breaking news
Odisha Latest News
-
బికల్ప్ ఆధ్వర్యంలో చైతన్య శిబిరం
రాయగడ: స్థానిక బికల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సదరు సమితి జఫాకాల్ గ్రామంలో సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ దుస్మంత్ కుమార్ మహాంతి, అధ్యాపకురాలు సంజుక్త పంగి, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చనా పట్నాయక్, వీరబాబు, సతీస్కుమార్, గౌరీ శంకరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మహంతి మాట్లాడుతూ.. మూభీ కోమ్ నహి అనే అంశంపై ప్రసంగించా రు. ముందుగా మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు అభినందించిన ఆయన సమాజ శ్రేయ స్సుకు మహిళల పాత్ర చాలా కీలకమని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు అగ్రస్థానంలో ఉండేందు కు పోటీ పడుతున్నారని అన్నారు. వంటిళ్లకే పరిమి తం కాకుండా మహిళలు ఇలా తమ కాళ్లపై నిలబడేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు దృష్టిసారించాలన్నారు. -
గుమ్మ గ్రీవెన్స్లో 86 వినతుల స్వీకరణ
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మా సమితి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రామముఖి పరిపాలన, సంయుక్త గ్రీవెన్స్సెల్కు మంచి స్పంద న లభించింది. గుమ్మ బ్లాక్లో సెరంగో, అజయగ డ, గుమ్మ గ్రామాల నుంచి 86 వినతులను అధికారులు స్వీకరించారు. వాటిలో వ్యక్తిగతం 56, గ్రామ సమస్యలకు సంబంధించినవి 30 ఉన్నాయి. గ్రీవెన్స్లో ఇద్దరు దివ్యాంగులకు రాష్ట్ర కార్మిక, ఉపా ధి విభాగం ద్వారా వివాహ ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం కింద రూ. 2.50 లక్షల చెక్కులను ఏడీఎం మునీంద్ర హానగ అందజేశారు. అలాగే 30 మంది గిరిజనులకు జంగిల్, జమ్మి పట్టాలు ఆర్వో ఆర్లను ఆదనపు మేజిస్ట్రట్ పంపిణీ చేశారు. వినతులన్నీ పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఏడీఎం మునీంద్ర హానగ అధికారులను ఆదేశించా రు. గుమ్మ సమితి అధ్యక్షురాలు సునేమీ మండళ్, బీడీవో దులారాం మరాండి, ఇన్చార్జి సీడీఎంవో డాక్టర్ రబినారాయణ దాస్ పాల్గొన్నారు. -
శ్రీ మందిరంలో ఖొసాపొడా లగ్గి సేవ
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరంలో ఖొసాపొడా ఆచారం పురస్కరించుకుని చైత్ర కృష్ణ పక్షం షష్టి తిథి సందర్భంగా సోమవారం సాధారణ భక్తుల ప్రవేశం నివారించి దర్శనం తాత్కాలికంగా నిలిపి వేశారు. ద్వితీయ భోగ మండప సేవ పూర్తయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ఖొసాపొడా ప్రక్రియ ప్రారంభించారు. అది మొదలుకొని సర్వ దర్శనం నిలిపి వేశారు. సుమారు రాత్రి 10 గంటల వరకు ఈ సేవ కొనసాగింది. ఖొసాపొడా లగ్గి ఆచారాన్ని సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు శ్రీ మందిరం రత్న వేదికపై కొలువు దీరిన శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్రల శ్రీ పాయరు (పవిత్ర పాదాలు) సంరక్షణలో భాగంగా ఖొ సాపొడా నిర్వహిస్తారు. ఈ పవిత్ర ఆచారంలో భాగంగా దేవతల పాదాలను తెల్లటి వస్త్రంతో కప్పుతారు. ఆచార సమయంలో గర్భగుడిలోకి ప్రవేశం పరిమితం చేయడంతో భక్తులు దేవతలను వీక్షించలేరు. దైతపతి వర్గం సేవకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ సేవ నిర్వహించారు. రాయగడ: స్థానిక సాయిప్రియ నగర్లో గల ఎస్బీఐ రీజనల్ (కమర్షియల్) శాఖ మాతృశక్తి సీనియర్ సిటిజన్ గృహానికి జనరేటర్ను వితరణ చేసింది. సోమవారం శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలొ ఎస్బీఐ బ్రహ్మపురం జోన్ డిప్యూటీ జనరల్ మేనేజరు అలొక్ కుమార్ సిన్హా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 15 కేవీఏ సామర్థ్యం గల జనరేటర్కు ప్రత్యేక పూజలను నిర్వహించి గృహ నిర్వాహకులకు అందజేశారు. ఎస్బీఐ చేపడుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా మాతృశక్తి సీనియర్ సిటిజన్ గృహానికి అవసరమయ్యే విద్యుత్ సరఫరా జనరేటర్ను వితరణ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సాయిప్రియ ఎస్బీఐ రీజనల్ శాఖ కార్యాల యం మేనేజరు ఉత్తర్ కుమార్ పటేల్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. సత్తాచాటిన గోకర్నపల్లి యువకుడు ● ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలకు ఎంపిక పొందూరు: మండలంలోని గోకర్నపల్లి గ్రామానికి చెందిన గురుగుబెల్లి రవికుమార్ ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలకు ఎంపికై సత్తాచాటాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్రామీణ బ్యాంక్ ఆఫ్ తెలంగాణాల్లో పీవో ఉద్యోగానికి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ తెలంగాణలో క్లర్క్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో తల్లిదండ్రులు జి.సత్యనారాయణ, రాధ ఆనందం వ్యక్తం చేశారు. యువకుడికి ఎంపీపీ కిల్లి ఉషారాణి, మాజీ ఎంపీటీసీ సీపాన శ్రీరంగనాయకులు, కిల్లి నాగేశ్వరరావు, విశ్రాంత జూనియర్ లెక్చరర్ జి.అప్పలనాయుడులు అభినందనలు తెలిపారు. ఎస్పీ గ్రీవెన్సుకు 47 వినతులు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదు ల స్వీకరణ మరియు పరిష్కార వేదిక కార్యక్రమానికి (గ్రీవెన్సుకు) బాధితుల నుంచి 47 వినతులు అందాయి. అదనపు ఎస్పీ కేవీ రమ ణ వినతులు స్వీకరించి, సకాలంలో న్యాయం చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. -
ఉద్యోగ విరమణ రోజే.. పెన్షన్ అందుకున్న ఉపాధ్యాయులు
జయపురం: ఉద్యోగ విరమణ రోజునే పూర్తి పెన్షన్ను అందుకున్నారు ఇద్దరు ఉపాధ్యాయులు. జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ విద్యా విభాగ కార్యాలయం పరిధిలో కుందారిగుడ పాశాలలో పనిచేస్తున్న సుప్రభా పాడీ, నువాగుడ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే కల్పన పండా సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ ఇద్దరు ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణకు ముందే ప్రభుత్వం వీరికి పూర్తి పెన్షన్ మంజూరు చేసింది. ఉద్యోగ విరమణ రోజునే పూర్తి పెన్సన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ నిర్ణయాన్ని జయపురం బ్లాక్ విద్యా విభాగం అమలు చేస్తున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. బ్లాక్ ఎడ్యకేషన్ అధికారి చందన కుమార్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగ విరమణ చేసిన ఇద్దరు ఉపాధ్యాయులు పూర్తి పెన్షన్ మంజూరు ఉత్తర్వులను అందజేసి సన్మానించారు. గౌరవ అతిథిగా విద్యాధికారి రాజేంద్ర నారాయణ పాడీ, సీనియర్ ఉద్యోగి శశిభూషణ దాస్, తదితరులు పాల్గొన్నారు. -
మహిళల విజయాలు స్ఫూర్తిదాయకం
జయపురం: నేటి సమాజంలో మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకమన్నారు. కొరాపుట్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షుడు ప్రదీప్కుమార్ మహంతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. మహిళలు సాధిస్తున్న విజయాలతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించటం ప్రధాన లక్ష్యమన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతు న్న వివక్ష, హింస, అసమానతలు వంటి సమస్యల ను వివరించారు. పలు చట్టాలపై అవగాహన కల్పి ంచాలన్నారు. ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి నిషిత్ నిశాంక్,చీఫ్ జ్యడీషియల్ మెజిస్ట్రేట్ ఎస్.శుభలక్ష్మి, సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి, ఉమెన్స్ కోర్టు జడ్జ్, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం కార్యదర్శి అలకానంద మహంతి, సివిల్ కోర్టు రిజస్ట్రార్ విష్ణప్రసాద్ దేవత, తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల వేతనాలు పెంచాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంచడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి, జిల్లా కార్యదర్శి ఎన్వీ రమణ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎన్.హైమావతి, పి.లతాదేవి, వి.హేమలత, బి.ఆదిలక్ష్మి, కె.హైమావతిలు డిమాండ్ చేశారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేతనాలు పెంచాలని కోరుతూ ఈనెల 11న నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ధర్నాలు జయప్రదం చేయాలని కోరారు. ఇటీవల విజయవాడలో చేపట్టిన ధర్నాలో భాగంగా అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండించారు. పోలీసు నిర్బంధాన్ని అభ్యుదయవాదులు, లౌకిక వాదులందరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. అంగన్వాడీల 10 డిమాండ్లలో 9 డిమాండ్లు పరిష్కరించామని శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో చేసిన ప్రకటన చేయడం అసత్యమని తెలిపారు. -
సమస్యలు వెంటనే పరిష్కరించండి
రాయగడ: జిల్లాలోని మునిగుడలో గల సమితి కార్యాలయం సమావేశం హాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ అశుతోస్ కులకర్ణి ఆధ్వర్యంలో జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ, తమ సమస్యలను దృష్టికి తీసుకువెళ్లారు. సమితిలో గల వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు 73 సమస్యలను విన్నవించుకున్నారు. ఇందులో 57 వ్యక్తిగత సమస్యలుగా కలెక్టర్ గుర్తించగా మిగతా 16 గ్రామ సమస్యలుగా పరిగణలోకి తీసుకున్నారు. రెడ్ క్రాస్ నిధుల నుంచి ఒకరికి రూ.20 వేల చొప్పున ముగ్గురుకి రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. మరో ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. స్వీకరించిన గ్రామ సమస్యలను సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఒ సచీన్ అన్నా సాహెబ్ అహోలే, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధి కారి అక్షయకుమార్ ఖెముండొ, గుణుపూర్ ఐటీడీ ఏ ప్రాజెక్టు అధికారి అజయ్ కుమార్ ప్రధాన్, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో 14 మంది దుర్మరణం
భువనేశ్వర్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా మారింది. గత 24 గంటల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయా రు. కెంజొహర్ జిల్లాలోని 9వ నంబరు జాతీయ రహదారి తెంతులి సమీపంలో జరిగిన దర్ఘటనలో మోటార్ సైకిల్ ట్రక్కుకు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, మూడేళ్ల కొడుకు ప్రాణా లు కోల్పోయారు. మృతుడిని మహ్మద్ నూర్గా గుర్తించారు. నూర్ తన భార్య, కొడుకుతో ప్రయాణిస్తుండగా వారి బైక్ వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. అతని భార్య తీవ్రంగా గాయపడి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. జట్నిలో వేగంగా వస్తున్న కారు ఆటోరిక్షాలోకి దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానిక జాతీయ విజ్ఞాన విద్యా, పరిశోధన సంస్థ నైజర్ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారందర్ని చికిత్స కోసం ఖుర్దా జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు పలువురి ప్రాణాల్ని బలిగొన్నాయి. బర్గఢ్ జిల్లా మెహ్నా గ్రామం సమీపంలో రెండు మోటార్ సైకిళ్లని బొలెరో వాహనం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన 4 మంది మృతి చెందారు. సంబల్పూర్ జిల్లా కుచిండా ప్రాంతం పితామరెన్ వద్ద కంటైనర్ ట్రక్కు, మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. సుందర్గఢ్లో ఇద్దరు, బొలంగీర్ జిల్లాలో ఒకరు మరణించారు. బారంగ్, పొలొసొర ప్రాంతాల్లో ఒక్కొక్కరు వంతున మరణించారు. స్వల్ప వ్యవధిలో జరిగిన వరుస ప్రమాదాలు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలు వ్యవస్థ పటిష్టత లోపం ఎత్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో సగటున రోజుకు 15 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పదేళ్లలో 53,451 మంది మృతి గత 10 సంవత్సరాలలో రాష్ట్రంలో సంభవించిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో 53,451 మంది మరణించారు. ఈ ప్రమాదాల్లో 55,783 మంది తీవ్రంగా గాయపడ్డారు, 45,146 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటనలకు సంబంధించి 1,13,325 ప్రమాద కేసులు నమోదయ్యాయి. 2024లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 12,375 కేసులు నమోదయ్యాయి, 6,142 మంది మరణించారు. గత ఏడాది నమోదైన 12,782 రోడ్డు ప్రమాదాల్లో 6,483 మంది మరణించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సోమ వారం జరిగిన రాష్ట్ర శాసన సభ మలి విడత సమావేశాల్లో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలియజేశారు. రోజువారీ రోడ్డు ప్రమాదాల సగటు 31 నమోదు అయింది. ఈ ప్రమాదాల్లో సగటున 27 మంది గాయపడుతున్నారు. శాసన సభలో జరిగిన సమావేశంలో రవాణా మంత్రి బిభూతి భూషణ్ జెనా రోడ్డు ప్రమాదాల్ని విశ్లేషించారు. -
లోకానికి అలంకారం.. బతుకుల్లో అంధకారం..!
● స్వర్ణకారులకు పని కరువు ● రెడిమేడ్.. వన్గ్రామ్ గోల్డ్తో డీలా ● బంగారం ధర పెరగడంతో మరిన్ని ఇబ్బందులు ● పనిలేక పస్తులతో గడుపుతున్న కులవృత్తిదారులు దయనీయ పరిస్థితులు ప్రస్తుతం మేము దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కనీస స్థాయిలో కూడా పనులు లేవు. బంగారం ధర పెరుగుదలతో ఆభరణాలు తయారు చేయించేవారి సంఖ్య తక్కువైంది. ఆపై వన్గ్రామ్ గోల్డ్, రెడీమేడ్ ఆభరణాల వైపే అందరూ చూస్తున్నారు. తమలాంటి వారికి ఉపాధి లేకుండా పోయింది. రోజువారి జీవనానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం. – ఎం.రవి, కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్షుడు, హిరమండలం కార్పొరేట్తో విలవిల ప్రస్తుతం అంతా రెడిమేడ్ ఆభరణాలు రావడంతో స్వర్ణకారులతో ఆభరణాలు తయారు చేయించుకోవడం తగ్గిపోయింది. ఆపై కార్పొరేట్ వ్యాపారం పెరిగి పోయింది. తరుగు, డిస్కౌంట్ అంటూ కార్పొరేట్ వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దీంతో ప్రజలు అటువైపు మొగ్గుచూపుతున్నారు. ఆపై పెరిగిన బంగారం ధరల పుణ్యమా అని రోల్డ్గోల్డ్ ఆభరణాలను ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. దీంతో కులవృత్తిపై ఆధారపడే స్వర్ణకారులకు ఉపాధి తగ్గుతోంది. గతంలో సంక్రాంతి వంటి పండగ సమయాల్లో వారికి ఖాళీ ఉండేది కాదు. వివాహాల సీజన్లో అయితే క్షణం తీరిక దొరకదు. అటువంటిది ఈ సంవత్సరం షాపుల వైపు చూసేవారు లేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆభరణాలకు మెరుగుపెడితే వందో.. రెండొందలో వస్తుందనుకుంటే, ఎవరూ ఈ వైపు రావడమే మానేశారని చెబుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. హిరమండలం: పసిడికి ప్రాణం పోస్తూ.. అందమైన ఆభరణాలతో లోకాన్ని మురిపించే స్వర్ణకారుల బతుకుల్లో చీకట్లు అలముకుంటున్నాయి. కంటికి ఇంపుగా కనిపించే నగలను తయారు చేసే చేతులకు నేడు పని దొరకడం గగనమైపోతోంది. ప్రస్తు తం బంగారం పరుగులు పెడుతోంది. వెండి రోజురోజుకూ ఎగబాకుతోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నత వర్గాల వారు రెడీమేడ్ బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో స్వర్ణకారులకు పని లేకుండా పోతోంది. జిల్లాలో ఏ స్వర్ణకారుడిని అడిగినా పనులు లేవని చెబుతున్నారు. ఇప్పటికే రోల్డ్గోల్డ్, రెడీమేడ్ ఆభరణాలతో వారికి పనులు లేకుండా పోయాయి. ఇప్పుడు పెరిగిన బంగారం ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాటి జోలికి పోవడం లేదు. దీంతో బంగారం పనులు చేసే స్వర్ణకారుల జీవనం దయనీయంగా మారింది. ● ఇదీ పరిస్థితి.. జిల్లాలో నరసన్నపేట బంగారం మార్కెట్కు పెట్టింది పేరు. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల నుంచి ప్రజ లు ఇక్కడికి వచ్చి బంగారు ఆభరణాలు తయారు చేయించుకుంటారు. శ్రీకాకుళం నగరంలో సైతం బంగారం దుకాణాలు అధికం. పలాస–కాశీబుగ్గ, టెక్కలి, పాతపట్నం, సోంపేట, ఇచ్ఛాపురంతో పాటు అన్ని మండల కేంద్రాలు, పట్టణాల్లో బంగారం దుకాణాలు జిల్లాలో 200 వరకు ఉంటాయి. ప్రతీ దుకాణానికి అనుసంధానంగా కొందరు స్వర్ణ కారులు ఉంటారు. దుకాణాల్లో బంగారం కొనుగోలు చేసే సమయంలో నమ్మకస్తులైన కొందరు స్వర్ణకారులకు పనులు అప్పగిస్తుంటారు షాపు యజమానులు. బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలను ఉపయోగించి ఆభరణాలు, ఇతర అలంకరణ వస్తువులు తయారు చేస్తుంటారు. జిల్లాలో ఇటువంటివారు 800 మంది వరకూ ఉంటారని ఒక అంచనా. బక బంగారు ఆభరణం తయారు చేయాలన్నా.. మరమ్మతులు చేసి మెరుగుపరచాలన్నా నిశిత దృష్టి అవసరం. సాధారణంగా ఆ వృత్తే కష్టం. అటువంటిది ఇప్పుడు ఆ పని కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఘనంగా అనుకూలచంద్రదేవ్ జన్మదిన వేడుకలు
రాయగడ: పరమపూజ్య శ్రీఠాకూర్ అనుకూల చంద్ర దేవ్ 138వ జన్మదిన వేడుకలు సదరు సమితి గౌడో కుండామ్ వద్ద సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వర్ నుంచి వచ్చిన రుత్విక్ స్వయ్, నృసింహ శ్రీచందన్, సంగీకారుడు కేశవ్ సాహు, సమీర్ రంజన్ బెహర, గుణుపూర్కు చెందిన సుధాంశు శేఖర్ మజుందార్, అంబొదల నుంచి వచ్చిన ఇప్పిలి గురునాయుడు తదితర ప్రముఖులు, ఆధఆ్యత్మిక వేత్తలు పాల్గొన్నారు. వక్తలు ప్రసంగిస్తూ ఆధ్యాత్మిక ధొరణిని అవలంభించి సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో అనుకూలచంద్రదేవ్ భక్తులు పాల్గొన్నారు. -
మజ్జిగౌరి మందిరం ప్రాంగణంలో దారుణం
రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరం ప్రాంగణంలో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనతో తీసుకువచ్చిన ఫినాయిల్ను తాగిన అనంతరం ఒంటికి నిప్పు అంటించుకుంది. అది చూసిన మందిరం సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి మందిరంలో గల అమ్మవారికి సమర్పించే చీరలను తీసుకువచ్చి ఆమైపె కప్పి మంటలను ఆర్పారు. అనంతరం ఆంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చేరుకొని హుటాహుటీన స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వివరాల్లోకి వెళితే స్థానిక రైల్వే స్టేషన్ ఆర్ఎంఎస్ విభాగంలో డాటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న శుభద్ర మాఝి (32) ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మజ్జిగౌరి మందిరానికి వచ్చి గట్టుపై కూర్చుంది. వెంట తెచ్చుకున్న సంచిలో నుంచి ఫినాయిల్ను అందరూ చూస్తుండగానే తాగింది. బాటిల్లో సగం ఫినాయిల్ తాగిన ఆమె కొద్ది సమాయానికి అగ్గిపుల్ల వెలిగించి శరీరానికి నిప్పంటించుకుంది. అది చూసిన అక్కడి వారంతా కేకలు వేయడంతో మందిరం సెక్యూటీ సిబ్బంది చేరుకున్నారు. ఒంటికి నిప్పుఅంటించుకుందని గుర్తించి పరుగున వెళ్లి అమ్మవారికి భక్తులు సమర్పించే చీరలను తీసుకువచ్చి ఆమెను కప్పి మంటలను అదుపుచేశారు. స్పృహ కొల్పోవడంతో ఆమెను అంబులెన్స్లో ఆస్పత్రికి రలించారు. ఆమె స్థానిక ఇందిరానగర్ నాలులో లైన్లో నివసిస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్డ్డారన్న విషయం తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫినాయిల్ తాగి, ఒంటికి నిప్పు అంటించుకొని మహిళ ఆత్మహత్యాయత్నం గమనించిన భక్తులు, సెక్యూరిటీ సిబ్బంది అమ్మవారికి సమర్పించిన చీరలను కప్పి మంటలను అదుపు చేసిన వైనం -
రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి.. ఆందోళన
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి 26 వ జాతీయ రహదారి చారిగాం కూడలి వద్ద మహేంద్ర వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మరణించిన వ్యక్తిని చారిగా గ్రామం పితంబర పూజారి(45) గా గుర్తించారు. ప్రమాద విషయం తెలిసిన మృతుని బంధువులు గ్రామస్తులు 26 వ జాతీయ రహదారి బొరిగుమ్మ పోలీసు స్టేషన్ ముందు మృతదేహంతో బైఠాయించి మృతుని కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళన కారణంగా దాదాపు నాలుగు గంటల పాటు జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బొయిపరిగుడ పోలీసు అధికారి రామనాత్ సాహు ఆందోళన కారుల వద్దకు వచ్చి వారితో చర్చలు జరిపి వారిని శాంత పరచటంతో వారు ఆందోళన విరమించారు. సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బొరిగుమ్మ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టు మార్టం అనంతరం మృత దేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించారు. -
రిజర్వాయర్లో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి
కొరాపుట్: రిజర్వాయర్లో మునిగి ముగ్గురు నవోదయ విద్యార్థులు మృతి చెందిన విషాదకర ఘటన శనివారం సాయంత్రం జరిగింది. కొరాపుట్ జిల్లా కేంద్రం సమీపంలోలోని మచ్ర గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన విద్యార్థులు కొరాపుట్లో మెట్రిక్ పరీక్షలు రాసి తిరిగి వచ్చారు. చివరి పరీక్ష కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకొని వెళ్లడానికి స్కూల్కి వచ్చారు. అందులో ఏడుగురు విద్యార్థుల తల్లిదండ్రలు రాక ఆలస్యమైంది. దీంతో ఆ ఏడుగురు విద్యార్థులు సమీప కొలాబ్ రిజర్వాయర్లో ఈత ఈదడానికి వెళ్లారు. నీటి వైపు వెళ్తున్న విద్యార్థులను సమీప పశువుల కాపర్లు నీటి లోతు ఎక్కువ ఉందని నీటిలో దిగ వద్దని వారించారు. అయినప్పటికీ ఆ విద్యార్థులు తమకు ఈత వచ్చునని చెబుతూ రిజర్వాయర్లో దిగారు. అందులో ముగ్గురు మునిగి పోయారు. ఇది చూసిన మిగతా విద్యార్థులు భయంతో స్కూల్ వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. వెంటనే స్కూల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి లక్ష్మీపూర్ సమితి బిరిగుడ గ్రామానికి చెందిన స్వస్ధిక్ హల్వ(15), లమ్తాపుట్ సమితికి చెందిన ఓం ప్రకాష్ (15), లింగరాజ్ (15) మృతదేహాలను వెలికి తీశారు. ఘటన తెలిసి బాధిత కుటుంబాలు స్కూల్పై దాడికి ప్రయత్నం చేశారు. వారిని ప్రజా ప్రతినిధులు వారించారు. కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ ఈ ఘటన పై దర్యాప్తుకి ఆదేశించారు. ఆదివారం జిల్లాస్థాయి ఉన్నతాధికారులు సంఘటన స్ధలం కి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
గల్ఫ్ యుద్ధం ఆపాలని శాంతి ర్యాలీ
పర్లాకిమిడి: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరుపుతున్న దాడులు వల్ల అనేక నష్టాలు సంభవిస్తాయని, ఈయుద్ధాన్ని వెంటనే ఆపాలని కోరుతూ ఉత్కళాంధ్ర ప్రోగ్రెసివ్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం శాంతి ర్యాలీ చేపట్టారు. పాత అగ్నిమాపక దళం జంక్షన్ నుంచి పాతపట్నం మహేంద్రతనయ నది వరకూ ర్యాలీ జరిగింది. యుద్ధం వల్ల నిత్యావసర వస్తువులు, పెట్రోలు, గ్యాస్, డీజిల్ ధరలు పెరుగుతాయని, నిరుద్యోగం సంభవిస్తుందని కాంగ్రెస్ నాయకులు బి.జనార్దనరావు అన్నారు. ర్యాలీలో అంకడాల వేణుగోపాలరావు, బర్నాల జనార్దనరావు, ఇసై వెంకట్రావు, బడేల బాబూరావు, నారాయణ రావు, జి.రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఇంటిలోకి దూసుకెళ్లిన అంబులెన్స్ భువనేశ్వర్: ఖుర్ధా, బొలంగీర్ 57వ నంబరు జాతీయ రహదారి దస్పల్లాలో శనివారం అర్ధరాత్రి దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓ పెంపుడు కుక్క చనిపోయింది. అంబులెన్స్ భువనేశ్వర్ నుంచి బౌధ్ జిల్లా ఫుల్బాణి వైపు వెళుతుండగా శనివారం రాత్రి దస్పల్లాలోని రోడ్డు పక్కన ఉన్న బాబులా గొంతాయత్ ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంటికి నష్టం వాటిల్లింది. ఇంటి యజమాని పెద్ద కుమార్తె స్వల్పంగా గాయపడింది. దసపల్లా మండలం పరిధిలోని బుగుడ మరియు బుగుడ కాలనీ మధ్య జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 586 కిలోల గంజాయి స్వాధీనం ● ఒకరి అరెస్టురాయగడ: పికప్ వ్యాన్లో గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా జిల్లాలోని కాసీపూర్ పోలీసులు దాడులను నిర్వహించి పట్టుకున్నారు. వ్యాన్లోని బస్తాల్లో ఉన్న 586 కిలోల గంజాయితో పాటు వ్యాన్ను స్వాధీనం చేసుకోవడంతోపాటు వ్యాన్ డ్రైవర్ను అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి కాసీపూర్లోని నారంగబడి గ్రామానికి చెందిన బిశ్వంబర్ నాయక్గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టుకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు ఖురిగా కూడలిలో శనివారం రాత్రి వాహన తనిఖీలను చేపట్టారు. ఈ క్రమంలో లమతాపుట్ నుంచి వయా ఖురిగా మీదుగా సికరపాయి వైపు వెళుతున్న పికప్ వ్యాన్ను అడ్డగించి తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. మొత్తం 33 బస్తాల్లో ఉన్న 586 కిలోల గంజాయి పట్టుబడినట్లు ఐఐసీ దేవదత్త మల్లిక్ తెలిపారు. మూల విరాట్లకు మహా స్నానం భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరంలో మధ్యాహ్న ధూపం తర్వాత లోపలి ప్రాంగణం (భిత్తొరొ కఠొ) నుండి దర్శనం జరుగుతుండగా ఈ ప్రాంగణంలో ధుకుడి ద్వారం దగ్గర రక్తపు జాడ తారసపడింది. ఈ సందర్భంగా శుద్ధి ప్రక్రియలో భాగంగా రత్న వేదికపై మూల విరాట్లకు మహా స్నానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో భక్తులకు దర్శనంలో అవాంతరం అనివార్యమైందని శ్రీ మందిరం అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియలో సుమారు 2 గంటలపాటు దర్శనం స్తంభించిపోయింది. -
విశ్రాంత సిబ్బందికి ఘన వీడ్కోలు
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండలంలో ఉద్యోగ విరామం పొందిన టికెట్ తనిఖీ సిబ్బందికి సామూహికంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విరామ సిబ్బంది తోటి సిబ్బందితో ఉద్యోగ జీవితంలో తమ అనుభవాలు పంచుకుని కొన్ని మెలుకువల్ని సూచించారు. ఈ సభలో విరామ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్లు (సీటీఐ) బణంబర ముదులి, రమేష్ ప్రధాన్, ఏ. సి. హంసదా, ఎన్. శ్రీనివాస్ రావు మరియు బి సాహు ప్రసంగించారు. స్టేషన్ ఇన్చార్జి సునీతా పరిడా అధ్యక్షతన జరిగిన సత్కార కార్యక్రమంలో పూరీ స్టేషన్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ జెనా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమర్షియల్ మేనేజర్ సుశాంత్ కుమార్ సాహు, శ్రామిక్ కాంగ్రెస్ శాఖా కార్యదర్శి లక్ష్మీ ధర హంతి, శ్రామిక్ యూనియన్ సంస్థాగత కార్యదర్శి రవి శర్మ తదితరులు హాజరయ్యారు. -
ధాన్యం బస్తాలతో రైతుల నిరసన
మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి పలు పంచాయతీలకు చెందిన రైతులు సమితి కార్యాలయం వద్ద ధాన్యం బస్తాలతో శనివారం ధర్నా చేపట్టారు. మండీలు ఏర్పాటు చేసి మూడు నెలలైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోరుకొండ మండీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోవింద పాత్రో మాట్లాడుతూ.. గత నెల 26వ తేదీన రైతులకు ఇచ్చిన హామీని కోరుకొండ సమితి అధికారి అమూల్య కుమార్ సాహు నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. అయితే రోజుకు 1,000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. -
మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలి
మల్కన్గిరి: మల్కన్గిరి, కలిమెల, పోడియా సమితుల్లో ప్రతి సమితి నుంచి మూడు గ్రామాలను తీసుకొని వాటిని మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో మల్కన్గిరి జిల్లా అభివృద్ధికి గానూ ప్రత్యేక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారులు గుర్తించిన గ్రామాల్లో వెంటనే సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. ఆ గ్రామాల్లో ప్రస్తుత అభివృద్ధి పరిస్థితి మరియు అవసరాలు గుర్తించి అంచనా వేయాలని అదేశించారు. ఈ ప్రక్రియకు ప్రతీ సమితి అభివృద్ధి అధికారిని నోడల్ అధికారిగా నియమించారు. అలాగే జిల్లా కేంద్రంలో ఉన్న మల్లికేశ్వర్ ఆలయం, బైరవి ఆలయం పనులు తక్షణమే ప్రారంభించాలని సూచించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బార్ ప్రధాన్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరథి సరాబు, కలెక్టర్ దుర్యోధన్ బోయి తదితరులు పాల్గొన్నారు. -
యూపీఎస్సీ విజేతకు సన్మానం
భువనేశ్వర్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2026లో జాతీయ స్థాయిలో 100వ ర్యాంక్ సాధించిన సాత్విక్ సత్యకాం దేవతను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శనివారం లోక్సేవా భవన్లో సత్కరించారు. కెంజొహర్ జిల్లా హతొ డిహి మండలానికి చెందిన సాత్విక్ తన తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా అభినందించారు. సాత్విక్ సాధించిన విజయం రాష్ట్ర యువతకు, ముఖ్యంగా కెంజొహర్ జిల్లాకు ప్రేరణగా నిలుస్తుందని సీఎం అభివర్ణించారు. పాలన అధికారిగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఉజ్వల భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. సాత్విక్ బలమైన పాలన అధికారుల నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవాడు కావడం విశేషం. అతని తండ్రి గోస్వామి దేవతా విరామ సివిల్ సర్వీసు ఉద్యోగి. సాత్విక్ సత్యకాం దేవత 2018లో భువనేశ్వర్ ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ (ఓయూటీఆర్) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించడానికి ముందు 2023 నుంచి నాబార్డ్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
భువనేశ్వర్: నగర శివారులోని పొహలా ప్రాంతం అనంతపురం కూడలి సమీపంలో శనివారం తెల్లవారుజామున ఇసుకతో వస్తున్న ట్రక్కు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. బాధితుల గుర్తింపులు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. బైక్ మీద వ్యక్తులు నియాలికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బైక్ తీవ్రంగా దెబ్బతింది. దానిపై ఉన్న 3 మంది అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా బాధితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
పర్లాకిమిడి: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని పురపాలక సంఘం చైర్పర్సన్ నిర్మలా శెఠి అన్నారు. సఖి వన్స్టాప్ సెంటర్, ఐఎస్ఆర్డీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ హాల్ నంబర్–2లో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, హక్కులను కాపాడుకోవడానికి ఉన్నత విద్యనభ్యసించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం మిషన్ శక్తి, సుభద్ర పథకం, మహిళ స్వయం సహాయక గ్రూపులు, మిషన్ కేఫ్లు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం అందజేస్తోందని ఏడీఎం ఫల్గునీ మఝి అన్నారు. మిషన్ శక్తి ద్వారా మహిళలు అభివృద్ధి చెందడమే కాకుండా.. మరికొంత మంది మహిళలకు ఆదర్శప్రాయం అవుతున్నారని ఓఎల్ఎం జిల్లా ప్రోగ్రాం అధికారి టిమోన్బోరా అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలిపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమానికి మెడికల్ ఆఫీసర్ సునీతా బెహర అధ్యక్షత వహించగా ప్రోగ్రాం అధికారి సరలా పాత్రో, ఐఎస్ఆర్డీ ప్రోగ్రాం అధికారి నాగేశ్వర చౌదరి, సామాజిక కార్యకర్త జాస్మిన్ షేక్ తదితరులు పాల్గొన్నారు. -
9,10 తేదీల్లో ఆదిత్యుని కిరణ దర్శనం
శ్రీకాకుళం కల్చరల్ : ఈ నెల 9, 10 తేదీలలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి కిరణ దర్శనం జరగనుందని ఆలయ ప్రతినిధులు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే ఉదయం 6 నుంచి 6.30 గంటల వరకు కిరణ దర్శనం ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు సత్యవరం విద్యార్థులు నరసన్నపేట: సత్యవరం ఉన్నత పాఠశాలకు చెందిన ఎ.సంజన, కె.ప్రవీణ్కుమార్లు అండర్–13 విభాగంలో రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పీడీ జ్యోతీరాణి తెలిపారు. ఆదివారం నుంచి గన్నవరంలో జరిగే ఈ పోటీలకు శ్రీకాకుళం జిల్లా జట్టులో వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది. ఒక గ్రామం..ఆరుగురు వీఆర్ఓలు పలాస: బొడ్డపాడు పంచాయతీ మామిడిపల్లి గ్రామంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేసేందుకు శనివారం ఏకంగా ఆరుగురు వీఆర్ఓలు రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇంతమంది ఎందుకొచ్చారా అని ఆరా తీస్తే శనివారం సాయంత్రానికల్లా గ్రామంలో ఉన్న ఇళ్ల మొత్తం సర్వే చేయాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకే తహశీల్దారు తమను మామిడిపల్లి పంపించారని వీఆర్ఓల సంఘం జిల్లా కార్యదర్శి శ్రావణ్కుమార్ చెప్పారు. ఇక్కడ పనిచేసిన వీఆర్ఓ సరిగా సర్వే చేయలేదని, ఇంకా 90 ఇళ్లు ఉన్నాయని, అందుకే ఆరుగురిని పంపించారని సర్వే సిబ్బంది చెప్పారు. మామిడిపల్లితో పాటు లొద్దబద్రలోనూ సర్వే పూర్తి కాలేదని, అక్కడ కూడా ఇంకా 40 ఇళ్లు ఉండిపోయాయని, అవి కూడా శనివారం సాయంత్రానికి పూర్తి చేశామని తహశీల్దారు కళ్యాణ చక్రవర్తి చెప్పారు. మొత్తానికి రెవెన్యూ ఉద్యోగులు ఒత్తిడి కారణంగా పూర్తి స్థాయిలో ఏ పనీ చేయలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి పేరిట మోసగించాడని యువతి నిరసన హిరమండలం: సీఆర్పీఎఫ్ జవానుతో తనను ప్రేమ పేరుతో వంచించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హిరమండలం మండలంలోని భగీరథపురం కాలనీకి చెందిన ఓ యువతి(21)కి భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన కొట్నాల చంద్రశేఖర్తో(మహేష్) కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. చంద్రశేఖర్ తాతగారిల్లు భగీరథపురం కాలనీకి వచ్చిన సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇటీవల చంద్రశేఖర్కు సీఆర్పీఎఫ్ జవాను ఉద్యోగం రావడంతో యువతిని పక్కన పెట్టాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు హిరమండలం పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసింది. కానీ వారు పట్టించుకోవడం లేదంటూ శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో శనివారం దళిత సంఘాల మహిళా ప్రతినిధులతో కలిసి గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగింది. తనకు న్యాయం చేసేవరకూ ఆందోళన కొనసాగిస్తానని స్పష్టం చేసింది. తనకు న్యాయం చేయకుండా నిందితుడికి కొమ్ము కాయడం తగదని ఆవేదన వ్యక్తం చేసింది. సోంపేట ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ శ్రీకాకుళం క్రైమ్/సోంపేట : సోంపేట పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ సింహాద్రి, కానిస్టేబుళ్లు మురళి, విజయ్లు శనివారం సస్పెన్షన్కు గురయ్యారు. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉన్నతాధికారుల నుంచి ఉత్వర్వులొచ్చాయని సోంపేట సీఐ బి.మంగరాజు పేర్కొన్నారు. రెండు నెలల క్రితం సోంపేటలో జరిగిన ఓ ఘటనే వీరికి ఈ పరిస్థితి తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. పూటుగా మద్యం తాగి ఓ వ్యక్తి ఓ దుకాణాదారుడిపై దాడి చేశాడు. ఘటనా స్థలిలో ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు ఉన్నా చర్యలు తీసుకోలేదు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడంపై ఎస్పీ వీరిపై చర్యకు ఉన్నతాధికారులకు నివేదించి, విచారణ చేసి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. -
సాహిద్ లక్ష్మణ్ నాయక్ విగ్రహాన్ని ప్రతిష్టించాలి
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొరిగుమ్మ పట్టణం ప్రధాన కూడలి వద్ద గిరిజన నేత, స్వాతంత్య్ర సమరయోధుడు సాహిద్ లక్ష్మణ్ నాయక్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని బొరిగుమ్మ ఆదివాసీ జాగరణ మంచ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివాసీ జాగరణ మంచ్ అధ్యక్షుడు సత్యనారాయణ నాయక్ నేతృత్వంలో పలువురు ఆదివాసీ నేతలు జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. బొయిపరిగుడ సమితి తెంతులిఖుంటి గ్రామంలో జన్మించిన లక్ష్మణ నాయక్ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడని గుర్తు చేశారు. అతని స్మృతి చిహ్నంగా బొరిగుమ్మ ప్రధాన కూడలి వద్ద విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ జాగరణ మంచ్ ఉపాధ్యక్షుడు కొములు జాని, న్యాయ సలహాదారు హరీష్ ముదులి, మంచ్ సభ్యులు ప్రకాశ్ కుమార్ జాని, శామ జాని, పితబాష్ హల్వా, చయితన భొత్ర తదితరులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలతో జీవితం చిత్తు
పర్లాకిమిడి: మత్తు పదార్థాలతో జీవితం చిత్తు అవుతుందని వక్తలు అన్నారు. నిషా విముక్త భారత్ అభియాన్ పిలుపు మేరకు సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం ఆధ్వర్యంలో మత్తు వదలండి, ఆరోగ్యంగా ఉండండి నినాదంతో మహారాజా బాలుర ఉన్నత పాఠశాల వద్ద నుంచి కలెక్టరేట్ వరకు చైతన్య ర్యాలీని ఏడీఎం మునీంద్ర హానగ శనివారం ప్రారంభించారు. ఈ ర్యాలీలో స్కూల్ విద్యార్థులతో పాటు ఎన్జీవో సంస్థల ప్రతినిధులు, జిల్లా సామాజిక సురక్షా అధికారి ఉత్సర్ గీతా బోడోరయితో, సబ్ డివిజనల్ సామాజిక సురక్షా అధికారి లక్కోజు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా న్యాయ సంహిత ప్రదర్శన
భువనేశ్వర్: దేశంలోని కొత్త క్రిమినల్ చట్టాలపై సాధారణ పౌరులకు అవగాహన కల్పించేందుకు ఒడిశా పోలీసులు స్థానిక ఇడ్కో ప్రదర్శన మైదానంలో న్యాయ సంహిత ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు అనూహ్య స్పందన వచ్చింది. వివిధ డిజిటల్ డిస్ప్లే బోర్డులు, సమాచార ప్యానెల్లు మరియు వివరణాత్మక ప్రదర్శనల ద్వారా ప్రజలకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) మరియు భారతీయ సాక్ష్య అధికారియం (బీఎస్ఎ) కొత్త భారతీయ క్రిమినల్ చట్టాల గురించి వివరించారు. కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆమోదించిన 10 స్టాల్స్లో సాధారణ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ప్రదర్శన ఈనెల 10వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతుంది. -
పెళ్లి పత్రికలు పంచి వస్తూ..
● రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ దుర్మరణం ● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఇచ్ఛాపురం రూరల్: వరుసకు తమ్ముడు పెళ్లిని ఘనంగా జరిపించాలనే ఆనందంతో సెలవు తీసుకొని గ్రామానికి వచ్చిన ఓ జవాన్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇచ్ఛాపురం రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కంచిలి మండలం బొనమాలి గ్రామానికి చెందిన బడ్డి బాలకృష్ణ(28) ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నాడు. పెద్దనాన్న కుమారుడు, వరుసకు తమ్ముడైన చంద్రశేఖర్ వివాహం సందర్భంగా సెలవుపై శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఒడిశా రాష్ట్రం జయంతిపురం, పాత్రపురం, సామంతపల్లి ప్రాంతాల్లో బంధువులు ఉండటంతో వారిని పెళ్లికి ఆహ్వానించేందుకు తమ్ముడు బడ్డి సర్వేశుతో కలిసి శనివారం ఉదయం ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. పెళ్లి కార్డులు అందించి తిరిగి వస్తుండగా కొత్త శాసనాం హనుమాన్ ఆలయం వద్దకు వచ్చే సరికి ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామానికి చెందిన యువకుడు రామిశెట్టి దిలీప్ అదే రోడ్డు గుండా ఒడిశా వెళ్తూ రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆర్మీ జవాన్ బాలకృష్ణ తలకు బలంగా దెబ్బ తగలగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చెరో బైక్పై ఉన్న సర్వేశు, దిలీప్లు తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు 108లో ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణకు ఏడాది క్రితం బాడపల్లి గ్రామానికి చెందిన శృతితో వివాహం జరిగింది. ఇంతలోనే మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు పార్వతి, దుర్యోధనలతో పాటు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని శవపంచనామాకు ఇచ్ఛాపురం సీహెచ్సీకి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై జనార్దనరావు తెలిపారు. -
ప్రెస్క్లబ్కు స్థలం కేటాయించండి
జయపురం: పట్టణంలో ప్రెస్క్లబ్కు స్థలం కేటాయించాలని జర్నలిస్టులు కోరారు. ఈ మేరకు మున్సిపల్ కార్య నిర్వాహక అధికారి, జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అవిభక్త కొరాపుట్లో ప్రధాన కేంద్రమైన జయపురంలో వివిధ భాషల పత్రికల, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి 60 మందికిపైగా జర్నలిస్టులు ఉన్నారన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రెస్క్లబ్లు ఉన్నా జయపురంలో లేకపోవడం విచారణకరమని పేర్కొన్నారు. దీనిపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రబి నాయిక్, కమల బొత్ర, ఎ.వెంకటరావు, అనిత దాస్, జోగేంద్ర సింగ్, సన చౌదరి తదితరులు పాల్గొన్నారు. సైబర్ పోలీస్స్టేషన్ ప్రారంభంకొరాపుట్: పెరుగుతున్న సైబర్ నేరాలు అరికట్టేందుకు నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో డీఎస్–3 సమీపంలోని పాత పోలీస్ అవుట్ పోస్టు ప్రదేశంలో సైబర్ పోలీస్స్టేషన్ శనివారం ప్రారంభించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్ విధానంలో ఈ స్టేషన్ ప్రారంభించారు. జిల్లాకు ఇదే తొలి సైబర్స్టేషన్ కావడం గమనార్హం. ఈ స్టేషన్లో ఒక డీఎస్పీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు విధులు నిర్వర్తించనున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, ఎస్పీ సంబిత్ సంపత్, నబరంగ్పూర్ ఎమ్మల్యే గౌరీ శంకర్ మజ్జి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పరిశీలన జయపురం: సబ్ డివిజన్ పరిధి బొయిపరిగుడ సమితిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్ శనివారం పరిశీలించారు. దసమంతపూర్ పంచాయతీ కాకలపడ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొత్తగా నిర్మిస్తున్న తరగతి గదులు, పీహెచ్సీకి వెళ్లి అక్కడి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బాలిగుడ గ్రామంలో పండిస్తున్న కూరగాయల పంటలను చూశారు. అనంతరం చంద్రపడ పంచాయతీ దొరాగుడలో బిజూ పట్నాయిక్ గ్రామీణ పరిశ్రమలను పరిశీలించారు. ఆయనతో పాటు కొరాపుట్ సీడీవె బేణూధర శబర, బొయిపరిగుడ సమితి బీడీవో శుభ్రత సాహు, పంచాయతీ సమితి అధ్యక్షుడు ప్రశాంత కుమార్ గుప్త తదితరులు ఉన్నారు. బాలుడి దారుణ హత్య రాయగడ: ఏడేళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా గొంతుకొసి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని బిసంకటక్ సమితి చాటికొన వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడు చాటికొన గ్రామానికి చెందిన పురుషోత్తం గంతాయిత్ పెద్ద కొడుకు రుషి గొంతాయిత్గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం చాటికొన గ్రామంలోని పాత రైల్వేస్టేషన్ వీధిలో నివసిస్తున్న పురుషోత్తం గంతాయిత్ పెద్ద కొడుకు రుషిని గుర్తు తెలియని కొందరు దుండగులు అపహరించారు. కొద్దిసేపటి తర్వాత బాలుడి మేనమామ సెల్ఫోన్కు బాలుడు తమ వద్దే ఉన్నాడని, రూ.4 లక్షలు ఇస్తే బాలుడిని తిరిగి పంపిస్తామన్నారు. విషయాన్ని ఒకవేళ పోలీసులకు తెలియజేస్తే బాలుడిని చంపేస్తామని హెచ్చరిస్తూ మెసేజ్ వచ్చింది. అప్పటికే బాలుడి ఆచూకీ కోసం వెతుకున్న పురుషోత్తం గంతాయిత్కు ఆ మెసేజ్ను చూపించాడు. అయితే అనంతరం శుక్రవారం రాత్రి చుట్టుపక్కలా వెదకడం ప్రారంభించారు. కొద్ది సమయానికే పురుషోత్తం ఉండే ఇంటికి కొద్దిదూరంలో ఉన్న మరో పాత ఇంటి వెనుక ఒక గోనె సంచిలో బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. -
విప్లవాత్మక మార్పులు
ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026విద్యా విధానంలో..● రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండోరాయగడ: రాష్ట్రంలోని విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండో అన్నారు. స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానం ప్రాంగణంలో నిర్వహిస్తున్న పీఎంశ్రీ వేడుకల ముగింపులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యా విధానంలో కొత్త పుంతలు తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో 762 పీఎంశ్రీ విద్యాలయాలుగా గుర్తించామని తెలిపారు. దీనిలో భాగంగా రాయగడ జిల్లాలో 15 పీఎంశ్రీ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్ లభించిందని వివరించారు. ఈ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి విద్యార్థులు స్వయం ఉపాధిపై దృష్టి సారించాలని మంత్రి నిత్యానంద గొండో అన్నారు. విద్యార్థి దశలోనే చదువుతో పాటు ప్రతిభకు అనుకూలంగా స్కిల్ డవలప్మెంట్ వంటివాటిలో ఆసక్తి కనబర్చేలా శిక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పీఎంశ్రీ ఉత్సవాల్లో భాగంగా సభా వేదిక ప్రాంగణంలో మోడల్ పార్లమెంట్ను విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలను కంటికి కనిపించేవిధంగా విద్యార్థులు ప్రదర్శించడం ఆకట్టుకుంది. అదేవిధంగా ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఏవిధంగా సహకరిస్తోందనే విషయమై ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, జిల్లా విద్యాశాఖ అధికారి రామచంద్ర నాహక్, ఏడీఈవోలు సస్మిత బెహర, శాంతిలత మున్ని, అదనపు జిల్లా విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి తదితరులు పాల్గొన్నారు. -
ఖుర్ధాలో నాటుబాంబు దాడి
● బాలుడి పరిస్థితి విషమం భువనేశ్వర్: ఖుర్ధా జిల్లా జట్ని సమీపంలోని పద్మపూర్ కూడలి వద్ద జరిగిన నాటుబాంబు దాడిలో మైనర్ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరికి ఈ దాడిలో స్వల్పంగా గాయాలయ్యాయి. ఇరువర్గాల మధ్య విబేధాలు పెచ్చుమీరి ఈ పరిస్థితి తాండవించింది. నిందితులు మరియు బాధితుల మధ్య వాగ్వాదం సందర్భంగా కులం, జాతి వివక్షతో అవమానించిన విమర్శలు తాళలేక నిందితుడు ప్రత్యర్థులపై నాటు బాంబులు రువ్వినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన మైనర్ బాలుడిని తొలుత ఖుర్ధా జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో ప్రత్యేక చికిత్స కోసం భువనేశ్వర్ ఎయిమ్స్కు తరలించారు. స్వల్పంగా గాయపడిన మిగతా ఇద్దరు బాధితులు స్థానికంగా చికిత్స పొందుతున్నారు. పేలుడు తర్వాత నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పిప్పిలి, ఖుర్ధా ప్రధాన రహదారిని దాదాపు రెండు గంటల పాటు దిగ్బంధించి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న జట్ని ఠాణా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను శాంతింపజేసి స్తంభించిన వాహనాల రవాణా పునరుద్ధరించారు. పూరీ దర్శనానికి ఉచిత బస్సులు పర్లాకిమిడి: పూరీ శ్రీజగన్నాథ్ దర్శన్ పథకం కింద వయోవృద్ధులకు బస్సులను కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ ఇండోర్ స్టేడియం వద్ద శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు మాట్లాడుతూ.. వయోవృద్ధులకు జగన్నాథ్ ధామ్ దర్శనాన్ని ఉచితంగా ప్రభుత్వం కల్పించడం అదృష్టమన్నారు. వృద్ధులకు ప్రయాణానికి కావాల్సిన కిట్ బ్యాగును అందజేశారు. గజపతి జిల్లా నుంచి 74 మంది రెండు ఒడిశా టూరిజం బస్సుల్లో పర్లాకిమిడి నుంచి బయలుదేరారు. కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, జిల్లా ఇన్చార్జి టూరిజం అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, సుధీర్ సాబత్ తదితరులు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
రాయగడ: స్థానిక సాయి ఇంటర్నేషనల్ వద్ద ఆగి ఉన్న ఒక కారుపై పక్కనే ఉన్న ఒక భారీ వృక్షం విరిగి పడిపోయింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో కారులో ఉన్న డ్రైవర్, మరో ప్రయాణికుడు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి మరమ్మతుల్లో భాగంగా వాహనాలను సాయి ఇంటర్నేషనల్ బైపాస్ రోడ్డు వైపు దారి మళ్లించారు. ఈ క్రమంలో ఆ దిశగా కారు వెళ్తున్న సమయంలో సమీపంలోని రైల్వే క్రాసింగ్ గేటు పడడంతో వాహనాలు నిలిచి ఉన్నాయి. అదే సమయంలో సాయి ఇంటర్నేషనల్ సమీపంలో ఆగి ఉన్న ఒక కారుపై రోడ్డుకు పక్కనే ఉన్న ఎండిపోయి ఉన్న ఒక భారీ వృక్షం కారు ముందు భాగంపై పడిపోయింది. దీంతో కారు ముందరి భాగం దెబ్బతింది. కారులో ఉన్నవారు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని విరిగిపడిన వృక్షాన్ని తొలగించారు. అంతవరకు రహదారి వద్ద వాహనాలు నిలిచిపోయాయి. హర్షవర్ధన్ బెయిల్ రద్దు చేయాలి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): దళిత మహిళను మోసగించి లైంగిక దాడికి పాల్పడిన న్యాయవాది, జిల్లా న్యాయ సేవాసమితి సభ్యుడు హర్షవర్ధన్ బెయిల్ రద్దు చేసి వెంటనే రిమాండ్కు పంపించాలని విదసం, విస్త్రృత దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిర్లో దళిత, ఆదివాసీ, ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్షవర్ధన్ జిల్లా న్యాయ సేవాసంఘంలో సభ్యుడిగా ఉన్న హోదాను అడ్డం పెట్టుకుని 50 రోజులు రిమాండ్కి వెళ్లాల్సిన కేసులో బెయిల్ పొందాడని, ప్రాసిక్యూషన్ స్పందించి బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ డి.గణేశ్ మాట్లాడుతూ హర్షవర్ధన్ను లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి, బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. యడ్ల గోపి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ లాయర్లు అసోసియేషన్ జిల్లా నాయకులు బి.మురళీకృష్ణ, వివిధ సంఘాల నాయకులు బడియా కామరాజు, సవాలపురపు కృష్ణవేణి, రాకోటి రాంబాబు, దండాసి రాంబాబు, అర్జి ఈశ్వరరావు, అర్జి కోటి, వన్నలి లక్ష్మీనారాయణ, టి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
సెంచూరియన్లో మహిళా దినోత్సవ వేడుకలు
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ముందస్తుగా నిర్వహించారు. మహిళా సాధికారత, సమానత్వం, అవకాశాలను అందిపుచ్చుకోవడం, ఆరోగ్యంపై ప్రముఖులు ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రి గైనకాలజిస్టు డాక్టర్ సుకన్య సనపాల మాట్లాడుతూ.. మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ.. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్వాస్ స్వచ్ఛంద సంస్థ (ఏసాక్స్) టి.ఐ.ప్రాజెక్టు మేనేజర్ పి.సునీత మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించేందుకు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించాలన్నారు. అనంతరం మహిళలకు పలు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డా.అనితాపాత్రో, డైరక్టర్ (అడ్మిన్) దుర్గాప్రసాద్ పాడి, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎన్.సంధ్య, అసోసియేట్ డీన్ ప్రజ్ఞా పాణి తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
రాయగడ: ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లాలోని గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనిల్ స్పందించారు. ఈ మేరకు ఆయన శనివారం ఉదయం వంశధార నది వద్ద ఆకస్మిక దాడులను నిర్వహించారు. వంశధార నది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలించేందుకు ఉన్న 7 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అలాగే రూ.3.56 లక్షల జరిమానా విధించారు. దాడుల్లో డిప్యూటీ కలెక్టర్ శుభ్రత్ రౌత్, తహసీల్దార్ అభికాస్ శతపతి, అదనపు తహసీల్దార్ దీపారాణి బెహర తదితరులు పాల్గొన్నారు. -
ఒడిశాలో ముడి చమురు కొరత లేదు
● మంత్రి కృష్ణచంద్ర పాత్రోభువనేశ్వర్: దేశవ్యాప్తంగా శనివారం నుంచి వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెంచారు. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60లు పెరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. తాజా పెరుగుదలతో భువనేశ్వర్లో 14.2 కిలోల వంట గ్యాస్ బండ ధర రూ.939లకి పెరిగింది. ఒడిశాలో తగినంత ముడి చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎటువంటి కొరత లేదని రాష్ట్ర ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్రో ప్రకటించారు. మధ్యప్రాచ్య సంఘర్షణకు సంబంధించి టెలివిజన్ ప్రసారాలు తప్పుదారి పట్టించే నివేదికలపై ప్రజలు భయపడి ఆందోళన చెందాల్సిందేమి లేదన్నారు. దయచేసి టీవీ ఛానల్స్ లేదా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని కోరారు. రష్యా నుంచి చమురు వస్తోందని, దైనందిన వినియోగానికి సరఫరాకు ఎటువంటి అవాంతరం లేదని స్పష్టం చేశారు. అవాంఛిత భయాందోళనతో పెట్రోల్ పంపుల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి లేదన్నారు. విభాగం అధికారులు బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. ముడి చమురు మరియు ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీని నిశితంగా గమనిస్తున్నామని, ఏవైనా అవకతవకలు జరిగితే వెంటనే పరిష్కరిస్తాము. ముడి చమురును అవసరాలకు మించి కొనుగోలు చేసి అవాంచితంగా నిల్వ చేయవద్దని కోరారు. -
జయపురంలో అవినీతిపై దర్యాప్తు చేయాలి
జయపురం: జయపురం మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని మాజీమంత్రి రబీ నారాయణ నందో నేతృత్వంలో బీజేడీ శ్రేణులు కోరారు. ఈ మేరకు కొరాపుట్ ప్రాంతీయ విజిలెన్స్ ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. జయపురం రాజుల కాలంలో ఏర్పాటు చేసిన జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనుల్లో తప్పుడు బిల్లులతో అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అలాగే 24వ వార్డులో ఎస్జీహెచ్ గ్రూపు పేరుపై రూ.35 లక్షలు స్వాహా చేశారని దుయ్యబట్టారు. వారం రోజుల్లో దర్యాప్తు చేయకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేడీ నేతలు దుర్గా ప్రసాద్ మిశ్ర, సూర్యనారాయణ రథ్, బాలారాయ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బి.సునీత, దేవరాజ్ చౌదరి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నవ్వు ఆరోగ్యానికి ఎంతోమేలు
రాయగడ: నవ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని స్థానిక ప్రేమ్ పహాడ్ లాఫర్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బాబూరావు మహాంతి అన్నారు. ప్రేమ్ పహాడ్ వద్ద శుక్రవారం క్లబ్ సభ్యులు నిర్వహించిన బోర్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు. నవ్వు ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంతో అందరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ క్లబ్ను ఏర్పాటు చేయడమైందని అన్నారు. ఎంతోమంది ఉత్సాహంతో క్లబ్లో సభ్యులుగా చేరుతుందడడం అభింనదనీయమని అన్నారు. వ్యాయామంతో పాటు నవ్వు కూడా ఎలా ఆరోగ్యానికి సహాయపడుతోందన్న అంశాలకు సంబంధించి బ్యానర్లను పట్టుకుని ప్రేమ్ పహాడ్ వద్ద చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడకు వ్యాయామం, వాకింగ్ కోసం వచ్చే వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సభ్యులు అభిమన్యు నాయక్, జయరాం టంకాల, ఉదయ పండ, లాల్బిహారీ లెంక పాల్గొన్నారు. -
చంద్రపూర్లో భారీ అగ్ని ప్రమాదం
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్లో భారీ అగ్ని ప్రమాదం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సంభవించింది. ఈ ప్రమాదంలో తాగునీటి మెగా ప్రాజెక్టుకు సంబంధించిన ప్లాస్టిక్ పైపులు దగ్ధమయ్యాయి. చంద్రపూర్లోగల డెఫ్పావీధిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. చుట్టు పక్కల గల పూరి గుడిసెలకు చెందిన వారు ప్రాణ భయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంతవరకు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదపు చేయగలిగారు. ఈ ప్రాంతంలో ప్రజల తాగునీటి సౌకర్యార్థం ప్రభుత్వం మెగా తాగునీటి ప్రాజెక్టు పనులను నిర్వహిస్తుంది. అందుకు సంబంధించిన ప్లాస్టిక్ పైపులను డెప్పాగుడ ప్రాంతంలొ డంపింగ్ చేశారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా లక్షల రూపాయలు విలువ చేసే పైపులు మంటలకు దగ్ధమైనట్లు ప్రాథమిక అంచనా కింద సంబంధిత శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్లాస్టిక్ పైపులు కావడంతో మంటలను అదుపు చేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అసలు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని అగ్నిమాపక అధికారులు వివరించారు. -
పీఎంశ్రీతో మెరుగైన విద్య
రాయగడ: విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో పీఎం శ్రీ యోజన ప్రారంభమైందని కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం నుంచి జిల్లాస్థాయి పీఎంశ్రీ ఉత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రెండు రోజుల పాటుగా జరిగే ఈ ఉత్సవాల్లో వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దడంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడమే పీఎంశ్రీ యోజన ముఖ్య ఉద్దేశమని వివరించారు. దీనివలన విద్యార్థులు మెరుగైన విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. చదువుతోనే విద్యార్థుల భవిత ఆధారపడి ఉంటుందని, ఇటువంటి సదావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామచంద్ర నాహక్, జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి, గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల హెచ్ఎం నమితా ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026
కలెక్టర్ కార్యాలయంలో గ్రీష్మతాపం, వడదెబ్బల నివారణ చర్యల సమావేశంలో కలెక్టర్, ఇతర అధికారులువడదెబ్బల నివారణపై..సన్నాహాక సమావేశంపర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాస్థాయి గ్రీష్మతాపం, వడదెబ్బలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సన్నాహాక సమావేశం కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్ అధ్యక్షతన జరిగినది. మార్చి మాసం నుంచి జూన్ వరకూ గజపతి జిల్లాలో వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికల దృష్ట్యా ప్రభుత్వ శాఖలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కలెక్టర్ సమావేశంలో వివరించారు. వడదెబ్బల నివారణకు పట్టణంలో పురపాలక సంఘం తాగునీటి సమస్య అధిగమించటం, విద్యుత్ అప్రకటిత కట్ నివారణ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు ఉదయపు బడులు నిర్వహించడం, అలాగే జంగిల్ సురక్ష, కార్మికుల పనివేళలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటలు, తర్వాత సాయంత్రం నిర్వహణపై జిల్లా కార్మికశాఖకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఒంటిపూట బడులు తెరవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వడదెబ్బల ఆహుతులకు ప్రత్యేక వార్డు కేటాయించాలని కూడా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఏడీఎం మునీంద్ర హానగ, సబ్ కలెక్టర్ అనుప్పండా, ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో, జిల్లా ఎమర్జెన్సీ అధికారి బినాయక్ రవుళో తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
జయపురం: జయపురం సబ్ డివిజన్ కోట్పాడ్ సమితి గులిమి పర్యాటక ప్రాంతంలో ఒక యువకుడి మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. ఒక రాయి కింద ఉన్న ఆ మృతదేహం కోడ్పాడ్ సమితి ముర్తిహండి గ్రామానికి చెందిన భగీరథి హరిజన్(30)దిగా నిర్ధారించారు. విషయం తెలియడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యువకుడిని హత్యచేసి అనంతరం గులుమి జలపాతంలో ఒక రాయి కిందకు మృతదేహాన్ని తోసేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా అనుమానితులైన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు బొరిగుమ్మ సబ్ డివిజన్ పోలీసు అధికారి సత్యభ్రత లెంక వెల్లడించారు. హత్యకు గల కారణాలు తెలియలేదని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. కోట్పాడ్ పోలీసు అధికారి ఫకీర్ మోహన్ కర్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు.రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి ● మరొకరికి తీవ్రగాయాలు భువనేశ్వర్: భువనేశ్వర్, పూరీ జాతీయ రహదారిపై దండముకుందపూర్ బైపాస్ సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే ప్రాణాలుకోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పిప్పిలి ప్రాంతంలో రోడ్డు దాటుతున్న వారిని వేగంగా వచ్చిన హైవా ట్రక్ దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం భువనేశ్వర్ క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాల సమాచారం. మృతుల ఆచూకీ తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇంటిలోకి దూసుకు పోయిన ట్రాలర్● ఒకరు దుర్మరణంభువనేశ్వర్: ఢెంకనాల్ జిల్లా గోండియా మండలం హత్తిబాడి గ్రామంలో గురువారం రాత్రి పూట ఒక గగుర్పొడిచే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ట్రాలర్ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. దీని ఫలితంగా ఇంటిలో నిద్రిస్తున్న ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఆన్లైన్ మ్యాప్ సూచించిన మార్గాన్ని అనుసరించి ట్రాలర్ ఢెంకనాల్ నుంచి కోల్కతాకు సరుకు లోడుతో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మందర్ చౌరస్తా సమీపంలో ట్రాలరు అదుపు తప్పి హత్తిబాడి గ్రామంలో ఒక ఇంటి ముందు నిలిచి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టి చేరువలో ఉన్న ఇంటిలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇంటికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇంటిలో నివసిస్తున్న అస్థిర తొరాయ్ అనే వ్యక్తి ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ట్రాలరు జార్ఖండ్లో రిజిస్టర్ అయిందని తెలుస్తోంది. ఈ సంఘటన స్థానికుల్ని దిగ్భ్రాంతికి గురి చేసి విషాదం అలముకుంది. బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి రామగిరి ప్రాంతంలో బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రామగిరి గ్రామానికి చెందిన మనోహర్ మచ్చ గ్రామ సమీపంలోని చెరువు వద్దకు కాలకృత్యాల కోసం వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు వద్ద నిల్చున్నాడు. అదే సమయంలో గొడమపొణి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బొయిపరిగుడ నుంచి తన గ్రామానికి బైక్ వెళ్తూ మనోహర్ మచ్చను వెనుక నుంచి ఢీకొన్నాడు. దీంతో అతడు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు మనోహర్ను రామగిరి ప్రాథమిక వైద్య కేంద్రంలో చేర్చారు. అనంతరం ఉన్నత చికిత్స కోసం అతడిని బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్కు తరలించారు. తదుపరి మరింత మెరుగైన వైద్యం కోసం కొరాపుట్ సాసహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య విద్యాలయ మెడికల్కు తరలించారు. -
మావోయిస్టు ఆజాద్పై నాలుగు కేసుల కొట్టివేత
పర్లాకిమిడి: ఏఓబీ మావోయిస్టు నేత దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ను శుక్రవారం గజపతి జిల్లా కోర్టుకు ప్రత్యేక వాహనంలో అత్యంత భద్రత నడుమ తీసుకువచ్చారు. 14 ఏళ్ల కిందట ఆయనపై నమోదైన కేసులకు సంబంధించి తీర్పు వెలువరించారు. ఆజాద్ పై మొత్తం 36 కేసులు ఉన్నాయి. అందులో ఒకటి బిస్సం కటక్ పరిధిలోని ఒకటి ఉంది. మొత్తం 36 క్రిమినల్ కేసులకు గాను నాలుగు కేసులు వాదించారు. వాటిలో 2 కేసులు సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల న్యాయమూర్తి కొట్టివేశారు. సుప్రీంకోర్టులో 2024లోఒక కేసు పెండింగ్లో ఉంది. మిగతా 32 కేసులు వర్చువల్ పద్ధతిలో విచారిస్తామని న్యాయాధికారులు తెలియజేశారు. 14 ఏళ్లు ఒడిషా జర్ఫడా (భువనేశ్వర్)జైలులో ఉన్న ఆజాద్ అలియాస్ డి.కేశవరావు కేసులను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఒక ఏడాదిలో విచారణ పూర్తి చేయాలన్న ఆదేశాలపై నేడు పర్లాకిమిడి జిల్లా కోర్టులో హాజరుపరిచినట్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.పృథ్వీరాజ్ తెలిపారు. ఆజాద్ తరపున న్యాయవాది స్వరూప్ కుమార్ పాల్ వాదనలు వినిపించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండళం నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన డి.కేశవరావు గత 14 ఏళ్లుగా భువనేశ్వర్ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నారు. విచారణ అనంతరం ఆజాద్ను మధ్యాహ్నం 2.30 సమయంలో భువనేశ్వర్ జైలుకు తరలించారు. -
సైబర్ క్రైమ్ కార్యాలయం ప్రారంభం
పర్లాకిమిడి: స్థానిక ఆదర్శ పోలీస్స్టేషన్లో సైబర్ అపరాధం, ఫైనాన్స్ మోసాలపై నూతన కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం సాయంత్రం వర్చువల్గా ప్రారంభించారు. ఎమ్మెల్యే దాశరథి గొమాంగో శిలాఫలకాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఎలాంటి సైబర్ మోసాలైనా పర్లాకిమిడి ఆదర్శ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవచ్చని ఎస్పీ జ్యోతింద్ర పండా అన్నారు. కార్యక్రమంలో మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, ఎస్పీ జ్యోతింద్ర పండా, డీఎఫ్ఓ కె.నాగరాజు, అదనపు ఎస్పీ సునీల్కుమార్ మహంతి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి అమితాబ్ పండా, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ మహాంతి, బార్ అసోసియేషన్, డీఈఓ డాక్టర్ మయాధర్ సాహు, సైబర్ క్రైం ఆదనపు ఎస్పీ సరితా బోహెరియా, మోడల్ పోలీసుస్టేషన్ ఐఐసి ప్రశాంత భూపతి కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, పురపాలక సంఘం చెర్మన్ నిర్మలా శెఠి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
● రాజ్యసభ ఎన్నికలు
● రాష్ట్రంలో ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు ఆమోదంభువనేశ్వర్: రాష్ట్రంలో ఈ నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల ఆమోదం పూర్తయ్యింది. పోటీ కోసం దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థుల దస్తావేజుల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయ్యింది. అందరినీ అర్హులుగా ప్రకటించారు. దీంతో రాజ్య సభ ఎన్నికల తొలి ఘట్టం విజయవంతంగా ముగిసింది. శుక్రవారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో సంతృప్త్ మిశ్రా, డాక్టర్ దత్తేశ్వర్ హొత్తా, మన్మోహన్ సామల్, సుజీత్ కుమార్, దిలీప్ రే నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. సంతృప్త్ మిశ్రా మరియు డాక్టర్ దత్తేశ్వర్ బిజూ జనతా దళ్ (బీజేడీ) అభ్యర్థులుగా బరిలోకి దిగారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు సుజీత్ కుమార్లను పోటీకి నిలబెట్టింది. అదనంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ నాయకుడు దిలీప్ రేకు భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. రాష్ట్రం నుండి 4 రాజ్యసభ స్థానాల్లో మూడింటిని గెలుచుకునేందుకు బీజేపీ ఈ వ్యూహం పన్నినట్లు స్పష్టం అవుతుంది. రాజ్య సభ ఎన్నికల గణాంకం ప్రకారం ఒక సీటు గెలవాలంటే అభ్యర్థికి కనీసం 30 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలం 82 మంది ఎమ్మెల్యేలు. వీరి మద్దతుతో ఆ పార్టీ 2 సీట్లను సులభంగా గెలుచుకునే అవకాశం ఉంది. చివరగా తన ఖాతాలో 22 మిగులు ఓట్లు ఉన్నాయి. ఈ భరోసాతో కావలసిన మరో 7 ఓట్లు కూడగట్టుకునే మనోధైర్యంతో స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దింపినట్లు బీజేపీ శిబిరాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పోటీ నుంచి వైదొలిగే నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయితే రాజ్య సభ ఎన్నికల పోటీ ముఖ చిత్రం స్పష్టం అవుతుంది. -
39 యూనిట్ల రక్తం సేకరణ
జయపురం: జయపురం మాజెస్టీ కియా, టాటా మోటార్స్, ఒడిశా రక్తదాత మహాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రెండు శిబిరాలు నిర్వహించారు. కియా షోరూం, టాటా మోటార్స్ ప్రాంగణం ఆడిటోరియంలో శిబిరాలు నిర్వహించగా కియా శిబిరాన్ని ఆ సంస్థ ప్రధాన అధికారి మీనకేతన సాహు ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ఎస్బీఐ ప్రాంతీయ మేనేజర్ సుభాష్ చంద్ర బెహరా హాజరయ్యారు. జయపురం సబ్డివిజన్ రక్తదాతల మోటివేటెడ్ కార్యదరి్శు ప్రమోద్ కుమార్ రౌళో, నిరంజన్ కుమార్ పాణిగ్రహి రక్త దాన శిబిరాలను పర్యవేక్షించారు. కియా షోరూంలో 24 యూనిట్ల రక్తం సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ రక్తదాన శిబిరంలో కొరాపుట్ సాహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రిలోగల ఒడిశా రక్త దాతల మహాసంఘ ప్రతినిదిలు వి.గంగాధర్, సంజయ సింగ్ రవీంధ్ర మిశ్రలు దాతల నుంచి రక్తం సేకరించారు. అలాగే టాటా షోరూం నిర్వహించిన శిబిరంలో ఒడిశా రక్తదాతల మహాసంఘం జయపురం ప్రతినిధులుక్ష్ మీకాంత గైనీ, అభయ పండ, సునీత పర్యవేక్షణలో వారి బృందం దాతల నుంచి రక్తం సేకరించారు. టాటా షోరూం శిబిరంలో 15 యూనిట్ల రక్తం సేకరించినట్లు వారు వెల్లడించారు. -
ఆరోగ్య కార్యకర్తల సేవలు ప్రశంసనీయం
● జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజిని దేవిరాయగడ: గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పట్టణ ప్రాంతాల వరకు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో ఆశ, అంగన్వాడీ, ఆరోగ్య కార్తకర్తల సేవలు ప్రశంసనీయమని జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజినిదేవి అన్నారు. స్థానిక బిజూపట్నాయక్ ఆడిటోరియంలో శుక్రవారం ఆరోగ్య, ఆశ, అంగన్వాడీ కార్యకర్తల వార్షిక సమావేశంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంతోపాటు ప్రభుత్వ పథకాలు ప్రజల దరికిచేరే విషయంలో ఆశ, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తల సేవలు ఎంతో విలువైనవని అన్నారు. అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలను ప్రజలకు అందించడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. అనంతరం వారి సేవలను ప్రశంసిస్తూ ఉత్తమ సేవలను అందించిన వారిని సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రజారోగ్య శాఖ (కుటంబ నియంత్రణ)అధికారి డాక్టర్ కిశోర్కుమార్ రాయ్, డాక్టర్ శ్యామ్ చరణ్ గురు, డాక్టర్ మమత చౌదరి, డాక్టర్ ప్రదీప్ కుమార్ సుబుద్ధి పాల్గొన్నారు. -
మృతుడి వివరాలు లభ్యం
టెక్కలి రూరల్ : టెక్కలిలోని గురుకుల పాఠశాల సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద ఓ వ్యక్తి మృతదేహం ఈ నెల 2న వెలుగుచూసిన సంగతి తెలిసిందే. మృతుడి వివరాలను పోలీసులు శుక్రవారం వెల్లడించారు. బీహార్ రాష్ట్రం మారియా గ్రామానికి చెందిన సునీల్కుమార్ మారాండీ(35) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇక్కడికి వచ్చాడని, ఈ నెల 1వ తేదీ రాత్రి బొరిగిపేట గ్రామంలో తిరుగుతుండగా గ్రామస్తులు పట్టుకుని దొంగగా అనుమానించారని తెలిపారు. మరుసటి రోజు ఉదయం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్ పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. ఈ మేరకు కుటుంబసభ్యులు రావడంతో మృతదేహానికి శవపంచనామా నిర్వహించి అప్పగించనున్నట్లు తెలిపారు. కొత్తూరు: కొత్తూరు బీసీ కాలనీ, మెట్టూరు బిట్–3 ఆర్ఆర్ కాలనీలో శుక్రవారం విషాదఛాయలు అలముకున్నాయి. బీసీ కాలనీకి చెందిన దామాన ఆదినారాయణ(45), ఆర్ఆర్ కా లనీకి చెందిన మచ్చ తిరుపతిరావు(40) శుక్రవారం హైదరాబాద్లోని టోలిచౌక్లో పరంజీ కూలిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. వీరిద్దరూ పదేళ్లుగా హైదరాబాద్లో మేస్త్రి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఆదినారాయణకు భార్య అనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తిరుపతిరావుకు భార్య రజిని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రణస్థలం: ఒడిశాలోని హడ్డుబంగి నుంచి హైదరాబాధ్ వెళుతున్న స్కార్పియో కారు అదుపుతప్పి లావేరు మండలం అదపాక ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందించారు. డ్రైవర్ నిద్రమత్తే ఘటనకు కారణమని లావేరు పోలీసులు భావిస్తున్నారు. చెరువులో గుర్తు తెలియని మృతదేహం పలాస: గోపాలపురం పెద్ద చెరువులో శుక్రవా రం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు కాశీబుగ్గ సీఐ రామకృష్ణ తెలిపారు. శరీరం మ ట్టిలో కలిసిపోయి ఎముకుల గూడు మాత్రమే మిగిలి ఉందన్నారు. షర్టు, షార్టు ధరించి ఉన్నాడని, వివరాలకు కాశీబుగ్గ పోలీసుస్టేషన్ (6309990825)లో సంప్రదించాలని కోరారు. టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి గో కార్టింగ్ పోటీల్లో భాగంగా శనివారం ఫైనల్ రేస్ జరగనుంది. ఈ మేరకు శుక్రవారం సెమీ ఫైనల్ రేసింగ్ పోటీలు నిర్వహించారు. సామర్థ్యపు పరీక్షల నిపుణులు దుర్గాప్రసాద్, ఎం.కిరణ్కు మార్, శివతేజ, పి.హిర్లఖర్, సాగర్ వ్యాస్, ఎం.శంకర్ సాయిరాం, ఎం.కులదీప్కుమార్, జి. వరుణ్రెడ్డి తదితర బృందం సెమీ ఫైనల్ పోటీలను ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి ఆయా వాహనాల సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ ఏఎస్ శ్రీనివాసరావు, కన్వీనర్ డి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లోకి వచ్చే ముందు జనసేన నాయ కుడు నాగబాబు, కూటమి నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్న నాగబాబు ముందుగా జిల్లాలో జరిగిన సామాజిక అన్యాయంపై స్పందించి క్షమాపణ చెప్పాల్సిన అసవరం ఉందన్నారు. శుక్రవారం స్వరూప్ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో కనీసం 5 నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే రాజాం, పాలకొండ నియో జకవర్గాలు ఎస్సీ, ఎస్టీ సోదరులకు రిజర్వేషన్ల వల్ల పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో కాపులు, కాళింగ సోదరులు సమానంగా ఉన్నప్పటికీ సంప్రదాయం ప్రకారం కాళింగ సామాజిక వర్గం పోటీ చేస్తోందన్నారు. మిగిలిన ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గానికి రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. గత ఎన్నికల్లో కూటమి నాయకులు ఎచ్చెర్ల సీటును స్థానిక ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో కనీసం 400 ఓట్లు కూడా లేని ఒక సామాజిక వర్గానికి సీటు కేటాయించి కాపు సామాజిక వర్గానికి తీవ్ర అన్యా యం చేశారని విమర్శించారు. పెత్తందారుల కింద కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు పని చేయాలా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారని, నాగేంద్రబాబు, కూటమి నాయకులు ముందుగా క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ రాజకీయాలు చేయాలన్నారు. -
గంజాయితో ముగ్గురు అరెస్టు
పలాస: ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న చిత్తూరు జిల్లా ఐర్లా మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. గుండ్లపల్లి గ్రామానికి చెందిన రంబే మునికుమార్, అతని భార్య మెందరికుర్తి నందిని, ఆమె అన్నయ్య మెందరికుర్తి రామకృష్ణలు ఒడిశా నుంచి గంజాయి తీసుకొని వచ్చి పలాస రైల్వే స్టేషన్లోకి వెళ్తుండగా ముందస్తు సమాచారం మేరకు కాశీబుగ్గ ఎస్ఐ ఎన్.సునీల్కుమార్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు. వారి వద్ద నుంచి గంజాయి, మూడు ఫోన్లు, రూ.2,490 నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చెప్పారు. 146 మద్యం బాటిళ్లు స్వాధీనం వజ్రపుకొత్తూరు రూరల్: బెండిగేట్ కూడలిలో అక్రమంగా నిల్వ ఉన్న 146 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పోలీసులు పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టగా చల్లా వినోద్కుమార్ షాపులో మద్యం సీసాలు అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించారు. దుకాణదారుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ బి.నీహర్ తెలిపారు. -
తవ్వేది కొండంత!
కంచిలి: మండలంలోని జలంత్రకోట, బూరగాం పంచాయతీల పరిధిలో అక్రమార్కులు కొండలను మాయం చేసేస్తున్నారు. క్వారీయింగ్కు కొంతమేర అనుమతులు పొంది మొత్తం కొండంతా తవ్వేస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు మైన్స్ శాఖ నుంచి అనుమతులు పొందిన మేరకే క్వారీయింగ్ చేపట్టేవారు. అయితే ఇటీవల కాలంలో కొందరు క్రషర్ యజమానులు పూర్తిగా అనుమతులు లేకుండానే క్వారీయింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నంబర్ 238లోని కొండ జలంత్రకోట, బూరగాం పంచాయతీల పరిధిలో ఉంది. మొదట్లో సమీప గ్రామాల్లో ఉన్నవారు ఈ కొండలో మాన్యువల్ క్వారీయింగ్ చేసుకొని ఉపాధి పొందేవారు. తర్వాత కాలంలో ఇక్కడ నాలుగు క్రషర్లు ఏర్పడడంతో పెద్ద ఎత్తున కొండలో క్వారీయింగ్ చేపట్టారు. సుమారు రెండు దశాబ్దాల కాలంగా ఇక్కడ పెద్ద ఎత్తున క్వారీయింగ్ జరుగుతోంది. కొన్నాళ్లుగా క్వారీయింగ్కు తక్కువ విస్తీర్ణంలో ఫీజు కట్టి, నలుగురు క్రషర్ యజమానులు కొండను నాలుగు వాటాలుగా పంచుకొని నిరంతరంగా తవ్వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై జలంత్రకోట సర్పంచ్ ఆధ్వర్యంలో గతేడాది నిరసన తెలియజేయడంతో కొన్నాళ్లపాటు క్వారీయింగ్ ఆపేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ ప్రారంభించారు. ఇటీవల సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సాలిన నారాయణస్వామి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఈ క్వారీని సందర్శించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. కాలుష్యంతో ఇబ్బందులు.. బూరగాం పంచాయతీలో ఉన్న నాలుగు స్టోన్ క్రషర్ల వల్ల సమీప గ్రామాల్లో నివసిస్తున్నవారు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. క్రషర్లు వద్ద ఉన్న సుమారు 50 ఎకరాల జీడితోటలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. ఈ చెట్ల ఆకుల మీద స్టోన్ డస్ట్ పేరుకుపోవడంతో కాపు కాయడం మానేశాయని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తోటలు కాలుష్యంతో నాశనమవుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సమీప గ్రామాల్లో ఆందోళన.. అక్రమ క్వారీయింగ్ చేస్తున్న కొండల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా రాళ్లు పేల్చుతుండడంతో సమీప గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బాంబులు పేలే సమయంలో మండల కేంద్రం కంచిలి వరకు శబ్దాలకు ఇళ్లు కంపిస్తున్నాయి. సమీప గ్రామాలైన బాసుబంజిరి, జలంత్రకోట, గొల్లకంచిలి, జెన్నాగాయి తదితర గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా మైన్స్ అధికారులు ఈ క్వారీలపై విచారణ చేపట్టి, ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. జలంత్రకోట పంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్ వలన సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇక్కడ పరిమితికి మించి క్వారీయింగ్ చేయడం వలన పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వెంటనే వీరిపై చర్యలు చేపట్టాలి. – సాలిన నారాయణస్వామి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జలంత్రకోట, బూరగాం పంచాయతీల పరిధిలో ఉన్న కొండలో మెటల్ను అక్రమంగా క్వారీయింగ్ చేయడం, ఆ రాళ్లను స్థానిక స్టోన్ క్రషర్లలో ప్రాసెస్ చేయడం వలన సమీప జీడితోటలు నాశనమవుతున్నాయి. చాలాకాలంగా ఇక్కడి జీడి రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. – మడ్డు వెంకటరావు, జీడి రైతు, బూరగాం గ్రామం, కంచిలి మండలం జలంత్రకోట కొండలో అనుమతులు లేకుండా క్వారీయింగ్ నాలుగు స్టోన్ క్రషర్ నిర్వాహకుల నిర్వాకం సమీప జీడితోటలపై కాలుష్య ప్రభావం సమీప గ్రామాల్లో భయభ్రాంతులు -
మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని స్మార్టీ కిచెన్ల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు విరమించుకోవాలని, మెనూ చార్జీలు, కార్మికుల వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరావు, యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుశీల బి.ఉత్తర రాష్ట్ర ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు , ఇతర సౌకర్యాలు అమలు చేయకపోయినా, ఇదే పనిని నమ్ముకొని పనిచేస్తున్న కార్మికులను నట్టేట ముంచే ప్రయత్నం ఆపాలన్నారు. ప్రైవేట్ సంస్థలకు నిర్వహణ బాధ్యత అప్పగించడం వల్ల పిల్లలు వేడి ఆహారానికి దూరమవుతారని చెప్పారు. ఇప్పటి వరకు ఉపాధి పొందిన పేద కార్మికులు జీవనాధారం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అక్షయ పాత్ర, ఇస్కాన్ వంటి ప్రైవేటు సంస్థలు అందిస్తున్న చల్లని, చప్పటి భోజనాన్ని పిల్లలు తినలేక పడేస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం సూపరింటెండెంట్ జి.కె.త్రిపాఠీకి వినతి పత్రంఅందజేశారు. ధర్నాలో యూనియన్ జిల్లా నాయకులు ఎ.రాధ, ఆర్.కాంతమ్మ, వి.లక్ష్మి, కె.కౌసల్య, టి.రామానుజమ్మ, జ్యోతి, వై.రత్నం తదితరులు పాల్గొన్నారు. -
ఈ నెలాఖరుకు నక్సలిజం అంతం: అమిత్ షా
భువనేశ్వర్: ఈ ఏడాది మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు ఆయన సభాముఖంగా హామీ ఇస్తున్నానని వక్కాణించారు. దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూ లించాలనే సంకల్పాన్ని భద్రతా దళాలు నెరవేరుస్తా యని అమిత్ షా శుక్రవారం పునరుద్ఘాటించారు. కటక్లో జరిగిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) 57వ వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్ షా మాట్లాడుతూ, నక్సలిజాన్ని నిర్మూలించడంలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్రను వివరించారు. చేశారు. దేశాన్ని నక్సలిజం నుండి విముక్తి చేయాల ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ ప్రయత్నంలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ లేదా తెలంగాణలో నక్సలిజాన్ని నిర్మూలించడంలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్రధారిగా అవతరిస్తుంది. తిరుప తి నుండి పశుపతి వరకు రెడ్ కారిడార్ కావాలని కలలు కనే వారిని భారత భద్రతా దళాలు పూర్తిగా ఓడించి తమ ఆధిపత్యాన్ని స్థాపించుకుంటాయని హోంశాఖ మంత్రి బలమైన నమ్మకం వ్యక్తం చేశారు. దేశం కోసం సీఐఎస్ఎఫ్ సిబ్బంది ‘శౌర్యం, ఆత్మబలిదానాలను‘ ప్రశంసిస్తూ అమిత్ షా వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. 56 సంవత్సరాల్లో సీఐఎస్ఎఫ్ ఆశయ సాధనతో అన్ని రకాల సవాళ్ల ను ఎదుర్కోవడం ద్వారా తనను తాను ధీటుగా మలచుకుందని కొనియాడారు. శౌర్యం, త్యాగం భారత దేశ అద్భుతమైన చరిత్రకు ముఖ్య లక్షణా లు. ఈ లక్షణాలను అంకిత భావంతో, ఆధునిక ఆయుధాలతో మిళితం చేయడం ద్వారా సీఐఎస్ఎఫ్ అన్నిరకాల సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రదర్శించింది. కటక్ ప్రాంతం ముండలిలోని ఖారవేళ ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో జరిగిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) 57వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొనడానికి రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర హోం మంత్రిని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతించారు. భువనేశ్వర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్యూ) క్యాంపస్ పక్కన ఉన్న సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) భూమి పూజలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మరో కార్యక్రమంలో భాగంగా న్యూ న్యాయ సంహితపై ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెండా ఊపి మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ ప్రారంభించారు. -
కంబిరిగాంలో ‘రియల్’ భూదందా
● మాదర బట్టి కబ్జా ● అడ్డుకున్న రెవెన్యూ అధికారులు పలాస: కంబిరిగాంలో మరో రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూదందా శుక్రవారం వెలుగుచూసింది. వందలాది ఎకరాల పంట భూములకు సాగు నీరందించే వరహాల గెడ్డకు అనుసంధానంగా ఉన్న తుప్పల గుడ్డి వద్ద మాదర బట్టి కబ్జాకు గురైంది. రియల్ ఎస్టేటు వెంచర్లకు అడ్డుగా ఉందని భావించి ఆ బట్టిని కూడా అందులో కలుపుకోవడానికి ప్రయత్నించి సగం బట్టీని ఆక్రమణదారులు మట్టితో కప్పేశారు. ప్రొక్లెయినర్లతో ఆ బట్టిని కప్పేసి వారి రియల్ ఎస్టేటు స్థలంలో కలిపేసుకున్నారు. ఇప్పటికే భూముల విలువలు పెరగడంతో రూ.కోట్లు విలువైన ప్రభుత్వ, పోరంబోకు, దేశబట్టిలు, వరద కాలువలను తమ కబంద హస్తాల కిందకు తెచ్చుకొని ఫ్లాట్లుగా విభజించి ఇళ్ల స్థలాలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే కంబిరిగాం గ్రామంలో కొన్ని భూములు వివాదాస్పదంగా మారడంతో పలువురు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా అదే ప్రాంతంలో కొందరు కూటమి ప్రభుత్వం అనుకూల, క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణలకు సంబంధించి వరుస కథనాలు పత్రికల్లో ప్రచురితమవుతుండటంతో అధికారులు స్పందించి ఆపుతున్నా దందా ఆగకపోవడం గమనార్హం. శుక్రవారం కూడా మాదర బట్టి కబ్జాకు గురైన విషయం తెలుసుకున్న పలాస తహశీల్దారు టి.కళ్యాణ చక్రవర్తి సంబంధిత స్థలానికి వెళ్లి ఆక్రమణ నిలుపుదల చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి కాలువ కప్పివేసే పనులను అడ్డుకున్నట్లు చెప్పారు. అయితే ఇది కంటి తుడుపు చర్యలేనని, అధికార పార్టీ అండదండలతో దందా నిరంతరాయంగా సాగుతునే ఉంటుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల వరుస ఘటనలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. పెంటిభద్ర రెవెన్యూలో పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి అక్కడకు వెళ్లి వాహనాలను ఆపినా ఇంత వరకు తగిన చర్యలు తీసుకోలేదు. ఇటీవల కంబిరిగాంలో అక్రమ మట్టి, కంకర తవ్వకాలను ఆపి, వాహనాలను సీజ్ చేశామని చెప్పినా వాటిని చడీ చప్పుడు కాకుండా తీసుకుపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఎత్తిపోతల పనుల పరిశీలన
హిరమండలం: వంశధార ఎత్తిపోతల పథకం నిర్మా ణం వేగవంతంగా జరుగుతున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఆయన శుక్రవారం వంశధార ఫేజ్–2 రిజర్వాయర్తో పాటు ఎత్తిపోత ల పథకం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అక్కడి అధికారుల తో పాటు కాంట్రాక్టర్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కొద్దిరోజులుగా ప్రాధాన్య తా ప్రాజెక్టుగా తీసుకొని ఎప్పటికప్పుడు వంశధార ఫేజ్–2 రిజర్వాయర్, ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల గురించి సమీక్షిస్తున్నట్టు తెలిపారు. వచ్చే వర్షాకాలంలో ట్యాంకుల అమరిక, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులు పూర్తిచేస్తామని చెప్పారు. సబ్స్టేషన్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి నగదును ట్రాన్స్కోకు చెల్లించినట్టు తెలిపారు. ఇప్పటివరకూ 55 శాతం పనులు పూర్తయ్యా యన్నారు. మిగతా పనులు వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని చెప్పారు. ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వ యంతో పనిచేయాలని ఆదేశించారు. హిరమండ లం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు. -
మెగా జాబ్మేళాకు స్పందన
నరసన్నపేట: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నరసన్నపేటలోని ఎల్వీఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. 15 కంపెనీలకు చెందిన హెచ్ఆర్ ప్రతినిధులు హాజరై 257 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరిలో అర్హత కలిగిన 99 మందిని వివిధ కంపెనీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు బగ్గు అర్చన, కళాశాల కరస్పాండెంట్ ఎల్.లక్ష్మీ ప్రసన్న, ప్రిన్సిపల్ ఎం.ప్రసాదరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి చంద్రమౌళి, అకడమిక్ డైరెక్టర్ జి.వి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
32 కేజీల గంజాయితో ఐదుగురు అరెస్టు
ఇచ్ఛాపురం : ఒడిశా నుంచి బెంగళూరుకు 32 కేజీల గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేయగా వీరిలో నలుగురు మహిళలు ఉన్నట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్ఛాపురం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో పట్టణ ఎస్సై ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం ఫుల్బాని ప్రాంతం నుంచి 32 కేజీల గంజాయితో కందమాల్ జిల్లాకి చెందిన సుస్మి బెహర, సితయ దలచత్ర, ప్రతిమ బెహర, దులై భోయ్, నిమంత కన్హార్లు పట్టుబడ్డారు. వీరిని విచారించగా కందమాల్ జిల్లా తిలారంగి గ్రామానికి చెందిన గంజాయి వ్యాపారి రాధాకాంత దిగల్ అలియాస్ రాధ నుంచి గంజాయిని తీసుకొని బెంగళూరులోని సునీల్కు అందజేయడానికి వెళ్తున్నట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి గంజాయి, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐతో పాటు పట్టణ ఎస్సై ముకుందరావు, క్రైమ్ సిబ్బంది రంజిత్ పాల్గొన్నారు. -
జాతీయ భద్రతా వారోత్సవాలు ప్రారంభం
రాయగడ: తెరువలిలో గల ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రొఎల్లొయిస్ (ఇంఫా) ఆధ్వర్యంలో గురువారం జాతీయ భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కర్మాగారం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీయల్ డిప్యూటీ డైరెక్టర్ ఇంజినీర్ చిత్తరంజన్ బెవురా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. కర్మాగారం యూనిట్ హెడ్ జి.వి.రాకేష్ వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్లాంట్లో పనిచేస్తున్న సిబ్బంది భద్రత, వారి సంక్షేమానికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ విధులను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం అంతా కలిసి ప్రమాదాల నివారణా చర్యలు తీసుకోవడంతోపాటు భద్రతలను పాటిస్తామని శపథం చేశారు. -
9,10 తేదీల్లో కిరణ దర్శనం
శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కిరణ దర్శనానికి వేళయ్యింది. ఈ నెల 9, 10 తేదీల్లో ఉదయం 6 నుంచి 6.30 వరకు కిరణ దర్శనం ఉండవచ్చని ఆలయ వర్గాలు తెలిపాయి. మబ్బులు, పొగమంచు లేకుండా వాతావరణం బాగుంటేనే స్వామి కిరణదర్శనం ఉంటుందని పేర్కొన్నారు. 9న ఐటీఐ అభ్యర్థులకు అప్రెంటిస్ మేళా ఎచ్చెర్ల : ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 9న ప్రధానమంత్రి జాతీయ అంప్రెటిస్ మేళా నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్, కన్వీనర్ ఎల్.సుధాకరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని తొమ్మిది ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో వివిధ ట్రేడ్లలో శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులు మూడు బయోడేటాలు, ధ్రువపత్రాలు, ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు. ఎంపికై న వారికి అరబిందో, శ్యాంక్రగ్ పిస్టన్స్, స్మార్ట్కెమ్, కాడ్మ్యాక్స్, బ్లూస్టార్, నోర్డిక్స్ వంటి కంపెనీల్లో అప్రెంటిస్ శిక్షణ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొబ్బరిమొక్కలు కొందరికే..! కంచిలి: ప్రకృతి వైపరీత్యాలు, వయస్సు పైబడి వ్యాధులబారిన పడిన కొబ్బరి చెట్లను తొలగించి, వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటడం, నిర్వహణ కోసం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కొబ్బరి విస్తరణ పథకాన్ని కొందరు రైతులకే వర్తింపజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంచిలి మండలం పెద్దశ్రీరాంపురంలో 67 మంది రైతులు తమకు పథకాన్ని వర్తింపజేయాలని పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. గడువు దాటిన తర్వాత దరఖాస్తులు వచ్చాయనే నెపంతో ఉద్యానశాఖ యంత్రాంగం వీటిని పక్కన పెట్టేశారు. జనవరి 21న ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఇంతవరకు దరఖాస్తుదారులతో గ్రామసభ నిర్వహించలేదు. పైగా ప్రతి ఫిర్యాదుకు చివరి రోజు వచ్చి ఫిర్యాదుదారునితో ఫొటో తీసుకొని వెళ్లిపోతున్నారని ఫిర్యాదుదారుడు బల్లెడ సునీల్ గురువారం తెలిపారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నాలుగు ఎకరాల గడ్డివాములు దగ్ధం బూర్జ: పాలవలస గ్రామంలో తుమ్మలపల్లి వెంకటనాయుడుకు చెందిన నాలుగు ఎకరాల గడ్డివాము దగ్ధమైంది. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామస్తులు పాలకొండ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఏడాది పాటు పశువులకు సరిపడా గడ్డి వాములు నిల్వ ఉంచుకున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేస్తున్నారు. మందుగుండు సామగ్రి పట్టివేత రణస్థలం: లావేరు మండలం వెంకటాపురంలో గేదెల సూర్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో మందుగుండు సామగ్రిని టాస్క్ఫోర్స్ ఎస్సై నరసింహమూర్తి, సిబ్బంది పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు గురువారం సాయంత్రం సూర్యనారాయణ ఇంట్లో తనిఖీ చేయగా వత్తుల మందు, తార జువ్వల మందు, తాటిరేకుల కట్ట, చిచ్చు బుడ్డీలు తదితర వస్తువులను స్వాధీనం చేసుకుని లావేరు పోలీసులకు అప్పగించారు. ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేశారు. బార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా న్యాయవాదుల బార్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.ద్వారకా రెడ్డి గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 9న తుది ఓటరు జాబితా ప్రకటన, 12న ఎన్నికల నోటిఫికేషన్, 13న ఎన్నికల అధికారి నియామకం, 16న నామినేషన్ల స్వీకరణ, 17న నామినేషన్ల పరిశీలన, 18న నామినేషన్ల ఉప సంహరణ, 19న పోటీలో ఉన్నవారి తుది జాబితా విడుదల ఉంటుంది. 27న ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఓటింగ్, అనంతరం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సునీల్కు నోటీసు ఇస్తున్న సచివాలయ వీహెచ్ఏ -
నేడు మదీనాబాబా చందనోత్సవం
గార: కళింగపట్నంలోని మదీనాబాబా దర్గాలో చందనోత్సవం శుక్రవారం సాయంత్రం జరగనుంది. హిందూ–ముస్లింల ఐక్యతకు చిహ్నంగా ఈ దర్గా నిలుస్తోంది. 11 శతాబ్దంలో మక్కా నుంచి మదీనాబాబా గుర్రంపై ఇక్కడికి విచ్చేశాని, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఇక్కడే సమాధి అయ్యారని కథనం. రంజాన్ నెల ప్రారంభమైన 16వ రోజున బాబా సమాధిపైనున్న చందనం తీసి, కొత్త చందనం పూస్తారు. బాబాను దర్శనం చేసుకుంటే కష్టాలు తీరుతాయని, బంగారం వస్తువులతో పాటు డాక్యుమెంట్లు వంటివి పోగొట్టుకొని, దొరకని సమయంలో బాబాను తలుచుకొని ప్రసాదాన్ని పంచిపెడితే వెంటనే దొరుకుతాయని భక్తుల నమ్మకం. ముస్లింలుతో పాటు హిందువులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. -
తప్పుడు కేసులపై దర్యాప్తు చేయండి
రాయగడ: పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించడంతోపాటు పాత్రికేయులపై తప్పుడు కేసులు బనాయించిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు పాత్రికేయులపై నమోదు చేసిన కేసులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేరే కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం దాదాపు 50 మందికిపైగా జిల్లాలో గల పాత్రికేయులు జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ ఐఐసీ సూర్యకాంత్ పాడీని కలిసి వినతిపత్రం అందించారు. గత కొన్ని నెలలుగా మునిగుడ సమితి అంబొదలలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను, పాఠశాల ఆవరణలో బైబిల్ వంటివి విద్యార్థులకు పంపిణీ చేయడం, పాఠశాలలో విద్యార్థులకు వేధించడం, నాసిరకం భోజనాలు ఇవ్వడం వంటి అంశాలను పాత్రికేయులు తమ పత్రికల్లో ప్రచురించడంతో ఆ పాఠశాల హెచ్ఎం ఆయా పత్రికల్లో పనిచేసే పాత్రికేయులపై అబద్ధపు కేసులను బనాయించి ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలను ఖండిస్తున్నట్లు వెల్ఫేర్ కమిటీ సభ్యులు వినతిపత్రంలో పేర్కొన్నారు. పాఠశాలలో జరగుతున్న అన్యాయాలను ఎత్తిచూపే పాత్రికేయులపై ఇలా అబద్ధపు కేసులు బనాయించడం ఏమాత్రం ఆమోదించదగిన విషయం కాదన్నారు. పాఠశాలలో జరుగుతున్న అవినీతి భాగోతాలకు సంబంధించి స్వయాన ఆ పాఠశాలలో చదువుతున్న తల్లిదండ్రులు జిల్లా యంత్రాంగం దృష్టికి కూడా తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో వారు పత్రికలను ఆశ్రయించారన్నారు. వాటిని ప్రజలకు తెలిసే విధంగా పత్రికల్లో ప్రచురిస్తే అవి అబద్ధాలుగా చిత్రీకరించిన హెచ్ఎం కొలా భామనమూర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చాలా విచారకరమన్నారు. ఈ నేపథ్యంలో పాత్రికేయులపై పెట్టిన కేసులు ఎంతవరకు నిజం.. అసలు ఆ పాఠశాలలో జరుగుతున్న అవినీతి భాగోతాలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మీడియా వెల్ఫేర్ కమిటీ అందించిన వినతిపత్రంలో వివరించింది. దీనిపై స్పందించిన ఐఐసీ పాడి.. ఈ మేరకు దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు. -
సేవా పేపరు మిల్లు కార్మికుల వినూత్న నిరసన
జయపురం: మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ జయంతి సందర్భంగా జయపురం గగణాపూర్లో మూతపడిన సేవా పేపరు మిల్లు కార్మికులు వినూత్నంగా నివాళులర్పించారు. ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి నేతృత్వంలో పలువురు సేవా పేపరు మిల్లు కార్మిక నాయకులు బిజూ పట్నాయక్ విగ్రహం ముందు తమ డిమాండ్లతో కూడిన బ్యానర్ పట్టుకొని నివాళులర్పించారు. మీ సమయంలో ప్రారంభించిన సేవా పేపరుమిల్లు గత 20 నెలలుగా మూతపడి ఉంది. బృహత్ పేపరు మిల్లు అని చెప్పి వందలాది కోట్ల రుణాలు తెచ్చి అసమర్థంగా నడిపింది యాజమాన్యం. విశ్రాంత కార్మికుల పెన్షన్, పీఎఫ్ గ్రాట్యుటీ, వేతన బకాయిల కోసం ఎదురు చూసి నేటివరకు 50 మందికి పైగా ప్రాణాలు వీడారన్నారు. వారి కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయని, ఇంకా అనేక మంది మృత్యువుతో పోరాడుతున్నారని వెల్లడించారు. పర్మినెంట్, కంట్రాక్ట్ కార్మికుల జీతాలు, పీఎఫ్లు పొందలేక పోతున్నారని వెల్లడిస్తూ బిజూ పట్నాయక్ 110 జయంతి సందర్భంగా ఆయన విగ్రహం ముందు తమ గోడు వినిపించారు. సేవా కార్మికులు బాధలు తీర్చేందుకు యాజమాన్యం దృష్టి సారించేలా చూడాలని వేడుకున్నారు. -
మాస్టర్స్ పోటీలకు సిద్ధమా!
● జిల్లాస్థాయి శాప్ లీగ్ మాస్టర్స్ క్రీడాపోటీల షెడ్యూల్ ఖరారు ● తొలుత బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, టెన్నిస్ క్రీడాంశాల్లో పోటీలు ● 35 ఏళ్లు దాటిన క్రీడాకారులకు గొప్ప అవకాశం శ్రీకాకుళం న్యూకాలనీ: వెటరన్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) నడుం బిగించింది. శాప్ లీగ్ – మాస్టర్స్ స్పోర్ట్స్ పేరిట 35 ఏళ్లు పైబడిన మాస్టర్స్(వెటరన్) క్రీడాకారులకు క్రీడా పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో పురుషులు, మహిళలకు జిల్లాస్థాయిలో వేర్వేరుగా పోటీలు జరిపించనున్నారు. ఇక్కడ రాణిస్తే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు. మూడు క్రీడాంశాల్లో పోరు.. శాప్ లీగ్ మాస్టర్స్ క్రీడా పోటీల్లో భాగంగా మొదటి విడతగా బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, టెన్నీస్ క్రీడాంశాల్లో జిల్లాస్థాయి పోటీలను నిర్వహించనున్నారు. ఆసక్తి గల వెటరన్ క్రీడాకారులు స్పోర్ట్స్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్పోర్టల్లో శాప్ లీగ్స్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ● బ్యాడ్మింటన్: 35 ఏళ్లు పైబడిన విభాగంలో పురుషులు, మహిళలకు పోటీలను నిర్వహిస్తుండగా, 45 ఏళ్లుపైబడిన విభాగంలో కేవలం పురుషులకు మాత్రమే పోటీలు నిర్వహించనున్నారు. విజేతలను రాష్ట్రస్థాయిలో మార్చి 14, 15 తేదీల్లో జరిగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరగనున్నాయి. ● టెన్నిస్: 40 ఏళ్లు పైబడిన విభాగంలో పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు మార్చి 22, 23 తేదీల్లో విజయనగరం జిల్లా వేదికగా జరిగే రాష్ట్రపోటీలకు పంపిస్తారు. ● అథ్లెటిక్స్: 35 ఏళ్లు పైబడి, 45 ఏళ్లు పైబడిన విభాగాల్లో పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడి విజేతలను మార్చి 30, 31 తేదీల్లో గుంటూరు వేదికగా జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు. గేమ్ తేదీ ఈవెంట్స్ వేదిక టెన్నిస్ మార్చి 8న సింగిల్స్, డబుల్స్ ఆర్ట్స్ కళాశాల మిక్స్డ్ డబుల్స్ శ్రీకాకుళం బ్యాడ్మింటన్ మార్చి 8న సింగిల్స్, డబుల్స్ ఇండోర్ స్టేడియం మిక్స్డ్ డబుల్స్ శ్రీకాకుళం అథ్లెటిక్స్ మార్చి 24న 100, 400,800, 1500 మీటర్ల పరుగు, కేఆర్ స్టేడియం లాంగ్జంప్, హైజంప్, శ్రీకాకుళం షాట్పుట్, డిస్కస్త్రో, లావెలన్, రిలే పరుగు సద్వినియోగం చేసుకోండి.. 35 ఏళ్లు పైబడిన వెటరన్ క్రీడాకారులకు శాప్ లీగ్ పోటీలు గొప్ప అవకాశం. తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి సన్నద్ధంకావాలి. తొలుత టెన్నిస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఇక్కడి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తాం. వివరాలకు 9390352942 నంబర్ను సంప్రదించవచ్చు. – ఎ.మహేష్బాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, శ్రీకాకుళం -
టిప్పర్ ఢీకొని యువకుడికి గాయాలు
హిరమండలం: అలికాం–బత్తిలి రహదారిపై ఎల్ఎన్పేట మండలం తురకపేట జంక్షన్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాపారావు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సరుబుజ్జిలి మండలం కొండవలస గ్రామానికి చెందిన ఎస్.పాపారావు సోదరుడు సూర్యనారాయణతో కలిసి ఎల్ఎన్పేట మండలంలో శుభకార్యానికి హాజరై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో వీరి బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పాపారావుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సరుబుజ్జిలి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఎస్ఐ హైమావతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఘనంగా సీఆర్పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం
కొరాపుట్: కేంద్ర రక్షణ బలగంలో ఒకటైన సీఆర్పీఎఫ్ 64వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. గురువారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని జానకీనగర్లో సీఆర్పీఎఫ్ 12వ బెటాలియన్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడాది కాలంలో విధి నిర్వహణలో అమరులైన వారికి నివాళులర్పించారు. దేశ రక్షణలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు పణంగా పెట్టి విధి నిర్వహణ చేస్తున్నారని కమాండెర్ నంద కిశోర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెండో ఇన్చార్జి రాజ్కుమార్ సోలంకి, డిప్యూటీ కమాండెంట్ ఫిరోజ్ అలీ, ఇన్స్పెక్టర్ పీకే సాహు, తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
జి.సిగడాం: జి.సిగడాం మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభా పరీక్షలో సత్తాచాటారు. న్యూఢిల్లీకి చెందిన ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ ఒలింపియాడ్ (ఐఎంఓ) గత ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో 30 మంది విద్యార్థులు హాజరుకాగా.. 8 బంగారు పతకాలు, 10 రజత పతకాలు, 12 కాంస్య పతకాలు సాధించారు. వీరికి ప్రిన్సిపాల్ డబ్బీరు గణేష్ పట్నాయక్, ఆంగ్ల అధ్యాపకులు డీహెచ్ సుబ్రహ్మణ్యం పతకాలు, ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు కోట తిరుపతిరావు, సురేష్, పిచ్చిక నేతాజీ, మరడ నాగమణి తదితరులు పాల్గొన్నారు. పతకాలు, ప్రశంసాపత్రాలతో విద్యార్థులు, అధ్యాపకులు -
ఆకట్టుకున్న వేషధారణలు
పర్లాకిమిడి: పట్టణంలో డోలా ట్యాంకు రోడ్డులో జరుగుతున్న డోలాయాత్ర వేడుకలు భుధవారంతో ముగిశాయి. గోవిందుడిని ఉయ్యాలలో వుంచి పాటలు పాడారు. ముగింపు వేడుకల్లో డోలాయాత్ర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఽరాధావేషధారణ పోటీలను నిర్వహించారు. సాధారణ సభకు డోలాయాత్ర కమిటీ సభ్యులు గణేష్ పట్నాయక్, సరోజ్ పండా, సుభేందు మోహన్ సేనాపతి, బిబి మహంతి, సుబ్రాంశు శేఖర్ పట్నాయక్లు పాల్గొని డోలా ఉత్సవాలపై మాట్లాడారు. రాధా వేషాధారణ పోటీలకు న్యాయనిర్ణేతలుగా శుబ్రాంశు శేఖర్ పట్నాయక్, భరత్ భూషణ్మహంతి, మిరాకిల్ డ్యాన్స్ అకాడమీ మాస్టార్ శుబేంధు మోహన్ సేనాపతి తదతరులు వ్యవహారించారు. మొత్తం 50 మంది చిన్నారులు రాధాగోపికల వేషాధారణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. -
పాఠశాలలను సందర్శించిన సబ్ కలెక్టర్
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలను జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి బుధవారం సందర్శించారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాల్లో నాణ్యత పాటించడం లేదని ఇటీవల నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో పలువురు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ సోమేశ్ణ్ ఉపాధ్యాయ్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి స్థానిక ఎక్స్బోర్డ్ పాఠశాలను సందర్శించి పిల్లలకు పెడుతున్న భోజన నాణ్యతను పరిశీలించారు. వంట చేసే ప్రాంతంలో శుభ్రతపై ఆరా తీశారు. భోజనం రుచి చూసి బాగుందన్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పి ఉత్సాహ పరిచారు. అలాగే పలు వసతి గృహాలను కూడా సబ్ కలెక్టర్ సందర్శించారు. స్వాతంత్య్ర సమరయోధుడు బిశ్వాసరాయ్కు ఘననివాళిజయపురం: కొరాపుట్ గాంధీగా పేరుగాంచిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ మంత్రి స్వర్గీయ రాధాకృష్ణ బిశ్వాసరాయ్ సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. విశ్వాసరాయ్ 122వ జయంతిని జయపురం పూజ్య పూజా సంసద్ బుధవారం ఘనంగా నిర్వహించించింది. స్థానిక రెండవ దైనిక బజారు ప్రాంగణంలోని బిశ్వాసరాయ్ విగ్రహానికి పూజ్య పూజా సంసద్ అధ్యక్షులు, ఇంజినీర్ కేదార్ నాధ్ బెహర, ఇతర సభ్యులు పూల మాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెహర మాట్లాడుతూ.. విశ్వాసరాయ్ దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొని దేశం కోసం తన సంపదను, జీవితాన్ని దారపోశారని కొనియాడారు. అవిభక్త కొరాపుట్లో స్వాతంత్య్ర పోరాటానికి బీజం నాటి ప్రజలను దేశ విముక్తి పోరాటం వైపు నడిపించారని గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర మంత్రిగా ఒడిశా అభివృద్ధికి కృషి చేశారన్నారు. అటువంటి పోరాట యోధుని జయంతిని అధికారులు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పూజ్య పూజా సంసద్ కార్యదర్శి తపన్ కిరణ్ త్రిపాఠీ, కోశాధికారి బైరాగి జెన, సంసద్ సలహాదారు, జయపురం సబ్డివిజన్ రక్తదాతల మోటివేటెడ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026
ఒడిశాలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం జరిగిన వేడుకల్లో చిన్నాపెద్దా అనే తేడాలేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సందడి చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. – సాక్షి నెట్వర్క్పర్లాకిమిడి: హోలీ ఆడుతున్న గజపతి సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులురాయగడ: మజ్జిగౌరి అమ్మవారికి రంగులు అద్దిన దృశ్యంకొరాపుట్: అనాథ పిల్లలతో నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి హోలీ పండగరాయగడ: మిత్రులతో హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కడ్రక -
రాజ్యసభ నాలుగో స్థానం.. పోటీ రసవత్తరం
● స్వతంత్ర అభ్యర్థిగా దిలీప్ రే ● గెలుపు మాదే: సీఎం మాఝి ● కీలకం కానున్న క్రాస్ఓటింగ్ భువనేశ్వర్: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల ముఖచిత్రం దాదాపు స్పష్టమైంది. తొలి 3 స్థానాలు అధికార, విపక్షాలకు సొంతం కావడం తథ్యమైంది. మిగిలిన 4వ స్థానం చేజిక్కించుకునేందుకు అధికార భారతీయ జనతా పార్టీ, విపక్ష బిజూ జనతా దళ్ ఎవరి తరహాలో వారు భారీ స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ప్రముఖ యూరాలజిస్టు డాక్టరు దత్తేశ్వర హోతా ఉమ్మడి అభ్యర్థిగా విపక్ష బిజూ జనతా దళ్ ప్రకటించి నాలుగో స్థానం అభ్యర్థిగా పేర్కొంది. ఇందుకు కాంగ్రెసు పూర్తి స్థాయి మద్దతు స్వచ్చందంగా ప్రకటించింది. మరోవైపు అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ప్రోత్సాహిత అభ్యర్థిగా దిలీప్ రే 4వ స్థానం కోసం పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ తనకు మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ప్రముఖులతో సంప్రదింపులు పూర్తయ్యాయని అన్నారు. హోరాహోరీ పోరు.. ● నాలుగో రాజ్యసభ సీటు కోసం దిలీప్ రే, డాక్టర్ దత్తేశ్వర్ హోటా మధ్య పోటీ ప్రత్యక్ష పోరుగా రూపొందుతోంది. దిలీప్ రే సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రిగా రాజకీయ రంగంలో విశేష అనుభవజ్ఞుడిగా పేరొందారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఈ నెల 5న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ● రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు తీవ్రమైన రాజకీయ పోటీకి వేదికగా మారింది. బీజేపీ 2, బీజేడీ 1 స్థానం సునాయాశంగా కై వసం చేసుకునేందుకు శాసన సభలో బలం పుష్కలంగా ఉంది. ఈ స్థానాలకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, సుజీత్ కుమార్లను నిలబెట్టింది. మరోవైపు బీజేడీ 3వ స్థానానికి సంతృప్త్ మిశ్రాను అభ్యర్థిగా ప్రకటించింది. డాక్టర్ దత్తేశ్వర్ హొత్తాను 4వ స్థానానికి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది. గెలిచి తీరుతాను: దిలీప్ రే స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికల రంగంలోకి దిగిన దిలీప్ రే తన గెలుపు పట్ల గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. విజయంపై నమ్మకం లేకపోతే నేను ఈ ఎన్నికల్లో నిలబడేవాడిని కాదన్నారు. అందరి మద్దతు కూడగట్టుకుని విజయం కై వసం చేసుకుంటానని చెప్పారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు పూర్తి అయ్యాయని, అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు దిలీప్ రే ధీమా వ్యక్తం చేశారు. ● ఎగువ సభలో రాష్ట్ర స్వరాన్ని పదును పెట్టేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రగాఢ నమ్మకం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దిలీప్ రే అభ్యర్థిత్వానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ సమీకరణం సంపన్న ఒడిశా, అభివృద్ధి చెందిన భారత దేశం నిర్మాణంలో సహాయపడుతుందన్నారు. త్వరలో జరగనున్న రాజ్య సభ ఎన్నికల్లో 4వ స్థానానికి ఏ పార్టీకి స్పష్టమైన సంఖ్యా బలం లేదు. అయిన దిలీప్ రే ఖచ్చితంగా గెలుస్తాడు, నాకు పూర్తి నమ్మకం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ● రాజ్య సభ 4వ స్థానం ఎన్నికలో క్రాస్ ఓటింగు కీలకమైన అంశం. సాదాసీదా పరిస్థితుల్లో బీజేపీ మద్దతు ప్రకటించిన స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రే గెలిచేందుకు అవకాశం లేదు. తొలి 3 స్థానాలు కై వసం చేసుకున్న తర్వాత అధికార బీజేపీ, విపక్ష బీజేడీ ఖాతాలో మిగులు ఓట్లు 4వ స్థానం స్వతంత్రంగా చేజిక్కించుకోలేని పరిస్థితి స్పష్టమవుతుంది. ఈ స్థానం కోసం ఉమ్మడి అభ్యర్థిగా డాక్టరు దత్తేశ్వర్ హోతా, స్వతంత్ర అభ్యర్థిగా దిలీప్ రే హోరాహారీగా తలపడనున్నారు. ● బీజేడీ అభ్యర్థిగా సంతృప్త్ మిశ్రా 3వ స్థానం అభ్యర్థిగా ఖరారు అయ్యారు. 30 మంది బీజేడీ ఎమ్మెల్యేల ఓటుతో ఆయన గెలుపు తథ్యమనే చెప్పాలి. ఆ తర్వాత బీజేడీ ఖాతాలో 18 ఓట్లు మిగిలి ఉంటాయి. బీజేడీ ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థికి కాంగ్రెసు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆ పార్టీ ఖాతాలో 14 స్పష్టమైన స్థానాలతో సీపీఐ (ఎం) 1 స్థానం మొత్తం మీద 15 స్థానాలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రస్తుతానికి ఉమ్మడి అభ్యర్థి డాక్టరు దత్తేశ్వర గెలిచేందుకు మొత్తం 33 ఓట్లు నికరంగా ఉన్నాయి. ● తొలి 2 స్థానాలు కై వసం చేసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ ఖాతాలో నామమాత్రంగా 22 ఎమ్మెల్యేల ఓట్లు మిగిలి ఉంటాయి. ఈ సంఖ్య తాము మద్దతు ప్రకటించిన దిలీప్ రే గెలిచేందుకు ఏమాత్రం ఉపకరించవని స్పష్టమవుతుంది. ఇటీవల బిజూ జనతా దళ్ ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. వీరివురి మద్దతు కూడగట్టుకోగలిగిన బీజేపీ ఖాతాలో 24 ఓట్లు జమ అవుతాయి. అభ్యర్థిని గెలిపించేందుకు ఈ బలం చాలదు. అయినా తమ మద్దతు అభ్యర్థిగా దిలీప్ రే గెలుపు తథ్యమని భారతీయ జనతా పార్టీ ప్రముఖులు భావిస్తున్నారు. దీనిలో ఆంతర్యం రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశమైంది. ● కాంగ్రెస్లో అసంతృప్తివాదుల్ని బుజ్జగించి తమ వైపు మలచుకుని 4వ స్థానం కై వసం చేసుకునే దిశలో అధికార బీజేపీ పావులు కదుపుతుందనే ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. బీజేడీ శిబిరంలో ప్రస్తుత ఎమ్మెల్యేల చిత్తశుద్ధి ఎంత వరకు సహకరిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. దీనివల్ల క్రాస్ ఓటింగ్ పోటీలో నిర్ణయాత్మక అంశంగా మారుతుంది. ● రాజ్యసభ ఎన్నికల ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 5తో నామినేషన్లు దాఖలు ఘట్టం ముగుస్తుంది. మర్నాడు 6న పరిశీలన పూర్తి చేసి ఖరారైన అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు. ఆ తర్వాత పోటీ నుంచి వైదొలిగేందుకు ఈ నెల 9 వరకు గడువు కల్పించారు. ఎట్టకేలకు ఈ నెల 16న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరవధికంగా ఓటింగ్ జరుగుతుంది. అనంతరం ఓట్లు లెక్కిస్తారు. -
8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం
● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి విజయనగరం: ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు నగర డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి తెలిపారు. ఈ మేరకు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తామన్నారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న మహిళలను సత్కరిస్తామని చెప్పారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో పురుషులుతో సమానంగా రాణిస్తుండడం శుభపరిణామన్నారు. మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయంగా రాణించేందుకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, కార్పొరేటర్లు తాళ్లపూడి సంతోషికుమారి, దాసరి పద్మావతి, పార్టీ నాయకులు ఎర్రంశెట్టి సునీత, తదితరులు పాల్గొన్నారు. -
చలో విజయవాడకు సమగ్ర శిక్ష సిబ్బంది
నెల్లిమర్ల: ఈ నెల 6న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఈ మేరకు స్థానిక ఎంఆర్సీ సిబ్బంది ఎంఈఓ యూఎస్ఎన్ మూర్తిని బుధవారం కలిసి ఆ రోజున మాస్ లీవ్ మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ సభ్యుడు ఆరికతోట రామకృష్ణ మాట్లాడుతూ.. సమగ్రశిక్షలో పనిచేస్తున్న 18 విభాగాల ఉద్యోగులకు ఏడు సంవత్సరాలుగా జీతాలు పెరగలేదన్నారు. అలాగే గత ప్రభుత్వం ఎంటీఎస్ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎల్డీఏఎన్ పార్వతి, ఎంఐఎస్ ఎం. ప్రశాంతి, మెస్సెంజర్ గోవిందమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
● ఘనంగా డోలోత్సవం
పర్లాకిమిడి: ఆంధ్రప్రదేశ్ మన్యం జిల్లా భామిని మండలం లివురి గ్రామంలో గల గోపినాథ మందిరం డోలాయాత్ర ఉత్సవాలు బుధవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తలు, గజపతిమహారాజుల చివరి వంశీయులు యువరాణి కల్యాణీ దేవి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు, తదితరులు లివురి గోపినాథ మందిరాన్ని దర్శించుకుని హోలీ పండుగను నిర్వహించారు. పర్లాకిమిడి మహారాజా శ్రీకృష్ణచంద్ర గజపతి మహారాజా అనేక ఏళ్లక్రితం నిర్మించిన గోపినాథ మందిరంలో పదిరోజులపాటు డోలా యాత్ర ఉత్సవాలు జరుపుతారు. ప్రతిరోజూ భక్తులకు అన్నదాన ప్రసాదాలు అందిస్తారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.20 ఎంట్రీ ఫీజు నిర్ణయించారు. ఈ జాతర జరుగుతున్న పదిరోజుల పాటు రైల్వే అధికారులు విశాఖపట్నం–గుణుపురం ప్యాసింజరు రైలు, పూరీ– గుణుపురం ట్రైన్లు కాశీనగర్ బ్లాక్ లివురి రైల్వేష్టేషన్ వద్ద రెండు నిమిషాలు స్టాపేజీ ఉంటుందని ఈస్టుకోస్టు రైల్వే అధికారులు తెలియజేశారు. లివురి వద్ద యాత్రికులు దిగి వంశధార నది దాటి లివురి గ్రామం చేరుకోవచ్చు. ఇటీవల ఒడిశా ప్రభుత్వం వంశధార నదిపై వంతెన లివురి గ్రామానికి నిర్మించడానికి ఆమోదం తెలిపింది. దీనివల్ల విద్యార్థులు అటు ఆంధ్రలో ఒడియా ప్రజలు ఒడిశా కాశీనగర్లో ఉన్నత చదువులకు మార్గం సుగమం అవుతుందని లివురి గ్రామస్తులు అంటున్నారు. -
ముగిసిన జాతీయ సదస్సు
జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ పరిధిలోని ఉపాధ్యాయ విద్యా విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు విజయవంతంగా నేడు ముగిసింది. వర్సిటీ కులపతి ప్రొఫెసర్ డాక్టర్ దుర్గాప్రసాద్ మిశ్ర ప్రారంభోత్సవం చేయగా.. ఒడిశా పాఠ్యక్రమ రూపకల్పన బోర్డు–2026 అధ్యక్షుడు డాక్టర్ నిత్యానంద ప్రధాన్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా విద్యా విభాగాధిపతి భరత్ కుమార్ పండా, విశ్వవిద్యాలయ స్నాతకోత్తర పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంతకుమార్ పాత్రో, సదస్సు కార్యదర్శి డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ తదితరులు హాజరయ్యారు. – జయపురం -
విద్యార్థినులకు నేత్ర పరీక్షలు
విజయనగరం క్రైమ్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీటీ అగ్రహారం ప్రభుత్వ బాలికల వసతిగృహంలో మాక్సివిజన్ సహాయంతో బుధవారం నేత్ర వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ లక్ష్మణరావు, పోలీస్ సిబ్బంది, వసతిగృహ సిబ్బంది పాల్గొన్నారు. వయోజనులకు ‘ఉల్లాస్’ పరీక్ష డెంకాడ: ఉల్లాస్ అక్షరాంధ్ర (2025–26) కార్యక్రమంలో భాగంగా మండలంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు వయోజనులకు ప్రీ ఫైనల్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం వి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండల పరిధిలో 350 మంది వలంటీర్ టీచర్ల ఆధ్వర్యంలో 350 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 3,498 మంది అభ్యాసకులు హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాలను డిప్యూటీ ఎంపీడీఓ రాజ్కుమార్తో కలిసి సందర్శించినట్లు చెప్పారు. 7న సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఎంపికలు విజయనగరం: సీనియర్ పురుషుల జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 7న నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు (రాంబాబు) బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాబా మెట్ట శివారు విజ్జి స్టేడియంలో శనివారం ఉదయం 7 గంటలకు ఎంపికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు వారి సొంత క్రికెట్ కిట్టు, ఆధార్ కార్డుతో పాటు తెలుపు దుస్తులు ధరించి రావాలని తెలిపారు. ఆ రోజు జిల్లా జట్టుకు అర్హత సాధించిన క్రీడాకారులను ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు ఎంపిక చేయటం జరుగుతుందని, అర్హత, ఆసక్తి గల వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డ్రోన్ వినియోగంతో డబ్బులు ఆదా.. డెంకాడ: పంటలకు డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేయడం ద్వారా సమయంతో పాటు డబ్బులు ఆదా అవుతాయని మండల వ్యవసాయాధికారి టి. సంగీత తెలిపారు. మండలంలోని డెంకాడ గ్రామంలో పాణిరాజు పొలంలో మొక్కజొన్న పంటకు బుధవారం డ్రోన్తో పురుగు మందులను పిచికారీ చేయించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్రోన్తో ఎకరా మొక్కజొన్న పంటకు 5 నుంచి 8 నిమిషాల్లో మందు పిచికారీ పూర్తవుతుందని చెప్పారు. కార్యక్రమంంలో ఏఈఓ బి.రామకోటి, రైతులు పాల్గొన్నారు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలి విజయనగరం ఫోర్ట్: వేసవి ప్రారంభమైన నేపఽథ్యంలో ప్రజలంతా వడదెబ్బపై పూర్తి అవగాహన కలిగి జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. ఎండ తీవ్రత కారణంగా శరీర ఉష్ణోగ్రత 104.9 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు పెరిగి మొదడుపై ప్రభావం చూపుతుందని దీనివల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రించే మెదడు కేంద్రం దెబ్బతిని వడదెబ్బ సంభవిస్తుందని తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరమై, ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు, ఫిట్స్ రావడం, అపస్మారక స్థితి ఎండలో బయటికి వెళ్లినప్పుడు కనిపిస్తే వెంటనే సమీప వైద్యున్ని సంప్రదించి ప్రధమ చికిత్స పొందాలని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు వాడటం, తెలుపు రంగు, పలుచటి చేనేత వస్త్రాలు ధరించడం, తలకు టోపి, లేదా రుమాలు ధరించాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదన్నారు. -
సీపీఆర్పై అవగాహన
విజయనగరం అర్బన్: పట్టణంలోని గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేషన్)పై విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ జీజీ సాయికుమార్ మాట్లాడుతూ.. నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది అకస్మాత్తుగా గుండెపోటుకు గురవుతున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ అందిస్తే మనిషి ప్రాణం కాపాడవచ్చన్నారు. అనతంరం సీపీఆర్ను ఎలా చేయాలో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డీవీ రామమూర్తి పాల్గొన్నారు. -
నీటి సంరక్షణ అందరి బాధ్యత
విజయనగరం: నీటి సంరక్షణ అందరి బాధ్యతని మాజీ ఎంపీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు అన్నారు. అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 42వ డివిజన్ కామాక్షి నగర్, అయ్యన్నపేట మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ప్లాంట్ వద్ద నీటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు సీహెచ్ రమణ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ డీవీజీ శంకరరావు మాట్లాడుతూ.. నీటి వనరులను వృథా చేయకుండా.. బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడంలో అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ.తిరుపతిరావు, డిప్యూటీ గవర్నర్ తాడ్డి ఆదినారాయణ, జాలీ వాకర్ వై. నలమహారాజు, క్లబ్ ఉపాధ్యక్షులు పెనుమత్స అప్పలరాజు, జి. సూర్యప్రకాశరావు, క్లబ్ కార్యదర్శి కోట్ల ఈశ్వరరావు, జాయింట్ కార్యదర్శి ఇందుకూరి అప్పలరాజు, ఎడ్ల శ్రీనివాసరావు, క్లబ్ పెద్దలు కోట్ల సత్యనారాయణ, ప్రసాద్ పాల్గొన్నారు. మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ -
7 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
● ఇద్దరు అరెస్టుజయపురం: ఏడు క్వింటాళ్ల గంజాయిని జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారు మల్కనగిరి జిల్లా కలిమెల పోలీసు స్టేషన్ ఎం.వి 90 గ్రామం డోనెల్ హరిజన్, మల్కనగిరి ఆదర్శ కాలనీ రమేష్ బాగ్ పట్టుబడినట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురు బత్రిక బుధవారం వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. వ్యాన్లో కూరగాయల ట్రేల కింద గంజాయి ఉంచి మల్కనగిరి నుంచి బొయిపరిగుడ వైపు వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారి డొంబురుదొర బత్రిక, ఎస్ఐ ధీరేంద్ర బారిక్ నేతృత్వంలో టీమ్ను పంపారు. ఈ టీమ్ పెట్రోలింగ్ జరుపుతూ.. కామిడిపొదర్ గ్రామ కూడలి వద్ద ఉండగా వ్యాన్ వస్తుండడంతో అనుమానం వచ్చి అడ్డగించారు. వ్యాన్ను పరిశీలించారు. కూరగాయల ట్రేల కిందన గంజాయి ఉంచిన విషయం బయట పడింది. వ్యాన్ను పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి గంజాయిని తూయించగా 7 క్వింటాళ్ల 63 కేజీల 400 గ్రాముల ఉన్నట్లు వెల్లడైందని అధికారి వెల్లడించారు. పట్టుబడిన గంజాయి రూ.5 కోట్ల విలువ ఉంటుందని పోలీసు అధికారి వెల్లడించారు. పట్టుబడిన గంజాయి ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్తుట్లు నిందితులు తెలిపారన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. -
ఈ నెల 8 నుంచి ముత్యాలమ్మ తీర్థం
విజయనగరం టౌన్: నగరంలోని కొత్తపేట కుమ్మరివీధిలో కొలువుదీరిన ముత్యాలమ్మ, పోతురాజుస్వామి వార్షిక తీర్థం ఈ నెల 8వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఫౌండర్ ట్రస్టీ మద్దాల ముత్యాల ప్రకాశరావు, ఉత్సవ కమిటీ నిర్వహకులు మద్దాల రామకృష్ణారావు, మద్దాల నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదిటి రోజు ఉదయం అమ్మవారికి నేత్రోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. అభినందనలు నెల్లిమర్ల: షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీల్లో నెల్లిమర్ల క్రీడాకారుడు ప్రతిభ కనబర్చాడు. విజయనగరం డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఇటీవల నాలుగు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలలో నెల్లిమర్లకు చెందిన క్రీడాకారుడు పైడిరాజు విజయకేతనం ఎగురవేశారు. 50+ విభాగంలో సింగిల్స్లో మంచి ఆటతీరు కనబరిచి రన్నర్గా నిలిచారు. అలాగే డబుల్స్ విభాగంలో కాకినాడకు చెందిన కేవీ సత్యనారాయణతో కలిసి విజేతగా నిలిచారు. దీంతో ఈ నెల 18 నుంచి 25 వరకు గోవాలో జరగనున్న ఆల్ ఇండియా మాస్టర్స్ నేషనల్ టోర్నమెంట్కు వీరిని రాష్ట్ర అసోసియేషన్ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో పైడిరాజును నెల్లిమర్ల షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ బుధవారం ప్రత్యేకంగా అభినందించింది. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీఎంకే లక్ష్మణరావు, కోశాధికారి శేఖర్, కోట్ల రంగారావు, రామారావు, సురేష్ పాల్గొన్నారు. బాధ్యతగా మెలగాలి విజయనగరం అర్బన్: సమస్యల పరిష్కారానికి యూనియన్లు బాధ్యతగా మెలగాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పీవీ రమణారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సిబ్బంది సంఘ సమావేశ మందిరంలో ఎన్ఎంయూ విజయనగరం జోన్ కార్యకర్తలకు నాయకత్వ లక్షణాలపై నిర్వహించనున్న రెండు రోజుల శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం, మేనేజ్మెంట్ ద్వారా అందుతున్న ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత కల్పనలో నాయకుల పాత్రపై వివరించారు. ప్రముఖ సైకాలజిస్ట్ ఉమారాజ్ మాట్లాడుతూ.. విధుల్లో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకొని విజయం వైపు అడుగులేయాలని సూచించారు. హెచ్ఆర్ ఫ్యాకల్టీ మెంబర్ పీవీ భోగారావు మాట్లాడుతూ.. నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడంపై వివరించారు. అనంతరం అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో సంఘం జోనల్ కార్యదర్శి బి.సూర్యరాములు, జిల్లా కార్యదర్శి పీజీ రాఫిల్, వివిధ డిపో కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
డిగ్రీ ఫలితాల్లో సత్తా చాటాం..
● నెల్లిమర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేఖ నెల్లిమర్ల: డిగ్రీ పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కందుల రేఖ తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసిన డిగ్రీ ఐదో సెమిస్టర్ ఫలితాల్లో బీఏ హిస్టరీ 84%, బీకాం 80%, బీఎస్సీ కెమిస్ట్రీ 100% బీఎస్సీ జువాలజీ 73. 3%, బోటనీ మైనర్ 100/%, భౌతిశాస్త్రం మైనర్లో 100% ఫలితాలు సాధించినట్లు చెప్పారు. అంతేకాకుండా హిస్టరీ, పాలిటిక్స్ ఎకనామిక్స్ మైనర్స్ 100% ఫలితాలు సంపాదించడం గమనార్హం. కళాశాలకు చెందిన విద్యార్థులు వై.బుచ్చమ్మ, బద్రి కృష్ణవేణి, ఎరకమ్మ, దేవకుమారి మంచి మార్కులు సాధించడంతో ఆమె అభినందించారు. -
కుక్కల దాడిలో 17 గొర్రెలు మృతి
బూర్జ: మండలంలోని కొరగాం గ్రామానికి చెందిన పిన్నింటి వెంకన్న అలియాస్ వెంకటరమణకు చెందిన 17 గొర్రెలు, ఒక మేక కుక్కల దాడిలో మృతి చెందినట్లు గుత్తావల్లి పశువైద్యాధికారి డాక్టర్ సతీష్ మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి గ్రామ సమీపంలో గొర్రెలు, మేకల మందను ఉంచారు. మంగళవారం తెల్లవారుజామున మందపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. మృతి చెందిన జీవాలు విలువ రెండు లక్షల రూపాయలు ఉంటుందని పశువైద్యులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత సభ్యులు కోరుతున్నారు. బొరిగిపేటలో అనుమానితుల కలకలం టెక్కలి రూరల్: బొరిగిపేటలో ఆదివారం అర్ధరాత్రి దాటాక కొందరు అనుమానిత వ్యక్తులు సంచరించడంతో గ్రామస్తులు వెంబడించారు. ఐదుగురిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. వెంటనే విద్యుత్ స్తంభానికి కట్టేసి ప్రశ్నించారు. వివరాలు చెప్పకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్వాసితుల హామీ నెరవేర్చేదెప్పుడు? కొత్తూరు: వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వంశధార నిర్వాసితుల సంఘం నాయకుడు, మెట్టూరు బిట్–2 సర్పంచ్ యర్లంకి ధర్మారావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ అన్నారు. మెట్టూరులో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో నిర్వాసితలకు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకుంటామని ప్రస్తుత సీఎం చంద్రబాబు అప్పట్లో ప్రకటించారని, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 2019 ఎన్నికల సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి కృషి మేరకు నిర్వాసితులకు అదనపు ప్యాకేజి కింద రూ. 217 కోట్లు నిధులు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సాంకేతిక కారణాలతో అదనపు ప్యాకేజీలు అందుకోని 30 శాతం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అందివ్వాలన్న ఆలోచన లేకపోవడం అన్యాయమన్నారు. సమావేశంలో సర్పంచ్ పెదకోట సాదుబాబు, మురపాక శంకరరావు, పార్టీ నాయకులు నిమ్మగడ్డ కృష్ణారావు, యర్లంకి ధర్మారావు, సవర రమేష్, మఠం పూర్ణ, దుర్యోధన, మణి, రమణ తదితరుఉల పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లోనే పిల్లల్ని చేర్పిద్దాం శ్రీకాకుళం: ఉపాధ్యాయులతో పాటు ప్రజలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్పించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సంపత్రావు కిషోర్కుమార్ కోరారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా భారత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడిని చులకనగా తీసుకోవద్దని, ఎందరో మహానుభావులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, పుస్తకాలు ఉచితంగా ఇస్తూ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కోసం రణభేరీ త్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గస్థాయి, జిల్లా కేంద్ర స్థాయి, రాష్ట్రస్థాయిలో నిరాహార దీక్షలు, ఏప్రిల్ 28న చలో సెక్రటేరియట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, గౌరవాధ్యక్షుడు కె.వైకుంఠరావు, సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, వై.ఉమాశంకర్, కోశాధికారి పి.సూర్యప్రకాశరావు, జిల్లా కార్యదర్శి డి.ప్రకాశరావు, జి.నారాయణరావు, బి.శంకరరావు, జి.సురేష్, టి.భాస్కరరావు, ఎం.మురళి ప్రకాష్, గణపతరావు, జైశ్రీరామ్, ఎం.వి.రమణ, బి.గౌరీశ్వరరావు పాల్గొన్నారు -
ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్ : విద్య, ఉపాధ్యాయరంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ (1938) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తొలుత ఈ శిబిరాన్ని సంఘ రాష్ట్ర సహాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి చింతాడ దిలీప్కుమార్ ప్రారంభించారు. ధర్నాకు ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవాధ్యక్షుడు టెంక చలపతిరావు, జిల్లా అధ్యక్షుడు బి.రవి, ప్రధాన కార్యదర్శి బుక్కూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండేళ్లు దాటినా కొత్త వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, ఎన్క్యాష్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
దాతలే దిక్కు
గార : ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. ఆరు నెలల కిందట తల్లిని, వారం క్రితం తండ్రిని మృత్యువు కబళించింది. ఇద్దరు చిన్నారులను అనాథలుగా మార్చింది. గార మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన శిర్ల చిన్నారావు, చిన్నమ్మడుల దంపతులకు పవన్కుమార్, మౌనిక ఇద్దరు పిల్లలున్నారు. చిన్నమ్మడు ఆరునెలల క్రితం దీర్ఘకాల అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి తండ్రి చిన్నారావే అన్నీ తానై పిల్లలను పెంచుతున్నాడు. ఇంతలో గత బుధవారం గుండెపోటుకు గురికావడంతో చిన్నారావు మృతి చెందాడు. అరునెలల వ్యవధిలోనే తల్లి, తండ్రి చనిపోవడంతో అన్నాచెల్లెళ్లు దిక్కుతోచని స్థితిల్లో పడ్డారు. పెదనాన్న, చిన్నాన్న సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. త్వరలోనే పదో తరగతి పరీక్షలు ప్రారంభమవ్వడం, మరోవైపు విషాదంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలున్నారు. పవన్కుమార్ అంపోలు బీసీ హాస్టల్లో పదో తరగతి, మౌనిక పాతపట్నం గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. అనాథలైన ఇద్దరు విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యమున్నా ఆర్థికంగా అండగా నిలిచేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు. సాయం చేయాలనుకునే దాతలు 8309396387 నంబరుకు సంప్రదించాలని చిన్నాన్న శిర్ల రాము విజ్ఞప్తి చేస్తున్నారు. -
వర్సిటీలో అక్రమ నియామకాలు రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎచ్చెర్లలోని డాక్టర్ బి. ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిపిన అక్రమ నియామకాలు తక్షణమే రద్దు చేయా లని జిల్లా తూర్పు కాపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో జిల్లా తూర్పు కాపు ఉద్యోగ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు అంకడాల తవిటన్న, కిల్లారి నారాయణరావు, డాక్టర్ ఎం.రామజోగినాయుడు, వాల్తేటి సత్యనారాయణలు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైస్ చాన్సలర్ కె.ఆర్.రజని నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ద్వారా ఎన్నికై న ప్రజా ప్రతినిధులకు, ఉన్నత అధికారులకు, మంత్రులకు కనీసం గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తూ.. జిల్లా పరువు ప్రతిష్టలు మంటగలుపుతున్నారని దుయ్యబట్టారు. వర్సిటీలో పనిచేస్తున్న తూర్పు కాపు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అవినీతికి, అవకతవకలకు, అక్రమాలకు నిలయమైన వీసీ వెంటనే డిస్మిస్ చేసి ఆమె హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.అభివృద్ధి పనులు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని బహిరంగంగా దోచుకుంటున్న అక్రమార్కులపై ప్రభుత్వం శాసనసభ కమిటీని నియమించి సమగ్ర విచారణ జరిపించాని కోరారు. కాగా, ఇటీవల పదోన్నతులు పొందిన ముగ్గురు ఉద్యోగులను సంఘ నాయకులు సత్కరించారు. పదోన్నతులు పొందిన వారిలో టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గొంటి తిరుపతిరావు, ఉపఖజానా శాఖ అధికారులు గార నిర్మల, బోర రవీంద్రలున్నారు. కార్యక్రమంలో తూర్పు కాపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శాసపు జోగినాయుడు, మక్కా శ్రీనివాస్, దాసరి రామచంద్రరావు, కర్ణం నరిసింగరావు, లావేటి సుందరరావు, దన్నాన మోహనరావు, కురిటి దుర్గారావు, నేతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధులు డిమాండ్ -
ఆరోగ్యం..ఆదాయం
సేంద్రియ సేద్యం.. సారవకోట : ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ, కలుషితమే. తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు అన్నింటా అనారోగ్య కారకాలే. ఈ నేపథ్యంలో చాలామంది సేంద్రియ, ప్రకృతి విధానంలో తయారైన ఉత్పత్తుల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. కారణాలు ఏవైనా సేంద్రియ సాగు చేసే రైతులు మాత్రం మన జిల్లాలో చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తనకున్న భూమిలో మొత్తం సేంద్రియ విధానంలోనే వ్యవసాయం చేస్తూ మంచి ఆదాయం సాధించడంతో పాటు సమాజానికి ఆరోగ్యకర ఉత్పత్తులు అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు సారవకోట మండలం కేళవలస పంచాయతీ పద్మాపురం గ్రామానికి చెందిన రైతు రావాడ మోహనరావు. తనకున్న 23 ఎకరాల భూమిలో సేంద్రియ పద్ధతులతో కూరగాయలు, చిరు ధాన్యాలు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. కిడిమి గ్రామానికి సమీపంలో కొండలకు ఆనుకుని ఉన్న తన స్థలాన్ని సాగు భూమిగా మార్చి సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకంతో అటు నేలతల్లికి, మానవులు ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రహించి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం, అగ్ని హస్త్రంలను ఉపయోగించి సొరకాయలు, వంకాయలు, దొండ, బీర, సారికంద, మిరప, చిక్కుడు, బీన్స్, తోట కూర, క్యారెట్, ముల్లంగి తదితర పంటలను సాగు చేస్తున్నారు. పాడి పెంపకం సైతం.. సేంద్రియ పద్ధతులైన ఘన, ద్రవ జీవాస్త్రాల తయారీకి నాటు ఆవులు అవసరం రావడంతో 50 నాటు ఆవులు, ఇతర జాతులకు చెందిన ఆవులు, కోళ్లను పెంచుతున్నారు. నాటు ఆవుల పేడ, మూత్రం వినియోగించి తయారు చేసిన ఎరువులతో పంటలను సాగు చేస్తున్నారు. మరోవైపు 60 సెంట్లలో ప్రత్యేకించి అంతర పంటలుగా ఒకే చోట ఏడు రకాల కూరగాయలు సొర కాయలు, దొండ, తోటకూర, క్యారెట్, కాకర, బీర, ముల్లంగి పంటలు పండిస్తున్నారు. ఇవేకాక కూరగాయలు పండిస్తున్న పంట పొలాల చుట్టు ఖాళీ ప్రదేశాలలో 600 కొబ్బరి మొక్కలు, మామిడి, సపోట, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి పంటలను పండిస్తూ వాటికి సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. తనకున్న ఖాళీగా ఉన్న భూమిలో 4 బోర్లు వేసి మూడింటికి సోలార్ పద్ధతిలో నడిచేలా మోటార్లు ఏర్పాటు చేసి స్ప్రింక్లింగ్ విధానంలో నీరు అందిస్తున్నారు. రసాయన ఎరువులు వాడకుండా చిరు ధాన్యాలైన రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు పండిస్తున్నారు. ఇక్కడ పండించిన పంట సారవకోట, అలుదు గ్రామాలతో పాటు నరసన్నపేటలో విక్రయిస్తున్నారు. నాటు ఆవుల గెత్తాన్ని ఇతర ప్రాంతాలకు విక్రయానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం రసాయన ఎరువులు వాడకం ఎక్కువైంది. దీంతో నేలతల్లికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఆ నేల తల్లిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. అటు నేలతల్లికి, ఇటు మానవాళి మనుగడకు సేంద్రియ సాగు ఎంతో అవసరం. ఆహార అలవాట్లు మారడం వల్ల మానవుడు తాను సంపాదిస్తున్న ఆదాయంలో సగం వరకు వైద్య ఖర్చులకు వెచ్చించాల్సి వస్తోంది. – రావాడ మోహనరావు, రైతు, పద్మాపురం -
చంద్రగ్రహణంతో మూతబడిన దేవాలయాలు
పర్లాకిమిడి: చంద్రగ్రహణం వల్ల పట్టణంలో అన్ని దేవాలయాలు, మఠాలు ఉదయం పదిగంటల నుంచి మూసివేశారు. రాజవీధిలో ఉమారామలింగేశ్వర మందిరం, ఏకాంబరీశ్వర మందిరం, గోపీశ్వర మందిరం, శ్రీజగన్నాథ మందిరం, పెద్ద రాధాకాంత మఠంలో రాధాగోవింద ఆలయం తదితర దేవాలయాలను మూసివేశారు. తిరిగి రాత్రి సంప్రోక్షణ అనంతరం తెరువబడతాయని పూజారులు తెలియజేశారు. పెద్ద రాధాకాంత మఠంలో 24 గంటలపాటు హరేరామ.. హరే కృష్ణ భజన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో చంద్ర గ్రహణం పురస్కరించుకుని అన్ని రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రాయగడ: చంద్ర గ్రహణం కారణంతో మంగళవారం పట్టణంలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. ప్రధానంగా మజ్జిగౌరీ మందిరాన్ని ఉదయం 6.15 గంటలకు మూసివేశారు. అలాగే స్థానిక కరణం వీధికి వెళ్లే మార్గంలో ఉన్న కోదండరామ మందిరం, మల్లికార్జున మందిరాలు మూతపడ్డాయి. స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణ వేంకటేశ్వర మందిరాన్ని కూడా మూసివేశారు. అయితే మజ్జిగౌరీ మందిరానికి కొంతమంది ఆంధ్రకు చెందిన భక్తులు రావడంతో వారు బయటే పూజలు చేసుకుని తిరుగుముఖం పట్టారు. -
బాధిత కుటుంబాలకు పరిహారం మంజూరు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి రాఖాల్గూడ గ్రామంలో లకే పోడియామి అనే మహిళ హత్యకు గురైంది. హత్యను నిరసిస్తూ గత ఏడాది డిసెంబర్ ఏడు, ఎనిమిది తేదీల్లో యం.వి. 26 గ్రామంపై కొందరు వ్యక్తులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇళ్లను కాల్చివేసి ఆస్తులను తగలబెట్టారు. ఈ సమయంలో గ్రామంలో పర్యటించిన నాయకులు బాధిత కుటుంబానికి రూ. 75 వేల నుంచి లక్ష రూపాయల వరకూ పరిహారంగా ఇస్తామన్నారు. అయితే గ్రామం మొత్తం నాశనం కావడంతో పరిహారాన్ని గతంలో ప్రకటించిన దానికంటే నాలుగు రేట్లు అధికంగా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా 4,65,47,269 రూపాయలను కేటాయించినట్టు మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకటించారు. పరిహారాన్ని త్వరలో జిల్లా కలెక్టర్ సోమేశ్ కుమార్ ఉపాధ్యాయ్ పర్యవేక్షణలో పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే రాఖాల్గూడ గ్రామానికి చెంది.. హత్యకు గురైన లకే పోడియామి కుటుంబానికి కూడా పది లక్షల రూపాయలకు బదులు 20 లక్షల రూపాయలను అందజేస్తామన్నారు. -
5ఈ– విద్యా బోధన పుస్తకావిష్కరణ
జయపురం: స్థానిక విక్రమదేవ్ యూనివర్సిటీ మానవీయ అధ్యాయన విభాగం మూడవ సభాగృహంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో శాసీ్త్రయ వాతావరణంలో 5ఈ విద్యా బోధన పుస్తకాన్ని ఆవిష్కరించారు. యూనివర్సిటీ ఉపాధ్యాయ శిక్షణ విభాగాధిపతి, సహాయ ప్రొఫెసర్లు డాక్టర్ మనోరంజన్ ప్రధాన్, లోకేష్ ప్రధాన్లు సంయుక్తంగా రచించిన 280 పేజీల విలువైన పరిశోధనా గ్రంథం 5ఈ విద్యా బోధన’పుస్తకాన్ని విశ్వవిద్యాలయ రిజస్ట్రార్ మహేష్ చంద్రనాయక్, స్నాతకోత్సవం పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ప్రశాంత కుమార్ సాహులు సంయుక్తంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇద్దరు రచయితలతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్రకుమార్ మహారాణ పాల్గొన్నారు. రచయిత డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ పుస్తకంలోని అంశాలను వివరించారు. గుణాత్మక విద్యా బోధనకు ఎలా ఉపయోగపడుతుందో తెలియ జేశారు. ముఖ్యఅతిథి మహేశ్వర్ చంద్రనాయక్ రచయితలను అభినందించారు. ఈ పుస్తకం బీఈడీఎ, ఎంఈడీ, ఆనర్స్ ఎంఏ విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అధ్యాపకులు కస్తూరీ ఆచార్య, అనిత పట్నాయక్, అనుపమ మిశ్ర, పరిచితా మహాపాత్రో, సుజాతా బేజ్, స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకులు బందనా మహరాణ, శుభశ్రీ పట్నాయక్, సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ పుస్తకం ఆన్లైన్తోపాటు పుస్తక విక్రయ కేంద్రాల్లో లభ్యమవుతాయన్నారు. -
ఘనంగా బిజూ జయంతి ఉత్సవాలు నిర్వహిద్దాం
రాయగడ: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ బిజూ పట్నాయక్ 110వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బీజేడీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సుధీర్ దాస్, పట్నాన గౌరీశంకర్ రావు, అనసూయా మాఝి తదితరులు సోమవారం సమావేశమై జయంతి ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. ఈ నెల ఐదో తేదీన బీజూ జయంతిని పురస్కరించుకుని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల బిజూ పట్నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమంతో పాటు భారీ ర్యాలీని నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయించారు. -
హెచ్పీవీ వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభం
జయపురం: జయపురం సబ్ డవిజన్ కోట్పాడ్ కమ్యూనిటీ హాస్పిటల్లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. కోట్పాడ్ ఎన్ఏసీ చైర్మన్ ఎం.శంకరరావు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక హెచ్పీవీ వ్యాక్సిన్ ధర బహిరంగ మార్కెట్లో రూ.5 వేల నుంచి రూ.10 వేలు వరకు ఉంటుందన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని వెల్లడించారు. కార్యక్రమంలో నవరంగపూర్ ఎంపీ ప్రతినిధి రామేశ్వర జెన, కోట్పాడ్ ఎమ్మెల్యే ప్రతినిధి సురేష్ మహంతి, కోట్పాడ్ వైద్యాధికారి రంజన్ దాస్, ప్రెస్క్లబ్ కార్యదర్శి, న్యాయవాది పంకజ కుమార్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
కరడు గట్టిన దొంగల ముఠా అరెస్ట్
కొరాపుట్: కరడు గట్టిన దొంగల ముఠాని నబరంగ్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళ వారం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ పట్టణం లో ఎస్డీపీఓ సుభేంద్ సబర్ తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు ప్రకటించారు. గత నెల 22వ తేదీన ఉమ్మర్కోట్ పట్టణానికి సమీపంలో కోచ్ని అంబ గ్రామంలో అమూల్య జెన్న ఇంటిలో భారీ దొంగతనం జరిగింది. ఆ రోజు ఆ కుటుంబం ఆస్తి అమ్మిన నగదు ఇంట్లో ఉందని తెలిసి దొంగల ముఠా దాడి చేసింది. వారింట్లో ఉన్న వారి పై దాడి చేసి రు.70 లక్షలు నగదు, పెద్ద మెత్తం లో బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. ఈ కేసుని చాలెంజ్గా తీసుకున్న పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి ఏడుగురు దొంగలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రు.21 లక్షలు నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నబరంగ్పూర్కి చెందిన బబులా, మజ్జి గూడ గ్రామానికి చెందిన రొణ, గణేష్ రానా, దీరజ్ లైచన్, ధర్నాబెడ గ్రామానికి చెందిన చిత్రసేన్ గొండో, జయపూర్ కి చెందిన సిసిఎల్ కునాల్, కొట్పాడ్కి చెందిన సుఖదేవ్ ముదలి తదితరులు ఉన్నారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. -
మధ్యప్రాచ్య సంక్షోభంపై ప్రభుత్వం అప్రమత్తం
భువనేశ్వర్: మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్)లో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వలస ఒడియా ప్రజల భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సూచనల మేరకు జరిగిన ఈ సమావేశంలో హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ ఆర్పీ కోచే, ఒడిశా మో పరిబార్ డైరెక్టర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బిజయకేతన్ ఉపాధ్యాయ్, కార్మిక శాఖ కమిషనర్ ఇంద్రమణి త్రిపాఠి, వివిధ విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో వలస వెళ్లిన ఒడియా ప్రజలకు, వారి కుటుంబాలకు సాధ్యమైనంత మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. సంబంధిత విభాగాలన్నీ అప్రమత్తంగా ఉంటు అనుక్షణం మారుతున్న పరిస్థితిని నిశితంగా గమనించాలని ప్రఽముఖ కార్యదర్శి సూచించారు. విదేశాల్లో ఉంటున్న ఒడియా ప్రజలకు సకాలంలో సహాయం, విశ్వసనీయమైన సమాచారాన్ని అందజేయడంలో చక్కని సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయ పౌరులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాత్రింబవళ్లు పని చేసే 24 గంటల టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 800–4634342, వాట్సాప్ నంబర్ +971543090571ను జారీ చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిస్పందన యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒడిశా మో పొరిబార్, రాష్ట్ర హోం (స్వరాష్ట్ర) శాఖ, రాష్ట్ర కార్మిక డైరెక్టరేట్ ప్రమఖులతో కూడిన ప్రత్యేక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. తాజా సమాచారం, సకాలంలో సహాయాన్ని సులభతరం చేసేందుకు ప్రీతీష్ పండాను ఒడిశా మో పరిబార్కు నోడల్ అధికారిగా నియమించారు. మధ్యప్రాచ్యంలోని ఒడియాలకు సంబంధించిన మద్దతు కోసం ఆయనను 9583321964 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సమావేశానికి హాజరైన రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ వై. బి. ఖురానియా తెలిపారు. సంబంధిత అధికారులందరినీ అప్రమత్తం చేశామని, పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన అన్నారు. పరిస్థితికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను కఠినంగా పర్యవేక్షిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని నివారించడానికి అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ తెలియజేశారు. -
శోభాయమానంగా శ్రీ క్షేత్రంలో డోలా యాత్ర
భువనేశ్వర్: పవిత్ర శ్రీ క్షేత్రం విరజిమ్ముకున్న రంగులతో శోభాయమానంగా కళకళలాడింది. శ్రీ జగన్నాథుడు హోలీ సందర్భంగా రంగుల జాతర డోలోత్సవం ఆచారంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా జరిగే ప్రముఖ యాత్రల్లో డోలోత్సవం ఒకటి కావడం విశేషం. ప్రత్యేక డోలికలో ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి ప్రతినిధిగా శ్రీ దేవి, భూ దేవి సమేతంగా ప్రత్యేక ఆచార నియమాలతో పూజలందుకున్నాడు. అనంతరం ఊరేగింపుగా శ్రీ మందిరం నుంచి డోలిక మండపానికి తరలివెళ్లాడు. నయనానందంగా సాగిన ఈ ఊరేగింపు ప్రత్యక్షంగా తిలకించిన భక్తజన హృదయాలు పులకించి పోయాయి. డోలిక మండపంలో ప్రత్యేక భోగాదుల నివేదనతో పూజా కార్యక్రమం ముగియడంతో ఆ ప్రాంగణం రంగులమయమైంది. అర్ధరాత్రి అలంకరణ ఈ ఏడాది చంద్ర గ్రహణం కారణంగా స్వర్ణ అలంకరణ పగటిపూట కాకుండా మంగళ వారం అర్ధ రాత్రి నిర్వహించారు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఈ సన్నాహాలు ప్రారంభించారు. మంగళ హారతి తదితర దైనందిన సేవాదులు క్రమ పద్ధతిలో ముగించి స్వర్ణ అలంకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవుళ్ళకు ఖొయికొర భోగాన్ని సమర్పించారు. 7 రోజుల డోలోత్సవం చైత్ర మాసం (శ్రీ మందిరం పంచాంగం గణాంకాల ప్రకారం) మొదటి రోజున డోల పూర్ణిమతో ముగిసింది.యాత్రికుల నడుమ డోలోత్సవం ఊరేగింపుస్వర్ణ అలంకారం పవిత్ర డోలో పూర్ణిమ సందర్భంగా శ్రీ మందిరం రత్న వేదికపై మూల విరాట్లకు బంగారు ఆభరణాలతో రాజాధి రాజా అలంకరణ ఆచారం నిరవధికంగా కొనసాగుతుంది. ఏటా 5 సార్లు జరిగే స్వర్ణ అలంకారాల్లో ఇదొకటి కావడం విశేషం. ఇది భక్తులకు ఒక ప్రత్యేకమైన, చిరస్మరణీయ దృశ్యం. ఈ దర్శనం దైవిక ఆశీస్సులతో శ్రేయస్సు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. -
హ్యాపీ అండ్ సేఫ్ హోలీ
భువనేశ్వర్: రంగుల పండగ ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ సైకత యానిమేటర్ మానస్ కుమార్ సాహు సైకత శిల్పాన్ని రూపొందించారు. దాదాపు 2 గంటలు నిర్విరామంగా శ్రమించి దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నాడు. ఆనందం, సామరస్యం, ఐక్యత, బాధ్యత మేళవింపుల పండగ హోలీ అని అభివర్ణించాడు. సామాజిక అవగాహన, సాంస్కృతిక వ్యక్తీకరణ మాధ్యమంగా ఈ కళాఖండం ఆవిష్కరించినట్లు తెలిపారు. బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. శాసనసభలో సంఖ్యా బలం దృష్ట్యా తొలి 2 స్థానాల్లో అనుకూలత నేపథ్యంలో పార్టీ కేవలం ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించినట్లు స్పష్టమవుతోంది. వారిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, మాజీ రాజ్యసభ సభ్యుడు సుజీత్ కుమార్ ఉన్నారు. ఈ ఇరువురి అభ్యర్థిత్వం ఎంపిక నిర్ణయం పార్టీ సంస్థాగత బలం మరియు ప్రాంతీయ ప్రాతినిధ్యంపై ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. రాష్ట్రంలో అట్టడుగు స్థాయి స్థితి నుంచి భారతీయ జనతా పార్టీకి అధికార హోదాకు అందలం ఎక్కించిన అనుభవజ్ఞుడుగా పేరొందిన ప్రస్తుత రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్కు ఎగువ సభ ప్రాతినిథ్యం కల్పించడం రాజకీయ ప్రాముఖ్యతకు అద్దం పడుతోంది. పశ్చిమ ఒడిశా కలహండి ప్రాంతీయునిగా విధానపరమైన నేపథ్యానికి పేరుగాంచిన సుజీత్ కుమార్ ఎగువ సభలో పార్టీ ప్రాతినిధ్యానికి కొనసాగింపు ప్రాంతీయ సమతుల్యతకు ప్రాణం పోస్తుంది. అంజిపేటలో కార్చిచ్చు రాయగడ: స్థానిక జేఎస్కో సమీపంలో గల అంజిపేట వద్ద కొండపై మంటలు చెలరేగడంతో సమీపంలో గల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. వేసవి కాలం ప్రారంభంలో అటవీ శాఖ పలు విధాలుగా అవగాహన కల్పిస్తున్నా ఎక్కడో ఓ చోట ఇలా జరుగుతూనే ఉంది. అంజిపేటలో ఉన్న కొండపై గుర్తు తెలియని వారు ఎండిన వాటికి నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగాయని సమాచారం. రూ.10.50 లక్షల విలువైన గంజాయి స్వాధీనం రాయగడ: రెండు కారుల్లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని పద్మపూర్ పో లీసులు పట్టుకున్నారు. కార్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు కార్లలో ఉన్న 105 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.10.50 లక్షలు ఉంటుందని అంచనా వేశా రు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు జిల్లా లోని గుణుపూర్ లొని కొమటి వీధికి చెంది న రజనీకాంత్ నాయక్గా గుర్తించారు. అయితే గంజాయి రవాణాకు సంబంధించి మరో నిందితు డు పోలీసులను చూసి కారును అక్కడే విడిచిపెట్టి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకా రం పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మిలకాపంగ గ్రామ సమీపంలో ఉన్న జీడి తోటలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు సొమవారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి పట్టుబడింది. పొరుగు జిల్లా గజపతి లొని అడవా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తున్న గుడ్రిపొంగ అడవుల నుంచి రెండు కారుల్లొ గంజాయిని పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీకాకుళంకు తరలిస్తుండగా పోలీసులకు నిందితుడు పట్టుబడ్డాడు. ఈ వివరాలను పద్మపూర్ పోలీస్ స్టేషన్ ఐఐసి ధరణీ ధర్ ప్రధాన్ తెలియజేశారు. -
ఈనెల 11న అవిశ్వాస తీర్మానం ఫలితాలు
రాయగడ: మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ శుభ్ర పండపై తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఫలితాలను ఈనెల 11వ తేదీన ప్రకటించనున్నట్లు కలెక్టర్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆరోజు ఉదయం 11 గంటలకు స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో కౌంటింగ్ వివరాలను వీడియో ద్వారా నిక్షేపం చేసిన అనంతరం ఫలితాలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు సంబంధించి 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జిల్లా యంత్రాంగం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో తీర్మానానికి సంబంధించి కౌన్సిలర్ల ఓటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. అయితే తనపై తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంలో ఏమాత్రం నిజం లేదని వైస్ చైర్పర్సన్ శుభ్రపండ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ హైకోర్టు ఆదేశానుసారం ఫలితాలను వెల్లడించలేదు. ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ను స్థానిక ట్రెజరీలో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న సమక్షంలో భద్రపరిచారు. ఏదిఏమైనప్పటికీ ఈనెల 11వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ఇప్పటికే శుభ్రపండకు వ్యతిరేకంగా 19 మంది కౌన్సిలర్లు ఓటింగ్ వేసిన సంగతి అందరికీ తెలిసినప్పటికీ, అధికారికంగా శుభ్ర పండ వైస్ ఛైర్పర్సన్ పదవి నుంచి తొలగించే విషయంలో ఫలితాలు వెల్లడిస్తాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
విద్యార్థిని మృతి
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలోని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలలో చదువుతూ హస్టల్లో ఉంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈమె అంబొదల ప్రాంతానికి చెందిన గీతా మాఝిగా గుర్తించారు. ఆదివారం రాత్రి హఠాత్తుగా గీత అస్వస్థతకు గురైంది. దీంతో హాస్టల్ నిర్వాహకులు సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంతజరిగినా హాస్టల్ నిర్వాహకులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని.. ఇదంతా వారి నిర్లక్ష్యం కారణంగానే తన కూతురు చనిపోయిందని సోమవారం అంబొదల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న గీతా మాఝి సొంత ఇల్లు వసతి గృహానికి కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న కొందోబలిజోడి గ్రామంలో ఉంది. ఆదివారం తీవ్రఅస్వస్థతకు గురైన గీత విషయం హాస్టల్ నిర్వాహకులు ఆమె తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం అందివ్వకపోవడం విచారకరం. ఇదిలాఉండగా హాస్టల్ ప్రధానోపాధ్యాయుడుగా విఽ దులు నిర్వహిస్తున్న కొలాబామన మూర్తి, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణమని పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు నమోదు కావడంతో కేసు మలుపు తిరిగింది. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి బల ప్రదర్శన పోటీలు
సారవకోట: మండలంలోని వడ్డినవలస గ్రామంలో త్రినాథస్వామి ఆలయ 69వ వార్షికోత్సవంలో భాగంగా జిల్లాస్థాయి బలప్రదర్శన పోటీలు నిర్వహించారు. 80 కిలోల విసురుగుండు పోటీల్లో ఒప్పంగి గ్రామానికి చెందిన గేదెల సత్యనారాయణ ప్రథమ, గేదెల రమణ ద్వితీయ బహుమతి పొందారు. అలాగే 100 కిలోల తీత సంగిడి పోటీల్లో గేదెల సత్యనారాయణ ప్రథమ, ఆవల గోవిందరావు ద్వితీయ బహుమతులు పొందారు. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ఆవల గోవిందరావు, ముద్దాడ తరుణ్ కుమార్లు ఇద్దరు 160 కిలోలు ఎత్తడంతో ఇద్దరికీ ప్రథమ స్థానం, బిల్లాడ యోగేశ్వరరావును ద్వితీయ స్థానానికి ఎంపిక చేశారు. అలాగే బాలికల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆడవరానికి చెందిన గుజ్జల వర్షిత 103 కిలోలు ఎత్తి ప్రథమ స్థానం, 95 కిలోలు ఎత్తి దూబ హేమశ్రీ ద్వితీయ స్థానంలో నిలిచారు. 203 కిలోల ఈడ్పు గుండు పోటీల్లో ఆవల గోవిందరావు ప్రథమ స్థానం సాధించారు. -
ఐసీయూ, ఎం.ఆర్ స్కాన్ ఏర్పాటు చేయాలి
పర్లాకిమిడి: ఎనిమిదో స్టాండిగ్ కమిటీ ముగింపు సమావేశం భువనేశ్వర్లోని లోక్సదన్లో సోమవారం నిర్వహించారు. పర్లాకిమిడి నియోజికవర్గ శాసనసభ్యులు రూపేష్ పాణిగ్రాహి పలు డిమాండ్లను ప్రతిపాదించారు. పర్లాకిమిడి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఎం.ఆర్ స్కాన్, ఐసీయూ ఏర్పాటు, నువాగడ బ్లాక్ ఖోజురిపద, చంద్రగిరిలో పోస్టుమర్టాం కేంద్రం నిర్మాణం, ప్రభుత్వ ఆస్పత్రి, పర్లాకిమిడిలో స్పెషలిస్టు డాక్టర్లు, నర్సుల నియామకం, అంబులెన్సులు, ఆక్సిజన్ ప్లాంటు పుణరుద్ధరణ, మార్చురీ (మహాప్రయాణం) వాహనాలు కొనుగోలు చేయాలని స్టాండింగ్ కమిటీ ఎదుట డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
● ఇద్దరికి గాయాలు సారవకోట: మండలంలో అలుదు గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 326–ఏ పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం కొయ్యాం గ్రామానికి చెందిన మజ్జి నరేంద్ర (24) మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలంలోని కొయ్యాం నుంచి పెళ్లి కబుర్లు చెప్పేందుకు సారవకోట వైపు ద్విచక్ర వాహనంపై మజ్జి నరేంద్ర, మజ్జి అప్పలనాయుడు వెళ్తున్నారు. అదే సమయంలో పాతపట్నం మండలంలోని సీది నుంచి ఆటోలో గేదెల వరలక్ష్మి, ఆటో డ్రైవర్ కృష్ణ సారవకోట మండలంలోని వడ్డినవలస వెళ్తున్నారు. అలుదు గ్రామం రెల్లివీధి సమీపంలో జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో మజ్జి నరేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే మజ్జి అప్పలనాయుడుతో పాటు ఆటోలో ఉన్న వరలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో నరేంద్ర, అప్పలనాయుడు, వరలక్ష్మిలను 108 వాహనంలో నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. నరేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
మౌలిక సౌకర్యాలు కల్పించాలని వినతి
రాయగడ: సదరు సమితి గజ్జిగాం పంచాయతీ పరిధిలో గల డెక్కాగుడలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ను గ్రామస్తులు కోరారు. గ్రామంలో గల సమస్యలకు సంబంధించి సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అశుతోష్ కులకర్ణిని కలిసి వినతిపత్రం అందించారు. గ్రామంలో సమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయని, అంతా ఆదివాసీలేనని వినతిపత్రంలో పేర్కొన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య గత కొన్నాళ్లుగా ఉందన్నారు. ఉన్న ఒక్క గొట్టపు బావి సరిపోవడం లేదని, రానున్న వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సమస్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా గ్రామానికి సరైన రహదారి లేకపొవడంతో తామంతా ఇక్కట్లు పడుతున్నామన్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఇంతవరకు ఎటువంటి ఫలితం లేదన్నారు. కలెక్టర్ స్పందించారు. వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న బీడీఓ సుజిత్ కుమార్ మిశ్రాను ఆ గ్రామంలో పర్యటించి పూర్తి వివరాలు తనకు సమర్పించాలని, అవసరమైన వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. -
7 నుంచి జిల్లా స్థాయి యోగా పోటీలు
రాయగడ: స్థానిక మున్సిపాలిటీ టౌన్ హాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి జిల్లా స్థాయి యోగా పోటీలను నిర్వహించేందుకు సన్నహాలు జరుగుతున్నాయని స్థానిక యోగా స్టోర్ట్స్ అసోసియేషన్ ప్రకటించింది. మేరకు సోమవారం అసోసియేషన్ అధ్యక్షుడు నృసింగ బాహిణిపతి, జిల్లా యోగా కన్వీనర్, ప్రముఖ హాస్యనటుడు ప్రభాకర్ మిశ్రో, యోగా గురు స్వాధీన పండా, ప్రదీప్ కుమార్ రౌత్, నిర్జారాణి పట్నాయక్లు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ మేరకు తెలియజేశారు. రెండు రోజుల పాటుగా జరిగే ఈ పోటీల్లో జిల్లాలో గల వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు వందల మందికి పైగా ఈ పోటీలకు హాజరవుతున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. వారికి భోజన, వసతి సౌకర్యాలను స్థానిక గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాలలో కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పేర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నట్లు వివరించారు. ఈ పోటీల్లో 10 నుంచి 55 ఏళ్ల లోపు వయసు గలవారు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు బాహిణిపతి తెలియజేశారు. ఈ పోటీల్లో గెలిపొందినవారు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని వివరించారు. -
శ్రీమందిర్ కొత్త సేవా విభాగం అడ్మినిస్ట్రేటర్గా ప్రియ రంజన్
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరం సేవా విభాగం ప్రముఖునిగా ప్రియ రంజన్ పృష్టి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ మందిరం సందర్శించి రత్న వేదికపై కొలువు దీరిన మూల విరాట్లను దర్శించుకున్నారు. శ్రీ మందిరంలో సేవాదులు సక్రమంగా సకాలంలో నిర్వహించేందుకు సాధ్యమైనంత వరకు అంకిత భావంతో కృషి చేస్తానన్నారు. సేవల విభాగంలో అన్ని వర్గాల సమన్వయం, సహకారంతో మాత్రమే ఇది సాధ్యమని పేర్కొన్నారు. శ్రీ మందిరం ఇతర విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు సాదరంగా స్వాగతించారు. ముగిసిన నామ సంకీర్తన రాయగడ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి చైతన్య రాంజీ ఆధ్వర్యంలో జిల్లాలోని కొలనార సమితి దొందులి గ్రామ పంచాయతీ పాత్రపుట్ గ్రామంలో గత నెల 28 నుంచి నిర్వహిస్తున్న అష్ట్రపహారి నామ సంకీర్తన కార్యక్రమం సోమవారంతో ముగిసింది. మూడు రోజుల పాటుగా జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని హరేరామ నామ కీర్తనలను చేశారు. ఆధ్యాత్మికంగా అందరిలో భక్తి, భావాలు పెంపొందాలని స్వామి చైతన్య రాంజీ ప్రసంగించారు. ఉన్న సమయంలో కొంత కేటాయించి దేవుని కీర్తనల కోసం గడపాలని, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికపొందూరు: త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న సైన్స్ సమగ్ర మహోత్సవ్–2026 పోటీలకు జిల్లా నుంచి పొందూరు కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాత్రుని ఐశ్వర్య రూపొందించిన ‘ఫార్మర్స్ ఫ్రెండ్లీ లైఫ్ సేవర్స్ స్టిక్’ ప్రాజెక్టు ఎంపికై ందని ప్రిన్సిపాల్ ఎస్.లలిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో విద్యార్థినిని అధ్యాపక సిబ్బంది అభినందించారు. కౌలు రైతులను పట్టించుకోవడం లేదు సరుబుజ్జిలి: కౌలు రైతుల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు ఆరోపించారు. మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో కౌలు రైతు సంఘం జిల్లా మహాసభలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు కార్డులు అందించడం ఇంతవరకు ఆచరణలో పెట్టలేదన్నారు. జిల్లాలో 30 శాతం మంది కౌలు రైతులు ఉన్నా.. వారికోసం పట్టించుకున్నవారే కరువయ్యారని ఆవేదనవ వ్యక్తం చేశారు. కౌలు కార్డులకు రుణాలు, అన్నదాత సుఖీభవ అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్రావు, జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, సీఐటీయూ మండల శాఖ కార్యదర్శి అదపాక రాజేష్, తదితరులు పాల్గొన్నారు. సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ పంచాయతీ పాలనాయుడుపేటలో ఎల్పీ నంబర్ 324, 325లో వేసిన లే–అవుట్లో ఆక్రమణలను రెవెన్యూ, పంచాయతీ అధికారులు గుర్తించారు. రియల్ దందా అనే శీర్షికతో ఆదివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం మండల సర్వేయర్ సుభాష్ ఆధ్వర్యంలో లే అవుట్ను పరిశీలించి సర్వే చేశారు. గ్రామ కంఠంకు సంబంధించి 7 సెంట్లు, వంశధార కాలువకు సంబంధించి 2 సెంట్లు కలిపి మొత్తం 9 సెంట్లు ఆక్రమణలకు గురైనట్లు తేల్చారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని మార్కింగ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పాడ ఉమాపతి, విలేజ్ సర్వేయర్ త్రిమూర్తులు ఉన్నారు. కాగా ఎల్పీ నంబర్ 324, 325లో భూములు కోర్టు పరిధిలో ఉన్నాయని, దీనిపై క్రయ, విక్రయాలు చేయకూడదని పీజీఆర్ఎస్లో కె.కుసుమారెడ్డి ఫిర్యాదు చేశారు. లే అవుట్ను పరిశీలిస్తున్న సర్వేయర్ సుభాష్ తదితరులు -
వార్షిక బడ్జెట్ ఆమోదం
జయపురం: జయపురం రీజనల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (ఆర్.సి.ఎం.ఎస్) వార్షిక బడ్జెట్ సమావేశం ఉమ్మిరి సమీప తెలిగుడ గ్రామంలోని సొసైటీ కార్యాలయంలో సోమవారం జరిగింది. రీజనల్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు సుకాంత త్రిపాఠీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్.సి.ఎం.ఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. త్రిపాఠీ వార్షిక నివేదికను వివరించారు. నూతన ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. 2026–27 వార్షిక బడ్జెట్ను సమావేశం ఆమోదించింది. బడ్జెట్లో ఆర్సిఎంఎస్ కార్యాలయ ప్రాంతంలో స్టాల్స్ నిర్మాణం, ఖాళీ స్థలం పంపిణీపై చర్చించారు. స్టాల్స్ కోసం ఎవరు దరఖాస్తు పెట్టుకుంటారో వారి నుంచి సెక్యూరిటీ వసూలు చేసి వాటితో ఆర్ి.ఎం.ఎస్ స్టాల్స్ నిర్మించాలని సమావేశం తీర్మానించింది. ఈ సమాపంలో సుదీప్ పదార్, ట్వింకిల్ మిశ్రా, అరుణ భటమిశ్రా, సుభాష్ సాహూ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 99 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీదారుల నుంచి వచ్చే వినతులను త్వరిగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలకు క్షేత్రస్థాయిలో అధికారులు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని, ప్రతి అర్జీదారుడికి సంతృప్తికరమైన సమాధానం అందాలని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 99 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 22 అర్జీలు రాగా, పంచాయతీ రాజ్ శాఖకు 19, సెర్ప్ విభాగంలో 13, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 10 వినతులు అందాయి. అలాగే జలవనరుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖలకు సంబంధించి చెరో 4 అర్జీలు రాగా, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగంలో 3 ఫిర్యాదులు అందాయి. ఆర్టీసీ, సర్వే సెటిల్మెంట్స్, బీసీ సంక్షేమం, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖలపై రెండేసి చొప్పున వినతులు వచ్చాయి. వీటితో పాటు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఎన్టీఆర్ వైద్య సేవ, కాలుష్య నియంత్రణ మండలి సహా మొత్తం 22 విభాగాలకు చెందిన సమస్యలను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యలపై అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే గ్రీవెన్స్ హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రెవెన్యూ క్లినిక్ వద్ద జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. మండలాల వారీగా ఏర్పాటు చేసిన డెస్క్ల వద్దకు వెళ్లి, అక్కడ ఉన్న దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీలను స్వయంగా పరిశీలించారు. అక్కడికక్కడే రెవెన్యూ సిబ్బందితో కలిసి చర్చించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. భయానక పరిస్థితులు నెలకొన్నాయి శ్రీకాకుళం నుంచి ఎచ్చెర్ల మండలంలోని పొన్నాడకు వెళ్లే రోడ్డులో వంతెన వద్ద ఇటీవల భయానక పరిస్థితులు నెలకొన్నాయని కొంగరాం, ముద్దాడ, వెంకన్నగారిపేట తదితర గ్రామాలకు చెందిన ప్రజలు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పొన్నాడ తర్వాత సుమారుగా పది గ్రామాలు ఉన్నాయని, వారంతా పగలు, రాత్రి ఆ మార్గం గుండానే ప్రయాణాలు చేస్తుంటారని తెలిపారు. ఇటీవల ఆ బిడ్జి సమీపంలో హత్యలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన అధికారులు స్పందించి ప్రజల భద్రతపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
డోలోత్సవానికి వేళాయె..!
● మూడు రోజుల పాటు కూర్మనాథుని డోలోత్సవాలు ● నేటి రాత్రి కామ దహనోత్సవం ● అధిక సంఖ్యలో దర్శించుకోనున్న భక్తులుగార: ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథాలయంలో మంగళవారం నుంచి డోలోత్సవాలు ప్రారంభమవ్వనున్నాయి. తొలిరోజు రాత్రి 10 గంటల నుంచి కామ దహనోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఏటా పాల్గుణ మాస త్రయోదశి నాడు మాఘ నక్షత్రంలో జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఉంచి మేళతాళాలతో తిరువీధి నిర్వహిస్తారు. అనంతరం గ్రామ సమీపంలోని కామ దహన మంటపం వద్ద కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మనసులోని చెడు ఆలోచనలు పటాపంచలవుతాయని, మంచి కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. కామ దహనోత్సవం ముగిసిన తర్వాత బుధవారం వేకువజాము నుంచి సమీప ఎస్.మత్స్యలేశం తీరంలో భక్తులు పవిత్ర స్నానాలచరిస్తారు. మరలా ఆలయంలోని శ్వేత పుష్కరిణిలో పవిత్ర స్నానాలాచరిస్తారు. గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి మూర్తులను మేళతాళాలతో ఊరేగించి, గ్రామదేవత ఆలయం సమీపంలోని డోలో మంటపం వద్దకు తీసుకెళ్లి ఉత్తరాభిముఖంగా స్వామిని వేంజేసింపజేసి బుక్కాభర్గుండతో పూజలు చేస్తారు. ఈ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఇదీ చరిత్ర.. విష్ణుమూర్తి దశావతారాల్లో రెండో అవతారం తాబేలు(కూర్మం) రూపం. ఇక్కడ మూలవిరాట్ను బ్రహ్మ ప్రతిష్టించారని, రాత్రి వేళల్లో దేవతల నిత్యార్చన, పగలు మానవ అర్చనలు జరుగుతుంటాయని చెబుతారు. ఆలయం ఎదురుగానున్న శ్వేత పుష్కరిణి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో తవ్వగా.. అందులో గరుడ వాహనంపై ఉన్న లక్ష్మీదేవి విగ్రహం లభ్యమై ఆలయంలో కూర్మనాయకిగా కొలువుంది. ఈ ఆలయం కృతయుగంలో నిర్మితమవ్వగా.. 11వ శతాబ్ధంలో రామానుజాచార్యులు తన దిగ్విజయ యాత్ర సందర్భంగా దీన్ని వైష్ణవ క్షేత్రంగా మార్చారని, ఈ విజయానికి చిహ్నంగా పశ్చిమాన విజయ స్థూపాన్ని నిర్మించారని ప్రతీతి. ఈ క్షేత్రాన్ని ఎనిమిదో శతాబ్ధంలో ఆదిశంకరాచార్యులు సందర్శించి స్వామివారికి సాలగ్రామాన్ని సమర్పించారు. 11వ శతాబ్ధంలో రామానుజాచార్యుల సందర్శన, 13వ శతాబ్ధంలో మద్వాచార్యులు శ్రీనరహరితీర్థుల క్షేత్రాన్ని సందర్శించి సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను బహుకరించారు. 1512వ సంవత్సరంలో చైతన్య మహాప్రభువులు క్షేత్రాన్ని సందర్శించారు. ఈ దేవాలయం అపురూప శిల్పకళతో ఉంటుంది. 108 రాతి స్తంభాలు ఒకదానితో ఇంకొకటి పోలిక ఉండవు. 600 ఏళ్లనాటి ఆకుపసర చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటాయి. పితృమోక్ష క్షేత్రం క్షేత్రం ఆవరణలోని శ్వేత పుష్కరిణిలో చనిపోయిన పెద్దల అస్తికలను కలిపితే ముక్తి లభిస్తుందని ఒక నమ్మకం. ఇందులో కలిపిన మానవ అస్తికలు కొద్ది రోజుల్లో శిలలుగా మారుతాయని భావిస్తారు. మానవుల కోర్కెలు దహించి, స్వామివారిని చేరే అద్భుత ఘట్టమైన కామదహనోత్సవంలో భక్తులు పాల్గొని, సముద్ర స్నానాలాచరించి, స్వామివారిని ఉత్తరాభిముఖంగా దర్శిస్తే ముక్తి లభిస్తుందని క్షేత్ర ప్రాశస్త్యం. మూడు రోజుల ఉత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలి. – సీహెచ్ సీతారామనృసింహాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు, శ్రీకూర్మనాథాలయం మూడు రోజుల పాటు నిర్వహించే ఈ డోలోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఉచిత క్యూలైన్ను ఆలయం వెనుక వైపు నుంచి ఏర్పాటు చేశాం. ప్రత్యేక దర్శనం వద్ద అదనపు క్యూలైన్లు ఏర్పాటు జరిగింది. లడ్డూ, పులిహోర ప్రసాదాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. – టి.వాసుదేవరావు, ఆలయ ఈవో, శ్రీకూర్మనాథాలయం -
యువకుడిని కాపాడిని మైరెన్ పోలీసులు
మందస: మండలంలోని రట్టి గ్రామంలో వల్లభనారాయణ స్వామి డోలోత్సవ యాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోంపేట పట్టణంలోని గాంధీ నగర్కి చెందిన యువకుడు ఆర్థి వాసుదేవ్ తన స్నేహితులతో కలిసి సోమవారం సముద్ర స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న బారువ మైరెన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై యువకుడిని రక్షించి, ప్రథమ చికిత్స అందించి.. 108 వాహనంలో హరిపురం పీహెచ్సీకి తరలించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని బారువ మైరెన్ సీఐ రమేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కోదండరావు, హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు, కానిస్టేబుల్ సంఘమేశ్వరరావు, హరిప్రసాద్ రాజు, హోమ్ గార్డ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో గుర్తు తెలియని యువకుడు మృతి టెక్కలి రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల ప్రహరీ వద్ద సోమవారం గుర్తు తెలియని యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రహరీ లోపలి భాగంలో గోడ కంటే ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైర్ను గోడపైకి ఎక్కి పట్టుకోవడంతో విద్యుత్ షాక్కు గురైనట్లు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాము ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వివరాలు తెలియరాలేదని, సుమారు 38 ఏళ్లు ఉంటాయన్నారు. ఆచూకీ తెలిసిన వారు తమకు తెలియజేయాలని కోరారు. అనంతరం మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
అదుపు తప్పిన బైక్.. పోలీసులకు గాయాలు
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి రామగిరి ప్రాంతంలో ముగ్గురు గంజాయి మాఫియా వ్యక్తులను వెండిస్తున్న సమయంలో ఇద్దరు పోలీసులు ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన పోలీసులను వెంటనే బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. నేడు జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రామగిరి పోలీసు స్టేషన్కు కొంత దూరంలో ముగ్గురు మాఫియా వ్యక్తులు ఒక బైక్పై వెళ్తున్న సమాచారం అందడంతో.. రామగిరి పోలీసు పంటి పోలీసులు బైక్లపై వారిని పట్టుకునేందుకు వెంబడించారు. రామగిరి పోలీసు పంటి ఏఎస్ఐ బిష్ణ్రు మడకామి, పోలీసు డ్రైవర్ డొంబురు చలాన్లు బైక్పై వారిని వెంబడించారు. పోలీసు పంటికి 11 కిలోమీటర్ల దూరంలో గల ధల్పూర్ నర్సరీ సమీపంలో పోలీసులు వెళ్తున్న బైక్ అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఇద్దరు కింద పడగా తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానిక ప్రజలు బొయిపరిగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరు పోలీసులను అంబులెన్స్లో బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి చేర్చారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కొరాపుట్ సహద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల మెడికల్కు తరలించారు. -
ఘనంగా డోలా యాత్ర
మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026పట్టణంలో డోలాట్యాంకు వద్ద డోలా యాత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం శ్రీజగన్నాథ మందిరం వద్ద ఉన్న రాధాగోవిందమందిరం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ప్రభలతో డోలాయాత్ర జరుగుతున్న ప్రాంతానికి తీసుకువెళ్లడంతో భక్తులు రాధాగోవింద స్వాములను చూసి పోగో (రంగులు)జల్లుకుని హోలీ జరుపుకున్నారు. ఈ సందర్భంగా డోలా యాత్ర వద్ద అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకున్నారు. మంగళవారం చంద్రగ్రహణం వల్ల రాధాగోవింద స్వామి మందిరం మూసి వేస్తారు. పర్లాకిమిడి హోలీ పండుగ బుధవారం జరుపుకుంటామని అర్చకులు తెలియజేశారు. –పర్లాకిమిడి -
దేవాంగ సామాజిక వర్గీయులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
జయపురం: దేవాంగ సామాజికవర్గీయులు ఆర్థికంగా మరింత బలపడాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఆకాక్షించారు. జయపురం సమీప డొంగాగుడ గ్రామంలో దేవాంగ సంక్షేమ సంఘం నూతన భవననాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నిధులు రూ. ఐదు లక్షలతో నిర్మించిన భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాహిణీపతి దేవాంగ సామాజికవర్గ సంక్షేమానికి, నూతన భవనాభివృద్ధికి మరో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రస్తుత భవనం 350 దేవాంగ కుటుంబాల శుభకార్యాలకు వినియోగపడుతోందన్నారు. కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎం.అప్పారావు, కార్యదర్శి పి.శంకరరావు, ఉపాధ్యక్షులు పి.సోమరాజు, విజయనగరం సంక్షేమ సంఘం అధ్యక్షులు వి.నాని, రాయగడ సంఘ అధ్యక్షులు ఎం,శంకరరావు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన అన్నదాతలు
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి బడిగేటా, తెల్రాయ్ పంచాయతీలకు చెందిన వందలాది మంది రైతులు తమ ధాన్యం బస్తాలతో సోమవారం రోడ్డెక్కారు. కలిమెల సమితి ఎంవీ 90 గ్రామం వద్ద ఏర్పాటు చేసిన మాండీలో రోజుకి 3000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి 600 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం రోడ్డుపై నుంచి నిరసన తెలిపారు. అలాగే గంపాకొండ పంచాయతీలో కూడా రైతులకు టోకెన్ గడువు ముగిసిందని చెప్పడంతో ఎంవీ 66గ్రామం వద్ద జాతీయ రహదారిపై ధాన్యం బస్తాలు ఉంచి ధర్నా చేశారు. మల్కన్గిరి కలిమెల రహదారి పూర్తిగా నిలిపివేశారు. రైతులకు నాలుగు గంటల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తేలిసిన కలిమెల ఐఐసీ ప్రభుదత్తు బిశ్వాల్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. అలానే సరఫరా అధికారి చిన్మయ్ సాహు కూడా వచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. -
గ్రీవెన్స్సెల్లో 71 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో 71 వినతులను అధికారులు స్వీకరించారు. ఇందులో 55 వ్యక్తిగత సమస్యకాగా తొమ్మిది గ్రామ సమస్యలుగా అధికారులు గుర్తించారు. మరో ముగ్గురు ఆరోగ్య సమస్యలకు సంబంఽధించి విన్నవించుకున్నారు. వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 50 వేల రూపాయలను కలెక్టర్ మంజూరు చేయగా మరో నలుగురుకి రెడ్క్రాస్ నిధుల నుంచి 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, డీఎఫ్వో సచిన్ అన్నాసాహెబ్ ఆహోలే, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, జిల్లా ముఖ్యవైధ్యాధికారి డాక్టర్ సరోజినిదేవి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమా రావ్, పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. మల్కన్గిరిలో 34 వినతులు.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎఫ్ఎల్సీ హాల్లో జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ గ్రీవెన్స్సెల్ను నిర్వహించారు . ఈ సందర్భంగా 34 వినతులు స్వీకరించారు. వీటిలో 26 వ్యక్తిగతం కాగా ఎనిమిది గ్రామ సమస్యలకు సంబంధించిన వినతులు ఉన్నాయి. కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. తీసుకున్న చర్యలు వివరాలు తనకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరధి సరాబు, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, ఇతర జిల్లాస్థాయి అధికారులు, సమితి అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. విన్నపాలు విన్నారు పర్లాకిమిడి: జిల్లాకలెక్టర్ కార్యాలయం మీటింగు హాలు 2 లో సోమవారం జాయింట్ గ్రీవెన్సు సెల్, స్పందన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ప్రజాసమస్యలు వినడానికి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (రెవెన్యూ) మునీంద్ర హానగ, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, సమగ్ర గిరిజనాభివృద్ధి శాఖ పీఓ అంశుమాన్ మహాపాత్రో తదితరులు విచ్చేశారు. రాణిపేట, పర్లాకిమిడి పురపాలకసంఘం, కత్తల కవిటి పంచాయితీల నుంచి మొత్తంగా 96 వినతులు, అభియోగాలు అందగా వాటిలో గ్రామ సమస్యలు 14, వ్యక్తిగత సమస్యలు 82 ఉన్నాయి. కొన్ని అభియోగాలను సంబంధిత శాఖలకు వెంటనే పంపించారు. గుసాని సమితి గారబంద పీహెచ్సీలో డాక్టరుగానీ, ఫార్మసిస్టు, ఇతర సిబ్బంది లేని కారణంగా రంప, లాబణ్యగడ గిరిజన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రంప మాజీ సర్పంచు, ఆదివాసీ మహాసంఘ్ అధ్యక్షులు నిరోభుయ్యాన్ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. వెంటనే ఏడీఎం ఆయన అభియోగాన్ని సీడీఎంఓకు పంపించారు. కొందరికి మధుబాబు వృద్ధాప్య పింఛన్కార్డులను అధికారులు అందజేశారు. నేటి గ్రీవెన్స్కు గుసాని సమితి బీడీఓ గౌరచంద్ర పట్నాయిక్, తాహాసిల్దారు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. -
‘బహుముఖ అవగాహనతో వ్యవహరించాలి’
భువనేశ్వర్: రైలు టికెటు తనిఖీ ఉద్యోగ నిర్వహణలో బహుముఖ అవగాహనతో వ్యవహరించాలని విరామం పొందిన సిబ్బంది తోటి సిబ్బందిని ప్రబోధించారు. రైల్వే నిబంధనల ప్రకారం పలు వర్గాల ప్రయాణికుల సుఖమయమైన ప్రయాణంలో టికెట్ తనిఖీ సిబ్బంది పాత్ర కీలకంగా పేర్కొన్నారు. విధుల నిర్వహణతో సిబ్బంది సంక్షేమం కోసం ముందంజలో నిలిచిన ప్రభాకర్ బొరాల్తో మరో ఇద్దరు ప్రధాన టికెటు తనిఖీ అధికారులు (సీటీఐ) రమేష్ ప్రధాన్, ఎస్సీ హంసదా రైల్వే సేవల నుంచి విరామం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో పలువురు అధికారులు, కార్మిక ప్రముఖులు పాల్గొన్నారు. తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెసు శాఖా కార్యదర్శి లక్ష్మీధర మహంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది పాలుపంచుకున్నారు. ఉద్యోగం నుంచి విరామం పొందిన సిబ్బంది సంక్షేమం కోసం నిరంతరం ఉద్యమిస్తానని ప్రభాకర్ బొరాల్ అన్నారు. -
సహజ రంగులే వినియోగించాలి
భువనేశ్వర్: రంగుల పండగ ఆనందమయం కావాలి. ఈ సందర్భంగా రసాయనపూరిత రంగులు నివారించి ప్రకృతి సహజమైన రంగులను వినియోగించాలని ఒడిశా గ్రామీణ అభివృద్ధి, మార్కెటింగ్ కమిటీ (ఒర్మాస్) పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా స్థానిక యూనిట్ – 8 ఎస్ఐఆర్డీ క్యాంపస్లో పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ ఆధ్వర్యంలోని రంగోత్సవ్–2026 ప్రారంభించారు. ఈ నెల 4వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతుంది. సురక్షితమైన, పర్యావరణ అనుకూలమైన రంగులతో హోలీ వేడుకలను ఆనందమయంగా జరుపుకునేందుకు ప్రేరణగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలు ఉత్పత్తి చేసిన సహజ రంగులతో ఈ వర్గం ఉత్పత్తి చేసిన సంప్రదాయ రుచికరమైన వంటకాలు, చక్కటి హస్తకళలు, చేతితో తయారు చేసిన గృహోపకరణాలు వంటి విస్తృత శ్రేణి గ్రామీణ ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. లాభాపేక్ష లేకుండా గిట్టుబాటు ధరలకు ఈ ఉత్పతుల్ని నగర వాసులకు విక్రయిస్తున్నట్లు ఈ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ మంత్రి రవి నారాయణ్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగోత్సవం సురక్షితమైన రంగులు, మహిళా సాధికారత యొక్క అందమైన కలయిక అని తెలిపారు. ఎస్హెచ్జీ మహిళలు తయారుచేసిన సహజ రంగులను ఉపయోగించడం ద్వారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఒర్మాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) డాక్టర్ మోనికా ప్రియదర్శిని మాట్లాడుతూ రంగోత్సవం గ్రామీణ ఒడిశా మహిళా వ్యవస్థాపకుల నైపుణ్యాలను ప్రతిబింబిస్తుందన్నారు. ఒర్మాస్ వారిని ఆధునిక మార్కెట్తో అనుసంధానించడానికి, వారి పనికి ఒక ప్రత్యేక గుర్తింపును ఇవ్వడానికి నిబద్ధతతో అండగా నిలుస్తుందన్నారు. ఈ చొరవతో ఎస్హెచ్జీ ఉత్పత్తులు అధిక నాణ్యత ప్యాకేజింగ్, బ్రాండింగ్ ద్వారా ప్రధాన స్రవంతి మార్కెట్లలో ప్రవేశం పొందగలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన ఆకర్షణ ఈ ప్రదర్శనలో సహజ రంగులు పసుపు, బీట్రూట్, పువ్వుల వంటి సహజ పదార్థాల నుండి రసాయన రహిత మూలికలతో తయారు చేసిన హోలీ రంగులను గిట్టుబాటు ధరలకు విక్రయిస్తున్నారు. ఈ రంగులు చర్మానికి, పర్యావరణానికి పూర్తిగా సురక్షితం. -
డోలీపై బాలింత తరలింపు
కొరాపుట్: అంబులెన్స్ రాలేకపోవడంతో బాలింతని డోలీ మీద తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితి మైదల్పూర్ గ్రామ పంచాయతీ కుసుంకుంట గ్రామంలో కుసుం బొత్ర అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధ పడింది. దీంతో గ్రామస్తులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్స్ రాలేక పోయింది. అంతలో గర్భిణి ప్రసవం జరిగి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వారిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో గ్రామస్తులు డోలీ మీద కిలో మీటర్ దూరం మోసుకుని వెళ్లారు. అక్కడ నుండి ఒక ఆటో లో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైదల్పూర్ ఆస్పత్రికి తరలించారు. 200 తాబేళ్ల స్వాధీనం మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 అటవీ శాఖ వారు సోమవారం మధ్యాహ్న సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ వాహనంలో తరలిస్తున్న తాబేళ్లను గుర్తించి పట్టుకున్నారు. అటవీ శాఖ వారిని చూసి మాఫియా వారు పరారయ్యారు. అటవీ శాఖ వారి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంవీ 62 గ్రామానికి ఈ తాబేళ్లను తీసుకువస్తున్నట్లు సమాచారం. వీటి విలువ రూ.4లక్షలకు పైగా ఉంటుందని అటవీ శాఖాధికారులు తెలిపారు. బాలికలకు ఈత శిక్షణ శిబిరం ప్రారంభం మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లాలో తొలిసారి బాలికలకు ఈత శిక్షణ శిబిరం ప్రారంభించారు. రాష్ట్ర ప్రకృతి విపత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం మల్కన్గిరిలో కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ జిల్లా పంచాయతీ సాధన కేంద్రంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా నీటిలో మునిగే ప్రమాదాల వల్ల జరిగే ప్రాణనష్టాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం యువతకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఇది 7వ విడత శిక్షణ శిబిరం ఇందులో 30 పాల్గొంటారు. ఓడ్రాఫ్ బృందం శిక్షణ ఇస్తుంది. మంగళవారం నుంచి స్థానిక బండా బాకులి చెరువు వద్ద ప్రాక్టికల్ ఈత శిక్షణ ఇస్తారు. ధాన్యం కొనుగోలు చేయాలని వినతి పర్లాకిమిడి: ఖరీఫ్ ధాన్యం ఇంకా తమవద్దే ఉన్నాయని.. వీటిని కొనుగోలు చేయాలని రైతులు కోరారు. ఈ మేరకు గుసాని సమితి ఉప్పలాడ, కొర్సండ, బుసుకిడి తదితర పంచాయతీల రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సోమవారం చేరుకుని సబ్ కలెక్టర్, ఇన్చార్జి సివిల్ సప్లై అధికారి అనుప్పండాకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ధాన్యం కోనుగోళ్లకు విడుదల చేసిన టోకెన్లు మరో రెండు రోజుల్లో గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ధాన్యం ఎప్పుడు మండీల వద్ద కొనుగోలు చేస్తారో చెప్పాలని రైతులు అధికారులను అడిగారు. రైతుల వద్ద కొంత ధాన్యం కొనుగోలు చేసి మరికొంత మిగిలిపోయిందని రైతులు విన్నవించారు. వివిధ సొసైటీలలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు రానందున ధాన్యం కొనుగోళ్లకు జాప్యం జరుగుతున్నట్టు సబ్ కలెక్టర్ అనుప్పండా, ఏఆర్సీఎస్ హారిహార శెఠికి వినతులు అందజేశారు. -
బంగారం, వెండికి డిమాండ్
పర్లాకిమిడి: బంగారం, వెండి ధరలు పెరుగుతున్నా వాటికి డిమాండ్ తగ్గటం లేదు. పర్లాకిమిడిలో కొత్తగా కార్పొరేట్ స్టయిల్లో బంగారం, వెండి షాపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరోవైపు ఉన్న పాత షాపులు కొత్తకొత్త ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. పట్టణంలో ఆదివారం రాజవీధిలో రెండు బంగారం షాపులు ప్రారంభమవ్వడంతో బంగారం, వెండి వస్తువులు కొనుగోలుకు జనాలు ఎగబడుతున్నారు. ఒకవైపు గల్ఫ్ దేశాలైన బహరైన్, సౌదీ అరేబియా, దుబాయి తదితర దేశాలపై ఇరాన్ బాంబుల కురిపిస్తున్న నేపథ్యంలో బంగారం ఒక్కసారిగా పెరగటంతో ప్రజలు బంగారం, వెండిపై పెట్టుబడులు పెడుతున్నారు. పట్టణంలో బంగారం ఒక గ్రాము 24 క్యారెట్ రూ.15,452 ధర ఆన్లైన్లో ఉండగా, పర్లాకిమిడిలో రూ.16 వేలకు పైగా పలుకుతుంది. వెండి వస్తువులు కూడా కిలో రూ. 2,95,000 ఉంది. అయినా ప్రారంభంరోజు చిన్న వస్తువు కోన్నా సిల్వర్ బహుమతి వుంటుందని, కిలో బంగారం కొంటే దానికి తగ్గట్టు బంగారం ఇస్తామని ప్రచారం చేయడంతో జనాలు కొనుగోలుకు ఎగబడుతున్నారు. సామాన్య ప్రజలు తమ పెట్టుబడులు బంగారం, వెండిపై పెట్టుబడులు పెడితే సమీప భవిష్యత్లో ఽఅధిక ధర పలుకుతుందన్న అంచనాలతో ప్రజలు కొనుగోలు చేశారు. -
మునిగుడ సమితి కార్యాలయం గేటు వద్ద యువకుని మృతదేహం
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఒక యువకుని మృతదేహాన్ని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. మృతుడు సమితిలో క్లరికల్ విభాగంలో పనిచేస్తున్న సుశాంత గౌడొ (34) గా గుర్తించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... ఉదయం సుశాంత్ కడుపు నొప్పిగా ఉందని ఇంటి నుంచి మునిగుడలొ గల సీహెచ్సీకి వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో సమితి కార్యాలయం గేటు వద్ద పడిపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. దోపిడీ దొంగల ముఠా అరెస్ట్ కొరాపుట్: దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నబరంగ్పూర్ జిల్లా మైదల్ పూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏఎస్పీ ఆదిత్య సేన్ ప్రసంగించారు. సెమ్లా ప్రాంతంలో అటవీ భాగంలో అనుమానితుల సంచారం పై తమకు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని అదుపులోనికి తీసుకున్నారు. వారిని విచారించగా పపడాహండి ప్రాంతంలో ఒక వ్యాపార వేత్త ఇంటి పై దాడికి సిద్ధంగా ఉన్నారని అంగీకరించారన్నారు. ఈ ఘటన లో 5 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా లో మరి కొందరిని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. నిందితుల నుంచి కత్తులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హెచ్పీవీ టీకాలు ప్రారంభం రాయగడ: జిల్లాలోని హ్యూమన్ పాపిల్లొమా వైరస్ (హెచ్పివి) నివారణ చర్యలకు జిల్లా వైద్య శాఖ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఆదివారం నాడు జిల్లా ప్రధాన హస్పటల్ (డిహెచ్హెచ్) సమావేశం హాల్లో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొరాపుట్ లొక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, గౌరవ అతిథిగా రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రకలు హాజరయ్యారు. రాష్ట్రంలో గల 14–15 ఏళ్ల మధ్య వయసు గల బాలికలు 3.36 లక్షల మందికి టీకా అందజేయనున్నారు. రాయగడ జిల్లాలోని 7587 మంది బాలికలకు ఈ టీకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఆమె వివరించారు. గర్భాశయ క్యాన్సర్ ను నివారించడానికి ఈ టీకా ఎంతో దోహదపడుతుందని అన్నారు. మహానది జల వివాద ట్రిబ్యునల్ బృందం సందర్శన భువనేశ్వర్: క్షేత్ర పరిశీలన కోసం 5 రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన మహానది జల వివాద ట్రిబ్యునల్ (ఎండబ్ల్యూడీటీ) చైర్పర్సన్, సభ్యులు పవిత్ర పుణ్య క్షేత్రం పూరీ శ్రీమందిర్ను సందర్శించి రత్న వేదికపై కొలు వై ఉన్న సోదరసోదరి సమేత శ్రీ జగన్నాథుని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పీతాంబర్ ఆచార్య విలేకరుల సమావేశం నిర్వహించి మహానది నీటిపై ఒడిశా, ఛత్తీస్గఢ్ మధ్య ఉన్న వివాదం త్వరలో పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశా రు. మహానది జల వివాద ట్రిబ్యునల్ బృందం ఈ నెల 7న ఛత్తీస్గఢ్ను సందర్శిస్తుంది. మార్చి 11 వరకు ఛత్తీస్గఢ్లోని వివిధ ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహిస్తుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు – మోహన్ చరణ్ మాఝి, విష్ణు దేవ్ సాయి మహానది జల వివాదానికి పరిష్కారం విషయ మై చర్చించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా ఊగిసలాడుతున్న మహా నదీ జ లాల పంపిణీ వివాదం త్వరలో కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. మహానది జల వివాద ట్రి బ్యునల్ బృందం ఒడిశాను సందర్శించి మహా నది బేసిన్లోని సమగ్ర పరిస్థితిని హెలికాప్టర్ ద్వారా విహంగ సర్వే నిర్వహింంచింది. మహా నది నీటి కొరతతో ప్రభావితమైన ప్రాంతాలను ఈ బృందం సమీక్షించింది. -
హెచ్పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఆదివారం ఉదయం 10 గంటలకు హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్, జెడ్పీ అధ్యక్షురాలు సమారి టాంగులు, ఎంపీ ప్రతినిధి సంజయ్ సర్కార్, జిల్లా వైద్యాధికారి డోలామణి ప్రధాన్, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చౌధురీ నిహర్ రంజన్ ప్రహరాజ్, అదనపు వైద్యాధికారి డాక్టర్ సౌభాగ్య రంజన్ రణసింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ టీకాను 14–15 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆరోగ్యవంతమైన బాలికలకు మాత్రమే ఇస్తారు. ఈ టీకా కార్యక్రమం 3 నెలలు పాటు జిల్లా ఆస్పత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది. తొలి దశలో ప్రధాన ఆస్పత్రిలో రెండో దశలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విస్తరిస్తారు. వయసు నిర్ధారణ కోసం ఆధార్, స్కూల్ ఐడీ తీసుకురావాల్సి ఉంటుంది. -
రచయిత నాగరాజుకు సన్మానం
రాయగడ: పట్టణానికి చెందిన ప్రముఖ కవి, రచయిత భళ్లమూడి నాగరాజును తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. అక్షరాల తోవ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కవితల పోటీల విజేతలకు సత్కరించిన సందర్భంగా ఆయనకు ఈ అవకాశం లభించింది. జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగదు బహుమతిని నిర్వాహకులు అందించారు. ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో అక్షరాల తోవ సాహితీ సంస్థ ఎనిమిదో వార్షికోత్సవం జరిగింది. సంస్థ నిర్వాహకులు, ప్రముఖ రచయితలు నామా పురుషోత్తం, దాసరాజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త మువ్వా శ్రీనివాస్, ప్రముఖ బాల సాహితీ వేత్త ఉరిమెళ్ల సునంద, ప్రముఖ కవయిత్రి,సైకాలజీస్ట్ తాళ్లూరి లక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో నాగరాజు సతీమణి శేషసాయి అద్భుతమైన పాటలు పాడి ప్రశంసలు అందుకున్నారు. నాగరాజు రచించిన 40 కథలు, 138 కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. గతంలో సాహితీ రత్న, సాహితీ శిరోమణి వంటి బిరుదులు పొందారు. ఈ సందర్భంగా స్థానిక సాహితీ సంస్థల ప్రతినిధులు నాగరాజు దంపతులను అభినందించారు. -
ఉగాది వేడుకల షెడ్యూల్ ఖరారు
● జయపురంలో 19, 20 తేదీల్లో శ్రీపరాభవ నామ ఉగాది ఉత్సవాలు ● వివరాలు వెల్లడించిన తెలుగు సాంస్కృతిక సమితి ప్రతినిధులుజయపురం: జయపురం తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీల్లో శ్రీపరాభవ నామ ఉగాది ఉత్సవాలతో పాటు జయపురం సిటీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం తెలుగు సాంస్కృతిక సమితి ప్రతినిధులు సిటీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సభ్యుల సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. సమితి అధ్యక్షులు బిరేష్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ సభ్యులు శశి పట్నాయక్ ఉగాది వేడుకల కార్యక్రమాలు ప్రకటించారు. ఈ సందర్భంగా నృత్య పోటీలు, తెలుగు గీతాల ఆదారిత అంశాలతోగల నృత్య ప్రదర్శనలు, బృందగానాలు, యుగళ గీతాలు, సోలో గీతాల నృత్య పోటీలు ఉంటాయన్నారు. పోటీలలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ నెల 12వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల్లోపు 81148 26451, 70089 72383 నంబర్లకు వాట్సాప్ ద్వారా వివరాలు పంపాలన్నారు. వారికి 15వ తేదీన స్క్రూట్నీ నిర్వహిస్తామన్నారు. డాన్స్ అకాడమీలో నృత్యం నేర్చుకున్న వారు లేక డాన్స్ అకాడమీ వారు స్పాన్సర్ చేయబడిన కళాకారులను మాత్రమే పోటీలకు అనుమతిస్తామన్నారు. వారు డాన్స్ అకాడమీల ధ్రువ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. అలాగే ఈ నెల 15వ తేదీన మహిళలకు సిటీ స్కూల్ ప్రాంగణంలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తామన్నారు. పోటీలలో పాల్గొనదలచిన వారు ముగ్గుల పిండి, రంగులు, ఇతర సామగ్రి వారే తెచ్చుకోవాలని సూచించారు. ముగ్గులు పోటీలో పాల్గొన దలచిన వారు తమ పేర్లను ఈ నెల 12వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య 63702 66106, 63025 04864 నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపించాలన్నారు. అలాగే చిత్ర కళా పోటీలు కూడా నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలలో 12 ఏళ్లలోపు వారు జూనియర్లుగా, 12 నుంచి 18 ఏళ్లలోపు వారిని సీనియర్లుగా పరిగణిస్తామని వెల్లడించారు. 19వ తేదీ ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు నిర్వహించే పోటీలలో జూనియర్లు పల్లెంలో వివిద ఫలాలు చిత్రం, సీనియర్లు ’సిటీ హైస్కూలు ప్రాంగణ భవనం ’చిత్రం వేయాలని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు తమ ఆధార్ కార్డు, ఫొటోపాటు పూర్తి వివరాలు వాట్సాప్లో పంపాలని సూచించారు. పోటీలలో పాల్గొనే వారికి డ్రాయింగ్ షీట్లు మాత్రం సమకూర్చుతామని.. రంగు పెన్సిళ్లు, బొమ్మ వేయటానికి అవసరమైన వస్తువులు వారే తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. పోటీలలో పాల్గొనదలచిన 63703 280837, 87639 62948 నంబర్లకు ఈ నెల 15వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల్లోపు లోపు వాట్సాప్లో పంపాలని వెల్లడించారు. అలాగే ఉగాది రోజున ఉదయం 11కు మహిళలకు వంటల పోటీలను సైతం నిర్వహిస్తామన్నారు. గంటన్నర సమయంలో వంట పూర్తి చేయాలని, హల్వా, గోధుమ రవ్వ, బొబాయి రవ్వ, క్యారెట్, బీట్రూట్ లేదా ఆనపకాయతో హల్వా తయారు చేయాల్సి ఉంటుందన్నారు. వంటల పోటీకి కావలసిన స్టౌతో పాటు అన్ని వస్తువులు పోటీదారులే తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. పోటీకి అయిన ఖర్చుకు తగినట్లు విజేతలకు బహుమతులు ఉంటాయని తెలిపారు. వంటల పోటీలకు వచ్చే వారికి సహాయంగా ఇద్దరిని తీసుకురావచ్చని తెలిపారు. పోటీలో పాల్గొన దలచిన వారు 15వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల్లోపు 77519 24005, 93480 65395 నంబర్లకు వాట్సప్ ద్వారా వివరాలు తెలియజేయాలన్నారు. అలాగే తెలుగు సంప్రదాయ వస్త్రధారణ పోటీలు కూడా ఉంటాయన్నారు. పోటీలోపాల్గొన దలచిన వారు 15వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటలలోపు తమ పేర్లను 77352 19129, 95565 05571 నంబర్లకు వాట్సాప్ చేయాలన్నారు. సమావేశంలో సమితి సభ్యులు వై.శ్రీనివాసఖన్నా, పి.మహేష్రెడ్డి, దుర్గా శర్మ పాల్గొన్నారు. -
కృత్రిమ అవయవాల శిబిరం
జయపురం: జయపురం నెహ్రూనగర్లో గల అగ్రసేన్ భవనంలోఒడిశా ప్రాంత మార్వాడీ యువచంచ్ వారు దివ్యాంగుల కోసం కృత్రిమ అవయవాల శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయక సమితి రాంచి వారి సహకారంతో నిర్వహిస్తున్న కృత్రిమ అవయవాల శిబిరంలో కృత్రిమ కాళ్లు, మెకానికల్ చేతులు, ఎల్బో స్టిక్లు, వాకింగ్ స్టిక్లు, బ్లైండ్ స్టిక్లు, ఇయర్ ఎయొడ్లు అందజేశారు. కాళ్లు, చేతులు లేని వారికి కొలతలు తీసుకుని కృత్రిమ చేతులు, కాళ్లు తయారు చేసి అందజేశారు. సోమవారం శిబిరం ముగియనుంది. అంతవరకు ఎంత మంది వచ్చినా సహాయ పరికరాలు అందజేస్తామని ప్రాజెక్ట్ డైరెక్టర్ మాయంక అగ్రవాల్ తెలిపారు. శిబిరం నిర్వహణలో జయపురం మార్వాడీ యువ మంచ్ అధ్యక్షుడు కన్హ అగ్రవాల్, ప్రాజెక్టు చైర్మన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మయాంక్ అగర్వాల్, కన్వీనర్ వరుణ్ అగ్రవాల్, కార్యదర్శి విక్కీ అగర్వాల్, కోశాధికారి రోషన్ గోయల్, శ్రీభగవాన్ మహావీర్ వికలాంగ సమితి కార్యదర్శి నెమి చంద్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రస్థానంలో భారత్
సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 20262047కు ముందే ● ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండాపర్లాకిమిడి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 పిలుపుతో మన యువతరం 2036 నాటికే ప్రపంచంలో మనం అగ్రస్థానంలో నంబర్ వన్గా భారత్ నిలుస్తుందని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా అభిప్రాయపడ్డారు. ఆయన స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి స్వయం ప్రతిపత్తి కళాశాలో ఆదివారం ఉదయం యూత్ పార్లమెంట్ను జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ వక్తృత్వానికి న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ రంజిత్ కుమార్ పతి, విశ్రాంత అధ్యాపకులు సురేంద్ర కుమార్ రథ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్ సుభ్రత్ కుమార్ చౌదురీ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాధాకాంత భుయ్యాన్, ఎన్.యస్.యస్.నోడల్ ఆధికారి డాక్టర్ సన్యాసి బెహరా, కోఆర్డినేటర్ (ఎన్.యస్.యస్.) భిఘ్నేశ్వర్ మిశ్రా, సుమంత్ బెహరా తదితరులు పాల్గొన్నారు. ‘50 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ కాలంలో భారతీయ రాజ్యాంగంపై మనం తెలుసుకోవాల్సిన పాఠాలు’ అన్న అంశంపై స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ను నిర్వహించారు. ఈ యూత్ పార్లమెంట్కు సెంచూరియన్ వర్సిటీ విద్యార్థులు, శ్రీరాండిగ్రీ కళాశాల, కాశీనగర్, హిల్టాప్ కళాశాల, మోహనా, మహిళా కళాశాల విద్యార్థినులు హాజరై మాట్లాడారు. జూన్ 25, 1975న జరిగిన అత్యవసర స్థితిపై విద్యార్థిని ఎ.శరణ్య డిబేటింగ్లో అన్నారు. 22 నెలలపాటు సాగిన అప్పటి ఎమర్జెన్సీపై పలువురు వక్తలు మాట్లాడారు. విజేతలకు బహుమతులు అందజేశారు. -
అరాచకాలకు వంతెన
● పొన్నాడ వంతెనకు ఇరువైపులా అసాంఘిక కార్యకలాపాలు– రాత్రి 9 దాటితే అటుగా వెళ్లడానికే భయం ● గంజాయి బాబుల క్రయ, విక్రయ సరఫరాల అడ్డాగా మారిన వైనం ● హత్య జరగడంతో భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు శ్రీకాకుళం క్రైమ్ : అభివృద్ధికి చిరునామాగా నిలిచిపోతుందన్న ఉద్దేశంతో నిర్మించిన పొన్నాడ వంతెనను కొందరు మందుబాబులు తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. నగరంతో అనుసంధానం కోసం కట్టిన ఈ వంతెనను అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. ఇటు శ్రీకాకుళం నగరానికి, అటు ఎచ్చెర్ల మండల పరిధి గ్రామాలకు పొన్నాడ వంతెనే దారి. వంతెనకు ఆవల, ఈవల.. ఎటు చూసినా 3 కిలోమీటర్ల పరిధిలోనే మత్తుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం సాయంత్రం నగరానికి చెందిన వ్యక్తి పొన్నాడ రాజీవ్గారితోటలోని నిర్మానుష్య ప్రాంతంలో హత్యకు గురికావడం తెలిసిందే.. వంతెనకు ఇవతల.. శ్రీకాకుళం నగరం పొన్నాడ వంతెన ఆరంభ శ్రీరామ మందిరం కూడలి నుంచి ఇటువైపుగా కలెక్టర్ బంగ్లా, వాంబేకాలనీ, 80 ఫీట్రోడ్డు, కేపీహెచ్బీ, కృష్ణాపార్కు, అఫీషియల్ కాలనీలతో పాటు, అటువైపుగా మంగువారితోట, గూనపాలెం, దమ్మలవీధి తదితర ప్రాంతాల్లో మత్తుబాబుల వీరంగం అధికమైంది. విచ్చలవిడిగా గంజాయి, మద్యం మత్తులో యువకులు నాలుగైదు బ్యాచ్లుగా విడిపోయి పేట్రేగిపోతున్నారు. స్పోర్ట్స్ బైక్లపై వేగంగా వెళ్తూ భయపెడుతుంటారు. రాత్రి 9 గంటలు దాటిందంటే ఇటుగా రావడానికి ఎవరైనా భయపడతారు. అనేకమార్లు దాడులు సైతం జరిగాయి. ఇటీవల వాంబే కాలనీ రాజీవ్ గృహకల్పలోని ఓ గదిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ గదిని కొంతమంది యువకులు అద్దెగా తీసుకుని గంజాయి వంటి మత్తు పదార్థాల క్రయ విక్రయాలకు వాడుతున్నట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వచ్చాయి. పొన్నాడ వంతెన చక్కటి సుందర ప్రదేశం. సాయంత్రం వేళ సేద తీరడానికి అనువుగా ఉంటుంది. అదే ఆసరాగా చేసుకున్న కూటమి ప్రభుత్వం నాయకులు సైతం సమీపంలోనే బార్అండ్ రెస్టారెంట్లు, వైన్షాఫులకు అనుమతులు ఇచ్చారు. బ్రిడ్జికి ఆవల రెండు దాబాలు కూడా ఉన్నాయి. వంతెన అవతలివైపు తోటలను మందుబాబులు అడ్డగా మార్చుకున్నారు. బ్రిడ్జి మీద కెమెరాలు పెట్టడంతో తోటల్లోకి వెళ్లిపోతున్నారు. ఎచ్చెర్ల స్టేషన్ పరిధి గ్రామాలైన పెద్ద కొంగరాం, ముద్దాడ, చిన్నకొంగరాం, వెంకన్నగారిపేట మీదుగా తోటపాలెం మార్గంలోని నీలగిరి, మామిడి, జీడి తోటల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లోకి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారు. కొంతమంది కళాశాలల అమ్మాయిలతో సైతం మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో వస్తుంటారని స్థానికులంటున్నారు. కొన్ని ఘటనలు.. ●శుక్రవారం ఇదే ప్రాంతంలో హత్య జరిగింది. ●దాదాపు నెలన్నర క్రితం ఆంజనేయస్వామి టెంపుల్ సమీపంలో ఓ వ్యక్తిని కత్తితో పొడిచేశారు. ●బ్రిడ్జి దాటాక పీడీ కన్వన్షన్ హాల్ వెనుక నగరానికి చెందిన ఓ వ్యక్తిని ఏడాది క్రితం కాల్చారని, అదే కన్వర్షన్ హాల్ సమీప మెకానిక్ షెడ్ పక్కన పొలాల్లో ఆరునెలల క్రితం కొందరు తాగి ఘర్షణ పడి కొంగరాం గ్రామానికి చెందిన మరో వ్యక్తి మరణానికి కారణమయ్యారని గ్రామస్తులు అప్పట్లో ఆరోపించారు. ●శుక్రవారం హత్య జరిగిన ప్రదేశానికి 100 అడుగుల దూరంలో ఉన్న ఎస్ఎంపురం పీఎసీఎస్ బహుళ ప్రయోజన సౌకర్య గోదాం వెనక వైపు ఓ వ్యక్తి పురుగు మందు తాగేశాడు. ●ఇక్కడికి సమీపంలోనే 2023 ఆగస్టు 15న ఓ యువతి అనుమానాస్పదంగా మృతిచెందిందని, ఎక్కడెక్కడో చంపేసి ఇక్కడ పడేస్తుంటారని, ఎక్కడెక్కడివారో ఇక్కడ మత్తులో జోగి హత్యలు, దాడులకు ఎగబడుతున్నారని, ఈ మార్గాల్లో వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేయడం గమనార్హం. -
ఆదిత్యాలయం..భక్తజన సందోహం
అరసవల్లి : అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. మాఘ మాసంతో పాటు వత్సవలస రాజమ్మ తల్లి ఉత్సవాల నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచే ప్రధాన రహదారిలో భారీగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయ సూపరింటెండెంట్ వెంకటరమణ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టగా.. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అంతరాలయంలో గోత్రనామాలతో పూజలు చేశారు. నగర కార్పొరేషన్కు కమిషనర్ బాధ్యతలు చేపట్టిన బొడ్డేపల్లి రాము కుటుంబసమేతంగా ఆదిత్యున్ని దర్శించుకున్నారు. ఓం ఫ్రీ యోగా సంస్థ ప్రతినిధి, యోగా గురువు చిలకా వెంకటరమేష్, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ బి.ఎస్.రాంబాబు, ఏపీ, తెలంగాణ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టి.రవీంద్రనాథ్, డిప్యూటీ జాయింట్ సెక్రటరీ వి.ఉదయకుమార్, జిల్లా బ్యాంకు ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ బి.శ్రీనివాసులు, సంఘ సభ్యుడు పెదపెంకి ఉపేంద్ర తదితరులు ఆదిత్యున్ని దర్శించుకున్నారు. -
రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య కో–చైర్మన్గా బగాది
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బగాది రామమోహనరావు రాష్ట్ర సమాఖ్య కో–చైర్మన్గా నియమితులయ్యారు. ఆదివారం విజయవాడలోని అంబేడ్కర్ భవనంలో జరిగిన సమాఖ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. బగాది ఎంపిక పట్ల వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హర్షం వ్యక్తం సేశారు. పూర్తిస్థాయిలో వైద్యసిబ్బందిని నియమించాలి పలాస: పలాస కిడ్నీ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ డిమాండ్ చేశారు. పలాస కిడ్నీ ఆసుపత్రిని ఆదివారం సందర్శించారు. సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ నిపుణుల సహకారంతో కిడ్నీ వ్యాధిపై పరిశోధన జరగాలన్నారు. రీసెర్చ్ సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలన్నారు. 59 వైద్యులకు గాను 18 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారని చెప్పారు. కిడ్నీ రోగులతో పాటు సహాయకులకు కూడా భోజనం అందించాలని కోరారు. 200 పడకలకు గాను 100 పడకలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం విచారకరమని చెప్పారు. ఆస్పత్రికి బస్సు పాయింట్ దూరంగా ఉందని, ఎలక్ట్రికల్ వాహనం సమకూర్చాలని కోరారు. కార్యక్రమంలో వేదిక నాయకులు పి.ధర్మారావు, కె.మణికుమార్, ఎన్.గణపతి పాల్గొన్నారు. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం జి.సిగడాం : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీసీపీఎస్ఈఏ జిల్లా నాయకులు మొయ్యి జనార్దన్నాయుడు, మక్క సురేష్ అన్నారు. ఆదివారం జి.సిగడాంలో వారు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ విధానం అమలయ్యేవరకు పోరాటం ఆగదన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సభ్యులు బాలి రామారావు, సామంతుల సత్యనారాయణ, జాడ వెంకటరమణ, శ్రీనివాస్ పట్నాయక్, వల్లూరు రమణ, జోగిదొర తవిటిరాజు పాల్గొన్నారు. మాజీ సైనికులకు సత్కారం శ్రీకాకుళం కల్చరల్: మాజీ సైనికులు సమాజానికి ముందుకురావాలని జిల్లా మాజీ సైనికుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇటీవల రథసప్తమి నాడు అరసవల్లిలో భక్తుల సేవలో పాల్గొన్న మాజీ సైనికులకు, వీర నారీమణులకు చైర్మన్, విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వి.సూర్యనారాయణ, ట్రెజరర్ ఎం.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. శ్రీకూర్మంలో భక్తుల రద్దీ గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలో కూర్మనాథున్ని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకులు సీహెచ్.సీతారామనృసింహాచార్యులు ఆధ్వర్యంలో వేకువ జామున స్వామికి పంచామృతాభిషేకం, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈఓ టి.వాసుదేవరావు భక్తుల క్యూలైన్ పర్యవేక్షించారు, -
ఉగాది ఉత్సవాలకు ముహూర్తపు రాట
రాయగడ: జిల్లా తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. స్థానిక కొల్లిగుడ సమీపంలోని మైదానంలో సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు ఆధ్వర్యంలో ఆదివారం మూహూర్తపు రాట వేసే కార్యక్రమం జరిగింది. వేద పండితులు రేజేటి శ్రీనివాస్ శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షులు కొండబాబుతోపాటు డి.లక్ష్మణరావు, ఆదినారాయణ, సాయిప్రియ మహిళ వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు పొట్టాం రామాదేవి, పట్టణ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 19న జరగనున్న ఉగాది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కొండబాబు తెలియజేశారు. మూడేళ్లుగా ఉత్సవాలను తన ఆధ్వర్యంలో అందరి సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఉగాది వేదికగా మారిందని అన్నారు. రెండు రోజులు ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహిస్తామన్నారు. -
22న నూతన కార్యవర్గం ఎన్నిక
పర్లాకిమిడి: చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు మార్చి 19న పంచాంగ శ్రవణం, 22న ఉగాది వేడుకలు, కొత్త కార్యవర్గం ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఉంటుందని కార్యదర్శి బర్నాల జనార్దనరావు తెలిపారు. 22న ఉగాది వేడుకలు స్థానిక రాజవీధిలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తామన్నారు. ఆదివారం చైతన్య సమితి కార్యవర్గం స్థానిక శ్రీకుంజ్ హోటల్ జరిగిన సమావేశంలో ఉగాది వేడుకలు పర్లాకిమిడిలో ప్రవాసాంఽధ్రులు నిర్వహించేందుకు సన్నాహక సమావేశం జరిపారు. ఈ సమావేశంలో చైతన్య సమితి న్యాయసలహాదారు వి.ఎస్.ఎన్.రాజు, కన్వీనర్ డాక్టర్ రహింతుల్లా, సామినేని విశ్వప్రసాద్, కె.రామారావు, కోశాధికారి జి.నానాజీ, జాయింట్ సెక్రటరీ ఇసై వెంకటరావు, పి.వాసుదేవరావు, టి.కిశోర్, తదితరులు హాజరయ్యారు. -
రాజమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
గార: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం వత్సవలస రాజమ్మ తల్లి (రాజరాజేశ్వరి) దర్శనానికి ఐదో ఆదివారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కొమరవానిపేట రాజమ్మ తల్లి ఉత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిన భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. శనివారం రాత్రికే వచ్చిన భక్తులు సమీప తోటలు, ఆరుబయట బసచేసి రాజరాజేశ్వరి (రాజమ్మతల్లి) పాటు భూలోకమ్మ తల్లిని ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. వేకువజాము నుంచే సమీపంలోని సముద్రంలో స్నానాలాచరించారు. -
మందిర పరిసరాలు అభివృద్ధి..
జయపురం: జయపురం సమితి గొడొపొదర్ గ్రామంలో హనుమాన్ మందిరం ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు గొడొపొదర్ పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నడుంబిగించారు. జయపురం ప్రాంత ప్రజలే కాకుండా పలు ప్రాంతాల ప్రజలు గొడొపొదర్ హనుమాన్ మందిర ప్రాంతాన్ని పిక్నిక్ కేంద్రంగా వినియోగిస్తున్నారు. అందువల్ల ఆ పాంతాన్ని అభివృద్ధి పరచాలని భావించిన విద్యార్థులు ఆలయాన్ని సందర్శించి మొక్కలు నాటారు. గ్రామంలో ప్రజలను చైతన్య పరిచేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వ్యర్థపదార్థాలు వేసేందుకు రెండు డస్ట్బిన్లు సమకూర్చారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని ఆలయ నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 మందికిపైగా విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, ఎస్.ఎం.సి చైర్మన్ లయిచన్ నాయక్, జయపురం సిటీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతాప్ పట్నాయక్ నేతృత్వంలో విద్యార్థులు పాల్గొని గొడొపొదర్ విద్యార్థులకు సహకరించారు. గొడొపొదర్ పాఠశాల హెచ్ఎం దిలీప్ పండా, తదితరులు పాల్గొన్నారు. -
గట్టి చేతలు!
చిట్టి చేతులు..● చిన్ననాటి నుంచే సమాజ సేవ ● పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు ● సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షణ ● పాఠశాలల్లో మెరుగుపడనున్న సౌకర్యాలు హిరమండలం: నూతన విద్యావిధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పాఠశాలలను ఏర్పాటుచేసింది. సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు సమాజ సేవా కార్యక్రమాలను చేపడుతోంది. దీనిలో భాగంగా ప్రతి పీఎంశ్రీ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటుచేస్తున్నారు. సేవాభావంతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాల పెంపు, సమాజంలో నడవడిక తదితర రంగాల్లో విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 81 పీఎంశ్రీ పాఠశాలలను ఎంపికచేసి ఆన్లైన్లో నమోదుచేశారు. తొలి విడతలో ఎంపికై న 32, రెండో విడతలో ఎంపికై న 3 పాఠశాలలకు నిధులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చుతుంది. ఇప్పటివరకూ ఆ రెండు విడతల్లో రూ.4.2 కోట్లు నిధులు వెచ్చించినట్టు తెలుస్తోంది. అయితే ఎందుకో మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో పాఠశాలల ఎంపిక జరగలేదు. ఇప్పుడు ఏడో విడతలో మాత్రం ఏకంగా 81 పాఠశాలలను ఎంపిక చేసినట్టు సమాచారం. తొలి రెండు విడతల్లో ఎంపిక చేసిన 35 పాఠశాలల్లో పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. దేశభక్తి పెంచేలా.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 35 పాఠశాలలకు సంబంధించి స్కౌట్స్ అండ్ గైడ్స్ను ఇప్పటికే ఏర్పాటుచేశారు. ఇందుకుగాను ఒక్కో పాఠశాలకు రూ.50 వేలు వంతున కేటాయించారు. పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చారు. ఇందుకు రూ.5 వేలు కేటాయించారు. ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలను, మెలకువలను విద్యార్థులతో చేయిస్తారు. ఇప్పటికే దాదాపు 800 మంది విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేరారు. ఈ విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడంతో పాటు సంరక్షించే బాధ్యతలను తీసుకుంటారు. దేవాలయాల వార్షికోత్సవాలు, వివిధ వేడుకల సమయంలో వచ్చే భక్తులను క్యూలైన్లో వెళ్లేలా పర్యవేక్షిస్తారు. తాగునీరు, మజ్జిగ, ప్రసాదాలను పంపిణీ చేస్తారు. స్వాతంత్ర దినోత్సవాలు, రిపబ్లిక్డే వేడుకల్లో భాగస్థులవుతారు. అయితే ప్రాథమిక స్థాయి నుంచే సేవ, దేశభక్తి అలవరచడానికి ఇవి ఎంతగానో దోహదం చేస్తాయంటున్నారు వ్యక్తిత్వ నిపుణులు. కేంద్ర ప్రభుత్వం ఏటా మరిన్ని పాఠశాలలను పీఎంశ్రీకు ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేయడం శుభ పరిణామం. సమగ్ర వసతులు.. పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రధానంగా క్రీడాంశాలకు ప్రాధాన్యమిస్తారు. క్రీడా కోర్టులు, రన్నింగ్ ట్రాక్లతో పాటు మైదానాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇంకుడు గుంతలు, కిచెన్ గార్డులు, ఉద్యానాలు, రక్షణ కంచెలను ఏర్పాటుచేస్తున్నారు. తరగతి గదులకు సంబంధించి ర్యాంపుల నిర్మాణం చేపడుతున్నారు. ప్రయోగశాలలో పరికరాలు, గ్రంథాలయాల్లో పుస్తకాలు ఏర్పాటుచేస్తున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్కు విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. యూనిఫాం అందిస్తున్నారు. దివ్యాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటుచేస్తున్నారు. పాఠశాల నిర్వహణకు సైతం ప్రత్యేక నిధుల కేటాయింపు జరుగుతోంది. విద్యార్థి దశలోనే వ్యక్తిత్వ వికాసం కలిగించాలన్నది పీఎంశ్రీ పాఠశాలల లక్ష్యం. దేశభక్తి, సమాజ సేవను ప్రాథమిక స్థాయిలో అలవరచాలి. తద్వారా నాయకత్వ లక్షణాలు సైతం అలవడుతాయి. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతాయి. – కె.రాంబాబు ఎంఈఓ, హిరమండలం -
లోయలోకి దూసుకెళ్లిన లారీ
● డ్రైవర్, హెల్పర్కు గాయాలురాయగడ: సదరు సమితి గుమ్మ ఘాటీ మలుపులో కర్రల లోడుతో వస్తున్న లారీ శనివారం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో లారీ డ్రైవర్, హెల్పర్లకు గాయాలు తగిలాయి. వారిని వెంటనే అక్కడ ఉన్న వారు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. సంఘటనా స్థలానికి కుంబికోట పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కొరాపుట్ జిల్లా బొరొగుమ్మ నుంచి కర్రల లోడుతో జేకేపూర్కు వస్తున్న లారీ గుమ్మఘాటీ మలుపు వద్ద అదుపుతప్పడంతో సుమారు 20 అడుగుల లోయలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ శివహరిజన్, హెల్పర్ నవీన్ భూమికలు లోయపడిపోవడతో గాయపడ్డారు. వారిని సమీపంలో ఉన్న వారు కాపడి వెంటనే ఆస్పత్రికి తరలించారు. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసుల భావిస్తున్నారు. -
విద్యార్థులకు వక్తృత్వ పోటీలు
రాయగడ: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సాయిప్రియ లేడీస్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సాయిప్రియనగర్లోని ఎన్.వి.ఆర్.విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఆరు, ఎనిమిదో తరగతి విద్యార్థులకు వేర్వేరుగా పోటీలు జరిగాయి. కంట్రిబ్యూషన్ ఆప్ ఇండియన్ సైంటిస్ట్స్ టు ద వరల్డ్ అనే అంశంపై ఆరో తరగతి విద్యార్థుల మధ్య నిర్వహించిన పోటీలో మొదటి బహుమతిని ప్రణయ మాఝి, ద్వితీయ బహుమతిని బి.ప్రజిషా, తృతీయ బహుమతిని శుభం మిశ్రాలు గెలుచుకోగా ప్రోత్సాహక బహుమతిని పుటుల్ బాగ్ దక్కించుకున్నారు. అలాగే ఎనిమిదో తరగతి విద్యార్థుల మధ్య బిహైండ్ ఎవిరీ డిస్కవరీ–దెరీజ్ ఎ ఉమెన్ సైంటిస్ట్ అనే అంశంపై నిర్వహించిన పోటీల్లొ ప్రధమ బహుమతిని విక్టోరియా కడైసిక గెలుచుకోగా ద్వితీయ బహుమతిని రాణి బ్రెడిక, తృతీయ బహుమతిని సుప్రియ క్రితంగ దక్కించుకున్నారు. ప్రోత్సాహక బహుమతి భారతీ బ్రెడకకు లభించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ లక్ష్మీ నారాయణ సాహు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్లబ్ అధ్యక్షురాలు పొట్టాం రామాదేవి, కార్యదర్శి మాధురి, కోశాధికారి నిర్మల పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. -
చిత్రకొండ సమితిలో ఆయుధ ప్రదర్శన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమతి 177 బెటాలియన్ బీఎస్ఎఫ్ జవాన్లు డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా శనివారం చిత్రకొండలో ఆదర్శ విద్యాలయంలో ఆయుధ పదర్శన నిర్వహించారు. ఓ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన, బీఎస్ఎఫ్ అధికారులు ఉపయోగించే వివిధ ఆయుధాలు, గోబాబారుదాలు, అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు ప్రదర్శించారు. సమారు 160 మంది విద్యార్థులు ప్రదర్శనలు తిలకించారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ కమెండర్ ఎం.నౌషాద్ తమ శాఖ చరిత్ర, దేశానికి జవాన్లు అందిస్తున్న సేవలు వివరించారు. త్వరలో పరీక్షలు రాయనున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ మిఠాయిలను పంపిపెట్టారు. తమ పాఠశాలలో జవాన్లు ఆయుధ ప్రదర్శ చేసినందుకు ఉపాధ్యాయులు విశ్వశ్రీ విశ్వస్, ప్రభాత్ దాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
రాయగడ: యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉంటేనే వారి భవిష్యత్ ఉజ్వలంగా మారుతోందని జిల్లా సామాజిక సురక్షా అధికారి శ్రీకాంత్ పాణిగ్రహి అన్నారు. సదరు సమతి కొమట్లపేటలోని ఉగ్రతార ఉన్నత పాఠశాలలో ‘మత్తుపదార్థాలు–యువతపై ప్రభావం’ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తుకు బానిసకాకూడదని అన్నారు . మత్తు వల్ల వారి భవిష్యత్ చిత్తయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. -
ఒడియా భాషా వైభవంపై ఇష్టాగోష్టి
పర్లాకిమిడి: ఒడియా భాష ఉన్నతి, ఒడిశా భాషా రాష్ట్రంగా ఏర్పాటుకు కృషిచేసిన పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్, ఇతర భాషాప్రజ్ఞులపై రాష్ట్ర స్థాయి ఇష్టాగోష్టి స్థానిక కలెక్టరేట్ వద్ద గ్రామీణ స్వయం ఉపాధి కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగినది. ఈ సభలో ఒడిశా మాతృభాష, యువపీడి’ అంశంపై పలువురు వక్తలు మాట్లాడారు. ఈ సభకు మహిళా డిగ్రీ కళాశాల అధ్యక్షురాలు డాక్టర్ రీనా సాహు అధ్యక్షత వహించారు. విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ భారతీ పాణిగ్రాహి స్వాగత ఉపన్యాసం, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇష్టాగోష్టిలో సాహితీ విమర్శకులు డాక్టర్ లంబోధర పాణిగ్రాహి (బరంపురం), డాక్టర్ అశోక్ పండా, రాయగడ జిల్లా స్వయంప్రతిపత్తి కళాశాల అధ్యాపకురాలు రాజ్యలక్ష్మీదేవి, సరిహద్దు ప్రహరి పూర్ణచంద్ర మహాపాత్రో, శ్రీకాకుళం జిల్లా బారువ ప్రభుత్వ కళాశాల ఒడియా అధ్యాపకులు డాక్టర్ రామారావు మఝి తదితరులు పాల్గొన్నారు. మాతృభాష ద్వారా వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని, స్వాతంత్య్రంకు పూర్వం పర్లాకిమిడి, జయపురం, నవరంగ్పూర్, రాయగడ, గంజాంలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవని, తరువాత బెంగాల్లో కోన్ని జిల్లాలు కలిసిన తర్వాత బెంగాళీ భాషలో అనేకమంది కవులు పుస్తకాలు రాశేవారని లంబోధర పాణిగ్రాహి అన్నారు. తదుపరి కాలంలో సరిహద్దు ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష ప్రభావం కూడా పర్లాకిమిడి సంస్థానంపై పడి ఒడిశా భాష వైభవం కోల్పోయిందని ఉత్కళ హితేషిణి కార్యదర్శి పూర్ణచంద్ర మహాపాత్రో ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఒడియా భాషలో వక్తృత్వం, ప్రబంధాలు, శుద్ధ ఒడియా రాయడంపై మహిళా కళాశాల నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు లంబోధర పాణిగ్రాహి బహుమతులు ప్రదానం చేశారు. అధ్యాపకురాలు బరదా ఆచార్య సభకు ధన్యవాదాలు తెలిపారు. -
దివ్యాంగులను ప్రోత్సహిద్దాం
జయపురం: దివ్యాంగులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, వారికి అండగా నిలిస్తే క్రీడా పోటీల్లో రాష్ట్ర,, జాతీయ స్థాయిలో విజయఢంకా మోగిస్తారని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. శనివారం కొరాపుట్ జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను జయపురం సమితి పూల్బెడ ప్రాంతంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి దివ్యాంగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా రంగంలో కొరాపుట్ జిల్లాను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు దివ్యాంగ క్రీడాకారులు మమేకం కావాలని పిలుపునిచ్చారు. కొరాపుట్ జిల్లా సామాజిక సురక్షా విభాగం, దివ్యాంగ స్వసస్థీకరణ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో 260 మంది దివ్యాంగ క్రీడాకారులు పాల్గొన్నారు. షాట్పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, వీల్చైర్ రేస్, పరుగు, లాంగ్జంప్, హైజంప్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, జయపురం సమితి చైర్మన్ తిలోత్తమ ముదులి, జయపురం సమితి బీడీఓ శక్తి మహాపాత్రో, జిల్లా సామాజిక భద్రతాధికారి తరుణ తపన్ ప్రహరాజ్, జయపురం సబ్ డివిజన్ సామాజిక భద్రతాధికారి సౌధామణి ప్రధాన్, అధ్యాపకులు రబి శతపతి, కొరాపుట్ బ్లైండ్ స్కూల్ క్రీడా ఉపాధ్యాయులు చంద్రశేఖర పట్నాయిక్, జయపురం సమితి అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి గగణబిహారి దాస్, పీఈటీ రంజిత్ కుమార్ ప్రధాన్, సూర్యకాంత ముదులి, శ్వణ కుమార్ మండంగీ, రమేష్కుమార్ భోల్, బొబిత ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల పరిశీలన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలను జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి చిత్తరంజాన్ పాణిగ్రహి శనివారం పరిశీలించారు. ఝరాపల్లి, పద్మాగిరి పంచాయతీల్లోని పాఠశాలలను డీఈవో సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అలాగే యం.వి.84, యం.వి.85 గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను కూడా సందర్శించారు. అనంతరం పద్మాగిరి పాఠశాలను సందర్శించి సౌకర్యాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఊహాగానాలకు తెర
● బీజేడీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ● పోటీలో సంతృప్త్ మిశ్రా, డాక్టర్ దత్తేశ్వర్య హోటాభువనేశ్వర్: రాజ్యసభ ఎన్నికలకు బిజూ జనతా దళ్ (బీజేడీ) అభ్యర్థుల పట్ల ఊహాగానాలకు తెరపడింది. అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం బీజేడీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఇద్దరు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. వారిలో ప్రముఖ వ్యాపార దిగ్గజం సంతృప్త్ మిశ్రా, ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ దత్తేశ్వర్ హోటా ఉన్నారు. వీరివురు భారత పార్లమెంటు ఎగువ సభలో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తారని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ● ఈసారి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. శాసనసభలో సంఖ్యా గరిష్టత ఆధారంగా అధికార పక్షం భారతీయ జనతా పార్టీకి తొలి 2 స్థానాలు కై వసం కావడం తథ్యం. మిగిలిన 2 స్థానాల్లో ఒకటి విపక్ష బిజూ జనతా దళ్కు వరిస్తుంది. చివరగా మిగిలిన 4వ స్థానం చేజిక్కించుకునే ప్రయత్నంలో అధికార, విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విపక్ష బీజేడీ 3, 4 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించి ప్రధాన పోటీకి తెర ఎత్తింది. మూడో స్థానానికి మొదటి అభ్యర్థి సంతృప్త్ మిశ్రా, 4వ స్థానానికి రెండో అభ్యర్థి డాక్టర్ దత్తేశ్వర్ను పేర్కొంది. డాక్టర్ దత్తేశ్వర్ ఉమ్మడి అభ్యర్థి. ఆయనకు సానుకూలంగా మద్దతు ఇచ్చి రాజ్య సభకు పంపాలని నవీన్ పట్నాయక్ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ● ఒడిశా యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మొదటి వైస్–ఛాన్సలర్, ఎస్సీబీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ హోటా ధారణ అభ్యర్థి కాబట్టి, సంతప్త్ మిశ్రా చాలా సంవత్సరాలుగా బీజేడీలో చురుకై న నాయకుడిగా, పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక వ్యూహకర్తగా పరిగణించబడుతున్నారు. ఈసారి, ఆయన కటక్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తారు. జాతీయ స్థాయిలో పార్టీ ప్రాతినిధ్యానికి తన స్వరాన్ని జోడిస్తారు. వైద్య రంగానికి, ముఖ్యంగా యూరాలజీకి చేసిన కృషికి పేరుగాంచిన డాక్టర్ దత్తేశ్వర్ ఎగువ సభలో కూడా స్థానం సంపాదించనున్నారు. ● ఒడిశా అసెంబ్లీలో బీజేడీ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే, ఆ స్థానానికి శాంట్రప్ట్ మిశ్రా అధికారిక అభ్యర్థిగా ఉంటారని, డాక్టర్ హోటాను నాలుగో స్థానానికి పోటీకి దించారు. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ హోటాకు మద్దతు ఇవ్వాలని నవీన్ అన్ని రాజకీయ పార్టీలను కోరారు. మూడవ స్థానానికి మొదటి అభ్యర్థి సంతృప్త్ మిశ్రా, మా పార్టీ సీనియర్ సభ్యుడు. డాక్టర్ దత్తేశ్వర్ ప్రముఖ వైద్యుడు, పేరొందిన యూరాలజిస్టు, ఒడిశా యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తొలి వైస్ ఛాన్సలర్, కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా కీలక బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆరోగ్య సంరక్షణలో దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఆయన నామినేషన్ ప్రజారోగ్య విధానంలో ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడంపై బీజేడీ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సంతృప్త్ మిశ్రా బిజూ జనతా దళ్లో చేరి కటక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. -
–8లోu
● ముగిసిన బ్రహ్మోత్సవాలురాయగడ జేకేపూర్ పారిశ్రామిక ప్రాంతంలో భూసమేత కల్యాణ వేంకటేశ్వర మందిరం స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుంచి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీనివాసుని పవలింపు సేవతో పూజా కార్యక్రమాలు ముగిసాయి. అంతకుముందు గజవాహన సేవ, చక్రస్నానం, వసంతోత్సవాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం మందిర ప్రాంగణంలో నిర్వహించిన కల్యాణ వేంకటేశ్వర స్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. వందల సంఖ్యలో భక్తులు ఈ సుందర దృశ్యాన్ని వీక్షించారు. – రాయగడఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026 -
ఫ్లై ఓవర్పైకి అనధికార ప్రవేశం
● రెండు వాహనాలకు రు.40 వేల జరిమానారాయగడ: స్థానిక ఫ్లై ఓవర్పై అనధికారంగా ప్రవేశించిన రెండు భారీ వాహనాలకు రోడ్డు రవాణా శాఖ అధికారులు రూ.40 వేల జరిమానాను విధించారు. గత కొద్ది నెలలుగా ఫ్లైవర్ మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో బ్రిడ్జిపై వాహన రాకపోకలను జిల్లా యంత్రాంగం నిషేధించిన విషయం తెలిసిందే. శనివారం రెండు భారీ వాహనాలు బ్రిడ్జి మీదుగా వెళ్లి రహదారి లేకపోవడంతో మధ్యలో నిలిపివేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా భారీ వాహనాలు బ్రిడ్జిపై నిలిచి ఉండటం గమనించిన ఆర్టీఓ సిబ్బంది శుక్రవారం సాయంత్రం పోలీసులు బందోబస్తుతో చేరుకుని వాహనాల యజమానికి సంబంధించిన కాగితాలను పరిశీలించి రెండింటికీ జరిమానను విధించారు. రెండు భారీ వాహనాలు గుజరాత్ నుంచి జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి వద్ద గల ఆదిత్యా అలూమిన కార్మాగారం నిర్మాణంలో భాగంగా అందుకు సంబంఽధించిన యంత్రాలను తరలిస్తున్నట్లు సమాచారం. స్థానిక కపిలాస్ కూడలి వద్ద ఫ్లైఓవర్ మీదుకు ఎటువంటి వాహనాలు రాకపోకలు కొనసాగించకూడదని జిల్లా యంత్రాంగం హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసినప్పటికీ ఈ రెండు భారీ వాహనాలు నియమాలను ఉల్లంఘించి బ్రిడ్జిపైకి వెళ్లాయి. -
● టైలర్ల దినోత్సవం
పర్లాకిమిడి: ప్రపంచ దర్జీల దినోత్సవం (టైలర్స్ డే) సందర్భంగా గజపతి జిల్లా టైలర్ల సంఘం సభ్యులు శనివారం ఉదయం స్థానిక పాతమార్కెట్ వద్ద పర్లాకిమిడి మహరాజా కృష్ణచంద్ర గజపతి విగ్రహానికి పూలమాలలు వేశారు. కుట్టు మిషన్ను కనిపెట్టిన విలియం ఎలియాస్ హోవే చిత్రపటానికి అంజలి ఘటించారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన టైలర్ మార్కెండయ చిత్రపటానికి దర్జీలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ సంఘం అధ్యక్షుడు కోవిల్కోండ వరదరాజులు, కార్యదర్శి ఎం.రవిరాజ్. ఉపాధ్యక్షుడు మల్లా ధర్మారావు, కోశాధికారి పి.దిలీప్, తదితరులు పాల్గొన్నారు. -
నందపూర్ సమితిలో కలెక్టర్ పర్యటన
కొరాపుట్: ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్ కాలినడకన నదులు దాటారు. శనివారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితిలో పర్యటించారు. ఆ ప్రాంతంలో బస్కి నదిపై వంతెన నిర్మించాలని గత కొంత కాలంగా గిరిజనులు ఎన్నికలు బహిష్కరిస్తున్నారు. ఈ సమస్య తెలుసుకోవడానిని కలెక్టర్ స్వయంగా నదిని నడుచుకుంటూ దాటారు. నది అవతల ఉన్న బెబసానందగుడ గ్రామ గిరిజనులతో సమావేశమయ్యారు. వర్షాకాలం తాము నది దాటలేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనారోగ్యం చేస్తే వైద్యం అందని పరిస్థితి ఉందన్నారు. తమ పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదని, అంగన్వాడీ కేంద్రాలు నడవడం లేదని వాపోయారు. కనీస ఉపాధి లేక విలవిలలాడుతున్నామని వాపోయారు. కలెక్టర్ స్పందిస్తూ వీలైనంత త్వరలో వంతెన నిర్మాణం ప్రారంభం అవుతుందని హామీ ఇచ్చారు. -
ఆవిష్కరణలతోనే వికసిత భారత్
జయపురం: విజ్ఞాన, ఆవిష్కరణాత్మక ఆలోచనల ద్వారానే వికసిత భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని విద్యావేత్త, యువ శాస్త్రవేత్త, అవిభక్త కొరాపుట్ తెలుగు తేజం అములూరి విశ్వనాథ్ అన్నారు. శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా జయపురం సబ్ డివిజన్ కొట్పాడ్లో మాట్లాడుతూ ఈ ఏడాది జాతీయ విజ్ఞాన దినోత్సవ థీమ్ ‘విజ్ఞానంలో మహిళలు..వికసిత భారత్ నిర్మాణానికి ప్రోత్సాహం’ అని వెల్లడించారు. అవిభక్తి కొరాపుట్( కొరాపుట్, మల్కనగిరి, రాయగడ, నవరంగపూర్) అభివృద్ధి కోసం శాస్త్ర సాంకేతిక రంగంలో సమగ్ర చర్చలు, ఆధునిక సాంకేతికత అవసరమన్నారు. విద్యాసంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో తరచూ విజ్ఞాన ప్రదర్శనలు, వర్క్షాపులు నిర్వహిస్తూ భవిష్యత్ శాస్త్రవేత్తలకు ప్రేరణ ఇవ్వాలని, అలా చేసినప్పుడే వికసిత భారత్, వికసిత ఒడిశా, వికసిత అవిభక్త కొరాపుట్లు సాధ్యమౌతాయని చెప్పారు. చనిపోయిన కోడి మాంసం తిని నలుగురికి అస్వస్థత రాయగడ: అనారోగ్యానికి గురై చనిపోయిన నాటుకోడి మాంసాన్ని వండుకుని తిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పర్శాలి పంచాయతీలొని సనోడెంగిలి గ్రామంలో ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని వెంటనే కళ్యాణసింగుపూర్ పీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం కుదుటుగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే సనోడెంగిలి గ్రామానికి చెందిన పొతే కడ్రక, కుడుంజీ కడ్రక, పవులి కడ్రక, మాల కడ్రకలు వారి ఇంట్లో పెంచుతున్న ఒక నాటుకోడి చనిపోయింది. దానిని పారవేయడమెందుకని కోసి మాంసాన్ని వండుకుని అందరూ కలిసి రాత్రి భోజనం చేశారు. అర్థరాత్రి అయ్యేసరికి ఒకొక్కరికీ వాంతులు పట్టుకుని అస్వస్థతకు గురయ్యారు. ఇరుగుపొరుగు వారు చూసి వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. లిక్విడ్ గంజాయి తయారీలో కేరళా స్మగ్లర్లు కొరాపుట్: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన గంజాయి ఆయిల్ తయారీ పరిశ్రమపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. శనివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో దక్షిణ పశ్చిమాంచల్ ఐజీ కన్వర్ విశాల్సింగ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 26న కొరాపుట్ జిల్లా జోలాపుట్ రిజర్వాయర్ మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ పరిశ్రమపై దాడి చేయగా.. 1,800 లీటర్ల గంజాయి ఆయిల్ పట్టుబడిందన్నారు. దీని విలువ రూ.200 కోట్ల పైబడి ఉంటుందన్నారు. ఈ సమయంలో నలుగురు కేరళ వాసులు ఉన్నారన్నారు. అధునాతన రసాయన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఆయిల్ తయారు చేస్తున్నారని చెప్పారు. ఐలాండ్కి వెళ్లడానికి బోట్లు వాడుతున్నారని, విద్యుత్ కోసం జనరేటర్లు వినియోగిస్తున్నారని తెలిపారు.ఈ మాఫియా డాన్ జయరాజ్ కేరళా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. టెన్త్ పాస్ అయిన జయరాజ్ యూట్యూబ్ చూస్తూ ఆయిల్ తయారు చేస్తున్నాడని చెప్పారు. కేరళా నుంచి వచ్చి ఒడిశాలో తయారు చేయడం వెనుక నెట్వర్క్ ఛేదిస్తామన్నారు. ఈ సాహసోపేతమైన ఆపరేషన్లో పాల్గొన్న ఎస్పీ రోహిత్ వర్మను అభినందించారు. -
కాంగ్రెస్ అభ్యర్థిగా సత్యజిత్ గొమాంగ్
భువనేశ్వర్: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్ర కాంగ్రెసు సిద్ధమైంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం శనివారం 3 సెట్ల నామినేషన్ ఫారాలు కొనుగోలు చేసింది. పార్టీ ఎమ్మెల్యే సత్యజిత్ గొమాంగ్ ఈ దరఖాస్తులు పొందారు. రాజ్యసభ ఎన్నికల్లో 4వ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపనుంది. పేలుడు ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో జరిగిన విషాదకరమైన ఫ్యాక్టరీ పేలుడు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఈ ఘటనలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాయగడ: జిల్లాలోని గుడారి ఎన్ఏసీ తొమ్మిదో వార్డు పరిధి శ్రీరాంనగర్లో నివసిస్తున్న ఉపాధ్యాయుడు వంశీధర సబర్ అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపులకు ఉన్న తాళాలను విరగ్గొట్టి లోపలకు వెళ్లి ఇంటిలోని వెండి, బంగారు, నగదును దోచుకున్నారు. ఈ మేరకు బాధితుడు గుడారి పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్టీంతో సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు మునిగుడ సమితిలోని బాలిజోల సేవాశ్రమంలో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఇంటికి తాళాలు వేసి ఆశ్రమ పాఠశాలకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. -
నాణ్యమైన వైద్యసేవలందించాలి
శ్రీకాకుళం: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. జిల్లాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆర్థిక సహకారంతో ఆస్పత్రుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను గుర్తించి ఫౌండేషన్ డైరెక్టర్ సత్తి శ్రీనివాసరావును విజయవాడలోని మంత్రి కార్యాలయంలో ఇటీవల సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రెడ్డీస్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలానే లేబర్ రూమ్, ఫార్మసీ, వార్డ్, ల్యాబరేటరీ గార్డెన్లకు అత్యాధునిక సదుపాయలు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ బద్దెల సురేష్ పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత టెక్కలి రూరల్: స్థానిక జగతిమెట్ట సమీపంలో శనివారం ఉదయం అక్రమంగా పశువులను తరలిస్తున్న నాలుగు బొలేరో వ్యాన్లను టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచిలి సమీప ప్రాంతాల నుంచి సంతలకు తరలిస్తుండగా సమాచారం అందుకున్న టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా 4 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వాటిలో మూడు వాహనాల్లో మొత్తం 14 గేదెలతో పాటుగా ఒక బొలేరో వాహనంలో 4 ఆవులు ఉన్నాయి. వాహనాలను టెక్కలి స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. పశువులను గోశాలకు తరలించనున్నట్లు తెలిపారు. ఇత్తడి సామగ్రి చోరీపై ఫిర్యాదు టెక్కలి రూరల్: మండంలోని తలగాం గ్రామానికి చెందిన హనుమంతు విద్యాసాగర్ అనే వ్యక్తి తన ఇంట్లో ఉంచిన సామగ్రి కనిపించడం లేదని టెక్కలి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. విద్యాసాగర్ తెలంగాణలోని భద్రాచలంలో పేపర్ బోర్డులో టెక్నికల్ అడ్వైజరుగా పనిచేస్తున్నారు. అయన ఈనెల 27వ తేదీన తన సొంత గ్రామమైన తలగాంలోని ఇంటికి వచ్చారు. అనంతరం స్టోర్ రూమ్కి వెళ్లి చూడగా అందులో ఉంచిన సుమారు 100 కేజీల ఇత్తడి సామగ్రితో పాటు 3 గ్రాముల బంగారు కాసులు కన్పించడం లేదని తెలిపాడు. ఈ మేరకు సామగ్రి చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతుల వివరాలను నమోదు చేయాలి ● డీపీఎం పూజారి సత్యనారాయణ ఆమదాలవలస: ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో కృషి మేపర్ పోర్టల్కు అనుసంధానం కోసం రైతుల వివరాలను ‘ఉర్వి’ యాప్లో నమోదు చేయాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యనారాయణ సూచించారు. మండలంలోని చీమలవలస గ్రామంలో నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డేటా ఎంట్రీ ప్రక్రియ ఐసీటీఎన్ఎఫ్ఏ శివకృష్ణ పర్యవేక్షణలో కొనసాగుతోందని చెప్పారు. చీమలవలస, కట్యాచార్యులపేట, వంజంగి, జొన్నవలస, దూసి, కలివరం పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో సీడీఎఫ్ సురేష్ ఆధ్వర్యంలో వివరాల నమోదు ప్రక్రియను ట్రైనీ ఐసీఆర్పీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది రైతుల భూ వివరాలను ఖచ్చితంగా జియోట్యాగ్ చేసి, రైతుల ఫొటోలను కూడా అప్లోడ్ చేస్తున్నారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ, ఫీల్డ్ స్థాయిలో సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
జయపురం: స్థానిక సరస్వతి విద్యా శారదా మందిరంలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యాలయ ప్రధాన శిక్షకులు సత్యనారాయణ సెట్టి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విజ్ఞాన ప్రాజెక్టులు, తదితర వాటిపై పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినవారికి బహుమతులు అందజేశారు. బహుమతుల ప్రదానోత్సవంలో ముఖ్యఅతిథిగా రిటైర్డ్ హెచ్ఎం క్షీరోద్ కుమార్ భటమిశ్ర పాల్గొన్నారు. పాఠశాల పరిచాలన కమిటీ అధ్యక్షుడు కిశోర్ చంద్ర పండా, కార్యదర్శి బిజయ కుమార్ భట్, పాఠశాల విజ్ఞాన అధ్యాపకులు దిలీప్ కుమార్ శతపతి, తదితరులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి విద్యార్థుల వికాశంలో విజ్ఞాన భూమికపై వివరించారు. పాఠశాల ఆచార్యులు అనంత నారాయణ మహాపాత్ర, కై ళాస్ చంఽద్ర పందా, రామచంద్ర మహంతి తదితరులు హాజరయ్యారు. శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాలలో.. పర్లాకిమిడి: జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల రుసా భవనంలో సైన్స్ ప్రదర్శనలను సైంటిస్టు భువనేశ్వర్ డాక్టర్ శాంతిభూషన్ సేనాపతి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ రధాకాంత భుయ్యాన్, జాతీయ సైన్స్ డే కోఆర్డినేటరు నివేదిత సామల్, భిఘ్నేశ్వర్ మిశ్రా తదితరులు హాజరయ్యారు. ఈ విజ్ఞాన ప్రదర్శనలకు ఎస్.కె.సి.జి కళాశాల లైఫ్సైన్స్, కాశీనగర్ శ్రీరాంకళాశాల, కేంద్రీయ విద్యాలయం ప్లస్టు, మోహనా హిల్టాప్ కళాశాల విద్యార్థులు 25 ప్రాజెక్టులు ప్రదర్శించారు. లైఫ్సైన్స్ కళాశాలలో వికసిత్ భారత్లో మహిళా విజ్ఞానవేత్తలు అన్న అంశంపై కర్మశాలను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రాధాకాంత భుయ్యాన్, శాంతిభూషణ్ సేనాపతిని సన్మానించారు. ప్రొఫెసర్ కీర్తిరంజన్ దాస్, పలువురు ప్రొఫెసర్లను సత్కరించారు. ఉత్తమ విజ్ఞాన ప్రాజెక్టులు చేసిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి 79 పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎంవివి 55 గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుక్రి సర్కార్ (55) మృతి చెందారు. ఈమె భర్త పరితోష్కు తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ జంట శుక్రవారం మధ్యాహ్నం బలిమెల నుంచి కలిమెల సమితి ఎంవి 81 గ్రామంలో నివసిస్తున్న బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం అక్కడ నుంచి బయలుదేరి తిరిగి వస్తున్న సమయంలో ఎంవివి 55 గ్రామం వద్ద బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదం చూసిన స్థానికులు రహదారి పక్కనే పడిపోయిన మహిళ తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. భర్త ప్రాణాలతో ఉండటంతో కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంవి 79 పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భర్త పరితోష్కు కాళ్లు విరిగిపోవడంతో మల్కన్గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
భక్తి శ్రద్ధలతో ఏకాదశి పూజలు
రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని ల్యాణవేంకటేశ్వర స్వామి మందిరంలో ఫాల్గుణ మాసం శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో మందిరం ప్రాంగణంలో శ్రీరమా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సెపక్ తక్రా పతక విజేతకు సత్కారం భువనేశ్వర్: శ్రీలంకలో జరిగిన ఆసియా సెపక్ టక్రావ్ చాంపియన్షిప్లో భారత మహిళా, పురుషుల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలో భారత జట్టు 3 బంగారు పతకాలు గెలుచుకుంది. ఒడిశాకు చెందిన ఆకాష్ కుమార్ రెడ్డి స్వర్ణ పతకం సాధించాడు. ఒడిశాకు కీర్తిని చాటిన ఆకాష్ కుమార్ రెడ్డిని హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఒడిశాలో సెపక్ తక్రా క్రీడను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సెపక్ తక్రా క్రీడా సంస్థ ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ సాహు పాల్గొన్నారు. రేపు ఎస్కేజీసీ కాలేజీలో యూత్ పార్లమెంట్ పర్లాకిమిడి: కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు స్థానిక శ్రీకృష్ణచంద్రగజపతి (స్వయంప్రతిపత్తి) కళాశాలలో మార్చి 1న యూత్ పార్లమెంటు నిర్వహిస్తున్నట్టు కళా శాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాధాకాంత భుయ్యాన్ తెలియజేశారు. శుక్రవారం కళాశాల కౌన్సిలింగ్ హాల్లో జరిగిన ప్రెస్మీట్లో ప్రొఫెసర్ రాధాకాంత భుయ్యాన్ మాట్లాడారు. తొలిసారిగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంటుకు జిల్లాలో కాశీనగర్, గుమ్మ, మోహన, పర్లాకిమిడి మహిళా కళాశాలల నుంచి 18 నుంచి 25 ఏళ్ల లోపు విద్యార్థులు 150 మందికి పైగా పాల్గొంటున్నారని, వీరిలో ఉత్తమంగా మాట్లాడిన యువ పార్లమెంటీరియన్లు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతారని ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారి బిధ్యాధర్ శెఠి అన్నారు. -
మల్కన్గిరిలో ఉత్కళ సమ్మిళిని రాష్ట్ర అధ్యక్షుడు పర్యటన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో ఉత్కళ సమ్మేళన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అధ్వైత్ కుమార్ పాత్రో, ఉపాధ్యక్షుడు డాక్టర్ సుబ్రత్ కుమార్ సాహు, ఇతర రాష్ట్ర స్థాయి ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు. ముందుగా స్థానిక సర్క్యూట్ హౌస్కు చేరుకొని మధుసూదన్ దాస్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధన్తో రాష్ట్ర అధ్యక్షుడు అధ్వైత్ కుమార్ పాత్రో చర్చించారు. జిల్లాకు రైల్వే అనుసంధానం, ఆదివాసీ భాషల పరిరక్షక్షణ, వినియోగం, స్వాభిమాన ప్రాంత అభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల సరైన అమలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పద్మనాభ సామల్, కమల్ చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి అక్షయ్ కుమార్ దాస్, కేంద్ర సభ్యుడు రవీంద్ర బెఉరియా, జిల్లా శాఖ అధ్యక్షుడు దుష్మంత్ కుమార్ జెనా, జిల్లా ఉపాధ్యక్షుడు లంభోధర్ తురుక్, జిల్లా కార్యదర్శి అశోక్ మిశ్రో, ఇతర సభ్యులు ఉన్నారు. -
శాస్త్రవేత్తల సహకారంతోనే వికసిత భారత్
భువనేశ్వర్: వైజ్ఞానిక పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో మహిళల పాత్ర వికసిత భారత్ కల సాకారానికి దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో విజ్ఞాన శాస్త్రంలో మహిళలు ఇతివృత్తంతో ఈ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) జరుపుకుంది. ఏటా భారతీయ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సర్ సి. వి. రామన్ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణను స్మరించుకుంటూ ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానిక జాతీయ వైజ్ఞానిక విద్య మరియు పరిశోధన (నైజర్) డైరెక్టర్ ప్రొఫెసర్ హిరేంద్ర నాథ్ ఘోష్ క్వాంటం ప్రపంచంలో అల్ట్రాఫాస్ట్ స్పెక్ట్రోస్కోపీ అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. సెమీకండక్టర్లు, అల్ట్రాఫాస్ట్ లేజర్ల నుంచి క్వాంటం కంప్యూటింగ్ వరకు క్వాంటం సైన్స్ ప్రాథమికంగా ఆధునిక సాంకేతికతను మార్చిందని ప్రొఫెసర్ ఘోష్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అణువులు, పదార్థాలను పరిశీలించడానికి అల్ట్రాఫాస్ట్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి 3 దశాబ్దాలకు పైగా చేసిన పరిశోధనల ఆధారంగా చేసుకుని తదుపరి తరం ఆప్టో ఎలక్ట్రానిక్ పరికరాలను అభివృద్ధి చేయడానికి ఫెమ్టోసెకండ్, అటోసెకండ్ ప్రక్రియలను అర్థం చేసుకోవడం చాలా కీలకమని చెప్పారు. నేడు దైనందిన జీవితంలో ఉపయోగించే ఎల్ఈడీలు, మొబైల్ డిస్ప్లేలు, సౌర ఘటాలు వంటి అనేక సాంకేతికతలు దీర్ఘకాలిక ప్రాథమిక పరిశోధనల ఫలితమని పేర్కొన్నారు. శాసీ్త్రయ పురోగతులను నడిపించడానికి భౌతిక శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, జీవ శాస్త్రవేత్తల మధ్య బలమైన అంతర్ విభాగ సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో ఐఐటీ భువనేశ్వర్ డీన్ పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ భేండే ప్రసంగించారు. ఈ సందర్భంగా పరిశోధనావేత్తలు పోస్టర్ ప్రెజంటేషన్ల ద్వారా తమ పరిశోధనా శైలిని ప్రదర్శించారు. పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
కొట్పాడ్ ఘఠ పర్వ్ ఉత్సవాలకు శ్రీకారం
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్లో మా శీతల ఠకురాణి ఘఠ పర్వ్ ఉత్సవాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ముందుగా మా శీతలఠకురాణి దేవికి భక్తితో అంచమాల పూజలు చేశారు. కొట్పాడ్లో ప్రతి మూడేళ్లకు ఒక సారి మా శీతల ఠకురాణి ఘఠ పర్వ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కొట్పాడ్ ఘఠ జాత్రను తిలకించేందుకు చత్తీస్గఢ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని ఘఠ జాత్ర నిర్వాహకులు వెల్లడించారు. ఘఠ జాత్రకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని భక్తులకు తగు సౌకర్యాల ఏర్పాటు, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుల సహాయం, కొట్పాడ్లో దమయంతి సాగర్ ఘాట్ పరిశుభ్రపరచడం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. -
కొఠియా, పోలవరం ప్రాంతాల పరిశీలన
జయపురం: ఉత్కళ సమ్మిళినీ ప్రతినిధి బృందం వివాదాస్పద కొఠియా, పోలవరం ప్రాంతాల్లో పర్యటించిందని ఉత్కళ సమ్మిళినీ అధ్యక్షుడు డాక్టర్ అద్వైతకుమార్ పాత్రో శుక్రవారం మీడియాకు తెలిపారు. ఉత్కళ సమ్మిళినీ 50వ మహాసభలో ఎన్నికై న నూతన కార్యవర్గ ప్రథమ సమావేశం ఈ నెల 25న జరిగింది. ఆ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాక కొఠియా, పోలవరం సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఒక ప్రతినిధి బృందం ఆయా ప్రాంతాలలో పర్యటించాలని తీర్మానించిందని వెల్లడించారు. రాష్ట్ర ఉత్కళ సమ్మిళినీకి కొత్తగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు, సమ్మిళినీ అధ్యక్షుడు అద్వైత కుమార్ పాత్రో నేతృత్వంలో గత రెండు దినాలు కొఠియా, పోలవరం ప్రాంతాల్లో పర్యటించినట్లు వెల్లడించారు. ప్రతినిధుల బృందంలో పద్మనాభ సామల్, భీమసేన్ మహాపాత్రో, కమల్ చక్రవర్తి, రవీంద్ర కుమార్ మిశ్ర, బిమల్ చంధ్ర షొడంగి, గోపముద్ర మహాపాత్రో, అక్షయ కుమార్దాస్,ద దుర్గా ప్రసాద్ పాఢీ, బిరెన్ మోహణ పట్నాయిక్, ప్రకాశ్ చంధ్ర పట్నాయిక్, రవీంధ్ర కుమార్ బెహురియ, దుర్యోధన్ మహారాణ, మదన మోహణ నాయిక్, జగన్నాథ్ మహాపాత్రో,బుల్లు హత్త, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్కళ సమ్మిళినీ అధ్యక్షుడు డాక్టర్ అద్వైత కుమార్ పాత్రో పత్రికల వారికి ఒక ప్రకటనలో వివరిస్తూ ఒడిశా సరిహద్దు రాష్ట్రాలైన చత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో 32 జిల్లాలలో ఒడియా ప్రజల పిల్లలకు ఒడియా భాషా బోధన, సంస్కృతి పరిరక్షణకు ఉత్కళ సమ్మిళినీ ఉద్యమిస్తుందని వెల్లడించారు. ఆయా జిల్లాలలో ఒడిశా కళలు, నృత్య నాట్యాలపై ఒడియా ప్రజలను చైతన్యపరిచేందుకు ఒడిశా కళాకారులను, నృత్య బృందాలను తీసుకెళ్లి ప్రదర్శనలు ఇప్పిస్తామన్నారు. కొఠియా, పోలవరం ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. వంశధార, మహేంద్రగిరి, నాగావళి, శబరి, సీలేరు తదితర నదుల ఎగువ ప్రాంతాలలో దిగువ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నీరు మళ్లించే ప్రయత్నాలు చేస్తోందని అందుచేత ఆయా నదుల ఎగువ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీలు, ఆనకట్టలు నిర్మించాల్సిన అవసరంపై ఉత్కళ సమ్మిళినీ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. -
ఢిల్లీలో సీఎం మాఝి, బీజేపీ చీఫ్ నబీన్ సమావేశం
భువనేశ్వర్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4 స్థానాలకు రాజ్యసభ నామినేషన్లపై ఉత్కంఠ నెలకొనగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి శుక్రవా రం న్యూ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీ య అధ్యక్షుడు నితీన్ నబీన్ను కలిశారు. నితీన్ నబీన్ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలకు వీరిరువురి సమావేశం ఆజ్యం పోసింది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై న నితీన్ నబీన్ ఈ ఏడాది జనవరి 19న పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో అధికార బీజేపీ త్వరలో జరగనున్న రాజ్య సభ ఎన్నికల్లో 2 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతిపక్ష బిజూ జనతా దళ్ 2024 ఎన్నికల తర్వాత రాష్ట్ర శాసన సభలో వారి బలం ఆధారంగా ఒక స్థానాన్ని కై వసం చేసుకోనుంది. ఈ లెక్కన 4వ స్థానానికి గట్టి పోటీ ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి న్యూ ఢిల్లీ సందర్శన పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యక్షునితో సమావేశం ఎగువ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహంపై చర్చలు జరిగి ఉండవచ్చనే ఊహాగానాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ సమావేశంలో సంస్థాగ త సమన్వయం, అభివద్ధి ప్రాధాన్యతలపై సంభాషించినట్లు బీజేపీ అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో సంస్థాగత సమన్వయం బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై ఫలప్రదమైన చర్చలు జరిపినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సుపరిపాలన, సమ్మిళిత వృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమంపై ఉమ్మడి నిబద్ధతపై చర్చ కొనసాగిందని అన్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ సంభావ్య రాజ్య సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ పార్లమెంటరీ బోర్డు పరిశీలన కోసం పంపినట్లు ముఖ్యమంత్రి ధ్రువీకరించారు. బీజేపీ రాష్ట్ర కమిటీకి అనేక సూచనలు అందాయి. అన్ని పేర్లను పార్లమెంటరీ బోర్డుకు పంపారు. అది తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను ఒడిశా నుండి పోటీకి నిలబెడితే కేంద్ర నాయకత్వం రాష్ట్రంపై వ్యూహాత్మక దష్టి సారిస్తుంది. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలం గణనీయంగా దడపడుతుంది. అదే సమయంలో ముఖ్యమంత్రికి జాతీయ నాయకత్వంతో సన్నిహితంగా పని చేసే సంబంధాన్ని బలోపేతం చేస్తుందనే దక్పథంతో రాష్ట్ర శాఖ జాతీయ అధ్యక్షునికి మద్దతు ఇవ్వాలని యోచిస్తోంది. -
మార్చి 5న కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన
భువనేశ్వర్: మార్చి 5న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా 2 రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. మార్చి 5న సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షా ప్రత్యేక వైమానిక దళ విమానంలో న్యూ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి చేరుతారు. మర్నాడు 6వ తేదీ ఉదయం కటక్ ముండులిలో జరిగే సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం ఖుర్దా జిల్లా జట్నీలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్ యూ), సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) భువనేశ్వర్ క్యాంపస్కు శంకుస్థాపన చేస్తారు. భువనేశ్వర్లోని ఎన్ఎఫ్ఎస్ యూ ట్రాన్సిట్ క్యాంపస్ను వర్చువల్ మోడ్ ద్వారా ప్రారంభిస్తారు. ఆ మధ్యాహ్నం కేంద్ర మంత్రి అమిత్ షా భువనేశ్వర్లోని ఇడ్కో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నవీన్ న్యాయ్ సంహిత ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారు. వివిధ విభాగాల ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడానికి కేంద్ర మంత్రి పర్యటన దష్ట్యా, గొడిసాహి, ముండులి రహదారిని బ్లాక్ టాపింగ్ చేయడంతో పాటు లైటింగ్, శుభ్రపరచడం, అవసరమైన సుందరీకరణ చేయాలని ఆదేశించారు. కటక్ జిల్లా మేజిస్ట్రేట్ వర్చువల్ మోడ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి సందర్శన యొక్క వివరణాత్మక షెడ్యూల్, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, రూట్ ప్లాన్, వేదిక వద్ద సంబంధిత సన్నాహాలపై సమావేశంలో చర్చించారు. కేంద్ర హోం శాఖ మంత్రి సందర్శనను సజావుగా విజయవంతం చేయడానికి నిర్ణీత సమయ వ్యవధిలో అన్ని సన్నాహాలను పూర్తి చేయాలని, అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్ర హోం, పరిశ్రమలు, సమాచార, ప్రజా సంబంధాల అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, కేంద్ర హోం శాఖ మంత్రి రాష్ట్ర పర్యటన సన్నాహాలు గురించి తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యోగేష్ బహదూర్ ఖురానియా, సహకార శాఖ కమిషనర్ మరియు కార్యదర్శి రాజేష్ ప్రభాకర్ పాటిల్, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్, ఖుర్దా జిల్లా మేజిస్ట్రేట్, సంబంధిత వివిధ విభాగాల కార్యదర్శులు, సీనియర్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కటక్ జిల్లా కలెక్టర్ వర్చువల్ మోడ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. -
కనుల విందుగా..
● శేషవాహనంపై స్వామి వారి ఊరేగింపు ● నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలురాయగడ: జేకేపూర్లోని భూసమేత కల్యాణ వేంకటేశ్వర మందిరం స్వర్ణోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం స్వామి వారిని పురవీధుల్లొ శేష వాహనంపై ఊరేగించారు. ఆదిశేశువుపై స్వామి శోభాయమానంగా భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులకు అభయమిస్తు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఊరేగింపులో స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ భక్తులకు స్వామివారు దర్శనభాగ్యం కలగడంతో అంతా పులకించిపోయారు. గోవింద..గోవింద అంటూ మధురమైన నామస్మరణాలతో ప్రాంతం ఆధ్యాత్మికంగా మారుమ్రోగిపోయింది. అంతకుముందు ఉదయం సుప్రభాత సేవ, వేదపారాయణం, విశేష హోమ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మందిరం ప్రాంగణంలోని కల్యాణ మండపంలో శుక్రవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. ఈ వ్రతాల్లో దంపతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతుండటంతో రాయగడ సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న గురువారం సాయంత్రం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మందిర కమిటీ అధ్యక్షులు వినయ్ ద్వివేది, ఉపాధ్యక్షులు పట్నాన గౌరీశంకర్, సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి వద్ద ప్రత్యక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీర్వచనాలు తీసుకున్న సబ్ కలెక్టర్ జెన్న మందిరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నేడు ముగింపు.. గత నెల 23వ తేదీ నుంచి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ జరగనుంది. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. -
అనుమానాస్పద మృతి
వలస కూలిమల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి అంబాగూడ గ్రామానికి చెందిన ఓ వలస కూలి మృతి చెందారు. ఆదివాసీ తెగకు చెందిన అంబాగూఢ గ్రామ వాసి పడియా మాడీ (49) అనే వ్యక్తి బోర్వెల్ వాహనంలో పని చేయడానికి ఆంధ్రాకు వలస వెళ్లాడు. ఏం జరిగిందో గానీ గురువారం రాత్రి అతడి మృతదేహాన్ని వాహనంలో తీసుకువచ్చి ఇంటి ముందు దింపి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం గ్రామస్తుల సాయంతో కుటుంబ సభ్యులు, కలిమెల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా కడుపు భాగంలో గాయం కనిపించింది. ఎలా చనిపోయాడో తెలీకపోవడంతో ఐఐసీ ప్రభుదత్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


