Odisha Latest News
-
ఘనంగా మహేంద్ర మేళా
పర్లాకిమిడి: మహేంద్రగిరిలో మహేంద్రమేళా ఘనంగా జరుగుతోంది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బిభూతీ జెన్నా మంగళవారం మధ్యాహ్నం మేళాను సందర్శించారు. మంత్రి బిభూతీ జెన్నాకు కాశీ సుమేధుపీఠాధిపతి జగద్గురు సరస్వతీ స్వామి, నరేంద్ర సరస్వతీ మహారాజ్, స్వామి హారిహార మహారాజ్, స్వామి భాస్కర తీర్ధ సరస్వతీ గౌరవంగా స్వాగతించారు. అనంతరం మహారాజ్ తదితరులును స్వాగతించారు. సనాఽతన ధర్మం, విశ్వశాంతి మహాయజ్ఞం జరుపుతున్న పండితుల వద్దకు మంత్రి పలకరించారు. అనంతరం ఆయన కుంతీ మందిరానికి వెళ్లి శివలింగాన్ని దర్శించుకున్నారు. మహేంద్రగిరి ఆధ్యాత్మిక చింతనకు, భక్తి, ధ్యానం, శాంతి, శాశ్వత సంస్కృతి, దివ్యవైభవంతో ప్రకాశిస్తున్నదని, మహేంద్రుని అనంత కృపతోఈ ఆధ్యాత్మిక మహోత్సవం విజయవంతం కావాలని మంత్రి బిభూతీ జెన్నా ఆకాంక్షించారు. ప్రపంచంలో శాంతి, సద్భావన, ఆధఆ్యత్మిక చైతన్యం సందేశాన్ని వ్యాప్తి చేయాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి జెన్నా అన్నారు. అనంతరం మంత్రి ఫారెస్టు శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రిసార్టుకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. ఆయన వెంట గజపతి జిల్లా ఎస్డీసీ చైర్మన్ కామదేవ్ బోడోనాయక్ ఉన్నారు. సందర్శించిన మంత్రి బిభూతీ జెన్నా -
చురుగ్గా రథాల తయారీ
భువనేశ్వర్: ప్రసిద్ధ పూరీ జగన్నాథుని యాత్ర కోసం రథాల తయారీ పనులు చురుగ్గా ముందుకు సాగుతున్నాయి. అక్షయ తృతీయ నుంచి మొదలైన రథ తయారీ పనులు 42వ రోజు సరికి ఇరుసుకు చక్రాల అమరిక పూర్తి కావడం విశేషం. ప్రధాన మహారణ మార్గదర్శకంలో రథ కార్మికులు నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. సాధారణంగా శీతల షష్టి నాటికి పూర్తి కావలసిన చక్రాల అమరిక చాలా ముందుగానే పూర్తి చేశారు. భంవురి రోజున లాంచనంగా 3 రథాల ఇరుసుకు చక్రాల అమరికను పూర్తి చేశారు. 41వ రోజున 3 రథాల 18 ఇరుసులకు 36 చక్రాలను భోయ్ సేవకులు అనుసంధానించి హరీ బోల్ నినాదంతో ఉర్రూతలూగారు. మొదటగా తాళ ధ్వజ రథం 6 ఇరుసులకు 12 చక్రాలను, నంది ఘోష్ రథం 7 ఇరుసులకు 14 చక్రాలను, దేవ దళన్ రథం 5 ఇరుసులకు 10 చక్రాలను అనుసంధానించడంతో చక్రాల అమరిక ప్రక్రియను పూర్తి చేశారు. దీని తర్వాత రథాల పైభాగం పనులు అంచెలంచెలుగా ఊపందుకుంటాయి. ఈ దశ పనుల్లో రూపకారుల పాత్ర పుంజుకుంటుంది. అలాగే కమ్మరి వర్గం సేవకులు పలు పరిమాణాల మేకులు వగైరా తయారీలో తలమునకలై ఉన్నారు. ఇలా పలు రకాల పనుల్లో 205 మంది సేవకులు పని చేస్తున్నారు. మూడు రథాల తయారీ పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 3 రథాలకు చెందిన 21 ఇరుసులకు 42 చక్రాలు అనుసంధానం పూర్తి చేశారు. ఆ తర్వాత రథం యొక్క ఇతర భాగాలను దశల వారీగా అమర్చుతారు. రూపకార్ సేవకులు మూడు రథాలలోని వెలుపలి భాగాల్లో సింహం, ఏనుగు చెక్కడం పనుల్లో హడావిడిగా ఉన్నారు. -
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటన
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి విచ్చేయనున్నారు. రైరంగ్పూర్ను సందర్శించనున్నారు. మయూర్భంజ్ లోక్ సభ సభ్యుడు నొబొ చరణ్ మాఝీ ఈ విషయం తెలిపారు. రాష్ట్రపతి ఈ నెల 19, 20 తేదీలలో రెండు రోజులు రాష్ట్ర పర్యటనలో పాల్గొంటారు. ప్రధాన మంత్రి ఈ నెల 20వ తేదీన పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి మెట్టినింటి గ్రామం పహడ్పూర్, రాయిరంగ్పూర్లో శంకు స్థాపన చేసి పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కుసుమ మండలం సులిదుమాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. భువనేశ్వర్ హై టెక్ మెడికల్ కాలేజీ కొత్త డైరెక్టర్గా సీతారాం భువనేశ్వర్: సీనియర్ వైద్యుడు మరియు పాథాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సీతారాం మహా పాత్రో భువనేశ్వర్ హై టెక్ వైద్య బోధన ఆస్పత్రి డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ మరియు మెడికల్ సూపరింటెండెంట్గా నియమితులు అయ్యారు. డాక్టర్ సీతారాం మహా పాత్రోకు వైద్య, పరిపాలనా రంగాలలో అనేక సంవత్సరాల నైపుణ్యం, అనుభవం ఉంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ముఖ్యమైన పదవులలో అంకిత భావంతో పని చేశారు. ప్రస్తుతం జాజ్పూర్ మహా రాజా యయాతి కేశరి వైద్య బోధన ఆస్పత్రి డీన్, చైర్మన్గా పని చేస్తున్న డాక్టర్ సీతారాం మహా పాత్రో ప్రఖ్యాత వైద్యుడిగా, నిర్వాహకుడిగా పేరు పొందారు. టెన్త్ విద్యార్థులకు వేసవి విద్యా శిబిరాలు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ ఆదేశాల మేరకు పదో తరగతి విద్యార్థుల కోసం 20 రోజుల పాటు వేసవి విద్యా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి శిబిరాలు ఆరంభమయ్యాయి. ప్రతి పాఠశాలలో ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. స్మార్ట్ క్లాస్ల ద్వారా అంశాల వారీగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేస్తారు. అలాగే ఆదివారం రోజున కెరీర్ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించడంతోపాటు ఈ నెల 20వ తేదీన తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని విద్యాశాఖాధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు విద్యాశాఖ అధికారి మాంజులాతా బోయి, భగీరధి బెహరా పాల్గొన్నారు. పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఆదివాసీ ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రాజెక్టును అమలు చేస్తుంది. మంగళవారం నువాగడ బ్లాక్ నుంచి సెరంగో (గుమ్మా బ్లాక్) వరకు సుమారు 16 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి నువాగడ బ్లాక్ వద్ద శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణానికి రూ.40.21 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. దీంతో గుమ్మా బ్లాక్ సెరంగో ప్రజలు పర్లాకిమిడి వచ్చి నువాగడ వెళ్లకుండా నేరుగా సెరంగో గ్రామం నుంచి నువాగడ బ్లాక్కు చేరుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, ఎస్డీసీ చైర్మన్ కామ్దేవ్ బోడోనాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోరో శోబోరో, రోడ్లు–భవనాల శాఖ సూపరింటెండింట్ ఇంజినీర్ అభిషేక్ శెఠి, తదతరులు పాల్గొన్నారు. -
వర్సిటీలు సమర్థులను తయారు చేయాలి: గవర్నర్
● వీసీల సదస్సు ముగింపు ● పరిశోధనలు, ఉపాధి కల్పనపై చర్చ భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలు విద్యార్థుల్లో జ్ఞానాన్ని సృష్టించి ఆవిష్కరణల ప్రోత్సాహంతో వ్యక్తిత్వ, నాయకత్వ లక్షణాలతో చైతన్యవంతమైన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని వైస్ చాన్స్లర్లకు గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. లోక్ భవన్ న్యూ అభిషేక్ హాల్లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల వైస్ చాన్స్లర్ల సదస్సు ముగింపు సమావేశం సందర్భంగా గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. విశ్వ విద్యాలయాలు కేవలం డిగ్రీ హోల్డర్లను మాత్రమే కాకుండా సమర్థులైన పౌరులను, సమస్య పరిష్కర్తలను, ఆవిష్కర్తలను, దేశ నిర్మాతలను తయారు చేయాలని ఆయన ఆకాంక్షించారు. పరిపాలన సంస్కరణలు, పరిశోధన, ఆవిష్కరణలు, అంతర్జాతీకరణ, ఉపాధి కల్పన, డిజిటల్ పరివర్తన, పారిశ్రామిక భాగస్వామ్యాలు, జాతీయ విద్యా విధానం అమలుపై సదస్సులో జరిగిన చర్చలు నిర్దిష్ట చర్యలుగా రూపుదిద్దుకోవాలని గవర్నర్ పేర్కొన్నారు. చాన్స్లర్గా తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఒడిశాలో ఉన్నత విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో చేసే వాస్తవ ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ సంక్షేమ, వ్యవస్థాపక, ఉ పాధి పథకాలపై విద్యార్థులలో అవగాహన కల్పించాలని గవర్నర్ విశ్వవిద్యాలయాలను కోరారు. తద్వారా యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఉత్తమ పద్ధతులకు పేరుగాంచిన సంస్థలను సంయుక్తంగా సందర్శించి, విజయవంతమైన నమూనాలను తమ క్యాంపస్లకు అనుగుణంగా మార్చుకోవాలని ఆయన వైస్ చాన్స్లర్లను ప్రోత్సహించారు. ఉన్నత విద్యా సంస్థల దీర్ఘకాలిక వృద్ధి, అభివృద్ధికి సంస్థాగత ఆస్తులను పరిరక్షించడం అత్యవసరం. ముగింపు కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ అనేక సంస్థలు ఆక్రమణలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, కొత్త ఆక్రమణలను నివారణకు అప్రమత్తతో కూడిన సమర్థవంతమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని ఆయన విశ్వవిద్యాలయ అధికారులను కోరారు. క్యాంపస్ జీవితంలో భాగంగా ఉపయోగించని భూమిని మొక్కలు నాటే కార్యక్రమాలతో పచ్చదనం విస్తరణకు వినియోగించుకోవాలని కోరారు. ఆక్రమిత భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని, ఇకపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చూసుకోవడం సంస్థల సమాన బాధ్యతగా గవర్నరు పేర్కొన్నారు. పైకప్పు స్థలాలను ఉపయోగించుకుని సౌర విద్యుత్ ఉత్పత్తితో సంప్రదాయ విద్యుత్ అవసరాలను కొంతమేర తీర్చుకోవాలని గవర్నరు ప్రోత్సహించారు. విశ్వవిద్యాలయాలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను అన్వేషించి పునరుత్పాదక ఇంధన సేవా సంస్థ (రెస్కో) నమూనాను అనుసరించాలని సూచించారు. సదస్సు చివరి రోజున రెండు సెషన్లు జరిగాయి. ఈ సెషన్లలో వివిధ విశ్వ విద్యాలయాల వైస్ చాన్స్లర్లు పలు సమకాలీన అంశాల్ని ప్రదర్శించారు. హరిత ఇంధనం, సుస్థిరత కార్యక్రమాలు, క్వాంటం కంప్యూటింగ్, వర్ధమాన సాంకేతికతలు, సంస్థాగత పాలనలో ఉత్తమ పద్ధతులు, విద్యా నైపుణ్యం వంటివి ముఖ్యమైన అంశాలుగా నిలిచాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ మాట్లాడారు. గవర్నర్ సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఉన్నత విద్యా సంస్థలన్నింటిలో నైపుణ్యాభివృద్ధి మౌలిక సదుపాయాలను విస్తరిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. -
అల్యూమినియం స్మగ్లింగ్ రాకెట్ గుట్టురట్టు
రాయగడ: వేదాంత లంజిఘడ్ అల్యూమినియం ప్రాజెక్టు నుంచి భారీ మొత్తంలో అల్యూమిన పౌడర్ను అక్రమంగా తరలిస్తూ ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్న పెద్ద రాకెట్ను జిల్లాలోని మునిగుడ పోలీసులు బట్టబయలు చేశారు. సోమవారం రాత్రి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో అల్యూమినియం లోడ్తో వెళ్తున్న 7 పికప్ వ్యాన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని అందుకు సంబంధించి ఆ వాహనాల్లో గల ఏడుగురు డ్రైవర్లను అరెస్టు చేశారు. మునిగుడ ఐఐసీ కేశవ్ షడంగి తెలిపిన వివరాల ప్రకారం వేదంత అల్యూమిన ప్రాజెక్టు నుంచి చోరీ చేసిన అల్యూమిన పౌ డర్ను పికప్ వాహనాల్లో లోడ్ చేసి రాష్ట్రం బయటకు తరలిస్తున్న సమయంలో పోలీసులు వ్యూహం ప్రకారం వాహనాలను పట్టుకున్నారు. ఈ రవాణా చేస్తున్న డ్రైవర్లను కోర్టుకు తరలించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని ఆయన చెప్పారు. -
రైల్వే అర్బన్ బ్యాంక్ వాటాదారులకు లాభసాటి సౌకర్యాలు
భువనేశ్వర్: ఖుర్దారోడ్ రైల్వే మండలం రైల్వే అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ వాటాదారులకు పలు ఆకర్షణీయమైన లాభసాటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు డైరెక్టర్ జగ్మోహన్ ఖుంటియా తెలిపారు. రుణాలపై వడ్డీ 1 శాతం తగ్గింపు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ 6 శాతం నుంచి 8.5 శాతానికి పెంపుదల, పొదుపు సొమ్ముపై వడ్డీని 5 శాతం నుంచి 7.5 శాతానికి పెంచడంతో అయోధ్య, తిరుపతి వంటి ప్రముఖ పర్యాటక, పుణ్య క్షేత్రాల్లో సులభ ధరలకు సౌకర్యవంతమైన వసతితో కూడిన విహార విడిది గృహాల సౌకర్యం, హైదరాబాద్లోని యశోద, బొంబాయిలోని టాటా మెమోరియల్లో రోగుల సహాయకులకు రోజుకు రూ.100 చొప్పున వసతి సదుపాయాలు ప్రముఖమైనవిగా పేర్కొన్నారు. త్వరలో రుణ పరిమితి విస్తరణ, గహ రుణాలు, విద్యా రుణాలపై వడ్డీ తగ్గింపు వంటి చర్యల ద్వారా వాటాదారులు ఇకపై విదేశీ బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ముఖ్య అతిథి అన్నారు. బ్యాంకులోని 40 ఖాళీ పోస్టులకు వాటాదారుల పిల్లలకు మెరిట్ ఆధారంగా నియమించేందుకు యోచిస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఒకే రోజున ఉత్తీర్ణుల ఫలితాలతో నియామక పత్రాలను పంపిణీ చేసే ప్రతిపాదన పాలక మండలి పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. పదవీ విరమణ చేసిన వాటాదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లు, హాలిడే హోమ్లలో వసతి కల్పించాలని శాఖ కార్యదర్శి లక్ష్మీధర్ మహంతి చేసిన ప్రతిపాదన తదుపరి డైరెక్టర్ల సమావేశంలో చర్చించి ఆమోదిస్తామని హామీ ఇచ్చారు. బ్యాంక్ మేనేజర్ పి. చక్రవర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి తూర్పు కోస్తా రైల్వే శ్రామిక కాంగ్రెస్ మండల సమన్వయకర్త, డైరెక్టర్ నిరంజన్ మిశ్రా తదితరులు హాజరయ్యారు. -
మల్కన్గిరిలో మామిడి మేళా ప్రారంభం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని పాత మెడికల్ కళాశాల మైదానం మామిడిపండ్ల మేళాను మంగళవారం ప్రారంభమైంది. జిల్లా పరిపాలన, ఓర్మాస్ సంయుక్త ఆధ్వర్యంలో మేళాను నిర్వహిస్తున్నారు.మల్కన్గిరి గిరిజన రుతులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల పర్యవేక్షణలో ఈ నెల ఐదో తేదీ వరకు నిర్వహించనున్న మేళాను జిల్లా అదనపు కలెక్టర్ వెద్బ్ర్ ప్రధాన్ ప్రారంభించారు. మేళాలో 20 రకాల మామిడి పండ్లను విక్రయాల కోసం రైతులు తీసుకొచ్చారు. స్వయం సహాయక సంఘాల మహిళలు మామిడితో చేసిన వివిధ రకాల పానియాలను విక్రయిస్తున్నారు. మామిడి పానకం, మ్యాంగో షేక్ ప్రత్యేక అకర్షణగా నిలిచింది. మేళా ప్రారంభ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాబు, ఓర్మాస్ కార్యనిర్వహక అధికారి స్వస్తికా ప్రధన్, వ్యాపారులు జితేంధ్ర కుమార్ పాత్రో, అమిత్ కుమార్, అధికారులు మమతా మహాపాత్రో, శ్యామ్ ముదిలి, జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు బాలాజీ పట్నాయక్, మానాస్ మిశ్రో, హిమాన్షు మహరాణా పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధిపై సమీక్ష
మల్కన్గిరి: వికసిత ఒడిశా విజన్ 2036–47 లక్ష్యంగా రాష్ట్రంలో అమలవుతున్న మోడల్ విలేజ్ విజన్, స్వాభిమాన్ ప్రాంతాభివృద్ధి కోసం కొనసాగుతున్న సేతు పథకంపై ఉన్నత స్థాయి సంయుక్త సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. మల్కన్గిరి జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ హాల్లో జరిగిన సమావేశంలో చిత్రకొండ సమితి స్వాభిమాన్ ప్రాంతంతో పాటు మొత్తం జిల్లా సమగ్ర అభివృద్ధి, రూపాంతరణపై విస్తృత కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ సందర్భంగా జిల్లా ముఖ్యఅభివృద్ధి అధికారి దశరాథి సరాబు మోడల్ విలేజ్ మిషన్ అమలు విధానాన్ని వివరించారు. గ్రామాలకు, పట్టణస్థాయి సౌకర్యాలను అందించి.. వాటిని స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దడమే మిషన్ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలోని 111 గ్రామ పంచాయతీలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ప్రత్యేకంగా చిత్రకొండ సమితిలోని 18 పంచాయతీలు, కోరుకొండ సమితిలో నక్కమామిడి పంచాయితీ చేర్చబడ్డాయి. ఇటీవల నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఎస్ఐఆర్పై అవగాహన
రాయగడ: కొండలు, అడవులు, భాషా అవరోధాలను అధిగమిస్తూ జిల్లా యంత్రాంగం స్వతంత్ర సఘన సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని నియమగిరి కొండల ప్రాంతంలో నివసిస్తున్న ఫకేరి గ్రామంలో నివసిస్తున్న డొంగిరియా తెగకు చెందిన ఆదిమ ఆదివాసీ ప్రాంతంలో చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని 139–బిసంకటక్ అసెంబ్లీ నియోజకవర్గం పరిఽధిలో ఉన్న ఈ గ్రామంలో ఓటరు అవగాహన కల్పించడం, ఎన్యూమరేషన్ ఫారమ్ల పంపిణీ కార్యక్రమాన్ని సంబంధత శాఖ అధికారులు విజయవంతంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ నాయకత్వంలో కళ్యాణసింగుపూర్ సమతి బీడీవో మనీషా దాస్, డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ సాహు, పీఈవో శ్వేతాంబర్ ప్రధాన్ తదితరులు ఫకేరీ గ్రామానికి అత్యంత ప్రయాసపడి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ డొంగిరియా గోండి భాషలో గ్రామస్తులతో మాట్లాడి ఎస్ఐఆర్–2026 లక్ష్యాలు, ప్రాధాన్యత, ప్రక్రియ గురించి వివరించారు. జిల్లా యంత్రాంగం ఈ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా గిరిజన సముదాయాలను ప్రజాస్వామ్య ప్రక్రియలో మరింత భాగస్వాములను చేయగలిగింది. ప్రజల మాతృభాషలో అవగాహన కల్పించడం వల్ల ఈ కార్యక్రమం మరింత సులభంగా విజయవంతమవుతుందని అధికారులు పేర్కొన్నారు. -
కవితా గానం.. చరిత్ర పఠనం
జయపురం: స్థానిక పూజ్యపూజ్ సంసద్ వారు సోమవారం సాహితీ సభలో ఒడిశా కవిసామ్రాట్ ఉపేంధ్ర భంజ్ కవితలపైన, ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు రాధామోహన్ సాహుపై ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు కవిసామ్రాట్ ఉపేంద్ర చిత్రాలను గీశారు. సరస్వతీ శిశుమందిర విద్యార్థులు ఆరాధ్య కౌశిక్, అనితా కౌశిక్లు ఉపేంధ్ర భంజ్పై రాసిన వ్యాసాలను చదివి వినిపించారు. స్వాతంత్య్ర యోధులు రాధామోహన్ సాహు జీవిత చరిత్రను సరస్వతీ శిశుమందిర విద్యార్థిని సంస్కృతి సామంతరాయ్ చదివి వినిపించి ఆ వ్యాసాన్ని సభకు అందజేశారు. పూజ్య పూజ సంసద్ అద్యక్షులు ఉదయ శంకర జాని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌరవ అతిథిగా పతంజలి విభాగ అధ్యక్షురాలు జానకీ పాణిగ్రహి ఒడియా సాహిత్యంపై కవి సామ్రాట్ ఉపేంధ్ర భంజ్ ప్రభావం, సమాజాన్ని చైతన్యపరచే ఆయన రచనలపై ప్రసంగించారు. అలాగనే అలాగనే స్వాతంత్య్ర ఉద్యమంలో కొరాపుట్ జిల్లా భూమిక స్వాతంత్య్ర యోధులలో రాధామోహన్ సాహు పోరాట పటిమలపై ఆమె ప్రసంగించారు. 10 క్వింటాళ్ల గంజాయి పట్టివేత మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి పోలీసులు ఆదివారం రాత్రి అక్రమ రవాణాకు సిద్ధం చేసిన భారీ గంజాయిను పట్టుకున్నారు. చిత్రకొండ సమితి గుంఠబేఢ పంచాయతీ ఆరంగి గ్రామ అడవిలో ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు గంజాయిని నిల్వ ఉంచారు. పోలీసులకు ముందస్తుగా సమాచారం అందడంతో ఐఐసీ జయనారాయణ్ ఖండేయ్ తన సిబ్బందితో ఆదివారం రాత్రి దాడి చేయగా పోలీసుల రాకను తెలుసుకున్న మాఫియా సభ్యులు పరారయ్యారు. అక్కడ ఉన్న గంజాయి బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. సోమవారం గంజాయిను తూకం వేయగా 10 క్వింటాళ్లు ఉంది. దీని విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. విద్యుత్ వాహనాల కొనుగోలుకు మార్గదర్శకాలు జారీ భువనేశ్వర్: ప్రభుత్వ కార్యకలాపాల్లో వినియోగించే విద్యుత్ వాహనాల (ఈవీల) కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. పశ్చిమ ఆసియాలో తాండవిస్తున్న సంక్లిష్ట పరిస్థితుల దష్ట్యా ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలు అవుతాయి. తాజా నిబంధనల ప్రకారం ఒక అధికారి ఒక వాహనం ప్రాతిపదికన గవర్నర్, ముఖ్యమంత్రి, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి, మంత్రులు రూ. 30 లక్షల వరకు విలువైన ఈవీలను కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ కార్యదర్శి, అభివృద్ధి కమిషనర్, శాఖా కార్యదర్శులు రూ. 25 లక్షల వరకు ఖరీదు చేసే ఈవీలకు అర్హులు కాగా జిల్లా కోర్టు న్యాయమూర్తులు, కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు రూ. 20 లక్షల వరకు విలువైన టాటా, మహీంద్రా, మారుతీ కంపెనీల ఉత్పాదిత ఈవీలను కొనుగోలు చేయవచ్చు. వాహనాల కొనుగోలుకు ఆర్థిక శాఖ ఆమోదం అవసరం. ప్రస్తుతం ఉన్న అధికారిక వాహనం నిర్దేశిత సేవా కాలాన్ని పూర్తి చేసు కున్న తర్వాతే ఈ కొనుగోలుకు అనుమతిస్తారు. మహేంద్రగిరి, కోయిపూర్ వద్ద కుండపోత పర్లాకిమిడి: మహేంద్రగిరిలో విశ్వశాంతి యజ్ఞం సందర్భంగా పవిత్ర కలశాలు యజ్ఞం వద్ద ఉంచిన తర్వాత మహేంద్ర నుండి కోయిపూర్ వరకూ గంటన్నర సేపు కుండపోత వర్షం కురిసింది. దీంతో మహంద్ర పర్వతానికి వెళ్లిన భక్తులు తడిసి ముద్దయ్యారు. దీంతో పలువురు మహిళలు తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. -
మత్తు ఇంజెక్షన్ల వ్యాపారం చేస్తున్న ఐదుగురు అరెస్టు
జయపురం: జయపురంలో నిషా ఇంజెక్షన్ల వ్యాపారానికి పోలీసులు చెక్ పెట్టారు. నిషా ఇంజెక్షన్లు తీసుకు వచ్చి జయపురం కేంద్రంగా వ్యాపారం చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ.40 వేల విలువ చేసే 750 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ తెలిపారు. వ్యాపారానికి వినియోగించే కారుతో పాటు రూ.15 వేలు నగదు, 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. అరెస్టన నిందితులు జయపురం సౌరాసాహి దేబాసిస్ పట్నాయిక్(29), స్థానిక పారాబెడ వాసి తాపస సాహు(29), జయపురం డొంగాగుడ వాసి రామ హరిజన్(34), క్రిష్టియన్ పేట నివాసి ప్రదీప్ ఖోర ఉరఫ్ రోణి(25) స్థానిక పూర్ణగడ్ నివాసి సూరజ కుమార్ గుప్త ఉరఫ్ సోను(29)లు అని వెల్లడించారు. వీరిలో రామ హరిజన్, సూరజ కుమార్ లను గత ఏడాది పట్టణ పోలీసు అధికారులు నిషా ఇంజెక్షన్ల వ్యవహారంలో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. గత అర్ధరాత్రి గాంధీ చౌక్ నుంచి గొడొపొదర్ కెనాల్ రోడ్డు లో సంధ్యా ఫంక్షన్ హాల్ సమీపంలో కొంత మందితో నిషా ఇంజెక్షన్ల వ్యాపారం జరుగుతుందని సమాచారం అందడంతో పట్టణ పోలీసులు వెంటనే వెళ్లి దాడి జరిపారు. అక్కడ ఆరుగురు ఉండగా ఒకడు పారిపోయాడు. ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఇంజెక్షన్లను డాక్టర్లు మత్తు ఇచ్చే క్రమంలో వినియోగిస్తారు. -
మంటల్లో దగ్ధమైన అంబులెన్స్
భువనేశ్వర్: స్థానిక ఖండగిరి సమీపం జగమొర ప్రాంతంలో అంబులెన్స్ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. సోమవారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఉదయం 4.30 గంటలకు కటక్ ప్రాంతానికి రోగిని తరలించి తిరిగి వచ్చి పార్క్ చేసి ఉండగా ఉదయం 6 గంటల ప్రాంతంలో అందులో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. అదృష్టవశాత్తూ అప్పటికే డ్రైవర్తో పాటు సహాయకుడు వాహనం నుంచి దిగి వారి గదులలో విశ్రాంతి తీసుకుంటుండటంతో ఎలాంటి గాయాలు లేదా ప్రాణ నష్టం జరగలేదు. నగర పాలక సంస్థ (బీఎంసీ) పారిశుద్ధ్య కార్మికుడు వాహనాన్ని చుట్టుముడుతున్న మంటలను గమనించి స్థానికులు, అగ్ని మాపక విభాగాన్ని అప్రమత్తం చేశాడు. అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫోమ్ ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలను ఆర్పి వేసే సమయానికి అంబులెన్స్ తీవ్రంగా దెబ్బతిని చాలా భాగం కాలిపోయింది. ఇంజిన్ బేలో సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
యువత క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలి
● రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి రాయగడ: యువత క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, బిజూ స్వాభిమాన్ మంచ్ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరరావు అన్నారు. జిల్లాలోని సదరు సమితి కర్లకొణ గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటు ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో ఆసక్తి కనబరిచే యువత ఆయా రంగాల్లో రాణించాలంటే అందుకు కృషి, శ్రమతో పాటు సహనం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇటువంటి తరహా పోటీల్లొ పాల్గొంటే వారికి నైపుణ్యం మెరుగుపడటంతో పాటు ప్రతిభను కూడా కనబరిచే అవకాశం ఉంటుందన్నారు. అతిథులుగా మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, ఆదిత్య లాజిస్టిక్స్ ఎండీ కృష్ణ చైతన్య, కర్లకొణ సర్పంచ్ నీలాంబర్ బిడిక, సమితి సభ్యురాలు బందనా అటక, యువ నాయకుడు తపన్ పెద్దింటి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూత్ క్లబ్ అధ్యక్షుడు సదానంద పెద్దింటి పాల్గొన్నారు. కాగా సోమవారం కులిజింగ్, కర్లకొణ జట్ల మధ్య ఫైనల్పోరు రసవత్తరంగా జరిగింది. విజేతగా కలజింగ్ జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు 15 వేల రూపాయల నగదు బహుమతిని, రన్నర్ జట్టుకు ట్రోఫీని ముఖ్యఅతిథి నెక్కంటి అందజేశారు. -
కలశ యాత్రకు పోటెత్తిన భక్తులు
పర్లాకిమిడి: మహేంద్రగిరి పర్వతంపై పురషోత్తమాసం సందర్భంగా సోమవారం అంగరంగవైభవంగా బుర్ఖాత్ పాస్ నుంచి మహేంద్రగిరి పర్వతం వరకూ మహిళలు పెద్ద ఎత్తున కలశ యాత్ర జరిపారు. దాదాపు బుర్ఖాత్ పాస్ నుంచి ఆరు కిలో మీటర్లు కాలినడకన కొండపైకి వెళ్లి పవిత్ర మహేంద్ర పర్వతం పై జరుగుతున్న విశ్వయజ్ఞం వద్ద ఉంచారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాలోకానంద, సత్యనారాయణ దాస్, అంతర్యామి గోమాంగో, రాయగడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్ పాల్గొన్నారు. అలాగే విశ్వహిందూపరిషత్ నాయకులు, భజరంగ్దళ్ నాయకులు రాయగడ, పర్లాకిమిడి, కొరాపుట్, నయాఘడ్, గంజాం, ఫుల్బణి నుంచి విచ్చేశారు. బుర్ఖాత్ పాస్ వద్ద నుంచి మహిళలు పసుపురంగు చీరలు ధరించి పవిత్ర కలశాలను పట్టుకుని నడిచి మహేంద్రగిరికి చేరుకున్నారు. మహిళలు కుంతీ మందిరం వద్ద అభిషేకాలు చేయించారు. ఆదివాసీ సవర సంస్కృతి తలపిస్తూ వారి వాయిద్యాలతో నాట్యాలు చేసి ఆనందోత్సవాలమధ్య విశ్వశాంతి యజ్ఞానికి సహకరించారు. ఈ సందర్భంగా భాస్కరతీర్థ లక్ష్మీబాబా మాట్లాడుతూ, ఈ పురుషోత్తం మాసంలోపవిత్ర మహేంద్రగిరికి వస్తే ప్రతి ఒక్కరికి పుణ్యం కలుగుతోంది. నేటి నుంచి కలశ యాత్ర, హరిహారాత్మక యజ్ఞం, చండీ మహాయజ్ఞం, జ్ఞాణ, ఆర్ణ యజ్ఞం, పూర్య యజ్ఞం వంటివి జరుగుతాయి. అలాగే భాగవతం, రామాయణ మానస చరిత్రను వేదపండితులు పఠిస్తారు. దేశంలోని నలుమూలలనుండి అనే మంది సాధుసంతువులు ఇక్కడకు విచ్చేశారు. వారి ఈ తొమ్మిది రోజుల పాటు పలు యజ్ఞాలను నిర్వహిస్తారు. జూన్ 15 న తిరిగి ఈ సాధుసంతువులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని, అలాగే కలశయాత్రకు 10వేల మంది మహిళలు వస్తారని అన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడా జూన్ 2 మంగళవారం మహంద్రగిరిలో జరుగుతున్న మహేంద్రమేళాకి విచ్చేస్తారని పలువురు అధికారులు తెలియజేశారు. -
గ్రీవెన్స్లో 28 సమస్యలు పరిష్కారం
రాయగడ: స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్కు మంచి స్పందన లభించింది. ప్రజల బాధలు తెలుసుకున్న కలెక్టర్ వేదిక వద్దే 28 సమస్యలను పరిష్కరించారు. అలాగే వచ్చిన 65 వినతుల్లో భాగంగా మరో ఐదుగురికి రెడ్ క్రాస్ నిధుల నుంచి 76 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మిగిలిన వినతులను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజ్ ప్రసాద్, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్నా, డీఎఫ్వో సచిన్ అన్నాసాహెబ్ అహలే, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ మిశ్రో, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ కెముండో , ఇతర శాఖల అధికారులు,ఉద్యొగులు పాల్గొన్నారు. -
92 శాతం ప్రజా ఫిర్యాదులు పరిష్కారం
భువనేశ్వర్: స్థానిక యూనిట్ 2లోని సోమవారం జరిగిన ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ శిబిరంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రజల ఫిర్యాదులను ప్రత్యక్షంగా పరిశీలించి తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి వర్గంలో 13 మంది సీనియర్ మంత్రులు హాజరై ప్రజల ఫిర్యాదులను విన్నారు. సోమవారం ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటి ద్వారా 600కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. రెండేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వరుసగా 18 సార్లు ప్రజా ఫిర్యాదుల విచారణలో పాలుపంచుకోవడం విశేషం. తొలుత బయట వేచి ఉన్న 30 మంది దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని కలిసి వారి సమస్యలను విన్నారు. వారి ఫిర్యాదు పత్రాలను స్వీకరించి తక్షణ చర్యలు తీసుకోవాలని అక్కడున్న అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత గది లోపల నమోదు చేసుకున్న ఫిర్యాదుదారుల ఫిర్యాదులను పరిష్కరించారు. సింగిల్ విండో వ్యవస్థ ద్వారా వివిధ వ్యాధులతో బాధపడుతున్న సుమారు 13 మంది ఫిర్యాదుదారులకు వైద్య సహాయంగా రూ. 3.60 లక్షలు ముఖ్యమంత్రి మంజూరు చేశారు. నయాగఢ్ జిల్లాకు చెందిన కామాక్షి సాహు కుమారుడి దుర్ఘటన మృతికి కారుణ్య సహాయంగా ముఖ్యమంత్రి రూ. 2 లక్షలు మంజూరు చేశారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్లు ప్రజల సమస్యలను క్రమం తప్పకుండా వింటుండగా, తహసీల్, మండల స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారం నిరంతరం కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు జిల్లా స్థాయిలో 2.40 లక్షల ఫిర్యాదులను విచారించగా వాటిలో 92 శాతం పరిష్కరించినట్లు తెలిపారు. -
కొంచాసు మామిడి పరిరక్షణ
జయపురం: కొరాపుట్ జిల్లాలో పేరెన్నికగన్న కొంచాసు మామిడి రానురాను కనుమరుగవుతోంది. కొంచాసు మామిడి కాయలను గ్రామీణ ఆదివాసీ ప్రజలు పట్టణాల రోడ్డు సైడ్లలో కాయలను పోగులు వేసి అమ్ముతారు. మామిడి సీజన్ వచ్చిందంటే కొంచాసు మామిడి కాయల కోసం ప్రజలు ఎదురు చూసేవారు. ప్రస్తుతం ఈ కాయలు మార్కెట్లో కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఒక పాత్రికేయుడు కొరాపుట్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో కలెక్టర్ స్పందించి కొరాపుట్ జిల్లాలో తప్ప మరే ప్రాంతంలో కనిపించని కొంచాసు మామిడి మొక్కలను పెంచేందుకు ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని జయపురం ఉద్యానవన విభాగ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశం మేరకు జయపురం ఉద్యానవన విభాగ డిప్యూటీ డైరెక్టర్ సంజీవ కుమార్ మహంత, ఉద్యానవన సహాయకుడు శేఖర్ చంఽద్రదాస్లు అతి కష్టంతో కొంచాసు మామిడి టెంకలను సేకరించి వాటిని ఒక ప్రత్యేక నర్సరీలో నాటారు. మొక్కలు మొలకెత్తటంతో వాటిని జయపురం సమితి హొరడాపుట్ నర్సరీలో 1500 మొక్కలను పెంచారు. ఒక మొక్కను రూ.45కు అందజేయాలని నిర్ణయించినా, ఈ అపూర్వ జాతి కొంచాసు మామిడి మరింత చౌకగా రైతుకు, ప్రజలకు అందేటట్టు చేసేందుకు రాయితీ ప్రకటించి కేవలం రూ.20 లకే అందిస్తున్నట్లు జయపురం ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ సంజీవ కుమార్ మహంత నేడు పత్రికల వారికి వెల్లడించారు. -
జయపురం దేవదాయ కమిటీ అధ్యక్షునిగా దేవేంద్ర బాహిణీపతి
జయపురం: జయపురం దేవదాయ కమిటీ నూతన అధ్యక్షునిగా కాంగ్రెస్ నేత, జయపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు దేవేంద్ర బాహిణీపతి ఎన్నికయ్యారు. జయపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో దేవదాయ పరిచాలన కమిటీ ఎన్నికకు ఏకగ్రీవంగా కమిటీ అధ్యక్షునిగా ఎన్నిక చేయాలన్న ప్రయత్నం ఫలించకపోవటంతో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్ష పదవికి బాహిణీపతితో సందీప్ సామంతరాయ్ తలపడ్డారు. దేవేంద్ర బాహిణీపతికి 9 మంది ఓటు వేయగా, సామంతరాయ్కు 6 ఓట్లు వచ్చాయి. వ్యక్తి సజీవ దహనం భువనేశ్వర్: బాలాసోర్ ప్రాంతంలోని ఐటీఐ రోడ్డులో ఉన్న రసాయన కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పారిశ్రామిక వాడ పోలీస్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం ప్రత్యక్షంగా సందర్శించారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలంలో మంటలను అదుపులోకి తెచ్చారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టు రాయగడ: సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బైక్ దొంగతనం కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టుకు తరలించారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేశామని ఐఐసీ ప్రసన్నకుమార్ బెహర తెలిపారు. కన్యకాపరమేశ్వరికి ప్రత్యేక పూజలు రాయగడ: పట్టణంలోని కొరాపుట్ కూడలిలో వైశ్యుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి మందిరంలో ఆదివారం అధిక జ్యేష్ఠపౌర్ణమి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని మామిడి పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం 7.30 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కుంకుమ, గులాబీ రేకులు, మల్లెపూలతో 108 అష్టోత్తర శతనామావళి పఠనంతో భవ్యమైన పూజ నిర్వహించారు. విశేష పూజల్లో పాల్గొన్న భక్తులకు అఖండ సౌభాగ్యం, అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సిద్ధించడంతో పాటు గ్రహ దోష నివారణ కలిగి అమ్మవారి అనుగ్రహం లభిస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. అనంతరం నిర్వహించిన కుంకుమపూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
● అస్నా గ్రామ పంచాయతీలో క్రీడా సందడిజయపురం: జయపురం సబ్డివిజన్ కుంధ్ర సమితి అస్నా గ్రామ పంచాయతీలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మొదటి ఆటలో ముర్జా గ్రామ టీమ్ విజయం సాధించింది. ప్రారంభ పోటీలో ముర్జ గ్రామ టీమ్ కందులిముండ టీమ్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ముర్జా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పద ఓవర్లలో 120 పరుగులు చేసింది. 121 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కందులిముండ టీమ్ నిర్ణీత పది ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రం చేయగలిగింది. దీంతో ముర్జ గ్రామ జట్టు 23 పరుగుల ఆధిక్యతతో విజయాన్ని దక్కించుకుంది. పోటీలను దివాకర గౌఢ, మీనకేతన గౌఢ, నరశింహ గౌడ్, దిలీప్ గౌడ్, ఘన గౌఢలు పర్యవేక్షించారు. పోటీలను కొరాపుట్ జిల్లా భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యదర్శి చంద్ర శేఖర రథ్ ముఖ్యఅతిథిగా హాజరై టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల దుర్గమ ప్రాంతం అస్నా గ్రామ పంచాయతీలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించటం ఈ ప్రాంత యువత క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు అవసరమైన వనరులు సమకూర్చుతుందని అన్నారు. ఆటలలో గెలుపు ఓటమిలు ప్రధానం కాదన్నారు. మానసిక, శారీరక వికాసానికి క్రీడలు దోహద పడతాయన్నారు. క్రీడాకారులు ఆటలలో రాణించి రాష్ట్ర, జాతీయ క్రీడారంగంలో జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. టోర్నమెంట్లో 16 జట్టు పాల్గుంటున్నాయి. టోర్నమెంట్ 15 రోజులు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో కొట్పాడ్ ఎంఎల్ఏ ప్రతినిధి బద్రి నారాయణ ఆచార్య, కొరాపుట్ జిల్లా ఐటీ సెల్ కోఆర్డినేటర్ సంతోష్ ప్రహరాజ్, దిగాపూర్ బీజేపీ మండల అధ్యక్షులు ధనపతి పొరజ,లయిచన్ గౌఢ,సుబాష్ మఝి అతిథులుగా హాజరయ్యారు. -
ఖుర్దా రోడ్ రైల్వే స్టేషన్ తనిఖీ
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ఖుర్దా రోడ్ రైల్వే స్టేషన్ను సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, స్టేషన్ సదుపాయాలు, పరిశుభ్రత, క్యాటరింగ్ సేవలను సమీక్షించడంపై దృష్టి సారించారు. ఆయనతో ఖుర్దా రోడ్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డి.సునీల్ పాల్గొన్నారు. తనిఖీ సందర్భంగా, పరమేశ్వర్ ఫంక్వాల్ బుకింగ్ కార్యాలయాలు, ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాలు, రాకపోకల ప్రాంతాలు, ఫుట్ ఓవర్బ్రిడ్జ్లు, ప్లాట్ఫారాలు, క్యాటరింగ్ యూనిట్లతో సహా స్టేషన్లోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఆయన అధికారులతో మాట్లాడి స్టేషన్లో అందిస్తున్న ప్రయాణికుల సేవల నాణ్యతను సమీక్షించారు. జనరల్ మేనేజర్ భద్రత, ప్రయాణికుల రద్దీ నిర్వహణ, పరిశుభ్రత, స్టేషన్ ప్రాంగణ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. పరిశుభ్రత, ప్రయాణికుల సౌకర్యాలు, వినియోగదారుల సంతృప్తి విషయంలో ఉన్నత ప్రామాణికలను పాటించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ప్రయాణికుల సమస్యలను తక్షణమే, సమర్థంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సురక్షితమైన, సమర్థమైన, భద్రతతో కూడిన సౌకర్యవంతమైన రైల్వే సేవలను అందించడంలో నిరంతరం పర్యవేక్షించాలని జనరల్ మేనేజర్ తెలిపారు. ప్రయాణికుల కేంద్రీకత అభివృద్ధి, సేవా శ్రేష్టతపై దష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు. -
ఓటరు జాబితా సవరణ ఫారాల పంపిణీ
రాయగడ: జిల్లాలోని నియమగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు బిసంకటక్ నియోజకవర్గం ఎన్నికల నమోదు అధికారి నవీన్ చంద్ర నాయక్ పర్యవేక్షణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా అధికారులు నియమగిరి గిరిజన గ్రామాలను సందర్శించారు. అర్హులైన ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. బీడీఓ శివప్రసాద్ పట్నాయక్, జీపీడీఓ సుదీప్ కృష్ణబెహర, సూపర్వైజర్ హరిదాస్ భొత్ర, బూత్ స్థాయి అధికారులు ఉమేష్ పెద్దింటి, భీమా కౌసల్య, తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత దంత వైద్య శిబిరం
జయపురం: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా భారత దంత వైద్యుల సంఘం జయపురం శాఖ ఆధ్వర్యంలో స్థానిక పట్టణ పోలీసుస్టేషన్లో ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పోలీసు సిబ్బందితోపాటు స్థానిక ప్రజలకు వైద్యులు దంత పరీక్షలు చేసి మందులు అందజేశారు. దంత పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. శిబిరంలో వందమందికి పైగా దంత రోగులు చికిత్స పొందినట్లు భారత దంత వైద్యుల సంఘం జయపురం శాఖ అధ్యక్షుడు డాక్టర్ రూపేష్ కుమార్ బెవురియ వెల్లడించారు. జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారిణి అర్చిత మిత్తల్, జయపురం పట్టణ పోలీసు అధికారులు శిబిరం నిర్వహణకు సహకరించారు. సంఘ మాజీ అధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ దాస్, ఉపాధ్యక్షులు డాక్టర్ సంతోష్ కుమార్ నాయిక్, డాక్టర్ అమిత్ దాస్, కోశాధికారి డాక్టర్ దేవ దేవరాహన్ బిశాయి, డాక్టర్ ఎస్.నారాయణ, డాక్టర్ రిచార్డ్ ఆశ, డాక్టర్ నిగమానంద బెహర, డాక్టర్ ఎస్.పూజ, డాక్టర్ శుభశ్రీ డాకువ, డాక్టర్ పి.సుచిత్ర పాల్గొన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతి
రణస్థలం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కొమర లక్ష్మణ శనివారం చింతపల్లి సమీపంలో సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం రణస్థలం మండలంలోని కొవ్వాడ సముద్ర తీరంలో కొమర లక్ష్మణ మృతదేహం లభ్యమైంది. జే.ఆర్.పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేశారు. పీఆర్ ఏఈ కృష్ణారావుకు సన్మానం టెక్కలి: టెక్కలి డివిజన్ పంచాయతీరాజ్ ఏఈ కణితి కృష్ణారావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆదివారం పట్టణంలో ఆత్మీయులు, అధికారుల సమక్షంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణారావు, సుబ్బమ్మ దంపతులను సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో ఈఈ సూర్యప్రకాశ్, ప్రదీప్కుమార్, విశ్రాంత ఎస్ఈ కేఎంవీ ప్రసాదరావు, కేసీహెచ్ మహంతి, మురళీమోహన్, మందస, కంచిలి ఎంపీపీలు డి.దానయ్య, పి.దేవదాస్రెడ్డి, కంచిలి ఎంపీడీవో వి.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం క్రైమ్: శ్రీకాకుళానికి చెందిన దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీలో ఉంటున్న ఓ రూమ్లో ఫ్యాన్కు తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీలో రూమ్ తీసుకుని గ్రూప్–2,పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. రూమ్ పక్కనే ఉన్న రీడింగ్ రూమ్కు చదువుకోవడానికి వెళ్లి తిరిగి రూమ్కు వచ్చి తనకు పని ఉందని సహచర స్నేహితురాలు మౌనికకు చెప్పి పై రూమ్లోకి వెళ్లింది. ఎంతకీ దుర్గాభవాని పై రూమ్లోనుంచి రాకపోవడంతో మౌనిక వెంటనే విజయనగరంలోనే ఉంటున్న దుర్గాభవాని సోదరుడికి ఫోన్లో విషయం తెలియజేసింది. దీంతో సోదరుడు వెంటనే వచ్చి పై రూమ్ తలుపులు పగలగొట్టి లోపల దుర్గాభవాని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి ఆమెను కిందికి దించి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వేడి నుంచి ఉపశమనం మండే ఎండలు, ఉక్కపోతల నుంచి శ్రీకాకుళం నగర ప్రజలు స్విమ్మింగ్తో ఉపశమనం పొంతున్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్విమ్మింగ్ పూల్ స్విమ్మర్లతో కిటకిటలాడుతోంది. ఉదయం, సాయంత్రం ఈత కొడుతూ సేదతీరుతున్నారు. వీరికి డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది రక్షణ కల్పిస్తున్నారు. పలు సూచనలు చేస్తున్నారు. – శ్రీకాకుళం న్యూకాలనీ -
జిల్లా కేంద్రంలో కార్డన్ సెర్చ్
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధి పెద్దరెల్లివీధిలో ఆదివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 70 మంది సిబ్బందితో 250 ఇళ్లను సెర్చ్ చేసి సరైన పత్రాలు, రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. సీఐ పి.ఈశ్వరరావు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి, మద్యం, ఇతర అనధికార పేలుడు పదార్థాల అక్రమ నిల్వలు, అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచాలనే ఉద్దేశంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు సెర్చ్ చేసినట్లు తెలిపారు. వ్యక్తుల ఆధార్కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు, వాహనాల రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఐలు హేమంత్ కల్యాణ్, చంద్రకళ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి: జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు సత్వర సేవలందించడంలో ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఉత్తమ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారని విద్యుత్ శాఖ ఇంజినీర్లు ప్రశంసించారు. సర్కిల్ ఎస్ఈగా పనిచేసిన నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆదివారం ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా స్థానిక విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ ఆవరణలో కృష్ణమూర్తి దంపతులను విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, సిబ్బంది సంయుక్తంగా ఘనంగా సత్కరించారు. జిల్లా సర్కిల్లో ఎస్ఈ హోదాలో ఉన్నతాధికారులతో ఎంతో గౌరవాన్ని పొంది.. తద్వారా జిల్లా సర్కిల్కు మంచి గుర్తింపు తెచ్చారని వక్తలు కొనియాడారు. అత్యధిక కాలం జిల్లా ఎస్ఈగా పనిచేసి, ఇక్కడే పదవీ విరమణ చేస్తూ రికార్డు సృష్టించారని ఇన్చార్జి ఎస్ఈ సురేష్కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పైడి యోగేశ్వరరావు, బయ్యన్నాయుడు, నరసింగ్కుమార్, యజ్ఞేశ్వరరావు, విష్ణుమూర్తి, విశ్రాంత విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు, ఎస్ఈవో శ్రీనివాసరావు, ఏఏవోలు మహంతి ప్రభాకరరావు, సుదర్శనరావు, జేఏవోలు సనపల వెంకటరావు, ఆర్.శ్రీనివాస్, ఏఈలు జె.సురేష్కుమార్, కె.జయరాం, కమల్హాసన్, జిల్లా విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
వర్సిటీలు ఎదగాలి: గవర్నర్
భారతీయ విలువలతోభువనేశ్వర్: ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో భవిష్యత్ సవాళ్లకు రాష్ట్రాన్ని సిద్ధం చేయడంలో ఉన్నత విద్యా సంస్థలు కీలక పాత్ర పోషించాలని, ఒడిశాలోని విశ్వ విద్యాలయాలు భారతీయ విలువలలో లోతుగా పాతుకుపోయి, ప్రపంచ స్థాయిలో పోటీపడగల సామాజిక బాధ్యత కలిగిన, సాంకేతికంగా అభివద్ధి చెందిన సంస్థలుగా ఎదగాలని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆది వారం పిలుపునిచ్చారు. లోక్ భవన్ న్యూ అభిషేక్ హాల్లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల సదస్సులో ప్రసంగిస్తూ ఒడిశాలో ఉన్నత విద్య భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఈ సమావేశం ఒక ముఖ్యమైన సామూహిక ప్రయత్నమని గవర్నర్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక సమాచార శాఖల మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద గోండ్, పరిశ్రమల శాఖ మంత్రి సంపద్ చంద్ర స్వంయి, ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వైస్చాన్స్లర్లకు గవర్నరు స్వాగతం పలుకుతూ విశ్వ విద్యాలయాలు జ్ఞానం, ఆవిష్కరణలు, నాయకత్వానికి కేంద్రాలు. దేశ నిర్మాణంలో వాటికి కీలక బాధ్యత ఉందన్నారు. వేగవంతమైన సాంకేతిక పురోగతులు, కొత్తగా వస్తున్న విజ్ఞాన శాస్త్రాలు, మారుతున్న ప్రపంచ సవాళ్ల కారణంగా ప్రపంచం అపూర్వమైన పరివర్తనకు లోనవుతూ మరింత సంక్లిష్టంగా మారుతున్న భవిష్యత్తును ఎదుర్కోవడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, విలువలతో ఉన్నత విద్యా సంస్థలు విద్యార్థులను సన్నద్ధం చేయాలని గవర్నర్ ప్రేరేపించారు. విశ్వ విద్యాలయాలు వ్యవస్థాపకతను, ఆవిష్కరణలను ప్రోత్సహించాలని, తద్వారా యువతను సమాజంలో వృద్ధి, అభివృద్ధికి ఉత్ప్రేరకాలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం (ఎనన్ఈపీ) 2020 విధానం బహుళ విజ్ఞానశాస్త్ర విద్య, విద్యాపరమైన సౌలభ్యం, నైపుణ్యాల ఏకీకరణ, డిజిటల్ అభ్యాసం, పరిశోధనలో శ్రేష్టత, బలమైన పారిశ్రామిక భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుందని అన్నారు. ఒడిశా గొప్ప గిరిజన వారసత్వంపై దృష్టిని ఆకర్షిస్తూ, దేశీయ జ్ఞాన వ్యవస్థలు, గిరిజన సంప్రదాయాలు, సాంస్కృతిక పరిరక్షణపై అర్థవంతమైన పరిశోధనలు చేపట్టాలని గవర్నర్ విశ్వవిద్యాలయాలను కోరారు. లోక్ భవన్లోని ట్రైబల్ సెల్ రూపొందించిన ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాల వివరాలను నమోదు చేసే ప్రచురణలను, విద్యా, పరిశోధన కార్యక్రమాలకు మద్దతుగా విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉంచుతామని ఆయన సభికులకు తెలియజేశారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రసంగిస్తూ విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదని, అవి జ్ఞాన సృష్టి, ఆవిష్కరణ, పరిశోధనలకు కేంద్రాలని అన్నారు. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను పెంచిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నత విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. అభివృద్ధి చెందుతున్న, సుసంపన్నమైన సమాజానికి విద్యే పునాదిగా పేర్కొన్నారు. 2036 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరించి వికసిత భారత్ జాతీయ దార్శనికతకు గణనీయంగా దోహదపడాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ఒడిశా నిర్దేశించుకుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా జాతీయ ప్రాముఖ్యత గల అంశాలపై చాన్స్లర్ కప్, ఇంగ్లీష్ డిబేట్ కోసం చాన్స్లర్ కప్, ఒడియా డిబేట్ కోసం చాన్స్లర్ కప్లను ప్రకటించి, ఆవిష్కరించారు. మత్తు పదార్థాల వ్యసన విముక్తిపై తీసిన లఘు చిత్రాలకు గాను, ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. -
పర్లాకిమిడిలో ఆరు పరీక్ష కేంద్రాల్లో బీఎడ్ అడ్మిషన్ పరీక్షలు
పర్లాకిమిడి: బీఎడ్ అడ్మిషన్ పరీక్ష 2026 ఆదివారం గజపతి జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాల్లో శాంతియుతంగా జరిగింది. గజపతి జిల్లా వ్యాప్తంగా 1339 అభ్యర్థులు బీఈడీ అడ్మిషన్ టెస్టుకు హాజరవ్వగా అందులో ఆర్ట్స్ అభ్యర్థులు 924, సైన్సు అభ్యర్థులు 415 మంది ఉన్నారు. పర్లాకిమిడిలో సెంచూరియన్ పబ్లిక్ స్కూల్, మహిళా కళాశాల, మహారాజా బాలుర ఉన్నత పాఠశాల, ఎం.ఆర్.గర్ల్స్ హైస్కూల్, సరస్వతీ శిశు మందిర్, శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాలలో బీఎడ్ పరీక్షలు నిర్వహించినట్టు డీఈఓ డాక్టర్ మయాధర్ సాహు తెలిపారు. -
స్వర నివేదన
సంగీత సాధన..● సంగీతంలో ఆకట్టుకుంటున్న చిన్నారులు వేదికపై చిన్నారుల ప్రదర్శన సంగీతం అంటే నాకు ప్రాణం. గత నాలుగేళ్లుగా నేర్చుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ప్రదర్శనలో పాడడం చాలా సంతోషంగా ఉంది. – పి.కన్విత, 6వ తరగతి, శ్రీకాకుళం శ్రీకాకుళం కల్చరల్: నగరంలో తల్లిదండ్రులు తమ చిన్నారుల ఆసక్తి మేరకు వేసవి నేపథ్యంలో పలు రకాల శిక్షణల్లో చేర్చుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా తమ పిల్లలకు సంగీతం నేర్పించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నారు. అలా నేర్చుకున్న చిన్నారులు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చేస్థాయికి చేరుతున్నారు. స్థానిక బాపూజీ కళా మందిర్లో ఆదివారం శ్రీచరణి సంగీత కళాక్షేత్రంలో సంగీత సాధన చేసి.. పలువురు చిన్నారులు ప్రదర్శన ఇచ్చి తమ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపారు. సంగీతంలో రేడియో గ్రేడ్ ఆర్టిస్టుగా ఎదగాలని కోరిక ఉంది. కష్టపడి గత ఆరేళ్లుగా సాధన చేస్తున్నాను. ఇక్కడి వేదికపై ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది. – పి.జాన్విత, ఇంటర్మీడియట్, శ్రీకాకుళం ● -
ఓఆర్ఎస్..!
● జిల్లాలో మండుతున్న ఎండలు ● ఓఆర్ఎస్తో తక్షణ ఉపశమనం ● ఇంట్లోనే తయారు చేసుకునే అవకాశంపాతపట్నం: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. శరీరంలో నీరు ఆవిరైపోయి జనాలు నీరసించి పోతున్నారు. ఠారెత్తిస్తున్న ఎండల తీవ్రతను తట్టుకునేందుకు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునేందుకు వేసవిలో ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు పాటించడం అవసరం. సాధారణం కంటే అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఈ ఏడాది ఉన్నాయి. దీంతో శ్రామిక, ఉద్యోగ, వ్యాపారులు విధి నిర్వహణలో భాగంగా అనివార్య పరిస్థితుల్లో మండే ఎండల్లో తిరగక తప్పదు. ఉపాధి పనులు, ఇతరత్రా వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా మండుటెండలో పనులు చేయాల్సి వస్తుంది. అటువంటి వారు ఎండ ప్రభావానికి లోనుకాకుండా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓఆర్ఎస్తో ఉపశమనం ఎండల్లో పనిచేసే సమయంలో శరీరంలో సహజంగా నీటిశాతం తగ్గిపోవడం వలన వడదెబ్బకు గురవుతుంటారు. ఇలాంటి ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ద్రావణం ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. స్థలం, కాలాన్ని బట్టి శరీరాన్ని నిర్దేశించిన ఉష్ణోగ్రతలో ఉంచుకోవాలి. మెదడులో హైపోథలామస్ అనే భాగం శరీరంలోని వేడిని క్రమబద్ధీకరిస్తుంది. తగిన నీటిని తాగకపోయినా, ఎండలో ఎక్కువ తిరిగినా హైపోథలామస్ భాగమే అధిక ఉష్ణోగ్రతకు లోనై క్రమబద్ధీకరించే పని చేయలేదు. ఈ స్థితిలో తల తిరగడం, నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, జ్వరం, చీకటి కమ్మినట్లు అనిపించడం, వాంతి అవుతున్న భావన కలగడం వంటి లక్షణాలు వడదెబ్బకు గురైనట్లు నిర్ధారిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యారోగ్య కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. అటువంటి సమయాల్లో వీటిని తీసుకోవడం వలన వెంటనే ఉపశమనం లభిస్తుంది. సమయానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ అందుబాటులో లేకపోతే ఇంటిలోనే ఉప్పు, పంచదార, నీరు సాయంతో ఈ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. లీటరు నీటిలో చిటికెడు ఉప్పు, అరస్పూన్ పంచదారను కలిపి తాగవచ్చు. ఎండ తీవ్రతకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించడం అవసరం. ఓఆర్ఎస్ తయారీ ఇలా... ఓఆర్ఎస్ అనేది వివిధ లవణాల మిశ్రమంతో కూడిన 20.5 గ్రాముల సోడియం క్లోరైడ్. దీనిలో 1.5 గ్రాముల పొటాషియం క్లోరైడ్, 2.9 గ్రాముల సోడియం సిట్రేట్, 13.5 గ్రాముల డెక్స్ట్రోజ్ ఉంటాయి. ఈ పౌడర్ ప్యాకెట్ను సురక్షితమైన లీటరు నీటిలో కలిపి రోజు మొత్తంలో వయస్సును బట్టి తగిన మోతాదులో తాగాలి. మితిమీరిన మోతాదులో తాగడమూ అనర్థాలు తెచ్చిపెడుతుంది. వడదెబ్బ బారిన పడినవారు డీ హైడ్రేషన్కు గురవుతారు. అటువంటి సమయంలో ముందుగా ఓఆర్ఎస్ ప్యాకెట్ను వినియోగించడం వల్ల కొంతవరకు కోలుకుంటారు. ఓఆర్ఎస్లో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి. అవసరమైనవారు తీసుకోవచ్చు. – డాక్టర్ జి.వేణుగోపాల్, సూపరింటెండెంట్, పాతపట్నం సీహెచ్సీ -
నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం కల్చరల్: ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కీలక నియామకాలు చేపట్టింది. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో పురోహిత క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఆదివారం జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ఈ నియామక పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని నినాదాలు చేశారు. సమాఖ్య వ్యవస్థాపకుడు యామిజాల నరసింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు, పురోహిత సమాజ సర్వతోముఖాభివృద్ధికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఏకగ్రీవ తీర్మానం మేరకు నూతన నియామకాలు చేశారు. ఇదే నూతన కార్యవర్గం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పొదిల నారాయణమూర్తి, రాష్ట్ర అధ్యక్షుడిగా తెన్నేటి విద్యాధర శాస్త్రి సునీల్, ప్రధాన కార్యదర్శిగా వారణాసి శ్రీధర్ శర్మలు ఎన్నికై నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సీనియర్ పురోహిత ప్రముఖులు పురాణం శేషు, పెంటా శ్రీధర్ శర్మ, పొన్నాల నరసింహమూర్తి, వాహిణీపతి మణిశర్మ, మేడూరి సంతోష్, కూనపల్లి శ్రీనివాస్, భోగాపురపు సూర్యనారాయణ, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి మహిళా ఏడీసీగా అనన్య అవస్థి
భువనేశ్వర్: ఐపీఎస్ అధికారిణి అనన్య అవస్థిని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఎయిడ్ డి క్యాంప్ (ఏడీసీ)గా నియమించారు. ఈ ప్రతిష్టాత్మక పదవిలో పని చేసిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ఆది వారం లోక్ భవన్లో జరిగిన లాంఛన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, పోలీస్ ఏడీసీగా అనన్య అవస్థికి ఆమె కొత్త బాధ్యతలు స్వీకరణకు స్వాగతించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ సచివాలయం ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నియామకానికి ముందు అనన్య అవస్థి కటక్లోని యూపీడీలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా పనిచేశారు. రాష్ట్ర గవర్నర్కు ఏడీసీగా పని చేసిన తొలి మహిళగా, ఆమె నియామకం ప్రభుత్వ సేవలో మహిళలకు ఒక ముఖ్యమైన మైలు రాయిగా నిలుస్తుంది. గవర్నర్కు గతంలో పోలీస్ ఏడీసీగా పని చేసిన ఐపీఎస్ అధికారి కులదీప్ మీనా స్థానంలో ఆమె నియమితులయ్యారు. రాష్ట్ర గవర్నర్కు ఇద్దరు ఎయిడ్స్ డి క్యాంప్లు (ఏడీసీలు) సహాయకులుగా ఉంటారు. వారిలో ఒకరు భారత నావికా దళం నుండి, మరొకరు ఒడిశా పోలీసుల నుండి ఉంటారు. అనన్య అవస్థి పోలీస్ ఏడీసీగా, భారత నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్ హర్షిత్ దేవ్ గవర్నర్కు నావల్ ఏడీసీగా కొనసాగుతారు. అధికారిక కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాలు మరియు ఇతర ప్రోటోకాల్ సంబంధిత విధులలో గవర్నర్కు సహాయం చేయడంలో ఏడీసీ కీలక పాత్ర పోషిస్తారు. -
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం
రాయగడ: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాయగడ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం మే 30వ తేదీ నుండి ప్రారంభమైంది. ఇందులో భాగంగా బూత్ స్థాయి అధికారులు సహాయ ఎన్నికల నమోదు అధికారుల వద్ద నుంచి గణన ఫారాలను స్వీకరించి ఇంటింటికీ పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలో ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, కచ్చితంగా రూపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రాయగడ తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి చెప్పారు. ఈ మేరకు శనివారం సమితి సమావేశం హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతీ అర్హుడైన ఓటరు, ఓటరు జాబితాలొ నమోదయ్యేలా, అనర్హుల పేర్లు తొలిగించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు వివరించారు. ఈ ప్రక్రియ సజావుగా కొనసాగాలంటే బీఎల్వోలు నిర్ణీత గడువులోగా ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఆయా బూత్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, సీఆర్పీలు, ఎంబీకేలు, ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన, మహిళా సంఘాలు, గ్రామీణ యువత బీఎల్వోలకు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. వాహనాల తనిఖీ పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పర్లాకిమిడి, రాయఘడ, కాశీనగర్, గుసాని, ఆర్.ఉదయగిరి, మోహానా తదతర ప్రాంతాల పోలీసు ష్టేషన్ల పరిధిలో ఆదివారం వాహనాలను తనిఖీ చేపట్టారు. గజపతి జిల్లా నుంచి అక్రమంగా గంజాయి, మద్యం, మత్తు పదార్థాలు స్మగ్లింగ్ అరికట్టడానికి ఈ చర్యలు చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులను కూడా పట్టుకుని కౌన్సెలింగ్ చేసి విడిచి పెట్టారు. -
సబ్ పోస్ట్మాస్టర్ సస్పెన్షన్
జయపురం: జయపురం పోస్టల్ డివిజన్లో ఉన్న పోస్ట్ ఆఫీసులో రూ.50 కోట్ల అవినీతి కుంభకోణంపై జరిగిన ప్రాథమిక దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు నవరంగపూర్ జిల్లా ఝోరిగాం తాత్కాలిక సబ్పోస్టు మాస్టర్ గౌరంగ సర్కార్ను ఉద్యోగం నుంచి జయపురం డివిజన్ చీఫ్ అధికారి సత్య ప్రకాశ మిశ్ర తొలగించారు. రూ.50 కోట్ల అవినీతిలో పలువురికి సంబంధాలున్నాయని భావించారు. నవరంగపూర్ జిల్లాడాబుగాం, కొడింగ పోస్టుమాస్టర్లను బదిలీ చేశారు. డాబుగాం సబ్పోస్టు మాస్టర్ శంభుప్రసాద్ పాణిగ్రహిని మల్కనగిరి జిల్లాలో మత్తిలికి, కొడింగ సబ్పోస్టు మాస్టర్ బసంత కుమార్ దాస్ను మల్కనగిరి పోస్టాఫీసుకు బదిలీ చేశారు. దర్యాప్తు పూర్తయిన తరువాత రూ.50 కోట్ల కుంభకోణంలో సంబంధం ఉన్న అధికారులందరిపైనా తగిన చర్యలు తీసుకుంటామని తపాలా విభాగ అధికారి వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రజాసంక్షమ, సహాయక పథకాల్లో 5 వేల మందికిపైగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పంచిన డబ్బులను కాజేశాిరు. పోస్టల్ డిపార్ట్మెంట్లోని సాఫ్ట్వేర్ను వినియోగించుకొని మొబైల్ నెంబర్ మార్చి డబ్బు స్వాహా చేసినట్లు ఇటీవల బీజేడీ నాయకులు చేసిన ఆరోపణ విదితమే. ఉద్యోగం నుంచి తొలగించబడిన ఆనాటి ఝోరిగాం సబ్పోస్టు మాస్టర్ గౌరంగ సర్కార్ రూ.7 లక్షల 70 వేలు స్వాహా చేసినట్లు ఆయనే అంగీకరించినట్లు పోస్టల్ విభాగ ఇన్స్పెక్టర్ రవీంద్ర కుమార్ బెహర సమర్పించిన నివేదికలో పొందుపరిచారు. గౌరంగ సర్కార్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు జయపురం డివిజన్ చీఫ్ వెల్లడించారు. కొడింగా సబ్ పోస్టు మాస్టర్ బసంత కుమార్ దాస్ 90 అకౌంట్లు తెరిచి డబ్బు స్వాహా చేశాడని ఆరోపణ. అవిభక్త కొరాపుట్ జిల్లాలలో 41 పోస్టాఫీసుల్లో డబ్బు స్వాహా జరిగినట్లు నవరంగపూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మఝి, మాజీ మంత్రి రబినారాయణ నందో ఆరోపణలను పరిగణలోనికి తీసుకొని పోస్టల్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. -
విక్రమదేవ్ వర్సిటీలో ముగిసిన బీఈడీ వర్క్షాప్
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో 12 రోజులుగా నిర్వహించిన బీఈడీ ముగిసింది. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)ఆధ్వర్యంలో వర్సిటీ ఉపాధ్యాయ విద్యా విభాగం ప్రాంగణంలో బీఈడీ కోఆర్డినేటర్, విద్యా విభాగఅధిపతి డాక్టర్ మనోరంజన ప్రధాన్ అధ్యక్షతన వర్క్షాపు జరిగింది. కార్యక్రమంలో వికర్మ విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ హృషికేష్ శనాపతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వర్క్షాపులో నేర్చుకున్న విషయాలను పాఠశాల స్థాయిలో అమలు చేయటంతో పాటు జాతీయ విద్యావిధానం 2020లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని హితవు పలికారు. గౌరవ అతిథిగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయిక్ వర్క్ షాపులో తరగతుల తీరు, విద్యార్థుల అనుభవాలను విని సంతోషం వ్యక్తం చేశారు. ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచివచ్చిన ప్రతినిధులను అభినందించారు. గౌరవ అతిధిగా ఇగ్నో రీజనల్ డైరెక్టరేట్ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ లలిత మిశ్ర వర్క్షాప్ ను విజయవంతంగా నిర్వహించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. గౌరవ అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఉజ్వళ కుమార్ షొడంగి బీఈడీ విద్యార్థులకు పరీక్షకులకు సంబంధించి పలు సూచనలు చేశారు. శిక్షణ శిబిరంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి మొత్తం 56 మంది హాజరై ఉపాధ్యాయ వృత్తిపై అవగాహన కల్పి్ంచుకున్నారు. పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
మహానది జలాల పంపిణీ వివాదం విచారణ వాయిదా
భువనేశ్వర్: ఒడిశా, చత్తీస్గఢ్ మధ్య కొనసాగుతున్న మహానది జలాల పంపిణీ వివాదం విచారణ వాయిదా పడింది. శనివారం వివాద ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ పాక్షికంగా ముగిసింది. ట్రిబ్యునల్ తదుపరి విచారణను జూన్ 6వ తేదీ ఖరారు చేసింది. మహానది జలాల పంపిణీ వివాదం నేపథ్యంలో ఉభయ చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య 15 ప్రధాన అంశాలలో 12 అంశాలపై ఒప్పందం కుదిరిందని ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాలు రెండూ ట్రిబ్యునల్కు తెలియజేశాయి. ఏకాభిప్రాయం ఆధారంగా మరిన్ని పరిష్కారాల కోసం సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. ఒప్పందం కుదిరిన అంశాల్ని ఇరు రాష్ట్రాల న్యాయ, సాంకేతిక బృందాలు పరిశీలించాలని ట్రిబ్యునల్ కోరింది. కారుని ఈడ్చుకుపోయిన ట్రక్కుభువనేశ్వర్: నగరంలో కారుని ట్రక్కు ఢీకొట్టి ఈడ్చుకుపోయిన భయంకరమైన ఘటన గగుర్పొడిచింది. ప్రత్యక్షంగా చూసిన వారికి తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని స్వల్ప గాయాలతో బతికి బయట పడ్డారు. స్థానిక సత్య విహార్ స్క్వేర్ సమీపంలో అతి వేగంగా వస్తున్న ట్రక్కు కారును ఢీకొట్టి, పొహలా వైపు రోడ్డుపై దాదాపు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. అది చివరకు ఒక వంతెనపై ఇరుక్కుపోయింది. ఈ ఘటన జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. కారులో ప్రయాణిస్తున్న మామ, మేనకోడలు తటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మంచేశ్వర్ ఠాణా పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని ట్రక్కును స్వాధీన పరచుకున్నారు. ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. అనంతరం ట్రక్కు డ్రైవర్ను అరెస్టు చేశారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ తెలిపారు. స్థానికుల దాడి భయంతో ఇలా చేసినట్లు డ్రైవర్ పోలీసులకు వివరించాడు. విద్యాశాఖపై అధికారుల సమీక్ష మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడం, సమగ్ర అబివృద్ధి సాధించేందుకు జిల్లా పరిపాలన యంత్రాంగం కీలక చర్య చేపట్టింది. ఇందులో భాగంగా మల్కన్గిరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజాశిర్క్ అధ్యక్షతన శనివారం విద్యాశాఖపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి, జిల్లా మంగళ అధికారి శ్రీనివాస్ ఆచారితో పాటు ఇతర ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా లో విద్యరంగంలో ఏక్కడ నిర్లక్ష్యం పనికిరాదన్నారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా పాఠశాలలకు సమయానికి వెళ్లాలని ఆదేశించారు. -
లారీ యజమానుల సంఘం అధ్యక్షునిగా కొండబాబు
● ఎన్నికల్లో వరించిన విజయంరాయగడ: లారీ యజమానుల సంఘానికి శనివారం జరిగిన ఎన్నికల్లో యాళ్ల కొండబాబు అధ్యక్షునిగా ఘనవిజయం సాధించారు. స్థానిక కపిలాస్ కూడలి వద్ద గల సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో భాగంగా ఎన్నికల అధికారులుగా ప్రముఖ న్యాయవాది బ్రజసుందర్ నాయక్, నీలా బిసోయి, సుశాంత్ పండాలు వ్యవహరించారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ రాత్రి 8.30 గంటల వరకు కొనసాగింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికై యాళ్ల కొండబాబు, బి.మన్మథరావులు బరిలో ఉన్నారు. పోటాపోటీగా కొనసాగిన ఎన్నికల్లో మొత్తం 361 మంది ఓటర్లు ఉండగా ఇందులొ 328 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్షునిగా గెలుపొందిన కొండబాబుకు 170 ఓట్లు అనుకూలంగా పోలవ్వగా ప్రత్యర్ధి బి.మన్మథరావుకు 148 ఓట్లు దక్కాయి. దీంతొ కొండబాబు తన సమీప అభ్యర్థిపై 22 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే సాధారణ కార్యదర్శిగా జి.రామ్మోహన్రావు, ఉపాధ్యక్షునిగా బి.రమేష్, సహకార్యదర్శిగా పి.మహానందియా, కోశాధికారిగా పికే సామల్లు విజయం సాఽధించారు. అధ్యక్షునిగా విజయం సాధించిన కొండబాబబుకు ఆయన మద్దతుదారులు అభినందించారు. అలాగే ఎస్డీసీ చైర్మన్ బిద్యాధర్ సబర్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈసందర్బంగా కొండబాబు మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. ఆనందోత్సాహాలదో సందడి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎస్డీపీవో గౌరహరి సాహు, చందిలి ఐఐసీ, గుణుపూర్ ఐఐసీ కేకేబీకే కుహరో, రాయగడ ఐఐసీ ప్రశన్నకుమార్ బెహరలు పర్యవేక్షించారు. -
కూలిన జిప్సం సీలింగ్
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026ప్రభుత్వాస్పత్రి గదిలోపర్లాకిమిడి: స్థానిక కేంద్రప్రభుత్వ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డు రూంలో జిప్సం సీలింగ్ కూలిన సంఘటనలో తృటిలో పేషెంటు తప్పించుకున్నాడు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వార్డు నంబర్ 3లో సముటియా వీధికి చెందిన భభశ్రీ హాలధర్ చిన్న సర్జరీ నిమిత్తం డి.హెచ్.హెచ్.కి వచ్చింది. అయితే సర్జరీ అయిన తర్వాత ఆమెను ఎమర్జెన్సీ వార్డు నంబర్ 63 గదిలోకి మార్చారు. పెషెంటు భభశ్రీ అనుకోకుండా బాత్రూంకు వెళ్లి వచ్చేలోగా ఫాల్స్సీలింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే తృటిలో ఆమె తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆమె భర్త తెలియజేశారు. ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రిలో ఈ సంఘటన జరిగి చాలా సమయం అయినా జిల్లా ముఖ్య చికిత్సాధికారి గానీ అదనపు జిల్లా పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గాని సంఘటనా స్థలానికి రాకపోవడం పలువురిని ఆశ్చర్య పరిచింది. ఇటీవల పర్లాకిమిడి డి.హెచ్.హెచ్.పై పబ్లిక్ అనేకసార్లు రాష్ట్రమంత్రులు, సెక్రటరీల వద్ద ప్రశ్నించినా ఇలాంటి సంఘటనలు జరగటం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. ప్రస్తుత సీడీఎంఓ డాక్టర్ సంతును పాఢి పదవీ బాధ్యతలు చేపట్టినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలకు దారి తీస్తోంది. ప్రభుత్వం కొత్తగా నియమించిన సి.డి.యం.ఓ డాక్టర్ మంజురాణి జెన్నా ఇంతవరకూ విధుల్లో జాయిన్ కాలేదని ఏడీఎంఓ మహాపాత్రో తెలియజేశారు. -
చెట్టు కూలి ఒకరి మృతి
రాయగడ: జిల్లాలో కాలవైశాఖి తుఫాను విషాదాన్ని మిగిల్చింది. గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల కారణంగా చెట్టు కూలి పంప్ హౌప్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మృతి చెందిన ఘటన జిల్లాలోని మునిగుడ సమితి కుట్రాగుడలో చోటు చేసుకుంది. మృతుడిని అదే గ్రామానికి చెందిన జితేంద్ర జాల్ (55) గా గుర్తించారు. పంప్హౌస్లో ఉద్యోగిగా విధులు నిర్వహించే జాల్ శుక్రవారం సాయంత్రం పంపులో నీళ్లు విడిచిపెట్టేందుకు వెళ్లే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అక్కడ గల ఒక చెట్టు కిందకు విరిగి పడిపోయింది. అదే సమయంలో అక్కడ ఉన్నజాల్ పై చెట్టు పడిపోవడంతో తీవ్రగాయాలకు గురై అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పారాదీప్ పోర్టులో ప్రమాదం ● డ్రైవర్ మృతి భువనేశ్వర్: పారాదీప్ పోర్టులో సీక్యూ–1 బెర్త్ వద్ద శనివారం ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హైవా డ్రైవర్ మతి చెందాడు. బెర్త్లోని ప్లాట్ నుంచి హైవా ఇనుప ఖనిజాన్ని అన్లోడ్ చేస్తుండగా, క్రేన్ నుంచి దానిపై ఇనుప ఖనిజం పడటంతో డ్రైవర్ మరణించాడు. ఐపీటీ డంపర్ డ్రైవర్లు వివిధ ప్లాట్ల నుంచి పనిని నిలిపివేసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ కేసులో నిందితుల అరెస్టు రాయగడ: జిల్లాలోని కాశీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసుకు సంబంధించి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు ఈ మేరకు వారి నుంచి చోరీకి గురైన సామాన్లు అన్నీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టుకు తరలించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం మల్కన్గిరి: ఒడిశాలో ఈ నెల 30వ తేదీ నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా కలేక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజాశిర్క్ అన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. ఈ క్రమంలో మల్కన్గిరి జిల్లాలో కూడా ఓటరు జాబితా కచ్చితత్వాన్ని నిర్థారించడం, అవసరమైన సవరణలు చేయడం కోసం ఈ ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఓటర్ల వివరాల నవీకరణ, తప్పుల సవరణ, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు చేపట్టామన్నారు. జిల్లాలో రెండు నియోజకవర్గాలు మల్కన్గిరి, చిత్రకొండ ఉన్నాయని, ఈ రెండు చోట్ల మొత్తం 549 బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) వీరిలో మల్కన్గిరి నియోజకవర్గంలో 302 మంది, చిత్రకొండ నియోజకవర్గంలో 247 మంది ఉన్నారు. మల్కన్గిరిలో 2,52,691 మంది ఓటర్లు, చిత్రకొండలో 2,09,480 మంది ఓటర్లు ఉన్నారు. రెండు గణన ఫారాలను అందజేసి వాటిని ఎలా నింపాలో మార్గనిర్దేశం చేస్తారు. ప్రస్తుతం మల్కన్గిరి నియోజకవర్గంలో 2,36,078 మంది (93.43 శాతం) చిత్రకొండ నియోజకవర్గంలో 1,99,731 మంది (95.35 శాతం) 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేశారు. మల్కన్గిరిలో 16,613 మంది, చిత్రకొండలో 9,749 మంది ఓటర్లు తమ గణన ఫారాలతోపాటు అవసరమైన పత్రాలను బీఎల్ఓలకు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రధాన్, సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు మూడు గదుల ఇల్లు దగ్ధం
భువనేశ్వర్: భద్రక్ జిల్లా తిహిడి మండలం దహపానియా గ్రామంలోని మూడు గదుల ఇల్లు పిడుగుపాటుకు దగ్ధమైంది. ఇంటిలో ఫర్నిచర్ అంతా కాలిపోయింది. లక్షల రూపాయల విలువైన ఆస్తి ధ్వంసమైందని బాధితులు వాపోతున్నారు. చార్జీల పెంపుపై ప్రభుత్వానికి అల్టిమేటం భువనేశ్వర్: బస్సు చార్జీల సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒడిశా బస్సు యజమానుల సంఘం శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. రాబోయే పది రోజుల్లోగా ప్రభుత్వంచార్జీల పెంపును ప్రకటించడంలో విఫలమైతే, రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులను నిలిపివేస్తామని సంఘం హెచ్చరించింది. శనివారం నిర్వహించిన సమా వేశంలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి మీడియాకు అల్టిమేటం ఆవశ్యకతను వివరించారు. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులు, అధికం అవుతున్న కార్యాచరణ సవాళ్లను చార్జీల సవరణ కోరడానికి కీలక కారణాలుగా బస్సు యజమానులు పేర్కొన్నారు. చార్జీలు పెంచకపోతే బస్సులను నడపలేమన్నారు. ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి గతంలో డీజిల్ చార్జీల పెంపు ఆధారంగా 13 కీలక అంశాలతో వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం డీజిల్ ధరలలో కేవలం రెండు శాతం లెక్కన చార్జీల పెంపును మాత్రమే ఆమోదించింది. మిగిలిన అంశాలను పట్టించుకోలేదు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఏ యజమాని కూడా తమ బస్సులను నడపడానికి సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో మరో వినతిపత్రాన్ని ఇచ్చారు. -
పొగాకు వినియోగంతో అనర్థాలు
రాయగడ: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం పురస్కరించుకుని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పితామహాల్ వద్ద గల సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్కు చెందిన బీఎస్సీ నర్సింగ్ నాలుగో సెమిస్టర్ విద్యార్థులు క్యాన్సర్ వార్డులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మెడిసన్ నిపుణుడు సురేష్ కుమార్ దేవ్ మాట్లాడుతూ.. పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, క్యాన్సర్తోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల గురించి వివరించారు. పొగాకు అలవాటు పూర్తిగా మానుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని సూచించారు. పొగాకు వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి నర్సింగ్ విద్యార్థుఽలు పోస్టర్ల ద్వారా చైతన్యపరిచారు. క్యాన్సర్ వార్డులో చికిత్స పొందుతున్న 25 మంది రోగుల, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సూచనలు అందించారు. -
ప్రథమ చికిత్సపై అవగాహప
శ్రీకాకుళం కల్చరల్: సర్వశిక్ష అభియాన్ ఒకేషనల్ విభాగం ద్వారా అంపోలులో శిక్షణ పొందుతున్న వివిధ జిల్లాలకు చెందిన హెల్త్ ఇన్స్ట్రక్టర్లకు రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ద్వారా ప్రథమ చికిత్సపై శనివారం అవగాహన కల్పించారు. జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు పర్యవేక్షణలో మేనేజర్ కె.సత్యనారాయణ, జి.రమణలు ప్రథమ చికిత్స, గాయాలు, కట్లు, తరలింపు మార్గాలు, కృత్రిమ శ్వాస, సీపీఆర్, కాలిన గాయాలు తదితర వైపరీత్యాల నుంచి రక్షించుకోవడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాక్ అసిస్టెంట్ డైరెక్టర్ డి.చిట్టిబాబు, రెడ్క్రాస్ సిబ్బంది చిన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జూన్ 2న జాబ్మేళా శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలోని బలగ హాస్పిటల్ జంక్షన్లో ఉన్న ప్రభుత్వ ఐటీఐ/డీఎల్టీసీ శిక్షణా సంస్థ ప్రాంగణంలో జూన్ 2వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలిపారు. కేవీఆర్ ఇంజినీర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తుట్ మైక్రోఫిన్ లిమిటెడ్, 2050 హెల్త్కేర్ సంస్థల్లో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్మేళాను చేపట్టనున్నట్టు చెప్పారు. ఆకర్షణీయమైన వేతనంతో పాటు అనేక వసతి రాయితీలు ఉంటాయన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ తదితర విద్యార్హత కలిగిన అభ్యర్థులు హాజరవ్వాలని కోరారు. బయోడేటా, విదార్హత ధ్రువీకరణ పత్రాలు, జిరాక్స్ కాపీలు, రెండు పాస్ఫొటోలతో ఆరోజు ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం డీఎల్టీసీ/ఐటీఐ శిక్షణా సంస్థ వద్దకు చేరుకోవాలని కోరారు. నేతన్న నేస్తం అమలు ఎన్నడు..? రణస్థలం: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేతన్న నేస్తం ఎప్పటిలోగా అమలు చేస్తారో సమాధానం చెప్పాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్వీ రమణ డిమాండ్ చేశారు. శనివారం లావేరు పర్యటనలో నేతన్నలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు హామీ అమలు చేయకపోవడంతో నేతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న చేనేతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. 50 ఏళ్లు దాటినవారికి పెన్షన్ అమలు చేస్తామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు వెంటనే జరిపించాలని, కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్.అసిరప్పడు, కె.రామారావు, యు.కాశీ విశ్వేశరరావు, ఎన్.భద్రకాళి, కె.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రైలు ఢీకొని ఆవు మృతి పాతపట్నం: మండలంలోని గంగువాడ గ్రామ రైల్వే గేటు సమీపంలో రైలు ఢీకొని ఆవు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం గంగువాడ రైల్వే గేటు సమీపంలో ఆవు మేత మేస్తోంది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి గుణుపూర్ వస్తున్న రైలు ఢీకొనడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గంగువాడ గ్రామానికి చెందిన సత్రాపు అప్పన్న అనే రైతుకు చెందిన ఆవుగా గుర్తించారు. ఆవు విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందన్నారు. నష్టపోయిన పాడి రైతుకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గాయపడిన వ్యక్తి మృతి టెక్కలి: జాతీయ రహదారిలో బొప్పాయిపురం సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కూన హరిశ్చంద్రరావు (63) శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఈనెల 25న రోడ్డు ప్రమాదంలో గాయపడిన హరిశ్చంద్రరావును టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. -
నాన్ కేడర్ ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు శిక్షణ
రాయగడ: స్థానిక జిల్లా పరిషత్ సమీవేశం హాల్లో శనివారం నాడు నాన్ కేడర్ ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు రెండు రోజుల ప్రాథమిక, రిఫ్రెషర్ శిక్షణ శిబిరం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయ శాఖ, భువనేశ్వర్లోని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ల డైరక్టరేట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ శిక్షణ శిబిరంలో అపరాధ, న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, కోర్టుల్లో శిక్షల కాలం శాతం పెంచడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు వృత్తి పరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ శిక్షణ శిబిరం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమ ప్రారంభంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్ర కుమార్ శర్మ స్వాగతం పలికారు. అనంతరం రాయగడ డిప్యూటీ డైరక్టర్ ఆప్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అజిత్ కుమార్ పట్నాయక్ అనుమతితో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలక్టర్ అశుతోష్ కులకర్ణి కొత్తగా నియమితులైన ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డులు అందజేశారు. అలాగే న్యాయ వ్యవస్థలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల బాధలు, విఽధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత ఎంతో ముఖ్యమని హితవు పలికారు. గౌరవ అతిథిగా హాజరైన ఎస్సి రాజ్ ప్రసాద్, రాయగడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విక్రమ్ కుమార్ కుండు, ప్రభుత్వ ప్లీడర్ పద్మనాభ దాస్ పాల్గొని మార్గనిర్దేశం చేశారు. -
విద్యుత్ కోతలపై ఆందోళన
పర్లాకిమిడి: స్థానిక వార్డు నంబర్ 5 జంగంవీధి ప్రజలు గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేనందున ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడటమే కాకుండా అనేక మంది పేషెంట్లు కరెంటు లేక అవస్థలు పడుతున్నారు. టాటా పవర్ డిస్ట్రిబ్యూషన్ జూనియర్ ఇంజినీరు, అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుకు జంగంవీధి వాసులు మొరపెట్టుకున్నా విద్యుత్ పునరుద్ధరణ నేటికీ జరగకపోవడంతో జంగం వీధి కూడలి వద్ద శనివారం మధ్యాహ్నం రెండు గంటలసేపు రాస్తారోకో ఆందోళన చేపట్టారు. దీంతో టి.పి.యస్.ఓ.డి.ఎల్. అసిస్టెంటు ఇంజినీరు, పోలీసులు వచ్చి ఏరియాలో విద్యుత్ పుణరుద్ధరణ చేస్తామని చెప్పటంతో జంగంవీధి వాసులు ఆందోళనను విరమించారు. -
క్రీడాకారులకు న్యాయం చేయాలని వినతి
జయపురం: జయపురం సబ్డివిజన్ అథ్లటిక్ అసోసియేషన్లో కోట్పాడ్ క్రీడాకారులకు సభ్యత్వం, ఓటువేసే హక్కు కల్పించాలని కోట్పాడ్ క్రీడా సంఘం, స్పోర్టింగ్ క్లబ్బు, యునైటెడ్ క్లబ్బుల సభ్యులు కోరారు. ఈ మేరకు కోట్పాడ్ ఎమ్లల్యే రూపు భొత్రను శనివారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు విషయాలపై వినతిపత్రాన్ని అందజేశారు. కోట్పాడ్ క్రీడాకారులను క్రీడా సంఘాన్ని సబ్డివిజన్ సంఘంలో కలిపేందుకు గతంలో ఆర్టీఐ సభ్యులు, కార్యదర్శి అనూప్ కమార్ పాత్రో కొరాపుట్ జిల్లా కలెక్టర్, క్రీడా విభాగ అధికారులను కలసి డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల బరంపురం రెవెన్యూ డివిజనల్ కమిషనర్ అసోసియేషన్లో చేరాలనుకునేవారందరిని చేర్చుకొని వారికి ఓటు వేసే హక్కును కల్పించాలని జిల్లా కలక్టర్ను ఆదేశించారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీనియర్ న్యాయవాది పంకజ పాత్రో, కిశోర్ చంధ్ర మిశ్రో, ప్రదీప్ కుమార్ బక్షీ,మహమ్మద్ సాలిమ్,సురేష్ మహంతి,వికాశ పట్నాయక్ తదితరులు ఎమ్మెల్యేను కలిసి క్రీడాకారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తాను సంబంధిత అధికారులు, కొరాపుట్ జిల్లా కలెక్టర్తో మాట్లాడుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. -
‘గ్రామోదయ’ యోజన ప్రారంభం
జయపురం: మావోయిస్టు, నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా ఉండేందుకు ‘గ్రామోదయ’ యోజన పథకాన్ని జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితిలో శనివారం ప్రారంభించారు. బొయిపరిగుడ సమితి మావో ప్రభావిత చంద్రపడ గ్రామ పంచాయతీ పల్లిగుడలో బొయిపరిగుడ సమితి అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బొయిపరిగుడ బీడీఓ నివేదిత దండసేన హాజరయ్యారు. బొయిపరిగుడ సమితిలో 20 గ్రామ పంచాయతీల్లో 10 గ్రామ పంచాయతీల పరిధిలోని 23 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పల్లిగుడలో నిర్వహించిన ‘గ్రామోదయ’ యోజన కార్యక్రమంలో పల్లెగుడ గ్రామ ప్రజలతోపాటు బాలిగుడ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రెండు గ్రామాల్లో ప్రభుత్వ ప్రజా సంక్షేమ, సహాయక పథకాలు పొందలేకపోతున్న అర్హులైన లబ్ధిదారులను గుర్తించటం జరుగుతుందని బీడీఓ వెల్లడించారు. గ్రామోదయ పథకం ద్వారా మావో ప్రభావిత గ్రామ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేయ సహాయ పథకాల ఫలితాలు సులభంగా అందేలా చూడటమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి పథకం మావో ప్రభావిత ప్రాంత ప్రజలకు చేర్చేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు సమైఖ్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పాలకులకు ఉన్న దూరం తగ్గుతుందన్నారు. అందువలన ప్రభుత్వ అధికారుల పట్ల ప్రజలలో నమ్మకం, విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ వాటర్ శానిటరీ విభాగ అధికారులతోపాటు వైద్య, విద్యుత్, విద్య, సామాజిక సురక్షా, సుభద్ర యోజన, అంత్యోదయ యోజన అధికారులు పాల్గొన్నారు. -
గజపతి జిల్లా!
ఉద్యానవనాల ఖిల్లాపర్లాకిమిడి: గజపతి జిల్లా ఉద్యానవన జిల్లాగా పేరోందిన తరువాత రామగిరి ప్రాంతంలో అనేకమంది యువతీ యువకులు, స్వయం సహాయక గ్రూపులు రుణాలు తీసుకుని లిచ్చి, మామిడి, అనాస, ద్రాక్ష పండ్లు పండించి ఎగుమతి చేసే దిశకు వచ్చారు. ఆర్.ఉదయగిరి బ్లాక్ మంగరాజ్పూర్ గ్రామం, సరసిసాహి, రామగిరి, జిరంగో ప్రాంతాల్లో లిచ్చి పండ్లు ఈ ఏడాది అత్యధికంగా దిగుబడి వచ్చినట్టు జిల్లా ఉద్యానవనాల విభాగం డెప్యూటీ డైరక్టర్ దుష్మంత్ కుమార్ బెహారా తెలియజేశారు. రామగిరి నుంచి గంజాం జిల్లా బరంపురం, ఖుర్దా, భుభనేశ్వర్, కటక్ పట్టణాలకు ఫ్రెష్ ఫ్రూట్స్ సప్లై అనే బ్లాగుద్వారా యువ ఉద్యోగి మ్యారీ జాన్ ఆర్డర్స్పై పంపిస్తున్నారు. పర్లాకిమిడిలో అమావాస్య పండుగనాడు లిచ్చి పండ్లు కిలో రూ.200 అమ్మగా, ఇప్పుడు ధరలు దిగివచ్చి కిలో రూ.120, వంద రూపాయలకు అమ్ముతున్నట్టు మంగరాజ్పూర్ రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇతర జిల్లాల కంటే మామిడి పండ్లు దిగుబడి కూడా భేషుగ్గా ఉన్నట్టు ఉద్యానవనాల శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఒర్మాస్ సహకారంతో స్వల్పకాలిక రుణాలు బ్యాంకు నుంచి పొంది అధిక లాభాలు పొందారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు వినియోగించుకుని మహిళా స్వయం సహాయక గ్రూపులు కూడా లిచ్చి, మామిడి, అనాస, నిమ్మ, ఆరెంజి తోటలు విరివిగా పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక గ్రూపులకు మరింత ప్రోత్సాహాకాలు, తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తే గజపతి జిల్లా పండ్లతోటల విస్తరణకు దోహాదం చేస్తుందని మాతరిణీ స్వయంసహాయక గ్రూపు సభ్యులు చెప్పారు. -
ఎయిర్పోర్టు నిర్మాణంతో అభివృద్ధి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన ఎయిర్పోర్టుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మండలంలోని ఎయిర్పోర్టు బాధిత గ్రామమైన అనకాపల్లిలో శనివారం అయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంత ప్రజలు భూమిని త్యాగం చేస్తేనే సాధ్యమవుతుందని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణం జరిగితే 10వ తరగతి నుంచి ఐఐటీ వరకు చదువుకున్న యువతకు అదే ఎయిర్పోర్టులోనే ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే భూమిని కోల్పోయిన రైతులకు మెరుగైన లబ్ధిని చేకూర్చుతామన్నారు. ఈ విషయంలో కొంతమంది పడుతున్న అపోహలు నిజం కాదని స్పష్టం చేశారు. కాగా కొంతమంది రైతులు, మహిళలు మాట్లాడుతూ తమ భూములు, ఇళ్లు విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. సమావేశంలో ఆర్డీవో అప్పలరాజు, తహసీల్దార్ సీతారామయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఎయిర్ పోర్టు మాకొద్దు మందస: విధ్వంసకర ఎయిర్పోర్టు తమకు వద్దని, దీనికోసం భూములు ఇచ్చేది లేదని మండలంలోని భేతాళపురం గ్రామస్తులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్పష్టం చేశారు. కార్గో ఎయిర్ పోర్టు ప్రతిపాదనను రద్దు చేయాలని ముక్తకంఠంగా తెలియజేశారు. కొబ్బరి, మామిడి, జీడి, పసస, మునగ వంటి పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీ యూనిట్లు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో ఆర్.అప్పలరాజు, డిప్యూటీ తహసీల్దార్ కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఝార్సుగుడలో దోపిడీ ముఠా అరెస్టు
● పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలురాయగడ: ఝార్సుగుడ జిల్లాలో భారీ భారీ దోపిడీకి సిద్ధమైన ఆయుధదారుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రెంగాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్లో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనలో ఒక నిందితుడు గాయపడగా అతడిని ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర తెలియజేసిన వివరాల ప్రకారం.. మే 29 రాత్రి రెంగాలి ప్రాంతంలో ఓ ఆర్థిక సంస్థపై దోపిడీకి పాల్పడేందుకు ఆయుధాలతో కూడిన ముఠా సంచరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా చర్యలు చేపట్టామని వివరించారు. ఈ క్రమంలో కదమ్ఘాట్ సమీపంలోని మాఘేంటేశ్వరి ఆలయం వద్ద ఆనుమానాస్పదంగా సంచరిస్తున్న పికప్ వ్యాన్ని పోలీసులు గుర్తించారు. వాహనాన్ని ఆపాలని సంకేతాలు ఇవ్వగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంబడించి వాహనం వెనుక భాగాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి అడ్డుకున్నారు. ఈ క్రమంలో జయ్ చౌహన్ అనే నిందితుడు పోలీసులపై కాల్పులకు దిగినట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ కాల్పులు కొనసాగించడంతో ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జయ్ చౌహన్ కుడి తొడ భాగంలో తుపాకీ గాయం కావడంతో అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మిగతా నలుగురు నిందితులు చీకటిని ఆసరాగా తీసుకుని సమీప అడవుల్లోకి పారిపొయారు. అనంతరం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు వారిని కూడా పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో బ్రజరాజ్నగర్కు చెందిన కరణ్ చౌహన్, బిశ్వజీత్ నాయక్, సంతొష్ మహాతొ అలియాస్ బడే, రొహిత్ కుమార్ సింగ్ అలియాస్ రవి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో వీరిలో పలువురికి హత్యాయత్నం, దోపిడీ, చోరీ, బెదిరింపులు, ఆయుధాల చట్ట ఉల్లంఘన వంటి పలు నేర చరిత్రలు ఉన్నట్లు వెల్లడైంది. నిందితుల నుంచి ఒక దేశీయ తయారీ తుపాకీ, రెండు ఖాళీ తూటాలు ఒక భుజాలి (పదునైన ఆయుధం), ఒక నకిలీ తుపాకీ, నిందితులు ఉపయోగించిన పికప్ వ్యాన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
గంజాయితో వ్యక్తి అరెస్టు
కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని సోంపేట రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని కంచిలి పోలీసులు శనివారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్ర పరిధి ఝార్సుగుడ జిల్లా గుమదెరా గ్రామానికి చెందిన అభినవ్ సింగ్ అనే యువకుడు మల్కన్గిరి జిల్లా సోమంతపూర్ గ్రామానికి చెందిన సుమన్ వద్ద తాను సేవించడానికి, అమ్ముకోవడానికి గానూ 3.370 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. తర్వాత ఈ గంజాయిని నలుపు రంగు బ్యాగ్లో ప్యాక్చేసి ప్రశాంతి ఎక్స్ప్రెస్లో బెంగుళూరు తరలించేందుకు సిద్ధమయ్యాడు. దీనిలో భాగంగా సోంపేట రైల్వేస్టేషన్ దగ్గరలోని రైల్వే పార్కు ముందు ఉన్న బీటీ రోడ్డు వద్ద వేచి ఉండగా కంచిలి ఎస్ఐ పి.పారినాయడు, పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. అతని వద్ద నుంచి గంజాయి నిల్వతో పాటు ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దీనిపై సోంపేట సీఐ బి.మంగరాజు కేసు నమోదు చేశారు. -
పిడుగు పడి మహిళ మృతి
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మహరాజ్పల్లి గ్రామంలో గురువారం రాత్రి పిడుగు పడి ఎంకి మడ్కామి (35) అనే మహిళ మృతి చెందింది. ఆమె భర్త భీమ మడ్కమికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. భీమా, ఎంకి ఇద్దరూ తమ పొలంలో వేరుశనగ పంటకు కలుపు మొక్కలు తీయడం కోసం గురువారం పొలానికి వెళ్లారు. అక్కడే గుడిసెలో వండుకుని తిన్నారు. సాయంత్రానికి గాలి వాన రావడంతో ముందు పిల్లలను ఇంటి వద్ద దింపడానికి భీమ బైక్పై వెళ్లారు. రాత్రి సామాన్లు తీసుకురావడానికి ఎంకి గుడిసె వద్దకు వెళ్లగా రాత్రి ఏడింటికి పిడుగు పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. భర్త భీమకు తీవ్ర గాయాలయ్యాయి. భీమ కేకలు వేయగా సమీపంలోని వారు వచ్చి ఆయను ఎంవీ 79 ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు ఎంకి మృతదేహానికి కలిమెల సమితి ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి ఇతర కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతురాలికి 7 ఏళ్ల కొడుకు, 5 ఏళ్ల కూతురు ఉన్నారు. -
కాలవైశాఖి బీభత్సం
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లాలోని పలు చోట్లు గురువారం రాత్రి కాల వైశాఖి బీభత్సం సృష్టించింది. దీంతో జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో ఎంవీ 43 గ్రామంలో ఇళ్లపై చెట్లు కూలిపోయాయి. కరెంటు సరఫరా ఆగిపోగా.. రేకులు ఎగిరిపోయి ఇళ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. కలిమెల సమితిలో కూడా పలు చోట్ల చెట్లు పడిపోయాయి. సరస్వతి శిశుమందిర్ స్కూల్పై చెట్లు పడి భారీ నష్టం వచ్చింది. కానీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కలిమెల సమితిలో ఉన్న గోపబంధు మహా విద్యాలయానికి వెళ్లే మార్గంలో భారీ చెట్టు కూలిపోయి రాకపోకలు స్తంభించాయి. -
ఐఐటీ భువనేశ్వర్లో బ్లెండెడ్ మోడ్ ఎం.టెక్ ప్రోగ్రామ్
భువనేశ్వర్: స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) ఈవీఏసీఏడీతో వ్యూహాత్మక భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) టెక్నాలజీలో బ్లెండెడ్–మోడ్ ఎం.టెక్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద పరిశ్రమలు తదితర రంగాల్లో పని చేస్తున్న ఇంజినీర్లు తమ కెరీర్ను కొనసాగిస్తూనే ఈవీ వ్యవస్థలు, బ్యాటరీ టెక్నాలజీ, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, వాహన అనుసంధానంలో ఉన్నత నైపుణ్యాన్ని పొందగలుగుతారు. ఆటోమోటివ్ పరిశ్రమలో ఈవీ ఆధారిత నైపుణ్యం గల నిపుణులకు పెరుగుతున్న డిమాండ్కు ప్రతిస్పందనగా ఈ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. కెరీర్ను కొనసాగిస్తూ ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా సౌకర్యవంతమైన బ్లెండెడ్ మోడ్ నిర్మాణం, ఆన్లైన్ అభ్యాసం క్యాంపస్లో జరిగే ప్రత్యేక తరగతులతో అనుసంధానపరిచారు. బ్లెండెడ్–మోడ్ ఎం.టెక్ ప్రవేశం ఇలా.. ఈ ప్రోగ్రామ్లో ప్రవేశానికి గేట్ అర్హత అవసరం లేదు. విద్యా నేపథ్యం, వృత్తిపరమైన అనుభవం ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ బహుళ విషయాల పాఠ్యప్రణాళిక, వాహన రూపకల్పన, పవర్ట్రెయిన్ అభివృద్ధి, ఈవీలలో నియంత్రణ అంశాలు, బ్యాటరీ రూపకల్పన, నిర్వహణ, డయాగ్నోస్టిక్స్, ఛార్జింగ్ టెక్నాలజీలు, మౌలిక సదుపాయాలు మొదలైన ఈవీల యొక్క వివిధ రంగాలలో సమగ్ర జ్ఞానాన్ని అందించడానికి రూపొందించబడింది ఈ ప్రోగ్రామ్. ఈ ఏడాది జూలై 24న ప్రారంభం కానుంది. వినూత్న, సరళమైన అభ్యాస నమూనా ద్వారా ఈవీ రంగంలో తమ కెరీర్ను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించే పరిశ్రమ, సంబంధిత రంగాల నుండి అర్హులైన అభ్యర్థుల కోసం ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. -
బిజూ స్వాఽభిమాన్ మంచ్ సన్నద్ధం
స్థానిక పోరుకు ..రాయగడ: రానున్న పంచాయతీ ఎన్నికల్లో బిజు స్వాభిమాన్ మంచ్ కీలక పాత్ర పొషిస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు, రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని కొలనరలో మొదటి సారిగా ఆ సంస్థ తరఫున భారీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలతో మమేకమై తన సేవలను అందించానని అన్నారు. బీజేడీకి గుడ్బై చెప్పి బిజూ స్వాభిమాన్ మంచ్ (బీఎస్ఎం) పేరిట సామాజిక సేవా సంస్థను తొమ్మిది నెలల క్రితం ఏర్పాటు చేసినట్టు వివరించారు. అయితే సంస్థ ఏర్పాటై తొమ్మిది నెలల పూర్తయినప్పటికీ ఎటువంటి కార్యకలాపాలను నిర్వహించలేదని అన్నారు. తనను నమ్ముకొని ఉన్న అభిమానులకు, మద్దతు దారులకు, ప్రజలకు తాను అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఆవిర్భవించిన ఈ సంస్థ రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందని ప్రకటించారు. ప్రజల ఆదరాభిమానాలతో సంస్త తరఫున అభ్యర్తులను ఎన్నికల బరిలొ దింపేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. త్వరలో ప్రతీ పంచాయతీలో ఇటువంటి తరహా కార్యక్రమాలను బీఎస్ఎం ద్వారా నిర్వహించనున్నామని అన్నారు. ప్రజా సేవ చేసేందుకు అభిష్టం ఉన్న వారు తమ వెంట ఉన్నారని వారి అభీష్టం మేరకు ఎన్నికల్లో పొటీ చేసేందుకు వారికి అండగా నిలుస్తానని అన్నారు. ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా బీఎస్ఎం సంస్థ పనిచేయదని.. ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక మాట్లాడుతూ.. ప్రజల ఆదరణ ఉన్నంత వరకు తామంతా కలిసి పోరాడుతామని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అండదండలతో బిజుస్వాభిమాన్ మంచ్ ఏర్పాటవ్వలేదన్నారు. నెక్కంటి భాస్కరరావు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేశారని వివరించారు. తామెప్పుడూ నెక్కంటి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బిజూ స్వాభిమాన్ మంచ్ ఉనికిని చాటుకుంటామఅన్నారు. ప్రజల ఆదరణ ఉంటే ఏ పార్టీ అండదండలు అవసరం లేదని హిమిరిక అన్నారు. ప్రజలే సైనికులుగా నెక్కంటికి వెన్నెంట ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా రాయగడ సమితి వైస్చైర్మన్ హర ప్రసాద్ హెప్రుక ఆదివాసీ భాషలో ప్రసంగించారు. అంతకు ముందు కొలనారలొ భారీ ర్యాలీ నిర్వహించగా.. నెక్కంటితో పాటు అతని అనుచరులు, మద్దతుదారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పర్లాకిమిడిలో మామిడిపండ్ల మేళా
పర్లాకిమిడి: స్థానిక మహారాజా కళాశాల సమీపంలో జిల్లాస్థాయి మామిడిపండ్ల మేళా, మన గ్రామ మామిడిపండ్ల రుచులుతో స్టాళ్లను డీఆర్డీఏ ఆధీనంలో ఉన్న ఓర్మాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశా రు. మేళాను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ము ఖ్యఅతిథిగా విచ్చేసి శుక్రవారం ప్రారంభించగా, గౌరవ అతిథులుగా జిల్లా పరిషత్తు చైర్మన్ గవర తిరుపతిరావు, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, ఏడీఎం మునీంద్ర హానగ, ఓర్మాస్ డిప్యూటీ సీఈ.వో ఆశిష్ రవుళో, డీపీఎం టిమోన్ బోరా, జిల్లా పరిషత్తు సీడీవో దయామయ పాఢి తదితరులు విచ్చేసి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సేంద్రియ పండ్లతోటల్లో పండిస్తున్న మామిడి పండ్లను తిలకించి వాటి రుచులను ఆస్వాదించారు. స్టాళ్లను మిషన్ శక్తి, స్వయం సహాయక మహిళా గ్రూపులు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాశీనగర్, గుసాని సమితిల్లో పండిస్తున్న మామిడి తోటల్లో బంగినపల్లి, చెరుకు రసాలు, ఆమ్రపల్లి, దోసెరీ రకాలను అమ్మకానికి ఉంచా రు. కిలో మామిడిపండ్లు రూ.40 చొప్పున్న అమ్ము తున్నారు. అలాగే అనాసపండ్లు ఒకటి రూ.60లు (క్వీన్ రకం) అమ్ముతుండటం విశేషం. రెండురో జుల పాటు ఈ మామిడిపండ్ల స్టాల్స్ కాలేజ్ జంక్షన్ వద్ద వుంటాయని అధికారులు తెలియజేశారు. -
నేటి నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్. ఎస్. గోపాలన్ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఈఓ మాట్లాడుతూ ఈ ప్రక్రియ జూన్ 28 వరకు నిరవధికంగా కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 కోట్లకు పైగా ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. ఈ ప్రక్రియలో సుమారు 17 శాతం లోపాలు గుర్తించారు. నేటి నుంచి బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ప్రతి ఇంటినీ సందర్శించి సవరణలు చేస్తారని గోపాలన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఓటరుకు 2 ఫారాలు అందజేస్తారు. ఒక కాపీని ఓటరు తన వద్ద ఉంచుకుని, మరొక కాపీని సంబంధిత బీఎల్ఓకు సమర్పించాలి. ఓటరు పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, చిరునామా లేదా ఫోటోలో ఏవైనా తప్పులు ఉంటే, వాటిని అక్కడికక్కడే సరిదిద్దడంలో బీఎల్ఓ సహాయం చేస్తారు. ఓటర్లు ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ voterr.eci.gov.in నుంచి ఫారాలను డౌన్లోడ్ చేసుకుని, వాటిని నింపి, ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయవచ్చు. ఫారాలు నింపడంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓటర్లకు బీఎల్ఓలు పూర్తి సహాయాన్ని అందిస్తారు. భారత పౌరులు కాని వారిని ఓటర్ల జాబితా నుండి నేరుగా తొలగిస్తామని సీఈఓ తెలిపారు. బీఎల్ఓలు 3,33,99,591 గృహాలను సందర్శించి 31,026 మంది బూత్ స్థాయి ఏజెంట్ల సహకారంతో పని చేస్తారు. బీఎల్ఓలు ఉదయం ఇంటింటికీ వెళ్లి ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ తమ బూత్లలో అందుబాటులో ఉంటారు. మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లు, బీఎల్ఓ సందర్శన సమయంలో తమ సంతకంతో ఫోటో అందించాల్సి ఉంటుంది అన్నారు. -
సవరణ ప్రక్రియ ప్రారంభం
నేటి నుంచి ఓటరు జాబితారాయగడ: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం మూడో దశను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఈ మేరకు కలెక్టర్ అఽశుతొష్ కులకర్ణి శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మే 20 నుంచి ప్రారంభమైన ప్రాథమిక సన్నాహాలు ,శిక్షణ కార్యక్రమాలు, ముద్రణ పనులు మే 29 తో పూర్తయ్యాయని వివరించారు. అనంతరం మే 30 వ తేదీ నుంచి జూన్ 28 వ తేదీ వరకు జిల్లాలొని అన్ని బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరించారని చెప్పారు. ఈ సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని వివరించారు.జూలై 5 న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుందని తెలిపారు. జూలై 5 నుంచి ఆగస్టు 4 వరకు కొత్త పేర్ల నమోదు, సవరణలు, అభ్యంతరాల దాఖలుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అందిన దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన జూలై 5 నుంచి సెప్టెంబరు 2 వరకు కొనసాగుతుంది. అనంతరం అన్ని ప్రక్రియలు పూర్తి చేసి సెప్టెంబరు 6 వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించేందుకు బీఎల్ఓల కొసం ప్రత్యేక మార్గ దర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి కుటుంబాన్ని సందర్శించి భౌతికంగా ధ్రువీకరణ చేపట్టడంతో పాటు, గైర్హాజరు, ఇతర ప్రాంతాలకు మారిన, మరణించిన ఓటర్ల వివరాలను గుర్తించి ప్రత్యేక జాబితా సిద్ధం చేయనున్నారు. అలాగే కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం–6, పేర్ల తొలగింపునకు ఫారం –7, వివరాల సవరణకు ఫారం –8 లను పంపిణీ చేసి పరిశీలిస్తామని చెప్పారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల సౌకర్యాలు, దూరం, దివ్యాంగులు, వృద్ధులకు అందుబాటు వంటి అంశాలను కూడా బీఎల్ఓలు పరిశీలించనున్నట్లు చెప్పారు. దీని ద్వార ఎన్నికల ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
జగన్నాథ రథయాత్రపై సన్నాహక సమావేశం
పర్లాకిమిడి: పూరీ తర్వాత అత్యంత ఆడంబరంగా జరిగే రథయాత్ర కోసం స్థానిక యూనియన్ బ్యాంకు స్వయం ఉపాధి శిక్షణ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం రథయాత్ర కమిటీ సభ్యులు, ప్రెస్తో ఒక సన్నాహాక సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి అతిథులుగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి దయామయ పాడి, తహసీల్దార్ బెహరా, సీనియర్ సిటిజన్ పూర్ణచంద్ర మహపాత్రో, తదితరులు హాజరయ్యారు. జూలై 16న రథయాత్రకు యాత్రికుల భద్రత, సీసీ కెమెరాలు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలపై సబ్కలెక్టర్ అనుప్ పండా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ప్రతి రోజు గుండిచా మందిరం వద్ద విక్రయించే ప్రసాదాల నాణ్యత, భక్తులకు రూ.50లకే ఓబడా ప్రసాదం పంపిణీ తదితర విషయాలపై కమిటీ సభ్యుల అభిప్రాయాలను అధికారులు సేకరించారు. గత రథయాత్రలో ఖర్చులపైనా కలెక్టర్ చర్చించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య రథయాత్రలో అధికంగా ఉంటుందని, దీనిని అధిగమించాలని పోలీసు అధికారులకు సూచించారు. -
గాదె వెంకటరెడ్డి మృతికి సంతాపం
నరసన్నపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి గా పనిచేసిన గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేశా రు. దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలకు విశేష సేవలందించారని, ఆయన మృతి తీరని లోటని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఇచ్ఛాపురం: ఏపీ పీజీసెట్ 2026 ఫలితాల్లో తెలుగు విభాగంలో పట్టణానికి చెందిన తెన్నేటి శ్రీనిజ శర్మ సత్తాచాటింది. 82 మార్కులతో స్టేట్ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఈమె పట్టణంలోని ప్రముఖ పురోహితుడిగా అందరి కీ సుపరిచితులైన తెన్నేటి తేజేశ్వర శర్మ కుమా ర్తె కావడంతో అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ పీజీసెట్–2026 ఫలితాల్లో నౌపడకు చెందిన అంపలాం సుచిత్ర ప్రతిభ కనబర్చారు. బోటనీ సబ్జెక్టులో 59 మా ర్కులు సాధించడం ద్వారా 169వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈమెను పలువురు అభినందించారు. గార: జిల్లా జైలు సూపరింటెండెంట్గా జి.మధుబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజయనగరం జైలు డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తూ శ్రీకాకుళం జిల్లా జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్గా పనిచేసేవారు. అడిషనల్ సూపరింటెండెంట్గా పదోన్నతి రావడంతో జిల్లా జైలు సూపరింటెండెంట్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బుసాబద్ర గ్రామానికి చెందిన ఉపాధి హామీ వేతన దారురాలు పల్లి మహాలక్ష్మి (50) శుక్రవారం వడదెబ్బతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహాలక్ష్మి శుక్రవారం ఉదయం గ్రామంలోని ఉపాధి పనికి వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. సాయంత్రం పని సమయానికి కుటుంబ సభ్యులు నిద్ర లేపినా లేవలేదు. చూస్తే ఆమె చనిపోయారు. ఆమె మృతితో కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమెకు భర్త శ్యామ్ సుందర్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు పలాస: మండలంలో కొబ్బరిచెట్లూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సోంపేట మండలం తాళ భద్ర గ్రామానికి చెందిన సాయికుమార్ హరిపు రం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. వెను క నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడ ఉన్నవారు 108కి సమాచారం ఇవ్వగా వారు వెంటనే వచ్చి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రున్ని తీసుకొని వెళ్లి మెరుగైన వైద్యం అందించారు. కాశీబుగ్గ సీఐ రామకృష్ణను వివరణ కోరగా తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు. -
722 లీటర్ల నాటుసారా స్వాధీనం
● 9 మంది అరెస్టు రాయగడ: జార్సుగుడలోని అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలోని బెల్పహర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మోహన్పూర్, ఉజల్పూర్ గ్రామాల్లో శుక్రవారం విస్కృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 722 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు తయారీకి వినియోగించే 47 క్వింటాళ్ల విప్పపువ్వును స్వాధీనం చేసుకుని అందుకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. అదేవిధంగా సారా తయారీకి వినియోగించే 12 క్వింటాళ్ల ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర తెలిపారు. రాయగడ: స్థానిక వికల్స్ సంస్థ ఆధ్వర్యంలో ఆమ మట్టి– అమ సంకల్ప్ సంయుక్తంగా సదరు సమితి పరిధిలో గల జఫాకల్లో శుక్రవారం బాలలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రమశిక్షణే విజయానికి తాళం చెవి అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి జగదీష్ చంద్ర దొర స్వాగత ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమైంది. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ డీకే మహాంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలొ భాగంగా క్రమశిక్షణ, సమయపాలన, వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థులకు విస్కృతంగా వివరించారు. విద్యార్థులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు పాటించాల్సిన దినచర్య గురించి వివరించారు. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి విజయానికి దోహదపడుతుందని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ అర్చనా పట్నాయక్, కృష్ణ ప్రియ సహాని, శశిభూషణ్ పట్నాయక్, డాక్టర్ వినోద్ చంద్ర పాత్ర, కుముద్ చంద్ర సామంతరాయ్ పాల్గొన్నారు. అనంతరం పిల్లలను ఉత్సాహపరిచేందుకు వివిధ క్రీడలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసారు. బీజేపీలో పలువురి చేరిక పర్లాకిమిడి: గజపతి జిల్లా బీజేపీలోకి వందలాది మంది సర్పంచ్లు, నాయిబు సర్పంచ్లు, బీజేడీ కార్యకర్తలతోపాటు కాశీనగర్ జెడ్పీటీసీ జోన్–1 సభ్యురాలు రోక్కం రాజ్యలక్ష్మి చేరారు. గుసాని సమితి లింగిపురం గ్రామంలో శుక్రవారం జరిగిన బీజేపీ మిశ్రణ్ పర్వ్కు అధ్యక్షత జిల్లా బీజేపీ అధ్యక్షుడె నవకిశోర్ శోబోరో వహించారు. బీజేపీ నాయకులు అమియ మహాపాత్రో, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు ముఖ్య అతిథులు విచ్చేశారు.ముఖ్యమంత్రి మోహాన్చరణ్ మఝి పరిపాలనకు ఆకర్షితులై అనేకమంది గుమ్మా, కాశీనగర్, గుసాని సమితుల నుంచి బీజేడీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరామని జెడీటీసీ సభ్యురాలు రోక్కం రాజ్యలక్ష్మి అన్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేడీ వీడి బీజేపీలోకి నాయకులు చేరడంతో తమ పార్టీకి బలం రెట్టింపు అయిందని కోడూరు నారాయణరావు అన్నారు. ఈ మిశ్రణ్ పర్వ్లో సీనియర్ నాయకులు (కాశీనగర్) ఛిత్రి సింహాద్రి, సాధారణ కార్యదర్శి జగన్నాధ మహాపాత్రో, కాశీనగర్ నాయకులు రొక్కం సతీష్, పర్లాకిమిడి నియోజకవర్గం నాయకులు, కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. సారాతో ఒకరి అరెస్టు రాయగడ: నాటుసారా అక్రమ రవాణా, తయారీపై ఉక్కుపాదం మోపిన జిల్లా అబ్కారీ శాఖ అధికారులు ఈ మేరకు విస్తతంగా దాడులను నిర్వహిస్తున్నారు. అబ్కారీ శాఖ అధికారి సంతోష్ కుమార్ ధలసామంతరాయ్ ఆదేశానుసారం సిబ్బంది పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మోటార్ సైకిల్పై నాటుసారాను తరలిస్తున్న ఎస్.జగన్నాథరావును పట్టుకున్నారు. అతని వద్ద 40 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. -
గంగమ్మ ఉత్సవాలు ప్రారంభం
రాయగడ: స్థానిక పిట్లవీధిలో గల అగ్ని గంగమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఆదివాసీ మేళతాళాలతో, పండితుల వేదమంత్రాలతో అమ్మవారి పాదాలను స్థానిక కేఎన్కే సమీపంలో గల పాదాల గుడి నుంచి తీసుకువచ్చారు. ఐదు రోజుల పాటుగా జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం నుంచి అమ్మవారి ప్రతీకలైన ఘటాలు పురవీధుల్లో ఊరేగిస్తారు. బుధవారంతో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు.చెట్టుపై నుంచి జారి పడి విద్యార్థి మృతి రాయగడ: జామకాయలు కోసేందుకు చెట్టెక్కిన విద్యార్థి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందిన ఘటన జిల్లాలోని ఒంటరిగడు గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడిని గణేష్ ముదలి (13 )గా గుర్తించారు. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అందిన వివరాల ప్రకారం.. ఒంటరిగుడ ప్రాథమిక పాఠశాలలో 5 వ తరగతి చదువుతున్న గణేష్ శుక్రవారం తన స్నేహితులతో కలసి జామకాయలు కోసుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో విద్యార్థి ప్రమాదవశాత్తు కాలుజారి చెట్టుపై నుంచి కిందకు పడిపోయాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బరంపురంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నిందితుడికి రెండున్నరేళ్ల జైలు శిక్ష రాయగడ: ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడికి రెండున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తు రాయగడ సీనియర్ సివిల్ జడ్జి ఆశీస్ పట్నాయక్ శుక్రవారం తీర్పునిచ్చారు. నిందితుడు రాజేంద్ర దీప్కు రూ.ఐదు వేల జరిమానా చెల్లించాలని, లేని పక్షంలో అదనంగా మరో మూడు నెలలపాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేకేపూర్ ప్రాంతంలో మహిళా హోంగార్డు రీనా బిడిక ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సమయంలో బైక్ను ఆపేందుకు ప్రయత్నించగా.. బైకు నడుపుతున్న రాజేంద్ర దీప్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. అనంతరం తిరిగి అక్కడి వచ్చి రీనా బిడికపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రీనాను రాయగడ జిల్లా కేంద్ర ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి రాజేంద్రను అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన జడ్జి ఈ మేరకు తీర్పునిచ్చారు. ఆరుగురు మృతిపై నివేదిక ఇవ్వండి భువనేశ్వర్: సెప్టిక్ ట్యాంక్లో ఊపిరాడక ఆరుగురు మరణించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి, కలహండి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సవివరమైన నివేదికను కోరింది. ఈ నెల 26న కలహండి జిల్లా గౌడ కర్లఖుంట గ్రామంలో నిర్మాణ పనుల కోసం మేసీ్త్రలు సెప్టిక్ ట్యాంక్ను తెరిచి పని చేసేందుకు లోపలికి వెళ్లిన కార్మికుడు ఊపిరాడక చిక్కుకున్నట్లు గమనించి కాపాడేందుకు తోటి కార్మికులు ట్యాంక్లోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలను మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి జాతీయ మానవ హక్కుల సంఘం స్వయంగా చొరవ కల్పించుకుంది.ఈ విషయంపై రెండు వారాల్లోగా సవివరమైన నివేదికను సమర్పించాలని కోరుతూ, కమిషన్ ఒడిశా ముఖ్య కార్యదర్శికి మరియు కలహండి పోలీస్ సూపరింటెండెంట్కు నోటీసులు జారీ చేసింది. జాతీయ మానవ హక్కుల సంఘం కోరిన నివేదికలో దర్యాప్తు స్థితి, గాయపడిన కార్మికుడి ఆరోగ్యం, అలాగే బాధితులకు చెల్లించిన నష్ట పరిహారం వివరాలు ఉండాలని పేర్కొంది. -
మహేంద్రగిరిని కాపాడండి
● విశ్వబసు సవర సంస్కృతి ఆధ్వర్యంలో నిరసనపర్లాకిమిడి: మహేంద్రగిరి పర్వతంపై అసాంఘిక శక్తులు చొరబడి ప్రకృతి ఒడిలోవున్న ఖనిజాలు, గ్రా నైట్ తవ్వకాలు, ఔషధమొక్కలు దోపిడీకి గురౌతుందని, అలాగే ఆదివాసీల హక్కులను హరించివేసి అ సహన వాతావరణం సృష్టిస్టు తున్నారని, వీటిని బంద్ చేయాలని కోరుతూ విశ్వబసు సవర సంస్కృతి, మహేంద్రగిరి సురక్షా మంచ్ పేరిట కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. జూన్ ఒకటి నుంచి మహేంద్రగిరి పై జరుగనున్న మేళాకు తాము వ్యతిరేకం కాదని ఆదివాసీ సురక్షా మంచ్ నాయకులు తెలియజేశారు. గజపతి స్టేడియం నుంచి బయలుదేరిన ర్యాలీ సమితి మాజీ చైర్మన్ ధనేశ్వర్ భుయ్యాన్ ఆధ్వర్యంలో జరిగింది. ర్యాలీలో కోయిపూర్, బారో ఘోరో, మహేంద్రగిరి చుట్టుపక్కల వున్న గ్రామప్ర జలు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం పలు డి మాండ్లతో కూడిన వినతిని జిల్లా కలెక్టర్ అక్షయ సు నీల్ అగర్వాల్కు ధనేశ్వర భుయ్యాన్ అందజేశారు. -
ప్రభుత్వ భూమి కబ్జా
● స్థలం చుట్టూ కర్రలు పాతిన టీడీపీ నేత సంతబొమ్మాళి: మూలపేట పోర్టుతో నౌపడలో భూములకు విలువ పెరగడంతో ప్రభుత్వ స్థలం కనబడితే చాలు వెంటనే అధికార పార్టీ నాయకులు కబ్జా చేసేస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. తాజాగా మండలంలోని నౌపడ నుంచి వెంకటాపురం వెళ్లే ఆర్అండ్బీ రోడ్డుకు ఆనుకొని నౌపడ పోలీస్స్టేషన్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక టీడీపీ నాయకుడు ఆక్రమణ చేశారు. సర్వే నంబర్ 386లో రోడ్డుకు అనుకుని ఉన్న సుమారు 6 సెంట్ల ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆక్రమించిన స్థలం చుట్టూ పొడవైన కర్రలు పాతాడు. ఆక్రమించిన భూమి విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.50 లక్షల వరకు ఉంటుంది. పట్టించుకోని అధికారులు ఈ స్థలం పక్క నుంచే ప్రతిరోజూ అధికారులు రాకపోకలు సాగిస్తున్నా తమకేమి పట్టనట్లు వ్యవహరించారు. దీంతో ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించారు. ఆక్రమణలు తొలగించాలని అధికారులు పలుమార్లు చెప్పినా సదరు టీడీపీ నాయకుడు పట్టించుకోలేదు. అది తమ ఆధీనంలో ఉన్న భూమి అని, దీనికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని అధికారులకు చెబుతున్నాడు. అయితే పత్రాలు చూపించమని అధికారులు అడిగితే సదరు టీడీపీ నేత ఇవ్వకపోవడం కొసమెరుపు. అందువలన ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి యు.ఉమాపతిని అడగగా ఆక్రమించినది ప్రభుత్వ భూమి అని, ఆక్రమణలు తొలగించాలని పలుమార్లు చెప్పడం జరిగిందన్నారు. తొలగించకపోవడంతో శుక్రవారం నోటీసులు ఇచ్చామని తెలియజేశారు. -
విద్యతో పాటు విలువలు అవసరం
రాయగడ: విద్యతో పాటు విద్యార్థులకు విలువలు కూడా ఎంతో అవసరమని బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక అన్నారు. జిల్లాలోని మునిగుడలో ఉన్న జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు శుక్రవారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాఽధించిన సీకృతి రథ్, డొలినాయక్, బిరూపాక్ష సాహు, భాగ్యదీప్ స్వయి, దేవేంద్ర కౌసల్య, దేవేతి హికక, లిపున్ దిబ్రిసింగ్, రోషన్ కుమార్ నాయక్, ఈసాన్ బలియార్సింగ్, డి.విశ్వజీవన్ పాత్రో సహా పది మంది ప్రతిభావంతులలైన విద్యార్థులకు సత్కరించారు. సంఘం అధ్యక్షుడు దేవేంద్ర నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమతి విద్యాశాఖ అధికారి గణేష్ సబర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హృషికేష్ జాలి, తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ఇంద్రావతి–విశాఖపట్నం ఓఎస్ఆర్టీసీ బస్ ప్రారంభం
కొరాపుట్: ఎట్టకేలకు ఇంద్రావతి–విశాఖపట్నం ఓఎస్ఆర్టీసీ బస్ ప్రారంభమైంది. బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ప్రారంభ పూజలు చేసి బస్ ప్రారంభించారు. నబరంగ్పూర్ జిల్లా తెంతులకుంటి సమితి ఖాతీగుడ (ఇంధ్రావతి) నుంచి నేరుగా విశాఖ పట్నం కోసం చాలా కాలంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అప్పర్ ఇంద్రావతి హైడ్రో ఎలక్రసీటీ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నాలుగు ఏపీఎస్ ఆర్టీసి బస్సులు విశాఖ పట్నం నుంచి నేరుగా నడిపింది. ఈ బస్సులు సుమారు 35 ఏళ్ల పాటు నడిచాయి. అనంతరం కాల క్రమేణా ఈ బస్సులు కుదిస్తూ వచ్చారు. కరోనా సమయం నుంచి పూర్తిగా రద్దు చేశారు. దాంతో విశాఖ పట్నం వైద్య, విద్య, ఇతర పనుల కోసం వేళ్లే వారు నబరంగ్పూర్ వచ్చి విశాఖ పట్నం బస్సులు ఎక్కుతున్నారు. తమకు నేరుగా విశాఖ పట్నం బస్సు కావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ సమస్యని ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి తాను గెలిచిన తర్వాత పరిష్కరిస్తానని గత ఎన్నికలలో ఇంధ్రావతి ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బస్సు ఏర్పాటు చేశారు. ఈ బస్సు ప్రతి రోజు రాత్రి 8.20 కి ఇంద్రావతి నుంచి బయల్దేరుతుంది. బస్సు ప్రారంభ సమయం లో ఎంఎల్ఎ మాట నిలబెట్టుకున్నందున్న ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.20 వేల కోట్లతో నిర్మిస్తున్న విశాఖ పట్నం–రాయ్పూర్ భారత మాల ఆరు అంచెల జాతీయ రహదారిని పరిశీలించారు. అక్కడ మండుటెండలో పని చేస్తున్న మహిళా కార్మికులతో సంభాషించారు. వారికి అందుతున్న సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికుల భద్రతకి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను సూచించారు. -
అతి త్వరలోనే కొరాపుట్ జిల్లాకు 50 కొత్త ఈవీ బస్సులు
జయపురం: కొరాపుట్ జిల్లాకు అతి త్వరలో 50 కొత్త ఈవీ (ఎలక్ట్రికల్ వెహికల్) బస్సులు రానున్నాయి. సుస్థిరమైన, కాలుష్య రహిత ప్రజా రవాణా సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పిఎంఈ–డ్రైవ్ పథకంలో కొరాపుట్ జిల్లాకు 50 కొత్త ఈవీ బస్సులు ప్రవేశ పెట్టనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఈవీ బస్సులు 200 కిలోమీటర్ల పరిధిలో నడుస్తాయి. జయపురం నుంచి కొరాపుట్ జిల్లాలో వివిధ ప్రాంతాలను కలుపుతూ ఈ బస్సులు నడుస్తాయి. ఈ పథకంలో 6 నెలలలో ఈవీ బస్సులు రోడ్లపైకి రానున్నాయని వెల్లడించారు. ఈ బస్సులు పయనించే మార్గంలో ప్రత్యేక చార్జింగ్ స్టేషన్లు, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్లు, ప్రత్యేక ట్రాన్స్ పార్మర్లు మొదలగు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో బస్సు సౌకర్యాలు లేని 6 మారుమూల పంచాయతీల్లో ముఖ్యమంత్రి బస్సు సేవా పథకంలో ఈ బస్సులు నడుపుతారు. రెండు నెలల్లో జయపురంలో ఆటోమెటిక్ వాషింగ్ ప్లాంట్ నిర్మించనున్నారు. మురుగు నీటిని సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ది చేసి బస్సులను కడిగేందుకు రీ సైక్లింగ్ చేస్తారు. కొత్తగా రానున్న 50 ఈవీ బస్సులు ఉంచే స్థలం కొరకు ఓఎస్ఆర్టీసీ డిపోలో ఉన్న 24 పాత బస్సులను ఒక నెలలోగా స్క్రాప్గా వేలం వేయనున్నారు. ఈ పథకం సజావుగా అమలు చేసేందుకు రాష్ట్ర రవాణా శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ మిశ్ర, కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్లు నిర్మాణంలో ఉన్న అటల్ బస్టాండ్లను తనిఖీ చేశారు. జయపురం నుంచి కొత్త వోల్వో బస్సు సర్వీస్ లను నడిపే ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉంది. ప్రభుత్వం ఆమోదిస్తే శబరిశ్రీక్షేత్రం కొరాపుట్ నుంచి కామాఖ్య పీఠం వరకు, అలాగనే ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రధాన ప్రాంతాలకు రూట్లు కలుపుతారు. -
సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ
జయపురం: ఎం.ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం జయపురం వారి ఆధ్వర్యంలో ఆవు పేడతో ఉత్తమ ఎరువులు తయారీపై రైతులకు శుక్రవారం శిక్షణ శిబిరం నిర్వహించారు. దేశంలో రసాయనిక ఎరువుల కొరత, సరఫరాలో సమస్యలను దృష్టిలో ఉంచుకొని సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ప్రధాన మంత్రి పిలుపు మేరకు తమ సంస్థ ఆవు పేడతో ఉత్తమ సహజ ఎరువులు తయారీ శిక్షణ శిబిరం నిర్వహించిందని ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ జయపురం కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కార్తి చరణ లెంక వెల్లడించారు. ఎరువుల కొరత, అధిక వ్యవసాయ ఖర్చు, ఇతర దేశాల రసాయిక ఎరువులపై ఆధార పడటం వలన రైతులకు అధిక భారం అవుతుందన్నారు. ఎం.ఎస్ స్వామినాథన్ రిసేర్చ్ ఫౌండేషన్ కేంద్రం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సహజ వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వాటిలో కొరాపుట్ జిల్లా రైతులను మమేకం చేస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా స్థానిక వనరుల ఆధారిత వ్యవసాయం, జైవిక ఎరవులు, సంప్రదాయ పద్ధతుల ద్వారా మట్టి సారవంతాన్ని మెరుగుపరచటం, తద్వారా వ్యవసాయ ఖర్చు తగ్గించటం ద్వారా ధీర్ఘకాలిక వ్యవసాయ స్థిరత్వం ఏర్పడుతుందని వెల్లడించారు. ఈ శిక్షణా శిబిరంలో కొరాపుట్ గ్రామ పంచాయతీ నుంచి 50 మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం మాజీ అధికారి, జిల్లా ఉద్యానవన విశ్రాంత అధికారి ఎస్.బి.రమణ, తదితరులు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన రైతలకు ఆవుపేడతో ఎరువులు తయారీ చేసేందుకు ఉపయోగ పడే యంత్రాలను అందించారు. -
మజ్జిగ వితరణ
పర్లాకిమిడి: ఎండలు తీవ్రంగా ఉండడంతో స్థానిక ఫారెస్టు కూడలి వద్ద గురువారం అఖిల భారత యువజన సేన ఆధ్వర్యంలో పాదచారులకు మజ్జిక వితరణగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కె.నాగరాజు, భారతీయ మానవ హక్కుల పరిషత్ అధ్యక్షుడు లక్ష్మీకాంత పాఢి, జిల్లా న్యాయాలయం సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా, కార్యదర్శి టి.శ్రీకాంత్, అఖిల భారత యువజన సేన సభ్యులు వసంతనాయుడు, ప్రశాంత ప్రధాన్, జె.వైకుంఠరావు, ఎ.రవి, విక్రం నాయుడు పి.సంతోష్ తదితరులు పాల్గొన్నారు. దేవమాలి సందర్శన కొరాపుట్: కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉల్క రాష్ట్ర సరిహద్దులో పర్యటించారు. గురువారం ఒడిశాలోని ముఖ్య పర్యాటక ప్రాంతం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి దేవమాలి పర్వతం సందర్శించారు. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.20 వేల కోట్లతో నిర్మిస్తున్న విశాఖపట్నం – రాయ్పూర్ 6 అంచెల ఎకనామిక్ కారిడర్ సందర్శించారు. రాష్ట్ర సరిహద్దులోని సుంకి సమీపంలో అంపావల్లి వద్ద నిర్మాణం పూర్తి చేసుకున్న కవల టన్నెల్లో పర్యటించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడు, పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర ఖడం, ఎంపీ ప్రతినిధి మనోజ్ ఆచార్య ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి పర్లాకిమిడి: గుమ్మబ్లాక్ తిత్తిసింగి వద్ద బియ్యం లోడుతో వెళ్తున్న వ్యాన్, ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సెరంగో పోలీసుస్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అడవ పీఎస్ పరిధి గులుబ పంచాయతీ గలిమేరా గ్రామానికి చెందిన చందన్ లిమ్మా (18), జీవన్ లిమ్మా (14) వీరిద్దరూ సర్టిఫికెట్ కోసం గుమ్మ వెళ్తున్నారు. ఆ సమయంలో గారబంద నుంచి గుమ్మ వెళ్తున్న బియ్యం లోడు వ్యాను తిత్తిసింగి గ్రామం మలుపు వద్ద వీరిని ఢీకొనడంతో చందన్ లిమ్మా సంఘటన స్థలంలో మృతి చెందాడు. జీవన్ లిమ్మాను బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి బాధిత కుటుంబీకులు చేరుకుని నష్ట పరిహారం అందజేయాలని మూడు గంటలపాటు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. నీటి కోసం కదం తొక్కిన మహిళలు మల్కన్గిరి: మల్కన్గిరి సమితి చంపాఖారి గ్రామస్తులు గురువారం ఖాళీ బిందెలు పట్టుకుని నీటి కోసం కదం తొక్కారు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నందున చుక్క నీరు దొరకడం లేదు. గ్రామంలో 145 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఉన్న ఒక్క బోరు వద్ద గంటల తరబడి క్యూలో ఉంటున్నారు. ఈ గ్రామం పక్కనే సత్తిగూడ జలాశయం ఉంది. అయినా గ్రామానికి పైపులైన్లు వేయలేదు. దీంతో గురువారం జాతీయ రహదారిపై బిందెలు, మట్టి కుండలతో వారు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సమితి కార్యాలయానికి తీసుకువచ్చి చర్చించారు. త్వరలోనే తాగునీటి సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. -
నామినేషన్ల ప్రక్రియ పూర్తి
రాయగడ: ఈనెల 30వ తేదీన స్థానిక కొరాపుట్ కూడలిలోని యూనియన్ కార్యాలయం ప్రాంగణంలో జరగనున్న రాయగడ ట్రక్ యజమానుల సంఘం ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఆ యూనియన్ల మాజీ అధ్యక్షులు యాళ్ల వెంకటేశ్వరరావు (కొండబాబు), బి.మన్మథరావు (చిట్టి)లు బరిరో ఉండగా.. అదే పదవి కోసం ఎం.శ్రీనివాస్రావు, సోమేశ్వర్ పాత్రోలు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీంతో అధ్యక్ష పదవికి నలుగురు పోటీలో ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యక్ష పదవికి బి.శంకరరావు, కోట సూరిబాబు, బి.రమేష్, ముచ్చి శ్రీనివాస్రావు, ఎస్.రమణలు పోటీ పడుతుండగా, సాధారణ కార్యదర్శి పదవికి ఎస్.శంకరావు దొర, ప్రశాంత కుమార్ బిసొయి, వీజీవీ ప్రసాద్, రామ్ మోహన్ గోపాల శెఠి, కె.జానకిరావు, సహ కార్యదర్శి పదవికి టి.ప్రశాంత్, పానిక్రావు మహానందియా, రెడ్డి సత్యనారాయణ, ఎల్.రాజేశ్వరి, కోశాధికారి పదవికి ప్రశాంత్ కుమార్ సామల్, పి.రవి, ఏఆర్ జగన్నాథంలు బరిలో ఉన్నారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఎన్నికల అధికారిగా వ్యవహరించే రాయగడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రజసుందర్ నాయక్, న్యాయవాదులు సుశాంత్ పండ, నీల బిసొయ్లకు సమర్పించారు. -
సర్పంచ్కు ప్రభుత్వ ఉద్యోగం
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితిలో కోరుకొండ పంచాయతీలో సర్పంచ్గా పద్మా మాడ్కామి ఉన్నారు. అయితే ఆమెకు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాస్పత్రిలో అటెండెంట్గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఈ విషయంపై జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి దాశరఽథి సరాబు మాట్లడుతూ ఒక వ్యక్తి రెండు చోట్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేరని, ఆమె రాజీనామా చేయాలని తెలిపారు. మల్కన్గిరి : జిల్లాలో రెండు రోజుల పాటు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ అభియాన్ శిబిరాన్ని గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్ ప్రారంభించారు. ఈ శిబిరం లక్ష్యం బీజేపీ సంస్థను గ్రామీణ స్థాయిలో మరింత బలోపేతం చేయడం, వార్డు స్థాయి నుంచి కార్యకర్తలను మరింత చురుగ్గా తయారు చేయడం అని నిర్వాహకులు తెలిపారు. శిబిరంలో ఎంపీ, ఎమ్మెల్యేలు అన్ని సమితుల కార్యకర్తలు శిక్షణ పొందారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలో వ్యూహాలపై శిక్షణ ఇచ్చారని నవరంగ్పూర్ ఎంపీ బోలభద్ర మాఝి అన్నారు. కార్యక్రమంలో మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సి్ంగ్ మడ్కమి, జిల్లా కార్యదర్శులు మాణిక్ లాల్ చక్రవర్తి, నవఘన లోకెయి తదితరులు హాజరయ్యారు. -
గుణుపూర్లో భారీ చోరీ
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో భారీ ఎత్తున చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు శుభద్ర గ్రామంలో నివసిస్తున్న పెద్దిన రామారావు ఇంటిలో చొరబడి కిలో వెండి ఆభరణాలు, బంగారు నగలను దోచుకున్నారు. బాధితుడు ఈ మేరకు గుణుపూర్ ఆదర్శ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. రామారావు అతని బంధువుల ఇంటికి వారం క్రితం వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంటిలో చొరబడి దొంగతనానికి పాల్బడ్డారు. బుధవారం రామారావు పెద్ద కొడుకు ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో తలుపులు తెరిచి ఉండటం గమనించి దొంగతనం జరిగినట్లుగా గుర్తించాడు. లోపలకు వెళ్లి చూడగా అలమరను విరిచిన దుండగులు అందులో గల నాలుగు తులాల బంగారు హారం, రెండు చెవి దిద్దులు, కిలో వెండి ఆభరణాలు, రూ.12 వేల నగదు పోయినట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేయడంతో వెంటనే వచ్చి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘ప్రకృతి సంపద దోచుకుంటున్నారు’
రాయగడ: అపారమైన ఖనిజ సంపదలు గల ఒడిశాలో పరిశ్రమల పేరిట వాటిని దోచుకుంటున్నారని ఒడిశా పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ అన్నారు. స్థానిక అశోక్ మండపంలో గురువారం నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అధ్వర్యంలో జరిగిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని డబల్ ఇంజిన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. పరిశ్రమలు నెలకొల్పే నెపంతో ఖనిజ, ప్రాకృతిక సంపదలను హరించి వేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అడ్డుకున్న ఆదివాసీలపై తప్పుడు కేసులు పెట్టి వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలొ అడ్డుదోవలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అవిభక్త కొరాపుట్ జిల్లా ఎప్పుడూ కాంగ్రెస్కు కంచుకోటగానే నిలుస్తుందని అన్నారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయని దాస్ అన్నారు. పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుండే వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజలు కాంగ్రెస్ను గెలిపించాలని కొరాపుట్ లొక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక కోరారు. మొబైల్ టవర్ల ఏర్పాటు, గుణుపూర్–తెరువలి రైలు మార్గం వంటి అభివృద్ధి పనులు కాంగ్రెస్ నాయకుల ప్రయత్న ఫలమేనన్నారు. సమావేశంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బలభద్ర మాఝి, పీసీసీ సాధారణ కార్యదర్శి దుర్గా ప్రసాద్ పండ, కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రూపక్ తురుక్, రాయగడ జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు నంది గౌరి, సీనియర్ నాయకులు చంద్రమౌళి కుముంధాన్, వివిధ సమితులకు చెందిన కాంగ్రేస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
రామసాగరం పునరుద్ధరణకు ఇంజినీర్లతో సమావేశం
పర్లాకిమిడి: అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రామసాగరం పునరుద్ధరణ పనులపై ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి గురువారం సాయంత్రం మైనర్ ఇరిగేషన్ ఇంజినీర్లతో కలిసి వెళ్లి సమీక్షించారు. గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ అనుచరుడు మిషన్ శక్తి మాజీ మంత్రి పాండియన్ రామసాగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి, ఉన్నతీకరణకు నిధులు కేటాయించారు. అయితే రామసాగరంలో గుర్రపుడెక్క పెరిగిపోవడంతో ప్రభుత్వం సుమారు రూ. 3 కోట్లతో మట్టి తీత పనులు, గుర్రపుడెక్క తీశారు. కానీ పనులు ఎందువల్లనో సగంలో ఆగిపోయాయి. దీంతో తిరిగి రామసాగరంలో మట్టి పేరుకుపోయి తిరిగి గుర్రపు డెక్క మొలిచింది. రామసాగరం క్యాచ్మెంట్ ఏరియా నుంచి సుమారు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. ప్రకృతి సౌందర్యమైన రామసాగరం పర్లాకిమిడి మహారాజా కాలం నాటిది. గజపతి, కృష్ణసాగరాల నుంచి నేరుగా కాలువల ద్వారా రామసాగరం, సీతాసాగరం గొలుసుకట్టుగా అప్పట్లో నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వాలు వాటి నిర్వహణను అశ్రద్ధ చేయడంతో ఆక్రమణలకు గురై, మట్టి పేరుకుపోయింది. రామసాగరం చుట్టు రింగురోడ్డు నిర్మించి, బోటింగ్ పార్కుగా నిర్మించడానికి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి చిన్ననీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఆశిష్ మల్లిక్కు డి.పీ.ఆర్.లు ఇవ్వాలని కోరారు. రామసాగరం సుందరీకరణకు అంచనాలు రూపొందిస్తే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రులతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. అనంతరం రామసాగరం సుందరీకరణ పనులుపై చిన్ననీటి పారుదల శాఖ అసిస్టెంటు ఇంజినీర్లు మనోజ్ చౌదురి, ఇతర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. -
జయపురం బంద్ విజయవంతం
జయపురం: జయపురం సమితి గగణాపూర్లో గత కొన్నేళ్లుగా మూత పడి ఉన్న సేవాపేపరు మిల్లును వెంటనే పునరుద్ధరించాలనే డిమాండ్తో గురువారం జయపురంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ బందుకు పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు, పలు కార్మిక కర్షక సంఘాలు, ప్రజా సంఘాలు, పలు ట్రేడ్ యూనియన్లు, కమ్యూనిస్టు పార్టీ, బీజేడీ పార్టీలు జయపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ తదితర సంస్థలు పూర్తిగా మద్దతు తెలిపాయి. జయపురం ఓఆర్టీసీ డిపో నుంచి ఒక్క బస్సు బయటకు పోలేదు. అందువలన జయపురం నుంచి నవరంగపూర్, మల్కన్గిరి, రాయగడ జిల్లాలకే కాకుండా రాష్ట్ర నలుమూలలకు వెళ్లాల్సిన ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారు. అలాగే పట్టణంలోగల బజారులు, వాణిజ్య వ్యాపార సంస్థలు, బ్యాంక్లు, జీవిత భీమా సంస్థలు, ప్రధాన తపాలా కార్యాలయం, పట్టణంలో గల ప్రభుత్వ కార్యాలయాలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు మూత పడ్డాయి. జయపురం సమితి గ్రామాల నుంచి నిత్యావసర వస్తువులు తెచ్చే ఆదివాసీ చిరు వ్యాపారులు రాక పోవటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. బీజేడీ పిలుపు మేరకు సేవా పేపరుమిల్లు వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ బీజేడీ శ్రేణులుసేవా పేపరు మిల్లులో, బీజేడీ కార్మిక సంఘ శ్రేణులు రథొపొడియ కూడలి వద్ద మాజీ మంత్రి రబినారాయణ నందో నేతృత్వంలో ధర్నాలు నిర్వహించారు.అలాగనే ఎమ్.జి రోడ్డు సంగీత హొటల్ జంక్షన్లో బీజేడీ కార్యకర్తలు టెంట్ వేసి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. -
చిన్న విషయాలకే.. చితికిపోతున్నారు!
● క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత ● చిన్న వయసులోనే ముగించేస్తున్న జీవితాలు ● వారం వ్యవధిలో జిల్లాలో 10 మంది ఆత్మహత్య ● ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందంటున్న మానసిక నిపుణులు శ్రీకాకుళం క్రైమ్/టెక్కలి: జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది.. అయితే కొందరు ప్రతి చిన్న విషయానికీ అతిగా ఆలోచిస్తూ చావే పరిష్కారంగా విలువైన జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తున్నారు.. క్షణికావేశంలో చేస్తున్న ఇటువంటి మరణాల వలన వారి కుటుంబాలు నడిరోడ్డున పడుతున్నాయి.. ప్రస్తుతం వివిధ రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్న ఎంతో మంది మేధావులు ఒకప్పుడు ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాకే ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. అటువంటి వారి జీవిత చరిత్రలను ప్రతి రోజూ చూస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఒంటరి తనంగా తీసుకునే నిర్ణయాలతో నిండు జీవితాలను కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఈ తరహా ఘటనలు అధికమవున్నాయి. ముఖ్యంగా యువత చిన్న విషయాల కే ‘చితి’కిపోతున్నారు. ఈ తరుణంలో ఎటువంటి సమస్య ఎదురైనా ఒక్క క్షణం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల ఘటనలు.. ● ఈ ఏడాది ఏప్రిల్ 10న జేఆర్ పురంలో నాగవరపు వీరబాబు (39) మతిస్థిమితం సరిగ్గా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే తన ఇంటిని మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు పోలీసులు సమక్షంలో కూల్చేశారని పలాస సూదికొండ కాలనీకి చెందిన దళిత మహిళ ఏప్రిల్ 10న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ● మే 14న ఆమదాలవలస మండలం గాజులకొల్లివలసలో తల్లితో గొడవపడి రాజేష్, గార మండలం గిడిపేటలో భార్య మద్యం తాగొద్దన్నందుకు కర్రి త్రినాధరావు చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించారు. సారవకోట మండలం కురిడిలో భాస్కరరావు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● మే 10న సారవకోటలో కుటుంబ కలహాలతో కలుపు మందు తాగి తిరుపతి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ● మే 5న వజ్రపుకొత్తూరు మండలం చిన్న పల్లివూరుకు చెందిన గర్తం ఇందు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ● టెక్కలి తలగాంకు చెందిన వీరఘట్టం అనూష మే 4న ఆత్మహత్య చేసుకుంది. ● మే4న జి.సిగడాంలో తన భర్త హోంగార్డు శ్యామ లరావు మద్యానికి, బెట్టింగ్లకు బానిసై బంగారాన్ని అమ్మేయడంతో భార్య ఉరి వేసుకుంది. ● మే 1న టెక్కలి ఆంధ్రావీధిలో డి.రామకృష్ణ తన భార్యపై దాడి చేసి ఆపై కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ● ఏప్రిల్ 12న బూర్జ మండలానికి చెందిన చుక్కర తవుడు అనే రైతు అకాల వర్షాలకు పంటలు నాశనమవ్వడంతో గడ్డి మందు తాగి బలవణ్మరణానికి గురయ్యాడు. ● అప్పు ఇస్తే తిరిగి అవతలివారే కేసు పెట్టడంతో మనస్తాపానికి గురై ఏప్రిల్ 11న పాతపట్నం చిన లోగిడికి చెందిన ఆటో డ్రైవర్ దయానిధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో డ్రైవరు ఆత్మహత్య పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని జయరామచంద్రపురం గ్రామానికి చెందిన పూడి చిన్నబాబు(31) బుధవారం రాత్రి గ్రామ శివారులో ఉన్న టేకుతోటలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నబాబు తాళబద్ర గ్రామ సంబరాలకు స్నేహితుడు శేఖర్తో కలిసి వెళ్లాడు. అక్కడ మద్యం సేవిస్తూ ఇద్దరు గొడవ పడ్డారు. శేఖర్ చిన్నబాబుపై చేయికోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. అప్పుడే అతను తాను చనిపోతానని చెప్పాడు. చెప్పిన ప్రకారం మద్యం మత్తులో ఉన్న చిన్నబాబు అదే రోజు రాత్రి తన ఇంటికి వెళ్లకుండా ఊరు శివారులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కౌన్సెలింగ్ అవసరం.. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినపుడు స్నేహితులు, కుటుంబ సభ్యులు, లేకపోతే మానసిక వైద్య నిపుణుల కౌన్సెలింగ్ అవసరం పడుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని కచ్చితంగా దూరం పెట్టవచ్చు. మనిషి సైకాలజీ ప్రకారం.. ఎంతటి పెద్ద సమస్యకై నా కచ్చితంగా సమాధానం ఉంటుంది. ఒక్క క్షణం ఆలోచిస్తే కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. – నిర్మల్ అలెగ్జాండర్, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, టెక్కలి -
పెట్రోల్ ధరల పెంపుపై బీజేడీ నిరసన
రాయగడ: ఒకవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా.. మరోవైపు డీజిల్ ,పెట్రోల్ ధరలు పెంచడంపై బీజేడీ నిరసన తెలిపింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం జిల్లాలోని పద్మపూర్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. పద్మపూర్లో గల ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. డబల్ ఇంజిన్ సర్కార్ వైఫల్యాలపై నాయకులు దుయ్యబట్టారు. ఇంధన ధరలను కుత్రిమ కొరత చూపించి ధరలు పెంచడం సామాన్య మానవునిపై గుది బండగా మారిందని నినాదాలు చేశారు. పెట్రోల్ ఉత్పత్తులపై ధరలు నియంత్రించకపోతే రానున్నకాలంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో గునుపూర్ మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ గొమాంగొ, బీజేడీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పింకు పండా, ప్రశాంత్ దొళాయ్, మహేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
రాయగడ: బక్రీద్ సందర్భంగా గురువారం జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సవాలు నెలకొన్నాయి. మసీదుల్లో పత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శాంతి, నెలకొనాలని ప్రార్థంచారు. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల నాయకులు ముస్లీంలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, త్యాగం, సహనం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. మస్లీం కుటుంబాలు ప్రత్యేక వంటకాలతో ఆనందంగా వేడుకలు నిర్వహించారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి సందడి చేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం పండగ ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక భద్రత చర్యలు తీసుకుంది. -
మందిర్, మసీద్ వివాదంపై నివేదిక అందజేస్తాం
జయపురం: జయపురం జమాల్ లైన్ శ్రీరామ మందిరం, మసీదు నిర్మాణాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు గురువారం జయపురం సబ్కలెక్టర్ జాదుమణి నాయక్ అధ్యక్షతన శాంతి సమావేశం జరిగింది. హిందూ, ముస్లిం వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. 107 ఏళ్ల కిందట శ్రీరామ మందిర పక్కన ముస్లిం సంప్రదాయ ప్రజలు ఉపాసన గృహం (మసీద్) నిర్మాణ కోసం 2023 నుంచి వివాదం ఏర్పడింది. సనాతన సంఘటనతో చేయబడిన ఆరోపణ ప్రకారం 103 యేళ్ల కిందట రామ మందిరం నిర్మించబడిందన్నారు. ఆ ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం ఏర్పడవచ్చని పోలీసు అధికారి సబ్కలెక్టర్కు నివేదించారు. హింధూ ప్రతినిధుల ఆరోపణ ప్రకారం 1989లో శ్రీరామమందిర పక్కన స్థలం కొని మసీద్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. అందుచేత మసీద్ నిర్మాణం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతాన్ని మసీదుగా వినియోగం బంద్ చేయాలని, మాంసం వంటకంపై ఆంక్షలు విధించాలని, ముస్లింలు శ్రీరామ మందిరానికి సహకరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రతినిధులు మాట్లాడుతూ.. తాము పట్టణంలో సోదరత్వాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అక్కడ ఏ ఒక్క మదర్సా లేరని, అలాగే మైకు వినియోగించటం లేదని, తాము మాంసం వండటం లేదని స్పస్టం చేశారు. ఉభయ పక్షాల వాదనలను విన్న జయపురం సబ్కలెక్టర్ జాదుమణి నాయక్, జయపురం తహసీల్దార్ సవ్య సాయి జేన, పట్టణ పోలీసు అధికారి .. శ్రీరామ మందిర్, మసీదు ఉన్న స్థలాలను సందర్శించారు. ఉభయ పక్షాల వివరణతో తాము జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తేజేశ్వర పండా, బును రథ్, గంగాధర నాయక్, ఆర్.ఎస్.ఎస్ నేత డాక్టర్ నిరంజన్ మిశ్ర, పి.నాగు, ముస్లిం ప్రతినిధులు హసన్ మదాని, ముస్లి్ం మత గురువులు పాల్గొన్నారు. -
విజయన్ నివాసంపై దాడులు దారుణం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కేరళ మాజీ సీఎం, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడులు చేయడాన్ని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం అంబేడ్కర్ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ చేతిలో రాజకీయ సాధనంగా ఉన్న ఈడీతో విజయన్ను అప్రతిష్ట పాలు చేయాలనే దుర్బుద్ధితో దాడులకు పూనుకుందని విమర్శించారు. రాజకీయ ప్రత్యార్థులను వేటాడేందుకు కేంద్ర ఏజెన్సీలను వాడుకుంటున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేరళలోనూ అదే కుట్ర చేసిందని విమర్శించారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు జి.సింహాచలం, పోలాకి ప్రసాద్, సీహెచ్ అమ్మన్నాయుడు, అల్లు సత్యనారాయణ, ఎస్.సూరీడమ్మ, కొత్తకోట అప్పారావు, ఎం.గోవర్దన్రావు, ఎం.ఆదినారాయణమూర్తి, అల్లు సోమశేఖర్, బూర్లు సింహాచలం, ఎం.గణేష్, ఆర్.ప్రకాష్, ఎస్.నగేష్, జానీ, జ్యోతేశ్వరరావు, వాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ విజేత పెద్దపాడు గార: తాళ్లవలస గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన అసిరితల్లి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతగా ‘పెద్దపాడు’ జట్టు నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్స్లో శ్రీకూర్మం జట్టుపై విజయం సాధించింది. 12 రోజులుగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 42 జట్లు పాల్గొనగా, మ్యాచ్లన్నీ హోరాహోరీగా జరిగాయి. విజేతలకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల గార జోనల్ కన్వీనర్ బి.సింహాచలం మాస్టారు, బీసీవై పార్టీ అధ్యక్షుడు పానిని ప్రసాద్ చేతుల మీదుగా ట్రోఫీ, రూ.25 వేలు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు. మ్యాన్ ఆఫ్ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా దుంగ శ్రీను ఎంపికయ్యాడు. కార్యక్రమంలో టి.పమిడయ్య, కె.జగ్గారావు, కె.శేఖర్, కె.రాజారా వు, టి.లచ్చన్న, కలగ ఢిల్లీశ్వరరావు, కరగాన రమణ, నిర్వాహకులు టి.గణ, ఎస్.శ్రీను, ఏ.దుర్గాప్రసాద్, గ్రామ యువత పాల్గొన్నారు. నేరేడు ఫలం.. పోషకాలు పుష్కలం శ్రీకాకుళం కల్చరల్ : మార్కెట్లో నేరేడు పండ్లకు భలే గిరాకీ ఏర్పడింది. ఈ సీజన్లో లభించే అద్భుతమైన ఆరోగ్యకరమైన పండు కావడంతో కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించడం, బరువు తగ్గడంలో సహాయపడటంలో నేరేడు పండు ముందంజలో ఉంటోంది. ఇవీ ప్రయోజనాలు.. నేరేడు పండు మధుమేహ నియంత్రణలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే జంబోలిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ బాధితులకు సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచి, మలబద్ధకం, విరేచనాలు వంటి ఉదర సమస్యలను నివారిస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. విటమిన్–సి, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరిగి రక్తహీనత తగ్గుతుంది. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది. క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. అయితే, నేరేడు పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు.పాలు తాగిన వెంటనే వీటిని తీసుకోవడం మంచిది కాదు. -
సరుకు రవాణా రైళ్లపై కూలిన క్రేన్
● తప్పిన పెను ప్రమాదం ● రైలు సర్వీసులు తాత్కాలికంగా రద్దు భువనేశ్వర్: సరుకు రవాణా రైళ్లపై క్రేన్ కూలిపోయింది. బాలాసోర్ జిల్లా నీలగిరి సమీపంలో గోపినాథ్పూర్ రైల్వే స్టేషన్లో గురు వారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అన్ లోడింగ్ పనులు జరుగుతుండగా 2 గూడ్స్ రైళ్లపై క్రేన్ కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, ఆ ప్రాంతంలో రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం రైల్వే స్టేషన్ సమీపంలోని స్లీపర్ల తయారీ యూనిట్లో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే స్లీపర్లను ఎక్కించడానికి, దించడానికి ఉపయోగిస్తున్న క్రేన్, పనులు జరుగుతుండగా అకస్మాత్తుగా కూలిపోయి, నిలిచి ఉన్న రెండు గూడ్స్ రైళ్లపై నేరుగా పడింది. క్రేన్ కూలిన ధాటికి రైల్వే ట్రాక్కు అనుసంధానించబడిన ఓవర్ హెడ్ విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో ఘటనా ప్రాంతంలో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ప్రయాణికుల రైళ్ల కార్యకలాపాలను నిలిపివేశారు. రైల్వే అధికారులు, సాంకేతిక బందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ, మరమ్మతు పనులను ప్రారంభించారు. -
వరుసగా వాహనాలు ఢీ
● రణస్థలం వద్ద స్తంభించిన ట్రాఫిక్ రణస్థలం: రణస్థలం ఫ్లై ఓవర్ పనులు వాహనచోదకులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు ముందు వెళుతున్న క్రేన్ను అధిగమించే ప్రయత్నంలో క్రేన్ చివర భాగం బస్సుకు తగిలింది. దీంతో బస్సు అద్దం పగిలిపోయి ప్రయాణికులు కేకలు వేశారు. వెనుకనే వస్తున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ కారు ఇసుక లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోయినా కారుకు, ప్రైవేటు బస్సు దెబ్బతిన్నాయి. ఈ రెండు ప్రమాదాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది. హైవే సెక్యూరిటి, స్థానిక పోలీసులు వచ్చి వాహనాలను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. -
పారదర్శకంగా క్రికెట్ ఎంపికలు చేపట్టాలి
శ్రీకాకుళం న్యూకాలనీ :జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఎంపికలు చేపట్టాలని క్రికెట్ క్రీడాకారుల తల్లిదండ్రులు కోరారు. జిల్లా క్రికెట్ సంఘం కీలకంగా చక్రం తిప్పుతున్న ఓ వ్యక్తి ఇప్పటికై నా మారాలని.. మారకుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. బుధవారం శ్రీకాకుళం నగరంలోని ఓ హోటల్లో జిల్లా పేరెంట్స్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ సమావేశం ఏర్పాటుచేశారు. ముందుగా జిల్లా స్థాయి పేరెంట్స్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. జిల్లా క్రికెట్ సంఘం జిల్లా తరఫున ఎంపిక చేయబడే జట్టును పూర్తిగా ఈ జిల్లాలో ఉంటూ.. సాధన చేస్తున్నటువంటి క్రీడాకారులతో భర్తీ చేయాలని, ఈ జట్టును మాత్రమే పైస్థాయి పోటీలకు ఆడించడానికి పంపించాలని కోరారు. ఇతర జిల్లాల నుంచి ఎవరైనా వచ్చి.. శ్రీకాకుళం జిల్లాకి రిప్రజెంట్ చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. కొందరు ఏకంగా ఆధార్ కార్డులను శ్రీకాకుళం జిల్లాకి మార్చి ప్రాతినిధ్యం వహించాలని చూస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్, ఎస్పీకి అభ్యర్థన పత్రం ఇవ్వాలని తీర్మానించారు. -
నవీన గుప్తకు అభినందన
జయపురం: ఒడిశా పబ్లిక్ అడ్మినిస్ట్రేట్ సర్వీస్ పరీక్షలో (ఓ.ఎ.ఎస్) కొట్పాడ్ యువకుడు నవీన గుప్త 19వ ర్యాంక్ సాధించి సత్తాచాటాడు. ఈ విషయం తెలుసుకున్న కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర నవీన గుప్త ఇంటికి గురువారం వెళ్లి అభినందించారు. వెనుకబడిన ప్రాంతం నుంచి యువకుడు 19వ ర్యాంకులో ఉత్తీర్ణుడు కావటం కొట్పాడ్కే గర్వకారణం అన్నారు. నవీన గుప్త సాధించిన విజయాన్ని ఈ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఫ్లడ్లైట్లు శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నూతనంగా నిర్మించిన క్రికెట్ నెట్స్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. జిల్లా క్రికెట్ సంఘం రూ.17లక్షల నిధులను వెచ్చించిన ఈ నెట్స్ ఫ్లడ్లైట్ల వెలుతురులో ఆకర్షిస్తోంది. ఇందులోకి పశువులు, ఇతరులు/అపరిచితులు లోపలకు ప్రవేశించుకుండా రక్షణగా ఇనుప కంచె సైతం అమర్చారు. ప్రస్తుతం రక్షణ వలయంలో క్రీడా కారులు ముమ్మర సాధన చేస్తున్నారు. జెడ్సీఎస్ ప్రతినిధులు, కోచ్లు పర్యవేక్షిస్తున్నారు. -
రైతు సచేతన రథం ప్రారంభం
జయపురం: జయపురం సబ్డివిజన్లో రబీ సీజన్ ధాన్యం సేకరణపై రైతులను చైత్యపరచేందుకు గురువారం అధికారులు మూడు రైతు చైతన్య రథాలను ప్రారంభించారు. జయపురం సబ్ కలెక్టర్ జాదుమణి నాయ రథాలను ప్రారంభించారు. ఈ సచేతన రథాలు జయపురం సబ్ డివిజన్లో వివిధ సమితులు మునిసిపాలిటీలలో పర్యటించి రైతులను సచేతలను చేస్తాయని సబ్కలెక్టర్ వెల్లడించారు. రైతులు టోకెన్లు అధికారుల నుంచి తీసుకొని ధాన్యాన్ని పరిశుభ్రపరచి, ఎఫ్ఎక్యూ నాణ్యత పరిశీలించిన తరువాత ధాన్యాన్ని మండీలకు తీసుకురావాలన్నారు. ప్రతి మండీలోనూ రైతుల కోసం అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా తాగునీటి సైకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, విద్యుత్ సౌకర్యం, రైతులు నీడలో ఉండేందుకు టెంట్లు ఏర్పాటు చేయటంన దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. రైతులు మంచి ధాన్యం మండీలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ఈ రైతు సచేతన రథం జయపురం మునిసిపాలిటీ, కొట్పాడ్ నోటిఫైడ్ ఏరియా(ఎన్.ఎ.సి) ప్రాంతం, జయపురం సమితి, బొరిగుమ్మ సమితి, కొట్పాడ్ సమితి, కుంద్ర సమితి, బొయిపరిగుడ సమితుల్లోని గ్రమాల్లో పర్యటించి రైతులకు ధాన్యం సేకరణ, నిబంధనలపై అధికారులు కల్పించే సౌకర్యాలపైన వివరించి చైతన్య పరుస్థామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెగ్యులేటింగ్ మార్కెట్ కమిటీ కార్యదర్శి తుషార్ కాంతి శెట్టి, ఆర్.ఎం.సి అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. -
అరణ్య రోదన..
జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ గ్రామంలో ఓ యువకుడికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రతిభావంతుడైన ఆ యువకుడు క్యారెక్టర్ సర్టిఫికేట్ కోసం పోలీసులను సంప్రదిస్తే అతనిపై అప్పటికే గంజాయి కేసు నమోదై ఉన్నట్లు తేలింది. గంజాయి సేవిస్తున్నట్లు వీడియోలు కలకలం సృష్టించిన ఘటనలో ఆ యువకుడు గతంలో పోలీసులకు చిక్కడంతో కేసు నమోదు చేశారు. సరదా, సందడి కోసం చేసిన ఆ పని యువకుడి జీవితంపై తీరని మచ్చగా మిగిలింది. అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గంజాయి సేవనం వల్ల దూరమైంది. ఆ యువకుడు జీవితం అంధకారబంధురమైంది. -
ఆర్భాటానికే పోలీసులా..?
ఎవరైతే మాకేంటి..? ● విశాఖ రేంజి ఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని జిల్లా పోలీస్ యంత్రాంగం యావత్తు ఇచ్ఛాపురంలో ‘మాదకద్రవ్యాలు రూపుమాపడంపై అభ్యుదయ సైకిల్ ముగింపు యాత్ర’ కార్యక్రమం భారీ ఎత్తున జరిపారు. జరిగి కొన్ని గంటలైనా కాలేదు.. ఆ కార్యక్రమానికి హాజరై వస్తున్న ఎస్ఐ డి.లోవరాజు, మరో కానిస్టేబుల్ సోంపేటలోని జామి ఎల్లమ్మ దేవాలయం సమీపానికి వచ్చేసరికి ముగ్గురు (వీరిలో యువకులు,బాలురు ఉన్నారు) గంజాయి మత్తులో గొడవపడుతున్నారు. గొడవెందుకుని ఎస్ఐ, కానిస్టేబుల్ ఆపడంతో చేతులతో దాడికి ఎగబడ్డారు. ఇదే అంశంలో ఎస్ఐని వీఆర్పై బదిలీ చేశారు. ● ఇదే సోంపేటలో మత్తులో ఇద్దరు యువకులు ఇంట్లో గొడవ చేస్తుండటంతో కుటుంబీకులే పోలీసులకు సమాచారమిచ్చారు. వారిని తీసుకొస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తోసేయడం.. ఆ తర్వాత ఓ దుకాణాదారునిపై యువకులు దాడి చేస్తుండగా అక్కడే ఉన్న ఏఎస్ఐ సింహాద్రి, కానిస్టేబుళ్లు విజయ్, మురళీలు ప్రేక్షక పాత్ర పోషించారు. సోషల్మీడియాలో సంబంధిత వీడియోలు వైరల్ కావడంతో పోలీసులను ఎస్పీ సస్పెండ్ చేశారు. ● ఈ ఏడాది జనవరిలో జిల్లాకేంద్రంలో ఇద్దరు యువకులపై మరో ముగ్గురు యువకులు మద్యం, గంజాయి మత్తులోనే దాడి చేసి గాయపర్చారని స్థానికులు ఆరోపించారు. కుటుంబం మధ్య జరిగిన వ్యక్తిగత గొడవగా పోలీసులు పేర్కొన్నారు. ● జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఏఎస్ఐ రాత్రి వేళ విధులు ముగించుకుని దమ్మలవీధివైపు వస్తుండగా యువత మత్తులో న్యూసెన్సు చేస్తూ బండిని ఆపడంతో.. ఎందుకు ఆపారని ఏఎస్ఐ అన్నందుకు ఆయనపై దాడి చేశారు. దాడులు ఈ మత్తులోనేనా..? జిల్లాలో కొన్ని దాడులు.. హత్యలు జరిగే విధానాన్ని బట్టి స్థానికులు గంజాయి మత్తులోనే జరిగాయని, ఆరోపణలు ఎదుర్కొన్నవారు గంజాయి అతిగా వాడినవారు కావడంతో ఆ మత్తులోనే దాడులు, హత్యలు చేసి వుంటారని వ్యాఖ్యానించడం గమనార్హం. పోలీసులు మాత్రం మద్యం మత్తులోనే జరిగాయని కేసులను ముగించేయడం విశేషం. ● పాతపట్నంలో పోలీసులకు గంజాయి డెన్ల సమాచారాన్ని ఇచ్చిన ఓ వ్యక్తిని బస్సు దిగుతుండగానే అవే గంజాయి బ్యాచ్లు దాడి చేశాయి. సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్న పోలీసులే నేరస్థులకు ఉప్పందించడంతోనే ఇలా జరిగిందన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ● నరసన్నపేట కేంద్రంగా చేసుకుని ఓ వ్యాపారిపై ఇద్దరు యువకులు గంజాయి మత్తులో దాడికి ఎగబడ్డారు. ● జిల్లాకేంద్రంలోని టీడీపీ కార్యాలయానికి చెందిన వ్యక్తి రాత్రి సమయాన మహలక్ష్మినగర్వైపు వెళ్తూ తన మేనల్లుడు మత్తు బ్యాచ్తో వుండటం చూశాడు. వారితో ఎందుకున్నావ్ అన్నందుకు అందులో మత్తులో ఉన్న ఓ వ్యక్తి బండిపై నున్న టీడీపీ వ్యక్తిని తోసేయడంతో తలకు బలమైన గాయమై మృత్యువాత పడ్డాడు. ● జిల్లాకేంద్రంలోని ఓ వివాహితను మద్యం మత్తులో రూమ్కు పిలిపించుకున్న యువకుడు చంపాడని పోలీసులు నిర్ధారించారు. కాగా యువకుడు మూడు రోజులుగా మత్తు వీడకపోవడం గంజాయి సేవించే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో లేనంతగా మేం గంజాయిని పట్టుకుంటున్నాం.. లెక్కలేనన్ని కేసులు నమోదు చేస్తున్నాం.. భారీగా గంజాయిని సీజ్ చేస్తున్నాం. సరఫరా, క్రయ, విక్రయదారులను జైళ్లకు పంపిస్తున్నాం.. ఆస్తులను జప్తు చేస్తున్నాం.. అడిక్షన్ సెంటర్లకు సేవించేవారిని పంపిస్తున్నాం..ఇవీ పోలీసులతో కూటమి ప్రభుత్వం ఊదరగొట్టిస్తున్న మాటలు. ఇన్ని చేస్తున్నా జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ఇప్పటికీ ఎందుకు అరికట్టలేకపోతున్నారు..? చెక్పోస్టులు, సరిహద్దులు దాటి రైళ్లు, బస్సులు, టూవీలర్లు, ఇతర వాహనాల ద్వారా అంతర్రాష్ట్ర గంజాయి సరఫరాదారులు ఎలా చొరబడుతున్నారు..? అనే ప్రశ్నలకు సమాధానం కరువైపోతుంది. ఇటీవల కొత్తగా డ్రగ్ డిటెక్షన్ కిట్లను జిల్లావ్యాప్తంగా ఉన్న పీఎస్లకు ఎస్పీ పంపించారు. మూత్ర పరీక్షలు ఆధారంగా నిమిషాల్లో గంజాయి, ఇతర మత్తుపదార్థాల సేవించేవారిని గుర్తించే ఈ కిట్ల ద్వారా శ్రీకాకుళం సబ్ డివిజన్లో ఒక్క రోజే 30 మంది అనుమానితులు పట్టుబడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా అర్ధం చేసుకోవచ్చు. -
అక్రమ దాడిని ఖండిస్తున్నాం
జయపురం: నవరంగపూర్ జిల్లా చందాహండి గౌఢ జాతి ప్రజలపై భజరంగ్ గూండాలు అమానుషంగా దాడి జరిపారని కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆరోపించారు. దాడిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్య నిర్వాహక సభ్యులు, ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి నాయకత్వంలో పలువురు నేతలు, కార్యకర్తలో చందాహండి సంఘటనను ఖండిస్తూ స్థానిక ప్రధాన కూడలి వద్ద బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ.. నవరంగపూర్ జిల్లా చందాహండి సమితిలో గౌడ జాతికి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ సొంత ఆవులను రోడ్డుపై తీసుకువెళ్తుండగా భజరంగ్దళ్ గూండాలు వారిపై అమానుషంగా దాడి జరిపి కొట్టారని ఆరోపించారు. ఆ దుండగులను హిందూ ధర్మ రక్షకులుగా ఎవరూ నియమించలేదని, వారు హిందూ ధర్మ కంట్రాక్టర్లు కాదని వెల్లడించారు. ఆ సమయంలో బాధితులు నోరు విప్ప లేకపోయారని మహంతి తెలిపారు. సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి జుధిస్టర్ రౌళో, నేతలు భీష్మ నాయక్, నంద హరిజన, భాస్కర మిశ్ర, తదితరులు పాల్గున్నారు. -
ఘనంగా గ్రామదేవత ఉత్సవాలు
పర్లాకిమిడి: స్థానిక ఎనిమిదో వార్డు పరిధి పిన్నింటి పాపన్న వీధిలో జరుగుతున్న గ్రామ దేవత ఉత్సవాలు చివరిరోజు బుధవారం పట్టణంలో ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి పాల్గొ అమ్మవారి ఘటాన్ని మోశారు. కమిటీ సభ్యులు, బీజేడీ శ్రేణులు న్యృం చేశారు. పర్లాకిమిడి: గుసాని సమితి బుసుకిడి పంచా యతీ లింగుపురంలో జరుగుతున్న చింతపోల మ్మ అమ్మవారి ఉత్సవాలకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు విచ్చేసి ఘటాలు మోశారు. ఆయనతో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సనప ల కిరణ్కుమార్, గ్రామ వ్యాపారవేత్త సిద్ధార్థ, డైరెక్టర్ ఆర్.ఎం.సి బల్ల ధనుంజయ, మాజీ జెడ్పీటీసీ శ్రీధర్ నాయుడు, జగన్నాథ పరిడా, తదతరులు పాల్గొన్నారు. రాయగడ: స్థానిక బాలాజీనగర్లో గల కళ్యాణవేంకటేశ్వర మందిరంలో అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ ఏకాదశి సందర్భంగా భక్తిశ్రద్ధలతో రమాసత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో బుధవారం జరిగాయి. ఈ పవిత్ర రోజున ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించా రు. ఉదయం నుండే భక్తులు స్వామివారి దర్శనార్థం వచ్చారు. వేదపండితులు రమా సత్య నారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్ష ఆచరిస్తే కుటుంబ శ్రేయ స్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయని ప్రధాన అర్చకులు భాస్కరాచార్యు లు ఈ సందర్భంగా వివరించారు. 29,30 తేదీల్లో ఎస్సీ కమిషన్ సభ్యుడి పర్యటన శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ఈ నెల 29, 30 తేదీలలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 29న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. మధ్యాహ్నం పలు భూ సమస్యల పై క్షేత్రస్థాయి విచారణ చేపట్టనున్నారు. 30న ఉదయం 10:30 గంటలకు మందస తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎస్సీ ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. మధ్యాహ్నం భూవివాదాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధితులతో మాట్లాడతారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ నరసన్నపేట: త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో కోరారు. దానం చేయడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం పండగ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. శ్రీకాకుళం క్రైమ్: బక్రీద్ పండగ మత సామరస్యానికి, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని.. కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ సంద ర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్య లు చేపట్టాలని ఆదేశించారు. మసీదుల వద్ద బందోబస్తు, డ్రోన్స్, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
ఘటాల ఊరేగింపు
రాయగడ: స్థానిక పయికొ వీధిలో పూజలందుకుంటున్న మా సమలాయి దుర్గమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. మంళవారం రాత్రి సంప్రదాయబద్ధంగా మల్లెలు (నిప్పులపై నడక) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజా రి బలముండతో పాటు అయిదు రోజుల పాటుగా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలను మోసే పేరంటాలు కూడా ఈ మల్లెల తొక్కే కార్యక్రమంలొ పాల్గొన్నారు. బుధవారం ఉదయం మందిరం నుంచి ఘటాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి స్థానిక మజ్జిగౌరి అమ్మవారి మందిరం ప్రాంగణంలో గల అమ్మవారి పాదాల గుడి వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలను నిర్వహించి, అనంతరం అక్కడ నిమజ్జనం చేశారు. దీంతో ఉత్సవాలు ముగిసినట్లుగా భావిస్తారు. ఈ సందర్భంగా ఆమ్మవారికి మొక్కుబడులను తీర్చుకున్నారు. నిమజ్జనోత్సవంలో కాళీరూపంతో విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఊరేగింపులో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. -
భద్రం బాసూ..!
● స్మార్ట్గా సెల్ఫోన్లు దోచేస్తారు ● అంతేవేగంగా రాష్ట్రాలు దాటి మళ్లిస్తారు ● రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్లే వీరి టార్గెట్ శ్రీకాకుళం క్రైమ్: ప్రస్తుత కాలంలో అందరి చేతుల్లో నూ స్మార్ట్ఫోన్లు తప్పనిసరిగా ఉంటున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సెల్ఫోన్ కూడా నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఎవరి తాహతుకు తగ్గట్టుగా వారు రూ.10 వేల నుంచి రూ.లక్షల్లో ధర ఉండే ఫోన్లు వాడుతున్నారు. అయితే అలాంటి స్మార్ట్ఫోన్లను కొందరు కేడీగాళ్లు అంతే స్మార్ట్గా దోచేస్తున్నారు. అనంతరం వాటిని రాష్ట్రాలు దాటించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారంటే నమ్మడం అతిశయోక్తి కాదు. ఈ గ్యాంగుల పనే..! కృష్ణా జిల్లా అకివీడు, రాజమండ్రి గోకవరం, విజ యనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మూడు గ్యాంగులు స్మార్ట్ఫోన్లను దర్జాగా కొట్టేసి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో గ్యాంగులో 10 నుంచి 15 మంది సభ్యులుంటారు. ఇటీవలే విశాఖ రేంజి పరిధి పోలీసులకు పట్టుబడినట్లే పట్టుబడి జారిపోయారు. బ్యాక్డ్రాప్లో బడా సూత్రదారులుండడం.. ఎవరైనా కేసు నమోదు చేస్తే వారిపైనే హెబియస్ కార్పస్ అనే వజ్రాయుధంతో హై కోర్టులో రిట్ వేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. మైనర్లతో నేరాలు ఈ గ్యాంగ్లు మైనర్ బాలలను ఎక్కువగా వాడుకు ని రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ప్రయాణికుల మొబైల్స్ను టార్గెట్ చేస్తారు. ఒక్కో బాలుడికి రోజుకు రూ.300లు ఇస్తారు. ఏరియాను బట్టి రోజుకు 40 నుంచి 70 మొబైల్స్ను టార్గెట్గా పెట్టుకుంటారు. పోగొట్టుకున్న, దొంగిలించిన సెల్ఫోన్లను కారు డిక్కీల్లో, సైడ్ డోర్లలో ప్రత్యేకంగా ప్యాక్ అయ్యేలా సెటప్ చేసుకుంటారు. ఈ విధంగానే దాదాపు 50 వరకు ఫోన్లను రేంజి పరిధి పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. నెలకు వీరికి టర్నోవర్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. విశాఖ, అనకాపల్లి, తుని, ఒడిశా బరంపురంల్లో ఎక్కువగా చోరీలు చేస్తున్నట్లు సమాచారం. దొంగిలించే ఈ మొబైళ్లను హైదరాబాద్ సెకెండ్ హ్యాండ్ ఫోన్లు సేల్స్ చేసే చోరీ బజార్, చైన్నెలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. -
బతుకుల్ని బలిచేస్తున్న గంజాయి
శ్రీకాకుళం క్రైమ్: గంజాయి మత్తులో జిల్లా యువత చిత్తవుతున్నారు. ఏం చేస్తున్నారో సోయి లేనంతగా ఈ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఎదురున్నది సామాన్య ప్రజలా.. పోలీసులా..అన్నది వీరికి అనవసరం.. ఎవరిని కొట్టాలో.. ఎవరిని హత్య చేయాలో.. ఎవరిపై అఘాయిత్యం జరపా లో వారే లక్ష్యంగా కనిపిస్తారు. ఖర్చులకు డబ్బు లు లేకపోతే నిర్మానుష్య మార్గాల్లో రాత్రివేళల్లో ఒంటరిగా వచ్చేవారిని అడ్డగిస్తారు. దారి దోపిడీ లు చేస్తారు. అవసరమైతే నగల కోసం గొంతుక లను సైతం కోయడానికి వెనకాడరు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనడానికి ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలే నిదర్శనం. గంజాయి మత్తు యువత జీవితాన్ని ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతోందనడానికి కొందరి జీవితాలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. గంజాయి మత్తుతో యువత బతుకు చిత్తు జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా పల్లెలకూ విస్తరిస్తున్న జాఢ్యం -
పెట్రోల్ ధరల పెంపుపై బీజేడీ ఆందోళన
పర్లాకిమిడి: పెట్రోల్, డీజిల్, సి.ఎన్.జీ, గ్యాస్ ధర ల పెరుగుదలకు నిరసనగా బుధవారం సాయంత్రం జంగంవీధి కూడలి వద్ద ఉన్న ఆర్.ఎం.సి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద బీజేడీ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పదిరోజుల్లో మూడు సార్లు చమురు ధరలు పెంచడం పట్ల జిల్లా బీజేడీ అధ్యక్షుడు ప్రదీప్ నాయక్ విమర్శించారు. పెట్రో ధరలు పెరగటంతో మార్కెట్లో అన్ని నిత్యావసర ధరలు ఆకాశానికి పెరిగిపోయాయన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి నిరసన తెలిపా రు. ఈ ఆందోళనలో బీజేడీ యువజన అధ్యక్షుడు లెంక సిమ్మ, మహిళా అధ్యక్షురాలు సంయుక్తా బెహరా, బీజేడీ నాయకులు బిశ్వజిత్ త్రిపాఠి, బీజేడీ టౌన్ అధ్యక్షుడు సిత్తు మహాపాత్రో, బీజేడీ కౌన్సెలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాల్పుల కలకలం
భువనేశ్వర్: స్థానిక ఇన్ఫో వ్యాలీ పోలీస్ ఠాణా పరిధి సమీపంలో బుధవారం కాల్పులు కలకలం రేగింది. గంజాం జిల్లా జగన్నాథ్ ప్రసాద్ ప్రాంతానికి చెందిన పేరు మోసిన మాదకద్రవ్యాల స్మగ్లర్ పపున్ మాఝీపై కమిషనరేట్ పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డ్రగ్ వ్యాపారి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఇన్ఫో వ్యాలీ పోలీస్ ఠాణా పరిధిలోని అరిసోల్ సమీపంలో పపున్ ఉన్నాడనే విశ్వసనీయ సమాచారం అందడంతో కమిషనరేట్ పోలీసులు స్పెషల్ క్రైం యూనిట్ మెరుపు దాడి నిర్వహించింది. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. వీరి రాకను గమనించిన పపున్ అక్కడి నుంచి పారిపోవడానికి విఫలయత్నం చేశాడు. అరెస్టు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతడు మొదట పోలీసు బృందంపై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో పపున్ మాఝీ కుడి కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని చికిత్స కోసం మొదట భువనేశ్వర్లోని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మెరుగైన వైద్య సంరక్షణ కోసం కటక్లోని ఎస్ిసీబీ వైద్య బోధన ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసుల ఆరా.. భువనేశ్వర్, పరిసర ప్రాంతాలలో పనిచేస్తున్న మాదకద్రవ్యాల నెట్వర్క్లో పపున్ ప్రమేయం ఏ మేరకు ఉందో నిర్ధారించే దిశలో దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. అంతర్ రాష్ట్ర డ్రగ్ సిండికేట్లు, ఇతర నేర సహచరులతో అతనికి ఉన్న సంబంధాలపైనా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉన్నతాధికారులు దర్యాప్తును నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితుడి వద్ద నుంచి లక్షలాది రూపాయల విలువైన డ్రగ్స్, పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతున్న కొద్దీ నిందితుడి నేర చరిత్ర, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, నిషేధిత వస్తువుల గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. -
మహేంద్రగిరిపై విశ్వ కల్యాణం
● భాస్కరతీర్థ లక్ష్మీబాబా పర్లాకిమిడి: మహేంద్రగిరి పర్వతంపై జూన్ ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకూ విశ్వకల్యాణాన్ని (మహేంద్రమేళా) నిర్వహిస్టున్నట్టు మహేంద్రగిరి సురక్షా మంచ్ నాయకులు, భాస్కరతీర్థ లక్ష్మీబాబా వెల్లడించారు. మేళాను అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అయితే ఎన్ని అడ్డంకులు ఏర్పడినా ఈ పవిత్ర విశ్వ కల్యాణాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. స్థానిక పెద్ద రాధాకాంత మఠంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబా మాట్లాడారు. పురుషోత్తమాసం సందర్భంగా పరశురాం కుండ్ వద్ద యజ్ఞాలు, సంకీర్తన, భజన కార్యక్రమాలకు జగద్గురు నరేంద్ర సరస్వతీ తీర్థ విచ్చేసి మూడు రోజులు బసచేస్తారని అన్నారు. అయితే పూరీ క్షేత్రం గోవర్ధనగిరి శంకరాచార్యులు మాత్రం అనారోగ్యం కారణంగా మహేంద్రం రావడం లేదని అన్నారు. ఈ విశ్వకళ్యాణం వల్ల ఈ ప్రాతం సుభిక్షమై పంటలు పండటమే కాకుండా సమృద్ధిగా వర్షాలు కురిసి శాంతి చేకూరుతుందని అన్నారు. మహేంద్రగిరి మేళాకు అనేకమంది గురువులు, మండళి మహాంతలు, సాధుసంతవులు ద్వారా పుణ్యస్నాణాలు, యాజ్ఞాదులు, దానాలు జరుగుతాయని అన్నారు. విలేకరుల సమావేశంలో బ్రహ్మాలోకానంద, సత్యన్నారాయణ దాస్ పాల్గొన్నార. -
బీజేపీ బలోపేతమే లక్ష్యం
రాయగడ: జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండో పిలుపునిచ్రరు. స్థానిక బిజూపట్నాయక్ ఆడిటోరియంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు టి.గొపిఆనంద్ ఆధ్యక్షతన బుధవారం పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం, కార్యకర్తల విస్తరణ, గ్రామీణ స్థాయిలోకి పార్టీని తీసుకెళ్లడం ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లాలోని అన్ని సమితులు, పంచాయతీలకు చెందిన పార్టీ కార్యకర్తలు శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. పార్టీ జాతీయ వాద సిద్ధాంతాలు, పార్టీ ఆదేశాలు, విధానాలను గ్రామస్థాఽయి నాయకులు, కార్యకర్తలు సమర్ధవంతంగా చేరవేయడ ఎలా వివరించారు. కార్యక్రమంలొ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ చంద్ర సాహు, సీనియర్ నాయకులు కాళీరాం మాఝి, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు కొరాడ రజిత, జిల్లా కార్యదర్శి పృధ్వీరాజ్ ధనపతి, జిల్లా మాజీ అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్ , శివశంకర్ ఉలక ఉన్నారు. -
ఎస్పీ రాజ్ప్రసాద్ బాధ్యతల స్వీకరణ
రాయగడ: రాయగడ జిల్లా ఎస్పీగా నియమితులైన రాజ్ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న స్వాతి ఎస్ కుమార్ నుంచి ఆయన బాధ్యతలను తీసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తానని అన్నారు. చట్ట వ్యవస్థను మరింత పటష్టం చేయడంపై దృష్టిసారిస్తానని వివరించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పెట్రోలింగ్ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహించడం, రాయగడ పట్టణంలో సీసీ కెమెరాల వ్యవస్థ పునరుద్ధరించడం, సైబర్ నేరాల శాతాన్ని తగ్గించడం, ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడించారు. అలాగే ఆర్మ్స్ యాక్ట్ కు సంబంధించిన కేసులను కూడా అత్యంత ప్రాధాన్యంతో తీసుకుంటామని ఎస్పీ అన్నారు. నేరస్తుల వద్దకు తుపాకీలు, పిస్తోళ్లు వంటి ఆయుధాలు ఎలా చేరుతున్నాయి.. వాటి మూలాలను గుర్తించి వాటిని నియంత్రించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజలకు చేరువయ్యే పోలీసింగ్ విధానాన్ని అమలు చేయడం, ప్రజలు–పోలీసులు మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరచడం ద్వారా పురక్షిత వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తానని రాజ్ ప్రసాద్ తెలిపారు. ప్రజల సహకారంతో నేరాలను నియంత్రించి జిల్లాను మరింత భద్రతతో కూడిన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇదిలాఉండగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణితో కలసి రాయగడ ప్రజల ఆరాధ్య దైవం మజ్జిగౌరీ అమ్మవారిని రాజ్ప్రసాద్ దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా మందిరం కమిటీ సభ్యులు ఇప్పలి సన్యాసిరాజు, దేవేంద్ర బెహరలు ఎస్పి ప్రసాద్ కు అమ్మవారి ఫొటోను అందించి సన్మానించారు. -
ఓఏఎస్లో 190వ ర్యాంకు
పర్లాకిమిడి: రాయఘడ బ్లాక్ కోరడాసింగి గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ వందనారాణి నాయక్ ప్రథమ ప్రయత్నంలోనే ఒడిశా అడ్మిన్స్ట్రేటీవ్ సర్వీస్ (ఓఏఎస్) పరీక్షలో 190వ ర్యాంకుతో ఉద్యోగం సాధించింది. వందనారాణి నాయక్ తండ్రి నటవర్ నాయక్, తల్లి రాధామణి నాయక్ మధ్యతరగతి చెందిన కుటుంబం. పర్లాకిమిడిలో సరస్వతీ శిశువిద్యామందిర్లో చదివి టెన్త్ పరీక్షల్లో ప్రథమం సాధించింది. తరువాత బరంపురం సరస్వతీ శిశు విద్యామందిర్ (నీలకంఠాపురం) ప్లస్టు సైన్స్ చదివిన అనంతరం భువనేశ్వర్లో రమాదేవి మహిళా కళాశాలలో ఎం.ఎస్పీ (ఫిజిక్స్)లో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణురాలైంది. ఆమె విజయంపట్ల రాయఘడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్, స్పెషల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ కామదేవ్ బోడోనాయక్, కోరడాసింగి గ్రామ ప్రజలు హార్షం వ్యక్తం చేస్తున్నారు. పూరీలో టీఎంసీ ఎమ్మెల్యే అరెస్ట్ భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే దిలీప్ మండల్ను పూరీలోని ఒక హోటల్లో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) ఆయనను అరెస్ట్ చేసి పశ్చిమ బెంగాల్కు తీసుకువెళ్లింది. దిలీప్ మండల్ మమతా బెనర్జీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. -
మహిళా దొంగలు అరెస్టు
భువనేశ్వర్: బిచ్చగాళ్లగా రైళ్లలో తిరుగుతూ ప్రయాణికుల నుంచి బంగార వస్తువులను దొంగలింస్తున్న మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ వద్ద రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) వారిని అరెస్టు చేసింది. వారి నుంచి రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ నుంచి దొంగిలించిన బంగారం రైలులో తరలిస్తుండగా ఆరెస్టు చేసినట్టు ఆర్పీఎఫ్ అధికారులు బుధవారం వెల్లడించారు. రాజ్యసభ ఉపఎన్నికకు ఉత్తర్వులు జారీ భువనేశ్వర్: రాష్ట్రంలో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానం భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటిఫికేషన్ బుధవారం జారీ చేసింది. బిజూ జనతా దళ్ అభ్యర్థి రాజీనామా చేసిన తర్వాత దేబాశిష్ సామంత్రాయ్ రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. అతడి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయనున్నారు. జూన్ ఒకటో తేదీన అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఎనిమిదో తేదీన నామినేషన్ల దాఖలకు గడువు ముగిస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 11గా ప్రకటించారు. అవసరమైతే 18వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాులుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఈసీఐ తెలిపింది. పోలీసుల ఔదార్యం భువనేశ్వర్: శాశ్వతంగా కన్నుమూసిన కన్న తల్లి అంత్యక్రియలకు బిడ్డలు ముందుకు రాలేదు. సోదరుల మధ్య కలహాలతో తల్లి మృతదేహాన్ని తాకేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అంతిమ యాత్ర అయోమయంగా పరిణమించింది. సుమారు 10 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. బాలాసోర్ జిల్లా సంతోష్పూర్ పంచాయతీ లోకనాథ్పూర్లో ఈ హదయ విదారక పరిస్థితి చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు రాయగడ: హత్య కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణ మాఝిని దోషిగా నిర్ధారిస్తు రాయగడ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బుధవారం కీలక తీర్పును వెల్లడించారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ తన తీర్పులో పేర్కొన్నారు. జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 సెప్టెంబర్ మూడో తేదీన నమోదైన కేసు బుధవారం విచారణకు వచ్చింది. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి సాక్ష్యాధారాలు, వాదనలు పరిశీలించిన కోర్టు నిందితుడు కృష్ణ మాఝిని దోషిగా పరిగణలోకి తీసుకుంది. దీంతో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు జరిమానా కింద నిందితుడు రూ. 20 వేలు చెల్లించాలని, చెల్లించలేని పక్షంలో అదనంగా మరో ఆరు నెలల జైలు శిక్షను అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. 10 వేల లీటర్ల నాటుసారా స్వాధీనం పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి పోలీసుస్టేషన్ పరిధిలో పుత్రుపడ గ్రామపంచాయతీ తుమన్నా గ్రామంలో పోలీసు, ఎకై ్సజు అధికారులు సంయుక్తంగా బుధవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా 10 వేల లీటర్ల ఐడీ. లిక్కర్, వంటసామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సారా తయారు చేస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేసి ఆర్.ఉదయగిరి పోలీసుస్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసినట్టు దర్యాప్తు చేస్తున్నట్టు ఆర్.ఉదయగిరి ఐఐసీ కల్పలతా ప్రధాన్ తెలిపారు. -
650 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి యం.వి.66 గ్రామంలో బుధవారం కలిమెల పోలీసులు అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 650 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రాకు చెందిన నగేష్ సిరుగురు ఇక్కడ నుంచి గంజాయి కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఐఐసీ ప్రభుదత్తు విశ్వల్ ఆదేశాలతో ఎస్సై విష్ణు ప్రసాద్ శబర్ నేతృత్వంలోని బృందం గంజాయి ఉంచిన ప్రాంతానికి వెళ్లి దాడి చేశారు. అక్కడ నుంచి సరిగేట గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో గంజాయి బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నగేష్ సిరుగురు పరారైయ్యాడు. బస్తాల్లో ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని స్టేషన్కు తరలించారు. ఐఐసీ ప్రభుదత్తు సమీక్షంలో తూకం వేయగా 650 కిలోలు ఉన్నట్టు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో దీనివలువ రూ. 75 లక్షలు ఉంటుందన్నారు. కేసునమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నగేష్ కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలంలో నిందితులకు చెందిన పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. -
విద్యుత్ షాక్తో మేసీ్త్ర మృతి
రాయగడ: జిల్లాలో ఆవాస్ గృహ నిర్మాణ పనులు జరుగుతుండటంతో విద్యుత్ తీగలు తాకడంతో షాక్కు గురై ఓ మేసీ్త్ర ప్రాణాలు కోల్పొయాడు. మృతుడు కళహండి జిల్లా లంజిఘడ్ సమితి పరిధిలోని డంగాముండి గ్రామానికి చెందిన లఖన్ మాఝి (49)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డంగాముండి గ్రామానికి చెందిన ఇంద్ర మాఝి నిర్మిస్తున్న ఆవాస్ ఇంటి పైకప్పు పనుల్లో లఖణ్ మయాఝి రాడ్ బెండింగ్ పనులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ లైన్ తగలడంతో లఖణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపొయాడు. తోటివారు గమనించి వెంటనే కళ్యాణసింగుపూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. -
14న అర్కక్షేత్రంలో సూర్య నమస్కారాలు
భువనేశ్వర్ : బ్లాక్ పగోడాగా ప్రఖ్యాతిగాంచిన అర్క క్షేత్రం కోణార్క్ సూర్య దేవాలయం ప్రాంగణంలో 108 రౌండ్ల సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం జరగనుంది. ఓం ఫ్రీ యోగా సంస్థ ఆధ్వర్యంలో జూన్ 14న ఈ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు, యోగా మాస్టర్ డాక్టర్ చిలుకా వెంకట రమేష్ తెలిపారు. యోగాకు విస్తత ప్రచారం కల్పించడంలో భాగంగానే ప్రఖ్యాత దేవాలయాల ఆవరణలో యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నిర్వాహక సంస్థ ప్రతినిధులు రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిశారు. కార్యక్రమంలో ఓం శ్రీ యోగ సంస్థ అధ్యక్షులు శాంతారాం, బీజేపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీందర్, ఉపాధ్యక్షుడు సురేష్ బాబు, లెండి విద్యాసంస్థల ఛైర్మన్ మధుసూదన్రావు పాల్గొన్నారు. -
‘వానా కాలం’ నిర్వహణకు సన్నాహాలు
భువనేశ్వర్: రుతు పవనాల కదలిక చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో వానా కాలం పరిస్థితుల నిర్వహణ ప్రక్రియ సన్నద్ధతను జల వనరుల విభాగం సమీక్షించింది. ఈ కాలంలో సంభావ్య వరదలు వంటి విపత్కర పరిస్థితుల సమర్థమైన నిర్వహణ, ప్రజల భద్రత నిర్ధారణ వంటి అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శుభా శర్మ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ఇంజినీర్ ఇన్ చీఫ్ ఇంజనీర్ బిభూతి భూషణ్ దాస్ హాజరయ్యారు. సీనియర్ శాఖాధికారులు, అన్ని ప్రధాన ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లు వర్చువల్ విధానంలో పాల్గొని వారి అధికార పరిధిలో ప్రస్తుత సన్నద్ధత, వరద నివారణ చర్యల స్థితిపై వివరణాత్మక సమాచారాన్ని అందించారు. మౌలిక సదుపాయాల నష్ట నివారణ, శూన్య ప్రాణ హాని లక్ష్యంపై సమగ్ర యంత్రాంగం నిబద్ధత, క్షేత్రస్థాయి అధికారులు, ఉప విభాగాలు నిరంతర సమన్వయం, అప్రమత్తత కార్యకలాపాల్ని విశ్లేషించారు. ప్రధానంగా వరద అత్యవసర ప్రణాళిక కార్యాచరణ అమలుపై విస్తృతంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నదుల గట్లు, తీర ప్రాంతాల్లో పటిష్టత తదితర అనుబంధ వ్యవస్థల పటిష్టతని సమీక్షించారు. గత ఏడాది వరదల వల్ల జరిగిన నష్టాలను పరిష్కరించేందుకు జరుగుతున్న పునరుద్ధరణ, మరమ్మతు పనుల ప్రస్తుత స్థితిని ఈ సందర్భంగా విశ్లేషించారు. రుతుపవనాల ఆగమనంతో వర్షాలు ప్రారంభం అయ్యేలోగా అసంపూర్తిగా ఉన్న అన్ని మరమ్మతు, పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో జల దిగ్బంధ సమస్యలను పరిష్కరించడానికి, నదీ జలాశయాల గేట్ల కార్యాచరణను తనిఖీ, వేగవంతమైన డ్రైనేజీ పూడికతీత పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆనకట్టల వద్ద నిర్వహించిన మాక్ డ్రిల్స్ నుంచి వెల్లడైన కీలక అంశాల ఆధారంగా వరద గేట్ల కార్యాచరణ, అనుబంధ అధికార యంత్రాంగం సన్నద్ధత స్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. పెరుగుతున్న నీటిమట్టాల నుండి సకాలంలో రక్షణ కల్పించేందుకు ఇసుక బస్తాలు, వెదురు కర్రలు, తీగ జాలీలు వంటి కీలకమైన వరద నివారణ సామగ్రి లభ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందన్నారు. రుతుపవనాల తాకిడితో వానలు తీవ్రం అయి ప్రమాదానికి గురయ్యే సమస్యాత్మక ప్రాంతాలపై రాత్రింబవళ్లు నిరంతర నిఘా, అధునాతన అత్యవసర పరికరాలను తక్షణ సన్నద్ధతతో యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండేదుకు మార్గదర్శకాలు జారీ చేశారు.జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు, అన్ని డివిజన్, సర్కిల్, చీఫ్ ఇంజినీర్ కార్యాలయ స్థాయిలలో రాత్రింబవళ్లు పని చేసే ప్రత్యేక వరద నియంత్రణ గదులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏకకాల వరద సెల్లు వ్యవసాయ సదన్, రాజీవ్ భవన్ రాష్ట్ర హైడ్రోలాజికల్ డేటా సెంటర్లో జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఏకకాలంలో వరద సెల్ నిరంతరాయంగా పని చేస్తాయి. నదులు, జలాశయాల అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నీటి మట్టం పరిశీలన తదితర విపత్తు నిర్వహణ కార్యకలాపాలు పురస్కరించుకుని పటిష్టమైన సమన్వయం కీలకంగా పరిగణించి నిరంతరాయ సమాచార మార్పిడితో సమయోచిత కార్యాచరణ కొనసాగించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. -
రాయగడ రైల్వే డీసీ కార్యాలయం సందర్శన
రాయగడ: రైల్వే కార్యకలాపాలకు కీలక కేంద్రంగా భావించే రాయగడ డివిజనల్ కంట్రోల్ కార్యాలయాన్ని వాల్తేర్ డివిజనల్ మేనేజర్లు లలిత్ బొహ్ర రాయగడ డివిజనల్ మేనేజరు అమితాబ్ సింఘాల్తో కలిసి మంగళవారం సమగ్రంగా పరిశీలించారు. ప్రధానంగా రాయగడ కంట్రోల్ కార్యాలయ కార్యకలాపాల పురోగతి, నిర్వహణ సామర్ధ్యం, సిబ్బంది సన్నద్ధత తదితర అంశాలను సమీక్షించారు. డివిజన్లో కంట్రొల్ కార్యాలయం అత్యంత కీలకమైన నాడీ కేంద్రంగా పనిచేస్తుందని డీఆర్ఎంలు పేర్కొన్నారు. పరిశీలన సందర్భంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రాయగడ కంట్రోల్ కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరును డీఆర్ఎంలు సమీక్షించారు. ముఖ్యంగా ఆపరేషన్స్, ఇంజినీరింగ్, క్యారేజ్ అండ్ వేగన్, భద్రత, క్రూ మేనేజ్మెంట్ తదితర శాఖల కార్యకలాపాలపై అధికారులు వివరాలు అందించారు. అలాగే రైల్వే కంట్రోల్ సిబ్బందితో ప్రత్యక్షంగా మాట్లాడి అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వాటి పనితీరుపై ఆరాతీశారు. అంతకు ముందు వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అలిత్ భొహ్ర విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు విండో ట్రైలింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి పనులు, భద్రత ఏర్పాట్లు, ప్రయాణికుల సౌకర్యాల అభివృద్ధి పనులను పరిశీలించారు. సిగ్నలింగ్ వ్యవస్థ, రైల్వే పాయింట్లు, క్రాసింగ్లు, యార్డ్ నిర్మాణం పనుల పురోగతిని అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. రైల్వే భద్రత, కార్యాచరణ సామర్ధ్యం, మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచి రైళ్ల రాకపోకలు సజావుగా జరిగేలా చూడడమే తనిఖీల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. -
రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని జాతీయ రహదారి–16పై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. రహదారి భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు ప్రమాదాలు తగ్గించే లక్ష్యంతో జాతీయ, రాష్ట్ర రహదారులు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్కే సోలార్ టెక్ సొల్యూషన్స్ సంస్థలు 180 ట్రాఫిక్ స్టాపర్స్ (బారికేడ్లు), 25 సోలార్ బ్లింకర్లు సామాజిక బాధ్యతతో జిల్లా పోలీసు శాఖకు అప్పగించారు. వీటిని జిల్లాకేంద్రంతోపాటు ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, కాశీబుగ్గ తదితర ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే కూడళ్లు, మార్కెట్టు ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాలు, ప్రధాన జంక్షన్లు వద్ద ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీటి ద్వారా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం, వాహనాల పార్కింగ్ను నియంత్రించడం, రహదారులపై అనవసర రద్దీని తగ్గించడం, అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడవచ్చన్నారు. ముఖ్యంగా పాదచారులు, వృద్ధులు, మహిళల భద్రతకు దోహదపడతాయన్నారు. ప్రజలకూ బాధ్యత ఉండాలి.. ప్రమాదాల నియంత్రణలో పోలీసులతో పాటు ప్రజల బాధ్యత కూడా అత్యంత ముఖ్యమని ఎస్పీ స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీటుబెల్టు వినియోగించాలని, మద్యం సేవించి, అతివేగంతో నడపరాదని, మొబైల్ డ్రైవింగ్, ట్రిపుల్, ర్యాష్ రైడింగ్ ప్రమాదకరమని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఉదయ్కుమార్సింగ్, హెచ్ఆర్ మేనేజర్ వి.శేఖర్, చీఫ్ మేనేజర్ ప్రసాద్, యూనియన్ జోనల్ సెక్రటరీ వి.వెంకటరమణ, ఆర్కే సోలార్ టెక్ సొల్యూషన్స్ ప్రతినిధులు ఎం.విజయ్చంద్, ఎ.చైతన్యప్రభు, ట్రాఫిక్ సీఐ వి.రామారావు, సీసీఎస్ సీఐ సూర్యచంద్రమౌళి, ఎస్ఐ మెట్ట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అంపురంలో భూ బాగోతం!
కంచిలి: అంపురం పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని వివాదాస్పదంగా ఉన్న భూమిలో కొందరు అక్రమార్కులు ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారు. ఏకంగా హైకోర్టులో వ్యాజ్యం ఉన్న ప్రభుత్వ భూమిలోనే రాళ్లు పాతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గేట్లు తెరిచారు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి ఈ వ్యవహారానికి ఒడిగట్టారు. దీనికి కొందరు అఽధికార పార్టీ నేతలు అండగా నిలిచారు. దీనిపై స్థానిక రెవెన్యూ యంత్రాంగం కొరడా ఝులిపించారు. కొద్ది నెలలుగా వివాదంగా ఉన్న ఈ వ్యవహరంపై తాజాగా చోటుచేసుకొన్న పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఎలాగైనా ఆక్రమించాలని.. జాతీయ రహదారికి ఆనుకొని కోట్లాది రూపాయలు చేసే ఈ విలువైన స్థలం పైన కొద్దిరోజులుగా అక్రమార్కుల కన్నుపడింది. కంచిలి మండలం అంపురం రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 116–1బిలో 1.12 ఎకరాల డీ పట్టా భూమిని విచారించిన తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, వెంటనే ఆక్రమణలు తొలగించాలని లోకాయుక్త గత ఏడాది సెప్టెంబరులో తీర్పు వెలువరిచింది. సదరు భూమిపై వివాదాన్ని కొనసాగిస్తూ మరో వ్యక్తి తాను అసలైన వారసుడినంటూ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానంలో వివాదం కొనసాగుతూనే ఉంది. జూన్ 16న దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తులు గానీ, ఇతర వ్యక్తులు గాని ఈ వివాదాస్పద భూమిపై ఎటువంటి వ్యవహారాలు చేయడం కోర్టు ధిక్కారమే అవుతుంది. దీన్ని పక్కన పెట్టి కొందరు అక్రమార్కులు ఇటీవల సదరు భూమిని జేసీబీతో చదును చేయించి ఏకంగా వెంచర్ వేశారు. రాళ్లను కూడా పాతిపెట్టి ప్లాట్లుగా విభజించారు. ఈ బరితెగింపు వ్యవహారానికి మండలానికి చెందిన అధికార పార్టీ నేతలు సూత్రధారులుగా వెనుక ఉంటూ కథ నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టకుండా చూసుకొంటానని అక్రమార్కులకు భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. చేతుల మారుతూ.. వాస్తవానికి కొన్ని దశాబ్దాల క్రితం కంచిలి మండలానికి చెందిన అనుపోజు లక్ష్మి అనే మహిళకు రెవెన్యూశాఖ అంపురం రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని 1.12 ఎకరాల మెట్టు భూమికి బీడీఆర్ పట్టా మంజూరు చేశారు. సదరు భూమి పలు క్రయ విక్రయాల ద్వారా చేతులు మారింది. చివరికి కంచిలికి చెందిన ఒక ప్రభుత్వ అధికారి కొనుగోలు చేశారు. తర్వాత ఆయన మరణించారు. ఆ ఉద్యోగి కుటుంబీకులు ఆ స్థలం ముందు భాగంలో షాపులు నిర్మించారు. తర్వాత ఈ స్థలం సమీపంలో ఓ వ్యక్తి షాపు పెట్టడం, తర్వాత మరికొందరు ఆ భూమి హక్కుదారులు తామే అంటూ ముందుకు రావడం వంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. చివరికి ఈ వివాదం లోకాయుక్త వరకు వెళ్లింది. కేసు విచారణ జరిపిన లోకాయుక్త ఈ భూమి క్రయవిక్రయాలు వ్యవహారంలో జరిగిన మొత్తం గలీజును బయటకు తీసింది. 1987లో బీడీఆర్ పట్టా పొందిన అనుపోజు లక్ష్మి ద్వారా జరిపిన భూమి బదిలీలు కావడం గుర్తించారు. తర్వాత బీడీఆర్ పట్టా పొందిన అనుపోజు లక్ష్మిగానీ, ఆమె కుటుంబీకులు గానీ ప్రస్తుతం లేనందున సదరు భూమిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆక్రమణలు ఉంటే వెంటనే తొలగించాలని లోకాయుక్త జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఈ మేరకు కంచిలి తహశీల్దార్కు ఆదేశాలు వచ్చాయి. ఇక్కడే వివాదం మలుపు తిరిగింది. అంతవరకు లోకాయుక్త విచారణ జోలికి పోని, బీడీఆర్ పట్టా పొందిన అనుపోజు లక్ష్మి ఇంటి పేరుతో ఉన్న ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లి తానే అసలైన వారసుడిని పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ఖంగుతున్నారు. ప్రస్తుతం హైకోర్టులో వివాదం కొనసాగుతుండగా మరోవైపు కోట్లాది రూపాయలు విలువైన ఈ భూమిని ఆక్రమించేందుకు కొందరు అక్రమార్కులు అధికార పార్టీ నేతల అండగా నిలవడంతో ఈ స్థలంలో రాళ్లు పాతి రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. ఆక్రమణ అడ్డగింత.. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. అంపురం రెవెన్యూ పరిధిలో జాతీ య రహదారి పక్కన సర్వే నంబర్ 116–1బి లో 1.12 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డబ్ల్యూపీ నంబర్ 27042/2025 వ్యాజ్యం పెండింగ్లో ఉన్నందున ఆక్రమణదారులు శిక్షార్హులు అంటూ కంచిలి తహశీల్దార్ ఎన్.రమేష్కుమార్ బోర్డు పెట్టారు. అక్కడ స్థలంలో పాతిన రాళ్లను పెకిలించి పక్కన పడేశారు. ఆ స్థలాన్ని పూర్తిగా రెవెన్యూశాఖ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించారు. కోర్టులో కేసున్నా బరితెచించిన అక్రమార్కులు ఆక్రమణదారులకు అండగా అధికార పార్టీ నేతలు కొరడా ఝుళిపించిన రెవెన్యూ అధికారులు -
యోగాతో మానసిక ప్రశాంతత
పర్లాకిమిడి: యోగాతో మానసిక ప్రశాంతంత చేకూరడంతోపాటు మెరుగైన ఆరోగ్యం సాధ్యమని వక్తలు అన్నారు. జూన్ ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీక్రిష్ణచంద్రగజపతి కళాశాల గౌరచంద్రగజపతి రంగస్థల వేదికపై పతంజలి యోగా సమితి గజపతి జిల్లా ప్రభారి విఘ్ణేశ్వర దాస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని రెండు నెలలుగా జరుపుతున్నారు. జిల్లాలోని గజపతి స్టేడియం, వివిధ కళాశాలలు, కాశీనగర్, గుమ్మ, గుసాని, చంద్రగిరి, నువాగడ సమితిల్లో పతంజలి యోగి సమితి, భారత్ శ్వాభిమాన్ సంఘటన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక స్థలాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా యోగా గురువు విఘ్నేశ్వర్ దాస్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. యోగా ద్వారా ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక రుగ్మతల నుంచి లబ్ధిపొందడమే కాకుండా మన నిత్యజీవితంలో ఉల్లాసంగా, దైనందిన కార్యాలు నెరవేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఇదొక ప్రాచీన విద్యఅని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కళాశాల విద్యార్థులు, ఐటీ ఇంజినీర్లు పనిఒత్తిడి వల్ల డిప్రెషన్కు లోనయ్యి మత్తు పదార్థలకు లోనవుతున్నారని, అలాంటి వారికి కూడా యోగా థెరపీ వల్ల జబ్బులు నయమవుతున్నట్టు యోగా గురువు దాస్ తెలిపారు. శిబిరంలో యువతీ యువకులతో పాటు వయో వృద్ధులు కూడా చేరి కోర్సులు పూర్తిచేసి ఉపాధి పొందుతున్నారన్నారు. ప్రస్తుతం రెండు నెలలుగా కొనసాగిస్తున్న యోగాభ్యాస్యాలలో ఆరితేరిన యోగా గురువులుగా తయారుచేసి జిల్లా అంతటా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పంపించే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. -
నెలక్రితం పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత
శ్రీకాకుళం క్రైమ్ : దాదాపు నెలక్రితం పోగొట్టుకున్న బ్యాగును ట్రాఫిక్ పోలీసులు ఆధార్కార్డు సహాయంతో ట్రేస్ చేసి జిల్లాకేంద్రానికి చెందిన కొల్లేటి అమూల్యకు సోమవారం అప్పగించారు. అమూల్య సారవకోట మండలంలోని వెంకటాపురం పుట్టింటికి వెళ్లేందుకు ఆటోలో ఆర్టీసీ కాంప్లెక్సుకు బయల్దేరి బ్యాగును మరిచిపోయింది. ఆటోవాలా ఆ బ్యాగును సమీప ట్రాఫిక్ పాయింట్లో అప్పజెప్పడంతో కానిస్టేబుల్ అన్నెపు సత్యనారాయణ అందులో ఉన్న ఆధార్కార్డును చూసి సారవకోట పోలీసులకు సమాచారమివ్వడంతో చిరునామాను బట్టి అమూల్య బ్యాగుగా గుర్తించారు. విద్యుత్ లైన్పై ఒరిగిన టవర్ రణస్థలం: పైడిభీమవరం జాతీయ రహదారి పక్కన ఉన్న బీఎస్ఎన్ఎల్ పాత టవర్ మంగళవారం 33 కేవీ హెచ్టీ విద్యుత్ లైన్పై వాలింది.ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడం, టవర్ కింద పడకుండా వైర్లపై నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి పాతపట్నం: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. పాతపట్నం సీహెచ్సీని మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, ఓపీ విభాగం, రోగుల వార్డులు, చిన్నపిల్లల వార్డు, బ్లడ్ బ్యాంక్ యూనిట్, రక్త పరీక్షల గదిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సక్రమంగా వైద్య సేవలు అందించి ఆస్పత్రికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డి.లీలాకుమార్, డాక్టర్లు జి.వేణుగోపాల్, జి.అనిత, హెచ్.సునీత, షణ్ముఖరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
నాటక రంగాన్ని రక్షించుకోవాలి
● ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి జయపురం: నాటక రంగాన్ని రక్షి్ంచుకోవాలని స్థానిక ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహణీపతి అన్నారు. స్థానిక గీతా భవనంలో ప్రియ థియేటర్ గ్రూపు నిర్వహించిన వారం దినాల నాటక శిక్షణ శిబిరం సోమవారం రాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా అమెబి సికిబి కార్యక్రమంలో మేము కూడా నేర్చుకుంటాం నాటక ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. ప్రియ ఽథియేటర్ గ్రూపు అధ్యక్షులు దిలీప్ మహాపాత్రో అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బాహిణీపతి మాట్లాడుతూ.. మన ప్రాచీన కళాసంపదలో నాటక కళ అతి ముఖ్యమైనది అన్నారు. నాటకాలు సమాజ ప్రతిబింబాలని.. వాటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. వారం రోజులు ప్రియ థియేటర్ గ్రూపువారు పిల్లలకు ఇచ్చిన నాటక శిక్షణ కొనియాడదగ్గదని అన్నారు. కొద్ది దినాలలో శిక్షణ పొందిన చిన్నారులు ప్రతిభావంతంగా నాటకాలు ప్రదర్శించి తమ పాత్రలకు జీవం పోశారని కొనియాడారు. ఈ సందర్భంగా నాటక శిక్షకులు గురు అశోక్ కర్, సమీర్ మహాపాత్రో, అమరేంధ్రహత్త, మానస ఆచార్య, పంచానన మిశ్ర, పద్మచరణ చౌధురి, నిరంజన్ పాణిగ్రహిలను ఘనంగా సన్మానించారు. శిక్షణ పొందిన 32 మంది బాలకళాకారులకు ముఖ్యఅతిథి తారాప్రసాద్ బాహిణీపతి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. శిక్షణ శిబిరంలో బాలనటులు నేర్చుకున్న మూడు నాటకాలను ప్రదర్శించారు. మొదట సమీర్ మహాపాత్రో రచించిన ‘బప్పంకు స్వప్న’(తండ్రి కల), అనంతరం నిరంజన్ పాణిగ్రహి రచించిన ‘పిక్నిక్’, తరువాత అశోక్ కర రచించిన ‘హే హో హు హూ’కళాకారులను ప్రదర్శించారు. పిల్లలు ప్రదర్శించిన నాటకాలు తిలకించిన ప్రేక్షకులు నటనలో పిల్లలు చూపిన ప్రతిభను ప్రశంసించారు. -
అభివృద్ధి పేరిట భూముల దోపిడీ
మందస : అభివృద్ధి ముసుగులో కార్పొరేట్లకు రైతుల భూములు కట్టబెట్టడానికి కార్గో ఎయిర్పోర్టు పేరిట పక్కా స్కెచ్ వేశారని రైతు సంఘం నాయకుడు బత్తిన లక్ష్మణ్ మండిపడ్డారు. మందస మండలం హరిపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవల జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలకు పలు ప్రశ్నలు సంధించారు. ఉద్దానం ప్రాంత రైతాంగం సమస్యలు మీకు తెలియవా? తరతరాలుగా కొబ్బరి, జీడితోటలపైనే ఆధారపడి బతుకుతున్నామని, అలాంటి భూములను లాక్కుంటే తమ బతుకులు వీధిన పడవా? అని ప్రశ్నించారు. కొబ్బరి చెట్టు ఫలసాయం ఇవ్వాలంటే కనీసం ఏడేళ్లు పడుతుందని, జీడి చెట్టు కాపు కాయాలంటే ఐదేళ్లు పడుతుందని, అలాంటి భూములను లాక్కుంటే కుటుంబ పోషణ ఎలా సాధ్యమన్నారు. జిల్లాలో 12 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయన్నారు. వజ్రపుకొత్తూరు మండలం సీతానగరంలో 1875 ఎకరాలు, పలాస వద్ద 800 ఎకరాలు, భావనపాడులో 5000 ఎకరాలు, మూలపేట వద్ద 1500 ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నా తమ భూములపై కన్ను పడటం వెనుక కార్పొరేట్ కుట్ర దాగుందని ఆరోపించారు. సమావేశంలో దున్న హరికృష్ణ, బెలమర జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
జీడి తోటలో యువకుడి మృత దేహం
భువనేశ్వర్: జట్నీ పిత్తాపల్లి ప్రాంతంలోని జీడి తోటలో రక్తసిక్తమైన యువకుడి మృత దేహం లభించింది. స్థానిక ఇన్ఫో వ్యాలీ పోలీస్ ఠాణా అధికారులు మృత దేహం పడి ఉన్న జీడి తోట ప్రాంగణం ప్రత్యక్షంగా సందర్శించి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై హత్య అనుమానంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన విద్యుత్ కేంద్రం సందర్శన కొరాపుట్: ప్రమాదం జరిగిన మాచ్ఖండ్ జల విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క మంగళవారం సందర్శించారు. కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితిలో ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సంయుక్త జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్తో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీ డిమాండ్ చేశారు. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ప్రమాదం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు ని అధికారులు ఎంపీకి వివరించారు. పర్యటనలో డీసీసీ అధ్యక్షుడు రుపక్ తురుక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోజ్ ఆచార్య ఉన్నారు. -
రాష్ట్రంలో అత్యాచారాలు అరికట్టాలి
పర్లాకిమిడి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని, కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును ఉద్దేశపూర్వకంగా డీ–లిమిటేషన్ బిల్లుతో లింకు పెట్టడం వల్ల లోక్సభలో వీగిపోయిందని బీజేడీ మహిళా అధ్యక్షురాలు సంయుక్తా బెహరా అన్నారు. స్థానిక బిజూ కల్యాణ మండపం నుంచి బీజేడీ పార్టీ తరపున మహిళలంతా ర్యాలీని చేపట్టారు. మహిళలంతా పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయం వరకూ వెళ్లి నిరసన తెలిపారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళలకు భద్రత కల్పించాలని పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి అన్నారు. అనంతరం రాష్ట్రపతికి విన్నవిస్తూ కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, బీజేడీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ నాయక్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, గుమ్మాబ్లాక్ అధ్యక్షురాలు సునేమీ మండల్, కాశీనగర్ బ్లాక్ అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, కాశీనగర్ ఎన్ఏసీ మాజీ వైస్ చైర్మన్ రఘురాం సాహు తదితరులు పాల్గొన్నారు. -
870 లీటర్ల నాటుసారా స్వాధీనం
రాయగడ: ఝార్సుగుడ ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర ఆదేశానుసారం సరిహద్దు ప్రాంతమైన చత్తీస్గఢ్లో కొనసాగుతున్న క్రమ నాటుసారా తయారీ, రవాణా వ్యవస్థలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రెంగాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా సరిహద్దులో అక్రమ నాటు సారా తయారీ, రవాణా జరుగుతుందని సమాచారం మేరకు పోలీసులు మంగళవారం ఈ దాడులను నిర్వహించారు. హిరాఖుడ్ జలాశయం బ్యాక్ వాటర్స్ ప్రాంతంతో పాటు ఒడిశా–చత్తీస్గఢ్ సరిహద్దులో భారీ స్థాయిలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడుల్లో అదనపు ఎస్పి, ఐయూసీఏడబ్ల్యూ, డీఎస్పీ లఖన్పూర్ ఐఐసి, రెంగాలి ఓఐఈలతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. మూడు ప్లాటూన్ల పోలీస్ బలగాలు, మహిళ పోలీస్ సిబ్బంది కూడా ఈ దాడుల్లో పాల్గొని ఆయా ప్రాంతాల్లొ గల ఇళ్లలో తనిఖీలు, కూంబింగ్ చర్యలు చేపట్టారు. అక్రమంగా నాటుసారా తయారీ చేసే సుమారు 17 నాటుసారా బట్టీలను కూల్చివేసి ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో 870 లీటర్ల నాటుసారాతో పాటు తయారీకి వినియోగించే సామగ్రి, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాఘవేంద్ర విలేకర్లకు తెలియజేశారు. -
బాధితుడిని చావగొట్టిన పోలీసులు
భువనేశ్వర్: బారంగ్ పోలీస్ ఠాణా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భార్య గల్లంతు విషయమై ఠాణాకు పిలిపించిన బాధితుని విచారణ చేపట్టాల్సిన పోలీసులు లాఠీ ఝులిపించి చావగొట్టారు. ఈ ఆరోపణతో బాధితుని తండ్రి కార్తీక్ బెహరా, తల్లి లక్ష్మీప్రియ బెహరాతో కలిసి బంధు మిత్రులు గ్రామం నుంచి తరలి వచ్చి ఠాణా ముట్టడించారు. పోలీస్ ఠాణాలో రాకేష్ తల్లి కన్నీళ్లతో పదేపదే స్పృహ కోల్పోయింది. కట్టలు తెంచుకొన్న గ్రామస్తుల ఆగ్రహం దృష్ట్యా బారంగ్ పోలీస్ ఠాణాకు భద్రత కల్పించేందుకు భారీ బలగాలను మోహరించారు. పోలీసుల దెబ్బలతో తీవ్రంగా గాయపడిన రాకేష్ బెహరా (31) కటక్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామస్తులు, బంధువుల ఫిర్యాదుల ప్రకారం రాకేష్ బెహరా భార్య ఈ నెల 15వ తేదీన అదృశ్యమైంది. మర్నాడు 16వ తేదీన భార్య అదృశ్యంపై రాకేష్ పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ నెల 22వ తేదీన పట్టొపూర్ సమీపంలోని కఠొజొడి నది ఒడ్డున ఇసుకలో పూడ్చిపెట్టిన మహిళ మృత దేహం లభ్యమైంది. మృత దేహాన్ని గుర్తించడం కోసం పోలీసులు రాకేష్ను ఠాణాకు పిలిచారు. ఆ మృత దేహం తన భార్యది కాదని, దొరికిన చీర, గాజులు తన భార్యవి కావని అతను పోలీసులకు పదేపదే మొర పెట్టుకున్నాడు. అది తన భార్య మృత దేహమని అతను అంగీకరించకపోవడంతో పోలీసులు అతడిని కొట్టి తీవ్రంగా గాయపరిచారని గ్రామస్తులు ఆరోపించారు. మరోవైపు పోలీసులు గ్రామస్తుల ఆరోపణలు నిరాధారమైనవని తోసిపుచ్చారు. రాకేష్ను పోలీస్ స్టేషనుకు పిలిచి విచారణ అనంతరం విడుదల చేసినట్లు వివరించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఉందని పేర్కొన్నారు. రాకేష్ వేరే ఘటనలో గాయపడి ఉంటాడని సందేహం వ్యక్తం చేశారు. అలాంటి సంఘలనలకు పోలీసులకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. -
మహేంద్రగిరి మేళాకు ఏర్పాట్లు
పర్లాకిమిడి: మహేంద్రగిరిపై జూన్ 1 నుంచి 9 వరకూ మహేంద్రమేళాను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీని కోసం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి బిభూతి భూషణ్ జెన్నా రెండురోజులుగా అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే యాత్రికులు, సాధుసంతువులు కోసం గుడారాలు, భోజన సదుపాయాలు, యజ్ఞాదులు కోసం తగు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 1500 మంది కోసం విడిది, వేలాది మంది సాధు సంతువులు కంధమాల్, కోరాపుట్, గంజాం, ఫుల్బనీ, రాయగడ జిల్లాల నుంచి విచ్చేసే వారికి విడిది సౌకర్యాలు అందించాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే మహేంద్రం వచ్చే భక్తులు, యాత్రికులు కోసం తాగునీరు, విద్యుత్, భోజన సదుపాయాలకు మహేంద్రంలో తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ జ్యేష్ట మాసంలో అధిక మాసం పడటం మూలాన, యమునా నదికి పుష్కరాలు పడటం, శుభసూచకమని చాలా ఏళ్ల తరువాత పవిత్ర పురుషోత్తమాసం జేష్టంలో సంభవించటంతో మహేంద్రంలో తొలిసారిగా మహేంద్రమేళాను గజపతి జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్నది. జూన్ 5, 9 తేదీల్లో మహేంద్రగిరి కుండ్ వద్ద పవిత్ర స్నానాలు ఉంటాయని మంత్రి బిభూతిభూషన్ జెన్నా విలేకరులకు తెలిపారు. ప్రతి ఒక్కరూ వచ్చి పరశురాం కుండ్ వద్ద యజ్ఞయాగాదులు చూసి తరించాలని మంత్రి జెన్నా కోరారు. -
మేటి ఉత్తీర్ణులకు హైటెక్ సత్కారం
భువనేశ్వర్: రాష్ట్ర ఉన్నత మాధ్యమిక విద్యా మండలి ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో మేటి ఉత్తీర్ణత సాధించిన హై టెక్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ చిత్తరంజన్ సహాణి మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువును నిరంతరం కొనసాగిస్తే విజయం వారి చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా హైటెక్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాల డైరెక్టర్ అంకితా పాణిగ్రాహి విద్యార్థుల భావి జీవితం అడుగడుగున విజయాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ముఖ్య కార్యనిర్వహణాధికారి శక్తిమయి పాఽఢి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ ఉత్తీర్ణత ప్రేరేణతో అందమైన జీవితాన్ని ఆవిష్కరించుకోవాలని కోరారు. మేధావంతులైన విద్యార్థులు దేశం సమగ్ర సంక్షేమానికి కృషి చేయాలని వైస్ చైర్మన్ బిభూతి భూషణ్ బెహరా ప్రోత్సహించారు. అంకితభావంతో విద్యార్థులు బహుముఖ రంగాల్లో మేటి ఉత్తీర్ణులు కావాలని ఉత్సాహపరిచారు. హై టెక్ సైన్న్స్ అండ్ కామర్స్ కళాశాల గత 20 ఏళ్లుగా 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తుంది. ఈ సంవత్సరం అదే తరహాలో ఉత్తీర్ణులైన వారిలో 97 శాతం మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కాగా నామమాతంగా 5 మంది విద్యార్థులు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. -
ముగిసిన ఎన్సీసీ వార్షిక శిక్షణ
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన 15 వ ఒడిశా బెటాలియన్ ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఎన్సీసీ కేడెట్స్ పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి, ముగింపు ఉత్సవానికి వన్నె తెచ్చారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విక్రమదేవ్ యూనివర్సిటీ రిజిస్టార్ మహేశ్వర చంధ్ర నాయిక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేడెట్స్ క్రమశిక్షణ అలవర్చుకొని దేశభక్తి, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని ఉద్బోధించారు. కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో మాట్లాడుతూ వార్షికోత్సవంలో ఎన్సీసీ కేడెట్స్ శారీరక, మానసిక, నైతిక శిక్షణ పొంది తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకున్నారని తెలిపారు. ముగింపు ఉత్సవంలో కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కర్నల్ ప్రీతిరంజన్ దాస్ మాట్లాడుతూ వార్షికోత్సవంలో కేడెట్స్ క్రమశిక్షణ, కృషి, కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న తీరు ప్రశంసనీమయని కొనియాడారు. ఇలాంటి శిక్షణ శిబిరాలు కేడెట్ల మనసులో దేశ సేవా భావణ కలిగించటంతో పాటు, వారిని భవిష్యత్లో బాధ్యతాయుత పౌరులుగా తీర్చి దిద్దుతాయని అన్నారు. -
కలెక్టర్కు పాచిపోయిన ఆహారం
కొరాపుట్: సాక్షాత్తు కలెక్టరే పాచిపోయిన ఆహారం తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం నబరంగ్పూర్ కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ రాయిఘర్ సమితి కేంద్రం సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో సిబ్బంది బయట హోటల్ నుంచి అల్పాహారం తెప్పించి ఇచ్చారు. అది పాచి పోయిన విషయం హాటల్ విక్రేతలు చెప్పలేదు. అలాగే సిబ్బంది కూడా పరిశీలించలేదు. తిన్న కలెక్టర్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఆహారం ఎక్కడ నుంచి వచ్చిందని ఆరా తీశారు. బయట హోటల్స్లో అమ్ముతున్నారని తెలుసుకుని వెంటనే ఫుడ్ సేఫ్టీ, తహసీల్దార్, పోలీసు విభాగాల సిబ్బందితో రాయిఘర్లో హోటల్స్పై దాడులు చేయించారు. ఆయా హోటల్స్లో దారుణమైన కలుషిత ఆహారాలు కనిపించాయి. దాంతో రెండు హోటల్స్ సీజ్ చేశారు. మిగతా హోటల్స్పై జరిమానాలు విధించారు. -
భర్తే చంపేశాడు
● కొలిక్కి వచ్చిన పల్లెగుడ హత్య కేసు జయపురం: జయపురం సమితి పల్లెగుడ గ్రామంలో ఇటీవల జరిగిన ఒక మహిళా హత్య కేసుని ఎట్టకేలకు ఛేదించారు. హంతకుడు ఆమె భర్తేనని పోలీసులు నిర్ధారించారు. పోలీసుల వివరణ ప్రకారం పల్లెగుడ గ్రామంలో బిభీషణ భూమియ భార్య కమల భూమియ స్నానం చేసిన సమయంలో బట్టలు లేకుండా ఉందని ఆగ్రహించిన ఆమె భర్త గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ వెల్లడించారు. నిందితుని అరెస్టు చేసి హత్యకు అతడు వినియోగించిన గొడ్డలి సీజ్ చేసినట్లు పెలీసు అధికారి వెల్లడించారు. అతడిని కోర్టులో హాజరుపరచగా కోర్టు వారు బెయిల్ నిరాకరించటంతో జైలుకు పంపించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. పల్లిగుడ గ్రామంలో బిభీషన్ భూమియ తన భార్యతో ఉంటున్నాడు. ఈ నెల 23 వ తేదీన గ్రామంలో ఒక ఫంక్షన్ జరుగుతోంది. అది పూర్తయిన తరువాత కమల స్నానం చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె దుస్తులు జారిపోయాయి. అది చూసిన బిభీషణ కోపంతో గొడ్డలితో భార్యను కొట్టి కొట్టి గాయపరచాడు. దాంతో కమల పరిస్థితి విషమంగా మారింది. తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా మారింది. అయినా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. 24 వ తేదీ ఉదయం కమల మరణించింది. కమల మరణించిన సమాచారం తెలిసిన ఆమె బంధువులు ఆ రోజు మధ్యాహ్నం పల్లెగుడకు చేరుకున్నారు. కమల నోటి నుంచి రక్తం కారుతుండటం, శరీరంపై దెబ్బలు కనిపించటంతో వారు పోలీసులకు తెలియజేశారు. కమలను కొట్టి చంపాడని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారి సచేంధ్ర ప్రధాన్, సబ్ఇన్స్పెక్టర్ శిరీష్ మహాపాత్రో, అమయ రంజన్ సాగరియ, ఏఎస్ఐ ప్రశాంత కుమార్ సర్కార్ పోలీసులతో కలసి ఆ గ్రామం చేరుకున్నారు. కొరాపుట్ నుంచి సైంటిఫిక్ టీమ్ను రప్పించారు. సైంటిఫిక్ టీమ్ పరీక్షలు జరిపి ఆధారాలు సేకరించారు. పోలీసుల ఎదుట నిందితుడు నేరాన్ని అంగీకరించటంతో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ వెల్లడించారు. -
సత్తాచాటిన విద్యార్థినులు
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి పరిధి పొలమ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు మరోసారి సత్తాచాటారు. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో జరిగిన జాతీయ ఉపకనిష్ట త్రోబాల్ పోటీల్లో విద్యార్థినులు నికితా మండిక, స్వప్న హుయిక, మౌసుమి మాఝిలు అద్భుత ప్రతిభ కనబర్చి కాంస్య పథకాన్ని సాఽధించారు. దీంతో వీరిని పలువురు అభినందించారు. మంగళవారం రాయగడ చేరుకున్న వీరికి క్రీడాభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఏనుగు సంచారం రాయగడ: గత కొన్నేళ్లుగా ఏనుగుల సంచారంతో భయాందోళనకు గురవుతున్న బిసంకటక్ సమితి రెటేలి గ్రామంలో, తాజాగా ఒక ఏనుగు చెరువు వద్ద స్నానం చేస్తుండడం కనిపించడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. సమీప అడవుల నుంచి వేసవి తీవ్రత కారణంగా ఉపశమనం పొందేందుకు చెరువు వద్దకు ఏనుగు వచ్చి గంటల పాటు చెరువులో ఉంది. అయితే ఈ ఏనుగు ఎప్పుడు ఎటువంటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందోనన్న భయాన్ని ఆ ప్రాంత వాసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్కటే ఏనుగు ఉందా లేకుంటే గుంపుగా ఉన్నాయో తెలియాల్సి ఉంది. ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు తెలియజేశారు. పేకాట శిబిరంపై దాడి మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి జియటిపల్లి గ్రామ సమీప అడవిలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు మంగళవారం సమాచారం వచ్చింది. దీంతో కోరుకొండ పోలీసులు పేకాట శిబిరంపై దాడిచేసి ముగ్గురుని అరెస్టు చేశారు. అలాగే 9 ద్విచక్ర వాహనాలు, రూ.440ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్నవారిని గాలిస్తున్నట్లు ఐఐసీ విజయ్ కుమార్ తెలిపారు. విచారణ అనంతరం నిందితులను కోర్టుకు తరలిస్తామన్నారు. సెప్టిక్ ట్యాంక్లో పడి ఆరుగురి మృతి భువనేశ్వర్: కలహండి జిల్లా ఎం.రాంపూర్ (మదన్పూర్ రాంపూర్) పోలీస్ ఠాణా పరిధిలోని గౌడ్ కర్లఖుంట గ్రామంలో మంగళవారం ఉదయం సెప్టిక్ ట్యాంక్ పనుల్లో ఊపిరాడక 6 మంది మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సెప్టిక్ ట్యాంక్లోని వ్యర్థాలను తొలగించడానికి కార్మికుడు లోపలికి ప్రవేశించాడు. కాసేపటి తర్వాత అతడి అలికిడి లేకపోవడంతో పరిశీలించి ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నట్లు గుర్తించారు. అతడిని రక్షించేందుకు తోటి కార్మికులు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లారు. వారంతా దురదృష్టవశాత్తు స్పృహ కోల్పోయారు. బాధిత వర్గాల కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడంతో స్థానిక యంత్రాంగం గ్రామస్థుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టింది. సెప్టిక్ ట్యాంక్ లో చిక్కుకున్న బాధితులందరినీ బయటకు తీశారు. వారిని వెంటనే చికిత్స కోసం మదన్పూర్ రాంపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. వారిలో ఆరుగురు ఊపిరాడక మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో తండ్రి మహేశ్వర్ హతి (62) మరియు అతడి ఏకై క కుమారుడు రంజన్ హతి (27) ఉన్నారు. ఈ దుర్ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ. 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. -
రాళ్ల గుట్టలో ఆక్రమణలు
టెక్కలి: జాతీయ రహదారికి ఆనుకుని బొప్పాయిపురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 1–1లోని రాళ్లగుట్టలో సుమారు 5 సెంట్ల ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఆక్రమణలు జరిగినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించినప్పటికీ.. తొలగింపు విషయంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు జోక్యం చేసుకుని అడ్డుపడుతున్నారని తెలుస్తోంది. ఇదే రాళ్లగుట్టకు ఆనుకుని జాతీయ రహదారి వరకు ఇటీవల సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో దీని విలువ పెరగడంతో ఆక్రమణలు మరింత జోరందుకున్నాయి. వీటితో పాటు సమీపంలో సుమారు ఎకరా వరకు డీ–పట్టా స్థలం ఉంది. దీనిని ఎలాగైనా కై వసం చేసుకునేందుకు అధికార పార్టీ కార్యకర్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమేరకు అమ్మకాలు చేపట్టడంతో రూ.లక్షల్లో చేతులు మారినట్లు సమాచారం. కాగా జాతీయ రహదారికి అనుకుని బహిరంగంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న ఈ స్థలాల్లో ఇప్పుడు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఒక్కసారిగా వీటి విలువ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో పంచాయతీ స్థాయిలో ఉన్న అధికార పార్టీ కార్యకర్తల కన్ను పడింది. ఎలాగైనా వాటిని కై వసం చేసుకుని గుట్టుగా అమ్మకాలు చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. అందువలన ఈ ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
70 మొబైల్ ఫోన్ల బాక్సు మాయం
● పోలీసులకు ఫిర్యాదు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో ప్రైవేట్ బస్సుల్లో నిర్లక్ష్యం, ఇష్టరాజ్యం ప్రయాణికులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. సరైన సీట్లు ఇవ్వకపోవడం, అఽధిక చార్జిలు వసూలు చేయడం వంటి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు బస్సులో పార్సెల్ రూపంలో పంపిన 70 మొబైల్ పెట్టె మాయమైన ఘటన ఇప్పుడు చర్చనీయమైంది. మాయమైన ఫోన్ల విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుంది. ఈ మేరకు మల్కన్గిరి పోలీసుస్టేషన్కు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. ఐఐసీ రీగాన్ కీండో కేసు నమోద్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. భువనేశ్వర్ నుంచి మల్కన్గిరికి రోజూ మహదేవ్ పేరుతో ప్రైవేటు బస్సు వస్తుంది. దీనికి ఽభువనేశ్వర్లో సెల్ఫోన్లతో ఉన్న పార్శిల్ ఇచ్చారు. భువనేశ్వర్కు చెందిన డిలైట్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ మల్కన్గిరికి చెందిన డిజిటల్ వరల్డ్ సంస్థకు 70 మొబైల్ ఫోన్లు ఒక పెట్టెలో ప్యాక్ చేసి బస్సుకు ఇచ్చారు. బస్సు సోమవారం చేరుకున్న వెంటనే సంబంధిత వ్యక్తులు రశీదు చూపించి మొబైళ్ల బాక్సు కోసం సిబ్బందిని అడిగారు. అయితే బాక్సు లేకపోవడంతోపాటు బస్సు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో డిజిటల్ వరల్డ్ యజమాని మౌసమీ సాహా దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బస్సుపై గతంలో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. -
నగరంలో పెరిగిన ఇంధన ధరలు
భువనేశ్వర్: సోమవారం నుంచి తాజా ఇంధన ధరల సవరణలు అమల్లోకి రావడంతో భువనేశ్వర్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి. కేవలం 10 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగో సారి కావడంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు రూ. 100.81 కాగా పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.16కు పెరిగింది. సోమవారం నాటి సవరణకు ముందు భువనేశ్వర్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.33గా, డీజిల్ ధర లీటరుకు రూ.97.92గా ఉండేది. స్పీడ్ పెట్రోల్ వంటి ప్రీమియం వేరియంట్ ధర కూడా భారీగా పెరిగాయి. నగరంలో దీని ధర ఇప్పుడు లీటరుకు రూ. 118.27గా ఉంది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సంతోష్ మిశ్ర కొరాపుట్: నబరంగ్పూర్ బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడిగా సంతోష్ మిశ్ర గెలిపొందారు. సమీప ప్రత్యర్థి సిరాజుద్దీన్ అహ్మద్పై 26 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవం సాధ్యం కాకపోవడంతో ఎన్నిక అనివార్యం అయింది. న్యాయవాదులతో కూడిన ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. వైభవంగా నీలమ్మ సంబరాలు పర్లాకిమిడి: స్థానిక ఎనిమిదో వార్డు పిన్నింటి పాపన్న వీధిలో గ్రామదేవత నీలమ్మ సంబరాలు రెండురోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ఆరోగ్య వీధిలో ఉంచి, ఘటాలను సోమవారం ఊరేగించారు. మూడు రోజులపాటు జరిగే అమ్మవారి సంబరాలకు విద్యుత్ దీపాలను అలంకరించారు. రూ.40 వేల ఆర్థికసాయం రాయగడ: జిల్లాలోని చంద్రపూర్లో సోమవారం జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కలక్టర్ అశుతోష్ కులకర్ణి ఇద్దరు వ్యక్తులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. వివిధ ప్రాంతాల నుంచి 15 వినతులు అందాయి. 7 వ్యక్తిగతమైనవి, మిగిలనవి గ్రామ సమస్యలుగా గుర్తించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ వినతుల స్వీకరణ కార్యక్రమంలో గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, జిల్లా ముఖ్యవైధ్యాధికారి, చంద్రపూర్ బీడీఓ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అగ్నివీర్పై ఎన్సీసీ క్యాడెట్లకు అవగాహన జయపురం: అగ్నివీర్పై ఎన్సీసీ క్యాడెట్లు అవగాహన పెంచుకోవాలని ఆర్మీ అధికారులు అన్నారు. ఎన్సీసీ 15వ ఒడిశా బెటాలియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏటీసీ క్యాంప్లో భాగంగా సోమవారం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్పై అవగాహన కల్పించారు. అగ్ని రిక్రూట్మెంట్ గోపాలపూర్ కార్యాలయ అధికారులు హాజరయ్యారు. అగ్నివీర్ లక్ష్యం, అర్హతలు, ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ, శారీరక, రాత పరీక్షలు, అభ్యుర్ధుల ఎంపిక ప్రక్రియలపై వివరించారు. అగ్నివీర్లో చేరిన యువతకు దేశ సేవ చేసే అవకాశంతో పాటు వారి ఉజ్వల భవిత నిర్మించుకునే అవకాశం ఉంటుందన్నారు. అగ్నివీర్లో చేరాలనుకునే ఎన్సీసీ క్యాడెట్లు క్రమం తప్పకుండా సాధన చేయాలన్నారు. క్యాడెట్స్ అడిగిన ప్రశ్నలకు ఆర్మీ అధికారులు విపులంగా వివరించారు. ఎరువుల దుకాణాల్లో తనిఖీలు గార: మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో విజిలెన్సు, వ్యవసాయాధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. తూలుగు జంక్షన్లోని శ్రీశివపార్వతి ఎంటర్ప్రైజెస్, శ్రీ వేంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ దుకాణాలను విజిలెన్సు ఎస్ఐ బి.రామారావు, ఏవో డి.పద్మావతిలు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వం ఇటీవల నిషేధించిన పారాక్వాట్ కలుపు మందు 287 లీటర్లు ఉండడంతో వాటి అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. తనిఖీల్లో ఏఈవోలు బి.దుర్గాప్రసాద్, జె.శ్రీదీప్తి తదితరులు పాల్గొన్నారు. -
నలుగురు నిందితులకు ఆరేళ్ల జైలు శిక్ష
రాయగడ: ఒక హత్య కేసుకు సంబంధించి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కీలక తీర్పును వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన అలేఖమణి నాయక్, అంబికా ఖుర, ఖేత్రమణి నాయక్, గొరేక్ ఖురాలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. కేసు విచారణ జరిపిన మీదట నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్షను విధిస్తు తీర్పునిచ్చింది. అదేవిధంగా అదనంగా ఒక్కొక్కరికి రూ.5 వేలు జరిమానా చెల్లించాలని, లేని పక్షంలో మరో ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితుల తరఫున న్యాయవాది ఉమాకాంత్ వాదించగా, ప్రభుత్వం తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజత్ రంజన్ ఖటువా వాదనలు వినిపించారు. నిఖిల్ హత్య కేసులో మరో నలుగురి అరెస్టు రాయగడ: స్థానిక ఇందిరానగర్ ఏడో లైన్లో ఈ నెల పదో తేదీన జరిగిన నిఖిల్ అనే వ్యక్తి హత్య, కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను తాజాగా అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసి కోర్టుకు తరలించిన పోలీసులు తాజాగా అరెస్టు చేసిన నలుగురుతో ఈ సంఖ్య 16కు చేరిందని స్థానిక పోలీసు కార్యాలయం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తాజాగా అరెస్టయిన నలుగురిలో ముగ్గురుని కర్ణాటకలో అరెస్టు చేశారు. అరెస్టయిన ప్రధాన నిందితుల్లొ చింటు అలియాస్ దేవాశీష్ బిభొర్, పవన్ కల్పా, సాగర్ కల్పాలు ఉన్నారు. వీరు పోలీసుల కన్నుగప్పి పలు రాష్ట్రాల్లో తలదాచుకుంటూ తిరుగుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం నుంచి గోవా మీదుగా కర్ణాటకలోని హుబ్లీ వరకు వెంబడించి చివరకు అరెస్టు చేశారు. అలాగే మరో నిందితుడు అజయ్ దేవరపల్లిని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ కేసుకు సంబంధించి ఉన్న ప్రతీఒక్కరిని అరెస్టు చేస్తామని అందుకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. చేతబడి నెపంతో మహిళ హత్య మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి సోమానాథపూర్ పంచాయతీ సారదాగూఢ గ్రామంలో ఆదివారం ఓ దారుణ ఘటణ చోటు చేసుకుంది. చేతబడి చేస్తుందనే నెపంతో ఓ మహిళను గ్రామస్తులు కొట్టి చంపేశారు. పద్మా నాయక్ (50) అనే మహిళ, గ్రామానికి చెందని మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి చేతబడి చేస్తోందనే అనుమానంతో గ్రామస్తులు రాళ్లతో కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పద్మా కుమారుడు గణేష్ నాయక్ వచ్చి తల్లిని ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో ఆమె మృతి చెందింది. వెంటనే గణేష్ ఈ విషయంపై బలిమెల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా చిత్రకొండ ఎస్డీపీఓ ప్రదోష్ ప్రధాన్, బలిమెల ఐసి దీరాన్ పట్నాయిక్ లు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సోమవారం సైంటిఫిక్ బృందం వచ్చి నమూనాలు సేకరించింది. నైజర్ పీహెచ్డీ స్కాలర్ అనుమానాస్పద మృతి భువనేశ్వర్: ఖుర్ధా జిల్లా జట్నీ ప్రాంతంలో జాతీయ విజ్ఞాన విద్య మరియు పరిశోధన సంస్థ (నైజర్)కు చెందిన మొదటి సంవత్సరం పీహెచ్డీ విద్యార్థిని సోమవారం తన హాస్టల్ గదిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించి కనిపించింది. మృతురాలిని ఉత్తర ప్రదేశ్కు చెందిన శ్రేయా సింగ్గా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం శ్రేయ తన మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని తోటి విద్యార్థులు గమనించారు. చాలా సేపటి వరకు ఆమె మేల్కోకపోవడంతో ఆందోళన చెందిన ఆమె సహచరులు హాస్టల్ మరియు విద్యాసంస్థ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరణానికి గల కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి మృత దేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం భువనేశ్వర్లోని ఎయిమ్స్కు పంపారు. జట్నీ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు అసహజ మరణం కోణంతో సహా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పీఎంఏవైలో రూ.50 కోట్లు అవినీతి
జయపురం: ప్రధానమంత్రి రోజ్గార్ ఆవాస్ యోజనతోపాటు వివిధ పథకాల్లో లబిధదారులకు చెందాల్సిన రూ. 50 కోట్లను పోస్టుల్శాఖ ఉద్యోగులు పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడ్డారని బీజేపీ పార్టీ నాయకులు ఆరోపించారు. జయపురంలోని ఓ హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి రబినారాయణ నందో, పార్లమెంటు మాజీ సభ్యులు ప్రదీప్ మఝి, పార్టీ యువజన ఉపాధ్యక్షులు అరుణ కుమార్ మిశ్ర, కొరాపుట్ జిల్లా కార్యక్రారి అధ్యక్షులు దుర్గా ప్రసాద్ మిశ్ర, సీనియర్ నాయకులు సరోజ్ కుమార్ పాత్ర, ధర్మేంద్రఅధికారి మాట్లాడారు. జయపురం ప్రధాన పోస్టాఫీసు ఆధీనంలో కొరాపుట్, మల్కన్గిరి, రాయగడ, నవరంగపూర్ జిల్లాలు ఉన్నాయని ఆయా పోస్టాఫీసుల్లో ప్రధాన మంత్రి అవాస్ యోజన తదితర పథకాల లబ్ధిదారులకు చెందిన 50 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందన్నారు. తపాలా విభాగంలో బీవీజీ రాంసింగ్, ప్రధాన మంత్రి అవాస్ యోజన, వృద్ధాప్య పింఛన్లు, బీమా మొదలగు ప్రజా సంక్షేమ పథకాల లబ్ధదారులకు పైకం జమ చేయాల్సి ఉంటుందన్నారు. అయితే కొరాపుట్, నవరంగపూర్ జిల్లాలలో డాబుగాం, ఝోరిగాం, కొడింగా తదిర సమితిలలో 800 తపాలా కార్యాలయాలలో ఉద్యోగులు కొంతమంది సబ్ తపాలా ఉద్యోగులు కలసిపేద లబ్ధిదారులకు చెందాల్సిన రూ. 50 కోట్లు స్వాహా చేశారని రోపించారు. 2021 నుంచి 2026 వరకు దాదాపు 25 వేల మంది అసలైన ఉపాధి హామీ పథకం వేతనదారులకు వేతనాలు ఇవ్వకుండా వారి ఖాతాల కేవైసీలను అక్రమంగా మార్చి నకిలీ వేలి ముద్రలు వేసి వారికి చెందాల్సిన సొమ్మును స్వాహా చేసినట్లు నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపి అవినీతి అధికారులు సిబ్బందిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే లబ్ధిదారులకు చెందాల్సిన పైకాన్ని వారికి వెంటనే చెల్లించాలని.. లేకపోతే పీఎంజీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే తాము న్యాయం కొరకు న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని మాజీ మంత్రి రబినారాయన నందో, మాజీ ఎంపీ ప్రదీప్ మఝి స్పష్టం చేశారు. -
ముగిసిన నాటక శిక్షణ శిబిరం
జయపురం: స్థానిక ప్రియా థియేటర్ గ్రూపు ఆధ్వర్యంలో గీతాంజలి కల్యాణ మండపంలో నిర్వహించిన నాటక శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది. ఈ నెల 18వ తేదీన శిబిరం ప్రారంభమైంది. నాటక శిక్షణ శిబిరంలో ఔత్సాహిక కళాకారులు అనేక మంది పాల్గొని శిక్షణ పొందారు. శిబిరంలో మూడు నాటకాలలో నటించే విధానంపై శిక్షణ ఇచ్చారు. ‘బప్పాకా స్వప్న’(తండ్రి కల) నాటకం, ‘పిక్నిక్’, ‘హేహో హుహూ’ నాటకాలను ఔత్సాహిక కళాకారులతో ప్రదర్శింప చేసి శిక్షణ ఇచ్చారు. బప్పాకా స్వప్న నాటకాన్ని రచించిన సమీర్ మహాపాత్రో నాటకానికి దర్శకత్వం వహించి కళాకాలకు నటన విధానం నేర్పారు. నిరంజన్ పాణిగ్రహి రచించిన పిక్నిక్ నాటకానికి ఆయనే దర్శకత్వం వహించి నాటకంలో పాత్రదారులు ఎలా నటించాలో తెలియజేశారు. అశోక్ కర్ రచించిన ‘హేహో హుహూ’ నాటకానికి ఆయనే దర్శకత్వం వహించి నటులకు తగిన సూచనలు ఇచ్చారు. గత వారం రోజులు ఔత్సాహిక నటులకు గురు పంచానన మిశ్ర, నిరంజన్ పాణిగ్రహి, గురు అబ్దుల్ ఖాదర్, గురు సమీర్ మహాపాత్ర, అమరేంద్ర హోత్త, మానస్ ఆచార్య, గురు అశోక్ కర్ (భువనేశ్వర్) శిక్షణ తరగతులను నిర్వహించారు. సమాజాన్ని చైతన్యపరచటంలో నాటకాల పాత్ర బృహత్తరమైనదని, నేడు నాటక కళలు కనుమరుగయ్యాయని నిరంజన్ పాణిగ్రహి అన్నారు. సమాజాన్ని చైతన్య పరచటంలో నాటక కళ భూమిక తెలుసుకొని కనుమరుగవుతున్న నాటకాలను పరిరక్షించేందుకు ఔత్సాహిక కళాకారులు, నటులు నాటకాలను ప్రదర్శించాలన్నారు. శిక్షణ శిబిరంలో చిన్నారులు, యువతీ, యువకులు అనేక మంది పాల్గొన్నారు. -
సరస్వతీ విద్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మాజీమంత్రి
పర్లాకిమిడి: కేంద్ర గిరిజనాభివృద్ధిశాఖ మాజీ మంత్రి, గజపతి జిల్లా బీజేపీ పర్యవేక్షకులు విశ్వేశ్వరతుడు సోమవారం సోండివీధి వద్ద సరస్వతీ శిశు మందిర్ విద్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు మహాంత రామానంద దాస్ ఘనంగా స్వాగతం పలికారు. మహారాజా క్రిష్ణచంద్రగజపతి 53వ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన తైలవర్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ప్రత్యేక ఒడిశా రాష్ట్రం ఏర్పాటుకు, పర్లాకిమిడిలో అనేక విద్యాసంస్థలు నెలకోల్పిన గజపతి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సరస్వతీ శిశుమందిర్ ప్రధాన ఆచార్యులు పాఠశాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరుతూ వినతిపత్రాన్ని విశ్వేశ్వర తుడుకు అందజేశారు. అనంతరం విద్యాలయం భవనాన్ని చూసి ముచ్చటపడ్డారు. కార్యక్రమంలో విద్యాలయం పర్యవేక్షక కమిటీ అధ్యక్షులు సుభాష్ చంద్ర జమాదార్, ఉపాధ్యక్షులు సంజయ్ జెన్నా, అనాది పాణిగ్రాహి ఉన్నారు. -
వినతుల వెల్లువ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి గుంటాబేడ పంచాయతీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించి 50 వినతులు స్వీకరించారు. 5 వ్యక్తిగత ఫిర్యాధులు, 45 గ్రామస్థాయి సమస్యలపై ఫిర్యాధులు అందాయి. వీటిలో పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను ఆయా శాఖలకు అప్పగించారు. మధుబాబు పెన్షన్ పథకం, వృద్ధాప్య, వితంతు భత్యాల కోసం కొత్త దరఖాస్తులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పక్కా ఇళ్ల మంజూరు, కొత్తరేషన్ కార్డుల జారీ కోసం వినతులు అందాయి. వివిధ గ్రామాల ప్రతినిధులు గ్రామీణ రహదారుల నిర్మాణం, తాగునీటి సరాఫరాలో సమాస్యలు, విద్యుదీకరణలో లోపాలు, భూపట్టాల మంజూరు వంటి కీలక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాబు, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధర్ బోయి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మల్కన్గిరి సమితిలో సీంద్రీమాల పంచాయతీ, మాత్తిలి సమితి కర్తన్మాల, కలిమెల గుమాక పంచాయతీ, ఖోయిర్పూట్ సమితి ముదిలిపోడ, కోరుకొండ సమితి డుడుమేట్ల పంచాయతీలోనూ వినతులు స్వీకరించారు. పర్లాకిమిడి: గజపతిజిల్లా రాయఘడ బ్లాక్ పంచాయతీ సమితి కార్యాలయంలో సోమవారం గ్రామముఖిపరిపాలన, జాయింట్ గ్రీవెన్స్కు అధిక స్పందన లభించింది. గ్రీవెన్స్కు జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, ఎస్.డి.పి.ఒ మాధవానంద నాయక్, డీఎఫ్ఓ నాగరాజు, ఐ.టి.డి.ఏ.పి.ఓ అంశుమాన్ మహాపాత్రో, సబ్కలెక్టర్ అనుప్ పండా, రాయఘడ సమితి చైర్మన్ పూర్ణబాసి నాయక్ తదితరులు పాల్గొన్నారు. 18 వినతులు అందాయి. వీటిలో గ్రామ సమస్యలు 15, వ్యక్తిగతం 3 ఉన్నాయి. జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం ఆధ్వర్యంలో ఆరుగురుకి మధుబాబు పింఛన్లు అందజేశారు. అధిక ఎండలు కారణంగా గ్రీవెన్సు సెల్కు అతి తక్కువ అభియోగాలు వచ్చాయి. ఇతర ప్రభుత్వ అధికారులతోపాటు ఉపాధ్యక్షులు జ్యోతిరంజన్ పాణి, బి.డి.ఓ సంతోష్కుమార్ బారిక్, తహసీల్దార్ సుకాంత ప్రధాన్, తదితరులు పాల్గొన్నారు. -
అంగుల్లో శ్రామిక్ కాంగ్రెస్ కొత్త శాఖ ప్రారంభం
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండలం అంగుల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే వర్కర్స్ కాంగ్రెస్ 16వ కొత్త శాఖ కార్యాలయ భవనాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక మండల రైల్వే అధికారి (డీఆర్ఎం) డి.సునీల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రామిక్ కాంగ్రెసు ప్రతిపాదించిన పలు కార్మిక సంక్షేమ, మౌలిక సదుపాయాల ఏర్పాటు తదితర అంశాల్ని పరిశీలించిన మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుందని డీఆర్ఎం తెలిపారు. సునీల్ కుమార్ భొంజొ సమన్వయంతో నిర్వహించిన ప్రారంభోత్సవ సభకు శ్రామిక్ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు హాజరయ్యారు. అంగుల్ రైల్వే కాలనీలో ఉద్యోగులకు వసతి సదుపాయం, అంగుల్ మున్సిపాలిటీ నీటి సరఫరా పైప్లైను అనుసంధానంతో రెల్వే కాలనీలో పరిశుద్ధ తాగునీటి సరఫరా, అంగుల్ స్టేషన్ నుంచి లోకో షెడ్ వరకు ఫుట్ ఓవరు బ్రిడ్జి, లోకో షెడ్ ఉద్యోగులకు ఓవర్టైమ్ భృతి, ఖాళీ పోస్టుల భర్తీ వంటి ప్రాథమిక డిమాండ్లను డీఆర్ఎంకు సభాముఖంగా ప్రతిపాదించినట్లు మీడియా సెల్ ప్రతినిధి లక్ష్మీధర మహంతి తెలిపారు. -
గోవుల రవాణాదారులంటూ వేధింపులు
కొరాపుట్: అమాయక రైతులను గోవుల అక్రమ రవాణాదారులంటూ తీవ్రంగా వేధించారు. నబరంగ్పూర్ జిల్లా చందాహండి సమితి లుధుపోడ గ్రామం సమీపంలో రాయిఘర్ సమితి బరుసుండి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు ఆవులతో వెళ్లడం గ్రామస్తులు గమనించారు. ఈ సమాచారం భజరంగ్దళ్ కార్యకర్తలకు సమాచారం వచ్చింది. వారు వెంటనే రైతుల వద్దకు వచ్చి భౌతిక దాడులు చేశారు. ఈ ఆవులను విక్రయించడానికి తీసుకొని వెళ్తున్నారని ఆరోపించారు. వాటిని వధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి రైతులు స్పందిస్తూ తాము ఆవులు కొనగోలు చేశామని, వాటిని వ్యవసాయ పనుల కోసం తీసుకొని వెళ్తున్నామని వివరించారు. అనంతరం రైతులను మండుటెండలో మోకాళ్ల మీద నడిపించారు. చెవులు పట్టుకొని గుంజీలు తీయించారు. ఇది తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను తమ వాహనంలో పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ వీడియోలు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఈ ఘటన పై దళిత, మైనారిటీ,గిరిజన సంఘాలు మండి పడ్డాయి. దళిత నాయకుడు కెమరాజ్ బాగ్ నేత్రుత్వం లో చందాహండి పోలీస్ స్టేషన్ ని ముట్టడించారు. స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
భారీ ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
రాయగడ: ఝార్సుగుడ ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర ఆదేశానుసారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ను ఛేదించారు. బ్రజరాజ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో భాగంగా ఐపీఎల్–26 మ్యాచ్లను కేంద్రంగా చేసుకుని నిర్వహిస్తున్న సంఘటిత బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు డిజిటల్ ఫ్లాట్ఫారాలు, మొబైల్ యాప్లు, ఆన్లైన్ ఫైనాన్సియల్ చానెళ్ల ద్వారా అక్రమంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ప్రత్యేక బృందాలు రంగంలొకి దిగాయి. బ్రజరాజ్నగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహించగా అత్యంత వ్యవస్థీకృతంగా నడుస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్ బయటపడింది. ఈ దాడుల్లో మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా నిందితులు అద్దె ఇళ్లను కేంద్రాలుగా మార్చుకుని కార్యకలాపాలు నిర్వహిసున్నట్లు గుర్తించారు. ల్యాప్టాప్లు, అనేక ప్రత్యక్ష పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజల బెట్టింగ్ ధోరణులను అంచనా వేస్తు వ్యవహరించినట్లు నిందితులు తెలిపారు. వీరు కమిషన్ ఆధారిత వ్యవస్థల్లో పనిచేస్తూ పెద్ద నెట్వర్క్కు అనుసంధానమై ఉన్నట్లు వెల్లడైంది. దాడుల సమయంలో పోలీసులు భారీ మొత్తంలో ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో రూ.5,09,100 నగదు, 2 ల్యాప్టాప్లు, 41 మొబైల్ ఫోన్లు, ఒక ఇన్నొవా వాహనం, అలాగే ఒక మారుతీ బొలేరొ, సిస్టమ్ కార్డులు, డిజిటల్ బెట్టింగ్ రికార్డులు లభించాయి. ప్రాథమిక విచారణలో ఈ ముఠాకు ఇతర రాష్ట్రాలతో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి వెనుక మరికొంత మంది కీలక నిర్వాహకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లావాదేవీలపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలించగా బెట్టింగ్ సిండికేట్కు సంబంధించిన ఖాతాల్లో సుమారు రూ.3.7 లక్షలను ఫ్రీజ్ చేసినట్లు వివరించారు. అలాగే స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఆర్థిక లావాదేవీలపై సాంకేతిక విశ్లేషణ కొనసాగుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. -
క్రికెట్ టోర్నీ విజేతగా జయపురం రాయల్స్ టీమ్
జయపురం: స్థానిక విక్రమ స్టేడియం మైదానంలో జయపురం ప్రీమియర్ లీగ్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ చాంపియన్గా జయపురం రాయల్స్ జట్టు విజయం సాధించి చాంపియన్ షీల్డ్ గెలుచుకుంది. పట్టణంలో ప్రముఖ వ్యాపారి సుభాష్ రౌత్ టాస్ వేసి ఫైనల్ ఆటను ప్రారంభించారు. టోర్నమెంట్లో ఫైనల్కు చేరిన జయపురం రాయల్ జట్టు, సన్సైన్ సూపర్కింగ్స్ టీమ్లు తలపడ్డాయి. రాయల్ టీమ్ ముందుగా బ్యాటింగ్ ప్రారంభించి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్సైన్ సూపర్కింగ్స్ టీమ్ చక్కగా ఆడినా రాయల్ టీమ్ ఆటగాళ్ల దాటికి నిలువలేక పోయింది. 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 168 పరుగులు మాత్రం చేయగలిగి ఓటమి చవిచూచింది. 24 పరుగుల ఆధిక్యతతో రాయల్స్ టీమ్ చాంపియన్గా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధాన ఉత్సవంలో అతిథులుగా సుభాష్ రౌత్, బాబుల రౌత్ పాల్గొన్నారు. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా రాయల్ టీమ్ ఆటగాడు భాగేష్ శర్మ ఎంపికయ్యారు. ఉత్తమ ఫీల్డర్గా దిలీప్ కుమార్ స్వయ్, ఆదిత్య అభిషేక్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా అర్జున మాల్య, ఉత్తమ కెప్టెన్గా జి.కృష్ణ ఎంపికయ్యారు. చాంపియన్ టీమ్కు ఒక లక్ష 50 వేల నగదు అందించారు. రన్నరప్కు రూ.లక్ష నగదుతోపాటు షీల్డ్ అందజేశారు. -
అర్హులకు అందేనా..?
నరసన్నపేట: వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్ల పాటు ప్రతీ పథకం అర్హులకు అందిస్తూ వచ్చారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పథకాలు మంజూరు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయి. పచ్చ చొక్కాలకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. టీడీపీ కార్యకర్తలకే పథకాలు ఇవ్వా లని అనధికారంగా కూటమి ప్రతినిధులు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. గడిచిన 23 నెలలుగా ఇదే జరుగుతోంది. ఈ దశలో రైతులకు యంత్ర సాయం పేరిట ప్రభుత్వం సబ్సిడీపై యంత్ర పరికరాలు ఇస్తామని ప్రకటించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రైతులు ఆశగా ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 4,052 మంది రైతులు దరఖాస్తులు చేశారు. ఈనెల 24తో గడువు ముగిసింది. అర్హులకు అందేనా.. పంటకోత, నూర్పిడి పరికరాలు 19, మొక్కల సంరక్షణ పరికరాలు 894, పంట కోత అనంతరం ప్రాసెసింగ్, విలువ జోడించు యంత్రాలు 18, పవర్ టిల్లర్స్ 63, అవశేషాల నిర్వహణ/ఎండుగడ్డి, పశుగ్రాసం పరికరాలు 42, స్వీయ చోదక యంత్రాలు 106, విత్తనాలు నాటడం, మొక్కలు నాటడం, తవ్వే యంత్రాలు 14, ట్రాక్టర్ పవర్ టిల్లర్ నడిచే పరికరాలు 129, ట్రాక్టర్లు 43 మొత్తం 1,328 యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లాకు రూ.4.84 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇవన్నీ అర్హులకు అందుతాయా లేదా కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పేవారికే ఇస్తారా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉపాధి నిధులతో గతేడాది గ్రామాల్లో పశువుల శాలలు మంజూరు చేయగా.. అనేక మంది దరఖాస్తులు చేశారు. అయితే అర్హులకు కాకుండా అన్నీ టీడీపీ వారికే ఇచ్చారు. ఇలా ఏ పథకం అమలు చేసినా వారికే ఇస్తున్నారు. దీంతో తాజాగా వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా అర్హులకు అందుతాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. చేసిన దరఖాస్తులు నిశితంగా పరిశీలించిన అనంతరం.. జేసీ పర్యవేక్షణలో లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారట. ఇక్కడే మతలబు ఉంటుంది అని రైతులు అంటున్నారు. లాటరీ పేరున తమకు నచ్చిన వారికి యంత్ర పరికరాలు మంజూరు చేసుకుంటారని అర్హులకు అందవనే అనుమానం బలపడుతోంది. సన్న, చిన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, మిగిలిన విభాగాల వారికి 40 శాతం రాయితీపై యంత్రాలు మంజూరు చేస్తారు. వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగకరం. వీటిని అర్హులకు ఇవ్వాలి. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పేవారికే ఇవ్వకూడదు. అలాగే కౌలు రైతులనూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకు రైతు భరోసా కూడా అందడం లేదు. కౌలు రైతులకు కార్డులు ఇచ్చి, వారి పంటలను నమోదు చేసి సబ్సిడీ యంత్ర పరికరాలు అందజేయాలి. – వెలమల రమణ, కౌలు రైతు సంక్షేమ సంఘం ప్రతినిధి రైతులు ఎంతో ఆశతో సబ్సిడీ యంత్ర పరికరాల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. అయితే ఈ కూటమి పాలనలో అర్హులకు పథకాలు అందడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా దానిని పాటించాలి. అర్హులైన రైతులకు యంత్ర సాయం చేయాలి. – కింతలి చలపతి, రైతు, కానుకర్తివానిపేట వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీపై ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఆన్లైన్లో దరఖాస్తులను పరిశీలించి జేసీ పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక చేస్తాం. వచ్చిన దరఖాస్తుల్లో అర్హులకు యంత్ర పరికరాలు ఇస్తాం. – ఎల్వీ మధు, వ్యవసాయ శాఖ ఏడీ, నరసన్నపేట యంత్ర సాయం కోసం ఆశగా నమోదు చేసుకున్న రైతులు లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామంటున్న అధికారులు అధికార పార్టీ వారికే కట్టబెట్టే వ్యూహమని రైతుల అనుమానం ముగిసిన దరఖాస్తుల గడువు ట్రాక్టర్తో పొలం దుక్కి చేస్తున్న రైతు -
నకిలీ నంబర్ ప్లేట్తో గంజాయి అక్రమ రవాణా
రాయగడ: బోలేరో వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్ అమర్చి అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా సదరు పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ మనోజ్ కుమార్ జెన్న బృందం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఒక బొలేరో వారికి హైవే వద్ద తారస పడింది. అనుమానించిన పోలీసులు దానిని ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. అయితే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వాహనంలో ఉన్న 230 కిలోల గంజాయితోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని వివరాలు సేకరించారు. బొలేరోకు అమర్చిన నంబరు ప్లేట్ నకిలీదని పోలీసులు దర్యాప్తులో తేలింది. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నప్పుడు పోలీసులు సోమవారం తెలిపారు. -
ఘన నివాళి
మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026మహారాజా కృష్ణచంద్ర గజపతికి.. పర్లాకిమిడి: పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ 53వ సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా సోమవారం జరుపుకున్నారు. కుమ్మరి వీధి వద్ద మహారాజా శ్మశాన వాటిక వద్ద ఆయన స్మృతి పీఠానికి ముఖ్యఅతిథి, ఏడీఎం మునీంద్ర హానగ జ్యోతిని వెలిగించి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు గజపతి వంశం చివరి రాణి కళ్యాణి గజపతి హాజరై తన తాతకు స్మృతి అంజలి ఘటించారు. అలాగే పట్టణంలో పాతబస్టాండు వద్ద మహారాజా విగ్రహానికి పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి పూలమాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్తు సి.డి.ఓ. దయామయపాఢి, పురపాలక సంఘం ఈ.ఓ. లక్ష్మణ ముర్ము, జిల్లా సాంస్కృతిక అధికారిని అర్చనా మంగరాజ్, డీపీఆర్ఓ ప్రదిప్త గురుమయి తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణచంద్రగజపతి నారాయణ దేవ్ సంస్మరణ మహారాజా కృష్ణచంద్రగజపతి నారాయణ దేవ్ 52వ వర్ధంతి సందర్భంగా స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో నిరాడంబరంగా సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. పాఠశాల ఆవరణలో వున్న గజపతి విగ్రహానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులు దుర్గాసి శ్రీరాంమూర్తి, జిల్లా ఉన్నత పాఠశాలల క్రీడాధికారి సురేంద్ర కుమార్ పాత్రో, జగన్నాధ పట్నాయిక్, సోమనాథ్ దాస్ తదితరులు నివాళులర్పించారు. -
భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
● 8 జిల్లాల ఎస్పీలు బదిలీ ● ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం ప్రభావంభువనేశ్వర్: శాంతిభద్రతల వ్యవస్థ పటిష్టతతో ప్రజా భద్రత మెరుగుదల దిశలో జారీ చేసిన ఆదేశాల అమలును ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సమీక్షించారు. ఈ సమీక్షకు అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) హేమంత్ శర్మ, రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా, ముఖ్యమంత్రి సలహాదారు ప్రకాష్ మిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రజా భద్రత పట్ల ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు పోలీసు యంత్రాంగం అనుక్షణం అప్రమత్తతతో సమర్థంగా వృత్తి నైపుణ్యంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ఆదేశాలు జారీ అయిన స్వల్ప వ్యవధిలో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) కేడర్లో హోం శాఖ భారీ మార్పులు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా 8 జిల్లాలకు చెందిన పోలీస్ సూపరింటెండెంట్లను బదిలీ చేశారు. ఈ జాబితాలో నవరంగ్పూర్, ఖుర్దా, రాయగడ, బర్గడ్, నయాగఢ్, గంజాం, బౌధ్, కంధమల్ జిల్లాలు ఉన్నాయి. బదిలీ అయిన పోలీసు అధికారుల్లో 14 మంది ఐపీఎస్, నలుగురు సీనియర్ ఓపీఎస్ అధికారులు ఉన్నారు. నవరంగ్పూర్ పోలీస్ సూపరింటెండెంట్ మడ్కర్ సందీప్ సంపత్ను బదిలీ చేసి సీఐడీ–సీబీ డీఐజీగా నియమించారు. ఆయన స్థానంలో కశ్యామ్ పార్థను నవరంగ్పూర్ కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమించారు. ఖుర్దా ఎస్పీ వివేకానంద శర్మను సీఐడీ–సీబీకి ఎస్పీగా బదిలీ చేశారు. గంజాం ఎస్పీ సువేందు కుమార్ పాత్రో ఖుర్దా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా బదిలీ అయ్యారు. కంధమల్ ఎస్పీ బీసీ హరీషా గంజాం జిల్లా కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమితులయ్యారు. రామేంద్ర ప్రసాద్ కంధమల్ జిల్లా కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమితులయ్యారు. రాయగడ ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ను భువనేశ్వర్ ఎస్టీఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) ఎస్పీగా బదిలీ చేశారు. రాజ్ ప్రసాద్ రాయగడ కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమితులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ రంగంలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించి సవాలుతో కూడిన రంగాలలో కొత్త నాయకత్వ దృక్పథాల కార్యాచరణతో రాష్ట్రంలో సమగ్రంగా శాంతిభద్రతల వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ బదిలీలు వ్యూహాత్మకమైన ప్రక్రియ అని అధికారులు అభివర్ణించారు. -
గజపతి జిల్లా ఎస్పీగా ప్రహ్లాద్ సహాయ్ మీనా
పర్లాకిమిడి: గజపతి జిల్లాకు నూతన ఎస్పీగా ప్రహ్లాద్ సహాయ్ మీనాను హోంశాఖ నియమించింది. 2017 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఈయన బర్ఘడ్ జిల్లా ఎస్పీగా పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు. తొలుత మల్కన్గిరి సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా పనిచేసిన తరువాత 2020లో నవరంగ్పూర్ జిల్లా ఎస్పీగా పనిచేసి తన సామర్ధ్యాన్ని నిరూపించుకుని ఉత్తమ ఎస్పీగా పేరుపొదారు. గజపతి ఎస్పీగా ప్రహ్లాద్ సహాయ్ మీనా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇన్చార్జి ఎస్పీగా వ్యవహరించిన ఆదనపు ఎస్పీ సునీల్ కుమార్ మహాంతి భువనేశ్వర్ పోలీసు హెడ్క్వార్టర్స్కు ప్రోమోషన్ అయ్యారు.రాయగడ ఎస్పీగా రాజ్ప్రసాద్ రాయగడ: రాయగడ జిల్లా ఎస్పీగా రాజ్ప్రసాద్ను నియమిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎస్పీగా పని చేసిన స్వాతి ఎస్ కుమార్ భువనేశ్వర్ ఎస్టీఎఫ్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం రాయగడలో నెలకున్న ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న రాజ్ ప్రసాద్ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఆవిశ్రాంతిగా కృషి చేయాల్సి ఉంటుందని సిబ్బందితోపాటు ప్రజలు భావిస్తున్నారు. చెరువు పునరుద్ధరణకు చర్యలు పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ కె.సీతాపురం పంచాయతీలో లింగిపురం వద్ద కృష్ణచంద్ర గజపతి చెరువు దుస్థితిని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం పరిశీలించారు. ఈ చెరువు పునరుద్ధరణ పనులు జరుగకపోవడంతో రైతులు 10 హెక్టార్లలో సాగుభూమి అంతరించి పోయింది. అమొ ఒడిశా, వికసిత్ ఒడిశా పిలుపుతో అప్పటి బీజేడీ ప్రభుత్వం ఈ చెరువు మరమ్మతులు, పూడికతీతకు 2024–25 ఆర్థిక సంవంత్సరంలో రూ.4 లక్షల నిధులు కేటాయించింది. ఈ చెరువు పునరుద్ధరణ జరిగితే సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందటమే కాకుండా, చేపల పెంపకం ద్వారా మత్స్యకారులు లబ్ధిపోందుతారని గ్రామస్తులు తెలిపారు. చెరువు పునరుద్ధరణకు సకాలంలో చర్యలు చేపడతామని ఎమ్మెల్యే రూపేష్ అన్నారు. రుణాలు ఇప్పిస్తానని కోట్లలో స్వాహాజయపురం: రుణాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి కోట్లాది రూపాయలు మోసం చేసిన ఒక యువకుడిని పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారిణి అర్చిత మిత్తల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అరెస్టయిన వ్యక్తి స్థానిక కొత్తవీధికి చెందిన లక్ష్మీకాంత పండ అని వెల్లడించారు. జయపురం పట్టణ పోలీసు స్టేషన్ సభాగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరిస్తూ జయపురం కొత్తవీధిలో ‘పండ కమ్యూని కేషన్’అనే ఒక సంస్థను లక్ష్మీకాంత పండ ప్రారంభించాడని, రుణాలు ఇస్తానని ప్రజలను నమ్మించాడని, ఆ వీధిలో 30 మందికి పైగా వ్యక్తుల నుంచి రూ.కోటి సేకరించాడని వెల్లడించారు. అతడిపై వచ్చిన ఆరోపణల పై పట్టణ పోలీసు అధికారులు దర్యాప్తు చేశారని తెలిపారు. దర్యాప్తు జరిపిన తర్వాత నిందితుడు లక్ష్మీకాంత పాఢీని బాలేశ్వర్ లో అరెస్టు చేసినట్లు ఎస్డీపీఓ వెల్లడించారు. నిందితుడు పండ కేవలం జయపురంలోనే కాదని రాష్ట్రంలో, వివిధ ప్రాంతాల్లో ఇలాంటి సంస్థలు నెలకొల్పి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుని వద్ద దాదాపు రూ.20 లక్షల విలువైన వస్తువులు స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. అందులో రూ.3 లక్షల 92 వేల నగదు, 13 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, ఒక హీరో గ్లామర్ వాహనం, విలువైన ఫర్నీచర్, ఏసీ, కంప్యూటర్ మొదలగు వస్తువులు అతడి వద్ద ఉన్నాయని వివరించారు. అలాగనే 7 సిమ్కార్డులు గల 9 మొబైల్ హేండ్సెట్ స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. ఇంకా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. -
విద్యార్థి మిత్రకు డీజిల్ మరక!
● బడులు తెరిచే నాటికి విద్యార్థులకు కిట్లు ఇవ్వలేమని ప్రకటన ● విద్యా కానుకకు అంతర్జాతీయ పరిణామాలతో ముడిపెట్టిన ప్రభుత్వం శ్రీకాకుళం, టెక్కలి: విద్యార్థి మిత్రకు సర్కారు డీజిల్ మరక అంటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందజేస్తున్న ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్ ఒక్కో విద్యార్థికి సుమారు రూ. 2,279 ఖరీదు చేస్తుంది. ఈ కిట్లో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 3 జతల యూనిఫాం, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్ట్ వంటి ప్రాథమిక విద్యా సామగ్రిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. కుట్టుకూలి దీని కి అదనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పద్ధతిని ప్రవేశపెట్టగా.. ప్రస్తుత ప్రభుత్వం పేరు మార్చి కొనసాగిస్తోంది. ఈ ఏడాది కూడా జూన్ 19వ తేదీన జరగబోవు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ఆర్భాటంగా విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ కూడా షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న ఆయిల్ కొరత కారణంగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి విద్యార్థి మిత్ర పంపిణీ మరింత ఆలస్యం అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. విద్యా శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు ఇది ఒక నెపం మాత్రమేనని వెండార్స్తో కుదుర్చుకున్న ఒప్పందాల్లో తేడా వచ్చిందని, గత ఏడాదితో పోల్చుకుంటే సుమారు రెండు లక్షల 40 వేల మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలకు దూరమయ్యారని, విద్యార్థుల సంఖ్య ప్రోగ్రెసన్ రూపంలో ఇండెంట్ పెట్టడం, ప్రస్తుతం ఇండెంట్ కంటే రెండున్నర లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, మ్యానుఫ్యాక్చర్స్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇండెంట్ ప్రాప్తికి హిట్ల తయారీ పూర్తయిందని, మొత్తం కిట్లు కొని తీరాల్సిందేనని పట్టు పట్టడంతో రూ.60 కోట్లకుపైగా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇదే అసలు కారణమని విద్యాశాఖలో పనిచేస్తున్న వారే లీకులిస్తున్నారు. గత ప్రభుత్వంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మే నెల మూడోవారా నికే మండల స్టాక్ పాయింట్లకు విద్యా కానుక కిట్లు పూర్తిస్థాయిలో చేరేవి. పాఠశాల పునః ప్రారంభం నాటికి పాఠశాల పాయింటుకు కిట్లు చేరవేసి విద్యారంగ పునర్నిర్మాణంపై నిబద్ధతను చాటుకుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థి మిత్రకు డీజిల్ మరకలు అంటిస్తోంది. -
ఆదిత్యుని సన్నిధిలో భక్తుల సందడి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. జ్యేష్ట మాసం రెండో ఆదివారం సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు తలనీలాలను సమర్పించుకుంటే, మరికొందరు 108 సార్లు ప్రదక్షిణలు, సంప్రదాయ పూజలు, వెండి కళ్లు, బంగారు కళ్లు సమర్పించుకున్నారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం చర్యలు చేపట్టారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు, రూ.300 దర్శన టికెట్లతో అంతరాలయ దర్శనాలు కల్పించారు. ఆలయం బయట ఎండ నుంచి రక్షణగా టెంట్లు వేయగా, మంచినీటి కోసం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. అన్నదాన ప్రసాదం కోసం భక్తులు వేచి ఉండక తప్పలేదు.. భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో పలువురికి అన్నదాన ప్రసాదం అందని పరిస్థితి నెలకొంది. -
నచ్చిన క్రీడను కెరీర్గా ఎంచుకోవాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యార్థులు నచ్చిన గేమ్ను ప్యాషన్గా తీసుకోవాలని, అదే క్రీడను కెరీర్గా ఎంచుకోవాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా క్రికెట్ సంఘం(జెడ్సీఎస్) ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఆర్ఐఓ కార్యాలయానికి సమీపంలో అత్యాధునిక హంగులతో రూ.17లక్షల నిధులతో ఏర్పాటుచేసిన ఫ్లడ్లైట్లతో కూడిన క్రికెట్ నెట్స్ను ఆదివారం జెడ్సీఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడాకారులు చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని, రెగ్యులర్గా ప్రాక్టీసు చేయాలని సూచించారు. టోర్నీలు, మ్యాచ్లు ఆడుకునేందుకు అవకాశం కల్పించాలన్న జిల్లా క్రికెట్ సంఘం విజ్ఞప్తి మేరకు ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్లో వసతులుతో తీర్చిదిద్దిన మైదానాన్ని ఉచితంగా వాడుకోవచ్చని హామీ ఇచ్చారు. ఉజ్వలమైన భవిష్యత్తును అందిపుచ్చుకోవాలని సూచించారు. రవికుమార్ మాట్లాడుతు ప్రతిభ కలిగిన క్రీడాకారులకు న్యాయం చేస్తు వారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు. జిల్లాలో మూడేళ్లలో జెడ్సీఎస్ సాధించిన ప్రగతి, క్రీడాకారుల విజయాలను మెంటార్ ఇలియాస్ మహ్మద్ వెల్లడించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.పోలినాయుడు, జిల్లా కార్యదర్శి హసన్రాజా షేక్, ఉపాధ్యక్షుడు టి.బాలమురళీకృష్ణ, కోశాధికారి మదినా శైలానీ, కౌన్సిలర్ డాక్టర్ ఎస్.రవికుమార్, సంయుక్త కార్యదర్శి ఎన్జీ బెనర్జి, సుంకరి కృష్ణకుమార్, కోచ్లు కె.సుదర్శన్, ఎ.ఆనంద్, మహిళా కోచ్లు హారికాప్రసాద్, రమణమ్మ, రవికిరణ్, క్రీడాకారుల తల్లిదండ్రులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
మందస: దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని విభిన్న ప్రతిభావంతుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ అధ్యక్షుడు ఆవుల వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మోహన్రావు డిమాండ్ చేశారు. ఆదివారం మందసలో జిల్లా కమిటీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ రీ వెరిఫికేషన్ జరిగినా చాలామంది దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు రావడం లేదన్నారు. వివాహంతో సంబంధం లేకుండా అర్హత కలిగిన దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మందస మండల నూతన కమిటీ అధ్యక్షుడు ముంజేటి దేవదాస్, అందాల ఆవేష్, ఉపాధ్యక్షులు జట్టు హేమావతి, ప్రధాన కార్యదర్శి ఫిస్టు ఝాన్సీ, సభ్యులు తెప్పల పాపారావు, మామిడి జానకి, బి.జె.పి కార్యవర్గ సభ్యులు పొందర దుదిష్టి, సింహాచల మహంతి, అడ్డి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒడిశాకు ఇసుక అక్రమ రవాణా పాతపట్నం: ఒడిశాకు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కులు పట్టపగలే ఆంధ్ర నుంచి ఒడిశాకు ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక తరలించుకుపోతున్నారు. పాతపట్నం, బైదలాపురం మీదుగా పర్లాకిమిడి(ఒడిశా)లోకి ఈ రవాణా జరుగుతోంది. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలోగ్గడంతో పాటు కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతూ అక్రమ రవాణాను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కువ శాతం టాక్టర్లు ద్వారా ప్రతి రోజు తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 8గంటల అక్రమంగా తరలిస్తున్నారు. హిరమండలం మండలం భగీరథపురం, కొత్తూరు మండలం నివగాం, పొట్నూరు వద్ద వంశధార నదిలో ఇసుకను ట్రాక్టర్లు ద్వారా రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. సముద్రస్నానానికి వెళ్లి వ్యక్తి మృతి సంతబొమ్మాళి: భావనపాడు సముద్రతీరంలో స్నానానికి దిగి టెక్కలికి చెందిన బినాయక్రావు పట్నాయక్ పక్కి(నరేష్)(36) ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. విశాఖపట్నం పెద్దగంట్యాడకు చెందిన నరేష్ జీవనోపాధి కోసం టెక్కలిలో కారు మెకానిక్గా పనిచేస్తూ నివాసం ఉంటున్నాడు. ఆదివారం తోటి స్నేహితులు బెహరా శరత్, కోనారి మణి, నవీన్తో కలిసి భావనపాడు తీరానికి ద్విచక్ర వాహనంపై వచ్చారు. సముద్రంలో స్నానానికి దిగి లోపలకి వెళ్లగా అలల తాకిడికి నరేష్ మునిగిపోయాడు. మైరెన్ పోలీసులు గాలించగా రాత్రి 8 గంటల ప్రాంతంలో మృతదేహం తీరానికి చేరింది. నరేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నౌపడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాటరీ టికెట్ల వికేత్రలపై కేసు నమోదు శ్రీకాకుళం క్రైమ్: జిల్లాకేంద్రంలోని కృష్ణాపార్కు వద్ద లాటరీ టికెట్లు విక్రయిస్తూ నగరానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆదివారం పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 80 లాటరీ టికెట్లు, రూ.56 వేలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలో అనధికారికంగా దాదాపు ఏడాదికాలంగా ఒడ్డు వెంకటరమణ, అనుపోజు కామేశ్వరరావు, టంకాల కామేశ్వరరావు, దేవరశెట్టి మణికంఠ, పొట్నూరు తారకరామారావు, వానపల్లి వెంకటమూర్తి లాటరీ టికెట్లు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్ఐ హేమంత్కళ్యాణ్కు వచ్చిన సమాచారం మేరకు కృష్ణాపార్కు వద్ద ఆదివారం రాత్రి సిబ్బందితో మాటువేయగా టికెట్లు అమ్ముతూ పట్టుబడ్డారు. వానపల్లి వెంకటమూర్తి తప్ప మిగతా ఐదుగురిపై నాలుగైదేళ్ల క్రితం సైతం ఈ కేసులున్నాయి. టీఎస్ ఏజెన్సీ ద్వారా ఆన్లైన్లో లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తూ రోజుకు 40 నుంచి 50 వరకు టికెట్లు అమ్ముతుంటారని సీఐ చెప్పారు. అసలు సూత్రధారులైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
28న జయపురం బంద్
జయపురం: జయపురం సబ్ డివిజన్లో ఏకై క పరిశ్రమ సేవా పేపర్మిల్లును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్తో ఈ నెల 28 వ తేదీన జయపురం బందు నిర్వహించాలని అఖిల పక్ష సమావేశం నిర్ణయించింది. నేడు మాజీ మంత్రి, బీజేడీ నేత రబినారాయణ నంతో అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం లో పట్టణంలో పలు కార్మిక, కర్షక సంఘాల, వ్యాపార సంఘాల ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని సేవాపేపరుమిల్లు పునరుద్ధరణ ఆందోళనలు చేపట్టాలని అభిప్రాయాలు వెల్లడించారు. ముందుగా ఈ నెల 28 వ తేదీన 12 గంటల జయపురం బంద్ నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా పలు సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ సేవా పేపరుమిల్లు జయపురం ప్రాంతంలో ప్రజలకు ఉపాధి కల్పించే ఏకై క పరిశ్రమ అని, అంతే కాకుండా మిల్లు పైనే జయపురం ఆర్థిక ప్రగతి ఆధార పడి ఉందన్నారు. మిల్లు మూత పడిన తర్వాత మిల్లులో పనిచేసే ఉద్యోగులు, శ్రామికులతో పాటు మిల్లుపై ఆధార పడి జీవిస్తున్న దాదాపు 10 వేల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడి ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేపరు మిల్లు పునరుద్ధరణ విషయంలో అటు యాజమాన్యం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని నిందించారు. ప్రభుత్వం తక్షణం తగు చర్యలు తీసుకొని మిల్లు ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మిల్లు పునరుద్ధరించేంత వరకు ఆందోళనలు చేస్తామన్నారు. ఈ నెల 28 వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలు సంపూర్ణంగా బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. వ్యాపార వర్గాలు సహకరించాలని కోరారు. -
రైలుపై సెల్పీ.. కరెంట్ షాక్
భువనేశ్వర్: ప్రమాదకర పరిసరాల్లో మొబైలు మోజులు ప్రాణాంతకమని తాజా సంఘటన రుజువు చేసింది. ఆదివారం రైలుపైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా విద్యుదాఘాతానికి గురైన యువకుడు ఆందోళనకర పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు రాజస్థాన్ ప్రాంతీయుడు. నగరంలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి రాజ్ కుమార్గా గుర్తించారు. మంచేశ్వర్ రైల్వే స్టేషన్లో సెల్ఫీలు తీసుకుని, రీల్స్ చిత్రీకరించడానికి అతడు రైలు కోచ్ పైకి ఎక్కడంతో అత్యంత శక్తివంతమైన ఓవర్హెడ్ విద్యుత్ రైలు వ్యవస్థ ధాటికి గురై విద్యుదాఘాతంతో రైల్వే ప్లాట్ఫారమ్పైకి తుళ్లిపడ్డాడు. యువకుడు తీవ్రంగా కాలి గాయపడినట్లు గుర్తించారు. ఈ పరిస్థితిలో తక్షణమే అత్యవసర చికిత్స కోసం స్థానికి రైల్వే ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో సత్వర ఉన్నత చికిత్స కోసం ఎయిమ్స్కు తరలించారు. సెల్ఫీలు, రీల్స్ కోసం రైలు కోచ్లు ఎక్కడం గానీ, నిషేధిత రైల్వే జోన్లలోకి ప్రవేశించడం గానీ చేయవద్దని రైల్వే అధికారులు ప్రజలను పదేపదే హెచ్చరించినా పెడ చెవిన పెట్టడంతో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు అనివార్యం అవుతున్నాయని రైల్వే వర్గాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. రైలు పైభాగంలో విద్యుత్ తీగలు అత్యంత అధిక వోల్టేజ్ను కలిగి ఉంటాయి. వాటిని నేరుగా తాకకపోయినా ప్రాణాంతకం కాగలవని అధికారులు తెలిపారు. -
యుద్ధానికి ముడిపెట్టడం సరికాదు
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విషయంలో ప్రభు త్వం శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు అందజేస్తున్న విద్యా కాను క కిట్ల విషయంలో అంతర్జాతీ య పరిస్థితులకు ముడిపెట్టడం సరికాదు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచేనాటికి కచ్చితంగా పూర్తి స్థాయిలో విద్యా కానుక కిట్లు అందజేయాలి. – టి.చందనరావు, స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి. చంద్రబాబు ఎప్పుడూ నిర్లక్ష్యమే ప్రభుత్వ పాఠశాలలు, అందులో చదువుతున్న పేద, సామాన్య వర్గాలకు చెందిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ నిర్లక్ష్యమే చూపుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయి. అప్పట్లో విద్యా కానుక కిట్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే పూర్తి స్థాయిలో కిట్లు అందజేయలేమని చెబుతున్నారు. – ఎం.గణపతిరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు, టెక్కలి. ప్రభుత్వ పాఠశాలలంటే చులకన ప్రభుత్వ పాఠశాలలంటే చంద్రబాబుకు చులకన. విద్యా కానుక కిట్లు పూర్తిగా ఇవ్వలేమని చెబు తూ, అంతర్జాతీయ పరిణామాలను ముడిపెడుతున్నారు. మంత్రులు, అధికార పార్టీ నాయకులకు మాత్రం ఇలాంటి ఆంక్షలు వర్తించవా. తక్షణమే పూర్తి స్థాయిలో విద్యా కానుక కిట్లు అందజేయాలి. – పి.వైకుంఠరావు, వైఎస్సార్ టీఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు, టెక్కలి -
సామాన్యులపై ‘పెట్రో’ పిడుగు
● మళ్లీ మళ్లీ పెరుగుతున్న పెట్రో ధరలు ● అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం హిరమండలం: పెట్రోల్, డీజిల్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజానీకం, రైతులు ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతుంటే.. తాజాగా కేంద్ర ప్రభుత్వం వరుసుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచుతూ అదనపు భారం మోపుతోంది. ఈనెల 15న లీటర్ పెట్రోల్పై రూ.3.29 పైసలు, డీజిల్పై రూ.3.14 పైసలు పెంచేసింది. మళ్లీ ఈ నెల19న లీటరుకు 95 పైసలు చొప్పున పెంచేసింది. అక్కడితో ఆగకుండా మూడోసారి ఈ నెల 23న లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజల్పై 91పైసాలు పెంచేసి సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచింది. సరుకుల ధరలు ౖపైపెకి.. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధర అన్ని వర్గాలపైనా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా రవాణా ఖర్చులు పెరుగుతాయి. తద్వారా నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉంది. బియ్యం, పాలు, కూరగాయలు, నూనె తదితర ధరలు పెరిగితే సామాన్యులు మరింత ఇబ్బంది పడతారు. కాడెద్దులు కరువై రైతులు యంత్రాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ప్రతి యంత్రానికి పెట్రోల్, డీజిల్ ఉపయోగించాల్సిందే. దీంతో పంటల సాగులో రైతులపై ఆర్థిక భారం పడుతుంది. ప్యాసింజర్ ఆటో, జీపులు, కార్లు నడుపుతూ జీవనం సాగించే మధ్య తరగతి కుటుంబాలపైనా ప్రభావం చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని పలువురు కోరుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ మళ్లీ పెంచడం సరికాదు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడంతో అన్ని వర్గాల ప్రజలపైనా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు జీవనం కష్టతరమవుతోంది. పెంచిన ధరలు తగ్గించాలి. – పి.పద్మావతి, యంబరాం, ఎల్ఎన్పేట మండలం -
ఆడపిల్ల పుట్టిందని వేధింపులు
భువనేశ్వర్: సమాజంలో కొనసాగుతున్న లింగ వివక్షను ఎత్తిచూపుతున్న తాజాగా దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. కటక్ జిల్లా పసులుండ గ్రామంలో కవల ఆడపిల్లలను ప్రసవించిన బా లింత పట్ల మెట్టినింటి వేధింపులు కలకలం రేపా యి. మగ బిడ్డని ఆశించిన స్థానంలో కవల ఆడపిల్లల్ని ప్రసవించడంతో కొడుకు కోడలుపై మెట్టినింటి సభ్యులు హింసాత్మక దాడికి పాల్పడుతున్నట్లు ఆరోపణ. ఈ సంఘటనకు సంబంధించి మహంగా పోలీస్ ఠాణాలో కేసు నమోదైంది. బాధితులను చంద్రశేఖర్ జెనా, అతని భార్య పార్వతి జెనాగా గుర్తించారు. కుటుంబ సభ్యులు మగబిడ్డ పుడతాడని ఆశించారు. వారికి కవల కుమార్తెలు పుట్టిన తర్వాత మహిళ అత్తింటి కుటుంబ సభ్యులు ఈ దంపతులపై శారీరకంగా దాడి చేశారని ఆరోపించారు. సుమారు నెల క్రితం పార్వతి కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఈ ప్రసవం తర్వాత అత్తమామలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొడుకు పుట్టలేదని ఆ దంపతులను పదేపదే నిందిస్తూ కించపరిచారు. క్రమంగా ఈ చర్య హింసాత్మకంగా మారడంతో విషయం గడప దాటింది. ఆడ పిల్లల ప్రసవం విషయంపై కుటుంబ సభ్యులు తమను దారుణంగా కొట్టారని ఆ జంట ఆరోపించడంతో పరిస్థితి హింసకు దారి తీసినట్లు సమాచారం. ఈ విషయమై మహంగా పోలీస్ ఠాణాలో అధికారిక ఫిర్యాదు నమోదైంది. దాడి తర్వాత చంద్రశేఖర్ మరియు పార్వతి ప్రస్తుతం తమ నవజాత కవల కుమార్తెలతో కలిసి ఆ మహిళ పుట్టింటిలో ఉంటున్నారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించి, ఆరోపణలను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన సమాజంలోని కొన్ని వర్గాలలో పాతుకుపోయిన సామాజిక వివక్ష, మగపిల్లల పట్ల కొనసాగుతున్న ప్రాధాన్యతపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది. -
థైరాయిడ్!
వామ్మో..● జిల్లాలో ఏటా పెరుగుతున్న బాధితుల సంఖ్య ● కీళ్లనొప్పులు, డిప్రెషన్, ఊబకాయంతో సతమతం ● నేడు ప్రపంచ థైరాయిడ్ డే ఇచ్ఛాపురం రూరల్: కొద్దిగా పని చేసినా నిస్సత్తువ ఆవహించడం, చిన్న విషయాలకే కోపం రావడం, ముఖం ఉబ్బుగా కనిపించడం, చర్మం పొడిబారడటం, కీళ్ల నొప్పులు వేధించడం, ఊబకాయం రావడం, అకస్మాత్తుగా సన్నబడటం వంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే ఓసారి పరీక్షించుకోండంటూ వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ప్రతి పది మందిలో ఒకరికి థైరాయిడ్ వ్యాధి వేధిస్తోంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా మారి శరీరాన్ని ఛిద్రం చేస్తుంది. ఈ గ్రంథి పనిచేయకపోతే దేహంలోని ఇతర అవయవాల పనితీరు మందగిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై అవగాహన లేక చికిత్సలో జాప్యంతో ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. నేడు వరల్డ్ థైరాయిడ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. ఈ లక్షణాలు కనిపిస్తే.. థైరాయిడ్లో హైపోథైరాయిడిజం (థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం), హైపర్ థైరాయిడిజం (హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం) ప్రధానమైనవి. థైరాయిడ్ నోడ్యూల్స్, గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి వాపు), థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఉన్నాయి. అలసట, బరువు పెరడగం, చలి అనుభూతి, జుట్టు రాలడం, నీరసం, డిప్రెషన్, మలబద్ధకం వంటివి హైపోథైరాయిడిజం లక్షణాలు, బరువు తగ్గడం, ఆందోళన, వేగంగా గుండె చప్పుడు, చెమటలు, వణుకు, నిద్రలేమి హైపర్ థైరాయిడిజం లక్షణాలు. గాయిటర్ లేదా నోడ్యూల్స్ ఉన్నవారిలో మెడ వాపు, గొంతులో అసౌకర్యం వంటివి కనిపిస్తాయి. ఇలా కణితి ఉన్న ప్రతి ఒక్కరికీ ఆపరేషన్ అవసరం లేదు. క్యాన్సర్గా మారితేనే ఆపరేషన్ చేయించుకోవాలి. గడ్డలు ఏర్పడ్డ వారిలో 5 శాతం మందిలో మాత్రమే క్యాన్సర్ కణితులు ఉంటాయి. వీరికి మాత్రమే ఆపరేషన్ చేసి కణితి తొలగించాల్సి ఉంటుంది. కారణాలు.. థైరాయిడ్ సమస్యకు కారణాలు అనేకం. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యం అవుతాయి. తద్వారా థైరాయిడ్ వ్యాధి వస్తుంది. హైపోథైరాయిడిజం సాధారణంగా ఆటోఇమ్యూన్ రుగ్మతలు, అయోడిన్ లోపం, థైరాయిడ్ శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీతో గానీ, కొన్ని రకాల మందులతో వస్తుంది. హైపర్ థైరాయిడిజం గ్రేవ్స్ డిసీజ్, థైరాయిడ్ గ్రంథి వాపు వస్తుంది. జన్యు కారణాలు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, గర్భం/ ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పులు కూడా థైరాయిడ్ సమస్యలకు కారణం. అయోడిన్ లోపం గానీ, అధికంగా ఉన్నా దీని బారినపడతారు. నివారణ ఇలా.. థైరాయిడ్ సమస్య వస్తే సమతుల ఆహారం, అయోడిన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు (సీఫుడ్, పాల ఉత్పత్తులు, అయోడైజ్డ్ ఉప్పు) తీసుకోవాలి. వైద్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా సహాయపడతాయి. చికిత్సలో హైపోథైరాయిడిజం కోసం లెవోథైరాక్సిన్ వంటి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, హైపర్ థైరాయిడిజం కోసం యాంటీథైరాయిడ్ మందులు, రేడియో అయోడిన్ థెరపీ, శస్త్రచికిత్స ఉన్నాయి. థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారి శస్త్ర చికిత్స, కిమోథెరపీ గానీ రేడియేషన్ గానీ అవసరం కావచ్చు మహిళల్లోనే అధికం.. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పురుషుల కంటే 58 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భం, ప్రసవం తర్వాత, రుతుక్రమం ఆగిన తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో హైపోథైరాయిడిజం, హైపర్థైరాయిడిజం మాతా,శిశు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. జిల్లాలో థైరాయిడ్ బాధితులు అధికంగా ఉండటంతో ప్రతీ పీహెచ్సీలో థైరాయిడ్ పరీక్షలు అందుబాటులో ఉంచాలని రోగులు కోరుతున్నారు. థైరాయిడ్ సమస్య ఉన్న గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలి. పుట్టబోయే బిడ్డకు కూడా పరీక్ష చేయించాలి. థైరాయిడ్ ఉందంటే మందులు వాడాలి. లేకపోతే బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలు అధికం. – డాక్టర్ ఎ.రమ్యారెడ్డి, వైద్యాధికారి, ఈదుపురం సమాజంలో 11 శాతం మందిలో హైపోథైరాయిడ్, రెండు శాతం మందిలో హైపర్ థైరాయిడ్ సమస్య ఉంది. ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే ఇబ్బందులు రాకుండా చేయవచ్చు. జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడాలి. – డాక్టర్ దల్లి సురేష్రెడ్డి, ఎండీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, ఇచ్ఛాపురం -
బైక్ ఢీకొని మహిళ దుర్మరణం
రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం రూరల్ మండలం పుక్కల్లపేట పంచాయతీ మోపసుబందరు గ్రామానికి చెందిన పుక్కల్ల ముత్తమ్మ(43) శుభకార్యంలో వంట పని చేసేందుకు బుడుమూరు వచ్చింది. ఆదివారం సాయంత్రం4.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా రణస్థలం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ద్విచక్రవాహనం అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో ముత్తమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. బైక్ డ్రైవింగ్ చేస్తున్న లావేరు మండలం తామాడ పంచాయతీ సూర్యనారాయణపురం గ్రామానికి చెందిన నడుమూరి వాసు, ఆమె భార్యకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహ నంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం రిమ్స్కు తీసుకెళ్లారు. లావేరు ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా ఆలయ వార్షికోత్సవం
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి ఖెందుగుడలో గ్రామ దేవత మా బవుడి ఆలయ వార్షికోత్సవాన్ని శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాత్రలో కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయంగా ఈ పూజలు చేపట్టారు. గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారి వార్షికోత్సవాలను తిలకించేందుకు అనేక గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు, ప్రజలు తరలివచ్చారు. భక్తులను అమ్మవారి పూజారి ఆశీర్వదించారు. -
ఫుట్బాల్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ముని శ్రీనివాసరావు(శ్రీకాకుళం), ప్రధాన కార్యదర్శిగా వేదుల సంతోష్కుమార్ (ఇచ్ఛాపురం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ విస్తృతస్థాయి సమావేశంతోపాటు నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఫుట్బాల్ అసోసియేషన్, శాప్ ప్రతినిధులు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధుల సమక్షంలో అడ్వకేట్ సూరు గోవిందరాజులు (గోపి) ఎన్నికల అధికారిగా వ్యవహరించి.. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేశారు. కార్యక్రమంలో ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు జి.పవన్కుమార్, శేషగిరిరావు, నాని, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, జిల్లా నలుమూలల నుంచి ఫుట్బాల్ క్లబ్ల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లాలో ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని, పాఠశాలల్లో ఫుట్బాల్ క్రీడను పీడీ, పీఈటీల సహాయంతో మరింత విస్తృతం చేద్దామని నూతన కార్యవర్గం ప్రతినిధులు స్పష్టం చేశారు. నూతన కార్యవర్గమిదే.. జిల్లా అధ్యక్షుడిగా ముని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా డి.దివాకర్రావు (సుప్రీమ్), వి.సుగుణ్కుమార్, వై.ఎన్.పి.లత, ప్రధాన కార్యదర్శిగా వేదుల సంతోష్కుమార్, కోశాధికారిగా కె.నవీన్కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా దుంగ శ్రీధర్, కె.కోటేశ్వరరావు, ఎ.వెంకటరావు, సీహెచ్ వీరభద్రరావు, ఎం.వి.ఎస్.సాయిసూర్య, ఎ.రేవతిలను ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో కె.నివాస్కుమార్, జె.నాగరత్నం, ఎ.జ్యోత్స్న, కె.భాస్కర్, మోహన్రావులు, జాయింట్ సెక్రటరీగా జి.రాందేవ్ గాంధీ, మాడుగుల రామారావు, తంగి మురళీమోహనరావు, నాయుడులు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తంగి రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, -
ఆకలి కడుపుల సాహిత్యమే ముఖ్యం
● సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో జనసాహితి 13వ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జన సాహితి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి.అరుణ ఆహ్వానం మేరకు అఖిల భారత ప్రజా సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రవిబాబు జనసాహితీ పతాకాన్ని ఆవిష్కరించారు. జనసాహి తి అధ్యక్షులు దివి కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ యు ద్ధం సర్వకాలీనం–శాంతి మధ్య మధ్యలో విరామం అన్న చర్చిల్ మాటలు నేడు వాస్తవంగా తయా రయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కడుపు నిండిన వారి కోసం వచ్చే ప్రేమ సాహిత్యం వేదాంత సాహిత్యం కంటే ఆకలి కడుపుల కోసం రాసిన సాహిత్యం విలువైనదని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘అల్లూరి సీతారామరాజు’ బురక్రథ, ‘యుద్ధం ఓ వినాశనం’ నాటిక, యుద్ధానికి వ్యతిరేకంగా కలకత్తా ముందడుగు సంస్థ వారి ’స్లైడ్షో’, గోర్కి నవల ’అమ్మ’ ఆధారంగా కలకత్తా సౌవిక్ సాంస్కృతిక చక్ర వారి నాటక ప్రదర్శనలు జరిగాయి. సభలో డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి రచించిన ‘సాహిత్య సమాలోచన’ పుస్తకాన్ని జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జన సాహితి ప్రచురించిన ‘మా బాల్యం’ పుస్తకాన్ని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.వేణుగోపాల్, ‘ఐఎంఎఫ్ అప్పు పతన సంస్కృతి ముప్పు’ పుస్తకాన్ని జనసాహితి రాష్ట్ర కోశాధికారి డాక్టర్ శాంతి కుమార్, ‘తరగతి గది నా ఆచరణ’ పుస్తకాన్ని అంకురం సినిమా దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, ‘సరిహద్దులు ఎరుగని స్వప్నాలు’ అనే పుస్తకాన్ని జన సాహితి రాష్ట్ర నాయకులు డాక్టర్ జీవీ కృష్ణయ్య ఆవిష్కరించారు. -
ప్రతిభావంతులకు సన్మానం
రాయగడ: సెంచూరియన్ విశ్వవిద్యాలయం, సి క్యూ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ సంయుక్తంగా సెంచూరియన్ –కౌశల్ సాథీ పేరుతో స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో ఆదివారం ప్రతభావంతులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ఓఏవీ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే ఉత్తమ విద్యావేత్తలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో కేవలం చదువుతో సరిపొదని నైపుణ్య ఆధారిత విద్య యువతను ఆత్మనిర్భరంగా మార్చగలదని అన్నారు. యువత తమ భవిష్యత్ను నైపుణ్యాలు, వినూత్న ఆలోచనలతొ నిర్మించుకోవాలని హితవు పలికారు. ముఖ్యవక్తగా పాల్గొన్న ఏడీఎం నవీన్ చంద్ర నాయక్ మాట్లాడుతూ.. విద్యతో పాటు ఇతర అంశాలపై కూడా వి ద్యార్థులు ఆసక్తి కనబరచాలని అన్నారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ సంబిత్ నాయక్ మాట్లాడుతూ.. నైపుణ్య విద్య ద్వారా విద్యార్థులు ఉద్యోగ, ఉపాఽధి అవకాశాలకు చేరువయ్యే అవకాశం ఉందని అన్నారు. విద్యావేత్త డాక్టర్ కెకే మహాంతి, సెంచూరియన్ వర్సిటీ ప్రాంతీయ శాఖ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాఢిలు మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని ఆసీమ పండటో పాటు గాయకుడు రాజేష్కుమార్ పాఘి కలిసి రూపొందించిన జయ జగన్నాఽథ్ హారే ఆధ్యాత్మిక ఆడియో ఆల్బమ్ను ఆవిష్కరించారు. -
రోగులకు మెరుగైన సేవలందించాలి
● జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతిజయపురం: అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు మైరుగైన చికిత్స అందించాలని జయపురం ఎమ్లల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. జయపురం జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన రోగులకు అందుతున్న సేవలు సేవ, వివిధ విభాగాల పనితీరుపై సమీక్షించారు. ఆస్పత్రిలో నెలకున్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, సముచిత వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, అమర్యాదగా ప్రవర్తించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన ఆస్పత్రిలో కలియతిరుగుతూ రోగులను పరామర్శించి వారి బాగోగులు తెలుసుకున్నారు. సమావేశంలో ప్రధాన వైద్యులు లక్షయ కుమార్ రథ్, రమాకాంత, భిభుతి భూషణ జెన, గైతమ త్రిపాఠీ, దుర్గా ప్రసాద్ పాత్రో, ఆశిష్ కుమార్ పాణిగ్రహి, లక్ష్మీపాత్రో, ఆస్పత్రి మేనేజర్ రనూపిసీ నాయిక్, సపణ పాణిగ్రహి, తదాగత దాస్, బి.జయబాబు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.


