Odisha Latest News
-
ఎరువుల అక్రమ నిల్వలపై కఠిన చర్యలు: సీఎం
భువనేశ్వర్: రానున్న ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల లభ్యత, పంపిణీని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శుక్రవారం లోక్ సేవా భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అట్టడుగు అంచె వరకు ఎరువుల పంపిణీని నిర్ధారించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జిల్లా కలెక్టర్లతో చర్చలు జరిపారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సరఫరాకు అంతరాయం కలగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు రైతులకు సరసమైన ధరలకు, సకాలంలో అవసరాలకు అనుగుణంగా ఎరువుల సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సేంద్రియ ఎరువు, నానో యూరియా వంటి ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.77 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 60,000 మెట్రిక్ టన్నులకు పైగా డీఏపీ నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పేర్కొన్నారు. రాయితీపై ఇచ్చే యూరియాను పారిశ్రామిక అవసరాలకు దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అలాంటి పద్ధతులను అరికట్టడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేయాలని మాఝీ ఆదేశించారు. స్థానిక స్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయడానికి, అన్ని గ్రామ పంచాయతీలలో కొద్ది రోజుల్లోనే విజిలెన్స్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎరువుల అక్రమ అమ్మకాలు, నిల్వలపై ఆకస్మిక తనిఖీలు, ఎఫ్ఐఆర్ నమోదు, నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సుల రద్దుతో సహా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఎరువుల దారి మళ్లింపును నివారించడానికి పోలీసులు మరియు వ్యవసాయ అధికారుల సంయుక్త పర్యవేక్షణతో అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వద్ద నిఘాను పెంచాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ కమిషనర్ కమ్ కార్యదర్శి సచిన్ రామచంద్ర జాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరానికి ఒడిశాకు కేంద్ర ప్రభుత్వం 1.14 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించిందని తెలిపారు. ఏప్రిల్ నెలకు 79,630 మెట్రిక్ టన్నుల అంచనా అవసరానికి గాను ఏప్రిల్ 15 నాటికి రాష్ట్రం వద్ద 361,490 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయి. 1,029 హోల్సేల్ డీలర్లు, 12,093 రిటైల్ డీలర్లు ద్వారా పంపిణీ కొనసాగుతుందన్నారు. డీలర్ పాయింట్ల వద్ద తనిఖీ నిర్వహణలో అవకతవకల కారణంగా 6 మంది లైసెన్సులను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రికి తెలియజేశారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్, సహకార శాఖ మంత్రి ప్రదీప్ బాల్ సామంత్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనూ గర్గ్, వ్యవసాయ, సహకార శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
18 నుంచి శ్రీరామ మందిర ప్రతిష్టోత్సవాలు
రాయగడ: సదరు సమితి పరిధిలోని జేకేపూర్ బీసీ రోడ్డు దుర్గా మండపం వెనుక కొత్తగా నిర్మించిన శ్రీరామ మందిర ప్రతిష్టోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. దీని కోసం కమిటీ సభ్యులు సన్నహాలు ప్రారంభించారు. తొలి రోజు ఉదయం ఎనిమిది గంటలకు కలశ యాత్ర నిర్వహించనున్నారు. సమీపంలోని నాగావళి నది నుంచి సాస్త్రోక్తంగా శుద్ధ జలాలను తీసుకువచ్చి మందిరం వద్ద ఉంచి శుభ్రపరుస్తారు. 19న ఉదయం ఎనిమిది గంటల నుంచి రుగ్వేద, యజుర్వేద, సామవేద, అదర్వేద పఠనాలు కొనసాగుతాయి. 20న శిఖర పూజలు, 21న విశేష పూజలతో పాటు 23వ తేదీన ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలియజేశారు. -
లోక్ సేవా భవన్ నుంచి ఏసీ విడిభాగాలు దొంగిలింత
భువనేశ్వర్ : రాష్ట్ర రాజధానిలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతం లోక్ సేవా భవన్ సముదాయంలో దొంగతనం చోటు చేసుకుంది. ఈ సంఘటన భద్రతా పటిష్టత పట్ల పలు ప్రశ్నలు ప్రేరేపిస్తుంది. ఈ భవన సముదాయం ఆర్థిక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషనర్ (ఏసీ) విడి బాగాలు దొంగిలించిన సంఘటన వెలుగు చూసింది. ఎయిర్ కండిషనర్ కంప్రెషర్లు, రాగి పైపులను దొంగిలించిన ఆరోపణలపై రాజధాని పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. నిందితులు టొమాండోకు చెందిన మనోజ్ కుమార్ దాస్ (25), జాజ్పూర్లోని బింఝర్పూర్కు చెందిన చందన్ పొలై (27)గా గుర్తించారు. వారి వద్ద నుంచి పలు ఏసీ కంప్రెసర్ విడిభాగాలు, సంబంధిత సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం కార్యాలయం పైకప్పు, గ్రౌండ్ ఫ్లోర్, సబ్ సెక్రటరీ ఛాంబర్, లైబ్రరీలో అమర్చిన 7 ఏసీ యూనిట్ల కంప్రెసర్లు, రాగి పైపులు చోరీకి గురయ్యాయి. నిర్వహణ, మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో వీటిని దొంగిలించారు. ఈ సామగ్రి నవంబర్ 2025 నుంచి మార్చి 2026 మధ్య దశలవారీగా ఈ దొంగతనాలు జరిగాయని ప్రాథమిక విచారణ సమాచారం. దీని ఆధారంగా సచివాలయంలోని భద్రతా సిబ్బంది ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో వారు దొంగతనాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా రాజధాని పోలీసులు కేసు నమోదు చేసి, అనంతరం ఇరువురు నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. -
ప్రభుత్వ భూములను కాపాడాలి
జయపురం: కోట్పాడ్ సమితి బతాసన గ్రామ పంచాయతీలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవ్వకుండా కాపాడాలని గ్రామ పెద్దలు, కమ్యూనిస్టు పార్టీ నేతలు కోరారు. ఈ మేరకు జయపురం సబ్ కల్క్టర్ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని నిరుపేదలు, ఆదివాసీలకు పట్టాలు పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో జుధిస్టర్ రైళో, కురుమనాథ్ భొత్ర, పూర్ణచంద్ర సురు, త్రిపతి భొత్ర, గోవర్ధన భొత్ర, ముఖుంద భొత్ర తదితరులు పాల్గొన్నారు. ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధం జయపురం: పట్టణంలోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణకు రోడ్ల విస్తరణ చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే మహాత్మాగాంధీ రోడ్డులో ఆక్రమణలను తొలగించి దాదాపు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశారు. కాగా ఇప్పుడు ఎన్కేటీ రోడ్డులో ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరణకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు జయపురం మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది ఆక్రమణల తొలగింపునకు కొలతలు ప్రారంభించారు. మున్సిపల్ అధికారులు, తహసీల్దార్ కార్యాలయ సూపర్వైజర్ హరిహర శతపతి, అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సరోజ్ పాఢీ సహకారంతో రోడ్డు కొలతలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఆర్ఐ శుభస్మిత జెన, అభినాశ్ సామంతరాయ్ పాల్గొన్నారు. పర్శాలిలో ఉచిత వైద్య శిబిరం రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి నియమగిరి పర్వత ప్రాంతం పర్శాలి గ్రామంలో డొంగిరియా కొంధొ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆదిమ తెగకు చెందిన డొంగిరియా ఆదివాసీలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జ్వరంతో ఉన్న వారి రక్త నమూనాలను సేకరించి మలేరియా పరీక్షలకు తరలించారు. మరి కొంతమందికి అవసరమైన మందులను పంపిణీ చేశారు. శిబిరంలో మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సంజ్ఞా దాస్, డాక్టర్ రాకేష్ రంజన్ పాఢి, మమత సతపతి తదితరులు వైద్య సేవలు అందించారు. ఫ్లై ఓవర్పై వాహనాల రాకపోకలు ప్రారంభం రాయగడ: పాత రాయగడ, కొత్త రాయగడను అనుసంధానించే స్థానిక ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు జిల్లా యంత్రాంగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిడ్జి శిథిలావస్థకు చేరుకొవడంతో ఈ ఏడాది జనవరి 10వ తేదీన మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. దీంతో బ్రిడ్జిపై వాహన రాకపోకలను నిలిపివేశారు. వాహన రాకపోకలకు సంబంధించి ప్రత్యామ్నాయంగా మార్గాల వైపు వెళ్లాల్సిందిగా జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. అయితే మరామతులు పనులు కొంత వరకు కొనసాగడంతో కేవలం బ్రిడ్జిపై ట్రాఫిక్ దృష్ట్యా ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇచ్చింది. అనంతరం పనులు పూర్తి కావడంతో అన్ని వాహనాలు రాకపొకలు కొనసాగించుకొవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరామ్మతుల్లో భాగంగా బ్రిడ్జి ఇరువైపుల ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు జాతీయ జెండా రంగులో ఉండటం అందరిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం బ్రిడ్జి పైవాహనాల రాకపోకలు యథావిధిగాకొనసాగుతున్నాయి. -
బిజూ పట్నాయక్ ఆదర్శనీయుడు
జయపురం: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జయానంద పట్నాయక్ (బిజూ పట్నాయక్) ఆదర్శనీయులని వక్తలు కొనియాడారు. ఆయన 29వ వర్ధంతి కార్యక్రమాన్ని జయపురం బీజేడీ పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, రాష్ట్ర బీజేడీ ఉపాధ్యక్షులు రబినారాయణ నందో నేతృత్వంలో అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు జయపురం పట్టణ పోలీసుస్టేషన్ సమీపంలోని బిజూ పట్నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రబినారాయణ నందో మాట్లాడుతూ.. బిజూ బాబు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రజా నేతగా రాష్ట్ర ప్రజలకు, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన మనమధ్య లేక పోయినా అందించిన సేవలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయన్నారు. బీజేడీ పార్టీ శ్రేణులు బిజూ బాబుని ఆదర్శంగా తీసుకొని ప్రజా సేవకు అంకితమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గా మిశ్ర, జయపురం మున్సిపల్ వైస్ చైర్మన్ బి.సునాత, మాజీ వైస్చైర్మన్ సూర్యనారాయణ రథ్ (మున్నా రథ్) బిజూ స్మృతి కమిటీ అధ్యక్షులు బాల రాయ్, సీనియర్ నేత నాగరాజు దొర, శివ పట్నాయక్, రాజా పాఢీ, కుని అధికారి, బాబు బిశాయి, బీజేడీ పార్టీ కౌన్సిలర్లు దేవ చౌధురి, ఆర్.పద్మ, పి.పద్మారెడ్డి, సుశీల్ పట్నాయక్, బుడు మహాపాత్రో, ధన్ ఖొర, మాధవ్ రథ్ పాల్గొని తమ ప్రియతమ నేతకు నివాళులు సమర్పించారు.బిజూ పట్నాయక్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న మాజీమంత్రి రబినారాయణ నందో, నాయకులు -
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో ప్రతిభ
జయపురం: సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో జయపురం మోడరన్ ఇంగ్లిషు మీడియం పాఠశాల నూరు శాతం ఫలితాలు సాధించింది. ఈ పాఠశాల నుంచి 192 మంది పరీక్షకు హాజరవ్వగా అందరూ పాసయ్యారు. వారిలో కుమారి జునేరా తవాస్సమ్ 98.2 శాతం మార్కులతో టాపర్గా నిలిచింది. ఆమె తరువాత ప్రీతమ్ పాఘీ 97 శాతం మార్కులతో రెండో స్థానంలో నిలవగా.. సచిత్ర హోత్త 97 శాతం మార్కులతో మూడో స్థానంలో నిలిచినట్టు పాఠశాల డైరెక్టర్ కుముద మాల మహంతి శుక్రవారం వెల్లడించారు. 197 మంది పరీక్షలకు హాజరవ్వగా.. వీరిలో 23 మంది 90 శాతం పైగా మార్కులతో ఉత్తీర్ణులు కాగా, 80 శాతానికి పైగా మార్కులతో 22 మంది, 70 శాతానికి పైమార్కులతో 23 మంది, 60 శాతం మార్కులతో 29 మంది, 50 శాతం మార్కులతో 43 మంది, 40 శాతం పైమార్కులు పొంది 52 మంది ఉత్తీర్ణులైనట్టు వెల్లడించారు. ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులను పాఠశాల యాజనమాన్య ప్రతినిధులు అభినందించారు. -
దౌర్జన్యం తగదు’
శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026‘ఆదివాసీలపై..పర్లాకిమిడి: రాయగడ జిల్లాలో వేదాంత ప్రతిబాదిత బాక్సైట్ కంపెనీ కోసం సజ్జిమల్లి పర్వతం ఆదివాసీలను బెదిరించి అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ, సీపీఐ (ఎం.ఎల్.) న్యూ డెమాక్రసీ, సి.పి.ఐ.(ఎం.ఎల్) తదితరులు కలిసి ప్రతిబాద్ సభ జరిపారు. తొలుత హైస్కూల్ జంక్షన్ నుంచి ర్యాలీగా ఆదివాస్ మంచ్, వామపక్షాలు, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకూ ర్యాలీ జరిపారు. అనంతరం అఖిల భారత కిసాన్ మజ్దూర్ సభ, సీపీఐ(ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ, జిల్లా కార్యదర్శి కేదార్ శోబోరో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిపారు. వేదాంత కంపెనీ బాకై ్సట్ తవ్వకాల కోసం అనేక గిరిజన ఆదివాసీ గ్రామాలు రాయగడ జిల్లా సజ్జిమల్లి, కంటామల్లి గ్రామంలో గ్రామసభ రికార్డులు నకిలీవి సృష్టించి, అటవీ భూముల హక్కులు కాలరాసి ఫారెస్టు హక్కుల చట్టం 2006, పెసా చట్టం 1996 ఉల్లంఘనకు పాల్పడి అనేక బాకై ్సట్ గనులు స్వాధీనం చేసుకోవాలని ఆదివాసీలపై బినామీ కేసులు బనాయించి అర్ధరాత్రి వారిపై దాడులు జరిపారని, దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మెమొ రాండమ్ ఇచ్చామని, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాయగడ సజ్జిమల్లి సంఘటనపై నిరసన తెలుపుతున్నామని కేదార్ శోబోరో అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ మఝి ప్రభుత్వం ఏప్రిల్ 6–7 సజ్జిమల్లి, కళాహాండి సంఘటనలపై చర్యలు తీసుకుని ఆదివాసీ భూహక్కులు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో వామపక్ష పార్టీల నాయకులంతా కలిసి ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగకు రాష్ట్రపతికి రాసిన ఒక వినతిని అందజేశారు. ఈ ఆందోళనలో సీపీఐ (యం.ఎల్) లిబరేషన్ నాయకులు శ్రీనివాస బెహరా, శాంసన్ గోమాంగో తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రపతి పర్యటన సన్నాహక సమావేశం
భువనేశ్వర్: ఈ నెల 21న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రూర్కెలా పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత ఏర్పాట్లు తదితర సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనూ గర్గ్ అధ్యక్షతన లోక్ సేవా భవన్లో శుక్ర వారం రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. రాష్ట్రపతి కార్యక్రమం ఆద్యంతం సజావుగా జరిగేందుకు ముఖ్య కార్యదర్శి ఉన్నతాధికారులతో సన్నాహాలను లోతుగా సమీక్షించారు. సంబంధిత శాఖలన్నింటికీ సవివరమైన సూచనలు జారీ చేశారు. ఈ సమావేశానికి అభివృద్ధి కమిషనర్ దేవ్ రంజన్ కుమార్ సింగ్, అదనపు ప్రధాన కార్యదర్శి (హోం, పరిశ్రమలు, సమాచారం, ప్రజా సంబంధాలు) హేమంత్ శర్మ, అదనపు ప్రధాన కార్యదర్శి (కార్మిక మరియు ఈఎస్ఐ, సైన్స్, టెక్నాలజీ) చిత్ర ఆరుముగం ఇతర సీనియర్ కార్యదర్శులు, అధికారులు హాజరయ్యారు. రూర్కెలా, సంబల్పూర్, ఝార్సుగుడ, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పలువురు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. ప్రత్యేక కార్యదర్శి (హోం) ఆర్. కె. శర్మ రాష్ట్రపతి పర్యటన కార్యక్రమాలు వివరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీ ఉదయం భారత వైమానిక దళ విమానంలో న్యూ ఢిల్లీ నుంచి బయల్దేరి ఉదయం 10.25 గంటలకు ఝార్సుగుడ విమానాశ్రయంలో దిగనున్నారు. అనంతరం ఆమె ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11.10 గంటలకు రూర్కెలా విమానాశ్రయానికి చేరుకుంటారు. రూర్కెలాలో సెక్టార్ 13లో జరిగే బహిరంగ సభకు రాష్ట్రపతి హాజరవుతారు. కోయల్ నగర్లో కొత్తగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ భవన్, సైన్స్ పార్క్, ప్లానెటేరియం, ప్రమోద్ గార్డెన్ ధ్యాన్తో సహా పలు ప్రజా సంక్షేమ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఆమె రూర్కెలాలోని ఎన్టీఆర్లో ఉన్న జన జాతి మ్యూజియం మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శిస్తారు. రాష్ట్రపతి సాయంత్రం 4.50 గంటలకు ఝార్సుగుడ విమానాశ్రయం నుంచి బయలుదేరి న్యూఢిల్లీకి తిరిగి వెళ్తారు అని వివరించారు. రాష్ట్రపతి పర్యటన సమగ్ర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర హోం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని తెలిపారు. -
బాకై ్సట్.. ఫైట్
రాయగడ : రాయగడలో బాకై ్సట్ ఫైట్ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం కాశీపూర్లో గల టికిరిలో ఉత్కళ అల్యూమినియం కర్మాగారానికి 1994లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్నో అభ్యంతరాలు, అవాంతరాలు, ప్రజల వ్యతిరేకతలు మధ్య 1996లో ప్రాజెక్టు పనులు పూర్తవ్వాల్సి ఉండగా అది 2006లో ప్రారంభమైంది. ఈ కర్మాగారం ఏర్పాటులో భాగంగా వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు సైతం త్యాగం చేశారు. అందుకు వారికి కర్మాగారం నష్టపరిహారం కూడా చెల్లించింది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రాంతంలో వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. సిజిమాలి తవ్వకాలకు అనుమతి కాశీపూర్ సమితి పరిధిలొని సగుబారి పంచాయతీలో గల కంఠమాల్ సమీపంలొ ఉన్న సిజిమాలిలో సుమారు 311 మిలయన్ టన్నుల బాకై ్సట్ నిక్షేపాలు దాదాపు 1549 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సిజిమాలి కొండలో ఉన్న బాకై ్సట్ తవ్వకాల కోసం 2023 వ సంవత్సరంలో వేదాంత కంపెనీకి 50 ఏళ్ల కోసం లీజ్ కింద అనుమతులు ఇచ్చింది. అయితే ఆది నుండే అవాంతరాలు ఏర్పడుతుండటంతో వేదాంత కంపెనీ తవ్వకాల కొసం ప్రయత్నించినా ఆ దిశగా ముందుకు వెళ్లలేకపోయింది. గ్రామ సభలు, పల్లెసభలను నిర్వహించిన అనంతరం ఆయా ప్రభావిత ప్రాంతాల ప్రజల అనుమతులతో తవ్వకాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎలాంటి గ్రామ సభలు, పల్లె సభలను నిర్వహించకుండా ప్రజల అభిమతం తెలుసుకోకుండా వేదాంత కంపెనీ తవ్వకాల కొసం కదం తొక్కినప్పటికీ దానికి అనుగుణంగా ముందుకు వెళ్లలేకపోయింది. ఎందుకంత వ్యతిరేకత..? కొండలనే తమ దైవంగా భావించే ఆదివాసీలు అడవులను నమ్ముకుని జీవనోపాధిని పొందుతుంటారు. మైనింగ్ తవ్వకాల వల్ల తాము దైవంగా భావించే కొండలు అంతరించిపోవడంతో పాటు పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని పచ్చని అడవులు నాశనం అవుతాయని భావించిన ఆదివాసీలు ఆది నుండే తవ్వకాలకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొండలపై జీవించే ఎంతో మంది ఆదివాసీలు తమకు నిలువనీడ లేకుండా పోతుందని, అదేవిధంగా తాగునీటి వనరులు కూడా దొరకడం గగనమవుతుందని భావిస్తూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటైతే తమ జీవన స్థితిగతులు మెరుగుపడతాయని భావించి మొదట్లో కాశీపూర్లో గల ఉత్కళ అల్యూమినియం కర్మాగాారం ఏర్పాటుకు ఆ ప్రాంత ప్రభావితమయ్యే గ్రామాలకు చెందిన ప్రజలు వారి భూములను, స్థలాలను అప్పగించారు. కానీ ఆ తర్వాత కూడా వలసలు ఆగలేదు. ఉన్న స్థలాల సైతం, నమ్ముకున్న అడవులసైతం ఇచ్చివేస్తే మిగిలేది ఏమీలేదని గట్టిగా నమ్మిన గ్రామస్తుల తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. సిజిమాలిలో జరిగింది ఇదే.. సిజిమాలి బాకై ్సట్ నిక్షేపాలను తవ్వకాల కోసం వేదంత కంపెనీ సగుబారి నుంచి కంఠమాల్ గ్రామ సమీపంలో గల సిజిమాలి కొండవరకు రహదారిని నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా గ్రామస్తులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఏప్రిల్ 7 వ తేదిన జిల్లా కలెక్టర్ అశుతొష్ కులకర్ణి కంఠమాల్ గ్రామ ప్రజలకు ఈ కొండను ప్రభుత్వం తవ్వకాల కొసం వేదాంత కంపెనీకి అనుమతులు ఇచ్చిందని, వారు తవ్వుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు తెలపకూడదని మైకు ద్వారా పోలీసులు బలగంతో అక్కడకు చేరుకున్న కలెక్టర్ గ్రామస్తులకు వివరించారు. అదే రోజు రాత్రి పోలీసులు కంఠమాల్ గ్రామంలో గల సుభాసిణి మాఝి అనే ఒక నిందితురాలిని అరెస్టు చేసే పేరిట పూర్తి పోలీసుల బలగాలతో అర్ధరాత్రి గ్రామంలో దమన కాండను సృష్టించారు. ఈ దాడుల్లో ఎంతొ మంది ఆదివాసీలు గాయాలపాలయ్యారు. అదేవిధంగా గ్రామంలొకి భాస్వవాయువును కూడా పోలీసులు ప్రయోగించారు. మరుసటి రోజు ఏప్రిల్ 8న మరికొంత మంది పోలీసులు ఉదయం కంఠమాల్ గ్రామానికి వెళ్లి రహదారి నిర్మాణానికి సంబంధించి సన్నాహాలు చేయగా గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. సంప్రదాయ ఆయుధాలతో వ్యతిరేకించారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య జరిగిన వాగ్వాదంలొ పోలీసులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో సుమారు 58 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. దీంతొ పరిస్థితులు ఉద్రిక్తమవ్వడంతో గ్రామంలొ 163 సెక్షన్ జారీ చేశారు. కొద్ది రొజులు సద్దుమణగగా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకరి తర్వాత ఒకరు గ్రామంలోకి వెళ్లారు. ఫ్యాక్ట్ పైండింగ్ టీంలుగా ఇటు ప్రతిపక్ష పార్టీ బీజేడీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనాయకులు కంఠమాల్ గ్రామంలొ గ్రామస్తులతో సమావేశమయ్యారు. తాము అండగా ఉంటామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఆదివాసీల హక్కులను కాలరాయడం విచారకరమని ఈ మేరకు తమ హైకమాండ్ లకు రాజకీయ నాయకులు నివేదికలను కూడా సమర్పించారు. ఇందులో భాగంగా కొరాపుట్ లొక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలొ రాయగడ, బిసంకటక్, గుణుపూర్ ఎమ్మెల్యేలు అప్పల స్వామి కడ్రక, నీలమాధవ హికక, సత్యజీత్ గొమాంగొలు కంఠమాల్ గ్రామంలొ పర్యటించిన అనంతరం కలెక్టర్ అశుతొష్ కులకర్ణితో సమావేశమయ్యారు. పల్లె సభలు, గ్రామ సభలను జరిగినట్లుగా సాక్ష్యాలను సృష్టించి వేదాంత కంపెనీ సిజిమాలి కొండలను తవ్వేందుకు ప్రయత్నిస్తుందని సరాసరి కలెక్టర్తో చెప్పారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ విషయమై చొరవ తీసుకొవాలని కొరారు. బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా ప్రతిపక్షపార్టీలు గ్రామస్తులకు మద్దతు చెబుతున్నాయి. ప్రభావిత గ్రామాలు సిజిమాలి బాకై ్సట్ తవ్వకాలు కొనసాగితే ప్రభావిత గ్రామాల గురించి తెలుసుకుంటే.. జిల్లాలోని 18 గ్రామాలు నేరుగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం, కంపెనీలు అంచనా వేశారు. ఇందులో రాయగడ జిల్లాలోని 8 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే సామాజిక కార్యకర్తలు, గిరిజన సంఘాల అంచనా మేరకు మైనింగ్ వల్ల సుమారు 50 నుంచి 80 గ్రామాలు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. దీని వల్ల సుమారు ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 30 వేల మందికి పైగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అంచనా. -
బిజూకు నివాళులు
రాయగడ: జననాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ బిజూ పట్నాయక్ 29వ వర్ధంతిని బీజేడీ నాయకులు శుక్రవారం నిర్వహించారు. స్థానిక కొత్త బస్టాండు సమీపంలోని బిజూ పట్నాయక్ విగ్రహానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాధ సరక, సీనియర్ నాయకులు, న్యాయవాది బ్రజసుందర్ నాయక్, అనసూయా మాఝి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, బిజేడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నాన గౌరి శంకరరావు, జిల్లా పరిషత్ సభ్యులు ధవలేశ్వర్ నాయుడు, నీలొ గంతాయిత్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజజలి ఘటించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వక్తలు బిజూ పట్నాయక్ సేవలు కొనియాడారు. మల్కన్గిరిలో బిజు పట్నాయక్ వర్ధంతి మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ బిజూ పట్నాయక్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్కన్గిరి బీజేపీ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే మానాస్ మాడ్కామి నేతృత్వంలో భిజు పట్నాయక్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కన్గిరి జిల్లా కోసం బిజూ బాబు చేసిన సేవలు ఏన్నో ఉన్నాయన్ానరు. ఇక్కడ ప్రజాల్లో చైతన్యం కోసం ఆయన సేవలు చీరస్మరణీయం అని అన్నారు . కార్యక్రమంలో మల్కన్గిరి మున్సిపల్ చైర్మన్ మనోజ్ బారిక్ , గోపాల్ పండా, కవితా మోహంతి, బీజేడీ సభ్యులు పాల్గున్నారు . 8 కిలోల గంజాయి పట్టివేత మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి యం.వి.79 పోలీసుస్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులను చూసి బైక్ వదిలి పారిపోవోడానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి గంజాయి బస్తాను స్వాధీనం చేసుకొని తూకం వేయగా ఎనిమిది కిలోలు ఉన్నట్టు నిర్ధారించారు. గంజాయిని కలిమెల ప్రాంతంలో కొనుగోలు చేసినట్టు నిందితుడు అంగీకరించారు. దీని విలువ రూ. 50 వేలు ఉంటుందని పోలీసులు చెప్పారు. నిందితుడు తెలంగాణాకు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. పూర్తి విచరణ అనంతరం కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు . మహిళ మృతదేహం లభ్యం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా సీక్పల్లి పంచాయతీ ఉస్కాలబాగ గ్రామ అడవిలో శుక్రవారం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. కేందు ఆకుల కోసం వెళ్లిన స్థానికులకు చెట్టు వేల్లాడుతూ ఓ మహిళ కనిపించింది. వెంటనే మల్కన్గిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి పోలీసు ఐఐసీ రీగాన్కీండో వెల్లి పరిశీలించారు. అయితే ప్రాధమిక విచారణలో మృతురాలు పోడియా సమితి నాండిబేఢా గ్రామనికి చెందిన లాచా కురామి భర్య సమే సోడిగా గుర్తించారు . భర్త లాచా కురామి ఉపాధికోసం ఆంధ్రా పనులకు వలస వెళ్లాడు. ఈ నేపథ్యంలో సమేకు మరో వ్యక్తితో సంబంధం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు . అయితే ఈ ఇద్దరు గురువారం ఉస్కలబాగ్ గ్రామంలో జరిగిన ఓ వివహంలో పాల్గునీ అనంతరం ఆ వ్యక్తి సమేపై తన స్నేహితులు తో కలిసి త్యాచారం జరిపి అనంతరం హత్య చేసి వుంటాడు షని కుంటుంభ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహన్ని స్వదీనం చేసుకోన్ని సైటీఫీక్ బృందం వస్తే పూర్తి వివరాలు తేలుస్తాయి ఆ తరువతే పోస్టుమాఠం నిర్వహించి మృతదేహం అప్పగిస్తాం అని ఐఐసి రీగాన్ కీండొ తేలిపారు మృతదేహన్ని మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రి తరలించారు . నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
బిజూ పట్నాయక్ మహోన్నత వ్యక్తి
భువనేశ్వర్: ఆధునిక ఒడిశా నిర్మాతలలో ఒకరు, ఒడియా గర్వానికి ప్రతీక అయిన దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ ఒక మహోన్నత వ్యక్తి అని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సాహసోపేతమైన విమానయాన నిపుణుడు, ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడు మరియు సంఘ సేవకుడుగా పలు రంగాల్లో తన పాత్రను విజయవంతంగా ప్రదర్శించారని తెలిపారు. శాసన సభ ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత బిజూ పట్నాయక్ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, స్పీకర్ సురమా పాఢి, డిప్యూటీ స్పీకర్ భవానీశంకర్ భోయ్, ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వీరందరు దివంగత బిజూ పట్నాయక్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. బిజూ పట్నాయక్ జీవితం ఆధారంగా శాస్వతి సోషల్ అండ్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్ రూపొందించిన సంగీత ప్రదర్శనకు అతిథి ప్రముఖులు హాజరయ్యారు. -
పాత్రికేయులకు భద్రత డిమాండ్
● 29న రాష్ట్రవ్యాప్త నిరసనలుభువనేశ్వర్: రాష్ట్రంలో పాత్రికేయుల సమగ్ర సంక్షేమానికి పాత్రికేయ సంఘాలు నడుం బిగించాయి. న్యాయసమ్మతమైన డిమాండ్లపై మోహన్ చరణ్ మాఝి మాట మరిచి వ్యవహరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆరోగ్య బీమా, రూ.15,000 పింఛను, పత్రికా ప్రతినిధుల రక్షణ చట్టం మొదలైన వృత్తిపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉత్కళ్ పాత్రికేయుల సంఘం (యూజేఏ) ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన విధానానికి నిరసనగా మే 1న నల్ల పట్టీలు ధరించి శాంతియుత నిరసన ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. అంగుల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆ సంస్థ కార్యకర్తలు ఈ తీర్మానం చేశారు. ఉత్కళ్ పాత్రికేయుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బిభూతి భూషణ్ కొరొ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో పాత్రికేయులకు భద్రత కల్పిస్తుండగా ఒడిశాలో వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధీకృత కమిటీ ఏర్పాటుతో పాత్రికేయులకు అధీకృత గుర్తింపు, రాజధానిలో స్వల్ప ఖర్చుతో కూడిన నివాస గృహాల నిర్మాణం, నెలకు రూ.15,000 పింఛను, ఆరోగ్య బీమా, పెళ్లికాని పిల్లలకు బీమా మొదలైనవి డిమాండ్ చేస్తూ 2024 ఫిబ్రవరి 7న రాష్ట్ర, జిల్లా స్థాయి అధీకృత కమిటీని ఏర్పాటు చేసి భువనేశ్వర్లో నిరసన చేపట్టారు. ఆ సమయంలో, ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు మోహన్ చరణ్ మాఝీ నిరసన ప్రదేశానికి వచ్చి ఈ డిమాండ్కు మద్దతు తెలుపుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ న్యాయసమ్మతమైన డిమాండ్లని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లు గడిచినా ఈ హామీ నీటి మీద రాతగా మిగిలిపోయింది. ఇందుకు నిరసనగా ఉత్కళ్ పాత్రికేయుల సంఘం ఈ నెల 29న జిల్లాలో ప్రతీకాత్మక నిరసన చేపట్టనుంది. వెంబడి మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా నల్ల పట్టీలు ధరించి నిరసన తెలుపుతుంది. రానున్న శీతాకాల సమావేశాలకు ముందు ఎలాంటి చర్య తీసుకోకపోతే ఆ సంస్థ భువనేశ్వర్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి బేణుధర్ పండా, కార్యనిర్వాహక అధ్యక్షుడు హరధన్ బెనర్జీ, పూర్ణ చంద్ర నాయక్, కోశాధికారి రాజేన్ చౌదరి, ఉపాధ్యక్షులు రష్మీ రంజన్ మిశ్రా, సత్యనారయణ మిశ్రా, సలహాదారులు పథ్వీ మహారథి, బిశ్వజిత్ పట్నాయక్, అంగుల్ జిల్లా అధ్యక్షుడు లోకనాథ్ దొలై, సభ్యులు లోకనాథ్ దళాయి, పూర్ణ చంద్ర సాహు, శ్రీకాంత్ ఖొటై, దేబాశిష్ పురోహిత్, సత్యబ్రత్ దాస్, హరిహర్ స్వంయి పాల్గొన్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో పాత్రికేయుల చర్చలురాష్ట్రంలోని పాత్రికేయుల సమస్యలు, డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కార్యదర్శి అనూ గర్గ్తో ఐయూడబ్ల్యూజే ప్రతినిధులు చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అభివృద్ధి కమిషనర్, అదనపు ప్రధాన కార్యదర్శి దేవ రంజన్ కుమార్ సింగ్, అదనపు సమాచార, పౌర సంబంధాల శాఖ ముఖ్య కార్యదర్శి హేమంత్ శర్మ, డైరెక్టర్ అనుజ్ కుమార్ దాస్ పట్నాయక్, డైరెక్టర్ (టెక్నికల్) గుర్బీర్ సింగ్ హాజరయ్యారు. పాత్రికేయుల తరఫున ఐయూడబ్ల్యూజే అఖిల భారత అధ్యక్షుడు పితావస్ మిశ్రా, ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు భగవత్ ప్రసాద్ త్రిపాఠి, భువనేశ్వర్ కార్యాలయ అధ్యక్షుడు హృషికేష్ మహంతి, ఐయూడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు రవి రాయ్ హాజరై పాత్రికేయుల సామూహిక సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన వివిధ ప్రతిపాదనలు, డిమాండ్లను ప్రముఖ కార్యదర్శికి సమర్పించారు. పాత్రికేయుల ఆర్థిక భద్రత కోసం పింఛను పథకాన్ని అమలు చేయడం, పాత్రికేయులకు ప్రభుత్వ గుర్తింపు మంజూరు చేసేందుకు రాష్ట్ర గుర్తింపు కమిటీని పునర్వ్యవస్థీకరణ, ప్రభుత్వ ప్రకటనల పంపిణీలో మరిన్ని సౌకర్యాల కల్పన, పాత్రికేయులకు గుర్తింపు పత్రాలు జారీ చేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో సవివరంగా చర్చించారు. -
మృతి చెందిన విద్యార్థులకు రూ.3లక్షల సాయం
పర్లాకిమిడి: ప్రభుత్వ పాఠశాల గేటు విరిగి గోడ విద్యార్థులపై పడటంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన ఆర్.ఉదయగిరి బ్లాక్, రుబుడుసింగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం జరిగింది. విద్యార్థులు విరామంలో మెయిన్ గేటు వద్ద ఆడుకుంటుండగా పునాదులతో సహా గేటు విరిగి పడటంతో ఇద్దరు విద్యార్థులు ఇదాంతీ రయితో, బెకాల్స్ రయితోలు సంఘటనా స్థలంలో మరణించారు. ఈ దుర్వార్త సమాచారం తెలుసుకుని వారి తల్లిదండ్రులు, బంధువులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకుని గగ్గోలు పెట్టారు. ఆర్. ఉదయగిరి పోలీసులు ఆ మృతదేహాలను పర్లాకిమిడి మెడికల్కు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఈ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝి మృతుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి రూ.3 లక్షల చొప్పున్న ఇస్తున్నట్టు ప్రకటించారు. 21న వివాహ పథకం నిధులు మంజూరు పర్లాకిమిడి: ముఖ్యమంత్రి కన్యా వివాహ పథకం కింద పేద బిడ్డలకు వివాహం నిమిత్తం ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్సు హాల్లో కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ ఆధ్యక్షతన ఒక ముందస్తు సమావేశం గురువారం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన 17 వివాహిత జంటలకు ప్రభుత్వ అధికారులు ఈనెల 21న బిజూ కల్యాణ మండపంలో ఆర్థిక సాయం అందజేయడానికి అధికారులు నిర్ణయించారు. సమావేశానికి ఏడీఎం మునీంద్ర హనగ, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారి మనోరమా దేవి, పురపాలక సంఘం ఈవో లక్ష్మణ ముర్ము, ఐఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నాగేశ్వర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ‘అవయవ దానం ఒక గొప్ప వరం’భువనేశ్వర్: మానవ మరణ అనంతరం కీలక అవయవాలను దానం చేయడం ఒక గొప్ప వరం అని హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ అవయవాలను మరో 8 మందికి అమర్చి వారి ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు. అవయవ దానంపై ప్రజల్లో క్రమంగా అవగాహన విస్తరించడంతో పుణ్య కార్యం అవయవ దానం కోసం వివిధ వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈ అవయవ మార్పిడి కోసం హై టెక్ మెడికల్ కాలేజీ క్యాంపస్లో ఒక ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ సిద్ధం చేసినట్లు మేనేజింగ్ ట్రస్టీ సురేష్ పాణిగ్రాహి తెలిపారు. ఈ బృహత్కార్యం కోసం హై టెక్ మెడికల్ కాలేజీతో చేతులు కలపడం ద్వారా అవయవ దాన ఉద్యమం మరింత వేగవంతం అవుతుందని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జేసీఐ) భువనేశ్వర్ అధ్యక్షుడు శ్రీనివాస్ సుబుద్ధి అన్నారు. సమాజంలో అవయవ దానం వంటి గొప్ప కార్యాన్ని ప్రోత్సహించి ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ భువనేశ్వర్, హై టెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. అవయవ దానం ప్రాముఖ్యతపై ఆధారపడిన ఆఫా చిత్ర ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. కార్యక్రమానికి హై టెక్ సీఓఓ జ్యోతిర్మయి పండా, కో డైరెక్టర్ అనిల్ పాణిగ్రాహి, డాక్టర్ మనోజ్ దాస్ పలువురు సీనియర్ వైద్యులు, సిబ్బంది హాజరయ్యారు. -
కంఠామాల్లో బీజేపీ బృందం పర్యటన
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి సగుబారి పంచాయతీ పరిధి కంఠామాల్ గ్రామంలో బీజేపీ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ బృందం బుధవారం పర్యటించింది. నవరంగపూర్ ఎంపీ బలభద్ర మాఝి, కొరాపుట్ ఎమ్మెల్యే రుపుభత్ర, దేవగడ్ ఎమ్మెల్యే సుధీర్ రంజన్ పఠజోషి, రాష్ట్ర ఆదివాసీ మోర్చ సాధారణ కార్యదర్శి కాలీరాం మాఝి, బీజేపీ రాష్ట్ర శాఖ కన్వీనర్ పూర్ణిమ నాయక్, సుశాంత ప్రధాన్, త్రినాథ్ గొమాంగో, అశ్విని కొంచాడ, ఎస్డీసీ వైస్ ప్రెసిడెంట్ మంజుల మినియాక, బీజేపీ రాష్ట్ర శాఖ కార్యవర్గ సభ్యులు యాళ్ల కొండబాబు, శివకుమార్ పట్నాయక్, బషంత కుమార్ ఉలక తదితరులు బృందంలో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం సిజిమాలి బాకై ్సజ్ గనుల తవ్వకాలకు సంబంధించి సగుబారి నుంచి సిజిమాల్ బాకై ్సట్ కొండ వరకు రహదారిని నిర్మిస్తున్న సమయంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు, గ్రామస్తులకు మధ్య చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి 58 మంది పోలీసులు గ్రామస్తుల రాళ్ల దాడిలో గాయాలు పాలయ్యారు. అదేవిధంగా ఘటనకు ముందురోజు రాత్రి కంఠమాల్ గ్రామంలో పోలీసులు సృష్టించిన దమన కాండలో పదిమంది వరకు గ్రామస్తులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నిజానిజాలు తెలుసుకునేందుకు రాష్ట్ర బీజేపీ చర్యలు తీసుకుంది. ఈ మేరకు అక్కడ పరిస్థితిని సమీక్షించడంతో పాటు వాస్తవాలను తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని పంపించింది. దీంతో ఆ బృందం సభ్యులు గ్రామస్తులతో మాట్లాడారు. బీజేపీ ప్రజల పార్టీగా గుర్తింపు పొందిందని ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందని, అందువల్ల జరిగిన ఘటనకు సంబంధించి వాస్తవాలను భయం లేకుండా గ్రామస్తులు తెలియజేయాలని ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందం వారికి భరోసా ఇచ్చింది. పక్కాగా నివేదికను రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బృందం వివరించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమకు జరిగిన అన్యాయానికి సంబంధించి ఒక వినతిపత్రంను బృందంకు సమర్పించారు. తమపై తప్పుడు కేసులను పోలీసులు నమోదు చేసి నానా ఇబ్బందులు పెడుతున్నారని, అదేవిధంగా తవ్వకాల పేరిట తాము నమ్ముకున్న కొండలను ధ్వంసం చేసేందుకు చేపడుతున్న సన్నాహాలను తాము వ్యతిరేకిస్తున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. -
● ముగిసిన బ్రహ్మోత్సవం
భువనేశ్వర్: అంగరంగ వైభవంగా ఆరంభమైన ఖుర్దారోడ్ అకౌంట్సు కాలనీ కొండపై నెలకొన్న శ్రీ వెంకటేశ్వరుని 33వ వార్షికోత్సవ సమేత బ్రహ్మోత్సవం గురువారం ఆనందోత్సాహాలతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఉభయ నాంచారీ సమేతంగా శ్రీనివాసుని పుర వీధుల్లో ఊరేగింపు కార్యక్రమం శాంతియుతంగా ముగిసినట్లు నిర్వాహక సంస్థ కార్యదర్శి జేకే రావు తెలిపారు. ఈ ఊరేగింపు స్థానిక ఉత్తరాయణి మందిర ప్రాంగణం నుంచి ప్రధాన దేవస్థానం వరకు కొనసాగింది. సీతారాం ఛక్, రైల్వే కాలనీ వీధుల గుండా కొనసాగిన ఊరేగింపులో మహిళల కోలాటం చూపరుల్ని ఆకట్టుకుంది. -
21 క్వింటాళ్ల విప్పపువ్వు స్వాధీనం
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్ సమితి డంగసొరడ పంచాయతీ పంపపడ్రతొల గ్రామంలో బుధవారం సాయంత్రం అబ్కారీ శాఖ అధికారులు చేపట్టిన దాడుల్లో 21 క్వింటాళ్ల విప్పపువ్వును స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీకి వినియోగించే విప్పపువ్వును ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామానికి చెందిన సదానంద సామల్ ఇంట్లో నిల్వ ఉంచిన విషయం తెలుసుకున్న అధికారులు ఈ మేరకు ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో విప్పపువ్వు స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడు సమాల్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పర్లాకిమిడి: ఒడిశా ఆదర్శ విద్యాలయం (ఓఏ వీ) గుసాని బ్లాక్ లింగిపురం విద్యార్థిని వ ట్టుకుల యామిని సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో 95.8 శాతం మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. గజపతి జిల్లాలో ఉన్న ఏడు ఓఏవీల్లో యామిని ఫస్టు ర్యాంకు సాధించినట్టు ప్రిన్సిపాల్ డంగు యాదవ్రావు తెలిపారు. మరో విద్యార్థిని దీపికా సామల్ 90.2 శాతం మార్కులు సాధించింది. ఓఏవీ లింగుపురంలో 60 శాతం మార్కులు సాధించిన వారిలో 37 మంది ఉన్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. -
ఉత్సాహంగా కవి సమ్మేళనం
జయపురం: జయపురం పూజ్య పూజ సాహిత్య సంసద్ గురువారం సాహితీ సమ్మేళనం నిర్వహించింది. కార్యక్రమంలో శారద విహార్ సరస్వతీ విద్యామందిరం ఆచార్యులు అనంత నారాయణ మహాపాత్రో ముఖ్యఅతిథిగా పాల్గొని మన సంస్కృతి కళలకు సాహిత్యం దర్పణం అన్నారు. అందుచేత సాహిత్యం, భాషలను పరిరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో బొయిపరిగుడ కళాశాల అధ్యాపకులు మానసీ ఆచార్య ముఖ్యవక్తగా పాల్గొని సాహిత్య విలువలు, ఒడియా సాహిత్య ప్రగతి లపై ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వీయ కవితా పఠన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి ప్రదీప్ కుమార్ సాహు, మాధురీ పండ, మానసీ ఆచార్య, రాధామోహన పండ, సంధ్యారాణి సాహు తదితరులు పాల్గొని కవితలు వినిపించారు.పూజ్య పూజ సంసద్ ఉపాద్యక్షలు తపన్ కిరణ్ త్రిపాఠీ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలొ బిపిన్ పాత్రో, ఆరాధ్య కౌశిక్, ధనిశ కౌశిక్, సంతోష్ కుమార్ బ్రహ్మ, సంస్కృతి సామంతరాయ్, సుశ్రీ సామంతరాయ్, స్వస్థిక్ ప్రసాద్ బెహర,శుభశ్రీ మహాపాత్రో,ఆశిష్ కుమార్ మహాపాత్రో, స్మిత పాత్రో, మాధురీ పండ, చంధ్ర శేఖర పాత్రో, గౌరీ పండ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులతో సత్కరించారు. కార్యక్రమాన్ని సంస్థ కార్యదర్శి భైరాగీ సాహు.మృత్యజయ సాహులు పర్యవేక్షించగా సరస్వతీ సాహు సభికులకు ధన్యవాదాలు తెలిపారు. -
ఆదిత్య విద్యార్థుల ప్రతిభ
టెక్కలి: ఇటీవల సత్యసాయి జిల్లాలో నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్నోవేషన్, డిజైన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ బూట్ క్యాంప్లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కళాశాలలో బుధవారం వారిని అభినందించారు. ఏఐసీటీఈ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 250 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. వారిలో ఆదిత్య విద్యార్థులు మైరెన్ ఎక్స్, కాష్యుహబ్, ఎఫీసోల్వో తదితర ఇన్నోవేషన్ ప్రాజెక్టులతో పాల్గొన్నట్లు వెల్లడించారు. కాష్యు హబ్కు జ్యూరీ ప్యానెల్ ఉత్తమ జట్టు అవార్డు, ప్రశంసా పత్రాలు అందజేసినట్లు తెలిపారు. అలాగే ఎఫీసోల్వోకు ప్రశంసపత్రాలు అందజేశారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఐతమ్ రైజ్ సీఈవో మనోజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కా.. ఏదీ నీ లెక్కా..?
ఇచ్ఛాపురం రూరల్: ఉపాధి హామీ పథకంలో భాగంగా గతంలో వేతనదారులకు ఇచ్చిన మొక్కలు ఇప్పుడు సామాజిక తనిఖీ బృందానికి దొరకడం లేదు. మొక్కలు నాటినట్లు రికార్డుల్లో ఉన్నా.. లెక్కకు మాత్రం అక్కడ ఒక్క మొక్క కూడా సామాజిక తనిఖీ బృందాలకు చిక్కకపోవడం విశేషం. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 1,252 పనులకు గత నెల రోజులుగా సామాజిక బృందం సభ్యులు గ్రామాల్లో ఆడిట్ నిర్వహించారు. వేతనాల రూపంలో రూ.10.75 కోట్లు, మెటీరియల్ రూపంలో రూ.5.14 కోట్లకు సామాజిక తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బుధవారం నిర్వహించిన ప్రజావేదికలో మండలంలోని ఏ గ్రామంలో కూడా మొక్కలు లేకపోవడంతో పీడీ లవరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మొక్కలు నాటాలని ఆదేశించారు. బాలకృష్ణాపురంలో రూ.1.05 లక్షల ఖర్చుతో నీటి కుంట తవ్వారు. అయితే జేసీబీతో కప్పివేసినట్లు సామాజిక బృందం గుర్తించింది. అదే గ్రామంలో రూ.5.38 లక్షలతో నక్కల బంధ చెరువు పూడిక తీత పనులు చేపట్టారు. అయితే ఆ చెరువు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించి చెరువు గట్టును పూర్తిగా తొలగించి, గ్రావెల్ రోడ్డు వేసి స్థలాలుగా మార్చుకున్నట్లు సామాజిక తనిఖీలో బృందం గుర్తించింది. దీనిపై ఏపీడీ ఎంకై ్వరీ వేస్తున్నట్లు పీడీ లవరాజు ఆదేశించారు. వివిధ కారణాలతో ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.4,500ల జరిమానా విధించారు. కార్యక్రమంలో ఎంపీపీ బోర పుష్ప, పీఏసీఎస్ చైర్మన్ పెదిన బాబ్జీ, డ్వామా పీడీ బి.లవరాజు, ఏపీడీ పి.రాధ, ఏపీడీ సీహెచ్ శ్రీనివాసరెడ్డి, విజిలెన్స్ అధికారి శ్రవణ్కుమార్, ఎంపీడీవో ఎ.ప్రభాకరరావు, ఎస్ఆర్పీ సిర్ల మాధవరావు, ఏపీవో పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఏడాదంతా... ఏ చింత లేకుండా..!
● ఏజెన్సీ చింతపండుకు వినియోగదారుల క్యూ ● ఏడాదంతా నిల్వ ఉండేలా ఏర్పాట్లు ● ఈ ఏడాది పెరిగిన చింత పండు ధరలుకొత్తూరు: ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చారు లేకుండా భోజనం ఉండదు. నిత్యం వంటింట్లో ఏదో రకంగా చింతపండు వినియోగం ఉంటుంది. అలాగే పచ్చళ్ల తయారీకి సైతం అత్యంత కీలకంగా చింతపండును పేర్కొంటున్నారు. అలాంటి నాణ్యమైన చింతపండుకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు, సీతంపేట, భామిని మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు ప్రసిద్ధిగాంచాయి. వేసవి సమీపిస్తున్న తరుణంలో మైదాన ప్రాంతం వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు సంతల్లో గిరిజనులు విక్రయించే చింతపండు కోసం క్యూ కడుతుంటారు. అధిక మొత్తంలో కొనుగోలు చేసి ఏడాదంతా వినియోగించడం, అమ్మకాలు సాగిస్తుండడం పరిపాటిగా మారింది. ఏజెన్సీ చింతపండుకు గిరాకీ జిల్లాలో ఏజెన్సీ చింతపండుకు అత్యంత గిరాకీ ఉంది. ఇక్కడి గిరిజనులు ఆటవీ ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద చింత చెట్లు వద్ద చింతపండును సేకరిస్తారు. దీని రుచి వేరుగా ఉంటుంది. ఇక్కడ లభ్యమయ్యే చింతపండుతో తయారు చేసిన పచ్చళ్లు. చారు, పులుసు తదితర వంటకాలు మంచి రుచిని కలిగి ఉంటాయి. అందుకే ఒకేసారి అధిక మొత్తంలో కొనుగోలు చేసి వివిధ రకాల పద్ధతుల్లో నిల్వ ఉంచుకొని ఏడాదంతా వినియోగించడంతో పాటు.. పట్టణాల్లో ఉండే బంధువులు, స్నేహితులకు పంపిస్తామని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఇకపోతే పంట దిగబడిని బట్టి ధర ఆధారపడుతుంది. ఈ ఏడాది పంట తక్కువ ఉండడంతో పాటు ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు సంతలకు ఎక్కువ మంది రావడంతో కిలో రూ.75 లు నుంచి రూ.80లు ధర ఉంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొనుగోలుదారులు చెబుతున్నారు. నిల్వచేసే విధానం సాధారణంగా ఏజెన్సీలోని సంతల్లో గిరిజనుల వద్ద వినియోగదారులు కొనుగోలు చేస్తారు. చింతపండుకు ఉన్న పెంకులు, ఇతరాలను వేరుచేసి శుభ్రపరుస్తారు. పల్లె ప్రాంతాల ప్రజలు కేజీ నుంచి రెండున్నర కేజీల పరిమాణంలో ఉప్పు వేసి గోళాకారంగా ఉండలను చేసి ఎండబడతారు. ఎండిన తర్వాత ఉండలను మట్టి, ప్లాస్టిక్ బకెట్లలో ఏడాదంతా ఉంచుకొని వినియోగిస్తారు. పట్టణ ప్రజలైతే పై ప్రక్రియ మాదిరిగానే చేసి ప్రత్యేక కవర్లలో, ప్రిజ్లో లో పెట్టి ఏడాదంతా నిల్వ ఉంచి వినియోగిస్తారు నష్టపోతున్నాం ప్రస్తుతం చింతపండు నిల్వ చేసేందుకు శీతల కేంద్రాలు లేకపోవడంతో దళారీలు అడిగిన ధరకు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాము. అధికారులు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తే మాకు మేలు జరుగుతుంది. – నిమ్మక అప్పన్న, గొట్టిపల్లి, కొత్తూరు -
తూతూమంత్రంగా సామాజిక తనిఖీ ప్రజావేదిక
కవిటి: మండలంలోని ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిర్వహించిన 18వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక తూతూమంత్రంగా జరిగింది. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జరిగిన పనులకు సంబంధించి ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక సభ బుధవారం కవిటిలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.లవరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. వాస్తవానికి సామాజిక తనిఖీ ఆడిట్ బృందం ఫిబ్రవరి 11 నుంచి మార్చి 31 వరకు గ్రామస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ గ్రామస్థాయి సభలకు సంబంధించి మీడియా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడంలో తనిఖీ బృందం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. వేజ్ కాంపోనెంట్ రూ.10.56 కోట్లకు పైగా నిధులు, పీఆర్ విభాగంలో రూ.4.10 కోట్లు, సోషల్ ఫారెస్ట్రీలో రూ.97,713లు, కాంపౌండ్స్ రూ.1.14 లక్షలకు సంబంధించిన పనులపై ఈ తనిఖీ నిర్వహించారు. సమీక్ష ప్రారంభం అయిన గంటలోనే 5 పంచాయతీలకు సంబంధించిన సానుకూల, ప్రతికూల అంశాలకు సంబంధించిన చర్చ సోషల్ ఆడిట్ సిబ్బంది పూర్తి చేసేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.15 కోట్ల నిధులు వినియోగానికి సంబంధించి కేవలం రూ.20,500లు దుర్వినియోగం అయినట్లు అధికారులు తేల్చారు. ఈ నిధులు బెజ్జిపుట్టుగలో రూ.6,000లు, సహలాలపుట్టుగలో రూ.7,500లు, బల్లిపుట్టుగలో రూ.4,500లు, వరకలో రూ.2,500లుగా నిర్దారించారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ టి.రాధ, ఏపీడీ సీహెచ్ శ్రీనివాసరెడ్డి, హెచ్ఆర్ మేనేజర్ శ్రావణ్, ఎంపీడీవో ఎల్.త్రినాథ, ఏపీవో టి.మోహనరావు, ఈసీ నీలాంబర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
చిరుతిండి.. ప్రమాదమండి..!
● జంక్ ఫుడ్తో చిన్నారులకు అనారోగ్యాలు ● ప్యాకింగ్ పదార్థాలతో అపాయం ● సంప్రదాయ సమతుల్య ఆహారంతో మేలు అవగాహన కల్పిస్తున్నాం పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు జంక్ ఫుడ్ మాన్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ఉండే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేసి పిల్లలకు అందివ్వాలి. దీనివలన వారిలో శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. – విద్యా శతపతి, సీడీపీవో, టెక్కలి జంక్ఫుడ్తో అనారోగ్య సమస్యలు జంక్ ఫుడ్ వలన చిన్నారుల్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, గుండె, పొట్ట సమస్యలతో పాటు మెదడు ఎదుగుదల లేకుండా చేస్తాయి. జంక్ఫుడ్ ఆకర్షణకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – బీఆర్కే మహారాజ్, చిన్న పిల్లల వైద్యు నిపుణుడు, టెక్కలి జిల్లా ఆస్పత్రి ఎదుగుదలకు హానికరం చిన్నారుల ఎదుగుదలపై ఈ జంక్ ఫుడ్స్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు, చక్కెర, ఉప్పు ప్రభావంతో వారిలో రోగ నిరోధక శక్తి నశించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వీటిలో ఎటువంటి ప్రోటీన్లు, విటమిన్లు ఉండవు. దీనివల్ల పెరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. బర్గర్లు, పిజ్జా, చిప్స్, సోడాల్లో పోషకాలు తక్కువ, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. దీంతో శరీరం పోషక లోపంతో ఎదుగుతుంది. అధిక బరువు, గుండె, లివర్ సమస్యలకు దారి తీస్తాయి. ఎక్కువ చక్కెర, ఫ్యాట్స్ వలన స్థూలకాయం, మధుమేహపు ప్రమాదం, ఫాటీ లివర్ మొదలైన సమస్యలు చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఏకాగ్రత తగ్గి, చిరాకు, అలసట, నిద్రలేమి సమస్యలు వస్తాయి. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి చిన్నారులకు జంక్ ఫుడ్ను మాన్పించే విషయంలో తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి. ఇంట్లో తల్లిదండ్రుల ఆహార అలవాట్లుకు అనుగుణంగా పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయంలో ఆకర్షణీయంగా ఇంట్లోనే పదార్థాలను తయారు చేసి వారికి అందివ్వాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని తయారు చేయడంలో పిల్లలు భాగస్వామ్యం ఉండే విధంగా చూడాలి. దీనివలన వారు తయారు చేసిన ఆహారాన్ని ఎలాగైనా తినాలి అనే మార్పు వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే విషయంలో వారిని ప్రోత్సహించే విధంగా చిన్నపాటి ప్రోత్సాహకాలు అందజేయాలి. దీనివలన ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఆహారం అనారోగ్యం అనే విషయంపై చిన్నారులకు అవగాహన కల్పించాలి. సంప్రదాయ ఆహారంతో మేలు చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు కొన్ని రకాల సాంప్రదాయ ఆహారాలను అలవాటు చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇంట్లో వండిన సమతుల్య ఆహారం అనగా పప్పు, కూరలతో చేసిన ఆహారం, పాలు, గుడ్లు, చికెన్, చేపలు వంటి ప్రోటీన్ ఆధారిత ఆహారం వారి పెరుగుదలకు ఎంతో మంచిది. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, అరటి, పచ్చి కూరలు, క్యారట్, బీట్రూట్తో చేసిన ఆహార పదార్థాలతో విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయి. -
ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న వసతి గృహంలో చేరేందుకు చలన సంబంధ, బధిర విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థినులను ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ ఏడీ శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి గృహంలో 50 మంది విభిన్న ప్రతిభావంతులైన బాలికలు చేరేందుకు అవకాశం ఉందన్నారు. 1వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యూయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత భోజనం, వసతితో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, సంవత్సరానికి నాలుగు జతలు యూనిఫామ్స్, కాస్మోటిక్ చార్జీలకు గానూ ప్రతినెల రూ.250లు అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న, ఉపాధి శిక్షణ పొందుతున్న విభిన్న ప్రతిభావంతులైన బాలికలకు సైతం శిక్షణ కాలములో వసతి గృహంలో వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వసతి గృహంలో చేరే విద్యార్థినుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలని, వికలాంగత్వం 40 శాతం కానీ అంతకంటే ఎక్కువ గానీ ఉండాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రం(ఓసీలకు అవసరం లేదు) ఉండాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 08942–240519, 99519 71764, 80747 77210 నంబర్లను సంప్రందించాలని సూచించారు. అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం టెక్కలి: అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక పట్టుమహదేవి కోనేరు గట్టుపై ఆలయం అభివృద్ధి పనులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అన్న క్యాంటిన్ను ప్రారంభించారు. అలాగే స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అంతకుముందు కోటబొమ్మాళిలో పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఆయనతో పాటు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్ బి.శేషగిరి, నాయకులు కె.హరివరప్రసాద్, వి.విజయలక్ష్మి, ఎం.సుందరమ్మ, ఎం.దమయంతి తదితరులు ఉన్నారు. గాయత్రీలో మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ శ్రీకాకుళం రూరల్: గాయత్రీ కాలేజ్ ఆఫ్ సైన్సు అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో డిగ్రీ ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల కోసం 2026–27 విద్యా సంవత్సరం నుంచి మెరిట్స్కాలర్ షిప్ ఇవ్వనున్నట్లు గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడు బుధవారం తెలిపారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ 100 మందిలో ఉత్తమ మార్కులు సాధించిన 5 మందికి రూ.25 వేల ప్రతిభా పురస్కారం అందజేస్తామన్నారు. ఈ పరీక్ష అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ స్టడీస్ వంటి అంశాలపై ఉంటుందన్నారు. పరీక్ష కోసం ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. మరిన్ని వివరాలకు 94403 95109 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఆయనతో పాటు కరస్పాండెంట్ రంగారావు, ప్రిన్సిపాల్ కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్స్టేషన్ పరిశీలన
జి.సిగడాం: స్థానిక పోలీస్స్టేషన్ను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. దీనిలో భాగంగా సిబ్బంది పనితీరు, స్టేషన్ నిర్వహణపై ఆరా తీశారు. గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పోలీసులు పక్కాగా గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో తగాదాలు సృష్టించేవారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. ఆయనతో పాటు శ్రీకాకుళం డీఎస్సీ వివేకానంద, జేఆర్పురం సీఐ అవతారం, ఎస్ఐ సందీప్కుమార్లు ఉన్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు హిరమండలం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలానికి చెందిన మీసాల రజిని, ష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా సొర్లంగి గ్రామానికి చెందిన వంగపల్లి లక్ష్మినారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. లక్ష్మినారాయణమీసాల రజిని -
రథయాత్రకు ముందే పనులు పూర్తవ్వాలి
భువనేశ్వర్: రథయాత్రకు ముందే పూరీ రైల్వే స్టేషన్లో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయడంపై తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ పనుల పురోగతిని నిశితంగా పర్యవేక్షించి రథయాత్రకు చాలా ముందుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. యాత్రికుల సురక్షిత, సులభ, సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలుగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఉద్ఘాటించారు. రాబోయే రథయాత్రను దృష్టిలో ఉంచుకుని తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజరు ఖుర్దా రోడ్, పూరీ సెక్షన్ను బుధవారం తనిఖీ చేశారు. అనంతరం పూరీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై సమీక్షించారు. జగన్నాథుని రథయాత్ర సమయంలో ఖుర్దారోడ్, పూరీ మార్గంలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని, భక్తుల తాకిడి దృష్ట్యా అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ప్లాట్ఫారాలు, సంచార ప్రాంతాలు, వేచి ఉండే హాళ్ల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు, సులభమైన రాకపోకల వ్యవస్థను సమగ్రంగా మెరుగుపరచాలని పేర్కొన్నారు. రథయాత్ర సమయంలో సమర్థవంతమైన రైళ్ల రవాణా నేపథ్యంలో భద్రత, పారిశుధ్యం, వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి ఉన్నత ప్రామాణికలను పాటించాల్సిన ప్రాముఖ్యతను జనరల్ మేనేజర్ వివరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జోనల్ ప్రధాన అధిపతులు, ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనేజర్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
పూరీలో స్లాట్ దర్శనం!
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరంలో జగన్నాథుని దర్శనానికి సంబంధించి భారీ మార్పు జరిగే అవకాశముంది. స్లాట్ విధానంలో స్వామి దర్శనం కల్పించాలని యోచిస్తున్నారు. గంటల తరబడి బారులు తీరాల్సిన పని లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్విరాజ్ హరిచందన్ తెలిపారు. అతి త్వరలో స్లాట్ బుకింగ్ ద్వారా ఆలయ దర్శన విధానం ప్రారంభం కానుందని, ప్రాథమిక దశలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని చెప్పారు. అనంతరం పూర్తి స్థాయి అమలు, కార్యాచరణ ఖరారు చేస్తామని మంత్రి వివరించారు. ద్వారాల ముంగిట స్కానర్లు.. శ్రీ మందిరం పరిసరాల్లో భద్రతా వ్యవస్థ పటిష్టపరిచే దిశలో పూరీ జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ మందిరం 4 ద్వారాల ముంగిట త్వరలో బ్యాగేజ్ స్కానర్లను ఏర్పాటు చేయనున్నట్లు పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రతీక్ సింగ్ తెలిపారు. ఆలయ ప్రాంగణానికి భద్రత కల్పించేందుకు మరిన్ని సాంకేతిక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జయపురం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం ఎన్నిక జయపురం: జయపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నూతన అధ్యక్షుడిగా సంజయకుమార్ జైన్ ఎన్నికయ్యారు. బి.ప్రభాకర్పై ఒక్క ఓటు ఆధిక్యతతో గెలుపొందారు. బుధవారం చాంబర్ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ ఎన్నికలలో 21 మంది డైరెక్టర్లు ఓటు వేశారు. అధ్యక్షుడిగా సంజయ్కుమార్ జైన్, ఉపాధ్యక్షులుగా సతీష్ పాత్రో, కె.దిలీప్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బి.సతీష్ కుమార్, కోశాధికారిగా సంజయకుమార్ జైన్(బొంబే స్టోర్స్), సహాయ కార్యదర్శులుగా లోకనాథ్ పాత్రో, అంకూర్ సోని, కార్యవర్గ సభ్యులుగా డైరెక్టర్లు ఎ.శ్రీనివాస రావు, వరుణ్ జైన్, బిబుదత్ పాఢీ, సీహెచ్.కిశోర్కుమార్, చందేస్ ఠాకూర్, డి.మాధవ, దినేశ్ శంకరి, గెంబలి వసంతరావు, జి.రామకృష్ణ, కెల్లా ఈశ్వరరావు, మనోజ్ కుమార్ షాహా, నేమాని చైతన్య, సూర్యనారాయణ పట్నాయిక్, వి.ప్రభాకర్ నియమితులయ్యారు. బొగ్గు లారీ బోల్తా రాయగడ: విశాఖపట్నం నుంచి రాయిపూర్ వైపు బొగ్గు లోడుతొ వస్తున్న లారీ సదరు సమితి పత్రాపూర్, తెప్పలరేవు ఘాటీ మలుపులో అదుపుతప్పి బోల్తా పడింది. బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో డ్రైవర్, హెల్పర్లకు గాయాలు తగిలాయి. సమాచారం తెలుసుకున్న శెశిఖాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హెల్పర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. ‘మజ్జిగౌరి’ ప్రాంగణంలో పాలిథిన్ వినియోగంపై ఆంక్షలు రాయగడ: పాలిథిన్ కవర్ల వాడకాలపై పర్యావరణానికి తీరని ముప్పు వాటిళ్లుతున్న నేపథ్యంలో రాయగడలోని మజ్జిగౌరి అమ్మవారి మందిరం ప్రాంగణంలో దీని వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ట్రస్టీ రాయిసింగి బిడిక ఉత్వర్యులు జారీ చేశారు. మందిరం ప్రాంగణంలోని వ్యాపారస్తులు పాలిథిన్ వినియోగించడాన్ని నిషేధిస్తూ ఆదేశాలతో కూడిన సర్క్యులర్ విడుదల చేశారు. పాలిథిన్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈవిధమైన చర్యలు చేపట్టడం జరిగిందని.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అత్యధిక శాతం మంది భక్తులు అమ్మవారి దర్శనార్ధం నిత్యం వస్తుంటారని అందువల్ల వారు ఖరీదు చేసుకునే వస్తువులను పాలిథిన్ కవర్లలో వ్యాపార వర్గాలు అందిస్తుండటం పరిపాటిగా మారిందన్నారు. ఇకదీనికి స్వస్తి పలకాలని సూచించారు. ప్రభుత్వం పేర్కొంటున్న పర్యావరణానికి హాని తలపెట్టని బ్యాగులను వినియోగించాలన్నారు. -
పట్టుబడిన మేకల దొంగలు
మల్కన్గిరి: కలిమెల సమితి ఎం.వి.79 పోలీసుస్టేషన్ పరిధిలో తమానపల్లిలో బుధవారం మేకలు దొంగతనానికి ప్రయత్నించిన నిందితులు గ్రామస్తులకు పట్టుబడ్డారు. నలుగురు వ్యక్తులు మేకలు చోరీ చేస్తుండగా ఎం.వి.113 గ్రామం వద్ద స్థానికులు గుర్తించారు. వెంటనే నిందితులు పిస్టల్తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. వారిలో రాహుల్ శికారి, సుజయ్ మండల్ను వెంబడించి గ్రామస్తులు పట్టుకుని దాడి చేశారు. విషం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరినీ కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సుజయ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బెంగాలీ –ఆదివాసీల మధ్య ఇటీవలే గొడవలు జరిగి ఇప్పుడిప్పుడే శాంతియువత వాతావరణం నెలకొంటోంది. ఈ తరుణంలో రెండు వర్గాలు గొడవకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. -
పల్లె రోడ్లకు మహర్దశ
రాయగడ: పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలని జిల్లా కలక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో బుధవారం నిర్వహించిన 71వ జిల్లా పరిషత్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు ‘మన గ్రామం పథకం’ ద్వారా రహదారు ఏర్పాటు కృషి చేస్తున్నామని అన్నారు. రహదారుల సౌకర్యం కలిగితే అన్ని రంగాల్లో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలు వారి దరికి చేరే విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవని అన్నారు. అందువల్ల ఈ ఏడాది జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్ల సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలను రూపొందించామని అన్నారు. గుణుపూర్ –తెరువలి రైలు మార్గంలో భూసేకరణ జిల్లాలోలి అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న గుణుపూర్–తెరువలి రైలు మార్గం నిర్మాణం పనుల్లో భాగంగా అవసరమయ్యే భూ సేకరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని కలెక్టర్ చెప్పారు. భూ సేకరణ విషయంలో అంతా సహకరించాలని పిలుపునిచ్చారు. బరంపురం, జయపురం, కెరడ రాయగడ రహదారి నిర్మాణం అలాగే రాయగడ బైపాస్ రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తయ్యిందని అన్నారు. జాతీయ రహదారి (ఎన్హెచ్)కి పనుల అప్పగించే విషయంలో చురుకుగా పనులు కొనసాగుతున్నాయని వివరించారు. జిల్లాలోని బిసంకటక్, మునిగుడ బైపాస్ రహదారి నిర్మాణం జరుగుతోందన్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. దాదాపు జిల్లాలో 800 ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు రంగం సిద్ధమయ్యిందని.. ఇందులొ కొన్ని ప్రాజెక్టు పనులు ఇప్పటికే నిర్మాణం పనులు ప్రారంభించాయన్నారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో రాయగడ మాత్రమే ఇన్ని అభివృద్ధి పనులకు సంబంధించి పనులు చేపడుతుండటం గర్వించదగ్గ విషయమని అన్నారు. పర్యాటక రంగానికి పెద్ద పీట జిల్లాలో పర్యాటక స్థలాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయడానికి రంగం సిద్ధమయ్యిందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. కొలనార, రామనగుడ సమితుల్లో ఈ ఏడాది వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో బంతిపూల సాగును ప్రొత్సాహించేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. నాగవళి, వంశధార నదుల నీటిని సద్వినియోగపరుచుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యంగా సాగు నీటి వనరులను ఈ నదుల నుంచి వ్యవసాయానికి సమకూర్చే విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంల్లో పాల్గొన్న రాయగడ ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రక మాట్లాడుతూ.. పీజీటీబీ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. బిసంకటక్ ఎంఎల్ఏ నీలమాధవ హికక మాట్లాడుతూ.. తన నియోజకవర్గం పరిధిలోని జగదల్పూర్లో ఉన్న ఆరోగ్య కేంద్రంలొ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు. జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజినిదేవి మాట్లాడుతూ.. జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తే రోగులకు సరైన వైద్య సౌకర్యాలను అందించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో 459 మంది వైద్యుల పోస్టుల్లో కేవలం 139 మంది మాత్రమే ఉన్నారని వివరించారు. ఖాళీగా ఉన్న 320 వైద్యుల పోస్టులను భర్తీ చేయాల్సిన అవశ్యతకత గురించి ప్రస్తావించారు. అంతకు ముందు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతీ మాఝి మాట్లాడుతూ.. ఆదివాసీ, హరిజన ప్రాంతమైన ఈ జిల్లాలో ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని.. అందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. -
ఉత్సాహం ఉత్సవమై..
జయపురం: జయపురం పట్టణంలో మంగళవారం సాయంత్రం జయపురం హిందూ సమాజ్ వారు నిర్వహించిన బిషువ సంక్రాంతి, హనుమాన్ జయంతి వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. ఈ సందర్భంగా విజయవాడ–రాంచీ 326 జాతీయ కారిడార్ మార్గం జయపురం పవర్ హౌస్ కూడలి నుంచి ధూంధామ్గా ప్రారంభమైన శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. జయపురం హిందూ సమాజ్ కార్యకర్తలు కాషాయ పతాకాలు ఎగురవేస్తూ సందడి చేశారు. పవర్ హౌస్ నుంచి బయలు దేరిన శోభాయాత్ర మెయిన్ రోడ్డు, 26వ జాతీయ రహదారి, పారాబెడ మీదుగా పారాబెడలోని మా ఝంఖడ దేవి మందిరం వరకు సాగింది. ఈ సందర్భంగా రాజుగారి కోట కూడలి వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రంతా పట్టణ ప్రధాన మార్గం భక్త జనంతో పోటెత్తింది. -
ఘనంగా హనుమాన్ జయంతి
రాయగడ: హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలో గల హనుమాన్ మందిరాల్లో భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి మందిరాల్లో విశేష పూజలను నిర్వహించారు. స్థానిక డైయిలీ మార్కెట్లో గల ధ్యానాంజనేయ మందిరంలో హనుమాన్ చాలిసా పఠనం, అభిషేకాలు చేపట్టారు. కిడ్నీ వ్యాధితో విలేకరి మృతి రాయగడ: హిందీ నవభారత్ దిన పత్రికలో పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయుడు కృష్ణకాంత్ జెన్నా (58) సోమవారం రాత్రి స్థానిక ప్రభుత్వ హాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. భార్య రాజేశ్వరి, కూమార్తె స్మృతి ఉన్నారు. జెన్నా మృతదేహానికి జిల్లా సీనియర్ పాత్రికేయులు శివాజీ దాస్, అమూల్య కుమార్ సాహు, త్రినాథ్ ఖడండ, తదితరులు మంగళవారం శ్రద్ధాంజలి ఘటించి, సంతాపాన్ని ప్రకటించారు. 2,010 కేజీల గంజాయి స్వాధీనంపర్లాకిమిడి: భీమన్పూర్ గ్రామంలోని అడవుల్లో రవాణాకు సిద్ధంగా ఉంచిన 67 ప్లాస్టిక్ సంచుల్లో ఉన్న గంజాయి బస్తాలను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఆర్.ఉదయగిరి పోలీసు ష్టేషన్ పరిధిలో సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు నేతృత్వంలో దాడులు చేపట్టారు. సంచులను తూకం వేయగా 2010 కిలోలు ఉన్నట్టు నిర్ధారించారు. గంజాయి రవాణా చేసే నిందితులు ఎవ్వరూ పట్టుబడలేదని ఎస్డీపీఓ రాకేష్ కుమార్ సాహు తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసును నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం జి.సిగడాం : గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని ఎచ్చెర్ల ఐసీడీఎస్ సూపర్వైజర్ తమ్మినేని లక్ష్మి అన్నారు. మంగళవారం జి.సిగడాం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలతో పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించారు. పౌష్టికాహారం, వ్యాక్సిన్ల ఆవశ్యకతను వివరించారు. అనంతరం పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త మహాదాస్యం రాధిక తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా అభయ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవం
జయపురం: జయపురం దైనిక బజారులో వేంచేసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. చైత్రమాస బహుళ ద్వాదశి మంగళవారం ఆంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి పూజలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. జయపురం చిరంజీవి కల్చరల్ అసోసియేషన్, డైలీ మార్కెట్ మర్చంట్స్ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహించిన స్వామి వారి బ్రహ్మోత్సవాలు విఘ్నేశ్వర పూజతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమమంలో పంచామృతాభిషేకం, తమలపాకులతో పూజలు, సింధూరార్చన మొదలగు పూజలు జరిగాయి.ఈ సందర్బంగా శ్రీవల్లీదేవసేన సమేత సుభ్రమణ్య స్వామి వారా కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు.ఈ కార్యక్రమాలు పూజలు ఆలయ అర్చకులు ముకావిల్లి సంతోష్ కుమార్ శర్మ గారి బ్రహ్మత్వంలో శ్రీకాకుళం వాస్తవ్యులు విద్యాపాసకులు నేతేటి నాగేంధ్ర శర్మ గారి నేతృత్వంలో బైదిక పద్దతిలో నిర్వహించారు.శ్రీఅభయాంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాలను చిరంజీవి కల్చరల్ అషోషియేషన్ , డైలీ మార్కెట్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యకర్తలు పర్యవేక్షించారు. -
బలానికి మూలం: గవర్నర్
వైవిధ్యం భారత దేశభువనేశ్వర్: పండుగలను కలిసి మెలిసి జరుపుకోవడం జాతీయ ఐక్యతకు ప్రతీక అని, ఈ సమైక్యతా భావం భారత దేశ వైవిధ్య సంప్రదాయానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. లోక్ భవన్ ప్రాంగణం న్యూ అభిషేక్ హాల్లో మంగళ వారం హిమాచల్ ప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం, ఒడియా నూతన సంవత్సరం (పొణా సంక్రాంతి)తో పాటు బిహు (అస్సాం), విషు (కేరళ), పుత్తాండు (తమిళనాడు), పోయిలా బోయిషాఖ్ (పశ్చిమ బెంగాల్), బైసాఖీ (పంజాబ్) పండుగల సంయుక్త వేడుకలో గవర్నర్ ప్రసంగిస్తు భారత దేశ వైవిధ్యమే బలానికి మూలమని అన్నారు. ఈ సందర్భంగా ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, అస్సోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్ ప్రజలకు వారి వారి పండుగల సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రథమ మహిళ జయశ్రీ కంభంపాటి హాజరయ్యారు. ఈ పండుగలను వేర్వేరు ప్రాంతాలలో జరుపుకున్నప్పటికీ అవి ఆశ, కృతజ్ఞత, పునరుజ్జీవనం అనే ఉమ్మడి సందేశం ప్రసారం చేసి జాతీయ ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. మనం ఒకరి పండుగలను మరొకరు జరుపుకున్నప్పుడు, ఒకే దేశంగా మనల్ని ఏకం చేసే బంధాలను మరింత బలోపేతం చేసుకుంటాము. ఈ ఉమ్మడి స్ఫూర్తి భారత దేశ సారాన్ని ప్రతిబింబిస్తుంది, ఇక్కడి వైవిధ్యం మన సామూహిక గుర్తింపును బలపరిచి కలిసి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తుందన్నారు. పొణా సంక్రాంతి సంప్రదాయ ఒడియా నూతన సంవత్సరానికి నాంది పలుకుతు రాష్ట్ర ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుందని గవర్నర్ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ జగన్నాథ సంస్కృతి మానవాళి సమ్మిళితత్వం, సమానత్వం, భక్తికి నిదర్శనం. సామాజిక సరిహద్దులకు అతీతంగా ప్రజలను ఏక తాటిపైకి తీసుకువచ్చి విశ్వ సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. ప్రముఖ సాహితీవేత్త, గీత రచయిత, విరామ ఐఏఎస్ అధికారి దేవదాస్ ఛోట్రాయ్ ఈ సభను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల విభిన్న సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు కను విందు చేశాయి.కేరళ ప్రాంతీయ కథకలి నృత్య భంగిమలో కళాకారులు -
సంస్కృతిని కాపాడండి
పర్లాకిమిడి: ఒడియా కొత్త సంవంత్సరాది సందర్భంగా మన కళ, సంస్కృతి, పరంపర ఎప్పుడూ కాపాడుకోవాలని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. స్థానిక బిజూకళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన ఒడియా పక్షోత్సవాలు ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో ఏడీఎం ఫల్గునీ మఝి, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, జిల్లా పరిషత్తు ఆదనపు సీడీవో ఫృథ్వీరాజ్ మండళ్, డీసీపీయూ అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, పురపాలక ఈ.ఓ. లక్ష్మణ ముర్ము, కౌన్సిలర్లు బబునా బెహారా, బాలక్రిష్ణపాత్రో విచ్చేశారు. ఈ సందర్భంగా ఒడిస్సీ, జానపద, ఆధునిక నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. కళాకారులందరకీ మెమెంటోలు, ప్రశంసాపత్రాలతో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి చేతులమీదుగా బహుమతి ప్రదానం చేశారు. -
వేసవి తాపం ఉపశమనం
కొత్త సంవత్సరం నుంచి వేసవి తాపం ఊపందుకుంటుంది. ఈ వాతావరణంలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతు వడ దెబ్బ తాకిడికి దూరంగా ఉండేందుకు సంకేతంగా పానంకం ఇష్ట దైవానికి నివేదించడంతో బంధు మిత్రులకు ఇచ్చిపుచ్చుకోవడం, ఎక్కడికక్కడ చలి వేంద్రాలు ఏర్పాటు చేసి లాంచనంగా పాణకం వితరణ చేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ రోజున, వేసవి ప్రారంభానికి గుర్తుగా దేవతలకు పాణాను సమర్పిస్తారు. శరీరానికి చలువ చేకూర్చి ఆరోగ్యానికి అనుకూలించే మారేడు పండు (బెల్ల), కొబ్బరి, బెల్లం, పెరుగు, అరటి పండ్లు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతో రుచికరమైన పాణకం తయారు చేసి ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ చల్లని పానీయం వేసవి వేడి నుండి శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. -
కొత్త వసంతం
భువనేశ్వర్: అనేక సామాజిక, మానవాళి హిత కార్యక్రమాలతో ఇమిడి ఉన్న ఒడియా కొత్త సంవత్సరం మంగళ వారం నుంచి ప్రారంభమైంది. మహా బిషుభ్ సంక్రాంతి లేదా పొణా సంక్రాంతి పేరుతో కొత్త సంవత్సరాదిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వేకువ జాము నుంచి ప్రతి ఇంటా ప్రత్యేక పూజల వాతావరణం అలముకుంది. ప్రతి ముంగిట పూర్ణ కలశం ముగ్గు అలంకరణతో శాస్త్రోక్తంగా నింపిన కలశం ఇంటి ప్రవేశం ప్రధాన ద్వారం ముంగిట అమర్చి కొత్త సంవత్సరానికి సంప్రదాయబద్ధంగా ఇంటింటా స్వాగతం పలికారు. ఈ రోజున సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించడంతో రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. సూర్యుడు భూమధ్యరేఖపై ఉండటం వల్ల పగలు మరియు రాత్రి సమయం దాదాపు సమానంగా ఉంటుంది. ఈ సమయం నుండే వేసవి కాలం తీవ్రత పెరుగుతుంది. శ్రీ జగన్నాథుని సన్నిధిలో కొత్త క్యాలెండరు పూరీ శ్రీ మందిరంలో రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ జగన్నాథుని సన్నిధిలో ఏడాది కొత్త క్యాలెండర్ను ఆవిష్కరించడం ఆచారం. డోల పౌర్ణమి నాడు డోల గోవిందునికి సమర్పించిన క్యాలెండర్ను మహా బిషుభ్ సంక్రాంతి నాడు శ్రీ జగన్నాథుని సన్నిధిలో ఆచరణకు శ్రీకారం చుట్టడంతో కొత్త సంవత్సరం ఆరంభం అయినట్లు పరిగణిస్తారు. తరణి మాత బంగారు దర్శనం మహా బిషుభ్ సంక్రాంతి పురస్కరించుకుని ఘొటొగాంవ్ అధిష్టాన దేవత తరణి మాత స్వర్ణ అలంకరణతో శోభిల్లడం విశేషం. ఈ సందర్భంగా ఈ క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. హనుమాన్ జయంతి కొత్త సంవత్సరం ఆరంభం రోజున హనుమాన్ జయంతి వేడుకలు ఆధ్యాత్మిక, ధార్మిక వాతావరణం ఆవిష్కరించడం విశేషం. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆంజనేయ స్వామి పూజల సందడి కనిపించింది. ఈ పూజా ప్రాంగణాల్లో పాణకం వితరణ ప్రత్యేక ఏర్పాటుగా కొనసాగుతుంది. -
అందరూ చూస్తుండగానే..
మల్కన్గిరి: భక్తులంతా చూస్తుంగానే ఈత చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి నలగుంధి పంచాయతీ ఎంవీ–72 గ్రామంలో మంగళవారం చోటుచేసుకోగా.. జగదీష్ సనా (35) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బెంగాళీ సంప్రదాయ పూజల్లో భాగంగా చఢక్ పూజాను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈత చెట్టు ఎక్కి పళ్లను కోయాలి. దీంతో జగదీష్ సనా ఈత చెట్టు ఎక్కుతుండగా శక్తిని కోల్పోయి 20 అడుగుల పైనుంచి కిందకు పడిపోయాడు. అక్కడ ఉన్నవారంతా వెంటనే కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చఢక్ పూజను నిలిపివేశారు. జగదీష్ సనా ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. విషయం తెలుసుకున్న కలిమెల పోలీసులు ఆరోగ్య కేంద్రానికి చేరుకొని కేసు నమోదు చేశారు. జగదీష్ సనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు కలిమెల ఐఐసీ ప్రభుదత్త విశ్వల్ తెలిపారు. ఈత చెట్టు పైనుంచి పడిపోతున్న జగదీష్ సనా -
హైటెక్ ఆరోగ్య సేవల్లో మరో ముందడుగు
భువనేశ్వర్: ఆరోగ్య సంరక్షణ రంగంలో హై టెక్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. హైటెక్ వైద్య బోధన ఆస్పత్రి ప్రాంగణంలో 13 కె.ఎల్. ద్రవ వైద్య ఆక్సిజన్ ప్లాంట్ను మంగళ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ముఖ్య అతిథిగా హాజరై ప్లాంట్ను ప్రారంభించారు. హై టెక్ గ్రూప్ మేనేజింగ్ ట్రస్టీ మరియు సీఈఓ సురేష్ కుమార్ పాణిగ్రాహి, మరియు ట్రస్టీ డాక్టర్ రాకేష్ కుమార్ పాణిగ్రాహి గౌరవ అతిథులుగా హాజరు అయ్యారు. రోగులకు నిరంతరాయంగా అధిక నాణ్యత గల ఆక్సిజన్ సేవలను అందించడమే ఈ కొత్త ఆక్సిజన్ ప్లాంట్ యొక్క ప్రధాన లక్ష్యమని డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు సకాలంలో ఆక్సిజన్ను అందుతుందని ఆయన అన్నారు. ఇది ముఖ్యంగా అత్యవసర పరిస్థితులలో మెడికల్ కాలేజీ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని మేనేజింగ్ ట్రస్టీ సురేష్ కుమార్ పాణిగ్రాహి తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆసుపత్రి సీఓఓ జ్యోతిమయ్ పండాతో పాటు పలువురు సీనియర్ వైద్యులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు హాజరు అయ్యారు. -
ఉత్సాహంగా హనుమాన్ జయంతి
పర్లాకిమిడి: హనుమాన్ జయంతి, ఒడియా నూతన సంవత్సర వేడుకలను పర్లాకిమిడిలో మంగళవారం ఉత్సాహంగా జరుపుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక గుండిచామందిరం వద్ద ఉన్న ఆంజనేయ మందిరంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి హనుమాన్ చాలీసా చదివారు. అలాగే కంజావీధి, కేవుటివీధి, ఉప్పరవీధి, రైల్వేస్టేషన్, కొత్త బస్టాండ్ హనుమాన్ మందిరాల వద్ద ప్రత్యేక పూజలు చేసి భక్తులకు పానకాన్ని పంచిపెట్టారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. రాజవీధిలోని జగన్నాథ మందిరం ఆవరణలో సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు బాటసారులకు పానకం పంపిణీ చేసి భక్తిని చాటుకున్నారు. -
సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం
● ● జిల్లా ప్లానింగ్ బోర్డు చైర్మన్గా మంత్రి గొండొ బాధ్యతల స్వీకరణరాయగడ: జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అందరూ సహకరించాలని, అధికారులు సమన్వయంతో వ్యహరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండొ అన్నారు. మంగళవారం రాయగడలో పర్యటించారు. స్థానిక కలెక్టర్ సమావేశం హాల్లో ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రణాళిక మండలి (ప్లానింగ్ బోర్డు) చైర్మన్గా బాధ్యతలను చేపట్టారు. మంత్రికి జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఇటీవల నియమితులైన ఎస్డీసీ చైర్మన్ బిద్యాధర్ సబర్, వైస్ చైర్పర్సన్ మంజుల మినియాకను కలెక్టర్ అభినందించారు. అనంతరం అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. జిల్లాలో అన్ని ప్రధాన అభివృద్ధి పనులు నాణ్యతగా పూర్తిచేయాలంటే అందుకు అన్ని శాఖలకు చెందిన అధికారుల మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారు. వ్యవసాయం, నీటి సరఫరా, విద్య, ఆరోగ్యం, గ్రామీణ రహదారులు వంటి జీవనోపాధి ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ చేరాలంటే క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు బలోపేతం చేయడం ఎంతో అవసరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఎన్నో పఽథకాలు ప్రజలు సద్వినియోగపరుచుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం, అదేవిధంగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నా అందుకు సంబంధించిన డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం చేయాలన్నారు. లేదంటే పనులు ప్రారంభించినా అవి అసంపూర్తిగానే మిగిలిపోవడంతో ఇటు ప్రభుత్వ నిధులు దుర్వినియెగమవ్వడంతోపాటు ఆయా పథకాల వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరదన్నారు. జిల్లాలో చేపడుతున్న, అదేవిధంగా చేపట్టిన ప్రతీ అభివృద్థి కార్యక్రమానికి సంబంధించి సంబఽంధిత శాఖ అధికారులు పరిశీలించడంతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలన్నారు. -
అంబేడ్కర్ జయంతి
బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఘనంగా.. శ్రీ జగన్నాథునికి కొత్త రత్న శోభిత మంచం భువనేశ్వర్: ఒడియా నూతన సంవత్సరం పురస్కరించుకుని పూరీ శ్రీ మందిరంలో శ్రీ జగన్నాథుని సమేత సోదర సోదరీ బలభద్రుడు, దేవీ సుభద్ర కోసం రత్నాలతో అలంకరించిన కొత్త మంచాలు సిద్ధం చేశారు. వీటిని దేవతల విరామ సేవలో వినియోగిస్తారు. ఇప్పటి వరకు వినియోగించిన పాత మంచాలు తొలగించారు. అంత కంటే ముందు ఆలయ సంప్రదాయాల ప్రకారం కొత్త మంచాలకు శుద్ధీకరణతో లాంఛనంగా ప్రతిష్టించారు. కొత్తగా సిద్ధం చేసిన 3 మంచాలకు వెండి తాపడంతో రత్నాలతో అలంకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పాత రత్నాల మంచాలను శ్రీ మందిరం ప్రాంగణంలో నీలాద్రి మ్యూజియంలో భద్రంగా ప్రదర్శించాలని యోచిస్తున్నారు. వాటిని ఎక్కడ ఉంచాలనే విషయంపై ఆలయ పాలక మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని శ్రీ జగన్నాథ ఆలయం ముఖ్య నిర్వాహకుడు సీఏఓ డాక్టర్ అరవింద కుమార్ పాఢి తెలిపారు. రక్తదాన శిబిరం జయపురం: కొరాపుట్ జిల్లా ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సమైక్య మంచ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా జయపురం జిల్లా కేంద్రాస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించింది. కార్యక్రమంలో నవరంగపూర్ జిల్లా పరిషత్ మాజీ సభ్యులు లలిత మోహణ నాయిక్ ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 55 యూనిట్ల రక్తం సేకరించారు. సమానత్వ మార్గదర్శి అంబేడ్కర్ భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ప్రథమ మహిళ జయశ్రీ కంభంపాటితో కలిసి భారత రత్న బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి పుష్పాంజలి ఘటించారు. డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా న్యాయం, సమానత్వం, మానవ గౌరవం వంటి ఆదర్శాలకు తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికుడిగా పేరొందారని తెలిపారు. సమ్మిళిత, సమానత్వ సమాజం దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణానికి డాక్టర్ అంబేడ్కర్ వారసత్వం మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 22 కిలోల గంజాయి స్వాధీనం రాయగడ: పుల్బాణి నుంచి ఆంధ్రప్రదేశ్కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని మునిగుడ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన యనామాల్ దినేస్గా గుర్తించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధి దేవకుపిలి కూడలిలో వాహనాల తనిఖీలను సోమవారం నిర్వహించారు. బలిగుడ నుంచి గంజాయి పట్టుకుని యనమాల్ దినేస్ వాహనంలో తీసుకువస్తుండగా పట్టుబడ్డాడు. నిందితుని నుంచి గంజాయితో పాటు ఒక మోబైల్ ఫొన్, 1170 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. జయపురం : బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా జయపురంలో సబ్డివిజనల్ సమాచార ప్రజా సంబంధాల అధికారి యశోద గదబ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయపురం బీజేడీ పార్టీ శ్రేణులు డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించాయి. కొరాపుట్ జిల్లా బీజేడీ కార్యనిర్వాహక అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ మిశ్రా, సీనియర్ బీజేడీ నేత, ఆ పార్టీ కార్మిక విభాగ అద్యక్షులు బాలా రాయ్, జయపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సూర్యనారాయణ రథ్(మున్నా రథ్)నేతృత్వంలో అనేకమంది పార్టీ కార్యకర్తలు అంబేడ్కర్కు నివాళులు అర్పించారు. జయపురంలో.. జయపురం : అంబేడ్కర్ 135 వ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా కాంగ్రెస్ భవనంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తురుక్ ప్రసంగిస్తూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయన పాత్ర కీలకమన్నారు. రాయగడలో.. రాయగడ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ 136 వ జయంతి ఉత్సవాలు పట్టణంలో ఘనంగా జరిగాయి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, కొరాపుట్ లొక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, జిల్లా అదనపు కలక్టర్ నిహారి రంజన్ కుహోరొ , ఎడిఎం నవీన్ చంద్ర నాయక్, ఐటీడీఏఏ ప్రాజెక్టు అధికారి చంద్రకాంత్ మఝి తదితరులు పాల్గొని పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అదేవిధంగా డొంబ్ సమాజానికి చెందిన ప్రతినిధులు అంబేడ్కర్ జయంతిని పురష్కరించుకుని నివాళులు అర్పించారు. పర్లాకిమిడి: బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకలు పర్లాకిమిడిలో జిల్లా అధికార యంత్రాంగం తరఫున ఘనంగా నిర్వహించారు. తొలుత కొత్త బస్టాండు వద్ద అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ పూలదండలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకు ముందు భీంరావ్ నినాదాలతో కొత్త బస్టాండ్ వరకూ పురపాలక సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిపారు. అనంతరం ఆదనపు జిల్లా మేజిస్టేట్ మునీంద్ర హానగ, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, పురపాలక సంఘం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లక్ష్మణ ముర్ము, గుసాని మాజీ చైర్మన్ భారతమ్మ, జైభీమ్ సంఘం అధ్యక్షులు పాపారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అంబేద్కర్ జయంతి సందర్భంగా హైస్కూల్ జంక్షన్ నుంచి స్వయంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. -
వసుంధర ఉట్టె
ఒడియా కొత్త సంవత్సరాదిలో మరో ప్రత్యేక ఆచారం వసుంధర ఉట్టె. వేసవి తాపం నుంచి పుడమి తల్లికి నిరంతరం చెమ్మ పర్యావరణం కల్పించడం ఈ ఆచారం ఆంతర్యంగా స్పష్టం అవుతుంది. ఈ ఆచారంలో చిన్న రంధ్రం కలిగిన మట్టి పాత్రంలో నీరు నింపి పవిత్ర తులసి మొక్క పైభాగంలో ఉట్టెని ఏర్పాటు చేసి అమర్చుతారు. తొలుత సంప్రదాయ రీతిలో తయారు చేసిన పానకం పోసి నీటితో నింపుతారు. ఇంటి ముంగిట అను నిత్యం పూజలందుకునే తులసి మొక్క పైభాగంలో అమర్చిన ఉట్టె నుంచి ఒక్కో బొట్టుగా చల్లని నీరు కారుతు మొక్క అడుగు భాగంలో మట్టిని దీర్ఘకాలం చెమ్మగా పరిరక్షిస్తుంది. ఈ క్రమంలో వేసవి తాపం నుంచి పుడమి తల్లి పరిరక్షణ పచ్చని మొక్క సంరక్షణతో ఆరోగ్యవంతమైన పర్యావరణం ఆవిష్కరణకు దోహదపడుతుందని వర్ధమాన తరాలకు కొత్త సంవత్సరం ఆరంభం వేడుకల్లో భాగంగా పరిచయం చేయడం ఆనవాయితీలో ఇమిడిన అంతరార్థం. తులసి మొక్కపై వసుంధర ఉట్టె -
నేడు రాయగడలో విద్యాశాఖ మంత్రి పర్యటన
రాయగడ: రాయగడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండ మంగళవారం పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలను ఆ శాఖ కార్యాలయం వెల్లడించింది. ఉదయం 8 గంటలకు కొరాపుట్ జిల్లా ఉమ్మర్కొట్ నుంచి బయలుదేరి ఉదయం 11.45 గంటలకు రాయగడలో గల సర్క్యూట్ హౌస్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.25 గంటలకు రాయగడ జిల్లా ప్లానింగ్ కమిటీ చైర్మన్ బాధ్యతలను స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో చేపడతారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమై తిరిగి ఉమ్మర్కొట్కు బయలుదేరుతారు. -
కళ్యాణసింగుపూర్ గ్రీవెన్స్లో 34 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలొని కళ్యాణసింగుపూర్ సమితి కార్యాలయంలో జిల్లా యంత్రాంగం సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 34 వినతులను అధికారులు స్వీకరించారు. వీటిలో 15 వ్యక్తిగతమైన సమస్యలుగా గుర్తించగా మరో 18 గ్రామ సమస్యలుగా పరిగణలొకి తీసుకున్నారు. గ్రామ సమస్యలను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఒకరికి చికిత్స నిమిత్తం రెడ్ క్రాస్ నిధుల నుంచి పది వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి అక్షయ కుమార్ ఖెముండో, ఏఎస్పీ గొసేన్ బర్లా, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజినిదేవి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. పోడియా సమితిలో 84 వినతులు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియా సమితి నీలిగూడ పంచాయతీలో జిల్లా కలెక్టర్ ప్రధామేశ్ అర్వింద్ రాజశిర్కే ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో 84 వినతులు స్వీకరించారు . వాటిలో 38 వ్యక్తిగత సమస్యలు కాగా.. 46 గ్రామీణ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, భూమి పట్టాలు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు మంజూరు చేయాలని, ఆర్థికసాయం ఇవ్వాలని వినతులు అందించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, రహదారుల వంటి మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరథి సరాబు, జిల్లా వైధ్యాధికారి డోళామణీ ప్రధాన్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ప్రముఖులకు నివాళి
జయపురం: ఒడిశా పక్ష వేడుకల స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో మహానుభావులకు నివాళి కార్యక్రమం నిర్వహించింది. విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమమానికి ఆ విభాగ అధిపతి డాక్టర్ రుషబ్ కుమార్ సాహు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో డాక్టర్ అరుణ కుమార్ రాజ్ స్వాతంత్ర పోరాటంలో సహిద్ లక్ష్మణ నాయిక్ నిర్వహించిన భూమికను వివరించి నివాళులు అర్పించారు. కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో స్వామి వివేకానంద చరిత్ర ను వివరించారు. అలాగే చరిత్ర విభాగ అధికారి రుష్భ్ కుమార్ సాహు ఉత్కళ గౌరవ మధుసూదన దాస్ ప్రత్యేక ఉత్కళ రాష్ట్ర కొరకు సాగించిన ఉద్యమంలో నిర్వహించిన భూమికపై ప్రసంగించారు. డాక్టర్ అనూరాధ పాల్ రమాదేవి రాష్ట్రానికి అందించిన సేవలను, డాక్టర్ మీనతి నాయిక్ రాజర్షి విక్రమదేవ్ వర్మ విద్యా, భాషా ప్రగతికి అందించిన సేవలను విపులీకరించారు. డాక్టర్ హృశికేష్ బెహర గోపబందు దాస్ చరిత్ర పైన, డాక్టర్ లలితేందు లెంకా స్వాతంత్య్ర యోధుడు బాజీ రౌత్ పైన, ప్రియరంజన్ సాహు మహారాజ కృష్ణ చంద్ర గజపతి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నిర్వహించిన పాత్ర పైన ప్రసంగించారు. అదేవిధంగా కిశోర్ గురు ఉద్యమ కారుడు వీర సురేంద్ర సాయి పై ప్రసంగించగా ఇతర అధ్యాపకులు ప్రసంగిస్తూ ఆ మహానుభావుల జీవితాలు, వారి సిద్ధాంతాలు, సమాజానికి చేసిన అమూల్యమైన సేవలను విస్తృతంగా వివరించారు. వారి ఆదర్శాలు విలువలు, దేశ భక్తి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆధునిక కాలంలో ఆ మహానీయుల త్యాగాలను విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకురాలు సుకాంతి సోయ్ ఒడియా పక్ష ప్రాధాన్యతను వివరించారు -
మన వంటలు.. మన రుచులు..
● ఒడియా పక్షోత్సవాల్లో పిండి వంటలు, ముగ్గుల పోటీలు పర్లాకిమిడి: ఒడియా ‘పక్ష’ వేడుకల్లో భాగంగా సోమవారం స్థానిక బిజూ కల్యాణ మండపంలో పురపాలక పరిధిలో పలు మహిళా స్వయం సహాయక గ్రూపులు ‘మన వంటలు..మన రుచులు’ పేరిట పలు పిండి వంటలు, రంగవళ్లుల పోటీలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఏ.డి.ఎం. ఫల్గుణి మఝి, పురపాలక సంఘం చైర్పర్సన్ నిర్మలా శెఠి, జిల్లా పరిషత్ అదనపు కార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, డీఈఓ డాక్టర్ మయాధర్ సాహు, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ తపస్వినీ బెహరా తదితరులు విచ్చేసి పిండి వంటలను రుచి చూశారు. విజేతలకు మంగళవారం ఒడియా నూతన సంవంత్సరం సందర్భంగా బహుమతులు అందజేస్తామని జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్ తెలిపారు. మల్కన్గిరిలో.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రం ఉన్న సంస్కృతి భవన్ ప్రాంగణంలో సోమవారం మన రుచి–మన తిండి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళాలు వివిధ రకాల సంప్రదాయ ఒడియా వంట కాలను తయారు చేసి ప్రదర్శించారు. ఉత్తమ బృందాలను బహుమతులు ఇచ్చి సత్కరించారు. ఈ కర్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ హాజరయ్యారు. న్యాయనిర్ణేతలుగా జిల్లా ఆహార భద్రత అధికారి ప్రభాస్ సేఠీ, తదితరులు పాల్గొన్నారు. రాయగలో.. రాయగడ: స్థానిక సమితి కార్యాలయంలో సొమవారం నిర్వహించిన మన వంటలు.. మన రుచులు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సమితి పరిధిలో గల వివిధ ప్రాంతాలకు చెందిన స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాగులతో తయారు చేసిన వంటకాలను ప్రదర్శనలో ఉంచారు. ఒడియా భాషకు ప్రాచుర్యం ఉన్నట్టే ఒడియా వంటకాలకు ఎంతో ఆదరణ ఉందని వక్తలు పేర్కొన్నారు. సమితి చైర్మన్ టున్ని హుయిక, వైస్ చైర్మన్ హరప్రసాద్, బీడీఓ సుజిత్ మిశ్రా, ఏబీడీఓ కాలు చరణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. పరేడ్ బృందాల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్య అతిథి సురమా పాఢి -
ప్రజలకు అందుబాటులో రైల్వే సేవలు
ఆమదాలవలస: జిల్లా ప్రజలకు రైల్వే సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం తన వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతికి రైల్వే శాఖ నూతనంగా మంజూరు చేసిన రైలును శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదివరకు జిల్లా ప్రజలు వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడానికి ప్రయాణం చేయాలంటే విశాఖపట్నం లేదా ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణం సాగించేవారన్నారు. కానీ ఇప్పుడు జిల్లా నుంచే వెళ్లే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. త్వరలో శ్రీకాకుళం రోడ్డు నుంచి హైదరాబాద్ వెళ్లడానికి కూడా మరో రైలు ప్రారంభించడానికి ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం లలిత్ బోహారా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల: మండలంలో కుశాలపురం గ్రామానికి సమీపంలోని ఫ్లై ఓవర్పై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం రూరల్ మండలంలోని భైరి గ్రామానికి చెందిన కొంగరాపు రంగయ్య మృతి చెందగా, బూరె లక్ష్మణరావుకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం రూరల్ మండలం భైరి గ్రామానికి చెంది న బూరె లక్ష్మణరావు, కొంగరాపు రంగయ్యలు మేకను అమ్మేందుకు లావేరు మండలంలోని బుడుమూరు సంతకు మోపెడ్పై వెళ్లారు. మేకను సంతలో అమ్మి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వాహ నం నడుపుతున్న లక్ష్మణరావు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న రంగయ్య రోడ్డుపై పడ్డారు. దీంతో రంగయ్య (50) తలకు తీవ్రంగా గాయమై అక్కడికక్కడే మృతి చెందగా, లక్ష్మణరావుకు గాయాలయ్యాయి. 108 సాయంతో వీరిని రిమ్స్కు తరలించారు. రంగయ్య కుమారుడు లక్ష్మీనారాయ ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగయ్యకు భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్లో సోంపేట యువకుడు మృతి సోంపేట: పట్టణానికి చెందిన యువకుడు వికాష్కుమార్ నెపాక్ హైదరాబాద్లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సోంపేటలోని నేతాజీ నగర్లో నివాసముంటున్న ఉపాధ్యాయుడు లింగరాజ్ నెపాక్ కుమారుడు వికాష్కుమార్ నెపాక్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం జరిగిన రహదారి ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. వికాష్ మృతితో నేతాజీ నగర్లో విషాదచాయలు అలముకున్నాయి. కంచిలి: సోంపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ ఆధ్వర్యంలో నాటుసారా రవాణా, అమ్మకాలపై వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి, గత నేర చరిత్ర కలిగిన పులకపుట్టుగ గ్రామానికి చెందిన పులక లక్ష్మణరావు అనే వ్యక్తి నాటుసారా రవాణా చేస్తున్న సమాచారంతో నిఘా పెట్టారు. దీంతో ఆయన ఒడిశా తుటుపురం నుంచి 300 నాటుసారా ప్యాకెట్లను ద్విచక్ర వాహనంపైన రవాణా చేస్తుండగా.. ఆదివారం సంత దగ్గర కాపుకాసి పట్టుకున్నారు. ఇతని నుంచి నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. అదేవిధంగా మఠం సరియాపల్లి గ్రామంలో నాటుసారా అమ్ముతున్న రత్నాల హేమలత, బొండాడ మోహనరావుల నుంచి 100 నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. బొండాడ మోహనరావు, పులక లక్ష్మణరావులు గతంలో పలు కేసుల్లో ముద్దాయిలు. వీరి ముగ్గురినీ సోంపేట కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ జీవీ రమణ తెలిపారు. ఒడిశా నుంచి నాటుసారా రవాణా అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. నాటుసారాపై ఏదైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 14405 లేదా 94409 02358 నంబర్కు తెలియజేయాలని కోరారు. దాడుల్లో ఎస్ఐ జగన్నాథ్, సిబ్బంది భాను ప్రసాద్, ఉమాపతి, మార్కారావు పాల్గొన్నారు. -
రైతులపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది
గార: రైతులపై కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభా గం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీపీ గొండు రఘురా మ్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట, ఎండబెట్టిన పంటలను పలువురు నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలకు మద్దతు ధర దక్కక శ్రమ దోపిడీ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరిపంట వద్దు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని ప్రభుత్వం చెప్పడమే గానీ రైతులను ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్వింటాకు రూ.2,200ల మద్దతు ధర ఇచ్చినట్లు గుర్తు చేశారు. అందువలన రైతులు మొక్కజొ న్న సాగు అధికంగా చేశారన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులకు యూరియా కూడా ఇవ్వలేని పరిస్ధితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని దుయ్యబట్టా రు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచి, మద్దతు ధరకు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. లేదంటే పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ నియోజకవర్గ రైతు విభా గం అధ్యక్షుడు పీస శ్రీహరిరావు మాట్లాడుతూ.. యూరియా కోసం ఆపసోపాలు పడాల్సి వచ్చిందని, ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మూకాళ్ల తాతబాబు మాట్లాడుతూ డీజిల్ ఇంజిన్లు ద్వారా సాగునీరు పెట్టుకోవడంతో మదుపులు పెరిగాయని, మద్ధతు ధర దక్కకపోతే నష్టాల పాలవుతారన్నారు. కార్యక్రమంలో గార, శ్రీకాకుళం మండల రైతు విభాగం అధ్యక్షులు శిమ్మ ధర్మరాజు, బగ్గు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
సమర్థ నాయకురాలు
మంగళవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 భారతీయ మహిళ..భువనేశ్వర్: జాతీయ సమ్మిళిత అభివృద్ధికి మహిళా సాధికారత అత్యవసరమని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. మహిళ గౌరవపూర్వక ఉన్నతీకరణతో సమగ్ర సమాజం గౌరవ ప్రతిష్టలతో ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. నగరంలో నిర్వహించిన నారీ శక్తి–ఒడియా అస్మిత కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగిస్తూ మహిళలు కుటుంబాలకు పునాది అని, విలువలను నేర్పే తొలి గురువులని తెలిపారు. కరుణామయ, ప్రగతిశీల సమాజానికి నిశ్శబ్ద రూపశిల్పులన్నారు. నేటి మహిళలు పరిపాలన, విద్య, ఆరోగ్య సంరక్షణ, విజ్ఞానం, సాంకేతికత, వ్యవస్థాపకత, క్రీడలు, కళలు, సాయుధ దళాలు వంటి విభిన్న రంగాలలో విజయవంతంగా రాణిస్తున్నారని గవర్నర్ అన్నారు. ఆత్మవిశ్వాసం, సామర్థ్యంతో ఆధునిక భారతీయ మహిళ తనంతట తానుగా నాయకురాలుగా వెలుగొందుతుందని అన్నారు. ఆర్థిక, సామాజిక, నిర్ణయ ప్రక్రియలలో మహిళల చురుకై న చొరవ సమ్మిళిత అభివృద్ధిని సాధ్యం చేస్తుందని తెలిపారు. నారీ శక్తి వందన అధినియమ్ ఆమోదం ఒక చారిత్రాత్మక చర్యగా అభివర్ణించారు. ఇది పరిపాలనలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని గవర్నర్ అన్నారు. రాష్ట్ర వారసత్వంలో లోతుగా పాతుకుపోయిన ఒడియా అస్మిత పరిరక్షణ, ప్రోత్సాహంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. అభివృద్ధి చెందుతున్న ఒడిశా నిర్మాణంలో మహిళా నేతృత్వం కీలకమని పేర్కొన్నారు. జీవితంలోని అన్ని రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సన్మాన గ్రహీత మహిళా విజేతలను గవర్నర్ అభినందించారు. -
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!
పర్లాకిమిడి: తీవ్రమైన ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. నాలుగు రోజులుగా పర్లాకిమిడిలో పగటి ఉష్ణోగ్రత్తలు పెరగుతూ వస్తున్నాయి. సోమవారం భానుడు భగభగ మండిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పర్లాకిమిడిలో ఉదయం పూట 34 సెంటిగ్రేడ్ డిగ్రీలు నమోదు అవుతుండగా సాయంత్రం 32 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. పట్టణానికి వివిధ పనులపై వేరే గ్రామాల నుంచి వచ్చే గిరిజనులు, విద్యార్థులు వేసవి తీవ్రతకు డిహైడ్రేషన్కు గురౌతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు ఒంటిపూట పనివేళలు ప్రారంభమయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు మరో ఐదు రోజులు ఉంటాయని ఐఎండీ మాజీ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్ర సాహు (భుభనేశ్వర్) తెలియజేశారు. ఉత్సాహంగా శౌర్య జాగరణ యాత్ర రాయగడ: జిల్లాలోని బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలొ శౌర్య జాగరణ యాత్ర ఉత్సాహంగా జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన యాత్రలో వివిధ పంచాయితీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక జగన్నాథ మందిరం కూడలి నుంచి ప్రారంభమైన యాత్ర పురవీధుల్లో సాగింది. బంగ్లాదేశ్ చొరబాటుదారులను అడ్డుకోవాలని వారంతా నినాదాలు చేశారు. వీరి కారణంగా గోవధ, గోవుల అక్రమ రవాణాలు కొనసాగుతుండటంతొ హిందూ ధర్మానికి తీరని విఘాతం ఏర్పడుతుందని అన్నారు. శ్రీరాముని రథంతో ప్రారంభమైన యాత్ర స్థానిక మెయిన్ బజారులోని శ్రీకృష్ణ మందిరం వరకు వెళ్లి ముగించారు. కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహాంతి, ఉపాధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి కునా రమేష్, గొపి బ్రహ్మ, విజయ్ చౌదరి, బి.రాజేష్, జ్యోతి బెహర తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ‘ఈపీఎఫ్ పెన్షన్దారులపై చిన్నచూపా..?’ జయపురం: ఈపీఎఫ్ పెన్షన్దారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి అన్నారు. నేడు స్థానిక యాదవ భవనంలో కొరాపుట్ జిల్లా ఈపీఎఫ్ పెన్షనర్ల అసోసియేషన్ కార్యదర్వి నళినీ కాంత్ రథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహంతి ప్రసంగిస్తూ ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ దాని మద్దతు పార్టీలు తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంట మహిళకు నెలకు రూ.3000 ఇస్తామని హామీ ఇచ్చాయని, ముప్పై నుంచి నలభై ఏళ్ల పాటు ఉద్యోగాలు చేసి రిటైరైన వారికి రూ.3వేల నుంచి రూ.4వేలు పెన్షన్ ఇవ్వడం చిన్నచూపు కాదా అని ప్రశ్నించారు. ఉద్యోగులు చెల్లించిన డబ్బులు కోట్లలో మూలుగుతున్నా పెన్షన్ ఇచ్చేందుకు ఎందుకు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ఉద్యమాల ద్వారానే పాలకులు దిగి వస్తారని అన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి నళిణీ కాంత రథ్ ప్రసంగిస్తూ గత 2018 నుంచి ఈపీఎఫ్ పెన్షనర్లకు నెలకు డీఏ కలిపి కనీసం రూ.9,000 తోపాటు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరంతర ధర్నా కొన సాగుతున్నప్పటికీ స్పందించడం లేదన్నారు. సమావేశంలో అసోసియేషన్ సలహాదారు సీపీఐ నేత జుదిస్టర్ రౌళోబసంత బెహర, ఉమాకాంత రథ్, రాధాకృష్ణ దాస్, భాస్కర మిశ్ర తదితరులు ప్రసంగించారు. మానవ అస్థిపంజరం లభ్యం భువనేశ్వర్: కటక్, పూరీ ప్రధాన కాలువ రోడ్డు ప్రాంతం షొండొపూర్ గ్రామం సమీపంలో మానవ అస్థిపంజరం లభ్యమైంది. బారంగ్ ఠాణా పోలీసులు మానవ అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ అస్థిపంజరాన్ని గోనె సంచిలో తీసుకువచ్చి కాల్చివేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గొడి సాహి ఔట్ పోస్ట్, బారంగ్ ఠాణా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల ఫలితాలు వెల్లడి
జయపురం: జయపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీన్ డైరెక్టర్ల ఎన్నికలు శనివారం జరిగాయి. పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల అధికారిగా వ్యవహరించిన చార్టెడ్ అకౌంటెంట్ ఎన్.ఆనందరావు పర్యవేక్షణలో చేపట్టి ఫలితాలు వెల్లడించారు. 21 మంది డైరెక్టర్ల పదవులకు 36 మంది పోటీ చేయగా అధిక ఓట్లు పొందిన వారిని విజేతలుగా ప్రకటించారు. సంజయ్ కుమార్ జైన్ అత్యధిక ఓట్టు పొందారు. ఆయనకు 610 ఓట్లు రాగా రెండవ స్థానంలో నేమాని చైతన్య 590 ఓట్లు పొందారు. 583 ఓట్లు సాధించి కె.దిలీప్రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. మిగతా వారిలో సుకరి దినేష్ 576, కె.రామకృష్ణ 557, సతీష్కుమార్ పాత్రో 555, ఎ.శ్రీనివాసరావు 551, వి.ప్రభాకర్ 516, డి.మాధవ్ 494, బి.సతీష్కుమార్ 490, గెంబలి వసంతరావు 475, సంజయకుమార్ జైన్ 470, సీహెచ్ కిశోర్ కుమార్ 462, కెల్ల ఈశ్వరరావు 460, లోకనాథ్పాత్రో 459, అంకుర్ సోని 452, మనోజ్ కుమార్ షాహా 443, బిభుదత్త పాఢీ 404, చంద్రేష్రాథోడ్ 400, వరుణ్ కుమార్ జైన్ 391, సూర్యనారాయణ పట్నాయక్ 384 ఓట్లు పొంది డైరెక్టర్లుగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. -
మహేంద్రగిరిలో మంత్రి బిభూతి పర్యటన
పర్లాకిమిడి: రాష్ట్ర మైనింగ్, రవాణాశాఖ మంత్రి బిభూతి భూషణ్ జెన్నా ఆదివారం రాయఘడ బ్లాక్ మహేంద్రగిరిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి విచ్చేశారు. జూన్ 2 నుంచి మహేంద్రగిరిలో కుంభ మేళా జరుగుతుందని మంత్రి తెలియజేశారు. మహేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గజపతి జిల్లాప్రత్యేక అభివృద్ధి మండలి చైర్పర్సన్ కామదేవ్ బోడోనాయక్, మహేంద్రగిరి పరిరక్షణ మంచ్ అధ్యక్షులు లక్ష్మీబాబా, అంతర్యామి గోమంగో, కాశీనగర్ బ్లాక్ మాజీ సమితి చైర్మన్ ఛిత్రి సింహాద్రి, బీజేపీ యువనాయకుడు కోట్ల యువరాజ్, సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో, తదితరులు పాల్గొన్నారు. -
49 యూనిట్ల రక్తం సేకరణ
జయపురం: జయపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్కేటీ రోడ్డులోని వాసవీ కన్యకా పరమేశ్వరి భవనంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జయపురం ఆర్యవైశ్య సంఘ సభ్యుల సహకారంతో నిర్వహించిన శిబిరంలో 49 యూనిట్ల రక్తం సేకరించారు. రక్తదానం చేయండి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోండి, బ్లడ్ సర్కులేషన్ పెంచుకోండి, కొత్త బ్లడ్ సెల్సు క్రియేట్ చేసుకోండి, క్యాన్సర్ రిస్క్ను తగ్గించుకోండి రక్తదానం చేయండి, ఇతరుల ప్రాణాలు కాపాడండి నినాదాలతో రక్తదాతలను ఉత్సాహపరచారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు జి.వెంకటరావు, కార్యదర్శి సురేష్చంద్ర పాణిగ్రహి పాల్గొన్నారు. జయపురం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవ్వా రామకృష్ణ, రవ్వా నారాయణమూర్తి, గంటి వేంకటేశ్వరరావు, పి.బంగారీరావు రక్తదాతలను ప్రోత్సహించారు. రక్తదాతలకు ప్రశంసా పత్రాలతో పాటు మెమెంటోలను అందజేసి సన్మానించారు. దాతలకు మజ్జిగ, ఫలాలు అందజేశారు. -
గ్రీవెన్స్కు 15 వినతులు
పర్లాకిమిడి: జిల్లాలో కాశీనగర్ పంచాయతీ సమితి కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. కలెక్టర్ అక్షయ్ సునీల్ అగ్రవాల్, అదనపు ఎస్పీ సునీల్ కాంత మహంతి, జిల్లా పరిషత్ అదనపు సీడీఓ పృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్ పండా విచ్చేశారు. 15 వినతులు అందాయి. వీటిలో వ్యక్తిగతం 7, గ్రామ సమస్యలకు సంబంధించినవి 8 ఉన్నాయి. సామాజిక సురక్ష, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం ఆధ్వర్యంలో నలుగురు వృద్ధులకు మధుబాబు పింఛన్ కార్డులను కలెక్టర్ అందజేశారు. కాశీనగర్ సమితి చైర్పర్సన్ బల్ల శాయమ్మ, బీడీఓ. డంభుధర మల్లిక్, తహసీల్దార్ సుధీర్ కుమార్ నందో, తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర విద్యా బోధనపై శిక్షణ
జయపురం: జయపురం బ్లాక్ విద్యా విభాగ పరిధిలోని బరిణిపుట్ ప్రాథమిక పాఠశాలలో బరిణిపుట్ కమ్యూనిటీ సాధన కేంద్రం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సమగ్ర విధ్యాబోధనపై శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు సమగ్ర విద్యా బోధన సామగ్రి తయారు చేయటంపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విద్యాధికారి జ్యోతీ రంజన్ త్రిపాఠీ సమర్ధవంతంగా పాఠ్య బోధన అందించాలనే అంశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమ పరిశీలన అధికారిగా జయపురం బ్లాక్ విద్యా కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శశిభూషణ దాస్ శిక్షణ శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు. శిబిరాన్ని బరిణిపుట్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయులు ప్రఫుల్ల మండల్, సహాయ ఉపాధ్యాయులు గీతా రాణి సాహు, ఆర్.సబిత శిబిరాన్ని పర్యవేక్షించారు. -
విజిలెన్స్ వలలో గుడారి ఫారెస్ట్ రేంజర్
రాయగడ: జిల్లాలోని గుడారి అటవీ శాఖ పరిధిలో రేంజర్గా విధులు నిర్వహిస్తున్న సుకుమార్ దుఖును విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.2.33 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫారెస్ట్ రేంజర్గా గుడారిలో విధులు నిర్వహిస్తున్న సుకుమార్ ఆదివారం ఒక బొలేరొలొ గుడారి నుంచి నవరంగపూర్లొ గల సేనాపతి వీధికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు నవరంగపూర్ జిల్లా పరిధిలోని ఇంద్రావతి బ్రిడ్జిపై అతడిని పట్టుకున్నారు. అనంతరం బొలేరొలో తనిఖీ చేయగా అందులో రూ.2.33 లక్షలు దొరికాయి. ఈ నగదుకు సంబంధించి సరైన సమాధానం చెప్పలేకపోవడంతో రేంజర్ సుకుమార్ ప్రయాణించే బొలేరొతొ సహా అతడిని విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. పారాదీప్లో చేపల మృతి భువనేశ్వర్: పారాదీప్లోని కపిలఝొరొ వాగులో చేపలు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. చేపలు చనిపోయి నీటిపై గుట్టలు గుట్టలుగా తేలుతున్నాయి. దీనికి కారణం అస్పష్టంగా ఉంది. పారిశ్రామిక రసాయనాలు వాగులోకి చేరడం వల్లే చేపలు చనిపోతున్నాయని భావిస్తున్నారు. మల్కన్గిరి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రాజ్వంత్కౌర్ మృతి మల్కన్గిరి: మల్కన్గిరి మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ రాజ్వంత్ కౌర్ ఆదివారం వేకువజామున 4.10 గంటలకు తన నివాసంలో కన్నుమూశారు. ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని మధ్యాహ్నం 2.30 గంటల వరకు దుర్గాగుడి సాహి ప్రాంతంలోని నివాసంలో ఉంచారు. వసతి గృహంలో ఒడియా దివస్ వేడుకలుమల్కనగిరి: ఒడియా పక్షోత్సవ వేడుకలను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతిని ప్రొత్సాహించేందుకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా విద్యాశాఖ అఽధికారి చిత్తరంజన్ పాణిగ్రహి, విద్యాశాఖ తరఫున బూటిగుడలోని నేతాజీ సుభాష్బోస్ వసతి గృహంలో ఒడియా దివస్ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఒడియా పుస్తకాలు, మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లా విద్యా అధికారి మంలతా భొయి, భాగీరధి బెహర హాజరై విద్యార్థులతో కొంతసేపు గడిపి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు కూడా ఒడియా పుస్తకాలు పంపిణీ చేశారు. బుడాగుటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూర్ణ చంద్ర ఖండపాణి, సమగ్ర విక్షా యోజన సమన్వయకర్త విజయలక్ష్మీ చౌదరి పాల్గొన్నారు. -
ఒడియా పక్షోత్సవాలు
సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఉత్సాహంగా..● మహాపురుషులకు వందనాలు కార్యక్రమానికి ప్రముఖులు హాజరులయంలో సంస్కృతం, ఒడియా భాషల్లో పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తిచేశారన్నారు. ఆయన పురుషోత్తమ శ్రీజగన్నాథ గ్రంధాన్ని రాశారని అన్నారు. తదుపరి పర్లాకిమిడి మహారాజా శ్రీక్రిష్ణచంద్రగజపతి నారాయణ దేవ్ ఉత్కళ రాష్ట్ర సాధనకు చేసిన కృషిని మాజీ ఒడియా సాహిత్య అకాడమి సభ్యులు బిచిత్రా నంద బెబర్తా వివరించారు. అలాగే జయపురం మహారాజా విక్రందేవ్ వర్మ, పండిత మధుసూదన్ దాస్, గంగాధర్ మెహార్, చికిటి మహారాజు, గోపబంధుదాస్, మహాపురుషులు స్వతంత్ర ఒడిశా కోసం చేసిన పోరాటాన్ని ప్రస్తావించారు. అనేక మంది ఉపాధ్యాయులు, రచయితలు మాట్లాడారు. వారికి ముఖ్యఅతిథి డీసీవో అర్చనా మంగరాజ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. శుభ్రాంశు పట్నాయక్ సభకు ముఖ్యవక్తగా వ్యవహారించారు.పర్లాకిమిడి: ఒడిశా దివస్ పక్షోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాలులో ‘వందనాలు మహాపురుషులు’కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా. అనేక మంది కవులు, రచయితలు, విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్, రాష్ట్రపతి ఆవార్డు గ్రహీత బినోద్ జెన్నా, బిచిత్రానంద బెబర్తా, పర్యాటక శాఖ మాజీ అధికారి రామచంద్ర హాజరయ్యారు. తొలుత ఒడిశా ప్రత్యేక రాష్ట్రానికి పునాది వేసిన డాక్టర్ సత్యన్నారాయణ రాజగురు చరిత్ర గురించి బినోద్ జెన్నా వివరించారు. శతాబ్ది పురుషుడైన పద్మశ్రీ సత్యన్నారాయణ రాజగురు తండ్రిగారు హారికృష్ణరాజగురు పర్లాకిమిడి మహారాజా క్రిష్ణచంద్రగజపతి నారాయణదేవ్కు గురువుగా విద్యాబుద్ధులు చెప్పేవారని అన్నారు. 1903 ఆగస్టు 19న జన్మించిన సత్యన్నారాయణ రాజగురు 1997లో కేంద్ర సాహిత్య పురస్కారం అందుకున్నారని గుర్తు చేశారు. ఆయనకు తెలుగుతో పాటు ఏడు భాషలపై పట్టుసాధించారన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాబిషుభ సంక్రాంతికి ముహూర్తపు రాట -
సేంద్రియ ఉత్పత్తుల సంత
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక 80 ఫీట్ రోడ్లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో వారాంతపు సేంద్రియ సంత ఆదివారం నిర్వహించారు. సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులను ఒక వేదికపైకి తీసుకొచ్చి, పండించిన పంటలను మధ్యవర్తులు లేకుండా ప్రజలకు అందించడంతో రైతులకు మంచి ఆదాయం, వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుతున్నాయని నిర్వాహకులు అన్నారు. ఈ సంత ప్రతినెలా రెండో ఆదివారం, నాలుగో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు. సంతలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారని, అలాగే వివిధ రకాల విత్తనాలు, పండ్లు, మొక్కలు ప్రజలకు అందుబాటులో ఉంచారన్నారు. -
సమాజ సేవే రోటరీ క్లబ్ ప్రధాన లక్ష్యం
జయపురం: సమాజ సేవే రోటరీ క్లబ్ ప్రధాన లక్ష్యమని రోటరీ డిస్ట్రిక్ట్ 3262 గవర్నర్ రొటేరియన్ మనోజ్ కుమార్ త్రిపాఠీ అన్నారు. శనివారం రాత్రి స్థానిక సిగ్నేచర్ సభా వేదికలో జరిగిని జయపురం రోటరీ క్లబ్ ప్రైడ్ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. జయపురం రోటరీ క్లబ్ ప్రైడ్ అధ్యక్షుడు రబినారాయణ నందో అధ్యక్షతన జరిగిన సమావేశంలో త్రిపాఠీ ప్రసంగించారు. ప్రతీ రొటేరియన్ సమాజంతో ప్రజల జీవనప్రమాణాల మెరుగుకు, ప్రజలకు సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. జయపురం రోటరీ క్లబ్ కార్యదర్శి గతేడాది నిర్వహించిన వివిధ ప్రజా సేవా కార్యక్రమాలను వివరించారు. వివిధ రంగాల్లో సమాజానికి ప్రశంసనీయ సేవలు అందించిన 11 మందిని సన్మానించారు. సంజయ కుమార్ గొలాబ్, శంకర దళపతి, రామకృష్ణ భోల్, రామానుజ బెహరా, అభయ చంద్ర పండా, కృష్ణ కేశవ షొడంగి, ప్రేమలత మహారాణ, సుధీర్ భాగ్, రబి మఝి, విక్రమదేవ్ విశ్వవిద్యాలయ పురుష, మహిళ ఎన్సీసీ కేడర్ విద్యార్థులను సన్మానించారు. 25 ఏళ్లుగా రోటరీ క్లబ్ సభ్యులుగా ఉంటూ సమాజానికి సేవలు అందిస్తున్న 20 మంది సభ్యులను డిస్ట్రిక్ట్ గవర్నర్ రొటేరియన్ మనోజ్ కుమార్ త్రిపాఠీ రోటరీ బ్యాడ్జ్లతో సత్కరించారు. రోటరీ సభ్యులు నారాయణ నిశంకొ, మధుశ్మిత త్రిపాఠీ, వెంకట రాబు, శివాజీ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు
● ప్రశాంతంగా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల ఎన్నికలు ● క్యూ కట్టిన ఓటర్లుజయపురం: జయపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల ఎన్నికల్లో ఆదివారం ఓటర్లు క్యూ కట్టారు. 21 మంది చాంబర్ డైరెక్టర్లను ఎన్నుకునేందుకు ఓటర్లను గుర్తించి ఓటు వేసేందుకు అనుమతించారు. ప్రజాస్వామ్య బద్ధంగా సీక్రెట్ బెలట్ పద్ధతిలో జరిగిన ఎన్నికలకు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఎన్.ఆనందరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్నికలను ఆనందరావు స్వయంగా పర్యవేక్షించారు. స్థానిక నెహ్రూనగర్లో గల చాంబర్ కార్యాలయం ‘వేదిక’లో నిర్వహించిన ఎన్నికల్లో కార్యాలయం బయట అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. 21 మంది డైరెక్టర్ల పదవులకు 36 మంది పోటీ చేశారు. 843 మంది ఓటర్లు ఉంటే 760 మంది ఓటు హక్కును వినియోగించారు. -
● కన్నతల్లే కడతేర్చింది
రాయగడ: నవ మాసాలు మోసి, కని పెంచిన కన్న తల్లే తన పిల్లలను కడ తేర్చింది. అత్యంత కర్కశంగా తన పిల్లలను పదునైన మరణాయుధంతో హతమార్చింది. ఝార్సుగుడ జిల్లా ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో గల తంగరపల్లి ప్రాంతంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఝార్సుగుడ పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఝార్సుగుడ ఆస్పత్రికి తరలించారు. ఝార్సుగుడ ఎస్పీ గుండాల రాఘవేంద్ర ఈ సందర్భంగా హస్పటల్కు వెళ్లి దర్యాప్తు చేశారు. డీఎస్పీ బనిత మాఝి ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం ఆదివారం నాడు జిల్లాలోని ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో గల తంగరపల్లి ప్రాంతంలో నివసిస్తున్న రంజితా ఓరం అనే మహిళ తన పదేళ్ల కొడుకు, ఐదేళ్ల కూతురుని అత్యంత దారుణంగా ఒక పదునైన మరణాయుధంతో హతమార్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. తన భర్త వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమె ఈ దారుణానికి ఆమె ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అదేవిధంగా నిందితురాలి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు సమాచారం. -
సరా గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన
పర్లాకిమిడి: సుప్రీంకోర్టు ఇటీవల నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాశీనగర్ బ్లాక్ వంశధార పరివాహక ప్రాంతం సరా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం కాశీనగర్ బ్లాక్ ముంపు గ్రామాలైన సరా, బడిగాంలు సందర్శించి అక్కడ వంశధార సురక్షామంచ్ సభ్యులతో భేటీ అయ్యారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాట్రగడ వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణం చేపడితే ఒడిశాలోని గజపతి జిల్లా కాశీనగర్ ప్రాంతంలో ఏడు గ్రామాలు ముంపునకు గురవుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై తదుపరి రైతులకు నష్టపరిహారం, ఒడిశా ప్రభుత్వం దీనికి ప్రత్నామ్యాయంగా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని, అలాగే గజపతి జిల్లా కాశీనగర్ రైతుల ప్రయోజనం కోసం, దీనిపై ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అసెంబ్లీలో ఒడిషా డబుల్ ఇంజిన్ సర్కారుపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తానని ఆయన విలేకరులకు తెలియజేశారు. -
విక్రమదేవ్ వర్సిటీ కులపతిగా హృషికేష్ శనాపతి
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ కులపతిగా ప్రొఫెసర్ డాక్టర్ హృషికేష్ శనాపతి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కులపతి ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్రా నూతన కులపతికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతన కులపతి డాక్టర్ హృషికేష్ శనాపతి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ సర్వాంగ ఉన్నతికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించటం తన ప్రధాన లక్ష్యమన్నారు. కొత్త కులపతికి విశ్వ విద్యాలయంలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు కులపతి దేవీ ప్రసాద్ మిశ్రతో పాటు రిజిస్ట్రార్ మహేశ్వర్ చంద్ర నాయక్, యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి రంజన్ కుమార్ ప్రధాన్, పీజీ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత్ కుమార్ పాత్రో, విక్రమదేవ్ కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో, అధ్యాపకులు, ఉద్యోగులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్రాకు ఘనంగా వీడ్కోలు పలికారు. వీడ్కోలు సభకు రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయక్ అధ్యక్షతన జరిగింది. వీడ్కోలు సభలో వర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా సరస్వతి శిశు మందిర్ వార్షికోత్సవం
మల్కనగిరి: పట్టణంలోని శ్రీరామనగర్లోఉన్న సరస్వతి శిశుమందిర్ వార్షికోత్సవాన్ని ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షుడు రవీంద్ర కుమార్ మహారాణ అధ్యక్షత వహించారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారీ తాంగులు ముఖ్యఅతిథిగా, జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజన్ పాణిగ్రహి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు నీలమణి ప్రధాన్ ముఖ్యవక్తగా ప్రసంగించారు. ఘడాయి కాలేజీ నిర్వహణ డైరెక్టర్ డాక్టర్ సురేష్ చంద్ర ఘడాయి, విద్యుత్ శాఖ కార్యనిర్వాహక అధికారి ఆశీస్ కుమార్ జెన, విద్యా వికాస సమితి దక్షిణ విభాగ పరిశీలకుడు సుకాంత్ కుమార్ బెహర గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో అతథులను సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. అనంతరం భారత మాతకు దీప ప్రజ్వలన చేసి వందన కార్యక్రమంతో సభను ప్రారంభించారు. పదో తరగతి విద్యార్థినులు ప్రారంభ గీతాన్ని ఆలపించారు. పాఠశాల ప్రధానాచార్యులు సరోజ్ కుమార్ సామల్ అతిథులను పరిచయం చేసి స్వాగత ప్రసంగం చేశారు. నిర్వాహణ కమిటీ కార్యదర్శి రమేష్ చంద్రరావత్ పాఠశాల వార్షిక నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ఉత్తమంగా స్థిరపడాలంటే చిన్నప్పటి నుండే క్రమశిక్షణ, సద్గుణాలు అలవర్చుకోవాలని సూచించారు. క్రీడలు, విద్య, వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్యఅతిథి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. పాఠశాల శ్రేయోభిలాషులు బనమాలి పాత్రొ, విప్రమండల్ను సత్కరించారు. శ్రీశయన కులస్తులకు ఎమ్మెల్సీ ఇవ్వాలి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శ్రీశయన కులస్తులకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నూతన కార్యవర్గ నాయకులు కోరారు. నగరంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీశయన సంఘ, జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఆదివారం నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా కోల బలరాం, ప్రధాన కార్యదర్శిగా గురు జగదీష్, కోశాధికారిగా బమ్మిడి రమణ, సంఘ జిల్లా అధ్యక్షుడిగా కై బాడి రాజు, ప్రధాన కార్యదర్శిగా దండాసి జ్యోతి భాస్కర్, కోశాధికారిగా బంటుపల్లి కోటేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు డీపీ దేవ్, కేంద్ర సంఘ అధ్యక్షుడు వంగా మహేష్దేవ్, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు కోల బలరాం తదితరులు మాట్లాడుతూ.. జిల్లాలోని కల్లుగీత కార్మికులకు తాటిచెట్లు పెంచుకోవడానికి అసైన్డ్ ల్యాండ్ ఇవ్వాలని కోరారు. శ్రీశయన కులస్తులను ఎంబీసీ మోస్ట్ బ్యాక్వార్డ్ క్లాస్ జాబితాలో చేర్చాలని, ప్రతి జిల్లాలో ఒక సామాజిక భవనం నిర్మాణానికి స్థలాలు మంజూరు చేయాలన్నారు. శ్రీశయన కార్పొరేషన్ సభ్యుల నియామకం ప్రభుత్వం వెంటనే జరపాలని కోరారు. కార్యక్రమంలో సంఘ పూర్వపు అధ్యక్షులు మెండలాల్ బహదూర్ శాస్త్రి, మండల మన్మథరావు, గుజ్జల శాంతిశ్వరరావు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాణాల కృష్ణారావు, విశాఖపట్నం అధ్యక్షుడు పెంట వెంకట్రావు, తోట వాసుదేవరావు, కేంద్ర శ్రీశయన సంఘ గౌరవ అధ్యక్షుడు దేవాడ మోహనరావు, కార్యదర్శి బైరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గడ్డిమందు తాగి వృద్ధుడు మృతి బూర్జ: మండలంలోని బూర్జ గ్రామానికి చెందిన చుక్కర తౌవుడు(70) గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు చుక్కర తౌవుడు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని, రెండు ఎకరాల్లో వరిపంట, మరో రెండు ఎకరాల్లో అరటి పంటలు వేశాడు. ఇటీవల వడగండ్లతో ఆకాల వర్షం పడడంతో అరటి పంట పూర్తిగా నేలమట్టమైంది. వరిపంటకు కూడా తీవ్రనష్టం జరిగింది. దీంతో అప్పులు పాలయ్యానని మనస్థాపం చెందాడు. ఈనెల 10వ తేదీన ఉపాధి హామీ పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెదికారు. సాగు చేసిన పొలం వద్దకు వెళ్లి చూడగా అతడు గడ్డిమందు తాగినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు వెంటనే పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య చుక్కర లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎం.ప్రవల్లిక తెలిపారు. -
వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం
రాయగడ: స్థానిక ఫ్రెండ్స్ ఎంజీఎఫ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్టులో ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ట్రస్టులో ఉంటూ చదువుకుంటున్న నిరుపేద ఆదివాసీ విద్యార్థినులకు దంత వైద్య పరీక్షలు చేశారు. డాక్టర్ రాజేష్కుమార్ పాత్రో, డాక్టర్ భోగి సంతోష్కుమార్, డాక్టర్ భోగి స్వరూపలు విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు టూత్ బ్రష్లు, టూత్ ఫేస్టులు, టంగ్ క్లీనర్లను క్లబ్ సభ్యులు పంపిణీ చేశారు. దంతాల రక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్లబ్ అధ్యక్షులు మోనింగి శ్రీహరి, సాధారణ కార్యదర్శి కింతలి శ్రీధర్, కోశాధికారి లాడి నూకరాజు, సభ్యు లు ఇప్పిలి సన్యాసిరాజులు ట్రస్టు నిర్వహకులకు ధన్యవాదాలు తెలియజేసారు. వైద్య శిబిరాలను తరచూ నిర్వహిస్తామని క్లబ్ సభ్యులు తెలిపారు. -
సెక్యూరిటీ గార్డుకి తుపాకీతో బెదిరింపు
● యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు ● తుపాకీ స్వాధీనంరాయగడ: స్థానిక జిల్లా కేంద్రాస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిపై ఓ యువకుడు తుపాకీ గురిపెట్టి బెదిరించిన ఘటన సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత సెక్యూరిటీ గార్డు పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సదరు పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి జిల్లాలోని కాసీపూర్ సమితి మండిబిసి ప్రాంతానికి చెందిన గొవర్ధన్ నాయక్ కొడుకు ప్రభాత్ నాయక్గా గుర్తించారు. నిందితుడిని ఆదివారం కోర్టుకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శనివారం స్థానిక జిల్లా కేంద్రాస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా నాగ్ కై లాస్, రాజు జకకలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది వచ్చి తమ బంధువులు పైఅంతస్తులో ఉన్నారని.. వారిని చూడాలని సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు. అయితే నిబంధనల ప్రకారం ఒక్కరే లోపలకు వెళ్లే అవకాశం ఉందని.. మిగతా వారిని లోపలకు ప్రవేశించేందుకు అనుమతించనని అభ్యంతరం తెలిపాడు. దీంతో కొపోద్రేక్తుడైన ప్రభాత్ నాయక్ తన వద్ద ఉన్న తుపాకీని బయటకు తీసి లోనికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపొతే కాల్చివేస్తానని బెదిరించి దౌర్జన్యంగా లోనికి వెళ్లాడు. ఈ విషయమై సెక్యూరిటీ గార్డు నాగ్ కై లాస్ సదరు పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. ఆస్పత్రిలని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు ప్రభాత్ నాయక్ను అరెస్టు చేసి అని వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
రక్తదానం.. ప్రాణదానం
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 57 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. యూనివర్సిటీ ఎన్.సి.సి (నేషనల్ క్రెడెట్ క్రాఫ్) క్యాడెట్లు, ఎన్.ఎస్.ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) యూనిట్, వైఆర్సీ(యూత్ రెడ్ క్రాస్) విద్యార్థులు సంయుక్తంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ సీపీజీసీ డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో ముఖ్యఅతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన అవసరాన్ని వివరించారు. సమాజంలో ఏ ఒక్కరూ రక్త లేమి వలన మరణించ కూడదన్నారు. జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్ రక్త భండార్ టెక్నీషియన్లు దాతల నుంచి రక్తం సేకరించారు. కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో, లెఫ్ట్నెంట్ సంతోషి, వైఆర్సీ కోఆర్డినేటర్ డాక్టర్ రుసవ కుమార్ సాహు, తదితరులు పాల్గొన్నారు. -
ఇరాన్పై యుద్ధాన్ని ఆపాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పశ్చిమాసియాలో గత కొద్దిరోజుల నుంచి అమెరికా, ఇజ్రాయిల్లు ఇరాన్పై ఉమ్మడిగా చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని పౌర హక్కుల సంఘం నేతలు కోరారు. ఈ మేరకు ప్రపంచ శాంతిని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పత్రి దానేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జగన్నాథరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నంశెట్టి రాజశేఖర్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిల వినోద్ కుమార్, సీపీఐ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మద్దిల రామారావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ అమ్మన్నాయుడు, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావులు మాట్లాడుతూ.. మానవజాతి మనుగడకు ప్రమాదకరమైనటువంటి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా ఖండించారు. యుద్ధం వల్ల అనేక దేశాలు ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమ యుద్ధాలను సృష్టించి తన ఆయుధ సంపదను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్న అమెరికా కుటీల బుద్ధిని, వ్యాపార విధానాన్ని వ్యతిరేకించారు. చర్చలు ద్వారా రెండు దేశాలు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్వేచ్ఛ మహిళా సంఘం నాయకులు నాగమణి, భానుమతి, నాయకులు గీతారాణి, జోగారావు, దానయ్య, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. -
అందని ప్రసాదం..!
గ్యాస్ ప్రభావం..● అరసవల్లిలో ప్రసాదాలకు గ్యాస్ కష్టాలు ● టోకెన్లతో అన్నప్రసాదాలు అందిస్తున్న వైనం ● సగం మందికే అందుతున్న ప్రసాదాలు ● ఇబ్బందులు పడుతున్న భక్తులు అరసవల్లి: ఎక్కడో అమెరికా–ఇరాన్ దేశాల మధ్య యుద్ధం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో నిత్యాన్న ప్రసాదంపై ప్రభావం చూపించింది. ఇప్పటికే గత నెల రోజులుగా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ దొరక్క చాలా ప్రాంతాల్లో ఇటు వినియోగదారులు.. అటు ఫుడ్ మార్కెట్ వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే ఇంతవరకు లేని సమస్య.. ఇప్పుడిప్పుడే అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి తాకుతోంది. వంట గ్యాస్పై ఆధారపడుతూ రోజూ వందలాది మందికి అన్నప్రసాదాలను అందిస్తున్న ఆలయ వర్గాలకు ఈ గ్యాస్పెద్ద షాకే ఇచ్చింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఇక్కడి అన్నప్రసాదం దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితులు ఎదురయ్యాయి. అలాగే లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీపై కూడా పెద్ద ప్రభావమే చూపుతోంది. అయితే ఫిక్స్డ్గా నంబర్ టోకెన్ల ద్వారా అన్నదాన ప్రసాదాలను అందజేస్తే గ్యాస్ కష్టాల నుంచి కొంతమేరకు గట్టెక్కవచ్చుననే భావనతో ఆలయ అధికారులు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ప్రసాదాలను కూడా ఒక పూట మాత్రమే విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి తాత్కాలిక విధానాలే అని.. గ్యాస్ కష్టాలు తీరిపోతే మళ్లీ అంతా యథావిధిగా జరుగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇదే నిర్థిష్ట టోకెన్ల విధానమే కొనసాగిస్తారనేలా భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఇండెంట్ ఇస్తున్నా.. అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో గ్యాస్ వినియోగం అధికంగానే ఉంటుంది. నిత్యం పులిహోర, లడ్డూ తయారీతో పాటు.. ప్రధానంగా నిత్యాన్నదాన ప్రసాదాల తయారీ కోసం రోజుకు కనీసంగా 10 నుంచి 12 సిలిండర్ల వినియోగం తప్పనిసరి. సరాసరి నెలకు రూ.250 నుంచి 300 వరకు సిలిండర్లు వినియోగమవుతుంటాయి. అయితే ప్రత్యేక అనుమతుల ద్వారా ఆలయంలో భక్తుల అవసరాల నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లకు బదులుగా ఇక్కడ డొమస్టిక్ సిలిండర్లు (ఇంటికి వినియోగిస్తున్నవి) మాత్రమే వినియోగిస్తున్నారు. నిత్యం ఇక్కడ 800 నుంచి 1,000 మంది వరకు అన్నదాన ప్రసాదాలను స్వీకరిస్తుంటారు. అయితే ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా నెలకు 300 వరకు సిలిండర్లు అవసరమంటూ ఇండెంట్ పెట్టినప్పటికీ, సగం మాత్రమే డెలివరీ అవుతున్నాయి. దీంతో ఈ ప్రభావం ఇటు భక్తులకు విక్రయించే ప్రసాదాలపైన, అటు అన్న ప్రసాదాల వంటల తయారీపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రోజుకు 500 మందికే భోజనాలు అరసవల్లి ఆలయంలో ప్రసాదాలుగా లడ్డూ, పులిహోరతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాదాలు స్వీకరించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రాధాన్యమిస్తుంటారు. అయితే గ్యాస్ కొరత కారణంగా ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదాలను లెక్కమీద అందించాలని నిర్ణయించారు. ఆలయంలో దర్శనాలు ముగించుకుని వస్తున్న భక్తులకు ప్రత్యేకంగా ఉచిత అన్నప్రసాదాల టోకెన్లు పేరిట పరిమితంగా ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో గత కొద్ది రోజులుగా సగం మందికే అన్నప్రసాదాలు అందుతున్నాయి. మొన్నటి వరకు రోజుకు వెయ్యిమంది ప్రసాదాలను స్వీకరిస్తే.. నేడు కేవలం 500 మందికే పరిమితం చేశారు. ఆదివారాల్లో అయితే 3 వేల మంది వరకు గతంలో ప్రసాదాలకు వచ్చేవారు. ఇప్పుడు అంతా లెక్క మీద టోకెన్ల పేరుతో 1,200 మంది నుంచి 1,500 మంది వరకు భక్తులకు మాత్రమే అన్నప్రసాదాలను అందిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అదనంగా భోజనాలు పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వందలాది మంది భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాజాగా ఆదివారం అయితే చాలా మందికి భోజనాలు అందని పరిస్థితి కనిపించింది. ఇదేం పద్ధతి..? ఇటీవల ఇంద్ర పుష్కరిణి అభివృద్ధి పనులు కాంట్రాక్టు క్రింద సుమారు 70 మంది వరకు కూలీలు రోజూ ఆలయం వద్ద పనులు చేస్తున్నారు. వీరు కూడా రోజూ ఈ నిత్యాన్నదాన పథకంలో ఉచితంగా భోజనం చేస్తున్నారు. వాస్తవానికి వీరికి సంబంధిత కాంట్రాక్టర్ బిల్లుల రూపంలో భోజనాలు పెట్టించాల్సి ఉంది. అయినప్పటికీ సదరు సబ్ కాంట్రాక్టర్ మాత్రం కూలీలకు ఎంచక్కా ఆలయంలోనే భోజనాలు పెట్టించేస్తున్నాడు. దీంతో దర్శనాలకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదం దొరక్క వెనుదిరుగుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఇతర ప్రాంతాల భక్తులకు అన్నప్రసాదాలు అందడం లేదు.. తక్కువ మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్న దృశ్యం -
తప్పనిసరి పరిస్థితుల్లో తగ్గించాం
గ్యాస్ కొరతతో అన్నదాన ప్రసాదాలను గతంలో లాగా అన్లిమిటెడ్ విధానంలో కాకుండా లిమిటెడ్ విధానంలో టోకెన్ల సంఖ్యలో అందజేస్తున్నాం. అలాగే దర్శనాలకు వచ్చిన భక్తులకు అత్యంత ప్రాధాన్యతగా ఈ ప్రసాదాలను అందించాలని ఆదేశించాం. గ్యాస్ బండలు డెలివరీ తక్కువగా వస్తున్న నేపథ్యంలో రోజుకు సగటున 500 మంది భక్తులకు మాత్రమే అన్నప్రసాదాలను అందించేలా చర్యలు చేపట్టాం. గ్యాస్ కొరత సమస్య ఇంకా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎన్జీ విధానాన్ని అమలు చేసేలా ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – కేఎన్వీడీవీ ప్రసాద్, అరసవల్లి ఆలయ ఈవో ● -
కిరండోల్ రైల్వే మార్గంలో బాలుడి మృతదేహం
కొరాపుట్: కిరండోల్ రైల్వే మార్గంలో బాలుడి మృతదేహం వివాదం రేపింది. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి మీదుగా వెళ్లే విశాఖ పట్నం–కిరండోల్ రైల్వే మార్గంలో మాలి బెల్గావ్ గ్రామ పంచాయతీ ఖజేల్ గ్రామ సమీపంలో సంసాగర్ గ్రామానికి చెందిన రామ్ రంగుడ కుమారుడు సుభం రంగుడ (17) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఒక చేయి,కాలు తెగి పడి ఉన్నాయి. హఫ్ ప్యాంట్లో మృతదేహం ఉంది. ఇతడు శుభం పాడువాలో రాధాకృష్ణ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఇంటర్ చదువుతున్నాడని కుటుంబీకులు పేర్కొన్నారు. తన మేనమామ ఇంటికి ఉత్సవాలు సందర్భంగా వచ్చి మృతదేహమై కనిపించాడని తెలిపారు. కొరాపుట్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ దీపక్ మజ్జి ఆదేశాల మేరకు ఆర్పీఎఫ్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నందపూర్ ఆస్పత్రికి తరలించారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ సాగరిక ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్పా, మసాజ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా
రణస్థలం: స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వ హిస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానంద హెచ్చరించారు. ‘మసాజ్ పేరు.. అసాంఘిక కార్యక్రమాల జోరు..’ శీర్షికతో ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో కొందరు వ్యక్తులు స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో స్పా, మసాజ్ సెంటర్లలో నిబంధనలకు విరుద్ధంగా, చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న స్పా, మసాజ్ సెంటర్లపై ప్రత్యేక నిఘాతో పాటు తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమాచారం ఇవ్వండి నిబంధనల పాటించకపోతే చర్యలు తప్పవని డీఎస్పీ తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలకు భవనం అద్దెకు ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సెంటర్లు నిర్వహిస్తే అనుమతి ధ్రువీకరణ పత్రాలను ప్రవేశ మార్గం వద్ద ఉంచాలన్నారు. స్పా/మసాజ్ సెంటర్ల పేరుతో ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గమనిస్తే 112తో పాటు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ 6309990804, సంబంధిత పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సీహెచ్ వివేకానంద వెల్లడి -
22 నుంచి విగ్రహ ప్రతిష్టోత్సవాలు
రాయగడ: స్థానిక ఉమాశంకర్ లైన్ సమీపంలోని అయ్యప్ప స్వామి మందిరం ప్రాంగణంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు గురుస్వామి ఎం.నాగేశ్వరరావు శనివారం తెలిపారు. పురాతనమైన అయ్యప్ప మందిరం ఇప్పటికే అందరి సహకారంతో అభివృద్ధి చెందగా ఉప ఆలయాల్లో భాగంగా గణేష్, సుబ్రహ్మణ్యం, హనుమాన్, దత్తాత్రేయ, మహాలక్ష్మి, సరస్వతి, మాలికాపురిమాత విగ్రహాలను ప్రతిష్టించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రాంతానికి చెందిన ప్రముఖ వేద పండితులు వెంకటరామ్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఇందులో భాగంగా 22వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ, రక్షాబంధన్, అఖండ దీపార్చన, సాయంత్రం 4.30 గంటలకు కలశ యాత్ర ఉంటందన్నారు. 23వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు క్షీరాభిషేకం, కుంకుమార్చన, సూర్య నమస్కారాలు, సాయంత్రం 4.30 గంటలకు మహాలింగార్చన, అష్టదిగ్భంధన పూజలు ఉంటాయి. చివరి రోజైన 24వ తేదీన ఉదయం ఎరిమిది గంటలకు సంప్రొక్షణ, హోమం, పూర్ణాహుతి, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయని నాగేశ్వరావు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. -
సారా మహమ్మారిపై పోరుబాట
● కారుబాయి గ్రామస్తుల ఉద్యమం ● మద్యనిషేధమే ధ్యేయమంటున్న ప్రజలురాయగడ: సదరు సమితి కారుబాయి గ్రామంలో మద్యవ్యతిరేక ఆందోళనకు గ్రామస్తులు నడుం బిగించారు. గ్రామ శివారులో నాటుసారా తయారీ, విక్రయాలు ఊపందుకోవడంతో యువత మత్తుకు బానిసై వారి భవిష్యత్ను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దీంతో తమ కుటుంబాలు గమ్యం లేని జీవితాలుగా మిగిలిపోతున్నాయని భావించిన గ్రామస్తులు అంతా ఏకమై గ్రామంలో సారా, మద్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దీంతో పక్కనే ఉన్న పనొగుడ గ్రామస్తులు కూడా అందుకు సై అంటూ ఆందోళనకు ఊపిరి పొసింది. దీంతో ఆయా గ్రామాలకు చెందిన పురుషులు, మహిళలు గ్రామ శివారల్లో ఉన్న నదీ తీర ప్రాంతాల్లో అక్రమంగా తయారు చేస్తున్న నాటుసారా కేంద్రాలపై ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. సారా తయారీ కేంద్రాల్లో ఉన్న సామగ్రీలను, పొదల్లో దాచిఉంచిన ఊటను బయటకు తీసి మహిళలు ధ్వంసం చేశారు. గ్రామస్తులకు అండగా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు మద్దతు ఇస్తున్నారు. వారంతా గ్రామాల్లో తిరిగి మధ్య నిషేధం గురించి అవగాహన కల్పిస్తున్నారు. తమ ప్రాంతంలో సంపూర్ణ మద్య నిషేధమే ధ్యేయంగా తాము చేపట్టిన ఈ ఆందోళన విజయవంతమయ్యేంత నిద్రపోమని శపథం చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో అక్రమంగా నాటుసారా తయారీ, విదేశీ మద్యం అమ్మకాలకు బ్రేక్ పడింది. ఎవరైన మద్యం విక్రయాలు, తయారీకి ఒడిగడితే తాము ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు. ఏదిఏమైనప్పటికీ వీరి ఆందోళనకు అంతా మద్దతు పలకడంతో ఆయా గ్రామాల్లో సంపూర్ణ మద్యనిషేధానికి బీజం పడిందని భావిస్తున్నారు. ఆందోళనకు కారుబాయి పంచాయతీ సర్పంచ్ మరియా శిరిక నాయకత్వం వహించారు. -
ఈఆర్ఎస్ఎస్ ఉద్యోగుల సమ్మె
భువనేశ్వర్: రాష్ట్ర అత్యవసర స్పందన కేంద్రం (ఎస్ఈఆర్సీ) ఉద్యోగులు సామూహికంగా సమ్మె ప్రారంభించారు. 112 వాహనాల సేవలు నిలిపివేశారు. న్యాయసమ్మతమైన తమ డిమాండ్లు నెరవేర్చకుంటే పీసీఆర్ జాడ లేకుండా పోతుందని స్పష్టం చేశారు. కాల్ సెంటర్ ఉద్యోగులకు గత 5 నెలలుగా జీతాలు అందలేదన్నారు. ఉద్యోగులకు ఏడాదిగా ఈపీఎఫ్ జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన చర్యలు చేపట్టేంత వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. జీతాలు అందే వరకు సమ్మె నిరవధికంగా కొనసాగిస్తామన్నారు. ఈ నిరసన కారణంగా 112 సేవలు ప్రభావితమయ్యాయి. -
ఆదిత్యుని సన్నిధిలో గజపతి కలెక్టర్
అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయం ప్రకారం గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు.గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. కౌన్సిలింగ్ బుక్ ఆవిష్కరణ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజినీరింగ్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రూపొందించిన కౌన్సిలింగ్ బుక్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులు, ప్రత్యేకతలు, మౌలిక వసతులు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిఏటా రూ.100 కోట్ల స్కాలర్షిప్స్ మెరిట్ విద్యార్థులకు అందించే ప్రణాళిక విషయమై ప్రశంసించారు. యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్తో పాటు వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థుల గురించి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు తెలియజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ఇన్చార్జి రాధాకృష్ణ, సీనియర్ మేనేజర్స్ కుమార్, రెడ్డి, నరసింహులు, వెంకట్ పాల్గొన్నారు. కోర్ ఇంజినీరింగ్తో అపారమైన అవకాశాలు టెక్కలి: కోర్ ఇంజినీరింగ్ బ్రాంచ్లతో భవిష్యత్లో అపారమైన అవకాశాలు ఉంటాయని అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ స్థాయి అధ్యాపక శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కృత్రిమ మేథస్సు, ఆధునిక సాంకేతిక రంగాల అభివృద్ధితో కోర్ ఇంజినీరింగ్ విభాగాలు కొత్త దిశగా ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. ఇంజినీరింగ్ కళాశాలలు సమకాలిన అవసరాలకు అనుగుణంగా కోర్సులను విస్తరించాలని సూచించారు. సాంకేతిక రంగంలో వేగవంతంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకులకు సాంకేతిక శిక్షణ తరగతులు అందజేసి తద్వారా విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం ఐఎస్టీఈ–2026 వార్షిక అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. కళాశాల డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 2007లో ఐఎస్టీఈ మెంబర్ షిప్తో అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2014 నుంచి 2026 వరకు తమ కళాశాలలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ అవార్డులను అందజేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఐఎస్టీఈ అధ్యక్షుడు ప్రతాప్ సింహాకసాహెబ్ దేశాయ్, జేఎన్టీయూ జీవీ పూర్వపు వీసీ ప్రొఫెసర్ కట సుబ్బయ్య, ఐఎస్టీఈ ఏపీ చైర్మన్ ప్రొఫెసర్ జి.రంగ జనార్ధన, కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, డైరక్టర్ కె.మధుకుమార్, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హిరమండలంలో చోరీ హిరమండలం: హిరమండలం మేజర్ పంచాయతీ దేవరశెట్టి వీధిలోని అందవరపు కస్తూరి ఇంట్లో శనివారం తెల్లవారుజామున దొంగతనం జరినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే కొత్తూరు సీఐ సీహెచ్ ప్రసాదరావు, హిరమండలం, కొత్తూరు ఎస్ఐలు వై.మధుసూదనరావు, కె.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్ బృందం, జాగిలాలను తెప్పించారు. ఇంటి యాజమాని అందవరపు కస్తూరి పొలాకిలోని తన కన్నవారింటికి వెళ్లడంతో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చోరీ సంఘటనపై కొత్తూరు సీఐ వద్ద ప్రస్తావించగా దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. -
గడ్డిమందు తాగి ఆటోడ్రైవర్ ఆత్మహత్య
పాతపట్నం: మండలంలోని చిన్నలోగిడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దయానిధి సోయి(30) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నలోగిడి గ్రామానికి చెందిన దయానిధి సోయి ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త జైనవలస చిలకమ్మకు రూ.3 లక్షలు అప్పు ఇచ్చాడు. చిలకమ్మకు ఐదు రోజుల క్రితం డబ్బులు అడగగా.. చిలకమ్మ, ఆమె భర్త ముఖలింగంలు కలిసి పోలీసుస్టేషన్లో దయానిధిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దయానిధి సోయిని పోలీసు స్టేషన్కు పిలిపించారు. స్టేషన్లోనే దయానిధి సోయిని చిలకమ్మ ధూషించింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఈనెల 10వ తేదీన గడ్డిమందు తాగాడు. అనంతరం ఆటోలో సెల్ఫీ వీడియో తీశాడు. తన మృతికి పెద్దలోగిడి ఆశ వర్కర్ జైనవలస చిలకమ్మ, ఆమె భర్త మొఖలింగంలు కారణమని, అప్పు ఇచ్చిన డబ్బులు అడిగితే తనపై కేసు పెట్టారని వాపోయాడు. వీడియోని చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు దయానిధిని పాతపట్నం సీహెచ్సీకి తరలించగా, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. రిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. రిమ్స్లో పంచనామా , పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ కె.శ్రీరామమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘దమ్ముంటే రాజీనామా చెయ్’ పాతపట్నం: మహానేత మరణంపై, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మంత్రి ఇలా వాఖ్యలు చేయడం దగదని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురా లు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా ఖండించారు. శనివారం మాజీ ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో రెడ్డి శాంతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ ఉనికి కోసం మరణించిన వ్యక్తిపై బురద చల్లడం మంత్రి అచ్చెన్నాయుడికి తగదన్నారు. ఎర్రన్నాయుడు మరణిస్తే గానీ మంత్రి పదవి రాదు అని అచ్చెన్న సహచరుల వద్ద ఎన్నోసార్లు అన్నారని గుర్తు చేశారు. దమ్ముంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు అచ్చెన్న రాజీనామా చేసి, పోటీ చేయాలని, డిపాజిట్ కూడా రాదని అన్నారు. సమావేశంలో పాతపట్నం, మెళియాపుట్టి పీఏసీఎస్ అధ్యక్షులు మిరి బిల్లి శ్యామ్సుందరరావు, ఉర్లాన బాలరాజు, పాతపట్నం, మెళియాపుట్టి, ఎల్.ఎన్.పేట పార్టీ మండల అధ్యక్షులు సవిరిగాన ప్రదీప్, పోలాకి జయమునిరావు, పెనుమజ్జి విష్ణుమూర్తి, కొత్తూ రు ఎంపీపీ సవర సావిత్రి, రాష్ట్ర బీసీ సెఎల్ జాయింట్ సెక్రటరీ చింతాడ సూర్యనారాయణ, రాష్ట వాణిజ్య విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ యరుకోల వెంకటరమణ, రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ రమేష్, రెడ్డి రామారావు, మడ్డు తాతయ్య, వెంకటరమణ పాల్గొన్నారు. -
గ్రంథాలయం.. దయనీయం..!
శ్రీకాకుళం అర్బన్: గత నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లు అందకపోవడంతో జిల్లాలోని గ్రంథాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వం గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన గ్రాంట్ సక్రమంగా విడుదల చేయకపోవడం వలన నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లు, 10 నెలలుగా పత్రికల బిల్లులు, కరెంట్ బిల్లులు, స్వీపర్ ఛార్జీలు కూడా చెల్లించక ఇబ్బందులు తప్పడం లేదు. ఒక నెలకు గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పేపర్ బిల్లులకు రూ.45 లక్షలు అవసరమవ్వగా.. ఆ నిధులను విడుదల చేయడం లేదు. జిల్లాలో 20 మంది శాశ్వత ఉద్యోగులు, 60 మంది పెన్షనర్లు, 13 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వీరికి ఏడాదికి చెల్లించేందుకు కనీసం రూ.6 కోట్లు కావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ కేవలం రూ.2.22 కోట్లు మాత్రమే గ్రాంటు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. అదనపు గ్రాంటు కోసం ప్రభుత్వాన్ని కోరగా ఇవ్వడం కుదరదని ఫైలు తిప్పి పంపించి వేసింది. దీంతో సక్రమంగా జీతాలు, పింఛన్లు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. నిర్వహణకు గడ్డు పరిస్థితి ప్రభుత్వం సకాలంలో నిధులు చెల్లించకపోవడం వలన గ్రంథాలయాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గ్రంథాలయాల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు వసూలైన సెస్సుతో అభివృద్ధి జరిగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతో గ్రంథాలయాలకు, పుస్తకాల కొనుగోళ్లకు, రోజువారీ వచ్చే దిన, వార, మాస పత్రికలకు సొమ్ములు చెల్లించడం లేదు. ఇలా అయితే గ్రంథాలయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించని పక్షంలో దశలవారీగా ఆందోళన చేపడతాం. అలాగే వేసవి శిక్షణా శిబిరాలను కూడా బహిష్కరిస్తాం. – పి.ఉగ్రసేన, జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జిల్లా గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తాం. ఇటీవలే మంత్రి నారా లోకేష్కు సమస్యను వివరించాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ నిధుల కోసం కృషి చేస్తున్నాం. ఇటీవల వసూలైన సెస్సు నుంచి రెగ్యులర్ ఉద్యోగులకు డిసెంబర్ నెల జీతం ఇవ్వడం జరిగింది. మరికొంత వసూలైన సెస్లో పెన్షనర్లకు ఒక నెల పెన్షన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. అయితే మార్చినెలాఖరు కావడంతో ఆగింది. త్వరలోనే పెన్షనర్లకు ఒక నెల పెన్షన్ చెల్లిస్తాం. జిల్లాలో కూడా ఇళ్లు, పంచాయతీల నుంచి రావాల్సిన నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – పీరుకట్ల విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గత నాలుగు నెలలుగా జీతాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా సమస్యలపై జేసీ, మున్సిపల్ అధికారులను కలిశాం. శ్రీకాకుళం మున్సిపాలిటీ కట్టాల్సిన సెస్ను త్వరలోనే కట్టించే ఏర్పాట్లు చేస్తామని జేసీ చెప్పడం జరిగింది. సెస్ వసూలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. మా జీతాలను ప్రభుత్వం ఇచ్చే స్థితిలో లేదని, స్థానిక సంస్థల నుంచే వసూలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం శోచనీయం. – వీవీజీ శంకరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. గత 33 ఏళ్ల చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదు. 40 శాతం నిధులు ప్రభుత్వం విడుదల చేసి.. 60 శాతం ఇళ్లు, పంచాయతీల నుంచి వసూలైన సెస్ నుంచి జీతాలు, పెన్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం చెప్పడం సరికాదు. నాలుగు నెలలుగా పెన్షన్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మందులకు, నెలవారీ ఖర్చులకు కూడా అవస్థలు పడుతున్నాం. – టి.వైకుంఠరావు, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ ములిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా ఈనెల 26వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించాల్సి ఉంది. అయితే గ్రంథాలయ ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతుంటే వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణ, వాటి ఖర్చు ఉద్యోగులే భరించాలని అనడం దారుణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించినా వాటికి సంబంధించి ఎటువంటి బిల్లులూ చెల్లించలేదని, ఆ నిర్వహణ ఖర్చుల భారం గ్రంథాలయ ఉద్యోగులే భరించాల్సి వచ్చిందని వాపోతున్నారు. గ్రాంట్ సక్రమంగా విడుదల చేయని ప్రభుత్వం నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లకు ఉద్యోగుల ఎదురుచూపులు పత్రికల బిల్లులూ చెల్లించలేని వైనం ప్రశ్నార్థకంగా వేసవి శిక్షణా శిబిరాలు -
తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట
సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ భర్త కర్రి విష్ణుమూర్తితో పాటు అతను అనుచరుడు అనపాన నగేష్పై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త, ఒక పత్రిక విలేకరి సదాశివ, మరికొందరు టీడీపీ కార్యకర్తలు శనివారం దాడిచేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళ్తే.. నౌపడ గ్రామానికి చెందిన అనపాన నగేష్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ చేయి అడ్డుపట్టి ఉమ్ము వేశాడు. అయితే అతని వెనుక ద్విచక్ర వాహనంపై వస్తున్న టీడీపీ కార్యకర్త, విలేకరి సదాశివ కాలుపై పడింది. దీంతో సీతానగరం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆపి కావాలనే నా మీద ఉమ్ము వేశావని.. సారీ చెప్పమని నగేష్కు సదాశివ సూచించాడు. అయితే కావాలని తాను చేయలేదని అనడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్నవారు ఇరువురికీ నచ్చజెప్పడంతో వెళ్లిపోయారు. అంతటితో సదాశివ ఆగకుండా కొంతమంది టీడీపీ కార్యకర్తలతో వెళ్లి.. పార్టీ కార్యాలయంలో ఉన్న అనపాన నగేష్ను పిలిచి దాడి చేశారు. ఇరువురూ కొట్టుకోవడంతో ఈ దాడిని అడ్డుకోవడానికి వెళ్లిన మాజీ ఎంపీపీ భర్త కర్రి విష్ణుమూర్తిపై సైతం దాడి చేశారు. ఈ దాడిలో విష్ణుమూర్తి కళ్లజోడు విరిగిపోగా, కాళ్లకు గాయమై రక్తస్రావం అయింది. దీనిపై ఇరువర్గాలు పరస్పరం నౌపడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అనపాన నగేష్ ఫిర్యాదు మేరకు సదాశివ, తిప్పాన కామరాజు, కీలుగు సత్యంపై.. సదాశివ ఫిర్యాదు మేరకు అనపాన నగేష్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నారాయణస్వామి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
నందిగాం: టెక్కలి పోలీస్స్టేషన్లో విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామానికి కూతవేటు దూరంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగాంకు చెందిన కానిస్టేబుల్ చీమల గోపాలకృష్ణ(40) మృతి చెందారు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కానిస్టేబుల్ గోపాలకృష్ణ శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని తన బుల్లెట్ వాహనంపై జాతీయ రహదారి మీదుగా నందిగాం వస్తుండగా, సుమారు రాత్రి 11.30 – 12 గంటల మధ్య వరిపంటను కోసుకొని వస్తున్న కోత మిషన్ రేవడిమెరక వద్ద జాతీయ రహదారి ఎక్కే క్రమంలో గోపాలకృష్ణను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయలు పాలైన గోపాలకృష్ణను విడిచిపెట్టి కోత మిషన్తో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి మిషన్తో పాటు వెళ్లిపోయారు. అయితే రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై ఉన్న బుల్లెట్ను చూసిన గుర్తు తెలియని వాహనదారుడు, 100కు ఫోన్ చేసి ప్రమాద విషయం తెలియజేశారు. సమాచారం అందుకున్న నందిగాం పోలీస్స్టేషన్ ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ తదితరులు ప్రమాద స్థలానికి చేరుకొని 108 వాహనానికి సమాచారం అందించారు. 108 వాహన సిబ్బంది గోపాలకృష్ణను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాదం స్థలంలో దొరికిన ఆనవాళ్లతో దర్యాప్తు సాగించిన పోలీసులు కోత మిషన్ ఢీకొట్టినట్లు అనుమానించి ఒడిశా రాష్ట్రం జాజ్పూర్కు చెందిన విజయ్ను అదుపులోకి తీసుకున్నారు. గోపాలకృష్ణ మృతదేహానికి శవపంచనామా అనంతరం గ్రామానికి తీసుకొచ్చి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో టెక్కలి సీఐ విజయ్కుమార్, టెక్కలి ఎస్ఐ రాము తదితరులు పాల్గొన్నారు. గోపాలకృష్ణ మృతితో నందిగాంలో విషాదం నెలకొంది. ఆయనకు భార్య యెతీష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
స్థానిక పోరుకు సిద్ధంగా ఉండాలి
● మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ● తాజా, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లకు సత్కారంపలాస: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. ఇప్పటినుంచే గ్రామాల్లో తగిన వాతావరణాన్ని తమకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ తాజా, మాజీ కౌన్సిలర్లు, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన మాజీ సర్పంచ్లను శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయం ఆవరణలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపాలిటీలోని కౌన్సిలర్ల ఎంపికపై కార్యకర్తల అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. గెలిచే అభ్యర్థికే అవకాశాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. 2027లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఉంటుందని, ఆ సమయంలో మనం కూడా స్థానికంగా అందుకు అనుగుణమైన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకుడు ఎన్ని ధనుంజయరావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో నాయకులంతా కష్టపడి పనిచేసి పార్టీని గెలుపించుకోవడానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి, జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడ దుర్యోధనరావు, పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు వెంకటరావు, పలాస ఏఎంసీ మాజీ చైర్మన్ పి.వి.సతీష్, వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం నాయకుడు మొదలవలస మన్మథరావు, పలాస–కాశీబుగ్గ పట్టణ కమిటీ అధ్యక్షుడు శిస్టు గోపి, పైల వెంకటరావు, ఉంగ సాయికృష్ణ, డల్లి జానకిరెడ్డి, దువ్వాడ రవి, తిర్రి రాజారావు, బత్తిన హేమేశ్వరరావు, బోర చంద్రకళ, సుజాత పండా, మీసాల సురేష్బాబు, బెల్లాల శ్రీనివాసరావు, మందస మాజీ ఎంపీపీ డొక్కర దానయ్య, ఉప్పరపల్లి ఉదయ్కుమార్, మచ్చ రత్నాలు, సవర చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
జెండా ఎత్తేసిన వ్యాపారి
● రూ. కోటికి పైగా నగదుతో ఉడాయించిన వైనం ● లబోదిబోమంటున్న బాధితులు సంతబొమ్మాళి: ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్న ఓ వ్యాపారి నగదు, బంగారం పట్టుకుని ఉడాయించిన ఘటన మండలంలోని బోరుభధ్రలో చేటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని బోరుభద్రలో పోలాకి మండలం పిన్నింటిపేటకు చెందిన పొట్నూరు కృష్ణారావు 30 ఏళ్లుగా వెంకట భగవాన్ పేరుతో మెడికల్ షాపు నడుపుతున్నారు. మెడికల్ షాపులో మందులు అమ్ముతూ చాలా కాలం నుంచి వడ్డీకి డబ్బులు అప్పులు ఇస్తున్నారు. బంగారు వస్తువులు తనఖాగా ఉంచుకుని డబ్బులు అప్పుగా ఇస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా తన మరదలి కుమారుడైన పొట్నూరి నానిని బోరుభద్ర తీసుకువచ్చి మెడికల్ షాపు వ్యాపారం అప్పగించాడు. కృష్ణారావు మకాం నరసన్నపేటకు మార్చి అక్కడ వేరే వ్యాపారాలు చేస్తూ అప్పుడప్పుడూ బోరుభద్ర వచ్చి షాపు లెక్కలు చూసి వెళ్లిపోయేవాడు. అయితే అప్పటి నుంచి బంగారం వస్తువుల తనఖా వ్యాపారాన్ని నాని చూసుకుంటూ అందరితో నమ్మకంగా మెలిగేవాడు. అయితే గత కొద్ది రోజులుగా బంగారం వస్తువులు తనఖా పెట్టిన వారు డబ్బులు తీసుకువచ్చి తమ వస్తువులు ఇవ్వమని అడగ్గా వేరే వారి వద్ద ఉన్నాయని నాని తిప్పుతున్నాడు. మరికొంతమంది వద్ద డబ్బులు తీసుకొని నెలలు కా వస్తున్నా బంగారం తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడంతో బాధితులు గట్టిగా నిలదీశారు. దీంతో గురువారం మెడికల్ షాపునకు తాళాలు వేసి నాని పరారైపోయాయడని స్థానికులు చెబుతున్నారు. నాని ఈ ప్రాంతంలో రూ. 30లక్షలు వరకు అప్పులు చేశాడని, మరి కొందరి వద్ద నెలకు నూటి కి రూ. 10లు వరకు వడ్డీకి అప్పులు వాడాడని సమాచారం. డబ్బులతో పాటు తనఖా పెట్టిన 50తులాల బంగారం వస్తువులను తీసుకుని మెడికల్ షాపు మూసి పరారు కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మోసపోయిన వారిలో బోరుభద్ర, గొదలాం, మలగాం, పాలతలగాం, శిమ్మయ్యపేట, కొల్లిపాడు, గెద్దలపాడు, పిట్టవానిపేట, పాత మేఘవరం బాధితులు ఉన్నారు. పిట్టవానిపేట గ్రామానికి చెందిన పిట్ట చిన్నమ్మ రెండున్నర తులాలు, మలగాంకు చెందిన లండ వరలక్ష్మి అరతులం, చిన్నమ్మి ఐదుతులాల బంగారాన్ని తాకట్టు పెట్టామని డబ్బులు ఇస్తామన్నా నెలలు తరబడి ఇవ్వకపోవడంతో పాటు పరారు కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంతబొ మ్మాళి ఎస్ఐ వై. సింహాచలంకు అడుగగా ఎవరూ లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేయలేదని తెలిపారు. -
ఏఓబీలో లోయలో పడిన బస్సు
● ఒకరు మృతి ● 15 మందికి గాయాలుకొరాపుట్: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో లోయలో బస్సు పడడంతో ఒకరు మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం వేకువ జామున కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి సుంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రా సరిహద్దుకు కూత వేటు దూరంలో ఒడి02డీఈ5446 నంబర్ గల ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓల్వో బస్సు లోయలో పడిపోయింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కలహండి జిల్లా బలగాం గ్రామానికి చెందిన జంబాబ్ బిహారీ (50) మృతి చెందాడు. తీవ్రంగా గాయాలపాలైన జంబాబ్ని పొట్టంగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ బస్సు ఒడిశాలోని కలహండి జిల్లా నుంచి విశాఖ పట్నం వెళ్తుంది. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే జయపూర్, పొట్టంగి, సిమిలిగుడల నుంచి అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సుమారు 40 అడుగుల లోతుకి దిగి రాత్రి వేళ టవర్ లైట్ ఏర్పాటు చేశారు. రోప్ లైన్లు ఏర్పాటు చేసి 8 మందిని స్ట్రెచర్ల మీద తరలించారు. ప్రమాదం వేకువ జామున 3 గంటలకు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో విషమ పరిస్థితిలో ఉన్న ఇద్దరిని విశాఖ, నలుగురిని కొరాపుట్లోని ప్రభుత్వ షహీద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగతా వారు పొట్టంగి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై పొట్టంగి ఎమ్మెల్యే రామ చంద్ర ఖడం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ సాలురు–సుంకి ల మధ్య బస్సులు ప్రమాదానికి గురవుతుండడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. -
తస్మాత్ జాగ్రత్త
● వడగాలులు ముంచుకొస్తున్నాయి ● కలెక్టర్లకు ఎస్ఆర్సీ హెచ్చరిక జారీభువనేశ్వర్: రాష్ట్రంలో వేసవి తాపం ఉగ్ర రూపం దాల్చనుంది. గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కాల వైశాఖి ప్రభావంతో ఉపశమనం కలిగించిన వాతావరణం వేడెక్కనుంది. వడగళ్ల వానతో అతలాకుతలమైన ప్రజానీకానికి వడగాడ్పులు బెంబేలెత్తించనున్నాయి. స్వీయ అప్రమత్తతతో వడ దెబ్బ వంటి ప్రాణాంతక చర్యల నుంచి రక్షణ పొందాలని వాతావరణ విభాగం సూచన మేరకు రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనరు (ఎస్ఆర్సీ) కార్యాలయం పలు జాగ్రత్తలు జారీ చేసింది. ఈ నెల 11 నుంచి 16 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందస్తు సమాచారం జారీ చేసింది. ఈ నెల 13, 14 తేదీలలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలతో అనుబంధ విభాగాలు, శాఖలు అప్రమత్తం కావాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిస్థితుల దష్ట్యా పలు ప్రాంతాలకు పసుపు హెచ్చరిక జారీ చేసి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్ఆర్సీ) రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరులు, గృహ నిర్మాణం, పట్టణ అభివృద్ధి, విద్యుత్, తాగు నీరు, పంచాయతీ రాజ్, మత్స్య, ఆరోగ్యం, విద్య, కార్మిక తదితర విభాగాల వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకు, ఆర్డీసీలు, ఓఎస్డిఎంఏ, మున్సిపల్ కార్య నిర్వాహక డైరెక్టర్కు ఈ లేఖ జారీ చేశారు. వడగాడ్పుల పరిస్థితి పట్ల అనుక్షణం పర్యవేక్షించాలని ఎస్ఆర్సీ ఆదేశించింది. ఉత్తర కోస్తా ఒడిశాలో ఒకటి రెండు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత ఇప్పటికే సుమారు 3 డిగ్రీల సెల్సియస్ మేర గణనీయంగా పెరిగింది. బౌధ్లో అత్యధికంగా పగటి పూట ఉష్ణోగ్రత 38.9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఝార్సుగుడలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 18.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. శిశువులు, వృద్ధులు, గర్భిణీ సీ్త్రలు, అనారోగ్య పీడితులు ఉన్నవారు వంటి బలహీన వర్గాల వారికి ఈ వాతావరణం స్వల్ప ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. రైతులకు సూచన చెరుకు, వేసవి మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, కూరగాయల పంటలకు నిరంతర నీటి పారుదల కొనసాగించాలని రైతులకు సూచించారు. పెంపుడు జంతువులు, పశువులను చల్లని, నీడ ఉన్న ప్రదేశాలలో తగినంత తాగు నీటితో ఉంచాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల సమయంలో సంబంధిత శాఖలన్నీ అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రతను నిర్ధారించాలని ఎస్ఆర్సీ నొక్కి చెప్పింది. ఐఎండీ పసుపు హెచ్చరిక బాలాసోర్, భద్రక్, కేంద్రాపడా, జగత్సింగ్పూర్, కటక్, జాజ్పూర్, పూరీ, ఖుర్దా, నయాగఢ్, గజపతి, గంజాం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల వేడి మరియు తేమతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. రేపటి వాతావరణం బొలంగీర్, బర్గడ్, సంబల్ పూర్ జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల వడగాడ్పుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. తీర ప్రాంత, దక్షిణ జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల వేడి, తేమతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. శరీరంలో నీటి శాతం చూసుకోవాలి రద్దీ సమయాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బయటకు వెళ్లేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు పాటించడం అవసరం. ఎక్కువసేపు ఎండలో ఉండకుండా, లేత రంగు, వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించి, టోపీ, గొడుగు లేదా తడి గుడ్డతో తలను కప్పుకోవాలి. దాహం వేయకపోయినా తగినంత నీరు తాగాలి. శరీరంలో నీటి శాతం తగ్గుదల (డీహైడ్రేషన్) నివారణకు ఓఆర్ఎస్, లస్సీ, తరవాణి (పుల్లటి గంజి), చెరకు రసం, నిమ్మ రసం, మజ్జిగ వంటివి వాడాలని సిఫార్సు చేశారు. మద్యం, టీ, కాఫీ, కార్బోనేటెడ్ పానీయాలు, అధిక ప్రోటీన్ లేదా నిల్వ ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం శ్రేయోదాయకం. శ్రమతో కూడిన బహిరంగ పనులను రోజులో చల్లగా ఉండే సమయాల్లో తరచుగా విశ్రాంతి తీసుకుంటూ ఉండేలా షెడ్యూల్ చేసుకోవాలి. కార్మికులు, ముఖ్యంగా గర్భిణులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తల తిరగడం, తల నొప్పి, వికారం, నీరసం లేదా మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. -
మహా నది ట్రిబ్యునల్ కాల పరిమితి పొడిగింపు
భువనేశ్వర్: ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా ఊగిసలాడుతున్న నీటి పంపకాల వివాదం పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన మహా నది జలాల పంపిణీ వివాదాల ట్రిబ్యునల్ (ఎండబ్ల్యూడీటీ) కాల పరిమితిని వచ్చే ఏడాది జనవరి 13 వరకు పొడిగించారు. మహానది నదిపై ఉన్న అంతర్ రాష్ట్ర వివాదాన్ని పరిష్కరించడానికి 2018లో ఈ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ మునుపటి కాల పరిమితి ఈ ఏడాది ఏప్రిల్ 13తో ముగియాల్సి ఉంది. ఒడిశా, చత్తీస్గఢ్ ప్రభుత్వాల ఉమ్మడి అభ్యర్థన మేరకు తీర్పు ప్రక్రియ సమర్థంగా పూర్తయ్యేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 9 నెలల కాల పరిమితి పొడిగింపును మంజూరు చేసింది. ఈ పొడిగింపు ఒడిశాకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు. మహా నది ఎగువ చత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బ్యారేజీలు, ప్రాజెక్టుల వల్ల దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహం దెబ్బతింటోందని ఒడిశా నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మహా నది జలాల పంపిణీ వివాదాల ట్రిబ్యునల్ చైర్పర్సన్ పదవి దాదాపు 9 నెలల పాటు ఖాళీగా ఉండటంతో విచారణ ప్రభావితమైంది. దీంతో సరైన తీర్పు కోసం ఇరు రాష్ట్రాలు అదనపు సమయం కోరాయి. ప్రస్తుతం విచారణలు కొనసాగుతున్నాయి. మరో వైపు ట్రిబ్యునల్ ఇటీవల ఇరు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించింది. ట్రిబ్యునల్ గడువు పొడిగింపుతో సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించి వాదోపవాదాలు లోతుగా విచారించేందుకు దోహదపడి నిర్మాణాత్మకమైన తుది తీర్పు వెల్లడించేందుకు ఉపకరిస్తుందని సర్వత్రా ఆశాభావం వ్యక్తమవుతోంది. -
గజపతి ఎస్డీసీ చైర్మన్గా కామదేవ్ బోడోనాయక్
పర్లాకిమిడి: గజపతి జిల్లా స్పెషల్ ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ పరిషత్ చైర్మన్గా కామదేవ్ బోడోనాయక్, వైస్ చైర్మన్గా పంకజినీ దోళాయి నియమితులయ్యారు. దీంతో శనివారం పర్లాకిమిడి జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరు నారాయణ రావు, జిల్లా అధ్యక్షులు నబకిశోర్ శోబోరో, ఛిత్రి సింహాద్రి, సాధారణ కార్యదర్శి ఇ.ప్రశాంత్, ఎంపీ ప్రతినిధి రాజేష్కుమార్, రౌతు విజయకుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలక్రిష్ణ పాత్రో, కౌన్సిలరు బిభూతీ భూషణ్ బెహారా, కె.జీవన్రావు, ప్రసాద్ నాయుడు నూతన చైర్మన్ కామదేవ్ బోడోనాయక్కు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ఎస్డీసీ చైర్మన్ పదవి ఏడాదిన్నరగా భర్తీకాకపోవడంతో అనేక అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఎట్టకేలక పాలకవర్గాన్ని నియమించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహాన్ మఝికి గజపతి జిల్లా బీజేపీ శ్రేణులు ధన్యవాదాలు తెలియజేశారు.పిచ్చికుక్క కాటుతో ఆవు మృతి ● పాలు తాగిన వారంతా ఆస్పత్రికి పరుగులు కొరాపుట్: పిచ్చికుక్క కరవడంతో ఆవు చనిపోయింది. ఈ ఘటన నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ పట్టణంలోని 12వ వార్డులో శనివారం చోటుచేసుకుంది. ఆసుర్ రాయ్కి చెందిన ఆవు కొద్ది రోజులుగా ఆహారం తీసుకోకుండా విచిత్రంగా ప్రవర్తిస్తుండేది. దీంతో యజమాని ఆసుర్ రాయ్ ఆవుని పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పిచ్చికుక్క కరిచిందని నిర్ధారించారు. ఈ క్రమంలో ఆవు శనివారం ప్రాణాలు కోల్పోయింది. కాగా సుమారు నెల రోజులుగా ఆవు పాలు వినియోగిస్తున్న వినియెగిస్తున్న సుమారు 30 ఇళ్లలో అలజడి రేగింది. వీరంతా రాయ్ వద్ద ఆవుపాలు కొనుగోళ్లు చేస్తుండేవారు. పిచ్చికుక్క కరవడంతో ఆవు చనిపోయిందనే సమాచారం తెలుసుకున్న వారంతా భయంతో ఉమ్మర్ కోట్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇప్పటికే 15 మంది పిల్లలు, 20 మంది పెద్దలు వ్యాక్సిన్ వేయించుకున్నారని వైద్యులు ప్రకటించారు.ఖంజావీధిలో యువతి ఆత్మహత్య పర్లాకిమిడి: పట్టణంలో ఖంజావీధిలో యువతి (అవివాహిత) శుభ్రా సామల్ (24) స్వగృంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన 15వ వార్డులో సంచలనం కలిగించింది. ఆదర్శ పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రశాంత్ భూపతి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసును దర్యా ప్తు చేశారు. ఇటీవలే మంచి మార్కులతో పాసై న శుభ్రా సామల్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు కుటుంబ సభ్యులు చెప్పలేకపోతున్నా రు. ఈమెకు ఇద్దరు అక్కచెల్లెళ్లు, తల్లిదండ్రులు ఉన్నారు. ఆదర్శ పోలీసు ష్టేషన్ అధికారులు, క్లూస్ టీమ్ దర్యాప్తు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై అవగాహన కల్పించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశం శ్రీకాకుళం పాతబస్టాండ్: పలాసలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి పలాస ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 50 మంది రైతులకు ఒక్కొక్క వీఆర్వో చొప్పున ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. వీఆర్వోలు ఆయా గ్రా మాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి రెవెన్యూ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామసభలు ఏర్పాటు చేసినపుడు తహసీల్దార్లు, పోలీసులకు పలు సూచనలు జారీ చే శారు. వీఆర్వోల వద్ద వారికి కేటాయించిన వారి వివరాలు ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరావు, పలాస ఆర్డీవో ఆర్.అప్పలరాజు, డీఎస్పీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. -
ట్రక్కుని ఢీకొట్టిన అంబులెన్స్
● ఒకరి మృతి ● మరొకరికి తీవ్రగాయాలు భువనేశ్వర్: ఢెంకనాల్ జిల్లా హల్దియాబహాల్ 55వ నంబర్ జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ట్రక్కును శనివారం అంబులెనన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్న్స్ సిబ్బంది ఒకరు మృతి చెందారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆస్పత్రిలో చేర్చారు. భువనేశ్వర్లో ఓ రోగిని దింపి అంగుల్ ప్రాంతానికి అంబులెన్స్ తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మోటంగా ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం పంపించారు. -
పుస్తకం కొనుగోలు చేద్దాం
మల్కన్గిరి: రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒడియా భాషా పక్షోత్సవంలో భాగంగా శుక్రవారం ‘రండి పుస్తకం కొనుగోలు చేద్దాం’ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సోమనా థ్ ప్రధాన్, వేద్బర్ ప్రధాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ మాట్లాడుతూ పుస్తకాలు సంస్కృతి సంప్రదా యాలకు ప్రతిబింబమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దాశరథి సరాబు, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, డీఐపీఆర్ఓ ప్రమిళ మాఝి పాల్గొన్నారు. పర్లాకిమిడి: ఒడిషా పక్షోత్సవాలు సంధర్బంగా పురపాలక సంఘం పర్లాకిమిడి పరిధిలోని పలువురు లోకనృత్య కళాకారులను శుక్రవారం మున్సిపల్ కాన్ఫరెన్సు హాలులో ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలరు బబునా బెహరా మాట్లాడుతూ పర్లాకిమిడి మహారాజుల కాలం నుంచి రంగస్థల నాటికలు, కవులు, సంగీత కళాకారులకు ఆదరణ వుండేదని, ఇప్పుడు స్థానిక కళాకారులను గౌరవించడం హార్షనీయమన్నారు. అనంతరం రంగస్థల నటులు దేవేంద్ర దాస్, లోక సంగీత దర్శకులు రఘునాథ పాత్రో, రంగస్థల నాటకం దర్శకులు నృసింహాచరణ్ పట్నాయిక్, కూచిపూడి, భరత నాట్యం మాస్టారు వి.హిమగిరి, కర్ర,కత్తిసాము నిపుణుడు బెబర్తావీధికి చెందిన త్రిపతి పాత్రోలను సన్మానించారు. కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, వైస్ చైర్మన్ లెంకమధు, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, కౌన్సిలర్లు బాలకృష్ణపాత్రో, నారాయణ బెహరా తదితరులు పాల్గొన్నారు. ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం శ్రీకాకుళం కల్చరల్: శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ ఆధ్వర్యంలో పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వహణలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాలుగో ఆహ్వాన నాటిక పోటీలు బాపూజీ కళామందిర్లో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ అకాడమీ రచయిత్రి, దర్శకురాలు పెమ్మరాజు పూర్ణిమ ఆధ్వర్యంలో ‘సీ్త్ర మాత్రే నమః’ నాటిక ఆద్యంతం అలరించింది. ప్రతి కుటుంబాన్ని నడిపించి, గెలిపించే సీ్త్రని కూడా సీ్త్ర మాత్రే నమః అని పూజించాలనే సందేశంతో ప్రదర్శన సాగింది. పెందుర్తికి చెందిన నటరాజ డ్రామాటిక్ అసోసియేషన్ బి.శెట్టి శేఖర్ దర్శకత్వంలో చందు తులసి రచనలో ‘నీళ్లు– నీళ్లు‘ నాటికలో ప్రస్తుత కాలంలో గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరమని పేర్కొంటూ నటీనటులు అద్భుతంగా ప్రదర్శించిన తీరు ఆహూతులను అలరించింది. కార్యక్రమంలో కేతిరెడ్డి రాజేశ్వరి, నిక్కు హరిసత్యనారాయణ, పొగిరి సత్యం, పూజారి మన్మధరావు, ఉంగటి రమణమూర్తి, పాత్రుని పాపారావు, సనపల అన్నాజిరావు, పొగిరి సుగుణాకరరావు, నల్లి ధర్మారావు, బలివాడ శ్రీనివాసరావు, కీర్తి పాల్గొన్నారు. రణస్థలం: జె.ఆర్.పురం పంచాయతీకి చెందిన నాగవరపు వీరబాబు(39) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వీరబాబు తల్లి చనిపోయినప్పటి నుంచి మానసిక ఆవేదన చెందుతూ మతిస్థిమితం లేకుండా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు రణస్థలం సీహెచ్సీకి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. వీరబాబుకు భార్య దుర్గ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ప్రజలకు నాణ్యమైన విద్యుత్
● ఒడిశా గ్రిడ్ ఆధునీకరణతో 22 లక్షల మందికి ప్రయోజనం ● గ్రిడ్ సబ్స్టేషన్ల ప్రారంభోత్సవంలో సీఎం మోహన్చరణ్ మాఝిభువనేశ్వర్: ప్రపంచ శ్రేణి విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి వినియోగదారులకు అధిక నాణ్యత, నికరమైన, నిలకడ విద్యుత్ను నిరంతరాయం సరఫరా చేయడం లక్ష్యమని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. ఖుర్దా జిల్లా బలియంత, సత్యనగర్, కటక్లోని ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి వద్ద ఉన్న 3 అత్యాధునిక జీఐఎస్ గ్రిడ్ సబ్స్టేషన్లతో పాటు, ఓపీటీసీఎల్ 8 ప్రధాన ట్రాన్స్మిషన్ లైన్లను ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్ర రాజధానిలో నిరంతరాయంగా అధిక నాణ్యత, నమ్మకమైన విద్యుత్ సరఫరాకు ఈ వ్యవస్థ దోహదపడుతుందన్నారు. పరిశ్రమలు, వ్యాపారం, సాంకేతిక సమాచారం, పట్టణ జీవనం సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. ఒడిశా గ్రిడ్ ఆధునీకరణ 22 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చుతుందని విద్యుత్ శాఖ బాధ్యతలు వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ తెలిపారు. దాదాపు రూ. 600 కోట్ల భారీ పెట్టుబడితో ఏడాదిలోపే ఈ ప్రాజెక్టులు పూర్తి కావడం పట్ల మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. దీంతో భువనేశ్వర్, సమీప ప్రాంతాలలోని సుమారు 22 లక్షల మంది వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా సుసాధ్యం అయ్యింన్నారు. చట్టపరమైన, అధికారిక పాలనాపరమైన అడ్డంకుల కారణంగా ఈ ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి ఆలస్యం కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కొత్త సబ్స్టేషన్లు తక్కువ వోల్టేజ్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తాయని, నికరమైన నిలకడ విద్యుత్ను అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతను నెరవేరుతుందని మంత్రి పేర్కొన్నారు. మరిన్ని ఫీడర్లను జోడించి పంపిణీని బలోపేతం చేయాలని ఆయన టాటా పవర్ను ఆదేశించారు. -
కాశీపూర్ ఘటనపై నిరసన
జయపురం: రాయగడ జిల్లా కాశీపూర్ సమితిలో కంటిమాల గ్రామాన్ని పోలీసులు చుట్టిముట్టి టియర్ గ్యాస్ ప్రయోగం చేయడమే కాకుండా, లాఠీచార్జి చేయడంపై కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ గ్రామం నుంచి ప్రజలను పంపించేందుకు పాలకులు, పోలీసులు కుట్ర పన్నారని మండిపడ్డారు. ఈ మేరకు జయపురంలో నిరసన ర్యాలీ శుక్రవారం చేపట్టారు. కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో వేదాంత అల్యూమిన కంపెనీకి రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతోందని ఆరోపించారు. కావాల్సిన భూసేకరణ కోసం గ్రామసభ నిర్వహించలేదని మండిపడ్డారు. ఆ ప్రాంతం షెడ్యూల్ ఏరియా కావడంతో పాటు ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తుందని గుర్తు చేస్తూ వెంటనే రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని పోలీసు శిబిరాలను తొలగించాలని డిమాండ్ చేశారు. నిరసనలో జిల్లా కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, జిల్లా కార్యదర్శి రామకృష్ణ దాస్, సహాయ కార్యదర్శి బుద్ర బడనాయిక్, యువనేత నంద హరిజన్, విద్యార్థి నాయకుడు కృష్ణ ఖొర తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్ తవ్వకాలపై రాజకీయ సెగ!
రాయగడ: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని కాసీపూర్ సమితి సిజిమాలి మైనింగ్ తవ్వకాలకు సంబంధించి వేదంత కంపెనీకి అనుమతులు ఇచ్చి్ంది. దీ.ంతో ఆ ప్రాంతంలొ బాక్సయిట్ నిక్షేపాలను తవ్వేందుకు రహదారి నిర్మాణంలో భాగంగా తలెత్తిన వివాదంతో రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రోడ్డు నిర్మించేందుకు ఇటు జిల్లా యంత్రాంగం పట్టుబడుతుండగా స్థానికులు తమ భూమిని కాపాడుకోవడానికి ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు కాసీపూర్లోని ప్రభావిత గ్రామాలో విస్తృతంగా పర్యటించి తమ సానుభూతిని గ్రామస్తులకు తెలపడంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతున్నారు. మరో వైపు పోలీసుల దురుసు ప్రవర్తనను వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరుణంలొ శుక్రవారం రాష్ట్ర పీసీసీ అధినేత భక్తచర ణ్ దాస్ ఆదేశాను సారం 13 మందితో కూడిన కాంగ్రెస్ సభ్యుల బృందం కంటమాల్ గ్రామంలో పర్యటించింది. కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉల క నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు తారాప్రసాద్ బాహిని పతి, సురేంద్ర రౌత్రాయ్, మీనాక్షి బాహిని పతి, ఎమ్మెల్యే రామచంద్ర కడమ్, రాయగడ ఎంఎల్ఏ, డీసీసీ అధ్యక్షుడు అప్పలస్వామి కడ్రక, గుణుపూర్ ఎంఎల్ఏ సత్యజీత్ గొమాంగో, మాజీ ఎంపి యశ్వంత్ నారాయన్ సింగ్ లగురి, మాజీ ఎంఎల్ఏ భజ్బల్ మాఝి, రత్నమణి ఉలక తదితర సీనియర్ నాయకులతో కూడిన బృందం గ్రామంలో పర్యటించి స్థానికుల తో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఒక నివేదికను పీసీ అధ్యక్షుడికి సమర్పించనున్నారు. ఏది ఏమైనప్పటికీ కంటమాల్లొ చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయనడంలో ఏమాత్రం అతశయోక్తి కాదు. -
క్రీడా కాంప్లెక్స్ సందర్శన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని క్రీడా కాంప్లెక్స్, వసతి గృహాన్ని శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ సందర్శించారు. జిల్లాలో క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడం, యువకుల ప్రతిభలను వెలుగులోకి తీసుకురావడం కోసం జిల్లా పరిపాలన యంత్రాంగి చర్యలు చేపట్టిందన్నారు. ఈ సందర్భగా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ క్రీడాకారులకు సంబంధించి వసతుల అబివృద్ధి, రాబోయే రోజుల్లో జరగనున్న సీఎం ట్రోఫీకి ఏర్పాట్లను పరిశీలించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని వివిధ విభాగాలను సందర్శించారు. క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు అథ్లెట్లకు మెరుగైన శిక్షణ కోసం ట్రాక్ స్థితిని పరిశీలించి.. దాని సంరక్షణతో పాటు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ సమితుల్లో ఉన్న ఇండోర్ స్టేడియాలను సక్రమంగా నిర్వహిస్తూ ఎల్లప్పుడు క్రీడాకారులకు ఉపయోగపడేలా ఉంచాలని జిల్లా క్రీడాధికారికి సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణాన్ని సురక్షితంగా ఉంచేందుకు గోడ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సీఎం ట్రోఫీ క్రీడా పోటీలను మల్కన్గిరిలో ఘనంగా నిర్వహించేందుకు లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించా రు. అలానే హస్టల్లో ఉంటున్న క్రీడాకారుల సమస్యలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా క్రీడాశాఖ అధికారులు ఉన్నారు. -
తీరానికి చేరిన తిమింగలం కళేబరం
భువనేశ్వర్: కేంద్రాపడా జిల్లా గహిర్మఠ్ సముద్ర అభయారణ్యం ప్రాంతం మదాలి నది ముఖ ద్వారం సమీపంలో భారీ నీలి తిమింగలం కళేబరం ఒడ్డుకు చేరింది. స్థానికులు వెంటనే మండల అటవీ అధికారి (డీఎఫ్ఓ)కు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కపిలేంద్ర ప్రధాన్, జంతు వైద్య అధికారి డాక్టర్ ప్రకాష్ కుమార్ జెనా ఆధ్వర్యంలో ప్రత్యేక బందం ఘటనా స్థలం సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రాథమిక పరీక్షలో సుమారు 4 నుంచి 5 ఏళ్ల వయసు కలిగిన ఆడ తిమింగలంగా ధ్రువీకరించారు. కళేబరం దాదాపు సగం కుళ్లిపోయినట్లు గుర్తించారు. 12 నుంచి 15 రోజుల క్రితం సముద్రంలోనే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. కళేబరం నుంచి తీవ్ర దుర్వాసన వెలువడడంతో లోతుగా పరిశీలించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. బలమైన గాలులు, ఆటుపోట్ల ప్రవాహాలతో కళేబరం ఒడ్డుకు చేరి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మరణానికి కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. చేపల వేట పడవను ఢీకొనడం, ఇతర తెలియని కారణాలు కావచ్చని చెబుతున్నారు. ఐదేళ్ల కిందట ఇదే ప్రాంతంలోని చించీరి నదీ ముఖ ద్వారం, కొంతియా ఖాయ్ సమీపంలో 2 భారీ తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. గహిర్మఠ్ తీరం నీలి తిమింగలాలు, ఇతర సముద్ర జీవజాతులు కనిపించే ముఖ్యమైన సముద్ర ఆవాసాలలో ఒకటిగా నిలుస్తోంది. -
ఘనంగా సీఆర్పీఎఫ్ శౌర్య దివాస్
కొరాపుట్: కేంద్ర రక్షణ దళాలలో ఒకటైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 61వ శౌర్య దివాస్ ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో జానకీనగర్లో 12వ బెటాలియన్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రం సమీపంలో మవుళీ గ్రామానికి చెందిన విజయ్కుమార్ హరిజన్ 2009 ఏప్రిల్ 16న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులతో పోరాటం చేస్తూ అమరుడయ్యాడు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులైన హేమలత్ హరిజన్, బుధన్ హరిజన్లను బెటాలియన్ ఆహ్వానించి గౌరవ సత్కారం చేశారు. కార్యక్రమంలో కమాండెడ్ ఎన్కేకే ప్రసాద్, డిప్యూటీ కమాండెడ్ రాజీవ్కుమార్, అసిస్టెంట్ కమాండెడ్ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ సుజిత్ కుమార్, పీకే సాహు, సబ్ ఇన్స్పెక్టర్ బంద్ నామ్దేవ్ పాల్గొన్నారు. -
కంటామాల్లో శాంతియుత వాతావరణం తీసుకురావాలి
రాయగడ: ప్రకృతి సంపదను హరించి వేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న దమన కాండను ఆపివేయాలని, అమాయకులైన ఆదివాసీలపై పెట్టిన అబద్ధపు కేసులను ఉపసంహరించుకోవాలని.. లేదంటే తమ పార్టీ తరఫున ఆదివాసీలకు మద్దతుగా ఆందోళన చేపట్టడం ఖాయమని అటాఘడ్ ఎంఎల్ఏ, బీజేడీ సీనియర్ నాయకుడు రాణేంద్ర ప్రతాప్ స్వయి అన్నారు. జిల్లాలొని కాసీపూర్ లోని కంటామాల్లో ఇటీవల పోలీసులు, గ్రామస్తు ల మధ్య జరిగిన ఘటనకు సంబంధించి గురువా రం నాడు ఆ పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీంలో పాల్గొని వివరాలు సేకరించిన అనంతరం శుక్రవారం నాడు స్థానిక హోటల్ విజేత కాంటినంటల్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాసీపూర్లో ఇప్పటికీ ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారని అన్నారు. పోలీసులు చేసిన దమనకాండ కారణంగా గ్రామంలొ ఎంతొ మంది గాయాలు పాలయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమితిలొ గల సిజిమాలి బాక్సయిట్ తవ్వకాలకొసం వేదంత కంపెనీకి అనుమతులు ఇవ్వడంతొ ఆ కంపెనీ ప్రజల గ్రామస్తులు అనుమతులు లేకుండా రహదారిని ఏర్పాటు చేయడం తొ గ్రామస్తులు అడ్డుకున్నారని అన్నారు. అయితే అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతొ పాటు అర్ధరాత్రి సమయంలొ కంటామాల్ గ్రామంలొ సృష్టించిన దమన కాండ కారణంగానే పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని వివరించారు. గ్రా మ, పల్లెసభలు లేకుండా బాక్సయిట్ నిక్షేపాలను తవ్వడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృధ్ది పేరిట వినాసం సృష్టిస్తుందనడానికి కంటమాల్లొ ఇటీవల చోటు చేసుకున్న పరిణామమే నిదర్శనమని అన్నారు. పోలీసులు దాడులకు అమాయక ఆదివాసీలు గాయాలు పాలవ్వడం విచారకరమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికై న నిద్ర లేచి పరిస్ధితిని సమీక్షించాలని డిమాండ్ చేసారు. అదేవిధంగా కంటామాల్ గ్రామంలొ అమలు చేసిన బిఎన్ఎస్ 163 సెక్షన్ ను ఎత్తి వేయడంతొ పాటు అక్కడ శాంతియుతమైన వాతావరణం ఏర్పాటుకు చర్యలు తీసుకొవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. జంగల్, జమీ అన్న నినాదాలతొ ఆదివాసీలు వారి హక్కుల కొసం పోరాడుతున్నారని వారి హక్కులను కాలరాయడం ప్రజా వ్యతిరేకతకు దారి తీస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం చోరవ తీసుకుని ఖనిజ నిక్షేపాలు గల ప్రాంతాల్లొ ఉన్న ప్రజలతొ సమావేశాలను నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాకే తవ్వకాల కొసం ఏ కంపెనీకి అను మతులు ఇచ్చినా అభ్యంతరాలు ఎదురవ్వవని అ న్నారు. ఈ సమావేశంలొ బిజేడి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాధ సరక, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు అనసూయా మాఝిలు పాల్గొన్నారు. -
● స్వర్గ రథం ప్రారంభం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మలో ఉచితంగా మృతదేహాలను తరలించడం కోసం సమాజ సేవకుడు, న్యాయవాది మున్న దొర సొంత నిధులతో స్వర్గ రథాన్ని సమకూర్చారు. దీన్ని కొరాపుట్ జిల్లా అదనపు కలెక్టర్ నరేష్ చంద్రశబర శుక్రవారం ప్రారంభించారు. బొరిగుమ్మ, పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది ఉపయోగంగా ఉంటుందన్నారు. దాత మున్న దొరను అభినందించారు. ప్రజల సామాజిక అవసరాలు తీర్చేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బొరిగుమ్మ సూర్యభాను గ్రంథాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో బొరిగుమ్మ సబ్డివిజనల్ పోలీసు అధికారి (ఎస్డీపీవో) సత్యబ్రత లెంక, బొరిగుమ్మ అదనపు తహసీల్దార్ బోయిన సతీష్, విశ్రాంత ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ రథ్, మునా దొర తండ్రి, రిటైర్డ్ పోలీసు అధికారి బిజయ కుమార్ దొర, సూర్యభాను గ్రంథాలయ పరిశీలన కమిటీ అధ్యక్షులు బిజయనారాయణ సాహు, బొరిగుమ్మ న్యాయవాదుల సంఘ అధ్యక్షులు నాగరాజు దొర, సూర్య ఆచారి, న్యాయవాదులు అశోక్ గంతాయిత్, ప్రసాద్ బాడిక, బిష్ణు షొడంగి పాల్గొన్నారు. -
138 మందికి గృహ నిర్మాణాలు
జయపురం: ఒడిశా ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి విభాగం అనుమతి మేరకు 138 మంది లబ్ధిదారులకు ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకంలో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను స్థానిక బాబా సాహేబ్ కల్యాణ మండపంలో శుక్రవారం జయపురం మున్సిపల్ అధికారులు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జయపు రం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధా న మంత్రి అవాస్ యోజన పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలు అందజేశామన్నారు. జయపురం మున్సిపాలిటీ పరిధిలో నాలుగు వేలకు పైగా లబ్ధిదారుల జాబితా తయారీ చేసి మంజూరు చేయటం జరిగిందన్నారు. వారిలో 3,400 మంది ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారన్నారు. ప్రస్తుతం పత్రాలుపొందిన వారు కూడా సకాలంలో గృహ నిర్మాణాలు చేపట్టాలన్నారు. మున్సిపల్ చైర్మ న్ నరేంద్రకుమార్ మహంతి, వైస్ చైర్మన్ బి.సునీ త, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి పూజా రౌ త్, కౌన్సిలర్లు, మునిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
పురపాలక సంఘ వార్షిక బడ్జెట్పై చర్చ
పర్లాకిమిడి: పర్లాకిమిడి పురపాలక సంఘం 2026–27 బడ్జెట్ సమావేశాలు మున్సిపల్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగాయి. సమావేశానికి పురపాలక సంఘం చైర్మన్ నిర్మల శెఠి అధ్యక్షత వహించగా, గౌరవ అతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, వైస్ చైర్మన్ లెంకమధు, ఎగ్జిక్యూటివ్ అధికారి లక్ష్మణ ముర్ము, ఇంజినీర్లు, కౌన్సిలర్లు హాజరయ్యారు. కౌన్సిలర్లు యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని చైర్మన్ నిర్మలా శెఠి కోరారు. అలాగే వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, ముక్తా పథకం, వీధి లైట్లు, పాఠశాలల మరామతులపై నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే ఆర్థిక సంవంత్సరంలో గృహాలు, వ్యాపార సమూదాయాల ప్రాపర్టీ, హోల్డింగ్ ట్యాక్సులు, కలెక్షన్ కూడా లక్ష్యాలు చేరుకోవాలని ట్యాక్స్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కౌన్సిలర్లు బబునా బెహారా, అమ్ములమ్మ, బబునా బెహారా, నారాయణరావు బెహారా ఉన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీ రాయగడ: స్థానిక రైతుల కాలనీలో నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నిరుపేదలైన 40 మంది వృద్ధ ఆదివాసీ మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ట్రస్టు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతీనెల ఇటువంటి తరహా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని తెలియజేశారు. తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీధర్ ఆచార్యులు ఇక్కడ ట్రస్టుని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. ప్రతినెలా ఆదివాసీలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడంతో పాటు ట్రస్టు ద్వారా అనాథ, పేద ఆదివాసీ యువతులకు ఉచితంగా చదివించడంతో పాటు వారికి భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. సుమారు వంద మందికిపైగా ఆదివాసీ యువతులు ట్రస్టు ద్వారా ఈ సౌకర్యాలు పొందుతున్నారని వెల్లడించారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై పునఃపరిశీలించాలిభువనేశ్వర్: భువనేశ్వర్ మెట్రో రైలు ప్రాజెక్టును నిలిపివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని భువనేశ్వర్ లోక్సభ సభ్యురాలు అపరాజిత షడంగి రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ప్రకటించారు. ప్రాజెక్టును మూసివేయడానికి పేర్కొన్న కొన్ని కారణాలు, వాస్తవ అవసరాల వాస్తవిక విశ్లేషణపై ఆధారపడినట్లు కనిపించడం లేదని లేఖలో వివరించారు. విస్తృతంగా పట్టణీకరణ చెందుతున్న రాజధాని ప్రాంతానికి మెట్రో రైలు ప్రాజెక్టు ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంగా పేర్కొన్నారు. -
22 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా పోలీసులు 22 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కొరాపుట్ నందపూర్ సమితి పాడువా పోలీస్స్టేషన్ ఆవరణలో ఎస్డీపీవో దేవేంద్ర కుమార్ మాలిక్ కేసు వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దేవతీగుడ అటవీ ప్రాంతంలో దాడులు చేపట్టామన్నారు. రవాణా కోసం సిద్ధంగా 180 బస్తాల్లో ఉంచిన గంజాయిని తమ సిబ్బంది గుర్తించరన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీస్స్టేషన్కి తరలించి తూకం వేయగా 22 క్వింటాళ్లు ఉందన్నారు. దీని విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని ప్రకటించారు. మెజిస్ట్రేట్ సమక్షంలో సీజ్ చేసి కోర్టుకి నివేదించామన్నారు. గంజాయి స్మగ్లర్ల కోసం గాలింపులు చేస్తున్నామని ఎస్డీపీవో ప్రకటించారు. -
కంటామాల్లో వామపక్ష నేతల పర్యటన
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి కంటమాల్ లో రహదారి నిర్మించే విషయంలో అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన సంఘటనపై వామపక్ష నాయకులు శుక్రవారం ఆ గ్రామంలో పర్యటించారు. సీపీఐ రాష్ట్ర శాఖ కార్యద ర్శి డాక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రో నేతృత్వంలో సీపీఐఎంకి చెందిన రాష్ట్ర శాఖ కార్యదర్శి సురేష్ చంద్ర పాణిగ్రహి, సీపీఐ ఎంఎల్ లిబరేషన్కి చెందిన రాష్ట్ర శాఖ కార్యదర్శి యుధిష్టర్ మహాపాత్రో, ఆలిండి యా ఫార్వర్డ్ తరగతులకు చెందిన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పూర్ణచంద్ర షడంగి, తిరుపతి గొమాంగో తదితర నాయకులు పర్యటనలో ఉన్నారు. ముందుగా గ్రామస్తులతో సమావేశమైన నాయకులు అసలు జరిగిన విషయమై ఆరాతీశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తామంతా అండగా ఉంటా మని భరోసా ఇచ్చారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందుకు తాము కూడా ఆందోళనకు సహకరిస్తామ ని అన్నారు. అర్ధరాత్రి నిందితుని అరెస్టు చేసేందు కు పోలీసులు కంటమాల్ గ్రామానికి వెళ్లి సృష్టించి న రభస గురించి తెలుసుకున్నారు. అక్కడితో ప్రా రంభమైన ఘటన చినికి చినికి వానలా మారిందని అన్నారు. రహదారి నిర్మించే విషయంలో అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో పాటు టియర్ గ్యాస్ వంటివి వినియోగించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య జరిగిన ఘర్షణలో కేవలం పోలీసులకు మాత్రమే గాయాలైనట్లు వస్తున్న ప్రచారా న్ని వామపక్ష నేతలు ఖండించారు. అంతకు ముందురోజు కంటమాల్ గ్రామంలో పోలీసులు అర్ధరా త్రి చేపట్టిన నిర్వాకంలో చాలామంది గ్రామస్తులు గాయపడిన విషయం మరిచిపొకూడదని అన్నారు. మహిళలని చూడకుండా వారిపై దాడి చేయడం పోలీసుల నిరంకుశ వైఖరికి నిదర్శనంగా ఉందని నాయకులు ఆరోపించారు. అనంతరం కంటమాల్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంఽధించి సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణికి వినతిపత్రం సమర్పించారు. -
11 కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ 38వ సమావేశం లోక్ సేవా భవన్లో శుక్రవారం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి మండలి కీలక తీర్మానాల వివరాలను ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ మీడియాకు వివరించారు. మంత్రి మండలి ఆమోదం కోసం 5 శాఖలు 11 ప్రతిపాదనలు ప్రవేశ పెట్టాయి. ప్రధాన ప్రతిపాదనలలో పార్వతీ గిరి మెగా లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమంలో భాగంగా రూ. 626 కోట్ల వ్యయ ప్రణాళికతో హదువా ప్రాజెక్ట్ పథకానికి మంత్రి మండలి ప్రాధాన్యత కల్పించింది. సోన్పూర్, సంబల్పూర్, జాజ్పూర్, కెంజొహర్, మయూర్భంజ్, కటక్ లబ్ది పొందుతాయి. మెట్ట, కరువు పీడిత ప్రాంతాల్లో పంటల వైవిధ్యీకరణ (వాణిజ్య పంట లు) ప్రోత్సాహానికి సూక్ష్మ నీటిపారుదల సౌకర్యా లు అందుబాటులోకి తెస్తారు. అటల్ బస్ స్టాండ్ పథకం.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే లక్ష్యంతో రూ. 3,400 కోట్ల వ్యయంతో రూపొందించిన ప్రతిష్టాత్మక అటల్ బస్ స్టాండ్ పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2031–32 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకీకృత నిర్వహణ కింద రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, సబ్ డివిజన్లు, మండలాలు, పట్టణ స్థానిక సంస్థలు, పర్యాటక కేంద్రాల్లో బస్ స్టాండ్ల ఆధునీకరణ పూర్తి చేస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రాధాన్యతకు అనుగుణంగా ఎ, బి, సి తరగతులుగా వర్గీకరించి బస్ స్టాండ్లలో ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలు, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రభుత్వ, ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఉభయ వర్గాలకు అవకాశం కల్పించేందుకు మంత్రి వర్గం అంగీకరించింది. 318 బస్టాండ్ల ఉన్నతీకరణ.. రాష్ట్ర వ్యాప్తంగా 318 బస్ స్టాండ్లను ఉన్నతీకరించనున్నారు. ఈ చర్య ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, రవాణా అనుసంధానా న్ని బలోపేతం చేస్తుందని మంత్రి మండలి అభిప్రాయపడింది. మౌలిక సదుపాయాల పెంపు.. రాష్ట్రంలో అత్యంత ఖనిజ సంపద కలిగిన ప్రాంతాలలో అధిక విద్యుత్ వినియోగం గల అనేక భారీ పరిశ్రమలకు కేంద్రంగా వెలుగొందుతున్న జోడా, బర్బిల్, పలాస్పంగ్ ప్రాంతంలో ఉన్న గ్రిడ్ సబ్–స్టేషన్లు ప్రస్తుతం గరిష్ట సామర్థ్యంతో పని చేస్తున్నాయి, అదనపు మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కెంజొహర్ జిల్లా బాసుదేవ్పూర్లో అనుబంధ ట్రాన్స్మిషన్ లైన్లతో పాటు జీఐఎస్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి మార్గం సుగమం అయింది. రూ. 1,647.00 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును ఓపీటీసీఎల్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 494.10 కోట్ల 30 శాతం ఈక్విటీ మద్దతు కల్పిస్తుంది. కార్మిక సేవా నిబంధనలకు సవరణ.. ఒడిశా కార్మిక సేవా (నియామక విధానం, సేవా నిబంధనలు) నియమావళి, 2019 సవరణలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ మార్పుల ప్రకారం 2019లో ఈ నియమావళి అమల్లోకి రాకముందు నియమితులైన సహాయ కార్మిక అధికారు లు, గ్రామీణ కార్మిక ఇన్స్పెక్టర్లకు శాఖాపరమైన పరీక్షల నుంచి మినహాయింపు లభిస్తుంది. కటక్ మండలాల కోసం నీటిపారుదల ప్రాజెక్ట్.. కటక్ జిల్లాలోని నరసింహపూర్, బొడొంబ, టిగిరి యా మండలాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న హదువా నీటిపారుదల ప్రాజెక్టుతో కరువు పీడిత ప్రాంతాల్లోని 3,641 హెక్టార్ల సాగు భూమికి హామీతో కూడిన నీటిపారుదల అందించేందుకు ఖరోడ్ గ్రామం సమీపంలో హదువా నదిపై ఒక జలాశయంతో పాటు పంపిణీ వ్యవస్థను నిర్మిస్తున్నారు. హదువా డ్యామ్ నిర్మాణం ఇప్పటికే పురోగతిలో ఉంది. -
రోడ్డు నిర్మాణం చేపట్టాలి
● కర్తాన్పల్లి పంచాయతీ ప్రజల విజ్ఞప్తిమల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితి కర్తాన్పల్లి పంచాయతీ దుతిబేడ గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేదు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామం నుంచి కియాంగ్, సలీమ్ పంచాయలు దాటి కర్తన్పల్లి పంచాయతీ రావాలంటే నరకాన్ని చైస్తున్నారు. సుమారు 12 కిలో మీటర్ల రోడ్డు పూర్తిగా శిథిలమైంది. దీంతో చినుకుపడితే చిత్తడిగా మారి నడిచి వెళ్లేందుకు కూడా అవకాశం లేదు. వర్షం కురిస్తే రాకపోకాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ పరిస్థితి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని కోరుతూ సమితి అధ్యక్షురాలు లక్ష్మీప్రియా నాయక్ పలుమార్లు జిల్లా పరిపాలన కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. అయిన్పటికీ ఎలాంటి స్పందన లేదు. పింఛన్లు, రేషన్ సరుకులు తీసుకోవడానికి వెళ్లేందుకు కూడా ప్రజలు అవస్థలు పడుతున్న విషయాన్ని కూడా లక్ష్మీప్రియా నాయక్ అధికారులకు విన్నవించి ఉన్నారు. అధ్వానంగా ఉన్న రోడ్డును ఆమె గురువారం మారోసారి పరిశీలించారు. రోడ్డు దుస్థితిపై మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని గ్రామస్తులకు వివరించారు. -
ఘనంగా కళాశాల వార్షికోత్సవం
జయపురం: పట్టణంలోని ప్రభుత్వ మహిళా కళాశాల 40వ వార్షికోత్సవాన్ని గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి విద్యార్థినులు సాంప్రదాయ గౌరవాన్ని కాపాడుతూ చదువులో కళాశాలకు మంచి గుర్తింపు తెస్తున్నట్లు కొనియాడారు. అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలకు బహు మతులు ప్రదానం చేశారు. ప్రిన్సిపాల్ వివేకానంద సున అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విక్రమదేవ్ విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ మహేశ్వర్ చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.పోలీస్స్టేషన్ తనిఖీ కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ నబరంగ్పూర్ జిల్లా కేంద్ర పోలీస్స్టేషన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాయంత్రం స్టేషన్లో వివిధ గదులు పరిశీలించారు. రికార్డులు, నిందితుల సెల్, వసతులు, కక్షిదారుల ప్రాంతం తదితర అంశాలు క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. హైకోర్టు నిబంధనలు ప్రకారం ఈ పరిశీలన జరిగింది. ఈ సమయంలో ఐఐసీ సంబిత్ బెహరా కలెక్టర్కి స్టేషన్ వివరాలు తెలియజేశారు.చోరీ కేసులో నిందితుడు అరెస్టు కొరాపుట్: ఒక ఇంట్లో దొంగతనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్ర పోలీస్స్టేషన్ ఐఐసీ సంబిత్ బెహరా ఈ కేసు వివరాలు ప్రకటించారు. పట్టణంలోని ఆర్కే కాలనీలో నివాసం ఉంటున్న ప్రియాంక పాత్రో నివాసంలో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో 6 ఆభరణాలు, రూ.10 వేల నగదు, ఒక చేతి గడియారం చోరీకి గురయ్యాయి. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా పట్టణంలోని తొట్టా వీధికి చెందిన రోమ్యా అలియస్ రొణ్య ఖొరఖొర దొంగతనం చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి జైలుకి తరలించినట్లు పోలీసులు ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం ● ఇద్దరికి గాయాలు రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధి లిటిగుడ కూడలి వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలయ్యారు. మృతుడు కలహండి జిల్లాలోని కలమ్పూర్ ప్రాంతానికి చెందిన కేశవ సాహు (34) కాగా గాయపడిన వారు మురిబహాల్ ప్రాంతానికి చెందిన ప్రమోద్ సాహు, కేదారనాథ్ సాహులుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న మునిగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం మునిగుడ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆంబులెన్స్లో మునిగుడ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కలహండి జిల్లాకు చెందిన కేశవ, ప్రమోద్, కేదార్నాథ్లు ఒకే బైక్పై మునిగుడకు వస్తుండగా లిటిగుడ కూడలి వద్ద ఎదురుగా వస్తున్న మరో బైకును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. వీరిలో కేశవ సంఘటనా స్థలం వద్దే ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎరువులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
జయపురం: రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైనంత ఎరువులు సమకూర్చే విషయంపై చర్చించేందుకు గురువారం వ్యవసాయ అధికారులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు ఎరువులు కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ ఎరువుల విక్రేతగా నియమించిన మార్క్ఫెడ్, ప్రాంతీయ సహకార మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు జయపురం ప్రధాన వ్యవసాయ అధికారి సంతోష్ కుమార్ ధళబెహర అధ్యక్షతన జరిగిన సమావేశంలో రానున్న ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా ధాన్యం రైతులకు అవసరమైన యూరియా, పొటాస్, తదితర ఎరువులు ఎలా సమకూర్చాలన్న దానిపై చర్చించారు. గత ఏడాది యూరియా కొరత ఏర్పడిన విషాయాన్ని గుర్తుచేసిన అధికారులు, ఈ ఖరీఫ్ సీజన్లో అటువంటి పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ఎరువుల కంపెనీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఎరువుల విక్రేతలు.. గుర్తింపు కార్డులు ఉన్న రైతులకే ఎరువులు అమ్మాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సహకార విభాగం డిప్యూటీ రిజస్ట్రార్ ఆఫ్ కోఆపరేటీవ్, మనోస్ రాయ్, జయపురం సహాయ వ్యవసాయ అధికారి లలిటేందు మహాపాత్ర, నందపూర్ వ్యవసాయ విభాగ సహాయ అధికారి సుజాత నిశంకొ, కొరాపుట్ వ్యవసాయ అధికారి కహ్నూచరణ దాస్, ఎరువుల సరఫరా విభాగ అధికారి సంగీత బెహరా, తదితరులు పాల్గొన్నారు. ఎరువులు నల్ల బజారుకు వెళ్ల కుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ విభాగ అధికారి సంబంధిత వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువులు అమ్మే సమయంలో రైతుల గుర్తింపు కార్డులు పరిశీలించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు అమ్మాలని, ఎరువులు నిల్వ ఉంచేందుకు గొదాంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
రంగస్థలం సిద్ధం
● నేటి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల 4వ ఆహ్వాన నాటిక పోటీలు శ్రీకాకుళం కల్చరల్: శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి బాపూజీ కళామందిర్లో ఉభయ తెలుగు రాష్ట్రాల 4వ ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బాపూజీ కళామందిర్ వద్ద ఏర్పాట్లు చేశారు. ● రాత్రి 7 గంటలకు శివశ్రీ నృత్య కళానికేతన్ విద్యార్థుల నృత్య ప్రదర్శన. ● 7.30 గంటలకు హైదరాబాద్కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘సీ్త్ర మాత్రే నమః’ నాటిక ప్రదర్శన. ● 9 గంటలకు పెందుర్తికి చెందిన నటరాజ డ్రమోటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘నీళ్లు– నీళు’ సాంఘిక నాటిక. ● 11న 7గంటలకు విశాఖపట్నం వారికి చెందిన తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ‘చిటికెన వేలు’ నాటిక. ● 8.30 గంటలకు విజయవాడకు చెందిన శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్’ ఆధ్వర్యంలో ‘మరో పుత్తడి బొమ్మ’ నాటిక. ● 12న 6గంటలకు ఎల్.రామలింగస్వామికి జీవితి సాఫల్య పురస్కార సభ. ● 7.30 గంటలకు కాకినాడకు చెందిన బీవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ‘కన్నీటికి విలువెంత’ నాటిక ప్రదర్శిస్తారు. ● 9గంటలకు విజయవాడకు చెందిన హర్ష క్రియేషన్స్ ఆధ్వర్యంలో ‘చెరిగిపోని చిరునామా’ నాటికలు పోటీలు ప్రదర్శిస్తారు. ఆనంతరం ముగింపు సభ, బహుమతి ప్రధానోత్సవం ఉంటాయి. -
నేడు కాంగ్రెస్ బృందం పర్యటన
రాయగడ: కాసీపూర్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కాంగ్రెస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందం శుక్రవారం పర్యటించనుంది. పి.సి.సి అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ ఈ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీని కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలో మాజీ మంత్రి సురేష్ కుమార్ రవుత్రాయ్, ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణిపతి, గునుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర సావుంత, మంగుఖిలి, మాజీ ఎంపీ యశ్వంత్ సింహ్ లగురీ, బుజబల్ మాఝి, మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణిపతి, రత్నమణి ఉలక, అమిత బిశ్వాల్ ఉన్నారు. సగుబారి, కంటమాల్ గ్రామాల ప్రజలతో సమావేశమై వివరాలను సేకరిస్తారు. చెట్లు నరికితే చర్యలు తప్పవు మల్కన్గిరి: మల్కన్గిరి సమితి ఎంవీ 109 గ్రామ సమీప అడవిలో బుధవారం రాత్రి కొంతమంది గ్రామస్తులు అటవీ శాఖ అనుమతి లేకుండా 20 చెట్లు నరికివేశారు. అయితే గురువారం ఈ విషయం తెలుసుకున్న ఫారెస్టర్ అడవిని చూసి విచక్షణారహితంగా చెట్లు నరికివేసిన గ్రామస్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే.. మల్కన్గిరికి చెందిన సురేంద్ర కుమార్ బేమల్ అనే వ్యక్తి అటవీ శాఖ అనుమతి లేకుండా తన సొంత భూమి పనులు కోసం గ్రామాస్తులు కొందరి సాయంతో చెట్లను నరికించాడు. వాటిలో ప్రభుత్వ భూములకు చెందిన కొన్ని చెట్లు ఉన్నాయి. సమాచారం రావడంతో ఫారెస్ట్ గార్డు ప్రశాంతి రౌత్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒక వ్యక్తి తన సొంత పనులు కోసం ఇలా చెట్లు అవసరమైతే ముందుగా అటవీ శాఖకు ఒక లేఖను రాయలని సూచించారు. బైక్ చోరీ నిందితుడు అరెస్టు మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి బెజంగివాడ పంచాయతీలో నివసిస్తున్న సహదేవ్ సాహు అనే ఉపాధ్యాయుడి బైక్ను దొంగలించిన వ్యక్తిని కలిమెల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే... బెంగంగ్వాడ పంచాయతీలో ఉన్న పాఠశాల ఉపాధ్యాయుడు సహదేవ్ గత ఆదివారం తన బైక్ను ఇంటిముందు పార్క్ చేశాడు. అయితే ఆ బైక్ను దొంగలించారు. దీంతో సోమవారం ఉదయం కలిమెల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా ఐఐసీ ప్రభుదత్ విశ్వాల్ కేసు నమోదు చేసి దర్యాస్తు చేపట్టారు. దీంట్లో భాగంగా బెంజంగవాడ గ్రామానికి చెందిన డి.ప్రకాశరావు అనే వ్యక్తి ఈ దొంగతనం చేసినట్లు తేలుసుకొని, బైక్, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామన్నారు. -
బంగారు ఆభరణాల చోరీ
రాయగడ: జిల్లాలోని అంబొదల పోలీస్స్టేషన్ పరిధి హటొ దైహికాల్ గ్రామంలో నివసిస్తున్న ఒక వ్యాపారి ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి కత్తులు, మరణాయుధాలతో బెదిరించి ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు దోపిడీ చేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు, పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఆరుగురు గుర్తు తెలియని దుండగులు అజిత్ సాహుకార్ అనే వ్యాపారి ఇంటికి సంబంధించిన ఇనుప గ్రిల్ను కట్ చేసి లోపలకు వెళ్లారు. మాస్కులు, గ్లౌవ్స్ ధరించిన దుండగులను చూసిన అందరూ లేచి కేకలు పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో దుండగులు ఇంట్లో ఒకరి మెడపై కత్తి పెట్టి బెదిరించారు. అనంతరం ఇంట్లోని 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదును దోచుకున్నారు. కేసు నమోదు చేసిన ఐఐసీ కేశవ్షడంగి పరిసరాల్లో సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. -
510 కిలోల గంజాయిని స్వాధీనం
పర్లాకిమిడి: ఆర్.ఉదయగిరి బ్లాక్ గోయిబడి ఏజెన్సీలో గురువారం తెల్లవారుజామున సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు తన బృందంతో జరిపిన దాడుల్లో 17 సంచుల్లో గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. అడవుల్లో దాచిన 510 కిల్లోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్.డి.పి.ఓ రాకేష్ సాహు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ మార్కెట్లో రూ.50 లక్షలు ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఆర్.ఉదయగిరి పోలీసు ష్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని సబ్ డివిజనల్ పోలీసు అధికారి తెలియజేశారు. -
నిర్మానుష్యంగా కంటామాల్
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ పరిధిలో పరిస్థితి శాంతియుతంగా ఉన్నప్పటికీ పలు గ్రామాలకు చెందిన ప్రజలు తమ గ్రామాలను విడిచి వేరే ప్రాంతంలో తలదాచుకునేందుకు వెళ్లడంతో నిర్మానుష్యంగా మారాయి. సిజిమాలి బాకై ్సట్ నిక్షేపాలను తవ్వుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేదంత కంపెనీకి అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో బాకై ్సట్ను తవ్వి తరలించేందుకు వీలుగా సగుబారి నుంచి సిజిమాల్ బాకై ్సట్ కొండల వరకు కంపెనీ రహదారి నిర్మిస్తున్న సమయంలో అడ్డుకున్న బాధిత గ్రామాల ప్రజలు పోలీసులపై రాళ్లురువ్వడంతో 58 మంది వరకు పోలీసులు గాయాలపాలైన సంగతి తెలిసిందే. పోలీసులను గాయపరచడంతో ఎప్పుడు ఏ పరిస్థితి సంభవిస్తుందో అన్న భయంతో గ్రామస్తులు తమ ఇళ్లకు తాళాలు వేసి వేరే ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. సమితిలోని కంటామల్ గ్రామంలో సుభాషిన్ మాఝి అనే వ్యక్తిపై 14 కేసులు ఉండటంతో అమెను అరెస్టు చేసేందుకు పోలీసులు సోమవారం రాత్రి బలగాలతో చేరుకున్నారు. సుభాషిన్ మాఝిని అరెస్టు చేసందుకు సన్నహాలు చేశారు. అప్పటికే గ్రామస్తులను పోలీసులు బెదించడంతోపాటు కొంతమంది గ్రామస్తులను గాయపరిచారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడి నుండి పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. మరుచటి రోజు మంగళవారం పూర్తి పోలీస్ బందోబస్తుతో సగుబారి రహదారిని వేసేలా కంపెనీకి అండగా నిలిచారు. ఆది నుంచి తమ ప్రాంతంలో బాకై ్సట్ నిక్షేపాలను తవ్వద్దని, దీని వల్ల పర్యావరణం నష్టమవ్వడంతోపాటు అడవి తల్లినే నమ్ముకుని ఉన్న ఆదివాసీల జీవనోపాధి కోల్పోతారని అంతా వ్యతిరేకించారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడంతో గ్రామస్తులు మరణాయుధాలతో ప్రతిఘటించారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ను విడుదల చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలసులపై గ్రామస్తులు రాళ్లు రవ్వడంతో 58 మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు దక్షిణాంచల్ డీఐజీ చరణ్ సింగ్ మీనా కాసీపూర్లో మంగళవారం పర్యటించారు. -
చేనేత క్లస్టర్ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
పొందూరు: చేనేత క్లస్టర్ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని క్రాఫ్ట్ కౌన్సిల్ మెంబర్ మీనా అపనేందర్, డిజైనర్ గౌరంగ్షా అన్నారు మండలంలోని రాపాక కూడలి సమీపంలో గల 310 సర్వే నంబర్లో ఉన్న ఐదు ఎకరాల్లో చేనేత క్లస్టర్ ఏర్పాటు గురువారం స్థలాన్ని పరిశీలించారు. చేనేత క్లస్టర్ను ఏర్పాటు చేయడం ద్వారా అధునాతన డిజైన్ల తో చేనేత వస్త్రాలను రూపొందించడంతో మార్కెటింగ్ విస్తృతమవుతుందని అన్నారు. స్థల పరిశీలన చేసిన వారిలో ఆర్కిటిక్ నీలేష్, రీసర్వే డీటీ రాధాకృష్ణ, మండల సర్వేయర్ గణపతి, ఈఓ పొన్నాడ జగదీష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గిరిజన బాలిక హత్యపై ఆరా హిరమండలం: జిల్లాలో ఇటీవల జరిగిన గిరిజన బాలిక హత్యపై రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ కె.హరిబాబు గురువారం ఆరా తీశారు. ఈ కేసులో నిందితుడు రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక తహసీల్దార్ బాలకృష్ణతో పాటు పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సైతం పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రేమసాయి వృద్ధాశ్రమాన్ని జిల్లా న్యాయమూర్తి జస్టిస్ హరిబాబు సందర్శించారు. ఆశ్రమవాసుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికై నా న్యాయసంబంధ సమస్యలు ఉన్నా, ప్రభుత్వ పథకాలు అందకపోయినా, పింఛన్లు అందకపోయినా విన్నవించాలని కోరారు. అనధికార ర్యాంప్పై దాడులు శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కిల్లిపాలెం పరిసర ప్రాంతం కలెక్టరేట్ సమీపంలో గల నాగావళి నదీ తీరాన గడిచిన కొన్ని నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న అనధికారిక ఇసుక ర్యాంప్పై జిల్లా మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ సి.మోహన్రావు నేతృత్వంలో గురువారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక జేసీబీతో పాటు ఒక ట్రాక్టర్ను మైన్స్ అధికారులు స్వా ధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ శ్రీకాకుళం పరిధిలోని ఎవరైనా అనధికారికంగా ఇలాంటి ర్యాంప్లను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా యంత్రాంగం ఇచ్చిన అనుమతులు మేరకు మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని, వాల్టా చట్టాన్ని అధిగమించకూడదన్నారు. ‘పనుల్లో జాప్యం వద్దు’శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల అవసరాల కోసం కేటాయించిన ఎంపీ లాడ్స్ నిధులు ప్రతి పైసా సద్వినియోగం కావాలని, అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దని కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన 17, 18వ లోక్సభ ఎంపీ లాడ్స్ నిధుల సమీక్షలో ఆయన పాల్గొని, నిధుల వినియోగంపై శాఖల వారీగా విశ్లేషణ చేశారు. పనులు పూర్తయిన వెంటనే వాటికి సంబంధించిన ఫొటోలను ‘ఈ–సాక్షి’ పోర్టల్లో అప్లోడ్ చేయాలని, అప్పుడే నిధుల విడుదల వేగవంతం అవుతుందని అధికారు లను ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖలో ఇంకా 76 పనులు, విద్యుత్ శాఖలో 42 పనులు పెండింగ్లో ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా టెక్కలి, శ్రీకాకుళం డివిజన్ల పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కార్యనిర్వాహక ఇంజినీర్లను ఆదేశించారు. ‘పోషణ్ పక్వాడాను విజయవంతం చేయండి’ శ్రీకాకుళం అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15 వరకు నిర్వహించనున్న పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐసీడీఎస్ పీడీ కె.రూపలత పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులోగల ఐసీడీఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సీడీపీఓలతో సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా రూపలత మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఈనెల 9వ తేదీ నుంచి 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని అందరు అంగన్వాడీలు చేపట్టేలా చూడాలన్నారు. రాపాక కూడలి సమీపంలో చేనేత క్లస్టర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు మాట్లాడుతున్న రూపలత -
ఉప ముఖ్యమంత్రి ఆగ్రహం
భువనేశ్వర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ గురువారం ఆకస్మికంగా స్థానిక మైత్రి విహార్లోని విద్యుత్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం సందర్శించారు. ఇటీవల ఈ కార్యాలయంలో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు వెలుగు చూడడంతో ఆయన విజిలెన్స్ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉప ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3.15 గంటలకు సందర్శించిన వేళలో కార్యాలయంలో ఏ ఉద్యోగి కనిపించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరు సిబ్బంది వ్యతిరేకంగా తక్షణ చర్యకు ఆదేశాలు జారీ చేశారు. -
రైల్వే ప్రాజెక్టు బాధితులకు పరిహారం చెల్లింపు
జయపురం: జయపురం–నవరంగపూర్, జయపురం–మల్కనగిరి రైల్వే ప్రాజెక్టుల వలన ప్రభావితులైన బాధితులకు నష్ట పరిహారం అందజేసేందుకు గురువారం సభ నిర్వహించారు. జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి జేఝారి గ్రామంలో నిర్వహించిన నష్టపరిహార ప్రధాన కార్యక్రమంలో నవరంగపూర్ పార్లమెంట్ సభ్యులు బలభద్ర మఝి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జయపురం– నవరంగపూర్, జయపురం–మల్కనగిరి రైల్వే ప్రాజెక్టులు ఆదివాసీల అభ్యున్నతి, నవరంగపూర్, కొరాపుట్, మల్కనగిరి జిల్లాల ప్రజల ఆర్థిక, సామాజిక ప్రగతికి దోహదపడతాయని ఎంపీ అన్నారు. ఈ రెండు రైల్వే ప్రాజెక్టల వలన జయపురం సబ్డివిజన్లో జయపురం, బొరిగుమ్మ, బొయిపరిగుడ,, కుంద్రా సమితుల్లో భూములు కోల్పోయిన బాధిత ప్రజలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొదటి విడత 30 మంది బాధిత కుటుంబాలకు నష్ట పరిహారంగా రూ.15 కోట్లను ఎంపీ, అతిథులు అందజేశారు. జయపురం నుంచి నవరంగపూర్, జయపురం నుంచి మల్కనగిరి కొత్త రైల్వే ప్రాజెక్టుల కోసం 700 హెక్టర్ల భూమి సేకరించటం జరుగుతుందని సూచన ప్రాయంగా వెల్లడించారు. మిగతా వారికి త్వరలోనే పరిహారం చెల్లించటం జరుగుతుందని ఎంపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, బొరిగుమ్మ పంచాయతీ సమితి అధ్యక్షుడు దీప్తి మయి నాయక్, రైల్వే, రెవెన్యూ అధికారులు, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. రైల్వే ప్రాజెక్టుల వలన భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం ప్రధాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నవరంగపూర్ పార్లమెంట్ సభ్యులు బలభధ్ర మఝికి ప్రజలు, బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. -
కంటామాల్లో బీజేడీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన
రాయగడ: జిల్లాలోని కాసీపూర్లో మంగళవారం చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి బీజేడీ సుప్రీం, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నిజనిర్ధారణ కమిటీ గురువారం సమితిలోని కంటామాల్ గ్రామంలో పర్యటించింది. మాజీ మంత్రులు జగన్నాథ సరక, రవినారాయణ నందొ, సీనియర్ నాయకుడు రమేష్ చంద్ర ప్రతాప్ స్వాయి, మాజీ ఎంపీ జిన్ను హికక, అనసూయా మాఝి లతో కలిసి పది మందితో కూడిన బృందం గ్రామస్తులతో సమావేశమైంది. సగుబారి నుంచి సిజిమాలి వరకు వేదంత కంపెనీ నిర్మిస్తున్న రహదారిని అడ్డుకున్నందుకు గ్రామస్తులు, పోలీసుల మధ్య జరిగిన దమన కాండకు సంబంధించి పూర్తి వివరాలను గ్రామస్తుల ద్వారా కమిటీ తెలుసుకుంది. సుమారు మూడు గంటల పాటు గ్రామస్తులతో సమావేశమైన కమిటిటీ అసలు ఈ సంఘటన ఎదురవ్వడానికి గల కారణాలను పరిశీలించింది. అనంతరం సగుబారిలో పర్యటించిన బృందం అక్కడి ప్రజలతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేడీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక మాట్లాడుతూ.. కాసీపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నుంచి విముక్తి లభించాలంటే ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవశ్యకత ఉందన్నారు. ప్రభుత్వం బాధిత గ్రామాలకు చెందిన ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేలా వారితో మరొసారి మంతనాలు చేయాలన్నారు. అంతేగాని పోలీసుల దుశ్చర్యలతో గ్రామస్తులను భయపెట్టే విధంగా వ్యవహరిస్తే ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందన్నారు. బాధిత గ్రామాల్లో సిజిమాలి బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి గ్రామ సభలను నిర్వహించాలని సూచించారు. ప్రజల అనుమతితోనే ఏదైన వికాశం చెందుతుందన్నారు. తమ బృందం సమీకరించిన నివేదికను బీజేడీ సుప్రీంకు అందజేస్తామన్నారు. -
80 అడుగుల లోతులో జారిపడిన ట్రక్కు
జయపురం: జయపురం– కొరాపుట్ 26వ జాతీయ రహదారి ఘాట్ రోడ్డులో బుధ వారం రాత్రి ట్రక్కు బ్రేక్ ఫైల్ అయి అదుపుతప్పి ప్రమాదానికి లోనైంది. ట్రక్కు జయపురం వైపు వస్తూ బ్రేక్ ఫెయిల్ కావటంతో ఘాట్ రోడ్డు రక్షణ గోడపై నుంచి 80 అడుగుల కిందకు జారిపడింది. ట్రక్కు డైవర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందిన జయపురం సదర్ పోలీసులు వెంటనే సంఘటన ప్రాంతానికి చేరి అగ్నిమాపక విభాగానికి తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని 80 అడుగుల లోతున పడి న ట్రక్కును తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ట్రక్కు డ్రైవర్ను వెంటనే జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్కు తరలించారు. ఒడియా సాహిత్యం, చరిత్ర పుస్తకాల విక్రయాలు పర్లాకిమిడి: ఒడియా సాహిత్యం, చరిత్ర, ప్రబంధాలు, కవితల పుస్తకాల సంపుటాలు స్థానిక కలెక్టరేట్ వద్ద గురువారం జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో అమ్మకాలు జరిపారు. ఒడియా దివాస్ పక్షోత్సవాలు సంధర్బంగా స్థానిక రచయితలు, కవులే కాక భువనేశ్వర్ నుంచి ప్రింట్అయి వచ్చిన పుస్తకాలు కూడా స్టాల్లో అమ్మకాలు జరిపారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ మునీంద్ర హానగ, జిల్లా అబ్కారీ శాఖ అధికారి ప్రదీప్ కుమార్ సాహు, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారిని మనోరమా దేవి, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్లు కూడా పాల్గొని ప్రోత్సహించారు. ‘శాంతి నెలకొల్పాలి’ రాయగడ: పోలీసులు, ఆదివాసీల మధ్య జరిగిన దమనకాండలో ఇటు పోలీసులు అటు ఆదివాసీలు కూడా గాయాలపాలయ్యారని, ఈ పరిస్థితిని అధిగమించి కాశీపూర్లో శాంతియుతమైన వాతావరణం నెలకొల్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అన్నారు. ఆయన కాశీపూర్లో జరిగిన ఘటనకు సంబంధించి సొషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు రాత్రి వేళ కాకుండా ఉదయం గ్రామానికి వెళ్లి నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే ఈ గొడవ జరిగి ఉండేది కాదన్నారు. ఆదివాసీలపై పోలీసుల అమానుష ప్రవర్తనను ఆయన ఖండించారు. నియమనిబంధనల ప్రకారం కాశీపూర్లో గల ఖనిజ నిక్షేపాలను తవ్వుకుంటే ఏ సమస్యా ఎదురయ్యేది కాదన్నారు. ప్రజల అభిమతం తెలుసుకోకుండా వ్యవహరిస్తే వారి నుంచి ఇలాంటి తరహా ప్రతిఘటనలే ఎదురవుతాయన్నారు. వచ్చే వారం నుంచి ఉక్కపోత భువనేశ్వర్ : భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈ నెల 12 నుంచి 14 తేదీల మధ్య రాష్ట్రంలో తీవ్రమైన వేడి, ఉక్కపోత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కాల వైశాఖి ప్రభావం గురువారం నుంచి బలహీనపడుతంది. ఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొనడం ప్రారంభం అవుతుంది. రాగల 2 రోజులు పగటి ఉష్ణోగ్రతలు నిలకడగా కొనసాగుతాయి. తదుపరి రాబోయే రోజుల్లో పగటి పూట ఉష్ణోగ్రత 4 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ సమయంలో ముఖ్యంగా ఆరుబయట పని చేసే కార్మికులు, వృద్ధులు, పిల్లలతో సహా ప్రజలు అధిక సమయం ఎండలో ఉండకుండా తరచూ తగినంత నీరు తాగుతూ ఉండాలని భారత వాతావరణ శాఖ కోరింది. -
సెంచూరియన్ వర్సిటీలో ఆరోగ్య పరీక్షలు
పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీలో గురువారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యోగాభ్యాసాలు, కంటి పరీక్షలు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారి డాక్టర్ సన్యాసి బెహరా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సన్యాసి బెహారా, డీన్ డాక్టర్ సుశాంత్ కుమార్ పట్నాయిక్, పర్లాకిమిడి డిప్యూటీ సూపరింటెండెంటు (సైబర్విభాగం) సరితా బెవురియా, సంజయ్కుమార్ పాఢి తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు కంటి పరీక్షలు కూడా చేశారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, డీన్ సుశాంత్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి పైపు దొంగతనం
● ఇద్దరు వ్యక్తులు అరెస్టు రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీసులు తాగునీటి పైపుల దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 80 ఇనుప పైపులతో సహ మినీ వ్యాన్ స్వాధీనం చేసుకున్నారు. అరైస్టెనవారిలో కలహండి జిల్లాకు చెందిన పరిమిల్ బిశి, మిధున్ రాణాల ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని డంగసొరడ, హనుమంత్పూర్, బిసంకటక్, అంబొదల, చంద్రపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తాగునీటి సరఫరాకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. దీంతో అక్కడ స్టాకు గమనించి ఒక పథకం ప్రకారం చోరీ చేస్తున్నారు. బుధవారం రాత్రి తుముడిబొంధొ, భవాణీపట్నం రహదారి గుండా పైపులను పశ్చిమ బెంగాల్ తరలించేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి డంగసొరడ వద్ద పోలీసులు కాపుకాసి పట్టుకున్నారు. మునిగుడ ఐఐసీ కేశవ్ షడంగీ నేతృత్వంలొ ఈ దాడులు చేపట్టారు. -
లక్ష్యం కోసం
లాభం కోసం కాదు..● విద్యాసేవలో తనదైన మార్క్ చాటుకుంటున్న శంకరరావు ● తక్కువ ఫీజుతో అడ్మిషన్లు ● 10 మంది పేదలకు ఉచిత వద్య రాయగడ: పేదరికంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి.. సమాజానికి వెలుగునిచ్చే విద్యాసేవలో తనదైన మార్క్ను చాటుకుంటున్నారు ప్రముఖ విద్యా సేవకుడు బుడ్డా శంకరరావు. ఉపాధి అవకాశాలు ఎన్నో వచ్చినప్పటికీ వాటిని కాదని విద్యారంగంలో స్థిరపడ్డారు. దీనిలో భాగంగా స్థానిక కస్తూరీనగర్లో 2007లో పది మంది పిల్లలతో మదర్ థెరిస్సా పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలలో ఉత్తమ విలువలతో కూడిన విద్యా బోధన అందించడంతో క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరిగి పదో తరగతి వరకు చేరుకుంది. నర్సరీ నుంచి ప్రారంభమైన పాఠశాల నేడు అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో సదరు సమితి పరిధి కొత్తపేట పంచాయతీ కొల్లిగుడ వద్ద 2017లో మదర్ థెరిస్సా టెక్నో స్కూల్ పేరిట మరో బ్రాంచ్ ప్రారంభించారు. ఆదివాసీలు అత్యధికంగా నివసించే ఈ ప్రాంతంలో వారి ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఫీజులు తీసుకుంటూ విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా పది మంది విద్యార్థులను ఉచితంగా తమ పాఠశాలలో చదివిస్తూ అవసరమైన విద్యా సామగ్రి సమకూరుస్తున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలి యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే సమయాన్ని వృథా చేసుకోకుండా స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు. తమ విద్యాసంస్థల్లో సుమారు 60 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వివరించారు. విద్యను వ్యాపార దృక్పథంతో చూడకుండా.. నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్కు దిశా నిర్దేశం చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో తనతో పాటు తన సోదరుడు సంతోష్ కుమార్ చేదోడుగా వ్యవహరిస్తుండడంతో సంస్థ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ ట్రస్టుకు కార్యదర్శిగా తన సోదరుడు విధులు నిర్వహిస్తుండడం తన విజయానికి మరో కారణంగా వివరించారు. త్వరలో ఇంటర్మీయడిట్ తరగతులు మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ ట్రస్టు ద్వారా మరో మైలురాయిని చేరుకునేందుకు సన్నాహాలు చేస్తున్నామని ట్రస్టు ఎండీ శంకరరావు తెలియజేశారు. ప్లస్ –టూ సైన్స్, ఆర్ట్స్ తరగతులను త్వరలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్లతో ప్రారంభమవ్వనున్న ఈ తరగతుల్లో జేఈఈ, ఎన్ఐఐటీ, ప్రొఫెషనల్, అడ్వాన్స్డ్ కోర్సుల శిక్షణ కూడా కల్పించేందుకు రంగం సిద్ధం చేశామని తెలిపారు. ఈ ఏడాది జూన్లో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
అమృత్ భారత్ బోగీలు
సరికొత్త సొబగులతో ..భువనేశ్వర్: రైలు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు అమృత్ భారత్ రైలు బోగీలు సరికొత్త సొంపులతో ప్రత్యక్షం కానున్నాయి. ఆకట్టుకునే రంగుల మేళవింపుతో ప్రతిపాదిత అంతర్గత డిజైన్ నమూనా కోచ్ సిద్ధమైంది. పీవీసీ ఫ్లోరింగ్, సీటు, బెర్త్ రెక్సిన్, స్నాక్ టేబుల్స్, కర్టెన్లు, లావెటరీ ప్రాంతాలు వంటి కీలక భాగాలలో సమన్వయ రంగులను పొందుపరిచి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ బోగీలను విభిన్నమైన అంతర్గత రంగుల థీమ్లతో అమర్చారు. ప్రయాణికుల అధిక స్థాయి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయమైన రూపకల్పనలో వీటిలో హెచ్ఎల్ 3 అగ్ని మాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సామగ్రి వినియోగించారు. -
సైబర్ నేరాలపై అవగాహన
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఓపెన్ ఆడిటోరియంలో గురువారం సైబర్ భద్రత, మాదక ద్రవ్యాల విముక్తిపై ఒక కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారి డాక్టర్ సన్యాసి బెహరా ప్రారంభించారు. కార్యక్రమంలో ఆదర్శ పోలీసు స్టేషన్ అధికారి ప్రశాంత భూపతి, సబ్డివిజనల్ పోలీసుఅధికారి మాధవాన ంద నాయక్, గురండి హెల్త్ విస్తరణాధికారి మమతా పాఢి, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరక్టర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాఢి, డీన్ ఎస్పీ నందా తదితరులు పాల్గొన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్డీపీఓ మాధవానంద నాయక్ సూచించారు. అలాగే సైబర్ నైరాలు, ఇతర ఆర్థిక మోసాలపై పర్లాకిమిడి ఆదర్శ పోలీసు స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేయాలని, దీనికై ప్రత్యేక సెల్ ఏర్పాటుచేశామని ఐఐసీ ప్రశాంత భూపతి అన్నారు. కార్యక్రమంలో బరంపురం విశ్వవిద్యాలయం, విక్రందేవ్ వర్సిటీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. -
చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి
కొరాపుట్: చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందారు. గురువారం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ సమితి కుర్సి గ్రామ పంచాయతీ ఉప్పరపొడ గ్రామంలో రాజ్ మాన్ గొండో ఇద్దరు కుమార్తెలు ఆధార్ గొండొ (6), సంజితా గొండొ (5), బాల్ సాయి గొండొ కుమార్తే ఫలాల్ గొండొ (7)లు మృతి చెందారు. వీరంతా సమీప ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నారు. ఉదయం 11 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. అనంతరం సమీప చెరువులో స్నానానికి వెళ్లి మునిగిపోయారు. గమనించిన మిగతా పిల్లలు ఇళ్లకు వెళ్లి పెద్దలకు చెప్పారు. వారు వచ్చి నీటి నుంచి వెలికి తీసి సమీప ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే వీరు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బంధువులు కావడంతో గ్రామం రోదనలతో మునిగి పోయింది. -
‘కార్గో ఎయిర్పోర్టు భూ సేకరణను వ్యతిరేకిస్తున్నాం’
మందస: మందస మండలం భేతాళపురం రైతులు కార్గోఎయిర్ పోర్టుకు వ్యతిరేకిస్తూ భూ వివరాల జాబితాపై నిరసన తెలిపారు. ఈ సందర్భంలో మందస ఎమ్మార్వో కార్యాలయం, పలాస ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి తమ ఆందోళన వ్యక్తం చేశారు. మందస ఎమ్మార్వో మిస్క శ్రీకాంత్కు మెమొరాండం అందజేశారు. కార్యక్రమంలో మడియా పురోషోత్తం, బత్తిన దేశయ్య, బొడ్డు శంకర్రావు, బత్తిని కృష్ణరావు, గార ఆనందరావు, బత్తిని ఉమాపతి, కీలు భీమారావు, ఇరోతు దేవరాజు, మడియా జగన్నాథం, ఆడతాల కూర్మారావు, మడియా ఋషి, బత్తిని మాధవరావు, బత్తిన మహేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు శివాజీ రాజాకు సత్కారం వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలో గల పల్లిసారథిలో బుధవారం ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజాను ఏపీ తెలుగు ఫిలిం ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కుమార్ నాయక్ సత్కరించారు. డొక్క కృష్ణారావు స్వీయ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చలన చిత్రంలో పలు సన్నివేశాలు ఉద్దాన ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం పల్లిసారథి ప్రాంతంలో చలన చిత్ర షూటింగ్ జరిగింది. చిత్రంలో నటించేందుకు శివాజీ రాజా వచ్చారు. కాగా హీరోగా, ప్రతి నాయకుడిగా సుమారు 500 పైచిలుకు సినిమాల్లో నటించినట్లు తెలిపారు. పెళ్లి సందడి, కళ్లు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. ఈ ఉద్దాన ప్రాంతంలో పర్యటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సత్కా రం చేసిన వారిలో ఫెడరేషన్ సభ్యులు కొండల ప్రకాశ్, షేక్ రాజాబాబు, మేకప్ ఆర్టిస్ట్ ఈశ్వరరావు తదితరులు ఉన్నారు. జనసేన, టీడీపీ నాయకుల కుమ్ములాట రణస్థలం: లావేరు మండలంలోని కొత్తరౌతుపేట గ్రామంలో కూటమి నాయకులు ఆల య నిర్మాణ స్థలంపై గొడవ పడ్డారు. స్థానికులు, లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కొత్తరౌతు పేట గ్రామంలో కొంత స్థలంలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించేందుకు టీడీపీ నాయకులు, గ్రామస్తులు పూనుకున్నారు. బుధవారం ఉదయం ఆ స్థలంలో కొలతలు వేస్తుండగా స్థానిక జనసేన నాయకుడు మా ఇంటికి వెళ్లే రోడ్డుకు అడ్డంగా ఆలయ నిర్మాణం కట్టడం సరికాదని నిలదీశారు. ఇరు పక్షాల మధ్య కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని తోసుకున్నారు. దీంతో జనసేన నాయకుడు 100కి ఫోన్ చేయడంతో లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి వెళ్లి పరిస్థితిని గమనించి గొడవ పడవద్దని ఇరుపక్షాలకు సూచించారు. రెవెన్యూ అధికారులు వచ్చి కొలతలు వేసిన తర్వాత పనులు చేపట్టాలని చెప్పి వెనుదిరిగారు. సారా స్థావరాలపై దాడులు పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్రా, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా బుధవారం దాడులు నిర్వహించారు. కొత్తూరు, మెళియాపుట్టి, పలాస మండలాలకు అనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన పెద్ద బురుజోల, చిన్న బురు జోల, సింగిపూర్ తదితర సరిసరాల్లో 1,080 లీటర్ల నాటు సారా, 10,500 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసి, భారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం జిల్లా ఎకై ్సజ్ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు, ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ ఎం శ్రీనివాసరావు, పాతపట్నం, పలాస, టెక్కలి, శ్రీకాకుళం టాస్క్ ఫోర్స్ ఎకై ్సజ్ అధికారులు, ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి, ఉదయ్గిరి, కాశీనగర్ ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
● క్రికెట్ టోర్నీ ప్రారంభం
జయపురం: జయపురం స్టేడియం గ్రౌండ్లో బుధవారం క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. జయపురం ఈవినింగ్ క్లబ్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నారు. క్రికెట్ లీగ్ను జయపురం సబ్ డివిజనల్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ (ఐపీఎస్) ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఆటలు మనోవికాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహద పడతాయన్నారు. యువత క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రెండు మ్యాచ్లు జరిగాయి. మొదటి మ్యాచ్లో జగన్నాథ్ సూపర్ జియాండ్ ధల్, బ్రాండెడ్ వాయిస్ జట్లు తలపడ్డాయి. జగన్నాథ్ సూపర్ జియాండ్ దల్ విజయం సాధించింది. రెండో మ్యాచ్లో జెకెసిఇటి స్పార్కింగ్ స్పోర్ట్స్, జయపురం జాగుతార్ టీమ్లు తలపడ్డాయి. ఈ బ్యాచ్లో జయపురం టీమ్ విజయం సాధించింది. దేబొ చౌదరి, బాబుల, అనంత నాయక్, సుబేన్ అంపైర్లుగా వ్యవహరించారు. క్రికెట్ పోటీలు ఈ నెల 19వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. -
తీసుకున్నారా..?
మ్యారేజ్ సర్టిఫికెట్ ..● మ్యారేజ్ సర్టిఫికెట్ అత్యంత కీలకం ● రిజిస్ట్రేషన్తో సర్టిఫికెట్ జారీ ఇచ్ఛాపురం: ఇటీవల సీజన్లో పెళ్లిళ్లు జోరుగా జరిగాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కొత్త జంటలు వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరి జీవితం కొత్తగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రభుత్వం పథకాలు రావాలన్నా, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయించాలన్నా, పాస్పోర్టు, భూములకు సంబంధించిన మ్యుటేషన్లు ఇతరత్రా అవసరాలు ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ చివరికి సర్టిఫికెట్ల కోసం బ్రోకర్లపై ఆధారపడి ఎక్కువ మొత్తంలో సొమ్ములు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను కొత్త జంట ముందుగానే గుర్తించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ పొందితే వారికే మంచిది. పెళ్లి జరిగిన 30 రోజుల్లో మున్సిపల్, పంచాయతీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొంటే తక్కువ ఫీజు ఉంటుంది. సాధారణంగా ఫీజు రూ.100 నుంచి రూ.500 వరకు మాత్రమే ఉంటుంది. వివాహం జరిగి 90రోజులు దాటితే సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఇందుకు ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. – యు.ఉపేంద్ర, జనన,మరణ, రిజిస్ట్రేషన్ అధికారి, ఇచ్ఛాపురం మున్సిపాలిటి పాస్పోర్టు అప్లికేషన్, బ్యాంక్ జాయింట్ అకౌంట్, కేంద్ర, రాష్ట్ర రక్షణ బలగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సర్వీస్ రికార్డుల్లో పేరు చేర్చుకునేందుకు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి వీసాప్రాసెస్, వీటితో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నవ వధూవరులు పెళ్లి చేసుకొనే ప్రదేశం ఆధారంగా గ్రామం ఐతే గ్రామ సచివాలయం లేదా పంచా యతీ కార్యాలయం, పట్టణం ఐతే వార్డు సచివా లయం లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం వివాహ శుభలేఖ, జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్న వధూవరుల ఫొటో, మంగళసూత్రం కట్టేటప్పుడు ఫొటో, పూల దండలు మార్చుకున్నప్పుడు ఫొటోలు ఉండాలి. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుల జిరాక్సులను జతచేయాలి. నవవధూవరుల తరఫున ఇద్దరు సాక్షులు, వారి ఆధార్ కార్డుల జిరాక్సు లను గ్రామ/వార్డు సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయంలోగానీ మున్సిపల్ కార్యాలయంకు గానీ అందజేయాలి. జత చేసిన ధ్రువీకరణ పత్రాలను జనన, మరణ రిజిస్ట్రేషన్ అధికారి పరిశీలించి సర్టిఫికెట్ని జారీ చేస్తారు. ఆలయాల్లో వివాహం చేసుకుంటే దేవదాయ శాఖకు మందస్తుగానే రుసుం చెల్లిస్తే అధికారులు రశీదులు ఇస్తారు. వాటి ఆధారంగానే వివాహానికి సంబంధించిన ఇతర పత్రాలు ఫొటోలు సాక్షుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇళ్లు, కల్యాణ మండపాల్లో సంప్రదాయంగా వివాహం చేసుకుంటే అందుకు తగ్గ అన్ని రకాలు పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకోవాలి. -
విద్యార్థుల్లో సేవా దృక్పథం ఉండాలి
రాయగడ: విద్యార్థి దశ నుండే సేవా దృక్పథంతో ముందుకు వెళ్లాలని స్థానిక అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సరస్వతి రాయ్ అన్నారు. బుధవారం కళాశాలలొ యువరెడ్ క్రాస్, ఎన్సీసీ, జాతీయ సేవా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని హితవు పలికారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు స్వ చ్ఛందంగా పాల్గొని తమ సేవా భావాన్ని చాటుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 23 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందించారు. -
ప్రకృతి వనరులపై హక్కులు కల్పించాలి
జయపురం: కొరాపుట్ జిల్లాలోని ఆదివాసీ ప్రజలకు ప్రకృతి వనరులపై హక్కులు కల్పించాలని సోషలిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు)(ఎస్యూసీఐ) జిల్లా కార్యదర్శి కనూచరణ్ బిశ్వాల్ అన్నారు. కొరాపుట్ జిల్లా కార్యకర్తలతో జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ బొయిపరిగుడ సహిద్ లక్ష్మణ నాయక్ గ్రంథాలయ ప్రాంగణంలో బుధవారం సమావేశం నిర్వహించారు. కనూచరణ్ బిశ్వాల్ మాట్లాడారు. దేశంలో నేడు మత రాజకీయాలు, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పాలనలో ప్రజలు పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. కొరాపుట్ జిల్లా ఆదివాసీలు స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య భూమిక వహించారన్నారు. ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. నేడు అడవులు, ప్రకృతి సంపదలపై ఆదివాసీ ప్రజలకు హక్కులు కల్పించాలన్నారు. పరిశ్రమలలో ఆదివాసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నేటి పాలకులు ప్రజలను పీడిస్తున్నారని, వారి దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు సమైఖ్యంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ప్రజా పోరాటాలకు ప్రజలను సంఘటితపరిచి ఎస్యుసీఐ కార్యకర్తలు ఉద్యమించాలన్నారు. ఎస్యూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సదాశివ దాస్, రాష్ట్ర కార్యదర్శి శంకర దాస్, తదితరులు ప్రసంగించారు. -
దోపిడీ దొంగల దారెటు..?
శ్రీకాకుళం క్రైమ్ : కాశీబుగ్గ కేంద్రంగా మంగళవారం పట్టపగలు బంగారం దుకాణంలో దోపిడీ దొంగలు చొరబడి భయానక వాతావరణం సృష్టించిన సంగతి తెలిసిందే. తనకు చూపించిన గన్ ఒరిజినల్దేనని షాపు యజమాని చెప్పడం గమనార్హం. షాపు ఓనరైన కిల్లంశెట్టి రామకృష్ణారావు నుంచి దుండగులు మంగళవారం మొబైల్ఫోన్ ఎత్తుకు వెళ్లిపోయినట్లు పోలీసు వర్గా ల సమాచారం. టవర్ డంప్ లొకేషన్ ఆధారంగా విజయనగరం బొబ్బిలి దగ్గర ఒకసారి చూపించగా మరోసారి రాయపూర్ వద్ద సిగ్నల్స్ చూపించినట్లు విశ్వసనీయ సమాచారం. దీన్ని బట్టి మంగళవారం గారబంద మీదుగా లూప్ మార్గాల్లో దుండగులు పర్లాఖిముడి (ఒడిశా) చేరి అక్కడి నుంచి బొబ్బిలి, సాలూరు ఘాట్రోడ్డు మీదుగా చత్తీస్గఢ్ చేరి రాయపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. వచ్చిన వారు హిందీ భాషలో ఎక్కువగా మాట్లాడటంతో పక్కా గా మహారాష్ట్ర గ్యాంగ్ లేదంటే బీహార్ గ్యాంగు పనేనని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దుండగుల్లో బంగారం ఎత్తుకుపోయిన కొందరు ఒకవైపు, మొబైల్ ఫోన్ తీసుకెళ్లిన వారు మరో వైపు వెళ్లి పోలీసులకు రాంగ్ డైవర్షన్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక కూ డా 3 చోట్ల చోరీలు జరిగాయి. పాత జాతీయ రహదారికి ఆనుకుని మంకినమ్మ చికెన్, మటన్ సెంటర్, డెకరేషన్ సాపు, రైల్వేస్టేషన్ దారిలో చోరీలు జరిగాయి. ఇటీవల కాలంలో 3 మెడికల్స్టోర్స్లో దాదాపు రూ. 4 లక్షల వరకు చోరీకి గురైనా పోలీసులు రికవరీ చేయలేకపోయారన్న ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. లక్ష్మీస్వీటుషాపులో సైతం రూ. 1.20 లక్షలు నగదు దొంగిలించారు. ‘పక్కా ప్లాన్తోనే వచ్చారు’ పలాస: దొంగలు పక్కా ప్లాన్తోనే వచ్చారని, దేవు డి దయ వల్ల తన ప్రాణాలు మిగిలాయని కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర జ్యూయలర్స్ షాపు యజ మాని కిల్లం శెట్టి రామకృష్ణారావు అన్నారు. ఆయన బుధవారం తన ఇంటి వద్ద భార్య లలిత, అతను అక్కడకు వచ్చిన వారితో జరిగిన సంఘటన గురించి చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించారు. దొంగలు పక్కా ప్లాన్తోనే వచ్చారన్నారు. హిందీలో ఏదేదో చెప్పారని, ఆ తర్వాత రెండు చేతులకు బేడీలు వేశారు. మొత్తం బంగారం దోచుకు పోయారని, తన మెడలో ఉన్న గొలుసు కూడా తీసుకుపోయారని, అంతా ఒక్క 5 నిమిషాల్లో జరిగిపోయిందని తెలిపారు. ఆయనను మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ పలాస నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు బుధవారం పరామర్శించారు. దొంగతనం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు శిస్టు గోపి, తాజా మాజీ కౌన్సిలరు బెల్లాల శ్రీనివాసరావు, పెంట రత్నాకర్, బోర బుజ్జి, బత్తిన హేమేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
● బాలికలకు ఈతపై శిక్షణ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా యంత్రగం తరఫున బండాబాకులి చెరువు వద్ద బాలికలకు ఈత, ప్రాణ రక్షణ నైపుణ్యాల శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే బుధవారం ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల భద్రత, శక్తివంతం చేయడం తమ ప్రధాన లక్ష్యమని అన్నారు . ఈత కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా ఆపద సమయంలో ప్రాణ రక్షణకు దోహదపడుతోందన్నారు. ఈ శిక్షణ బాలికల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచి అత్యవసర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే సామర్ాధ్యన్ని కలిగిస్తుందని కలెక్టర్ అన్నారు. శిక్షణలో ఓడ్రాఫ్ బృందానికి చెందిన 20 మంది అనుభవజ్ఞులైన శిక్షణదారులు 30 మంది బాలికలకు ఏడు రోజులు శిక్షణ ఇస్తారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రధన్, మల్కన్గిరి ఎస్డీపీవో దివ్యజ్యోతి దళై, డిప్యూటీ కలెక్టర్ దీప్తి రంజన్ సాహు ఉన్నారు. -
ఎస్ిసీబీ అగ్ని ప్రమాదంపై కేంద్ర బృందం దర్యాప్తు
భువనేశ్వర్: కటక్ ఎస్ిసీబీ అగ్ని ప్రమాదంపై కేంద్ర బృందం దర్యాప్తు ప్రారంభమైంది. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కేంద్ర దర్యాప్తు బృందం బుధవారం ఎస్ిసీబీ వైద్య బోధన ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించిన ప్రాంతాలు, సంబంధిత వర్గాలతో విచారణ చేపట్టింది. ఈ ఆస్పత్రి ట్రామా ఐసీయూలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 12 మంది రోగులు మరణించిన సంఘటన ఇటీవల ముగిసిన శాసన సభ సమావేశాల్లో తీవ్ర అలజడి రేపిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఈ విచారకర సంఘటనపై నైతిక బాధ్యత వహిస్తు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టరు ముఖేష్ మహాలింగ్ పదవికి రాజీనామా చేసి వైదొలగాలని విపక్షాలు గట్టి గా పట్టుబట్టి నిరవధికంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటిని సంప్రదించి చొరవ కల్పించుకుని సత్వర చర్యలకు ఆదేశాలు జారీ చేయాలని విపక్ష వర్గం అభ్యర్థించింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం కటక్ ఎస్సీబీ సందర్శించి విచారణ చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బృందం ఈ ఏడాది మార్చి 16న ట్రామా ఐసీయూలో సంభవించిన అగ్ని ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ బృందంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి (ఎన్డీఎంఏ), ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రముఖులు, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ప్రతినిధి, ఒడిశా రాష్ట్ర విపత్తు స్పందన అథారిటీ (ఓస్డమా), అగ్ని మాపక, పౌర రక్షణ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు. యువకుడి మృతదేహం లభ్యం రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరం సమీపంలో గల జంఝావతి నది వంతెన పైనుంచి మంగళవారం దూకిన యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. స్థానిక కోపరేటీవ్ కాలనీకి చెందిన రంజిత్ కుమార్ సాహు(34) అనే యు వకుడు మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తన సొంత బైక్పై వచ్చి జంఝా వతి నది వద్ద పార్కింగ్ చేశాడు. వంతెన పైనుంచి దూకేశాడు. అగ్నిమాపక సిబ్బంది యువకుని ఆచూకీ కోసం గాలించారు. బుధవారం ఉద యం 9 గంటల ప్రాంతంలో యువకుని మృతదేహం బ్రిడ్జికి కొంత దూరంలో లభించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అందరి కృషితోనే ఆరోగ్యకరమైన సమాజం
రాయగడ: అందరి కృషితోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని ఝార్సుగుడ ఎస్పీ గుండాలరెడ్డి రాఘవేంద్ర అన్నారు. మంగళవారం ఝార్సుగుడలో గల మేఫెయర్ ఒయాసీస్ ప్రాంగణంలో ఇండియన్ మెడికల్ అసొసియేషన్ సంస్థ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటైతే శాంతియుత వాతావరణం వస్తుందన్నారు. నేటి యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ భవిష్యత్ను బుగ్గిపాలు చేసుకుంటున్నారని అన్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును ఏకీకృతం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిస్తుందన్నారు. పెరుగుతున్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ముందస్తు రోగాలు నిర్ధారణ చేయడం సాధ్యమవుతోందన్నారు. ఝార్సుగుడ వంటి జిల్లాలో ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించేలా అందరూ సహకరించాలని కోరారు. మొదటి సెషన్లో మెంటల్ హెల్త్ ప్రయారిటీపై మోడరన్ మెడిసిన్ అన్న అంశంపై జరిగిన చర్చలో ముఖ్యవక్తగా డాక్టర్ ఎస్జే పాల్ పాల్గొని ప్రసంగించారు. అదేవిధంగా రెండొ సెషన్లో రొల్ ఆఫ్ ఆ ర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇన్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అన్న అంశంపై ముఖ్య వక్తగా పాల్గొన్న డాక్టర్ శక్తి కుమార్ త్రిపాఠి వివరించారు. అలాగే మూడో సెషన్లో ఫిజికల్ హెల్త్ ఎ హిస్టొరిక్ అప్రొచ్ అన్న అంశంపై జరగిన చర్చలో డాక్టర్ శక్తి కుమార్ త్రిపాఠి పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పి రాఘవేంద్రకు ఇండియన్ మెడికల్ అసొసియేషన్ సంస్ధ సన్మానించింది. -
పూరీలో కాల వైశాఖి తాండవం
భువనేశ్వర్: పూరీలో బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా మారిన వాతావరణంతో తుఫాను వంటి తీవ్రతర పరిస్థితి అలముకుంది. వాతావరణ శాఖ ముందస్తుగా జారీ చేసిన సమాచారం ప్రకారం ఈ జిల్లా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కాల వైశాఖి వాతావరణం తాండవించింది. జగన్నాథుని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు బెంబేలెత్తారు. భారీ వర్షం, ఉరుములు, ఈదురు గాలులతో శ్రీ మందిరం పరిసరాల్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూరీ జిల్లా కొణాస్ గ్రామంలో పిడుగుపాటుకు ఒక రైతు మృతి చెందాడు. మృతుడిని బంధముండ గ్రామానికి చెందిన సిద్దియా ధోలేరసింఘాగా గుర్తించారు. బడికి తాళం మల్కన్గిరి: గౌడగూఢ పంచాయతీ ఎంవీ 9 గ్రామం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివిన విద్యార్థులకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అందకపోవడంతో గ్రామస్తులు బుధవారం బడికి తాళం వేశారు. పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయుడు ప్రశాంత్ సామంతరాయ్ కొద్ది నెలల కిందట 7వ తరగతి విద్యార్థిని శారీరకంగా, మానసికంగా వేధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యాశాఖ ఆయనపై వేటు వేసింది. ఆయన స్థానంలో విధుల్లో ఉన్న మహిళా ఉపాధ్యాయురాలికి బాధ్యతలు అప్పగించింది. ఆమె సక్రమంగా చేయకపోవడంతో మరో టీచర్ సరస్వతి పూజారికి బాధ్యతలు అప్పగించారు. అయితే బుధవారం పాఠశాల ముందు పిల్లలను కూర్చోబెట్టి స్థానికులు నిరసన తెలిపారు. ఇక్కడ 8వ తరగతి లో 46 మంది చదువుతున్నారు. ఇక్కడ పాస్ అయిన వారు 9వ తరగతిలో చేరేందుకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రక్తదానం.. ప్రాణదానం పర్లాకిమిడి: రక్తదానం.. ప్రాణదానంతో సమానమని అదనపు జిల్లా మాజిస్ట్రేట్ ఫల్గుణీ మఝి అన్నారు. ఒడియా దివాస్ పక్షోత్సవాల సందర్భంగా భారతీయ రెడ్ క్రాస్, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని ఫల్గుణీ మఝి ప్రారంభించారు. రక్తదాతల నుంచి 38 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్టు బ్లడ్ బ్యాంకు ఫార్మాసిస్టు ఖగేశ్వర బెహరా తెలిపారు. సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా పరిషత్ అదనపు సీడీఓ పృథ్వీరాజ్ మండల్, జిల్లా అబ్కారీశాఖ అధికారి ప్రదీప్ సాహు, డాక్టర్ అనిల్ ఆచార్య పాల్గొన్నారు. రక్తదానం చేసిన దాతలను అభినందించారు. భార్యను హతమార్చిన భర్త భువనేశ్వర్: స్థానిక స్వస్తిక్ నగర్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఒక దారుణ హత్య ఘటన నివాసితులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేవరాజ్ అనే రిటైర్డ్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ తన భార్య ప్రియంబద షడంగి గొంతు కోసి హత్య చేసినట్లు ఆరోపణ. పదవీ విరమణ చేసిన అకౌంటెంటు జనరల్ కార్యాలయం ఉద్యోగి అయిన దేవరాజ్ ఉద్యోగ విరమణ తర్వాత గత 2 సంవత్సరాల నుంచి తన భార్యతో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. రక్తసిక్తమైన పడక గదిలో రక్తపు మడుగులో ప్రియంబద పడి ఉన్నట్లు ఇరుగు పొరుగు వారి దృష్టికి రావడంతో ఎయిర్ ఫీల్డు ఠాణా పోలీసులకు సమాచారం చేరదీశారు. వీరి సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరి పర్యవేక్షించడంతో రక్తపు మడుగులో మహిళ మృత దేహం ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం దేవరాజ్ మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు సూచిస్తున్నాయి. సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందం, కమిషనరేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హత్య వెనుక కారణం ఇంకా అస్పష్టంగానే ఉంది. కానీ కుటుంబ కలహాలే ఈ విషాద ఘటనకు దారి తీసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. -
ఆత్మహత్యకు అనుమతివ్వండి
● సబ్ కలెక్టర్ను కోరిన మాజీ సర్పంచ్ త్రిపాఠిజయపురం: మాజీ సర్పంచ్ నిరంజన్ త్రిపాఠీ ఆత్మహత్య చేసుకొనేందుకు జయపురం సబ్ కలెక్టర్ను అనుమతి కోరారు. త్రిపాఠి వ్యవసాయం వదలి కంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. చేసిన పనుల బిల్లుల పాస్ చేసేందుకు అధికారులు లంచాలు అడగటంతో మనో వేదన చెందిన త్రిపాఠి ఆత్మహత్య చేసుకొనేందుకు నిర్ణయించి స్వచ్ఛందంగా ఆత్మహత్య చేసుకొనేందుకు అనుమతి కోరడం గమనార్హం. వ్యవసాయ దారుడైన త్రిపాఠీ 2022 లో బొరిగుమ్మ సమితి బెణాపూర్ పంచాయితీ బాగభధ్ర గ్రామం సమీపంలో గల తన 8 ఎకరాల భూమిని అమ్మి వేసి బొరిగుమ్మ సమితిలో కంట్రాక్టు పనులు చేయటం ప్రారంభించారు. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల కాలంలో మనోరెగ పనుల కాంట్రాక్ట్ తీసుకున్నారు. బాగభధ్ర గ్రామంలో 5–టి విద్యాలయ ప్రహరీ, యూజీహెచ్సీ విద్యాలయ ప్రహరీ, సమితి రోడ్డు పనులు, గ్రామాల అప్రోచ్ రోడ్డు పనులకు అనుమతులు లభించాయి. ఆ పనులు చేస్తున్న త్రిపాఠీ మనోరెగ పనుల్లో కూలీలకు కాంట్రాక్ట్ పనుల కోసం పనులకు తన డబ్బులు చెల్లించారు. అయితే బిల్లు పైకం చేతికి రాలేదు. బిల్లు పాస్ చేసేందుకు 27 శాతం పీసీ కావాలని సంబంధిత అధికారులు డిమాండ్ చేశారు. అయితే 12 శాతం ఇచ్చేందుకు త్రిపాఠీ అంగీకరించాడు. అందుకు సంబందిత అధికారులు ఎవరూ సమ్మతించలేదు. ఈ విషయం బీడీఓకు తెలియజేసినా ఫలితం లేక పోయిందని, అందు చేత మరో మార్గం కనిపించక ఆత్మహత్యే శరణ్యం అని భావించిన త్రిపాఠి సబ్ కలెక్టర్ను అనుమతి కోరాడు. ఈ ఆరోపణపై వెంటనే దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తనకు రావాల్సిన బిల్లు డబ్బు చెల్లించక పోతే ఆత్మహత్యకు అనుమతించాలని నిరంజన్ త్రిపాఠీ విజ్ఞప్తి చేశారు. -
‘అంకితభావం, సమర్థత కలిగిన ఉద్యోగులు సంస్థకు బలం’
భువనేశ్వర్: సమర్థంగా, కష్టపడి పనిచేసే ఉద్యోగుల వల్లే సంస్థ స్వర్ణయుగాన్ని ఆవిష్కరిస్తుంది. వారే సంస్థకు శక్తివంతమైన సంపద, మూలధనమని హైటెక్ గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టరు తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేట్ ఆస్పత్రిగా హైటెక్ వైద్య బోధన ఆస్పత్రి రాష్ట్రం, జాతీయ స్థాయిలో ఖ్యాతిని ఆర్జిస్తుంది. ఒడిశాలో ఆరోగ్య విద్య, చికిత్స, సేవల రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సంస్థగా వెలుగొందుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమర్థమైన వైద్య, పారామెడికల్, నర్సింగ్, ఫార్మసిస్టులతో సంస్థ దినదిన ప్రవర్ధమానంగా ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యంగా ఈ సంస్థలో కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగానికి చెందిన సమర్థమైన వైద్య సిబ్బంది, ప్రొఫెసర్ డాక్టర్ రితేష్ కుమార్ ఆచార్య, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ స్మృతి ప్రకాష్ సాహు ప్రత్యేక ఆరోగ్య సేవలను అందిస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుండి గౌరవాభిమానాలు చూరగొంటున్నారు. హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి సంస్థలోని ప్రతి ఉద్యోగిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో హైటెక్ వైద్య బోధన ఆస్పత్రి ట్రస్టీ, డైరెక్టర్ మధుస్మిత త్రిపాఠి పాల్గొని దక్షత, నైపుణ్యత చాటుకున్న సిబ్బందిని ఉత్తరీయం, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రనాథ్ బెహెరా, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చందన్ సామంత్రాయ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ శ్రద్ధ, జాగరూకతతో సేవలు అందించడంలో నిబద్ధత, సంకల్పంతో పని చేయాలని ప్రోత్సహించారు. -
ఎదురెదురుగా కార్లు ఢీ.. నలుగురు మృతి
కొరాపుట్: ఎదురెదురుగా కార్లు ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు. మంగళవారం రాత్రి నబరంగ్ఫూర్ జిల్లా ఉమ్మర్కోట్ పట్టణం సమీపం బడకుమరి గ్రామ సమీపంలో భారత మాల 6 అంచెల జాతీయ రహదారి పై ప్రమాదం జరిగింది. కొరాపుట్ జిల్లా సునాబెడాకి చెందిన అరుణ్ కుమార్ పండా (65), అతని మనుమడు అశుతోష్ రధ్ (10), మేనల్లుడు సుభ్రత్ సత్పతి (35) లు సంఘటన స్థలంలో మృతి చెందారు. వీరు నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితిలో ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నబరంగ్పూర్ జిల్లా జోరిగాంలో మరో శుభ కార్యానికి వెళ్తున్న కారు వీరి కారుని ఢీకొట్టింది. ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని నబరంగ్పూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బంశీధర్ పండా (40) మృతి చెందాడు. -
తాగునీటికి కటకట
లిబ్రిగుడలో..● నెల రోజులుగా పనిచేయని మంచినీటి పథకం ● బావిలోని బురదనీరే దిక్కు.. ● పట్టించుకోని అధికారులుపర్లాకిమిడి: గజపతి జిల్లాలో నువాగడ బ్లాక్ పరిమళ పంచాయతీ లిబ్రిగుడ గ్రామంలో నెల రోజులుగా ప్రజలు తాగునీటికోసం అనేక అవస్థలు పడుతున్నారు. వంద కుటుంబాలు ఉన్న లిబ్రిగుడలో గ్రామీణ తాగునీటి, శానిటేషన్ శాఖ మంచినీటి పథకం నిర్మించినా.. నాలాల నుంచి తాగునీరు రావడం లేదు. గ్రామంలో ట్యూబ్ వెల్ కోన్నేళ్లుగా మరమ్మతులకు గురైంది. ఉన్న ఒక్క మంచినీటి బావి ఎండలకు అడుగంటింది. ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి తాగునీరు రావడం లేదు. మంచినీటి బావి నుంచి బురదనీరు వడబోసి ప్రజలు తాగుతున్నారు. గ్రామంలో పిల్లలు, వృద్ధులు దగ్గు, జ్వరాల బారిన పడుతున్నట్టు లిబ్రిగుడ గ్రామసభ సభ్యుడు బిశ్వంబర రయితో ఆందోళన చెందుతున్నారు. తాగునీటి సమస్యలపై ఏప్రిల్ 6న లిబ్రిగుడ గ్రామవాసులు పర్లాకిమిడి కలెక్టరేట్లో అధికారులకు వినతిని అందజేశారు. అధికారులు ప్రభుత్వ గ్రామీణ తాగునీరు, శానిటేషన్ ఇంజినీర్కు వినతిని పంపారు. ఇప్పటివరకు నువాగడ బ్లాక్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గ్రామంలో మహిళలు తాగునీటికి ఆందోళన చెందుతున్నారు. దీనిపై మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో తగిన చర్యలు తీసుకోవాలని లిబ్రిగుడ గ్రామస్తులు కోరుతున్నారు. -
కత్తలకవిటిలో జడ్డిమా అమ్మవారి పూర్ణాహుతి
పర్లాకిమిడి: గుసాని సమితి కత్తలకవిటిలో మాశీతాలయి (జడ్డిమా) గ్రామదేవత నూతన మందిర నిర్మాణం ప్రతిష్టాపన మహోత్సవాలు రెండు రోజులుగా జరుగుతున్నాయి. జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు మందిరానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పూరీ పుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన అమ్మవారికి ప్రాణపతిష్ట, పూర్ణాహుతి, యజ్ఞాలు నిర్వహించి బుధవారం రెండుగంటల సమయంలో గుడి తలుపులు తెరిచి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కత్తలకవిటి గ్రామకమిటీ, తమిళనాడుకు చెందిన బ్రాహ్మణులు విచ్చేసి మంత్రోచ్ఛరణ చేశారు. -
రాజ్య సభ నాయకత్వానికి సస్మిత్ పాత్రో రాజీనామా
భువనేశ్వర్: డాక్టర్ సస్మిత్ పాత్రో బుధవారం రాజ్య సభలో బిజూ జనతా దళ్ (బీజేడీ) పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలక రాజకీయ పరిణామంగా చర్చ ఊపందుకుంది. సస్మిత్ పాత్రో తన రాజీనామా పత్రం బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్కు సమర్పించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఎగువ సభలో నాయకత్వ మార్పు కోరుతూ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు నాయకత్వానికి లేఖ రాశారన్న వార్తల నేపథ్యంలో ఈ రాజీనామా చోటుచేసుకోవడం కలకలం రేపుతుంది. రాజ్య సభలో కొత్తగా ఎన్నికై న బీజేడీ ఎంపీ సంతృప్త్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సస్మిత్ పాత్రోను తొలగించాలన్న డిమాండ్ ఊపందుకుందని తెలిసింది. కొంత మంది ఎంపీలు తమ ఆందోళనలను అధినేత నవీన్ పట్నాయక్కు లాంఛనంగా తెలియజేసి నాయకత్వ పునర్వ్యవస్థీకరణకు ఒత్తిడి చేశారని పార్టీ అంతర్గత వర్గాలు సమాచారం. ప్రస్తుతం రాజ్య సభలో బీజేడీకి 6 మంది సభ్యులు ఉన్నారు. 2022 నుంచి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పని చేస్తున్న సస్మిత్ పాత్రో రాజ్య సభలో పార్టీ వైఖరిని సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన రాజీనామాతో ఆ కీలక నాయకత్వ పాత్రను ఎవరు చేపడతారనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. సంతృప్త్ మిశ్రా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సంతృప్త్ మిశ్రా తొలిసారిగా రాజ్య సభలోకి ప్రవేశించారు. డాక్టరు సస్మిత్ పాత్రో రాజీనామా లేదా తదుపరి కార్యాచరణకు సంబంధించి గానీ, బీజేడీ నాయకత్వం నుంచి గానీ ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదా ప్రకటన వెలువడలేదు. -
పది గంటల ట్రాఫిక్ జామ్
కొరాపుట్: అంతర్రాష్ట్ర సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల 10 గంటల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో రాష్ట్ర సరిహద్దు కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి సుంకికి సమీపంలో ఆంధ్ర లోని కంకణా ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది. కొరాపుట్ జిల్లా నుంచి బియ్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దాంతో రోడ్డు మార్గం మూసుకుపోయింది. ఈ మార్గంలో వందలాది వాహనాలు నిలిచి పోయాయి. విజయనగరం–రాయ్పూర్ జాతీయ రహదారి 26 కావడం తో వందలాది వాహనాలు నిలిచి పోయాయి. రాత్రి పూట తిరిగే అంతర్రాష్ట్ర బస్సులు నిలిచి పోయాయి. విజయవాడ, రాజమండ్రి, విశాఖ పట్నం, విజయ నగరం, బ్రహ్మపుర, భువనేశ్వర్, కటక్, పూరి నుంచి ఒడిశా వైపు జయపూర్, నబరంగ్పూర్, మల్కన్గిరి, జగదల్పూర్ వెళ్లే వందలాది బస్సులు ఇరు వైపులా నిలిచి పోయాయి. ఒడిశా, చత్తీస్గఢ్ నుంచి వచ్చే బస్సులు కూడా చిక్కుకున్నాయి. ఉదయం 7 గంటలకు ఆంధ్రా పోలీసుల వచ్చేంత వరకు వేలాది ప్రజలు నరక యాతన పడ్డారు. మంగళ వారం ఉదయం 9 గంటలకు రెండు వైపులా వాహనాలు ముందుకు కదిలాయి. -
రాష్ట్రపతి రౌర్కెలా పర్యటన
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన రౌర్కెలా పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమాలపై కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరం, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో చర్చించారు. ఈ చర్చలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనూ గర్గ్, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా పాల్గొన్నారు. ఉత్పత్తి రంగంలో నాల్కో కొత్త రికార్డు జయపురం: కొరాపుట్ జిల్లా ధమన్జోడిలోని నాల్కో సంస్థ రికార్డు సృష్టించింది. గత 2025–26 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఉత్పత్త సాధించింది. గత నాలుగు దశాబ్దాలుగా బాకై ్సట్ ఉత్పాదనలో, ఎగుమతులలో రికార్డులు సృష్టిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 77.01 లక్షల టన్నులు అల్యూమినియం ఉత్పత్తి చేసి కొత్త రికార్డు సృష్టించిందని అధికార వర్గాల వర్గాలు వెల్లడించాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 77.7 లక్షల టన్నుల బాకై ్సట్ ఎగుమతి చేసి నూతన రికార్డు స్థాపించింది. అలాగే అల్యూమిన హైగ్రేడ్ 23.00 లక్షల టన్నులు, క్యాలసైడ్ అల్యూమినియం 22.75 లక్షల టన్నులు ఉత్పాదన చేసినట్లు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2026 మార్చ్ 31 నాటికి సాధించిన రికార్డుతో ఉత్పత్తి సాధించిన నాల్కో మతాబులు కాల్చి, మిఠాయిలు పంచుకుంది. రత్న భాండాగారంలో ఆభరణాల లెక్కింపు పునః ప్రారంభం భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరం రత్న భాండాగారంలో భద్రపరిచిన ఆభరణాల లెక్కింపు బుధవారం నుంచి తిరిగి ప్రారంభం అవుతుందని శ్రీ మందిర్ ముఖ్య నిర్వాహకుడు డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి తెలిపారు. ఈ లెక్కింపు 11వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 13వ తేదీన, 16 నుంచి 18వ తేదీ వరకు లెక్కింపు జరుగుతుందని ఆయన తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా సామాన్య భక్తుల దర్శన ఏర్పాట్లలో స్వల్ప మార్పులు చేశారు. లెక్కింపు జరిగే రోజున లోపలి ప్రాంగణం (భిత్తొరొ కఠొ) దర్శనం మూసివేయబడుతుంది. వెలుపలి ప్రాంగణం (బహారొ కఠొ) నుండి సర్వ దర్శనం పరిమితం చేశారు. ఈ దశ తర్వాత తదుపరి లెక్కింపు తేదీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మార్చి 25న ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధీకృత సేవకులు జగ మోహన్, గర్భగుడి లోపల తమ విధులను యథావిధిగా నిర్వర్తిస్తారు. శ్రీ జగన్నాథుని ఆలయ ఆచారాలు నిరాటంకంగా కొనసాగుతాయన్నారు. పిడుగుపాటుకు ఆవు మృతి జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి బలిగాం గ్రామ పంచాయితీ లకమాలియగుడ గ్రామంలో సోమవారం సాయంత్రం పెనుగాలులతో పిలుగులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడి ఒక ఆవు ప్రాణాలు కోల్పోయింది. పశువుల కాపర్లు లకమాలియగుడ గ్రామ సమీపంలో ఆవులు, మేకలు గొర్రెలకు మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాలులతో కూడిన వర్షం పడటంతో పశువులు చెల్లాచెదురై చెట్ల కిందకు చేరాయి. అందులో ఒక ఆవు చెట్టు కింద నిల్చొని ఉండగా పిడుగు పడి సంఘటనా స్థలంలోనే మరణించింది. మరణించిన ఆవు అదే గ్రామానికి చెందిన కమలలోచన పంగిదిగా గుర్తించారు. బాధితుడికి ఆర్థిక సహాయం అందజేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కాశీపూర్లో ఉద్రిక్త పరిస్థితులు
ఉత్సాహంగా ర గ్బీ పోటీలు రగ్బీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. క్రీడాకారులు ప్రతిభ చూపారు. –8లోuజడ్డిమా మందిర ప్రారంభం పర్లాకిమిడిలో జడ్డిమా మందిరం ప్రారంభోత్సవం జరిగింది. మహిళలు పాల్గొన్నారు. –8లోu● 163 సెక్షన్ జారీ ● పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు ● 53 మంది పోలీసులకు గాయాలుశ్రీమందిరం ఆదాయం లెక్కింపు భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం మంగళవారం లెక్కించారు. ఇందులో నగదు రూ.3,64,753లు, బంగారం 10 గ్రాములు, వెండి 6 గ్రాముల 400 మిల్లీగ్రాములు వచ్చాయని అధికారులు తెలిపారు. బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పోలీసులపై దాడి అమానుషం రాయగడ: విధులు నిర్వహించేందుకు వెళ్లిన పోలీసులపై ఆందోళనకారులు చేసిన దాడి అమానుషమని ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ అన్నారు. ఈ మేరకు దాడిని ఖండిస్తూ ఆమె మంగళవారం వీడియో సందేశం విడుదల చేశారు. కాశీపూర్ సమితి కండమాల్ గ్రామానికి చెందిన సుభాషిన్ మాఝి అనే నిందితుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారని అన్నారు. నిందితుడిపై 14 కేసులు ఉన్న నేపథ్యంలో అరెస్టు చేసేందుకు వెళ్లగా అప్పటికే సగుబారి, కంధమాల్ తదితర గ్రామాలకు చెందిన గ్రామస్తులు ముందస్తు వ్యూహం ప్రకారం సామూహికంగా పోలీసులను రౌండప్ చేసి రాళ్లతో దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో 58 మంది పోలీసులు గాయపడ్డారని చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు టియర్ ఫాగ్ విడుదల చేశామన్నారు. రాయగడ: జిల్లాలోని కాశీపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమితిలోని సగుబారి పంచాయతీలోని సిజిమాలి బాకై ్సట్ నిక్షేపాలకు సంబంధించి తవ్వుకునేందుకు ప్రభుత్వం వేదాంత్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో సగుబారి గ్రామం నుంచి సిజిమాలి బాకై ్సట్ నిక్షేపాలు గల ప్రాంతం వరకు రహదారిని నిర్మించేందుకు కంపెనీ సన్నహాలు చేశారు. బాకై ్సట్ నిక్షేపాలు కొల్లగొడితే ఈ ప్రాంతం పర్యావరణం పరంగా పూర్తిగా దెబ్బ తింటుందని అందుకు ఆది నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రభావిత గ్రామాలకు చెందిన వారు రహదారి నిర్మాణానికి అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిని బుజ్జగించే ప్రయత్నం చేసేందుకు మంగళవారం వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు రాళ్లు రువ్వడంతో 53 మంది పోలీసులకు గాయాలయ్యాయి. గాయాలు తగిలిన వారిలో ఎస్డీపీఓ గౌరహరి సాహు, ఏఎస్పీ అమూల్యకుమార్ ధర్, అండ్రాకంచ్ ఐఐసీ కూడా ఉన్నారు. గాయాలు తగిలిన వారిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం వైజాగ్ తరలించారు. మిగిలిన వారిలో కొందరిని కాశీపూర్ పీహెచ్సీకి, మరికొందరిని టికిరిలొ గల ఉషాపాడు ఆస్పత్రికి తరలించారు. శాంతి భద్రతలు క్షీణించడంతో 163 సెక్షన్ అమలు చేశారు. ఆందోళన జరిగే సగుబారి గ్రామంలొ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసు బందోబస్తుతో పాటు రిజర్వ్ పోలీసుల దళాలు మోహరించాయి. అసలు జరిగిందేమిటి.. సగుబారి గ్రామానికి సమీపంలో గల సిజిమాలి ప్రాంతంలో ఉన్న బాకై ్సట్ ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు వేదాంత కంపెనీకి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. దీన్ని అనుసరించి ఆ ఖనిజ నిక్షేపాలను తవ్వేందుకు కంపెనీ యాజమాన్యం ఆయా ప్రభావిత ప్రాంతాల్లో గల గ్రామస్తులతో ఎలాంటి సమావేశాలను నిర్వహించకుండా వారి అనుమతులను తీసుకోకుండా కొండను తవ్వేందుకు కంపెనీ సన్నాహాలు చేసింది. ఈ నేపథ్యంలో సగుబారి నుంచి బాకై ్సట్ లభించే కొండ వరకు రహదారిని నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అందుకు ఆది నుంచి ఆ ప్రాంత వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా సొమవారం నాడు గ్రామస్తులకు, కంపెనీ సిబ్బంది మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తం కావడంతో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి సోమవారం సగుబారి గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నించారు. అందుకు గ్రామస్తులు ఎలాంటి సహకారం అందించకపోవడంతో కలెక్టర్ పోలీస్ బందోబస్తు నడుమ వారిని మైకు ద్వారా బాకై ్సట్ తవ్వుకునేందుకు ప్రభుత్వం వేదాంత కంపెనీకి అనుమతి ఇచ్చిందని, అందుకు ఎవ్వరూ అభ్యంతరం చెప్పకూడదని వివరించారు. అదే రోజు రాత్రి కొంత మంది పోలీసులు సగుబారి గ్రామంలో చొరబడి గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ క్రమంలొ పోలీసులు తమపై దాడి చేయడంతొ గ్రామానికి అనీ మాఝి, నారింగ దేయి మాఝి, లాలి మాఝి, కుముటి మాఝి, బామిణి మాఝి, బురుస మాఝి, నింగి మాఝి, ఆగాధ నాయక్, రామచంద్ర నాయక్తొ పాటు మరి కొందరు పోలీసుల దాడిలో గాయాలు పాలయ్యారని గ్రామస్తులు ఆరొపించారు. మంగళవారం పోలీసుల బందోబస్తుతో సగుబారి గ్రామానికి చేరుకున్నారు. అయితే కొండపై ఉన్న గ్రామస్తులు మరణాయుధాలతో వ్యతిరేకించారు. తమ గ్రామంలొ గల ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు తామెంతమాత్రం అనుమతించేది లేదని దీని వల్ల పర్యావరణం పూర్తిగా కలుషితమవ్వడంతొ పాటు అడవి తల్లిని నమ్ముకున్న తామంతా అనాథలమై జీవనోపాధిని కోల్పోతామని హెచ్చరించారు. అనంతరం పోలీసులపై రాళ్లు రువ్వారు. -
శ్రమదానంతో బావి నిర్మాణం
● తాగునీటి సమస్యను పరిష్కరించుకున్న టికరపడ గ్రామస్తులు రాయగడ: తాగునీటి సమస్యను పరిష్కరించండి మహాప్రభో అంటూ ఇటు పంచాయతీ కార్యాలయం అధికారులకు అటు సంబంధిత శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. విసిగిపోయిన సమస్యను తామే పరిష్కరించుకోవాలని గ్రామస్తులంతా ఏకమయ్యారు. శ్రమదానంతో సమీపంలో బావి నిర్మించుకున్నారు. బావి నుండి నీటిని పైపుల సహాయంతో గ్రామానికి తరలించి సమస్యను పరిష్కరించుకున్నారు. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా తామే తమ సమస్యను పరిష్కరించుకున్నామని గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కాసీపూర్ సమితి హడియా పంచాయతీలోని టికరపడ గ్రామంలో కొన్నాళ్లుగా తాగునీటి సమస్య నెలకుంది. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఎవ్వరూ స్పందించకపొవడంతో గ్రామస్తులంతా కలసి కొంత మేర డబ్బులు పొగు చేసుకుని శ్రమదానంతో బావిని తవ్వుకున్నారు. పిల్లా.. పెద్ద, ఆడమగా అనే తేడా లేకుండా అంతా కలసి శ్రమించారు. వారం రోజుల్లో బావిని తవ్వుకున్నారు. గ్రామంలో ఇంటింటా సేకరించిన డబ్బులతో బావి నుంచి గ్రామం వరకు తాగునీటి పైపులను, మోటారును ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 30 కుటుంబాలు గల ఈ గ్రామస్తులు తమ ఐక్యతను చాటుకున్నారు. -
నా కుమారుడి ఆచూకీ తెలపండి!
రాయగడ: నా కుమారుడి ఆచూకీ తెలపండని ఓ విద్యార్థి తండ్రి మోర పెట్టుకున్నారు. ఈ ఘటన స్థానిక అంబాగుడ గ్రామంలో గల ఆర్డబ్ల్యూ ఎస్అండ్ఎస్ పాఠశాలలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని టికిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మయిలిగుడ గ్రామానికి చెందిన సాలు మాఝి కుమారుడు ప్రకాష్ మాఝి పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు చెందిన హాస్టల్లో ఉంటున్నాడు. ప్రకాష్ గత 14 రోజులుగా ఇంటికి రాలేదని ఆందోళన చెందిన విద్యార్థి తండ్రి ఈ మేరకు పాఠశాల హెచ్ఎం బిభూతి భూషన్ రొథొను కలిశారు. ఇదివరకే తాను ఇంటికి వెళ్తున్నట్లు హాస్టల్ వార్డెన్కు చెప్పి ప్రకాష్ వెళ్లిపోయాడని హెచ్ఎం సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా మార్చి 27వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఉందని అందరికీ ఫోన్ ద్వారా మెసేజ్లు పంపించడం జరిగిందని, ఆ సమయంలో సమావేశానికి రాకపొవడంతో ఏదో కారణంతో రాలేదని భావించామని హెచ్ఎం సమాధానం చెప్పాడు. గత 14 రోజులుగా తన కుమారుడు ఇంటికి రాలేదని, పాఠశాలలో లేడని, ఎక్కడికి వెళ్లినట్లని విద్యార్థి తండ్రి బోరుమన్నాడు. ఈ విషయమై పోలీసులకు విద్యార్థి తండ్రి సాలు మాఝి, పాఠశాలకు చెందిన వారు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. -
విద్యార్థులకు ‘ఒడియా భాష వాచకం’ పుస్తకాల పంపిణీ
పర్లాకిమిడి: ఒడిశా దినోత్సవ పక్షోత్సవాలు పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం తరపున మంగళవారం స్థానిక గాంధీ మెమోరియల్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు మధుసూదన్రావు రాసిన ‘బొర్నోబోధో’(ఒడియాభాష వాచకం) పుస్తకాలను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఒడియా వాచకం ఒకటి, రెండవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ప్రాథమిక స్థాయి నుంచి ఒడియా భాషను ప్రతిఒక్క విద్యార్థి నేర్చుకోవాలని ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏడీఎం మునీంద్ర హానగ అన్నారు. కార్యక్రమంలో డీఈవో డాక్టర్ మయాధర్ సాహు, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, ప్రధాన ఉపాధ్యాయులు ఎస్.తిరుపతిరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
బ్రిడ్జి పైనుంచి దూకిన యువకుడు
రాయగడ: Ý린MýS Møç³ç³-Æð‡-sîæÐŒæ M>ÌS±ÌZ °Ð]líÜ-çÜ$¢¯]l² Æý‡…h™Œæ MýS$Ð]l*ÆŠ‡ Ýëçßæ$ (34) Ð]l$hjVúÇ Ð]l$…¨Æ>-°MìS çÜÒ$-ç³…ÌZ° f…Æý‡n*Ð]l† ¯]l¨ Ð]l…™ðl¯]l Oò³¯]l$…_ Ð]l$…VýS-âýæÐéÆý‡… ±sìæ-ÌZMìS §ýl*MóS-Ô>yýl$. E§ýlĶæ$… çÜ$Ð]l*Æý‡$ 11 VýS…rÌS çÜÐ]l$Ķæ$…ÌZ ™èl¯]l Ý÷…™èl O»ñæMýS$Oò³ {¼yìlj Ð]l§ýlªMýS$ Ð]l_a¯]l Æý‡…h™Œæ AMýSPyólే ´ëÇP…VŠæ ^ólíܯ]l A¯]l…™èlÆý‡… A™èl° gZâ¶æ$Ï ç³MýSP¯ól E…_ {¼yìlj Oò³¯]l$…_ ±sìæÌZMìS VðS…™ól-Ô>yýl$. C¨ ^èl*íܯ]l AMýSPyìl ÐéÆý‡$ Ððl…r¯ól ´ùÎ-çÜ$ÌSMýS$ çÜÐ]l*^éÆý‡… A…¨…-^éÆý‡$. çÜÐ]l*^éÆý‡… A…§ýl$MýS$¯]l² ´ùÎçÜ$Ë$ çÜ…çœ$-r¯é çܦÌê-°MìS ^ólÆý‡$-MýS$¯é²Æý‡$. A¯]l…-™èlÆý‡… AW-²-Ð]l*-ç³MýS íܺ¾…¨MìS çÜÐ]l*-^éÆý‡… CÐ]lÓ-yýl…™ø ÐéÆý‡$ ¯]l¨-ÌZMìS ¨W Ķæ¬Ð]lMýS$° B^èl*MîS MøçÜ… V>Í-çÜ$¢-¯é²Æý‡$. çÜ$Ð]l*Æý‡$ Ð]lÊyýl$ VýS…rË$ {ÔèæÑ$…-_-¯]lç³µ-sìæMîS B^èl*MîS ™ðlÍ-Ķæ$-Æ>Ìôæ§ýl$. D Ðól$Æý‡MýS$ ´ùÎ-çÜ$Ë$ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ §ýlÆ>Åç³#¢ ^ólçÜ$¢-¯é²Æý‡$. Æý‡…h™Œæ G…§ýl$MýS$ Cr$-Ð]l…sìæ Açœ*-Ƈ$$-™éÅ-°MìS ´ëyýl-µyéz-yýl¯ól Mø×æ…ÌZ BÆ> ¡çÜ$¢-¯é²Æý‡$. గాలిస్తున్న అగ్నిమాపక సిబ్బంది -
ఖుర్దా రోడ్దే అధిక ఆదాయం
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వేకు చెందిన ఖుర్దా రోడ్ మండలం 2025–26 ఆర్థిక సంవత్సరంలో జోనల్ స్థాయిలో టికెట్ తనిఖీల ద్వారా అత్యధిక ఆదాయం ఆర్జించడం విశేషం. ఈ సాఫల్యత టికెట్ తనిఖీల పనితీరులో మైలురాయిని ఆవిష్కరించిందని అధికార వర్గాలు టికెట్ తనిఖీ సిబ్బందిని అభినందించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 7.38 లక్షల అనధికార, అక్రమ ప్రయాణికుల నుండి చార్జీలు, జరిమానాల రూపంలో మొత్తం రూ. 39.71 కోట్లు వసూలు చేశారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 21 శాతం పెరుగుదలను సూచిస్తుందని విభాగం ప్రముఖ అధికారి సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అనిల్ కుమార్ ఎస్ తెలిపారు. ఖుర్దారోడ్ మండల వ్యాప్తంగా వివిధ రైళ్లు, స్టేషన్లలో సుమారు 3,000 విస్తృతమైన, ప్రత్యేక టికెట్ తనిఖీ దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనధికార ప్రయాణాలను అరికట్టి క్రమశిక్షణతో కూడిన ప్రయాణ వాతావరణం నిర్ధారణకు మండల టికెట్ తనిఖీ దాడులు మరింత ముమ్మరం చేస్తున్నారు. -
మనస్తాపంతో ఉపాధ్యాయుడి ఆత్మహత్య
రాయగడ: మనస్తాపానికి గురైన ఉపాధ్యాయుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని గునుపూర్లో సోమవారం చోటు చేసుకుంది. మృతుడు గుణుపూర్లో గల శివశక్తి నగర్ రెండో నంబరు కాలనీలో నివాసముంటున్న కృష్ణ సేనాపతి (53)గా గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గుడారి సమితి డిమిరిగుడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సేనాపతి గత కొద్ది నెలలుగా పక్షవాతంతో మంచం పట్టారు. నడవలేని దుస్థిఽతి ఏర్పడింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేందుకు ఇష్టం లేక మానసికంగా ఆందోళన చెందారు. మనస్థాపానికి గురై ఇంటికి సమీపంలో గల బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సబ్ డివిజన్ హాస్పటల్కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
జయపురం: వ్యవసాయ విభాగ అధికారులు పట్టణంలోని రసాయినిక ఎరువుల దుకాణాలు, వేర్ హౌస్లపై మంగళవారం దాడులు నిర్వహించారు. ఎరువులు సక్రమంగా లభించటం లేదని రైతుల ఆరోపణల నేపథ్యంలో రెండు ప్రభుత్వ వేర్ హౌస్లు, మూడు ప్రైవేట్ ఎరువుల దుకాణాలపై దాడులు జరిపిన అధికారులు ఎరువుల నిల్వలు పరిశీలించి రికార్డులు సరిచూశారు. ముఖ్యంగా యూరియాను నిబంధనల మేరకు అమ్ముతున్నారా లేదా తెలుసుకున్నారు. దాడుల్లో సీడీఏలో సంతోష్ కుమార్ దళబెహర, జిల్లా వ్యవసాయ విభాగ అధికారి లలితేందు మహాపాత్ర, ఏడీఏ కనూచరణ దాస్, జయపురం సమితి అగ్రికల్చర్ అధికారి ిశితికాంత దాస్, అసిస్టెంట్ అగ్రి కల్చర్ ఆఫీసర్ ప్రశాంత పుష్టి, శ్మిత పాఢీ పాల్గొన్నారు. -
మిషన్.. అడ్మిషన్
● ఇంటర్ అడ్మిషన్ల వేట ● సంక్రాంతి నుంచే కార్పొరేట్ కాలేజీల హవా మేము విశాఖలో కార్పొరేట్ కాలేజీ నుంచి వచ్చాం. మీ అమ్మాయి బాగా చదువుతుందట. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెస్తుందట. అందుకే తెలుసుకొని వచ్చాం. మా కాలేజీలో చేర్పించండి. అమ్మాయి భవిష్యత్కు మాది భరోసా. మంచి విద్యాబోధనతో పాటు అన్నిరకాల వసతులు ఉంటాయి. ఆలస్యం చేస్తే అడ్మిషన్లు పూర్తవుతాయి. ఇలాంటి అవకాశం మీకు రాదు. కొంత మొత్తం అడ్వాన్స్ కట్టి అడ్మిషన్ను ఖరారు చేసుకోండి. – ఎల్ఎన్పేటకు చెందిన వెన్నెల అనే విద్యార్థిని తల్లిదండ్రులను కార్పొరేట్ ప్రతినిధులు ఒప్పిస్తున్న తీరు ఇది.. హిరమండలం: టెన్త్ పరీక్షలు అయ్యాక కాలేజీల్లో అడ్మిషన్ల కోసం కార్పొరేట్ కళాశాలలు పెద్ద మిషనే మొదలుపెట్టాయి. నిజానికి పరీక్షల ముందు నుంచే విద్యార్థుల వేట మొదలైంది. తాజాగా పరీక్షలన్నీ ముగియడంతో ప్రచారాలు పతాక స్థాయికి చేరుకుంటు న్నాయి. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా నడిచే కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి పీఆర్వోలు వందలా ది మంది జిల్లాలో ఉన్నారు. వారు విద్యాశాఖ వద్ద ఉన్న పదో తరగతి విద్యార్థుల వివరాలు తీసుకొని తల్లిదండ్రులను కలుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పిల్లాడు చేజారిపోకూడదనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. వీరి దూకుడుకు జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలు ఉన్నా అడ్మిషన్ల విషయంలో వెనుకబడుతున్నాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 38, ఆదర్శ పాఠశాలలు 13, కేజీబీవీలు 25, ప్లస్ 2 పాఠశాలలు 6, గురుకుల పాఠశాలలు 9 ఉన్నాయి. ప్రతి సంవత్సరం 20 వేలకుపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. గత ఏడాది పదో తరగతి విద్యార్థులు 28,176 మంది పరీక్షలకు హాజరుకాగా.. 23,219 మంది ఉత్తీర్ణత సాధించారు. కానీ ఇందులో కేవలం 6,491 మంది మాత్రమే జిల్లాలో ఇంటర్లో చేరారు. ఈ ఏడాది 29,362 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరికలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నా యి. అధ్యాపకుల కొరత విద్యాబోధనపై ప్రభావం చూపుతోంది. అటు ఆశించిన స్థాయిలో జూనియర్ కాలేజీల్లో వసతులు ఉండడం లేదు. ఉత్తీర్ణతా శాతం అంతంత మాత్రమే. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. వైఎస్సార్సీపీ హయాంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేజీబీవీల్లో ఇంటర్ కాలేజీలను అప్గ్రేడ్ చేశారు. సంప్రదాయ కోర్సులతో పాటు సాంకేతిక కోర్సులు సబ్జెక్టులను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఉద్యోగం, ఉపాధినిచ్చే కోర్సులు సైతం వచ్చాయి. అలాగే 2021లో నరసన్నపేట మండలం ఉర్లాం, సరుబుజ్జిలి మండలం రొట్టవలస, పలాస మండలం బ్రాహ్మణతర్లా, మందస మండలం హరిపురం, వజ్రపుకొత్తూరు మండలం వజ్రపుకొత్తూరు, టెక్కలి మండలం టెక్కలిలో ప్లస్ 2గా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను అప్గ్రేడ్ చేశారు. అప్పట్లో ఇవన్నీ విద్యార్థులతో నిండిపోయి కళకళలాడేవి. కానీ గత రెండేళ్లలో సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. వేసవిలో అధికారులు అవగాహన పెంచుతున్నా విద్యార్థులు ఆసక్తి చూపని పరిస్థితి. పీఆర్వోల హల్చల్ జిల్లా నుంచి ఎక్కువగా విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో చేరుతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న 71 జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తవుతున్నాయి. కానీ ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రం సీట్లు నిండడం లేదు. సంక్రాంతి నుంచే కార్పొరేట్ కంపెనీల పీఆర్వోలు గ్రామాల్లో ప్రవేశిస్తున్నారు. విద్యార్థుల అడ్మిషన్లు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి ఫీజులతో పాటు హాస్టల్కు రూ.2 లక్షలకుపైగా వసూలు చేస్తున్నారు. మీ పిల్లాడు చాలా బాగా చదువుతాడట. అందుకే తెలుసుకొని వచ్చాం. మా కాలేజీలో చేర్పిస్తే పిల్లాడి భవిష్యత్కు మాదీ భరోసా. విద్యార్థికి ఇంటర్ కీలకం. అందుకే మా కాలేజీలో చేర్పించండి. మంచి విద్యా బోధనతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించి అన్నిరకాల శిక్షణలు ఇస్తాం. నీట్, జేఈఈ, ఎంసెట్ ఇలా అన్ని రకాల శిక్షణలు ఉంటాయి. ముందుగా చేరితే ఫీజుల్లో రాయితీ ఉంటుంది. ఆలస్యం చేస్తే వెనుకబడి పోతారు. – హిరమండంలో శ్రీనివాస్ అనే పదో తరగతి విద్యార్థి తల్లిదండ్రులను కలిసి కార్పొరేట్ కాలేజీ ప్రతినిధులు చెప్పిన మాట ఇది..ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు చేరాలి. ఇక్కడ ఉత్తమ విద్యాబోధనతో పాటు సౌకర్యాలు ఉంటాయి. సామాన్య, మధ్యతరగతి వారికి ఇవి ఎంతో మేలు. అనవసరం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి భారం పడవద్దు. కేజీబీవీల్లో విద్యార్థినులు చేరాలి. ఇక్కడ ఉత్తమ విద్యాబోధన, రక్షణ, వసతులు ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి. – కృష్ణవేణి, ఎస్ఓ, హిరమండలం కేజీబీవీ -
ఉత్సాహంగా రగ్బీ పోటీలు
భువనేశ్వర్: 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) రగ్బీ చాంపియన్షిప్ 2025–26 అండర్ 17 పోటీలు కళింగ స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగాయి. ఈ పోటీల్లో ఆతిథ్య ఒడిశా బాలికల జట్టు టైటిల్ కై వసం చేసుకోగా, బీహార్ బాలుర జట్టు చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. అండర్ 17 బాలికల విభాగంలో ఒడిశా అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని గెలుచుకుంది. బీహార్ రన్నర్ అప్గా నిలిచింది. మహారాష్ట్ర మరియు ఢిల్లీ వరుసగా మూడు, నాల్గో స్థానాలను దక్కించుకున్నాయి. అండర్ 17 బాలుర విభాగంలో ఫైనల్లో ఒడిశాపై బలమైన ప్రదర్శన కనబరిచిన బీహార్ విజయం సాధించింది. ఒడిశా రన్నరప్గా నిలిచింది. మహారాష్ట్ర, రాజస్థాన్ వరుసగా మూడు, నాల్గో స్థానాల్లో నిలిచాయి. అండర్ 17 విభాగం ముగింపు వేడుకకు క్రీడలు, యువజన సేవల డైరెక్టర్ డాక్టర్ యెద్దుల విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాజరైన ఇతర ప్రముఖులలో మాధ్యమిక విద్యా విభాగం డైరెక్టర్ బీరేంద్ర కోర్కోరా, సహాయ డైరెక్టర్ (పీఈటీ) జ్యోతి ప్రసాద్ పరిడా, టోర్నమెంట్ పరిశీలకుడు అరవింద్ యాదవ్ ఉన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ యెద్దుల విజయ్ యువ క్రీడాకారుల అంకితభావం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తిని ప్రశంసించారు. ఆయన విజేతలను అభినందించి పాల్గొన్న వారందరూ శ్రేష్ఠత కోసం నిరంతరం కృషి చేయాలి. ఉన్నత స్థాయి పోటీలను లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రోత్సహించారు. వ్యక్తులను అన్ని రంగాలలో రాణించేలా తీర్చిదిద్దడంలో పాఠశాల క్రీడల ప్రాముఖ్యతను మాధ్యమిక విద్యా విభాగం డైరెక్టర్ బీరేంద్ర కోర్కోరా వివరించారు. క్షేత్రస్థాయిలో రగ్బీని ప్రోత్సహించడంలో ఇలాంటి చాంపియన్షిప్లు కీలక పాత్ర పోషిస్తాయని టోర్నమెంట్ పరిశీలకుడు అరవింద్ యాదవ్ అన్నారు. ఈ చాంపియన్షిప్లో భాగంగా అండర్ 14 బాలురు, బాలికల మ్యాచ్లు ఈ నెల 9 మరియు 10 తేదీలలో కళింగ స్టేడియం ప్రాంగణంలో జరగనున్నాయి. -
పరిహారం కోసం ఆందోళన
భువనేశ్వర్: ఇటీవల కురిసిన వడగళ్ల వాన వల్ల జరిగిన భారీ నష్టానికి పరిహారం కోరుతూ బొలంగీర్ జిల్లాలో స్థానికులు మంగళవారం రహదారిని దిగ్బంధించారు. పట్నగడ్, పద్మాపూర్ రహదారిపై పడేల్ కూడలి వద్ద నిరసన ప్రదర్శించారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వడగళ్ల వాన ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత అధికార యంత్రాంగం, ప్రభుత్వం గానీ ఎలాంటి సహాయం అందించకపోవడంతో అసంతృప్తి పెరుగుతోందని గ్రామస్తులు ఆరోపించారు. తక్షణ సహాయం, నష్టపరిహారం కోసం ఒత్తిడి చేస్తూ స్థానికులు రహదారిని దిగ్బంధించారు. వడగళ్ల వాన కారణంగా అనేక కచ్చా ఇళ్ల పైకప్పులు దెబ్బతిని, ఇళ్లలోకి వర్షపు నీరు చేరినట్లు సమాచారం. వంట పాత్రలతో సహా నిత్య వినియోగ గృహోపకరణాలు దెబ్బతిన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విపత్తుతో జరిగిన నష్టాలను పూడ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్లో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ సి.హెచ్.వసంత్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరెక్టర్ (అడ్మిన్) డాక్టర్ దుర్గాప్రసాద్ పాడీ, డీన్ (స్టూడెంట్స్) డాక్టర్ రితీష్ కుమార్, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.ఎన్.సంధ్య, డెంటిస్టు డాక్టర్ సల్లాన శరత్కుమార్, తదితరులు హాజరయ్యారు. ఈ వర్క్షాపులో ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ గుండెపోటు వచ్చి పడిపోయినప్పుడు మనం ఎలా సీపీఆర్ చేయాలి, ప్రతిఒక్కరికీ ప్రాణాపాయం సమయంలో ప్రాథమిక జీవరక్షణ ఎలా చేయాలో ప్రిన్సిపాల్ ఎస్.ఎన్.సంధ్య తెలియజేశారు. దీనిపై నర్సింగ్ విద్యార్థులకు డెమో చేసి చూపించారు. సీపీఆర్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


