breaking news
Odisha Latest News
-
తీర్థయాత్రలకు 775 మంది వృద్ధుల పయనం
రాయగడ: సీనియర్ సిటిజన్ తీర్థయాత్ర పథకంలో భాగంగా శనివారం రాయగడ నుంచి 775 మంది వయోవృద్ధులను ప్రత్యేక ట్రైన్లో వారణాసి, అయోధ్య తీర్థయాత్రలకు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక హజరవ్వగా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, రాయగడ రైల్వే డివిజనల్ మేనేజరు అమితాబ్ సింఘాల్ పచ్చ జెండాను ఊపారు. దక్షిణ, పశ్చిమాంచల్ జిల్లాలైన కొరాపుట్, రాయగడ, నవరంగపూర్, మల్కనగిరి, కలహండి, నువాపడ జిల్లాల నుంచి వచ్చిన వయో వృద్ధులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వీరికి ఎస్కార్టుగా మరో 25 మంది ప్రయాణించి వారికి సహకరిస్తారు. -
ఫిబ్రవరి 28, మార్చి ఒకటి తేదీల్లో ఉత్కళ సమ్మిళిణి మహాసభలు
జయపురం: ఉత్కళ సమ్మళిణి కొరాపుట్ జిల్లాశాఖ మహాసభలను ఫిబ్రవరి 28, మార్చి ఒకటో తేదీల్లో జరపాలని ఉత్కళ సమ్మిళిణి కమిటీ నిర్ణయించింది. శుక్రవారం స్థానిక కాళ్ల సాహి హరిశ్చంద్రపార్క్లో సమ్మిళిణి ఉపాధ్యక్షుడు రాజేంద్రకుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా ఉత్కళ సమ్మిళిణి కార్యవర్గ సమావేశంలో సభల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. మహాసభ క్రమశిక్షణతో శాంతి యుతంగా ఘనంగా నిర్వహించాలని సమావేశం నిర్ణయించి అందుకు చేపట్టవలసిన కార్యక్రమం రూపొందించాలని సమావేశం ఆమోదించింది. మహాసభ విషయం పత్రికలు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం, కరపత్రాల పంచటం, అతిథులకు ఆహ్వానం, ఆతిథి ఏర్పాట్లు, సభ్య సేకరణ మొదలగు అంశాలపై సమావేశం సుధీర్ఘంగా చర్చించింది. సమ్మిళిణి బ్యాంక్ ఖాతాను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యతలను కార్యదర్శి నవీణ మదళకు అప్పగించింది. ఈ సందర్భంగా మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఉత్కళ సమ్మిళిణి రాష్ట్ర పరిషత్ సభ్యులు సూర్యనారాయణ రథ్, బాలా రాయ్, సంస్థాగత కార్యదర్శి కవిరాజ్ పరమేశ్వర పాత్రో, చంద్రమణి బారిక్, కృష్ణ చంద్రహోత్త పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో రేంజర్ మృతి
రాయగడ: రోడ్డు ప్రమాదంలో కల్యాణ సింగుపూర్ అటవీ శాఖ రేంజర్ చందన్ గొమాంగో(43) మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చందన్ గొమాంగో తన సొంత కారులో కల్యాణ సింగుపూర్ నుంచి రాయగడకు వస్తుండగా కొలనార సమితి శ్రీరామపూర్ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో కారు ముందరి భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో గొమాంగో తీవ్రగాయాలకు గురయ్యారు. స్థానికులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జేకే పేపర్ మిల్కు సేప్టీ ఎక్స్లెన్స్ అవార్డు రాయగడ: సదరు సమితి జేకేపూర్లోని జేకే పేపర్ మిల్కు ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఎన్విరో సేఫ్టీ ఎక్స్లెన్స్ అవార్డు–26 ప్లాటినం కేటగిరీ అవార్డు దక్కించుకుంది. భద్రత రంగంలో అద్భుతమైన పనితీరును కనబరిచినందుకు ఈ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని గ్రీన్ ఎన్విరో ఫౌండేషన్ ఈ అవార్డును ప్రదానం చేసింది. గోవాలో గ్రీన్ ఎన్విరో ఫౌండేషన్ ద్వారా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ఈ మేరకు అవార్డును అందజేసింది. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఇందన శాఖ సహాయ మంత్రి ఎపాద యస్సొనాయక్ హాజరై జేకే పేపర్ మిల్ జనరల్ మేనేజర్ సత్యజీత్ మహంతికి అవార్డును అందజేశారు. కృషి, పట్టుదల, అంకిత భావం, నిబద్దతతో పనిచేస్తే అవార్డులు లభిస్తాయని మంత్రి నాయక్ పేర్కొన్నారు. పట్టణ బీజేడీ పార్టీ అధ్యక్షుడిగా పార్థసారథి రాయగడ: రాయగడ పట్టణ బీజేడీ పార్టీ అధ్యక్షుడిగా వి.వి.పి.పార్థసారథి నియమితులయ్యారు. రాష్ట్ర శాఖ సీనియర్ నాయకుడు, పార్టీ ఉపాధ్యక్షుడు దేవిప్రసాద్ మిశ్రా ఈ మేరకు జిల్లాలోని సమితి, నగర, అధ్యక్షుల జాబితాను ప్రకటించారు. అదే విధంగా రామనగుడ సమితి అధ్యక్షునిగా బత్రిమండంగి, గునుపూర్ సమితికి సొమేశ్వరరావు, గుణుపూర్ పట్టణానికి పూర్ణచంద్ర బౌరి, పద్మపూర్ సమితికి కరుణాకర్ సబర్, చంద్రపూర్ సమితికి మంగల్ బిబాక, గుడారి సమితికి బిశ్వనాథ్ సబర్, గుడారి ఎన్ఏసీకి ఈశ్వర చంద్ర పాణిగ్రహి, మునిగుడ సమితికి రతన్ లాల్మ జైన్, కొలనార సమితికి లక్ష్మణ్ పెద్దింటి, బిసంకటక్ సమితికి జయరాం హికక, కళ్యాణ సింగుపూర్ సమితికి సుందర్రావు బాగ్, రాయగడ సమితికి ప్రతాప్ పెద్దింటి, కాసీపూర్ సమితికి రతికాంత్ నాయక్లు నియమితులైనట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి, రానున్న పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తమదైన శైలిలో బీజేడీ ఎదుర్కొంటుందని అందుకు ఇప్పటి నుంచేరంగం సిద్ధం చేస్తున్నట్లు మిశ్రా తెలిపారు. నేటి నుంచి చిలికా పక్షుల లెక్కింపు భువనేశ్వర్: దేశంలోని అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు చిలికా వలస పక్షుల స్వర్గధామం. ఈ సరస్సులో పక్షులు మరియు డాల్ఫిన్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం అయింది. ఈనెల 18వ తేదీన పక్షుల లెక్కింపు, 20న డాల్ఫిన్ల గణన జరుగుతుందని చిలికా వైల్డ్లైఫ్ డివిజన్ డీఎఫ్వో అమలన్ నాయక్ తెలిపారు. సరస్సు వ్యాప్తంగా 22 గ్రూపులు పక్షుల లెక్కింపులో పాల్గొంటాయి. ఒక్కో గ్రూపులో ఒక పక్షి నిపుణుడు, 3 నుంచి 5 మంది గణనదారులు, 2 మంది బోట్ ఆపరేటర్లు ఉంటారు. సతొపొడ, రంభ, బలుగాంవ్, టంగి మరియు చిలికా ప్రాంతాల్లో లెక్కిస్తారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లెక్కింపు నిరవధికంగా కొనసాగుతుంది. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, రాష్ట్ర వన్య ప్రాణుల విభాగం, అటవీ విభాగం, ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వ విద్యాలయం విద్యార్థులు, స్థానిక పక్షుల పరిశీలన నిపుణులు లెక్కింపులో పాల్గొంటారు. -
వందేళ్ల కమ్యూనిస్టు నేత మృతికి నివాళులు
జయపురం: వందేళ్ల కమ్యూనిస్టు నేత, అఖిల భారత కృషక్ సమాజ్ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ మండలి సభ్యులు, ప్రముఖ సాహితీ వేత్త కామ్రేడ్ సోమనాథ్ పాత్రో (102) మృతికి కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కన్నీటి నివాళులు అర్పించింది. కామ్రేడ్ సోమనాథ్ పాత్రో గురువారం ఉదయం మృతి చెందారు. స్థానిక కార్మిక భవనంలో శుక్రవారం కృషక సభ నాయకులు ఝుఽధిస్టర్ రౌళొ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రముఖ కార్మిక నేత ప్రమోద కుమార్ మహంతి మాట్లాడుతూ స్వర్గీయ సోమనాథ్ పాత్రో రైతు సమాజానికి, వారి సంక్షేమానికి, ప్రయోజనాలకు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కమ్యూనిస్టుగా, సాహితీ వేత్తగా ఆయన సమాజానికి అందించిన సేవలు మరువ లేనివని అన్నారు. ఆయన కలం నుంచి వెలువడిన గీతా విచార్ అనే పుస్తకం మహాభారతంపై ప్రజలను ఆలోచింప చేసిన ఒక గ్రంథమైందని తెలిపారు. -
సీతకొండ జాతరకు పోటెత్తిన భక్తజనం
పర్లాకిమిడి: కనుమ పండుగ నుంచి గుసాని సమితి గారబంద పంచాయతీ పెద్ద కొత్తూరు పంచాయతీలో ఉన్న సీతకొండడపై నిర్వహించిన జాతరకు ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తుల పోటెత్తారు. కొండపై సీతాదేవిని దర్శించుకుని ఆంజనేయుని మందిరంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నాలుగు రోజులపాటు నామయజ్ఞం, అర్ణయజ్ఞం, మృత యజ్ఞం జరుగుతున్నట్టు మహేంద్రగిరి లక్ష్మీబాబా తెలియజేశారు. త్రేతాయుగంలో సీతారాములు, లక్ష్మణసమేత వనవాసం సమయంలో ఈ కొండకు విచ్చేసిన సమయంలో సీతాదేవి రుతుక్రమం జరిగినప్పుడు పుణ్యస్నానం ఈ కొండపై చేసినట్టు స్థల పురాణం చెబుతుంది. అందువల్ల ఈ కొండకు సీతకొండ అని అనాదిగా పిలుస్తున్నారు. ఈ కొండపై రాముడు, ఆంజనేయస్వామి మందిరాలు ఉన్నాయి. చిరకాల స్నేహితులు కనుమనాడు ఈ కొండపై కలుసుకుని సీతా అమ్మవారిని దర్శించుకుంటారు. కొత్తవారు చేరుకుని జతకడితే వారి స్నేహబంధం కలకాలం ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు చేరుకొని వివిధ రకాల సామగ్రిని విక్రయిస్తుంటారు. అమ్ముతుంటారు. సీతకొండపై రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా భక్తులను అప్రమత్తం చేశారు. -
స్వర ఝరిలో..
ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026–8లోuభువనేశ్వర్: రాజారాణి సంగీత ఉత్సవం గురువారం సాయంత్రం స్థానిక చారిత్రాత్మక రాజారాణి ఆలయ ప్రాంగణంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజారాణి ఆలయ ప్రాంగణం శాసీ్త్రయ సంగీత స్వరాలతో మారు మోగింది. ఒడియా భాష, సాహిత్యం, సాంస్కృతిక విభాగం, ఒడిశా సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఉత్సవం ప్రారంభించారు. రాజారాణి సంగీత ఉత్సవం భారత దేశపు గొప్ప శాసీ్త్రయ, సంప్రదాయాలకు ఒక సజీవ ప్రతిబింబమని మంత్రి పేర్కొన్నారు. శాసీ్త్రయ, సంప్రదాయ సంగీతం ఒడిశాకు, దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు సాధించాయన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రముఖ ఒడిస్సీ సంగీత గురువు అచ్యుత మహరణ, ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు పండిట్ సురేష్ తల్వాల్కర్, ప్రారంభ సాయంత్రం ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులందరినీ సత్కరించారు. గురు అచ్యుత మహరణ ఆకట్టుకునే ఒడిస్సీ సంగీత కచేరీతో సంగీత ఉత్సవం ప్రారంభమైంది. గురు అచ్యుత మహరణ భావోద్వేగభరితమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. గురు సచ్చిదానంద దాస్ (మర్దల), డాక్టర్ జవహర్ మిశ్రా (వేణువు), గురు మురళీధర్ స్వంయి, మమతా శ్రీచందన్ (తంబురా) చక్కటి వాద్య సహకారం అందించారు. పండిట్ సురేష్ తల్వాల్కర్ తాళ కీర్తనను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అమేయ బిచు (హార్మోనియం), షబరి తల్వాల్కర్, కౌస్తుభ్ స్వంయి (తబలా), ఇషాన్ ప్రమోద్ పరాంజపే (కొనక్కల్), అభిషేక్ భురుక్ (డ్రమ్స్) మరియు నడుక్కండి వినయదాస్ రామదాసన్ (గాత్రం) సహకరించారు. ఒడిస్సీ సంగీతం, తాళ కీర్తన ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఉత్సవ వేదిక వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ కూడా పెద్ద సంఖ్యలో యువ సందర్శకులను ఆకర్షించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒడియా భాష, సాహిత్యం విభాగం మంత్రి సూర్యవంశీ సూరజ్, ఏకామ్ర నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, మాజీ ఎమ్మెల్యే జయంత కుమార్ షడంగి హాజరయ్యారు. -
ముగిసిన ఏసీఏ సంక్రాంతి వేడుకలు
భువనేశ్వర్: ఆంధ్ర సాంస్కృతిక సమితి (ఏసీఏ) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఆనందోత్సాహాలతో ముగిశాయి. పండగ సంప్రదాయంలో భాగంగా భోగీ మంట, బాలల భోగీ పండ్లు, ముత్తైదువుల పసుపు–కుంకుమ, రంగవల్లి తదితర ఆచార వ్యవహారాలతో జరుపుకున్న వేడుకల్లో ఆబాలగోపాలం పాలుపంచుకున్నారు. ఆటపాటలు, తమాషా పోటీలు, కట్టూబొట్టు వంటి మనోరంజక కార్యక్రమాలు హుషారుగా సాగాయి. మంగళ గిరి నుంచి విచ్చేసిన రోహిణి బృందం ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్య నాటిక, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పీఎం మోహన్ రావు రచన, రాయప్రోలు సాయి లక్ష్మి దర్శకత్వంలో వేలం వెర్రి నాటకం కొసమెరుపుగా ఆకట్టుకుంది. భారతీయ స్టేట్ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ ఏడీ రత్న తేజ, గెయిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జి.హర గోపాల్ అతిథులుగా విచ్చేసి సంక్రాంతి వేడుకల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకుని ఏసీఏ సభ్యులను ప్రోత్సహించారు. -
నల్ల బ్యాడ్జీలతో నిరసన
భువనేశ్వర్: స్థానిక క్యాపిటల్ హాస్పిటల్లో వైద్యులపై దాడిపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. శాంతియుత ఆందోళనకు సంకేతంగా పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్ల సంఘం ప్రభుత్వ వైద్యులకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. వైద్యుల భద్రతా సమస్యలను పరిష్కరించకపోతే ఓపీడీ సేవలను నిలిపివేస్తామని ఈ వర్గం హెచ్చరించింది. నిందితులను అరెస్టు చేస్తారు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.అశ్వతి క్యాపిటల్ ఆస్పత్రిని సందర్శించారు. దాడులకు వ్యతిరేకంగా ఆస్పత్రిలో కొనసాగుతున్న వైద్యుల నిరసన పురస్కరించుకుని ఆమె స్పందించారు. వైద్యుల డిమాండ్ ప్రకారం పటిష్టమైన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు. వైద్యులపై దాడి ఘటనలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. త్వరలోనే మిగిలిన నిందితులందరినీ అరెస్టు చేస్తారని హామీ ఇచ్చారు. -
‘వందేమాతరం’ బహుమతుల ప్రదానం
రాయగడ: జాతీయ గేయం వందేమాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అధికారయంత్రాంగం బహుమతులను ప్రదానం చేసింది. మున్సిపాలిటీ యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక బిజూపట్నాయక్ అడిటోరియంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, గౌరవ అతిథిగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్రకాంత్ మాఝిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్తుల మధ్య నిర్వహించిన వక్ృత్వ, చిత్రలేఖనం, వందేమాతరం గానం తదితర పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథులు బహుమతులను అందజేశారు. అనంతరం నవీన్ నాయక్ మాట్లాడుతూ.. దేశ సమైక్యతకు అద్దం పట్టే ఈ గానంలో మాధుర్యం ఎంతో నిండిఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహేష్ కుమార్ పట్నాయక్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, జిల్లా సాంస్కృతిక విభాగం అధికారి సుస్మిత బౌరి పాల్గొన్నారు. -
తల్లి కళ్లెదుటే..కుమారుడు దుర్మరణం
● లారీ ఢీకొని యువకుడు మృతి ● తమ్మాపురం, వల్లభరావుపేట గ్రామాల్లో విషాదఛాయలు మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ ముదిలిపోడ పంచాయతీలో ఝాటీ పూజలు రెండురోజులు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ తొలి పంటను కొండ దేవతకు సమర్పిస్తారు. ఇళ్లలో మహిళలు పురుషులకు విజయ తిలకం దిద్ది పూజలకు పంపిస్తారు. వీరంతా కర్రలతో కొట్టుకుంటారు. మల్కన్గిరి రణస్థలం : కన్న తల్లి ఎదుటే కుమారుడు మృతిచెందిన ఘటన రణస్థలం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దువ్వు కోటేశ్వరరావు(27) అనే యువకుడు శనివారం ఉదయం తన తల్లి అనసూయకు షుగర్ చెకప్ చేసేందుకు రణస్థలం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఆస్పత్రికి 100 మీటర్లు దూరంలోనే విశాఖపట్నం వైపు వెళ్లే లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కోటేశ్వరరావు రోడ్డుపై పడిపోవడంతో అతని పైనుంచి లారీ వెళ్లి పది మీటర్లు ఈడ్చుకుపోయింది. మృతదేహం నుజ్జునుజ్జుగా మారి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై ఉన్న తల్లి దూరంగా తుళ్లిపోవడంతో సురక్షితంగా బయటపడింది. మృతుడు కోటేశ్వరరావు స్వగ్రామం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం తమ్మాపురం. కనుమ రోజు అమ్మమ్మ అప్పయ్యమ్మ ఇంటికి తల్లి అనసూయతో కలిసి వల్లభరావుపేట వచ్చాడు. అమ్మమ్మ చనిపోవడంతో మేనమామ సీమల త్రినాథరావు సంక్రాంతి పండుగకు పిలుపు చేశారు. కోటేశ్వరరావుకు అన్నయ్య భాస్కరరావు, చెల్లి త్రివేణి ఉన్నారు. బీటెక్ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా యువకుడు మృతి చెందడంతో ఇటు స్వగ్రామం తమ్మాపురం, అటు అమ్మమ్మ గ్రామమైన వల్లభరావుపేట గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. తన కళ్ల ముందే కుమారుడు చనిపోవడంతో తల్లి అనసూయ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఘటనా స్థలాన్ని జె.ఆర్.పురం పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. -
దర్జాగా దోపిడీ!
● అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ● పండగ పూట 50 శాతం పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ● ఇదే అదనుగా రెండు రెట్లు అదనంగా వసూళ్లు ●వలస జీవులపై పెనుభారం శ్రీకాకుళం : సంక్రాంతి పండగ సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన వారిని తిరుగు ప్రయాణంలో చార్జీల రూపంలో దోచుకునేందుకు కొన్ని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. పండగ పూట చార్జీలను 50 శాతం వరకు పెంచుకోవచ్చని గ్రీన్సిగ్నల్ ఇవ్వడాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు రెండు నుంచి మూడు రెట్లు చార్జీలను పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఆర్టీసీ చార్జీల కంటే సాధారణ రోజుల్లో ప్రైవేటు బస్సుల్లో చార్జీలు 50 శాతానికి పైగా అదనంగా ఉంటాయి. అటువంటప్పుడు మరింత పెంచుకోవచ్చని ప్రభుత్వం ఇప్పు డు ఎందుకు అవకాశం కల్పించిందని పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలసదారులపై దెబ్బ.. శ్రీకాకుళం జిల్లా నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువ. వీరు ఎక్కడ ఉన్నా సంక్రాంతికి తప్పనిసరిగా సొంత గ్రామాలకు రావడం పరిపాటి. కనుమ పండగ తర్వాత తిరిగి ఉపాధి కోసం తాము ఉంటున్న ప్రాంతాలకు తిరుగు ప్రయాణం అవుతుంటారు. ఇటువంటి వారి నుంచి ప్రైవేట్ యాజమాన్యాలు ఎక్కువ చార్జీలను వసూలు చేస్తూ ఆర్థికంగా దెబ్బతీస్తున్నప్పటికీ ఏ శాఖ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం నుంచి విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. వీటిలో కూర్చొని (సిటింగ్) వెళ్లే బస్సులతో పాటు స్లీపర్ కోచ్లు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో నాన్ ఏసీ బస్సులో సిటింగ్కు రూ.800 వరకు, స్లీపర్ కోచ్లో రూ.1200 వరకు చార్జీలుగా వసూలు చేస్తుంటారు. ఏసీలో ప్రయాణించాలంటే మరో రెండు వందల రూపాయలు అదనం. అయితే కనుమ రోజు నుంచి విజయవాడకు నాన్ ఏసీలో కూర్చొని వెళ్లేందుకు రూ.1500, ఏసీలో రూ.1800, స్లీపర్ కోచ్ ఏసీలో రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ ప్రయాణం మరింత భారంగా మారిందని చెప్పాలి. ఇదివరలో నాన్ ఏసీ బస్సులో కూర్చుని వెళ్లేందుకు రూ.1200 నుంచి రూ.1400, స్లీపర్లో రూ.1600 వరకు చార్జీగా వసూలు చేసేవారు. ఏసీలో మరో 300 రూపాయలను అదనంగా ప్రయాణికుల నుంచి తీసుకునేవారు. ఇప్పుడు నాన్ ఏసీ బస్సులో కూర్చుని వెళ్లేందుకు రూ.2,200, స్లీపర్లో రూ.3300 వసూలు చేస్తున్నారు. టిక్కెట్లు బ్లాక్ చేసి.. టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ వీటిని కొందరు వ్యక్తుల ద్వారా బ్లాక్ చేయిస్తూ మరింత అదనపు ధరలకు కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు అమ్ముకుంటున్నారు. ఇలా కొందరు దారి దోపిడీకి పాల్పడుతున్నాయని చెప్పాలి. కొన్ని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు పర్మిట్ ఒక బస్సుకు మాత్రమే తీసుకొని అదే నెంబర్తో రెండు మూడు బస్సులను తిప్పుతూ ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి కొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకటి, రెండు సందర్భాల్లో ఇటువంటి వాటిని గుర్తించినా రెండు రోజులు హడావుడి చేసి వదిలేస్తుండటంతో తిరిగి యథాస్థితికి వస్తున్నాయి. దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా లగేజ్ వేసి, బిల్లులు లేని సరుకును రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి ఈ రకంగా కూడా కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు గండి కొడుతున్నాయి. ఇప్పటికై నా రవాణా శాఖ అధికారులు దృష్టి సారించి ప్రయాణికులపై అధిక భారం పడకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తాం. చార్జీలు పెంచినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. జరిమానాలు విధిస్తాం. ఒకే నెంబర్తో ఎక్కువ సర్వీసులు తిప్పుతున్నట్లు మా దృష్టికి వస్తే బస్సును సీజ్ చేస్తాం. – విజయసారధి, జిల్లా రవాణాశాఖ అధికారి -
75 తులాల వెండి, ఐదున్నర తులాల బంగారం..
● పూండిలో పంచాయతీ కార్యదర్శి ఇంట్లో భారీ చోరీ ● దర్యాప్తు చేపట్టిన పోలీసులు పొందూరు: ఎరువులు, పురుగు మందులను అధిక ధరలకు విక్రయించే దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ కె.త్రినాథస్వామి అన్నారు. మండలంలో మనగ్రోమోర్, సాయిరాం ట్రేడర్స్ దుకాణాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలకు మాత్రమే ఎరువులను, పురుగు మందులను విక్రయించాలన్నారు. జిల్లాలో రబీలో సాగు విస్తీర్ణం సుమారు 70,310 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 57,230 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నట్లు వివరించారు. గత ఏడాది మొక్కజొన్న సాగు 14,238 హెక్టార్లు కాగా, ఈ ఏడాది సుమారు 19 వేల హెక్టార్లలో సాగు చేసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో రాగి, నువ్వులు, వేరుశనగ సాగు విస్తీర్ణం క్రమేపీ పెరుగుతూ వస్తోంన్నారు. రైతులు ఒకే పంటను సాగు చేయకుండా పంట మార్పిడి విధానం అనుసరించాలని సూచించారు. జిల్లాలో యూరియా వాడకం సుమారు 20 శాతం పెరిగిందని చెప్పారు. ఆయనతో పాటు మండల వ్యవసాయాధికారి ఎం.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. వజ్రపుకొత్తూరు : పూండి– గోవిందపురంలోని సాయిరాం వీధిలో పంచాయతీ కార్యదర్శి హనుమంతు శరత్చంద్ర దొర ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించిన దొంగలు బీరువాను పగలుగొట్టి 75 తులాల వెండి, ఐదున్నర తులాల బంగారం, రూ.90వేలు నగదు పట్టుకుపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి కావడంతో శరత్చంద్ర కుటుంబంతో కలిసి పూండి సాయిరాం వీధిలో నివాసం ఉంటున్న అద్దె ఇంటికి తాళం వేసి స్వగ్రామం నందిగాం మండలం బోరుభద్రకు బోగి ముందు రోజు వెళ్లిపోయారు. కుటుంబం ఇంకా అక్కడే ఉండగా శనివారం విధుల్లో చేరేందుకు బోరుభద్ర నుంచి వచ్చిన శరత్ చంద్ర నేరుగా గోవిందపురం సచివాలయానికి వచ్చారు. అక్కడ విధులు ముగించుకుని శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం పగలుగొట్టి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు విరగ్గొట్టి.. వెండి, బంగారు నగలు, నగదును ఎత్తుకెళ్లి సామాన్లు చిందర వందరగా పడేశారు. అనంతరం వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శరత్చంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు సవాల్.. మూడేళ్లుగా పూండి ప్రాంతంలో దొంగలు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఓ పక్క పాత కేసులు పెండింగ్లో ఉండగానే కొత్తగా జరుగుతున్న చోరీలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. గత ఏడాది కూడా పూండి నడిబొడ్డున ఉన్న బంగారం దుకాణంలో దొంగలు భారీ చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. -
రికార్డు అసిస్టెంట్ పోస్టుల రోస్టర్ పాయింట్లో సవరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్ పోస్టు భర్తీకి సంబంధించి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లో స్వల్ప మార్పులు చేస్తూ సంస్థ చైర్మన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12న విడుదల చేసిన నోటిఫికేషన్ నంబర్ 01/2026 లోని రోస్టర్ పాయింట్లలోని రిజర్వేషన్ కేటగిరీని సవరించినట్లు పేర్కొన్నారు. రికార్డు అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి రోస్టర్ పాయింట్ నంబర్ 2లో ఇదివరకు ‘ఎస్సీ’ కేటగిరీగా ఉన్న రిజర్వేషన్ను, తాజా సవరణ ప్రకారం ‘ఎస్సీ – గ్రూప్ 1’ గా పరిగణించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ మార్పు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సమాచారాన్ని జిల్లాలోని అన్ని కోర్టుల నోటీసు బోర్డుల్లోనూ, ఉపాధి కార్యాలయాల్లోనూ ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. కొత్తూరు: కొత్తూరు నాలుగు రోడ్లు కూడలిలోని బత్తిలి రోడ్డులో ఉన్న చెంగల పతివాడ భీమరాజుకు చెందిన శ్రావణి ఫ్యాషన్ రెడీమేడ్ దుస్తుల షాపులో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు రూ.25 లక్షలు విలువైన దుస్తులు కాలిబూడదయ్యాయి. షాపు మొదటి అంతస్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పండగ పూట షాపు కాలిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. టెక్కలి: రైల్వే సేవలను సద్వినియోగం చేసుకోవా లని కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు అన్నా రు. కోటబొమ్మాళి మండలం తిలారు రైల్వే స్టేషన్ వద్ద బ్రహ్మపురం–విశాఖ (విశాఖ ఎక్స్ప్రెస్) రైలు హాల్ట్ను శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో రైల్వే శాఖ డీఆర్ఎం లలిత్ బోహ్రా, రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సక్రమంగా భూముల రీసర్వే పలాస: భూముల రీసర్వేను సక్రమంగా చేయాలని, రికార్డుల్లో తప్పుల్లేకుండా చర్యలు తీసుకోవాలని భూరికార్డుల సర్వే సెటిల్మెంటు డైరెక్టర్ రోణంకి కూర్మనాఽథ్ (ఐఏఎస్) చెప్పారు. నీలావతి గ్రామంలో శనివారం పర్యటించిన ఆయన రీసర్వేకు సంబంధించి రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అధికారులను కూడా తగిన సలహాలు సూచనలు చేశారు. తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి, డీటీ గిరి, ఆర్ఐ ప్రసాద్, వీఆర్వో అప్పలనాయుడు ఉన్నారు. -
జూనియర్ రెడ్క్రాస్ శిబిరం ప్రారంభం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితిలో శనివారం ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు జూనియర్ రెడ్క్రాస్ శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖాధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి అధ్యక్షతన నిర్వహించిన ప్రారోంభత్సవం కార్యక్రామంలో ముఖ్యఅతిథులుగా మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి హాజరయ్యారు. శిబిరంలో 111 పంచాయతీలకు చెందిన వివిధ పాఠశాలల నుంచి 400 మంది విద్యార్థులు హాజరయ్యారు. మూడురోజులు పాటు విద్యార్థులకు ప్రథమ చికిత్సపై శిక్షణ, రక్తదానంపై అవగాహన, విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, శ్రమదానంపై శిక్షణ ఇస్తారు. -
శ్రీముఖలింగంలో తోపులాట
జలుమూరు: సంక్రాంతి నేపథ్యంలో ముక్కనుమ రోజున శ్రీముఖలింగంలో తోపులాట జరిగింది. దేవదాయ శాఖ కనీస పర్యవేక్షణ లేకపోవడంతో దక్షిణ ద్వారంతోపాటు తూర్పు ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. భక్తులు తెలిపిన వివరాలు ప్రకా రం.. ఉదయం 9 గంటల తర్వాత ఆలయ ఈఓ ఏడుకొండలు శ్రీకాకుళం వెళ్లిపోగా భక్తులు గర్భగుడిలోని గోలెం వద్దకు అధిక సంఖ్యలో వెళ్లారు. అయితే దర్శనానికి వచ్చే భక్తులు, ఆలయం నుంచి వెళ్లే భక్తులకు ఒకటే మార్గం అయిపోవడంతో తోపు లాట జరిగింది. దర్శనానికి దాదాపు నాలుగు గంటలు పట్టింది. కొందరు అర్చకులతోనూ వాగ్వాదానికి దిగారు. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్కు ఫోన్లో సమాచారం ఇవ్వగా.. డీసీ సంబంధిత ఈఓతో ఫోన్లో మాట్లాడారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి రద్దీని అదుపు చేశారు. -
రైతులకు పరికరాల పంపిణీ
బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి కట్టుబడి ఉందని కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చ అన్నారు. జయపురం దసరా పొడియలో శుక్రవారం ప్రారంభమైన మూడుదినాల జయపురం సబ్డివిజన్ స్థాయి వ్యవసాయ యంత్రాల మేళాలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా ప్రధాన వ్యవసాయ అధికారి సంతోష్ కుమార్ దళబెహర అధ్యక్షతన జరిగిన వ్యవసాయ యంత్రాల మేళలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆర్థిక ఆదాయం పెంచేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పరికరాలు తక్కువ ధరకు, సబ్సిడీలో అందజేస్తున్నామన్నారు. జయపురం -
● సంప్రదాయం ‘కనుమ’..!
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో కనుమ పర్వదినం సందర్భంగా స్థానిక గోశాలలో పవిత్ర గోపూజోత్సవం శుక్రవారం వేదోచ్ఛరణ, మంగళధ్వనుల నడుమ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ సకలదేవతల దర్శనాలు, ఒక్క గోమాత దర్శన పుణ్యంతో సమానమని గోవు విశిష్టతను పురాణాల్లో ఉన్న విషయాలను వివరించారు. ఏడాది పొడవునా పశుసంపద మానవాళికి చేసిన మేలునకు కృతజ్ఞతగా ప్రతి కనుమ పండుగ నాడు ఇలా గోమాతలను పూజిస్తారని వివరించారు. హిందు ధర్మ ప్రతీకగా ఉన్న గోవుకు ఎంతో విశిష్టత, ఔషద తత్వాలు న్నాయని వివరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శోభనాద్రాచార్యులు, బిఎస్.చక్రవర్తి, ఆల య అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, ఇప్పిలి సాందీప్శర్మ, ఫణీంద్ర శర్మ, షన్ముఖశర్మ, నేతేటి హరిప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. –అరసవల్లి -
ఇద్దరు బీజేడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సస్పెండ్
భువనేశ్వర్: ప్రతిపక్ష బిజూ జనతా దళ్ (బీజేడీ) గురువారం ఇద్దరు సిట్టింగ్ శాసనసభ సభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరు ఇరువురు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణ. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలైనట్లు స్పష్టం చేశారు. బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ నిర్ణయం మేరకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలలో కేంద్రాపడా జిల్లా పటకురా నియోజకవర్గం ఎమ్మెల్యే అరవింద్ మహా పాత్రో, కెంజొహర్ జిల్లాలోని చంపువా నియోజకవర్గం ఎమ్మెల్యే సనాతన్ మహాకుడు ఉన్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అరవింద్ మహా పాత్రో రాష్ట్ర మాజీ మంత్రి బిజయ్ మహా పాత్రో కుమారుడు కాగా, సనాతన్ మహాకుడు చంపువా శాసన సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేడీ అధికార ప్రతినిధి, మీడియా సమన్వయకర్త లెనిన్ మహంతి మాట్లాడుతూ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ నాయకత్వంలో పార్టీ నిబంధనల ప్రకారం క్రమశిక్షణను అనుసరిస్తుంది. ఉల్లంఘనలపై నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎమ్మెల్యేలు అరవింద్ మహా పాత్రో, సనాతన్ మహాకుడు పార్టీ మార్గదర్శకాలను ఉల్లంఘించారు. పార్టీ నియమావళి ప్రకారం తక్షణమే సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేడీ కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారని లెనిన్ మహంతి అన్నారు. -
గంజాయితో ఇద్దరు అరెస్టు
రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగపదర్ కూడలిలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కంధమాల్ జిల్లా తుమిడిబొందొ ప్రాంతానికి చెందిన ఆహితా మండల్, సదమ్ నాయక్లుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 27.200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేసి నిందితులను కోర్టుకు తరలించినట్లు ఐఐసీ కేశవ్ షడంగి తెలిపారు. ఆదిత్యున్ని దర్శించుకున్న పాట్నా హైకోర్టు జస్టిస్ అనుపమ చక్రవర్తి అరసవల్లి: ప్రఖ్యాత సూర్యదేవాలయాన్ని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుప మ చక్రవర్తి కుటుంబ సమేతంగా గురువారం మకర సంక్రాంతి సందర్భంగా దర్శించుకున్నా రు. ఈ మేరకు ఆరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయ అధికారులు, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ వారికి గౌరవంగా సంప్రదాయ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అంతరాలయంలో గోత్రనామాలతో ప్రత్యేక అర్చనల అనంతరం అనివెట్టి మండపంలో వేదాశీర్వచనాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రొటోకాల్ అఽధికారిక సిబ్బంది పాల్గొన్నారు. ఒడిశా బస్సు ఢీ కొని యువకుడికి గాయాలు సారవకోట: ఓఎస్ఆ ర్టీసీ బస్సు ఢీ కొని మండలంలోని వడ్డినవలస గ్రామానికి చెందిన యువకుడు బక్క రమణ గాయాల పాలయ్యా డు. నరసన్నపేట నుంచి ఒడిశాలోని పర్లాకిమిడి వెళ్తున్న ఓఎస్ ఆర్టీసీ బస్సు వడ్డినవలస గ్రామానికి సమీపంలో మూత్ర విసర్జనకు వెళ్లి వస్తున్న యువకుడిని ఢీ కొట్టింది. దీంతో గాయాలపాలైన రమణను స్థానికులు, కుటుంబ సభ్యులు 108 వాహనంలో నరసన్నపేట ఆస్పత్రికి అక్కడి నుంచి శ్రీకాకుళం తరలించారు. శుక్రవారం క్షత్రగాత్రుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. 23న అరసవల్లి శోభాయాత్ర శ్రీకాకుళం పాతబస్టాండ్: అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థాన రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న జరగాల్సిన ‘శోభాయాత్ర’ను 23వ తేదీకి మారుస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది ఈ వేడుకలను తొలిరోజే శోభాయాత్రతో అత్యంత వైభవంగా ప్రారంభించామని, అయితే మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతితో జిల్లాలో సంతాప పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ సారి మార్పు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 23వ తేదీ మధ్యాహ్నం నుంచి శోభాయాత్రను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో సంప్రదింపులు జరిపిన అనంతరం, అరసవల్లికి చెందిన దివంగత నేతకు గౌరవ నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలను కూడా చాలా వరకు తగ్గించామని, అయితే భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. -
రాయి పడి ఇద్దరు కార్మికులు మృతి
మల్కన్గిరి : స్థానిక తరణి ఆలయం సమీపంలో శుక్రవారం ఉదయం క్వారీ వద్ద అక్రమంగా మురుం మట్టి తవ్వుతుండగా భారీ రాయిపడడంతో సత్యంగూఢ గ్రామానికి చెందిన టూనా గదబ(21) చనిపోయాడు. చంపాఖారి గ్రామానికి చెందిన మితు మాడీ (31)ని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి.శ్రీనివాస రావు, తదితరులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. క్వారీ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. మల్కన్గిరి ఐఐసీ రీగాన్ కీండో సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి
రాయగడ: పాఠశాల ప్రాంగణంలోని సరస్వతి, వినాయక స్వామి విగ్రహాలను విరగొట్టిన అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కె.కృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని భజరంగదళ్, విశ్వహిందు పరిషత్లకు చెందిన కార్యకర్తలు కోరారు. ఈ మేరకు కలెక్టర్ అశుతోస్ కులకర్ణి, ఎస్పీ స్వాతి ఎస్.కుమార్లకు వినతిపత్రాలు శుక్రవారం అందజేశారు. జిల్లాలో మునిగుడ సమితి అంబొదలలోని ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాలలో ఈనెల 15వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. వినతిపత్రం అందజేసినవారిలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి రమేష్ కున, సహ కార్యదర్శి గోపి బ్రహ్మ, రంజన్ స్వాయి తదితరులు ఉన్నారు. -
రూ. 12.26కోట్ల మద్యం తాగేశార్రోయ్..
శ్రీకాకుళం క్రైమ్, ఎచ్చెర్ల : మందుబాబులు ‘పండగ’ చేసుకున్నారు. సంక్రాంతి మూడు రోజులూ మద్యపాన సంబరం చేసుకున్నారు. పండగను దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాల యజమానులు ఈ నెల 13, 14 తేదీల్లో రూ. 11.65 కోట్లు విలువైన మద్యాన్ని ఎచ్చెర్ల డిపో నుంచి తీసుకొచ్చారు. 13వ తేదీ నుంచి 16వ తేదీ కనుమ రాత్రి 7 గంటల వరకు ఏకంగా రూ. 12.26 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. జిల్లాలో 176 ప్రైవే టు లైసెన్సు దుకాణాలు, 9 బార్ అండ్ రెస్టారెంట్లు ఉండగా పట్టణ ప్రాంతాలైన శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, ఆమదాలవలస, కాశీబుగ్గ, ఇచ్ఛాపురంలో అధికంగా మద్యం అమ్ముడుపోయింది. ఎమ్మార్పీకి మించి.. ఈ నెల 12న రాష్ట్ర ప్రభుత్వం బాటిల్పై అదనంగా రూ. 10 లు పెంచుతూ జీఓ విడుదల చేసింది. అప్పటికే పాత స్టాకు ఉండటంతో దుకాణదారులు పాత ఎమ్మార్పీ స్టిక్కర్ ఉన్న బాటిల్పై రూ. 10 తీసుకోవాల్సి ఉన్నా.. జిల్లాలో అధిక ప్రాంతాల్లో ఎమ్మార్పీకి మించి రూ. 10 నుంచి రూ. 30 వరకు అదనంగా వసూలు చేశారు. క్వార్టర్ బాటిల్పై రూ. 10లు, బీరు, ఆఫ్బాటిల్పై రూ. 20 లు, ఫుల్ బాటిల్పై రూ. 30 లు అధికంగా తీసుకున్నారు. ఊరూరా ఇప్పటికే బెల్టుషాపులుండగా పండగ రోజులు అదనంగా ఒకట్రెండు కొత్తగా వెలిశాయి. అమ్మకందారులు ఒక్కో బాటిల్పై రూ. 30 నుంచి రూ. 80 వరకు ప్రాంతం, డిమాండ్ను బట్టి మద్యం ప్రియుల జేబులు చిల్లు చేశారు. పండగ రోజులు కావడంతో సంబంధిత ఎకై ్సజ్ శాఖ పోలీసులు చూసీ చూడనట్లు వదిలేశారు. పండగ సందర్భంగా జిల్లాలో భారీగా మద్యం విక్రయాలు ఎక్కడికక్కడ వెలసిన బెల్టుషాపులు డిమాండ్ దృష్ట్యా బాటిల్పై అదనంగా రూ. 30 నుంచి రూ. 80 వరకు వసూలు -
పోటెత్తిన భక్తజనం
ఆమదాలవలస: మండలంలోని గాజులకొల్లివలస సమీపంలో కొండపై కొలువై ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సంక్రాంతి, కనుమ–ముక్కనుమ పండుగల సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరలో రెండో రోజు శుక్రవారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. జాతర మొదటి రోజు పండుగ నాడు భక్తులు ఓ మోస్తరుగా హాజరైనప్పటికీ, రెండో రోజు అలికాం–బత్తిలి ప్రధాన రహదారి, పార్వతీశంపేట–పాలకొండ రహదారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. కొండపై ఉన్న సంగమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. గుడి ప్రాంగణం నుంచి మెట్ల వరకు భక్తులు క్యూలలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. -
తల్లి మందలించిందని..
● ఆత్మహత్య చేసుకున్న యువకుడు పాతపట్నం: తల్లి పని చేసుకోమని మందలించిందని మండలంలోని దశరథపురం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు అమిత్ బౌరీ (17) మనస్తాపం చెందిన ఇంటి పెరటి వంటరేకుల షెడ్లో ఉరి వేసుకున్నాడని ఎస్ఐ కె.మధుసూధనరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దశరథపురం ఎస్సీ కాలనీకి చెందిన ఉమా బౌరీ, సుమిత్రబౌరీల కుమార్తె రిచాబౌరీ, కుమారుడు అమిత్ బౌరీలు. కుమారుడు అమిత్ బౌరీ ఇంటర్ వరకు చదు వుకున్నాడు. ఇంటర్లో రెండు సబ్జెక్ట్లు ఫెయిల్ కావడంతో గ్రామంలో తిరుగుతూ మైక్సెట్లు కట్టే పనికి వెళ్లేవాడు. ఇటీవల తల్లి సుమిత్ర బౌరీ కొడుకుకు వేరే ఏదైనా పనిచేసుకోవాలని చెప్పడంతో.. అతడు మనస్తాపంతో ఇంటికి సక్రమంగా రాకుండా, భోజనం కూడా సరిగా తినకుండా గ్రామంలో తిరుగుతుండేవాడు. ఈ నెల 14వ తేదీ బుధవారం భోగిరోజు రాత్రి పది గంటల సమయంలో ఇంటి పెరట వంట రేకుషేడ్లో ఉరి వేసుకున్నాడు. తల్లి గమనించి నిశ్చేష్టురాలైపోయింది. వెంటనే భర్తకు, గ్రామస్తులకు తెలియజేశారు. గురువారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతిపై తండ్రి ఉమాబౌరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
గజపతి ఉత్సవాల ప్రచార రథం, పోస్టర్ ఆవిష్కరణ
పర్లాకిమిడి: కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జిల్లా సాంస్కృతిక పరిషత్ ఆధ్వర్యంలో గజపతి ఉత్సవాలు 2026 ప్రచార రథం, పోస్టర్ను కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ ప్రారంభించారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ పర్లాకిమిడి గజపతి స్టేడియంలో జరగనున్న గజపతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ప్రజాపనులు, న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తొలిరోజు ప్రారంభోత్సవానికి రానున్నట్టు తెలియజేశారు. కళ, సంస్కృతి, సాహిత్యం, పరంపరకు పేరొందిన భూమి గజపతి జిల్లా అని కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ అన్నారు. జిల్లాలోని ఏడుసమితి కేంద్రాల్లో గజపతి ఉత్సవాల ప్రచార రథం తిరిగి ప్రచారం చేస్తుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరజ్, ఏడీఎం ఫల్గుణి మఝి, పృథ్వీరాజ్ మండల్, ప్రచార కమిటీ సభ్యులు భాగవత్ పాఢి తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతి సంబరాలు
రాయిపడి ఇద్దరు కార్మికులు.. రాయి పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. క్వారీలో ఘటన జరిగింది. –IIలోuశనివారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2026అంబరాన్నంటిన..● ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు ● హాజరైన తెలుగు ప్రముఖులుశ్రీ మందిరం ఆదాయం లెక్కింపు నగదు : రూ. 6,33,695 బంగారం : 1 గ్రాము 700 మిల్లీ గ్రాములు వెండి : 166 గ్రాముల 700 మిల్లీ గ్రాములు – భువనేశ్వర్/పూరీకొరాపుట్: నిర్వాహకుడు కనుదాస్తో కమిటీ సభ్యులుకొరాపుట్: తెలుగు వారి పెద్దపండగ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని ఆర్సీడీ హైస్కూల్ మైదానంలో నబరంగ్పూర్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండో ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించారు. అనువదించిన తెలుగు ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఇటువంటి కార్యక్రమాలు నిత్యం కొనసాగించాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గౌరీశంకర్ మజ్జి ప్రసంగిస్తూ జిల్లాలో తెలుగు ప్రజలు శాంతి సామరస్యాలకు మారుపేరుగా నిలుస్తున్నారని చెప్పారు. గత 60 ఏళ్లుగా సుమారు 500 మృతదేహాలకు స్వచ్ఛంద సేవగా అంత్యక్రియలు నిర్వహించి టైలర్ పొట్నూరు రమణ, వేలాది మందికి తెలుగు విద్య బోధించిన అప్పలస్వామి మాస్టార్లను ఘనంగా సత్కరించారు. సుమారు పదేళ్లు అనంతరం ఉత్సవాలు పున ప్రారంభించినందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మానస్ రంజన్ దాస్ (కను)ను తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, చాంబర్ ఆఫ్ కామర్స్ సహకారం అందించాయి. విశాఖ పట్నానికి చెందిన రోషన్లాల్ ఆర్కెస్ట్రా, ఇతర సాంస్కృతి బృందాల ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, మున్సిపల్ చైర్మన్ కునునాయక్, సీనియర్ కాంగ్రెస్ నేత మున్నా త్రిపాఠి, సీనియర్ న్యాయవాది జాడేశ్వర్ ఖడంగా, పి.ఎల్.మూర్తి, పూసర్ల రామారావు, వి.మహేష్, వి.రవి, వి.సంతోష్, కె.శ్రీను, మణి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో.. జయపురం: స్థానిక జయపురం కల్యాణ మండపంలో రాష్ట్రీయ స్వయం సేవా సంఘం జయపురం శాఖ వారిచే పట్టణ స్థాయి మకర సంక్రాంతి పండగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి వేడుకలలో జయపురం చాంబర్ ఉపాధ్యక్షుడు ఎ.శ్రీనివాస రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ సంఘ నిర్వాహకుడు నిరంజన్ మిశ్ర, కార్యనిర్వాహకుడు డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ ముఖ్యవక్తగా కొరాపుట్ సెంట్రల్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ భరత్ కుమా ర్ పండ పాల్గొన్నారు. ముఖ్యవక్త భరత్ కుమార్ పండ మాట్లాడుతూ హిందువుల పండగలలో మకర సంక్రాంతి పండగ ప్రాధాన్యతను వివరించారు. రాయగడలో.. రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో అయ్యప్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నాయి. కూచిపూడి తదితర నృత్య ప్రదర్శనలు నిర్వహించి బహుమతులను అందజేశారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: తెలుగు చిత్రరంగంలో తన తొలి సినిమా 1978లో పునాది రాళ్లు అయినా తన టాలెంట్ను చూసి ప్రముఖ దర్శకులు విశ్వనాథ్ ప్రెసిడెంటు పేరమ్మలో వేషం ఇప్పించారని సినీ హాస్య నటుడు ఆలీ అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 1200 తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ, నేపాలీ భాషా సినిమాల్లో నటించానని తెలిపారు. పరలా మకర సంక్రాంతి ఉత్సవాలను స్థానిక రాంనగర్లో హైటెక్ ప్లాజాలో గురువారం సాయంత్రం నిర్వహించారు. తెలుగు చలనచిత్ర హాస్యనటులు ఆలీ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ మకర సంక్రాంతి ఉత్సవాలు హైటెక్ మెడికల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ఆధ్వర్యంలో జరుగగా, ఆయన తనయుడు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, ఇతర అతిథులుగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు, పర్లాకిమిడి పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ ఉత్సవాలలో ఆలీ తన గత సినిమాల కామెడీ డైలాగులు చెబుతూ డ్యాన్స్లు చేసి ఉర్రూతలూగించారు. వేదికపై జబర్దస్త్ బుల్లితెర నటులు బుల్లెట్ భాస్కర్, ఫాతిమా, నరేష్లు హాస్య పేరడీలు ప్రేక్షకులకు నవ్వు తెప్పించాయి. -
అయ్యప్ప స్వామికి స్వర్ణ కిరీటం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో కొలువైయున్న అయ్యప్ప స్వామికి 40 తులాల బంగారంతో రూపొందించిన స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు. సంక్రాంతి పురస్కరించుకొని ప్రత్యేక పూజలను స్వామివారికి నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి లక్ష చామంతులు, గులాబీలతో అభిషేకించారు. తదుపరి జ్యోతి దర్శన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీకి చెందిన సుబుద్ధి గౌరి, లాడి రఘు, లాడి రమేష్, గిరిజాల అనంతరావు తదితరులు పాల్గొన్నారు. రాయగడలో జన కల్యాణకారి దినోత్సవం రాయగడ: బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి జన్మదినం పురస్కరించుకొని జిల్లా బీఎస్పీ పార్టీ నాయకులు జన కల్యాణకారి దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక కొత్త బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా స్థానిక తేజస్వీ మైదానానికి చేరుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సరోజ్ నాయక్, జిల్లా అధ్యక్షుడు పూర్ణ చంద్ర టక్రీ, జిల్లా పరిశీలకుడు రామదాస్ టక్రీ, సీనియర్ నాయకుడు జితు జకసికల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో వలస కార్మికుడి మృతి
రాయగడ: రోడ్డు ప్రమాదంలో వలస కార్మికుడు మృతి చెందాడు. మృతుడు జిల్లాలోని కాసీపూర్ సమితి కుచేయిపొదొరొ గ్రామానికి చెందిన లింగరాజ్ మాఝి కొడుకు గురునాథ్ మాఝి (25) గా గుర్తించారు. కొద్ది నెలల క్రితం గురునాథ్ ఉపాధి కోసం పొరుగు రాష్ట్రమైన కేరళకు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడ ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కంపెనీలో పనులు ముగించుకుని అతడు నివసించే ప్రాంతానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రగాయాలతో ఉన్న అతడిని కేరళలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తోటి స్నేహితులు బాధితుని కుటుంబానికి తెలియజేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఆటో – బైక్ ఢీకొని... చందిలి పోలీస్స్టేషన్ పరిధి కొత్తపేట గ్రామ సమీపంలో శుక్రవారం ఆటో – బైకు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రగాయాలకు గురయ్యారు. మృతుడు లంకా సుధ (53)గా పోలీసులు గుర్తించారు. గాయాలు తగిలిన వ్యక్తి సుధ కొడుకు శ్యామ సుందర్గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, గాయాలు తగిలిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సదరు సమితి కురుంపేటకు చెందిన లంకా సుధ, అతని కొడుకు శ్యామ్ సుందర్లు కనుమ పండగను పురస్కరించుకుని తన బంధువులు ఉంటున్న రాయగడకు తమ స్వగ్రామం నుంచి బైకుపై శుక్రవారం బయల్దేరారు. కొత్తపేట సమీపంలో ఒక ఆటో అదుపుతప్పి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో సంఘటన స్థలం వద్దే సుధ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాత్రికేయుడి మృతికి సంతాపం
రాయగడ: స్థానిక గాంధీనగర్ మూడో లైన్లో నివాసముంటున్న పాత్రికేయుడు అశుతోష్ పట్నాయక్ (53) గుండెపోటుతో మృతి చెందారు. ఒడియా వెబ్ ఛానెల్లో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న పట్నాయక్ శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అశుతోష్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పాత్రికేయులు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రాయగడ ప్రింట్ అండ్ మీడియా వెల్ఫేర్ కమిటీ సభ్యునిగా వ్యవహరిస్తున్న అశుతోష్ పట్నాయక్ అకాల మృతికి శనివారం స్థానిక సంస్కృతి భవన్లో సంతాప సభ నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధి శివాజీ దాస్ తెలిపారు.గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం మల్కన్గిరి: జిల్లా కేంద్రం పాతపోస్టాఫీస్ వీధిలో గురువారం పూజ కోసం వంట చేస్తుండగా బి.ప్రకాశరావు ఇంటిలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వంటింటిలో ఉన్న సామాన్లు కాలిపోయి భారీగా నష్టం వాటిల్లింది. కుటుంబ సభ్యులు పిండి వంటలు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్ పట్టివేత మల్కన్గిరి: కోరుకొండ సమితి సిరాగూడ చౌక్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఎస్ఐ మహాప్రసాద్ నాయిక్ నేతృత్వంలో పట్టుకుంది. డ్రైవర్ త్రినాథ్ ఖిలో సరైన పత్రాలు చూపించకపోవడంతో కేసు నమోదు చేసి ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రైవర్ను అరెస్టు చేసినట్లు ఐఐసీ ఆర్.విజయ్కుమార్ తెలిపారు. చికిత్స పొందుతూ గజరాజు మృతి భువనేశ్వర్: ఢెంకనాల్ కపిలాష్ ఏనుగుల చికిత్స కేంద్రంలో చికిత్స దిశలో గజరాజు మరణించినట్లు వైద్య బందం ప్రకటించింది. పేలుడు పదార్థం సేవించి తీవ్రంగా గాయపడిన ఏనుగు పరిస్థితి క్షీణించడంతో ఏనుగుల చికిత్స కేంద్రానికి తరలించారు. చికిత్స కొనసాగుతుండగా శుక్రవారం ఉదయం మరణించింది. అంగుల్ అటవీ డివిజన్ పరిధిలోని బొంతొల అటవీ ప్రాంతంలోని పొథొరొగొడొ సాహి సమీపంలో ఈ ఏనుగుని విషమ స్థితిలో గుర్తించారు. ఐదు, ఆరు రోజుల కిందట పేలుడు పదార్థం తినడంతో తీవ్రంగా గాయపడిందని సీనియర్ పశు వైద్యుడు డాక్టర్ ప్రదీప్త కుమార్ సింగ్ ధ్రువీకరించారు. ఈ పేలుడు కారణంగా ఏనుగు నోటి లోపల లోతైన గాయాలయ్యాయి. కపిలాష్, అంగుల్, సతొకొసియా నుంచి ప్రత్యేక పశువైద్య బందాలు నిమగ్నమై చేసిన చికిత్స ప్రయత్నాలు విఫలమయ్యాయి. వేటగాళ్లు పన్నిన ఉచ్చుతో గజరాజు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుని ఉంటుందని అంగుల్ మండల అటవీ శాఖ అధికారి పేర్కొన్నారు. అయితే కచ్చితమైన పరిస్థితులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయి. లారీ డ్రైవర్ మృతి రాయగడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ జి.తాతాజీ (30) శుక్రవారం సదరు సమితిలోని కొత్తపేట వద్ద గుండెపోటుకు గురై మృతిచెందాడు. నువాపడ నుంచి కాకినాడకు వెళుతుండగా తీవ్ర అస్వస్థతకు గురై లారీ కింద పడిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసేసరికి గుండె పోటుతో మృతి చెందాడు. చందిలి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
వారణాసి–అయోధ్యకు మల్కన్గిరి నుంచి 75 మంది పయనం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా నుంచి శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద పర్యాటక శాఖ నేతృత్వంలో వేయ్యార్ నిక్రతిక్ తీర్థయాత్ర యోజన పథకం కింద జిల్లా నుంచి రాయగడకు రెండు బస్సుల్లో ప్రయాణికుల యాత్రను జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధన్ జెండా ఊపి ప్రారంభించారు. రాయగడ నుంచి రైలులు వారణాశి, అయోధ్య వెళ్లనున్నారు. ముందుగా వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆధార్ కార్డులు సేకరించారు. పురుషుల కోసం జిల్లా రెవెన్యూ అధికారి రవీంద్ర నాయక్, మహిళల కోసం క్రీడా ఉపాధ్యాయురాలు బబితా మొహంతి వెళ్తున్నారు. -
నమ్మినందుకు మళ్లీ నగుబాటు!
పోలాకి: పోలాకి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఉర్జాం గ్రామం. ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లిన వారంతా పెద్దపండగ సంక్రాంతికి సొంతూరు రావటంతో గ్రామంలో చిన్న సందడి.. గ్రామంలోని కణితోళ్ల ఇంటి వద్ద ఉన్న రచ్చబండపై కూర్చున్నారు గ్రామానికి చెందిన రైతు చింతాడ నూకయ్య, రైతు కూలీ సంపతిరావు వేణు. వీరిద్దరూ వ్యవసాయం గురించి మాట్లాడుతుండగా అటుగా వచ్చిన ఎల్ఐసీ ఏజెంట్ కణితి కృష్ణ పలకరించాడు. డబ్బుల కోసం అడగ్గా.. ఇంకా ధాన్యం డబ్బులు అందలేదు పండగ వెళ్లాక కిస్తీ కడతాను అన్నాడు నూకయ్య. కృష్ణ: అదేంట్రా తమ్ముడు.. లేటైతే ఫినాల్టీ కట్టాలి. ఇంటిదగ్గర డబ్బులుంటే చూసి కట్టేయకూడదు. నూకయ్య: ఇంకెక్కడ డబ్బులురా అన్నా.. ఖర్చులు పెరిగిపోయాయి. పంటకు ధరలేదు, ఎరువులు దొరకటం లేదు. మిల్లులు చుట్టూ తిరగలేక, సచివాలయం దగ్గర నిలబడ లేక ధాన్యం దళారీలకి ఇచ్చాను. ఇంకా డబ్బులు అందలేదు. ఈలోగా పండగ వచ్చేసింది. చుట్టాలు, బంధువులు, పిల్లలు వస్తారు కదా.. (ఇంతలోనే అటుగా వచ్చిన యువకులను చూసి వీరు ముగ్గురూ ఆప్యాయంగా పిలిచారు. నాయనా బాగున్నార్రా అందరూ.. పండక్కి వచ్చారా..? మీరుంటే ఊరు కళకళలాడుతాదిరా అన్నారు. వెంటనే వారి దగ్గరకు వచ్చిన కుర్రాళ్లు కణితి సంతోష్, కిల్లి లచ్చుమునాయడు(హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు), సంపతిరావు గోవిందరాజు (టెక్నికల్ మెంబర్, జిందాల్ స్టీల్స్, ఛత్తీస్గఢ్), కిల్లి తిరుపతి(వైజాగ్ స్టీల్ప్లాంట్ ఎంప్లాయ్) ఏంటి దద్దా డిమ్ముగా వున్నారు అనడిగారు. నూకయ్య: ముసిలోళ్లం.. డిమ్ముగా కాకపోతే మీలా ఉండగలమా..? లచ్చుమునాయుడు: మీ పనే బాగుంది పింఛన్ అందుతుంది కదా? నూకయ్య: ఏం పింఛన్రా.. నిలువునా మునిగిపోయాం. యాభై సంవత్సరాలకు పింఛన్ ఇస్తానన్నారు. నాకు అరవయ్యొక్కటి..ఇదిగో వేణుకి యాభైనాలుగు వచ్చినాయి. మా ఇద్దరికే కాదు మా వయసున్నోళ్లు చాలామంది ఉన్నా ఊళ్ల నుంచి జనాలైతే వచ్చారు. కానీ ఏం కొందామన్నా డబ్బుల్లేవు. ధాన్యం ధర గిట్టుబాటు కాలేదు. తీసుకున్న ధాన్యానికి ఇచ్చే కొద్దిపాటి సొమ్మైనా ప్రభుత్వం నుంచి ఇంకా అందలేదు. 50 ఏళ్లు దాటితే పింఛన్ ఇత్తామన్నారు. ఆ ఊసే ఎత్తడం లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా విగ్రహాలకు, ఆడంబరాలకు వందల కోట్లు తగలేస్తున్నారు. ఈ ప్రభుత్వం సంగతి తెలిసినా మళ్లీ ఓట్లేసి గెలిపించి మోసపోనాం.. ఇంకేం పండుగ చేసుకుంటాం. -
సర్వం సిద్ధం
సంగమేశ్వర జాతరకు.. ● సర్వమత సమ్మేళనం ఇక్కడి ప్రత్యేకత ● నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలుఆమదాలవలస రూరల్: గాజులు కొల్లివలస సంగమేశ్వర జాతరకు సర్వం సిద్ధమైంది. సంక్రాంతి నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 12వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మితమైందని పురావస్తుశాఖ కూడా గుర్తించటంతో రాష్టంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమదాలవలస పట్టణ సమీపంలోనే ఈ ఆలయం ఉంది. ఎన్నో ప్రత్యేకతలు.. చరిత్రాత్మక నిలయంగా చెప్పుకుంటున్న సంగమేశ్వర ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. కొండపై రాతితో చెక్కిన శివ లింగంతో పాటు శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వామివారిని దర్శించుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మూడు మతాల సమ్మేళనం ఆమదాలవలస సంగమేశ్వర ఆలయం సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడి కొండపై బౌద్ధ, జైన, శైవ అనే మూడు మతాలు ఒక్కో చోట చేరటం ఇక్కడి ప్రత్యేకత. మూడు మతాలు ఇక్కడ ఉండటం వల్ల సంగమేశ్వర క్షేత్రంగా కూడా పిలుస్తారని ప్రతీతి. మత సంగమం సాధారణంగా నదీ సంగమంలో ఉంటాయని చరిత్ర చెబుతోంది. అయితే ఇక్కడ ఎటువంటి నదులు లేనప్పటికీ కొండపై మూడు మతాలు సమ్మేళనంగా ఉండటం విశేషం. శివుడితో పాటు బుద్ధుడు, జైన తీర్ధంకుల విగ్రహాలను భక్తులు దర్శించుకుంటారు. -
ఘనంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం ఉదయం అనివెట్టి మండపంలో ఘనంగా నిర్వహించారు. పుష్య బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉషా పద్మిని ఛాయా దేవేరులతో సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను కల్యాణమూర్తులుగా అలంకరించి ప్రక్రియ పూర్తి చేశారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్శర్మ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించి భక్తదంపతులకు తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, వేదపండితులు పాల్గొన్నారు. నేడు ఆదిత్యుని క్షీరాభిషేకం మకర సంక్రాంతి సందర్భంగా సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టుకు పంచామృతాలతో అభిషేక సేవ జరగనుందని ఈవో ప్రసాద్ తెలిపారు. గురువారం ఉదయం 4 గంటల నుంచి అభిషేక సేవ జరుగుతుందని, నిజరూపదర్శనం కూడా ఉంటుందని, రూ.500 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తదంపతులకు మాత్రమే ఈ సేవలో పాల్గొనే అవకాశముందని చెప్పారు. ఆదిత్యుని సన్నిధిలో భక్తుల రద్దీ అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. బుధవారం భోగి సందర్భంగా ఆదిత్యుని ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేసి ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనాలకు అనుమతిచ్చారు. విశాఖకు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ వై.ప్రభాకరరావు కుటుంబసమేతంగా ఆదిత్యున్ని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయం ప్రకారం గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించి తీర్ధప్రసాదాలను అందజేశారు. అనంతరం సూర్యనమస్కారాల పూజలు నిర్వహించారు. ఇదిలావుంటే రథసప్తమి మహోత్సవాల సందర్భంగా ఆలయ మండపాల్లో వివిధ రకాల పనులు జరుగుతున్న క్రమంలో ఎక్కడా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ తగు జాగ్రత్తలతో కూడిన చర్యలు చేపట్టారు. -
శబర శ్రీక్షేత్ర, కొరాపుట్ పుస్తకావిష్కరణ
జయపురం: జయపురానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు, ఆదివాసీ జీవనం, సంస్కృతి, సంప్రదాయాల పరిశోధకుడు, అవిభక్త కొరాపుట్ చరిత్ర పలు పుస్తకాలు రచించిన డాక్టర్ పరేష్ రథ్ కొరాపుట్ శబరి శ్రీక్షేత్రపై రచించిన శబరి శ్రీక్షేత్ర, కొరాపుట్ పుస్తకాన్ని మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు.శబర శ్రీక్షేత్ర విద్యాపీఠం, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాయం, పూరీ పండితులు సంయుక్తంగా కొరాపుట్ ఆదివాసీ సంగ్రాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి శబరశ్రీక్షేత్ర దివ్య పీఠ అధ్యక్షులు, జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రెండు రోజులు జరిగిన శ్రీజగన్నాథ సంస్కృతి, ఆదివాసీ సంస్కృతిలపై జరిగిన చర్చావేదికపై ‘శబర శ్రీక్షేత్ర కొరాపుట్ ’పుస్తకాన్ని జయపురం ఎమ్మెల్యే బాహిణీపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రచయిత డాక్టర్ పరేష్ రథ్ 2016లో శబరి శ్రీక్షేత్రం కొరాపుట్పై ఒడియాలో రచించారన్నారు. రాష్ట్ర వాసులే కాకుండా దేశ, విదేశీయులు కొరాపుట్ శబరి శ్రీక్షేత్రం ప్రాధాన్యత తెలుసు కొనేందుకు వీలుగా ఆంగ్లంలో రచించటం ప్రశంసనీయమన్నారు. డాక్టర్ రథ్ అవిభక్త కొరాపుట్ ఆదివాసీ సంస్కృతిపై పలు పండుగలపై అనేక రచనలు చేశారని వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డాక్టర్ పరేష్ రథ్ను ఎమ్మెల్యే బాహిణి పతి ఘనంగా సన్మానించారు. -
పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాల వితరణ
శ్రీకాకుళం అర్బన్: సంక్రాంతి సండగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ కాంప్లెక్స్లో పనిచేసే 14 మంది పారిశుద్ధ్య కార్మికులకు జీఎన్ జ్యుయలరీస్ సౌజన్యంతో నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ హనుమంతు అమరసింహుడు కార్మికులకు వస్త్రాలు వితరణ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎస్ఎం ఎంపీ రావు, ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం: కొండములగాంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ రెడ్డి వాసు 5100 పిడకలతో భారీ భోగి పిడకల దండ తయారు చేయించారు. 20 మంది చిన్నారులతో ఊరేగింపుగా దండను తీసుకొచ్చి భోగి మంట వద్ద సందడి చేశారు. గడ్డికుప్పలు దగ్ధం టెక్కలి రూరల్: పరశురాంపురంలో బుధవా రం జరిగిన అగ్ని ప్రమాదంలో గడ్డి కుప్పలు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్పంచ్ కోరాడ కామేష్తో పాటు మరికొందరు సుమారు 5ఎకరాల గడ్డిని కుప్పలుగా పెట్టి ఉంచారు. బుధవారం మధ్యాహ్నం సమీప పొలంలోని వరి దుబ్బులు కాల్చేందు కు పెట్టిన మంట చెలరేగి పక్కనే ఉన్న గడ్డికుప్పలపై పడటంతో ఈ ప్రమాదం సంభవించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటల ను అదుపు చేశారు. అప్పటికే చాలావరకు కుప్పలు కాలిపోయాయి. నందిగాం: గొల్లూరు గ్రామంలో పింఛన్దారుల సొమ్ములో కొంత మొత్తాన్ని పంచాయతీ కార్యదర్శి తన వద్దే ఉంచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జనవరి నెలకు సంబంధించి గొల్లూరు పంచాయతీలో సుమారు 120 పింఛన్లకు గాను రూ.5,32,500ను గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శి హేమసుందర్కు అప్పగించారు. అందులో రూ.4,68,000 మేరకు పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. మరి కొంత మంది పింఛన్దారులు అందుబాటులో లేకపోవడంతో వారికి సంబంధించిన రూ.64,500ను కార్యదర్శి తన వద్దే దాచుకున్నాడు. 3వ తేదీతో పింఛన్ పంపిణీ ప్రక్రియ పూర్తయినప్పటికీ, మిగిలిన పింఛన్ డబ్బుల సంగతి మండల స్థాయి అధికారులకు తెలియజేయలేదు. ఈ విషయమై ఎంపీడీఓ కుమార్ పట్నాయక్ వద్ద ప్రస్తావించగా.. గొల్లూరు కార్యదర్శి హేమసుందర్ పింఛన్ డబ్బులు ఉంచేశారనే విషయం తనకు తెలియదన్నారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం శ్రీకాకుళంలోని తిలక్ నగర్లో ఉపాధి కొత్త చట్టం జీఓ కాపీలను భోగిమంటలో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ల ఒత్తిడితోనే కొత్త చట్టం తెచ్చారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బి.కృష్ణమూర్తి, కె.నాగమణి, పి.తేజేశ్వరరావు, పి.ప్రసాదరావు, కె.శ్రీనివాస్, ఎం.గోపి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట : కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోను అమలు చేయకుండా ఎన్నికల హామీలు తుంగలోనికి తొక్కడం దారుణమని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మోజ్జాడ యుగంధర్ అన్నా రు. ఈ మేరకు బుధవారం నరసన్నపేటలోని ఉమామహేశ్వరాలయం వద్ద భోగి మంటల్లో మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు రూ.20 లక్షలు, నిరుద్యోగ భతి నెలకు రూ. 3000 ఇస్తామని ఇంతవరకూ అమలు చేయకపోవడం దారుణమన్నారు. -
వెలుగు తెచ్చింది..
భోగీ వచ్చింది..పల్లె మురిసింది.. వీధులు కళకళలాడాయి.. ఇళ్లన్నీ సందడిగా కనిపించాయి.. పెద్ద పండుగ పిలుచుకునే సంక్రాంతి సంబరాలు ఆరంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి తరువాత ప్రారంభమైన భోగి మంటల వెచ్చదనం బుధవారం రోజంతా కొనసాగింది. చిన్నా..పెద్దా తారతమ్యం లేకుండా అందరూ వేకువజామున సంప్రదాయబద్ధంగా స్నానాలు ఆచరించి భోగి మంటల వద్దకు చేరుకొని ఉత్సాహంగా గడిపారు. నూతన వస్త్రాలు ధరించిన పిల్లలు మంటల్లో కట్టెలు, పిడకలు వేసేందుకు చూపారు. అలాగే పిల్లలకు భోగిపండ్లు వేసి పెద్దలు ఆశీర్వదించారు. రంగురంగుల రంగవల్లికతో వీధులన్నీ కలర్ఫుల్గా కనిపించాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు చేరుకోవడంతో కొంతశోభను సంతరించుకున్నాయి. డూడూ బసవన్నల ఆటలు, హరిదాసుల కీర్తనలు సంక్రాంతికి మరింత ఊపుతెచ్చాయి. కాగా గురువారం జరుపుకునే సంక్రాంతి కోసం ఇళ్లన్నీ సుందరంగా ముస్తాబయ్యాయి. పూజలకు కావాల్సిన సామగ్రి కొనుగోలు కోసం వచ్చిన వారితో మార్కెట్లు రద్దీగా మారాయి. – సాక్షి నెట్వర్క్ -
పేదలకు దుస్తులు పంపిణీ
రాయగడ: స్థానిక అంబాగుడలో రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి స్వగృహంలో సంక్రాంతిని పురస్కరించుకుని పేదలకు దుస్తులను బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక హాజరయ్యారు. 500 మందికి దుస్తులను పంపిణీ చేశారు. ప్రతీ ఏడాది అప్పల స్వామి కడ్రక ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు తన స్వంత ఖర్చులతో పేదలకు దుస్తులు పంపిణీ చేస్తుండటం అభినందనీయమని ఉలక పేర్కొన్నారు. పేదలకు అండగా నిలుస్తున్న కడ్రక భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టలని ఆకాంక్షించారు. గోదాదేవి అమ్మవారికి సారె సమర్పణ రాయగడ: ధనుర్మాస పూజల్లో భాగంగా స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణవేంకటేశ్వర మందిరంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలు, పండ్లు, చీర, గాజులు, పసుపు, కుంకుమను సారెగా భక్తులు సమర్పించారు. ఆయా ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు కొనసాగుతున్నాయి. సారెను సమర్పించిన అనంతరం వాటిని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. ఆటోబోల్తాపడి ఆరుగురికి గాయాలు రాయగడ: ఆటోబోల్తా పడిన ఘటనలో ఆరుగురు తీవ్రగాయాలకు గురయ్యారు. జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పుటాసింగి పోలీస్ స్టేషన్ పరిధి సింధూర ఘాటి వద్ద ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని గజపతి జిల్లా నువాగడ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. గజపతి జిల్లా నువాగడ వద్ద వారపు సంతను చూసేందుకు ఆబడ సమీపంలోని కులుసింగి గ్రామానికి చెందిన పది మంది ఆటోలో ప్రయాణిస్తుండగా.. సిందూర ఘాటి వద్ద ఆటో అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు పర్లాకిమిడి: పదేళ్ల బాలికపై అత్యాచారం జరిపిన ఘటనలో స్థానిక జంగంవీధిలో నివాసముంటున్న పైల రవి(35)ని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. సోమవారం రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాలికపై అత్యాచారం జరిపాడు. ఈమేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆదర్శ పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేయగా రవిని అరెస్టు చేసి కోర్టుకు తర లించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
పండగ పూట విషాదం
● రాయగడ కాపువీధిలో బాంబు పేలుడు ● నలుగురికి తీవ్ర గాయాలు ● సంక్రాంతి సంబరాల వేళ అపశ్రుతి రాయగడ : సంక్రాంతి సంబరాల వేళ రాయగడ కాపువీధిలో అపశ్రుతి చోటుచేసుకుంది. బాంబు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో స్థానిక పిట్లవీధికి చెందిన రెడ్డి నిఖిల్, డి.బొన్ని, ఎస్.కిశోర్ దొర, బి.యోగేశ్వర్ ఉన్నారు. వీరిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నలుగురిని విశాఖపట్నం తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒక్కసారిగా పేలుడు.. స్థానిక కాపువీధి, మజ్జివీధుల్లో భోగి సంబరాలు నిర్వహిస్తుండగా బుధవారం వేకువజాము సుమారు 3 గంటల ప్రాంతంలో కాపువీధి వెనుక భారీ శబ్ధం రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. బాంబు పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన వారిని చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి గౌరి శంకరరావు అనే వ్యక్తి ఇంటి పైభాగం పూర్తిగా విరిగిపోయింది. తలుపులు విరిగిపోయాయి. పక్కనే ఉన్న ఆటో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసుల దర్యాప్తు.. విషయం తెలుసుకున్న డీఎస్పీ అమూల్యధల్, ఎస్డీపీఓ గౌరహరి సాహు, ఐఐసీ ప్రసన్న కుమార్ బెహరా, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీశారు. పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడి ఉన్న కాగితపు ముక్కలు, ఇంటి పై భాగం నుంచి కిందపడిన మట్టి పెల్లలు, ధ్వంసమైన ఆటోను పరిశీలించారు. కొద్దిరోజులుగా కొంతమంది ఇక్కడికి రాత్రిపూట వచ్చి ఉంటున్నారని స్థానికులు పోలీసులకు చెప్పారు. అయితే వారు ఎవరన్న విషయం తెలియడం లేదన్నారు. కాపువీధి , మజ్జివీధుల్లో సంబరాలు నిర్వహించే వారిని పోలీసులు పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబరాలు నిలిపివేత కాపు వీధిలో మూడు రోజుల పాటు ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసినా బాంబు పేలుడు నేపథ్యంలో అర్ధంతరంగా ఆపేశారు. ఎటువంటి సంబరాలు నిర్వహించవద్దని పోలీసులు నిర్వాహకులకు ఆదేశించారు. పోలీసుల నుంచి అనుమతులు తీసుకోకపొవడం వల్లే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఇకపై తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. -
కమనీయం.. గోదాదేవి కల్యాణం
పర్లాకిమిడి: స్థానిక వేంకటేశ్వర ఆలయంలో నెల రోజులుగా కొనసాగుతున్న ధనుర్మాస పూజలు బుధవారం గోదాదేవి కల్యాణంతో పూర్తయ్యాయి. కోమటివీధి వేంకటేశ్వర మందిరంలో ప్రధాన అర్చకులు భద్రం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో కల్యాణోత్సవం నిర్వహించారు. శ్రీనివాసుడి మహాభక్తురాలు గోదాదేవి వ్రతాలు ఫలించి భోగిపండుగ నాడు శ్రీరంగం శ్రీనివాసులతో వివాహం జరిగిన ఘట్టాన్ని అర్చకులు భద్రం కళ్యాణ్, చక్రధర్ కనుల పండువగా జరిపించారు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కల్యాణ ఘట్టాన్ని వీక్షించారు. -
అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే బాహిణీపతి
జయపురం : అస్వస్థతకు గురై కొద్ది నెలలుగా చికిత్స పొందిన జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఎట్టకేలకు కోలుకున్నారు. మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్డొన్నారు. స్థానిక బాబాసాహెబ్ కళ్యాణ మండపంలో మునిసిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సురక్షా బిన్నక్షమ సహసీ్త్రకరణ విభాగం, ఒడిశా సహకారంతో మధుబాబు పెన్షన్ పథకంలో భాగంగా కొత్తగా పింఛన్ మంజూరైన 826 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చైర్మన్ మహంతి, తదితరులు పాల్గొన్నారు. అటవీ భూముల పట్టాలు పంపిణీ మల్కన్గిరి: గోవిందపల్లి పంచాయతీ దామాబేడా గ్రామానికి చెందిన 79 మంది గిరిజనులకు మల్కన్గిరి జిల్లా చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖీలో మంగళవారం అటవీ భూముల పట్టాలను పంపిణీ చేశారు. మత్తిలి అటవీ విభాగ అధికారి బసుదేవ నాయక్ అధ్యక్షతన ముందుగా అటవీ అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. గోవిందపల్లి సర్పంచ్ శ్రీనివాస్ ముదిలి, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర బార్కౌన్సిల్కు రెండు నామినేషన్లు శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయవాదుల రాష్ట్ర బార్ కౌన్సిల్కు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, ఇతర సభ్యులతో కలిసి 25 మందిని ఎన్నుకుంటారు. ఫిబ్రవరి 13న జరిగే ఈ ఎన్నికకు జిల్లా నుంచి ఇద్దరు న్యాయవాదులు కిల్లి మార్కండేశ్వరరావు, గేదెల వాసుదేవరావు నామినేషన్ వేశారు. వీరిలో ఇప్పటికే బార్ కౌన్సిల్ సభ్యులుగా గేదెల వాసుదేవరావు ఉండగా, కొత్తగా జిల్లా నుంచి మార్కండేశ్వరరావు పోటీలోకి దిగారు. మినేషన్ ప్రక్రియ ఈ నెల 13తో ముగిసింది. జిల్లాలో 1316 మంది న్యాయవాదులు బార్ కౌన్సిల్కు ఓటు వేయనున్నారు. -
పండగ పూట ఇవేం పనులు!
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నగర అభివృద్ధి పనులు కూటమి నేతలకు, మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీర్లకు సంక్రాంతి సమయంలో మాత్రమే గుర్తుకురావడం పరిపాటిగా మారింది. రథసప్తమి పేరిట గతేడాది పాలకొండ రోడ్డు, కళింగరోడ్డు, అరసవల్లి మిల్లు కూడలి వద్ద పెద్ద పెద్ద గోతులు తవ్వేసి ప్రయాణికులకు, నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. ఈసారీ అదే తరహాలో పెద్దపాడు నుంచి రామలక్ష్మణకూడలి, సూర్యమహాల్ కూడలి నుంచి జి.టి రోడ్డు, ఉమెన్స్ కాలేజీ రోడ్డులో గోతులు తవ్వేసి ప్రయాణికులకు అడుగడుగున నరకయాతన చూపిస్తున్నారు. జిల్లా కేంద్రానికి దుస్తులు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చేవారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ముందస్తు ప్రణాళిక లేకుండా హడావిడి పనులు చేయడం, నాసిరకం పనులు చేయడం బిల్లులు చెల్లింపులు జరిపి కాంట్రాక్టులు, పాలకులు, అధికారులు జేబులు నింపుకోవడం అలవాటైపోయింది. దీనిపై ఉన్నతాధికారులు, పాలకులు దృష్టి సారించి నాణ్యమైన పనులు జరిగేలా చూడాలని, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పర్లాకిమిడి: ముఖ్యమంత్రి మోహన్చరణ్ మఝి మంగళవారం వర్చువల్గా పలు అభివృద్ధి పథకాలకు, ఎనిమిది రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పర్లాకిమిడి వాసుల చిరకాల కోరిక బైపాస్ రోడ్డును రూ.48.6 కోట్లతో పాటు మొత్తం రూ.226.58 లక్షలను ఎనిమిది రోడ్డు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కొత్త రోడ్డు ప్రాజెక్టులలో మోహనా నియోజకవర్గంలో జిరంగో, కోయిపూర్ రోడ్డు, గుసాని సమితిలో గొప్పిలి–కించిలింగి (ఆంధ్రా–ఒడిశా సరిహద్దు), సెరంగో–నువాగడ, బాగుసల– అగర్ఖండి, చాందిపుట్– లుహాగుడి ఉన్నాయి. పర్లాకిమిడి, మోహనా ఎమ్మెల్యేలు రూపేష్ పాణిగ్రాహి, దాశరథి గొమాంగో విచ్చేసి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ ఏడీఎం మునీంద్ర హానగ, రోడ్లు–భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు అభిషేక్ శెట్టి, మోహనా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శెఠి, అదనపు ఎస్పీ పునీల్కుమార్ మహంతి తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక వ్యవసాయాన్ని అలవర్చుకోవాలి
మల్కన్గిరి: రైతులు ఆధునికీ పద్ధతుల్లో వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని అధికారులు అన్నారు. మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని సాంస్కృతిక భవన్లో జలసంపద శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పాణి పంచాయతీ పక్షం–2026ను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోటేరు సాగునీటి ప్రాజెక్ట్ ప్రధాన ఇంజినీర్ తృప్తకుమార్ పాత్రో అధ్యక్షత వహించారు. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు పతితపావన ముఖ్యఅతిథిగా హాజరై వ్యవసాయంలో ఆధునికీ విజ్ఞానం, సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మల్కన్గిరి ఎమ్మెల్యే నిహార్ రాయ్, చిత్రకొండ ఎమ్మెల్యే ప్రతినిధి గోవింద చంద్ర పాత్రో, జిల్లా జల విభాగం ప్రాజెక్టు డైరెక్టర్ సమీర్ శబర్ పాల్గొన్నారు. -
పర్లాకిమిడిలో ‘పోలాకి’ సందడి
పర్లాకిమిడి: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన పర్లాకిమిడి వాసి పోలాకి విజయ్ను చిరంజీవి అభిమాన సంఘం నేతలు ఘనంగా స్వాగతం పలికారు. పట్టణంలో జయా మహాల్లో రిలీజైన ఈ సినిమాను వీక్షించేందుకు మంళవారం విజయ్ వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. సినిమాలో ఓ మీసాల పిల్ల, మరో పాటకు విజయ్ కొరియోగ్రఫీ చేశారు. గతంలో పుష్ప–2 సినిమాకు కూడా నృత్య దర్శకత్వం వహించినట్లు విజయ్ తెలిపారు. చిన్నప్పటి నుంచి అభిమానించే చిరంజీవికి కొరియోగ్రఫీ చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. -
సాగునీరు అందించేందుకు కృషి
● సాగునీటి సంఘాలు బాధ్యత తీసుకోవాలి ● పాని పంచాయతీ పక్షోత్సవాల ముగింపులో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి పర్లాకిమిడి: గజపతి జిల్లాలో సాగునీటి సంఘాల ద్వారా పంట పొలాలకు నీరు అందించడానికి కృషి చేయాలని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. గుసాని, కాశీనగర్లో పాని పంచాయతీ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం స్థానిక యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం హాలులో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి సంఘాల ద్వారా గుసాని, కాశీనగర్, గుమ్మ సమితిలోని పలు గ్రామాలకు నీరు అందిస్తున్నామని, త్వరలో డంబాపూర్ రిజర్వాయరు నీటిని కృష్ణసాగరానికి కెనాల్ ద్వారా తరలించి రైతులకు సాగునీరు అందిస్తామని చిన్ననీటి పారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరు సింహాచల శతపతి వివరించారు. అనంతరం వివిధ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన వక్తృత్వ పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ చైర్మన్ జి.తిరుపతిరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ మునీంద్ర హానగ, అదనపు చీఫ్ ఇంజినీర్ (వంశధార, నాగావళి బేసిన్) రాంప్రసాదరావు, ఎస్ఈ ఇరిగేషన్ డివిజన్ సరోజ్కుమార్ నాయక్, ఆశిష్ కుమార్ మల్లిక్ (ఏఈఈ), అసిస్టెంట్ ఇంజినీర్(మైనర్ ఇరిగేషన్) మనోజ్ చౌదురి తదితరులు పాల్గొన్నారు. -
రథసప్తమి వేడుకలకు విరాళం
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న అరసవల్లి రథసప్తమి వేడుకలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించడం అభినందనీయమని, ఈ విరాళాలను భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ఉత్సవాల బ్రాండింగ్ కోసం వినియోగిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జెమ్స్, కిమ్స్ ఆసుపత్రుల ప్రతినిధులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్సవాల నిర్వహణకు కిమ్స్, జెమ్స్ తరఫున రెండు లక్షల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ సమాజానికి వెలుగునిచ్చే భాస్కరుడి ఉత్సవాల్లో వైద్య రంగం తరపున భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కిమ్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గూడెన సోమేశ్వరరావు, జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త డాక్టర్ కల్యాణ్బాబు, జెమ్స్, కిమ్స్ ఆసుపత్రుల ప్రతినిధులు డాక్టర్ హేమంత్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రవి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భ జలాలు తోడేసే పరిశ్రమ మాకొద్దు
రణస్థలం: వ్యవసాయానికి అన్ని రకాలుగా అడ్డంకిగా మారిన ఆక్వా బ్రూవరీస్ పరిశ్రమను తమ పొలాల్లో ఏర్పాటు చేయవద్దని రణస్థలం పంచాయతీకి చెందిన 50 మంది రైతులు మంగళవారంకలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. మూడు నెలలుగా పరిశ్రమ నిర్మించవద్దని, ఎన్ని విధాలుగా చెప్పినా పరిశ్రమ యాజమాన్య ప్రతినిధి ఎన్.రవికిరణ్ మొండిగానే వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇటీవల రౌడీమూకల ద్వారా రైతులపై దాడికి పాల్పడినట్లు వివరించారు. పరిశ్రమ నిర్మిస్తున్న ప్రదేశంలో తమ గ్రామానికి చెందిన బొద్దవాని చెరువు, ఇతర చెరువులకు వెళ్లే భారీ నీటి వాగు ఉందని, ఆ వాగును ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు. చెరువులకు నీరు చేరకుంటే సాగుకు ఇబ్బందులు ఎదురౌతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వ్యవసాయ సాగుకు బోర్లు వేసుకుంటే సుమారు 140 అడుగుల వరకు మాత్రమే వేస్తామని, అదే కంపెనీ నిర్వాహకులు 350 అడుగుల లోతు వరకు తవ్వారని, భారీగా నీటిని తోడేస్తే మా వ్యవసాయ బోర్లకు నీటి మట్టం తగ్గిపోయి పచ్చని భూములు బీడు భూములుగా మారిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రణస్థలం మాజీ సర్పంచ్ కరిమజ్జి భాస్కరరావు, గ్రామపెద్దలు కరిమజ్జి మల్లేశ్వరరావు, మజ్జి రమేష్, చందక రమణ, కరిమజ్జి రామినాయుడు, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
ఆర్మీ జవాన్ మృతి
జలుమూరు: యలమంచిలి గ్రామానికి చెందిన ఆర్మీజవాన్ జుత్తు వెంకటరమణ(37) గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్లు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరమణ ఢిల్లీలో ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. మూడు రోజులు క్రితం సెలవుపై ఇంటికి వచ్చారు. పిల్లల చదువుల నిమిత్తం కుటుంబంతో శ్రీకాకుళంలో అద్దె ఇంటిలో ఉంటున్నారు. సోమవారం వేకువజామున గుండెపోటుతో మృతి చెందడంతో భార్య విజయ ఆర్మీ అధికారులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని యలమంచిలి తీసుకొచ్చారు. వెంకటరమణకు భార్యాపిల్లలతో పాటు తల్లిదండ్రులు బోడయ్య, శాంతమ్మ, సోదరుడు గోవిందరావు ఉన్నారు. ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో వెంకటరమణ మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. భార్య విజయ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కందిరీగల దాడిలో తొమ్మిది మందికి గాయాలు రణస్థలం: లావేరు మండలం తాళ్లవలస సమీపంలోని వరిచేను కళ్లాల వద్ద కందిరీగల దాడిలో తొమ్మది మందికి గాయాలయ్యాయి. మీసాల పెంటనాయుడుకు తీవ్ర గాయాలు కాగా, అతని భార్య కళ్యాణి, గ్రామస్తులు మీసాల రాంబాబు, మీసాల వరలక్ష్మి, క్రిష్ణవేణి, సంచాన హేమలత, సంచాన ఈశ్వరమ్మ, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పెంటనాయుడు రణస్థలం సీహెచ్సీలో చికిత్స పొందుతున్నాడు. మరో నలుగురు చికిత్స పొంది ఇంటికి చేరుకోగా, ఇంకో నలుగురు గ్రామంలోనే ప్రథమ చికిత్స పొందారు. తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి కవిటి: మండలంలోని బైరెడ్లపుట్టుగకు చెందిన బైరెడ్ల చిరంజీవి(50) తేనెటీగల దాడిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో తోటల పక్కగా వస్తున్న చిరంజీవిపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడిచేసింది. తీవ్రంగా గాయాలు కావడంతో బాధితుడిని కవిటి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కవిటి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ మృత్యువాత రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిలో ఆగి ఉన్న లారీలో డ్రైవర్ మృతి చెందాడు. లావేరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుడుమూరు వద్ద లారీ ఉదయం నుంచి పక్కనే నిలిపివేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు. మధ్యాహ్నం లారీ క్యాబిన్లోనికి చూడగా డ్రైవర్ నిద్రపోయి ఉన్నట్లు గమనించారు. ఎంత సేపు పిలిచినా పలకక పోవడంతో లోపలకు వెళ్లి చూడగా చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే లావేరు పోలీసులకు సమాచారం తెలియజేశారు. పోలీసులు వచ్చి లారీ యజమానికి సమాచారం అందించారు. డ్రైవర్ గోబర్థన్ రాయ్(54) ఒంటరిగా వాహనం డ్రైవింగ్ చేస్తూ రెండు రోజుల క్రితం పశ్చిమబెంగాల్ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళుతుండగా బుడుమూరు గ్రామానికి చేరుకునే సరికి నిద్రలోనే గుండెపోటు వచ్చి చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ స్వగ్రామం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మెదినాపూర్ జిల్లా పూర్భా పోస్టు బ్రిందాబన్ చౌన్గా గుర్తించారు. బుడుమూరు వీఆర్వో కె.నవీన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఏఎస్సై పి.జగన్మోహన్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? శ్రీకాకుళం న్యూకాలనీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు ముగుస్తున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం దౌర్భాగ్యకరమని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు హక్కుగా రావాల్సిన డీఏ బకాయిలను సంక్రాంతి కానుకగా చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు యూనియన్ 2026 క్యాలెండర్ శ్రీకాకుళం జిల్లా జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఆ సంఘ జిల్లా అధ్యక్షులు చల్లా సింహాచలం అధ్యక్షతన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఇచ్చిన మాటలన్నీ ఒట్టి మాటలగానే మిగిలిపోయాయమని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీఏ బకాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 26 జిల్లాల కలెక్టర్లకు విజ్ఞప్తి చేశామన్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని, అధికారంలోకి తీసుకువచ్చి తప్పుచేశామని ప్రతి ఒక్క ఉద్యోగి ఆవేదనలో ఉన్నారని.. భవిష్యత్తులో తగిన మూల్యాం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీసీపీఎస్ఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శి అంపోలు షణ్ముఖరావు, జిల్లా ఉపాధ్యక్షులు పైడి నాగేశ్వరరావు, ఏవో సుందరరావు, కె.లక్ష్మీనారాయణ, సీపీఎస్ ఉగ్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
భూగర్భ జలాలను కాపాడుకుందాం
రాయగడ: నీటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక రింగ్రోడ్డు సమీపంలోని బిజు పట్నాయక్ కళ్యాణ మండపంలో మంగళవారం పాణి పంచాయతీ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతరించిపోతున్న భూగర్భజలాలను సంరక్షించుకోవాలని, నీటి వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు సాగునీటి వనరుల వినియోగంలో సరైన మెలకువలు పాటించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్కే హేసాన్ మాట్లాడుతూ ప్రభుత్వం సమకూరుస్తున్న సాగునీటి ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సరైన నిర్వహణ లేకే సాగునీటి వనరులు నిరుపయోగమవుతున్నాయని చెప్పారు. -
తండ్రి మృతదేహానికి కుమార్తె అంత్యక్రియలు
కొరాపుట్: తండ్రి మృతదేహానికి కుమార్తె అంత్యక్రియలు నిర్వహించి కన్నరుణం తీర్చుకుంది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని రాజు వీధికి చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు గంగాధర్ సామంత్రాయ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు. కొడుకులు లేకపోవడంతో గంగాధర్ సామంత్రాయ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు ఆలోచనలో పడ్డారు. అయితే చిన్న కుమార్తె స్వాగతిక సామంత్రాయ్ అన్నీతానై తండ్రి అంత్యక్రియలను పూర్తి చేశారు. రాజులు కుటుంబాలతో స్నేహ సంబంధాలు ఉండే సంప్రదాయ ఒడియా బ్రహ్మణ కుటుంబంలో జన్మించిన స్వాగతిక నిర్ణయం కొంత సేపు అందరిని అయోమయానికి గురి చేసింది. అదే సమయంలో కుటుంబ సభ్యులు సైతం మద్దతు ఇవ్వడంతో స్వాగతిక తన తండ్రి చివరి కోరిక నెరవేరుస్తూ చితికి నిప్పంటించింది. ఈ ఘటన పట్ల మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మాఘరో మహిళా స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ కాధంబనీ త్రిపాఠి అభినందించారు. -
పాత శాసనసభ భవనం మన వారసత్వం
భువనేశ్వర్: ప్రస్తుతం ఉన్న ఒడిశా శాసన సభ భవనం భవితవ్యంపై ఉన్న ఊహాగానాలకు న్యాయశాఖ మంత్రి పి.ఆర్.హరిచందన్ ముగింపు పలికారు. ఈ చారిత్రక నిర్మాణాన్ని కూల్చివేయబోమని, బదులుగా వారసత్వ భవనంగా భద్రపరచబడుతుందని, భవిష్యత్తులో మ్యూజియంగా, శాసన మండలి (విధాన పరిషత్)గా ఉపయోగించుకునే అవకాశం ఉందని మంత్రి మంగళవారం స్పష్టంచేశారు. భువనేశ్వర్లో అత్యాధునిక శాసనసభ భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత జరుగుతున్న చర్చల మధ్య మంత్రి ప్రకటన వెలువడింది. 70 ఏళ్లకు పైగా పురాతనమైన ప్రస్తుత శాసన సభ భవనం విస్తరణకు అవకాశం లేదు. పెరుగుతున్న శాసన సభ యొక్క భవిష్యత్ అవసరాలను తీర్చలేదని మంత్రి అన్నారు. ఈ భవనం చారిత్రక, నిర్మాణ ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం దానిని పరిరక్షించాలని నిర్ణయించిందన్నారు. భవిష్యత్తులో ఒడిశాలో శాసన మండలి ఏర్పడితే ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనాన్ని విధాన పరిషత్ భవనంగా ఉపయోగించవచ్చన్నారు. ఇది రాష్ట్ర ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించే మ్యూజియంగా కూడా పని చేయగలదన్నారు. ప్రస్తుత లోక్ సేవా భవన్, శాసన సభ భవనం మధ్య ఖాళీగా ఉన్న స్థలంలో కొత్త శాసన సభ భవనం నిర్మితం అవుతుంది. దాదాపు 300 మంది శాసన సభ్యులకు వసతి కల్పించడానికి రూపొందించబడిన ఈ కొత్త సభ భవన సముదాయం తదుపరి శాసన సభ నియోజక వర్గాల పునర్విభజన సమయంలో దాదాపు 50 అసెంబ్లీ స్థానాల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని రూపకల్పన చేసినట్లు మంత్రి వివరించారు. ప్రతిపాదిత నిర్మాణం రెండంతస్తులతో అత్యాధునిక సౌకర్యాలు, భూగర్భ పార్కింగ్, ప్రత్యేక పార్కింగ్ జోన్లతో ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.387.94 కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. ప్రస్తుతం పని చేస్తున్న విభాగాధిపతుల 9 అంతస్తుల భవన సముదాయం, ప్రస్తుత లోక్ సేవా భవన్కు దగ్గరగా ఉన్న రాజీవ్ భవనాల కాల పరిమితి ముగిసి సురక్షితం కాదని ప్రకటించబడినందున వాటిని కూల్చివేస్తామని హరిచందన్ తెలియజేశారు. దాదాపు 67 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రస్తుత లోక్ సేవా భవన్ (సచివాలయం) తీవ్రమైన స్థల పరిమితుల కారణంగా వేరే చోటికి మార్చబడుతుంది. కొత్త సచివాలయ సముదాయాన్ని 3 దశల్లో నిర్మించనున్నారు. మొదటి దశలో ఖారవేళ భవన్ సమీపంలో ప్రధాన లోక్ సేవా భవన్, రెండవ దశలో పవర్ హౌస్ స్క్వేర్ సమీపంలో అదనపు సచివాలయ కార్యాలయాలు, ఏడీఎం కార్యాలయం మరియు ఒసేపా క్యాంపస్కు ఆనుకొని కొత్త శాసన సభ, లోక్ సేవా భవన్ సముదాయం మరియు ఇతర ప్రభుత్వ భవనాలను 71.13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. మూడో దిశలో ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాంపస్ను ఏర్పరుస్తారు. న్యూఢిల్లీ సెంట్రల్ విస్టా పునరాభివద్ధి నుండి ప్రేరణ పొందిన ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 3,623 కోట్లు ఖర్చవుతుంది. ఒడిశా పరిపాలనా, శాసన మౌలిక సదుపాయాలను రానున్న 70 నుంచి 100 సంవత్సరాలకు అనుగుణంగా నూతన శాసన సభ భవన సముదాయం ప్రతిష్టాత్మక కట్టడంగా నిలుస్తుందన్నారు. మంత్రి హరిచందన్ -
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి
● బీజేపీ నాయకుడు కొండబాబు ● రాణిగుడఫారంలో సంక్రాంతి సంబరాలురాయగడ: మన తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించడం అందరి బాధ్యతగా గుర్తించాలని బీజేపీ నాయకుడు యాల్ల కొండబాబు అన్నారు. స్థానిక రాణిగుడఫారం వద్ద గల మజ్జిగౌరి మండపం ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సంబరాలను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన తెలుగు పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనదన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మన పండుగలను భావితరాలు తెలుసుకునే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలుగు లోగిళ్లలో ఇంటింటా సంక్రాంతి సంబరాలు జరుగుతుంటాయన్నారు. అయితే అంతా ఒకే వేదికపై ఇటువంటి తరహా కార్యక్రమాలను, పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదిలాఉండగా సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో 20 మంది మహిళలు పాల్గొన్నారు. ఇందులో ప్రథమ బహుమతిని హారిక, ద్వితీయ బహుమతిని నిరుపమమహాపాత్రో, తృతీయ బహుమతిని రమ్యలు గెలుచుకొగా పోటీల్లొ పాల్గొన్న అందరికీ నిర్వాహకులు ప్రొత్సాహక బహుమతులను అందజేశారు. న్యాయనిర్ణేతలుగా కొళ్లూరి శేషసాయి, కె.పద్మావతి పట్నాయక్ వ్యవహరించారు. విజేతలకు ముఖ్యఅతిథిగా హాజరైన కొండబాబు బహుమతులను ప్రదానం చేశారు. -
భగవద్గీతను పఠనం చేయాలి
జయపురం: పవిత్ర భగవద్గీతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఇస్కాన్ ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వీసీ మహేశ్వర చంద్ర నాయిక్ పర్యవేక్షణలో మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాయాపూర్ ధామ్ నుంచి వచ్చిన శ్రీపద వంశీ గోపీనాథ్ ప్రభు, మనోరమ గౌర దాస్, ఇస్కాన్ జయపురం శాఖ శ్యామానంద దాస్, ఘనశ్యామనంద దాస్లు పాల్గొని సనాతన పవిత్ర గ్రంథం భగవద్గీతలో పొందుపరచిన గీతా బోధనలు వాటి తాత్పర్యాలు విద్యార్థులకు బోధించారు. భగవద్గీత పఠనంతో మానసిక, ఆధ్యాత్మిక, శారీరక వికాసంతో పాటు ఉత్తమ గుణాలు గల మణిషిగా రూపు చెందగలరని వివరించారు. కార్యక్రమంలో భాగంగా +2, +3 విద్యార్థులు 250 మందికి భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరిసెట్టి రామకృష్ణ, దీనబందు అగర్వాల్, ఓంప్రకాశ్ హలన్, అశోక్ అగర్వాల్, రాజేష్ తోషినివాల, ప్రకాశ్ నాయిక్, పూర్ణచంద్ర పట్నాయక్ పాల్గొన్నారు. -
రహదారుల దిగ్బంధం
బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026కొరాపుట్ : నబరంగ్పూర్ జిల్లాలో రైతుల సమస్యలపై మంగళవారం భారీ ఆందోళన చేపట్టారు. ప్రతిపక్ష బీజేడీ పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు రహదారులు దిగ్బంధించారు. ఎక్కడికక్కడే ఆందోళనలు నిర్వహించారు. ఉదయం నుంచి జిల్లాతో ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు (మండీ)లలో రైతులు ధాన్యంతో రోజులు తరబడి పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ చంద్ర మజ్జి చందాహండి సమితి కేంద్రంలో రాస్తారోకో చేశారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డులో మధ్యాహ్నం వరకు ఆందోళన సాగింది. ఆందోళనకారులు ఎక్కడికక్కడ కాన్వాయ్కు మార్గం సుగమం చేశారు.ఈ కాన్వయ్ వెళ్తున్నప్పుడు అందులో ఒక డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బండారు ఘరణి మందిరం వద్ద ఆందోళన చేస్తున్న మహిళలపై వాహనం వెళ్లడంతో కేకలు వేస్తుండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బ్రేక్లు వేస్తూ భయపెట్టాడు. దీంతో మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వాహనం ముందు నిలిచారు. బ్రేక్లు వేస్తూ బయపెట్టడం పట్ల మండిపడ్డారు. అక్కడ ఉన్న పోలీసులు కూడా భద్రతా దళ వాహన డ్రైవర్పై అసహనం వ్యక్తం చేసారు. అనంతరం ట్రాక్టర్ల తో జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన రైతులు కలక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మని దహనం చేశారు. జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారీ, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రదాని, సుభాష్ గొండోలు, మాజీ జెడ్పీ ప్రెసిడెంట్ మంజులా మజ్జి తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలకు మద్దతుగా బీజేడీ శ్రేణుల ఆందోళన నబరంగ్పూర్ జిల్లాలో రాస్తారోకో నిలిచిన వాహనాల రాకపోకలు ప్రభుత్వ తీరుపై మండిపాటు -
కాంగ్రెస్ పార్టీకి శంకర్ జిలకర్ర రాజీనామా
రాయగడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, డీసీసీ మాజీ అధ్యక్షుడు శంకర్ జిలకర్ర ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామ పత్రాన్ని పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, డీసీసీ అధ్యక్షుడు, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రకకు సమర్పించారు. కాంగ్రెస్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆయన రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో కలవర పెడుతున్నాయి. ఆదివాసీ నాయకుడైన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి నిర్విరామంగా కృషి చేశారు. దీంతో జిల్లాలోని రాయగడ, బిసంకటక్, గునుపూర్ అసెంబ్లీ స్థానాలతో పాటు కొరాపుట్ ఎంపీ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థుల విజయం సునాయాసమయ్యిందనే చెప్పొచ్చు. అయితే అసలు పార్టీకి రాజీనామా చేయడం వెనుక కారణం తెలియడం లేదు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఆయన భవిష్యత్లో ఏ పార్టీలో చేరుతారో వేచిచూడాల్సిందేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి ● మరో ఇద్దరికి గాయాలు రాయగడ: జిల్లాలోని బిసంకటక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెగాలిబుడుని గ్రామ సమీపంలోని కూడలిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు దుర్మరణం చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న బిసంకటక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించగా గాయపడిన వారిని బిసంకటక్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. డేగాలిబుడుని గ్రా మానికి చెందిన మహేశ్వర్ కౌసల్య, రామదేవి పాణి, జున్ను కౌసల్య ద్విచక్ర వాహనంపై బిసంకటక్ నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా డెగాలుబుడుని గ్రామానికి దగ్గరలోని కూడలిలో గుణుపూర్ నుంచి వస్తున్న బొలేరో అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రమాదేవి పాణి (64) సంఘటనా స్థలం వద్దే మృతి చెందగా మహేశ్వర్, జున్నులు గాయాలపాలయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బైకు, బొలేరోను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ మీటర్లకు.. అద్దె వసూలు చట్టవిరుద్ధం ● వినియోగదారుల సంఘం ఆరోపణ భువనేశ్వర్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నారు. అదనపు సెక్యూరిటీ డిపాజిట్ నోటీసులతో ఇళ్లలో స్మార్ట్ మీటర్లను బలవంతంగా అమర్చుతున్నారు. పేద ప్రజల ఇళ్లలో ప్రభుత్వ మీటర్ల వ్యతిరేకంగా రూ.300 అక్రమంగా వసూలు చేస్తున్నారు. సౌభాగ్య, ఐపీడీఎస్ పథకాలలో మాత్రమే టాటా పవర్ అధీనంలో 4 విద్యుత్ పంపిణీ సంస్థలు 2020 నుంచి చట్ట విరుద్ధంగా మీటర్ల అద్దెను వసూలు చేస్తున్నాయి. ఈ విషయంలో వినియోగదారుల సంఘం ఓఆర్ సీకి పదేపదే ఫిర్యాదు చేసిన ప్రయోజనం శూన్యంగా పరిణమిస్తుంది. టీపీసీఓడీఎల్ సమాచారం ప్రకారం 2024 సంవత్సరం ఏప్రిల్ నుంచి మీటర్ల అద్దె వసూలు చేయడం లేదు. 2024 మార్చి నెల వరకు రూ.18.68 కోట్లు వసూలు చేశారు. ఐపీడీఎస్ మీటర్ల నుండి 2,00,195 మంది వినియోగదారుల నుంచి రూ.11.55 కోట్లు అద్దె వసూలు చేశారు. సౌభాగ్య యోజన కింద 1,75,188 మంది వినియోగదారుల నుంచి మీటర్ అద్దెగా రూ.7.13 కోట్లు వసూలు చేశారు. ఇదిలా ఉండగా టీపీఎన్ ఓడీఎల్, టీపీఎస్ ఓడీఎల్, టీపీ డబ్ల్యూడీఎల్ వంటి 3 కంపెనీలు దీన దయాళ్ యోజన, రాజీవ్ జ్యోతి, బిజూ జ్యోతి వంటి అనేక ప్రభుత్వ పథకాల నుంచి సుమారు రూ. 300 కోట్లు అద్దె రూపంలో దోచుకున్నాయి. ఇంగ్లిషులో బిల్లులు ముద్రించి సాధారణ వినియోగదారుల నుంచి కోట్ల రూపాయలు తీసుకోవడం శిక్షార్హమైన నేరం. వినియోగదారుల సంఘం అధ్యక్షుడు రమేష్ చంద్ర సతపతి, ప్రధాన కార్యదర్శి ప్రసన్న బిషోయ్, కొర్యదర్శులు లలాటేందు దీక్షిత్, అక్షయ్ ఆచార్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మోసపూరితంగా డబ్బు వసూలు చేసినందుకు టాటా అధికారులను అరెస్టు చేసి చట్టం ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలన్నారు. పరిస్థితిని సమీక్షించకుండా రాష్ట్ర ప్రభుత్వం టాటా పవర్కు రూ.735 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. పన్ను డబ్బుతో టాటా పవర్ మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా సామాన్య ప్రజలను దోపిడీ చేస్తూనే ఉంటుంది. ఇది విద్యుత్ హక్కు చట్టానికి విరుద్ధమని వినియోగదారుల సంఘం పేర్కొంది. -
కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాలి
● బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక రాయగడ: కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో కృషి చేయాలని బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక అన్నారు. మునిగుడలోని ఇన్స్పెక్షన్ బంగ్లాలో సోమవారం సాయంత్రం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని అన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన ఈ జిల్లాలో రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ జెండాను ఎగురవేయాలని అన్నారు. ఇప్పటి నుంచే కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సమితి పరిధిలో వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్ జెండాను కప్పి ఆహ్వానం పలికారు. పార్టీ బలొపేతానికి అంతా కలసి కట్టుగా పనిచేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో రజనీ కాంత్ పొడొల్, రమేష్ పలకీయ, మునిగుడ పంచాయతీ సర్పంచ్ సరస్వతి సబర్, తెలంగాపొదొరొ, సమితి సభ్యులు అనంగ్ నాగ్ పాల్గొన్నారు. -
నదిలో మునిగి యువకుడు మృతి
రాయగడ: స్నానానికని నదిలో దిగి నీటి ప్రవాహానికి మునిగిపోయి ఊపిరాడక ఒక యువకుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని గుణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుంగురుతల గ్రామ సమీపంలో గల చిన్న నది వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి గుణుపూర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రపుల్ల మిశ్రొ కొడుకు జొగా మిశ్రో (35) గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలించి జొగా మృతదేహాన్ని వెతికి బయటకు తీశారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం ... గుణుపూర్కు చెందిన కొంత మంది స్నేహితులతో కలిసి జొగ ఆదివారం నాడు పిక్నిక్ వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం పిక్నిక్ ప్రాంతం నుండీ సమీపంలో గల చిన్న గెడ్డ వద్ద స్నానానికని దిగాడు. దీంతో మునిగిపొయి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చార్టర్ ప్రమాద స్థలం పరిశీలన
భువనేశ్వర్: రూర్కెలాలో ఇటీవల జరిగిన చార్టర్ (మినీ విమానం) ప్రమాద స్థలాన్ని రాష్ట్ర రవాణా, వాణిజ్య శాఖ మంత్రి బిభూతి జెనా సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా దుర్ఘటన తదనంతర చర్యలను పరిశీలించారు. అనుబంధ అధికార యంత్రాంగంతో చర్చించారు. ప్రమాదం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసిందన్నారు. భగవంతుని దయతో ఎటువంటి ప్రాణ హాని లేకుండా గట్టెక్కిందన్నారు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా దర్యాప్తు జరుగుతోందని మంత్రి ప్రకటించారు. పెరగనున్న చలిగాలులు భువనేశ్వర్: రాష్ట్రంలో శీతల గాలులు తిరిగి వీస్తున్నాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి పెరుగుతుందని వాతావరణ వర్గాల సమాచార. సోమవారం నుంచి ఉష్ణోగ్రత మరోసారి తగ్గింది. మేఘావృతం క్రమంగా తొలగిపోవడంతో ఉష్ణోగ్రత తగ్గి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మేఘావృతమైన వాతావరణం నెలకొనడంతో ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగింది. ఫలితంగా శనివారం రాత్రి నుంచి చలి తీవ్రత తగ్గింది. అయితే ఇప్పుడు ఈ వ్యవస్థ బలహీనపడి మేఘాలు తొలగిపోవడంతో చలి పరిస్థితులు మళ్లీ తీవ్రమవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సి ఉంది. రోడ్డు కోసం ఆందోళన కొరాపుట్: రోడ్డు నిర్మాణం కోసం పట్టణ వాసులు ఆందోళనకు దిగారు. సోమవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న ఐదో నంబర్ వార్డులోని నువాబందు వీధి వాసులు ఆందోళనకు దిగారు. ఈ వీధి గుండా రోజూ కోర్టు, కాలేజీ, వివిధ ప్రభుత్వ కార్యాలయాల కోసం వందలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. ఈ వీధిలో గతంలో రోడ్డు బాగుండేది. కానీ ప్రభుత్వం డ్రైనేజీ నిర్మాణం చేయడంతో శిథిలమైంది. దీంతో కొత్త రోడ్డు నిర్మించాలని వీధి వాసులు డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికారులు క్రమేణా వాయిదా వేస్తున్నారు. దీంతో స్థానిక కౌన్సిలర్ ఐ.మురళీ క్రిష్ణ నేతృత్వంలో ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనకు దిగారు. వీరికి సంఘీభావంగా ఆ మార్గంలోని దుకాణదారులు తమ షాపులు మూసి వేశారు. దీంతో సంబంధిత ఆర్అండ్బీ విభాగ ఇంజినీర్లు వచ్చి ఫిబ్రవరి 20వ తేదీలోపు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రామనగుడలో 89 వినతుల స్వీకరణ రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశానుసారం జిల్లాలోని రామనగుడ సమితి కార్యాలయంలో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామనగుడ సమితి పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 89 వినతులను అధికారులు స్వీకరించారు. ఇందులొ 74 వ్యక్తిగత సమస్యలు కాగా 15 గ్రామ సమస్యలుగా అధికారులుగుర్తించారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ ఆదేశించారు. రామనగుడ సమితి ఽఅధ్యక్షులు రవిగొమాంగో, డీఎఫ్వో అన్నా సాహెబ అహోలే, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లిమ్మపొదొరో గ్రామానికి చెందిన దివ్యాంగుడు గౌరంగ పండకు ట్రైసైకిల్ను అధికారులు అందజేశారు. -
తిరుపతి పాణిగ్రాహికి సత్కారం
పర్లాకిమిడి: ఒడిశాలో దీర్ఘకాలికంగా విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన హైటెక్ విద్యాసంస్థల చైర్మన్, పర్లాకిమిడి స్వాభిమాన్ మంచ్ అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహికి మణిపూర్లో ఘనంగా సత్కరించారు. ఇంఫాల్ విమానాశ్రయంలో వందలాది విద్యార్థులు, మేధావులు, కళాకారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. మణిపూర్లో మెడికల్ కళాశాల నిర్మాణానికి తిరుపతి పాణిగ్రాహి ముందుకు వచ్చారని అక్కడి విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి యువ పర్యావరణ వైజ్ఞానికులు లిపిప్రియా ప్రాతినిధ్యం వహించారు. -
ఆర్చరీలో మెరిసిన ఒడిశా
భువనేశ్వర్: 69వ జాతీయ స్కూల్ గేమ్స్ అండర్ 17 ఆర్చరీ చాంపియన్షిప్లో ఒడిశా యువ ఆర్చర్లు అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించారు. ఈ పోటీలు ఈ నెల 6 నుంచి 10 వరకు జార్ఖండ్లోని రాంచీలో జరిగాయి. రాష్ట్ర జట్టు మొత్తం 10 పతకాలు సాధించింది. వాటిలో 4 స్వర్ణాలు, 5 రజతాలు, 1 కాంస్యం ఉంది. జాతీయ స్థాయిలో రన్నరప్గా నిలిచింది. జాతీయ స్థాయిలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. ఒడిశా రెండో స్థానం చేజిక్కించుకోగా జార్ఖండ్ మూడో స్థానంతో సర్దిపుచ్చుకుంది. రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్ర పాఠశాల క్రీడల సంఘం 18 మంది క్రీడాకారులతో ఒడిశా జట్టును రంగంలోకి దించింది. ఈ జట్టులో 11 మంది బాలికలు, ఏడుగురు బాలురు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శన రాష్ట్ర వ్యాప్తంగా యువ క్రీడా ప్రతిభను ప్రేరేపిస్తుందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించడానికి ఆశావహులైన అథ్లెట్లను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. మయూర్భంజ్ జిల్లా బరిపద యూజీపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి రోహిత్ కుమార్ మరాండి అత్యుత్తమ ప్రతిభా క్రీడాకారుడిగా నిలిచాడు. అతడు వరుసగా 30 మీటర్ల ఇండియన్ రౌండ్, 30 మీటర్ల ఒలింపిక్ రౌండ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో 3 బంగారు పతకాలు, 30 మీటర్లు, 20 మీటర్ల విభాగంలో ఒక రజత పతకాన్ని గెలుచుకున్నాడు. భువనేశ్వర్ కిట్ స్కూల్కు చెందిన రేష్మా మల్లిక్, రోహిత్తో కలిసి 30 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకాన్ని సాధించారు. కెంజొహర్ జిల్లాకు చెందిన సునీతా నాయక్ 60 మీటర్ల రీ కర్వ్ రౌండ్లో రజత పతకాన్ని, 60 మీటర్ల వ్యక్తిగత ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 60 మీటర్ల రీ కర్వ్ రౌండ్లో సాబిత్రి పాత్రో (కెంజొహర్), తెన్షా మెహర్ (సుందర్గడ్), పంఖి భత్రా (భువనేశ్వర్) రజత పతకాలను గెలుచుకున్నారు. వీరందరి విజయంతో ఒడిశా పతకాల సంఖ్య గణనీయంగా పెరిగేందుకు దోహదపడిందని సర్వత్రా ఆనందం వ్యక్తం అవుతుంది. -
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని గుణుపూర్ సబ్డివిజన్ పరిధిలో గల లిమ్మాపొడ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నీలాగుడ గ్రామానికి చెందిన మున్నా కింవాక (19), కృష్ణ కింవాక (15) లు మృతి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం కోసం గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం నాడు నీలాగుడ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మున్నా, కృష్ణలు బైకుపై గుణుపూర్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలొ బైకు అదుపుతప్పి లిమ్మాపొడ గ్రామ సమీపంలో ఒక విద్యుత్ స్తంభానికి ఢీకొన్నారు. దీంతో తీవ్రగాయాలకు గురైన ఇద్దరూ సంఘటన స్థలం వద్దే ప్రాణాలు విడిచారు. అత్యంత వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆర్సీడీ హైస్కూల్ మైదానంలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలుగు కల్చరల్ అసోసియేషన్ ప్రకటించింది. పట్టణంలోని వివిధ తెలుగు కుల, సమాజ సేవా సంఘాలకు చెందిన యువకులు ఐక్యంగా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ కల్యాణ మండపంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన చాంబర్ అధ్యక్షుడు మానస్ రంజన్ దాస్ (కను) ఈ కార్యక్రమానికి పూర్తి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. మిల్లర్ల సంఘం కూడా చేతులు కలిపింది. పార్టీలకు అతీతంగా కార్యక్రమం నిర్వహించాలని యువత నిర్ణయించింది. కార్యక్రమంలో విశాఖ పట్నంకి చెందిన రోషల్ లాల్ ఆర్కెస్ట్రాతో పాటు ఆంధ్రా నుంచి వివిధ కళాకారుల బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రముఖలంతా ఒకే వేదికపైకి రానున్నారు. -
త్వరలో రాష్ట్రంలో అత్యాధునిక లోక్ సేవా భవన్
భువనేశ్వర్: రాష్ట్రంలో కొత్తగా అత్యాధునిక లోక్ సేవా భవన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సోమవారం పునాది రాయి వేశారు. 71.13 ఎకరాల విస్తీర్ణ ప్రాంగణంలో లోక్ సేవా భవన్, రాష్ట్ర శాసన సభ ఒకే సముదాయంలో నిర్మితం అవుతాయి. రాష్ట్రంలో శాసన సభ నియోజక వర్గాల భావి పునర్విభజన దృష్ట్యా కొత్తగా నిర్మితం అవుతున్న శాసన సభలో 300 మంది సభ్యులకు వీలుగా సకల సౌకర్యాలతో ఈ భవన సముదాయం అత్యంత ఆధునికంగా నిర్మితం అవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రణాళిక వ్యయ అంచనా రూ.3,623 కోట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రూ. 6,700 కోట్ల విలువైన ప్రజా పనుల శాఖకు చెందిన 71 ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో దాదాపు రూ.5,630 కోట్ల పెట్టుబడితో 39 ప్రాజెక్టులకు పునాది రాయి వేయగా రూ. 1,070 కోట్ల పెట్టుబడితో 32 ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేశారు. -
మత్తు పదార్థాల విముక్తితో వికసిత్ భారత్
పర్లాకిమిడి: యువత మత్తు పదార్థాలను వదిలేస్తేనే వికసిత భారత్ సాధ్యమని సఖీ వన్స్టాప్ సెంటర్, ఐఎస్ఆర్డీ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ నుంచి ఒక ర్యాలీని ఆదనపు కలెక్టర్ మునీంద్ర హానగ ప్రారంభించారు. యువజనోత్సవాలు సందర్భంగా యువత మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే సమీప భవిష్యత్లో వికసిత్ భారత్ సంభవమని కలెక్టర్ మునీంద్ర అన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని మనోరమాదేవి, జువెనల్ కోర్టు ప్యానల్ లాయర్ భాగ్యలక్ష్మీ నాయక్, జిల్లా సామాజిక, భధ్రత, సంక్షేమ శాఖ అఽధికారి సరలా పాత్రో, జిల్లా శిశు సురక్షా యునిట్, చైల్డ్ లైన్, ట్రాన్స్జెండర్ కార్యదర్శి జాస్మిన్ షేక్, వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మెడికల్ రోడ్డులో ఉన్న వనస్టాప్ సెంటర్ రిసోర్స్ భవనంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. -
రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో ప్రతిభ
జయపురం: బరంపురంలో 9వ రాష్ట్ర నాటక మంచ్, 35వ గంజాం జిల్లా కళాపరిషత్ మంచ్ కళాకారులు కలిసి నిర్వహించిన రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో జయపురం సంస్కృతిక సంస్థ జయపురం వారు ప్రదర్శించిన నాటకం ‘మా లో చాంబర్’ విజయ దుందిబి మోగించి జయపురానికి నూతన సంవత్సర కానుగా తీసుకు వచ్చింది. రచయిత జగదీష్ అధికారి కలం నుంచి రూపుదిద్దుకున్న నాటకం ‘మా లో చాంబర్’కి నిరంజన్ పాణిగ్రహి దర్శకత్వం వహించి సమర్థవంతులైన కళాకారులతో ప్రదర్శింప చేసి అత్యుత్తమ రెండో నాటకంగా గుర్తించారు. ఈ నాటకానికి సంగీత కళాకారులు జి.మహేష్, రామ నిగమ మహంతి సంగీతం సమకూర్చారు. ఈ నాటకంలో పాత్రదారులు సురేష్ హోత్త, పంచానన మిశ్ర, నృశింగ షొడంగి, సరోజ్ మిశ్ర, నిరంజన్ పాణిగ్రహి, పవిత్ర మల్లిక్, బిజయ లక్ష్మీ పాణిగ్రహి, నివేదిత పాణిగ్రహిలు తమ పాత్రలకు జీవం పోశారు. ఈ నాటకం బరంపురం నాటక పోటీల మంచ్లో ప్రదర్శించబడిన నాటకాలలో రెండో అత్యుత్తమ నాటకంగా ఎంపికై ంది. అత్యుత్తమ హాస్య నటునిగా పవిత్ర మల్లిక్, అత్యుత్తమ సహాయనటుని కళాకారునిగా నృశింగ షొడంగి ఎంపికయ్యారు. ‘మా లో చాంబర్’ నాటకం ఆంధ్రప్రదేశ్– ఒడిశా రాష్ట్రాల వివాదస్పద కొటియ ప్రాంత ప్రజల దమనీయ జీవనం, ఆ ప్రాంత ఆదివాసీ ప్రజలు, న్యాయవాదులు మధ్య సంఘర్షణలు కథా వస్తువుగా తీసుకొని రచించబడింది. ఈ నాటకం ప్రారంభం నుంచి మగిసే వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందని జయపురం సంస్కృతి సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. -
ఎండే అండ
భువనేశ్వర్: పునరుత్పాదక ఇంధన వినియోగంతో పర్యావరణ స్థిరత్వం కార్యాచరణలో భాగంగా మైలు రాయి ఆవిష్కృతమైంది. కటక్ జిల్లాలోని 2 గ్రామాలు రాష్ట్రంలో మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తి వినియోగ ప్రాంతాలుగా వెలిశాయి. నరసింగ్పూర్ మండలం ఓలాబ్, కందకేల దేవభూమి గ్రామాలు పూర్తి స్థాయి సౌరశక్తి విద్యుత్తు వినియోగ ప్రాంతాలుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్ ప్రాంతాలుగా ప్రత్యేకత సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన కింద ఈ రెండు గ్రామాలు సౌర విద్యుత్ సదుపాయం పొందాయి. కటక్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ భౌసాహెబ్ షిండే, అఠొగొడొ సబ్ కలెక్టర్ ప్రహ్లాద్ నారాయణ్ శర్మ, టాటా పవరు సెంట్రల్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీసీఓడీఎల్) అధికారులు, ఇతర అధికారుల సమక్షంలో బొడొంబా నియోజక వర్గం ఎమ్మెల్యే బిజయ కుమార్ దలొ బెహెరా ఓలాబ్, కందకేల దేవభూమి గ్రామాల్లో సౌర విద్యుత్ శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీపీసీఓడీఎల్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ కేవలం 25 రోజుల వ్యవధిలోనే దాదాపు 80 గృహాలకు రూఫ్టాప్ సోలార్ ప్యానెల్లను విజయవంతంగా ఏర్పాటు చేయడం విశేషం. వీటిలో ఒలాబాలో 51, కందకేల దేవభూమిలో 29 గృహాలు ఉన్నాయి. ఈ చొరవ సాంప్రదాయ గ్రిడ్ విద్యుత్ నుండి విముక్తి కలిగించి పునరుత్పాదక సౌరశక్తి ద్వారా నిరంతరాయంగా స్వచ్ఛమైన విద్యుచ్ఛక్తిని అందిస్తుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలపై దృష్టి సారించి నిరంతర విద్యుత్తు ప్రాప్యత సౌకర్యం కల్పించారు. దీంతో ఇంటి నిర్వహణ ఖర్చులను తగ్గించి ఆర్థిక భారం వెసులుబాటు కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ఉచిత విద్యుత్ పథకం కింద పైకప్పు సౌర విద్యుత్తును కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ. 30,000 సబ్సిడీని అందించింది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 25,000 ఆర్థిక మద్దతు అందజేసింది. లబ్ధిదారుల వాటాను జిల్లా యంత్రాంగం జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్) నుండి నిధులను అందజేసి గ్రామస్తులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సౌర విద్యుచ్ఛక్తి సౌకర్యం కల్పించారు. ఈ చొరవ ముఖ్యంగా బీపీఎల్ కుటుజీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. నిరంతరాయ విద్యుత్ సరఫరా విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. పునరుత్పాదక శక్తి వినియోగం పట్ల అవగాహన పెంచుతుందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. -
తగాదాలో గాయపడిన వ్యక్తి మృతి
సారవకోట: గుమ్మపాడు పంచాయతీ అగదల గ్రామంలో గత ఏడాది నవంబర్లో భూ తగాదాలో దాడికి గురై తీవ్ర గాయాలపాలైన బమ్మిడి జయరాం(76) ఆదివారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరి పంట కోత విషయమై అదే గ్రామానికి చెందిన హనుమంతు రామకృష్ణ, బలగ నాగభూషణంలు జయరాంపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. అప్పటి నుంచి శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. అప్పట్లో సారవకోట పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. బెదిరింపు కేసులో ముగ్గురు అరెస్టు పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పద్మనాభపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను బెదిరింపు కేసులో కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పలాస రైల్వే స్టేషన్ టూవీలర్ పార్కింగ్, రైల్వే రన్నింగ్ రూమ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు వ్యవహారంలో శనివారం రాత్రి గొడవ జరిగిందన్నారు. 2005 డిసెంబరులో వీటిని కాంట్రాక్టు పొందిన కుర్ధా రోడ్డుకు చెందిన కణితి జగన్నాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెదిరింపు, దాడి కేసులో నిందితులుగా ఉన్న ఎం.సురేష్, ఎం.చిన్నారావు, ఎం.మోహనరావులను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా కిషోర్కుమార్ శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా సంపతిరావు కిషోర్కుమార్ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈయన్ను ఎన్నుకున్నారు. కిశోర్కుమార్ 24 ఏళ్లుగా ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఈ కౌన్సిల్ సమావేశాల్లో సంక్షేమ పథకం బోర్డు డైరెక్టర్గా గుంట కోదండరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బి.శ్రీరామ్మూర్తి, ఎల్.బాబురావు, సీహెచ్ రవీంద్ర, బి.తవిటమ్మ ఎన్నికయ్యారు. బంగారం చోరీపై ఫిర్యాదు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని ఫాజుల్బేగ్పేటకు చెందిన పెద్దింటి గౌరీదేవి నివాసంలో 2 తులాల బంగారం చోరీకి గురైంది. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 7న విద్యుత్ మరమ్మతుల పనులు చేయించేందుకు కొందరు సిబ్బంది వచ్చారని, వారు సాయంత్రం వెళ్లిపోయాక మేడపై ఉన్న గదిలో బీరువా తెరిచి చూడగా తులం గొలుసు, తులం చెవి రింగులు, రూ.40 వేలు నగదు చోరీకి గురయ్యాయని బాధితురాలు తెలిపారు. ఈ మేరకు గౌరీదేవి ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. పోరాట యోధుడు ఓబన్న శ్రీకాకుళం పాతబస్టాండ్: బ్రిటీష్ సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కొని ఉరుకులు పెట్టించిన వీరయోధుడు వడ్డే ఓబన్న అని కలెక్టరేట్ పర్యవేక్షక అధికారి సూర్యనారాయణ కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓబన్న 219వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేనాటి గడ్డపై జన్మించిన ఓబన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఆంగ్లేయులపై వీరోచిత పోరాటం చేశారని గుర్తుచేశారు. నల్లమల అడవుల్లో సంచార జాతులతో సైన్యాన్ని నడిపించి బ్రిటీష్ కంపెనీ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టారని గుర్తు చేశారు. ఇంతటి చరిత్ర ఉన్న వీరుడికి స్వాతంత్య్ర పోరాట చరిత్రలో తగిన గుర్తింపు లభించకపోవడం విచారకరమన్నారు. ఆయన జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, వడ్డెర కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బస్సు ఢీకొని వృద్ధురాలికి గాయాలు శ్రీకాకుళం ౖక్రైమ్ : ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్గేట్ సమీపంలో బస్సు ఢీకొన్న ఘటనలో వృద్ధురాలికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాగోలుకు చెందిన పైలా నర్సమ్మ (72) ఆదివారం సాయంత్రం ఎచ్చెర్లలోని లింగాలపాడులోని తన మనవడి పుట్టిన రోజు వేడుకకు వెవెళ్లి తిరిగి ఆర్టీసీ కాంప్లెక్సుకు చేరింది. రాగోలు వెళ్లేందుకు కాంప్లెక్సు ఇన్గేట్ వద్ద వేచి ఉండగా విశాఖ–అనకాపల్లి పండగ స్పెషల్ బస్సు వృద్ధురాలి కాలి మీద నుంచి వెళ్లడంతో గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి వెంటనే రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ ఎస్ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు సమస్యలపై 13న నబరంగ్పూర్ జిల్లా బంద్
కొరాపుట్: ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు (మండీ) లలో రైతుల సమస్యలపై నిరసనగా ఈ నెల 13వ తేదీన నబరంగ్పూర్ జిల్లా బంద్ జరగనుంది.ఆది వారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో గ్లేజ్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష బీజేడీకి చెందిన మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి ప్రసంగించారు. జిల్లాలో 10 సమితులకు గాను ఏడు సమితుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉమ్మర్కోట్, రాయిఘర్, జొరిగాం సమితుల మినహా మిగతా 7 సమితుల్లో ఆందోళన ఉంటుందన్నా రు. ఆయా సమితుల్లో బీజేడీ కార్యకర్తలు రోడ్లను దిగ్బంధిస్తారని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, మాజీ జెడ్పీ ప్రెసిడెంట్ మంజులా మజ్జి, బీజేడీ నాయకులు సరోజ్ పాత్రో, అరుణ్ మిశ్ర, ప్రమోద్ పాఢీ, లల్లు త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
ముందుకు సాగాలి
సేవా దృక్పథంతో..రాయగడ: స్వచ్ఛంద సేవా సంస్థల్లో చేరే ప్రతీఒక్కరూ సేవ దృక్పథం కలిగి ఉండాలని వాకర్స్ ప్రాంతీయ అధ్యక్షులు పి.గోవిందగుప్త అన్నారు. స్థానిక సాయిప్రియ వాకర్స్ క్లబ్, సాయిప్రియ మహిళా వాకర్స్ క్లబ్లకు చెందిన కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం రిలియన్స్ మార్ట్ సమీపంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం సందడిగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాయగడలో ఎంతో మంది సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు వస్తుండటం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా మహిళలు కూడా క్లబ్లలో సభ్యులుగా పాల్గొని సేవలందించేందుకు ముందుకు రావడం విశేషమని అన్నారు. వంటిళ్లకే పరిమితం కాకుండా సేవా సంస్థల్లో పాల్గొని కీలక పాత్రను పోషిస్తుండటం హర్షించదగ్గ విషయమన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న డిస్టెట్ గవర్నర్ రాజ్ కిశోర్ స్వయి మాట్లాడుతూ.. వాకర్స్ క్లబ్ల వంటి సేవా సంస్థల్లో చేరే ప్రతీ ఒక్కరిలో అంకిత భావం ఉండాలని పిలుపునిచ్చారు. క్లబ్ల ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలను నిర్వహంచాలని సూచించారు. ముందుగానే భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుని అందుకు అనుగుణంగా కార్యరూపం దాల్చాలని అన్నారు. తాము నివసించే ప్రాంతాల్లో ఉండే పేదలకు ఆపన్న హస్తం అందించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం పట్టణానికి చెందిన వాకర్స్ క్లబ్ ప్రాంతీయ అధ్యక్షులు ఐ.గున్నేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటం ఆనందించాల్సిన విషయమని అన్నారు. క్లబ్లు ఆర్థికంగా పుంజుకుంటే దానికి అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుందని.. ఆ దిశగా కృషి చేయాలని అన్నారు. అనంతరం సాయిప్రియ వాకర్స్ క్లబ్, సాయిప్రియ మహిళా వాకర్స్ క్లబ్ల నూతన కార్యవర్గ సభ్యులచే ప్రాంతీయ అధ్యక్షులు గొవింద గుప్తా ప్రమాణ స్వీకారం చేయించారు. సాయిప్రియి వాకర్స్ క్లబ్ కార్యవర్గం ఇలా.. సాయిప్రియ వాకర్స్ క్లబ్ అధ్యక్షులుగా జయక్రిష్ణ ప్రధాన్, ఉపాధ్యక్షులుగా లాల మెహన్బెహర, విప్రచరణ్ బ్రహ్మ, కార్యదర్శిగా జగన్నాథనాయక్, సహకార్యదర్శిగా పొట్టాం సురేష్, కోశాధికారిగా కె.వైకుంఠరావు, జొలి వాకర్గా ఎ.త్రినాథరావు, ధర్మరాజులు నియమితులయ్యారు. అలాగే సాయిప్రియ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలిగా పొట్టాం రమాదేవి, కార్యదర్శిగా జి.మాధురి, కోశాధికారిగా నిర్మల పట్నాయక్, ఉపాధ్యక్షురాలుగా జి.స్వప్న, సహకార్యదర్శిగా కె.అరుణశ్రీ, సహకోశాధికారిగా జి.సుభాషిణి, జొలివాకర్గా కె.సునిత, కె.రజిని, ప్రోకోఆర్డినేటర్లుగా పి.దీప, జామి పూర్ణిమ, కె.అరుణ శేఖర్, సలహాదారులుగా పి.సురేష్, లాడి చంద్ర మౌళి, బొర్డాప్ డైరెక్టర్లుగా కె.అలేఖ్య, ఐ.లక్ష్మి, ఎ.సుశీల, కకే అశ్విని, కె.ఆరుణ, ఎల్.లతలు నియమితులయ్యారు. కొలువు దీరిన కొత్త కార్యవర్గానికి సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో సత్యవాది పతి, డాక్టర్ సురేష్ కుమార్, సుభాష్ బెహర పాల్గొన్నారు. -
ఒకే విడతలో రుణాలు వసూలు
● సహకార బ్యాంక్ నిర్ణయంజయపురం: రుణం తీసుకొని దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నవారి నుంచి ఏకకాలంలో తిరిగి వసూలు చేయాలని జయపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రతినిధులు నిర్ణయించారు. బ్యాంక్ 82వ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. సమావేశానికి బ్యాంక్ పరిశీలన కమిటీ అధ్యక్షులు సుకాంత త్రిపాఠీ అధ్యక్షత వహించారు. ధీర్ఘకాల రుణాల వసూలుపై చర్చించారు. రుణగ్రస్తుల నుంచి ధీర్ఘకాల రుణాలను ఏకకాలంలో (ఒకే విడత) వసూలు చేయాలని సమావేశంలో ప్రవేశ పెట్టిన తీర్మాణాన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే ఇంగ్లిష్లో ఉన్న బ్యాంక్ లోగోను ఒడియాలోకి మార్చాలని తీర్మాణం చేశారు. బ్యాంక్ ఉద్యోగుల వేతనం 35 శాతం పెంచాలని, జయపురం పట్టణంలో బ్యాంక్ శాఖ ప్రారంభించాలని ప్రతిపాదించారు. గత సమావేశంలో ప్రతిపాదనల అమలుపై చర్చి్ంచారు. బ్యాంక్ ఆదాయ వ్యయాలు, రానున్న ఆర్థిక సంవత్సర బడ్జెట్, మొదలగు విషయాలపై చర్చించారు. సమావేశంలో బ్యాంక్ కార్యదర్శి విజయ, డైరెక్టర్ దేవేంద్ర బాహిణీపతి, ఉభాష్ సాహు, లక్ష్మణరావు, పి.పద్మారెడ్డి, దేబొ చౌదరి, సునీల్ పట్నాయక్ పాల్గొన్నారు. -
పర్లాకిమిడిలో హిందూ సమ్మేళనం
పర్లాకిమిడి: రాష్ట్రీయ స్వయం సహాయక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున హిందూ ఐక్యత వాదులు ఒక్కటయ్యారు. గజపతి జిల్లాలో హిందువుల ఐక్యత, జాగృతి కోసం పర్లాకిమిడి ఫారెస్టు గేటు వద్ద ‘హిందూ సమ్మేళనం’ విశ్వహిందూ పరిషద్, ఆర్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం హిందూ సమ్మేళనం జరిగింది. ఈ సభకు వి.హెచ్.పి నాయకులు ప్రియా చరణ్ మహారాజ్, సౌమ్యరంజన్ ఆచార్య, నృసింహా చరణ్ దాస్, దుర్గా మాధవ్ పాణిగ్రాహి, జి.కూర్మారెడ్డి, వి.హెచ్.పి పట్టణ అధ్యక్షుడు కై లాస్ పట్నాయక్, సరోజ్ పండా తదితరులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో, దేశంలో గోవధ నిషేధించాలని, మతమార్పిడిలు జిల్లాలో నిర్మూలించాలని మహాంత ప్రియాచరణ్ మహారాజ్ అన్నారు. దీని కోసం గిరిజన సంప్రదాయ హిందువులు అంతా ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ హిందూ సమ్మేళనంలో గజపతి సవర సమాజ్ (ఆర్.ఉదయగిరి) నాయకులు, జిల్లాలో పలు గ్రామాల నుంచి వచ్చిన వందలాది మంది పాల్గొన్నారు. -
దోకొంధా గ్రామంలో ప్రజారోగ్య బృందం సందర్శన
భువనేశ్వర్: పూరీ జిల్లా దోకొంధా ప్రాంతంలో ప్రజారోగ్య శాఖ ప్రత్యేక బృందం పరిశీలన ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో ఇటీవల పచ్చ కామెర్లు వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. క్షేత్ర స్థాయిలో కామెర్ల వ్యాప్తికి కారణం, తాజా పరిస్థితులు సమీక్షించేందుకు ఈ బృందం పర్యవేక్షిస్తోంది. ఈ సందర్భంగా పచ్చ కామెర్లు బాధితుల కుటుంబాలతో మాట్లాడి, గ్రామాన్ని సందర్శించి పరిసరాలు పరిశీలించారు. ఈ ప్రాంతంలో ప్రజలు స్థానిక దయా నది నీటిపై ఆధారపడతారు. ఈ నది నీరు కలుషితమై కామెర్లు వ్యాప్తించినట్లు భావిస్తున్నారు. ప్రజారోగ్య బృందం ఈ నది నీరు నమూనాల్ని సేకరించింది. తదుపరి పరీక్షల కోసం సిఫారసు చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు దయా నది నీటి వినియోగం నివారించాలని సూచించారు. -
పేదలకు ఆహార పొట్లాల పంపిణీ
రాయగడ: స్థానిక లయన్స్ క్లబ్ అపరాజిత విభాగం ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలను గుర్తించి ఆహారాన్ని అందజేశారు. సుమారు 50 మందికి ఈ సేవా కార్యక్రమాలను అందించగలిగామని క్లబ్ కార్యదర్శి బి.అవంతి తెలిపారు. క్లబ్ ఆవర్భవించిన నుంచి ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. కొత్త ఏడాదిలో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జి.రామక్రిష్ణ, ఉపాధ్యక్షులు కొరాడ రజిత, కోశాధికారి కళ్యాణి, సభ్యులు పాల్గొన్నారు.శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న 25 బైకులు సీజ్ జయపురం: జయపురం పట్టణ పోలీసులు శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న ద్విచక్ర వాహనదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. పోలీసు ఉన్నతాధికారి ఉల్లాస చంద్రరౌత్ ఆదేశాల 26వ జాతీయ రహదారి, సర్దార్ వల్లభాయి పటేల్ మార్గం (పట్టణ మెయిన్ రోడ్డు)లో ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధిక శబ్దంతో సృష్టిస్తున్న సైలెన్సలతో ఉన్న 25 బైకులను అదుపులోకి తీసుకొని సీజ్ చేశారు. వాటి సైలెన్సర్లను తొలగించారు. వాహనాల యజమానులకు వెయ్యి రూపాయల చొప్పున జరిమానా వసూలు చేసినట్లు పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ పత్రికా ప్రతినిధులకు తెలియజేశారు. పట్టణ పోలీసు స్టేషన్లో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో సారి ఇటువంటి తప్పు చేస్తే రూ. రెండు వేలు చొప్పున ఫైన్ వేస్తామని హెచ్చరించామన్నారు. అలాగనే బైక్తో కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను మాత్రం వినియోగించాలని స్పష్టం చేశారు. ఇకపై రోజూ అన్ని వీధుల్లో వాహన తనిఖీలు చేపడతామన్నారు. ప్రజల సురక్షిత కోసం పోలీసు యంత్రాంగం పాడైన సైలెన్సర్లను వినియోగిస్తూ బైక్లు నడిపే వారిపై కఠిన చర్యలు చేపడతాయాని స్పష్టం చేసారు. రూర్కెలా విమానం దుర్ఘటనపై దర్యాప్తు భువనేశ్వర్: ఇండియా వన్ విమానం అనివార్య ల్యాండింగ్తో సంభవించిన దుర్ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు గాయపడిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు విమాన సిబ్బంది కాగా 4 మంది ప్రయాణికులుగా ధ్రువీకరించారు. వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స కార్యకలాపాలను రవాణా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఉషా పాఢి ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం వైద్య నిపుణుల బృందంతో కలిసి రూర్కెలా సందర్శించారు. ఈ విచారకర సంఘటనపై దర్యాప్తు నిర్వహించేందుకు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం ఘటనా స్థలం చేరింది. పౌర విమానయాన శాఖ మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు చురుకుగా కొనసాగుతోంది. ఈ బృందం ప్రమాద ప్రాంతంలో వైమానిక సర్వే నిర్వహించింది. ఏవియేషన్ డైరెక్టర్ రూర్కెలాలో మకాం వేశారు. డీజీసీఏ బృందం ప్రమాద స్థలాన్ని సందర్శించిందని రవాణా శాఖ ప్రముఖ కార్యదర్శి ఉషా పాఢి తెలిపారు. అమొ బస్సు డిపోలో అగ్ని ప్రమాదంభువనేశ్వర్: నగరం శివార్లు పటియా స్క్వేర్ సమీపంలోని అమొ బస్ డిపోలో ఆది వారం అగ్ని ప్రమాదం జరిగింది. డిపోలో నిలిచి ఉన్న ఒక ఎలక్ట్రిక్ (ఈవీ) బస్సు ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. మంటలను ఆర్పేందుకు 2 అగ్నిమాపక దళాల బృందాలను నియమించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
బీజేపీ నాయకుడు గంగాధర్ సామంత్రాయ్ మృతి
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాకి చెందిన అధికార బీజేపీ సీనియర్ నాయకుడు గంగాధర్ సామంత్రాయ్ (67) మృతి చెందారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజు వీధిలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గంగాధర్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. మరణ వార్త విన్న వెంటనే రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి నిత్యానంద గొండో, నబరంగ్పూర్ ఎంపీ, ఎమ్మెల్యే లు బలబద్ర మజ్జి, గౌరీ శంకర్ మజ్జిలు హుటాహుటీన చేరుకొని సామంత్రాయ్ మృతదేహానికి నివాళులర్పించారు. గంగాధార్ నబరంగ్పూర్ జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా 2000–09 వరకు పని చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షునిగా, అనేక రాష్ట్ర పదవులలో కొనసాగారు. అంతిమ యాత్రలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కను దాస్, మాజీ ఎంపీ పరశురాం మజ్జి, బీజేపీ నాయకులు జడేశ్వర్ ఖడంగా, రాజ పురోహితుడు నర్సింగ త్రిపాఠి పాల్గొన్నారు. -
రహగిరి ఉత్సవాలు
వైభవంగా..పర్లాకిమిడి: గజపతి ఉత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభోత్సవం సందర్భంగా పర్లాకిమిడి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రాజవీధిలో కిలో మీటరు మేర రహగిరి పదోత్సవాలను అదనపు కలెక్టర్ మునీంద్ర హనగ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. పర్లాకిమిడి తెలుగు, ఒడియా సంప్రదాయ కళాకారుల సమ్మేళనమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా కళాకారులను ప్రోత్సాహించడమే ఈ రహగిరి పదోత్సవాలు ఉద్దేశమని పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి అన్నారు. ఒడిస్సీ, కూచిపూడి కళాకారులు నృత్యాలు ప్రదర్శించారు. గిరిజన సంప్రదాయ సవర నృత్యం, యోగా, స్కేటింగ్, మహిళా స్వయం సహాయక గ్రూపుల స్టాల్స్, రంగవల్లుల పోటీలు, కృష్ణచంద్ర సమర యోధుల కత్తి, కర్ర సాములు ప్రదర్శించి అధికారుల మన్ననలను పొందారు. ఈ రహగిరి ఉత్సవాల్లో సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, తబలా కళాకారులు రఘునాథ పాత్రో, తదితరులు పాల్గొని కళాకారులను ఉత్సాహ పరిచారు. -
ముగిసిన వార్షిక క్రీడోత్సవాలు
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల వార్షిక క్రీడోత్సవ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రెండు దినాలు జరిగిన ఈ పోటీలు ప్రారంభ దినాన విశ్వవిద్యాలయ క్రీడా మైదానం నుంచి విద్యార్థులు, క్రీడాకారులు శోభాయాత్ర ప్రారంభించారు. మా భగవతీ మందిరం వద్దకు వెళ్లి అక్కడ క్రీడా మశాలా జ్యోతిని వెలిగించి అక్కడ నుంచి శోభా జాత్ర నిర్వహించుకుంటూ విశ్వ విద్యాలయ క్రీడా మైదానానికి చేరారు. అక్కడ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర క్రీడా మశాలను స్వీకరించారు. అనంతరం క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. ప్రారంభోత్సవంలో విశ్వద్యాలయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ పాత్రో, డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో, క్రీడా పోటీల నిర్వాహక కార్యదర్శి సచిన్ కుమార్ నాయిక్, ఉపాధ్యక్షులు డాక్టర్ ఋషభ కుమార్ సాహు, సంతోషిణీ ముండ, క్రీడా శిక్షకులు భగవత్ ప్రసాద్ సింగ్, విశ్వవిద్యాలయ అధ్యాపకులు సిబ్బంది పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం, క్రీడాకారుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించటం ప్రధాన లక్ష్యంగా క్రీడా పోటీలు నిర్వహించినట్లు వెల్లడించారు. -
● కాంగ్రెస్ ధర్నా
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యాలయం వద్ద జిల్లా పార్టీ అధ్యక్షుడు జి.శ్రీనివాసురావు నాయకత్వంలో మనరేగా బచావో ఉద్యమ లక్ష్యం కోసం ఆదివారం ధర్నా నిర్వహించారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి నిళులర్పించి మౌనపోరటం ప్రారంభించారు. నిరాహారదీక్షను చేపట్టారు. జిల్లా పార్టీ నాయకులు జి.శ్రీనివాసురావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గాంధీని అవమానిస్తుందన్నారు. ఆయన పేరున ఉన్న మనరేగా పథకం నుమార్చి జీవీ రామ్జీ పేరు పెట్టడం తగదన్నారు. గాంధీజీకి జరిగిన ఈ అవమానాన్ని దేశం సహించదన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లా మొత్తం నిరసనలు చేపట్టాన్నారు. -
అంబరాన్నంటిన జానపద సంబరాలు
మందస : హరిపురంలో గిడుగు రామ్మూర్తి తెలుగు భాష జానపద కళా పీఠం, బైకులు పోలమ్మ యువజన సంఘం, సోమేశ్వరరావు కలాసీల సంఘం ఆధ్వర్యంలో బద్రి కూర్మారావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన జానపద కళా జాత ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. జముకులపాట, ఎరుకుల పాట, జంగం పాట, తుడుం సన్నాయి మేళం, గంగిరెద్దుల పాటలు, తప్పెటగుళ్లు, థింసా వంటి కళా ప్రదర్శనలు అలరించాయి. కుమార్నాయక్ బృందం ప్రదర్శించిన ఒరియా జానపద ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. నిహారిక సుదర్శన్ల కూచిపూడి, మహిళల కోలాటం, బాలక లోకనాథం బుర్రకథ, ఈశ్రర పాత్ర మిమిక్రీ, గాయకులు మద్దిల నారాయణ, బాడ సూరన్న, అమ్మ రామకృష్ణ, సాలిన జోగారావులు ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో డాక్టర్ మట్ట ఖగేశ్వరరావు, దున్న సోమేశ్వరరావు, నల్ల జయశంకర్, మడ్డు తిరుపతిరావు, రాపాక సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ నాయకుల పర్యటన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి రఖాల్గూడ గ్రామంలో రాష్ట్ర స్థాయి ఆదివాసీ సమాజ మహా సంఘం నాయకులు ఆదివారం పర్యటించారు. గ్రామంలో లకే పోడియమి హత్య ఘటనా కేంద్రంగా చేసుకొని జిల్లాలో గత నెల 5వ తేదీ నుంచి ఏర్పడిన వివాదానికి పరిష్కారం చూపించి, శాంతియుత వాతావరాణాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్రస్థాయి ఆదివాసీ అధ్యక్షుడు కర్మాలక్రా స్వయంగా వెళ్లి గ్రామంలోని ఆదివాసీలతో చర్చించారు. జరిగిన ఘటనలో లకే పోడియమి హత్యతో కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందజేయాలన్నారు. దోషులను కఠినంగా శిక్ష విధించాలని, రెండు గ్రామాల మధ్య ఏర్పడిన వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించాలన్నారు. ఎం.వి 26 గ్రామాన్ని కూడా పరిశీలించారు. ఎస్పీ వినోద్ పటేల్ను కలిసి దోషులను త్వరాగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ పర్యటనలో రాష్ట్ర ఆదివాసీ కార్యదర్శి శరత్ చంద్రనాయక్, సాధారణ కర్యదర్శి మనోజ్ కుమార్ ప్రదాన్, మయూరభంజ్ ఆదివాసీ సంఘ అధ్యక్షుడు రవేంద్రనాథ్ సింగ్, మల్కన్గిరి ఆదివాసీ సంఘ అధ్యక్షుడు బంధు ముదులి, ఇతర ఆదివాసీ నేతలు పాల్గొన్నారు. -
నేడు కాంగ్రెస్ ఉపవాస దీక్షలు
రాయగడ: డబుల్ ఇంజన్ సర్కార్ పనితీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఉపవాస దీక్షలు చేపట్టనుందని సీఎల్పీ నాయకుడు రామచంద్ర కడమ్ అన్నారు. స్థానిక కాంగ్రెస్ భవనంలో శనివారం విలేకర్లతో మాట్లాడారు. దేశంలో కార్మికులకు వంద రోజుల ఉపాధి హామీ పథకం మనొరేగ పేరును మారుస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను తామంతా వ్యతిరేకిస్తున్నామన్నారు. మనొరేగ.. పథకం మాత్రమే కాదని పేదలు, కార్మికుల జీవనోపాధిని మెరుగుపరిచే సాధనమని అభిప్రాయపడ్డారు. దీని పేరులో గాంధీ అనే పదాన్ని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం పెద్ద తప్పిదం చేసిందని దుయ్యబట్టారు. పేరు మార్పుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉపవాస దీక్షలు చేపట్టడంతోపాటు జనవరి 31 నుంచి ఫివ్రబరి 6వ తేదీ వరకు పంచాయతీ స్థాయిలో శాంతియుత ప్రదర్శనలను నిర్వహించి, తమ నిరసన తెలియజేస్తామన్నారు. అదేవిధంగా రైతు సమస్యలను ఎత్తిచూపడంతోపాటు విద్యుత్ బిల్లులపై వినియోగదారులుపడుతున్న పాట్లు తదితర సమస్యలకు సంబంధించి తాము ప్రజాపోరాటం చేస్తామని ప్రకటించారు. రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ దుర్గాప్రసాద్ పండా, డీసీసీ సాధారణ కార్యదర్శి శంకర్షన్ మంగరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
కాయాకల్ప్ అసెస్మెంట్ బృందం పర్యటన
రాయగడ: రాష్ట్ర కాయాకల్ప్ అసెస్మెంట్ బృందం శుక్రవారం జిల్లాలొని బిసంకటక్లో పర్యటించింది. ఆ బృందంలో రాష్ట్ర ఆరోగ్య శాఖకు చెందిన డాక్టర్ సురహ్జీత్ రావు, డాక్టర్ బసంత కుమార్ సాహు, డాక్టర్ ప్రశాంత్ కుమార్ సావత్తో కూడిన ఈ బృందం బిసంకటక్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. వివిధ విభాగాల రికార్డులను పరిశీలించింది. అనంతరం ఆరోగ్య కేంద్రంలోని రామయ కేంద్రాన్ని సందర్శించిన బృందం రోగులకు మందులు సకాలంలో అందుతున్నాయా లేదా అనే విషయంపై ఆరా తీశారు. అలాగే ఆరోగ్యకేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉండాలని సూచించింది. అనంతరం ప్రసూతి విభాగాన్ని సందర్శించిన బృందం అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాయాకల్ప్ బృందం పర్యటనలో ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ హరిహర్ బలదేవ్, డాక్టర్ సుమిత్ స్నేహశీస్ నాయక్, డాక్టర్ జీవన్ జ్యోతి ఉన్నారు. తాబేళ్ల అక్రమ రవాణాకు అడ్డుకట్ట కొరాపుట్: తాబేళ్ల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. శనివారం నబరంగ్పూర్ జిల్లా డాబుగాం వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో 83 తాబేళ్లు పట్టుబడ్డాయి. డాబుగాం పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టిగుడ గ్రామానికి చెందిన పట్టాడ సర్కార్, రామ్ పల్లాన్ సర్కార్ వీటిని ఒక బైక్ మీద తీసుకొని వెళ్తుండగా దొరికారు. వీటిని కలహండి జిల్లాలో అమ్మకానికి తీసుకొని వెళ్తున్నట్లు పోలీసుల ముందు అంగీకరించారు. డాబుగాం ఫారెస్ట్ అధికారి రాం చంద్ర బోత్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను నబరంగ్పూర్ జిల్లా కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. పట్టుబడిన తాబేళ్లని ఇంద్రావతి రిజర్వాయర్ లో విడిచి పెడతామని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. నేల బావిలో పడి ఎలుగు బంటి మృతి కొరాపుట్: నేల బావిలో పడి ఎలుగు బంటి మృతి చెందింది. శనివారం నబరంగ్పూర్ జిల్లా నందాహండి సమితి దోహన గ్రామ పంచాయతీ స్కూల్ వెనుక పాడు బడిన బావిలో ఎలుగు కళేబరాన్ని గిరిజనులు గుర్తించారు. ముందు రోజు రాత్రి ప్రహరీ లేని బావిలో ఎలుగు పడిపోయింది. బావి నుంచి బయట పడేందుకు మార్గం లేక పోయింది. రాత్రంతా విపరీతమైన చలి వల్ల ఎలుగు చనిపోయింది. అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని కళేబరం వెలికి తీశారు. పోస్టు మార్టం నిర్వహించి ఖననం చేశారు. గణతంత్ర వేడుకలపై సమీక్ష మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 26న నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవం ఏర్పాట్లపై అధికారులు శనివారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్ సోమేశ్ కుమార్ ఉపాధ్యాయ్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ వేధ్బర్ ప్రధాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభాత్ ఫెర్రీ విగ్రహలకు నివాళులర్పించడం, ప్రధాన అతిథి చేతరులమీదుగా జాతీయ పతాకావిష్కరణతో పాటు పరేడ్ నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనపై చర్చించారు. అలానే జిల్లా ఆస్పత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ చంద్రసభరో, డీఐపీఆర్ ఒ.ప్రమిళ మాఝి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అంపశయ్యపై ఆశల దీపం
● అరుదైన మెనింజైటీస్తో బాధపడుతున్న విద్యార్థిని ● దాతల సాయం కోసం కుటుంబ సభ్యుల వేడుకోలు రాయగడ: అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి.. ఆస్పత్రిలో అచేతన స్థితిలో పడి ఉంది. సుమారు 15 రోజుల క్రితం వచ్చిన జ్వరం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధిస్తానని చెప్పిన విద్యార్థిని మృత్యువుతో పోరాడుతుంది. తల్లిదండ్రులు తమ కుమార్తెను కాపాడుకోవడానికి దాతలు కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్.హేమలత, బాబురావు దంపతులు సదరు సమితి జేకేపూర్లోని బీసీ రోడ్డు వద్ద నివాసముంటున్నారు. వీరి కుమార్తె తేజస్విని ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఎంతో సాఫీగా సాగుతున్న వారి జీవితంలోకి సుమారు 15 రోజుల క్రితం పిడుగులాంటి కష్టం వచ్చింది. విద్యార్థిని జ్వరంతో బాధపడుతూ కోమాలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించగా అరుదైన మెనింజైటీస్ వ్యాధిగా నిర్ధారణ అయ్యింది. దీంతో విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థిని చికిత్స కోసం సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కూలి చేస్తేగానీ కడుపు నింపుకోలేనివారు అంత డబ్బు సమకూర్చలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. దాతలు దయచూపి తమ కుమార్తె వైద్యానికి సాయం చేయాలని వేడుకుంటున్నారు. సాయం చేసేవారు 95333 41833 నంబర్ను సంప్రదించాలని కోరుతున్నారు. -
నేల కూలిన వన్ చార్టర్
భువనేశ్వర్: భువనేశ్వర్ నుంచి రూర్కెలాకు వెళ్తున్న ఇండియా వన్ ఎయిర్ ఫ్లైట్ శనివారం ప్రమాదానికి గురైంది. రూర్కెలా జల్దా సమీపంలో గమ్య స్థానానికి 8 నాటికల్ మైళ్ల దూరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గురైన 9 సీట్ల బుల్లి విమానంలో 2 మంది పైలట్లు, 4 మంది ప్రయాణికులు మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రాణాలతో బతికి బయటపడ్డారని అధికారులు నిర్ధారించారు. వీపీ కేఎస్ఎస్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన కారవాన్ 208 విమానం మధ్యాహ్నం 12.27 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరింది. సాంకేతిక కారణాల వల్ల పైలట్లు బలవంతంగా ల్యాండింగ్ చేశారు. సిబ్బంది సమయ స్ఫూర్తి విమానంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటానికి సహాయపడిందని అధికారులు వివరించారు. విమాన దుర్ఘటన సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పైలెట్లు, ప్రయాణికులను రూర్కెలాలోని వైద్య సదుపాయాలకు తరలించారు. అంతకు ముందుగా స్థానిక గ్రామస్తులు చొరవ కల్పించుకుని బాధితులకు చేయూతనిచ్చి మానవీయత చాటుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది సకాలంలో రంగంలోకి దిగి విమానంలో మంటలు చెలరేగకుండా సత్వర చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ముగ్గురు ప్రయాణికులు జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఇద్దరు పైలెట్లు, ఒక ప్రయాణికుడు రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రి (ఆర్జీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారందరూ వైద్య పరిశీలనలో ఉన్నారని, ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు ధ్రువీకరించారు. ఈ ల్యాండింగ్ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అధికారులు అంచనా పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి నివేదించారు. ఈ బృందం తక్షణమే ఘటనా స్థలం సందర్శిస్తుంది. విమానయాన నిబంధనల ప్రకారం తదుపరి దర్యాప్తు కోసం ఎయిర్లైన్ డీజీసీఏ, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)కి వివరణాత్మక నివేదికను సమర్పిస్తుంది. ఈ బృందం ఆదివారం ఉదయం సరికి ఘటనా స్థలం చేరుతుంది. ఘోర ప్రమాదం తప్పింది: మంత్రి రూర్కెలాలో విమానం కూలిపోవడంతో ఆరుగురు గాయపడ్డారు. వారందరి పరిస్థితి స్థిమితంగా కొనసాగుతుంది. భగవంతుని దయ వల్ల ఘోర ప్రమాదం తప్పిందని రాష్ట్ర వాణిజ్య, రవాణా విభాగం మంత్రి బిభూతి భూషణ్ జెనా తెలిపారు. రూర్కెలా రఘునాథ్పల్లి జల్దా ఎ బ్లాక్లో జరిగిన చార్టర్ విమానం కూలిపోవడంతో ఆరుగురు గాయపడ్డారని రవాణా మంత్రి తెలిపారు. విమానంలో నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులలో సుశాంత్ కుమార్ బిస్వాల్, అనితా సాహు, సునీల్ అగర్వాల్, సబితా అగర్వాల్ ఉన్నారు. గాయపడిన 2 మంది సిబ్బందిలో కెప్టెన్ నవీన్ కడంగా, కెప్టెన్ తరుణ్ శ్రీవాస్తవ ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. భువనేశ్వర్ నుంచి రూర్కెలాకు వెళ్తున్న ఈ విమానం 9 సీట్ల విమానం ఏ పరిస్థితులలో కూలిపోయిందో స్పష్టంగా తెలియదు. ఇది క్రాష్ ల్యాండింగ్ కాదు. ఫోర్స్ ల్యాండింగ్ అని స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ తెలిపారు. ఇంజిన్లో లోపంతో అనివార్య ల్యాండింగ్ జరిగి ఉండవచ్చన్నారు. చార్టర్ విమానం ల్యాండింగ్కు 15 నిమిషాల ముందు ఫోర్స్ ల్యాండింగ్ చేసింది. 9 మంది ప్రయాణించే విమానం భువనేశ్వర్ నుంచి రూర్కెలాకు వెళుతోంది. ఏ పరిస్థితుల్లో అది కూలిపోయిందో స్పష్టంగా తెలియదు. డీజీసీఏ బృందం సాయంత్రం సరికి చేరుకుంటుంది. ఆదివారం నాటికి ఏఏఐబీ బృందం రూర్కెలాకు చేరుకుంటుందని సమాచారం. సమన్వయం కోసం భువనేశ్వర్ పౌర విమానయాన డైరెక్టరేటు నుంచి ఇద్దరు ఉద్యోగులు ఘటనా స్థలానికి వెళ్లారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ సంఘటనను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మొబైల్ నంబర్ 9861096371, 0674– 2596371 కు కంట్రోల్ రూమ్ సిస్టమ్ జారీ చేయబడింది. ముఖ్యమంత్రి విచారం రూర్కెలా విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. భగవంతుని దయవల్ల ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారనే వార్త ధైర్యాన్నిస్తోంది. గాయపడిన వారికి ఉత్తమ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అందరూ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్నాథుని వేడుకున్నట్లు తెలిపారు. -
ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు
రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని జెమ్స్ విద్యాసంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం పిల్లల మధ్య విశేష వేషధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లెటూరి వస్త్రాధారణతో పాటు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ దుస్తుల్లో పిల్లలు సందడి చేశారు. హరిదాసు వేషధారణ ఆకట్టుకుంది. జెమ్స్ విద్యాసంస్థ ప్రాంగణంలో భోగి మంటలను వేసి పిల్లలు ఆనందంగా గడిపారు. ముందుగానే పండగ వాతావరణాన్ని సృష్టించారు. మహిళలు పిండి వంటలను తయారు చేసి ప్రదర్శించారు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతిని తలపించే విధంగా ఆనందంగా అంతా గడిపారు. సంక్రాంతి పండుగ రోజు వరకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని విద్యాసంస్థ ప్రిన్సిపాల్ పతివాడ వనిత, చైర్మన్ తుబాటి రాములు తెలియజేశారు. మహిళల మధ్య సమైఖ్యత భావం ఏర్పడటంతో పాటు పిల్లల్లో మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. -
మేకలు, గొర్రెలు, కోళ్లకు గిరాకీ
పర్లాకిమిడి: సంక్రాంతి సమీపిస్తుండంతో సంతలో మేకలు, గొర్రెలు, కోళ్లకు గిరాకీ ఏర్పడింది. పర్లాకిమిడిలోని శనివారం వారపు సంతలో లక్షలాది రూపాయల లావేదేవీలు జరిగాయి. కుండలు, రైతులు ధాన్యరాసులు నిల్వ ఉంచేందుకు వివిధ బుట్టలు, గాదెలు, వనరాజా కోళ్లు, కాయగూరలు, మేకలు, గొర్రెలు అధిక రేట్లకు అమ్ముడుపోయాయి. అన్నింటికంటే కనుమ జరుపుకునే మాంసాహారం విందువినోదాలకు కోడి పుంజులు ఒక్కొక్కటి రూ.1200 పలికాయి. కోడి పెట్టలు జత వెయ్యి రూపాయలు పలికాయి. మేకలు, గొర్రెలు ఉదయం పది గంటలకే బేరాలు కుదిరి అమ్మకాలు జరిగిపోయాయి. -
ఏకామ్ర కాన గుభాళింపు
భువనేశ్వర్: ఏటా శీతాకాలంలో నిర్వహించే వార్షిక పుష్ప ప్రదర్శన–2026తో ఏకామ్ర కానన్గుభాళిస్తోంది. ప్రాంతీయ మొక్కల వనరుల కేంద్రం (ఆర్.పి.ఆర్.సి.) బొటానికల్ గార్డెన్లో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను రాష్ట్ర అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పువిభాగం మంత్రి గణేష్ రామ్ సింగ్ ఖుంటియా ప్రారంభించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు విభాగం, ఆర్పీఆర్సీ, మొక్కల ప్రేమికుల సంఘం సహకారంతో నిర్వహించిన ఈ 37వ పుష్ప ప్రదర్శన ప్రకృతి, సంప్రదాయం, పూల ఉత్సవం నినాదంతో నిర్వహించారు. ఈ ప్రదర్శన ఈ నెల 11వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 వరకు ప్రజలకు తెరిచి ఉంటుంది. ఈ పుష్ప ప్రదర్శనలో స్థానిక, అన్యదేశ రకాల గులాబీలు, గ్లాడియోలస్, గెర్బెరా, పెటునియాస్, లిల్లీస్, ఆర్చిడ్లు, శీతాకాలపు కాలానుగుణ పువ్వుల ఆకర్షణీయమైన ప్రదర్శన ఆహ్లాదపరుస్తుంది. సహజ ఇతివృత్తాల ఆధారంగా పూల అలంకరణలు, పూల కళాకృతులు, పువ్వుల ద్వారా ఒడియా సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించడం ఈ ప్రదర్శన ప్రధాన ఆకర్షణ. ఈ ప్రసిద్ధ పుష్ప ప్రదర్శనలో రంగురంగుల పుష్పాలు, వివిధ రకాల కళాత్మక ప్రదర్శనలు నగరవాసులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూలతో అలంకరించిన ప్రవేశ ద్వారం, సహజ సౌందర్యం తనను మంత్రముగ్ధులను చేశాయన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుందని అన్నారు. అత్యాధునిక టిష్యూ కల్చర్ ప్రయోగశాల ద్వారా అరటి, ఆర్చిడ్, వివిధ పుష్పించే మొక్కలను పెద్ద సంఖ్యలో ప్రచారం చేయడం రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ రంగానికి ఎంతో సహాయపడుతుందన్నారు. ఏకామ్ర నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భాస్కర్ జ్యోతి శర్మ, పీసీసీఎఫ్ సురేష్ పంథ్ మరియు ఆర్.పి.ఆర్.సి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుధాంషు శేఖర్ ఖోరా గౌరవ అతిథులుగా హాజరయ్యారు. మొక్కల పరిశోధనకు ఒప్పందం ఈ సందర్భంగా మొక్కల పరిశోధన రంగంలో మరింత అభివృద్ధి కోసం ప్రాంతీయ మొక్కల వనరుల కేంద్రం (ఆర్.పి.ఆర్.సి.) సిక్కింలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్కిడ్స్ (ఎన్ఆర్సీఓ), లక్నోలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్బీఆర్ఐ) మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్ అండ్ మెటీరియల్ టెక్నాలజీ (ఐఐఎంటీటీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
పర్లాకిమిడి చేరిన ‘స్వర్ణ ధనుష్ యాత్ర’
పర్లాకిమిడి: అయోధ్యలోని శ్రీబాలరామునికి అలంకరించడానికి తయారు చేసిన స్వర్ణ ధనుష్ను రూపొందించారు. దీన్ని రూర్కెలా నుంచి సంబల్పూర్, భౌధ్, బరఘడ్, నువాపడ, నవరంగ్పూర్, కోరాపుట్ మీదుగా పర్లాకిమిడికి ప్రత్యేక రథంలో శనివారం తీసుకొచ్చారు. దీనిని సరస్వతీ శిశు మందిర్ నుంచి పట్టణంలో జైత్ర యాత్ర చేసి బరంపురం వైపు వెళ్లిపోయింది. ఈ యాత్రలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు కై లాస్ చంద్ర పట్నాయక్, లోకనాథ మిశ్రా, భజరంగ్ దళ్ నాయకులు మనోజ్ దాస్ తదితరులు మోటారు సైకిళ్ల ర్యాలీలో పాల్గొన్నారు. రాయగడలో స్వర్ణ ధనుస్సు రథం రాయగడ: అయోధ్యలో ప్రతిష్టించిన బాలరాముడి స్వర్ణ ధనుస్సు శనివారం రాత్రి రాయగడకు చేరుకుంది. స్థానిక సిరిగుడ కూడలి నుంచి శ్రీరామ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రథానికి మంగళహారతులు సమర్పించి ఘనంగా స్వాగతం పలికారు. ధనుస్సుతో గల రథాన్ని తాకేందుకు భక్తులు పోటీపడ్డారు. అయితే ఒకొక్కరికీ అవకాశం కల్పించారు. ఎంతో భాగ్యం చేసుకోవడంతోనే బాలరాముడి స్వర్ణ ధనుస్సు తాకే ఆవకాశం లభించిందని భక్తి పారవశ్యంతో భక్తులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో భజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కపిలాస్ కూడలి మీదుగా పూరీకి రథం పయనమయ్యింది. మల్కన్గిరిలో.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా శ్రీరామ స్వర్ణ ధనుస్సు రథం వచ్చింది. స్థానిక హన్మాన్ విగ్రహం వద్ద రథానికి భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. రౌర్కెలా నుంచి పలు జిల్లాలు దాటుతూ మల్కన్గిరి మీదగా భద్రచలం వెళ్లి అక్కడ నుంచి అయోధ్యకు రథం చేరుకుంటుంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
పీఎంశ్రీ ఉత్సవాలు ప్రారంభం
పర్లాకిమిడి: మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత చదువులే లక్ష్యంగా ముందుకు అడుగులు వేయాలని, మీకు బాసటగా ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ కూడా సహకారం అందిస్తుందని మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో అన్నారు. గుసాని సమితి హాత్తిబడి వద్ద 500 సీట్ల పోస్టు మెట్రిక్ మైనార్టీ హోస్టల్లో పి.ఎం.శ్రీ ఉత్సవాలను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ప్రారంభించారు. జిల్లా పరిషత్తు అదనపు కార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, జిల్లా పరిశ్రమల శాఖ, జనరల్ మ్యానేజరు సునారాం సింగ్, డీఈఓ డాక్టర్ మయాధార్ సాహు, ఒడిషా విద్యాలయాల పాఠ్యాంశాల సంస్కరణకర్త అధ్యక్షులు నిత్యాంద ప్రదాన్, జిల్లా ఎంప్లాయిమెంట్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి సౌభాగ్య స్మృతిరంజన్ త్రిపాఠి, సమగ్ర గిరిజనాభివృద్ధి శాఖ అధికారి అంశుమాన్ మహాపాత్రో, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సల్మాన్ రైకా, అదనపు డీఈఓ ఎస్.గిరిధర్ పాల్గొన్నారు. -
ప్రపుల్ల పండాకు జాతీయ స్థాయి అవార్డు ప్రదానం
పర్లాకిమిడి: సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ స్కూల్ డీన్, ప్రొఫెసర్ ప్రపుల్ల పండాకు జాతీయ స్థాయి ‘స్పూర్తిదాయక పౌర పురస్కారం’ను భువనేశ్వర్లోని ప్రెస్ క్లబ్లో అధికారులు అందజేశారు. ప్రపుల్ల పండా భువనేశ్వర్లో జరిగిన ‘రీషేపింగ్ గ్రీనర్ ఫ్యూచర్’ జాతీయ స్థాయి సెమినార్లో రిమోట్ సర్విసింగ్, జియె గ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జి.ఐ.ఎస్.), ప్రకృతి విపత్తులపై పేపర్ ప్రెజెంటేషన్కు ఈ అవార్డు లభించింది. జి.ఐ.ఎస్పై చేసిన పరిశోధనకు ప్రపుల్ల పండాకు అవార్డు లభించడం పట్ల సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు, రిజిస్ట్రార్ అనితా పాత్రో, డైరెక్టర్ దుర్గాప్రసాద్ పాడీ, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాస్థాయి చోళ్ల మండీ ప్రారంభం జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి హటపొడ లో మండియ(చోళ్లు అమ్మే కేంద్రం) మండీని కొరాపుట్ కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహజన్ శనివారం ప్రారంభించారు. ఒడిశా కృషి, కృషక పరిచాలన విభాగం ద్వారా నియమించిన సబుజిమా ఉత్పాధన కంపెనీ ద్వారా ఏర్పాటు చేసిన మండియ కొనుగోలు కేంద్రం మండీ ప్రారంభ కార్యక్రమానికి సబుజిమా ఉత్పాదన కంపెనీ అధ్యక్షుడు మొణీ మఝీ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కొరాపుట్ కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్ రబ్బర్ కట్ చేసి మండీని ప్రారంభించారు. గౌరవ అతిథులుగా బొయిపరిగుడ సమితి అధ్యక్షుడు ప్రశాంత కుమార గుప్త, ఉపాధ్యక్షురాలు పూర్ణియ బారిక్, బీడీఓ సుబ్రత సాహు, జిల్లా పరిషత్ సభ్యులు మణీ జానీ, నవరంగపూర్ నాయకుడు నరేంధ్ర కందలియ, కొట్పాడ్ ఎం.ఎల్.ఎసి.హెచ్.ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు. మహిళ మెడలో మంగళసూత్రం చోరీ రాయగడ: మహిళపై దాడి చేసి ఆమె మెడలోని మంగళసూత్రాన్ని గుర్తుతెలియని దుండగులు తష్కరించిన ఘటన స్థానిక రైల్వే కాలనీలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. రైల్వే విభాగంలో ఎలక్ట్రికల్ టెక్నిషియన్గా ఆర్.నాగమణి పనిచేస్తోంది. తెల్లవారి జామున మూత్ర విసర్జనకు వాస్ రూమ్కు వెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఆమైపె దాడి చేసి తులంనర బంగారు మంగళసూత్రాన్ని తస్కరించారు. ఆమె కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు లేచి వచ్చేసరికి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన నాగమణిని కాలనీ వాసులు సమీపంలో గల రైల్వే ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే, సదరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దుండగుల ఆచూకీ గురించి ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రాయగడ డీఆర్ఎం అమితాబ్ సింఘల్ బాధితురాలి క్వార్టర్కు చేరుకుని వివరాలు సేకరించి పరామర్శించారు. -
అందరూ చదువుకోవాలి
రాయగడ: విజన్–2036 కలలు సాకారం చేయాలంటే ప్రతీఒక్కరూ చదువుకోవాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ఎస్ఐవోఎస్ (స్టేట్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ స్కూలీంగ్) అవగాహన, మాస్ ప్రవేశాలు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యతోనే వికాసం సాధ్యమన్నారు. అందువల్ల ప్రతీ ఒక్కరూ చదువుకోవాలని హితవు పలికారు. చదువు మధ్యలో ఆపేసి పనులు చేసుకుంటున్న చిన్నారులకు ప్రతీ శని, ఆదివారాల్లో ఉచితంగా చదువు చెప్పి పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఈ అవకాశం కల్పిస్తుందన్నారు. 2036లొ రాష్ట్ర శతజయంతి నాటికి వికసిత్ ఒడిశా కలలు సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెడుతుందని అన్నారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిమిత ప్రధాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి, పితామహాల్లోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాఢి, స్థానిక అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ సరస్వతి రాయ్ పాల్గొన్నారు. అనంతరం చదువుకునేందుకు ఆసక్తి కనబరిచిన వారి వివరాలను సేకరించి వారికి ఈ సందర్భంగా పుస్తకాలు, గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఓపెన్ స్కూల్లో చేరిన వారికి స్వాగతం పలికారు. -
ఉత్సాహంగా సైన్స్ కళాశాల వార్షికోత్సవం
పర్లాకిమిడి: గుమ్మ బ్లాక్ పర్సంబ గ్రామంలోని బినోదినీ ప్లస్టు సైన్సు కళాశాలలో శనివారం మధ్యాహ్నం 28వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఇతర అతిథులుగా గుమ్మ సమితి అధ్యక్షురాలు సునేమీ మండళ్, సబ్ కలెక్టర్, కళాశాల అధ్యక్షులు అనుప్ పండా, ఉపాధ్యక్షులు ఎస్.శ్రీనివాసరావు, జీబ పంచాయతీ సర్పంచ్ ఎడంగా శోబోరో తదితరులు విచ్చేశారు. గిరిజన ప్రాంతంలోని విద్యార్థులకు అందుబాటులో ఉండే ఈ ప్లస్ టు కళాశాలలో విద్యార్థులకు ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హామీ ఇచ్చారు. అనంతరం సీని గాయనీ డాక్టర్ అనురాధా పాణిగ్రాహి తన గాత్రంతో విద్యార్థులకు తన్మయపరిచింది. క్రికెట్, ఇతర ఆథ్లెటిక్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్యఅతిథి రూపేష్పాణిగ్రాహి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కళాశాల అధ్యాపకులు రవీంద్ర పాణిగ్రాహి అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. భువనేశ్వర్: స్థానిక కళింగ స్టూడియో స్క్వేర్ వద్ద శనివారం ఉదయం అమొ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులతో వెళుతుండగా బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సంఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదని సమాచారం. సంఘటనా స్థలానికి తక్షణమే చేరుకున్న భరత్పూర్ ఠాణా పోలీసులు ప్రయాణికులందరినీ రక్షించారు. అగ్ని మాపక సిబ్బంది సకాలంలో మంటలను నివారించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పర్లాకిమిడి: గుసాని సమితిలో శనివారం మహేంద్రతనయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గజపతి ఉత్సవాలు సందర్భంగా.. సమితి స్థాయిలో ఉత్సవాల ముగింపు సందర్భంగా ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్తు అదనపు ఈఓ పృథ్వీరాజ్ మండల్ విచ్చేశారు. గుసాని సమితి చైర్మన్ నాగులపల్లి వీర్రాజు, వైస్ చైర్మన్ ఎస్.అనసూయాదేవి, తదితరులు పాల్గొన్నారు. కళాకారులకుబహుమతులు అందజేశారు. -
అపార్ట్మెంట్ పూర్తయ్యేది ఎప్పుడు?
భువనేశ్వర్: ఖుర్దా రోడ్ రైల్వే మండలంలో రైల్వే ఉద్యోగుల వసతి కోసం ప్రారంభించిన క్వార్టర్ల సముదాయం (అపార్ట్మెంట్) నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు. గత ఐదేళ్లుగా ఈ పనులు స్తంభించిపోయాయి. ఉద్యోగుల ప్రాథమిక సౌకర్యాల కోసం తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ శాఖా కార్యదర్శి లక్ష్మీ ధర్ మహంతి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఈ ప్రాంతం సందర్శించి బాగోగులు పర్యవేక్షించింది. అపార్టుమెంట్ల నిర్మాణం నిలిపి వేయడంతో సంఘ విద్రోహక శక్తుల అడ్డాగా మారి పరిసరాల్లో నివాసితులకు ఇబ్బందికరంగా తయారయ్యాయి. మరోవైపు లక్షలాది రూపాయల వ్యయం నిర్వీర్యం కావడంతో రైల్వే ఉద్యోగులకు క్వార్టర్ సదుపాయం కొరవడుతోందని సిబ్బంది వర్గం ఆరోపించింది. ఖుర్దా రోడ్ స్టేషన్ 5వ నంబర్ ప్లాట్ఫామ్ దక్షిణ దిశలో మురుగు కాలువ వ్యవస్థ దెబ్బతింది. 200 మీటర్ల పొడవున మురుగునీరు ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి, రైలు పట్టాల మధ్య బురద పేరుకుపోతుంది. విధుల నిర్వహణలో సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. ఆరోగ్య అధికారిని నిలదీయడంతో ప్రభావిత ప్రాంతం ప్రత్యక్షంగా పరిశీలించారు. మురుగు కాలువ లోపలి నుంచి ఇంజిన్లోకి ఆయిల్ పోయడానికి ఉద్దేశించిన డీజిల్ పైపు ఏర్పాటు చేయడంతో మురుగు నీరు బయటకు వెళ్లడం లేదని గుర్తించారు. కాలువ లోపలి పైపులను తొలగించడం శాశ్వత పరిష్కారంగా అధికారి పేర్కొన్నారు. అపార్ట్మెంట్లు నిర్మాణం పూర్తి, డీజిల్ పైపులను వెంటనే తొలగించేందుకు రైల్వే ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేయడం జరుగుతుందని లక్ష్మీ ధర్ మహంతి తెలిపారు. -
స్మార్ట్ పోలీసింగ్తో కేసులు ఛేదించాలి
శ్రీకాకుళం క్రైమ్ : కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత స్మార్ట్ పోలీసింగ్ ఎంతో కీలకమని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక అప్లికేషన్ల వినియోగం, కేసుల పురోగతి, ఆన్లైన్ పోర్టల్స్లో సమాచారం నమోదు విధి విధానాలను వివరించారు. నాట్గ్రిడ్ ద్వారా డేటా విశ్లేషణ, సీసీటీఎన్ఎస్లో ఎఫ్ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు సమాచారాన్ని సకాలంలో నమోదదు చేసి, క్రైమ్ మాక్ ద్వారా అంతరజిల్లా – రాష్ట్ర నేరగాళ్ల గుర్తింపు, ఈ–సాక్ష్య ద్వారా డిజిటల్ ఆధారాలు భద్రపరిచే విధానం తప్పనిసరిగా అమలుచేయాలన్నారు. సమన్లను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా పంపి ఖర్చు ఆదా చేయడంతో పాటు పారదర్శకత పెంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 కాల్స్కు తక్షణంగా స్పందించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు కె.వి.రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, షేక్ షాహబాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
‘పథకాలను వినియోగించుకోవాలి’
పర్లాకిమిడి: ముఖ్యమంత్రి కృషి ఉద్యోగ యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ అన్నారు. కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ప్రాంతీయ స్థాయి వ్యవసాయ యంత్రాల మేళాలో పాల్గొన్నారు. నాల్గో రోజు సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతి రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎం.ప్రకాశ రావు, జిల్లా పరిషత్ అదనపు ఈఓ పృథ్వీరాజ్ మండల్, గుసాని జోన్ 6 జెడ్పీటీసీ ఎస్.బాలరాజు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నామని, వారికి వ్యవసాయ పరికరాలు, యంత్రాల కొనుగోళ్లకు 50 శాతం సబ్సిడీ కోనుగోలు చేసినప్పుడే ఈ ఏడు అందిస్తున్నామని కలెక్టర్ అగర్వాల్ అన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుంటేనే రైతులు అభివృద్ధి చెందుతారని జెడ్పీ అధ్యక్షుడు గవర తిరుపతి రావు అన్నారు. ఖరీఫ్ ధాన్యం అమ్మకాలలో మండీల వద్ద అధికారులు అందజేస్తున్న టోకెన్లలో తక్కువ చేసి ఎందుకు ఇస్తున్నారని తిరుపతి రావు అన్నారు. గుసాని సమితిలో రబీ పంటకు సాగునీరు అందడం లేదు. అందువల్ల మహేంద్రతనయ నది నుంచి సాగునీటిని కాలువల ద్వారా అందించాలని మైనర్ ఇరిగేషన్ అధికారులను కోరారు. ఈ సంధర్బంగా రాయగడ బ్లాక్ బొమ్మిక, కిష్టిపురం రైతులు ఉద్యాన వనాలలో మంచి ఫలితాలు సాధించడంతో వారికి కలెక్టర్ చేతుల మీదుగా వారికి ప్రోత్సాహకాలు అందజేశారు. -
ఎరువులు దుకాణాల తనిఖీ
జి.సిగడాం: రబీ సీజన్లో జిల్లావ్యాప్తంగా లక్షా 53 వేల ఎకరాల్లో మొక్కజొన్న, రాగి, వరి, ఇతర పంటలను సాగు చేస్తున్నారని, వీటి కావాల్సిన యూరి యా రైతులకు అందుబాటులో ఉంచామని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథస్వామి వెల్లడించారు. శుక్రవారం ఆనందపురం, పాలఖండ్యాం, జి.సిగడాం గ్రామాల్లో ఎరువుల షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 13,963 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందజేశామన్నా రు. ఖరీఫ్ సీజన్లో లక్ష్యానికి మించి వరి పంటలో దిగుబడులు సాధించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలులో దళారులు లేకుండా నేరుగా ప్రభుత్వ మే రైతు కొనుగోలు చేస్తుందన్నారు. ఈ–క్రాప్ నమోదు వచ్చే నెల 15లోగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈయనతోపాటు మండ ల వ్యవసాయాధికారి బెండి బాబ్జీ, రైతుసేవా కేంద్రం అసిస్టెంట్ ముంతా హరీష్, తూలుగు అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విస్తృతంగా ఎకై ్సజ్ దాడులు
రాయగడ: జిల్లా అబ్కారీ శాఖ సిబ్బంది గత రెండు రోజులుగా వివిధ ప్రాంతాల్లో దాడులను విసు్తృతంగా నిర్వహించారు. జేకేపూర్, రాయగడ, పిరుడి కాలనీ, కుంభికొట, బెజాప, ఖటగుంత, కళ్యాణసింగుపూర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 227 లీటర్ల నాటుసారా, 235 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 11 మందిపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. దాడుల్లో ఆరు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాయగడ అబ్కారీ శాఖ ఐఐసీ సత్యనారాయణ దాస్ ఆధ్వర్యంలో మోబైల్ బృందం దాడుల్లో పాల్గొన్నారు. -
‘వందేమాతరం’ సంబరం
రాయగడ: జాతీయ గీతం వందేమాతం దేశభక్తి గీతానికి 150 వసంతాలు పూర్తి కావడంతో జిల్లా యంత్రాంగం, ఒడిశా భాషాసంస్కృతి శాఖ సంయుక్తంగా శుక్రవారం పట్టణంలో పలు కార్యక్రమాలను నిర్వహించింది. రాయగడ బీడీవో సుజిత్ కుమార్ మిశ్రో, జిల్లా పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బసంత కుమార్ప్రధాన్, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చనా పట్నాయక్, అసిస్టెంట్ గ్రూప్ ఎడ్యూకేషన్ అధికారి విశాల్ సింగ్లు ఈ సందర్భంగా మహిళా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతీఒక్కరిలో జాతీయ భావం, దేశభక్తి నిండి ఉండాలని అన్నారు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా రూపొందిన జాతీయ గీతం వందేమాతరం ఆవిర్భవించి 150 వసంతాలు పూర్తికావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అందరిలో సమైఖ్యతా భావం నిండి దేశ ప్రగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాయగడ మున్సిపాలిటీ తదితర ప్రాంతాల్లో వందేమాతం సంబరాలను నిర్వహించారు. పాల్గొన్న విద్యార్థులకు వందేమాతరం గీతం ప్రాముఖ్యత, దాని విశిష్టత గురించి అవగాహన కల్పించారు. అలాగే పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వందేమాతరం గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ నెల 12 వ తేదీన జరగనున్న జాతీయ యువజనోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని పాఠశాలు, కళాశాలల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించనున్నట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. -
యువకుడి దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదల పోలీస్స్టేషన్ పరిధి బొడొనాగజరి గ్రామంలో బొడొనున్నా కరిమ్ (23) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి గ్రామానికి చెందిన బిసంబర్ కరిమ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బొడొనున్నా కరిమ్ తన సొంత పొంలంలో పనులు చేసేందుకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన బిసంబర్ పొలం వద్దకు వెళ్లి గొడ్డలితో బొడొనున్నాపై ఒక్కసారిగా దాడి చేశాడు. తీవ్రగాయాలకు గురైన బొడొనున్న సంఘటన స్థలం వద్దే మృతి చెందాడు. బొడొనున్నా, బిసంబరులు పెద్దనాన్న, చిన్నాన్నల పిల్లలు. వారి మధ్య కొన్నాళ్లుగా కుటుంబ గొడవలు జరుగుతున్నాయని, పాత కక్షలే హత్యకు కారణమని భావిస్తున్నారు. -
సచివాలయ ఉద్యోగులను ఒత్తిడికి గురిచేయొద్దు
ఆమదాలవలస : రకరకాల సర్వేల పేరుతో పూర్తిస్థాయి సమాచా రం, అవగాహన కల్పించకుండానే సచివాల య ఉద్యోగులను ఇ బ్బందులకు గురి చేయడం, మరోవైపు బీఎల్ఓ విధులను అప్పగించ డం తగదని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ, జీడబ్ల్యూఎస్ఈఎఫ్ సంఘం ఉత్తరాంధ్ర కన్వీనర్ కూన వెంకట సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆమదాలవలసలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సర్వే పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు చూపిస్తూ పలు రిపోర్టుల పేరుతో తీవ్ర పనిఒత్తిడి కల్పించడం అన్యాయమన్నారు. ఈ ఒత్తిడి కారణంగా డిసెంబర్లోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 మంది సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారి కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సచివాలయ ఉద్యోగుల పనితీరును తప్పుబట్టడం సమంజసం కాదన్నారు. ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావలసిన నోషనల్ ఇంక్రిమెంట్లు, స్పెషల్ ఇంక్రిమెంట్లు, కరు వు భత్యం, వేతన సవరణ కమిటీ ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ చానల్ కల్పించి, ఖాళీగా ఉన్న వివిధ ప్రభుత్వ విభాగాల్లో భర్తీ చేయాలని కోరారు. -
రాయగడలో సంక్రాంతి సంబరాలు
రాయగడ: రాయగడలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. స్థానిక రైతుల కాలనీలోని జెమ్స్ విద్యా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జెమ్స్ ప్రాంగణంలో మహిళల మధ్య ముగ్గుల పోటీలను నిర్వహించింది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో 45 మంది మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను తలపించే విధంగా అతివలు వేసిన రంగవల్లికలు అందరినీ ఆకర్షించాయి. ప్రతీ ఏడాది ఇటువంటి తరహా పోటీలను తమ విద్యా సంస్థ నిర్వహిస్తుందని డైరెక్టర్ తుబాటి రాము తెలిపారు. ఇదిలాఉండగా పోటీల్లొ పి.దీపిక ప్రథమ బహుమతిని గెలుచుకోగా ద్వితీయ బహుమతిని భాగ్య లక్ష్మీ దాస్, తృతీయ బహుమతిని సంతోషి గంతాయిత్లు గెలుచుకున్నారు. భాషాతీతంగా ఈ పోటీల్లొ ఒడియా మహిళలు కూడా పాల్గొనడం విశేషం. విజేతలకు బహుమతులను అందజేశారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా రజిత కొరాడ హాజరయ్యారు. జెమ్స్ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ పతివాడ వణిత పర్యవేక్షణలో పోటీలు జరిగాయి. ఆకట్టుకున్న రంగవల్లికలు -
నైపుణ్య యువతరం ఆవిష్కరణే లక్ష్యం
● ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి భువనేశ్వర్: రాష్ట్రంలో భారీ పారిశ్రామికీకరణ దిశలో ప్రభుత్వ కార్యాచరణ చురుకుగా ఊపందుకుంది. యువత ఏ రంగంలో నైపుణ్యం కలిగి ఉన్నా ఒడిశాలో ఉపాధిని పొందగలుగుతారు. అన్ని స్థాయిలలో నైపుణ్య యువతరం ఆవిష్కరణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. శుక్రవారం జరిగిన ఒడిశా నైపుణ్య పోటీ 2025–26 ముగింపు కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రతిభావంతులైన నైపుణ్యం కలిగిన విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.ఈ నైపుణ్య పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్యమంత్రి 54 బంగారు పతకాలు, 53 వెండి పతకాలు, 50 కాంస్య పతకాలను అందజేశారు. బంగారు పతకం విజేతలకు రూ. 25 వేల నగదు బహుమతి, వెండి పతకం విజేతలకు రూ. 20 వేలు, కాంస్య పతకం విజేతలకు రూ. 15 వేలు, ధృవపత్రాలు అందజేశారు.రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి మరియు ఆర్థిక పురోగతికి నైపుణ్యం చాలా అవసరం. ప్రజలను శక్తివంతం చేయ డమే ప్రధాన లక్ష్యం. యువతలో నైపుణ్యత వారి భవిష్యత్తు ప్రకాశవంతం చేస్తుందని ముఖ్యమంత్రి ప్రోత్సహించారు. 2036 నాటికి సుసంపన్న ఒడిశా మరియు 2047 నాటికి వికసిత భారత్ దార్శనికత సాకారం చేసేందుకు యువతరం నైపుణ్యత దోహ దపడుతంది. ఉజ్వల యువత ఒడిశా భవిష్యత్తుని ఉజ్వలం చేస్తుంది. పారిశ్రామికీకరణ లక్ష్య సాధనకు మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ప్రధాన సోపానాలుగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత 18 నెలల్లో రూ. 6.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. దీంతో 3 లక్షల 64 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం నిర్విరామంగా చేస్తోంది. ఐటీఐ స్కీమ్ ఆఫ్ ఎక్సలెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 47 ఐటీఐలను ఎక్సలెన్స్ కేంద్రాలుగా మార్చి మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు తాజా నైపుణ్యాల ద్వారా శిక్షణ అందించబడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. మరో వైపు కృత్రిమ మేధస్సు రంగంలో నైపుణ్యాల సాధనకు రాష్ట్రంలోని 9 ఐటీఐలలో ఏఐ ప్రయోగశాలను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. పరిశ్రమలు మరియు నైపుణ్యాభివృద్ధి విభాగం మంత్రి సంపద్ చంద్ర స్వంయి మాట్లాడుతూ ఒడిశా నైపుణ్య పోటీ కేవలం ఒక పోటీ మాత్రమే కాదు. నూతన ఒడిశా యొక్క సమిష్టి ఆకాంక్షలను ప్రదర్శించే వేదికగా పేర్కొన్నారు. ఈ పోటీ యువతరంలో ప్రతిభను గుర్తించి నైపుణ్యాన్ని ప్రోత్సహించింది. భారీ జాతీయ మరియు అంతర్జాతీయ అవకాశాలకు బలమైన సోపానంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, అభివృద్ధి కమిషనర్ దేవ్ రంజన్ కుమార్ సింగ్, పరిశ్రమలు మరియు నైపుణ్యాభివృద్ధి విభాగం కమిషనర్ భూపేంద్ర సింగ్ పుణియా ఈ కార్యక్రమంలో ప్రముఖంగా పాల్గొన్నారు. -
కాంప్లెక్స్కు పోటెత్తిన ప్రయాణికులు
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ శుక్రవారం ప్రయాణికులు పోటెత్తారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 10 నుంచి 18 వరకు పాఠశాలలకు, కళాశాలలకు సెల వులు ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాంప్లెక్స్కు చేరుకోవడంతో రద్దీమయంగా కనిపించింది. పండగ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వెళ్లేందుకు కాంప్లెక్స్కు చేరుకోవడంతో కాంప్లెక్స్ మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. ప్రయాణికుల రద్దీకి తగ్గ బస్సులు లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
● రోడ్డు భద్రతపై చైతన్యం
రాయగడ: ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ తమ గమ్యానికి సురక్షితంగా చేరుకోవాలని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం చైతన్య ర్యాలీ చేపట్టారు. వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు ర్యాలీలొ పాల్గొన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వల్ల చాలామంది ప్రమాదాలకు తమ నిండుప్రాణాలను బలిగొంటున్నారని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే అంతా చైతన్యవంతులై నియమ నిబంధనలను విధిగా పాటించాలని అన్నారు. స్థానిక సర్క్యూట్ హౌస్ నుంచి ప్రారంభమైన చైతన్య ర్యాలీ పురవీధుల మీదుగా గజపతి కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. ముందుగా కలెక్టర్ కులకర్ణి, ఏడీఎం నవీన్ చంద్ర నాయక్లు ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. -
త్వరలో సీఎం కన్యా వివాహ్ యోజన
● లబ్ధిదారులకు రూ. 51 వేలు కానుకభువనేశ్వర్: రాష్ట్రంలో త్వరలో ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన ప్రారంభం కానుంది. ఈ పథకం కింద వధువుకు పెళ్లి కానుకగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ పథకం కార్యాచరణ కోసం పెళ్లి కానుక సరంజామా సరఫరా కోసం ఉత్కలికి, మహిళా శిశు అభివృద్ధి శాఖ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన కింద వధువులకు చీరలు, పట్టీలు, పసుపు, కుంకుమ వంటి ఉపకరణాలు లభిస్తాయి. ప్రభుత్వం ఈ వస్తువులన్నింటినీ ఉత్కలిక ద్వారా లబ్ధిదారులకు అందజేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర హస్తకళల రంగానికి పరోక్షంగా చేయూతనిస్తుంది. ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన కింద ప్రభుత్వం సమగ్రంగా రూ. 51,000 సహాయం అందిస్తుంది. వర్గాలవారీగా ఈ సహాయం విడుదల చేస్తుంది. వివాహం నమోదు చేసుకున్న ఏడు రోజుల తర్వాత రూ. 35,000 నగదు వధువు ఖాతాకు బదిలీ చేస్తారు. సారె వంటి బహుమతులు, సామగ్రి కోసం కోసం రూ.10,000, రూ. 6,000 విలువైన పెళ్లి తంతు కోసం అవరసమైన ఉపకరణాలు ప్రభుత్వం అందజేస్తుంది. -
అన్నదాతల అవస్థలు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మిల్లర్ల సమస్యలతో ఇప్పటివరకూ ధాన్యం కోనుగోలు జరగటం లేదు. డిసెంబరు 30 నుంచి ప్రభుత్వ అధికారులు ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేస్తామని పర్లాకిమిడి ప్రాంతీయ మార్కెట్ కమిటీ (ఆర్.ఎం.సీ.) వద్ద మండీలు అట్టహాసంగా ప్రారంభించినా ఈ రోజు వరకూ ధాన్యం కోనుగోలు జరగలేదు. దీనిపై సబ్ కలెక్టర్, సివిల్ సప్లై అధికారి అనుప్ పండాను ఆర్ఎంసీ వద్ద ప్రశ్నించగా, ప్రభుత్వానికి, మిల్లర్లకు అగ్రిమెంట్ కుదరకపోవడంతో ఈ నెల 5 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు జరగలేదని, అయితే రాష్ట్ర ప్రభుత్వం, మిల్లర్లకు గురువారం అగ్రిమెంట్ కుదరటంతో జనవరి 8 నుంచి గుసాని, రాయగడ, కాశీనగర్లలో 50 కేంద్రాల్లో గురువారం నుంచి ప్రారంభమైనట్టు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అనుప్ పండా తెలియజేశారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 50 వేల క్వింటాళ్ల ధాన్యం కోనుగోళ్లకు లక్ష్యం చేసుకున్నట్టు సబ్ కలెక్టర్, ఇన్చార్జి సీఎస్ఓ అనుప్ పండా తెలియజేశారు. రైతుల వద్ద ధాన్యం కోనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు వారి అకౌంట్లలో జమ చేస్తారని అన్నారు. మరోవైపు తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి వస్తోంది. కానీ గుసాని, కాశీనగర్ రైతులు ధాన్యం అమ్ముకోలేక విచారం వ్యక్తం చేస్తున్నారు. -
భద్రక్ ప్రాంతంలో పాఠశాల వేళలు మార్పు
భువనేశ్వర్: రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో చలి గజగజలాడిస్తుంది. ఈ నేపథ్యంలో భద్రక్లోని ప్రభుత్వ పాఠశాల సమయాల్లో మార్పు చేశారు. జిల్లా యంత్రాంగం తాజా నిర్ణయం ప్రకారం నిత్యం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలు పని వేళలుగా ప్రకటించారు. శని వారం నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నాయి. తీవ్రమైన చలి, పొగమంచు కారణంగా జిల్లా యంత్రాంగం ఈ మేరకు నిర్ణయించింది. ఫిబ్రవరి నెల 2వ వారం వరకు నిరవధికంగా ఈ నిర్ణయం కొనసాగుతుంది. 1 నుంచి 10వ తరగతి వరకు పాఠశాల సమయాల్లో మార్పు వర్తిస్తుంది. రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవానికి సంబంధించి కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించా రు. జిల్లా పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరక్టర్ బసంత కుమార్ ప్రధాన్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వివరాల నివేదికను చది వి వినిపించారు. ఇదిలా ఉండగా స్థానిక ఫ్లై ఓవర్ బ్రిడ్జి మరమ్మతుల పనుల కారణంగా ఈసారి పాఠశాల, కళాశాలలకు చెందిన విద్యార్థులతో ర్యాలీ చేపట్టవద్దని కలెక్టర్ ఆదేశించారు. శ్రీకాకుళం రూరల్: బైరి ఇసుక ర్యాంపుపై శుక్రవారం రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. వంశధార నదిలో అనధికారికంగా సాగుతున్న ఇసుక రవాణాను అడ్డుకున్నారు. ర్యాంపు నడిచే ప్రాంతాల్లో ఎక్కడికక్కడ గట్లకు అడ్డుకట్ట వేస్తూ స్ట్రెంచ్ కొట్టించారు. సారవకోట : మండల కేంద్రం సారవకోటకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పారశెల్లి ధర్మేంద్రబాబు(53) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం ఆయన మృతదేహానికి పాత పట్నంలో పోస్టుమార్టం నిర్వహించగా స్థానిక యువకులు ద్విచక్ర వాహనాలతో గ్రామంలో ర్యాలీగా తీసుకొచ్చారు. కుర్ధాకు చెందిన 110 బెటాలియన్ బీఎస్ఎఫ్ సైనికులు ఎస్ఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ధర్మేంద్రబా బు డిసెంబర్ 28న సెలవుపై వచ్చారు. ప్రస్తు తం 18 బెటాలియన్ నార్త్ బెంగాల్లో విధులు నిర్వర్తించారు. ఈయనకు భార్య దేవి, కుమారుడు ఉన్నాడు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సతివాడ హిమశేఖర్కు అంబేద్కర్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ చైర్మన్ కొండ్రు జగదీశ్వరరావు రూ.20 వేలు ఆర్థిక సాయం శుక్రవారం అందజేశారు. శ్రీకాకుళం గూనపాలెంకు చెందిన హిమశేఖర్ ఈజిప్ట్ దేశం కై రో నగరం వేదికగా ఈ నెల 13 నుంచి 18 వరకు జరగనున్న పారా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్–2025–26 పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జగదీశ్వరరావు మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారుల కు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. దే శం తరఫున ప్రాతినిధ్యం వహించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంపిలి ప్రేమ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. వజ్రపుకొత్తూరు రూరల్ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే ఎల్సీ గేట్ను శుక్రవారం టాటామ్యాజిక్ వ్యాన్ ఢీకొట్టింది. గేటు విరిగిపోవడంతో సుమారు గంట సేపు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. గేట్ కీపర్ విషయాన్ని రైల్వే స్టేషన్ మేనేజర్ కుమార్దాస్కు తెలియజేయడంతో రైల్వే ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తాత్కాలిక గేటు ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్ పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడంతో వాహనాల రాకపోకలు కొనసాగాయి. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్పై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని రైల్వే పోలీసుస్టేషన్కు తరలించారు. పేకాట శిబిరంపై దాడి రణస్థలం: తెప్పలవలస పంచాయతీ సీతారాంపురం సమీపంలోని తోటల్లో పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఏడుగురిని అదుపులోనికి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వీరి వద్ద నుంచి ఏడు సెల్ఫోన్లు, రూ.1,95,960 నగదు స్వాధీ నం చేసుకున్నట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
గజపతి జిల్లా కలెక్టర్గా అక్షయ్ సునీల్ అగర్వాల్
పర్లాకిమిడి: గజపతి జిల్లా నూతన కలెక్టర్గా నియమితులైన అక్షయ సునీల్ అగర్వాల్ పర్లాకిమిడి కలెక్టరేట్లో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ హాల్లో ఉన్నతాధికారులతో సమావేశమై మాట్లాడారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతోపాటు విద్య, ఆరోగ్యం, రవాణా, మంచినీటిని ప్రజలకు సక్రమంగా అందించాలన్నారు. ప్రజా అభియోగాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, ఏడీఎం ఫుల్గునీ మఝి, డీఎఫ్వో కె.నాగరాజు, జిల్లా పరిషత్ ఆదనపు ఈవో పృద్వీరాజ్ మండల్ తదితరులు నూతన కలెక్టర్కు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ మహామ్మద్ ముబారక్ ఆలీ, అన్ని మండళాల బీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
సారా స్థావరాలపై దాడులు
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. పాతపట్నం, కొత్తూరు, మెళియాపుట్టి మండలాలకు ఆనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన సింగుపూర్, నేరేడిగూడ తదితర చోట్ల 560 లీటర్ల సారా, 7,200 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిల్(ఎన్డీపీఎల్) ఒక్కటి తీసుకొస్తున్నా అరెస్టు చేసి కేసు నమోదు చేస్తామన్నారు. సారా తయారీ, విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న పండగల దృష్ట్యా దాడులు విస్తృతం చేశామన్నారు. దాడుల్లో శ్రీకాకుళం అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, పి.మురళీ, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్లు రామచంద్ర కుమార్, గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్కుమార్ సాహూ, జిల్లా టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్, పాతపట్నం, కొత్తూరు, ఆమదాలవలస ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మహేంద్రగిరిపై చెత్త తొలగింపు
పర్లాకిమిడి: పవిత్ర మహేంద్రగిరి పర్యాటక కేంద్రంలో సెంచూరియన్ వర్సిటీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్లాస్టిక్, చెత్త తొలగింపు కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. 22 మంది వాలంటీర్లు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి శివరాం సాబత్, ఎన్ఎస్ఎస్ పీవో డా.బిష్ణు ప్రసాద్ దాస్, ఫారెస్టు గార్డులు కవితా రాణిదేవి, అటవీ సిబ్బంది చింతామణి శోబోరో, సత్యస్వరాజ్ మహంతి, రంకమణి బరియా, ఎకో డవలప్మెంట్ అధ్యక్షుడు సన్యాసీ భుయ్యాన్, ఎంగార్సాయి సర్పంచు కుమారి కార్జి తదితరులు పాల్గొన్నారు. కొండపై పర్యావరణ పరిరక్షణకు స్థానికులు పర్యాటకులకు చైతన్యం కల్పించాలని బిష్ణుప్రసాద్ దాస్ అన్నారు. కుంతీ మందిరం, బుర్ఖాత్పాస్ వరకు చెత్తను తొలగించి విద్యార్థులు శుభ్రం చేశారు. -
లోక్ భవన్లో అటల్ వన్
భువనేశ్వర్: భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు స్థానిక లోక్ భవన్ ప్రాంగణంలో కొత్తగా అభివృద్ధి చేసిన అటల్ వన్ పర్యావరణ పార్కును ప్రారంభించారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి దార్శనిక నాయకత్వం, దేశ నిర్మాణానికి ఆయన చేసిన శాశ్వత సేవలకు నివాళిగా ఈ పార్కుకు ఆయన పేరు పెట్టారు. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి, ఆయన సతీమణి జయశ్రీ కంభంపాటి, రాష్ట్ర శాసన సభ స్పీకర్ సురమా పాఢి, ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా, డిప్యూటీ స్పీకర్ భవాని శంకర్ భోయ్, ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. సుస్థిరతకు అధిక ప్రాధాన్యతనిస్తూ అభివద్ధి చేసిన అటల్ వన్లో అభివృద్ధి ప్రక్రియలో తవ్విన రాళ్లను ఉపయోగించి ల్యాండ్స్కేపింగ్ చేశారు. ఇందులో పచ్చని వక్ష సంపద, నీటి వనరులు, జలపాతాల వంటి నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ పార్కులోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి టీ–55 యుద్ధ ట్యాంక్. ఇది ఒకప్పుడు భారత సైన్యానికి వెన్నెముకగా నిలిచి 1971 యుద్ధంలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. మరో ముఖ్యమైన ఆకర్షణ భారత వైమానిక దళం మరియు భారత నౌకా దళం ప్రస్తుతం ఉపయోగిస్తున్న రఫేల్ బహుళ ప్రయోజన యుద్ధ విమానం నమూనా. భారత ప్రభుత్వ ‘వేస్ట్ టు వెల్త్’ మిషన్ కింద ఆటోమొబైల్ రద్దు, జీఐ షీట్లతో తయారు చేయబడిన ఈ నమూనా 15 అడుగుల పొడవు, 4 అడుగుల 6 అంగుళాల ఎత్తు మరియు 9 అడుగుల 11 అంగుళాల రెక్కల వెడల్పును కలిగి ఉంది. ్చలోక్ భవన్ అభ్యర్థన మేరకు భువనేశ్వర్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ బందం ఈ నమూనాను రూపొందించి తయారు చేసింది. పార్కును ప్రారంభించడం పట్ల అటల్ స్మతి న్యాస్ సొసైటీ అధ్యక్షుడైన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు వాజ్పేయిని తొలి సారి కలిశానని, ఆ తర్వాత వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని గుర్తు చేసుకున్నారు. వాజ్పేయి హయాంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలు గ్రామీణ అనుసంధానం రూపురేఖలు మార్చి ఆర్థిక వృద్ధిని బలోపేతం చేశాయన్నారు. రక్షణ ప్రదర్శనల గురించి ప్రస్తావిస్తూ, సైనిక శక్తిని ప్రదర్శించడం భారత దేశ శాంతి నిబద్ధతకు ప్రతీక అని తెలిపారు. అదే పురోగతి, అభివృద్ధికి పునాది అని వక్కాణించారు. గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి మాట్లాడుతూ వాజ్పేయి పదవీకాలం భారత దేశ అభివృద్ధిలో, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, అనుసంధానం, సుపరిపాలనలో పరివర్తన దశను గుర్తించిందని అన్నారు. స్వర్ణ చతుర్భుజి, సర్వ శిక్షా అభియాన్ మరియు పోఖ్రాన్ అణు పరీక్షలు వంటి చొరవలను ఆయన గుర్తుచేసుకున్నారు. వాజ్పేయిని పార్టీ శ్రేణులకు అతీతంగా గౌరవించే దార్శనిక రాజనీతిజ్ఞుడిగా అభివర్ణించారు. స్పీకర్ సురమా పాఢి సభలో ప్రసంగించారు. కార్యక్రమంలో రాఫెల్ నమూనాను రూపొందించిన, తయారు చేసిన బృందాన్ని సత్కరించారు. -
ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో జనాభా లెక్కింపు
భువనేశ్వర్: రాష్ట్రంలో తొలి దశ జనాభా లెక్కింపు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం అవుతుంది. 2వ దశ జనాభా లెక్కింపు ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. తొలి దశలో ఇళ్లు, ఫర్నిచర్ లెక్కిస్తారు. అదేవిధంగా, 2వ దశలో ఇంటింటా జనాభా లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ దేవ్ రంజన్ సింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో చర్చించారు. స్థానిక లోక్ సేవా భవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి జనాభా లెక్కల సమన్వయ కమిటీ సమావేశంలో సెన్సస్ డైరెక్టర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణకు 6 నెలలుగా సన్నాహాలు జరుగుతున్నాయి. భువనేశ్వర్, కటక్లలో ప్రయోగాత్మకంగా సన్నాహాలు పూర్తయ్యాయి. కొత్తగా ప్రకటించిన ఎన్ఏసీ, మున్సిపల్ సరిహద్దులను లెక్కింపులో పరిగణనలోకి తీసుకునేందుకు వీలుగా సవరణలు చేశారు. రాగల 3 నెలల పాటు జనాభా గణన అధికారులకు శిక్షణ ఇస్తారు. ప్రతి 200 గృహాలకు ఒక జనాభా గణన అధికారిని నియమిస్తారు. ప్రతి 6 మంది అధికారులకు ఒక సూపర్వైజర్ను నియమిస్తారు. రాష్ట్రంలో సుమారు లక్ష మంది జనాభా గణన అధికారులను నియమిస్తారు. ప్రతి జనాభా గణన అధికారికి రూ. 25,000 ఆర్థిక ప్రోత్సాహకం మంజూరు చేస్తారు. ఒక వ్యక్తి తన వివరాలను వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. దీని కోసం మొబైల్ నంబర్ ఆధారంగా ఓటీపీ ఉంటుంది. ఒకే నంబర్ను 2 సార్లు ఉపయోగించలేరు. స్క్రీన్ షాట్లు తీసుకోలేరు. దాదాపు 90 శాతం పని ఆన్లైన్లో జరుగుతుంది. 100 శాతం కచ్చితమైన జనాభా గణన జరుగుతుంది. -
రాజధానికి నీటి లోటు
భువనేశ్వర్: పెరుగుతున్న పట్టణ ప్రజల అవసరాలు తీర్చడానికి నీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుంది. భువనేశ్వర్, పరిసర ప్రాంతాలకు నీటి వనరుల ప్రణాళికను విభాగం ప్రముఖ కార్యదర్శి సమీక్షించారు. స్థానిక ఖారవేళ భవన్లో వాట్కో, ఆ శాఖ సీనియర్ అధికారుల సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశానికి గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఉషా పాఢి అధ్యక్షత వహించారు. ప్రాజెక్టులు వేగవంతం కావాలి సమీక్ష సందర్భంగా వాటర్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిశా (వాట్కో) ఆధ్వర్యంలో కొనసాగుతున్న, ప్రతిపాదిత నీటి సరఫరా ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించి వాటిని నిర్ణీత సమయాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. భువనేశ్వర్ వేగవంతమైన జనాభా పెరుగుదల, భవిష్యత్ విస్తరణ ప్రభావం నివారణ కోసం ప్రాజెక్టుల కార్యకలాపాల్లో జాప్యం దీర్ఘకాలిక నీటి భద్రతను ప్రభావితం చేస్తాయని కార్యదర్శి అన్నారు. వాట్కో మేనేజింగ్ డైరెక్టర్ దేబబ్రత మహంతి ప్రస్తుత అవసరం, సరఫరా అంతరం మౌలిక సదుపాయాల పెంపుదల ప్రణాళికలు, కార్యాచరణ సవాళ్లపై వివరాలను సమర్పించారు. వాటి ముందస్తు పరిష్కారం కోసం ఉన్నత అధికారులకు తెలియజేస్తారు. ఈ ప్రణాళికలు వికసిత్ ఒడిశా 2036, వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ఉంటాయి. కీలకమైన వృద్ధి ప్రణాళికలు ● రాగల 6 నెలల్లో ముండలిలో 130 ఎంఎల్డీ నీటి శుద్ధి కర్మాగారం ప్రారంభం. ● 2028 నాటికి నొహరొకొంట ప్రాంతంలో 20 ఎంఎల్డీ ప్లాంట్ పనిచేయడం ప్రారంభిస్తుంది. ● మూడోదిగా, దీర్ఘకాలికంగా రాగల 50 ఏళ్లకు భువనేశ్వర్ నీటి అవసరాన్ని తీర్చడానికి ముండలి వద్ద మహానది నుంచి రెండు దశల్లో 1,000 ఎంఎల్డీ ముడి నీటిని ఎత్తివేయడానికి వాట్కో ఒక ప్రతిపాదనను సమర్పించనుంది. ● అదనంగా భవిష్యత్ పట్టణ వద్ధిని తీర్చడానికి వికసిత్ భారత్ 2047 రోడ్మ్యాప్లో భాగంగా అదనంగా 400 ఎంఎల్డీ నీటి శుద్ధి కర్మాగారాన్ని ప్రతిపాదించారు. పట్టణ నీటి ఎద్దడిపై రాష్ట్రవ్యాప్త సర్వే ఒడిశా అంతటా పట్టణ స్థానిక సంస్థలపై, ముఖ్యంగా వేసవి నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ వాట్కోను ఆదేశించారు. ప్రభుత్వం లక్ష్య జోక్యాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో సహాయపడటానికి ఈ సర్వే వనరుల స్థిరత్వం, చికిత్స మరియు నిల్వ సామర్థ్యం, పంపిణీ సామర్థ్యం, గరిష్ట కాలానుగుణ డిమాండ్ను అంచనా వేస్తుంది. భువనేశ్వర్ ప్రస్తుతం 65.50 ఎమ్ఎల్డీ అవసరం.దీంతో నీటి సరఫరా అంతరాన్ని ఎదుర్కొంటోంది. -
సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత
రాయగడ: ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానంతో పాటు సేంద్రియ వ్యవసాయానికి రైతులు అధిక ప్రాధాన్యమివ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరో అన్నారు. స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న కృషిమేళా కార్యక్రమంలో భాగంగా గురువారం రైతుల సమస్యలు, సూచనలు అన్న అంశంపై జరిగిన జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధిక దిగుబడులు వస్తాయని అవగాహన లేని కొంతమంది రైతులు అధిక మోతాదులో రసాయన ఎరువులు వినియోగించడంతో నష్టాలబారిన పడుతున్నారన్నారు. రైతులు వ్యవసాయ రంగంలో మెలకువలు తెలుసుకోవడంతో పాటు సంబంధిత శాఖ అధికారులు ఇచ్చిన సలహాలు, సూచనలను తప్పకుండా పాటించాలన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన రైతుల సామాజిక, ఆర్థిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అపారమన్నారు. అనంతరం వ్యవసాయానికి వినియోగించే ఆధునిక పరికరాల గురించి రైతులకు అవగాహన కలిగించారు. డ్రోన్ల సాయంతో పంటలకు పిచికారీ విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో బిసంకటక్ సమితి అధ్యక్షురాలు యశోద హుయిక, నాబార్డు డిప్యూటీ డైరక్టర్ సంతోష్ కుమార్ సామల్, ప్రాజెక్టు డైరక్టర్ దామోదర్ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు. -
వెనుజులాపై దురాక్రమణ దారుణం
జయపురం: వెనుజులా దేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైనికులు అక్రమంగా దాడులు నిర్వహించి ఆ దేశాధినేత నికోలాస్ మదురోను అతడి ధర్మపత్నిని బంధించి ఎత్తుకు పోయి అమెరికాలో న్యూయార్క్ పట్టణానికి తీసుకు పోయి నిర్భందించటం దుర్మార్గమని కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. నేడు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రామకృష్ణ దాస్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు అమెరికా అధ్యక్షుని చర్యకు నిరసనగా జయపురంలో ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ ట్రంప్ చర్య కేవలం అన్యాయమే కాదు ఇతర దేశాల అధికారాలపై మూడో స్థాయి గూండాల కన్నా అతి హీనంగా వ్యవహరించాడని దుయ్య బట్టారు. అమెరికా సామ్రాజ్యవాద, ట్రంప్ ప్రభుత్వ హీనమైన నరహంతక చర్యను ప్రపంచంలో అన్ని దేశాలు ఖండిస్తున్నాయని, అంతే కాకుండా అమెరికాలో ప్రజలు ట్రంప్ చర్యను నిరసిస్తూ ప్రదర్శనలు జరుపుతున్నా ట్రంప్ తన సామ్రాజ్యవాద పోకడలను కొనసాగిస్తూనే ఉన్నాడని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చూపి వెనుజులా దేశంలో ఆపారమైన చమురు సంపదను లూటీ చేసేందుకే బహిరంగంగా ఈ దుర్మార్గానికి పూనుకున్నాడని కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రామకృష్ణ దాస్ దుయ్యబట్టారు. వెంటనే మదురోను అతడి భార్యను భేషరతుగా విడిచి పెట్టాలని ఆ పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. ర్యాలీలో పార్టీ జిల్లా మాజీ కార్మదర్శి జుధిష్టర్ రౌళో, నేతలు బసంత బెహర, సుదర్శణ బిశాయి, నంద హరిజన్, ధృభ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. -
భూముల ఆక్రమణపై దర్యాప్తు చేయండి
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ తహసీల్దార్ పరిధి బొయిరాగిపొదర్ మౌజ లోగల దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ గోచర (పశుల మేతకు నిర్దేశించిన)భూమితో పాటు అటవీ విభాగ భూములను కొంద మంది చట్ట వ్యతిరేకంగా ఆక్రమించి మొక్క జొన్న పండిస్తున్నారని కొరాపుట్ విజిలెన్స్ డివిజన్ జయపురం ఎస్పీకి గురువారం అందజేసిన వినతి పత్రంలో ఆదివాసీ గ్రామీణ ప్రజలు ఆరోపించారు. కొట్పాడ్ పోలీసు స్టేషన్ పరిధి బముణియగుడ గ్రామం ఆదివాసీ ప్రజలు ప్రముఖ సమాజ సేవి బి.హరి రావు నేతృత్వంలో జయపురంలో విజిలెన్స్ ఎస్పీని కలిసి మెమొరాండం అందజేశారు. గతంలో తాము ఈ విషయం కొరాపుట్ కలెక్టర్ తదితర సంబంధిత అధికాలకు తెలియజేశామని, అయితే ఎలాంటి చర్య తీసుకోలేదని వారు ఆరోపించారు. ఈ ఆరోపణపై పూర్తి వివరాలతో నివేదిక పంపాలని కలెక్టర్ బొరిగుమ్మ తహసీల్దార్ను ఆదేశించారని వారు గుర్తు చేశారు. అయితే తహసీల్దార్ కలెక్టర్ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండా భూఆక్రమణ దారులకు సహకరిస్తున్నారని వారు ఆరోపించారు. భూఆక్రమణ దారులకు అండగా ఉంటూ ఉన్నతాధికారుల ఆదేశాలను తహసీల్దార్ ఉల్లంఘిస్తున్నారని వారు ఆరోపణ చేశారు. ఆరోపణలపైన విజిలెన్స్ దర్యాప్తు జరిపించాలని కోరారు. ఆదర్శ పాఠశాలకు శంకుస్థాపన మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి పప్పులూర్ పంచాయతీలోని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గోదావరిశ్ మిశ్రో పేరున నిర్మించనున్న ఆదర్శ పాఠశాలకు బుధవారం మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కామి శంకుస్థాపన చేశారు. పంచాయతీ స్థాయిలో తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 118 గోదావరిశ మిశ్రో పేరున ఆదర్శ పాఠశాలలను ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దీనిలో భాగంగా మల్కన్గిరి జిల్లాలో చిత్రకొండ సమితి పప్పులూర్ పంచాయతీలో ఈ పాఠశాలను నిర్మిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రహి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతులు తెలిపారు. ఈ ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు ఇంత మంచి అవకాశం కల్పించారన్నారు. ఈ పాఠశాలలో మౌలిక సౌకార్యాలు కల్పిస్తామన్నారు. ఈ పాఠశాలలో బాలురు–బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణం, డిజిటల్ లైబ్రరీ, లాంగ్వేజ్ ల్యాబ్, క్రీడా స్థలం, డైనింగ్ హాల్, కంప్యూటర్లు, స్మార్టు బోర్డులు వంటి ప్రతీ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ చంద్ర శభర్, జిల్లా అదనపు విద్యాధికారి మంజులత బోయి, భగీరథి బెహరా, సమితి విద్యాధికారులు పాల్గొన్నారు. -
వర్క్షాప్ నిర్వహణ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి కార్యాలయంలో గురువారం 2030 నాటికి గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా జిల్లా ప్రణాళిక, పర్యవేక్షణ యూనిట్, మల్కన్గిరి ఆధ్వర్యంలో సమితి స్థాయి వర్క్షాప్ను నిర్వహించారు. ఈ వర్క్ షాప్ ద్వారా ప్రతి పంచాయతీ అభివృద్ధికి సుశక్తిమంతమైన, అభివృద్ధి చెందిన ఒడిశాగా నిర్మించవచ్చనే అనే అంశంపై వివిధ శిక్షణ కార్యక్రమాలు, ప్రెజెంటేషన్ల ద్వారా అవగహన కల్పించారు. 40కు పైగా విభాగాలకు చెందిన అధికారులు హాజరజయ్యారు. పంచాయతీ సమితి అభివృద్ధిశాఖ అధికారి అమూల్య కుమార్ సాహు, గోలక్ చంద్రదళాయి, సీనియర్ ఆర్థిక పరిశోధకుడు ధనపతి ఇంద్రజిత్, ప్రోగ్రాం మేనేజర్ రాజారాం మాలిక పాల్గొన్నారు. -
వేంకటేశ్వరునికి పొన్నాకుల హారతి
రాయగడ: ధనుర్మాస పూజల్లో స్థానిక బాలాజీ నగర్లో ఉన్న కల్యాణ వేంకటేశ్వర మందిరంలో ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పొన్నాకుల్లో హారతి సమర్పించారు. పొన్నాకుల హారతి వల్ల గాలిని శుద్ధి చేసి ప్రతికూల శక్తులను తొలగిస్తుందని, ప్రతీ ఏడాది ధనుర్మాసంలో ఇటువంటి తరహా పూజలను స్వామివారికి అర్పిస్తామని భాస్కరాచార్యులు పొన్నాకుల విశిష్టతను గురించి వివరించారు. కర్పూరం, పొన్నాకుల సువాసన కలిసి పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణం సృష్టించబడుతుందన్నారు. ముఖ్యంగా పొన్నాకుల్లో సహజ సిద్ధమైన సువాసన, పవిత్రత వల్ల హారతికి వాడడం వలన దీని ప్రభావం మరింత పెరుగుతుందన్నారు. పొన్నాకుల హారతి అనేది కేవలం ఒక సాంప్రదాయ పూజ మాత్రమే కాకుండా పర్యావరణాన్ని, మనస్సును శుద్ధి చేసి భక్తిని పెంచుతుందన్నారు. -
ఉత్సాహంగా అండర్–14 క్రికెటర్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అండర్–14 బాలుర క్రికెట్ ఎంపికలు ఆరంభమయ్యాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలోని క్రికెట్ నెట్స్ వద్ద ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో మొదలైన ఈ సెలక్షన్స్ ట్రయల్స్కు జిల్లా నలుమూలల నుంచి 82 మంది క్రీడాకారులు హాజరై ప్రతిభ నిరూపించుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ ఇలా అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 33 మందిని ప్రాథమికంగా గుర్తించారు. వీరిని ఫస్ట్ రౌండ్కు ఎంపిక చేశారు. వీరికి శుక్రవారం ఉదయం 9 గంటలకు చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం సెలక్షన్ మ్యాచ్లు నిర్వహించి తుది జాబితా వెల్లడిచేంచనున్నారు. సెలక్టర్లగా ఏసీఏ నుంచి ఆర్.విష్ణువర్ధన్రెడ్డి (తిరుపతి), పి.భాను ప్రకాష్రెడ్డి (నెల్లూరు) హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు, సిబ్బంది, కోచ్లు పాల్గొన్నారు. -
కాశీనగర్లో ఘనంగా వారణాసి ఉత్సవాలు
పర్లాకిమిడి: కాశీనగర్ ఎన్ఏసీలో గురువారం సాయంత్రం వారణాసి ఉత్సవాలు వారణాసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్స్లో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, కాశీనగర్ సమితి చైర్మన్ బల్లశాయమ్మ, వైస్ చైర్మన్ ఎస్.కళ్యాణి, కాశీనగర్ నగరపాలక మండలి చైర్మన్ మేడిబోయిన సుధారాణి, తహసీల్దార్ సుధీర్కుమార్ నోందో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీడీఓ డంభుధర మల్లిక్ మట్లాడుతూ, కాశీనగర్ ఉత్సవాలు కళా, సంస్కృతికి నిదర్శనాలని అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహికి ప్రత్యేక మెమొంటోను బీడీఓ డంబుధర మల్లిక్ అందజేశారు. అనంతరం పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆహుతులను ఆకట్టుకున్నారు. -
గవర్నమెంట్ ప్లీడర్గా ఇప్పిలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కోర్టు గవర్నమెంట్ ప్లీడరు (జీపీ)గా సీనియ ర్ న్యాయవాది ఇప్పిలి తాతను ప్రభుత్వం నియమించింది. పోలాకి మండలం మబగాం గ్రామానికి చెందిన తాత నరసన్నపేటలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ప్రస్తు తం పలు బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. ఈయనకు పదవి రావడం పట్ల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి శివప్రసా దరావు, ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు, సభ్యులు అభినందనలు తెలియజేశారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్ట ర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం భవన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసంపూర్తిగా మిగిలిన పనుల వివరాలను ఎగ్జిక్యూ టివ్ ఇంజినీర్ సుగుణాకర్ను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం డైరీ – 2026ను శ్రీకాకుళం ఎన్జీఓ హోమ్లో ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్ర జాయింట్ యాక్షన్ చైర్మన్ చౌదరి గురువా రం పురుషోత్తంనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ సంఘ ప్రతినిధులు పెన్షనర్ల ఇంటి వద్దకు కూడా వెళ్లి లైఫ్ సర్టిఫికెట్లు వంటి సేవలు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రకాష్రావు మాట్లాడుతూ ఫిబ్రవరి 28వరకు ప్రతిరోజూ ఎన్జీవో హోంలో లైఫ్ సర్టి ఫికెట్లు ప్రక్రియ నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కె. సోమసుందరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రసాదరావు, అసోసియేట్ అధ్యక్షుడు పి.నరసింహమూర్తి, కోశాధికారి కె.వెంకటేశ్వరరావు, సిటీ బ్రాంచ్ అధ్యక్షుడు బి.జానకిరామ్ పట్నాయక్, కార్యదర్శి ఎన్.ఎస్.పండా, కోశాధికారి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. మందస: మఖరజోల రహదారిపై పలాస నుంచి హైవేలో మొక్కలను తడుపుకుంటూ వెళ్తున్న వాటర్ ట్యాంకర్ను సోంపేంట నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ ముందుభాగం నుజ్జయ్యింది. క్యాబిన్లో ఇరుకున్న డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నేషనల్ హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్య లు చేపట్టారు. డ్రైవర్ను బయటకు తీసి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో అన్నీ శాఖలలో టెండర్ విధానంలో చేస్తున్న పనులకు ఏళ్ల తరబడి బిల్లులివ్వకపోవడంతో కాంట్రాక్టులకు ఆత్మహత్యలే శరణ్యమని సబ్కా శ్రీకాకుళం కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి.వి.రామానాయుడు అన్నారు. బ్యాంకులో డబ్బులు లేకుండానే బడ్జెట్ ఉందని చెప్పి.. తీరా పనులు చేయించాక డబ్బులు లేవని అధికారులు మొండిచేయి చూపిస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పండుగపూట కాంట్రాక్టులు, వారిపై ఆధారపడి ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. జిల్లాలో రూ.200 కోట్లు మేర బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు గ్రంధి వెంకటగణేష్ మాట్లాడుతూ శ్రీకాకుళం మున్సిపాల్టీలో పలుకుబడి ఉంటేనే బిల్లులు వస్తున్నాయన్నారు. సంఘ ప్రధాన కార్యదర్శి చల్ల సింహాచలం, కోఆర్డినేటర్ మొదలవలస ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శులు యాళ్ల రామారావు, కిల్లి మోహనరావు, సభ్యులు తలగాపు సంతోష్ కుమార్, ఎం.రవికుమార్ పాల్గొన్నారు. -
రెండు ఆలయాల్లో చోరీలు
నరసన్నపేట: సత్యవరం పాదాలమ్మ తల్లి గుడి, దూకులపాడులోని జ్యోతి రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో బుధవారం రాత్రి దుండగులు చోరీలకు పాల్పడ్డారు. రెండు చోట్లా సీసీ కెమెరాలు ఉన్నా.. వాటి హార్డ్డిస్క్లు, డీవీఆర్లు కూడా ఎత్తుకుపో యారు. రూ.60 వేల వరకూ నష్టం జరిగినట్లు సమాచారం. దూకులపాడు శివాలయంలో అమ్మ వారి పుస్తెలు, ఉత్సవ విగ్రహాల ఆభరణాలు, హుండీ కొల్లగొట్టి నగదు పట్టుకుపోయారని పూజారి గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవరం పాదాలమ్మ తల్లి ఆలయంలో విగ్రహాల ఆభరణాల ను పూజారి భద్రపరచడంతో పెద్ద నష్టమే తప్పింది. అయితే హుండీలో నగదు మాత్రం పట్టుకుపోయారు. పోలీసులు, క్లూస్టీమ్ ఆలయాలను పరిశీలించి వివరాలు సేకరించారు. -
మా ప్రాంతంలో విధ్వంసం సహించబోం
వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దానంలో విధ్వంసాన్ని సహించబోమని కార్గో ఎయిర్ పోర్టు బాధితులు ముక్తకంఠంతో హెచ్చరించారు. మండలంలో గల మోట్టూరు పంచాయతీ పరిధిలో గల బర్రివానిపేటలో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో గురువారం ‘మా ఊరు మా భూమి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు ముక్తకంఠంతో మా భూములే మాకు ముద్దు..మా ప్రాంతంలో విధ్వంసం వద్దు అంటూ నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి తమకు తల్లిలా ఉన్న ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అనంతరం పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శి కొమర వాసు, జోగి అప్పారావులు మాట్లాడుతూ తరతరాలుగా భూములను నమ్ముకొని జీవనోపాధి సాగిస్తున్న రైతులు నేడు కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగానే బాధిత ప్రాంతాలలో దశల వారిగా అవగాహన, పోరాట కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. చివరిగా బాధితులు అంతా కలిసి ఉద్దాన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ప్రతిజ్జ చేశారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు, బాధితులు గుంటు లోకనాథం, బర్రి కుర్మానాయకులు, గుల్ల ఈశ్వరరావు, బర్రి సురేష్, జోగి కామరాజు, ఉమాపతి, రామస్వామీ తదితరులు ఉన్నారు. -
పశువుల అక్రమ రవాణా అడ్డగింత
నరసన్నపేట: జాతీయ రహదారిపై లారీలో హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 45 పశువులను హైవే పెట్రోలింగ్ పోలీసు సిబ్బంది గురువా రం పట్టుకున్నారు. అనంతరం నరసన్నపేట పోలీసులకు వాహనాన్ని అప్పగించారు. బరంపురం నుంచి వీటిని తీసుకొస్తున్నారు. లోపల పశువులను ఎక్కించి పైన క్లాత్ కట్టి రవాణా చేస్తున్నారు. హైవే పోలీసులకు అనుమానం వచ్చి గొట్టిపల్లి వద్ద వాహనం నిలిపి తనిఖీలు చేయగా గుట్టు రట్టు అయ్యింది. వాహనంలో 15 ఆవులు, 20 ఎడ్లు, 10 దూడలు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి మూగజీవాలను కొత్తవలస గోశాలకు తరలించామని ఎస్సై శేఖరరావు తెలిపారు. మందస: బాలిగాం సమీపంలో జాతీయ రహదారి పై ఇచ్ఛాపురం వైపు నుంచి పలాస వైపు పవువుల తో వెళుతున్న నాలుగు వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను సీజ్ చేసి 17 పశువులను గోశాలకు తరలించినట్లు మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ తెలిపారు. మెళియాపుట్టి: ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి టెక్కలి వైపు రెండు పశువులను వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా గురువారం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పశువులను గోశాలకు తరలించారు. -
ఆర్థిక సంఘం నిధులకు గండి
నగరపాలక సంస్థకు మూడు విడతలుగా పాలకవర్గం లేకపోవడంతో రూ.25 కోట్ల మేర 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రాలేదు. వీటిని రాబట్టేందుకు కూడా కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయకపోగా, నగరపాలక సంస్థపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. ఇప్పటికే నగరపాల క సంస్థ విద్యుత్ శాఖతో పాటు ఎంతోమందికి బకాయిలు పడగా అవి మరింత పెరిగి ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అందించలేని స్థాయికి నగరపాలక సంస్థ దిగజారింది. గత ఏడాది మూడు రోజులకు రూ.8 కోట్లకు పైగా ఖర్చు అయితే, ఈ ఏడాది ఏడు రోజులు జరిపితే ఇంకెంత ఖర్చు అవుతుందో ఊహించవచ్చు. జిల్లా ప్రజా ప్రతినిధులు ఇటువంటి వాటిని పరిగణనలోనికి తీసుకోకుండా పండగ లుగా ప్రకటించేసి నిధులు విదల్చకుండా చేతు లు దులుపుకొంటున్నారు. ఇప్పటికై నా పాలకు లు స్పందించి పాత బకాయిలు ప్రభుత్వం నుంచి రాబట్టడంతోపాటు రథసప్తమి నిర్వహణకు నిధులు మంజూరయ్యేలా చూడాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
పండగ సరే.. పైసలేవీ?
శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలను ఈ నెల 19 నుంచి 25 వరకు ఏడు రోజులపాటు రాష్ట్ర పండుగగా జరపాలని నిశ్చయించింది. అయితే ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు నిధుల కొరత వేధిస్తోంది. గత ఏడాది నిధులు సమకూర్చిన నగర పాలక సంస్థ అధికారులు ఈసారి మాత్రం చేతులెత్తేశారు. రథసప్తమి ఏర్పాట్లకు సంబంధించి పలు శాఖల అధికారులతో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన సమీక్షలో పలు వివరాలు వెలుగుచూశాయి. అప్పులే మిగిలే.. గత ఏడాది మూడు రోజులపాటు రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా జరిపేందుకు ప్రభుత్వం ప్రకటనలు చేసింది. ఈ మేరకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర, కేంద్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. ముందుగా నగరపాలక సంస్థ ఖర్చు చేస్తే దానిని ప్రభుత్వం నుంచి వెనక్కు ఇప్పి స్తామని భరోసా ఇవ్వడంతో, జిల్లా ఉన్నతాధికారులతో పాటు నగరపాలక సంస్థ అధికారులు వెనుకా ముందు చూడకుండా ఎనిమిది కోట్ల రూపాయల ను ఖర్చు చేశారు. ఈ మొత్తంలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. నగరపాలక సంస్థ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో తమకు ఉన్న సౌలభ్యాన్ని వినియోగించుకొని రాష్ట్ర ప్రణాళిక విభాగం నుంచి రూ.నాలుగు కోట్లు వడ్డీ లేని రుణాన్ని తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది కోట్లను వెనక్కి చెల్లిస్తే అందులో నుంచి నాలుగు కోట్లు తీర్చవచ్చని భావించగా, ఆ నిధులు రాకపోగా నాలుగు కోట్లు అప్పు మిగిలింది. ప్రస్తుతం నగరపాలక సంస్థ రూ.36 కోట్ల మేర లోటు బడ్జెట్లో ఉన్నట్లు తెలుస్తోంది. దేవదాయశాఖ బకాయి రూ.65 లక్షలు దేవాదాయశాఖ నగరపాలక సంస్థకు రూ.65 లక్షల బకాయి పడింది. గత ఏడాది రథసప్తమి సందర్భంగా దేవాదాయ శాఖ కొన్ని పనులు చేపట్టేందుకు నిధులు లేకపోవడంతో జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి అనుమతితో ఆ పనులను కూడా నగరపాలక సంస్థ జరిపింది. ఆ మొత్తాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా వెనక్కి వచ్చేలా చూస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడంతో ఈ విషయం కూడా అగమ్యగోచరంగా మారి నగరపాలక సంస్థను ఆర్థిక ఇబ్బందుల్లో పడేసింది. రిజిస్ట్రేషన్ శాఖ బకాయిలు రూ.25 కోట్లు.. నగరపాలక సంస్థకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కూడా రూ.25 కోట్లు వరకు బకాయిపడినట్లు నగరపాలక సంస్థ ఉన్నతాధికారులకు అందజేసిన నివేదిక ప్రకారం తెలుస్తోంది. నగరంలో ఇల్లు, స్థలాలకు సంబంధించిన క్రయ విక్రయాలు జరిగితే దీని ద్వారా రిజిస్ట్రేషన్ శాఖకు సమకూరిన ఆదాయంలో కొంత వాటాను నగరపాలక సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా చెల్లింపులు జరగకపోవడంతో ఈ మొత్తం రూ.25 కోట్లకు చేరినట్లు సమాచారం. -
రేపటి నుంచి రాకపోకలు బంద్
రాయగడ: పాత రాయగడ, కొత్త రాయగడకు అనుసంధానం చేసే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై శనివారం నుంచి రాకపోకలు నిలిపి వేయనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి మరమ్మతుల పనులకు సంబంధించి బ్రిడ్జిపై వాహన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలియజేసింది. అయితే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణను దృష్టిలో పెట్టుకుని దారి మళ్లించినట్లు వివరించారు. స్థానిక పీడబ్ల్యూడీ సిరిగుడ కూడలి నుంచి రైతుల కాలనీ మీదుగా సాయి ఇంటర్నేషనల్ కూడలి మీదుగా వాహన రాకపోకలు సాగించవచ్చని ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా ద్విచక్ర వాహనాలకు సంబంధించి మున్సిపాలిటీ రోడ్డు మీదుగా కపిలాస్ కూడలి నుండి రైల్వే అండ్ గ్రౌండ్ మీదుగా రాకపోకలు కొనసాగించవచ్చని వివరించింది. బ్రిడ్జి మరమ్మతుల పనులు పూర్తయ్యేంత వరకు బ్రిడ్జిపై రాకపోకలు కొనసాగవని స్పష్టం చేసింది. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
రాయగడ: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని జేకేపూర్లో గల జేకే పేపర్ మిల్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ ద్వివేది అన్నారు. గురువారం జేకేపేపర్ మిల్ మైదానంలో పేపర్ మిల్స్ యూనిట్ల మధ్య ఇంటర్ యూనిట్స్ లీగ్ క్రికెట్ టోర్నామెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నీకి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన క్రీడాకారులను ప్రోత్సాహించారు. క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో జేకేపేపర్ మిల్ (రాయగడ), పొన్ఘద్లో గల సెంట్రల్ పల్ప్ యూనిట్, సిరిపూర్ పేపర్ మిల్, కాగజ్నగర్ ఢిల్లీలకు చెందిన జట్ల మధ్య ఈ నెల 11 వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ప్రారంభోత్సవ అనంతరం సిరిపూర్ పేపర్ మిల్, జేకేపేపర్ మిల్స్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో జేకేపేపర్ మిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్ల పరిమితి గల ఈ మ్యాచ్లో జేకే పేపర్ మిల్ జట్టు 184 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సిరపుర్ జట్టు 19.1 ఓవర్లలో 76 పరుగులకు అలౌట్ అయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను జేకేపేపర్ మిల్ జట్టుకు చెందిన మహమ్మద్ అభిషేష్కు దక్కింది. -
పట్టుబడినా పట్టించుకోలేదు!
● లెక్కకు మించిన ధాన్యంతో పట్టుబడిన రైస్మిల్ ● సీజ్ చేయాలని మంత్రి ఆదేశించినా పట్టించుకోని అధికారులు శ్రీకాకుళం రూరల్ : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 367 క్వింటాళ్లు (458 బస్తాలు) ధాన్యాన్ని శ్రీకాకుళం పరిధి లోని చింతాడ వద్ద చిట్టెమ్మ రైస్మిల్లో ఈ నెల 5న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేరుగా పట్టుకున్నారు. లెక్కకు మించి ధాన్యం ఉన్నందున సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అయినా ఇంతవరకు ఆయన ఆదేశా లు ఎవరూ పట్టించుకోలేదు. వాస్తవానికి, కెపాసిటీ కి మించి ట్రక్ షీట్లను నమోదు చేసినట్లు ఈ మిల్లులో గుర్తించారు. నవంబర్ నుంచి వేమెంట్ బ్రిడ్జి రికార్డుల ప్రకారం వెయ్యికు పైగా ట్రక్షీట్లు చిట్టెమ్మ రైస్మిల్లో నమోదు చేసినట్లు తేల్చారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం బస్తాల లెక్కలతోనే సరిపెట్టారు తప్ప కనీసం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అతి తక్కువకే కొనుగోలు.. వాస్తవంగా ఈ–క్రాప్ చేసిన పంట భూముల ధా న్యాన్నే మిల్లర్లు కొనుగోలు చేయాలి. ఇక్కడ మా త్రం పోరంబోకు భూములు, డిపట్టా భూములు, ఇనామి భూముల్లో పండించిన ధాన్యాన్ని అతి త క్కువ ధరకే రైతుల వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. టార్గెట్కు మించిన ధాన్యం మిల్లులో గుర్తించినా చర్యలు చేపట్టకుండా ఓ అధికారి పావులు కదిపినట్లు తెలుస్తోంది. చిట్టెమ్మ రైస్మిల్లులో అదనంగా 367 క్వింటాళ్ల ధాన్యం గుర్తించాం. దీనిపై రిపోర్టు రాసి ఉన్నతాధికారులకు పంపించాం. మిల్లును సీజ్ చేయలేదు. మిల్ యాజమాన్యం నవంబర్ నుంచి డిసెంబర్ వరకే రికార్డులు చూపించా రు. జనవరి నుంచి ఎటువంటి రికార్డులు నమోదు చేయలేదు. – పైడి అనిల్కుమార్, సివిల్ సప్లయ్ అధికారి -
ప్రెస్క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
రాయగడ: ప్రెస్క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక స్థానిక రాణిగుడ ఫారంలోని క్లబ్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. అధ్యక్షుడిగా సంగ్రామ్ కేసరి పట్నాయక్, ఉపాధ్యక్షునిగా శివసాయి బక్షీ పాత్రో, సాధారణ కార్యదర్శిగా వై.దామోదర్రావు, సహ కార్యదర్శిగా సుశాంత్ దాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుశాంత్ ప్రధాన్, కోశాధికారిగా సింహాచల్ పండాచ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా భళ్లమూడి నాగరాజు, శుభ్రత్ చౌదరి నియమితులయ్యారు. క్లబ్ న్యాయ సలహాదారులుగా సీనియర్ న్యాయవాది మదన్ మోహన్ పాడి, న్యాయవాది రితేష్ సబత్లు కొనసాగుతారు. కొత్తగా ఏర్పడిన ఈ కార్యవర్గం రెండేళ్ల పాటు కొనసాగుతుంది.లింగరాజ్ ఆలయంలోకి విదేశీయుడు భువనేశ్వర్: స్థానిక లింగరాజ్ ఆలయంలోకి హిందూయేతర వ్యక్తి ప్రవేశించాడు. అతడ్ని ఆలయ సేవకుడు సందేహంతో అదుపులోకి తీసుకుని అధికార వర్గాలకు అప్పగించాడు. ప్రాథమిక విచారణలో అతడు జపాన్ నుంచి వచ్చిన పర్యాటకుడిగా గుర్తించారు. కూలిన ఆస్పత్రి పైకప్పు భువనేశ్వర్: కటక్ నగరంలో ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఓ రోగి గాయపడ్డాడు. పాత వైద్య విభాగం వార్డులో బుధవారం ఈ ఘటన సంభవించింది. రోగి మంచంపై ఉన్నప్పుడు పైకప్పు తలపై పడటంతో గాయపడ్డాడు. వెంటనే రోగిని వేరొక మంచానికి తరలించి చికిత్స అందించారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షుడిగా బ్రజసుందర్ నాయక్ రాయగడ: స్థానిక వాకర్స్ క్లబ్ అధ్యక్షుడిగా న్యాయవాది బ్రజసుందర్ నాయక్ నియమితులయ్యారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి కొత్త కార్యవర్గం ఎన్నిక సదరు సమితి పితామహాల్లో బుధవారం జరిగింది.క్లబ్ ఉపాధ్యక్షులుగా ప్రభాకర్ దొర, జలంధర్ పుసిక, మన్మత తులొ, కార్యదర్శిగా బిశ్వనాథ్ సాహు, కోశాధికారిగా గోపాల్ జైన్ నియమితులయ్యారు. కొత్త కార్యవర్గానికి సభ్యులు అభినందించారు. ఇసుక రీచ్పై దాడులు రాయగడ: జిల్లాలోని గుణుపూర్ వంశధార ఇసుక రీచ్లో గుణుపూర్ ఆదర్శ పోలీసులు, ఓఎంసీ అధికారులు మంగళవారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ, అనుమతులు లేని జేసీబీ వినియోగించి నదీ గర్భం నుంచి తీస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ను సీజ్ చేశారు. జేసీబీ, ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం వంశధార నది ఇసుక రీచ్–1లో ఇదే తరహా అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి లక్ష రూపాయల జరిమానా విధించారు. -
రాష్ట్రాభివృద్ధి
పోటీతత్వంతోనే..భువనేశ్వర్: పోటీతత్వంతోనే ఒడిశా రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పరిశ్రమ, నైపుణ్య అభివృద్ధి, సాంకేతిక విద్యా శాఖ మంత్రి సంపద చంద్ర స్వంయి అన్నారు. స్థానిక వరల్డ్ స్కిల్స్ సెంటర్లో ఒడిశా స్కిల్స్ 2025–26ను బుధవారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నైపుణ్య అభివృద్ధి రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరివర్తనలో కీలక భాగమన్నారు. ఒడిశా స్కిల్స్ కేవలం ఒక పోటీ మాత్రమే కాదని, యువ పోటీదారులలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సజనాత్మకత, శ్రేష్ఠత సాధనను ప్రేరేపించే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ శ్రేణి నైపుణ్యత కలిగిన యువతను ఆవిష్కరించడం ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. పోటీతత్వం ఉన్న యువత ద్వారా అభివృద్ధి చెందిన ఒడిశా నిర్మాణం సాధ్యమని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 49 విభాగాల్లో.. ఈ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా 500 మందికి పైగా యువత పాల్గొంటున్నారు. వీరంతా పరిశ్రమలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ఆధారంగా 49 నైపుణ్య విభాగాలలో పోటీ పడుతున్నారు. రాష్ట్ర స్థాయి పోటీ విజేతలు జాతీయ స్థాయిలో ఒడిశాకు ప్రాతినిధ్యం వహిస్తారు. తర్వాత ప్రపంచ నైపుణ్య పోటీలో పాల్గొంటారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచ నైపుణ్య పోటీని స్కిల్ ఒలింపిక్స్గా వ్యవహరిస్తారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 10 ప్రధాన ప్రదేశాలలో ఈ పోటీ జరుగుతోంది. ప్రతి నైపుణ్య విభాగంలో ఒడిశా స్కిల్స్ 2025–26 విజేతకు ముఖ్యమంత్రి ఆస్పైర్ పథకం కింద ముఖ్యమంత్రి నైపుణ్య అవార్డును ప్రదానం చేస్తారు. ఇది అత్యుత్తమ ప్రతిభను గుర్తించి యువత ఉన్నత స్థాయి నైపుణ్యాల సాధనకు ప్రోత్సహిస్తుంది. ఒడిశా స్కిల్స్ పోటీని ఒక గమ్యస్థానంగా కాకుండా ఎదుగుదలకు తొలి మెట్టుగా పరిగణించి ఉత్సాహంతో ముందుకు సాగాలని మంత్రి సంపద చంద్ర స్వంయి విద్యార్థులకు పిలుపునిచ్చారు. పోటీలో పాల్గొనేవారు ఉత్తమ పద్ధతులను గుర్తించడానికి, పారిశ్రామిక ప్రామాణికలతో పరిచయం పొందడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలని నైపుణ్య అభివృద్ధి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, కార్యదర్శి భూపేంద్ర సింగ్ పుణియా ప్రోత్సహించారు. వరల్డ్ స్కిల్స్ సెంటర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ప్రిన్సిపల్, డిప్యూటీ ప్రిన్సిపల్, పరిశ్రమల భాగస్వాములు, నిపుణులు, జ్యూరీ సభ్యులు, శాఖ సీనియర్ అధికారులు ఈ సందర్భంగా హాజరయ్యారు. -
ఉత్సాహంగా పుష్పుణి మహోత్సవం
● ప్రేక్షకులను అలరించిన ప్రముఖ గాయకుడు మింటు చురియజయపురం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో కొరాపుటియ కళా, కళాకారుల గ్రూపు వారిచే నిర్వహిస్తున్న పుష్పుణి మహోత్సవం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి ఒడిశాలో ప్రసిద్ధ గాయకుడు మింటు చురియ తన శ్రావ్యమైన కంఠంతో మృదుమధురమైన పాటలతో శ్రోతలను మైమరపించాడు. అలాగే పలు ఆదివాసీ నృత్య గీతాలను ఆదివాసీ కళాకారులు ప్రదర్శించి కొరాపుట్ ఆదివాసీ కళాసంస్కృతిని గుర్తు చేశారు. ముఖ్యంగా నవరంగపూర్ జిల్లా చందాహండి ఆదివాసీ కళాకారుల ఘుముర నృత్యం, కొరాపుట్ జిల్లా సెమిలిగుడ గిరిజన కళాకారుల రెంగ డాన్స్, బొయిపరిగుడ సమితి గిరిజనుల దురువ నృత్యాలు, డైనమిక్ డాన్స్ గ్రూపుడాన్స్లు ప్రజలను ఉత్సాహ పరిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి, గౌరవ అతిథిగా జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్ధ్ గజదీస్ కాశ్యప్, సమాజ సేవి, ప్రముఖ క్రీడాకారులు సుభాష్ రౌత్లు పాల్గున్నారు. సబ్ కలెక్టర్ శొశ్యారెడ్డి మాట్లాడుతూ.. కొరాపుట్ జిల్లా ఆదివాసీ కళా సంస్కృతులకు పుష్పుణి మహోత్సవాలు దర్పణం పడుతున్నాయని, ఇటువంటి ఉత్సవాల ద్వారా ప్రాచీన సంస్కృతి కళలను పరిరక్షించుకోవాలని ఉద్బోధించారు. శంకర ప్రహరాజ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, అతిథులతో పాటు కొరాపుటియ కళ, కళాకారుల గ్రూపు అధ్యక్షులు మనోజ్ పాత్రో, కార్యదర్శి ధిరెన్ మోహన పట్నాయక్ సహకరించారు. -
ఉపాధ్యాయుల వేతనం నిలిపివేత
రాయగడ: hÌêÏÌZ° ¼çÜ…-MýS-rMŠS çÜÑ$† ç³Ç«¨ ´ëƇ$$Mö-yé-MýS$-Ë$-VýS*yýl {V>Ð]l$…ÌZ° {糿¶æ$™èlÓ E¯]l²™èl ´ëuý‡-Ô>-ÌSÌZ ^èl§ýl$Ð]l#-™èl$¯]l² ¯]lË$-VýS$Æý‡$ ѧéÅ-Æý‡$¦Ë$ AW-²-{ç³-Ð]l*-§é°MìS VýS$OÆð‡¯]l çœ$r-¯]lMýS$ çÜ…º…-«¨…_ A«¨-M>-Æý‡$Ë$ ^èlÆý‡Å-ÌSMýS$ Eç³-{MýS-Ñ$…-^éÆý‡$. C…§ýl$ÌZ ¿êVýS…V> ´ëuý‡-Ô>-ÌSMýS$ ^ðl…¨¯]l {糫§é-¯ø-´ë-«§éÅ-Ķæ¬-yýl$-™ø-´ër$ Ð]l$Æø I§ýl$VýS$Æý‡$ E´ë-«§éÅĶæ¬-ÌSMýS$ ^ðl…¨¯]l ¯ðlÌSçÜÇ Ðól™èl-¯é°² °Íí³ ÐólçÜ$¢¯]l²r$Ï ½yîl-Ðø Ô>…†-ÌS™èl Ð]l¬° E™èl¢-Æý‡$ÓË$ gêÈ ^ólÔ>Æý‡$. Ð]l$…VýSâýæ-ÐéÆý‡… Ð]l$«§éÅçßæ²… Mö…™èl-Ð]l$…¨ í³ÌSÏË$ Ð]lÊ{™èl ÑçÜ-Æý‡j¯]l MøçÜ… Mö…§ýlÆý‡$ ºÄ¶æ$rMýS$ Ð]l^éaÆý‡$. D {MýSÐ]l$…ÌZ JMýS ѧéÅ-Ǧ ™èl¯]l Ð]l§ýlª VýSÌS rÆð‡µ…sŒæ BƇ$$-ÌŒæ¯]l$ ѧéÅ-Æý‡$¦ÌSOò³ ´ùíÜ °ç³µ…-sìæ…-^éyýl$. D çœ$r-¯]lÌZ ¯]lË$-VýS$Æý‡$ ѧéÅÆý‡$¦Ë$ V>Ķæ$-ç³-yìl¯]l çÜ…VýS† ™ðlÍíÜ…§ól. D çœ$r-¯]lMýS$ çÜ…º…-«¨…_ Æ>çÙ‰ ÐéÅç³¢…V> ^èlÆý‡a±-Ķæ*…-Ôèæ…V> Ð]l*Æý‡-yýl…™ø çÜ…çœ$-r¯]l çܦÌê-°MìS ^ólÆý‡$-MýS$¯]l² ´ùÎ-çÜ$Ë$ D Ðól$Æý‡MýS$ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ §ýlÆ>Åç³#¢ {´ëÆý‡…À…-^éÆý‡$. D çœ$r¯]lMýS$ çÜ…º…-«¨…_ ´ëuý‡-Ô>ÌS E´ë«§éÅ-Ķæ¬Ë$, {糫§é-¯ø-´ë-«§éÅ-Ķæ¬yìlÌSMýS$ ¼çÜ…MýS-rMŠS çÜÑ$† ½yîlÐø ÚùM>gŒæ ¯øsîæ-çÜ$-ÌS¯]l$ gêÈ ^ólÔ>Æý‡$. D çœ$r-¯]lÌZ ¡{Ð]lV>-Ķæ*-ÌSMýS$ VýS$OÆð‡¯]l ѧéÅÆý‡¦ ŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠŠి¾Æý‡-gê r{MîS A¯ól ѧéÅ-Ç® ç³Çíܦ† B…ùªâýæ¯]l MýSÆý‡…V> E…yýl-yýl…™ø Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… Æ>{† MýSr-MŠSMýS$ ™èlÆý‡-Í…^éÆý‡$. »ê«¨™èl ѧéÅ-Æý‡$¦ÌS ™èlÍÏ-§ýl…-{yýl$Ë$ D Ðól$Æý‡MýS$ ¡{Ð]l B…§øâýæ-¯]lMýS$ VýS$Æý‡Ä¶æ*ÅÆý‡$. ´ëuý‡-Ô>-ÌSÌŸ Cr$-Ð]l…sìæ çœ$r¯]l ^ør$ ^ólçÜ$Mö-Ð]l-yýl…™ö ™èlÐ]l$ í³ÌSÏ-ÌS¯]l$ ´ëuý‡Ô>-ÌSMýS$ ç³…í³…^ól…-§ýl$MýS$ °Æ>-MýS-Ç-çÜ$¢-¯é²Æý‡$. ´ëuý‡Ô>-ÌSÌŸ VýSÌS E´ë-«§éÅ-Ķæ¬ÌS °Æý‡Ï„ýSÅ… M>Æý‡-׿…-V>¯ól Cr$Ð]l…sìæ çœ$r¯]l fÆý‡-W…§ýl° ÐéÆý‡…™é BÆø-í³-çÜ$¢-¯é²Æý‡$. C¨-ÌêE…-yýlV> º$«§ýl-ÐéÆý‡… ¼çÜ…-MýS-rMŠS G‹Ü-yîl-ï³Ðø çÜ…™öí-Ù×ìæ JÆý‡…, Ð]l¬°-VýS$yýl IIíÜ Ýû§é-Ñ$×ìæ »ñæçßæÆý‡, ¼çÜ…-MýS-rMŠS IIíÜ çÜ*Æý‡Å-^èl…{§ýl ´ëyìl, AW-²Ð]l*-ç³MýS A«¨M>Ç ´ëuý‡-Ô>-ÌSMýS$ ÐðlãÏ çœ$r-¯]lMýS$ VýSÌS M>Æý‡-×ê-ÌS¯]l$ AyìlW ™ðlË$-çÜ$MýS$-¯é²Æý‡$. A§ól-Ñ-«§ýl…V> ¼çÜ…-MýSrMŠS ÌŸ _MìS™èlÞ ´÷…§ýl$™èl$¯]l² Ð]l$Æö Ð]l¬VýS$YÆý‡$ ѧéÅ-Æý‡$®ÌS Ð]l§ýlª MýS$ ÐðlãÏ ÐéÇ õÜtsŒæ-Ððl$…sŒæ ÌS¯]l$ ÇM>Æý‡$z ^ólçÜ$-MýS$-¯é²Æý‡$. í³ÌSÏÌSOò³ rÆð‡µ…sŒæ BĶæ$ÌŒæ ÐólíÜ °ç³šA…-sìæ…-_¯]l ѧéÅ-Ç-®Oò³ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ-¯]lr$t çÜÐ]l*^éÆý‡…. -
రాష్ట్రంలో పెరిగిన చలిగాలులు
భువనేశ్వర్: రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. 23 నగరాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, 38 ప్రదేశాలలో 12 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సమాచారం ప్రకారం 3 డిగ్రీల సెల్సియస్తో జి.ఉదయగిరి అత్యంత శీతల ప్రదేశంగా నిలిచింది. తదుపరి చలి ప్రాంతాల జాబితాలో సెమిలిగుడ (4.1 డిగ్రీల సెల్సియస్), ఫుల్బాణి (5 డిగ్రీలు), రూర్కెలా (5.1 డిగ్రీలు), ఝార్సుగూడ (5.4 డిగ్రీలు) ఉన్నాయి. 10 డిగ్రీలు కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఇతర నగరాల్లో దారింగ్బాడి (7 డిగ్రీలు), కెంజొహర్ (7.6 డిగ్రీలు), సుందర్గఢ్, భవానీపట్న (7.8 డిగ్రీలు), అంగుల్ (8 డిగ్రీలు), కొరాపుట్ , బొలంగీర్ (8.5 డిగ్రీలు), కటక్ (9.6 డిగ్రీలు) ఉన్నాయి. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతతో గజగజలాడుతున్నాయి. రాష్ట్రంలో వివిధ ప్రదేశాలలో 10 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత వివరాలు.. చెరుకు పంట దగ్ధం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి యంవీ 31 గ్రామంలో బుధవారం మధ్యాహ్న సమయంలో ప్రతాప్ బిశ్వాస్ అనే రైతుకు చెందిన చెరుకు పంట అగ్ని ప్రమాదం జరిగి భారీగా నష్టం వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి . వరి కోత అనంతరం ప్రతాప్ తన పొలంలో చెరుకును వేశాడు. అయితే అతని పోలానికి సమీపంలో మరో రైతు తన పొలంలో కారణం లేకుండానే నిప్పు పెట్టాడు. ఈ పంటలు ప్రతాప్ పోలం వైపు వ్యాపించి చెరుకు పంట మొత్తం కాలిపోయింది.విషయం తెలిసిన వేంటనే ప్రతాప్ పోలంకు వచ్చి చూడగా చెరుకు మొత్తం బుడిద అయింది దానితో అగ్నిమాపిక సిబ్బందికు సమాచారం ఇవ్వడం తో వారు ఈ పోలాలుకు మద్య కాలువ ఉండటం తో వహనం చేరుకోలేదు కాని సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు అయిన అప్పటికే పూర్తిగా కాలిపోయింది .1లక్ష 10వేలు ఖర్చు చేశాను అప్పుగా తెచ్చానని.. జిల్లా యంత్రాంగం ఆర్థిక సాయం చేయాలని బాధితుడు కోరారు. సహయం చేయ్యాలి అని కోరారు రైతు ప్రాతాప్ . పంట ఏంత మొత్తం ద్వంశం అయిందో నివేదికను చూసి పరిహరం అందజేస్తాం అని కోరుకొండ అగ్నిమాపిక అధికారి సునీల్ నాయక్ తెలిపారు. -
సెంచూరియన్ వర్సిటీలో రక్తదాన శిబిరం
పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీలో ఎన్.ఎస్.ఎస్, యూత్ రెడ్క్రాస్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ అనితాపాత్ర్, డైరెక్టర్ (అడ్మిన్) దుర్గాప్రసాద్ పాఢిలు శిబిరాన్ని ప్రారంభించారు. ఎన్.ఎస్.ఎస్.అధికారి డాక్టర్ నిహాల్, విద్యార్థి వ్యవహారాల అధికారి డాక్టర్ సుశాంత్ కుమార్ పట్నాయిక్ ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులు హాజరై రక్తదానం చేశారు. మొత్తం 50 యూనిట్ల రక్తాన్ని విద్యార్థులు, జాతీయ సేవా సంస్థ కార్యకర్తలు అందజేశారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి సీనియర్ ఫార్మసిస్టు ఖగేశ్వర బెహరా రక్తదాన శిబిరంలో పాల్గొనగా, వై.ఆర్.సి.కౌన్సిలర్ డాక్టర్ సుశాంత పట్నాయక్ వరుసగా 25వ సారి రక్తదానం చేసి రికార్డు సాధించారు. రక్తదాతలకు సర్టిఫికెట్లను వై.ఆర్.సి. అధికారి పట్నాయిక్ అందజేశారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ప్రజ్ఞాపాణి తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ల నిరసన
సరుబుజ్జిలి: గ్రామ పంచాయతీల్లోని నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించి, అభివృద్ధికి విఘాతం కలిగించడం ఎంతవరకు సమంజసమని పలువురు సర్పంచ్లు ప్రశ్నించారు. పంచాయతీ నిధుల ఖర్చు విషయంలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకు విధానాలపై మండల కేంద్రంలో బుధవారం పలు పంచాయతీల సర్పంచ్లంతా కలిసి నిరసన తెలిపారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాలనకు పట్టుగొమ్మల్లాంటి పంచాయతీలను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధుల వినియోగంపై జారీ చేసిన జీవో వలన పారిశుద్ధ్యం, తాగునీరు, గ్రామ సచివాలయాల నిర్వహణ విషయంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు కాలేదని, ఇలాంటి తరుణంలో ఆంక్షలు విధించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన జీవోను తక్షణమే వెనుక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెగిపడిన విద్యుత్ వైర్ టెక్కలి రూరల్: మండలంలోని రావివలస గ్రామంలో ఉన్న అల్లాయిస్ పరిశ్రమకు చెందిన విద్యుత్ వైరు బుధవారం తెగిపడి రెండు పందులు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పరిశ్రమకు సమీపంలో ఉన్న వంశధార కాలువ వద్దనున్న విద్యుత్ స్తంభం నుంచి వైరు తెగి కిందనున్న పందులపై పడిపోయింది. దీంతో అక్కడికక్కడే రెండు పందులు మృతి చెందాయి. దీనిపై అప్రమత్తమైన గ్రామస్తులు పరిశ్రమ యాజమాన్యానికి సమాచారం అందించారు. అనంతరం గ్రామస్తులు చనిపోయిన పందులను పరిశ్రమ ముందు వేసి నిరసన తెలిపారు. విద్యుత్ వైర్లు మనుషులపై పడి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మన భూములను కాపాడుకుందాం మందస: మన ఊరు.. మన భూములను కాపాడుకుందామని, ఈ క్రమంలో ఎవరు ఎటువంటి ప్రలోభాలకు గురిచేసినా లొంగవద్దని మందస మండలం తెలగ గంగువాడ గ్రామస్తులు బుధవారం ప్రతిజ్ఞ చేశారు. స్థానిక సామాజిక భవ నం వద్ద కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామపెద్ద చిత్త కూర్మారావు మాట్లాడుతూ కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు మేరకు ఉద్యమంలో అందరూ భాగస్వాములం అవుతామన్నారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, రైతులు పాల్గొన్నారు. విద్యార్థులతో బాధ్యతగా వ్యవహరించాలి ఇచ్ఛాపురం రూరల్: విద్యార్థులతో ఉపాధ్యాయులు ప్రేమగా వ్యవహరించాలే తప్పా.. కఠినతరమైన శిక్షలు అమలు చేయకూడదని ఎంఈవో–2 ఎస్.విశ్వనాథం అన్నారు. బూట్లు వేయలేదనే నెపంతో టెన్త్ విద్యార్థులను పాత శాసనాం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పైడి గోపాలరావు బయటకు గెంటేయడంతో మంగళవారం సాక్షి దినపత్రికలో ‘బూట్లు వేయలేదని టెన్త్ విద్యార్థుల గెంటివేత’ శీర్షికతో వచ్చిన కథనానికి విద్యాశాఖ స్పందించింది. బుధవారం ఎంఈవో–2 విశ్వనాథం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఇకపై విద్యార్థులపై ఇలాంటి చర్యలు తీసుకోకూడదంటూ సూచించారు. ప్రధానోపాధ్యాయుడితో లిఖిత పూర్వకంగా సంజాయిషీ పత్రాన్ని తీసుకున్నట్లు తెలిపారు. -
క్రీడల్లో శిక్షణ అందిస్తాం
● జిల్లా క్రీడాధికారి, అసిస్టెంట్ కలెక్టర్ త్రినాథ సాహుపర్లాకిమిడి: మహిళా స్నాతక డిగ్రీ కళాశాలలో బుధవారం వార్షిక క్రీడాపోటీలు జరిగాయి. ముఖ్యఅతిథిగా జిల్లా క్రీడాధికారి, అసిస్టెంట్ కలెక్టర్ త్రినాథ సాహు ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడోత్సవాలను ప్రారంభించారు. క్రీడా పోటీల్లో మహిళా డిగ్రీ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ రీనా సాహు, అధ్యాపకురాలు మధుస్మితా ప్రధాన్, క్రీడా ప్రశిక్షకులు (సెయింట్ జోసఫ్ స్కూల్) సుకుమార్ శథపతి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపినవారికి రాష్ట్ర స్థాయి స్పోర్ట్ కాంప్లెక్సలో శిక్షణ అందిస్తామన్నారు. లాంగ్జంప్, హైజంప్, షార్ట్పుట్, పరుగు పందాలు, జువెలెన్ థ్రో, మ్యూజికల్ చైర్ వంటి క్రీడాంశాల్లో 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో ప్లస్ త్రీ విద్యార్థిని ప్రియాంకా జెన్నా చాంపియన్షిప్ సాధించింది. కళాశాల సీనియర్ అధ్యాపకురాలు డాక్టర్ భారతి పాణిగ్రాహి అతిధి పరిచయం చేయగా, స్పోర్ట్ ప్రశిక్షకురాలు బరోదా ఆచార్య ధన్యవాదాలు తెలిపారు. -
యాంత్రీకరణతో అధిక దిగుబడులు
పర్లాకిమిడి: వ్యవసాయంలో టెక్నాలజీని వినియోగించుకుంటూ యంత్రాలతో సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని మోహనా ఎమ్మెల్యే దాశరథి గొమాంగో అన్నారు. ప్రాంతీయ స్థాయి వ్యవసాయ పనిముట్ల మేళాను బుధవారం ఆయన ప్రారంభించారు. ఒడిశా అగ్రికల్చర్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (ఓ.యు.ఏ.టి.) విశ్రాంత డీన్ డాక్టర్ సంగ్రాం కేసరి స్వయిని, సబ్ కలెక్టర్ అనుప్ పండా, రాయగడ జిల్లా ముఖ్య వ్యవసాయాధికారి సంతోష్ మిశ్రా, ఒడిశా మిల్లెట్ మేన్ (కొరాపుట్) తపస్ చంద్ర రాయ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వయిని మాట్లాడుతూ ఒడిశా ఓ.యు.ఏ.టి., ఇక్రిసాట్ ఆధ్వర్యంలో రాగుల పంటలో విత్తనాలు వెదజల్లడం, క్రిమిసంహరిక మందుల పిచికారీ, కోతకోసి, ఎగురపోత చేసే కొత్త పనిముట్లు, యంత్రాలను ముందుకు తెస్తున్నామని చెప్పారు. మేళాలో రైతులకు 50 శాతం సబ్సిడీతో ట్రాక్టర్లు, ట్రసర్ మిషన్లు అందజేస్తున్నుట్ల సబ్ కలెక్టర్ అనుప్ పండా తెలిపారు. గత ఏడాది ఇదే మేళాలో వ్యవసాయ యంత్రాలు అమ్మకాలు రూ.3 కోట్ల వ్యాపారం జరిగిందని, ఈసారి రూ.5కోట్ల వ్యాపారం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మోహనా బ్లాక్లో మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పితే ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కృషి ఉద్యోగి యోజనను రైతులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలనిన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్యవ్యవసాయాధికారి ఎం.ప్రకాశ్రావు, వ్యవసాయాధికారి సూరజ్ ఉప్పలాడ తదితరులు సహకరించారు. టెక్నాలజీ వినియోగంతో రైతులకు మేలు వ్యవసాయ పనిముట్ల మేళా ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గొమాంగో -
బంగ్లాదేశ్ చొరబాటుదారులను అడ్డుకోవాలి
రాయగడ: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారని విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్పీ స్వాతి ఎస్.కుమార్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. రాయగడతో పాటు జేకేపూర్, గుణుపూర్, కళ్యాణ సింగుపూర్, రామనగుడ, మునిగుడ తదితర ప్రాంతాల్లో చొరబాటుదారుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. చొరబాటుదారుల వల్ల భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, తక్షణమే వారిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భజరంగ్దళ్ జిల్లా కో ఆర్డినేటర్ శశ్యజ్యోతి బెహరా, పట్టణ కన్వీనర్ శంకర్ బెహరా, ప్రఫుల్ల పాత్రొ, ఆనందరావు తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
రాయగడ: రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రగాయాలకు గురయ్యాడు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పరిధిలోని కేశనాయకగుడ గ్రామ సమీపంలో మలుపు వద్ద బైకు అదుపుతప్పి కింద పడిపోవడంతో పర్శాలి పంచాయతీలోని చాటికొన గ్రామానికి చెందిన గొపినాథ్ భత్రియ గాయాలకు గురయ్యాడు. వ్యక్తిగత పనిపై బైకుతో వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయాలకు గురైన భత్రియాను కళ్యాణసింగుపూర్ పీహెచ్సీకి తరలించారు. అయితే పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
మణిపూర్లో కొరాపుట్ ఎంపీ పర్యటన
కొరాపుట్: కొరాపుట్ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సప్తగిరి ఉల్క మణిపూర్ రాష్ట్రంలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో మత ఘర్షణల బాధితుల శిబిరాలను శిబిరాలు సందర్శించారు. వారికి జరిగిన నష్టం, కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి సమస్యలను పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తునాని ప్రకటించారు. మణిపూర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె.మేఘచంద్ర సింగ్తో కలసి అకంపట్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో తెలుసుకున్న బాధితుల సమస్యలు మీడియాకి వివరించారు. చుర్చానందపూర్లో ఐడీబీ క్యాంప్లో బాధితుల జీవితాలు దయనీయంగా ఉన్నాయన్నారు. ఘర్షణలు జరిగి నెలలు గడుస్తున్నప్పటికీ బాధితులు ఇంకా స్వస్థలాలకు చేరుకోలేదన్నారు. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణించారు. అనంతరం అక్కడ ఎంఆర్ఎన్ఆర్ఈజీఎ పథకం బచావో ఆందోళనలో పాల్గొన్నారు. ఉల్క ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు. -
ఫిబ్రవరి ఒకటి నుంచి జిల్లాస్థాయి మాల్యవంత్ మహోత్సవం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ నిర్వహించిన సమావేశంలో డిసెంబర్ నెలలో జరగవలసిన మాల్యవంత ఉత్సవాలు అనివార్య కారణాలతో జరగలేదు. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి ఒకటి నుంచి 5వ తేదీ వరకు జరుపాలని నిర్ణయించారు. ఉత్సవానికి అందరూ. సహకరిచాలని కలెక్టర్ సోమేశ్ కోరారు. జిల్లా సంస్కృతి అధికారి సంత్రాన నారాయణ పండా, జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాఽథ్ ప్రధాన్ , మల్కన్గిరి జిల్లా అదనపు ఎస్పి ఆర్కే దాస్, చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో ప్రతినిధి గోవిందపాత్రో, ఇతర ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు. -
కఠిన చర్యలు చేపట్టాలి
భువనేశ్వర్: బిజూ జనతా దళ్ నాయకులు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియాను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా మహిళా మండల అభివృద్ధి అధికారిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ అధికారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 3వ తేదీన కేంద్రాపడా జిల్లా రాజ్నగర్ మండల అభివృద్ధి అధికారి బీడీవో తిలోత్తమ ప్రుస్టీపై జరిగిన దాడిపై ఒడిశా డీజీపీకి బీజేడీ నాయకులు లేఖ రాశారు. బీడీవో కార్యాలయంలోకి బలవంతంగా చొరబడి, బెదిరింపులు మరియు దాడికి ప్రయత్నించారని లేఖలో ఆరోపించారు. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఓఏఎస్ సీనియర్ అధికారిపై గతంలో జరిగిన దాడిని బీజేడీ ఉదహరించి ఆందోళనకరమైన నమూనాగా ఎత్తి చూపింది. ఈ దాడులు చట్టపరమైన పాలన మరియు ప్రభుత్వ ఉద్యోగుల భద్రతకు, ముఖ్యంగా మహిళా అధికారుల భద్రతకు తీవ్రమైన ముప్పుగా పేర్కొంది. ఎఫ్ఐఆర్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సత్వర అరెస్టులు, నిష్పాక్షిక దర్యాప్తు మరియు ప్రభుత్వ అధికారులకు భద్రత కల్పించాలని బీజేడీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. -
బీజేపీని బలోపేతం చేయాలి
రాయగడ: రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.గోపి ఆనంద్ అన్నారు. జిల్లాలోని కాసీపూర్ సమితి గోరఖపూర్లో కార్యకర్తలతో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరు గురించి అందరికీ అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. భవిష్యత్ ప్రణాళికల గురించి సమావేశంలో కార్యకర్తలతో చర్చించారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు బసంత ఉలక, రజత్ మదల, యాల్ల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. -
సాగునీరు ఉపయోగించుకుంటే అధిక పంటలు
పర్లాకిమిడి: సాగునీటి సంఘాల ద్వారా సాగునీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే అధిక పంటలు పండించవచ్చని చిన్ననీటి పారుదల శాఖ ఎస్ఈ సింహాచల శతపతి అన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ఆర్.శెఠి భవనంలో డివిజన్ స్థాయి సాగునీటి సంఘాల పక్షోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 146 సాగునీటి సంఘాలు ఉన్నాయన్నారు. సాగునీటి సంఘాల నిర్వాహణకు ఎంత ప్రభుత్వ నిధులు ఖర్చుపెడుతున్నారో ప్రాజెక్టు వద్ద సైన్ బోర్డులు పెట్టడం లేదని జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు అన్నారు. ప్రతీ పథకం వినియోగానికి పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు. అనంతరం అదనపు చీఫ్ ఇంజినీర్ రాంప్రసాద్రావు మాట్లాడుతూ.. గజపతి జిల్లాలో వ్యవసాయంపై 75 శాతం రైతులు ఆధారపడి ఉన్నారని, సాగునీటి సంఘాల ద్వారా దిగువ భూములకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. సాగునీటి సంఘాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి సూచించారు. అనంతరం సాగునీటి సంఘాల ద్వారా నీటి పంపకాలు సక్రమంగా జరుపుకుంటామని రైతులచే అధికారులు ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డివిజన్ ఎస్ఈ సరోజ్ కుమార్ నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, గుసాని సమితి చైర్మన్ వీర్రాజు, కాశీనగర్ సమితి చైర్మన్ బల్ల శాయమ్మ, ఏఈఈ అశిష్ కుమార్ మల్లిక్, అసిస్టెంట్ ఇంజినీర్ మనోజ్ కుమార చౌదరి, ఏఈ సుకుమార్ శతపతి, సుజాతా కుమారి గౌడో తదితరులు పాల్గొన్నారు. -
చిన్నబాబు కుటుంబానికి పరామర్శ
టెక్కలి : పెద్దసాన గ్రామానికి చెందిన రైతు నాయకుడు కోత చిన్నబాబు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని అస్సాం చీఫ్ సెక్రటరీ కోత రవి మంగళవారం పరామర్శించారు. చిన్నబాబు చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. పుస్తెలతాడు చోరీ రణస్థలం: లావేరు మండలం బెజ్జిపురంలో కలిశెట్టి సూరమ్మకు చెందిన రెండు తులాల పుస్తెలతాడు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చోరికి పాల్పడ్డారు. లావేరు పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జిపురం హైస్కూల్ వెనుక రొంపివలసకు వెళ్లే దారిలో పొలం నుంచి సూరమ్మ అనే వృద్ధురాలు వస్తుండగా సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చిన పుస్తెలతాడు లాగారు. వెంటనే తేరుకుని తాడు పట్టుకోవడంతో సగం ముక్క ఆమె చేతిలోనే ఉండిపోయింది. దీంతో మరో సగం తాడు పట్టుకుని పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఎస్సై కె.అప్పలసూరి మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటుకల ట్రాక్టర్ బోల్తా మందస: మేఘమాల గ్రామ సమీపంలో మంగళవారం ఇటుకల ట్రాక్టర్ బోల్తా పడింది. మందస నుంచి చీపి గ్రామం ఇటుకల లోడుతో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పొగమంచుకు తోడు కొండ ప్రాంతం కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో నష్టం తప్పింది. గురుకుల విద్యార్థి ప్రతిభ కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి పొట్నూరు ప్రవీణ్కుమార్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎస్హెచ్ఆర్ఈఎస్టీఏ–ఎన్ఈటీఎస్–2026 పరీక్షలో ఆల్ ఇండియాలో 725వ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్ పేడాడ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. జోన్–1 స్కూల్స్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్గా నమోదైందని పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆప్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో పేద దళిత విద్యార్థులకు అత్యుత్తమ విద్య ఉచితంగా అందించే లక్ష్యంతో కార్పొట్ సంస్థల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ కోసం ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో విజయం సాధించిన విద్యార్థితో పాటు కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ అభినందించారు. రణస్థలం : లావేరు మండలం రావివలస సమీపంలో విశాఖపట్నం వైపు నుంచి చిలకపాలెం మీదుగా రాయ్పూర్ వైపు వెళుతున్న లారీ మంగళవారం తెల్లవారుజామున బోల్తా పడింది. డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీలోని బొగ్గు రోడ్డు పక్కన కళ్లద్దాలు, హెల్మెట్ దుకాణంపై పడటంతో సామగ్రి ధ్వంసమైంది. ఈ ఘటనలో రణస్థలం మండలం ఎన్జీఆర్పురం పంచాయతీ చీకటిపేటకు చెందిన కళ్లజోడు దుకాణ నిర్వాహకురాలు కొమర లక్ష్మీ సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. పోలీసులు లారీని పక్కకు జరిపి ట్రాఫిక్ చక్కదిద్దారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. ఆర్మీ ఉద్యోగి ఇంటిపై దాడి.. ఇరువర్గాలపై కేసు నమోదు హిరమండలం: ఆర్మీ ఉద్యోగి ఇంటిపై దాడికి సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కె.వెంకటేష్ మంగళవారం తెలిపారు. సోమవారం ఇంటి స్థలం విషయంపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ధనుపురం గ్రామంలో సిరిపురం శ్యామలరావు అనే ఆర్మీ ఉద్యోగి ఎనిమిదేళ్ల కిందట అక్కడ స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నారు. అయితే ఆ ఇంటి స్థలం విషయంలో అదే గ్రామానికి చెందిన దారపు షణ్ముఖరావుతో గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వారు తమపై దాడికి పాల్పడ్డారని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిపారు. సిరిపురం మోహన్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దారపు షణ్ముఖరావు, దారపు సంపతిరావులపై కేసు నమోదు చేశామన్నారు. అలాగే దారపు షణ్ముఖరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరిపురం మోహనరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
చెట్టును ఢీకొన్న కారు
రాయగడ: జిల్లాలో గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి గుమడ సమీపంలోని బిచికోట్ వద్ద మంగళవారం ఉదయం ఒక మామిడి చెట్టుకు కారు బలంగా ఢీకొంది. బరంపురం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పడంతో పాటు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవరు కారుతో సమీపంలోని మామిడి చెట్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో డ్రైవరు అతి చాకచక్యంతో బయటపడడంతో ప్రాణాలు కాపాడుకోగలిగాడు. కారు మాత్రం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. సంఘటన స్థలానికి గుమడ పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జింక కొమ్ములు స్వాధీనం రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి శుంగేరు పంచాయతీ సగబారి గ్రామంలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో జింకకు చెందిన మూడు కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ సిబ్బందితో రేంజర్ సచితానంద పరిడ, ఫారెస్టర్ దీనబంధు సబర్లు మంగళవారం ఉదయం గ్రామంలో ఆకస్మిక దాడులను నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రహల్లాద్ నాయక్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు ఈ మేరకు మూడు జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో నిందితుడు ఇంట్లో లేకపోవడంతో అరెస్టు చేయలేకపోయామని అధికారులు తెలియజేశారు. అయితే అతని సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. యువతిపై అత్యాచారం రాయగడ: ఒక మతి స్థిమితం లేని యువతిపై గుర్తు తెలియని ముగ్గురు దండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలోని గుడారి సమితి నైరా ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ మేరకు బాధిత కుటుంబీకులు గుడారి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మతి స్థిమితం లేని ఒక యువతి ఇంటికి వస్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఆమెను ఒక పత్తి పంట లోపలికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తామని భయపెట్టారు. అనంతరం ఆమె ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం
రాయగడ: రాయగడ మీదుగా గజపతి జిల్లాకు అక్రమంగా బొలేరోలో తరలిస్తున్న విదేశీ మద్యాన్ని రామనగుడ పోలీసులు పట్టుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో బీహార్కు చెందిన అనూజ్ కుమార్ యాదవ్, జిల్లాలోని చందిలి పోలీస్స్టేషన్ పరిధి దేవదొల గ్రామానికి చెందిన గణేష్ హిమిరికలు ఉన్నట్లు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించడంతో పాటు, బొలేరో వాహనాన్ని సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న 386 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్ల విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని అంచనా. -
9న రథసప్తమి ఉత్సవాలకు శ్రీకారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 19 నుంచి 25 వరకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగే రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 9వ తేదీ ఉదయం 8 గంటలకు ‘కర్టెన్ రైజర్’ కార్యక్రమంతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో సూర్యనమస్కారాలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ప్రాశస్త్యం తెలిసేలా ఫ్లెక్సీలు, విదేశీ పుష్పాలతో అలంకరణలు చేయాలని ఆదేశించారు. రూ.100 క్యూ లైన్లు, ఉచిత దర్శనం లైన్లలో వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకూడదని స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లకు పార్కింగ్ నుంచి ఆలయం వరకు రవాణా సౌకర్యం కల్పించాలని, పోలీసు శాఖ సమన్వయంతో పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని సూచించారు. గతంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి భోజనం అందలేదన్న ఫిర్యాదులు మళ్లీ రాకూడదని, ఫుడ్ కమిటీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సిక్కోలు రథసప్తమి జ్ఞాపికలు, పొందూరు ఖాదీ శాలువాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణకు 15 ప్రత్యేక కమిటీలు: ఉత్సవాల విజయవంతం కోసం 15 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఫండింగ్ కమిటీ, ఆహ్వాన పత్రికల కమిటీ, పబ్లిసిటీ కమిటీ వంటి కీలక బృందాలను నియమించారు. వీటితో పాటు శోభాయాత్ర, మెగా సూర్యనమస్కార్, సాంస్కృతిక కార్యక్రమాలు, పార్కింగ్, బ్యూటిఫికేషన్ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, డీఆర్వో ఎస్వీ లక్ష్మణమూర్తి, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, ఆలయ ఈఓ, మున్సిపల్ కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
● రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక ● ప్రారంభమైన జిల్లాస్థాయి కృషి మేళా రాయగడ: వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంభిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి కృషి మేళా మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రైతులు సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దీనివల్ల భూమి సారవంతం కోల్పోకుండా ఉంటుందన్నారు. అధిక రసాయనాలు వినియోగిస్తే దిగుబడులు తగ్గిపోవడంతో పాటు భూసారం తగ్గిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. అధికారుల సూచనలు, సలహాల మేరకు రైతులు వ్యవసాయం చేయాలని సూచించారు. మెలకువలు పాటించాలి గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో మాట్లాడుతూ రైతులు వ్యవసాయంలో మెలకువలు పాటించాలని సూచించారు. మెలకువలు పాటించకపోవడం వలన నష్టాలబారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్కే ఎహేసాన్ మాట్లాడుతూ కృషి మేళ ఈనెల 10వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. రైతులకు వ్యవసాయ రంగంలో అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయ పరికరాల వినియోగం అదేవిధంగా ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాల గురించి వివరించడమే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక, జిల్లా పరిషత్ సభ్యులు సంధ్యా పులక, బరాటం వరప్రసాదరావు, పద్మావతి మండంగి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆధునిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కొంతమంది రైతులను సన్మానించారు. యంత్రాలతో తక్కువ ఖర్చుతో లాభాలు పర్లాకిమిడి: వ్యవసాయంలో యంత్రాల వినియోగం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు అన్నారు. స్థానిక గజపతి స్టేడియంలో ప్రాంతీయ స్థాయి కృషి యంత్రాలు, పనిముట్ల మేళాను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రూపేష్ మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను వినియోగించుకొని కావాల్సిన యంత్రాలు కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి ఎం.ప్రకాష్రావు లబ్ధిదారులు, రైతులకు సబ్సిడీ పథకాలు, ఇన్సూరెన్సులు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ మునీంద్ర హానగ, రాయగడ వ్యవసాయ అధికారి సంతోష్ మిశ్రా, గుసాని సమితి చైర్మన్ వీర్రాజు, కాశీనగర్ సమితి చైర్మన్ బల్ల శాయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అయ్యప్ప సన్నిధానంకు వితరణ
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితి కేంద్రానికి చెందిన ఇటీవల మాల విరమించిన అయ్యప్ప స్వాములు డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారిని నబరంగ్పూర్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అయ్యప్ప దీక్షా సమయంలో స్వాములు బస చేయడానికి ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. పపడాహండిలో ఉన్న తమ సన్నిధానం నిర్మాణానికి సాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి తన కోటా నిధుల నుంచి రు.2 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోసారి ఆర్థిక సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేని కలిసినవారిలో గురుస్వామి కృష్ణ ప్రధాన్, నరేష్ స్వామి తదితరులు ఉన్నారు.


