breaking news
Odisha Latest News
-
రెవెన్యూ అసోసియేషన్ ఎన్నికలకు సిద్ధం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రెవెన్యూ సర్వీసుల సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైందని సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె.శ్రీరాములు, బి.వి.ఎన్.ఎస్.రాజు తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ యూనిట్, శ్రీకాకుళం డివిజన్ యూనిట్, టెక్కలి డివిజన్ యూనిట్, పలాస డివిజన్ యూనిట్ల మూడేళ్ల కాల పరిమితి ముగిసినందున 2025 – 28 సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గం ఎన్నుకునేందుకు బధవారం నోటిఫికేషన్ను విడుదల చేశారు. రెవెన్యూ డివిజన్, కలెక్టర్ యూనిట్ల ఎన్నికలు ఈ నెల 21న జరగనున్నాయని తెలిపారు. ప్రత్యేక అవసరాల పిల్లలపై దృష్టి సారించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్ఎస్ఏ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. అంతర్జాతీయ ప్రత్యేక విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని బెహరా మనోవికాస్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సందర్శనలో భాగంగా హరిబాబు కేంద్రంలోని చిన్నారులందరికీ మిఠాయిలను పంపిణీ చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అడ్వకేట్ జి.ఇందిరాప్రసాద్, సంస్థ నిర్వాహకులు శేఖర్, శ్యామల తదితరులు పాల్గొన్నారు. విస్తృతంగా ఎకై ్సజ్ అధికారుల దాడులు కొత్తూరు: అంధ్ర – ఒడిశా సరిహద్దు గ్రామల్లో రెండు రాష్ట్రాలకు చెందిన ఎకై ్సజ్ అధికారులు బుధవారం విస్తృతంగా దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 6,050 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు, 100 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసినట్లు స్థానిక ఎకై ్సజ్ సీఐ కిరణ్మీశ్వరి తెలిపారు. అంధ్ర, ఒడిశా రాష్ట్రాల జాయింట్ రైట్స్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో, ఒడిశా రాష్ట్రం సరిహద్దు గ్రామాలైన కొత్తగూడ, నడుము గూడ గిరిజన గ్రామాల్లో దాడులు చేపట్టారు. దాడుల్లో శ్రీకాకుళం ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ మురళీధర్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన కొత్తూరు, పొందూరు, పాలకొండ, రాజాం, పార్వతీపురం, ఆమదాలవలస, శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్రం గుణుపూర్కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. ట్రక్ షీట్లు జనరేట్ కావడం లేదు సారవకోట: రైతులు కల్లాలు లేకపోవడంతో సమీపంలో ఉన్న మిల్లుల ఆవరణలో ధాన్యం ఆరబెట్టుకుని, అక్కడే మిల్లర్లకు ధాన్యం అందిస్తున్నారని అటువంటి ట్రక్ షీట్లు జనరేట్ కావడం లేదని అవలింగికి చెందిన రైతు బోర ధనుంజయ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దృష్టికి తీసుకెళ్లారు. మండలంలోని బుడితి రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో పలు సమస్యలపై చర్చించారు. ట్రక్షీట్లు జనరేట్ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గ్రామాల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేటట్లు చూడాలని కోరారు. కార్యక్రమంలో నిక్కు కృష్ణారావు, బోర శ్రీరామమూర్తి, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. వృద్ధుడి మృతదేహం లభ్యం పాతపట్నం: మండలంలో కోదూరు గ్రామ సమీపంలోని కొండ పక్కన కాపు గోపాలపురం గ్రామానికి చెందిన మతి స్థిమితం లేని వృద్ధుడు తడక లక్ష్మీనారాయణ (84) మృతదేహం లభ్యమైనట్లు ఏఎస్ఐ కె.శ్రీరామమూర్తి బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కాపుగోపాలపురం గ్రామానికి చెందిన వృద్ధుడు తడక లక్ష్మీనారాయణకు మతిస్థిమితం లేదు. ఇంటి నుంచి మూడు రోజులకు ఒకసారి వెళ్లిపోయి, మళ్లీ ఇంటికి రావడం అలవాటుగా ఉండేది. అందులో భాగంగానే నవంబర్ 31వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు బుధవారం కోదూరు గ్రామ సమీపంలోని కొండ వద్ద మృతదేహం గ్రామస్తులు గుర్తించి, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి కుమారుడు తడక దాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్ఐ తెలిపారు. -
విభిన్న ప్రతిభావంతులను గౌరవిద్దాం
పర్లాకిమిడి: విభిన్న ప్రతిభావంతులను గౌరవించాలని ఇన్చార్జి కలెక్టర్, ఏ.డి.ఎం. మునీంద్ర హానగ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా సమాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం ఆధ్వర్యంలో స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాల నుంచి అవగాహన ర్యాలీ చేపట్టారు. వ్యాంగులు, ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐదుగురు దివ్యాంగులకు సంక్షేమ పథకం కింద రూ.2.50 లక్షల చెక్కులను అందజేశారు. ఐదుగురు దివ్యాంగులకు నెలసరి భృతి, ఇద్దరు విద్యార్థినులకు ఉన్నతవిద్య భృతి, ఇద్దరికి వీల్ చైర్లను జిల్లా పరిషత్ ఆదనపు కార్యనిర్వాహణ అధికారి ఫృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్ పండా అందజేశారు. మూగ, బధిరులకు వక్తృత్వ, డ్రాయింగ్, క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. శ్రీజగన్నాథ ఒడిస్సీ కళాకేంద్రం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
అవగాహనే ఎయిడ్స్కు మందు
జయపురం: అవగాహనే ఎయిడ్స్ మహమ్మారికి మందు అని స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ జాతీయ సేవా యోజన బ్యూరో చీఫ్ డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ అన్నారు. వర్సిటీలోని హ్యూమానిటీ సెమినార్ హాల్లో జాతీయ సేవా యోజన విభాగం వారు నిర్వహించిన హెచ్ఐవీ, ఎయిడ్స్, సిపిన్సిల్లపై నిర్వహించిన సెమినార్లో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. జీవితంలో ప్రాణాంతకమైన హెచ్ఐవీ సంక్రమించకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లెప్రా ఇండియా ప్రతినిధి విజ్ఞానిక దాస్, సహిద్ లక్ష్మణ నాయిక్ మెడికల్ కళాశాల ఐసీటీసీ కౌన్సిలర్ మనశ్విణీ టక్రి ఎయిడ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జాతీయ సేవా యోజన జయపురం విభాగ పురుష విభాగ కార్యనిర్వాహక అధికారి లోకేస్ ప్రధాన్, మహిళా విభాగ కార్యనిర్వాహక అధికారిణి సుకాంతి సాయె శిబిరాన్ని పర్యవేక్షించారు. ఎయిడ్స్ నియింత్రపై విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. -
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి
● అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే కడ్రకరాయగడ: రాయగడ వంటి ఆదివాసీ, హరిజన జిల్లాల్లో ఉపాధి అవకాశాలు లేకపొవడంతో నిరుద్యొగ యువత కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస బాట పడుతున్నారని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక బుధవారం జరిగిన శీతాకాల సమావేశాల్లో భాగంగా జీరో అవర్లో ప్రస్తావించారు. జిల్లాలో సుమారు 70 శాతం మంది ఆదివాసీ, హరిజనులు నివసిస్తున్నారన్నారు. ఉపాధి కోసం వెళ్తున్న ఎంతో మంది యువత అక్కడ అవస్థలు పడుతున్నారన్నారు. అక్కడకు వెళ్లిన ఎంతో మంది శవాలుగా ఇంటకి వస్తుండటం పరిపాటిగా మారిందన్నారు. జిల్లాలో ఉత్కళ అలూమిన, వేదంత, జేకేపేపర్ మిల్, ఇండియన్ మెటల్స్ అండ్ పెర్రొఎల్లొయిస్ (ఇంఫా), ఆదిత్య బిర్లా వంటి పరిశ్రమలు ఉన్నప్పటికీ ఉపాధి అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది చదువుకుని ఉద్యోగాలు లేకుండా వలస బాట పడుతున్న యువత ఉండటం విచారకరమన్నారు. వారి అర్హతకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటే వలసలు తగ్గుతాయన్నారు. -
శ్రామిక్ కాంగ్రెస్ ఓపెన్ లైన్ శాఖ కొత్త కార్యవర్గం
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఓపెన్ లైన్ శాఖ కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గ సభ్యులకు శ్రామిక్ కాంగ్రెస్ ప్రముఖులు ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. కార్యదర్శి లక్ష్మి ధర మహంతి ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు పి.రాజారావు అధ్యక్షత వహించగా మండల సమన్వయకర్త సునీల్కుమార్ భంజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యవర్గం: అధ్యక్షునిగా మహ్మద్ ముస్తాక్ ఆలీ, కా ర్యనిర్వాహక అధ్యక్షునిగా పి.రాజారావు, ఉపాధ్యక్షులుగా ఫకీర్ చరణ్ నాయక్, జి.రామమోహనరావు, శాఖ కార్యదర్శిగా లక్ష్మీధర మహంతి, సహాయ కార్యదర్శులుగా త్రిలోచన్ మహంతి, రాకేష్ కుమార్ ఘొడై, ప్రదీప్ కుమార్ సుందరరాయ్, త్రిలోచన్ బెహరా, సంస్థాగత కార్యదర్శులుగా బి.టి.రావు, సునీల్ కుమార్ పరిడా, కోశాధికారిగా ప్రదీప్ కుమార్ పండా నియమితలవ్వగా.. సంతోష్ కుమార్ ఖొటై, అశోక్ కుమార్ భోలా, నిత్యానంద పండా, నరేంద్ర కుమార్ దాస్, సంతోష్ కుమార్ దొలై శాఖ సలహాదారులుగా వ్యవహరిస్తారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
పర్లాకిమిడి: స్థానిక డోలా ట్యాంకు రోడ్డు గజపతి నగర్లో ఉన్న మహిళా ఉన్నత విద్యామండలి నాల్గో వార్షిక క్రీడా పోటీలు బుధవారం ప్లస్ టు కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ డాక్టర్ మహీంద్ర రైతా ప్రారంభించారు. ఈ క్రీడా పోటీల్లో వంద మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్, జువెలిన్ థ్రో, కబడ్డీ, గోణె సంచుల గంతులు, షార్ట్ఫుట్ వంటి ఈవెంట్లను పీఈటీ బిజయలక్ష్మీ పండా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఆటల పోటీలకు ప్లస్ టు విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గురువారం సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందని ప్రిన్సిపాల్ మహేంద్ర రయిత తెలియజేశారు. -
58 కొత్త కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు
● మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్ భువనేశ్వర్: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదనలు దీర్ఘ కాలం వినియోగానికి వీలుగా నిల్వ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ డివిజన్ స్థాయిలో 58 శీతల గిడ్డంగులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బడ్జెటులో రూ. 252 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. తొందరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పాదనలు పదిల పరిచేందుకు శీతల నిల్వ గిడ్డంగుల అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుంది. కోత తర్వాత వ్యవసాయ ఉత్పాదనల నష్టాలను నివారించడంలో ఈ చర్య దోహదపడుతుందన్నారు. బుధవారం శాసన సభ ప్రశ్నోత్తరాలు సందర్భంగా ప్రశ్నకు ప్రభుత్వ నిర్మాణ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్ స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 133 కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఉండగా.. వాటిలో 35 మాత్రమే పూర్తిగా పనిచేస్తున్నాయన్నారు. వీటిలో 33 ప్రైవేట్గా, రెండు యూనిట్లు ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ప్రస్తుత మౌలిక సదుపాయాలు, వాస్తవ అవసరాల మధ్య భారీ వ్యత్యాసాన్ని ఈ పరిస్థితి ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు. గత దశాబ్దంలో 26 కొత్త శీతల గిడ్డంగులు నిర్మించారు. 22 పనిచేయడం ప్రారంభించగా 4 యూనిట్లు ప్రారంభానికి నోచుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన 133 యూనిట్లలో 98 పని చేయడం ప్రారంభించలేదు. వాటిలో 20 ప్రభుత్వ మరియు 78 ప్రైవేట్ గిడ్డంగులు ఉన్నాయి. కొత్త శీతల గిడ్డంగులు పూర్తయితే పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పాదనల వృథా నివారణతో రైతులు, వ్యాపారులు, వ్యవసాయ సరఫరా అనుబంధ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. -
దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయం
రాయగడ: దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా సామాజికి సురక్షా విభాగం నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. హెలెన్ కెల్లర్, లిక్ బ్రూజిక్, జెస్సీకా క్రబ్, అరుణిమా సిన్హా, దీప మాలిక్ వంటి ప్రముఖులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్రనాయక్ మాట్లాడుతూ దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా ఆపద సమయంలో అండగా నిలవాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఏడుగురు దివ్యాంగులకు రూ.2.50 లక్షలను పెళ్లి కానుకగా అందజేశారు. అంతకుముందు మున్సిపాలిటీ కార్యాలయం నుంచి దివ్యాంగులు ర్యాలీ నిర్వహించారు. వివిధ సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాయగడ మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్, వైస్ చైర్మన్ శుభ్ర పండా, బీడీఓ సుజిత్కుమార్ మిశ్రా, సమితి వైస్చైర్మన్ హరప్రసాద్ హెప్రుక, రాయగడ దివ్యాంగుల మహాసంఘం అధ్యక్షుడు శిశిర్ కుమార్ రావుల్, సాధారణ కార్యదర్శి అమరేంద్రనాథ్, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి శ్రీకాంత్ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక సేవల విస్తరణ
● లఘు ఖనిజ నిధులను జిల్లాలోనే ఖర్చు చేయాలి ● డీఎంఎఫ్ సమీలో ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝిభువనేశ్వర్: జిల్లా ఖనిజ నిధికి చేరుతున్న లఘు ఖనిజ ఆర్థిక వనరుల్ని సంబంధిత జిల్లా అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఆదేశించారు. స్థానిక లోక్ సేవా భవన్లో జిల్లా ఖనిజ ఫౌండేషన్ (డీఎంఎఫ్) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి రాష్ట్రంలో 11 డీఎంఎఫ్ జిల్లాల నుంచి సమగ్రంగా రూ. 34,052 కోట్లు వసూలు కాగా, అందులో దాదాపు 55 శాతం నిధులు ఖర్చు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ వ్యయాన్ని పెంచి ప్రజలకు ప్రాథమిక, మౌలిక సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇటీవల పునరుద్ధరించిన 10 జిల్లాల్లో డీఎంఎఫ్ ట్రస్ట్ బోర్డు సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతి డీఎంఎఫ్ ఆడిట్ నివేదికతో పాటు వార్షిక నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. లఘు ఖనిజ పదార్థాల నుంచి సేకరించిన డీఎంఎఫ్ నిధులను సంబంధిత జిల్లాలో ఎక్కడైనా ఉపయోగించవచ్చని మండల కార్యదర్శులకు సూచించారు. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, నీటి సరఫరా, రవాణా వంటి ప్రాథమిక అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. గనుల ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు పూర్తి ప్రాథమిక సేవలను అందించాలన్నారు. ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి డీఎంఎఫ్ ట్రస్ట్ బోర్డు త్వరలో సమావేశం కానున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. ఖనిజ పదార్థాల తవ్వకాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమైన గ్రామాలను గుర్తించాలన్నారు. ఆయా ప్రాంతాలకు సమీపంలో ఉన్న స్థావరాలలో కాలుష్యం నివారణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎండోమెంట్ నిధి.. వార్షిక డీఎంఎఫ్ నిధుల సేకరణ రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉన్న జిల్లాలు ఎండోమెంట్ నిధి ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నిధిని ప్రభుత్వ సెక్యూరిటీలుగా, బాండ్లుగా, షెడ్యూల్డ్ బ్యాంకుల ఫిక్స్డ్ పొదుపు ఖాతాల్లో పెట్టుబడి పెట్టవచ్చన్నారు. ఖనిజాలు అడుగంటి పోయిన తర్వాత, అనివార్య పరిస్థితుల్లో గనుల తవ్వకం కార్యకలాపాలు ఆగిపోయిన ప్రాంతాలలో భవిష్యత్ తరాలకు జీవనోపాధిని కల్పించేందుకు ఈ నిధిని ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ అహుజా, అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్, గనుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సురేంద్ర కుమార్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి శాశ్వత్ మిశ్రా పాల్గొన్నారు. -
వందేభారత్ను కొరాపుట్ వరకు పొడిగించండి
కొరాపుట్: వందేభారత్ రైలును విశాఖపట్నం నుంచి కొరాపుట్కు పొడిగించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉల్క డిమాండ్ చేశారు. బుధవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా ఆయన మాట్లాడుతూ కొరాపుట్ నుంచి భువనేశ్వర్కు పగటి పూట రైలు కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం భువనేశ్వర్–విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ను కొరాపుట్ వరకు పొడిగించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన రాయగడ రైల్వే డివిజన్కు పూర్తి సౌకర్యాలు కల్పించాలన్నారు. డివిజన్లో అత్యధిక కార్యకలాపాలు విశాఖ రైల్వే డివిజన్లోనే కొనసాగుతున్నాయని ఎంపీ గుర్తు చేశారు. -
మాజీ ఎంపీ ప్రదీప్పై కేసు నమోదు
కొరాపుట్: ప్రతిపక్ష బీజేడీకి చెందిన నబరంగ్పూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల కొసాగుమ్డ సమితిలోని ఆశ్రమ పాఠశాలలో వంట గదిలో ప్రెజర్ కుక్కుర్ పేలింది. ఈ ఘటనలో 7వ తరగతి విద్యార్థి ధనుర్జయ బోత్ర ముఖం కాలిపోయింది. దీనిని కప్పిపుచ్చి బాలుడిని రహస్య గదిలో ఉంచి దాదాపు 9 రోజులు దాచారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ ప్రదీప్ అర్ధరాత్రి ఆశ్రమ పాఠశాల గోడ దూకి బాలుడిని రక్షించారు. అనంతరం అదే రాత్రి కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ నివాసానికి వెళ్లి ఘోరం చూపించారు. అక్కడే ఉన్న డీడబ్ల్యూఓ రవీంద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గిరిజన జాతిపై ఇటువంటి దాష్టీకాలు చేస్తే కాల్చేస్తానని కలెక్టర్ సమక్షంలో హెచ్చరించారు. వెంటనే కలెక్టర్ స్పందించి హాస్టల్ వార్డెన్, కుక్, ఇతర సిబ్బందిని సస్పెండ్ చేశారు. అయితే ప్రదీప్ అర్ధరాత్రి వేళ హాస్టల్ దూకి విద్యార్థిని బయటకు తేవడం పట్ల అధికార బీజేపీ జిల్లా అధ్యక్షుడు కుంజ బీహారి దాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులను బెదిరించడాన్ని ఖండించారు. ఈ మేరకు బుధవారం నబరంగ్పూర్ పోలీస్ స్టేషన్లో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి (డిడబ్ల్యూఓ) రవీంద్ర పాలక ఫిర్యాదు చేయడంతో మాజీ ఎంపీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. -
త్వరలో ఓటీపీ ఆధారిత తత్కాల్ టిక్కెట్లు
భువనేశ్వర్: రిజర్వేషన్ కౌంటరులో ఓటీపీ ఆధారిత తత్కాల్ టిక్కెట్లు జారీ చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. సాధారణ రైలు వినియోగదారుల సౌకర్యాలు మెరుగుపరచడం దీని లక్ష్యంగా రైల్వే శాఖ పేర్కొంది. ఈ ఏడాది జూలైలో ఆన్లైన్ తత్కాల్ టికెటింగ్ కోసం ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను ప్రవేశపెట్టారు. తదుపరి దశలో సాధారణ రిజర్వేషన్ల కోసం ఓటీపీ ఆధారిత ఆన్లైన్ రిజర్వేషన్ వ్యవస్థను అక్టోబర్లో అమలు చేశారు. ఈ రెండు ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. రిజర్వేషన్ ప్రక్రియలో పారదర్శకత పరిరక్షణకు ఓటీపీ వ్యవస్థ ఉపకరిస్తుంది. ఓటీపీ ఆధారిత తత్కాల్ రిజర్వేషన్ వ్యవస్థను రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా ఈ ఏడాది నవంబర్ 17న ప్రారంభించింది. తొలి విడత కింద ఈ వ్యవస్థను 52 రైళ్లకు విస్తరించారు. దీనిలో భాగంగా రిజర్వేషన్ కౌంటర్లో తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికుడు రిజర్వేషన్ దరఖాస్తులో తెలిపిన మొబైల్ నంబర్కు ఓటీపీ చేరుతుంది. ఓటీపీ ధృవీకరణ తర్వాత మాత్రమే టికెట్ ఖరారు అవుతుంది. -
గుణుపూర్లో అగ్నిప్రమాదం
● రెండు గంటలు శ్రమించి మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బందిరాయగడ: జిల్లాలోని గుణుపూర్ బకేటి వీధిలోని ఓ ఇంటి పై అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు చూసి వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది రెండు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఇంటి మూడో అంతస్తులో భారీ ఎత్తున బాణసంచా ఉండడంతో ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. బాణసంచా పేలుడు కారణంగా గోడలు బీటలు వారాయి. జనావాసాల మధ్య అక్రమంగా బాణసంచా ఉంచడంతో దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు. -
చేనేత బ్రాండ్ అంబాసిడర్కు రూ.కోటిన్నర
భువనేశ్వర్: రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్గా 2025 సంవత్సరానికి గాను బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్కు రూ.కోటి 60 లక్షలు చెల్లించినట్లు రాష్ట్ర జౌళి, చేనేత శాఖ మంత్రి ప్రదీప్ బాల్ సామంత బుధవారం శాసన సభలో తెలియజేశారు. విపక్ష బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే డాక్టర్ అరుణ్ కుమార్ సాహు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ వెల్లడించారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచే చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ రుసుముతో పాటు ఆమె నియామకానికి సంబంధించిన సందర్శనలకు విమాన ఛార్జీలు, వసతి, ఆతిథ్య ఖర్చులను ప్రభుత్వం అదనంగా చెల్లిస్తున్నట్లు తెలియజేశారు. ఒడిశా సాంప్రదాయ చేనేత రంగం ప్రపంచ ఆకర్షణను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ను ఒడిశా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు తెలిపారు. -
విధుల్లోకి బిద్యులత హుయిక
రాయగడ: ఆదివాసీ నాయకురాలు, జిల్లా బాలల సంక్షేమ కేంద్రం అధ్యక్షురాలుగా పనిచేస్తూ విధుల నుంచి తొలగింపునకు గురైన బిద్యులత హుయిక హైకోర్టు ఆదేశాలతో తిరిగి విధుల్లోకి చేరారు. జిల్లా కలెక్టర్గా వ్యవహరించే ఫరూల్ పట్వారి (గత కలెక్టర్) అనివార్య కారణాలను చూపించి బిద్యులతను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అయితే బిద్యులత తనకు న్యాయం చేకూర్చాలని హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న కోర్టు బిద్యులత హుయికకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. మళ్లీ ఆమెను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఆమె విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు. డీఐపీఆర్వో బాధ్యతల స్వీకరణ రాయగడ: సబ్ డివిజనల్ పౌరసంబంధాల శాఖ అధికారిగా దేవరాజ్ టక్రి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో ఈ మేరకు బాధ్యతలు స్వీకరించగా జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, మాజీ డీఐపీఆర్వో జలంధర్ పుసిక, సిబ్బంది అభినందించి స్వాగతం పలికారు.యువకుడి బలవన్మరణం! రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి కొరప పంచాయతీలోని శిలిపొదొరో గ్రామంలో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. మృతుడు సేన్ లోయా కొడుకు భవాణీ లోయ(35)గా గుర్తించారు. గ్రామంలోని నిమ్మచెట్టుకు మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఏనుగు దాడిలో వ్యక్తికి గాయాలు రాయగడ: ఏనుగు దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పర్శాలి పంచాయతీ పరిధి బుడుని గ్రామంలో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు బాలా సికక ఉదయం కొండపై ఉన్న తన పంట పోలంో పనులు చేస్తున్న సమయంలో ఏనుగు అతనిపై హఠాత్తుగా దాడి చేయడంతో గాయపడ్డాడు. సమీపంలో ఉన్న వారు చూసి ఏనుగును తరిమారు. గాయాలతో ఉన్న సికకను కళ్యాణసింగుపూర్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి రిఫర్ చేశారు. ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 15 కేజీల గంజాయి పట్టివేత జయపురం: బైక్పై అక్రమంగా రవాణా చేస్తున్న 15 కేజీల గంజాయిని బొయిపరిగుడ అబ్కారి సిబ్బంది పట్టుకున్నారు. చిపాకూర్ గ్రామానికి చెందిన యువకుడిని అరెస్టు చేసినట్లు బొయిపరిగుడ అబ్కారి విభాగ అధికారి భగవాన్ మహానందియ తెలిపారు. -
ఈ–కేవైసీ గడువు పొడిగింపు
భువనేశ్వర్: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ–కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు వెలుగులోకి వచ్చాయని మంత్రి వివరించారు. 6,83,995 మంది మృతులు లబ్ధిదారులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారని వెల్లడించారు. వారి వివరాల్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు తెలియజేసి అనుబంధ చర్యలకు ఆదేశించామన్నారు. ఆహార భద్రత వ్యవస్థలో దుర్వినియోగం, మోసపూరిత లబ్ధి వ్యవహారాల్ని ఈ–కేవైసీ వెలుగులోకి తెస్తుందన్నారు. ఇప్పటి వరకు 33,128 అనర్హమైన రేషన్ కార్డులు రద్దు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అత్యధికంగా ఖుర్దా జిల్లాలో బూటకపు రేషన్ కార్డులు వెలుగు చూశాయన్నారు. జిల్లాలో ఈ–కేవైసీ ధృకరణ ప్రక్రియలో 4,747 బూటకపు లబ్ధిదారుల్ని గుర్తించి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. -
పోర్టు వాహనాల అడ్డగింత
● నిర్లక్ష్య డ్రైవింగ్పై గ్రామస్తుల మండిపాటు సంతబొమ్మాళి: మూలపేట పోర్ట్ వాహనాలను గ్రామస్తులు మంగళవారం అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కూర్మనాథపురం రామాలయం ఎదురుగా మూలపేట పోర్టుకు సంబంధించిన వాల్వో టిప్పర్ మెయింటెనెన్స్ కోసం పార్కింగ్ చేశారు. మెయింటెనెన్స్ పని అయిన తర్వాత లిఫ్ట్ డౌన్ చేయకుండా రోడ్డుపైకి రావడంతో విద్యుత్ వైర్ ఇంజిన్కు ట్రాలీకి మధ్య ఉండిపోయింది. అది గమనించిన డ్రైవర్ టిప్పర్ను ముందుకు తీసుకుని వెళ్లడంతో విద్యుత్ హైటెన్షన్ వైర్లు రాపిడీకి గురై పెద్ద శబ్దంతో మంటలు చెలరేగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ శబ్దంతో రోడ్డు మీద ఉన్న వ్యక్తులు పరుగులు తీయగా, ఇంట్లో ఉన్న గ్రామస్తులు, మహిళలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. టిప్పర్కు, ట్రాలీకి మధ్యన ఉన్న వైరును చూసి ఆందోళన చెంది టిప్పర్ కదలకుండా అడ్డుకున్నారు. ఇలా జరగడం ఇది ఐదో సారి అని ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఎంతమంది ప్రాణాలు తీస్తారంటూ మహిళలు, గ్రామస్తులు మండిపడ్డారు. దీంతో ట్రాపిక్కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న సంతబొమ్మాళి ఎస్ఐ వై.సింహాచలం సంఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. ఇంటిలో విద్యుత్ పరికరాలన్నీ పాడైపోయాయని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వాహనాలను కదలనీయబోమని గంటల తరబడి గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గత్యంతరం లేక పోర్టు హెచ్ఆర్ మేనేజర్ రాఘవరెడ్డి సంఘటన స్థలానికి వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని యాజమాన్యమే భరిస్తుందని హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. -
గురుకుల పాఠశాల తనిఖీ
పాతపట్నం: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల, కళాశాలల అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్కుమార్ అన్నారు. పాతపట్నం మండలం ప్రహరాజపాలెంలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను మంగళవారం గురుకులాల సమన్వయాధికారి వై.యశోదలక్ష్మితో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థుల భోజనం, వంటగది, స్టోర్రూమ్, డార్మిటరీలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గిరిజనుల బతుకులు బూడిద చేయవద్దు సరుబుజ్జిలి: థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మించి గిరిజనుల బతుకులు బూడిద చేయవద్దని థర్మల్ వ్యతిరేక పోరాటకమిటీ కన్వీనర్ సురేష్దొర, కోశాధికారి అత్తులూరి రవికాంత్ అన్నారు.వెన్నెలవలసలో మంగళవారం థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో థర్మల్ వ్యతిరేక పోస్టర్లను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులపై ఏమాత్రం ప్రేమ ఉన్న ప్రభుత్వం వెంటనే థర్మల్ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని డిమాండ్చేశారు. కార్యక్రమంలో పోరాట కమిటీ కార్యదర్శి సమర సింహాచలం, పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు. థర్మల్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోవాలి ఆమదాలవలస: సరుబుజ్జిలి, బూర్జ మండలాల ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టిన థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కోనారి మోహనరావు డిమాండ్చేశారు. మంగళవారం ఆమదాలవలస పట్టణంలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం పెన్షన్ల పంపిణీకి సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలోని ఆదివాసీల గ్రామాలకు వెళ్లి ప్లాంట్ ఏర్పాటుపై కాగితాలు ఏమైనా ఉంటే చూపెట్టాలని స్థానికులను అడగడం సిగ్గుచేటన్నారు. ప్లాంట్ నిర్మించబోమని చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందన్నారు. ప్లాంట్ నిర్మిస్తున్నట్లు తనకు తెలియదని చెప్పడం కంటే ఈ ప్రాంతంలో నిర్మించడం లేదని చెబితే బాగుండేదన్నారు. ప్రాజెక్టును స్థానికులు వ్యతిరేకిస్తుంటే ఎందుకు ముందుకెళ్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికై నా పాలకులు తీరు మారకపోతే భవిష్యత్తు ఉద్యమానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ వికాస పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, సీపీఐ కార్యదర్శి చాపర సుందర్లాల్, థర్మల్ పోరాట కమిటీ కోశాధికారి అత్తులూరి రవికాంత్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సవర లక్ష్మణరావు, అఖిలభారత యువజన సంఘం అధ్యక్షులు బొత్స సంతోష్కుమార్, థర్మల్ పోరాట కమిటీ సభ్యులు సవర సింహాచలం, కునారి మనోజ్, సవర సింగయ్య ,నగేష్ తదితరులు పాల్గొన్నారు. కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లలు మృతి పొందూరు: కొంచాడ గ్రామంలో కుక్కల దాడిలో మంగళవారం సుమారు 40 గొర్రె పిల్లలు మృతి చెందాయి. అన్నదమ్ములు కురమాన రమణ, కురమాన గౌరినాయుడులు తమ శాలలో 40 గొర్రె పిల్లలు ఉంచారు. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా కుక్కల గుంపు చొరబడి దాడిచేసి చంపేశాయి. స్థానికులు వచ్చి తరిమికొట్టేలోపే గొర్రె పిల్లలన్నీ మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. మృతిచెందిన గొర్రె పిల్లలకు పెనుబర్తి పశువైద్యాధికారి హేమంత్ పోస్టుమార్టం నిర్వహించారు. -
దొంగల హల్చల్
● బూర్జలో ఆరు తులాల బంగారం, 23 తులాల వెండి చోరీ ● టెక్కలి అయ్యప్పనగర్లో 60 తులాల వెండి మాయం బూర్జ/టెక్కలి రూరల్ : జిల్లాలో దొంగలు పడ్డారు. బూర్జ, టెక్కలి అయ్యప్పనగర్లో చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్జ గ్రామానికి చెందిన చెన్నూరు రమేష్ గ్రామంలో టిఫిన్ షాపు నడుపుతున్నారు. శనివారం కుటుంబంతో కలిసి అరకు విహార యాత్రకు వెళ్లారు. టిఫిన్ షాపులో పనిచేస్తున్న సూర్యనారాయణ అనే వ్యక్తి మంగళవారం రమేష్ ఇంటికి వెళ్లిచూడగా తలుపులు తెరిచి ఉండటం గుర్తించి రమేష్కు ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశారు. వెంటనే ఆయన వచ్చి చూడగా బీరువాలో ఆరుంపావు తులాల బంగారం, 23 తులాల వెండి, రూ.లక్ష నగదు చోరీకు గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, క్లూస్ టీమ్ వచ్చి వివరాలు సేకరించారు. ఆమదాలవలస సీఐ పాండ్రంకి సత్యనారాయణ, ఎస్సై ఎం.ప్రవళ్లిక ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు. అయ్యప్పనగర్లో వరుస దొంగతనాలు.. టెక్కలి అయ్యప్పనగర్లో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో కాలనీవాసులు భయాందోళనకు గురౌతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి వరుస ఇళ్లల్లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారం వసంతరావు శుక్రవారం మధ్యాహ్నం శుభకార్యానికి వెళ్లి వచ్చే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా సుమారు 60 తులాల వెండి, రూ.లక్ష నగదు, ల్యాప్టాప్ చోరీకి గురైనట్లు గుర్తించారు. అదే రోజు పొరుగు ఇంట్లోకి సైతం దుండగులు చొరబడే ప్రయత్నం చెయ్యగా వృద్ధురాలు కేకలు వేయడంతో పరారయ్యారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వసంతరావు తెలిపారు. -
పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ శిబిరం
జయపురం: జయపురం ఫూల్బెడ గ్రామంలో గల ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం, జయపురం వారు పుట్టగొడుగుల వ్యవసాయంపై శిక్షణ శిబిరం నిర్వహించారు. జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ వ్యవసాయ విభాగ కేంద్రంలో కెపాసిటీ బిల్డింగ్ పథకంలో భాగంగా మంగళవారం స్వయం సహాయక గ్రూపు మహిళలకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో బొయిపరిగుడ సమితి నుంచి 60 మంది స్వయం సహాయక గ్రూపుల మహిళలు పాల్గొన్నారు. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం సీనియర్ ఉద్యోగి త్రిపతి ఖొర అతిథులను ఆహ్వానించారు. బొయిపరిగుడ సమితి ప్రభుత్వ ఉద్యాన వ్యవసాయ విభాగ అధికారి త్రిలోచన పాఢీ పుట్టగొడుగు వ్యవసాయం చేసే విధానాన్ని స్వయం సహాయక గ్రూపుల మహిళలకు వివరించారు. అతి తక్కువ రోజుల్లో పుట్టగొడుగు వ్యవసాయం ఎలా చేయాలి, పండించిన పంటను ఎలా మార్కెట్ చేసి లాభాలు ఎలా సంపాదించాలి అన్నది వారికి బోధించారు. పుట్టగొడుగు వ్యవసాయం వల్ల మహిళా రైతు కుటుంబాలు లబ్ధి పొందే పద్ధతిపై త్రిలోచన పాఢీ వివరించారు. పుట్ట గొడుగు పంటకు ఏయే వస్తువులు అవసరం, వాటిని ఎలా సంపాదించాలో మహిళలకు విపులీకరించారు. పుట్టగొడుగు పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరించారు. -
కనీసం రూ.15 చెల్లించాలి..
ప్రస్తుత ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి రూ.20 చొప్పున ప్రభుత్వం చెల్లించాలి. కనీసం రూ.15 అయినా ఇవ్వాలి. ధరలకు.. పెంచిన వంట ఖర్చులకూ పొంతన ఉండటం లేదు. – అల్లు మహాలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం గౌరవాధ్యక్షురాలు నిత్యవసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో పైసల్లో పెంపు చేయడం సరికాదు. మా వైపు నుంచి కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలి. – బర్ల బంగారమ్మ, వంట నిర్వాహకురాలు, ఉర్లాం పెరిగిన ధరలకు అనుగుణంగా ఽవంట ఖర్చులు పెంచాలి. కూరగాయలు ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో ఏమీ కొనలేకపోతున్నాం. ప్రభుత్వం తాజాగా పెంచిన ధరలు సరిపోవు. – అమ్మాయమ్మ, వంట నిర్వాహకురాలు, వీఎన్పురం స్కూల్ ● -
కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం!
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుసాని బ్లాక్ మహాదావ్ పూర్ గ్రామానికి చెందిన మహిళ మానస జెన్నా గ్రామంలోని ప్రశాంత్ డాలోకు రూ. 3.77 లక్షలు అప్పుకింది కోద్దిరోజుల క్రితం అందజేసింది. ఈ రుణం ఇచ్చినట్టు ఒక కాగితంపై ప్రామిసరీ నోట్ను కూడా మానస రాసుకున్నది. అయితే అప్పు తీసుకున్న ప్రశాంత్ పాముకాటుతో ఇటీవల మరణించాడు. తీసుకున్న అప్పును మృతుడు కోడుకు జగదీష్ డోలో ఇవ్వాలని కోరగా అందుకు ఆతడు తీర్చుతానని హామీ ఇచ్చాడు. కానీ చాలారోజులుగా మానస జెన్నాకు తిప్పుతూ చివరికి అప్పును ఇవ్వనని మొండికేయడంతో..చేసేది లేక ఆమె గురండి పోలీసుస్టేషన్ అధికారి ఓంనారాయణ పాత్రోకు ఫిర్యాదు చేసింది. అయితే గురండి పోలీసు ష్టేషన్ అధికారి ఆమెతో అసభ్యంగా మాట్లాడడంతో పాటు ఆమె లొంగుబాటుకు ప్రోత్సాహించాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లగా ఆయన సెలవు మీద ఉండటంతో తిరిగి పర్లాకిమిడి పోలీస్స్టేషన్కి వెళ్లినప్పటికీ అక్కడి అధికారి ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో సోమవారం జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును ఆదనపు ఎస్పీ స్వీకరించారు. అయితే వెనువెంటనే మానసజెన్నా కలెక్టరేట్ హాలు బయట తన చీరకొంగుతో ఆత్మహత్యాయత్నం చేయగా ఆదనపు ఎస్పీ సునీల్ మహాంతి వారించి సబ్ డివిజనల్ పోలీసు అధికారితో ప్రత్యేకంగా విచారించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆమె వెళ్లిపోయింది. -
వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్లో బోత్తవ పంచాయతీ, పొరుగున ఉన్న కొత్తూరు మండలం లివురి గ్రామానికి వంశధార నదిపై ఒక వంతెన నిర్మించడానికి పదేళ్లుగా కృషి చేస్తున్నారు. కోడూరు నారాయణరావు గతంలో పర్లాకిమిడి శాసనసభ్యులుగా పనిచేసిన సమయంలో ఇరురాష్ట్రాల అనుమతితో వంశధార నదిపై ఒక వంతెన నిర్మిస్తే లివురి, కాశీనగర్ వాసులకు మార్గం సుగమం అవుతుందని ప్రయత్నించగా అది ఇప్పుడు మోహాన్ మఝి ప్రభుత్వం చొరవతో అనుమతి లభించినందుకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ మఝికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే పర్లాకిమిడి నియోజకవర్గం గుసాని సమితిలో శోబర పంచాయతీ పద్మపూర్ గ్రామానికి ఒక వంతెన నిర్మించడానికి ప్రభుత్వం జిల్లా గ్రామీణ రోడ్లు శాఖకు ఆమోదం తెలిపినట్టు ఉత్తరం రాశారని, దీంతో ఈ రెండు వంతెనలు రాష్ట్ర సేతుబంధ యోజన కింద పనులు త్వరలో ప్రారంభం అవుతాయని కోడూరు నారాయణ రావు విలేకరల సమావేశంలో తెలియజేశారు. స్థానిక ఇరదల వీధిలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ విషయం ఆయన తెలియజేశారు. పర్లాకిమిడిలో జాజిపురం గ్రామం నుంచి బైపాస్ రోడ్డు పనులకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో స్థల సేకరణ సర్వే పూర్తిచేసుకుని టెండర్లు పిలుస్తున్నట్టు జిల్లా రోడ్లు–భవనాల శాఖ ఎస్ఈ తెలియజేసినట్టు కె.నారాయణ రావు చెప్పారు. జిల్లా అభివృద్ధి, గ్రామీణ వికాసం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని బిజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరు నారాయణరావు అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరుతో పాటు బిజేపీ జిల్లా అధ్యక్షులు నబకిశోర్ శోబోరో తదితరులు పాల్గొన్నారు. -
నేడు శ్రీ ముఖ అలంకరణ
భువనేశ్వర్: బుధవారం మార్గశిర మాసం శుక్ల పక్ష త్రయోదశి పురస్కరించుకుని శ్రీ మందిరం రత్న వేదికపై మూల విరాట్లకు ముఖ అలంకరణ దిద్దుతారు. ద్వితీయ భోగ మండప సేవ ముగిసిన తర్వాత ఈ సన్నాహాలు ఆరంభిస్తారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తారని శ్రీ మందిరం అధికార వర్గాలు తెలిపాయి.ఆదివాసీల భారీ ఢమరుక వాయిద్యంసంస్కృతికి అద్దం పట్టే ఉత్సవాలు: కలెక్టర్ ఆదివాసీ, హరిజన సంప్రదాయాలతో ఇమిడి ఉన్న రాయగడ జిల్లా వారి భాషా, సంస్కృతి, కళలను పరిరక్షించడంతో పాటు వారి సంస్కృతికి అద్దం పట్టేవిధంగా ఏటా చొయితీ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. సమితి స్థాయి ఉత్సవాల ప్రారంభోత్సవలో భాగంగా కాసీపూర్లోని సమితి కార్యాలయం వెనుక ఉన్న మైదానంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం అందరి కర్తవ్యమన్నారు. ఈ నెల 26 నుంచి ఐదు రోజులు జిల్లా కేంద్రమైన రాయగడలో ఉన్న గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో జరగనున్న జిల్లా స్థాయి చొయితీ ఉత్సవాలకు అంతా సహకరించడంతో పాటు ఉత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చొయితీ ఉత్సవాలకు సంబంధించిన పొస్టర్లను వేదికపై ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరో, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, రాయగడ ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రక, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న పాల్గొన్నారు. -
గాయత్రీ మందిరం ప్రతిష్టోత్సవాలు
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్లో కొత్తగా నిర్మించిన గాయత్రీ మందిర ప్రతిష్టోత్సవాలు మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గాయత్రీ పరివార్కు చెందిన సేవా కమిటీ సభ్యులు కలశ యాత్రను నిర్వహించారు. కల్యాణి నది నుంచి తీసుకొచ్చిన శుద్ధ జలాలను కలశాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి మందిరం వద్ద నిలిపారు. అనంతరం శాంతి యజ్ఞం, ప్రాణ ప్రతిష్ట, ధ్వజస్తంభం ఏర్పాటు తదితర పూజలు నిర్వహించారు.బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కార్యాచరణ భువనేశ్వర్: రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని కార్మిక, ఉద్యోగుల రాష్ట్ర బీమా విభాగం మంత్రి గణేష్ రామ్ సింగ్కుంటియా మంగళవారం శాసన సభలో తెలియజేశారు. తొమ్మిది విభాగాల సమన్వయంతో ఈ ప్రణాళిక కార్యాచరణ కొనసాగుతుందన్నారు. బాల కార్మికుల నిర్మూలన దిశలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణకు సంబంధించి ఎమ్మెల్యే టొంకొధొరొ త్రిపాఠి లేవనెత్తిన ప్రశ్న కు మంత్రి బదులు ఇచ్చారు. రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి సహాయక చర్యలు చేపడుతున్నారు. అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు తరచు నిర్వహించి చైతన్యపరుస్తున్నారని మంత్రి వివరించారు. బాల కార్మికులపై చివరి సర్వే 1997లో నిర్వహించారు. ఈ సర్వేలో 2,15,222 మంది బాల కార్మికులను గుర్తించారని మంత్రి పేర్కొన్నారు. బాల కార్మికుల (నిషేధం, నియంత్రణ) చట్టం, 1986, బాల కార్మికులను గుర్తించి వారిని రక్షించడానికి జిల్లా స్థాయి తనిఖీలను తప్పనిసరి చేయడం జరిగిందన్నారు. బాల కార్మికులను నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి హామీ ఇచ్చారు. -
తూర్పు కోస్తా రైల్వే ప్రేమ్ సమావేశం
భువనేశ్వర్: నిర్వహణలో ఉద్యోగుల భాగస్వామ్య సమావేశం (ప్రేమ్) ప్రధాన కార్యాలయం రైల్ సదన్లో జరిగింది. జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ అధ్యక్షతన మంగళ వారం జరిగిన ఈ సమావేశానికి జోనల్ స్థాయిలో పలు విభాగాల ఉన్నతాధికారులు, గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు, వివిధ రైల్వే సిబ్బంది సంఘాల ప్రతినిధులు హాజరై ముఖాముఖి సంప్రదింపుల్లో పాలుపంచుకున్నారు. గమ్యాన్ని ప్రోత్సహించే చొరవలో భాగంగా సామరస్యపూర్వకమైన, నిర్మాణాత్మక పారిశ్రామిక సంబంధాలను పెంపొందించే సంప్రదాయంలో భాగంగా భారతీయ రైల్వే సిబ్బంది భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. రైల్వే కార్యకలాపాల్లో సమష్టి ప్రయత్నాలతో మెరుగైన ఫలితాల సాధనకు ఈ సంప్రదాయం దోహదపడుతుందని జనరల్ మేనేజరు అభిప్రాయపడ్డారు. -
ఉత్సాహం ఉత్సవమై..
● చొయితీ ఉత్సవాలకు శ్రీకారం ● కాసీపూర్ నుంచి సమితి నుంచి ప్రారంభంరాయగడ: చొయితీ ఉత్సవాలకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని కాసీపూర్లో ఉన్న మా మణికేశ్వరి మందిరం నుంచి సమితి స్థాయి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అమ్మవాకి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారి ఆశీర్వచచాలు పొందిన అనంతరం అక్కడ నుంచి కలశ యాత్రకు నాంది పలికారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి కలశాన్ని మోసుకుంటూ మందిరం నుంచి తోడ్కొని రాగా, కలెక్టర్ కులకర్ణి జ్యొతీ ప్రజ్వలన చేసిన మషాల్ను పట్టుకుని ర్యాలీలొ పాల్గొన్నారు. అంతకుముందు కాసీపూర్లో మటోపొద వద్ద ఉన్న నది సమీపంలో గంగామాతకు ప్రత్యేక పూజలను సరస్వతి మాఝి, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, సమితి అధ్యక్షుడు కొంఠో మాఝిలు నిర్వహించారు. కలశాలతో శుద్ధ జలాలను తీసుకువచ్చి మణికేశ్వరి మందిరంలో నిలిపారు. అలాగే జిల్లాలోని పదకొండు సమితులకు చెందిన 11 కలశలను పూజా కార్యక్రమంలో ఉంచారు. అనంతరం భక్తుల సమక్షంలో కలశ యాత్రను ప్రారంభించారు. భారీ ఎత్తున ర్యాలీ సమితి స్థాయి చొయితీ ఉత్సవాల ప్రారంభోత్సవంలో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, యువతీ, యువకులు పాల్గొన్నారు. కలశ యాత్రలో పాల్గొన్న వీరంతా నృత్యాలతో సందడి చేశారు. చొయితీ శుభాకాంక్షలు ఒకరినొకరు చెప్పుకున్నారు. ప్రచార రథం ప్రారంభం చొయితీ సమితి స్థాయి ఉత్సవాల్లో భాగంగా స్థానిక డీఆర్డీఏ కార్యాలయం ఎదుట ప్రత్యేకంగా రూపొందించిన చొయితీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, జిల్లా సాంస్కృతి విభాగం అధికారి సస్మిత బౌరి, డొంబురు పండ, పాత్రికేయులు పాల్గొన్నారు. జిల్లాలో నేటి నుంచి ప్రచార రథం ప్రతీ సమితిలో పర్యటిస్తూ చొయితీ ఉత్సవాలకు సంబంధించి ప్రచారం చేస్తుందని సాంస్కృతిక శాఖ అధికారి బౌరి వెల్లడించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు కాసీపూర్లో మంగళవారం సమితి స్థాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కలహండి జిల్లాకు చెందిన భవాణీపట్నం నుంచి వచ్చిన గుంరా నృత్యప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవగా ఒడిశా సంస్కృతికి అద్దం పట్టే సంబల్పూర్ నృత్యాలు, ఆదివాసీ భాషా, సంస్కృతిని ప్రతిబింబించే థింశా నృత్యం అందరినీ అలరించింది. ఆదివాసీల సంప్రదాయ వాయిద్యం ఢమరుకం నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
ఘనంగా బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం
కొరాపుట్: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) 61వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. మంగళవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని బీఎస్ఎఫ్ సెక్టార్లో డీఐజీ సత్యవాన్ కంచి బీఎస్ఎఫ్ జెండా ఎగుర వేశారు.అనంతరం జవానులద్దేశించి ప్రసంగించారు. 1965 డిసెంబర్ ఒకటో తేదీన ఆవిర్భవించిన బీఎస్ఎఫ్ దేశ సమగ్రత, శాంతి పరిరక్షణలో ఎంతో కీలక పాత్ర వహించిందన్నారు. కొరాపుట్ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం అదుపు చేయడంలో కృషి చేస్తుందని గుర్తు చేశారు. అనంతరం అమర జవాన్ల స్ఫూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్, ఎస్పీ రోహిత్ వర్మ పాల్గొన్నారు. -
అవిభక్త కొరాపుట్ జిల్లాలో 686 పాఠశాలలు మూసివేత
కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాలో గత ఐదేళ్లలో 686 పాఠశాలలు మూసి వేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్లో తన ప్రశ్నకి కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. దేశంలో వెనుక బడిన జిల్లాలలో అవిభక్త కొరాపుట్ జిల్లాలు కొరాపుట్, నబరంగ్పూర్, రాయగడ, మల్కన్గిరి జిల్లాలు ఉన్నాయన్నారు. ఈ జిల్లాలలో అత్యధికంగా గిరిజనులు జీవిస్తున్నారని గుర్తు చేశారు. సరైన రహదారుల లేని కొండ ప్రాంతాల్లో ప్రభుత్వం వరుసగా పాఠశాలలు మూసి వేస్తూ గిరిజన బాలలకు విద్యాహక్కు దూరం చేసిందన్నారు. ఈ పరిణామంతో 8,854 మంది గిరిజన బాలలపై నేరుగా విద్యా సమస్య పడిందన్నారు. వీరు దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లడానికి అనేక కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మాత్రం మూసి వేయడానికి అనేక సాకులు చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన భవనాలు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత తదితర అంశాలను పేర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా హక్కు కింద 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక కిలోమీటర్ లోపు పాఠశాలలు ఉండాలన్నది నిబంధన అని గుర్తు చేశారు. ఈ మూసి వేసిన పాఠశాలలు అత్యధికంగా కొరాపుట్ జిల్లా దశమంత్పూర్ సమితిలో 46, లమ్తాపుట్ సమితిలో 35, మల్కన్గిరి జిల్లా కలిమెలలో 27, నబరంగ్పూర్ జిల్లా జొరిగాంలో 20, రాయగడ జిల్లా మునిగుడలో 13 పాఠశాలలు ఉన్నాయన్నారు. ఈ విషయం తాను ఇది వరకు ఆరోపిస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఎంపీ సప్తగిరి ఉల్క పేర్కొన్నారు. ఈ పాఠశాలలు పునరుద్ధరణ చేసేంత వరకు తాను పోరాటం చేస్తానని తెలిపారు. -
వికసిత భారత్లో యువతే కీలకం
భువనేశ్వర్: వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వం లక్ష్యం దిశలో యువజనం పాత్ర అత్యంత కీలకమని, యువతరం చైతన్యంతో ముందడుగు వేసి అభివృద్ధి చెందిన భారత దేశ నిర్మాతలు కావాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. జట్నీ కళాశాల మండల స్థాయి మండల స్థాయి యు వజనోత్సవం 2025 నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జెట్నీ మండల విద్యాధికారి యోగేష్ చంద్ర సామంతసింగార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జట్ని మండల అభివృద్ధి అధికారి (బీడీఓ) బసంత్ కుమార్ హాతి మాట్లాడుతు దేశాభివృద్ధి బాటలో యువ విద్యార్థుల ప్రతిభ ప్రధానాంశమై నిలుస్తుందన్నారు. యువ ప్రతిభాపాటవాలు దేశానికి అంకితం కావాలని యువ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఒడిశా ఇంజనీరింగ్ కళాశాల విరామ ప్రొఫెసర్ ఇంజనీర్ రాజేంద్ర ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు మానసిక స్థైర్యంతో ఏకాగ్రత బలపరచుకుని సానుకూల మనస్తత్వంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. కళాశాల అధ్యక్షురాలు డాక్టర్ స్వప్న మల్లిక్ యువజనోత్సవం లక్ష్యాన్ని వివరించారు. జట్నీ మండల పరిధిలో కళాశాలల నుంచి 100 మంది విద్యార్థులు మో భారత్ (నా భారతదేశం) పోర్టల్ ఆధ్వర్యంలో యువజనోత్సవం 7 విభాగాల్లో చురుగ్గా పాలుపంచుకున్నారని సమన్వయక్తర పూర్ణ చంద్ర బెహరా తెలిపారు. మండల స్థాయి ఉత్సవాల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికై నట్లు ప్రకటించారు. ‘ఐదేళ్లలో 25 మెగా పైపుల నీటి ప్రాజెక్టులు పూర్తి’ భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో 25 భారీ కుళాయి నీరు సరఫరా (పీడబ్ల్యూఎస్) ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టులకు కేటాయించిన రూ.35,193.24 కోట్లలో రూ.17,502.12 కోట్లు ఖర్చు చేసిందని పంచాయతీ రాజ్, తాగు నీటి శాఖ మంత్రి రబీ నారాయణ్ నాయక్ రాష్ట్ర శాసన సభలో తెలిపారు. ఎమ్మెల్యే అరవింద్ మహా పాత్రో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానంగా గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగు నీటిని అందించేందుకు 207 భారీ పీడబ్ల్యూఎస్ ప్రాజెక్టులను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. పురోగతి ఆశాజనకంగా ఉన్నప్పటికి భూసేకరణలో జాప్యం, నిర్వాహక సంస్థల నిర్లక్ష్యం మరియు చట్టబద్ధమైన ఆమోదాలలో జాప్యం వంటి సమస్యల కారణంగా అనేక ప్రా జెక్టులు మందకొడిగా కొనసాగుతున్నాయని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం విఫలమైన సంస్థలకు భారీ జరిమానాలు విధించింది. వివరణ కోరుతు తాఖీదులు జారీ చేసింది. పురోగతిని పర్యవేక్షించి అడ్డంకులను తొలగించేందుకు ఉన్నత స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు తరచు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సంవత్సర వారీ వివరాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 14 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇది అన్ని గ్రామీణ కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అనే ప్ర భుత్వ లక్ష్యాన్ని సాధించే దిశగా గణనీయమైన పురోగతిని సూచిస్తుందని అన్నారు.దోపిడీ దొంగల అరెస్టు జయపురం: బైకిస్టుపై దాడి చేసి మొబైల్ దోపిడీ చేసిన నలుగురు దొంగలను అరెస్టు చేసినట్లు బొరిగుమ్మ పోలీసు అఽధికారి రచిత మడకామి మంగళవారం వెల్లడించారు. వారి నుంచి రెండు బైక్లు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వివరాల్లోకి వెళితే..నవంబర్ 28వ తేదీన బొరిగుమ్మ సమితి బిరిగుడ గ్రామానికి చెందిన రాధాకాంత పాత్రో 26వ జాతీయ రహదారిలో బైక్ ఇంటికి వెళ్తున్న సమయంలో అంచల– ఖెందుగుడ గ్రామాల మధ్య ముఖానికి మాస్కులు వేసుకున్న దుండగులు అతన్ని అడ్డగించి మొబైల్ లాక్కోవడంతోపాటు దాడి చేసి కొట్టారు. ఈ సంఘటనపై రాధాకాంత పాత్రో బొరిగుమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా.. దోపిడీకి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పేర్కొ న్నారు. అరెస్టయిన వారు నవరంగపూర్ జిల్లా పపడహండి పోలీసుస్టేషన్ పరిధిలోని సనకుమిలి గ్రామానికి చెందిన రోషన్ హరిజన్, చొబి హరిజన్, సునీల్ హరిజన్, జయపురం సదర్ పోలీసు పరిది డుమురుగుడ గ్రామానికి చెందిన మధుసూదన హరిజన్ ఉన్నారన్నారు. -
● వైభవంగా ద్వాదశ పూజలు
జయపురం: జయపురం సమితి అంబాగుడ గ్రామంలోని శ్రీరాధాకృష్ణ మందిరంలో ద్వాదశి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భగవాన్ రాధాకృష్ణకు 72 రకాలతో తయారు చేసిన ప్రసాదాలను నైవేద్యంగా భక్తులు సమర్పించారు. సంకీర్తనలు, భజనలు, సత్సంగ్ పూజలు చేశారు. బాబా కృష్ణచంద్రపాల్, పూరీ హరిచరణ దాస్, రత్నాకర నారాజీ, లింగరాజ్ నిశంకో, బిపద భంజీన మండల్ నీర సాహు, మదన మహారాజ్, పాఢీ తుషార కాంత దాస్లు ద్వాదశ మహోత్సవ ప్రాధాన్యాన్ని భక్తులకు వివరించారు. రొశాయి బిశ్వనాద్ పాఢీ పర్యవేక్షణలోలో జరిగిన పూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
14న జయపురం రహగిరి వేడుకలు
జయపురం: ఈ నెల 14వ తేదీన జయపురం రహగి రి వేడుకలు నిర్వహించేందుకు రహగిరి నిర్వహణ కమిటీ నిర్ణయించింది. స్థానిక మున్సిపాలిటీ సభాగృహంలో జయపురం సబ్కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి రహగిరి జరపాలని ప్రతిపాదించారు. సభికులు ఏకగ్రీవంగా అంగీకరించారు. 14వ తేదీ ఉదయం నుంచి 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రహగిరి వేడుకలు నిర్వహించాలని సబ్కలెక్టర్ నిర్దేసించా రు. ఆ కార్యక్రమంలో వివిధ మనోరంజన్ కార్యక్రమాలు, సంస్కృతిక ప్రదర్శనలతో పాటు పలు స్టా ల్స్ ఏర్పాటు చేసి ఆహార దినుసులు అమ్మకం ఏ ర్పాటు చేయాలని నిర్ణయించారు. 2017లో జయపురంలో రహగిరి వేడుకలు ప్రారంభించటం జరి గిందని సమావేశంలో వెల్లడించారు. వైస్ చైర్మన్ బి. సునీత, తహసీల్దార్ సబ్యసాచి జెనా, పట్టణ పోలీ సు అధికారి ఉల్లాస రంజన్ రౌత్, జయపురం సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రదాన్, జయపురం సబ్ డివిజన్ ప్రజాసంబంధాల, సమాచార అధికారి యశోద గదబ, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
నబరంగ్పూర్ ఎమ్మెల్యే గృహానికి సీఎం రాక
కొరాపుట్: అధికార బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ప్రభుత్వ అధికార గృహ నివాసం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి హాజరై అందరినీ ఆశ్చర్య పరిచారు.సోమవారం భుబనేశ్వర్లోని యూనిట్–8లో గౌరీకి ప్రభుత్వం క్వార్టర్ కేటాయించింది. ఎమ్మెల్యే ఎన్నికై రెండేళ్లు గడుస్తున్నప్పటికీ మంచి క్వార్టర్ ప్రభుత్వం కేటాయించలేదు. మాజీలు ఖాళీ చేయకపోవడంతో ఎమ్మెల్యే ఇబ్బందులు పడ్డారు. చివరకు పాత భవనాన్ని మరమ్మతులు చేసి ఎమ్మెల్యేకి కేటాయించినప్పటికీ రెండేళ్లు గడచిపోయాయి. దీంతో ఎమ్మెల్యే గౌరీ కుటుంబ సభ్యులు పూజలు చేసి గృహ ప్రవేశం చేశారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యే రెండేళ్ల అనంతరం నూతన గృహ ప్రవేశం చేస్తుండడంతో సీఎం హాజరై గౌరీ మజ్జి కుటుంబం ఆశ్చర్యం కలిగించారు. సీఎం వెంట మరో ఐదుగురు మంత్రులు, 13 మంది ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. -
విద్య, ఉపాధిలో రిజర్వేషన్లపై.. ప్రత్యేక చర్చకు అభ్యర్థన
భువనేశ్వర్: విద్య, ఉపాధి కల్పనలో ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ), షెడ్యూల్డ్ కులా లు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ల అంశంపై ప్రత్యేక చర్చ కోసం స్పీకర్కు కాంగ్రెస్ నాయకుడు లిఖిత పూర్వకంగా అభ్యర్థించారు. కాంగ్రెస్ శాసన సభ నాయకుడు రామచంద్ర కద మ్ ఈ విషయాన్ని సభ విరామ సమయంలో తెలియజేశారు. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు 40 శాతం, ఓబీసీలకు 27 శాతం కొనసాగుతోంది. వాస్తవానికి ఈ వర్గాల కు వారి హక్కులు లభించడం లేదు. ఈ అంశా న్ని ఏకగ్రీవంగా చర్చించాలని రామచంద్ర కద మ్ డిమాండ్ చేశారు. వాస్తవంగా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. కేవలం 11 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇస్తున్నారు. ఇది సిగ్గుచేటు చర్య అన్నారు. మరోవైపు, షె డ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు 40 శాతం ఉండగా.. వారు ఉన్నత విద్యలో 20 శాతం రిజర్వేషన్లు మాత్రమే పొందుతున్నారు. ఇందులో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, దళితుల కు 8 శాతం రిజర్వేషన్లు పరిమితం చేశారు. ప్రభుత్వం ఈ నియమాన్ని ఏ ప్రాతిపదికన చేసిందని రామచంద్ర కదమ్ ప్రశ్నించారు. రాయగడ: కొత్తగా నిర్మించిన స్థానిక రైల్వే స్టేషన్లో రాయగడ ప్రజల ఆరాధ్య దైవం మజ్జిగౌ రి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర గవర్నర్ కంభం పాటి హరిబాబును కోరా రు. స్థానిక విశ్వబ్రాహ్మణ వ్యవస్థాపక సభ్యు లు, సమాజ సేవకులు పొట్నూరి భాస్కరరావు సోమవారం గవర్నర్ను కలిసి ఈ మేరకు విన తి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన గవర్నర్ వెంటనే రైల్వే శాఖ ఉన్నతాధికారుల కు, డీఆర్ఎంకు సందేశాలు పంపించారు. పర్లాకిమిడి: నైరుతి వాయవ్య బంగళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గజ పతి జిల్లా అంతటా సోమవారం వేకువ జామునుంచి వర్షం పడింది. కాశీనగర్లో అత్యధికంగా 7.0 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, పర్లాకిమిడిలో 3.6, జిల్లా వ్యాప్తంగా23.8 మి.మీటర్ల వర్షం కురిసిందని జిల్లా వాతావరణ, ఎమర్జెన్సీ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ వర్షంతో వరి కోతలకు అటంకం ఏర్పడింది. భువనేశ్వర్: పవిత్ర గీతా జయంతి పురస్కరించుకుని స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి సోమవారం సామూహిక గీతా పారాయణం కార్యక్రమం నిర్వహించింది. సమితి సభ్యులు ఆనందోత్సాహాలతో పాలుపంచుకుని సమగ్ర భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణం చేశా రు. సమితి కార్యదర్శి రాయప్రోలు సత్యసా యి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజల్లో ధార్మిక భావాల ప్రేరణకు సమితి తరచూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని అధ్యక్షుడు గన్నవరపు ఆనంద రావు తెలిపారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాదాపుగా అన్నీ టీడీపీ కార్యకర్తలు, వారి ఏజెన్సీలకే ఇవ్వడం వల్ల వారంతా దళారులుగా మారి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని, అటువంటి ఏజెన్సీలను మార్చాలని ఆమదాలవలస వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు కలెక్టర్ గ్రీవెన్స్లో వినతిపత్రం అందించారు. సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు, ఆమదాలవలస మండలాల్లో రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధర రావడం లేదన్నారు. పొందూరు మండలంలోని రాపాక, కృష్ణాపురం వంటి ప్రాంతాల్లో అక్రమ క్వారీలు నిలుపుదల చేయాలని కోరారు. బూర్జ మండలం లక్కపురంలో ఆశా కార్యకర్త పోస్టు అక్రమ భర్తీని అడ్డుకోవాలన్నారు. సరుబుజ్జిలి మండలం పెద్దసవలాపురం సచివాలయంలో పాత స్థలంలోనే కొనసాగించాలని కోరారు. మహిళలకు ఉపాధి శిక్షణ ఎచ్చెర్ల : మండల కేంద్రం ఎచ్చెర్లలోని ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత కేంద్రం (మహిళా ప్రాంగణం)లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి (ఎపీఎస్ఎస్డీసీ–గుంటూరు) సౌజన్యంతో 18 నుంచి 45 ఏళ్ల మహిళలకు పలు ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ జిల్లా మేనేజర్ రబీకాసామ్యూల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్(60 రోజులు), హ్యండ్ ఎంబ్రాయిడర్(45 రోజులు) కోర్సులకు 8వ తరగతి, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు(90 రోజులు)కు పదో తరగతి చదివి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల మహిళలు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని, వివరాలకు 8309548067 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
అసంపూర్తి భవనాలకు నిధులు మంజూరు
కంచిలి : కంచిలిలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.65 లక్షలు నిధులు మంజూరుకు తక్షణమే జీఓ జారీ చేస్తున్నట్లు రాష్ట్ర గురుకుల సొసైటీ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్కుమార్ వెల్లడించారు. సోమవారం కంచిలి గురుకులంలో ఆయన పర్యటించారు. ఇక్కడి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘చలించదా..?’ అనే శీర్షికన నవంబర్ 21న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించారు. ఇప్పటికే పలువురు అధికారులు పర్యటించి ఆరా తీశారు. తాజాగా నాబార్డు భవనాలు పూర్తి చేయడానికి రూ.35లక్షలు, నాడు–నేడు భవనాలను పూర్తి చేయడానికి రూ.30లక్షలు మంజూరుకు అంచనాలు రూపొందించాలని ఇంజినీరింగ్ శాఖకు ఆదేశించారు. పాడైన డార్మిటరీ స్థానంలో కొత్త డార్మిటరీ నిర్మాణానికి రూ.4.5 కోట్లతో ఎస్టిమేషన్ తయారుచేసి పంపించాలని గురుకుల ప్రిన్సిపాల్ పి.శ్రీనివారావును ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గురుకులాల సమన్వయాధికారి వై.యశోద లక్ష్మి, సిబ్బంది ఉన్నారు. -
మహిళలను వేధించరాదు
మల్కన్గిరి: వివాహమైన మహిళలను వరకట్నం పేరుతో వేధించడం తగదని జిల్లా మహిళా శిశు సంరక్షణ సమితి కన్వీనర్ మణిమోహన్ సర్కార్ అన్నా రు. సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్డీఏ సమా వేశ మందిరంలో వరకట్న నివారణ చట్టంపై సోమ వారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ మహిళ తమ దాంప త్య జీవితం సుఖవంతంగా కొనసాగాలని ఆశపడుతుంటారన్నారు. అయితే కొన్ని కుటుంబాల్లో వరకట్న వేధింపులు తాళలేక ఆఘాయిత్యాలకు పాల్ప డం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశా రు. వరకట్న నిషేధ చట్టం గురించి అవగాహన కలిగేలా అధికారులు కృషి చేస్తే కొంతవరకు సత్ఫలితా లు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సీడీపీవోలు, సూపర్వైజర్లు, ఎస్హెచ్జీ బృందాలకు చెందిన మహిళలు, పోలీస్ విభాగాధికారులు పాల్గొన్నారు. అలాగే డీఎస్పీ మమత పాణిగ్రహి, చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అధికారి అశోక్ కుమార్ పట్నాయక్లు తమ ప్రసంగంలో మహిళల భద్రత గురించి మాట్లాడారు. -
సీఆర్పీఎఫ్ జవాన్ల స్వచ్ఛ ప్రతిజ్ఞ
కొరాపుట్: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్పై సీఆర్పీఎఫ్ 12వ బెటాలియన్ జవానులు ప్రతిజ్ఞ చేశారు. సోమవా రం జానకీనగర్లోని ఆర్ఆర్ గ్రౌండులో జవాన్ల సమావేశం నిర్వహించారు. సెకెండ్ ఇన్ కమాండ్ కేకే సింగ్ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2014 నుంచి ఈ ఉద్యమం ప్రారంభించారన్నారు. ఈ ఉద్యమం ముందుకు సాగించడానికి ప్రజలు నడుం బిగించాలని పిలుపు నిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమం 15 రోజులు కొనసాగుతోందని కేకే సింగ్ వెల్లడించారు. -
అవగాహనతోనే ఎయిడ్స్ దూరం
పర్లాకిమిడి: ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ముఖ్యవైద్యాధికారి కార్యాల యం నుంచి అవగాహన ర్యాలీని జిల్లా ముఖ్యవైద్యాధికారి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మహమ్మద్ ముబారక్ అలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో సెంచూరియన్ వర్సిటీ నర్సింగ్ విద్యార్థులు, ట్రాన్స్ జెండర్స్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. ఎయిడ్స్ రోగులను సమాజంలో కొంతమంది దూరంగా ఉంచడా న్ని డాక్టర్ రాకేష్ కుమార్ బెహరా తప్పుబట్టారు. ఎయిడ్స్ మహమ్మారి నివారణకు ఆదిలోనే జాగ్రత్త లు తీసుకోవాలని సెంచూరియన్ వర్సిటీ నర్సింగ్ ప్రిన్సిపాల్ ఎస్.సునీత అన్నారు. వర్సిటీ నర్సింగ్ విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు. సెంచూరి యన్ వర్సిటీ, మహిళా డిగ్రీ కళాశాలల విద్యార్థులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. -
సందడిగా డ్యాన్స్ పోటీలు
పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరం ఆవరణలో నృత్య అకాడమీ మిరాకిల్ డ్యాన్సు స్టూడియో ఆధ్వర్యంలో 7వ సీజన్ మిరాకిల్ నైట్ కార్యక్రమం ఆది వారం రాత్రి జరిగింది. మిరాకిల్ డ్యాన్స్ సంస్థ డైరెక్టర్ సుభేంద్ర మోహాన్ సేనాపతి కార్యక్రమం నిర్వహించగా, యాంకర్గా రంగస్థల నటులు ఆదర్శ దాస్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘం అధ్యక్షురాలు నిర్మలా శె ఠి, గౌరవ అతిథులుగా డీసీవో అర్చనా మంగరాజ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సల్మన్ రైకా, డీసీపీ యూ అరుణ్కుమార్ త్రిపాఠి, సంగీత నాటక అకాడమి సభ్యులు రఘునాథ పాత్రో పాల్గొన్నారు. డ్యా న్స్ పోటీలలో జూనియర్, సీనియర్ కళాకారులు సోలో, గ్రూప్ డ్యాన్సులలో పాల్గొన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతగా సినీనటులు రాకేష్ దేవ్, సినీ నిర్మా త, సమర్పకులు పార్ధసారథీ వ్యవహారించారు. -
ఆశ్రమ పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు అదృశ్యం
కొరాపుట్: గిరిజన సంక్షేమ అశ్రమ పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు అదృశ్యమైన ఘటన రాష్ట్రంలో అలజడి రేపింది. సోమవారం ఉదయం కొరాపుట్ జిల్లా లంకాపుట్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అదృశ్యమైనట్టు ఉపాధ్యాయులు గుర్తించారు. వీరంతా ఒక టి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న చిన్నారులే. దీంతో జిల్లా నుంచి రాష్ట్రస్థాయి ఉన్నతాధికా రులు ఉలిక్కి పడ్డారు. వీరంతా ముందు రోజు రాత్రి ఆశ్రమాన్ని వదలి వెళ్లినట్లు సహచర విద్యార్థులు పేర్కొన్నారు. వెంటనే అధికారులు సమీప గ్రామాలు, అటవీ ప్రాంతాలు, కొండల్లో గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రం నుంచి ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున ఆశ్రమ పాఠశలకు చేరుకున్నా రు. పిల్లల తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. అయితే పిల్లలంతా అశ్రమ పాఠశాలకు తొమ్మిది కిలో మీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం కొండ మీద ఉన్నట్లు గిరిజనులు గుర్తించారు. వెంటనే అఽధికారులు పిల్లలను సురక్షితంగా అశ్రమ పాఠశాలకి తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిక నిబంధనల ప్రకారం రాత్రిపూట వార్డెన్గా ఉండాల్సిన ఉపాధ్యాయులు కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సొంత నివాసానికి వెళ్లి పోతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. అసలు వీరంతా ఎందుకు మూకుమ్మడిగా అడవి లోనికి వెళ్లిపోయారో తెలుసు కోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
73 వినతుల స్వీకరణ
రాయగడ: స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన సొమవా రం జిల్లా యంత్రాంగం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. వివిధ ప్రాంతాలకు చెందిన 73 వినతులను కలెక్టర్ విన్నారు. ఇందులో 40 వ్యక్తిగత సమస్యలు, 23 గ్రామ సమస్యలు గుర్తించారు. వాటిని సకాలంలో పరిష్కారమవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇద్దరికి వైద్య ఖర్చుల నిమిత్తం రెడ్ క్రాస్ నిధుల నుంచి రూ.20 వేల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. మరో 8 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1.20 వేలను ఆర్థిక సహా యాన్ని అందించారు. దీనికి సంబంధించిన చెక్ను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జె న్నా, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి అక్షయకుమార్ ఖెముండొ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ బి.సరోజినిదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి రామచంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ ఖాళీలు
భువనేశ్వర్: రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కేడర్లలో కేటాయించిన మంజూరు చేసిన (కేడరు) పలు పదవుల్లో ఖాళీలు కొనసాగుతున్నాయి. ఆ ఖాళీ పదవుల భర్తీ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశంలో బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే ప్రతాప్ కేశరి దేవ్ ప్రశ్నించారు. దానికి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి లిఖితపూర్వక సమాధానం ప్రవేశ పెట్టారు. రాష్ట్రంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారుల పోస్టులు అఖిల భారత సర్వీసులలో భాగం కావడంతో భారత ప్రభుత్వం వాటిని భర్తీ చేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒడిశా కేడర్లలో ప్రస్తుతం మంజూరు చేసిన సంఖ్య, ఖాళీలు ఈ కింది విధంగా ఉన్నాయి. -
అశ్లీల రీల్స్పై వీహెచ్పీ ఆగ్రహం
రాయగడ: స్థానిక చెక్కాగుడ వద్ద గల ప్రేమ్ పహాడ్ కొండపై కొలువైయున్న శివుని విగ్రహం వద్ద అశ్లీల వీడియోరీల్స్ను చత్రీకరించిన యువకులపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పరిషత్ సభ్యులు సొమవారం సదరు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఐఐసీ ప్రశన్నకుమార్ బెహరాకు వినతిపత్రం సమర్పించారు. ప్రేమ్ పహాడ్ వద్ద కొలువై యున్న మహాకాళేశ్వర్ విగ్రహం (శివుని) వద్ద జిల్లాలోని హనుమంతపూర్ ప్రాంతానికి చెందిన సల్మాన్ దావాక అనే యువకుడితో కలసి మరో ఇద్దరు యువకులు అశ్లీలంగా వీడియోని చిత్రీకరించి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. దీనిని తప్పుపట్టిన వీహెచ్పీ, భజరంగదళ్ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది హిందూ ధర్మఅనుచరులకు తీవ్ర బాధ కలిగిస్తుందని.. ఇటువంటి వీడియోలు, రీల్లుగా చిత్రీకరించి తమ పైశాచికత్వాన్ని చాటుకోవడమేనని వినతిపత్రంలో పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ రాయగడ శాఖ ఉపాధ్యక్షుడు ఆనందరావు, బజరంగ్ దళ్ కోఆర్డినేటర్ కె.జ్యొతి బెహర, శంకర్ బెహరా, అజయ్ అశ్రాణి, విజయ్ చూలేట్, మానస్ దాస్ వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. -
చొయితీ ఉత్సవాలకు శ్రీకారం
రాయగడ: ఈ నెల 26వ తేదీ నుంచి స్థానిక గొవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో చొయితీ ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు సమితి వారీగా ఉత్సవాలను నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం జిల్లాలోని కాసీపూర్ మణికేశ్వరి మందిరం నుంచిఉత్సవాలకు శ్రీకారం చుడతారని వివరించింది. అలాగే రామనగుడ సమితిలో ఏడో తేదీన, కళ్యాణసింగుపూర్లో తొమ్మిదిన, కొలనారలో 11న, గుడారిలో 12న, మునిగుడలో 13న, చంద్రపూర్లో 13న, పద్మపూర్, బిసంకటక్లలొ 13న, గుణుపూర్లో 23వ తేదీన సమితి వారీగా ఉత్సవాలు జరుగుతాయని జిల్లా యంత్రాంగం వెల్లడించింది. 71 వేల గంజాయి మొక్కలు ధ్వంసం రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీలోని దుడకాబహాల్ సమీప అటవీ ప్రాంతంలో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు, అబ్కారీ, ఏపీఆర్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో నాశనం చేశారు. 71 వేల గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్టు అధికారులు వెల్లడించారు. అటవీ ప్రాంతంలో గంజాయి అక్రమంగా సాగవుతుందని సమాచారం మేరకు పోలీసులు స్పెషల్ స్క్వాడ్ను ఏర్పాటు చేసి దాడులను నిర్వహించినట్లు సమాచారం. కాసీపూర్ అబ్కారీ శాఖ ఇన్స్పెక్టర్ విష్ణు పద బెహర, కళ్యాణసింగుపూర్ నుంచి సత్యనారాయణ దాస్, టికిరి ఐఐసీ విష్ణుబంధిని బాగ్ తదితరులు దాడుల్లో ఉన్నారు. -
ఒడిశా అప్పుల భారం అదుపులోనే ఉంది
● ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి భువనేశ్వర్: రాష్ట్రంలో అప్పుల భారం అదుపులోనే ఉంది. రాష్ట్ర రుణ భారం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) నిష్పత్తి 12.72 శాతం, వడ్డీ భారం 2.87 శాతానికి పరిమితం అయిందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సోమవారం రాష్ట్ర శాసన సభకు తెలియజేశారు. ఈ గణాంకాలు ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్ బీఎం) చట్టం, 2005 ప్రకారం నిర్దేశించిన పరిమితుల్లోనే ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఝార్సుగుడ ఎమ్మెల్యే టొంకొధొరొ త్రిపాఠి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్ర ప్రధాన బకాయిలు రూ. 26,978 కోట్లుగా కొనసాగుతోంది. ఇది అనేక ఇతర రాష్ట్రాల కంటే తక్కువ అని అన్నారు. రాష్ట్ర రుణ పరిస్థితి వివేకవంతమైన ఆర్థిక నిర్వహణకు అద్దం పడుతుంది. ఈ చర్య ఆర్థిక భారం లేకుండా అభివృద్ధి ప్రాజెక్టులు మరియు సంక్షేమ పథకాలను చేపట్టడానికి రాష్ట్రానికి అనుకూలత కల్పిస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో అక్టోబర్ చివరి నాటికి రాష్ట్ర సమగ్ర రుణ భారం రూ. 1,26,799 కోట్లు. వివిధ వనరుల నుంచి రాష్ట్రం తీసుకున్న రుణాలలో భారత ప్రభుత్వ రుణాలు రూ. 2,301.43 కోట్లు, ఓపెన్ మార్కెట్ రుణాలు రూ. 7,000 కోట్లు, నాబార్డ్ రుణాలు రూ. 824.36 కోట్లు, ఓఎంబీఏడీసీ రుణాలు రూ. 2,170 కోట్లు, క్యాంపా నిధులు రూ. 2,430 కోట్లు ప్రధాన రుణాలుగా వివరించారు. రాష్ట్రంలో జీఎస్డీపీ, రుణ వడ్డీ అనుపాతం 2.87 శాతం తేలికగా రుణాన్ని తీర్చడానికి అనుకూలతని నిర్ధారిస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ పథకాలు మరియు ఇతర ప్రజా కార్యక్రమాలకు ఎక్కువ నిధులను వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రం క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాన్ని కొనసాగిస్తోంది. రుణ స్థాయిలు మరియు వడ్డీ చెల్లింపులు రెండింటినీ అదుపులో నియంత్రిస్తుంది. ఇది రాష్ట్ర భవిష్యత్ వృద్ధికి శుభ సంకేతంగా ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. -
జయపురం సమితి స్థాయి పర్వ్
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఉత్సాహంగా..జయపురం: జయపురం సమితి స్థాయి ఆదివాసీ మహోత్సవం కొరాపుట్ పర్వ్ 2025 సోమవారం ఉత్సాహంగా జరిగింది. మధ్యాహ్నం పట్టణ ప్రజల ఆరాధ్య దేవి శ్రీజగత్ జననీ మందిరంలో ఘనంగా పూజలు జరిపి దీప ప్రజ్వలనం చేశారు. అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. యాత్రలో ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలు, చిత్ర విచిత్ర వేషధారణలతో కళాకారులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ పారాబెడ ప్రాంతంలోగల విక్రమ క్రీడామైదానం వరకు సాగింది. ఈ పొడియాలో పర్వ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందంగా ఏర్పాటు చేసిన వేదికపై జయపురం బీడీఓ శక్తి మహాపాత్రో అధ్యక్షతన జరిగిన ఉత్సవంలో ముఖ్యఅతిథిగా సమితి చైర్మన్ సస్మిత మెలక పాల్గొని సమితి స్థాయి పర్వ్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ మరుగున పడిన కొరాపుట్ ఆదివాసీ ప్రతిభను ప్రోత్సహించి ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో చేస్తున్నదే జాతీయ ఆదివాసీ మహోత్సవం ప్రధాన లక్ష్యమన్నారు. ఉత్సవాల సందర్భంగా సమితి స్థాయిలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వీరిని జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు బిడిఓ శక్తి మహాపాత్రో వెల్లడించారు. -
‘కాసీపూర్ పీహెచ్సీ అటెండెంట్పై చర్యలు తీసుకోండి’
రాయగడ: కొడుకు మృతి చెందాడన్న బాధలో తాము ఉంటే మృతదేహం పోస్టుమార్టం చేశాక రెండు వేలు లంచం అడిగిన అటెండెంట్పై చర్యలు తీసుకోవాలని బాధితుడి తండ్రి, అతడి కుటుంబ సభ్యులు సోమవారం కలెక్టర్ అశుతోష్ కులకర్ణిని కలసి ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ బి.సరోజిని దేవిని ఆదేశిస్తు దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి అందుకు సంబంధించిన నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. కాసీపూర్ సమితి గొరఖ్పూర్ పంచాయతీలోని కన్హుగుడ గ్రామంలో గత నెల 29 వ తేదీన గ్రామానికి చెందిన కొంబొమజ్జి కొడుకు తొరు మజ్జి (3) అనే బాలుడు ప్రమాదవశాత్తు సమీపంలో నదిలో పడి చనిపోయాడు. కాసీపూర్ పీహెచ్సీలో పోస్టుమార్టం చేశాక మృతదేహాన్ని ఇవ్వడానికి అటెండెంట్ లంచం అడిగాడు. దీనిపైనే బాలుడి తండ్రి ఫిర్యాదు చేశారు. -
నేటి నుంచి ఆన్లైన్లో టిక్కెట్ల అమ్మకం
భువనేశ్వర్: భారత్, దక్షిణాఫ్రికా జట్ల టీ20 మ్యాచ్ టికెట్లు ఆన్లైన్ అమ్మకం సోమవారం ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 5 నుంచి కౌంటర్లలో ఆఫ్లైన్ టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభిస్తారు. ఆన్లైన్లో 2,000 టిక్కెట్లు మాత్రమే విడుదల చేస్తారు. 23,000 టిక్కెట్లు ఆఫ్లైన్ అమ్మకానికి కేటాయించారు. 18,400 కాంప్లిమెంటరీ పాస్లు జారీ చేయనున్నట్లు ఓసీఏ కార్యదర్శి సంజయ్ బెహరా తెలిపారు. ఈ నెల 3, 4 తేదీల్లో ఓసీఏ అనుబంధ సంస్థలు, క్లబ్లకు టిక్కెట్లు జారీ చేస్తారు. 5వ తేదీన కౌంటర్లో సాధారణ ప్రేక్షకులకు టిక్కెట్లు అమ్మకం ప్రారంభిస్తారు. మునుపటి మ్యాచ్ కంటే ఈసారి 2500 టిక్కెట్లు తక్కువ విక్రయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ లెక్కన మొత్తం 23,000 టిక్కెట్లు విక్రయిస్తారు. 11,000 టిక్కెట్లు ఓసీఏ అనుబంధ సంస్థలకు, 10,000 టిక్కెట్లు కౌంటర్లో సాధారణ ప్రేక్షకులకు, 2 వేల టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆన్లైన్లో 2,000 టిక్కెట్లు అమ్ముతారు. కొత్త పెవిలియన్, స్పెషల్ ఎన్క్లోజర్, ఏసీ బాక్స్, గ్యాలరీ 2, 4 – 7 టికెట్లు ఆన్లైన్లో జారీ చేస్తారు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన టిక్కెట్లకు ప్రామాణీకరణ తప్పనిసరి. ఈ నెల 8, 9 తేదీల్లో వరుసగా రెండు రోజులపాటు ఆన్లైన్ టికెట్ల ప్రామాణీకరణకు వీలు కల్పించారు. డిసెంబర్ 8న ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటలు, డిసెంబర్ 9న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేంబ్రిడ్జ్ స్కూల్ ప్రాంగణంలో ఆన్లైన్ టికెట్ల ప్రామాణీకరణకు ఏర్పాట్లు చేశారు. ఆఫ్లైన్ అమ్మకాల వేళలు తొలి విడతలో ఓసీఏ అనుబంధ సంస్థలకు ఆఫ్లైన్ టికెట్లు మంజూరు చేస్తారు. ఈ టికెట్లు డిసెంబర్ 3, 4 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారత స్టేటు బ్యాంకు ఆధ్వర్యంలో ఓసీఏ కాన్ఫరెన్స్ హాల్లో జారీ చేస్తారు. కౌంటర్లలో సాధారణ ప్రేక్షకుల టికెట్లు సాధారణ ప్రేక్షకులకు బారాబటి స్టేడియం ప్రాంగణంలో టికెట్లు విక్రయిస్తారు. ఈ వర్గాలకు డిసెంబర్ 5 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరవధికంగా విక్రయిస్తారు. టికెటు కొనుగోలు కోసం చెల్లుబాటు అయ్యే ఐడీ ఉన్న వ్యక్తికి గరిష్టంగా 2 టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు. -
ఉత్సాహంగా పాటల పోటీలు
రాయగడ: డిసెంబర్ ఏడో తేదీన జరగనున్న స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వాగత్ లైన్లోని శ్రీకోదండ రామ మందిరం ప్రాంగణంలో ఆదివారం పాటల పోటీలను నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు గుడ్ల ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లొ యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్ విభాగంలో బి.గౌరి శంకరరావు ప్రథమ, పి.కళ్యాణి ద్వితీయ, జి.నాగేశ్వరరావు తృతీయ బహుమతులను సాధించారు. అలాగే జూనియర్ విభాగంలో శుభంకర్ ప్రధాన్ ప్రథమ, ఆకాశ రంజన్ పాడి ద్వితీయ, శ్రీయశ్రీ తృతీయ బహుమతిలను గెలుపొందగా.. హసిని పాత్రో, ముస్తాన్ దత్తలు ప్రోత్సాహక బహుతులు గెలుచుకున్నారు. పొటీలకు న్యాయనిర్ణేతలుగా పార్వతీపురం వాస్తవ్యులు, ప్రముఖ గాయకుడు రమణ పాత్రో, శాంతిమూర్తి, రాజ్కుమార్ వ్యవహరించారు. విజేతలకు స్పందన సంస్థ వార్షికోత్సంవలో బహుతులు ఇవ్వనున్నట్లు సాంస్కృతిక విభాగం కార్యదర్శి కె.కె.ఎం.పట్నాయక్ తెలిపారు. -
20 ఎకరాల్లో గంజాయి ధ్వంసం
జయపురం: అబ్కారీ విభాగ సిబ్బంది, పోలీసుల సహాయంతో లమతాపుట్ సమితి మాచ్ఖండ్ పోలీసు స్టేషన్ పరిధి సిక్రెల్, ముండాపుట్, ప్రాంతాల అడవిలో 20 ఎకరాల్లో పండిస్తున్న గంజాయి మొక్కలను కోసి వేసినట్లు అబ్కారి అధికారి అరుణకుమార్ పాడి తెలిపారు. సిక్రెల్, ముండాపుట్ అడవుల్లో జోరుగా గంజాయి సాగు జరుగుతుందన్న సమాచారం అందగా శనివారం మధ్యాహ్నం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తో కలసి వెళ్లి ఆయన సమక్షంలో గంజాయి పండిస్తున్న అడవిలో దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. మాచ్ఖండ్ పోలీసు అధికారి మధుసూధన భొయి నందపూర్ అబకారి విభాగ అధికారి అజయకుమార్ నాయిక్లతో ఏర్పాటు చేసిన ఇక టీమ్, అబ్కారీ ఏపీఆర్ ఫోర్స్, అటవీ విభాగ ఉద్యోగులు, పోలీసు సిబ్బందిలతో దాడులు జరిపి 20 ఎకరాల్లో పండిస్తున్న 2400 గంజాయి మొక్కలను కోసి వేసినట్లు ఆయన వెల్లడించారు. గంజాయి సాగు ధ్వంసం రాయగడ: గంజాయి సాగుపై రాయగడ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా గంజాయి వనాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా జిల్లాలోని బిసంకటక్ సమితి పరిధిలోని బెథియాపొడ పంచాయతీ రెలోకుప గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి వనాలను ధ్వంసం చేశారు. అబ్కారీశాఖ, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు ఐదు ఎకరాల విస్తీరణంలోని గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ప్రభుత్వ భూముల్లో ఈ అక్రమ గంజాయి సాగు జరుగుతుందన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. -
పిచ్చోడి చేతిలో హతం
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా చిత్రకొండ డైలీ మార్కెట్ వద్ద ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఓ హత్య జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వరి సోగరియ అనే వ్యక్తి మతిస్థిమితం తప్పి వీధుల్లో తిరుగుతున్నాడు. ఆదివారం ఆయన కత్తితో తిరుగుతూ సనియా టక్రీ అనే యువకుడు కత్తితో మెడ కోసి పారిపోయాడు. సనియా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు పరీక్షించి అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. గ్రామస్తులు రవిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సనియా మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. -
పూరీ సముద్రంలోకి మురుగు నీరు
● ఆగ్రహించిన స్థానికులు ● రూ. 37 కోట్లతో వాట్కో ఆధునిక ప్రణాళిక భువనేశ్వర్: పూరీ పట్టణ వ్యాప్తంగా ఉత్పన్నం అవుతున్న మురుగు నీరు బంకి ముఖ ద్వారం సమీపంలో సముద్రంలోకి నిరవధికంగా ప్రవహిస్తోంది. దీని పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు సముద్రంలో యథేచ్ఛగా చొరబడి పరిసరాలు దుర్గంధమయం అవుతున్నాయి. దుర్వాసనతో కూడిన పర్యావరణం, కలుషితమైన నీరు నిరంతర ప్రవాహం ఆరోగ్యం, పారిశుద్ధ్య సమస్యలను సృష్టిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో దుర్వాసన తీవ్రమైంది. ప్రభావిత ప్రాంతం చుట్టూ దోమల బెడద విపరీతంగా పెరిగింది. ఏ క్షణంలో ఏ మహమ్మారి రోగాలు ఈ ప్రాంతంలో తాండవిస్తాయోనని అంతు చిక్కని భయానక పరిస్థితులు పొంచి ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. గతంలో ఏర్పాటు చేసిన మురుగు నీటి శుద్ధి వ్యవస్థ మొరాయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుత ప్లాంట్ సముద్రపు నీరు కలుషితం కాకుండా నిరోధించడానికి అవసరమైన వడపోతను నిర్వహించడం లేదని పేర్కొన్నారు. వాట్కో రూ. 37 కోట్ల ప్రాజెక్టు వాటర్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిశా (వాట్కో) బంకీ ముహాణొ వద్ద కొత్త మురుగు నీటి శుద్ధి వ్యవస్థను నిర్మించే ప్రతిపాదనను ప్రకటించింది. రూ. 37 కోట్ల అంచనా వేసిన ఈ ప్రాజెక్టులో సబరే శుద్ధి సాంకేతికత ఉపయోగించబడుతుంది. పూరీ పట్టణంలో రోజుకు 15 మిలియన్ లీటర్ల (ఎమ్ఎల్డీ) మురుగు నీరు ఉత్పత్తి అవుతుంది. దీంతో సముద్రంలో నీరు కలుషితం కాకుండా చేయడానికి ఈ ప్రాజెక్టు రూపొందించారు. అధికారుల సమాచారం ప్రకారం ప్రధాన కార్యాలయం ఆమోదంతో టెండర్ ప్రక్రియ పూర్తయింది. నిర్మాణం 6 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వాట్కో జనరల్ మేనేజర్ బిక్రమ్ రౌత్ తెలిపారు. -
పారాదీప్ పోర్టు బెర్త్ వద్ద ఓడలో మంటలు
భువనేశ్వర్: బొగ్గు రవాణా చేస్తున్న ఓడలో మంటలు చెలరేగాయి. పారాదీప్ పోర్టు బెర్త్ వద్ద ఆదివారం ఈ సంఘటన జరిగింది. చైన్నెరాధ బెర్త్ వద్ద థర్మల్ బొగ్గును కన్వేయర్ బెల్ట్పై బొగ్గును లోడ్ చేస్తుండగా ఎకో కొలెనల్ మోనోరివా అనే ఓడలో అగ్ని ప్రమాదం కారణంగా ఓడను సీక్యూ – 2 బెర్త్కు తరలించి ఓడ నుంచి బొగ్గును దించారు. నిర్వహణ లోపంతో మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ● శ్రీ జగన్నాథునికి తొలి ఆహ్వానం భువనేశ్వర్: కటక్ బారాబటి స్టేడియం వేదికగా ఈ నెల 9న భారత దేశం, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగనుంది. ఈ మేరకు సన్నాహాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మ్యాచ్ నిర్వాహక సంస్థ ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ) కార్యదర్శి సంజయ్ బెహెరా ఆదివారం పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మ్యాచ్ నిర్వహణ విజయవంతం కావాలని కోరుతూ పూరీ శ్రీ జగన్నాథుని సోదర సోదరీ సమేతంగా ప్రత్యక్షం కావాలని ఆహ్వానించారు. మ్యాచ్ తొలి టికెట్ను శ్రీ జగన్నాథుడి పాదాలకు అంకితం చేశారు. మ్యాచ్ సజావుగా సాగి టీం ఇండియా విజయం సాధించాలని స్వామిని వేడుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. బారాబటి స్టేడియంలో మ్యాచ్ నిర్వహణ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఈ పనులు కొద్ది రోజుల్లో పూర్తవుతాయన్నారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తొలి టికెట్ కొనుగోలు చేయడంతో అమ్మకాలు ప్రారంభం అవుతాయి. వరపుత్రుల విగ్రహాలు ఆవిష్కరణ రాయగడ: Ð]l$à-ç³#-Æý‡$-çÙ$yýl$ rMýSPÆŠ‡ º´ëµ 126 fĶæ$…-†° ç³#Æý‡-çÜPÇ…-^èl$MýS$° hÌêÏÌZ° Æ>Ð]l$-¯]lVýS$yýl çÜÑ$† ´ëË$-´ëƇ$$ {糿¶æ$™èlÓ »êÍMýSÌS E¯]l²™èl ´ëuý‡-Ô>ÌS {´ë…VýS-׿…ÌZ Ð]l$à-ç³#-Æý‡$-çÙ$ÌS Ñ{VýS-àÌS BÑçÙP-Æý‡×æ M>Æý‡Å-{MýSÐ]l$… Ôèæ°-ÐéÆý‡… fÇW…¨. D M>Æý‡Å-{MýSÐ]l*°MìS Ð]l¬QÅ-A-†-¤V> hÌêÏ çÜ…„óSÐ]l$ Ô>Q A«¨M>Ç BïÜ-Ð]l*-Æ>ÐŒæ àfÆý‡-Ķæ*ÅÆý‡$. çÜïßæ§Šæ ÌS„ýSÃ×Šæ ¯éĶæ$MŠS, çÜ$¿ê‹Ù ^èl…{§ýl-»Z‹Ü, E™èlP-âýæ-Ð]l$×ìæ Vö糺…«§ýl$ §é‹Ü, E™èlP-âýæVúÆý‡ÐŒæ Ð]l$«§ýl$çÜ*-§ýl¯ŒS §é‹Ü Ñ{VýS-à-ÌS¯]l$ BÑ-çÙP-Ç…-^éÆý‡$. ™éÅVýS-ç³#Æý‡$-çÙ$ÌS õÜÐ]l-ÌS¯]l$ D çÜ…§ýlÆý‡Â…V> Mö°-Ķæ*-yéÆý‡$. VýS$׿$-ç³NÆŠ‡ çÜÐ]l${VýS WÇ-f-¯é-À-Ð]l–Šి§ýl® çÜ…çܦ BǦMýS ÝëĶæ$…™ø Ñ{VýS-à-ÌS¯]l$ Æý‡*´÷…¨…^éÆý‡$. E´ë-«§éÅ-Ķæ¬Ë$, ѧéÅ-Æý‡$¦Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి రాయగడ: మాదక ద్రవ్యాలైన గంజాయి వంటి సాగులకు స్వస్తిచెప్పి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా చైతన్య పరచాలని అధికారులకు జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశించారు. ఆదివారం వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనిల్, జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో అక్రమంగా గంజాయి సాగు విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతోందని, దీనిని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. జిల్లా యంత్రాంగం, పోలీసులు, అబ్కారీ శాఖ నిర్విరామంగా కృషి చేయాల్సి ఉంటుందన్నారు. గంజాయి అక్రమ రవాణా, సాగుపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. -
మాదక ద్రవ్య విముక్తిపై ప్రచారం
రాయగడ: బజరంగ్దళ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్వ విముక్తిపై ప్రచార కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, యువతీ యువకులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత తమ బంగారు భవిష్యత్ను బుగ్గిపాలు చేసుకుంటుందని అందువల్ల యువతకు మేల్కొపేందుకు ఈ తరహా కార్యక్రమాలు దోహదపడతాయని డాక్టర్ సునీల్ కుమార్ మహాపాత్రో అన్నారు. స్థానిక కపిలాస్ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ తేజస్వీ మైదానం వరకు కొనసాగింది. విద్యార్థులు, యువతీ,యువకులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. బజరంగ్ దళ్ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు జ్ఞాపికలను నిర్వాహకులు అందజేశారు. -
ఆకర్షిస్తున్న మంకడా డియాన్ జలపాతాల కేంద్రం
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్లో శియ్యాళి లోట్టి పంచాయతీ మంకడా డియాన్ జలపాతాలు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. మంకడా డియాన్ జలపాతం చేరుకోవడానికి పర్లాకిమిడి నుంచి రాయఘడ మీదుగా 55 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడి నుంచి శియ్యాళి లోట్టి గ్రామానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. ఎత్తైన కొండల నడుమ ఆహ్లాద వాతావరణంలో ఉన్న మంకడా డియాన్ జలపాతాలు ఇప్పుడిప్పుడే విహార యాత్రగా ఇటీవల ప్రసిద్ధిగాంచాయి. అయితే పర్యాటకులు ఇక్కడ మద్యం సేవించడం వల్ల అసౌకర్యం కలుగుతోంది. పోలీసు రక్షణ కూడా లేదు. రెస్టు షెడ్ లేనికారణంగా పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. -
అమలా సంఘం అధ్యక్ష, కార్యదర్శి పోస్టులు ఏకగ్రీసీ
జయపురం: అఖిల ఒడిశా అమలా సంఘం కొరాపుట్ జిల్లా శాఖకు జరగనున్న ఎన్నికలకు ఆదివారంతో నామినేషన్ల స్వీకరణ పర్వం ముగిసింది. అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు ఒక్కక్క నామినేష్ దాఖలు కావటంతో వారు ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆదివారం స్థానిక యాదవ భవనంలో సంఘ ఎన్నికల అధికారి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి పదవులకు నామినేషన్లు స్వీకరించగా.. అధ్యక్ష పదవికి సంఘ సీనియర్ కార్యకర్త, అటవీ విభాగ ఉద్యోగి జగన్నాథ్ మఝి, కార్యదర్శి పదవికి శిక్షా విభాగ ఉద్యోగి గజేంద్రచౌదరి, కోశాధికారి పదవికి శిక్షా విభాగ ఉద్యోగి నాగేశ్వరరావులు మాత్రమే నామినేషన్లు వేశారు. వీటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు పోటీగా మరెవరూ నామినేషన్లు వేయనందున ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ప్రకటించారు. మరో రెండు పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉందని.. త్వరలోనే వాటికోసం ఎన్నికల తేదీ ప్రకటిస్తామని ఎన్నికల కమిటీ వెల్లడించింది. -
మాల్యవంత్ ఉత్సవాలకు శ్రీకారం
మల్కన్గిరి: మల్కన్గిరిలో మాల్యవంత్ ఉత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలశ యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారీ తాంగులు, సమితి అధ్యక్షురాలు గౌరి పడియామి, చిత్రకొండ సమితి అధ్యక్షురాలు రాజేశ్వరి ఖిల్, కోరుకొండ సమితి అధ్యక్షుడు జితు బురుడి, బలిమెల ఎన్ఏసి చైర్మన్ ప్రదీప్ నాయక్, జిల్లా అదనపు కలెక్టర్ బెదబర్ ప్రధాన్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి నరేష్ చంద్ర సబర్, సబ్ కలెక్టర్ అశ్ని ఎ ఎల్, తదితరులు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. కలెక్టర్ మాల్యవంత్ పోస్టర్ ఆవిష్కరించారు. డిసెంబరు 14 నుంచి 18 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని కలెక్టర్ ఉపాధ్యాయ్ తెలిపారు. స్థానిక భైరవ మందిరం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి జరిగిన కలశ యాత్ర జగన్నాథ మందిరం వరకు కొనసాగింది. ఆకట్టుకున్న ఆదివాసీ నృత్యాలు ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన దుస్తులతో ఆదివాసీలు వారి సంప్రదాయ ఆయుధాలతో కలశ యాత్రలో పాల్గొన్నారు. వారి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
రక్తదానంపై అపోహలు వీడాలి
పర్లాకిమిడి: గజపతి బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో పర్లాకిమిడి పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీని ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, ఇన్చార్జి కలెక్టర్, ఏడీఎం మునీంద్ర హానగ విచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. డిసెంబర్ 14వ తేదీన జరుగబోయే రక్తదాన శిబిరం దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రతి రక్తపు బింధువు అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమానికి నేను కూడా సహకరిస్తానని ఎమ్మెల్యే రూపేష్ అన్నారు. ఈ ర్యాలీ రాజవారి ప్యాలస్ నుంచి మార్కెట్ కూడలి మీదుగా.. జిల్లా ప్రధాన ఆస్పత్రి మీదుగా కొనసాగింది. ఈ ర్యాలీలో గజపతి బ్లడ్ డోనర్స్ సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.రుషి, ఒన్ స్టాప్ సెంటర్ పరిపాలన అధికారిణి సునీతా రోథో, సస్మితా బెహరా, ఐ.ఎస్.ఆర్.డి మోహినీ ప్రదాన్, కై లాష్చంద్ర బిశ్వాళ్, సభ్యులు క్రాంతి కుమార్ బెహరా, శరత్కుమార్, నిహర్ కుమార్ పండా పాల్గొన్నారు. -
పోక్సో చట్టంపై అవగాహన
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్లో పోక్సో చట్టంపై అవగాహన శిబిరం ఆదివారం నిర్వహించారు. కొట్పాడ్ తాలూకా న్యాయ సేవా సమితి వారు నిర్వహించిన ఈ శిబిరంలో న్యాయ సేవా సమితి అధ్యక్షుడు, మెజిస్ట్రేట్ త్రిజీవ కుమార్ నందా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొట్పాడ్ సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన శిబిరంలో త్రిజీవ కుమార్ నందా మాట్లాడుతూ.. విద్యార్థులు, ఉద్యోగులు, యువతులు, మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని, బాధితుల కుటుంబాలు, బాధితులు తీరని నష్టానికి గురవుతున్నారన్నారు. అటువంటి వారికి న్యాయం చేకూర్చేందుకే పోక్సో చట్టం చేసినట్లు వెల్లడించారు. నేటి సమాజంలో మహిళలకు గౌరవించటం అందరి బాధ్యత అన్నారు. పాఠశాల పరిచాలన కమిటీ అధ్యక్షులు, న్యాయవాది పంకజ కుమార్ పాత్రో, ప్రభుత్వ న్యాయవాది కిశోర్ చంద్ర మిశ్ర, మహిళా న్యాయవాది బిద్యుత్ లత భక్షీ చట్టాలను వివరించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ మెళియాపుట్టి: ఎవరూ లేని సమయం చూసి తాళాలు వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన సంఘటన ఆదివారం పెద్దమడి గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు జినగ చంద్రావతి గ్రామంలోని తన ఇంటి ముందు చిన్న పాన్షాప్ పెట్టుకుని జీవిస్తోంది. ఈమె భర్త చాలాక్రితం మృతి చెందారు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు అవ్వడంతో శ్రీకాకుళంలో నివాసముంటున్నారు. చంద్రావతి పెట్టుకున్న పాన్షాప్లో వ్యాపారం సరిగాలేక పదిరోజుల క్రితం శ్రీకాకుళం వెళ్లింది. ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే గేట్కు వేసిన తాళాలు వేసినట్లే ఉండి.. ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోని బీరువా తెరిచి రూ.5000ల నగదు, రెండు జతల చెవి పోగులు, పుస్తెలు దొంగలు దోచుకెళ్లారు. వెంటనే ఆమె మెళియాపుట్టి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఇంటిని పరిశీలించారు. -
ముగిసిన కొరాపుట్ పర్వ్ 2025
జయపురం: జయపురం మున్సిపాలిటీ స్థాయి ఆదివాసీ మహోత్సవం కొరాపుట్ పర్వ్ 2025 ముగింపు వేడుకలు ఆదివాసీ సంస్కృతికి, కళలకు అద్దం పట్టాయి. ముగింపు వేడుకల వేదిక అలంకరణ గ్రామీణ వాతావరణాన్ని తలపింపచేసింది. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఆదివాసీ నృత్య, నాట్యాలు వారి కళాభిరుచిని వెల్లడించాయి. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి అధ్యక్షతన స్థానిక లక్ష్మణ నాయక్ స్మృతి భవనంలో జరిగిన పర్వ్ ముగింపు ఉత్సవంలో జయపురం సబ్కలెక్టర్, మున్సిలప్ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్యా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు కొరాపుట్ పర్వ్ మార్గమన్నారు. కొరాపుట్ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ప్రపంచానికి పరిచయం చేయటం ద్వారా కళాకారులకు గుర్తింపు తీసుకురావటం లక్ష్యంగా కొరాపుట్ పర్వ్ ఉత్సవాలు నిర్వహించినట్లు వెల్లడించారు. వివిధ పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేసి సన్మానించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బి.సునీత, అదనపు కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్, జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్థ జగదీస్ కాశ్యప్, జయపురం సమితి బీడీఓ శక్తి మహపాత్రో, తహసీల్దార్ సబ్యసాచి జెన, మున్సిపల్ ఇంజినీర్ అజయ్ జాని తదితరులు పాల్గొన్నారు. -
లావేరులో పురిల్లు దగ్ధం
రణస్థలం: లావేరు గ్రామానికి చెందిన నడుపూరి ఏసురత్నం పురిల్లు అదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. వెంటనే గుర్తించిన బాధితులు రణస్థలం అగ్నిమాపక వాహనానికి సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిళ్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గురువు శ్రీకాకుళం: నగరంలోని దాసరి క్రాంతి భవన్లో ఎస్వీ రమణమూర్తి అధ్యక్షతన ఎస్టీయూ వార్షిక కౌన్సిల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. జిల్లా అధ్యక్షుడిగా పేడాడ ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శిగా గురువు శ్రీనివాసరావు, ఆర్థిక కార్యదర్శిగా కంచరాన తేజేశ్వరరావులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి డి.శ్యామ్ వ్యవహరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచినా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని వాపోయారు. అనంతరం సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని, 12వ పీఆర్సీ వెంటనే ప్రకటించాలని తీర్మానించారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీకాకుళం క్రైమ్: కోటబొమ్మాళిలోని ఎత్తురాళ్లపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన నలుగురు మృత్యువాత పడినప్పటికీ ఇటు పోలీసులు తీరుగానీ, అటు వాహనదారుల తీరుగానీ మారడం లేదు. ఎప్పటిలాగే రోడ్లపైనే గంటల తరబడి వాహనాలు నిలిపివేస్తున్నారు. ఎత్తురాళ్లపాడు ఘటన జరిగాక కూడా జిల్లాలో ప్రమాదాలు పెరిగాయి. ఆమదాలవలస ఫ్లై ఓవర్ వంతెన వద్ద కొబ్బరికాయల లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం ప్రమాదంలో కొడుకు ముందే కన్నతల్లి మృత్యువాత పడింది. పలాస మండలం గరుడఖండి పాత జాతీయ రహదారిపై ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కవిటి మండలం ఆర్.కరాపాడు టోల్గేట్ వద్ద దాబాలో పనిచేస్తున్న వ్యక్తిని భారీ వాహనం ఢీకొట్టి మృత్యువాత పడ్డాడు. కేవలం నవంబర్ నెలలోనే 16 మందికి పైగా చనిపోయారు. ఈ పరిస్థితుల్లో రోడ్లపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ మేరకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థులకు హిందీపై అభిరుచి పెరగాలి శ్రీకాకుళం: విద్యార్థులకు హిందీ సబ్జెక్టుపై అభిరుచి పెంచేందుకు హిందీ ప్రతిభా పరీక్షలను నిర్వహిస్తున్నామని హిందీ మంచ్ గౌరవాధ్యక్షుడు దొంతం పార్వతీశం అన్నారు. శ్రీకాకుళంలో 80 ఫీట్ రోడ్లోని బీకేఎస్ జూనియర్ కళాశాలలో హిందీ మంచ్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ హిందీ సిలబస్పై హిందీ సేవా సదన్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందీ ప్రతిభా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభా పరీక్షలను నిర్వహించి, విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు, పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయి టాపర్స్కు మెడల్స్, నగదు బహుమతులను ప్రదానం చేయనున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో విశేష ప్రతిభ కనబరిచిన టాపర్స్కు హిందీ ప్రతిభా రత్న అవార్డుతో సన్మానం చేయనున్నట్లు తెలిపారు. టాలెంట్ టెస్ట్కు ఉత్తరాంధ్ర జిల్లాల సంయోజక్గా కోనే శ్రీధర్ను నియమించామన్నారు. సమావేశంలో కె.సత్యం, ఆర్.రామారావు, ఎస్.రాధ తదితరులు పాల్గొన్నారు. -
కళాకారుల్లో నూతనోత్సాహం
● ముగిసిన అమ్రిత్ కాల్ కల్చరల్ కాన్క్లేవ్ రాయగడ: జిల్లా యంత్రాంగం సహకారంతొ కోల్కత్తాకు చెందిన సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో స్థానిక బీజు పట్నాయక్ ఆడిటోరియంలో గత రెండు రోజులుగా జరుగుతున్న సాంస్కృతిక ఉత్సవాలు శనివారం సాయంత్రంతో ముగిశాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ప్రముఖ యాంకర్, కళాకారిణి బిదీషా సతపతి హాజరయ్యారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కళాకారులను ప్రోత్సాహించేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు వారిలో కొత్త పుంతలకు దారి తీస్తోందని ఆభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు నృత్య ప్రదర్శనలు చేశారు. జిల్లాలోని డొంగిరియా, లంజియాసవర, ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన కళాకారులకు నిర్వాహకులు సన్మానించారు. -
యువ కళాకారుడి హత్య దారుణం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వివిధ కళారూపాలతో ప్రజలను చైతన్య పరుస్తున్న యువ కళాకారుడు పెంచలయ్యను హత్య చేయడం దారుణమని సాంస్కృతిక ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో అంబేడ్కర్ కూడలి వద్ద ఆదివారం ఆయన మృతికి నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి ముఠా ఒక పథకం ప్రకారం ప్రజా నాట్యమండలి కళాకారుడు, డీవైఎఫ్ఐ మాజీ నాయకుడిని హత్య చేశాయన్నారు. హత్య కారకులను గుర్తించి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో ఇటీవల కాలంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి సంస్కృతికి వ్యతిరేకంగా ఆయన ప్రజలను చైతన్య పరచడానికి అనేక కళారూపాలను రూపొందించి ప్రదర్శించాడు. పోలీస్ శాఖ సహకారంతో కూడా కొన్ని కార్యక్రమాలు చేశాడు. గంజాయి మానడంటూ స్థానికంగా ప్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారని, ఇది స్థానిక గంజాయి ముఠాకు ఏమాత్రం నచ్చలేదన్నారు. దీంతో కొంతకాలంగా ఆయన కదలికలపై నిఘా వేసి హత్య చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్య ముఠాలను పసిగట్టి నివారించడంలో వైఫల్యం చెందిందని, పోలీసు నిఘా వ్యవస్థకు ఉద్యమాలను అణచివేయడంపై ఉన్న శ్రద్ధ మాదక ద్రవ్యాల ముఠాలను నిర్మూలించడంలో లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు బి.కృష్ణమూర్తి, కె.నాగమణి, పి.ప్రసాదరావు, పి.ఖగేష్, పి.సుధాకర్, కేధారేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ రాష్ట్ర అథ్లెటిక్స్ బృందానికి కోచ్, మేనేజర్లుగా సిక్కోలు వాసులు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా స్కూల్గేమ్స్ అండర్–14 బాలబాలికల అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు కోచ్, మేనేజర్లుగా శ్రీకాకుళం వాసులకు అరుదైన అవకాశం ల భించింది. మధ్య ప్రదేశ్లోని ఇండోర్ వేదికగా డిసెంబర్ ఒకటి నుంచి 4 వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలబాలికల బృందానికి కోచ్, మేనేజర్లగా జిల్లాకు చెందిన నలుగురు వ్యా యామ ఉపాధ్యాయులు(ఎస్ఏపీఈ) నియా మకమయ్యారు. నియామకమైన వారిలో బాడాన నారాయణరావు (పీడీ–జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాకిపల్లి, టెక్కలి మండలం), నడిమింటి నాగరాజు (పీడీ–జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యామలపేట, సంతబొ మ్మాళి మండలం), పీరుకట్ల సునీత (పీడీ– జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బ్రాహ్మణతర్ల, పల్సా మండలం), సయ్యద్ సౌజన్ (జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల ఈదుపురం, ఇచ్ఛాపురం మండలం) ఉన్నారు. వీరు నలుగురు ఈ పోటీ ల కోసం శనివారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్గేమ్స్ అథ్లెటి క్స్ అండర్–14 బాలబాలికల బృందంతో కలిసి ఇండోర్ చేరుకోనున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబరు 13న జాతీయ లోక్ అదాలత్ జరగనున్న విషయం విధితమే. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కుటుంబ, ఆస్తి వివాదాలు, చిన్న క్రిమినల్, ట్రాఫిక్, కాంపౌండ్ కేసుల వంటి రాజీ సాధ్యమైనవి ముందుగా గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా సున్నితమైన, అతి సున్నితమైన గ్రామాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, సమాచారాన్ని సిద్ధం చేయాలని, జనాభా వివరాలు, కమ్యూనిటీ ప్రదేశాలు, ముఖ్య ప్రాంతాలు, గొడవలు జరిగే ప్రాంతాలపై కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, డి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు కళ్లద్దాల పంపిణీ శ్రీకాకుళం క్రైమ్ : సిబ్బంది కంటి ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి యాంటీ–గ్లేర్ కళ్లద్దాలను పంపిణీ చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కంప్యూటర్ కానిస్టేబుళ్లు, ఐటీకోర్, డీసీఆర్బీ, కార్యాలయ సిబ్బందికి వందకు పైగా కళ్లద్దాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, ఏఓ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి: జెడ్పీటీసీ సభ్యుల సూచనలకు విలువ ఇవ్వాలని, ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకోవద్దని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. శనివారం సాయంత్రం నిర్వహించిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాలకు పలువురు ముఖ్య కమిటీల సభ్యులు హాజరు కాగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ విజయ మాట్లాడుతూ క్షేత్ర సా యిలో స్థానిక సంస్థల పాలకుల సూచనలను అధికారులు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని, స్పందించని అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే కూన రవి మాట్లాడుతూ గతంలో పనిచేసిన చాలావరకు పనులకు బిల్లులను ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టారని, ముఖ్యంగా ఉపాధిహామీ పనులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. 2012లో రూ.9 లక్షల బిల్లులు ఇప్పటివరకు రాకపోతే ఆ కాంట్రాక్టర్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 6,3,5 స్థాయీ సంఘాలు వాయిదా పడినట్లుగా అఽధికారులు ప్రకటించారు. మిగిలిన స్థాయీ సంఘాల సమావేశాలకు జెడ్పీ చైర్పర్సన్ విజయ అధ్యక్షత వహించి పూర్తి చేశారు. కార్యక్రమంలో పలువురు శాఖాఽధికారులు పాల్గొన్నారు. -
థర్మల్ ప్రతులు దగ్ధం
బూర్జ: థర్మల్ విద్యుత్ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు తక్షణమే రద్దు చేయాలని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, మండల గిరిజన ఆదివాసీలు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మండలంలో గల అన్నంపేట పంచాయతీ అడ్డూరిపేట గ్రామంలో శనివారం థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కోశాధికారి అత్తులూరి రవికాంత్, అధ్యక్షుడు సురేష్ దొర, కార్యదర్శి సవరసింహాచలం ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ, ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సవర మిన్నారావు, లక్ష్మణరావు, రామలింగం, కుర్మయ్య, ధర్మారావు, నాగేశ్వరరావు, సింగయ్య పాల్గొన్నారు. -
విపత్తుల నివారణపై అవగాహన
రాయగడ: విపత్తు సమయంలో ఎలా స్పందించి, ప్రాణాలను కాపాడాలన్న అంశంపై సదరు సమితి మల్లిగాం గ్రామంలో గల పాఠశాలలో శనివారం విద్యార్థులకు శిక్షణ శిబిరం జరిగింది. ఈ శిబిరంలో వివిధ పాఠశాలలకు చెందిన 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ శిబిరంలో భాగంగా అత్యవసర సమయాల్లో అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఎలా రక్షించి కాపాడాలన్న అంశంపై శిక్షణ కల్పించారు. ఉరుములు, మెరుపులు సమయంలో పిడుగులు పడుతుంటాయి. పిడుగుపాటు వల్ల ప్రాణనష్టం సంభవించకుండా ఎలా రక్షించుకోవాలన్న విషయాలపై అవగాహన కల్పించారు. ప్రధమ చికిత్స ఎలా అందించాలన్న వాటిపై శిక్షణ కల్పించారు. ఒ.ఎస్.డి.ఎ.ఎం.ఎ సంస్థకు చెందిన మితాలి సాహు, వైశాఖి స్వయ్ అనే ఇద్దరు రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇచ్చారు. చోరీ కేసులో ఒడిశా వాసి అరెస్ట్ ● రూ.8.60 లక్షల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్లో గల జె.బి.స్వర్ణ దుకాణంలో సుమారు మూడు నెలల క్రితం జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఒడిశా రాష్ట్రానికి చెందిన నిందితుడిని బద్వేలు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 72 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదున్నర కిలోల వెండి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. శనివారం స్థానిక అర్బన్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని మార్కెట్వీధికి చెందిన జబీవుల్లా స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్లో గత కొన్నేళ్లుగా వెండి, బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు నెల 9వ తేదీన రోజూ మాదిరే వ్యాపార కార్యకలాపాలు పూర్తి చేసుకుని దుకాణంలోని వస్తువులన్నీ సర్ది బ్యాగులో ఉంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పటికే కాపు కాసిన కొందరు యువకులు దుకాణంలోకి వెళ్లి.. బంగారు, వెండి ఆభరణాలను భద్రపరిచిన బ్యాగులను తీసుకుని బైక్లో పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అర్బన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు ఒరిస్సా రాష్ట్రం గంజామ్ జిల్లా ఆస్కా తాలూకా కలసందాపూర్ గ్రామానికి చెందిన దాస్ శ్రీరామ్గా గుర్తించారు. ఈ క్రమంలో శనివారం అర్బన్ సీఐ లింగప్ప సిబ్బందితో కలిసి బద్వేలు– నెల్లూరు ప్రధాన రహదారిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. దాస్ శ్రీరామ్ ఆటోలో వస్తుండగా ఆపి తనిఖీ చేయగా అతని వద్ద బంగారు, వెండి ఆభరణాలు లభించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా నిందితుడు దాస్శ్రీరామ్ అతని స్నేహితుడైన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రావులబినోద్ అలియాస్ బిన్ను గతంలో పలు చోరీ కేసులలో ఒరిస్సా రాష్ట్రంలో జైలుకు వెళ్లారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన తొండపోతురాజు, అతని అన్న మౌలాలితో కలిసి బద్వేలులో చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలిందని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ, క్రైమ్ పార్టీ ఏఎస్ఐ రాంభూపాల్రెడ్డి, అర్బన్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు శివ, వెంకటేష్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
సాహిత్యంతో జీవితావిష్కరణ
భువనేశ్వర్: సాహిత్యం విలువలతో కూడిన జీవితాలను ఆవిష్కరిస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. స్థానిక శిక్షా ’ఓ’ అనుసంధాన్ (ఎస్ఓఏ) విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన మూడో విడత ఎస్ఓఏ సాహిత్య ఉత్సవం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. సంస్కృతి, సృజనాత్మకత, కృత్రిమ మేధస్సు ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వర్ధమాన పరిస్థితులకు అనుకూలంగా సందర్భోచిత కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని గవర్నర్ అభినందించారు. విద్యా వ్యవస్థల ఆవిర్భావం, అభివృద్ధికి ముందు సమాజాలు కథలు, కవితలు, ఇతిహాసాల ద్వారా సత్యం, న్యాయం, ధైర్యం, కరుణ వంటి విలువలను నేర్చుకున్నామని గవర్నర్ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ రచయితలు, కవులు, పండితులు మరియు కళాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, గేయ రచయిత, సాహిత్య రచయిత పద్మభూషణ్ జావేద్ అక్తర్కు మొదటి ఎస్ఓఏ సాహిత్య సమ్మాన్ 2025తో సత్కరించారు. -
●పదే పదే అదే తప్పు
కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లుపాడు సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాంతంలో ప్రమాదకరంగా నిలిపివేసిన వాహనాలు ఆ దారిపై రక్తపు మరకలు ఇంకా తొలగలేదు. ఆ కుటుంబాల్లో ఆర్తనాదాలు ఇంకా ఆగలేదు. ఆ ఘోర ప్రమాదం చూసిన వారికి కలిగిన భయం ఇంకా తగ్గలేదు. అయినా వాహన చోదకుల నిర్లక్ష్య వైఖరి మాత్రం మారలేదు. ఎక్కడైతే నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయో, ఎక్కడైతే వారి రక్తంతో రోడ్డు తడిచిందో, ఎక్కడైతే వాహనం మృత్యు శకటంగా మారిందో.. సరిగ్గా అదే చోట మళ్లీ లారీలు ప్రమాదకరంగా పార్కింగ్ చేయడం శనివారం కనిపించింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇలాంటి విరుద్ధ దృశ్యాలు కనిపిస్తూ వారి చిత్తశుద్ధిని వెక్కిరిస్తున్నాయి. – టెక్కలి -
గంజాయి హాట్స్పాట్లపై ఉక్కుపాదం
బొమ్మల తయారీపై శిక్షణ జయపురం: జయపురం ఆర్ట్స్ క్రాఫ్ట్ కళాశాలలో ఇకో క్రాఫ్ట్ వర్క్షాపు నిర్వహించారు. ఈ వర్క్ షాపులో ముఖ్యఅతిథిగా జిల్లా ప్రణాళిక విభాగ డిప్యూటీ అధికారి, జిల్లా సంస్కృతిక అధికారి సూర్యకాంత బెహర పాల్గొని వర్క్షాపును ప్రారంభించారు.గౌరవ అతిథిగా ఖల్లికోట ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ లోకనాథ్ షొడంగి, కొరాపుట్ జిల్లా సంస్కృతిక విశ్రాంత అధికారి కృష్ణ చంద్ర నిశంఖ హాజరయ్యారు. కార్యక్రమ కోఆర్డినేటర్ జయంత కుమార్ దాస్, జయపురం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కళాశాల ప్రిన్సిపాల్ జుధిష్టర్ మల్లిక్, ఇకో వర్క్షాప్ను నిర్వహించారు. ఇకో క్రాఫ్ట్ వర్క్ షాపులో లక్కతో బొమ్మలు, టెరాకోట్ కుమ్మర వస్తువులు ప్రదర్శించారు. వాటిపై అధికారులు వివరించారు. ఈ వర్క్షాపులో ముఖ్యఅతిథి సూర్యకాంత బెహర మాట్లాడుతూ 1946 లో రాష్ట్రంలో నెలకొల్పబడిన ప్రథమ విక్రమ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాల ఉన్నతికి కృషి చేయటం జరుగుతుందన్నారు. ఈ వర్క్షాపులో లక్కతో ఎలా వస్తువులు చేయాలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ప్రసిద్ద టెరాకోట్ బొమ్మలు, వస్తువులు తయారు చేయటంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు అధికారులు గుర్తించిన 65 హాట్స్పాట్ల వద్ద సీసీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కెమెరాల ఏర్పాటు బాధ్యతను స్థానిక సంస్థలు తీసుకోవాలని చెప్పారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలసి కలెక్టర్ మాట్లాడుతూ జి ల్లాలోని 16 మండలాల్లో గంజాయి కార్యకలాపాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న మొత్తం 65 హాట్స్పా ట్లను అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు కేవలం 32 ప్రాంతాల నుంచి మా త్రమే కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని, కేవలం 3 మాత్రమే ఏర్పాటు చేశారని ఎస్పీ నివేదించినట్లు తెలిపారు. గంజాయి విక్రయం, నిషేధంపై ప్రజల సహకారం కీలకమని ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. చీకటిగా ఉన్న ప్రాంతాల్లో వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయా లని డీపీఓ, మున్సిపల్ కమిషనర్లను కోరారు. రహదారుల భద్రతపై జరిగిన సమీక్షలో శ్రీకాకుళం నవభారత జంక్షన్–బైపాస్ జంక్షన్ వద్ద పాదచారుల భద్రత కోసం వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు కు డీపీఆర్ సిద్ధం చేయాలని ఎస్పీ కోరారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ప్రైవేట్ బస్సులు నిలపకుండా కేసులు నమోదు చేయాలని, రోడ్లపై ఇష్టానుసారం వాహనాలు పార్క్ చేసినా, జాతీయ రహదారిపై చెత్త వేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
క్వారీల బంద్
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్రా సమితిలో అనుమతులు లేకుండా నడుపుడుతున్న క్రషర్, రాళ్ల క్వారీలను అధికారులు బంద్ చేయించారు. కుంద్ర సమితి బానువగుడ పంచాయతీలో నువాగుడ క్రషర్ యూనిట్, పుపుగాం పతర్ క్వారీలను (రాళ్లక్వారీ) అధికారులు సందర్శించి బంద్ చేయించారు. ఆ ప్రాంత ప్రజల ఫిర్యాదు మేరకు శనివారం జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి, అకస్మాత్తుగా వెళ్లి లీజ్ అనుమతి కాగితాలను అడిగారు. తారాతరణి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని ఎటువంటి లీజ్ డాక్యుమెంట్స్ చూపించలేకపోయారు. అందువలన చట్ట వ్యతిరేకంగా క్రషర్ నడుపుతున్నట్లు వెల్లడైంది. సబ్కలెక్టర్తోపాటు జూనియర్ మైనింగ్ ఆఫీసర్ శౌమ్యరంజన్ సాహు, తహసీల్దార్ బినోద్ కుమార్ నాయక్, రెవెన్యూ సూపర్వైజర్ బీరేంద్ర మండల్, మొసిగాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ భబాణీ భొత్ర, పోలీసు అధికారి అశ్విణీకుమార్ పట్నాయక్ సమక్షంలో క్వారీ చట్ట విరుద్దమని ప్రకటించారు. క్వారీ, క్రషర్ల చుట్టూ ఎర్ర జెండాలు పాతించారు. క్వారీ, క్రషర్లలో వినియోగించే సామగ్రి, మినీక్రషర్ మిషన్ను అధికారులు సీజ్ చేశారు. వాటిని ఆ కంపెనీ యజమాని సోమనాత్ పాత్రో జిమాలో ఉంచారు. -
ఉపాధ్యాయురాలిపై మానసిక వేధింపులు
రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాలలో సైన్స్ విభాగంలో సీనియర్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పి.అనురాధ చౌదరిని ప్రధానోపాధ్యాయురాలు మమిత ప్రధాన్ లైంగిక వేధిపులు చేస్తున్నారనే ఆరోపణలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యామాల్లో వైరల్ కావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. తనపై తరచూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. ఆమె వేధింపులు తట్టుకోలేక అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైరల్ అయిన వీడియా అధికారుల దృష్టికి వచ్చింది. ఈ ఘటన ఈ నెల 24వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన ఉపాధ్యాయురాలు చౌదరి ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి తగిన న్యాయం చేయాలని ఆమె కోరింది. గత 20 ఏళ్లుగా సైన్ టీచర్గా అనుభవం ఉన్న తాను గత ఏడాదిగా గొవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న మమిత ప్రధాన్ ఎటువంటి తప్పు లేకపొయినప్పటికీ తనపై దురుసుగా ప్రవర్తిండంతోపాటు మానసికఒత్తిడి కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 24న తాను క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న సమయంలో వెంటనే తనని చాంబర్కు రమ్మని పిలిచారని ఆమె ఆదేశానుసారం వెంటనే తాను ప్రధానోపాధ్యాయురాలి చాంబర్కు వెళ్లగా తనపై లేనిపోని మాటలతో బాధకలిగించారని వీడియోలో వివరించారు. అనంతరం తాను తరగతిలో పాఠాలు చెప్పడానికి వెళ్లినప్పటికీ ఒత్తిడి వల్ల పాఠాలు నిలిపివేసి విశ్రాంతి తీసుకునేందుకు టీచర్స్ కామన్ రూంకు వెళ్లి అక్కడ కళ్లు తిరిగి ఆపస్మారక స్థితిలో పడిపోయినట్లుగా వివరించారు. సిబ్బంది తనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారని వివరించారు. ఉపాధ్యాయులపై ఇటువంటి మానసిక వత్తిడి కలిగేలా ప్రధానోపాధ్యాయురాలు ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని కోరారు. -
యమకంకరలు
పలాస: పలాస మండలంలో గత కొన్ని నెలలుగా అక్ర మ కంకర తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. కేదారిపురం, గంగువాడ, లొద్దబద్ర పరిసర ప్రాంతాల్లోని కొండలు అక్రమార్కులకు అడ్డాగా మారా యి. అలాగే ఇటీవల రామకృష్ణాపురం వద్ద గల ఉజ్జిడి మెట్టను కూడా కొల్లగొడుతున్నారు. ఈ కంకరంతా మున్సిపాలిటీ, మండలంలోని రియల్ ఎస్టేటు వెంచర్లకు తరలిస్తున్నారు. అయినా సంబంధిత రెవెన్యూ, మైన్స్ అధికారులకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం విశేషం. ఇంత వరకు ఒక్క ట్రాక్టర్ను గానీ, జేసీబీని గానీ సీజ్ చేయకపోవడం అధికారుల పనితనాన్ని చూపిస్తోంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అక్రమ తవ్వకాల విషయంలో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో తప్పని పరిస్థితిలో పలాస రెవెన్యూ అధికారులు సిబ్బంది, మైన్స్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల కంబిరిగాం, లొద్దబద్ర తదితర ప్రాంతాల్లో కూడా మైన్స్ అధికారులు పర్యటించి పరిశీలించారు. ఆ తర్వాత దానిపై ఏం చర్యలు తీసుకున్నారంటే తగిన సమాధానాలు లభించడం లేదు. తాజాగా శనివారం కూ డా పలాస మండలం రామకృష్ణాపురం వద్ద గల ఉజ్జిడి మెట్టను పరిశీలించారు. వారితో స్థానిక వీఆర్ఓ నౌషద్ అల్లా ఒక్కరు మాత్రమే ఉన్నారు. అక్కడకి వెళ్లి చూసిన వారికి ఈ మెట్ట ఏమైపోయిందని స్థానికులకు ఆశ్చర్యం కలుగుతోంది. వెళ్లిన అధికారులకు కూడా కొండ తవ్విన ఆనవాలు, తరలిపోయిన కంకర కళ్లకు కట్టినట్టు కనిపించింది. ఎంత కంకర తవ్వుకుపోయారనేది పరిశీలించి ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఆదాయాన్ని వారి నుంచే వసూలు చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం
జయపురం: కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యమని జిల్లా కమిటీ అధ్యక్షుడు రూపక్ తురుక్ అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు జయపురంలో గల జిల్లా కాంగ్రెస్ భవనంలో శనివారం జాతీయ ప్రతిభా అన్వేషణ సమావేశం నిర్వహించారు. సీనియర్ కాంగ్రేస్ నేత నిహారంజన్ బిశాయి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కాంత పాదీ, జయపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత నాయక్, మల్కనగిరి మాజీ ఎమ్మెల్యే నిమయ్ చరన సర్కార్, బ్రజ నాగ్, జిల్లా యూత్ కాంగ్రెస్ నేత టిను రావు, సను దండసేన, జిల్లా అల్ప వర్గాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హపన్ మదాని, ప్రనభ నాయక్, తదితరులు హాజరయ్యారు. ప్రతిభావంతులైన యువతకు పార్టీ చరిత్ర, ఆదర్శాలు, పార్టీ ఆలోచన ధార, ఉత్తమ భాషాజ్ఞానం, రాజనైతిక సచేతన, చరిత్రపై జ్ఞానం ప్రతిభ గల యువతీ, యువకుల కోసం అన్వేషణ జరుగుతోందని, అటువంటి వారినుంచి పత్రాలు ఆహ్వానించటం జరుగుతుందన్నారు. డిసెంబర్ 3వ తేదీన ఆవేదన పత్రాలను పరిశీలించటం జరుగుతుందని వెల్లడించారు. డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు ప్రాంతీయ స్థాయిలో వ్యక్తగత సాక్షాత్కారం ఉంటుందని, 14న రాష్ట్ర స్థాయిలో ఆవేదన పత్రాలు ఇచ్చిన వారితో రాష్ట్ర పార్టీ నేతలతో కలిసే కార్యక్రమం ఉంటుందన్నారు. -
కళాకారులను ప్రోత్సహించడమే ధ్యేయం
రాయగడ: కళలకు పుట్టినిళ్లుగా బాసిళ్లుతున్న రాష్ట్రంలోని కళాకారులను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కోల్కతాకు చెందిన సాంస్కృతిక విభాగం అమ్రిత్ కాల్ కల్చరల్ కాన్క్లేవ్ పేరిట స్థానిక బిజూపట్నాయక్ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కళాకారులను ప్రొత్సాహించి వారిలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకువచ్చేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ వేదికను కళాకారులు సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. జిల్లా పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బసంత కుమార్ ప్రధాన్ మాట్లాడుతూ.. ఈ కాన్క్లేవ్ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ వేదికపై తమ ప్రతిభను కనబరిచేందుకు ఉత్సాహంగా ఉన్నారన్నారు. కోల్కతాకు చెందిన సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని అన్నారు. రెండు రోజులు జరిగే కార్యక్రమంలొ కళాకారులు తమ సత్తాను చాటుకోవాలని అన్నారు. కోల్కతాకు చెందిన సాంస్కృతిక విభాగం డిప్యూటీ డైరెక్టర్ క్రిష్ణ సరోజ్ మాట్లాడుతూ.. రాష్ట్రం కళలకు ప్రసిద్ధిగా గుర్తింపు పొందిందని అన్నారు. ఒడిస్సీ నృత్యం అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకోవడం విశేషమని అభిప్రాయపడ్డారు. కళాకారులను ప్రొత్సాహించడమే కార్యక్రమం ముఖ్యఉద్దేశమన్నారు. గురువులకు సన్మానం జిల్లాలో ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దుతున్న గురువులను ఈ సందర్భంగా సాంస్కృతిక విభాగం సన్మానించింది. మా సంతోషి కళా ప్రతిష్టాన్కు చెందిన గురువు సంతోష్ కుమార్ తండి, గుణుపూర్ సబ్ డివిజన్లోని పుటాసింగ్ ప్రాంతానికి చెందిన లంజియా సవర నృత్య గురువు వీరభధ్ర దొలొబెహర, మా మజ్జిగౌరి డ్యాన్స్ డ్యాన్స్ బృందానికి చెందిన గురువు టి.శివ భాస్కర్, పీడీసీ డ్యాన్స్ బృందానికి చెందిన గుప్తేశ్వర్ సిక్క, మా మార్కమా నాట్య కళా సంఘటన్కు చెందిన మధుసూదన్ మహాపాత్రో, రాయగడ సేవా సమాజ్కు చెందిన దీప్తి మడమను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆదివాసీల సంస్కృతికి అద్దం పట్టే థింశా నృత్యం, వారి ఆచార వ్యవహారాలు, పూజా విధానాలు తెలిపే నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. అలాగే సంబల్పూరి నృత్యం ఆకట్టుకుంది. -
పెన్షన్దారుడు మరణిస్తేనే మరొకరికి పెన్షన్ ఇస్తారా..?
జయపురం: ఒక పెన్సన్దారుడు మరణిస్తే గానీ మరొకరికి పెన్షన్ లభించదా? అని ప్రముఖ సమాజసేవి బి.హరి రావు ప్రశ్నించారు. 60 ఏళ్లు నిండిన ప్రతివారికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అనేకమంది అర్హులు ధరఖాస్తులు పెట్టుకున్నా పెన్షన్ మంజూరు చేయటం లేదని ఆరోపించారు. కొంతమంది వృద్ధులతో జయపురండిప్యూటీ కలెక్టర్ నమ్రత గర్తియకు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో వృద్ధులు కేశవ జాని, రామ ముదులి, బలరాం జాని, బుదు హంతాల్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 2,900 పిల్లలు అదృశ్యం
● అగ్రస్థానంలో ఖుర్ధా జిల్లా భువనేశ్వర్: రాష్ట్రంలో జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు 2,975 మంది పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ వ్యవధిలో 11,337 పిల్లలు తప్పిపోయిన కేసులు నమోదయ్యాయని శనివారం జరిగిన శీతా కాలం సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా తెలిపారు. వీరిలో 8,362 మంది పిల్లలను గుర్తించి రక్షించారు. మిగిలిన 2,975 మంది బాలల జాడ గుర్తించే ప్రయత్నా లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభు త్వ పోలీసులు, బాలల సంక్షేమ సంఘాలు మరియు కమ్యూనిటీ వర్గాలు సమన్వయంగా గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని వివరించారు. సభలో సమర్పించిన జిల్లాల వారీ సమాచారం ప్రకారం ఖుర్ధాలో అత్యధికంగా తప్పిపోయిన పిల్లల కేసులు నమోదయ్యాయి. 785 ఫిర్యాదులు ఆధారంగా ఇప్పటివరకు 576 మంది పిల్లలను గుర్తించారు. బాలాసోర్లో 683 కేసులు నమోదు కాగా 114 మంది పిల్లలను మాత్రమే రక్షించగలిగారు. రాష్ట్ర స్థాయిలో ఈ జిల్లాలో అతి తక్కువ రికవరీ రేటుపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.ఏసీఏలో సమగ్ర గీతా పారాయణం భువనేశ్వర్: స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి ఏసీఏ గీతా జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా సమగ్ర గీతా సామూహిక పారాయణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సమితి సభ్యులతో పలువురు ఔత్సాహిక సభ్యులు పాల్గొంటారని ఇటీవల బాధ్యతలు చేపట్టిన అధ్యక్షుడు జి.ఆనంద రావు తెలిపారు. డిసెంబరు నెల 1వ తేదీన సమితి రజతోత్సవ సభా మందిరంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఔత్సాహిక అభ్యర్థులు సమితి కార్యదర్శి రాయప్రోలు సత్య సాయిని సంప్రదించాలని తెలిపారు. మెడికల్ షాపు యజమానికి జరిమానారాయగడ: నిషేధిత గుట్కాను నములుతూ మెడికల్ షాపులో కూర్చొని వ్యాపార లావాదేవీలు చేస్తున్న మెడికల్ షాపు యజమానికి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రెండు వందల రూపాయల జరిమానా విధించారు. ఇకపై ఇటువంటి ప్రవర్తనకు స్వస్తి చెప్పాలని లేదంటే సంబంధిత లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. జిల్లాలోని గుడారిలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గుడారిలోని మెడిక్ షాపులపై ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్తో పాటు పోలీసు, వైద్య సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. మెడికల్ షాపుల్లో కాల పరిమితి ముగిసిన మందులను పరిశీలించారు. అదేవిధంగా మందుల బ్యాచ్ నంబర్లను తనిఖీ చేశారు. గర్భనిరోధక మందుల కిట్లను డాక్టర్ల ప్రిస్కప్సన్ లేనిదే ఎవ్వరికీ విక్రయించకూడదని తాఖీదు చేశారు. అలాగే ప్రిస్కిప్సన్ లేకుండా చిన్నచిన్న రోగాల బారిన పడి మందుల షాపులను ఆశ్రయించే రోగులకు అధిక మోతాదులో యాంటీబయోటిక్ మందులను ఇవ్వకూడదని వివరించారు. 60 కిలోల గంజాయి స్వాధీనం రాయగడ: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అతని వద్దనుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో నిందితుడు ఉత్తర ప్రదేశ్కు చెందిన షానుగా పోలీసులు గుర్తించారు. రాయగడ నుంచి విశాఖపట్నానికి వెళ్లే రైలులో గంజాయిని రవాణా జరుగుతున్నట్లుగా సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రభాత్ కుమార్ త్రిపాఠి, ఇన్స్పెక్టర్ బినయ్ ప్రకాష్ మింజ, అలోక్ నాయక్, ఏఎస్సై మానిక్ చంద్ర గౌడో, మలయ మాఝిలు ప్లాట్ఫారంపై తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో షాను అనుమానాస్పదంగా కనిపించడంతో అతని బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
రూ.2 వేలు ఇస్తేనే మృతదేహం ఇస్తాం
రాయగడ: ఒక బాలుడు ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతి చెందిన ఘటనకు సంబంధించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు పోస్టుమార్టం పూర్తి చేసి వెళ్లిపోగా సిబ్బంది మాత్రం రూ.రెండు వేలు లంచం ఇస్తే గాని మృతదేహాన్ని ఇచ్చేదిలేదని డిమాండ్ చేశారు. దీనిపై బాధిత కుటుంబీకులు గ్రామస్తుల సహాయంతో జిల్లా ముఖ్యవైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జిల్లాలోని కాసీపూర్ సమితి గొరఖ్పూర్ పంచాయతీలొని కన్హుగుడ గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామంలో నివసిస్తున్న కొంబొమజ్జికి చెందిన మూడేళ్ల కొడుకు తొరు మజ్జి అనే బాలుడు సమీపంలో గల నదిలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కాశీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం వైద్యుడు పోస్టుమార్టం చేసి వెళ్లిపోయారు. పోస్టుమార్టం సమయంలో వైద్యునికి సహకరించిన ఆస్పత్రి సిబ్బంది హృషి కేష్ సాహు అనే వ్యక్తి బాలుని తండ్రిని రూ.2వేలు లంచం అడిగాడు. లంచం ఇస్తేనే గానీ మృతదేహాన్ని ఇచ్చేది లేదని కచ్చితంగా చెప్పడంతో గత్యంతరం లేని కొంబొ మజ్జి విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. దీంతో గ్రామస్తులంతా కలసి చందాలు పోగు చేసుకుని వెయ్యి రూపాయలను సర్దుబాటు చేశారు. ఈ మొత్తాన్ని తీసుకువెళ్లి హస్పటల్ సిబ్బంది హృషికేస్ సాహుకు ఇవ్వడంతో అడిగింది రెండు వేల రూపాయలైతే ఇచ్చేది వెయ్యి రూపాయలా అని తిరిగి ముఖాన కొట్టాడు. అనంతరం గ్రామానికి చెందిన టంకధర్ సాహు నేతృత్వంలో గ్రామస్తులంతా కలసి తమకు జరిగిన విషయాన్ని జిల్లా ముఖ్యవైద్యాధికారి పేరిట కాసీపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ముఖ్య వైద్యునికి, అదేవిధంగా కాశీపూర్ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
యువతకు లోతైన సాహితీ పరిజ్ఞానం అవసరం: జావేద్ అక్తర్
భువనేశ్వర్: యువతకు లోతైన సాహితీ పరిజ్ఞానం అవసరమని, యువత సాహిత్యం, భాష, సంస్కృతి, సంప్రదాయాలపట్ల మక్కువతో పట్టు సాధించాలని ప్రముఖ కవి, గేయ రచయిత, సాహిత్య రచయిత పద్మభూషణ్ జావేద్ అక్తర్ ప్రోత్సహించారు. ఈ విషయాలను ఎంత ఎక్కువగా అన్వేషిస్తే అవగాహన అంత గొప్పగా తళుక్కుమంటుందన్నారు. ఆయన తొలి ఎస్ఓఏ సాహిత్య సమ్మాన్ – 2025 పురస్కార గ్రహీతగా శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొనడాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో న్యూఢిలీ సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఎస్ఓఏ ఉపాధ్యక్షురాలు శాస్వతి దాస్ మరియు ఎస్ఓఏ వైస్ చాన్స్లర్ ప్రదీప్త కుమార్ నందా, ఎస్ఓఏ సాహిత్య ఉత్సవ డైరెక్టర్ గాయత్రిబాల పండా, ఎస్ఓఏ డీన్ జ్యోతి రంజన్ దాస్ తదితరులు ప్రసంగించారు. -
ముగిసిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు
పర్లాకిమిడి: గజపతి జిల్లా స్థాయిలో స్థానిక బిజూ కల్యాణ మండపంలో జరిగిన యువజనోత్సవాలు శనివారం ముగిశాయి. ఏడీఎం, ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హానగ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. వికసిత్ భారత్ యువజనోత్సవాలలో జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్లు పాల్గొని మాట్లాడారు. తొలుత జానపద గీతాలు పాడారు. తదనంతరం జానపద డ్యాన్సుల పోటీలు జరిగాయి. విజేతలు వీరే.. ఈ ఫోక్ సాంగ్స్ పోటీలో ప్రథమ బహుమతి క్రియేటివ్ ఆర్ట్స్ రూ.10వేలు, ద్వితీయ ఏ.జె.క్య్రూ డ్యాన్స్ స్టూడియోకు రూ.7,500, తృతీయ ప్రభుత్వ పీఎంశ్రీ ఉన్నత పాఠశాల, ఆర్.ఉదయగిరి (బలియా సాహి) గెలుచుకున్నారు. అలాగే జానపద నృత్యాల పోటీలో ప్రథమ బహుమతి క్రియేటివ్ ఆర్ట్స్ రూ.10వేలు, ద్వితీయ సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ రూ7,500, తృతీయ బహుమతిని వందేమాతరం టాలెంట్ అకాడమీకి రూ. 5 వేల బహుమతిని ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ అందజేశారు. ఇవికాక, పోయిట్రీ, పెయింటింగ్, స్టోరీ టెల్లింగ్ వంటి వివిధ పోటీలలో పాటు విజ్ఞాన ప్రదర్శనలో సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు పదివేల రూపాయలు బహుమతిని అందజేశారు. ప్రథమ బహుమతిని అందుకున్న విజేతలకు రాష్ట్ర స్థాయిలో భువనేశ్వర్లో జరుగనున్న పోటీలకు పంపిస్తామని జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు తెలిపారు. -
టెక్కలి డివిజన్కు నందిగాం
● అభ్యంతరాలుంటే తెలపాలి : కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం, నందిగాం మండలాన్ని ప్రస్తుతం ఉన్న పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి రెవెన్యూ డివిజన్కు మారుస్తూ కలెక్టర్ స్వప్నిల్ దింకర్ పుండ్కర్ ప్రాథమిక నోటిఫికేషన్ (జీవోఆర్టీ.1490) జారీ చేశారు. ఈ ప్రతిపాదనపై ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే, గెజిట్ ప్రచురణ అయిన తేదీ (27.11.2025) నుంచి 30 రోజుల్లోపు రాతపూర్వకంగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటిన కంబకాయ యువకుడు నరసన్నపేట: కంబకాయకు చెందిన పాగోటి సతీష్ అంతర్జాతీయ స్థాయిలో థాయ్లాండ్లోని పటాయ్ పట్టణంలో జరిగిన బాడీబిల్డింగ్ పోటీ ల్లో సత్తా చాటి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నాడు. 27 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకూ యునైటెడ్ వరల్డ్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్(యూడబ్ల్యూఎస్ఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో ఆసియా స్థాయి లో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరిగిన పోటీలో సతీష్ ప్రతిభ చూపి మూడో స్థానంలో నిలిచారు. సుమారు 20 దేశాల నుంచి 18 మంది పోటీల్లో పాల్గొనగా తనకు కాంస్య పతకం దక్కిందని ఆయన తెలిపారు. దీనిపై సర్పంచ్ పాగోటి కుసుమ కుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాగోటి ఉమామహేశ్వరి సతీష్కు అభినందనలు తెలిపారు. రైతును నట్టేట ముంచుతున్నారు ● ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపాటు నరసన్నపేట: బాబు సర్కారు అన్ని రకాలుగా రైతులను నష్టపరుస్తోందని, పంటను సకాలంలో కొనుగోలు చేయకుండా దగాకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పండిన ధా న్యం అమ్ముకోవడానికి అనేక ఆంక్షలు పెడుతోందన్నారు. చంద్రబాబు నిజస్వరూపం చూ పుతున్నారని అన్నారు. టమాటా, ఉల్లి, అరటి, మిరప పంటలకు మద్దతు ధర కల్పించలేక పోయిన ప్రభుత్వం ఇప్పుడు వరి ధాన్యం అ మ్మకాల వద్దకు వచ్చే సరికి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. సక్రమంగా ధాన్యం కొనుగో లు చేయక దళారులకు అమ్ముకొనే విధంగా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కొనుగో లు కేంద్రాల ఏర్పాటు, ఏజెన్సీల నియామకంలో కూడా రాజకీయం చేస్తూ రైతులకు కష్టాలకు గురి చేస్తుందన్నారు. రైతులకు నచ్చిన చోట ధాన్యం అమ్ముకోవచ్చని అంటూ కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన రైతులను పట్టించుకోవడం లేదని, షెడ్యూల్ ఇవ్వడం లేదని, ట్రక్ షీట్ జనరేట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వ మని అన్నారు. గోనె సంచులు కూడా ఇవ్వలేకపోతున్నారని, రైతులు బయట కొనుగోలు చేసి నష్టపోతున్నారని అన్నారు. తేమ శాతం పేరుతో, ధాన్యం నాణ్యత పేరుతో దళారులు రైతులను మోసం చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకుండా వెనకేసుకు వస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు ఆదుకోవాలని, ధాన్యం అమ్మకాల విషయంలో పూర్తిగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతుల పక్షాన ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. వాహనాలపై స్పెషల్ డ్రైవ్ శ్రీకాకుళం రూరల్: జిల్లాలో గల స్కూల్, కాలేజ్లకు చెందిన పలు వాహనాలపై విజయవాడ రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు శుక్రవారం నుంచి డిసెంబర్ 4వరకూ జిల్లా వ్యాప్తంగా స్పెషల్డ్రైవ్ చేస్తున్నట్లు ఉపరవాణాశాఖాధికారి విజయసారధి తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం ఒక్కరోజే 41 వాహనాలను తనిఖీలు చేసి నోటీసులు అందించినట్లు తెలిపారు. -
ఘనంగా వికసిత్ భారత్ యువజనోత్సవాలు
పర్లాకిమిడి: నేటి యువత ప్రగతికి సారథులని వక్తలు అన్నారు. వారి సృజనాత్మకతను, పరంపర కళానృత్యాల నైపుణ్యం ప్రదర్శించే వేదికే వికసిత్ భారత్ యువజనోత్సవాలని ఆదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫల్గునీ మఝి అన్నారు. స్థానిక బిజూ కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన యువజనోత్సవాలను శుక్రవారం ప్రారంభించారు. ఉత్సవాలకు ఇతర అతిథులుగా పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, జిల్లా ముఖ్య విద్యాధికారి డాక్టర్ మయాధర్ సాహు, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్, జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహులు విచ్చేయగా, శుభ్రాంశు శేఖర్ పండా ముఖ్యవక్తగా వ్యవహరించారు. యువజనోత్సవాలలో మొత్తం అయిదు ఈవెంట్లు ఏర్పాటు చేశారు. వీటిలో విజ్ఞాన ప్రదర్శన, చిత్రలేఖనం, స్టోరీ రైటింగ్, వక్తృత్వం, డ్యాన్సు ఉంటాయని, జిల్లా వ్యాప్తంగా 400 మందికిపైగా కళాశాలల విద్యార్థులు పాల్గొంటారని జిల్లా స్పోర్ట్స్ అధికారి త్రినాథ సాహు అన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా సెంచూరియన్ వర్సిటీకి చెందిన డాక్టర్ నారాయణ గౌడో, ప్రొఫెసర్ సాగర్ మైత్రే, డాక్టర్ సోమనాథ్ కుమార్ బెహారా, డాక్టర్ ప్రియబ్రత్ శతపథి (అసోసియేట్ ప్రొఫెసర్), డాక్టర్ బిప్లవ్ రంజన్ ప్రధాన్, మహారాజా బాలుర ఉన్నత పాఠశాల అసిస్టెంటు టీచర్ జగన్నాథ్ పట్నాయక్ వ్యవహారించారు. రెండు రోజుల పాటు యువజనోత్సవాలు జరుగుతాయని జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు తెలిపారు. -
ఇద్దరు కళాకారులకు సంగీత అకాడమి పురస్కారాలు
జయపురం: జయపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు కళాకారులు కళారంగానికి అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర సంగీత ఏకాడమి అవార్డులతో సన్మానించింది. సంగీత అకాడమి సన్మానించిన కళాకారులు జయపురంలో ఒడిస్సీ నృత్యకళా సంస్థను నెలకొల్పి కొరాపుట్ జిల్లాలో ఒడిస్సీ నృత్య కళను విస్తరింప చేస్తున్న ప్రముఖ నృత్యకారుడు కనూచరణ్ ప్రధాన్, సంగీత అకాడమీ చే సన్మానించబడ్డారు. అలాగే మరుగున పడుతున్న లోక కళా భజన సంకీర్తనలు పునరుద్ధరణకు ఎనలేని కృషి చేస్తున్న లింగరాజ్ నిశంకను కూడా సంగీత అకాడమి అవార్డులతో సత్కరించింది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లోక్ సేవా భవనంలో నిర్వహించబడిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి సూర్యవంశీ సూరజ్, ఎమ్మెల్యే సిద్ధాంత మహాపాత్రో, బాబు సింహ, ఆకాశ దాస్ నాయిక్, సంబంధిత విభాగ కార్యదర్శి డాక్టర్ విజయ కేతన్ ఉపాధ్యాయ, స్వతంత్ర పాలన కార్యదర్శి దేవ ప్రసాద్ దాస్, సంగీత నాటక అకాడమి కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖరహాత్త లు కళాకారులకు శాలువలు కప్పి ప్రశంసా పత్రాలతో పాటు ఒక లక్ష రూపాయల చొప్పున సత్కరించారు. -
మంత్రుల పరామర్శ
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతిని భువనేశ్వర్లోని ఆయన నివాసంలో మంత్రులు పరామర్శించారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూరజ్ సూర్యవంశీ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్, ప్రభుత్వ చీఫ్ విప్ సరోజ్ కుమార్ ప్రధాన్ తదితరులు పరామర్శించారు. మరోవైపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా అసెంబ్లీలో ఆరుగురు సీనియర్ ఎమ్మెల్యేలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కార్యక్రమంలో పాల్గొన్నానని పేర్కొన్నారు. త్వరలో కొరాపుట్ జిల్లాకి వస్తానని రాష్ట్రపతి చెప్పారని బాహిణీపతి ప్రకటించారు. -
క్రికెట్లో మున్సిపాలిటీ టీమ్ విజయం
జయపురం: కొరాపుట్ పర్వ్–2025 పురస్కరించుకొని శుక్రవారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలో మున్సిపాలిటీ అకాడమీ టీమ్ ఘన విజయం సాధించింది. ఈ పోటీ జయపురం ప్రెస్క్లబ్, మున్సిపాలిటీ అకాడమీ జట్ల మధ్య జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జయపురం ప్రెస్క్లబ్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. 104 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన మున్సిపాలిటీ అకాడమీ టీమ్ 9 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. పోటీలను జయపురం సబ్ కలెక్టర్, మున్సిపల్ కార్య నిర్వాహక అధికారి అక్కవరం శొశ్యా రెడ్డి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి పార్ధ గజపతి కాశ్యప్, మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, వైస్ చైర్పర్సన్ బి.సునీత తదితరులు పాల్గొన్నారు. -
నన్నొదిలి వెళ్లిపోయావా..
తన కళ్లెదుటే తల్లి మృతిచెందడంతో ఆ కుమారుడు తల్లడిల్లిపోయాడు. తాను లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ ‘నన్ను వదిలి వెళ్లిపోయావా..’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. రక్షించండంటూ అటువైపుగా రాకపోకలు సాగించిన ప్రతిఒక్కరినీ వేడుకున్నాడు. ఈ హృదయ విదారకర ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. అమ్మా.. ● కుమారుడి కళ్లెదుటే తల్లి మృతి ● షుగర్ టెస్టులకు తీసుకెళ్తుండగా స్కూటీని ఢీకొట్టిన లారీ ● కొల్లివలసలో విషాదఛాయలు తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న కుమారుడు మణికంఠ, (ఇన్సెట్లో) భానుమతి(ఫైల్) ఆమదాలవలస/బూర్జ: ఆమదాలవలస పట్టణ శివారులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రాంతంలో ఇండ్రస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి చెందగా కుమారుడికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్జ మండలం కొల్లివలస గ్రామానికి చెందిన నున్నగొప్పల మణికంఠ తన తల్లి భానుమతి (50)ని షుగర్ టెస్టుల నిమిత్తం శ్రీకాకుళం తీసుకెళ్లేందుకు స్కూటీపై బయలుదేరారు. ఫ్లై ఓవర్ దిగువకు చేరుకునే సమయంలో శ్రీకాకుళం వైపు నుంచి పాలకొండ వైపు కొబ్బరికాయల లోడుతో వెళుతున్న లారీ అతివేగంతో ఓవర్ టేక్ చేసి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో భానుమతి అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడు మణికంఠకు తీవ్ర గాయాలపాలయ్యాడు. తల్లడిల్లిన కుమారుడు.. కళ్ల ముందే కన్నతల్లి రక్తపుమడుగులో కొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తుంటే ఏమి చేయలేని స్థితిలో మణికంఠ తల్లడిల్లుతూ చేస్తున్న రోదనలు మిన్నంటాయి. తాను లేవలేని స్థితిలో ఉన్నప్పటికి లేవాలని ప్రయత్నిస్తూ రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపుతూ వారి సహాయం కోరడం అక్కడున్న వారిన కంట తడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న ఆమదాలవలస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందడంతో వారికి సమాచారం అందించారు. అనంతరం రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మణికంఠను చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొల్లివలసలో విషాదఛాయలు.. రోడ్డు ప్రమాదంలో భానుమతి మృతి చెందడంతో స్వగ్రామం కొల్లివలసలో విషాదఛాయలు అలముకున్నాయి. భానుమతికి భర్త కొండలరావు, కుమారుడు మణికంఠ ఉన్నారు. కుమార్తెకు వివాహం అయ్యింది. చింతాడ పరామర్శ.. విషయం తెలుసుకున్న ఆమదాలవలస వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. పోలీసులు, స్థానికులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. భానుమతి మృతికి సంతాపం తెలుపుతూ ఆమె భర్త, వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు కొండలరావుతో మాట్లాడి ఓదార్చారు. -
ప్రభుత్వ విద్య, వైద్యంపై యువకుడి వినూత్న నిరసన
కొత్తూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తు న్న విద్య, వైద్య రంగాల అమలు తీరుకు నిరసనగా కొత్తూరు మండలం కలిగాం గ్రామానికి చెందిన యువకుడు పొన్నాడ హేమసుందరరావు కొత్తూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపాడు. ప్రజలు చెల్లించిన డబ్బుతో నడుస్తున్న ప్రభుత్వ బడుల్లో ఎమ్మెల్యేలు, మంత్రు లు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను చదివించినప్పు డే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు వైద్యం పొందితేనే అందరికీ నాణ్యమైన వైద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే పర్య వేక్షణ లోపిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ప్రైవేటీ కరణ చేయడం వల్ల పేదలకు వైద్య విద్యతో పాటు వైద్యం అందకుండాపోతుందన్నారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా ప్రతి రోజూ ఒక గంట పాటు కొత్తూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తానన్నారు. -
వైద్యానికి ఆర్థిక సాయం అందించండి
● కలెక్టర్కు మీడియా వెల్ఫేర్ కమిటీ వినతి రాయగడ: వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలైన పాత్రికేయురాలు సుప్రియ షోడంగి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణికి జిల్లా మీడియా వెల్ఫేర్ కమిటీ సభ్యులు కోరారు. కమిటీకి చెందిన శివాజీ దాస్ నేతృత్వంలో సభ్యులు ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కలెక్టర్కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కులకర్ణి స్పందించి ప్రభుత్వ తరఫున బాధితురాలికి ఆర్థిక సహాయం అందేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ట్రెజరీ రోడ్డు వద్ద నివాసముంటున్న పాత్రికేయుడు గొపి నాథ్ గౌడో వివాహం బుధవారం సంబల్పూర్ జిల్లాలోని కుచింద వద్ద జరిగింది. ఈ వివాహానికి బంధుమిత్రులు అదేవిధంగా పాత్రికేయురాలు సుప్రియ, శక్తిదాస్లు హాజరయ్యారు. వివాహం జరిగిన తరువాత రాత్రి తిరిగి వస్తున్న సమయంలో బొలేరో ఒక చెట్టుకు ఢీ కొనడంతొ అందులో ప్రయాణిస్తున్న వధువు సోదరి జ్యోత్స్నరాణి గౌడి అక్కడిక్కడే మృతి చెందగా సుప్రియ, శక్తిదాస్లు గాయపడిన విషయం విదితమే. -
ధనలక్ష్మి పూజలు ప్రారంభం
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్లో ధనలక్ష్మి పూజలు గురువారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం నాగావళి నది నుంచి శుద్ధజలాలను తీసుకువచ్చి మండపాన్ని శుద్ధి చేశారు. అనంతరం వైతరణి, దేవగిరి సంఘంలో స్థలంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. తొమ్మిది రోజులు ధనలక్ష్మి పూజలను నిర్వహిస్తారని నిర్వాహకులు తెలియజేశారు. జిల్లా పరిషత్ సభ్యులు బి.వి.ప్రసాద్ రావు, కమిటీ అధ్యక్షులు కై లాస్ ఆచారి, ఉపాధ్యక్షులు కామాఓ కుమార్ పాఢి, కార్యదర్శి జి.కిరణ్కుమార్ తదితరుల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రోజు సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలో బాంబు పేలుడు భువనేశ్వర్: స్థానిక సెంట్రల్ స్కూల్–3 ముంగిట బాంబు పేలుడు బెంబేలెత్తించింది. శుక్రవారం ఉదయం గొడొకొణ ప్రాంతంలో సెంట్రల్ స్కూల్–3 ప్రధాన ద్వారం దగ్గర బాంబు పేలుడు పరిసరాలను దద్దరిల్లించింది. మంచేశ్వర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాయగడ: స్థానిక రైల్వే స్టేషన్లో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కోర్టుకు తరలించారు. రైల్వే స్టేషన్లో గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు డీఎస్పీ ప్రవాత్ కుమార్ త్రిపాఠి, ఏఎస్ఐ ఎం.చంద్ర, సిబ్బంది దాడులను నిర్వహించారు. ఈ క్రమంలో ఒకటో నంబర్ ఫ్లాట్ఫాంలో అనుమానాస్పందంగా కనిపించిన ఓ ప్రయాణికుడి బ్యాగును తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది నిందితుడు జిల్లాలోని అండ్రాకంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాయికొకుఫాకల్ గ్రామానికి చెందిన అశోక్ మణి బాగ్గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. క్రీడలు ఆరోగ్యదాయకం భువనేశ్వర్: విద్యార్థి దశలో క్రీడలు యువతలో మానసిక, శారీరిక సమతుల్యతకు దోహదపడతాయి. ఈ రంగంలో పోటీలు యువతరంలో క్రీడా స్ఫూర్తిని ప్రేరేపిస్తాయని పర్లాకిమిడి నియోజక వర్గం ఎమ్మెల్యే రూపేష్ కుమార్ పాణిగ్రాహి తెలిపారు. స్థానిక హైటెక్ సైన్స్, కామర్స్ కళాశాల 19వ వార్షిక క్రీడోత్సవం ప్రారంభం పురస్కరించుకుని ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గజపతి జిల్లాలో రూపా మిశ్ర పర్యటన పర్లాకిమిడి: గజపతి జిల్లాను ఆకాంక్ష జిల్లాగా ప్రకటించిన తర్వాత గుమ్మా, ఆర్.ఉదయగిరి సమితుల్లో వివిధ ప్రభుత్వ పథకాలు ఎంతవరకూ అమలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి రాష్ట్ర గృహ, పట్టణాభివృద్ధి, స్వచ్ఛ భారత్ మిషన్ జాయింట్ సెక్రటరీ రూపా మిశ్రా పర్యటించారు. అనంతరం పర్లాకిమిడి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. గుమ్మా, ఆర్.ఉదయగిరి బ్లాక్లలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఆర్థిక, మౌలిక సౌకర్యాలు, స్కిల్ డవలప్మెంట్, అమృత సరోవర యోజన, మహాత్మాగాంధీ ఉపాధి పనులు, రోడ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హానగ, ఏడీఎం ఫల్గునీ మఝి, జిల్లా పరిషత్ అదనపు సీడీవో పృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్పండా, సీడీఎంవో డా.మహ్మద్ ముబారక్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
సుపరిపాలనకు కీలకం: గవర్నర్
ఆధునిక ఆడిటింగ్ పద్ధతులుభువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి శుక్రవారం ఆధునిక పాలన అవసరాలకు అనుగుణంగా ఆడిటింగ్ పద్ధతులను మార్చాల్సిన అవసరాన్ని ప్రతిపాదించారు. స్థానిక జయదేవ్ భవన్లో జరిగిన 5వ ఆడిట్ వారోత్సవం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక ఆడిటింగ్ భవిష్యత్ దృష్ట్యా సాంకేతికత ఆధారిత విశ్లేషణాత్మక సమాచారంతో ఆకస్మిక ఒడిదొడుకుల అంచనాలతో ప్రజా వ్యయం, ఆర్థిక వ్యవస్థల పరిశీలనను మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. డిజిటల్ ప్లాట్ఫారాలు, పెరుగుతున్న సంక్లిష్టమైన ప్రజా కార్యక్రమాలతో ఆడిట్ దృష్టిలో ప్రమాదాలను అంచనా వేయడం, నియంత్రణలను మెరుగుపరచడం, సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడాన్ని ప్రారంభించడం జరగాలన్నారు. 150 సంవత్సరాలకు పైగా ఆడిటింగ్ ప్రజా జవాబుదారీతనానికి పునాదిగా ఉంది. ప్రజా వనరుల బాధ్యతాయుతమైన, పారదర్శక వినియోగాన్ని నిర్ధారించడం ద్వారా పాలనపై నమ్మకాన్ని బలోపేతం చేయడంలో ఆడిటింగ్ సహాయపడింది. లావాదేవీల నుంచి వ్యవస్థాగత ఆడిటింగ్కు మారాల్సిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రక్రియ వృత్తిపరమైన నైపుణ్యంపై ఆధారపడి ఉంటుందని, కృత్రిమ మేధస్సు, అధునాతన విశ్లేషణల వాడకంపై ఆధారపడి ఉంటుందన్నారు. పారదర్శకత, సంస్థాగత విశ్వసనీయతను బలోపేతం చేయడానికి ముందస్తు, సమగ్ర మరియు సంప్రదింపుల ఆడిట్ ఫ్రేమ్వర్క్ అవసరాన్ని గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏ అండ్ ఈ) ఐఏఏఎస్ డి. సాహు, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్–1) ఐఏఏఎస్ సుబు ఆర్. మాట్లాడారు. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. జిల్లా్లోని రామనగుడ సమీపంలోని బంకీ కూడలిలో ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతుడు పర్వేష్ కుమార్ (32)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న రామనగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు తెలిజేసిన వివరాల ప్రకారం.. రాయపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే ఒక లారీ (ట్రైలర్ ) నడుస్తు బంకీ కూడలిలో యాంత్రిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో ఆగిపొయింది. వెంటనే డ్రైవరు పర్వేష్ లారీ నుంచి కిందకు దిగి ఇంజిన్ స్టార్ట్ చేసి ఇంజిన్ కింద మరమ్మతులు చేస్తున్నాడు. అదే సమయంలో లారీ ఒక్కసారిగా వెనక్కు రావడంతో ఇంజన్ కింద ఉన్న డ్రైవరు లారీ చక్రం కింద పడి మృతి చెందాడు. లారీ వెనక్కు వెళ్లి బోల్తా కొట్టి సమీపంలోని లోయలోకి దూసుకుపొయింది. -
● అతిథి దేవో భవ
రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి గౌరవ విందుతో ఆతిథ్యం కల్పించారు. గురువారం రాజ్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాత్రి విందులో గవర్నరు సతీమణి జయశ్రీ కంభంపాటి పాల్గొన్నారు. ఈ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఆయన భార్య డాక్టర్ ప్రియాంక మరాండి, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జుయెల్ ఓరం, రాష్ట్ర శాసన సభ స్పీకర్ సురమా పాఢి, ఉప ముఖ్యమంత్రులు కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడా, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, అనేక మంది ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు ఇతర ప్రము ఖులు హాజరు అయ్యారు. – భువనేశ్వర్ -
యువత అన్ని రంగాల్లో రాణించాలి
● ఏడీఎం నవీన్ చంద్ర నాయక్ ● రాయగడలో ప్రారంభమైన యువజనోత్సవాలు రాయగడ: యువత అన్ని రంగాల్లో రాణించాలని అందుకు సాధన ఎంతో అవసరమని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ సమావేశం హాల్లో శుక్రవారం జిల్లా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువజనోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత తమ ప్రతిభను చాటుకునేందుకు ఇదో మంచి వేదికగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతీఒక్కరు సమయానికి అనుకూలంగా ప్రతిస్పందించాలని ఉన్న కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే తమ భవిష్యత్ ఉజ్వలంగా మారుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతను ప్రోత్సాహించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందని దీనిని సద్వినియోగపరుచుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యవేత్త డాక్టర్ డి.కె.మహాంతి మాట్లాడుతూ.. మన రాష్ట్రం కళలకు పుట్టినిళ్లని అన్నారు. భిన్న సంస్కృతులు గల మన రాష్ట్రంలో ఎంతో మంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర గౌరవాన్ని పెంపొందిస్తున్నారని అన్నారు. జిల్లాలో ఎంతో మంది కళాకారులు ఉన్నారని వారు కూడా తగిన సాధన చేసి వారి ప్రతిభను కనబర్చుకోవాలని అన్నారు. అనంతరం యువతీ, యువకులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, న్యాయవాది బ్రజసుందర్ నాయక్, జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్ ఆలీనూర్, జిల్లా సాంస్కృతిక విభాగాధికారి సుస్మిత బౌరి ప్రసంగించారు. -
పూరీ జగన్నాథ ఆలయం విద్యుద్దీపాలంకరణ
● రూ. 17 కోట్ల వ్యయ ప్రణాళిక భువనేశ్వర్: పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయం విద్యుద్దీప అలంకరణతో కాంతులీనే ఘడియలు దగ్గర పడుతున్నాయి. అత్యంత శక్తిమంతమైన ఎల్ఈడీ దీపాలతో దీపాలంకరణ వ్యయ ప్రణాళిక అంచనా రూ. 17 కోట్లు. రాత్రి పూట ప్రాచీన శ్రీ మందిరం సౌందర్యం కాంతులీనుతుంది. చీకటి సమయంలో ఆలయ నిర్మాణ సౌందర్యం, సంక్లిష్టమైన శిల్పాలను తళుకులు మెరిపించి సందర్శకుల అనుభవాన్ని ద్విగుణీకృతం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఆలయ ప్రాచీన కట్టడాలు, శిల్పాలు వగైరాకు ఏమాత్రం కళంకం ఏర్పడకుండా అత్యాధునిక ఎల్ఈడీ విద్యుద్దీపాలంకరణ చేపడుతున్నట్లు శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాఢి తెలిపారు. యాత్రికులు, సందర్శకులు ఆలయ వైభవాన్ని రాత్రింబవళ్లు చవిచూసేందుకు వీలుగా ఈ ప్రాజెక్టు రూపొందించినట్లు వివరించారు. ఈ ప్రణాళిక పూర్తిగా అమలులోకి వస్తే శ్రీ మందిరం రాత్రి పూట చీకటి సమయంలో దాదాపు 10 కిలో మీటర్ల దూరం నుంచి కాంతులు ప్రసరణతో తళుక్కుమంటుందన్నారు. ఇది యాత్రికులకు ఉత్కంఠభరితమైన దృశ్యంగా మారుతుందని ఆయన అన్నారు. ప్రధాన నిర్మాణం, చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు, నాలుగు ప్రధాన ద్వారాలను ప్రకాశవంతం చేసే ఈ ప్రాజెక్టును ఎస్జేటీఏ మరియు భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ఏఎస్ఐ వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసింది. దీని కోసం రూ. 17.12 కోట్లు కేటాయించారు. ప్రాథమిక సౌకర్యాల పెంపుదల–వారసత్వ, నిర్మాణ శైలి అభివృద్ధి (ఒబొఢా) పథకం కింద ఈ నిధులను ఉపయోగించుకోవాలని ఎస్జేటీఏ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తుంది. గత ఆలయ పాలక మండలి సమావేశంలో శ్రీ మందిరం ఎల్ఈడీ విద్యుద్దీపాలంకరణ ప్రాజెక్టు డీపీఆర్పై చర్చించి ఆమోదించింది. భోగ మండపం, జగ్మోహన్, నాట్య మండపం, గర్భ గుడి, మేఘనాథ్ ప్రహరి, శ్రీ మందిరం ప్రధాన సముదాయం, పరిసరాల్లో దేవాలయాలు, ఆనంద బజార్, కూర్మ మండపం వంటి కట్టడాల్ని ఈ ప్రాజెక్టు పరిధిలో విలీనం చేశారు. -
కుంద్రాలో డాక్టర్ల ఆందోళన
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్ర కమ్యూనిటీ ఆస్పత్రిలో డాక్టర్లు వైద్యులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారు తమ డిమాండ్ల సాధనకు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. వారం రోజులైనా అధికారులు స్పందించకపోవడంపై డాక్టర్లు మండిపడ్డారు. డిమాండ్లు నెరవేర్చకుంటే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఒడిశా మెడికల్ సేవా సంఘం ఇచ్చిన పిలుపు మేరకు కేంద్రీయ డీఎస్సీ హక్కు, ఒప్పందం ప్రకారం కేడర్ పునరుద్ధరణ, కేబీకే నిబంధనలు, విధుల్లో ఉన్న డాక్టర్లకు రక్షణ, ఆరోగ్య బీమా తదితర 18 డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. నెలాఖరు వరకు ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. నెలాఖరులోగా ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించక పోతే కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని తెలిపారు. ఓపీ పూర్తిగా బంద్ చేస్తామన్నారు. డాక్టర్ దాస్తో పాటు డాక్టర్ దేవాశిష్ మహరాణ, డాక్టర్ జయప్రకాశ్, డాక్టర్ అరవింద పండ, డాక్టర్ హరిశ్చంధ్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. -
సోదరుని పెళ్లికి హాజరై వస్తుండగా..
రాయగడ: తన సోదరుడి పెళ్లి చూసి ఎంతో ఉత్సాహంగా ఇంటికి తన స్నేహితులతో తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై సోదరి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదానికి గురి చేసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పాత్రికేయులతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సంబల్పూర్ జిల్లాలోని కటర్బాగ్ సమితి పరిధిలోని కుసుంధీహి గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక ట్రెజరీ రోడ్డు సమీపంలో నివసిస్తున్న పాత్రికేయుడు గొపినాథ్ గౌడోకు బుధవారం సంబల్పూర్లోని కుచేండ వద్ద వివాహం జరిగింది. ఈ వివాహానికి గోపినాథ్ సోదరి జోత్స్నరాణి గౌడో (35)తో సహా పాత్రికేయులు సుప్రియా షడంగి, శక్తిదాస్ బంధుమిత్రులు వివాహానికి హాజరయ్యారు. వివాహం పూర్తయి తిరిగి ఇంటికి బంధుమిత్రులతో పాటు వధువును తీసుకువస్తున్న సమయంలో బొలేరోలో ప్రయాణం చేస్తున్న జోత్స్నరాణి గౌడో, సుప్రియ షడంగి, అను, సంతోష్ కుమార్, శక్తిదాస్లు ఉన్నారు. సంబల్పూర్కు కొద్ది దూరం చేరేసరికి కుసుంధీహి గ్రామ సమీపంలో వాహభం అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో జోత్స్నరాణి గౌడో సంఘటన స్థలం వద్దే మృతి చెందగా సుప్రియ షడంగి, అను, సంతోష్ కుమార్, శక్తిదాస్లకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బుర్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో సుప్రియ షడంగి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆమెను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. వాహనంలో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయిన జోత్స్నరాణి గౌడో మృతదేహాన్ని గ్యాస్ కటర్లతో తొలగించి పోస్టుమార్టం కోసం సంబల్పూర్కు తరలించారు. అండగా జిల్లా ప్రెస్ అండ్ మీడియా వెల్ఫేర్ సంఘం జరిగిన సంఘటనను తెలుసుకున్న పాత్రికేయుల సంఘం బాధిత కుటుంబానికి అండగా నిలిచింది. మృతదేహాన్ని సంబల్పూర్ నుంచి రాయగడకు తరలించేందుకు జిల్లా ప్రెస్ అండ్ మీడియా వెల్ఫేర్ సంఘానికి చెందిన శివాజీదాస్, సంగ్రామ్ పట్నాయక్, శివనారాయణ గౌడో, ఆశీష్ రంజన్ పండ తదితరులు జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరోను గురువారం సంప్రదించారు. అనంతరం ఆయన చొరవతో సంబల్పూర్ కలెక్టర్ను సంప్రదించి మృతదేహాన్ని ఆంబులెన్స్లో తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు. అలాగే తీవ్రగాయాలకు గురై విశాఖలో చికిత్స పొందుతున్న సుప్రియా షడంగికి ఆర్థికంగా ఆదుకునేందకు సంఘం ముందుకు వచ్చింది. -
ఉపాధ్యాయుల నిరసన
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్లో ఉన్న ఒడిశా ఆదర్శ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు గురువారం నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్లలు ధరించి పాఠశాల ముందు తమ నిరసను వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణసింగుపూర్లో ఆదర్శ విద్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు సంపూర్ణంగా ప్రభుత్వ గుర్తింపు లభించలేదని, అదేవిధంగా ఉపాధ్యాయులు, సిబ్బంది ఆదర్శ విద్యాలయాలకు కల్పిస్తున్న సౌకర్యాలను పొందడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తగు చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు. అగ్ని బాధితులకు సాయం రాయగడ: జిల్లాలోని గుణుపూర్ డెప్పోవీధిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు కుటుంబాలకు చెందిన పది ఇళ్లు దగ్ధమయ్యాయి. సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు సత్యసాయి సేవా ట్రస్టు సభ్యులు సహాయాన్ని అందించారు. ట్రస్టు సభ్యులు ఈ మేరకు బుధవారం బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా గ్యాస్ స్టౌ, వంట సామగ్రి, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. సత్యసాయి ట్రస్టుకు చెందిన శివదుర్గా, పద్మన సేనాపతి, కె.ధర్మరాజు, పి.రామప్రసాద్ పి.హరిశ్చంద్ర, ఎల్.సురేష్ తదితరులు బాధితులకు సహాయం అందించిన వారిలో ఉన్నారు. అయితే బాధితులకు ఇంతవరకు ప్రభుత్వ నుంచి ఎటువంటి సహాయం అందలేదు. 91 మంది అధికారుల జీతాలు నిలిపివేత భువనేశ్వర్ : కటక్ జిల్లాలో 91 మంది అధికారులు, సిబ్బంది జీతాలు నిలిపివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీరి పని తీరు పట్ల ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ కేంద్రం తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. బాధితుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం తేటతెల్లం కావడంతో జీతాలు నిలిపివేయాలని సిఫారసు చేశారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా ప్రభుత్వ సేవలు కల్పించిన అధికారులు, సిబ్బంది నవంబరు నెల జీతభత్యాల చెల్లింపు నిలిపివేయాలని కలెక్టరు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ట్రెజరీ అధికారులకు లేఖ రాశారు. జీతాలు నిలిపివేతకు గురైన వారిలో కటక్ నగర పాలక సంస్థ కమిషనర్, నగర డీసీపీ, కటక్ గ్రామీణ పోలీస్ సూపరింటెండెంట్, కటక్ సబ్ జిల్లా మేజిస్ట్రేట్, అఠొగొడొ సబ్ జిల్లా మేజిస్ట్రేట్, కటక్ ఆర్టీఓ, కటక్ జిల్లా ప్రధాన వైద్య అధికారి (సీడీఎంఓ), జిల్లా విద్యాధికారి (డీఈఓ), ట్రాఫిక్ సూపరింటెండెంట్, ట్రాఫిక్ ఇనస్పెక్టర్ ఇన్చార్జి ఉన్నారు. 8 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం పర్లాకిమిడి: గజపతి, గంజాం సరిహద్దు బోడోగోడో పోలీస్ స్టేషన్ పరిధిలోని బజ్రకోట్, బరాగావ్, జైసింగ్ గ్రామాల్లో ఎకై ్సజ్, పోలీసు శాఖ, అటవీశాఖ అధికారులు గురువారం ఉమ్మడిగా దాడులు జరిపారు. అక్రమంగా పండిస్తున్న గంజాయి క్షేత్రాలను నాశనం చేసి తగులబెట్టారు. దాదాపు ఎనిమిది ఎకరాల్లో గంజాయిని పండిస్తున్నట్టు ఐఐసీ సోరడా పోలీసు ష్టేషన్ అధికారి తెలిపారు. ఎనిమిది ఎకరాల్లో పండిస్తున్న గంజాయి విలువ కోన్ని లక్షల రూపాయలు ఉంటుందని బోడోగోడో పోలీసు అధికారులు తెలియజేశారు. ఈ దాడుల్లో హింజిలికాటు, అస్కా అబ్కారీశాఖ, పోలీసులు, ధరాకోట్ ఆదనపు తహసీల్దార్, బోడోగోడో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్ర వరపుత్రిక ద్రౌపది ముర్ము
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర వరపుత్రిక వంటివారని వక్తలు పేర్కొన్నారు. రాష్ట్రపతి శాసన సభ సందర్శన సందర్భంగా గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి, స్పీకర్ సురమా పాఢి, ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి, విపక్ష నేత నవీన్ పట్నాయక్ తదితర ప్రముఖులు ప్రసంగించారు. గవర్నర్ మాట్లాడుతు ఒడిశా శాసన సభ సభ్యులను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ప్రసంగించడం చరిత్రలో గర్వించదగిన మైలురాయిగా నిలుస్తుందన్నారు. 75 ఏళ్లలో తొలిసారిగా, సభకు ప్రథమ పౌరుడి నుంచి మార్గదర్శకత్వం పొందే అవకాశం లభించడం ఒడిశా ప్రజాస్వామ్య ప్రయాణానికి గొప్ప అర్థాన్ని జోడించే క్షణంగా పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి దేశంలోని అత్యున్నత పదవికి ఆమె ఎదగడం మన ప్రజాస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రసంగిస్తు ఒడిశా ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా అభివర్ణించారు. విపక్ష నేత నవీన్ పట్నాయక్ ప్రసంగిస్తు మన రాష్ట్రానికి చెందిన రాష్ట్రపతి ఒడిశా శాసనసభను ఉద్దేశించి ప్రసంగించడం ఒడియా ప్రజలకు గొప్ప గౌరవమని పేర్కొన్నారు. -
రైతుల కోసం మాట్లాడే అర్హత టీడీపీకి లేదు
ఆమదాలవలస: రైతుల కోసం మాట్లాడే అర్హత టీడీ పీకి లేదని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రస్తు తం చేస్తున్న రైతన్న కోసం కార్యక్రమం బూటకమ ని అన్నారు. అది రైతులను మోసం చేయడానికేనని మండిపడ్డారు. ఏడాదికి రూ.20,000లు రైతు భరో సా ఇస్తానని చెప్పి.. ఈ రెండు సీజన్లకు రూ. 40,000లు ఇవ్వాల్సింది పోయి, రూ.5,000లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతుల ను నానా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలులో ఎన్ని అక్రమాలు, వివక్షలు చూపుతారోనని రైతులు భయపడుతున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సభ్యుడు సురవరపు నాగేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి గురువుబెల్లి శ్రీనివాసరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, ఆమదాలవలస మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, నాయకులు బద్రి రామారావు, కోవిలాపు చంద్రశేఖర్, అత్తులూరి రవికాంత్, కూన రామకృష్ణ, కృష్ణారావు, హేమంత్, ప్రసాద్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
జెమ్స్ ఆస్పత్రి జిల్లాకే తలమానికం
శ్రీకాకుళం రూరల్: రాగోలులోని జెమ్స్ ఆస్పత్రి జిల్లాకే తలమానికమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జెమ్స్లో యుగ్మా 25వ వార్షికో త్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాల్లో భాగంగా కొన్ని కేసులను జెమ్స్కు రిఫర్ చేయడం, వారు త్వరగా కోలుకోవ డం శుభపరిణామన్నారు. జెమ్స్లో వైద్యం బాగుందని, పేద ప్రజలకు మరిన్ని సేవలందివ్వాలని కోరారు. ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు జగపతిబాబు మాట్లాడుతూ.. అవయవ దానానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో తాను కిమ్స్లోనే చికిత్స చేసుకున్నానని వెల్లడించారు. ఆస్పత్రి వర్గాలు ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, ఎన్.ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
భారతమాలను త్వరగా పూర్తి చేయాలి
కొరాపుట్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విశాఖపట్నం–రాయపూర్ ఆరు అంచెల ఎకనామిక్ కారిడర్ భారతమాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి ఆదేశించారు. గురువారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని మిషన్ శక్తి సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటోరింగ్ కమిటీ (దిశ) సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఒడిశాలో నబరంగ్పూర్, కొరాపుట్ జిల్లాల మీదుగా రోడ్డు నిర్మాణం సాగుతోందని, పనులు పూర్తయితే ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. నబరంగ్పూర్–జయపూర్ మధ్య నిర్మాణం కానున్న రైల్వేలైన్ కోసం భూసేకరణలో సమస్యలు తొలగించాలన్నారు. జిల్లాలో 152 గ్రామాల్లో సెల్ఫోన్ సిగ్నల్స్ సంతృప్తికరంగా లేవన్నారు. సమావేశానికి గృహనీటి పారుదల, మేజర్ ఇరిగేషన్ విభాగాల అధికారులు హాజరుకాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కలెక్టర్ మహేశ్వర స్వయ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, రాజధానిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన జరుగుతుండడంల్లో ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. వారి తరఫున ప్రతినిధులు హాజరయ్యారు. -
కళింగ అతిథి నివాస్ ప్రారంభం
భువనేశ్వర్: స్థానిక రాజ్ భవన్ సముదాయంలో సరికొత్త భవంతి కళింగ అతిథి నివాస్ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రారంభించారు. ప్రముఖులు, ప్రత్యేక సందర్శకులకు ఈ అతిథి గృహం ఆతిథ్యం కల్పిస్తుంది. రాజ్భవన్ ప్రాంగణంలో ఉన్నత స్థాయి అధికారిక కార్యక్రమాలను మరింత హుందాగా నిర్వహించేందుకు ఈ గృహం సమర్ధవంతమైన సౌకర్యాలు కల్పిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. కళింగ అతిథి నివాస్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాణాల విభాగం కార్యదర్శి సంజయ్ సింగ్ భారత రాష్ట్రపతి, ఇతర విశిష్ట అతిథులకు ఈ భవంతి నిర్మాణ రూపకల్పన, ప్రాంగణ ప్రణాళిక ఇతరేతర కీలక నిర్మాణ శైలి క్రమం వివరించారు. ఈ భవనం సాంస్కృతిక సౌందర్యం మరియు ఆధునిక సౌకర్యాల మేళవింపుతో అత్యంత ఉన్నత కార్యదక్షతతో రూపుదిద్దుకుందని తెలిపారు. -
సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి
రాయగడ: మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుని, భావితరాలకు అందించాలని కొరాపుట్ ఎమ్మెల్యే, అవిభక్త కొరాపుట్ జిల్లా డొంబ్ సమాజం అధ్యక్షుడు రఘురాం మచ్చ అన్నారు . స్థానిక గొవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన డొంబ్సమాజ్ భేట్ ఘాట్–25 ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నేటి యువత సంస్కృతి, సంప్రదాయాలను పట్టించుకోవడం లేదన్నారు. గత మూడు సంవత్సరాలుగా రాయగడలో డొంబ్ సమాజం ఆవిర్భవించి సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఎస్సీ వర్గాలకు చెందిన వారికి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందన్నారు. వారికి ఎస్టీ వర్గాలకు కల్పించేలా సౌకర్యాలు కల్పించడంతోపాటు రిజర్వేషన్ల సౌకర్యాలు కల్పించేలా అంతా కలిసి కట్టుగా పోరాడాలన్నారు. రాయగడ డొంబ్ సమాజం అధ్యక్షుడు ధనీరాం నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవాల్లో ముఖ్యవక్తగా భువనేశ్వర్ ఉత్కల విశ్వవిద్యాలయం సెంటర్ ఆఫ్ అంబేడ్కర్ స్టడీస్కు చెందిన ప్రొఫెసర్ రవీంద్ర గరడియా, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సరొజ్ నాయక్, నువాపడ జిల్లా ఉపాధ్యక్షురాలు దీపిక కౌసల్య, తదితరులు పాల్గొన్నారు. డొంబ్ సమాజం జిల్లా సాధారణ కార్యదర్శి జనార్దన్ గరడ సంఘం వార్షిక నివేదికను చదివి వినిపించారు. పట్టణంలో భారీ ఎత్తున ఊరేగింపులో యువతీ, యువకులు సంప్రదాయ పద్ధతిలొ కావుళ్లతో కూరగాయలు, తదితరమైనవి పట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. -
ఉద్యోగాలకు 70 మంది ఎంపిక
ఎచ్చెర్ల: మండలంలో చిలకపాలేంలోని శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ బెంగలూరు సంస్థ నిర్వహించిన ఆన్లైన్ క్యాంపస్ డ్రైవ్లో 70 మంది విద్యార్థులు ఉద్యోగాల కు ఎంపికయ్యారు. ఇక్కడ ఆన్లైన్ డ్రైవ్ రెండు రోజులు పాటు నిర్వహించారు. దీనిలో 150 మంది విద్యార్థులు పాల్గొనగా.. 70 మంది సెలక్టయ్యారు. కళాశాల టీపీవో డాక్టర్ బి.ప్రసాదరావు, ఎం.శ్రీని వాసనాయుడు, రమాసాయి పర్యవేక్షణలో ఎంపిక లు జరిగాయి. ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులను కళాశాల యాజమాన్య సభ్యులు వీఎంఎం సాయి నాథ్ రెడ్డి, కె.దుర్గా శ్రీనివాస్, పి.దుర్గాప్రసాద్రాజు, డి.వెంకటరావు, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ వై.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ జి.టి.చంద్రశేఖర్ తదితరులు అభినందించారు. టెక్కలి: కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలస గ్రామం సమీపంలో గురువారం 104 వాహనానికి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. గ్రామంలో వైద్య పరీక్షల నిమిత్తం వాహనం వెళ్తుండగా, వంశధార కాలువ వద్ద ఏర్పడిన గొయ్యిలో వాహనం చక్రం ఇరుక్కుపోయింది. దీంతో సమీపంలో ఉన్న గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని ట్రాక్టర్ సాయంతో వాహనాన్ని బయటకు లాగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే వాహనంలో ఉన్న సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని గరుడభద్ర ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఉన్న గుంతలో గురువారం పాడి ఆవు ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. ఒక టవర్ కోసం ప్రైవేట్ వ్యక్తులు గుంతలు తవ్వి విడిచిపెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మర్రిపాడు గ్రామానికి చెందిన పాడిౖ రెతు గూడ భాస్కరరావు జీవనాధారమైన సుమారు రూ.90 వేలు విలువ గల పాడి ఆవు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ నాయకుడు గూడ ఈశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. రోడ్డు పక్కన తవ్వి వదిలేసిన గుంతలను వెంటనే పూడ్చాలని కోరారు. -
చరిత్రాత్మకం
భువనేశ్వర్: ఒడిశా శాసన సభలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చరిత్రాత్మకంగా నిలిచింది. భావోద్వేగం, అంతర్ దృష్టితో కూడిన ఆమె ప్రసంగం ప్రజా ప్రతినిధులకు మార్గదర్శకత్వాన్ని ప్రతిబింబించింది. ప్రసంగం ఆద్యంతం ఒడిశా శాసన సభతో ఆమె బంధాన్ని ప్రస్ఫుటించింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజా ప్రతినిధుల జీవన శైలి వినయంతో కూడుకుని ప్రజల పట్ల జవాబుదారీతనంలో ఉండాలని నిర్దేశించింది.ప్రసంగం సాగిందిలా..అందరి మధ్య ఉండటం సంతోషంగా, గౌరవంగా అనిపిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తాను భారతదేశం అంతటా అనేక శాసన సభలను ఉద్దేశించి ప్రసంగించానని, కానీ ఇక్కడ మాట్లాడటం చాలా ప్రత్యేకమైనది, వ్యక్తిగతమైనదని పేర్కొన్నారు. ఏ పదవిలో ఉన్నా, ఆ ఘనత ఈ సభకే చెందుతుందన్నారు. జగన్నాథుడి ఆశీస్సులు లేకుంటే తాను ఈ స్థాయికి చేరుకునే దానిని కాదన్నారు. ఈ సభలో ప్రయాణం ఓ మధుర స్మృతిగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా అనేక ప్రశ్నలు అడిగానని, ఇదే సభలో మంత్రిగా ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. గ్యాలరీలో మాజీ సహోద్యోగులను చూడడం సంతోషంగా ఉందన్నారు.ప్రజల చేతుల్లోనే సర్వం..శాసన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నైతిక విలువల్ని వివరించారు. ప్రజా ప్రతినిధుల విధిని నిర్ణయించేవారు ప్రజలేనని స్పష్టం చేశారు. అపరిమిత అధికారం వారి చేతుల్లోనే ఉంటుందన్నారు. పాలన ప్రజల చేతుల్లోనే ఉంటుందని, శాసన సభ్యులు వారి ప్రతినిధులు మాత్రమేనని పేర్కొన్నారు. వారు ఎన్నో ఆశలు నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారని, వారి కలలను నెరవేర్చడం మీ విధి అని స్పష్టం చేశారు. అడుగడుగున జవాబుదారీతనంతో మెలగాలన్నారు.పురోగతి జీవిత ప్రతిజ్ఞ..ఒడిశా అన్ని రకాల వనరులతో తులతూగుతోందని ముర్ము పేర్కొన్నారు. 2036 నాటికి సంపన్న ఒడిశాను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రతినిథులు ఒడిశా పురోగతిని జీవిత ప్రతిజ్ఞగా స్వీకరించాలన్నారు. వికసిత భారత్ దార్శనికతకు ఇది దోహదపడుతుందన్నారు. ఈ నేల యోధుడు చండ అశోకుడిని ధర్మ అశోకుడిగా మార్చిందన్నారు. డాక్టర్ హరే కృష్ణ మహాతాబ్, బిజూ పట్నాయక్ వంటి అనేక మంది రాష్ట్ర నిర్మాతలు ఉత్కళ తల్లి ఒడిలో ఎదిగి జాతికి వన్నె దిద్దారని గుర్తు చేశారు. నేడు సభని మహిళా స్పీకర్ నిర్వహించడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. -
నడిరోడ్డుపై నాగసర్పం!
కొరాపుట్: నడిరోడ్డుపై నాగుపాముని చూసిన జనం భయంతో హడిలిపోయారు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి కేంద్రంలోని సిమిలిగుడ రోడ్డులో ఐటీఐ కళాశాల ఎదుట గురువారం భారీ నాగుపాము పడగవిప్పి దర్శనం ఇచ్చింది. నిత్యం వాహనాల రద్దీ ఉండే ఈ మార్గంలో రోడ్డు మధ్యలో పాము ఉండడంతో ఇరుపక్కల వాహనాలు నిలిచిపోయాయి. సుమారు గంట తర్వాత పాము సమీప పొదలోనికి వెళ్లిపోవడంతో వాహనాలు ముందుకు కదిలాయి. కొట్పాడ్ సమితి మాజీ అధ్యక్షుడు మృతికి సంతాపం జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ప్రకాశ్ రథ్ బుధవారం మృతి చెందారు. భార్య, కుమారుడు ఉన్నారు. ప్రకాశ రథ్ మృతి పంట్ల కాంగ్రెస్ నాయకులు, కొట్పాడ్ బార్ అసోషియేషన్ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. రథో అందించిన సేవలను గుర్తు చేశారు. శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం పట్టణానికి చెందిన మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ, పీకే ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సిక్కోలు లఘు చిత్రోత్సవం – 2025 లోగోను శ్రీకాకుళం నెహ్రు యువకేంద్రం డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ ఉజ్వల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం యువత క్రియేటివిటీ టాలెంట్ను నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశమన్నారు. ఈ లోగో శ్రీకాకుళం సంస్కృతి సంప్రదాయా లు, కళలు ప్రతిబింబించే విధంగా చిత్రీకరించి న ఆర్ట్ డైరెక్టర్ మణిపాత్రుని నాగేశ్వరరావుని అభినందిస్తూ ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహ కులు ప్రసాద్, కుమారి, కీర్తి, అభిరామ్, సంజు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్స రం చదువుతున్న అంబటి గణేష్ రగ్బీ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికై న ట్లు కళాశాల ప్రిన్సిపాల్ టి.హేమసుందర్ తెలిపారు. ఇటీవల కర్నూలు జిల్లాలోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా మైదానంలో జరిగిన 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్లో అండర్–19 బాలుర విభాగంలో శ్రీకాకుళం జిల్లా తృతీయ స్థానం సాధించింది. ఈ జట్టులో పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులుఎ.గణేష్, బి.ప్రసా ద్, పి.వంశీ, ఎస్.అయ్యప్పలు ఉండ డం అభి నందనీయమని ప్రిన్సిపాల్ అన్నారు. వీరిలో గణేష్ జాతీయ పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. గురువారం విద్యార్థులను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. ఎచ్చెర్ల: ఖేల్ ఇండియా జాతీయ క్రీడా పోటీలు వెయిట్ లిప్టింగ్ విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ క్రీడాకారిణి గుజ్జల వర్షిత కాంస్య పతకం సాధించింది. ఈనెల 24వ తేదీ నుంచి రాజస్థాన్లోని బికనరీలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళా కేటగిరి 69 కేజీల విభాగంలో వర్షితకు గురువారం కాంస్యం వరించింది. ఈ విజయంపై వర్సిటీ వీసీ ఆచార్య కేఆర్ రజనీ, రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య, స్పోర్ట్స్ డీన్ డా.పి.రవికుమార్లు అభినందనలు తెలిపారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ధర్మశాలలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ప్రదేశ్లో జరిగిన అఖిల భారత మహిళల వెయిట్ లిప్టింగ్ పోటీల్లో కూడా బీఆర్ఏయూ తరుపున పాల్గొని రజత పతకం సాధించింది. -
పోషక ఆహార తోటలపై శిక్షణ
జయపురం: జయపురం పూల్బెడలో గల ఎం.ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ పౌండేషన్ కేంద్రం వారు పౌష్టిక ఆహార తోటలపై (న్యూట్రిషిన్ౖె గార్డెన్) రైతులకు శిక్షణ ఇస్తున్నారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 5 రకాల శిక్షణలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ శిబిరంలో జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి నుంచి 250 మంది రైతులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యానవన విభాగ డిప్యూటీ డైరెక్టర్ సుధామ్ చంద్ర బిశ్వాల్ ముఖ్యఅతిథి హాజరయ్యారు. ఎం.ఎస్ స్వామినాథన్ రిసర్చ్ ఫౌండేషన్న్ కేంద్ర కోఆర్డినేటర్ అక్షయ కుమార్ పండా పౌష్టికాహార తోటల శిక్షణ శిబిరం నిర్వహణ, ప్రధాన లక్ష్యాలను వివరించారు. కాయగూరలు, పండ్లు ప్రజలకు సమృద్ధిగా లభించాలంటే ప్రతీ రైతు పెరటి తోటలు పెంచాలని సూచించారు. ఇందుకు ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ పౌండేషన్ పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. సుధామ్ చంద్ర బిశ్వాల్ మాట్లాడుతూ.. ప్రపంచంలో సంప్రదాయ వ్యవసాయానికి కొరాపుట్ జిల్లా పేరుగాంచిందన్నారు. రసాయినక ఎరువులకు బదులు కంపోస్టు, సేంద్రియ ఎరువులు వినియోగించాలని సూచించారు. -
పచ్చని ఉద్దానంలో కార్గో చిచ్చు పెట్టొద్దు
వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దానాన్ని నమ్ముకొని ఏళ్ల తరబడి జీవనోపాధి సాగిస్తున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వాలు కార్గో చిచ్చు పెట్టి తమ జీవితాలను రోడ్డుపాలు చేయవద్దని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాటంలో భాగంగా ఈ నెల 21 నుంచి సాగుతున్న నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా చీపురపల్లి పంచాయతీ సంతోష్నగర్లో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 21న మహాధర్నా పేరున రైతులతో కలిసి పలాస ఆర్డీఓకి తమ గోడు వినిపించాలన్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. పాలకులు ఇదే పంథా కొనసాగిస్తే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు, బాధితులు పాల్గొన్నారు. సాగునీటి కాలువలో పడి వ్యక్తి మృతి శ్రీకాకుళం రూరల్: పెదపాడు పంచాయతీ ముద్దాడపేటకు చెందిన ముద్దాడ తారకేశ్వరరావు (40) బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు సాగునీటి కాలువలో పడి మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. -
బెంబేలెత్తిస్తున్న వాయు కాలుష్యం
● అత్యంత కాలుష్య నగరంగా అంగుల్భువనేశ్వర్: రాష్ట్రంలో వాయు నాణ్యత గణనీయంగా దిగజారి కాలుష్య తీవ్రతని తేటతెల్లం చేస్తుంది. ఈ పరిస్థితులు బెంబేలెత్తిస్తున్నాయి. వాయు కాలుష్యంతో తల్లడిల్లుతున్న ఢిల్లీ నగరం తరహాలో రాష్ట్రంలో వాయు నాణ్యత దిగజారుతున్నట్లు బుధవారం నాటి వాయు కాలుష్య నియంత్రణ బోర్డు గణాంకాలు సూచించాయి. ఈ గణాంకాల ప్రకారం అంగుల్ నగరంలో వాయు కాలుష్యం ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంది. ఈ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 339గా నమోదైనట్లు హకిమపడా ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (ఓఎస్పీసీబీ) స్టేషన్ ప్రకటించింది. ఇది భారత దేశంలో 6వ అత్యంత కాలుష్య నగరంగా మారింది. ఢిల్లీలో పలు చోట్ల నమోదైన స్థాయిలకు దగ్గరగా రాష్ట్రంలో కొన్ని చోట్ల వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ)ని నమోదు అయినట్లు ఓఎస్పీసీబీ తెలిపింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ 355 ఏక్యూఐ నమోదు చేయగా చాందిని చౌక్ 325 మరియు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం 328 ఏక్యూఐ నమోదు చేశాయి. రాష్ట్రంలో భువనేశ్వర్, కటక్ జంట నగరాల్లో అధిక వాయు కాలుష్య స్థాయిలు నమోదయ్యాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు జాతీయ వాయు నాణ్యత సూచిక ఏక్యూఐ ప్రకారం ఓఎస్పీసీబీ భువనేశ్వర్ లింగరాజ్ మందిర్ స్టేషన్ ఏక్యూఐ 328గా ప్రకటించింది. కటక్ నగరం సీడీఏ ఏరియా స్టేషన్ 324 ఏక్యూఐ నమోదు చేసింది. రాష్ట్రంలో ఇతర కాలుష్య నియంత్రణ బోర్డు స్టేషన్లు పటియా (భువనేశ్వర్) – 311, కాళిదాస్పూర్ (బాలాసోర్) – 249, తాల్చేర్ కోల్ఫీల్డ్స్ – 247 మరియు రౌర్కెలా ఫెర్టిలైజర్ టౌన్షిప్ – 99 ఏక్యూఐ ప్రకటించాయి. -
దట్టంగా పొగమంచు
పర్లాకిమిడి: జిల్లాలోని కాశీనగర్, గుమ్మా, పర్లాకిమిడి పట్టణంలో బుధవారం ఉదయం దట్టమైన మంచు కురవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రాయఘడ బ్లాక్ ఘాట్ సెక్షన్ మర్లబలోవాహనాలు లైట్ల సహయంతో నడిపారు. బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఇటువంటి వాతావరణం ఏర్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. మంగుళి మృతదేహం లభ్యం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితి కర్తన్పల్లి పంచాయతీ సమీపంలో ఉన్న శబరి నదీలో మంగళవారం ఉదయం మంగుళి భూమియా అనే మహిళ మునిగిపోయిన విషయం విధితమే. బుధవారం మధ్యహ్నం మృతదేహం లభ్యమైంది. నదీలో అగ్నిమాపక బృందం ఎంతో శ్రమపడి మంగుళి భూమియా (60) మృతదేహాన్ని బయటకుతీశారు. మాత్తిలి ఐఐసీ దీపాంజలి ప్రదాన్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహన్ని పరిశీలించారు. ప్రమాదశత్తు మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఐఐసీ తెలిపారు. -
నేడు శాసన సభలో రాష్ట్రపతి ప్రసంగం
● 4 అంచెల భద్రతా ఏర్పాట్లుభువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో సరికొత్త చరిత్రకు శ్రీకారం పడుతోంది. గురు వారం రాష్ట్ర శాసన సభను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. శాసన సభ చరిత్రలో ఇదే తొలి సారి కావడం విశేషం. ఇదే సభలో ఆమె సభ్యురాలిగా ప్రాతినిథ్యం వహించారు. మంత్రిగా బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. ఆ పాత జ్ఞాపకాల మననంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె శాసన సభ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించిన కార్యాలయం గదిని ప్రత్యేకంగా సందర్శించనున్నారు. మరో వైపు రాష్ట్రపతి సందర్శన పురస్కరించుకుని రాష్ట్ర శాసన సభ కొత్త ముస్తాబుతో స్వాగతించేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో శాసన సభ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ముస్తాబు రాష్ట్రపతి శాసన సభ భవన సందర్శన పురస్కరించుకుని సమగ్ర శాసన సభ సముదాయాన్ని అందంగా తీర్చిదిద్దారు. గదులను పునరుద్ధరించారు. వర్ధమాన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన రాజకీయ జీవితంలో గణనీయమైన భాగాన్ని శాసన సభలో ఎమ్మెల్యేగా, మంత్రిగా గడిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిగా సభలో ఆమె ప్రసంగించడం చిరస్మరణీయం, చారిత్రాత్మకం అవుతుందని శాసన సభ స్పీకర్ సురమా పాఢి అభివర్ణించారు. ఈ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్ర ఎంపీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరవుతారు. దేశాధినేత పర్యటన దృష్ట్యా నగరం అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. అవాంఛనీయ సంఘటనలు నివారణకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నాలుగు అంచెల భద్రతా కవచాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 31 వరకు జరిగే శీతాకాల సమావేశాల ముగింపు వరకు 33 ప్లాటూన్ల పోలీసులు శాసన సభ భవన సముదాయం భద్రత, రక్షణ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. విమానాశ్రయం నుండి శాసన సభ మార్గంలో అదనంగా 25 ప్లాటూన్లు పోలీసు దళాలు, యాంటీ టెర్రర్ స్క్వాడ్ను మోహరిస్తారని పోలీస్ కమిషనర్ ఎస్. దేవ్ దత్తా సింగ్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటన వేళలు గురు వారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుతారు. అత్యంత ప్రముఖ అతిథుల కోసం రూపొందించిన రాజ్ భవన్ సముదాయంలో కొత్తగా నిర్మించిన కళింగ అతిథి నివాస్ను ఆమె ప్రారంభించనున్నారు. ఆమె రాత్రికి అక్కడే బస చేస్తారు. సాయంత్రం 4.30 గంటల నుండి 5.30 గంటల వరకు శాసన సభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆమె గౌరవార్థం గవర్నర్ ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఆమె న్యూఢిల్లీకి బయలుదేరుతారు. శాసన సభతో రాష్ట్రపతి బంధం ప్రత్యేకం ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి హోదాలో రాష్ట్ర శాసన సభ సందర్శించి ప్రసంగించడం ఆమె వ్యక్తిగత జీవితంలో మరో మైలు రాయిగా నిలుస్తుంది. ఈ సభతో అమెకి ఉన్న బంధం అపురూపం. ఆమె 2000 నుండి 2009 వరకు ఎమ్మెల్యేగా ఈ సభలో తళుక్కుమన్నారు. ఈ నిడివిలో 2 సార్లు మంత్రిగా బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించారు. 2000 నుంచి 2002 వరకు వాణిజ్య, రవాణా, 2002 నుంచి 2004 వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖల మంత్రి పదవులు ఆమెని అలంకరించాయి. 11 నంబర్ గది జ్ఞాపకాల నిధి శాసన సభలో ప్రసంగం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2000 నుంచి 2004 వరకు మంత్రిగా పని చేసిన సమయంలో శాసన సభ సముదాయంలో ఆమె మాజీ కార్యాలయమైన 11వ నంబర్ ఛాంబరుని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆమె తొలి రాజకీయ ప్రయాణ జ్ఞాపకాల అవలోకనంతో ఈ ఛాంబర్ను తాజాగా అలంకరించారు. లోగడ 2022 నవంబర్ నెలలో భారత రాష్ట్రపతి మిజోరం అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. -
గుండిచా ప్రవేశ రుసుం రూ.10
భువనేశ్వర్: పూరీ శ్రీగుండిచా ఆలయం వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా తెరవనున్నారు. ఆలయ ప్రవేశానికి ఒక్కో భక్తుడు రూ.10 చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భక్తులు, 80 సంవత్సరాల పైబడిన, దివ్యాంగ భక్తులకు ప్రవేశం పూర్తిగా ఉచితం. భక్తులకు మొబైల్, షూ స్టాండ్లు, ఉచిత సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. గుండిచా ఆలయం నిత్యం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరవధికంగా తెరిచి ఉంటుంది. ఏడాదిలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. భక్తుల ప్రవేశం, నిష్క్రమణ సింహ ద్వారం గుండా ఉంటుంది. దివ్యాంగ భక్తుల కోసం ర్యాంప్ వ్యవస్థ అమలులో ఉంటుందని శ్రీమందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాడీ తెలిపారు. -
మత్స్యకారుల్లో అలజడి
● తుఫాన్ హెచ్చరికలతో ఆందోళన ● ఈ ఏడాది వృథాగా మారిన 56 రోజులు ● ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆకలి కేకలుఇచ్ఛాపురం రూరల్: వరుస తుఫాన్లు గంగపుత్రులను వణికిస్తున్నాయి. రోజుల తరబడి వేటకు వెళ్లలేని దుస్థితిని కల్పిస్తున్నాయి. కుటుంబ పోషణను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. ప్రభుత్వం సైతం పట్టించుకోకపోవడంతో మత్స్యకారులు పస్తులతో కాలం గడపాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఈ ఏడాది దాదాపు ఐదు సార్లు అల్పపీడనం, వాయుగుండాలు, తుఫాన్లు రావడంతో జిల్లాలోని మత్స్యకారులు దాదాపు 56 రోజుల పాటు వేటకు దూరమయ్యారు. తాజాగా మరో తుఫాను ముంచుకొస్తుందంటూ వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు మళ్లీ వేటకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మత్స్యసంపద అంతంత మాత్రమే. తర్వాత ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల సంతోనోత్పత్తి సమయం కావడంతో 61 రోజుల పాటు వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించింది. దీంతో దాదాపు ఆరు నెలలు పాటు మత్స్యకారులకు అరకొరగా వేట సాగింది. ఇక జూన్ నుంచి నవంబర్ వరకు వరుస తుఫాన్లు రావడంతో మత్స్యకారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ధరలు పతనం.. కొన్ని నెలలుగా సముద్రంలో చేపల వేట సజావుగా సాగక అల్లాడిపోతున్న మత్స్యకారులకు కార్తీక మాసం గుదిబండగా మారింది. జిల్లాలో దొరికే మత్స్య సంపదను అధిక ధరలకు కొనుగోలు చేసే ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల వ్యాపారులు కార్తీక మాసం పేరుతో ముఖం చాటేశారు. దీంతో కిలో రూ.120 నుంచి రూ.180 పలికే చేపలను రూ.50, రూ.60లకు అమ్ముకోవాల్సి వచ్చింది. కాస్తో కూస్తో వలకు చేరిన కవ్వళ్లతో వ్యాపారం చేద్దామనుకున్న సమయంలో మోంథా తుఫాన్ పుణ్యమాని సుమారు రూ.30లక్షలు ఎండు చేపలు వర్షార్పణం అయ్యాయి. నవంబర్లో వేల రూపాయలు ఆదాయం కల్పించే ఖరీదైన కోనేం చేపలు కూడా వలకు పడటం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ అల్లకల్లోలం.. తాజాగా తుఫాన్ హెచ్చరికతో మత్స్యకారులు ఆందోళనకు గురౌతున్నారు. బోట్లను ఒడ్డుకు చేర్చుకోవడం, వలలను సంరక్షించుకోవడం చేస్తున్నారు. ఇప్పటికే మోంఽథా తుఫాన్తో చితికిపోయిన మత్స్యకారులు మరో హెచ్చరికతో బెంబేలెత్తిపోతున్నారు. కనీసం రెండు నాటికల్ మైళ్ల దూరం కూడా వెళ్లలేక వెనుదిరుగుతున్నారు. ఈ ఏడాదిలో సముద్రంపై వలలను వదులుతూ వాటిని మళ్లీ తిరిగి లాక్కుంటూ రోజంతా శ్రమ పడుతూ రోజుకి రూ.4వేలు నష్టపోతున్నామే కానీ, తగిన ఆదాయం రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. గతంలో ఇలా లేదు.. మునుపెన్నడూ ఈ గతి చూడలేదు. వలకు పదేసి కోనేములు పడే సీజన్ ఇది. ఇప్పుడు ఒక్క కోనేం చేప కూడా పడటం నేదు. కవ్వళ్లు మాత్రం దొరుకుతున్నాయి. దీంతో ఉసూరుమంటూ ఒడ్డుకు తిరిగి వచ్చేస్తున్నారు. నాలుగైదు నెలలుగా గాలులు, వర్షాలతో ఇబ్బందులు పడుతున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే జీవనం కష్టమే. – మాగుపిల్లి మోహనరావు, మత్స్యకారుడు, డొంకూరు ఏడాదిగా అవస్థలే.. వరుస విపత్తులతో సముద్రంలో వేట సజావుగా సాగడం లేదు. ఈ ఏడాదిలో చాలా సార్లు తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు రావడంతో వేట లేక పస్తులుండాల్సి వస్తోంది. ఒకవేళ సముద్రంలోకి వెళ్లినా బోటు ఒక్కచోట ఆగకపోవడంతో చేపలు వలకు చిక్కడం లేదు. చివరకు పర(ఉప్పుటేరు)లో దొరికే చూపలతో పొట్టపోసుకుంటున్నాం. మొన్నటి వరకు కార్తీక మాసం అని చేపలు బేరం తగ్గిపోగా, ఇప్పుడు అస్సలు చేపలు దొరకడమే గగనంగా మారింది. ప్రభుత్వం ఎలాంటి సాయం కూడా చేయడం లేదు. – బుడ్డ జగ్గయ్య, మత్స్యకారుడు, డొంకూరు -
శ్రీ గుండిచా ఆలయం ప్రవేశానికి సర్వం సిద్ధం
భువనేశ్వర్: పూరీ సందర్శించే యాత్రికులు, భక్తులకు శుభ వార్త. గత ఆరేళ్లుగా మూసివేసిన పూరీలోని శ్రీ గుండిచా ఆలయం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి భక్తుల కోసం తలుపులు తెరిచేందుకు సర్వం సిద్ధం చేశారు. శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (ఎస్జేటీఏ) డిప్యూటీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్, పూరీ జిల్లా కలెక్టర్ దిబ్య జ్యోతి పరిడా బుధ వారం ఈ విషయాన్ని ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో గుండిచా ఆలయంలోకి భక్తుల ప్రవేశంపై ఆంక్షలు విధించి మూత వేశారు. వెంబడి భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎస్ఐ) ఆలయ మరమ్మతు, పునరుద్ధరణ పనులు ప్రారంభించడంతో ఈ శ్రీ గుండిచా ఆలయం మూత వ్యవధి నిరవధికంగా కొనసాగింది. కోవిడ్ తొలగిన తర్వాత 2023లో ఆలయం లోపల మూల స్తంభాలు, దూలాలు, నేలపై ఖొండలైట్ రాతి పలకల అమరిక తదితర పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ పనులు అన్నీ పూర్తి కావడంతో శ్రీ గుండిచా ఆలయ నిర్వహణను ఇప్పుడు ఎస్జేటీఏ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది. ఆలయ తలుపులు తెరిచి భక్తులకు సజావుగా ఏర్పాట్లు జరిగేలా సన్నాహాలు చేసినట్లు దిబ్య జ్యోతి పరిడా తెలిపారు. 11 మేకలు, గొర్రెలు మృతి పర్లాకిమిడి: కాశీనగర్ సమితి ఖరడ పంచాయతీ నీలకంఠాపురం గ్రామం వద్ద బుధవారం వేకువజామున 3.30 లకు ఒక ట్రాక్టరు మేకలు, గొర్రెల మందపై ఎక్కించుకుని వెళ్లిపోగా 9 మేకలు మృత్యువాత పడగా, రెండు గొర్రెలకు గాయాలయ్యాయి. ఈ మేరకు నీలకంఠాపురం గ్రామానికి చెందిన యాదవుడు పిట్ట కృష్ణ తన కుల సంఘం నాయకులకు తెలియజేశాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ యాదవకుల సంఘం అధ్యక్షులు అంకబోయిన కులవర్ధనరావు రాణిపేటవద్ద కాపు కాసి ట్రాక్టరును పట్టుకున్నారు. ట్రాక్టరు యజమాని నుంచి మేకలు చనిపోయినందుకు రూ.35 వేలు నష్టపరిహారంగా వసూలు చేసి బాధితుడు పిట్ట కృష్ణకు అందజేశారు. బుధవారం కాశీనగర్ బ్లాక్లో దట్టమైన పోగమంచు ఆవరించిన కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్టు ట్రాక్టరు డ్రైవర్ తెలిపాడు. కుంద్రాలో ఎలుగుబంటి హల్చల్ జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్ర గ్రామంలో ఎలుగుబంట్లు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామంలో దాదాపు నాలుగు ఎలుగుబంట్లు తిరుగుతున్నాయని ప్రజలు వెల్లడిస్తున్నారు. కుంధ్రా సమితి కార్యాలయ ప్రాంతం, అటవీ కార్యాలయ ప్రాంతంలో, హనుమాన్ మందిర్, జగన్నాథ్ మందిరం, కాలియకద, నువాగుడ, సాగరగుడ తదితర ప్రాంతాలో సంచరిస్తున్నాయని వెల్లడించారు. గత మార్చి నెలలో కుంద్ర పంచాయతీ దొరాగుడ గ్రామంలో లచ్చమన్ హరిజన్(65)అనే వ్యక్తి ఎలుగుబంటి దాడిలో మరణించాడని, ఎలుగు సంచారం వల్ల ఆందోళన నెలకొందని స్థానికులు తెలిపారు. అడవుల్లో ఆహారం లభించకపోవడం వల్ల ఊరిలోకి వస్తున్నాయని చెబుతున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని లక్ష్మీకాంత పట్నాయిక్,బిరజ పండ,బొరిడి బాబుల్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. న్యూట్రిషన్ గార్డెన్లపై శిక్షణ జయపురం: స్థానిక ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ గార్డెన్లపై రైతులకు శిక్షణ శిబిరం బుధవారం నిర్వహించారు. న్యూట్రిషన్ గార్డెన్ పంటలపై 5 రకాల శిక్షణలు రైతులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా ఉద్యానవన జాయింట్ డైరెక్టర్ సుభాష్ చంద్ర బిశ్వాల్, వ్యవసాయ కో–ఆర్డినేటర్ అక్షయ కుమార్ పండ తదితరులు పాల్గొన్నారు. -
కిసాన్ మోర్చా ఆందోళన
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో పలు సమస్యలపై కిసాన్ మోర్చా సభ్యులు బుధవారం ఆందోళన చేపట్టారు. గుణుపూర్లోని కొత్త బస్టాండ్ నుంచి కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సమస్యలకు సంబంధించి సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనిల్కు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏకపక్ష కార్మిక నియమావళిని నిరసిస్తూ చేపట్టిన ఈ ఆందోళనలో సీపీఐ (ఎంఎల్ ) జిల్లా అధ్యక్షుడు తిరుపతి గొమంగో పాల్గొని తన మద్దతును ప్రకటించారు. ప్రతీ కార్మికుడు పది గంటల కాలం పనులు చేస్తున్నాడని, దానిని రద్దు చేసి 8 గంటల కార్మిక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులు పండిస్తున్న అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. ఆందోళనలో కిషాన్ మోర్చ నాయకులు నిరంజన్ నిమల, సంభార్ సబర్, బుద్ధదేవ్ సబర్, తులసీ నిమల, రమేష్ గంట, ముతుకా త్రిపాఠి, పార్వతీ సబర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓఎంసీ ఆదర్శ పాఠశాల గదులకు విముక్తి
జయపురం: జయపురం సమితి ఉమ్మిరి పంచాయతీ ఫూల్బెడలోగల మైనింగ్ కార్పొరేషన్ ఆదర్శ పాఠశాల భవనం గదులు కాంట్రాక్టర్ కబ్జా నుంచి విముక్తి పొందాయి. రెండేళ్లుగా కాంట్రాక్టర్ కబంధ హస్తాల్లో ఉన్న మైనింగ్ కార్పొరేషన్ ఆదర్శ పాఠశాల క్లాస్ రూమ్ తాళాలను అధికారులు ఎట్టకేలకు తీశారు. ఈ పాఠశాలలో నిర్మించిన 3 తరగతుల గదులు రెండేళ్లుగా కాంట్రాక్టర్ కబ్జాలోనే ఉన్నాయని ఫిర్యాదు అందడంతో జయపురం సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి వెంటనే ఆ క్లాసు రూమ్ల తాళాలు తీసి స్వాధీన పరచుకోవాలని అధికారులకు మంగళవారం ఆదేశం జారీ చేశారు. ఆ మేరకు జయపురం తహసీల్దార్ సబ్యసాచి జెన, జయపురం సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ నేతృత్వంలో పోలీసుల సహకారంతో మైనింగ్ కార్పొరేషన్, పాఠశాల కంట్రాక్టర్ కబ్జాలో ఉన్న మూడు రూమ్ల తాళాలు విరిచి స్వాధీన పరచుకున్నారు. అధికారుల వివరణ ప్రకారం 2023 లో ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ ద్వారా అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఖనిజ తవ్వకాల ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించగా వారి పిల్లలు చదువుకొనేందుకు పునరావాస నిబంధనల ప్రకారం ఒడిశా మైనింగ్ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జయపురం సమితి ఉమ్మిరి గ్రామ పంచాయతీ ఫూల్బెడ గ్రామంలో 2023 లోనే మైనింగ్ ఆదర్శ విద్యాలయ భవన నిర్మాణం పూర్తయ్యింది. 2023 జూన్ నెలలో పాఠశాల ప్రారంభం కానుందని వెంటనే ఆ పాఠశాల భవనాలను అప్ప జెప్పాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అయితే ఆ కాంట్రాక్టర్ భవనాలను అప్పజెప్పలేదు. దీంతో కొరాపుట్ కలెక్టర్, ఎస్పీ కలుగజేసుకుని ఉభయ వర్గాల మధ్య రాజీ కుదిర్చి భవనాలను ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ వారికి అప్పగించారు. అయితే కాంట్రాక్టర్ మూడు గదులకు తాళాలు వేసి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అయితే గత రెండేళ్లలో 9, 10 వ తరగతులలో విద్యార్థులు చేరటంతో పాఠశాలలో తరగతి గదుల కొరత నెలకొంది. కాంట్రాక్టర్కు మైనింగ్ కార్పొరేషన్ అధికారులు మూడు గదులు అప్పజెప్పాలని లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు గత అక్టోబర్ 31 వ తేదీన మైనింగ్ కార్పొరేషన్ ప్రాంతీయ డైరెక్టర్ జయపురం సబ్ కలెక్టర్ కుమారీ శొశ్యా రెడ్డికి ఆ విషయం లిఖిత పూర్వకంగా ఆరోపించారు. ఆరోపణ ఆధారంగా సబ్ కలెక్టర్ తహసీల్దార్, జయపురం సదర్ పోలీసు అధికారిలకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయగా అధికారులు మూడు రూంల తాళాలు తెరచి స్వాదీనపరచుకున్నారు. -
రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి
పర్లాకిమిడి: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ధాన్యం, గోధుమల మద్దతు ధర కోసం 380 రోజులు పోరాడి ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని ఆల్ ఇండియా కిసాన్ మోర్చా సంఘ్, కృషక్ సంఘటన్ మంచ్, గజపతి జిల్లా రైతు కూలీ రైతు సంఘం సభ్యులు నిరసన తెలిపారు. ఈ మేరకు స్థానిక కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా దండపాని రైయితో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలని, వ్యవసాయ కూలీలకు కనీస దినసరి కూలీ మంజూరు చేయాలని కోరారు. ఉపాధి కూలీలకు ఏడాదికి 200 రోజుల పని దినాలు కల్పించి, వారికి దినసరి కూలీ రూ.700ల మంజూరు చేయాలని, జంగిల్, భూపట్టాలు, వ్యవసాయ కూలీలకు ఇవ్వాలని విన్నవించారు. పెండింగ్లో ఉన్న ఇళ్ల పట్టాలు, నివాస గృహాలు మంజూరు చేయాలన్నారు. అనంతరం ఏడీఎం(రెవెన్యూ) మునీంద్ర హనగకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకుడు కేదార్ సొబోరో, సర్వ భారతీయ కిసాన్ మోర్చా నాయకుడు ముచ్చి బంగారు, జిల్లా రైతు కూలీ సంఘం సాధారణ కార్యదర్శి రోక్కం లోకనాథం, గజపతి మోటార్ వర్కర్స్ సంఘం నాయకులు నర్సింగ మాలబిశోయి, ఏఐఎఫ్బీ జిల్లా అధ్యక్షుడు పైల మురళీకృష్ణ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస బెహరా తదితరులు పాల్గొన్నారు. -
మన కర్తవ్యం
రాజ్యాంగ విలువల నిబద్ధత.. భువనేశ్వర్: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ స్ఫూర్తి మార్గనిర్దేశంతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి పిలుపునిచ్చారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం రాజ్యాంగ విలువల పట్ల సమష్టి నిబద్ధతను కర్తవ్య దీక్షగా స్వీకరించి ముందుకు సాగుదామని ప్రోత్సహించారు. రాజ్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన నిరాడంబర కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి రాజ్యాంగ విలువల నిబద్ధతతో కొనసాగుతామని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకు శాసన సభ స్పీకర్ సురమా పాఢి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఇతర సీనియర్ మంత్రులు, శాసన సభ్యులు శాసన సభ భవనంలో రాజ్యాంగ ప్రతిజ్ఞను పఠించారు. తూర్పు కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం రైల్వే సదన్ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ఆధ్వర్యంలో జోనల్ స్థాయి, మండల రైల్వే అధికారులు (డీఆర్ఎం) ఆధ్వర్యంలో మండల స్థాయి భారత రాజ్యాంగ దినత్సోవం కార్యక్రమం నిర్వహించారు. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని మండలాలు, రైల్వే స్టేషన్లలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. -
అఖిలపక్ష సమావేశం
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ శీతాకాలం సమావేశాలు ఆరంభం పురస్కరించుకుని ఒక రోజు ముందుగా బుధవారం అఖిల పక్ష సమావేశం జరిగింది. స్పీకర్ సురమా పాఢి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్, శాసన సభ వ్యవహారాల మంత్రి ముఖేష్ మహాలింగ్, న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్, ప్రభుత్వ చీఫ్ విప్ సరోజ్ ప్రధాన్, ప్రతిపక్ష చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్, కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు రామచంద్ర కదమ్ వంటి కీలక నాయకులు హాజరయ్యారు. అధికార, విపక్షాలకు సభలో సమాన సమయం కేటాయించాలని స్పీకర్కు అభ్యర్థించారు. శీతా కాలం సమావేశాలు ఆద్యంతం సజావుగా, క్రమశిక్షణతో కొనసాగాలని స్పీకరు అఖిల పక్ష సభ్యులను అభ్యర్థించారు. ప్రధానంగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంపై బాధ్యతాయుతంగా మెసలుకోవాలని హితవు పలికారు. సమావేశాల తొలి రోజున సభలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. రెండో రోజు నవంబర్ 28న 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి అనుబంధ వ్యయ ప్రకటన (బడ్జెట్)ను సభలో ప్రవేశపెట్టనున్నారు. -
బాల్య వివాహాలు నిర్మూలించాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాను బాల్య వివాహాల విముక్తి జిల్లాగా 2013లో అప్పటి కలెక్టర్ ప్రకటించారని, అయితే అడపాదడపా బాల్య వివాహాలు జరుగుతున్న ఘటనలు బయటకు వస్తున్నాయని జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి అరుణ్కుమార్ త్రిపాఠి అన్నారు. స్థానిక సమగ్ర గిరిజనాభివృద్ధి శాఖ కాన్ఫరెన్సు హాలులో బుధవారం జిల్లాస్థాయి స్టేక్ హోల్డర్స్ (సహాయక కర్మి) బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. బాల్య వివాహాలు అరికట్టడానికి అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఎన్జీవో సంఘాలు వాట్సాప్ గ్రూపుగా ఏర్పడి పని చేయాలని సూచించారు. జిల్లాలో ఎన్జీవో సంఘాల సహకారంతో బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రయత్నించాలని మహిళా గ్రూపులను కోరారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సరళ పాత్రో, సీడబ్ల్యూసీ చైర్మన్ అశ్వినీకుమార్ మహాపాత్రో, ఆదర్శ పోలీసుస్టేషన్ ఎస్ఐ గిరిజా కుమారి పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు. -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వినూత్న నిరసన
మల్కన్గిరి: జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మంగళవారం వినూత్నంగా శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పోస్టుకార్డ్ల ద్వారా ప్రధాని మరియు రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా పంపించారు. ఏన్నో సంవత్సరాలుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు తమను గుర్తించడం లేదని వాపోయారు. ఇటీవల దాదాపు 65 శాతం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారని వాపోయారు. గత మార్చి నెలలో తమ న్యాయమైన డిమాండ్లతో భువనేశ్వర్లో ధర్నా చేసినప్పుడు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి ప్రమోద్ బాజింగ, శ్యామ్ సాగరియా, గౌతమ్ దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సేవలు అంతంత మాత్రమే
● 329 వైద్యుల పోస్టులు ఖాళీ ● జెడ్పీ సమీక్ష సమావేశంలో ప్రజాప్రతినిధుల అసంతృప్తిరాయగడ: ఆదివాసీ, హరిజన ప్రాంతమైన రాయగడ జిల్లాలో వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ప్రజా ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన వైద్య సేవలు అందక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశంలో కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వైద్య సేవలు గురించి చర్చించారు. జిల్లా కేంద్రాస్పత్రిలో వైద్య సేవలు దయనీయంగా ఉన్నాయని ఎంపీ సప్తగిరి అన్నారు. సుదూర గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతోమంది ఆదివాసీలు, నిరుపేదలు చికిత్స కోసం వస్తుంటే వారికి మెరుగైన సేవలు అందక, పొరుగు రాష్ట్రాలకు చికిత్స కోసం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ బి.సరోజిని దేవి మాట్లాడుతూ జిల్లాలోని వివిధ వైద్య కేంద్రాల్లో 329 మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వైద్యులు పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఇదిలా ఉండగా జిల్లాలోని డిమికిరిగుడలో పీహెచ్సీ ఏర్పాటు ఎంతో అవసరమని జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సంతోష్ కుమార్ సున్న ప్రతిపాదించారు. వేయి కోట్లతో అభివృద్ధి పనులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బిజు సేతు యోజన పథకంలో భాగంగా 2022 నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1,089 కోట్లతో వంతెనల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు వివరించారు. దీనిలో భాగంగా మరో 4 కొత్త వంతెనల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవ్వనున్నాయని వెల్లడించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సడ్ యోజన పథకంలో భాగంగా 17 రోడ్ల విస్తరణ పనుల్లో ఇప్పటికే 9 పూర్తయ్యాయని వివరించారు. జిల్లా మినరల్ ఫండ్లో భాగంగా ప్రధానమంత్రి సడక్ యోజన, ప్రధానమంత్రి జనమన్్ యోజన పథకాలకు సంబంధించి సమావేశంలో చర్చించారు. డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతుంది విద్యా విధానంపై సమీక్షించిన ప్రజాప్రతినిధులు జిల్లాలో విద్యావిధానం కూడా సంతృప్తికరంగా లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. డ్రాపౌట్లను నివారించాలని సూచించారు. విద్యా విధానం కొత్త పుంతలు తొక్కుతుందని ప్రభుత్వం ఒకవైపు ప్రకటిస్తున్నా అటువంటిది ఈ జిల్లాలో ఏమాత్రం కనిపించడం లేదని ఎంపీ సప్తగిరి అన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి
● గవర్నర్ హరిబాబు కంభంపాటి పిలుపుభువనేశ్వర్: రాష్ట్రంలోని గిరిజన విద్యార్థుల్లో సాంకేతికత ఆధారిత అభ్యాసం వ్యవస్థ ప్రోత్సాహానికి భారత స్టేట్ బ్యాంక్ వంటి సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. రాజ్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 7 గిరిజన ప్రాబల్య జిల్లాలు మల్కన్గిరి, కందమాల్, కొరాపుట్, సుందర్గఢ్, మయూర్భంజ్, రాయగడ, నవరంగ్పూర్ ప్రాంతాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు జిల్లా అధికారులతో గవర్నర్ మంగళవారం సంభాషించారు. ఈ సందర్భంగా డిజిటల్ తరగతి గదుల్లో బోధన, అభ్యాసం, సాధనపై విద్యార్థులు ఉత్సాహం ప్రదర్శించారు. స్మార్ట్ తరగతి గదులు విద్యార్థుల్లో ఉత్సుకతను ప్రేరేపించి అభ్యాస సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయన్నారు. స్మార్ట్ ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఏర్పాటు, బోధన మరియు అభ్యాస ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల సాధ్యం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. భారత స్టేట్ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) చొరవ కింద 7 గిరిజన ప్రాబల్య జిల్లాల్లో 46 ఎస్టీ, ఎస్సీ అభివృద్ధి విభాగం పాఠశాలల్లో స్మార్ట్ ఇంటరాక్టివ్ ప్యానెల్లను ఏర్పాటు చేశారు. ఈ చొరవ ఆశాజనకమైన ఫలితాలు సాధించింది. ఈ ప్రేరణతో సాంకేతికత ఆధారిత అభ్యాసం వ్యవస్థ ప్రోత్సాహానికి మరిన్ని సంస్థలు ముందుకు వచ్చేలా అనుబంధ విభాగాలు చర్యలు చేపట్టాలని గవర్నర్ తెలిపారు. -
ట్యాంకర్ను ఢీకొన్న బొలేరో
భువనేశ్వర్: కటక్ టంగి ప్రాంతం 16వ నంబర్ జాతీయ రహదారి రాజొకొనా చౌరస్తా సమీపంలో మంగళవారం వేకువజామున బొలేరో అదుపు తప్పి ట్యాంకర్ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కటక్ వైపు వెళ్తుండగా అదుపుతప్పిన బొలేరో డివైడర్ను దాటి ఎదురుగా ఉన్న రోడ్డులో నిలబడి ఉన్న ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, మరో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరిని కటక్లోని ఎస్సీబీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. -
డుకుం పంచాయతీలోనే ఉంటాం
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి పరిధి జియారి గ్రామాన్ని పంచాయతీగా గుర్తించాలని కొంతమంది గ్రామస్తులు బీడీవోకు ఇటీవల వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. అయితే డకుం పంచాయతీ పరిధిలోని పిపిలి, బుకృమస్కా, హురాలు, రూపాపొదొరొ గ్రామస్తులు అందుకు వ్యతిరేకించారు. ప్రస్తుతం ఉన్న డుకుం పంచాయతీ పరిధిలోనే తామంతా ఉంటామని, వేరే పంచాయతీ ఏర్పాటు ఏమాత్రం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కచాపాకు గ్రామంలో ఆయా గ్రామస్తులు సోమవారం రాత్రి సమావేశమయ్యారు. పంచాయతీని విభజించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. కొంతమంది స్వార్థపరులు జియారి గ్రామాన్ని పంచాయతీగా గుర్తించాలని పట్టుబడుతున్నారని, వారంతా స్వప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ జియారి గ్రామాన్ని పంచాయతీగా గుర్తిస్తే తామంతా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
నేటి నుంచి ఇప్పిలి 102వ జయంతి వేడుకలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ వంశపారంపర్య అర్చక ప్రధానులు దివంగత ఇప్పిలి జోగారావు 102వ జయంతి వేడుకలు ఈ నెల 26 నుంచి 29 వరకు శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్లో జరగనున్నాయి. రెండేళ్ల క్రితం జోగారావు గారి శతజయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించిన ఇప్పిలి కుటుంబసభ్యులు.. కుమారుడు సూర్యదేవాలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలోని శ్రీసుమిత్ర కళాసమితి, ఆరామ ద్రావిడ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ● 26న సాయంత్రం 5.30 గంటలకు కేరళకు చెందిన విష్ణుదేవ్ నంబూద్రిచే సుస్వర గానామృతం, 27న కేరళ సోదరులుగా పేరొందిన ఆర్.కన్నన్, ఆర్.ఆనంద్లచే నాదస్వర విన్యాసం, 28న వీణావిద్వాంసులు ఫణి నారాయణచే తంత్రీనాద వినోదం, 29న చైన్నె కళాకారిణి సుచిత్ర బాలసుబ్రమణియంచే సుచిత్రా గాత్ర సౌరభం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటల కార్యక్రమాలు మొదలవుతాయని నిర్వాహకులు ప్రకటించారు. 8 నెలల గర్భిణి మృతి కంచిలి: ఎనిమిది నెలల గర్భిణి మృతిచెందిన ఘటన కంచిలి మండలం అర్జునాపురంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఇచ్ఛాపురం మండలం మండపల్లి గ్రామానికి చెందిన కాయ ధనలక్ష్మి(26) ప్రసవం కోసం కంచిలి మండలం అర్జునాపురంలోని కన్నవారింటికి వచ్చింది. సోమవారం రాత్రి పురిటి నొప్పులు తాళలేక మృతిచెందింది. ఫిట్స్ రావడం వల్లే మృతిచెందినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, ధనలక్ష్మికి ఇచ్ఛాపురం మండపల్లి గ్రామానికి చెందిన కాయ శివతో ఈ ఏడాది మార్చి 7న వివాహమైంది. ఇంతలోనే మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అధికారుల తీరు సరికాదు నరసన్నపేట : బొరిగివలసకు మంగళవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ వచ్చినా ప్రజాప్రతినిధులకు అధికారులు సమాచారం ఇవ్వకపోవడంపై సర్పంచ్ బగ్గు విష్ణమ్మ, ఎంపీటీసీ జగదీశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. జేసీ వస్తారనే సమాచారం గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉండగా, అధికార పార్టీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి రైతన్నా మీ కోసం కార్యక్రమం నిర్వహించడాన్ని తప్పుబట్టారు. సచివాలయ సిబ్బంది పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తున్నారని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. సర్పంచ్, ఎంపీటీసీని అవమానించినట్లుగా భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం ముమ్మరంగా వస్తున్నా.. ధాన్యం రావడం లేదని, అందుకే కొనుగోళ్లు ప్రారంభించలేదని జేసీకి సచివాలయ సిబ్బంది చెప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయంలో చోరీ పలాస: తర్లాకోట గ్రామంలోని కాటమ్మతల్లి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఆలయం తలుపులు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హుండీలో కానుకలు పట్టుకుపోయారు. ఆలయ పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొట్టకూటి కోసం వెళ్తే ప్రాణంపోయింది ● అబుదాబిలో దొంకూరు యువకుడు మృతి ఇచ్ఛాపురం రూరల్: తీర ప్రాంతానికి చెందిన మత్స్యకార యువకుడు అబుదాబిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామానికి చెందిన బడే భాస్కరరావు(22) ఏడాదిన్నర క్రితం జీవనోపాధి కోసం వెల్డింగ్ హెల్పర్గా వెళ్లాడు. అక్కడే పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భాస్కరరావు ఆత్మహత్య చేసుకున్నాడంటూ కంపెనీ ఎండీ మంగళవారం సాయంత్రం ఫోన్లో సమాచారం అందివ్వడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఒక్కగానొక్క కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ తండ్రి రామ్మూర్తి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదని, ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని తల్లి భాగ్యశ్రీ విలపిస్తోంది. అబుదాబి పోలీసులు మరణాన్ని నమోదు చేసినప్పటికీ కారణాలు ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు కుటుంబ సభ్యులు స్థానిక రాజకీయ నాయకులు, అధికారుల సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నారు. -
కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మాహత్యాయత్నం
మల్కన్గిరి: జిల్లా కేంద్రంలో తమిళ క్యాంప్ కూడలి వద్ద నివాసముంటున్న మాధురి కచిం అనే మహిళ భర్తతో గొడవ పడి కోపంతో ఇంట్లో కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన మహిళ భర్త నరేంద్ర కచం ఇరుగుపొరుగు వారి సాయంతో మంటలను ఆర్పారు. అనంతరం గాయాలపాలైన ఆమెను అంబులెన్స్ ద్వారా మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అందజేస్తున్నారు. మంటలు ఆర్పే సమయంలో భర్త నరేంద్ర రెండు చేతులు కూడా కాలిపోయాయి. మాధురి శరీరం 80 శాతం కాలిపోయింది. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. -
నూతన విద్యార్థులకు స్వాగతం
భువనేశ్వర్: స్థానిక హైటెక్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ 21వ కొత్త బ్యాచ్ వైద్య విద్యార్థులకు అధికార వర్గం ఆప్యాయంగా స్వాగతించింది. ఈ సందర్భంగా నిర్వహించిన నిరాడంబర కార్యక్రమంలో హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని ప్రశంసించారు. కొత్త విద్యార్థుల స్వాగత కార్యక్రమానికి సీనియర్ పోలీస్ అధికారి, ఒడిశా అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాంశు కుమార్ షడంగి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తమ చదువులపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. -
విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలి
రాయగడ: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రయత్నించాలని గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో అన్నారు. గుణుపూర్లోని ఏకలవ్య ఆదర్శ విద్యాలయంలో మంగళవారం జరిగిన సర్గీఫూల్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు. ఉత్సవాల్లో భాగంగా విద్యార్థుల మధ్య వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఉత్సవాల్లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమారావ్, పద్మపూర్ సమితి అధ్యక్షుడు మణిమాల సబర్, ఏకలవ్య ఆదర్శ విద్యాలయం హెచ్ఎం అనంత త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
ఒకటో తరగతికి 8 పేజీలా?
శ్రీకాకుళం : ఇటీవల జరిగిన సమ్మెటివ్ పరీక్షల్లో ఒకటి రెండు తరగతులు చదువుతున్న చిన్నారులకు ప్రశ్నపత్రంగా 8 పేజీల బుక్లెట్ను ఇవ్వడాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. 6,7 ఏళ్ల వయసున్న వీరికి ఈ ప్రశ్నపత్రాన్ని నింపడం తలకుమించిన భారమని, ఇటువంటి ఆలోచనలు రాష్ట్రస్థాయిలో ఉన్నవారికి ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నపత్రాన్ని దిద్దడానికే ఒక్కో ఉపాధ్యాయునికి 15 నిమిషాలకు పైగా పడుతోందని, అటువంటిది చిన్నారులు రెండున్నర గంటల్లో 8 పేజీల ప్రశ్నపత్రానికి జవాబులు ఎలా రాయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. గతంలో వీరికి 50 మార్కులకు పరీక్ష నిర్వహించే వారని ఇప్పుడు దానిని కూడా కాదని 80 మార్కులకు ప్రశ్నల రూపంలోనూ, మిగిలిన 20 మార్కులు అసైన్మెంట్ రూపంలోనూ నిర్వహించడాన్ని ఉపాధ్యాయ వర్గాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తప్పుపడుతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. -
గంజాయి అక్రమ రవాణా
హత్య కేసులో పెరోల్పై వచ్చి..నరసన్నపేట : ఒడిశా నుంచి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న షేక్ రియాజ్ అహ్మద్ను నరసన్నపేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మడపాం టోల్గేట్ వద్ద ఎస్ఐ–2 శేఖరరావు సిబ్బంది సోదాలు నిర్వహిస్తుండగా ఓ బస్సులో ప్రయాణిస్తున్న అహ్మద్ను అనుమానంతో ప్రశ్నించారు. అతని వద్ద సోదా చేయగా 20.860 కేజీల గంజాయిని గుర్తించినట్లు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఫోన్ సీజ్ చేశామన్నారు. మైసూర్లోని మొహాల్లాకు చెందిన షేక్ రియాజ్ అహ్మద్కు వ్యసనాలకు బానిసై నేర చరిత్ర కలిగి ఉన్నాడు. 2010లో దర్వడా జైల్లో ఉండగానే తోటి ఖైదీని హత్య చేశాడు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తుండగా కుటుంబ సభ్యులు ఇతనికి వివాహం చేయడానికి పెరోల్ కావాలని దరఖాస్తు చేసుకోగా నవంబర్ 5న బయటకు వచ్చాడు. రానున్న జనవరి 3 వరకూ పెరోల్ గడువు ఉంది. జైల్లో ఉన్నప్పుడు గంజాయి అక్రమ రవాణా చేసే వారితో ఏర్పడిన స్నేహంతో బయటకు రాగానే గంజాయి అక్రమ రవాణాకు దిగాడు. బరంపురం ప్రాంతానికి చెందిన హిమాన్స్ శేఖర్ మాహిజా అనే వ్యక్తి నుంచి గంజాయిని లక్ష రూపాయలకు కొనుగోలు చేసి హుబ్బాలికి చెందిన ముజిమల్ అక్తర్, అక్రమ్ హలాభావి(పుచ్చు)లకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా మడపాం టోల్గేట్ వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు. -
కొరాపుట్లో బిష్ణు ప్రసాద్ పర్యటన
జయపురం: రాష్ట్ర వ్యవసాయ విభాగ డైరక్టర్, సమన్విత వ్యవసాయ ప్రణాళిక ప్రాజెక్టు నోడల్ అధికారి బిష్ణు ప్రసాద్ పట్నాయక్ రెండు రోజుల కొరాపుట్ జిల్లా పర్యటనకు మంగళవారం విచ్చేశారు. దీనిలో భాగంగా ఆయన కొరాపుట్ జిల్లాలోని బొయిపరిగుడ, నవరంగపూర్ జిల్లాలోని కొశాగుమడలలో పర్యటిస్తారు. బొయిపరిగుడలోని ఎంఎస్ స్వామినాథన్ పరిశోధన కేంద్రం సమన్విత వ్యవసాయ ప్రణాళిక ప్రాజెక్టు ద్వారా అమలు చేస్తున్న వ్యవసాయ పనులు స్వయంగా పర్యవేక్షించారు. రైతులు ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నందుకు కొనియాడారు. ఆయనతో పాటు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్ర శాస్త్రవేత్తలు ఉన్నారు. చిత్ర లేఖనం పోటీలు జయపురం: స్థానిక జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఏడీఆర్ భవనంలో కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ సంస్థ ఆధ్వర్యంలో చిత్ర లేఖనం పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలను కొరాపుట్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ మహంతి ప్రారంభించారు. పోటీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతల వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి, లోక్ అదాలత్ పర్మినెంట్ విచారపతి బిష్ణుప్రసాద్ దేవత, సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ సంతోష్ కుమార్ బారిక్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 11 నుంచి ధాన్యం కొనుగోళ్లు జయపురం: కొరాపుట్ జిల్లాలో డిసెంబర్ 11వ తేదీ నుంచి మండీల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు ఖరీఫ్ ధాన్యం సేకరణ కమిటీ నిర్ణయించింది. సోమవారం కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు 108 మండీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మండీల్లో ధాన్యం అమ్మేందుకు 44,104 మంది రైతులను గుర్తించి అనుమతి కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో నవరంగపూర్ ఎంపీ బలభద్ర మఝి, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చ, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర హంతాల్, కోట్పాడ్ ఎమ్మెల్యే రూపుబోత్ర, జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి, అదనపు జిల్లా కలెక్టర్ తపన కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాలువలో పడిపోయిన ప్రైవేటు బస్సు భువనేశ్వర్: సువర్ణపూర్ జిల్లా బినికా పోలీస్స్టేషన్ పరిధి సింగియుబా సమీపంలో ప్రైవేటు ప్రయాణికుల బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని బినికా సామూహిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బస్సు భువనేశ్వర్ నుంచి బరగడ్ జిల్లా బీజేపూర్ సమీపంలో భద్రాపూర్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో 5 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని సోన్పూర్ జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని బుర్లాకు తరలించారు. -
విద్యార్థుల ఆందోళన
రాయగడ: సదరు సమితి అమలాభట్ట వద్దనున్న మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కళాశాల ప్రధాన గేటు వద్ద వారంతా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్లస్ త్రీ పరీక్షలు పూర్తయినప్పటికీ ఫలితాలు సకాలంలో ప్రకటించడం లేదని, అదేవిధంగా పరీక్షల నిర్వహణ సమయంలో విద్యార్థుల రోల్ నంబర్లు గజిబిజిగా ఉండడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వాపోయారు. ఇదిలా ఉండగా ఐదో సెమిస్టర్ పరీక్షలు పూర్తయినా ఇప్పటికీ ముందు రాసిన రెండో సెమిస్టర్ ఫలితాలను నిర్వాహకులు ప్రకటించకపోవడం దారుణమన్నారు. సకాలంలో ఫలితాలు ప్రకటించకుండా రానున్న పరీక్షల కోసం ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికై నా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
వాడీవేడిగా ప్రోక్యూర్మెంట్ కమిటీ సమావేశం
పర్లాకిమిడి: స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి ఖరీఫ్ ధాన్యం ప్రోక్యూర్మెంట్ కమిటీ సమావేఽశం వాడీవేడిగా మంగళవారం జరిగింది. సమావేశానికి పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ, ఎంపీ ప్రతినిధి రౌతు విజయకుమార్, జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి ఎం.ప్రకాశ్రావు, డీఆర్సీఎస్ అధికారి హరిహర శెఠి, అదనపు ఎస్పీ అమితాబ్ పండా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షుడు జి.తిరుపతిరావు మాట్లాడుతూ.. గతేడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం 22 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 1,15,436 మెట్రిక్ టన్నులు మాత్రమేనని మండిపడ్డారు. తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది జిల్లాలో సకాలంలో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో గుసానిలో రైతులు పక్క రాష్ట్రాలకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని పలువురు రైతులు విచారం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లకు ఇప్పటివరకు తేదీలు ఖరారు చేయకుండా సమావేశానికి ఎందుకు పిలిచారాని జిల్లా బీజేపీ కృషక్ మోర్చా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ పాలో మండిపడ్డారు. గజపతి జిల్లాలో రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ, కొనుగోళ్లకు సొసైటీలకు అధికారం ఇచ్చామని ఆర్ఎంసీఎస్ అధికారులు వెల్లడించారు. దీనిపై జిల్లాలోని అన్ని సమతి కేంద్రాల్లో ప్రచారం ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు ధాన్యం మండీల్లో కొనుగోళ్లకు 15,436 మంది రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపారు. ఇంకా ఎవరైనా రైతులు మిగిలి ఉంటే వారు కూడా వెబ్సైట్లో తమ ఆధార్ కార్డు, రైతు కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అసిస్టెంటు సివిల్ సప్లయ్ అధికారి సుభాష్ చంద్ర శెఠి సూచించారు. సమావేశంలో ఆర్.ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ, మిల్లర్లు, రైతులు పాల్గొన్నారు. -
కీలక ప్రతిపాదనలకు ఆమోదం
భువనేశ్వర్: స్థానిక లోక్సేవా భవన్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 3 ప్రతిపాదనలను ఆమోదించారు. సమావేశం తర్వాత అదనపు ప్రధాన కార్యదర్శి సురేంద్ర కుమార్ మంత్రివర్గం ఆమోదించిన కీలక నిర్ణయాలను మీడియాకు వివరించారు. సాధారణ పాలన మరియు ప్రజాభియోగాల విభాగం సమర్పించిన మూడు ప్రతిపాదనలను మంత్రి మండలి పరిశీలించి ఆమోదించిందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాలానుగుణంగా ఏర్పడే ఖాళీల సత్వర భర్తీకి వీలుగా కంబైడ్ గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (సీజీఎల్ఆర్ఈ) నిబంధనలు– 2022 సవరణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణతో ఉద్యోగాల భర్తీ కోసం ఏడాదికోసారి మాత్రమే ప్రకటన జారీ ఆంక్షకు తెర పడింది. సమయానుకూలంగా ముందస్తు ప్రభుత్వ అనుమతితో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడానికి మార్గం సుగమం అయింది. ఈ చర్య రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వేగవంతమైన నియామకాలను సులభతరం చేస్తుందని, వివిధ విభాగాల్లో సిబ్బందికి పెరుగుతున్న డిమాండ్ను తీరుస్తుందని భావిస్తున్నారు. గ్రూప్–బీ మరియు గ్రూప్–సీ స్పెషలిస్ట్ ఉద్యోగాలు మరియు సేవల నియామకం కోసం కంబైడ్ గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్మెంట్ పరీక్ష విధానం సవరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ఒడిశా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అర్హత గల ఉద్యోగాల భర్తీకి నవీకరించబడిన కంబైడ్ గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్మెంట్ పరీక్ష విధానం అమలు చేస్తారు. అలాగే కంబైడ్ హయ్యర్ సెకండరీ (10+2) స్థాయి లేదా తత్సమాన స్పెషలిస్ట్ పోస్టులు నియామక పరీక్ష నియమాల సవరణ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. తాజా సవరణతో హోం శాఖలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ కింద జూనియర్ ఫోరెన్సిక్ అటెండెంట్ పోస్టు ఒడిశా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో 12 పోస్టులతో కలిపి నియామక పరీక్షను నిర్వహించి భర్తీ చేపడతారు. ఈ నిర్ణయం ఫోరెన్సిక్ సేవలలో సిబ్బంది నియామకాల క్రమబద్ధీకరణతో ఉన్నత మాధ్యమిక అర్హతలు అవసరమయ్యే స్పెషలిస్ట్ పోస్టుల భర్తీలో సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. -
ఉత్సాహంగా కొరాపుట్ పర్వ్
జయపురం మున్సిపాలిటీ స్థాయి రాష్ట్రీయ ఆదివాసీ మహోత్సవం కొరాపుట్ పర్వ్ – 2025 ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్థానిక వల్లభ నారాయణ మందిరంలో పర్వ్ మశాలా(దివిటీ) వెలిగించారు. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి మశాల స్వీకరించగా ఊరేగింపు ప్రారంభమైంది. కార్యక్రమంలో జయపురం విక్రమదేవ్ విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయక్, మున్సిపాలిటీ కార్య నిర్వాహక అధికారి అక్కవరం శొశ్యా రెడ్డి, అదనపు కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బి.సునీత, జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్థ జగదీష్ కాశ్యప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ నృత్యాలు ఆకట్టుకున్నాయి. – జయపురం -
నదిలో మహిళ గల్లంతు
మల్కన్గిరి: జిల్లాలోని మత్తిలి సమితి కర్తన్పల్లి పంచాయతీకి చెందిన మంగుళి భుమియా అనే మహిళ గ్రామంలోని మహిళలతో కలిసి మంగళవారం ఉదయం కాలకృత్యాల కోసం శబరి నది గట్టు వైపు వెళ్లారు. అయితే దురదృష్టావశాత్తు ఆమె కాలుజారి నదిలో పడిపోయారు. దీంతో వెంటనే తోటి మహిళలు కేకలు వేయడంతో సమీపంలో ఉన్నటువంటి పురుషులు వచ్చి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వెంటనే మత్తిలి అగ్నిమాపక అధికారి రేణుబాల దీశారికి సమాచారం ఇచ్చారు. వారి వచ్చి సహాయక చర్యలు చేపట్టినా ఆచూకీ తెలియలేదు. చీకటి పడిపోవడంతో గాలింపు చర్యలకు అవాంతరం ఏర్పడింది. -
ఉత్సాహవంతం కావాలి
మంగళవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2025వృద్ధాప్యం.. భువనేశ్వర్: వయసు మీరిన పెద్దలు వృద్ధాప్యం పట్ల నిరుత్సాహం చెందకుండా ఉత్సాహవంతంగా జీవిత కాలం కొసాగాలని జట్నీ వయో వృద్ధుల సంఘం పిలుపునిచ్చింది. ఈ సంఘం 14వ వార్షికోత్సవం పురస్కరించుకుని సోమవారం స్థానిక అగర్వాల ధర్మశాలలో ప్రత్యేక సభా కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు భక్తబంధు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒడిశా వయో వృద్ధుల మహాసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రధాన సలహాదారు కృపాసింధు సాహు హాజరై ప్రసంగించారు. వయసు మీరిన పెద్దలు సమాజానికి అమూల్యమైన సంపద అని, వారంతా ఒకరికి ఒకరుగా చేతులు కలిపి తమను తాము వృద్ధులుగా భావించకుండా ఒకరికొకరు సహాయం చేసుకుని ముందుకు సాగితే వృద్ధాప్యం ఉత్సాహంగా గడుస్తుందన్నారు. వయసు మీరిందని నిరాశ చెందకుండా ఆరోగ్యంపై తగిన జాగ్రత వహించడంపై ప్రాధాన్యత కల్పించాలని కోరారు. హెల్ప్ ఏజ్ ఇండియా భువనేశ్వర్ శాఖకు చెందిన భారతి చక్ర గౌరవ అతిథిగా హాజరై వయో వృద్ధులు దైనందిన కార్యకలాపాలపై సమయపాలన పాటించడం అత్యంత అవసరమని, వేళకు తగిన ఆహారం, సకాలంలో మందులు తీసుకోవడంపై శ్రద్ధ వహించాలని ప్రోత్సహించారు. సమాజంలో ఎన్నో ఒడిదుడుకులు చవి చూసిన పెద్దల సంక్షేమానికి పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. వాటిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే దిశలో ఈ సంఘం చురుగ్గా పని చేయాలని విశిష్ట అతిథిగా పాల్గొన్న జెట్ని పోలీస్ ఠాణా ఇన్స్పెక్టర్ ఇన్చార్జి స్టాలిన్ కుమార్ బిశ్వాల్ కోరారు. వయో వృద్ధుల కోసం సంకల్పించిన పింఛన్ వంటి పథకాలు దైనందిన సామాజిక స్థితిగతులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నవీకరించి దోహదపడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జట్నీ వయో వృద్ధుల సంఘం ప్రతిపాదించింది. ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతున్న సంక్షేమ పథకాల్ని రద్దు చేయడం, కుదించడం వంటి చర్యలకు పాల్పడరాదని హితవు పలికారు. రైలు చార్జీలో వయో వృద్ధుల రాయితీ సదుపాయం తొలగించడం అత్యంత విచారకరం. తక్షణమే ఈ సదుపాయం పునరుద్ధరించాలని సంఘం అభ్యర్థించింది. ఆస్పత్రుల్లో వయో వృద్ధులకు ప్రాధాన్యత ప్రాతిపదికన మౌలిక చికిత్స, వైద్యం అనుబంధ సౌకర్యాల అమలు, కార్యాచరణ పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహిస్తే పూర్తి స్థాయిలో ఫలప్రదం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం వార్షికోత్సవ సంచిక వరిష్ట, అధ్యక్షుడు భక్తబంధు చౌదరి రాసిన అప్రియ సొత్తొ (చేదు నిజం) పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ప్రతిభావంతులైన వయో వృద్ధులను సత్కరించారు. ప్రహ్లాద్ సాహు, బామదేవ్ మిశ్రా, నిరంజన్ మహాపాత్రొ, రాధా మోహన్ పట్నాయక్, ప్రహ్లాద్ లెంకా, పి. జగన్నాథ్ పట్నాయక్. జట్నీ ఠాణా ఇనస్పెక్టరు ఇంచార్జి స్టాలిన్ బిస్వాల్ ఈ ప్రతిభా సత్కారం అందుకున్నారు. -
కుమ్ములుసింగి గ్రీవెన్స్లో 88 వినతులు స్వీకరణ
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ కుమ్ములుసింగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామముఖి పరిపాలన, గ్రీవెన్సు సెల్ను ఉన్నతాధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయఘడ బ్లాక్లోని సన్నతుండి, మర్లబ, కుమ్ములుసింగి ప్రజలు తరలివచ్చారు. ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ, ఆదనపు ఎస్పీ సునీల్ కుమార్ మహాంతి, ఆదనపు అభివృద్ధి అధికారి, జెడ్పీ ఈవో పృధ్విరాజ్ మండళ్, తదితరులు హాజరయ్యారు. నాలుగు పంచాయతీల నుంచి 88 వినతులు అందగా, వాటిలో 37 వ్యక్తిగతం, గ్రామసమస్యలకు సంబంధించినవి 51 ఉన్నాయి. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదనపు కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సామాజిక సురక్షా, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు ఐదుగురికి పింఛన్ కార్డులు మంజూరుచేసి అందజేశారు. రాయఘడ సమితి చైర్మన్ పూర్ణబాసి నాయక్, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం. ఆలీ, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చంద్రపూర్లో 45 వినతులు.. రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి చంద్రపూర్ సమితి కార్యాలయ సమావేశం హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో 45 వినతులను అధికారులు స్వీకరించారు. వీటిలో 26 వ్యక్తిగతం కాగా 19 గ్రామ సమస్యలుగా గుర్తించారు. కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనిల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి అక్షయ కుమార్ ఖెముండో, జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి.సరోజినిదేవి, చంద్రపూర్ బీడీవో సౌమ్య కాంత్ బంగ్లా, తహసీల్దార్ సునీల్ కుమార్ ప్రధాన్పాల్గొన్నారు. స్వీకరించిన వినతులను సంబంధిత శాఖ అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలక్టర్ నాయక్ ఆదేశించారు. చిత్రకొండ సమితిలో 393 వినతుల స్వీకరణ మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి పప్పులూర్ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 393 వినతులు అందాయి. వీటిలో 256 వ్యక్తిగత వినతులు ఉండగా.. మిగిలిన 137 సామూహిక సమస్యలకు సంబంధించిన వినతులు ఉన్నాయి. అలాగే సంక్షేమ పథకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే బంసుదరా పథకంగా భాగంగా 59 మందికి పట్టాదారు పాస్పుస్తకాలను, 59 మందికి శ్రామిక కార్డులు అందజేశారు. సంక్షేమ పథకాల కోసం ఆరుగురు పేర్లు నమోదు చేసుకున్నారు. 8 మందికి కొత్త కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, చిత్రకొండ సమితి ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. -
రైల్వే ఉద్యోగులకు సత్కారం
భువనేశ్వర్: విధి నిర్వహణలో రైల్వే ఉద్యోగుల అసాధారణమైన అప్రమత్తత, సమయస్ఫూర్తి, స్పందనే సమర్థవంతమైన రైలు కార్యకలాపాలకు సురక్షిత కవచంగా దోహదపడుతున్నాయి. ఈ దిశలో సురక్షిత రైలు కార్యకలాపాల్లో ఆదర్శంగా నిలిచిన నలుగురు రైల్వే ఉద్యోగులను ఖుర్దారోడ్ అదనపు మండల రైల్వే అధికారి (ఏడీఆర్ఎం) సోమవారం ప్రత్యేంకగా సత్కరించారు. సిబ్బంది అంకిత భావం, కార్యాచరణ, నైపుణ్యతకు గుర్తుగా ఈ సత్కారం చేసినట్లు తెలిపారు. అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఆపరేషన్న్స్) బెహరా, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఇన్ఫ్రా) శుభ్ర జ్యోతి మండల్ ఉద్యోగులను అభినందించారు. బరంపురం గ్రేడ్– 3 ట్రాక్ మెయింటెయినర్లు ఎస్.శివ , బినోద్ ఘొడేయి, నీలకంఠేశ్వర్ స్టేషన్ పాయింట్స్ మ్యాన్ లక్ష్మీకాంత్ బెహరా, ఖుర్దారోడ్ మెమూ షెడ్ టెక్నీషియన్–1 హిరేన్ కుమార్ సింగ్ను సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు ఏఐసీసీ సెక్రటరీ సూరత్సింగ్ ఠాకూర్ తెలిపారు. నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లా అధ్యక్షుడి నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తాము శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నామన్నారు. పార్టీలో నిబద్ధతతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించేందుకు ఏఐసీసీ చర్యలు తీసుకుంటుందన్నారు. పార్టీ జెండా మోసేవారే కాక, గత కొంతకాలంగా పార్టీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇప్పటికే పలువురు నుంచి దరఖాస్తులు అందాయని, ఈనెల 27వ తేదీ వరకు శ్రీకాకుళంలోనే ఉంటూ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ కమిటీ సభ్యులు లెక్కరాజు రామారావు, పాచిపెంట శాంతికుమారి, నాయకులు పేడాడ పరమేశ్వరరావు, అంబటి కృష్ణారావు, సనపల అన్నాజీరావు, రెల్ల సురేష్, గోవింద మల్లిబాబు, బస్వా షణ్ముఖరావు, ఎం.చక్రవర్తిరెడ్డి, లఖినేన నారాయణ, పూడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని డే అండ్ నైట్ వంతెన వద్ద, కిన్నెర కాంప్లెక్సు జుడో షోరూం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫాజుల్బేగ్పేటకు చెందిన రియ్యా లోకేష్ సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం పని నుంచి వచ్చిన లోకేష్ భోజనం చేసి ప్రతిరోజు మాదిరిగానే దత్తాత్రేయ గుడి సమీప నాగావళి కొత్త వంతెన ఫుట్పాత్పై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు. కాస్త నిద్రలోకి జారగానే కుడిచేయి ఫుట్పాత్పై నుంచి జారడం, కిమ్స్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం 10 గంటలకు ఢీకొనడంతో తీవ్రగాయమైంది. రిమ్స్కు తరలించినా గాయం పెద్దది కావడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. దమ్మలవీధికి చెందిన కాళహస్తి ఉమామహేశ్వరరావు అతని భార్య లావణ్య, కుమారునితో కలిసి కంపోస్టు కాలనీలోని అత్తవారింటికి ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. రాత్రి 10 గంటలకు తిరిగి ఓబీఎస్ వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ఢీకొట్టడంతో ఉమామహేశ్వరరావు భార్య లావణ్యకు గాయాలవ్వడంతో రిమ్స్కు తరలించారు. బాధితులు సోమవారం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హోరా హోరీగా రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు సింగరాయకొండ: మండల కేంద్రంలోని ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. లీగ్ దశలో జరిగిన 30 మ్యాచ్ల్లో బాలబాలికలు పోటా పోటీగా పాల్గొన్నారు. లీగ్ మ్యాచ్లలో బాలుర విభాగంలో పూల్ సిలో విన్నర్స్గా విశాఖపట్నం, రన్నర్స్గా కర్నూలు, పూల్ డిలో విన్నర్గా కడప, రన్నర్గా చిత్తూరు, బాలికల విభాగంలో పూల్ బిలో విన్నర్ గా కడప, రన్నర్గా ప్రకాశం, పూల్ సిలో విన్నర్గా వెస్ట్ గోదావరి, రన్నర్గా విజయనగరం, పూల్ డిలో విన్నర్గా కృష్ణా, రన్నర్గా గుంటూరు జట్లు నిలిచాయి. మిగిలిన పూల్ విభాగాల్లో జరగాల్సిన పోటీలను మంగళవారం ఉదయం నిర్వహించి క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ను మధ్యాహ్నానికి పూర్తి చేసి సాయంత్రానికి ఫైనల్స్ నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కే శంకర్రావు, అండర్–19 కార్యదర్శి ఈ చింపారెడ్డి తెలిపారు. ఈ టోర్నమెంటులో ఎస్సై బీ మహేంద్ర, డీఐఈఓ కే ఆంజనేయులు, జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ పీ విజయ్కుమార్, పీఈటీలు ఎస్డీ జంషీర్, ఎన్టీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
8 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి కుర్మానూర్ పంచాయతీ ప్రాంతంలో ఎనిమిది ఎకరాల్లో గంజాయి తోటలను కలిమెల పోలీసులు సోమవారం ధ్వంసం చేశారు. 12 వేల గంజాయి మొక్కలను పెకలించి నాశనం చేశారు. దీని విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వరి కోతలు సీజన్ కావడంతో గంజాయి సాగును కూడా గిరిజనులు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన కలిమెల ఐఐసీ ముకుందో మేల్కా నేతృత్వంలో ఎస్ఐ డోంబును సుగ్రీ సహ పోలీసు బృందం కుర్మానుర్ ఘాటీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గంజాయి తోట కనిపించడంతో వెంటనే నరికి కాల్చి ధ్వంసం చేశారు. గంజాయి వనాలపై విస్తృతంగా దాడులు చేపడతామని ఐఐసీ ముకుందో మేల్కా తెలిపారు. గంజాయి సాగు ఎవరికి చెందిందో దర్యాప్తులో తేలుతోందన్నారు. -
41 యూనిట్ల రక్తం సేకరణ
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడలో గల సహిద్ లక్ష్మణ నాయిక్ కళాశాలలో కళాశాల యాజమాన్యం ద్వారా సోమవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్, యువ రెడ్ క్రాస్ సొసైటీ, బొయిపరిగుడ రెడ్ రిబన్ క్లబ్, సంబాద్ అమొ ఒడిశాలు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కళాశాల పరిచాలన కమిటీ అధ్యక్షుడు మనోజ్ కుమార్ మహాపాత్రో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా బొయిపరిగుడ రెడ్ రిబ్బన్ క్లబ్ ఉపాధ్యక్షుడు పూర్ణియ బారిక్, బొయిపరిగుడ సమితి సభ్యులు మంజులత పట్నాయిక్, సునీల్ మహాపాత్రో తదితరులు రక్తదాతలను ఉత్సాహపరిచారు. శిబిరంలో 41 యూనిట్ల రక్తం సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ రక్తదాన శిబిరంలో లక్ష్మణ నాయిక్ కళాశాల ప్రిన్స్పాల్ స్నేహలత పట్నాయిక్, వై.ఆర్.సి జ్యోతి పాఢి, కళాశాల ఎన్.ఎస్.ఎస్ కేడర్ ప్రతినిధి హిమాంశు శేఖర బక్షీ, అధ్యాపకులు మౌసుమీ మహంతి, క్షీరోద్ కుమార్ పాయిక్, సను పొరజ, రాకేష్ భుయ, బొయిపరిగుడ సంబాద్ ప్రతినిధి అమరేంధ్ర కుమార్ పరిచ,సమాజ సేవి సౌమేంధ్ర పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో బోధన పటిష్టం
భువనేశ్వర్: ఉత్తమ విద్యాభ్యాసం ఉన్నత జీవితం ప్రామాణికం. విద్యార్థులకు పటిమతో కూడిన విద్యా బోధన, సాధన కల్పించడంలో ఉపాధ్యాయులు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దక్షతకు నిరంతరం పదును పెట్టాలని హైటెక్ గ్రూప్ విద్యా సంస్థల సీఈఓ, మేనేజింగ్ ట్రస్టీ సురేష్ కుమార్ పాణిగ్రాహి ప్రబోధించారు. బోధన, సాధనపై విద్యార్థులను ఉత్సాహపరచడంలో ఉపాధ్యాయులు చురుకుగా ముందుకు సాగాలని, ఈ రంగంలో కాలానుగుణ సాంకేతిక పరిజ్ఞానంతో ఉపాధ్యాయ వర్గం సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. జెట్నీ కోణార్క్ విజ్ఞాన, సాంకేతిక కళాశాల (కిస్ట్)లో నిర్వహించిన 5 రోజుల వర్క్షాప్ ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. కోల్కతా సాంకేతిక విద్య ఉపాధ్యాయుల పరిశోధన సంస్థ (ఎన్ఐటీఈటీఆర్) సహకారంతో ఈ శిబిరం నిర్వహించారు. ఉపాధ్యాయుల ముందస్తు తయారీ, విద్యార్థులను విద్య వైపు ఆకర్షించడానికి సరైన నైపుణ్యాల గురించి వర్క్షాప్ చర్చించింది. ఏఐసీటీఈ అనుబంధంగా ఉన్న విద్యా సంస్థల నుంచి వందలాది మంది ఉపాధ్యాయులు, పరిశోధకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ శిబిరంలో పాల్గొన్నారు. విద్యార్థులను మేటి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు తయారు చేయడంలో అంకిత భావంతో కృషి చేయాలని అభ్యర్థించారు. దేశం కోసం జ్ఞానవంతమైన విద్యార్థులను తయారు చేయడంలో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ దిశలో హైటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి చేసిన బలమైన ప్రయత్నాలు ఫలించడం ప్రారంభించాయి. ఐదు రోజుల పాటు వర్క్షాప్ విజయవంతంగా నిర్వహించిన వారికి కిస్ట్ డైరెక్టర్ అనిల్ కుమార్ పాణిగ్రాహి అభినందించారు. -
నాటు తుపాకీ పేలి యువకుడు మృతి
పర్లాకిమిడి: జిల్లాలోని గుమ్మా బ్లాక్ సెరంగో పోలీసు స్టేషన్ పరిధిలో బుభుని పంచాయతీ సిత్రగుడ గ్రామానికి చెందిన యువకుడు బిర్సన్గోమాంగో (34) తన నాటుతుపాకీలో గుళ్లను లోడ్ చేస్తుండగా ఆకస్మికంగా పేలి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనలో నాటు తుపాకీ పేలుడుకు ఇరుగు పొరుగు వారు వచ్చి చూడగా బిర్సన్ గోమాంగో రక్తపుమడుగులో పడి కనిపించాడు. కొంతకాలంగా బిర్సన్ గొమాంగో ఒంటరిగా గ్రామంలో నివసిస్తున్నాడు. ఆయన భార్య పిల్లలు వేరే గ్రామంలో నివసిస్తున్నారు. ఆదివారం అతను పొలానికి వెళ్లి తిరిగి వచ్చి నాటు తుపాకీ తుడిచి గుండు లోడు చేస్తుండగా పేలి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సబ్ డివిజన్ పోలీసు అధికారి మాధవా నంద నాయక్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. బిర్సన్ గోమాంగో శవాన్ని పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేసి వారి బంధువులకు అప్పగించారు. దీనిపై సెరంగో పోలీసు ఠానాలో ఒక కేసును నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ ప్రమోధ్ కుమార్ తెలిపారు. నలుగురు అనాథ బాలలపై ఔదార్యం పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మోహనా బ్లాక్లో ఖరికుటి గ్రామంలో జలేశ్వర్ మల్లిక్, ఆయన భార్యరాజేశ్వరీ మల్లిక్ ఇటీవల స్వర్గస్థులవ్వడంతో వారి నలుగురు సంతానం అనాథలయ్యారు. వారు చద్మనాథ్ క్రిస్ మల్లిక్ (13), పప్పు మల్లిక్ (11), ఆడపిల్ల సురో మల్లిక్ (8), ఆడపిల్ల రిక్కి మల్లిక్ (5). తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి పెద్దఅక్క వివాహిత శిఫానీ మల్లిక్ వారిని ఆశ్రయం కల్పించింది. అయితే వారి పెద్దక్క ఆర్థిక పరిస్థితి బాగోలేనందున వారి పోషణ కష్టతరమైంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా శిశు సురక్షా సమితి అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని డి.సి.పి.యు. సిబ్బంది నరేష్ నాయక్, ఎ.రవికుమార్ (సి.హెచ్.ఎల్.), డెస్టర్ శిశు సురక్షా సంస్థ కార్యకర్తలను మోహన పంపించి వారిని పర్లాకిమిడి కలెక్టరేట్కు తీసుకువచ్చి శిశు సంక్షేమ సమితి అధికారులకు అప్పగించారు. జిల్లా చైల్డ్ వేల్ఫేర్ అధికారి ఆదేశాల మేరకు వారిని జోరావులో ఉన్న శిశు సంరక్షణ సంస్థ, డెస్టర్ హోం (మోహాన)కు తరలించినట్టు తెలియజేశారు. ఈ బాలలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించి ఉచిత వసతి కల్పిస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. సర్టిఫికెట్ల ప్రదానం పర్లాకిమిడి: గజపతి జిల్లాలో జన శిక్షాన్ సంస్థాన్ (జె.ఎస్.ఎస్.) ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, డ్రాపౌట్స్ ఔత్సాహిక జనరల్ అభ్యర్థులకు డ్రైవింగ్ కోర్సుల్లో శిక్షణ మూడు నెలలపాటు అందించింది. లైట్ వెహికల్ డ్రైవింగ్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు సోమవారం నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లను ఆర్.టీ.ఓ అధికారులతో అందించారు. ఈ సంస్థ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు వంద మందికి పాతపట్నం రోడ్డులో ఉన్న కార్యాలయం ప్రాంగణంలో సోమవారం సర్టిఫికెట్లు మంజూరు చేశారు. ఈ కార్యక్రమానికి జూనియర్ మోటారు వెహికల్ అధికారి, జె.ఎస్.ఎస్ చైర్మన్ అడ్డాల జగన్నాథ రాజు, డైరెక్టర్ జీవన్ దాస్, తదితరులు పాల్గొన్నారు. జె.ఎస్.ఎస్ కేవలం డ్రైవింగ్ శిక్షణతోపాటు మహిళలకు టైలరింగ్లో శిక్షణ, కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు కూడా అందిస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమానికి భారత నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ సపోర్టు నిచ్చిందని జీవన్ దాస్ తెలిపారు. ఇలా ఉంటే.. వ్యాధులు రావా? పర్లాకిమిడి: గజపతి జిల్లాకు 125 కిలో మీటర్ల దూరంలో ఉన్న మోహనా బ్లాక్ అడవ గ్రామ పరిసరాలు వ్యర్థాలు, ఎక్కడపడితే అక్కడ పారవేసిన చెత్త అపరిశుభ్రంతో నిండిపోయింది. గతవారం రోజులుగా అనేక మంది డెంగీ, డయేరియోతో మోహనా సీహెచ్సీ, బరంపురం మెడికల్కు అడవ ప్రజలు చికిత్స కోసం తరలివెళ్తున్నారు. మోహనా నియోజకవర్గంలో అడవ పంచాయతీ అధికారులు, మోహనా బ్లాక్ స్వస్థ సేవా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుర్వాసన ప్రబలి వాంతులు, విరేచనాలతో పలువురు బాధపడుతున్నారు. దీనిపై మోహనా బీడీఓ రాజీవ్ దాస్ తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
లెక్కింపు పూర్తి.. ఫలితాలు భద్రం
రాయగడ: రాయగడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శుభ్ర పండపై 19 మంది కౌన్సిలర్లు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సొమవారం నాడు ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయినప్పటికీ ఫలితాలను అధికారులు వెల్లడించలేదు. గత నెల 9 వ తేదీన వైస్ చైర్మన్ శుభ్రా పండపై కౌన్సిలర్లు తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి స్థానిక మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే. అయితే కోర్టును ఆశ్రయించిన శుభ్ర పండా తనపై తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానంలో ఎలాంటి నిజాలు లేవని హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టు ఆదేశానుసారం ఫలితాలను వెల్లడించలేదు. దీంతో ఓట్లు వేసిన బాక్స్ ను స్థానిక ట్రెజరీ కార్యాలయంలో అధికారులు భద్రపరిచారు. దీనిపై హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ ఆదేశానుసారం సోమవారం నాడు లెక్కింపు కార్యక్రమం చేపట్టినప్పటికీ ఫలితాలను మాత్రం వెల్లడించకుండా తిరిగి ఆ బాక్స్ను జిల్లా ట్రెజరీ కార్యాలయంలో భద్రపరిచారు. సోమవారం నాడు సబ్ కలక్టర్ రమేష్ కుమార్ జెన్న, డీపీఓ తదితరుల సమక్షంలో ఉదయం 11 గంటలకు లెక్కింపు కార్యక్రమం జరిగింది. రాయగడ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 వార్డులు ఉండగా ఇందులో 19 మంది బీజేడీకి చెందిన కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అయితే 24 వార్డు కౌన్సిలర్ల ఓటింగ్ జరిగే సమయంలో కేవలం 21 మంది కౌన్సిలర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఖుర్దా రోడ్ మండల కమిటీ సమావేశం
● అధ్యక్షునిగా భర్తృహరి మహతాబ్ ఏకగ్రీవ ఎన్నిక భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ మండలం అధికార పరిధికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుల (ఎంపీలు) మండల కమిటీ సమావేశం సోమవారం భువనేశ్వర్లో జరిగింది. ఈ సమావేశంలో తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ సహా పలువురు సీనియర్ రైల్వే అధికారులతో పాటు ఈ ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ను మండల కమిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంబిత్ పాత్రో (పూరీ), డాక్టర్ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి (బరంపురం), అనంత నాయక్ (కెంజొహర్), సుకాంత కుమార్ పాణిగ్రాహి (కంధమల్), డాక్టర్ రవీంద్ర నారాయణ్ బెహరా (జాజ్పూర్), అవిమన్యు సెఠి (భద్రక్), అనితా శుభదర్శిని (అసికా), రాజ్య సభ సభ్యులు సులతా దేవ్, శుభాశిష్ ఖుంటియా, దేబాశిష్ సామంతరాయ్ సమావేశంలో పాల్గొన్నారు. రైల్వే మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచాలని సభ్యులు ప్రతిపాదించారు. రాష్ట్రం అంతటా రైలు మార్గం అనుసంధానం విస్తరణకు ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు. ప్రధాన ప్రాజెక్ట్లను వేగవంతం చేయడం, రైలు సేవలను మెరుగుపరచడం మరియు ప్రజల సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సమావేశంలో తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ప్రసంగిస్తూ జోనల్ స్థాయిలో ప్రయాణీకుల సేవలు, భద్రత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కార్యదక్షతని ఎంపీలకు వివరించారు. ఖుర్దా రోడ్ మండల రైల్వే అధికారి అలోక్ త్రిపాఠి మండలం వ్యాప్తంగా రైలు మార్గాల విస్తరణ తదితర ప్రధాన రంగాల్లో కార్యాచరణ వివరించారు. -
ఏక్తా పాదయాత్ర
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిధిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సోమవారం నిర్వహించిన ఏక్తా పాదయాత్రలో నవరంగ్పూర్ ఎంపీ బోలభద్ర మాఝి పాల్గొని పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి, ఒకే భారత్, శ్రేష్ట భారత్కు ప్రతీక అని అన్నారు. దేశభక్తుడు, జాతీయతావాది, అఖండ భారత నిర్మణంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. జిల్లా పరిపాలన అధ్వర్యంలో స్థానిక ఎం.వి.3 గ్రామం వద్ద గల బీఎస్ఎఫ్ గ్రౌండ్ నుంచి డీఎన్కే క్రీడా మైదానం వరకు ఈ ఏక్తా పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి, జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్, జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, బీఎస్ఎఫ్ డిప్యూటీ కమెండార్ రవి మిశ్రా, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రదాన్, డీఐపీఆర్ ప్రమిళా మాఝి, అధికారులు, జవాన్లు, ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా క్రీడోత్సవాలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ గాంధీ పబ్లిక్ స్కూల్లో సోమవారం వార్షిక క్రీడోత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. స్కూల్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ చంద్ర పండ ముఖ్యఅతిథిగా హాజరై క్రీతోత్సవాలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభను కనబరిచేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో మనోవికాసానికి క్రీడలు సహకరిస్తాయని అన్నారు. మూడు రోజులు పోటీలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. నర్సరీ నుంచి 12వ తరగతి విద్యార్థులకు పోటీలు విభాగాల వారీగా జరుగుతున్నాయి. ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
దుకాణంలోకి దూసుకెళ్లిన పికప్ వ్యాన్
రాయగడ: పశువులను తరలిస్తున్న ఒక పికప్ వ్యాన్ అదుపు తప్పి దుకాణంలోకి దూసుకువెళ్లిన ఘటన జిల్లాలొని బిసంకటక్ లొ ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటనలొ దుఖానంలొ కూర్చున్న ఒక మహిళ తీవ్రగాయాలకు గురైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని పికప్ వ్యాన్ ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గాయాలకు గురైన మహిళలను హస్పటల్ కు తరలించి చికిత్స అందించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... మునిగుడ నుండి ఆంధ్రప్రదేశ్ వైపు అయిదు పశువలతొ ఒక పికప్ వ్యాన్ వెళుతుండగా బిసంకటక్ క్రిష్టియన్ హస్పటల్ మలుపువద్ద అదుపుతప్పి రొడ్డు పక్కనే ఉన్న ఒక దుఖాణంలొకి దూసుకువెళ్లింది. దుఖానంలొ కూర్చున్న జిత్తు నల్లా అనే వ్యక్తి భార్య భారతీ నల్లా గాయాలకు గురైంది. దీంతో డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం దారుణం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఖరీఫ్ కోతలు జరుగుతున్నా ఇంతవరకు సక్రమంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొండు రఘురాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యానికి ప్రభుత్వం రూ.1,890లు మద్దతు ధర ప్రకటించినా.. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు రూ.1,350లకే అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వ్యవసాయశాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇతర జిల్లాల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందోనని ఆవేదన వ్యక్తం చేశారు. మోంథా తుఫాన్కి జిల్లావ్యాప్తంగా ప్రాథమికంగా 4 వేల ఎకరాలకు నష్టం కలిగినట్లు అంచనా వేసి, చివరికి 400 ఎకరాలకు ఫైనల్ చేసి అరకొరగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు జాబితాలు సిద్ధం చేయడం దారుణమన్నారు. వంశధార, నారాయణపురం, మడ్డువలస, ఆఫ్షోర్ ప్రాజెక్టులను ప్రభుత్వం గాలికొదిలేసి.. శివారు ఆయకట్టుకి నీరివ్వకుండా రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. నేరడి బ్యారేజీ అడ్డంకులపై ఒడిశా సీఎంతో మాట్లాడేందుకు గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ధర్మాన సోదరులు వెళ్లి దీర్ఘకాల సమస్యకు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు గొర్లె అప్పలనాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ అధ్యక్షుడు పీస శ్రీహరి, రైతు విభాగం గార మండల అధ్యక్షుడు శిమ్మ ధర్మరాజు, శ్రీకాకుళం మండల అధ్యక్షుడు రావాడ జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య కళాశాల ఎంబీఏ కోర్సుకు ఎన్బీఏ టైర్–1 గుర్తింపు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎంబీఏ కోర్సుకు ప్రతిష్టాత్మక నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) టైర్–1 గుర్తింపు లభించిందని కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు విశ్వ విద్యాలయాలతో పాటు ఆదిత్య కళాశాలకు అరుదైన గుర్తింపు లభించినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రమాణాలు, నాణ్యత, పారదర్శకత కలిగిన మేనేజ్మెంట్ విద్యాసంస్థలకు మాత్రమే లభించే ఈ గుర్తింపు ఆదిత్య కళాశాలకు లభించడంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు కృషి ఉందన్నారు. సొసైటీ చైర్మన్ కొంచాడ సోమేశ్వరరావు మాట్లాడుతూ ఎన్బీఏ గుర్తింపు పొందడం అంటే ఆదిత్యలో అందిస్తున్న విద్య జాతీయ ప్రమాణాలకు మించి ఉన్నదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
96 శాతం ఫిర్యాదులు పరిష్కారం
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సోమవారం 15వ ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. స్థానిక యూనిట్ 2 గ్రీవెన్స్ సెల్లో కెంజొహర్ జిల్లా నివాసితులు తీసుకువచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 8 మంది సీనియర్ క్యాబినెట్ మంత్రులు ఆయనతో పాలుపంచుకుని పీడితులకు ప్రత్యక్షంగా చేరువై ప్రభుత్వం నిబద్ధతను మరింత బలోపేతం చేశారు. ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ వేదికకు ఇప్పటి వరకు దాఖలైన 12,950 ఫిర్యాదుల్లో 12,371 దాదాపు 96 శాతం పరిష్కరించారు. మిగిలిన 579 ఫిర్యాదుల పరిష్కారం ప్రక్రియ చురుకుగా కొనసాగుతుంది. సోమ వారం తెల్లవారు జాము నంచి విచారణ శిబిరం ఆవరణలో వేచి ఉన్న 34 మంది దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను ముఖ్యమంత్రి తొలుత కలిశారు. ఆయన ప్రతి ఒక్కరితోనూ సంభాషించి ఫిర్యాదు పత్రాల్ని సేకరించి సత్వర చర్యలకు అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్ మరియు మంత్రులు సురేష్ కుమార్ పూజారి, ముఖేష్ మహాలింగ్, కృష్ణ చంద్ర మహాపాత్రో, బిభూతి భూషణ్ జెనా, ప్రదీప్ బాల్ సామంత్, గణేష్ రామ్ సింగ్ ఖుంటియా మరియు గోకులానంద మల్లిక్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మోహన్ మాఝీ నేతృత్వంలో ఫిర్యాదుల విచారణ వ్యవస్థ పౌరులు తమ సమస్యలను ప్రత్యక్షంగా నివేదించడానికి ఒక వేదికగా విశేష ప్రజాదరణ పొందుతుంది. ప్రధానంగా ఫించన్లు, భూ వివాదాలు, సంక్షేమ ప్రయోజనాలు, ప్రజా సేవలు వంటి అంశాలపై ఈ వ్యవస్థ దృష్టి సారిస్తుంది.


