, కిశోర్ చంద్రపండా, సువర్ణ బిశాయి, భాస్కర మిశ్ర పాల్గొన్నారు. -
26 వినతుల స్వీకరణ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బలిమెల ఎన్ఏ సీ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. బలిమెల కోరుకొండ పరిసర ప్రాంతాలకు చెందిన గిరిజనులు వినతిపత్రాలు అందించారు. 26 వినతులను అధికారులు స్వీకరించారు. ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ సభరో, ఇతర అధికారులు పాల్గొన్నారు. భువనేశ్వర్: పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును స్థానిక పార్లమెంటు సభ్యురాలు అపరాజిత షడంగి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరివురి మధ్య కొనసాగిన సంభాషణలో భువనేశ్వర్ బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 3వ టెర్మినల్ నిర్మాణం ఆమోదం కోసం ఆయనను అభ్యర్థించారు. భువనేశ్వర్ నుంచి పలు ప్రముఖ ప్రాంతాలకు రాకపోకల కోసం విమానాల అవసరం గురించి ఎంపీ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వీరిరువురి మధ్య సానుకూల చర్చ సాగినట్లు ఎంపీ తెలిపారు. ఈ దిశలో తదుపరి చర్యలు పట్ల శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు. రాయగడ: క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బీజేపీ నాయకుడు యాల్ల కొండబాబు ఆకాంక్షించారు. జిల్లాలోని కొలనారలో సోమవారం కొలనార ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కొండబాబు మాట్లాడుతూ క్రీడాకారులకు ఇటువంటి తరహా పోటీలు వారి ప్రతిభ ను కనబరుచుకునే అవకాశాన్ని కల్పిస్తుంటాయన్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంటులో నాలుగు జట్లు పాల్గొన్నాయి. ప్రతీ జట్టు నాలుగు సార్లు పోటీల్లో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. బీజేపీ నాయకులు చక్రధర్ బిడిక, బిరజా పాత్రో, తదితరులు పాల్గొన్నారు. రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో మూడు రోజులుగా జరుగుతు న్న పవిత్రోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి వారికి ఉదయం సుప్రభా త సేవ, శాత్తుమురై, తీర్ధ గొష్టి, సాయంత్రం పూర్ణాహుతి, తిరువీధి, పవిత్ర విసర్జన కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యు లు ఆధ్వర్యంలో మూడు రోజుల పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. వివాహిత అదృశ్యం శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఒక వివాహిత అదృశ్యమైనట్లు రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు సోమవారం వెల్లడించారు. గార మండలం కళింగపట్నానికి చెందిన సంతోషి(21)కి విజయవాడకు చెందిన భక్తుల వెంకటేశ్వరరావుతో నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. తరచూ ఫోన్లో గడపడంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆరు నెలల క్రితం కళింగపట్నంలోని పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో ఈనెల 8వ తేదీన విజయనగరంలో పండగకు కుమార్తె బయల్దేరడంతో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సులో బస్సు ఎక్కించానని తల్లి వనుము సూరమ్మ తెలిపారు. -
పాఠశాలకు తాళాలు
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్ర సమితి కెరమెటి గ్రామ పంచాయతీ కొంఠపొదర్ ప్రాథమి క పాఠశాలలో ఉపాధ్యాయురాలు గాయత్రీ ధరువ ని మరో గ్రామంలో పాఠశాలకు బదిలీ చేయటాన్ని ఆ గ్రామ వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. వెంట నే ఆమె బదిలీ ఆర్డర్ను రద్దు చేసి ఆమెను వెనక్కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల అభ్యర్థనను అధికారులు పట్టించుకొక పోవడంతో సోమవారం పాఠశాలకు గ్రామస్తులు, పాఠశాల పరిచాలన కమిటీ సభ్యులు కలిసి తాళాలు వేశారు. 6 నెలల కిందట ఉపాధ్యాయురాలు గాయత్రి ధురువను బదిలీ చేశారని వెంటనే ఆమె బదిలీని రద్దు చేయాలని తాము బ్లాక్ విద్యాధికారికి రెండు పర్యాయాలు విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. అలాగనే కొరాపుట్ జిల్లా కలెక్టర్కు రాసిన వినతిని కుంద్ర సమితి బ్లాక్ అదనపు విద్యాధికారి పొపెయి బెహర కు అందజేశామని వెల్లడించారు. గత మే 3వ తేదీ న, జూన్ 6వ తేదీన బ్లాక్ విద్యాధికారికి ఉపాద్యాయురాలు ధరువ మదిలీ రద్దు చేయాలని వినతు లు అందజేశామన్నారు. రెండు నెలల్లో సమస్య పరిస్కరిస్తామని బీఈఓ హామీ ఇచ్చారని, ఆమె బదిలీ అయ్యి 6 నెలలు గడచినా నేటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. మరో మార్గంలేక పాఠశాలకు తాళాలు వేశామని వెల్లడించారు. ఈ సంఘటనతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయు డు గుప్త చంద్ర భుయ్, బీఈఓకు తెలియజేశారు. తరువాత ఏబీఈఓ పొపెయి బెహరా, సీఆర్సీసీ సంజయ సామంతరాయ్, సమితి ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు త్రినాథ్ పండా, ఉపాధ్యక్షుడు రాకేష్ చంద్రగురు, పాఠశాలకు వచ్చి పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు లభి సాంత, గ్రామస్తులతో చర్చలు జరిపారు. వారం రోజుల్లో ఉపా ధ్యాయురాలుని తిరిగి పాఠశాలకు తీసుకువస్తామ ని హామీ ఇచ్చారు. గ్రామస్తులు ససేమిరా అంటూ పాఠశాల తాళాలు తీసేది లేదంటూ భీష్మించారు. అనంతరం బీఈఓ రఘునాథ్ పంగితో ఫోన్ ద్వారా మాట్లాడించగా ఆయన ఇచ్చిన హామీతో పాఠశాల తాళాలు తీశారు. వారం రోజుల్లో ఉపాధ్యాయురా లు పాఠశాలకు రాకపోతే మరలా తాళాలు పాఠశాలకు వేస్తామని, ఉపాధ్యాయురాలు పాఠశాలకు వచ్చేంత వరకు తాళాలు తీసేది లేదని హెచ్చరించారు. -
విద్యుత్ సమస్యలపై గిరిజనుల ఆందోళన
కొరాపుట్: విద్యుత్ సమస్యలపై గిరిజనులు ఆందో ళనకు దిగారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కేంద్రంలో సోమవారం ఆందోళన చేపట్టి సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. సమితి పరిధిలోని సుంకి, పెట్టురు, అంపావల్లి, గొల్లురు, పొట్టంగి పరిసర గ్రామాల ప్రజలు విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్నారు. లోఓల్టేజీ సమస్య, విద్యుత్ కోత, నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోవడం, వినియోగంతో సంబంధం లేకుండా బిల్లులు అధికంగా వస్తున్నాయంటూ ఆందోళన చేపట్టారు. పెట్టురు వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్శాఖ కార్యాలయం సిబ్బందికి అందజేశారు. ఈ సమస్యలపై 15 రోజుల్లో పరిష్కార చర్యలు ఉంటాయని విద్యుత్ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనుతిరిగారు. -
లారీని ఢీకొన్న టాటా మ్యాజిక్
నందిగాం: మండల పరిధిలోని నర్సిపురం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వ్యాన్ ఢీకొనడంతో వ్యాన్లో ఉన్న తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రా మానికి చెందిన పిట్ట చంద్రశేఖర్తో పాటు మరో 8 మంది టాటా మ్యాజిక్ వ్యాన్లో ఆదివారం ఉదయం ఒడిశా రాష్ట్రంలోని రాయగడలో మజ్జిగౌరి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తిరిగి గ్రామానికి వస్తుండగా ఆదివారం రాత్రి మండల పరిధిలోని నర్సిపురం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టారు. దీంతో వ్యాన్లో ఉన్న 9 మందికి చిన్న, చిన్న గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకొని క్షతగాత్రులను టెక్క లి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ ఇచ్చి న ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధ్యాయునిపై దాడి
రాయగడ: రాష్ట్రపతి అవార్డు గ్రహీత, బిలేసు ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ద్వితిచంద్ర సాహుపై గుర్తుతెలియని దుండగుడు దాడి చేశాడు. ఈ దాడిలో సాహు తలకు తీవ్రగాయాలయ్యాయి. రాజధాని భువనేశ్వర్లోని రైల్వే పోలీస్ స్టేషన్లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు సమితి బిలేసు ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న సాహు విధుల్లో భాగంగా భువనేశ్వర్ వెళ్లాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం 6 వద్ద రైలు దిగి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగుడు మొబైల్ లాక్కొవడమే కాకుండా కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో సాహు తలపై తీవ్రగాయాలయ్యాయి. అక్కడి వారు కొందరు అతనిని కేపిటల్ హాస్పిటల్కు తరలించారు. దాడి చేసిన దుండగులు ఎవరు, ఎందుకు దాడి చేశాడు, మొబైల్ లాక్కొని పారిపోకుండా ఎందుకు కర్రతో దాడి చేశాడనే విషయం రాయగడలో చర్చనీయంశంగా మారింది. బాధితుడు సాహు భువనేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మిషన్ శక్తి భవనంలో దొంగలు
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి కేంద్రంలో ఉన్న మిషన్ శక్తి భవనంలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. ఆదివారం సెలవు దినం కావడంతో మిషన్ శక్తి భవనానికి తాళం వేశారు. దుండగులు తాళం తీసి లోపలకు ప్రవేశించి బీరువాలో ఉన్న ఫైల్స్ దొంగిలించారు. సోమవారం ఉదయం మిషన్శక్తి భవనం తీయడం కోసం వస్తే సామాన్లు చిందరవందరగా ఉన్నాయి. దీంతో ధరిత్రీమిషన్ శక్తి అధ్యక్షురాలు పూర్ణిమా దత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐఐసి ముకుందో మేల్క తన సిబ్బందితో వచ్చి పరిసరాలు పరిశీలించారు. రాజధానిలో 47 వేల వీధి కుక్కలు భువనేశ్వర్: రాష్ట్రంలో తొలిసారిగా రాజధాని నగరంలో వీధి కుక్కల లెక్కింపు చేపట్టారు. స్థానిక నగర పాలక సంస్థ బీఎంసీ ఆధ్వర్యంలో ఈ గణన నిర్వహించారు. ఈ లెక్కల్లో బీఎంసీ పరిధిలో వీధి కుక్కల రేటు జాతీయ రేటు కంటే అధికంగా ఉందని స్పష్టం అయింది. భువనేశ్వర్ నగర పాలక సంస్థ బీఎంసీ ప్రాంతంలో 39,723 వీధి కుక్కలు ఉన్నాయి. నగర జనాభాలో ఈ వీధి కుక్కల సంఖ్య 3.62 శాతంగా నమోదైంది. వాటిలో 23,047 మగ కుక్కలు, 15,552 ఆడ కుక్కలు, 1,124 కుక్కపిల్లలు ఉన్నాయి. 4,068 మగ కుక్కలు, 3,335 ఆడ కుక్కలకు స్టెరిలైజేషన్ జరిగింది. నగరంలో యువకుడిపై కాల్పులు భువనేశ్వర్: అన్న (పెద్ద తండ్రి కొడుకు)ను తమ్ముడు (పినతండ్రి కుమారుడు) తుపాకీతో కాల్చి చంపాడు. నగరంలో ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. తమ్ముడు 4 రౌండ్లు కాల్పులు జరపడంతో అన్న మృతి చెందాడు. మృతుడిని సుధాంశు ఖుంటియాగా గుర్తించారు. అతని శరీరంలోకి 3 తూటాలు దూసుకు పోయాయి. ఆస్తి వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు సమాచారం. పోలీస్ కమిషనర్ ఎస్.దేవదత్త సింగ్ సమాచారం ప్రకారం రెండు కుటుంబాల మధ్య వివాదం కారణంగా కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసు విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడు ఎయిమ్స్లో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగా విధులకు హాజరయ్యేందుకు విచ్చేస్తుండగా వెంబడించి తుపాకీ కాల్పులు జరపడం కలకలం రేపింది. 19 కిలోల గంజాయి స్వాధీనం రాయగడ: గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు ఆ దిశగా విస్తృతంగా దాడులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని చంద్రపూర్ పోలీసులు సొమవారం నిర్వహించిన దాడుల్లో భాగంగా కురులిబలి కూడలిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని పట్టుకుని అతని నుంచి 19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. -
గురండి గ్రీవెన్స్కు 108 వినతులు
పర్లాకిమిడి: గుసాని సమితి గురండి పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్సుసెల్కు విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ మధుమిత అధ్యక్షత వహించగా, అదనపు ఎస్పీ సునీల్ కాంత మహాంతి, డీఆర్డీఏ ముఖ్య కార్యనిర్వాహణాధికారి శంకర్ కెరకెటా తదితరులు హాజరయ్యారు. గురండి పంచాయతీతో పాటు తాటిపట్టి, పెద్ద గుసాని, బుసుకుడి గ్రామ పంచాయతీల నుంచి 108 వినతులు అందాయి. వాటిలో వ్యక్తిగతం 64 కాగా, గ్రామ సమస్యలు, అభియోగాలు 44 వచ్చాయి. వాటిని సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం 12 మందికి వసుంధర భూపట్టాలను కలెక్టర్ గురండిలో అందజేశారు. గురండి పంచాయతీ కార్యాలయం ఆవరణలోని అంగన్వాడీల రాష్ట్రీయ పోషణ స్టాల్ను కలెక్టర్ సందర్శించారు. గుసాని బీడీవో గౌర చంద్ర పట్నాయక్, తహసీల్దార్ నారాయణ బెహరా, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం.ఆలీ పాల్గొన్నారు. -
‘ప్రమాదం పొంచి ఉంది’
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో అక్టోబరు 2న జరిగిన కొండ చరియలు విరిగిపడిన ఘటనలో రాయగఢ బ్లాక్లో పెక్కట గ్రామంలో తండ్రీకొడుకులు ఇద్దరు మృతిచెందారు. అలాగే మోహనా, ఆర్.ఉదయగిరి బ్లాక్లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఒడిశాలో ఇక్కడే ప్రత్యేకంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇలాం ప్రకృతి వైపరీత్యాలు మళ్లీ జరగకుండా జిల్లా యంత్రాంగం ఒక జియోలాజికల్ సర్వే చేపట్టాలని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కోరుతున్నారు. ఆల్ ఇండియా ల్యాండ్స్లైడ్ ససెప్టబిలిటీ మ్యాప్ (ఐ.ఎల్.యస్.యం), ఐఐటీ, ఢిల్లీ విద్యార్థులు జరిపిన సర్వేలో గజపతి జిల్లాలో 129 కొండచరియలు విరిగిపడే లోకేషన్లు ఉన్నట్లు గుర్తించారు. మోహనా, నువాగడ, ఆర్.ఉదయగిరి, రాయగడ సమితి కేంద్రాల్లో గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నారు. ఏటవాలు ప్రాంతంలో పోడు వ్యవసాయం ఎక్కువగా చేస్తూ మొక్కజొన్న, వరి, రాగులు, కాయగూరల పంటలు పండిస్తూ జీవిస్తున్నారు. అయితే పర్యావరణ శాస్త్రవేత్తలు గజపతి జిల్లాలో సుమారు కొండ చరియలు విరిగిపడే 129 అపాయకర ప్రాంతాలను గుర్తించారు. అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కోరుతున్నారు. అక్టోబర్లోనే గజపతి ఎక్కువగా వానలు కురుస్తుంటాయి. ప్రకృతి వైపరీత్యాలు సైతం ఇదే మాసంలో సంభవిస్తుంటాయి. అక్టోబరు 15 నుంచి వాయవ్య బంగళాఖాతంలో తిరిగి అల్పపీడనం సంభవించనున్న దృష్ట్యా ఒడిశాలో పలు జిల్లాలో అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉందని ఐఎండీ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
రౌర్కెలా హై టెక్ ఆస్పత్రిలో జన ఔషధి ప్రారంభం
భువనేశ్వర్: రౌర్కెలా హైటెక్ వైద్య కళాశాల, ఆస్పత్రి ఆవరణలో ప్రధాన మంత్రి జన ఔషధి విక్రయ కేంద్రం ప్రారంభించారు. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయెల్ ఓరాం చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. రౌర్కెలా ఎమ్మెల్యే శారదా ప్రసాద్ నాయక్, రఘునాథ్పల్లి ఎమ్మెల్యే దుర్గా చరణ్ తంతి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అన్ని వర్గాల రోగులకు సులభంగా, సరసమైన ధరలకు ఈ కేంద్రంలో మందులు లభిస్తాయి. రౌర్కెలా ఆస్పత్రిలో సకాలంలో సముచిత వైద్యం లభించడంతో సరసమైన ధరలకు జన ఔషధి విక్రయ కేంద్రంలో నాణ్యమైన మందులు దొరుకుతాయన్నారు. హైటెక్ వైద్య కళాశాల ఆస్పత్రి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి హాజరై ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులు కొత్తగా ప్రారంభించిన జన ఔషధి కేంద్రం సేవల్ని సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. -
పవిత్ర క్షేత్రం పూరీ
మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025● ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఇంజినీరింగ్ చదివి.. గంజాయి స్మగ్లర్గా మారి భువనేశ్వర్: పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని రాష్ట్రం మారుమూల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన హబిష్యాలీలతో చతుర్థామ క్షేత్రం పూరీ కళకళలాడుతోంది. కార్తీక మాసంలో నెల రోజులపాటు నిరవధికంగా ప్రత్యేకంగా వ్రతం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో వితంతు మహిళలు తరలి వచ్చారు. వీరందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం పూరీ ప్రాంతంలో ఉచిత వసతి, మహా ప్రసాదం, దర్శనం కోసం ప్రత్యేక రవాణా తదితర ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా పట్టణంలో 5 వేర్వేరు చోట్ల వీరి కోసం ఆరోగ్యం, పటిష్టమైన భద్రత, రక్షణ వ్యవస్థతో ఉచిత వసతి సముదాయాలు ఏర్పాటు చేశారు. కార్తీక మాసం తొలి సోమవారం పురస్కరించుకుని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి హబిష్యాలీలు బస చేసిన బృందావతి సముదాయం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్దాలుగా కార్తీక మాసాన్ని భక్తి మాసంగా పరిగణిస్తారు. ఒడియా మహిళలు ఈ పవిత్ర మాసంలో హవిష్యం పాటించడం తరతరాల సంప్రదాయంగా కొనసాగుతుంది. అత్యంత నియమ నిష్టలతో రాధా దామోదరుల్ని సేవిస్తూ శ్రీ జగన్నాథుని మహా ప్రసాదం (ఒబొఢ)తో నిత్యం ఒంటి పూట భోజనం చేయడం కోసం అనుకూలమైన సదుపాయాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏటా మాదిరిగా ఈ ఏడాది ఏర్పాటు చేసిందన్నారు. హబిష్యాలీలు నియమ నిష్టలతో సుదీర్ఘంగా నెల రోజులపాటు నిర్వహించే కార్తీక వ్రతంతో పరిసరాలు పవిత్రంగా మారుతాయన్నారు. కార్తీక వ్రతం ఒడిశాకు చెందిన ఒక జీవన సంస్కృతి, ఒక ప్రత్యేకమైన సంప్రదాయం అని అన్నారు. ఈ వ్రతం ఆచరించేందుకు చాలా మంది భక్తులు పలు ప్రాంతాల నుంచి ఒంటరిగా వస్తారు. వారు తమ కుటుంబాలను విడిచిపెట్టి ఇక్కడ ఒక నెల రోజులు గడుపుతారు. లోక కల్యాణం కోసం వారు దీపాలను వెలిగిస్తారు. కార్తీక మాసంలో వీరు వెలిగించే దీపాలు రాష్ట్ర నైతిక, ఆధ్యాత్మిక భావాలను మేల్కొల్పుతాయి. పూరీ కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు. ఈ పవిత్ర క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ జగన్నాథుడు భక్తుల నడుమ ప్రత్యక్షమై అడుగడుగున వేస్తు పుణ్య బాటలో నడపిస్తాడని భక్తులు గట్టిగా విశ్వసిస్తారు. ఈ పవిత్ర స్థలంలో భక్తులకు సేవ చేయడం ప్రభుత్వ విధి. ఈసారి పూరీలోని 5 ప్రదేశాలలో 2 వేల 500 మందికి పైబడి హబిష్యాలీల కోసం వసతి, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యకలాపాల కోసం ప్రభుత్వం రూ. 3.3 కోట్ల వ్యయ ప్రణాళికని రూపొందించినట్లు తెలిపారు. ఇది గత సంవత్సరం కంటే రూ. 70 లక్షలు అధికంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పూరీ జిల్లా యంత్రాంగం ఔత్సాహికుల కోసం సౌకర్యాలను కల్పిస్తోంది. ఎమ్మెల్యే ఓం ప్రకాష్ మిశ్రా, పూరీ ఎంపీ డాక్టర్ సంబిత్ పాత్రో, జగత్సింగ్పూర్ ఎంపీ బిభు ప్రసాద్ తొరాయ్, పిప్పిలి ఎమ్మెల్యే అశ్రిత్ పట్నాయక్, పూరీ ఎమ్మెల్యే సునీల్ మహంతి, బ్రహ్మగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే ఉపాసన మహాపాత్రొ, జిల్లా కలెక్టర్ దివ్య జ్యోతి పరిడా, పోలీసు సూపరింటెండెంట్ ప్రతీక్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘గదబ సంప్రదాయాన్ని కాపాడుకోవాలి’
జయపురం: కొరాపుట్ జిల్లాలో గదబ సంప్రదాయ గిరిజనుల భాష, సంస్కృతి సంప్రదాయం పరిరక్షణకు సామూహిక ఉద్యమం అవసరమని రాష్ట్ర విధాన సభలో కాంగ్రెస్ నేత, పొట్టింగి ఎమ్మెల్యే రామచంద్ర కడమ్ అన్నారు. సోమవారం జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడలో గదబ సమాజ్ వికాశ పరిషత్ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వికాస పరిషత్ అధ్యక్షుడు మోహణ్ శ్రీకరలియ అధ్యక్షతన నిర్వహించిన వార్షిక సమావేశంలో రామచంద్ర కడమ్ ప్రసంగిస్తూ కొరాపుట్ జిల్లాలో గదబ సంప్రదాయ గిరిజనులు పురాతన తెగ అని, వారి నృత్య సంగీతాలకు సమాజంలో ప్రత్యేక ఆదరణ ఉందని అయితే వారికి ప్రభుత్వం తగిన సహకారం అందించక పోవటం వల్ల కళలు కనుమరుగు అవుతున్నాయని వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. వార్షికోత్సవం సందర్భంగా బొయిపరిగుడలోగల సహిద్లక్ష్ మణ నాయిక్ పాఠాఘర్ ప్రాంగణంలో నిర్వహించిన వార్షికోత్సవంలో మల్కన్గిరి జిల్లా చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖిళో, గదబ సమాజ్ వికాస పరిషత్ సీనియర్ నేత ముకుంద హంతాల్, భగీరథ్ ముర్జయ, జితేంధ్ర నాయిక్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. -
అంబులెన్స్కు అనారోగ్యం!
● ఘాట్ రోడ్డులో రోగితో నిలిచిపోయిన అంబులెన్స్ కొరాపుట్: అత్యవసరంగా వెళ్లాల్సిన అంబులైన్స్కి అనారోగ్యం చేసింది. కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ నుంచి రోగితో అత్యవసరంగా ప్రభుత్వ 108 అంబులైన్స్ సోమవారం బయలు దేరింది. జాతీయ రహదారి–26పై కొరాపుట్ ఘాట్పైకి వెళ్తుండగా అకస్మాత్తుగా నిలిచి పోయింది. దీంతో రోగి బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అంబులైన్స్ డ్రైవర్ సహచర సిబ్బందిని సంప్రదించి మరో అంబులైన్స్ని రప్పించి అందులో రోగిని కొరాపుట్ తరలించారు. ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాలకి రోగి సకాలంలో చేరడంతో ప్రమాదం తప్పింది. కానీ మరమ్మతులకు గురైన అంబులైన్స్కి సుమారు 15 కాల్స్ వచ్చినా ఘాట్ రోడ్డు లోనే ఉండి పోయింది. పట్టంచు కోనే వారు లేక అంబులైన్స్ డ్రైవర్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ 108 అంబులైన్స్ వాహనాల పనితీరుపై విమర్శలు రేగుతున్న వేళ ఈ ఘటన చోటు చేసుకుంది. -
కాసులు కురిపిస్తున్న పీచు
● టన్ను పీచు ధర రూ.10 వేలు నుంచి రూ.20 వేలు ● ఉద్దానం నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు ● కొబ్బరి పీచు, తాళ్లకు డిమాండ్ వజ్రపుకొత్తూరు: కోనసీమ తర్వాత కొబ్బరి చెట్లకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఉద్దానంలో ఉత్పత్తి అవుతున్న కొబ్బరిపీచుకు మంచి గిరాకీ ఉంటోంది. ఇక్కడి పరిశ్రమల్లో తయారైన పీచు, తాడు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు భారీ ఎత్తున ఎగుమతి అవుతోంది. పొరుగునే ఉన్న విజయనగరంతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు వంటి రాష్ట్రాలకు పీచు, తాడు ఉత్పత్తులు పంపిస్తున్నారు. జిల్లాలో అటు రణస్థలం నుంచి ఇటు ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస, సంతబొమ్మాళి, పలాస తదితర 29 మండలాల్లో 15 వరకు పీచు పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ రోజుకు 120 టన్నుల వరకు పీచు ఉత్పత్తి జరుగుతోంది. తయారీ ఇలా.. జిల్లాలో 32,602 ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తుండగా నెలకు సరాసరి 32,60,000 కాయలు దిగుబడి వస్తున్నాయి. కొబ్బరికాయల డొక్కలు 30 శాతం వృథాగా పోతుండగా.. పరిశ్రమ నిర్వహకులు అవసరమైన డొక్కలను రైతుల నుంచి కొనుగోలు చేసి లారీలతో తరలిస్తున్నారు. వీటిని పరిశ్రమల్లో పెద్ద లాట్లుగా కట్టి పది, పదిహేను రోజులు నీటితో తడుపుతారు. అనంతరం డీసెండికేటర్లో కొబ్బరి డొక్కలు వేస్తే పీచులా మారుతుంది. దానిని ఎండబెట్టి ఎగుమతులకు సిద్ధం చేస్తారు. కర్లింగ్ పీచు కొనుగోలు చేసుకుని కర్లింగ్ మెషీన్ల ద్వారా రెండు రకాల తాడును తయారు చేస్తారు. ప్రస్తుతం పీచు ధర టన్ను రూ.10వేలు ఉంది. కర్లింగ్ పీచుకు రూ.20 వేలు ధర లబిస్తోంది. 2014 వరకు కొబ్బరి పీచును చైనాకు అధికంగా ఎగుమతి జరిగేది. ఐతే పరుపుల తయారీకి ఫోం అందుబాటులోకి రావడంతో పీచుకు డిమాండ్ తగ్గింది. దేశీయంగా మాత్రం వినియోగం పెరిగింది. వినాయకుడు, దేవీ విగ్రహాల తయారీలో దేశ వ్యాప్తంగా కొబ్బరి పీచునే వినియోగిస్తుండటంతో గిరాకీ పెరుగుతోంది. బోట్లు, ఇటుకలు తయారీకిలోనూ.. ప్రధానంగా బోట్లు తయారీలో కొబ్బరి పీచు వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్, కొబ్బరి పీచును వినియోగించి బోట్లు రూపొందిస్తారు. విశాఖ, కాకినాడ, చైన్నె, ముంబై, కోల్కత్తా, కేరళ తదితర ప్రాంతాల్లో చేపల బోట్లతో పాటు రవాణా, టూరిజం బోట్ల తయారీలో కొబ్బరి పీచు వినియోగిస్తారు. పీచు తయారీలో పొట్టు కూడా వస్తుంది. దీనిని కంపోస్టు, ఇటుకల తయారీలో వినియోగిస్తున్నారు. ఫాక్టరీల వద్దే నేరుగా కంపోస్టు ఎరువు తయారు చేసి నర్సరీలకు ఎగుమతి చేస్తున్నారు. కంపోస్టు ఎరువు టన్ను రూ.5వేలు ధర పలుకుతోంది. ఇటుకల బట్టీల్లోనూ పొట్టు వినియోగిస్తున్నారు. దీని వల్ల ఇటుక తేలికగా ఉంటోంది. ఈ ఇటుక అపార్టుమెంట్ల నిర్మాణంలో బాగా ఉపయోగపడుతోంది. ట్రాక్టర్ లోడుకు రూ.7వేలు ధర లభిస్తోంది. ఉద్దానం ప్రాంతంలో పెద్ద ఎత్తున కొబ్బరి డొక్కలు ఉత్పత్తి అవుతున్నా అందుకు తగ్గస్థాయిలో పరిశ్రమలు లేవు. ఔత్సాహికులు ముందుకు వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కాయిర్ బోర్డు ద్వారా 35 శాతం సబ్సిడీతో రుణాలు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగ యువత ఈ పరిశ్రమలపై దృష్టి సారించాలి. ఇచ్చాపురం కొబ్బరి పొట్టుతో ఇటుకలు తయారు చేసే పరిశ్రమ సైతం ఉంది. మంచి లాభాలు సైతం ఆర్జిస్తున్నారు. కాయిర్ బోర్డు, మా సహకారం తీసుకుని ముందుగా దీనిపై అవగాహన పెంచుకుని నాబార్డు, ఇతర సంస్థలు ద్వారా రుణాలు పొంది పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి. – సీహెచ్.శంకర్దాసు, ఉద్యానవన శాఖ అధికారి , పలాసఇటీవలే పీచు పరిశ్రమ ప్రారంభించాను. కర్లింగ్ పీచుకు డిమాండ్ ఉంది. అయితే మార్కెట్పై పూర్తి స్థాయిలో అవగాహన లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాయిర్ బోర్డుపీచు పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి మార్కెట్ సౌకర్యం మార్గాలను చూపించాలి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. – కె.దేవదాసు, పీచు పరిశ్రమ నిర్వాహకుడు, పెద్దమురహరిపురం -
11 అడుగుల కొండచిలువ పట్టివేత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి టెల్రాయి పంచాయతీ ఎం.వి.107 గ్రామంలో 11 అడుగుల కొండచిలువను పట్టుకున్నారు. శనివారం రాత్రి గ్రామానికి చెందిన సురెం గుప్తా వ్యక్తి ఇంటి పెరట్లోని అరటి చెట్టు వద్ద ఉన్న పామును పక్కింటి మహిళ చూసి కేకలు వేసింది. దీంతో సురెం గుప్తా కలిమెల స్నేక్హైల్ప్ లైన్ సభ్యుడు రాకేష్ హల్ద్ర్కు సమాచారం ఇవ్వడంతో ఆయన తన సహచారుడుతో వచ్చి కొండచిలువను పట్టుకున్నారు. అటవీశా ఖ సిబ్బంది సూచన మేరకు ఆదివారం ఉదయం ఎం.వి.126 గ్రామ అడవిలో విడిచిపెట్టారు. -
మల్కన్గిరిలో చిన్నారులకు చుక్కల మందు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐదేళ్ల చిన్నారులకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 13, 14 తేదీల్లో ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు జిల్లాలోని ఏడు సమితుల్లో ప్రతి ఇంటికి వెళ్లి చుక్కలు వేయించుకోనివారిని గుర్తించి పోలియో డ్రాప్స్ వేస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా 752 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 1504 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నట్టు పేర్కొన్నారు. జిల్లా వైద్యాధికారి బ్రోజబాల్ దాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి జయపురం: జయపురం– బొరిగుమ్మ 26వ జాతీయ రహదారిలో ఉమ్మిరి గ్రామ సమీపంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిడ్డంగుల సమీపంలో బైక్–కారు ఢీకొన్నాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో బైక్పై వస్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. మరణించిన వ్యక్తి జయపురం సమితి ఆంబాగుడ పోలీసు పంటి పరిది మండాపొదర్ గ్రామ వాసి ధనపతి నాయక్(20)గా గుర్తించారు. మరణించిన వ్యక్తి శనివారం మధ్యాహ్నం తన బంధువును బైక్పై జయపురం తీసుకెళ్లాడు. అక్కడ నుంచి సాయంత్రం తన గ్రామానికి బయలు దేరివస్తున్నాడు. ఆ సమయంలో అతి వేగంగా వస్తున్న కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న ధనపతి నాయక్ సంఘటనా స్థలం వద్దే మరణించాడు. ప్రమాదంలో అతడి తలకు బలమైన దెబ్బ తగలటంతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన అంబాగుడ పోలీసు సంటి పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం కొరాపుట్ జిల్లా కేంద్ర హాస్పిటల్ జయపురానికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆదివారం పోస్టుమార్టం పూర్తయిన తరువాత మృత దేహాన్ని బంధువులకు పోలీసులు అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి సంతబొమ్మాళి: మండలంలోని లక్కీవలస పంచాయతీ గెద్దలపాడు గ్రామానికి చెందిన తుంబల చిరంజీవి (25) అనే మత్స్యకార యువకుడు శనివారం రాత్రి రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అక్కడ ఓ హోటల్లో వంట మాస్టర్గా పని చేస్తున్న చిరంజీవి ఇటీవలే స్వగ్రామం వచ్చాడు. పది రోజుల కిందట తిరిగి రాజమండ్రి వెళ్లిపోయాడు. బైక్పై వెళ్లూ లారీని ఓవర్ టేక్ చేయబోయి అదే వాహనం కిందపడి మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విని తండ్రి గురువులు, తల్లి ఆదెమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి పలాస: బారువ–మందస రైల్వేలైన్లో గుర్తు తెలియని రైలు ఢీకొని గుర్తు తెలియన వ్యక్తి మృతి చెందినట్టు పలాస జి.ఆర్.పి ఎస్ఐ కోటేశ్వరరావు ఆదివారం తెలిపారు. మృతుడి ఛాతిపై ‘ఐ లవ్ యు స్వాతి’ అని తెలుగులో రాసిన పుట్టుమచ్చ ఉందన్నారు. వివరాలు తెలిస్తే 9440627567 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. జాతీయ పోటీల్లో రాజశేఖర్ ‘పవర్’ గార: కొర్ని గ్రామానికి చెందిన చమల్ల రాజశేఖర్ జాతీయ పోటీల్లో విజయదుందుభి మోగించాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన నేషనల్ పవర్లిఫ్టింగ్ చాంపియ్న్షిప్ – 2025 పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించి శభాష్ అనిపించాడు. ఫుల్ పవర్లిఫ్టింగ్, పుష్పుల్, బెంచ్ప్రెస్ విభాగాల్లోనూ స్వర్ణ పతకాలు సాధించాడు. గతంలోనూ ఇండియన్ పవర్లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జంషెడ్పూర్లో జరిగిన జాతీయ స్థాయి పోటీలల్లో పతకాలు సాధించిన విషయం తెలిసిందే. యువ క్రీడాకారుడి ప్రతిభ పట్ల ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాధికారులు హర్షం వ్యక్తంచేశారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
పర్లాకిమిడి: మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంటే మనకు ఎటువంటి అనారోగ్యాలు, చెడు ఆలోచన, వ్యసనాలు దరికి చేరవని ప్రభుత్వ మెడికల్ సిబ్బంది ప్రసన్న రంజన్ నాయక్ అన్నారు. స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో రాజగురు పతంజలి రాందేవ్ బాబా యోగా శిబిరంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చెడువ్యసనాలకు బానిసై నేరాలకు అలవాటు పడుతున్నారని ప్రసన్న రంజన్ నాయక్ అన్నారు. యోగా వల్ల మానసిక ప్రశాంత పొందవచ్చన్నారు. అక్టోబర్ 11 నుంచి నెలరోజుల పాటు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శిబిరాలు ఏర్పాటుచేస్తున్నామని సతీష్ కుమార్ మహాపాత్రో అన్నారు. ఈ శిబిరంలో జతిన్ పట్నా, ప్రదీ కుమార్ మహాపాత్రో, పతంజలి యోగా శిబిరం గురువు కె.సూర్యనారాయణ, సురేంద్ర కుమార్ రథ్, ఇతర యోగా శిక్షకులు పాల్గొన్నారు. రాణిపేట గ్రామంలో... కాశీనగర్ బ్లాక్ రాణిపేట గ్రామంలో ఉన్న నియాతి మానసిక వికలాంగుల విద్యార్థుల పాఠశాలలో జిల్లా కోర్టు న్యాయ సేవా ప్రాధికరణ అధికారి బిమల్ రవులో పాల్గొని ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవంపై మాటాల్డారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్కుమార్ మిశ్రా, జిల్లా నియాతి స్కూల్ అధ్యక్షురాలు స్వయంలతా పాణిగ్రాహి, తనూజా శతపథి తదితరులు పాల్గొని మాట్లాడారు. -
డిజిటల్ మారథాన్కు రెడీ
● ‘ఆంధ్రా యువ అంబాసిడర్’ ఎంపికలకు పోటీలు ● షార్ట్వీడియోలకు ఆహ్వానం ● విజేతలకు భారీగా నగదు బహుమతులు శ్రీకాకుళం న్యూకాలనీ : వికసిత్ భారత్ – 2047 లక్ష్యాలను సాధించేలా యువతను ఆకర్షించేందుకు యువజన సర్వీసుల శాఖ నడుంబిగించింది. దీనిలో భాగంగా సామాజిక, కుటుంబ సంబంధాలతోపాటు ఆరోగ్యకరమైన జీవన వైవిధ్యాన్ని తెలియజేస్తూ డిజిటల్ ఆవిష్కరణల విలువలను ప్రోత్సహించి ప్రజలను మేల్కొలిపేలా షార్ట్వీడియోను తయారుచేసేందుకు యువతకు అవకాశం కల్పించారు. ఇందులో విజేతలకు ఆంధ్ర యువత అంబాసిడర్గా ప్రకటించడంతో పాటు భారీగా నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నారు. ఈ మేరకు ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2కే25 (ఆంధ్ర యువ 2కే25 అంబాసిడర్)’ డిజిటల్ మారథాన్లో యువత భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిస్తున్నారు. ఎలా పాల్గొనాలంటే.. ● ఆంధ్ర యువ అంబాసిడర్ పోటీల్లో పాల్గొనేందుకు 18 నుంచి 35 ఏళ్ల యువతీ యువకులు అర్హులు. ● ‘ఆంధ్రాయువసంకల్ప్.కామ్’ వెబ్సైట్లో రిజిస్టర్ చేరుకోవాలి. ఇందుకు ఈ నెల 15తో గడువు ముగియనుంది. ● పోటీల్లో పాల్గొనేవారు 120 సెకన్ల నిడివిగల వీడియో/షార్ట్ను తయారుచేసి, నిర్దేశిత అధికారిక హ్యాష్ట్యాగ్లతో వారి సొంత సోషల్ మీడియా ఖాతాలలో (ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, యూట్యూబ్ షార్ట్స్ మొదలైనవి) పోస్ట్ చేయాలి. ● జ్యూరీ కమిటీ తమకు వచ్చిన ఎంట్రీలను సమీక్షించి విజేతలను ప్రకటిస్తుంది. అంబాసిడర్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచినవారికి రూ.1,00,000, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.75,000, తృతీయ స్థానంలో నిలిచినవారికి రూ.50,000 నగదు బహుమతులు అందజేస్తారు. మొదటి తొమ్మిది మంది విజేతలకు ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2కే25 అంబాసిడర్‘గా గౌరవ సత్కారం అందజేస్తారు. పోటీలలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ డిజిటల్ క్రియేటర్ ఏపీ 2కే25 పేరిట సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. యువత తమలో ఉండే సృజనాత్మకతను నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా వివిధ అంశాల్లో ప్రజలను మేల్కొలిపేలా వీడియోను సోషల్మీడియాలో అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేసన్ చేసుకున్నవారి వీడియోలను జ్యూరీ కమిటీ పరిశీలించి ఎంపికచేస్తుంది. – వావిలపల్లి వెంకటప్పలనాయుడు, సెట్శ్రీ సీఈఓ జిల్లా యువత అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. టాలెంట్ నిరూపించుకునేందుకు ఇదొక చక్కటి అవకాశం. డిజిటల్ మారథాన్లో పాల్గొని ప్రతిభ చాటుకోవాలి. అత్యధిక మంది భాగస్వాములై శ్రీకాకుళం జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలి. – కె.వెంకట్ ఉజ్వల్, మేరాభారత్ డిప్యూటీ డైరెక్టర్ -
మద్యం మత్తులో ఉన్మాది హల్చల్
● కత్తి పట్టుకొని పలువురిపై దాడి ● ఇద్దరికి తీవ్రగాయాలు ● మోహన్ కుమార్ నాయక్ను అరెస్టు చేసిన పోలీసులుజయపురం: జయపురం బెడ సాహిలో తాగుబోతు(ఉన్మాది) కత్తి పట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఆ ప్రాంత ప్రజలు అతి కష్టంతో అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో గల గంగా మా మందిరంలో దేవీ పూజా స్థలంలో గల దేవి ఖడ్గాన్ని తీసుకువచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్నవారిపై కత్తితో దాడి చేస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన పట్టణ పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు అతడిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా పోలీసులపైనా దాడి చేశాడు. పోలీసులు అతడిని పట్టుకునే సమయంలో ఉన్మాది కిందపడ్డాడు. ఆ సమయంలో ప్రజలు అతడిని పట్టుకున్నారు. పోలీసుల సహకారంతో గంట సమయం ఆ ఉన్మాదిని పట్టుకొనేందుకు శ్రమించిన ప్రజలు అతడికి దేహశుద్ధి చేశారు. ఉన్మాది వ్యక్తి మోహన్ కుమార్ నాయక్(44) అని పోలీసులు వెల్లడించారు. అతడు మద్యం తాగి ఉన్మాదంతో గత రాత్రి ఇంటిలో భార్య, కుమార్తెను కొట్టాడని ఆ వీధి వాసులు వెల్లడించారు. గత రెండు రోజులుగా ఆ తాగుబోతు వీధిలో భయభ్రాంతులను చేస్తున్నాడని ఆరోపణ. అతడి దాడిలో సింహాచల గంతాయిత్, చిన్మయ సాహు గాయపడినట్లు ప్రజలు వెల్లడించారు. జయపురం పట్టణ పోలీసులు అతడిని స్టేషన్కు తీసుకువచ్చారు. నాయక్ తాగుబోతు కావటం వలన అతడు మతిస్థిమితం కోల్పోయి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో.. బొరిగుమ్మ యువతి
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ యువతి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025లో స్థానం సంపాదించింది. ఇంగ్లీష్ పుస్తకాలు రచించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొంది అందరి ప్రశంసలు పొందుతోంది. యువతి బొరిగుమ్మ సమితి నువాగాం గ్రామంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో విశ్రాంత ఉపాధ్యాయులు ఎన్.రాజేష్ కుమార్, గాయత్రీల కుమార్తె ఎన్.త్రిషా తన్య. త్రిషా 19 ఏళ్ల వయసులో ‘ఎ నోట్ వాట్ ఐ థాట్’, ‘సెంటిమెంట్స్ ఆఫ్ ఎడల్సెంట్’, ‘డిజైన్ డెజిరబుల్ డిపిక్షన్’ పుస్తకాలను ఇంగ్లీష్లో రచించింది. ఆ రచనలకు సంతృప్తి చెందిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డు వారు ఆ బాలిక ప్రతిభకు మెచ్చి రికార్డ్స్లో స్థానం కల్పించి ప్రశంసా పత్రం, మెడల్, ఇండియ బుక్ ఆఫ్ రికార్డ్స్ పుస్తకం, పెన్, బ్యాడ్జ్, గుర్తింపు కార్డ్తో సన్మానించారు. ఎన్.త్రిషా తన్య జయపురం విక్రమదేవ్ విశ్వ విద్యాలయలో +3లో ఆఖరి సంవత్సర చదువుతోంది. భవిష్యత్తులో తాను మరికొన్ని పుస్తకాలు ఆంగ్లంలో రాయనున్నట్లు త్రిషా వెల్లడించింది. ఆమెను తోటి విద్యార్థులు, స్నేహితులు, బంధువులు, బొరిగుమ్మ ప్రజలు అభినందించారు. మరిన్ని పుస్తకాలు రచించి మంచి ఆంగ్ల రచయితగా పేరు తెచ్చుకోవాలని ఆకాక్షించారు. -
అరసవల్లిలో భగళాముఖి అమ్మవారు
శ్రీకాకుళం కల్చరల్ : ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి కొలువుదీరిన అరసవల్లిలోనే భగళాముఖి అమ్మవారు ప్రత్యేకంగా పూజలందుకుంటున్నారు. ప్రస్తుత తరంలో చాలామందికి ఈ విషయం తెలియదనే చెప్పాలి. సూర్యనారాయణ స్వామి ఆలయంలో మూలవిరాట్ మందిరానికి ఆనుకొని ఉన్న దుర్గాదేవిని భగళాముఖి అమ్మవారుగా పిలుస్తారు. ప్రత్యక్ష నారాయణుని దర్శించుకున్న తరువాత బయటకు వస్తే మనకి తీర్థం ఇచ్చి శఠగోపం పెడతారు. అక్కడే ఈ అమ్మవారు కొలువుదీరారు. భగళాముఖి అమ్మవారికి ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు. వారే జలుమూరులో కొండపైన ఉన్న ఇంద్రాణి అమ్మవారు, శ్రీముఖలింగంలో వారాహి అమ్మవారు. అరసవల్లిలో శక్తిస్వరూపిణిగా ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు, నిత్యపూజలు అందుకుంటారు. పంచాయతన ఆలయంగా అరసవల్లి.. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని పంచాయతన ఆలయంగా పిలుస్తారని మీకు తెలుసా!. ఎందుకంటే అక్కడ ఆదిత్యుడు, అంబిక, విష్ణు, గణనాథుడు, మహేశ్వరుడు కలసి ఉన్నారు. అందుకే ఈ ఆలయాన్ని పంచాతయన ఆలయంగా కొలుస్తారనిప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. ఆదిత్యుడికి రథసప్తమి వేడుకలు, ఈశ్వరుడికి శివారాధన, శివరాత్రి, కార్తీక మాస ఉత్సవాలు జరుగుతాయి. వినాయకుడికి గణపతి ఉత్సవాలు, నిత్య పూజలు నిర్వహించారు. విష్ణుతత్వంగా మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇలా అనేక ప్రత్యేకతలతో అరసవల్లి ఆదిత్యాలయం విరాజిల్లుతోంది. మీకు తెలుసా? -
ఆర్.బెలగాం యువకుడి ప్రతిభ
కవిటి: ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో భారత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్వెస్ట్–2025లో కవిటి మండలం ఆర్.బెలగాం గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ రత్నాల సుమిత్కుమార్ సత్తాచాటాడు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలో బ్యాంక్ లావాదేవీలు, పేమెంట్ డేటా, రియల్ టైమ్ ఫ్రాడ్ డిటెక్షన్ తదితర సమస్యల పరిష్కారంపై ఆన్లైన్ టెస్ట్, కోడ్ అండ్ డేటా సైన్స్ చాలెంజ్, అడ్వాన్స్డ్ ఏఐ వర్క్ షాప్ తదితర విభాగాల్లో సుమిత్కుమార్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా మహరాష్ట్ర సీఎం చేతుల మీదుగా రూ.5 లక్షల నగదు, అవార్డు శనివారం అందుకున్నారు. రత్నాల కామేశ్వరరావు, ప్రమీల దంపతుల కుమారుడు సుమిత్కుమార్ ప్రస్తుతం హైదరాబాద్లోని కేఎంఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. యువకుడి విజయం పట్ల కవిటి మండల సొండికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాండవ రామారావు హర్షం వ్యక్తం చేశారు. -
ఎస్డీసీ నిధులు దారి మళ్లింపు
● ఎస్డీసీ మాజీ ముఖ్య సలహాదారుడు ప్రదీప్ మాఝిరాయగడ: ఆదివాసీల అభ్యున్నతికి, వారి భాష, సంసృతి, విధి విధానాలను పరిరక్షించేందుకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అభివృద్ధి మండలి (ఎస్డీసీ) ఎంతగానో దొహదపడుతుండేదని ఎస్డీసీ మాజీ ముఖ్య సలహాదారుడు, మాజీ ఎంపీ ప్రదీప్ మాఝి అన్నారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎస్డీసీని రద్దు చేయడం విచారకరమన్నారు. రద్దయిన తరువాత రాయగడ జిల్లాలో ఎస్డీసీకి సంబంధించిన సుమారు 4 కోట్ల రుపాయల నిధులు దారిమళ్లాయని ఆరోపించారు. స్థానిక హోటల్ కై లాస్లో ఈ మేరకు ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఆదివాసీ జిల్లాగా గుర్తింపు పొందిన రాయగడలో ఎస్డీసీకి మంజూరైన నిధులు దుర్వినియోగమయ్యాయన్నారు. రాయగడ జిల్లా కలెక్టర్గా వ్యవహరించే ఫరూల్ పట్వారీ, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిష్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి కుమ్మకై ఆదివాసీల అభివృద్ధి కోసం వచ్చిన నిధుల్లో సుమారు 4 కోట్ల రుపాయల నిధులు దారిమళ్లించారని ఆరోపించారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేయాలని, లేదంటే తాము ఆందోళన చేయడం ఖాయమని హెచ్చరించారు. ఆదివాసీ పిల్లల కోసం ఆట వస్తువులు కొనుగోలు చేసే విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎస్డీసీని రద్దు చేసిన అనంతరం ఆ నిధులు ఏ విధంగా ఖర్చు చేశారో తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్డీసీ మాజీ చైర్మన్ (రాయగడ) అనసూయ మాఝి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, బీజేడీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ మంత్రి జగన్నాథ సరక పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర సమరయోధుడు రాబిసింగ్ మజ్జికి నివాళులు
కొరాపుట్: స్వాతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ రబిసింగ్ మజ్జి 103వ జయంతి కార్యక్రమం ఆయన స్వగ్రామం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ డివిజన్ బట్టిబెడా గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పి్ంచారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం అనంతరం రబిసింగ్ మంత్రి హోదాలో ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. గ్రామంలోని రబిసింగ్ విగ్రహానికి గ్రామస్తులతో కలసి నివాళులర్పించారు. ఉమ్మర్ కోట్ పట్టణంలో రబిసింగ్ జయంతి కార్యక్రమం నిర్వహించగా.. స్థానిక మంత్రి నిత్యానంద గోండో తన అనుచరులతో సింగ్ విగ్రహానికి నివాళులఅర్పించారు. -
పర్లాకిమిడిలో పల్స్పోలియో
పర్లాకిమిడి: జిల్లా స్థాయి పల్స్పోలియో కార్యక్రమాన్ని స్థానిక ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రి మాతాశిశు ఆస్పత్రిలో ఆదివారం ఉదయం జిల్లా ముఖ్యచికిత్సాధికారి, డీహెచ్ఓ డాక్టర్ మహ్మద్ ముబారక్ ఆలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అన్ని ప్రాథమిక, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో రెండు చుక్కల పల్స్పోలియో కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, సోమ, మంగళవారాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలు చంటి పిల్లలకు వేస్తామని అన్నారు. పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో పోలియో వ్యాధి ఎక్కువగా ఉన్నందున భారత్లో తిరిగి పల్స్పోలియో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డి.పి.యం. సరితా మహాపాత్రో ముఖ్యవక్తగా వ్యవహారించగా, జిల్లా పరిషత్తు ముఖ్యకార్యనిర్వాహాణ అధికారి శంకర్ కెరకెటా ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఇతర అతిథిలుగా డాక్టర్ రబినారాయణ దాస్, డాక్టర్ శంతును పాఢి, డీఎంఎస్ఎం ప్రణతి సాహు తదితరులు పాల్గొని మాట్లాడారు. -
నవీన్ పట్నాయక్ను కలిసిన ఎంపీ దంపతులు
భువనేశ్వర్: స్థానిక పార్లమెంట్ సభ్యురాలు అపరాజిత షడంగి దంపతులు ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలతో సంభాషించారు. గతంలో జరిగిన అనేక సంఘటనలను ప్రేమగా గుర్తుచేసుకుని వీరివురి మధ్య సంభాషణ సంతోషకరంగా కొనసాగిందని ఎంపీ అపరాజిత షడంగి తెలిపారు. ఈ సమావేశం పరస్పర గౌరవం, సానుకూల రాజకీయాల స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. నవీన్ పట్నాయక్ వినయం మరియు రాజకీయ సరిహద్దులకు అతీతంగా జీవిస్తు రాష్ట్ర ప్రజలు మరియు ఆయన అధీనంలో పని చేసిన అధికారులు తదితర వర్గాల హృదయాల్లో సుస్థిర స్థానం సాధించారు. భువనేశ్వర్ ఎంపీగా వరుసగా 2 సార్లు ఎన్నికై అధికారంలో కొనసాగుతున్న అపరాజిత షడంగి నవీన్ పట్నాయక్ హయాంలో రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారిగా తనదైన ప్రత్యేక శైలితో పలు అధికారిక, పాలనాపరమైన సంస్కరణలు ఆవిష్కరించి నవీన్ పట్నాయక్ ప్రసంశలు అందుకున్నారు. అధికారిక దక్షతతో ప్రజల ప్రేమ మరియు విశ్వాసాన్ని గెలుచుకున్న మహిళా అధికారిగా అపరాజిత షడంగి సరళత, నిజాయితీ మరియు సామాన్య ప్రజలతో సన్నిహిత సంబంధాలను సొంతం చేసుకున్నారు. సమ భావాలు కలిగిన ఈ ఇరువురు నాయకులు సమయోచితంగా సమావేశమై సంభాషించుకోవడం రాజకీయ విభేదాల కంటే మానవత్వం మరియు పరస్పర గౌరవాభిమానాలు విలువైనవని చాటి చెప్పారు. -
నవంబర్ 23న స్పందన వార్షికోత్సవం
● వివిధ పోటీల నిర్వహణకు నిర్ణయంరాయగడ: స్థానిక స్పందన సాహితీ, సాంస్తృతిక సంస్థ 30వ వార్షికోత్సవాన్ని నవంబర్ 23వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ మేరకు రామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన సభ్యుల సమావేశంలో సంస్థ అధ్యక్షులు గుడ్ల గౌరీశంకర్ ప్రకటించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థుల మధ్య వివిధ పోటీలను నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయించారు. అలాగే మహిళల మధ్య మెహేందీ పోటీలతో పాటు విద్యార్థుల మధ్య చిత్రలేఖనం, విచిత్ర వేషధారణ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ 1995 ఆగస్టు 15వ తేదీన ఆవిర్భవించిందని సంస్థ సాంస్కతిక విభాగం కార్యదర్శి కొండవలస క్రిష్ణమూర్తి పట్నాయక్ అన్నారు. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించడంలో సంస్థ విశేషంగా కృషి చేస్తుందని వివరించారు. సమావేశంలో సంస్థ సాహితీ విభాగం కార్యదర్శి సింగిడి రామారావు పాల్గొన్నారు. -
నిండు గర్భిణి.. రెండు కిలోమీటర్ల నడక
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి కతాపాల్లి పంచాయతీ బేదురుపల్లి గ్రామంలో ఆదివారం కనక్ దెయిదువువ అనే నిండు గర్భిణి రెండు కిలోమీటర్లు మట్టి రోడ్డులో కాలినడకన వెళ్లి అంబులెన్స్ను చేరుకుంది. గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో అంబులెన్స్ను కతాపల్లి కూడలి వరకు మాత్రమే వచ్చింది. దీంతో గర్భిణి రెండు కిలోమీటర్లు నడిచి అంబులెన్స్ను చేరుకున్నాక మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రూ.లక్షల విలువైన నకిలీ గుట్కా స్వాధీనం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బలిమెల పోలీసులు ఆదివారం బలిమెల పోలీసులు ఓ పూజా దుకాణం నుంచి రూ.లక్షల విలువైన నకిలీ గుట్కాలకు స్వాధీనం చేసుకున్నారు. చిత్రకొండ సమితి డైక్ 3 గ్రామానికి చెందిన ప్రశాంత్ పాత్రో బలిమెల డైలీ మార్కెట్లో ఓ పూజా సామగ్రి దుకాణాన్ని నడుపుతున్నాడు. లైసెన్స్ లేకపోవడంతో బలిమెల ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ ఆదివారం ఆ దుకాణం పై దాడి చేసి ప్రశాంత్ను అరెస్టు చేసి నకిలీ గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
● మరొకరికి గాయాలు రాయగడ: జిల్లాలోని కళ్యాణ సింగుపూర్ సమితి సికరపాయిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు సికరపాయిలోని డొంగిరియా వీధికి చెందిన నిరంజన్ మినియాక (30)గా గుర్తించగా గాయాలు తగిలిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన నవీన్ తియాకగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికిచేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. క్షతగాత్రున్ని చికిత్స కోసం గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి పంపించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి సికరపాయిలో జరుగుతున్న గజలక్ష్మి పూజలను చూసేందుకు నిరంజన్ తన బైక్పై తన గ్రామం నుంచి వెళ్లాడు. అదే సమయంలో పూజ మండపం వద్ద ఎదురుగా మరో బైకుపై వస్తున్న నవీన్ అదుపుతప్పి ఇద్దరు ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు బైకుల పైనుంచి కింద పడిపొగా సంఘటన స్థలం వద్దే నిరంజన్ తీవ్రగాయాలకు గురై మృతి చెందగా నవీన్ గాయాల పాలయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిడుగు పడి ముగ్గురికి గాయాలు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా తామ్సా పంచాయతీ చాంపాఖారి గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి ముగ్గురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన శంకర్ గోలారీ అనే వ్యక్తి తన కుటుంబంతో ఇంటిలో నిద్రపోతున్న సమయంలో పైకప్పుపై పిడుగు పడింది. దీంతో ముగ్గురు గాయపడ్డారు. ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. పాప పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆస్పత్రిపైనుంచి పడి వ్యక్తి మృతి ఎంవీపీ కాలనీ: కోరాపుట్కు చెందిన పూజారి నరసింగ్(28) అనే వ్యక్తి ఎంవీపీ కాలనీలోని మెడికవర్ ఆస్పత్రి 5వ అంతస్తు నుంచి పడి మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నరసింగ్ కోరాపుట్ జిల్లా కెండుగూడ గ్రామంలో కుటుంబ సభ్యులతో నివసిస్తూ.. స్థానిక ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా అతను మద్యానికి బానిస కావడంతో పూజారి విధుల నుంచి గ్రామస్తులు తొలగించారు. దీంతో మద్యానికి మరింతగా బానిసయ్యాడు. ఇటీవల అతని స్నేహితురాలు తులసిదాస్ అత్తగారికి అనారోగ్యంగా ఉండటంతో ఆమెతో కలిసి మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆస్పత్రిలో కనిపించకపోవడంతో అతని భార్య పున్నీ పూజారికి తులసీదాస్ ఫోన్చేసి తెలియజేసింది. అయితే అదేరోజు అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆస్పత్రి 5వ అంతస్తు నుంచి పడిపోవడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులను, వారి బంధువులను అప్రమత్తం చేయడంతో తులసి దాస్ చనిపోయిన వ్యక్తి తనతోపాటు వచ్చిన నరసింగ్గా గుర్తించి ఆస్పత్రి వర్గాలకు తెలిపింది. వారు అత్యవసర వైద్య విభాగానికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై అతని భార్య పున్నీ పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్త మద్యానికి బానిసై కొంతకాలంగా మతిస్థితిమితం లేకుండా తిరుగుతున్నాడని, ఈ క్రమంలో ఆస్పత్రి పైఅంతస్తు నుంచి పడిపోయి ఉంటాడని, అతని మృతిపై ఎలాంటి అనుమానం లేదని భార్య పున్నీ పూజారి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
మజ్జిగౌరి దర్శనానికి భక్తుల తాకిడి
రాయగడ: ఆంధ్ర, ఒడిశా ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి మందిరానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారి మందిరాన్ని ఉదయం తెల్లవారుజాము 3.30 గంటలకే మంగళహారతితో తెరుచుకోగా అప్పటి నుంచే భక్తులు క్యూలైన్లో బారులుదీరారు. భక్తుల సౌకర్యార్ధం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన 300 రుపాయల ప్రత్యేక దర్శనంలో కూడా రద్దీ బాగా కనిపించింది. ప్రత్యేక దర్శనం టిక్కెట్ తీసుకున్న భక్తులకు అమ్మవారి దర్శనం కోసం సుమారు మూడు గంటల సమయం పట్టింది. అయితే సాధారణ దర్శనం కోసం భక్తులు పడిగాపులు పడ్డారు. ఇదిలాఉండగా అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల ఇబ్బందులు ఎదుర్కొని గత్యంతరం లేక ఆరుబయట మొక్కలు తీర్చుకుని వెళ్లాల్సి వచ్చింది. -
శ్రీ మందిరంపై ఎగిరిన డ్రోన్ స్వాధీనం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని ఆలయ శిఖరంపై చక్కర్లు కొట్టిన డ్రోన్ను భద్రతా దళాలు స్వాధీనపరచుకున్నారు. శ్రీ మందిరం ప్రాంగణం నో ఫ్లయింగ్ జోన్గా లోగడ ప్రకటించారు. ఇటీవల ముగిసిన రథ యాత్ర సందర్భంగా డ్రోన్ వ్యతిరేక ప్రాంతంగా ప్రకటించారు. అధికారిక ప్రకటనలు ఇలా ఉండగా తరచూ ఆలయ శిఖరంపై తరచు డ్రోన్ చక్కర్లు కొట్టడం, డ్రోన్ వీడియో రికార్డింగు క్లిప్లు సాంఘిక మాధ్యమంలో ప్రసారం కావడం భక్తజన హృదయాల్ని కలవరపరుస్తున్నాయి. తాజాగా శ్రీ మందిరం ప్రాంగణం రెడ్ జోన్లో చేర్చినట్లు పౌర విమాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) ప్రకటించింది. తాజా సంఘటనలో శ్రీ మందిరం శిఖరంపై డ్రోన్ చక్కర్లు కొట్టించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని స్థానిక శని మందిర్ వీధిలో డ్రోన్ స్వాధీనపరచుకున్నారు. డ్రోన్ను ఎగురవేసిన చత్తీస్గఢ్కు చెందిన యువకుడిగా గుర్తించి రెడ్ జోన్ నిబంధనల పరిధిలో అరెస్టు చేసినట్లు పూరీ జిల్లా పోలీసులు తెలిపారు. -
భారీగా గంజాయి స్వాధీనం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితి కుర్లగుడ జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. కూరగాయల లోడుతో వెళ్తున్న వ్యాన్ కింది భాగాన క్వింటాల్ గంజాయి పట్టుబడింది. ఈ వ్యాన్లో ఉన్న నబరంగ్పూర్ జిల్లా రాయగర్సమితికి చెందిన రాజు మండల్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణ సింగ్, హర్తిక్ చౌహాన్లను అరెస్ట్ చేశారు. మల్కన్గిరి జిల్లా బలిమెలలో గంజాయి కొనుగోలు చేసి ఉత్తర్ ప్రదేశ్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బొయిపరిగుడ ఓఐసీ డొంబురుధర్ బట్రియా, ఎస్ఐ ధీరేంద్ర బారిక్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కూరగాయల వాహనంలో గంజాయి జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ పోలీసులు కూరగాయలు రవాణా చేస్తున్న వ్యాన్లో గంజాయి పట్టుకున్నారు. శనివారం మల్కన్గిరి జిల్లా బలిమెల నుంచి కుడుములుగుమ్మ, బొయిపరిగుడల మీదుగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి గంజాయి రవాణా జరుగుతోందని, ఓ వ్యాన్లో గంజాయి తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఏఎస్ఐ ధీరేంధ్ర బారిక్ నేతృత్వంలో ఒక టీమ్ను పంపిచామని బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురు బత్రిక తెలిపారు. వ్యాన్ను అడ్డుకుని తనిఖీ చేయగా గంజాయి దొరికిందని, వ్యాన్ను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు. వారిలో ఒకరు నవరంగపూర్ జిల్లా రాయగర్ వాసి రాజు మండల్ కాగా ఇద్దరు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాసులు కృష్ణ సింగ్,హితిక్ చౌహాన్లు అని పోలీసు అధికారి వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గంజాయితో వ్యక్తి అరెస్టు జయపురం: జయపురం రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో జయపురం అబ్కారి సిబ్బంది దాడి జరిపి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి వద్ద 4.1 కిలోల గంజాయి పట్టుకున్నట్లు జయపురం అబ్కారి సటేషన్ అధికారి శుబ్రత్ కేశరీ హిరన్ వెల్లడించారు. అరెస్టయిన వ్యక్తి కేరళ రాష్ట్ర తిరువనంతపూర్ జిల్లా పుబర పోలీసు స్టేషన్ పరిధి కొలురు గ్రామం బయిజు జెమ్స(48) అని వెల్లడించారు. నిందితుడు ఈ ప్రాంతంలో చట్ట విరుద్ధంగా ఎక్కడో గంజాయి కొని బెగ్లో భధ్ర పరచి రైలులో విశాఖపట్నం, అక్కడి నుంచి కేరళకు వెళ్లేందుకు జయపురం రైల్ స్టేషన్ ప్రాంతంలో వేచి ఉన్నాడని తెలిపారు. -
దాటితే చేటు
లెవెల్ క్రాసింగ్ గేటు..● ప్రమాదకరంగా గేట్లు దాటుతున్న వైనం ● ప్రమాదాల నివారణకు అధికారుల చర్యలు భువనేశ్వర్: రహదారి, రైలు మార్గం కూడలిలో లెవెల్ క్రాసింగ్ గేట్లు ప్రజల ప్రాణాలకు భద్రతగా నిలుస్తున్నాయి. ప్రాణాపాయ పరిస్థితులు నివారించి రైళ్లను సకాలంలో నడిపించే లక్ష్యంతో రైల్వే శాఖ ఈ గేట్లు నిర్వహిస్తోంది. అక్కడక్కడా ఈ గేట్లను ప్రమాదకరంగా దాటుతూ చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి చర్యలు రైల్వే చట్టం ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ఈ అవాంఛనీయ సంఘటనల నివారణలో రోడ్డు వినియోగదారులు సహకరించాలని ఖుర్దారోడ్ రైలు మండలం అభ్యర్థిస్తోంది. గేటు మూసివేసేటప్పుడు రోడ్డు వినియోగదారులు బలవంతంగా లెవెల్ క్రాసింగ్ గేట్లను దాటడానికి ప్రయత్నించడం చట్ట వ్యతిరేక చర్య. బలవంతంగా లెవెల్ క్రాసింగ్ గేట్లు దాటే సందర్భాల్లో గేట్ల భద్రతా భాగాలు దెబ్బతింటున్నాయి. రైలు సిగ్నల్ వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ బాధ్యతారహిత ప్రవర్తన ఫలితంగా రైళ్లు సమయపాలన కోల్పోవడం, రైలు కార్యకలాపాలకు అంతరాయం, ప్రాణాలకు మరియు ఆస్తికి ప్రమాదం ఏర్పడుతోంది. గత ఏడాది తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ మండలంలో సమగ్రంగా 113 లెవెల్ క్రాసింగ్ గేటు ఉల్లంఘన సంఘటనలు నమోదయ్యాయి. ఈ నేరం కింద 92 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 8 వరకు ఖుర్దారోడ్ మండలంలో 64 లెవెల్ క్రాసింగ్ గేట్ అక్రమ ఉల్లంఘన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయా సంఘటనలో ఇప్పటి వరకు 47 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. ఖుర్దారోడ్ మండలంలో ఉల్లంఘనలు ఖుర్దారోడ్ మండలంలో పలు చోట్ల లెవెల్ క్రాసింగ్ గేట్లు వేసి ఉండగా అతిక్రమించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. భువనేశ్వర్ ప్రాంతంలో ఇటువంటి 11 సంఘటనలు సంభవించగా బరంపురం ప్రాంతంలో 8, పూరీ, భద్రక్, జాజ్పూర్ కెంజొహర్ రోడ్ ప్రాంతాల్లో 7 చొప్పున లెవెల్ క్రాసింగు గేటుల నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. కటక్ ప్రాంతంలో 6, పలాస, ఖుర్దా రోడ్ ప్రాంతాలలో 5 వంతున ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవగాహన కసరత్తు లెవెల్ క్రాసింగ్ గేట్ల అక్రమ ఉల్లంఘన నివారణకు ఖుర్దా రోడ్ రైల్వే మండలం భద్రతా విభాగం, రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) సంయుక్తంగా తరచూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ దిశలో సాధారణ ప్రజానీకం స్వచ్ఛందంగా సహకరించాలని అధికారులు కోరుతున్నారు. గేటు అతిక్రమణ అపాయం రైళ్లు, రోడ్డు వాహనాలు సురక్షితంగా, సజావుగా ప్రయాణించడానికి ప్రజల మద్దతు చాలా అవసరం. పట్టాలపై అధిక వేగంతో దూసుకువస్తున్న రైలుని అకస్మాత్తుగా ఆపే అవకాశం ఉండదు. పరుగులు తీస్తున్న రైలుని అత్యవసరంగా నియంత్రించేందుకు బ్రేక్లు వేసిన వెంటనే ఆగకుండా కొంత దూరం పోయిన తర్వాత ఆధీనంలోకి వస్తుంది. ఈ స్వల్ప నిడివిలో ప్రాణాపాయ పరిస్థితులు నెలకొంటాయి. మూసి ఉన్న లెవెల్ క్రాసింగ్ గేట్ను దాటడానికి చేసే ఏ ప్రయత్నమైనా విపత్తుకు ఆహ్వానం పలికినట్లేనని అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి నిర్లక్ష్య చర్యలు ఉల్లంఘనకు పాల్పడే వారితో రైలు ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసి రైల్వే ఆస్తికి అపార నష్టం చేకూర్చుతాయి. రైలు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తాయి. ప్రయాణికులు, సరుకు రవాణా రంగాల్లో సమయపాలన విపరీతంగా ప్రభావితమై సుఖమయమైన రైలు ప్రయాణం అసౌకర్యంగా పరిణమిస్తుంది. నిబంధనలు అతిక్రమించి వేసి ఉన్న గేటు కింద నుంచి వెళ్తున్న ప్రయాణికుడు -
పేదలకు దుస్తులు పంపిణీ
రాయగడ: స్థానిక లయన్స్ క్లబ్ అపరాజిత మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం సదరు సమితి కొత్తపేట కమ్యూనిటీ హాల్లో పేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తపేట పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నిరుపేదలకు 80 చీరలు, 70 తువ్వాల్లు, 70 దోవతీలను పంపిణీ చేశారు. అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన వారికి ఉచితంగా భోజన సౌకర్యం కల్పించారు. లయన్స్ క్లబ్ అపరాజిత మహిళా విభాగం కొద్ది నెలలుగా ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని.. ఇందులో భాగంగా పేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని దీపావళి సందర్భంగా నిర్వహించామని క్లబ్ కార్యదర్శి బరాటం అవంతి తెలియజేశారు. కార్యక్రమంలో క్లబ్ మిడియేట్ పూర్వ జిల్లా గవర్నర్ సరస్వతి పాత్రో, అధ్యక్షులు జి.రామక్రిష్ణ, ఉపాధ్యాక్షురాలు రజిత కోరాడ, ఉపాధ్యక్షురాలు కింతలి శ్రీవాస్తవ, పలువురు సభ్యులు పాల్గొన్నారు. నాగావళి నదిలో వృద్ధుడు గల్లంతు రాయగడ: మల్లిగాం సమీపంలోని నాగావళి నదిలో మరో వృద్ధుడు గల్లంతయ్యాడు. సదరు సమితి మల్లిగాం గ్రామానికి చెందిన పెంటయ్య జిలకర్ర (70) అనే వృద్ధుడు శుక్రవారం సాయంత్రం పశువులను పచ్చిక మేపేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కొన్ని పశువులు నది మధ్యకు వెళ్లడంతో వాటిని గట్టుమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేసేందుకు నదిలోనికి దిగాడు. అయితే నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది శుక్రవారం రాత్రి వరకు గాలించినప్పటికీ ఆచూకీ లేకపోవడంతో శనివారం కూడా గాలించారు. గత పది రోజుల్లో నాగవళి నదిలో పది మంది వరకు మృత్యువాతకు గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఘటనలో గాయాలు పాలైన వారిలో జింజిలిబడి గ్రామానికి చెందిన శంభు, రామచంద్రహుయికలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జింజిలిబడి గ్రామం నుంచి శంభు అనే యువకుడు తన గ్రామం నుంచి వ్యక్తిగత పనిపై జేకేపూర్కు బైక్పై వెళ్తున్న సమయంలో పెట్రోల్బంక్ సమీపంలో ఎదురుగా మరో బైక్పై వస్తున్న అదే గ్రామానికి చెందిన రామచంద్రహుయిక అనే వ్యక్తి ఎదురెదురుగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ముందు భాగాలు నుజ్జునుజ్జవ్వగా బైకు చోదకులు తీవ్రగాయాలకు గురయ్యారు. అక్కడగల వారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన చందిలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులకు వక్తృత్వ పోటీలు పర్లాకిమిడి: స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి సైన్సు సెమినార్లో భాగంగా ‘క్వాంటం యుగం ప్రారంభం’ అనే అంశంపై విద్యార్థులకు వక్తృత్వ పోటీలు శనివారం నిర్వహించారు. దీనివల్ల మనం ఎలాంటి సవాళ్లు ఎదుర్కోగలమో పలువురు విద్యార్థులు వివరించారు. న్యాయ నిర్ణేతలుగా జాతీయ అవార్డు గ్రహీత బినోద్ చంద్ర జెన్నా, సాత్మిక్ పట్నాయిక్లు వ్యవహరించగా, ముఖ్య అతిథిగా జిల్లా సైన్సు కో–ఆర్డినేటర్ అంపోలు రవికుమార్, హెచ్ఎం పూర్ణచంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. -
ధనధాన్య కృషి పథకం ప్రారంభం
రాయగడ: లోక్నాయక్ స్వర్గీయ జయప్రకాష్ నారాయణ్ జయంతిని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధనధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని వర్చువల్ మాధ్యమంలో శనివారం నాడు ప్రారంభించారు. స్థానిక రాణిగుడఫారంలోని బిజుపట్నాయక్ కళ్యాణ మండపంలో ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ముఖ్యఅతిథిగా హాజరై ఢిల్లీ నుంచి ప్రసారమైన వర్చువల్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రైతుల సంక్షేమం కోసం ఈ పథకం ప్రారంభించామని వివరించారు. పథకం ముఖ్యఉద్దేశాన్ని మోదీ వర్చువల్ మాధ్యమంలో రైతునుద్దేశించి ప్రసంగించారు. దేశంలో దాదాపు వంద జిల్లాల్లో రైతులు పప్పుదినుసుల పంటలను పండించి ఆర్థికంగా ముందుకు వెళుతున్నారని మోదీ అన్నారు. ఒడిశా రాష్ట్రంలోని నువాపడ, మల్కన్గిరి, కంధమాల్, సుందర్ఘడ్ జిల్లాల్లో ఇప్పటికే వ్యవసాయం పట్ల రైతులు ఆవగాహన పొంది ఆర్థిక సారికారితను పొందుతున్నారని అన్నారు. రాయగడ జిల్లాలో కూడా 11 సమితుల్లో 180 మందికి పైగా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇదేతరహా పంటలపై ఆసక్తి కనబరచాలని సూచించారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
రాయగడ: జిల్లాలోని రామనగుడ సమితి గోగుపాడు పంచాయతీలోని సికల గ్రామ సమీపంలోని ఒండరాబంగ్ కొండపై ఒక యువకుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న కేసులో సంబంధం ఉన్న నిందితుడుని శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని మన్యం పార్వతీపురం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం ఆడురుబంగీ గ్రామానికి చెందిన మంగులు మండంగి (52)గా గుర్తించారు. అతని నుంచి రెండు నాటు తుపాకీలను స్వాధీనం చేసుకుని నిందిడుడిని గుణుపూర్ సబ్ డివిజన్ కోర్టుకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఈ నెల ఏదో తేదీన సికల గ్రామ సమీపంలోని ఒండురుబంగ్ కొండపై మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుని ఆధార్ కార్డును ఆధారంగా మృతుడు పువ్వల పారయ్యగా పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని ఒండురుబంగ్ గ్రామవాసిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం మృతుని కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు రామనగుడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
బీజేపీలోకి నువాపడ మాజీ ఎమ్మెల్యే కుమారుడు
భువనేశ్వర్: నువాపడా శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికకు ముందు మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ఢొలొకియా కుమారుడు జాయ్ ఢొలొకియా శనివారం భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్, మంత్రి సూర్య వంశీ సూరజ్, బీజేపీ సీనియర్ నాయకుడు బసంత పండా, ఎమ్మెల్యే జయ నారాయణ మిశ్రా, ఇతర సీనియర్ బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తల సమక్షంలో ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కాషాయ పార్టీలో చేరారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనం రేపింది. నువాపడా ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జాయ్ ఢొలొకియా భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో రసవత్తర ఘట్టంగా మలుపు తిరిగింది. ఆయన తండ్రి దివంగత రాజేంద్ర ఢొలొకియా బిజూ జనతా దళ్ విశ్వాసపాత్రుడుగా జీవితాంతం కొనసాగారు. బీజేడీ అభ్యర్థిగా నువాపడా నియోజక వర్గం నుంచి వరుసగా 4 సార్లు విజేతగా నిలిచి దీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించారు. నువాపడా ఉప ఎన్నికలో జాయ్ ఢొలొకియా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం తథ్యమని తేటతెల్లమైంది. జాయ్ ఢొలొకియా చేరిక నువాపడాలో బీజేపీ గెలుపు అవకాశాలను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఛేదించేందుకు మార్గం సుగమమైంది. 2024 శాసన సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు బసంత్ పండా కుమారుడు అభినందన్ పండా బీజేడీ అభ్యర్థి రాజేంద్ర ఢొలొకియా మరియు ఘసిరామ్ మాఝి కంటే వెనుకబడి మూడో స్థానంలో నిలిచారు. జాయ్ ఢొలొకియా బీజేపీలో చేరడం బసంత్ పండా పరపతిని ప్రభావితం చేస్తుంది. నవంబర్ 11న నువాపడా శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నిక జరుగనుంది. జాయ్ ఢొలొకియా పార్టీ ఫిరాయింపు నువాపడా ఉప ఎన్నికని ఉత్కంఠ భరితంగా మలిచింది. ఈ పరిణామం వారసత్వ ఓటు బ్యాంకు విభజన ప్రేరేపిస్తుంది. దశాబ్దాల తరబడి ప్రజా సేవలో దివంగత రాజేంద్ర ఢొలొకియా బలమైన వ్యక్తిగత అనుచరులను కూడగట్టుకున్నారు. దీని వల్ల నువాపడాలో బిజూ జనతా దళ్ బలమైన స్థానం సొంతం చేసుకుంది. ఈ వ్యవస్థతో ఆయన కుమారుడు జాయ్ డొలొఖియా గెలుపు తథ్యమనే భావన ఉభయ బీజేపీ, బీజేడీలో తొలి నుంచి స్థిరపడింది. చివరి క్షణంలో బీజేపీలోకి దాటవేత బీజేడీకి మింగుడు పడని పరిస్థితిగా తలెత్తింది. స్థానిక విశ్వసనీయతసై బీజేపీ ఆశలు డొలొకియా పరివారం పట్ల నువాపడా నియోజక వర్గంలో స్థిరపడిన విశ్వసనీయత జాయ్ ఢొలొకియా ప్రవేశంతో చేజిక్కించుకున్నట్లు బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. మరో వైపు ఈ నియోజక వర్గం తిరుగులేని బీజేపీ నాయకుడిగా వెలుగొందిన బసంత్ పండా కొంత మేరకు నిరుత్సాహపడినట్లు బీజేపీ శిబిరం సమాచారం. పార్టీ పట్ల విధేయతతో ఆయన చిత్తశుద్ధితో వ్యవహరిస్తే తప్ప బీజేపీ గెలుపు బాట నికరం కాని ప్రతికూల పరిస్థితులు పొంచి ఉన్నాయి. బసంత్ పండా అంకిత భావం బీజేడీ (రాజేంద్ర డొలొకియా) సానుభూతి, వారసత్వ ఓటు బ్యాంకు చీలికని కొంత మేరకు సర్దుబాటు చేస్తుంది. ఢొలొకియా, పండా మధ్య నిష్కల్మష ఐక్యత ఉప ఎన్నికలో బీజేపీ విజయానికి తొలి మెట్టుగా నిలుస్తుంది. వచ్చే నెలలో జరగనున్న నువాపడా నియోజక వర్గం ఉప ఎన్నికలో సమగ్రంగా బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ తీవ్రతరమైంది. గత ఎన్నికల విశ్లేషణ ప్రకారం త్రిముఖ పోటీలో కాంగ్రెసు అభ్యర్థి ఘసిరామ్ మాఝి పరిస్థితి పదిలంగా గోచరిస్తుంది. 2024లో రాజేంద్ర ఢొలొకియా చేతిలో దాదాపు 10,000 ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్కు చెందిన ఘసిరామ్ మాఝి తన స్థావరాన్ని మరింత బలోపేతం చేసుకోగలిగే అవకాశం లేకపోలేదు. చివరి క్షణం వరకు దివంగత సిటింగ్ ఎమ్మెల్యే కుమారునిపై సానుభూతి ఓట్లు పోలింగ్ పట్ల గట్టి నమ్మకం పెట్టుకున్న బీజేడీ పరిస్థితి డోలాయమానంగా మారింది. జాయ్ డొలొకియా పార్టీ ఫిరాయింపు ఆకస్మిక పరిణామం నేపథ్యంలో విపక్షం హోదాకు దిగజారిన బిజూ జనతా దళ్ సొంత కేడర్, సంస్థాగత యంత్రాంగంపై ఆధారపడి ఉప ఎన్నిక పోరు నుంచి గట్టెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. -
వీఆర్ఓల సంఘం కార్యవర్గ ఎన్నిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అడ్హక్ అధ్యక్షుడిగా డి.రాజేష్ ఎన్నికయ్యారు. శనివారం శ్రీకాకుళంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్లో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన అంజనీకుమార్ (చంటి) అధ్యక్షతన వీఆర్ఓల సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు ( గ్రేడ్–1, 2, ప్రమోటీ, నామినీ) హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా డి.రాజేష్, సహాధ్యక్షుడిగా ప్రవీ ణ్, జనరల్ సెక్రటరీగా బి.రాంజీ, ట్రెజరర్గా జి. డిల్లేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లుగా ఎన్.అప్పలనా యుడు, పి.శ్రావణి, జాయింట్ సెక్రటరీలుగా ఎస్. కొండలరావు, ధనలక్ష్మి, వెబ్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ సెక్రటరీగా మనోజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా విశ్వనాథం, స్పోర్ట్సు అండ్ కల్చరల్ సెక్రటరీగా నాగరాజు, స్టేట్ ఈసీ సభ్యులుగా గణేష్ ప్రసాద్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ ఏ స్టేట్ సెక్రటరీ పి.శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రట రీ బి.వి.వి.ఎన్.రాజు, ఏపీవీఆర్ఏ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ అనుపమ, అసోసియేట్ ప్రెసిడెంట్ బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
15 ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం
భువనేశ్వర్: లోక్ సేవా భవన్ కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన జరిగిన 28వ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశంలో 10 విభాగాలు ప్రతిపాదించిన 15 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ వివరాలను ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా మీడియాకు వివరించారు. రాష్ట్ర మంత్రి వర్గం రాష్ట్రంలో అంతర్ రాష్ట్ర నదుల అనుసంధాన పథకం ప్రతిపాదనను ఆమోదించింది. దీని కోసం పంచ వర్ష వ్యయ ప్రణాళిక రూపొందించారు. ఈ పథకం వ్యయ ప్రణాళిక రూ.1790.00 కోట్లు. ఈ నిధులను 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి 2029–30 వరకు క్రమ పద్ధతిలో అంచెలంచెలుగా వెచ్చించాలని మంత్రి మండలి నిర్ణయించింది. నీటి మిగులు నదీ పరీవాహక ప్రాంతాలను నీటి కొరత ఉన్న ప్రాంతాలతో అనుసంధానించడం ద్వారా అంతర్ రాష్ట్ర నీటి పంపిణీని బలపరచడం ఈ పథకం లక్ష్యం. దీని వల్ల కరువు స్థితిస్థాపకతను మెరుగుపరచడం, అదనపు నీటి నిల్వను సృష్టించడం, వరద ప్రమాదాలను తగ్గించడం, ఆరు ప్రధాన ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం సుసాధ్యం అవుతాయని మంత్రి వర్గం అభిప్రాయపడింది. అంతర్ రాష్ట్ర నదీ అనుసంధానం పథకాలు ● కాట్రా లింక్ ప్రాజెక్ట్ (కంసపాల్ ఐఎస్ఎస్ నుండి ఫీడర్ ఛానల్) ● వంశధార – రుషికుల్య (నందిని నల్లా) ఇంట్రా ● లింక్ ప్రాజెక్ట్ ● హిరాధర్బాతి వరద ప్రవాహ కాలువ ప్రాజెక్ట్ ● బహుదా – తంపరా లింక్ ప్రాజెక్ట్ ● ఓంగ్ – సుక్ తేల్ గార్లాండ్ కాలువ ప్రాజెక్ట్ ● తెలంగిరి – ఎగువ కోలాబ్ పీఎస్పీ ప్రాజెక్ట్ -
పిడుగు పడి పశువులు దుర్మరణం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో శనివారం పిడుగు పాటుకు మూడు పశువులు దుర్మరణం పాలయ్యాయి. ఈ సంఘటన బొయిపరిగుడ సమితి కొలార్ గ్రామ పంచాయతీ హతిపకన సమీపం గదియగుడ గ్రామంలో జరిగిందని సమాచారం. ఆ గ్రామంలో ఉరుములతో కూడిన వర్షం అకస్మాత్తుగా పడి పిడుగులు పడటంతో ఒక ఆవుతోపాటు రెండు మేకలు మరణించాయి. అందిన సమాచారం ప్రకారం గదియగుడ గ్రామంలో ఒక పశువుల కాపరి ఆవులు గొర్రెలు, మేకలను మేతకు గ్రామ సమీపంలో అడవికి తీసుకువెళ్లాడు. అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వర్షం పడటంతో అతడు చెట్టు కిందకు వెళ్లి తల దాచుకున్నాడు. ఆ సమయంలో పశువులు ఉన్న చోట పిడుగులు పడ్డాయి. ఆ ప్రమాదంలో ఒక ఆవు, రెండు మేకలు మరణించాయి. పశువుల కాపరి పిడుగు పడిన చోటుకి కొంత దూరంలో ఉండటం వల్ల అతడు తృటిలో ప్రమాదం నుంచి బయట పడ్డాడు. పిడుగు పడి ఆ గ్రామం భీమ బొడొనాయిక్ ఆవు, రతన శిశా,గురు కిరసానిల రెండు మేకలు మరణించాయని తెలిపారు. -
18న చెకుముకి సైన్స్ సంబరాలు
శ్రీకాకుళం: చెకుముకి సైన్స్ సంబరాలను విజయ వంతం చేయాలని జన విజ్ఞాన వేదిక ఎడ్యుకేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ పిలుపునిచ్చా రు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవనంలో చెకుము కి సైన్స్ సంబరాల కన్వీనర్ పి.కూర్మారావు అధ్యక్షతన పోస్టర్లు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చెకుముకి సైన్స్ సంబరాలు పాఠశాల స్థాయిలో అక్టోబర్ 18న, మండల స్థాయిలో నవంబర్ 1న, జిల్లా స్థాయిలో నవంబర్ 23న, రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 12 నుంచి 14 తేదీల్లో జరుగుతాయని వివరించా రు. విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయు లు, విద్యార్థులు, సైన్స్ అభిమానులు హాజరై విజ యవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కామేశ్వరరావు, జి.వాసుదేవరావు, ఎస్.సాయి శ్రీనివాస్ శ ర్మ, యూటీఎఫ్ జిల్లా నాయకులు బి.శ్రీరామ్మూర్తి, పి.అప్పారావు, బి.ధనలక్ష్మి, ఎస్.స్వర్ణకుమారి, బి. మోహనరావు, ఎస్.సంజీవరావు పాల్గొన్నారు. -
మానసిక ఆరోగ్యంపై అవగాహన
జయపురం: జయపురం సమితి అంబాగుడ గ్రామ పంచాయతీ రొండాపల్లిలో కొరాపుట్ న్యాయ సేవా ప్రదీకరణ ఆధ్వర్యంలో మానసిక వైద్య శిబివార్ని శుక్రవారం నిర్వహించారు. కొరాపుట్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహంతి సూచన మేరకు రొండాపల్లిలోని జయపురం కాలేజీ ఆఫ్ ఫార్మసీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సివిల్ కోర్టు రిజిస్ట్రాస్టార్, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం ఇన్చార్జి కార్యదర్శి బిష్ణు ప్రసాద్ దేవత ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ పదో తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మానసిక ఆరోగ్య ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించటంతో పాటు మానసిక ఆరోగ్యంపై ప్రజలను చైతన్యవంతులను చేయడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు అన్నారు. న్యాయాధికారులు హరమాన్ దాస్, భీష్మ రౌత్ రాయ్, జయపురం కాలేజీ ఆఫ్ ఫార్మసీ రొండాపల్లి డైరెక్టర్ ప్రియంబద సారంగి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ సత్యబ్రత జెన, జిల్లా వైద్యాధికారి డాక్టర్ దిలీప్కుమార్ జెన, జయపురం వైద్యాఽధికారి డాక్టర్ సవ్యసాచి మహాపాత్రో, శిశుకళ్యాణ కమిటీ సభ్యురాలు భానుమతి పూజా తదితరులు ప్రసంగిస్తూ మానసిక ఆరోగ్యంపై అందరూ దృష్టిసారించాలన్నారు. మానసిక వ్యాధుల నియంత్రణ, మానసిక రోగుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. -
ఉత్సాహంగా పోషణ వేడుకలు
పర్లాకిమిడి: జిల్లా స్థాయి రాష్ట్రీయ పోషణ మాసోత్సవాన్ని స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్సు హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆదనపు మేజిస్ట్రట్ ఫాల్గునీ మఝి, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి మనోరమా దేవి, మిషన్ శక్తి డైరెక్టర్ టిమోన్ బోరా, ప్రోగ్రాం, ప్రోటెక్షన్ అధికారి శారదా పట్నాయక్, పీవో సునీతా రోథ్ పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో బాలలకు నెల రోజుల పాటు పోషకాహారం అందించాలని ఏడీఎం ఫల్గునీ మఝి సూచించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ హాల్ బయట అంగన్వాడీ వర్కర్లు పోషక విలువల కలిగిన కాయగూరలు, వంటల ప్రదర్శన స్టాల్ నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ వరకూ జిల్లాలోని అన్ని సమితి కేంద్రాల్లో రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలను నిర్వహిస్తామని ప్రోగ్రాం ఆఫీసర్ శారదా పట్నాయక్ తెలిపారు. -
ముఖ్యమంత్రిని కలిసిన తిరుపతి పాణిగ్రాహి
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి కలిశారు. ఈ సందర్భంగా హైటెక్ ఉన్నత శ్రేణి ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా సౌలభ్యం కల్పించడంపై ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి పాణిగ్రాహి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా రాష్ట్రంలో ప్రారంభించిన ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ఆరోగ్య సేవల రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది. దిగువ, మధ్యతరగతి, పేద మరియు బలహీన వర్గాలకు చికిత్స సులభతరమైంది. ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ కారణంగా మణిపూర్, చత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర దూరప్రాంతాల నుంచి విచ్చేసిన రోగులకు హైటెక్ ఆస్పత్రిలో ఉన్నత వైద్య, చికిత్స సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. -
ఉత్సాహంగా పద్యకవితల పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో యువ రచయితల వేదిక అధ్యక్షురాలు తంగి ఎర్రమ్మ ఆధ్వర్యంలో జరిగిన నెలవారీ సమావేశంలో శనివారం పద్యకవితల పోటీలు ఉత్సాహంగా సాగాయి. బొంతు సూర్యనారాయణ, బోకర శ్రీనివాసరావు, రోణంకి విశ్వేశ్వరరావులు తొలి మూడు స్థానాల్లో నిలవగా.. రెడ్డి పద్మావతి, కుప్పిలి వెంకటరమణలకు కన్సోలేషన్ బహుమతులు లభించాయి. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, విశ్రాంత అధ్యాపకులు పిలకా శాంతమ్మ, డి.పార్వతీశం చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం భాషాభివృద్ధిపై ఆర్.ఢిల్లీశ్వరరావు, ఆర్.విశ్వేశ్వరరావు, ఆర్.పద్మావతి, జి.గోపాలకృష్ణ, కె.జనార్దనరావు, డి.పార్వతీశం, డి.ఈశ్వరరావులు కవితల్ని వినిపించారు. కార్యక్రమంలో డాక్టర్ పి.మాలతి, జి.సునీత, శివతేజ, ఆర్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పేకాట శిబిరంపై దాడి
పర్లాకిమిడి: లబార్ సింగి వద్ద పేకాట శిబిరంపై ఆకస్మికంగా దాడి జరిపి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. గజపతి జిల్లాలో మోహన పోలీస్స్టేషన్ పరిధిలో చంద్రగిరి జీపీ లబార్సింగి వద్ద పేకాట శిబిరంపై దాడి చేసి తొమ్మిది మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.12,200లు తోపాటు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని తిలక్నగర్లో మహిళా యాంకర్ మీనా ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..మీనా గత నెల 21న బీరువాలో భద్రపరిచిన బంగారు వస్తువులు చోరీకి గురవ్వడంతో ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చోరీకి పాల్పడిన ది సీపన్నాయుడుపేటకు చెందిన బెండి అజ య్గా గుర్తించారు. ఈయనపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. అజయ్ నుంచి ఐదు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. టెక్కలి: అన్ని రకాల భూమిపత్రాలతో సాగు చేస్తున్న భూములను ఇప్పటికిప్పుడు ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు ఏర్పాటు చేసి తమను అన్యాయం చేస్తున్నారని కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామానికి చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో అధికారులు తమను ఇబ్బందులు గురి చేస్తున్నారని వాపోయారు. వివరాల్లోకి వెళితే.. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో పెద్దబమ్మిడి సర్పంచ్ మెండ తాతయ్య సహకారంతో గ్రామంలోని పోరంబోకు భూమిని సుమారు 38 మంది నిరుపేద దళితులకు ఒక్కొక్కరికి 26 సెంట్లు చొప్పున కేటాయించారు. భూ పట్టాలతో పాటు పాస్ పుస్తకాలు, ఇతర భూపత్రాలు అందజేశారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం, ఇటీవల అన్నదాత సుఖీభవ పథకం కూడా వర్తింపజేశారు. ప్రస్తుతం ఆయా భూముల్లో వ్యవసాయం, ఇతర పంటలను పండిస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా శుక్రవారం రాత్రి సమయంలో రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడంతో దళితులంతా ఆందోళన చెందుతున్నారు. ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ ఎలక్ట్రికల్ ఉద్యోగిగా పనిచేస్తున్న గంగు మోహనరావు పాతిన వాని పేటలో వీధిలైట్లు వేస్తుండగా స్తంభం నుంచి జారిపడిపోవడంతో బలమైన గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా బాధితుడిని గుట్టు చప్పుడు కాకుండా అధికారులు జెమ్స్కు తరలించారు. బాధితుడి తలకు గాయాలయ్యాయని, చేయి విరిగిందని, మున్సిపల్ అధికారులు ఒక రోజంతా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశా రు. దీంతో మున్సిపల్ కమిషనర్ టి.రవి శనివారం సాయంత్రం జెమ్స్కు వెళ్లి పరామర్శించారు. విద్యుత్ సమస్యలపై వేళాపాళా లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వాడుకుంటున్నారని, ప్రమా దం సంభవించినప్పుడు విడిచి పెడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆడపిల్లలకు అనేక సంక్షేమ పథకాలు’
పర్లాకిమిడి: ఆడపిల్ల సంతానం వల్ల కుటుంబానికి సమాజానికి నష్టం ఏమీ లేదని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అందజేస్తోందని సబ్కలెక్టర్ అనుప్ పండా అన్నారు. గజపతి జిల్లా స్థాయిలో అంతర్జాతీయ కన్యాసంతానం దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో సబ్కలెక్టర్ పండా ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. నేటి బాలిక రేపటి రోజు మాతృమూర్తిగా, ఒక జడ్జి, సాఫ్ట్వేర్, కలెక్టర్, ఎస్పీగా అనేక బాధ్యతలు నిర్వహిస్తుందని అన్నారు. అనంతరం జిల్లా పాలనాధికారి కార్యాలయం ఓస్వాన్ భవనంలో సమావేశంలో పలువురు వక్తలు పాల్గొన్నారు. వారిలో ముఖ్యంగా జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, జువెనెల్ కోర్డు ప్యానల్ లాయర్ భాగ్యలక్ష్మీ నాయక్, అదనపు డీహెచ్ఓ డాక్టర్ రబినారాయణ దాస్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం కలెక్టర్ కార్యాలయం నుంచి సి.డి.పి.ఓ. జిల్లా సామాజిక సంక్షేమ శాఖ ప్రొగ్రాం అధికారి సరలా పాత్రో, సునితా రోథో ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. -
రైల్లో ప్రయాణికుడికి అస్వస్థత
ఆమదాలవలస : రైల్వే ప్రయాణికుడికి ఛాతినొప్పి రావడంతో 108లో హుటాహుటిన చికిత్స అందించారు. శనివారం గుణుపూర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గుణుపూర్ పాసింజిర్లో పర్లాకిమిడి సమీపంలోని కాజీపేటకు చెందిన ఎం.దిలీప్కుమార్ ప్రయాణిస్తున్నాడు. ఉర్లాం సమీపంలోకి వచ్చేసరికి ఛాతిలో నొప్పి వస్తుందని తోటి ప్రయాణిలకు చెప్పాడు. దీంతో వారు 108కు ఫోన్చేసి శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్కు రావాలని తెలియజేశారు. రైలు చేరుకునే సమయానికి 108 సిబ్బంది మూడో నంబ ర్ ప్లాట్ఫాం వద్దకు చేరుకొని బాధితునికి ప్రథమచికిత్స అందించారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో అదే అంబులెన్సులో శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇంతలో దిలీప్కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
కొరాపుట్: రైళ్లు సురక్షితంగా నడపడానికి సందేశం ఇచ్చే రైల్వేస్టేషన్ మాస్టర్ల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ (ఈస్ట్కోస్ట్ జోన్) విజ్ఞప్తి చేసింది. శనివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఈస్ట్కోస్ట్ రైల్వేస్టేషన్ మాస్టర్ల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ అడ్వైజర్ కమిటీకి చెందిన పీసీ సామల్ (ఖుర్ధా) మాట్లాడుతూ.. రైల్వే విభాగంలో స్టేషన్ మాస్టర్ల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. నైట్ షిప్ట్ అలవెన్స్ అందరికీ ఇవ్వాలని, పని గంటల ఒత్తిడి వలన రద్దీ స్టేషన్లలో అదనపు స్టేషన్ మాస్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను డీఆర్ఎం ద్వారా రైల్వే బోర్డుకి పంపాలని నిర్ణయించారు. సమావేశంలో జోనల్ ప్రెసిడెంట్ పీఎన్ మూర్తి (విశాఖపట్నం), సంయుక్త కార్యదర్శి పి.నారాయణరావు (కొరాపుట్) తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో పూజలు
రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం త్రిరాత్ర పవిత్రోత్సవ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, శాత్తుమురై, మంగళశాసన పూజలను నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. వాహన తనిఖీలు రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరిలో పోలీసులు, ఆర్టీవో సిబ్బంది సంయుక్తంగా వాహన తనిఖీలను శనివారం నిర్వహించారు. నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. 35 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.3,88,875ల జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించారు. -
ధాన్యం డబ్బులు చెల్లించండి
జయపురం: గత రబీ సీజన్లో తాను మండీలో అమ్మిన ధాన్యం డబ్బులు చెల్లించాలని కోరుతూ ఒక రైతు జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జయపురం సబ్ డివిజన్ కోట్పాడ్ సమితి చిత్ర గ్రామానికి చెందిన రైతు కృష్ణ కమర నాలుగు నెలల క్రితం కోట్పాడ్ సమితి చిత్ర ధాన్యం మండీలో 37 క్వింటాళ్ల ధాన్యం అమ్మాడు. అయితే లేంప్స్ కార్యాలయ బాధ్యతలు నిర్వహిస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ నంబర్ తప్పుగా వేయడం వలన తనకు రావాల్సిన రూ.1.14 లక్షలు బ్యాంక్ ఖాతాల్లో జమ అవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. గుడారిలో గంజాయి స్వాధీనం రాయగడ: గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు జిల్లాలోని గుడారి పోలీసులు ఆకస్మిక దాడులను నిర్వహించి అందుకు సంబంధించి నిందితుడిని పట్టుకున్నారు. అతని నుంచి రూ.177 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు తరలించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ బీరేంద్ర రాయ్, ఎస్ఐ సంజయ్ ఛత్రలు తెలియజేసిన వివరాల ప్రకారం గుడారి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిగిగుడ గ్రామ సమీపంలో గల ఒక తోటలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం అందటంతో ఈ దాడులను నిర్వహించినట్లు తెలియజేశారు. రైల్వే ప్రయాణికుల సలహాల సేకరణ కొరాపుట్: అమ్రిత్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా ప్రయాణికుల సలహాలు రైల్వే శాఖ అధికారులు తీసుకున్నారు. శనివారం కొరాపుట్ రైల్వే స్టేషన్లో ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) కె.రామారావు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి.. స్టేషన్కి వచ్చిన ప్రయాణికులతో మమేకమయ్యారు. స్టేషన్లలో సౌకర్యాలు, అభివృద్ధి, లోపాలు తదితర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పలవురు ప్రయాణికులు స్వయంగా వచ్చి సూచనలు చేశారు. సీనియర్ డివిజనల్ ఎలక్ట్రిక్ ఇంజినీర్ ఎం.ఎస్.ఎన్.మూర్తి పాల్గొన్నారు. అభ్యంతరకర పోస్టు.. యువకుడి అరెస్టు రాయగడ: సామాజిక మాధ్యమాల్లో రాయగడ జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహోరో పై అభ్యంతరకరమైన పోస్టులను ఫేస్బుక్లో పెట్టినందుకు సదరు పోలీసులు దిలీప్ కుమార్ పాఢి అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కుహొరొపై అవాస్తవ ఆరోపణలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడంతో కుహొరొ కలెక్టర్ అశుతొష్ కులకర్ణి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్పందించి వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ స్వాతి ఎస్.కుమార్కు ఈ విషయాన్ని తెలిపారు. శనివారం యువకుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని అరసవల్లి సెగిడివీధికి చెందిన ఓ విద్యార్థి అదృశ్యమైనట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. పాతబస్టాండ్లో పండ్ల దుకాణం నడుపుతున్న పొట్నూరు వెంకటరమణకు కుమార్తె, కుమారుడు సాయికృష్ణ (28) ఉన్నారు. సాయికృష్ణ ఇంటి వద్దనే ఉంటూ సివిల్స్కు ప్రిపేరయ్యేవాడు. ఈ ఏడాది జనవరి 19న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడో దూరంగా ఉంటూ చదువుకుంటాడని భావించి వెతకడం మానేశారు. నెలలు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో శనివారం రాత్రి విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరికృష్ణ తెలిపారు. -
సిక్కోలు పుస్తక మహోత్సవానికి ఆహ్వానం
శ్రీకాకుళం కల్చరల్: వచ్చే నెలలో జరగనున్న సిక్కో లు పుస్తక మహోత్సవానికి రచతయిలకు, అభిమానులకు ఆహ్వానం పలుకుతున్నామని కమిటీ చైర్మన్ డాక్టర్ కె.సుధీర్ కోరారు. జిల్లా కేంద్రంలోని యూ టీఎఫ్ భవనంలో సిక్కోలు పుస్తక మహోత్సవ కమి టీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు విజ యవాడ, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లోనూ భారీ ఎత్తున పుస్తక ప్రదర్శనలు జరిగాయని, మన జిల్లాలో తొలిసారి నిర్వహిస్తుండటం శుభ పరిణామమన్నారు. కమిటీ కో–చైర్మన్ అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ సాంస్కృతిక వేదికపై జిల్లా సంస్కృతిని ప్రతిబింబించే తప్పెటగుళ్లు, జముకుల పాట, కోలాటం, పగటి వేషాలు, నాటికలు, డ్యా న్సులు, సంగీత ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలు తదితర ప్రదర్శనలు జరగనున్నాయని వివరించా రు. విద్యార్థులతో సైన్స్ఫెయిర్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమిటీ కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో నవంబరు 11 నుంచి 20 వరకు జరిగే సిక్కో లు పుస్తక మహోత్సవం–2025, సాహిత్య, సాంస్కృతిక వైజ్ఞానిక సంబరాల్లో 100 ప్రచురణకర్తలు బుక్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారని వివరించారు. సాహిత్య, సాంస్కృతిక, విజ్ఞాన ఆహార, మీడియా, ప్రచార, శానిటేషన్, సెక్యూరిటీ, ఆర్థిక సబ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో వివిధ ప్రజాసంఘాలు, సాహిత్య సంస్థల సభ్యులు కంచరాన భుజంగరావు, చీకటి దివాకర్, గొంటి గిరిధర్, పి.సుధాకర్, కొత్తకోట అప్పారావు, ఎల్.రామలింగస్వామి పాల్గొన్నారు. -
‘బాలికలపై వివక్ష సరికాదు’
రాయగడ: బాలికలపై వివక్ష చూపడం సరికాదని కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో శనివారం జరిగిన అంతర్జాతీయ కన్యా దినోత్సవ కార్యక్రామానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కన్యా శిశువుల సంరక్షణ, వారిని విద్యావంతులను చేయడం, అన్ని రంగాల్లో ప్రోత్సహించడం అందరి కర్తవ్యమని పేర్కొన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోందని, వారి సంరక్షణ కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వివరించారు. సమాజాభివృద్ధికి కన్యా శిశువుల పాత్ర చాలా కీలకమని ఉద్బోధించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సామాజిక సురక్షా అధికారి మీనతీ దేవ్ మాట్లాడుతూ అనేక ఆందోళనలు, పోరాటాల ఫలితంగా 1920 నుంచి మహిళలకు ఓటు హక్కు దక్కిందని అన్నారు. -
320 మంది దివ్యాంగుల గుర్తింపు
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్ర సమితిలో భీమభొయి వికలాంగ పథకంలో దివ్యాంగుల గుర్తింపు శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ శిబిరంలో సమితి అధ్యక్షు లు తరుణసేన్ బిశాయి ముఖ్యఅతిథిగా పాల్గొ ని శిబిరాన్ని ప్రారంభించారు. గౌరవ అతిథులు గా జిల్లా పరిషత్ అధ్యక్షుడు రాదాబినోద్ సామంతరాయ్, బీడీఓ పి.మనశ్మిత, కొట్పాడ్ ఎమ్మెల్యే ప్రతినిధి బద్రి నారాయణ ఆచార్యతో పాటు సమితి సభ్యులు, సర్పంచ్లు పాల్గొన్నా రు. శిబిరంలో 320 మందిని గుర్తించినట్లు తెలిపారు. వీరికి గుర్తింపు కార్డులు అందజేశారు. శిబిరంలో వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.ఎస్.మిశ్ర, డాక్టర్ దేవాశిశ్ మహాపాత్రో, శివానంద బుద్దియ, కిశాన్ కుమార్ సాహు, లలటేందు మిశ్ర, సవ్య సాచి మహాపాత్రో పాల్గొన్నారు. పర్లాకిమిడి: స్థానిక శ్రీక్రిష్ణచంద్ర గజపతి కళాశాల ప్రిన్సిపల్గా రాధాకాంత భుయ్యాన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. భుయ్యాన్ ఎస్కేసీజీ కళాశాలలో హిస్టరీ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. రాధాకాంత భుయ్యాన్ స్వస్థ లం గజపతి జిల్లాలో రాయఘడ బ్లాక్. భు య్యాన్ బరంపురం విశ్వవిద్యాలయంలో చరి త్ర సబ్జెక్టులో పోసు్ట్రగాడ్యుయేషన్ చేసి 1996– 98లో గంజాం జిల్లా కోనిసి, ఛత్రపురం ప్రభు త్వ కళాశాలల్లో కొన్నాళ్లు పని చేసి పర్లాకిమిడి కళాశాలకు బదిలీ అయ్యి వచ్చారు.రాధాకాంత భుయ్యాన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కళాశాల అధ్యాపకులు, పాత విద్యా ర్థుల సంఘం అధ్యక్షులు శంకర్ ప్రసాద్ భక్షి, శశిభూషన్ పాఢి, బసంత్ పండా తదితరులు అభినందనలు తెలియజేశారు. మల్కన్గిరి: స్కౌట్స్పై అవగాహన పెంచాలని వక్తలు అన్నారు. మల్కన్గిరి మహిళా మాధ్యమిక మహావిద్యాలయంలో జిల్లా స్థాయి స్కౌ ట్ గైడ్పై ప్రాథమిక చర్చా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి చిత్తరంజన్ పాణిగ్రాహీ అధ్యక్షత జరిగిన కార్య క్రమాన్ని ముఖ్యఅతిథిగా రాష్ట్ర శిక్షణ కమిషనర్ సురజిత్ సేన్, గౌరవ అతిథులుగా అదనపు జిల్లా విద్యాశాఖ అధికారి భగీరధీ బెహేరా, అదనపు విద్యాధికారిణి మంజులతా భోయి, కళాశాల అధ్యక్షుడు దుష్మంత్ కుమార్ జేనా, జిల్లా శారీరక విద్యాధికారి కార్తిక చంధ్ర బెహర పాల్గొన్నారు. 250 మంది ఉపాధ్యాయులు హాజరవ్వగా.. వీరికి స్కౌట్ గైడ్పై అవగాహన కల్పించారు. ఎచ్చెర్ల : ఏపీఈఏపీ సెట్–2025 ప్రవేశ పరీక్షకు హాజరైన బైపీసీ విద్యార్థులకు సంబంధించి బీ–ఫార్మశీ, ఫార్మా–డీ, బయో/ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైందని జిల్లా ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్, సహాయక కేంద్రం జిల్లా సమన్వయకర్త కె.నారాయణరావు శుక్రవారం తెలిపారు. తొలి విడతగా ఈ నెల 12 నుంచి 18వరకు, తుది విడతగా ఈ నెల 25 నుంచి 29 వరకూ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతాయని పేర్కొన్నారు. 21న సీట్ల కేటాయింపు ఉంటుందని, వివరాలకు పాలిటెక్నిక్ కళాశాలలోని సహాయ కేంద్రంలో సంప్రదించాలని కోరారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు పకడ్బందీగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్న్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వివిధ స్థాయిల్లో పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసుల పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. పలు కేసుల్లో మూడు నెలల్లో బాధితులకు రూ.18 లక్షల వరకు పరిహారం చెల్లించామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఏఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో సాయి ప్రత్యూ ష, డీఎస్పీ సీహెచ్.వివేకానంద, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదనరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ గెడ్డమ్మ, బీసీ సంక్షేమాధికారి అనురాధ, కమిటీ సభ్యులు గేదెల రమణమూర్తి, దాసరి తిరుమలరావు మాదిగ, దండాసి రాంబాబు, తోట రాములు తదితరులు పాల్గొన్నారు. -
డయాలసిస్ సేవలు సకాలంలో అందాలి
● జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ శ్రీకాకుళం: జిల్లాలోని కవిటి, సోంపేట మండలా ల్లో కిడ్నీ వ్యాధి బారిన పడిన వారికి డయాలసిస్ సేవలు సకాలంలో అందించాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. శుక్రవారం జిల్లా పరిష త్ కార్యాలయంలో పలు స్థాయీ సంఘ సమావేశా లు ఆమె అధ్యక్షతన జరిగాయి. ఆమె మాట్లాడు తూ జిల్లా పరిషత్ సాధారణ సభ్య సమావేశాలు, స్థాయీ సంఘ సమావేశాలకు జిల్లా అధికారులు రాకుండా వారి ప్రతినిధులను పంపుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా అధికారులు రాని పరిస్థితుల్లో ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు. 4వ స్థాయీ సంఘ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో డయాలసిస్ బెడ్లు పెంచాలని అధికారులను కోరారు. 2వ స్థాయీ సంఘ సమావేశంలో జిల్లాలో చాలా మంది అర్హుల పింఛనుల జాబితాలు ఎంపీడీఓల లాగిన్లో పెండింగ్లో ఉన్నాయని సభ్యులు తెలపడంతో వాటిని క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. 2వ స్థాయీ సంఘ సమావేశంలో డీడబ్ల్యూఎంఏ చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. 7వ స్థాయీ సంఘ సమావేశంలో పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ పనులు నిర్దేశించిన కాలంలో చేయకుండా కాలం చెల్లిన, మొదలు పెట్టని పనుల వివరాలు ఇవ్వాలని తెలిపారు. ఉద్దానం ప్రాజెక్టు పైప్లైనులు ఎక్కువగా లీక్లు అవుతున్నాయని, సత్వరమే మరమ్మతులు చేపట్టి నీటి వృధాను అరికట్టాలన్నారు. ఉదయం 3, 5, 6 వ స్థాయీ సంఘ సమావేశాల్లో ప్రగతి నివేదికలను అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, సీఈఓ డి.సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు ధర్మాన కృష్ణచైతన్య, జంపు కన్నతల్లి, సురవరపు నాగేశ్వరావు, కె.త్రినాఽథ్, టొంపల సీతారాముడు, కాయల రమణ, కామాక భాగ్యవతి, మీసాల సీతం నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సెంచూరియన్ విశ్వవిద్యాలయానికి అరుదైన గుర్తింపు
● డబ్ల్యూయూఆర్ ర్యాంక్ ప్రదానంభువనేశ్వర్: సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రపంచ గుర్తింపు సాధించింది. ఈ ఏడాది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) ప్రచురించిన ప్రతిష్టాత్మక వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (డబ్ల్యూ యూఆర్)–2026లో జాతీయ, అంతర్జాతీయ ర్యాకింగులు సొంతం చేసుకుంది. ప్రపంచ స్థాయిలో 1501+ గ్లోబల్ ర్యాంక్, జాతీయ స్థాయిలో 98వ ర్యాంక్ను సాధించి రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అద్భుతమైన మైలురాయిని ఆవిష్కరించింది. ఇదివరకు వరుసగా 2 సార్లు టీహెచ్ఈ రిపోర్టర్ లిస్ట్, ఎస్డీజీ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకుంది. ఈ ప్రపంచ గుర్తింపు బోధన, పరిశోధన, ఆవిష్కరణ, సామూహిక సాధికారత దిశలో విశ్వ విద్యాలయం పుంజుకుంటున్న నైపుణ్యతకు అద్దం పడుతుంది. నైపుణ్యం–సమగ్ర, సమగ్ర విద్యాభ్యాసంతో నైపుణ్యతకు సాన పెడుతూ భారత దే శంలోని అత్యంత ప్రగతిశీల విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా సెంచూరియన్ తన ఉనికిని చాటుకుంటోంది. జాతీయ స్థాయిలో సెంచూరియన్ విశ్వ విద్యాలయం 100 మేటి విశ్వవిద్యాలయాలలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల సరసన తళుక్కమంటోంది. ప్రత్యేకమైన ‘నైపుణ్య–సమగ్ర ఉన్నత విద్య’ నమూనా, గ్రామీణ మరియు సామాజిక వ్యవస్థాపకత పట్ల ప్రాధాన్యతతో బోధన శైలితో భారత దేశ ఉన్నత విద్యా సంస్థల జాబితాలో దానిని ప్రత్యేక స్థానం సొంతం చేసుకోవడం విశేషం. సెంచూరియన్ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ ర్యాంక్ బోధనా నాణ్యత, లోతైన పరిశోధన, జ్ఞాన సముపార్జన రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రామాణికలతో సుస్థిర పురోగతితో దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రపంచ స్థాయిలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్య, పరిశోధన ఆధారిత ప్రామాణికలతో ఆవిష్కరణ, సామాజిక పరివర్తన సమన్వయాన్ని దృఢపరుస్తుంది. ఐక్య రాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ), గ్రామ్ తరంగ్ ఎంప్లాయిబిలిటీ ట్రైనింగ్ సర్వీసెస్, ఇండస్ట్రీ స్పాన్సర్డ్ లాబొరేటరీస్, స్టార్టప్ ఎకోసిస్టమ్ల వంటి చొరవలతో సెంచూరియన్ విశ్వవిద్యాలయం సమయోచిత కార్యాచరణ పలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సాధించి విద్యావేత్తలు, నైపుణ్యతలు, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించి వెనుకబడిన ప్రాంతాల నుంచి యువతకు సాధికారత కల్పించడంలో ముందడుగు వేస్తుంది. ఉపాధి, వ్యవస్థాపకత, సామాజిక ప్రభావానికి ప్రేరణాత్మక విద్యతో సెంచూరియన్ విశ్వవిద్యాలయం అనేక సంక్లిష్ట లక్ష్యాల్ని ఛేదించి తరచూ సరికొత్త విజయాల్ని సాధిస్తుంది. తాజాగా రిపోర్టర్ జాబితాలో స్థానం సాధించి ప్రపంచ వ్యాప్తంగా ర్యాంకింగు విశ్వవిద్యాలయంగా నిలిచింది. పరిశోధన నైపుణ్యాల మేళవింపుతో విద్యావేత్తలను తీర్చిదిద్దుతుందని వైస్ చాన్స్లర్ ప్రొఫెసరు సుప్రియా పట్నాయక్ తెలిపారు. -
చైన్స్నాచింగ్ ముఠా అరెస్టు
● నిందితులంతా ట్రాన్స్జెండర్లే ● 38 గ్రాముల బంగారు గొలుసులుస్వాధీనం నరసన్నపేట: ఉత్తరాంధ్రతో పాటు పలుచోట్ల ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న పురుషులే లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ట్రాన్స్జెండర్స్ ముఠాను నరసన్నపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు శుక్రవారం నరసన్నపేటలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇటీవల నరసన్నపేట మండలం ఉర్లాం సమీపంలో నడగాంకు చెందిన దొంపాక ఆనందరమణను కొందరు ట్రాన్స్జెండర్ల అడ్డగించి చైన్స్నాచింగ్కు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా ముఠా పట్టుబడింది. ఉర్లాంతో పాటు ఇచ్ఛాపురం, జి.సిగడాం మండలం ఉల్లివలస జంక్షన్, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబల్లి మండలం సంకిలిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. బైక్లపై వచ్చిన వారి మెడలో నుంచి బంగారు చైన్లు లాక్కోని సమీపంలో ఉన్న కారులో వీరు పారిపోతుంటారు. ఈ కేసులో తెర్లాం మండలం పిరిడి గ్రామానికి చెందిన నందిగామ నేహా, కాకినాడ జిల్లా రేచర్లపేటకు చెందిన మండల శ్రావణి, పార్వతీపురం జిల్లా వీరఘట్టంకు చెందిన అలుబిల్లి ప్రియ, రంపచోడవరం ప్రాంతానికి చెందిన బేదంపూడి సాయిపల్లవి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన నాగిరెడ్డి సుష్మలతో పాటు వీరికి సహాయకారిగా ఉన్న కారు డ్రైవర్ తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన సేలం రాంప్రవీణ్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ మడపాం టోల్గేట్ వద్ద శుక్రవారం పట్టుకొని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. వీరి వద్ద నుంచి 38 గ్రాముల బరువున్న మూడు బంగారు చైన్లు రికవరీ చేశారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, నరసన్నపేట, పోలాకి ఎస్ఐలు సీహెచ్ దుర్గాప్రసాద్, రంజిత్లు కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నందుకు డీఎస్పీ అభినందించారు. -
కాంగ్రెస్లో చేరికలు
రాయగడ: జిల్లాలోని రామనగుడ సమితి పరిధిలో గల గొగుపాడు, అదామ్గుడ, అచవ, పొల్లిడంగి, గొరుండ ప్రాంతాలకు చెందిన 40 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుణుపూర్లో గల బంగ్లాలో ఈ మేరకు గురువారం నాడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు (కాంగ్రెస్) బంచానిధి బెహర సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ ప్రజల గురించి చేస్తున్న సేవా కార్యక్రమాలు తమకు ఆకట్టుకున్నాయని అందువల్ల ఆ పార్టీలో చేరామని పార్టీలో చేరిన వారు తెలిపారు. కార్యక్రమంలొ కాంగ్రెస్ నాయకులు భిశ్వనాత్ బలియార్ సింగ్, నిలు సాహు, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
ఎచ్చెర్ల : శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఐఐఐటీ) విద్యార్థులు అఖిల భారత విశ్వవిద్యాలయాల యోగా చాంపియన్షిప్–2025కు ఎంపికయ్యారు. ఈ నెల 8, 9వ తేదీల్లో నూజివీడులో జరిగిన అంతర్ కళాశాల యోగా పోటీల్లో రాష్ట్ర స్థాయిలో బి.భావన, కె.మేఘన వ్యక్తిగత విభాగంలో అర్హత సాధించారు. బృంద విభాగంలో ఎం.హేమరితిక, పి.కారుణ్య, ఎన్.నళిని, ఏ.రాధిక, జి.మహేశ్వరి, ఇ.భరత్సాయి, పి.జవితనాయుడు, ఎం.నవీన్కుమార్, కె.రాకేష్ అర్హత సాధించారు. వీరంతా నవంబర్ 24 నుంచి 28 వరకూ బెంగళూరులో జరగనున్న జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిని వర్శిటీ సంచాలకులు ప్రొఫెసర్ కేవీజీడీ బాలాజీ, పరిపాలనాధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి డాక్టర్ వాసు, వెల్ఫేర్ డీన్ డాక్టర్ గేదెల రవి, యోగా విభాగాధిపతి డాక్టర్ ఈశ్వరరావు, యోగా అధ్యాపకులు అర్చన, జి.ధనుంజయరావు, పీఆర్వో మామిడి షణ్ముఖరావు శుక్రవారం అభినందించారు.