breaking news
Odisha Latest News
-
నవీన్ పట్నాయక్, వీకే పాండియన్పై క్రిమినల్ రివిజన్ కొట్టివేసిన కోర్టు
భువనేశ్వర్: మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మాజీ అధికారి వి.కె.పాండియన్న్పై వ్యతిరేకంగా దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్ను భువనేశ్వర్లోని ఖుర్దా సెషన్స్ కోర్టు బుధవారం కొట్టివేసింది. న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధీర్ చరణ్ మహంతి దాఖలు చేసిన రివిజన్ ిపిటిషను కొట్టివేస్తూ ఈ ఏడాది మార్చి 25న స్థానిక ఎస్డీజేఎం కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సమర్థించింది. నవీన్ పట్నాయక్, వి.కె.పాండియన్ హెలికాప్టర్ ప్రయాణం, ప్రజా సమావేశాలకు సంబంధించి ఖర్చుల కోసం రూ.500 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని ప్రధాన ఆరోపణ. మూడు కీలక అంశాలను హైలైట్ చేస్తూ, కోర్టు ఎస్డీజేఎం నిర్ణయాన్ని సమర్థించింది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(4) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో చట్టబద్ధమైన ప్రక్రియను పాటించలేదని సెషన్స్ కోర్టు పేర్కొంది. ఆరోపణలు నిరూపించేందుకు ప్రాథమిక సాక్ష్యాధారాలు లేనట్లు కోర్టు గమనించి ఆరోపణలు అసంబద్ధమైనవిగా పేర్కొంది. ఎస్డీజేఎం కోర్టు ఈ ఏడాది మార్చి 25న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎటువంటి చట్ట విరుద్ధత లేదని సెషన్స్ కోర్టు ధృవీకరించి క్రిమినల్ రివిజనన్ను కొట్టివేసింది. -
పాముకాటుతో యువతి మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియా సమి తి రోడన్పల్లి గ్రామానికి చెందిన యువతి బుధవారం మృతి చెందింది. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పింకీ భోజ నం చేసి నిద్రపోయింది. మంగళవారం ఉద యం నిద్ర లేచి కాలు తీవ్రంగా నొప్పి పెడుతుందని తల్లికి తెలిపింది. పాము కాటు కనిపిచడంతో పోడియా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. బుధవారం ఉదయం పింకీ మృతి చెందింది. ఈ విషయంపై పోడియా ఐఐసీ దేవేంద్ర భత్రా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంత రం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలో గీతాంజలి పబ్లిక్ స్కూల్లో పోలీసులు సైబర్ సెక్యూరిటీ, నిషా ముక్త అభియాన్పై విద్యార్థుల్లో బుధవా రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గీతాంజలి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ డి.వేణుగోపాలరావు, ఆదర్శ పోలీసు స్టేషన్ అధికారులు పాల్గొన్నారు. జయపురం: జయపురం సబ్ డివిజన్లోని కుంధ్ర సమితి రాణిగుడ గ్రామ పంచాయతీ ఉన్న త మాద్యమిక పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ పాఠశాల ప్రధాన గేటుకు తాళాలు వేశారు. టెన్త్ వరకు 356 మంది విద్యార్థులు చదువుతున్నారని, గతంలో 11 మంది ఉపాధ్యాయులు ఉండేవారని, వారిలో ముగ్గురిని ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్పై పంపించ డం తగదన్నారు. అనంతరం బ్లాక్ విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. మందస: మండలంలోని టబ్బగాం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐటీబీపీ కానిస్టేబుల్ సవర శేషగిరి (28) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒడిశాలో ని ఖుర్దా యూనిట్లో విధులు నిర్వహిస్తున్న శేషగిరి ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చా డు. గ్రామ సమీపంలోని జీడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విధి నిర్వహణలో పని ఒత్తిడితో కొంతకాలంగా మానసిక ఆందోళనలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం పీహెచ్సీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరసవల్లి: జిల్లా విద్యుత్ సర్కిల్లో పీఎం సూర్యఘర్ పథకం అమలు లక్ష్యాలను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఏపీ ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టివి.సూర్యప్రకాష్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఎస్సీ ఎస్టీ ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు కచ్చితంగా సోలార్ రూఫ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఎస్సీ ఎస్టీ వినియోగదారులు 16278 మంది ఉండగా, ఇంతవరకు 9032 ఇళ్లకు మా త్రమే సోలార్ పథకాన్ని అమర్చారని, మిగిలిన వారికి ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం ప్రధాన దేవాలయంలో ఇంద్ర లింగానికి బుధవారం సంప్రోక్షణ, శుద్ధి పూజలు నిర్వహించారు. ‘శివ..శివా’ అనే శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి దేవదాయ శాఖ, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు స్పందించారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి పవిత్ర వంశధార నదీ జలాలతో శుద్ధి చేసి భక్తులకు దర్శనాలు కలిగించారు. ఇదిలా ఉండగా ‘సాక్షి’లో వచ్చిన కథనానికి దేవదాయ శాఖ అధికారులు స్థానిక ఈఓ ఏడుకొండలను మందలించినట్లు సమాచారం. దీనిపై ఈఓ, అర్చకులు వాగ్వాదానికి దిగారు. జలుమూరు ఎస్ఐ బి.అశోక్బాబు చొరవ తీసుకొని ఆలయ నిర్వహణ సమష్టిగా చూడాలని సర్దిచెప్పడంతో వివాదం సద్దు మణిగింది. శ్రీకాకుళం క్రైమ్ : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 27 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి అక్టోబరు 1 నుంచి ట్రైనింగ్ పీరియడ్ ముగిసిన తర్వాత వీరికి ప్రమోషన్ కల్పించాల్సి ఉన్నా 27 హెచ్సీ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఈ ప్రక్రియ జరిపినట్లు పోలీసు వర్గాల సమాచారం. -
విద్యుత్ షాక్తో లైన్మెన్కు గాయాలు
జయపురం: జయపురం సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతులు చేస్తుండగా లైన్మెన్ అజిత్ బెహర(35) షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తోటి సిబ్బంది తరలించారు. అజిత్ బెహర స్తంభంపై మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని తోటి సిబ్బంది మండిపడ్డారు. బాధితునికి పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని, తగిన నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
రాగి పైపులు చోరీ
రణస్థలం: మండలంలోని నారువ పంచాయతీలో నిర్మాణంలో ఉన్న పరిశ్రమలో ఎయిర్ కండీషనర్ (ఏసీ)లకు వాడే చిన్నపాటి రాగి పైపులు దొంగలించిన కేసులో పట్టుబడినవారిని స్టేషన్ బెయిల్పై విడిచిపెట్టామని జేఆర్పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. పైడిభీమవరం సిస్కో పోలీస్స్టేషన్లో ఈ కేసు విషయమై విలేకరుల సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 18వ తేదీన నారువ గ్రామానికి చెందిన నిద్రబంగి ప్రసాద్, నీలాపు పరదేశి(మహేష్), నిద్రబంగి దుర్గా ప్రసాద్లు పరిశ్రమలో దొంగతానికి పాల్పడ్డారు. దొంగిలించిన రాగి పైపుల 25 కట్టలను పూసపాటిరేగ మండలంలోని కామవరం దగ్గర ఒక తుక్కు దుకాణంలో అమ్మేందుకు ఆటోలో వెళ్లారు. అక్కడ అమ్మకానికి ప్రయత్నించగా జేఆర్పురం, పైడిభీమవరం పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ.8.25 లక్షలు ఉంటుందని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రాపర్టీ రికవరీ చేశామన్నారు. అనంతరం స్టేషన్ బెయిల్పై ఇంటికి పంపించామని తెలిపారు. కాగా ఈ ముగ్గురి నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై పోలీసులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జేఆర్పురం ఎస్ఐ వి.సత్యనారాయణను వివరణ కోరగా 7 ఏళ్లలోపు కేసులకు రిమాండ్కు తరలించకుండా పంపించవచ్చునని, అదే 7 ఏళ్లు దాటిన కేసులకు తప్పకుండా రిమాండ్కు తరలిస్తామన్నారు. -
రాయగడలో యంత్రాలతో రోడ్ల శుభ్రత
రాయగడ: పట్టణాన్ని మరింత శుభ్రంగా, సుందరంగా, కాలుష్యరహితంగా తీర్చిదిద్దే దిశగా మున్సిపాలిటీ యంత్రాంగం కీలక ముందడుగు వేసింది. పట్టణంలోని ప్రధాన రహదారులను అత్యాధునిక యంత్రాలతో శుభ్రం చేసే మెకానికల స్వీపింగ్ (యాంత్రిక రోడ్ల శుభ్రత) వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇకపై రోడ్డుపై పేరుకుపోయిన దుమ్ము, ఇసుక, చెత్తను తక్కువ సమయంలోనే సమర్ధవంతంగా తొలగించే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఉత్వర్వుల మేరకు సంబల్పూర్ మున్సిపాల్ కొర్పొరేషన్, జయపురం మున్సిపాలిటీతో పాటు రాయగడ మున్సిపాలిటీ పరిధిలోయాంత్రిక శుభ్రత పనుల నిర్వహణకు గ్రీన్ ఇన్నొవేటీవ్ పవర్ ప్రైవెట్ లిమిటెడ్ సంస్థను నియమించారు. ఈ సంస్థతోఐదేళ్ల పాటు సేవలు అందించేలా ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక యాంత్రిక శుభ్రత వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలొ రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రెండున్నర కేజీల గంజాయితో ఒక యువకుడితో పాటు 15 ఏళ్ల బాలుడు పట్టుబడ్డారని సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. తమిళనాడులోని దిండిగల్ జిల్లా ఏ–వేలిగోడు గ్రామానికి చెందిన మరియా కిల్బెర్ట్ రాజశేఖర్ అనే యువకుడు, ఒక 15 ఏళ్ల బాలుడు ఇరువురూ జల్సాలకు అలవాటుపడ్డారు. వీరికి తమిళనాడు దిండిగల్ జిల్లా ఫలనీ బైపాస్ ప్రాంతంలో గంజాయి వ్యాపారం చేసే కాళిదాస్తో పరిచయం ఏర్పడింది. దీంతో గంజాయి వ్యాపారి సూచించినట్లు ఒడిశాలో బలియాగడ గ్రామం సమీపంలోని హెచ్సీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉంటున్న రామస్వామి దొర వద్దనుంచి 2.500 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం వీరిరువురు ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ నుంచి రైలు గుండా తమిళనాడు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్టేషన్కు వస్తుండగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్దనుంచి గంజాయి, ఒక సెల్ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో యువకుడిని సోంపేట కోర్టుకి తరలించగా, బాలుడుని జువైనల్ కోర్టుకి తరలించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ముకుందరావు సిబ్బంది పాల్గొన్నారు. -
ఖనిజ సవరణ చట్టంపై పునరాలోచన చేయాలి
● ప్రధానమంత్రి మోదీకి ఎంపీ సప్తగిరి లేఖరాయగడ: ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఒడిశా రాష్ట్ర రాజ్యాంగ హక్కులు, ఆర్థిక స్వయంప్రతిపత్తి, దీర్ఘకాలిక ప్రయోజనాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యూలేషన్ ) సవరణ చట్టం–2026 , ప్రధానంగా చట్టంలో చేర్చిన సెక్షన్ 9డీపై పునరాలోచన చేయాలని కొరాపుట్ పార్లమెంటు సభ్యుడు సప్తగిరి శంకర్ ఉలక కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బుధవారం లేఖ రాశారు. ప్రస్తుతం ఒడిశాకు ఎంత ఆదాయం వస్తుందన్నది మాత్రమే కాకుండా, భవిష్యత్లో రాష్ట్రంలోని ఖనిజ వనరులపై నిర్ణయాలు తీసుకునే అధికారి, వాటి నుంచి ఆదాయం సమీకరించే రాజ్యాంగబద్ధమైన హక్కు ఎవరి వద్ద ఉంటున్నదనే అసలు ప్రశ్న అని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాల పన్నుల అధికారంపై ప్రభావం సెక్షన్ 9డీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం విధించే నిబంధనలు లేదా పరిమితులకు లోబడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఖణిజ హక్కులు లేదా ఖనిజాలు కలిగిన భూములపై పన్ను, సెస్ లేదా ఇతర లెవీలను విధించగల పరిస్తితి ఏర్పడుతుందని ఉలక ఆందోళన వ్యక్తం చేశారు. రాయల్టీ, వేలం ప్రీమియం, జిల్లా ఖనిజ ఫౌండేషన్ (డీఎంఎఫ్) వంటి వాటి ద్వారా రాష్ట్ర ఆదాయం లభిస్తున్నప్పటికీ, భవిష్యత్లో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పన్నులు లేదా ఇతర లేవీలను రూపొందించే స్వేచ్ఛ తగ్గే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. అక్రమ మైనింగ్పై షా కమిషన్ నివేదిక జస్టిస్ ఎంబీ షా కమిషన్ ఒడిశాలో ఇనుప, మాంగనీస్ ఖనిజాల అక్రమ తవ్వకాలపై వివరాలను నమోదు చేసిందని, సుమారు 1,59,200 రూపాయల మేర అక్రమాలకు సంబంధించిన ఉల్లంఘనలు ఉన్నట్లు నివేదికలొ పేర్కొన్న విషయాన్ని ఎంపీ ఉలక గుర్తు చేశారు. అలాగే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2017లో సుప్రీంకోర్టు అవసరమైన చట్టపరమైన అనుమతులు లేకుండా అక్రమంగా తవ్విన ఖనిజాల పూర్తి విలువను వసూలు చేయాలని ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. కేంఝర్, సుందరఘడ్ వంటి ఖనిజ ప్రభావిత జిల్లాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, అనేక ప్రభావిత గ్రామాలకు ఇప్పటికీ అవసరమైన మౌలిక వసతులు అందలేదని వివరించారు. గనుల కారణంగా నిర్వాసితులు కావడం, నీటి కాలుష్యం ,అటవీ నష్టం, జీవనోపాధి కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజల కోసం డీఎంఎఫ్ నిధులను సమర్ధవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన హక్కులకు రక్షణ కల్పించాలి ప్రత్యేకించి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనులు భూమి హక్కులు, గ్రామ సభల సమ్మతి, పునరావాసం, పరిహారం వంటి అంశాలపై మరింత పారదర్శకత అవసరమని ఉలక తెలిపారు. భూసేకరణ, పునరావాసం, న్యాయమైన పరిహారం, పాదర్శకతకు సంబంధించిన 2013 చట్టం, అలాగే పంచాయతీ చట్టం–1996 (పేసా) నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. తన నియోజకవర్గమైన కొరాపుట్ గిరిజన ప్రాంతమని, సహజ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ వాటిపై ఆధారపడిన అనేక మంది ప్రజలు తమ భూమి, అటవీ హక్కుల విషయంలో ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారని ఉలక లేఖలో పేర్కొన్నారు. ఒడిశా నుంచి వెలికితీసే ఖనిజాలు దేశవ్యాప్తంగా పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడుతున్నప్పటికీ ఖనిజ ప్రభావిత ప్రాంతాల్లోని సామాజిక, పర్యావరణ, మానవీయ అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్రానికి ఎంపీ పలు సూచనలు సెక్షన్ 9డీ పై పునఃసమీక్ష చేపట్టడంతో పాటు దాని రాజ్యాంగ, ఆర్థిక, పారిశ్రామిక, పర్యావరణ, సమాఖ్య ప్రభావాలను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలాగే సెక్షన్ 9డీ కింద నిబంధనలు లేదా పరిమితులు విధించే ముందు ఖనిజ సంపద కలిగిన అన్ని రాష్ట్రాలతో అధికారికంగా సంప్రదింపులు జరపాలని, రాష్ట్రాల వారీగా ఆర్థిక ప్రభా వాల అంచనా నివేదికలను బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖనిజ ప్రభావిత జిల్లాలపై సవరణ చట్టం ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని, డీఎంఎఫ్ నిధుల వినియోగంలో జవాబూదారీతనాన్ని పెంచాలని, గిరిజనులు, నిర్వాసితుల భూమి సేకరణ, పునరావాస ప్రక్రియల్లో అటవీ హక్కుల చట్టం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సప్తగిరి శంకర్ ఉలక తన లేఖలో ప్రధాన మంత్రిని కోరారు. -
తీర్థయాత్ర రైలు ప్రారంభం
● వృద్ధులకు ఉచిత ప్రయాణం ● జెండా ఊపి రైలును ప్రారంభించిన డిప్యూటీ సీఎం ప్రభాతి పరిడాభువనేశ్వర్: ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన కింద వయో వృద్ధుల తీర్థ యాత్ర ప్రత్యేక రైలు బుధవారం బయల్దేరింది. ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా జెండా ఊపి న్యూ భువనేశ్వర్ రైల్వే స్టేషను నుంచి దీనిని ప్రారంభించారు. ఇందులో 775 మంది వృద్ధ యాత్రికులు ప్రయాణించారు. ఈ పథకం కింద రాష్ట్రం నుంచి వారణాసి, అయోధ్యకు బుధవారం ప్రత్యేక రైలు బయల్దేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది తొలి సీనియర్ సిటిజన్ యాత్రా రైలు కావడం విశేషం. పవిత్ర లింగరాజ పుణ్య క్షేత్రం నుంచి కాశీ విశ్వనాథుడు, అయోధ్య వరకు సాగే ఈ యాత్ర వయోవృద్ధులకు ఒక చిరస్మరణీయ అనుభూతినిస్తుంది. వారి ప్రయాణం సురక్షితంగా, ఆధ్యాత్మికంగా సంతృప్తికరంగా ఉండాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్రలో యాత్రికులు కాశీ విశ్వనాథుని దర్శనంతో గంగా హారతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని ప్రత్యక్షంగా సందర్శిస్తారు. అక్కడ నుంచి అయోధ్యలో శ్రీ రామ్ లల్లా దివ్య దర్శనం పొందుతారని ప్రభాతి పరిడా తెలిపారు. యాత్రా కార్యక్రమం కింద రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన వయోవృద్ధులు దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పుణ్య క్షేత్రాలను సందర్శించి గనమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఆస్వాదిస్తున్నారన్నారు. బుధవారం బయల్దేరిన తీర్థ యాత్ర ప్రత్యేక రైలులో ఖోర్ధా, జగత్సింగ్పూర్, కటక్, పూరీ, కేంద్రాపడా, ఢెంకనాల్ 6 జిల్లాలకు చెందిన 775 వృద్ధులు పాల్గొన్నారు. జిల్లా వారీగా పాల్గొన్న యాత్రికులలో ఖోర్ధా నుంచి 169 మంది, జగత్సింగ్పూర్ నుంచి 85 మంది, కటక్ నుంచి 197 మంది, పూరీ నుంచి 127 మంది, కేంద్రాపడా నుంచి 108 మంది, ఢెంకనాల్ నుంచి 89 మంది ఉన్నారు. 333 మంది మహిళలు, 432 మంది పురుషులు ఉన్నారు. యాత్ర పొడవునా యాత్రికుల భద్రత, సౌకర్యం 25 మంది ఎస్కార్ట్ అధికారులు కూడా ఉన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్యాశాఖ మంత్రి సంపద్ చంద్ర స్వంయి, కేంద్రాపడా ఎమ్మెల్యే గణేశ్వర్ బెహెరా, పర్యాటక శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి బల్వంత్ సింగ్, ఖుర్ధా కలెక్టర్ అమృత్ రుతురాజ్, ఖుర్దా రోడ్ డివిజన్ అదనపు డీఆర్ఎం ప్రదీప్ కుమార్ బెహెరా, ఐఆర్సీటీసీ ప్రాంతీయ మేనేజర్ అనుజ్ దత్తా, పర్యాటక శాఖ డైరెక్టర్ దీపాంకర్ మహా పాత్రో ప్రసంగించారు. ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన కింద 2026–27 ఆర్థిక సంవత్సరంలో 10 దశల్లో మొత్తం 8,000 మంది వయోవృద్ధులు తీర్థయాత్రలు చేపట్టనున్నారు. కార్యక్రమంలో అయోధ్య, వారణాసి, హరిద్వార్, రిషికేశ్, రామేశ్వరం, మదురై వంటి గమ్యస్థానాలు ఉంటాయని తెలిపారు. -
అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
పర్లాకిమిడి: గజపతిజిల్లా గుమ్మాబ్లాక్ కార్యాలయంలో దశమ పంచాయతీ సమావేశానికి బరంపురం ఎంపీ ప్రదీప్కుమార్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సమావేశంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవ ర తిరుపతిరావు, గుమ్మసమితి అధ్యక్షురాలు సునేమీ మండల్ తదితరులు పాల్గొన్నారు. గుమ్మబ్లాక్లో విద్య, వైద్య, విద్యుత్, గ్రామీణాభివృధ్ధి, సాగునీరు, తాగునీరు, రోడ్లు నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ పాణిగ్రాహి అజయగడ–నమ్మనగుడ రోడ్డు, సెరంగో నుండి కుజాసింగి రోడ్డు నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాలకు శంకుస్థాపన చేసి శిలాఫలకాలు వేశా రు. అనంతరం పర్లాకిమిడి చేరుకుని బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీడీఓ దులారాం మరాండి, జిల్లా పరిషత్ సీడీఓ. దయామయా పాడీ, తహసీల్దార్ శరత్ శోబోరో, జెడ్పీటీసీ (గుమ్మ)రేనుకా పాత్రో, తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్లలో సీసీ టీవీలు ఏర్పాటు చేయండి
రాయగడ: విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని కొలనార సమితి పరిధిలోని రివల్కొన ప్రభుత్వ ఎస్ఎస్డీ హైస్కూల్ హాస్టల్లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర శిశు సంరక్షణ కమిషన్ అధ్యక్షురాలు బబితా పాత్రో బుధవారం పరిశీలించారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో కౌన్సిలర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆగష్టు 3వ తేదీన రివల్కొన పాఠశాలలోని హాస్టల్లో ఉంటున్న పదో తరగతికి చెందిన విద్యార్థులు అదే హాస్టల్లో ఉంటున్న జూనియర్ విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలను సందర్శించిన బబితా పాత్రొ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించి సదరు విద్యార్థిపై చర్యలు తీసుకుని హాస్టల్ నుంచి తొలగించినట్లు తెలిపారు. పాఠశాలలో మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉపాధ్యాయులకు ప్రత్యేక సూచనలు చేశారు. విద్యార్థుల భద్రత కోసం పాఠశాలల్లో పనిచేయని సీసీ టీవీ కెమెరాల స్థానంలో వెంటనే కొత్త కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం, నిద్ర వసతులు సక్రమంగా ఉన్నప్పటికీ భద్రత చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతీ హాస్టల్లో కౌన్సిలర్.. చిన్నారుల్లో పెరుగుతున్న ప్రతికూల ప్రవర్తనను నియంత్రించడంతోపాటు వారి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రంలోని ప్రతీ హాస్టల్లో కౌన్సిలర్ను నియమించే ప్రణాళిక ఉందని బబితా పాత్రొ తెలిపారు. విద్యార్థుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని వారికి సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే కౌన్సిలర్ల లక్ష్యమని పేర్కొన్నారు. అదేవిధంగా హాస్టళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, మలేరియా నివారణకు మెరుగైన దొమతెరలు అందుబాటులో ఉంచాలని, ప్రాథమిక చికిత్స, అవసరమైన మందుల సదుపాయాలు కల్పించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు.. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులను కూడా బలొపేతం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సొంత భవనాలు లేని కేంద్రాలను గుర్తించి కొత్త భవనాల నిర్మాణానికి రూ.11 లక్షల చొప్పున నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే అదనంగా మరో రూ. 6 లక్షలు కూడా కేటాయించే అవకాశం ఉందన్నారు. ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో ప్రహరీ, ప్రత్యేక మరుగుదొడ్లు, వంటగది, తాగునీటి సదుపాయం, పిల్లలు ఆడుకునేందుకు స్థలం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సక్షమ్ అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతోపాటు అద్విక కార్యక్రమం ద్వారా పిల్లలకు పరిశుభ్రత, శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు, హాస్టళ్లలో సిబ్బంది కొరతతోపాటు ఇతర సమస్యలపై జిల్లా కలెక్టర్, పీడీ, ఐటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం రాత్రి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించిన ఇక్కడ ఉన్న సమస్యలను పరిశీలించారు. రోగులు ఉంటున్న వార్డుల్లో పర్యటించి సౌకర్యాలపై ఆరా తీసారు. ఈ పర్యటనలో ఆమె వెంట ఎస్ఎస్డి ఉపాధ్యాక్షురాలు మంజుల మినియాక, బీజేపీ సేనియర్ నాయకుడు శివ శంకర్ ఉలక, తదితరులు పాల్గొన్నారు. -
సర్పై క్షేత్రస్థాయి పరిశీలన
రాయగడ: ఎస్ఐఆర్–2026లో భాగంగా ఓటరు జాబితా పునః సమీక్ష, ధ్రువీకరణ, సూపర్ చెకింగ్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఐడీసీఓ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్నికల జాబితా పరిశీలకుడు డాక్టర్ ప్రశాంత్ కుమార్ రెడ్డి బుధవారం జిల్లాలో రెండోసారి పర్యటించి, వివిధ ప్రాంతాల్లో ఎస్ఐఆర్–2026 పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. పర్యనటలో భాగంగా తొలుత గుణుపూర్ సమితిలోని న్యూకాలనీని సందర్శించిన డాక్టర్ రెడ్డి సూపర్ చెకింగ్కు ఎంపికై న ఫారం–7 దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత బూత్ లెవల్ అధికారులతో మాట్లాడి దరఖా స్తు పరిశీలన విధానం, అవసరమైన పత్రాలు, సూపర్ చెకింగ్ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలోని పద్మపూర్ సమితిలో పర్యటించారు. సమితిలోని అఖుసింగి–2, రామనగుడ సమితిలోని మోసారిగుడ ప్రాంతాలను సందర్శించి సూపర్ చెకింగ్కు ఎంపికై న ఫారం–6 దరఖాస్తులను పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం.. పర్యటన సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎస్ఐఆర్–26 ప్రస్తుత దశ, జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతి, అభ్యంతరాల స్వీకరణ, విచారణ ప్రక్రియపై చర్చించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతీ దశను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఎస్ఐఆర్–2026లో ఫారం–6, ఫారం–7 దరఖాస్తు ల పరిశీలన, సూపర్ చెకింగ్ కొనసాగుతున్నాయి. తదుపరి దశంలో అభ్యంతరాల స్వీకరణ, విచారణ పూర్తి చేసి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 21న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్నా, గునుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. -
యువకుడు ఆత్మహత్య
మల్కన్గిరి: మల్కన్గిరి సమితి ఎం.వి.92 గ్రామంలో సాగర్ సర్కార్ (23) అనే యువకుడు మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సాగర్ కొద్దిరోజుల కిందట కోల్కతాలో పనిచేస్తున్న సమయంలో ఓ వివాహితను ప్రేమించి తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న సాగర్ తండ్రి గ్రామపెద్దల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించి సాగర్ను కొట్టి రూ.45 వేలు జరిమానా విధించారు. అనంతరం వివాహిత భర్తను పిలిపించి అతనితో పంపించేశారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన సాగర్ మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. మల్కన్గిరి ఐఐసి ప్రభుదత్త మాలిక్ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. -
చెస్లో ఎలెనా మిశ్రా ప్రపంచ రికార్డు
● పిన్న వయసులో ఘనతభువనేశ్వర్: చదరంగం క్రీడలో ఒడిశాకు చెందిన చిన్నారి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఘనత సాధించింది. ఒడిశాకు చెందిన 4 ఏళ్ల ఎలెనా మిశ్రా అధికారిక ఫిడే రేటింగ్ సాధించిన అతి పిన్న వయస్కురాలైన మహిళా క్రీడాకారిణిగా చదరంగం క్రీడా ప్రపంచంలో ఒక అద్భుతమైన మైలు రాయిని ఆవిష్కరించింది. ఎలెనా మిశ్రా కేవలం 4 సంవత్సరాల 6 నెలల 16 రోజుల వయస్సులో ఈ రికార్డు సృష్టించడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అంతర్జాతీయ చెస్ పాలక సంస్థ ప్రచురించిన రేటింగ్ల ప్రకారం కేవలం 4 సంవత్సరాల 6 నెలల 16 రోజుల వయస్సు గల ఎలెనా 1432 బ్లిట్జ్ రేటింగ్తో అధికారిక ఫిడే రేటింగ్ను పొందిన అతి పిన్న వయస్కురాలైన మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. స్థానిక మదర్స్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఒడిశా స్టేట్ బ్లిట్జ్ ఫిడే రేటింగ్ ఓపెన్ చెస్ చాంపియషిప్ 2026లో ఆమె ఈ ఘనతను సాధించింది. ఈ టోర్నమెంట్లో ఆమె ప్రతిభ అత్యంత చిన్న వయస్సులోనే ఆమెకు అధికారిక ఫిడే రేటింగ్ జాబితాలో స్థానం సంపాదించి పెట్టింది. ప్రస్తుతం 2022, ఆ తర్వాత జన్మించిన వారిలో ఏ ఫార్మాట్లోనైనా అధికారిక ఫిడే రేటింగ్ను కలిగి ఉన్న ఏకై క బాలిక, క్రీడాకారిణి ఆమె మాత్రమే కావడం సాధించిన ఘనతకు ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎలీనా మిశ్రా సాధించిన ఈ మైలు రాయి ఘనత ఒడిశాలోని చిన్న పిల్లల్లో చదరంగం పట్ల మరింత ఆసక్తిని కల్పించి జాతీయ, అంతర్జాతీయ చదరంగ పటంలో రాష్ట్రానికి పెరుగుతున్న ప్రాబల్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. -
విద్యార్థుల గోడు పట్టించుకోరా..?
● ఆర్టీసీ బస్సులు ఆపాలని విద్యార్థుల నిరసన ● డీఆర్వలస కూడలి వద్ద బైఠాయింపు ● పోలీసులు సముదాయించడంతో శాంతించిన విద్యార్థులు జి.సిగడాం: మండలంలోని డీఆర్వలస వద్ద విద్యార్థులు బస్సు కోసం బుధవారం రోడ్డెక్కారు. రాజాం–విజయనగరం ప్రధాన రహదారి మధ్యలో డీఆర్వలస కూడలి ఉంది. ఈ కూడలికి సర్వేశ్వరపురం, డి.బొండపల్లి, దాలెమ్మరాజువలస, గదబపేట, ముషినివలస, శిరిగిడిపేటకు చెందిన ప్రయాణికులు, విద్యార్థులు వస్తుంటారు. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు ఈ సెంటర్ నుంచే అటు విజయనగరం.. ఇటు రాజాం తదితర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఆర్టీసీ బస్సులు ఇక్కడ నిలుపుదల చేయడం లేదు. దీంతో ప్రతిరోజు ఉదయం వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రైవేట్ వాహనాలు లేక, ఇటు ఆర్టీసీ బస్సులు ఆపక తిరిగి ఇంటిముఖం పడుతున్నారు. కాస్తో కూస్తో స్తోమత ఉన్నవారు ఎలాగోలా ప్రైవేట్ వాహనాలు ద్వారా కాలేజీలకు వెళ్తున్నారు. మిగిలినవారంతా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బుధవారం వీరంతా అటు విజయనగరం, ఇటు రాజాం వెళ్లే ఆర్టీసీ బస్సులకు అడ్డంగా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ కూడలిలో ఎందుకు బస్సులు ఆపడం లేదు.. బస్సు పాసులు ఇచ్చి ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ఆర్టీసీ డ్రైవర్లను ప్రశ్నించారు. అయితే బస్సులు ఖాళీ ఉండడం లేదని, కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారని, ఈ కారణంగానే కూడలి వద్ద ఆపలేకపోతున్నామని సమాధానం చెప్పారు. గతంలో మాదిరిగా ఆర్టీసీ సర్వీసులు లేవని, తగ్గించేశారని చెప్పడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. తమ సమస్య పరిష్కరించేవరకూ ఏ బస్సును కదలనీయమని రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల రంగ ప్రవేశం డీఆర్వలస సెంటర్లో విద్యార్థుల నిరసన విషయాన్ని తెలుసుకున్న జి.సిగడాం పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఈ నిరసన కార్యక్రమం కారణంగా డీఆర్వలస కూడలికి రెండు వైపులా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులతో పోలీసులు మాట్లాడారు. ఆర్టీసీ సర్వీసులు ఉదయం, సాయంత్రం సమయాల్లో పెంచడంతో పాటు ప్రతీ ఆర్టీసీ బస్సూ విద్యార్థుల కోసం డీఆర్వలస కూడలిలో నిలుపుదల చేయాలని, ఎంత రద్దీగా ఉన్నా బస్సును ఆపాలని కోరారు. ఆర్టీసీ సిబ్బంది అందుకు అంగీకరించడంతో నిరసన తాత్కాలికంగా సద్దుమణిగింది. -
సెంచూరియన్ వర్సిటీలో కౌశల్ కృషిమేళా
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ ఆడిటోరియంలో మంగళవారం కౌశల్, కృషిమేళా నిర్వహించారు. బరంపురం ఎం.పి.ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి, సెంచూరియన్ వర్శిటీ ఉపాధ్యక్షులు డి.ఎన్.రావు, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, ఉపకులపతి సుప్రియా పట్నాయిక్, రిజిస్ట్రార్ అనితా పాత్ర్, డైరక్టర్ (అడ్మిన్) దుర్గాప్రసాద్ పాఢి, ఎం.ఎస్.స్వామినాథన్ వ్యవసాయ కళాశాల డీన్ ఎస్.పి.నందా, ఫిషరీస్, యానిమల్ హాజ్బెండరీ డీన్ డాక్టర్ గిరీష్ మహాంతి, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్శిటీలో డ్రోన్ సహాయంతో వ్యవసాయం, గోబర్ గ్యాస్ ప్లాంట్ను ప్రారంభించారు. వర్శిటీ ఉద్యానవనాలలో పండిస్తున్న వివిధ రకాల మొక్కలు, డ్రాగన్ ప్రూట్ కల్చర్, ఫిషరీస్ ఆధ్వర్యంలో రొయ్యలు, చేపల పెంపకం, వెటర్నరీ కళాశాలను ఎం.పి.ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి పరిశీలించారు. వ్యవసాయ, ఫిషరీస్, వెటర్నరీ కళాశాలలకు సెంచూరియన్ వర్శిటీ భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని ఎంపీ పేర్కొన్నారు. -
క్షయవ్యాధిపై అవగాహన
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో బుధవారం టీబీ ముక్త భారత్ అభిజాన్ పేరిట అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్.ఎ.సి బెటాలియన్ 15(ఓ) ఆదేశాల మేరకు కమాండింగ్ అధికారి లెఫ్టనెంట్ కర్నల్ పీతిరంజన్ దాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ అనూప్ నాయిక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యుడు శివసాయి స్వరూప్ (ఎ.పి.పి.హెచ్.ఓ–టీబీ) ముఖ్యవక్తగా పాల్గొని క్షయ వ్యాధి లక్షణాలు, నిరోధక చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్.ఎ.సి బెటాలియన్ 15(ఓ) సుబేదార్, అసిస్టెంట్ కలెక్టర్ అనూప్ నాయిక్, కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
అరుదైన పాంగొలిన్ ప్రత్యక్షం
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి ధమునిపంగ పంచాయతీ డమలిమా గ్రామ సమీపంలో అరుదైన వన్యప్రాణి పాంగొలిన్ (బజ్రకాష్ట)ను స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పాంగొలిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలివేయనున్నట్లు ఫారెస్టర్ బర్కారాణి పాత్ర, గార్డ్ అనుష్క పండా, ఫారెస్టర్ విక్రంనాయుడు తెలిపారు.వంశధార నదిలో వ్యక్తి గల్లంతు రాయగడ: గుణుపూర్లోని వంశధార నదిలో బుధవారం స్నానానికి దిగిన ఓ వ్యక్తి నదీ ప్రవాహం కారణంగా కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సముద్రంలో గల్లంతై పర్యాటకుడి మృతి భువనేశ్వర్: పూరీ సముద్రంలో స్నానం చేస్తున్న ఐదుగురు పర్యాటకులు అలల ధాటికి కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఓ పర్యాటకుడు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లైట్ హౌస్ బీచ్ సమీపంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడిని ఉత్తర ప్రదేశ్లోని రాణిపూర్కు చెందిన సుమిత్ గుప్తాగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బీహార్కు చెందిన పర్యాటకుడు అనీష్ సింగ్ను మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్కు తరలించారు.సుమిత్ గుప్తా, అనీష్ సింగ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుమిత్ గుప్తా మరణించాడు. అనీష్ సింగ్ భువనేశ్వర్ ఆసుపత్రిలో ఉన్నత చికిత్స పొందుతున్నాడు. నీటి గుంతలోకి దూసుకెళ్లిన కారు ● దంపతుల దుర్మరణం భువనేశ్వర్: లోతైన గుంతలో కారు పడిపోవడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన పారాదీప్ గొడొ బజార్ సమీపంలో బుధవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. దంపతులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపై నుంచి పక్కకు జారి పోయి నీటి గుంతలో మునగడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు భావిస్తున్నారు. మృతులను పారాదీప్ పోర్ట్లోని మైరెన్ డిపార్ట్మెంట్ విశ్రాంత ఉద్యోగి బిభూతి భూషణ్ దాస్, అతని భార్య ప్రతిమా దాస్గా గుర్తించారు. కారు రోడ్డు డివైడర్ను ఢీకొనడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం అదుపు తప్పి నీటి గుంతలోకి దూసుకెళ్లింది. నీటిలో మునిగిపోయిన కారులో ఉన్న ఇద్దరూ అందులోనే చిక్కుకుపోయారు. వారిని సకాలంలో రక్షించలేక పోయారు. లాక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చే సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. 203 కిలోల గంజాయి పట్టివేత మల్కన్గిరి: మల్కన్గిరి సమితి ఝాటిగూడ అటవీ ప్రాంతంలో రవాణాకు సిద్ధం చేసిన 203 కిలోల గంజాయిని మల్కన్గిరి ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. సోమవారం అందిన ముందస్తు సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ పొద చాటున ఉన్న 8 గంజాయి బస్తాలు పట్టుకున్నారు. వీటిన మంగళవారం తూకం వేయగా 203 కిలోలుగా గుర్తించారు. దీని విలువ రూ.25 లక్షలు ఉంటుందని దర్యాప్తు అధికారులు తెలిపారు. -
ఆర్థిక సాయం అందజేత
రాయగడ: మృతి చెందిన జర్నలిస్టు రాజీవ్ లోచన్ పండ తల్లిదండ్రులకు రాయగడ ప్రెస్ యూనియన్ మరోసారి ఆర్థిక సాయం అందజేసింది. యూనియన్ అధ్యక్షుడు ఇప్పిలి సర్వేశ్వరరావు నేతృత్వంలో గుముడా ఖిలింగరాయిలోని వారి నివాసానికి వెళ్లి నెలకు రూ.1,000లు చొప్పున 11 నెలలకు సంబంధించిన రూ.11 వేల భత్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి శివాజీ దాస్ మాట్లాడుతూ యూనియన్ ఒక కుటుంబం, సభ్యులు కష్టాల్లో ఉన్నప్పుడు సంఘం అండగా నిలస్తుందన్నారు. ప్రతీ సభ్యుడి కుటుంబానికి రక్షణగా నిలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని సంఘం సలహాదారుడు సురేష్ దాస్ కోరారు. ఘనంగా పోషకాహార దినోత్సవం పర్లాకిమిడి: సమతుల్యమైన పోషక విలువలు కలిగిన ఆహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే పోషకాహార దినోత్సవం ముఖ్య ఉద్దేశమని నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్.ఎన్.సంధ్య అన్నారు. ఆర్.సీతాపురంలో సెంచూరియన్ వర్సిటీ ఆధ్వర్యంలో గుసాని బ్లాక్ రణదేవి గ్రామంలో పోషకాహార దినోత్సవం 2026ను విద్యార్థులు, ఫ్యాకల్టీ నిర్వహించారు. సరైన పోషకాహారంపై నర్సింగ్ విద్యార్థులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పోషకాహారం శరీరం ఎదుగుదల, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతగానో సహాయపడుతుందని వివరించారు. పోస్టర్ ప్రదర్శించి సమతుల్య ఆహారం వల్ల పిల్లల ఎదుగుదలను వివరించారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్లు, సునీత, మధుచందా తదితరులు పాల్గొన్నారు. ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్ మల్కన్గిరి: పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో 25 ఏళ్ల సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా బీజేపీ నేతలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవకు అంకితమైన 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు చేపట్టారు. మహిళల గౌరవం కోసం నరేంద్ర మోదీ చేసిన ప్రతీ పథకం కూడా ప్రజలకు అందేవిధంగా చూడాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు అశోక్ పారిడా వెల్లడించారు. కార్యక్రమంలో మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి, కుశ్ తాతి, శాంతిలత మాఝి, ప్రత్యేక అభివృద్ధి మండలి చైర్మన్ గంగా సోడి, మాజీ ఎమ్మెల్యే డంబరు సీసా, జిల్లా కార్యదర్శి మాణిక్ లాల్ చక్రవర్తి, నవఘన్ లోకేయి తదితరులు పాల్గొన్నారు. సోఫియా ఫిర్దౌస్ రాజీనామా చేయాలి భువనేశ్వర్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో మరో రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తే బారాబటి కటక్ శాసనసభ నియోజక వర్గం సిటింగ్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) కోరింది. 2024లో ఆమె కాంగ్రెస్ టికెట్పై రాష్ట్ర శాసన సభకు ఎన్నికై న విషయం తెలిసిందే. కాబట్టి మరో రాజకీయ పార్టీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ముందే పార్టీని వీడాలి అని ఓపీసీసీ చీఫ్ తెలిపారు. తన కుమార్తె ఫిర్దౌస్ బారాబటి కటక్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్పై తిరిగి పోటీ చేయదు. 2029 ఎన్నికలలో కొత్తగా ఏర్పడిన ఒడిశా జనతా కాంగ్రెస్ (ఓజేసీ) అభ్యర్థిగా పోటీ చేస్తుందని మాజీ శాసన సభ్యుడు మహ్మద్ మోకిమ్ ప్రకటించిన మర్నాడు భక్త చరణ్ దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో సోఫియా ఫిర్దౌస్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి పూర్ణచంద్ర మహాపాత్రోను సుమారు 8,000 ఓట్ల తేడాతో ఓడించి ప్రతిష్టాత్మకమైన బారాబటి కటక్ శాసన సభ స్థానాన్ని గెలుచుకున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 16న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెతో పాటు మరో 2 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జెనా, దాశరథి గోమాంగోలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. -
బయో మైనింగ్కు శ్రీకారం
రాయగడ: పట్టణాన్ని పరిశుభ్రంగా, కాలుష్య రహితంగా తీర్చిదిద్దే దిశగా మున్సిపాలిటీ కీలక ముందడుగు వేసింది. స్థానిక మజ్జిగౌరి మందిరానికి సమీపంలోని పాత డంపింగ్ యార్డులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సుమారు 60 వేల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో తొలగించి, పునర్వినియోగం చేసి వ్యర్థాల శాసీ్త్రయ శుద్ధి ప్రక్రియ (బయో మైనింగ్)కి మంగళవారం శ్రీకా రం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి హాజరై ప్రాజెక్టును ప్రారంభించారు. మజ్జిగౌరి మందిరానికి సమీపంలోని ఈ పాత డంప్సైట్లో పేరుకుపోయిన లెగసీ వ్యర్థాల బయో మైనింగ్ కోసం మున్సిపాలిటీ యంత్రాంగం టెండర్ ప్రక్రియ చేపట్టింది. ఈ పనులకు మూడు ప్రైవేట్ సంస్థలు దరఖాస్తు చేయగా నిబంధనల ప్రకారం ఝనేశ్వర్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఎంపిక చేసి 2026 ఏప్రిల్ 21న పనుల ఉత్తర్వులను జారీ చేశారు. బయో మైనింగ్ ద్వారా పాత చెత్తను శాసీ్త్రయ పద్ధతిలో వేరుచేసి, పునర్వినియోగానికి అనువైన పదార్థాలను తిరిగి వినియోగించనున్నారు. మొత్తం 60 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను నిర్వహించేందుకు ఈ సంస్థకు 4 నుంచి 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ ప్రక్రియలో లభించే ఆర్డీఎఫ్ వ్యర్థాలను సిమెంట్ పరిశ్రమలకు పంపించనుండగా, తడి వ్యర్థాలను ల్యాండ్ ఫిల్లింగ్కు వినియోగించనున్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి దేవరాజ్ టక్రీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అఽధికారి కులదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మోసం
రాయగడ: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ యువతి నుంచి రూ.లక్ష తీసుకుని మోసం చేశారని స్థానిక వెబ్ ఛానల్ జర్నలిస్ట్ అనుబ్రత బరాపై సదరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. తెరువలి ప్రాంతానికి చెందిన యువతి జుబంతి హికక పట్టణంలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి సదరు జర్నలిస్టు తన వద్ద నుంచి రూ.లక్ష తీసుకున్నారని ఆరోపించారు. గత ఆరు నెలలుగా ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మిస్తూ వచ్చారని, అనంతరం రూ.లక్షకు సంబంధించిన చెక్ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ చెక్ను బ్యాంకులో జమ చేయగా బౌన్స్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ జుబంతీ తన బంధువుతో కలసి మంగళవారం సదరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇప్పించడంతో జర్నలిస్టుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. కాగా ఈ విషయంపై పోలీసుల అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. -
మోసం కేసులో నిందితుడు అరెస్టు
పర్లాకిమిడి: ముక్కుడమ్మ మహిళా స్వయం సేవక్ గ్రూపులు సేకరించిన డబ్బులు, మైక్రో ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్ అందజేసిన రుణాలు కాజేసి పరారైన సిద్ధకుమార్ అలియాస్ సిద్ధ ఆరాధ్యను హైదరాబాద్లో యూసఫ్గుడలోని హైలాం కాలనీలో ఒడిశా పోలీసులు అరెస్టు చేసి పర్లాకిమిడి ఎస్డీజేఎం కోర్టులో సోమవారం హాజరుపరిచారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక బగాతి వీధికి సమీన్ బేగం జూన్ 11న పోలీసుస్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధకుమార్ మైక్రోఫైనాన్స్, మహిళా స్వయం సహాయక గ్రూపుల వద్ద నుంచి కలెక్షన్ చేసిన బాకీ సొమ్ము రూ.80 లక్షలు, 110 గ్రాముల గోల్డును కోవిడ్ 2019లో కాజేసి పరారయ్యారు. దీంతో మైక్రోఫైనాన్స్ కంపెనీ ప్రెసిడెంట్ ఎ.పద్మారాజ్, దివంగత అనిల్ కుమార్ పాత్రోకు కంపెనీ లావేదేవీలు అన్ని అప్పగించి అమెరికా వెళ్లిపోయారు. దీంతో అకౌంటెట్ సపన్ కుమార్ పాణిగ్రాహి, సిబ్బంది కాళీప్రసాద్ పట్నాయిక్, అశోక్కుమార్ మహాపాత్రోలు మైక్రోఫైనాన్స్లో మోసం జరిగిందని గమనించి సిధ్ధకుమార్పై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదర్శ పోలీసుస్టేషన్లో ఐఐసీ ప్రశాంత్ భూపతి, ఇతర సిబ్బంది దర్యాప్తు జరిపి సిద్ధకుమార్ను ఎట్టకేలకు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. -
బాధ్యతల స్వీకరణ
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే కొత్త అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా బిజయ్ కుమార్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఏఎస్) 1991 బ్యాచ్ అధికారి. రైల్వే ఆర్థిక, పథకాల నిర్వహణ, రైలు కార్యకలాపాల రంగంలో సుదీర్ఘంగా 35 సంవత్సరాలకు పైబడిన విభిన్నమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. భారతీయ రైల్వేలో తన విశిష్టమైన కెరీర్లో ఆయన అనేక ముఖ్యమైన సవాళ్లతో కూడిన బాధ్యతలను నిర్వహించారు. తన ప్రస్తుత బాధ్యతతో పాటు బిజయ్ కుమార్ తూర్పు కోస్తా రైల్వేలో ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ (పీఎఫ్ఏ)గా కూడా పని చేస్తున్నారు. అక్కడ ఆయన అకౌంట్స్, ఫైనాన్స్, బడ్జెటింగ్, ఇంటర్నల్ ఆడిటింగ్ వంటి కీలకమైన విధులకు బాధ్యత వహిస్తున్నారు. గతంలో ఈశాన్య సరిహద్దు రైల్వేలోని తిన్సుకియా మండలంలో మండల రైల్వే అధికారి (డీఆర్ఎం)గా పని చేశారు. మలేషియాలోని కౌలలాంపూర్లో ఉన్న ఐఆర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో డిప్యుటేషన్పై ప్రాజెక్ట్ ఫైనాన్స్ హెడ్గా చేరి ప్రధాన అంతర్జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యవేక్షించారు. విద్యాపరంగా బిజయ్ కుమార్ మిశ్రా ధన్బాద్ ఐఐటీ నుంచి అప్లయిడ్ జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ లీ క్వాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నుంచి మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ (ఎంపీపీ) పట్టాను పొందారు. ఆయన లండన్ మరియు ప్యారిస్లోని యూరోపియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో, చైనాలోని బీజింగ్ జియావోటాంగ్ యూనివర్సిటీలో హెవీ హాల్ రైల్వే టెక్నాలజీలో ఉన్నత వృత్తిపరమైన శిక్షణను పొందారు. ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి ● నిందితులకు రెండేళ్ల జైలుశిక్ష రాయగడ: విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్పై అమానుషంగా దాడి చేసిన ఘటనపై జిల్లా కోర్టు ఇద్దరు నిందితులకు రెండేళ్ల పాటు జైలు శిక్షను విధించడంతో పాటు ఒకొక్కరూ రూ.2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ జరిమానా కట్టకుంటే అదనంగా మరో రెండేసి నెలలు జైలు శిక్ష అనుభవించాలని తమ తీర్పులో పేర్కొంది. రాయగడ సివిల్ జడ్డి (సీనియర్ డివిజన్), అదనపు సెషన్ జడ్డి ఆశీష్ పట్నాయక్ ఈ తీర్పును వెలువరించారు. వివరాల్లోకి వెళ్తే.. 2023 నవంబర్ 17వ తేదీన బాధితుడు ప్రణవ్ కుమార్ పాఢి ట్రాఫిక్ విధుల్లో ఉండగా అదే సమయంలో నిందితులు జి.అజయ్ అలియాస్ ఎస్కే ఇమ్రాన్, ఎం.మణికంఠలు ఒక బైకుపై ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారు. వెంటనే వారిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి నిలదీశా రు. దీంతో నిందితులిద్దరూ ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడికి దిగారు. ఈ మేరకు కానిస్టేబుల్ సదరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసును సోమవారం విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది. -
హైటెక్లో అరుదైన శస్త్ర చికిత్స
● 7 గంటల పాటు నిరవధికంగా శస్త్ర చికిత్స ● రోగి ప్రాణాలు కాపాడిన వైద్యుల బృందం భువనేశ్వర్: హైటెక్ ఆస్పత్రిలో జరిగిన అరుదైన శస్త్ర చికిత్స ద్వారా ఒక రోగి మృత్యువు నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. గంజాం ప్రాంతానికి చెందిన సూరజ్ నాయక్ వృత్తిరీత్యా డ్రైవర్. అతడు చాలా కాలంగా ఛాతీ, వీపు, మెడలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రిలో చేరిన తర్వాత వ్యాధిని నిర్ధారించినా.. సకాలంలో శస్త్ర చికిత్స చేయలేకపోయారు. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత హుటాహుటిన సూరజ్ను హైటెక్ వైద్య బోధన ఆస్పత్రిలో చేర్పించారు. వివిధ పరీక్షలు, సిటీ స్కాన్, ఈసీజీ, యాంజియోగ్రఫీ పరీక్షల ఆధారంగా రోగి గుండెలోని ప్రధాన ధమనిలో చీలిక ఏర్పడి దాని నుంచి రక్త ప్రవాహం గుండైపె తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోందని కనుగున్నారు. దీనికి తక్షణమే అవసరమైన శస్త్ర చికిత్స చేసేందుకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందాన్ని సిద్ధం చేశారు. డాక్టర్ రితేష్ ఆచార్య, డాక్టర్ శ్వేతా దాస్, డాక్టర్ స్మృతి ప్రకాష్ సాహు, డాక్టర్ సత్య స్వరూప్ పట్నాయక్లతో కూడిన బృందం శస్త్ర చికిత్సకు నడుం బిగించింది. డాక్టర్ శ్వేతాంక్ దాస్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. శస్త్ర చికిత్స ఇలా... వీరంతా సుమారు 7 గంటల పాటు నిరవధికంగా కొనసాగించిన శస్త్ర చికిత్సలో దాదాపు 34 నిమిషాల పాటు రోగి శరీరం అంతటికీ రక్త ప్రసరణను తాత్కాలికంగా నిలిపివేసి, కేవలం గుండెకు మాత్రమే కృత్రిమంగా వెంటిలేషన్ అందించారు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా సమగ్ర వైద్య బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి రోగిని మృత్యు ముప్పు నుంచి బతికించడం విశేషం. సాయంత్రం ప్రారంభమైన ఈ శస్త్ర చికిత్స తెల్లవారుజాము వరకు నిరవధికంగా కొనసాగింది. ఇలాంటి వ్యాధులతో 100 మందిలో 70 మంది రోగులు మరణించే ప్రమాదం ఉందని డాక్టర్ శ్వేతాంక్ దాస్ అన్నారు. డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి సారధ్యంలో అత్యాధునిక చికిత్సా విధానం అందుబాటులో ఉండడం వలన సూరజ్ నాయక్ ప్రాణాలను కాపాడడం సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆరోగ్య బీమా కార్డుపై ఈ శస్త్ర చికిత్స జరిగింది. రోగి ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత అతడు యథావిధిగా పనులన్నీ చేసుకోగలుగుతాడని వైద్య బృందం అభయం ఇచ్చింది. -
ఆహ్లాదకర వాతావరణంలో..!
● పూరీ మందిరంలో ఏసీ సౌకర్యం ● భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు ● ఆలయ పవిత్రతకు ఇబ్బంది లేకుండా చర్యలుభువనేశ్వర్: పూరీలోని జగన్నాథ స్వామివారి ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఉక్కపోత, తేమ నుంచి ఉపశమనం లభించనుంది. ప్రధాన ఆలయం లోపల నాట్య మండపం ప్రాంగణంలో పూర్తిగా ఎయిర్ కండిషన్ (ఏసీ) సౌకర్యం కల్పించారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో భక్తులకు దర్శనానికి ఈ సదుపాయం సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తుంది. నాట్య మండపం ప్రాంగణంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న భక్తులు, యాత్రికుల చిరకాల కోరిక తీరింది. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభమైంది. ముఖ్యంగా భొత్తొరొ కఠొ దర్శనం (లఘు దర్శనం) సమయంలో ఇటువంటి ఏర్పాటు ఉపశమనం కల్పిస్తుంది. ఈ ప్రాంగణంలో దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడిన సమయంలో వేడి, తేమతో కూడిన వాతావరణం అలముకొని తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. ఏసీ సదుపాయం అందుబాటులోకి రావడంతో జగన్నాథ స్వామి, ఆయన తోబుట్టువుల దర్శనం కోసం నాట్య మండపాన్ని సందర్శించే భక్తులు సౌకర్యవంతమైన వాతావరణంలో సమయం గడపగలుగుతారు. ఈ సదుపాయం ముఖ్యంగా వేసవి కాలంలో మరియు అధిక తేమ ఉండే సమయాల్లో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.పటిష్ట జాగ్రత్తలు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ వల్ల దేవతా విగ్రహాలకు, ఆలయ ఆచారాలకు లేదా శ్రీమందిరం వారసత్వ కట్టడాల పవిత్రతకు ఎలాంటి దుష్ప్రభావం కలగకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. ఆలయ ఆచారాలు, వారసత్వ సంరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏసీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ వారసత్వ కట్టడం రక్షణ కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నాట్య మండపంలో వేరియబుల్ రిఫ్రిజెరేట్ ఫ్లో (వీఆర్ఎఫ్) టెక్నాలజీతో కూడిన ఆధునిక ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పని చేస్తుంది. ఈ సదుపాయం నిరంతరాయంగా పనిచేసేలా చూసేందుకు దీనికి 5 ఏళ్ల నిర్వహణ మరియు మరమ్మతుల నిబంధనతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
ఆస్తి నేరాలపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం క్రైమ్ : పెండింగ్లో ఉన్న ఆస్తి నేరాల కేసుల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించి కోర్టులో చార్జిషీట్ దాఖలయ్యేలా చూడాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్సు ద్వారా డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆస్తి నేరాల్లో సీసీ కెమెరాల ఫుటేజీ కీలకంగా మారుతుందన్నారు. నేరం జరిగే ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించి నేరస్థుల కదలికలను గుర్తించాలని, భౌతిక ఆధారాలతో పాటు సాంకేతిక ఆధారాలను శాసీ్త్రయ పద్ధతిలో సేకరించి దర్యాప్తు చేపట్టాలన్నారు. నేరస్థుల గత చరిత్ర, నేరం జరిగే విధానం, సాంకేతిక ఆధారాలు సమన్వయం చేసుకోవాలన్నారు. హౌస్ బ్రేకింగ్, చైన్ స్నాచింగ్, రోబరీ, డెకాయిట్, మర్డర్ ఫర్ గెయిన్, ద్విచక్రవాహనాల దొంగతనాలు వంటివి పెండింగ్ కేసులు పూర్తిచేయాలన్నారు. -
ప్రతిపక్షానికి ఆంక్షలు.. అధికార పక్షానికి అనుమతులు
రణస్థలం: రపజా సమస్యలపై పోరాడేందుకు ప్రతిపక్ష పార్టీ ఏ చిన్న కార్యక్రమం చేసినా పోలీసులు అనుమతులు ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అదే అధికార పార్టీ అనుమతులు తీసుకోకపోయినా పక్కన నిలబడి వత్తాసు పలకడం సరికాదని మండల ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఏడాది జూన్ 12 నాటికి చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలు ఇస్తామన్న హామీలు అమలు చేయలేదని వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ప్రతిపక్ష పార్టీ బైక్ ర్యాలీ చేపడతామని అనుమతి కోరితే పోలీసులు అనుమతులు మంజూరు చేయలేదు. రణస్థలం ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నాయని, జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ చేయడానికి కుదరదంటూ నిలువరించేశారు. అదే అధికార పార్టీలో భాగమైన జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా బుధవారం చేపట్టే భారీ బైక్ ర్యాలీకి లావేరు నుంచి సుభద్రపురం, రణస్థలం, కోష్టా మీదుగా పైడిభీమవరం వరకు జాతీయ రహదారిపై దర్జాగా అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ప్రతిపక్ష పార్టీకి వర్తించే నిబంధనలు.. ఇప్పుడు అధికార పార్టీకి వర్తించవా? అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై జె.ఆర్.పురం సీఐ ఎం.అవతారం, లావేరు ఎస్సై వి.సందీప్కుమార్ వద్ద ప్రస్తావించగా అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. ఖాళీ పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమించాలి శ్రీకాకుళం: ఆగస్టులో కొందరు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేశారని, ఆయా పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు పిసిని వసంతరావు, హెచ్ఎం పశువుల జగన్నాథరావు తదితరులు కోరారు. ఈ మేరకు డీఈఓ ఎ.రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. కొన్ని పాఠశాలల్లో 300 మంది విద్యార్థులున్నా ఒక్కరే సబ్జెక్టు టీచర్ ఉన్నారని, బోధించడం కష్టంగా మారిందన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు బోధన కుంటుపడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
గుణుపూర్లో ప్రోటోకాల్ వివాదం
● ప్రారంభోత్సవ ఫలకాల్లో ఎంపీ, ఎమ్మెల్యే పేర్లు లేవని అభ్యంతరం రాయగడ: జిల్లాలోని గుణుపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శిలా ఫలకాల్లో స్థానిక కొరాపుట్ లోక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగోల పేర్లు లేకపోవడంతో వివాదం చెలరేగింది. అంతేకాకుండా వేడుకలకు ముఖ్య అతిథి గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిలీప్, గౌరవ అతిథి గుణుపూర్ బీడీవో స్వస్థిక్ జమాదార్లు హాజరవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మున్సిపాలిటీ లేదా సమితి పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు సంబంధిత ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించడంతో పాటు ప్రారంభోత్సవ ఫలకాల్లో వారి పేర్లు పొందుపరచాల్సి ఉంటుందని ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో పేర్కొన్నారు. అయితే గుణుపూర్ మున్సిపాలిటీ చైర్మన్ మమత గౌడో, వైస్ చైర్మన్ శివ ప్రసాద్ గౌడో, కార్యనిర్వాహక అధికారి ఈ నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. ఈ విషయాన్ని రాయగడ జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ అక్షయ కుమార్ ఖెముండో, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభి షేక్ అనిల్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే గొమాంగొ తెలిపారు. మరోవైపు ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక మున్సిపాలిటీ అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై స్వాధికార భంగం నోటీసు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కూడా ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్కు లేఖ..? ఫిర్యాదుల నేపధ్యంలో సబ్ కలెక్టర్ మున్సిపాలిటీ చైర్పర్సన్కు లేఖ రాసి ప్రభుత్వ నిబంధనలు, ప్రోటోకాల్ను తప్పనిసరిగా పాటించాలని సూచించినట్లు సమాచారం. అయితే ఆ సూచనల అనంతరం కూడా ఎంపీ, ఎమ్మెల్యే పేర్లు లేకుండానే కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించడం మరింత వివాదానికి కారణమైంది. మరోవైపు సీనియర్ కౌన్సిలర్ దేవీ ఆచార్య మాట్లాడుతూ స్వపరిపాలన దినోత్సవ వేడుకల నిర్వహణకు ముందుగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాల్సి ఉందన్నారు. సమావేశం నిర్వహించకుండా మున్సిపాలిటీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఇబ్బందికర పరిస్ధతులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి స్పందిస్తూ ఇది నా దురదృష్టం అని పేర్కొన్నారు. వివాదం నేపధ్యంలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ దుదూల్, గౌరవ అతిథిగా పేర్కొన్న బీడీవో స్వస్తిక్ జమాదార్ హాజరవ్వలేదు. దీంతో మున్సిపాలిటీ క్యార్యాలయం ప్రాంగణంలో చైర్మన్ మమత గౌడో, వైస్ చైర్మన్ శివ ప్రసాద్ గౌడో, కార్య నిర్వాహక అధికారి సంతోష్ కుమార్ నాయక్, సమితి వైస్ చైర్మన్ సుదర్శన్ సబర్, కౌన్సిలర్లు దేవీ ప్రసాద్ ఆచార్య, భాగిరథి బొసొయి తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఆర్టీసీ బస్ సర్వీసులు రద్దు
శ్రీకాకుళం అర్బన్: పాయకరావుపేటలో బుధవారం జరగనున్న జలహారతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు వేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 20, రెండో డిపో నుంచి 20, టెక్కలి డిపో నుంచి 10, పలాస డిపో నుంచి 15 బస్సులు మొత్తం 65 బస్సులు జిల్లాలో రద్దు చేశామని, ప్రయాణికులు గమనించి వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుడికి రిమాండ్ శ్రీకాకుళం రూరల్: మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆధ్వర్యంలో పాఠశాలలో విచారణ చేపట్టగా.. వాస్తవాలు నిజమని తేలడంతో సదరు ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. కొట్లాట కేసులో ఐదుగురిపై కేసు నమోదు కొత్తూరు: కొత్తూరులో ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద సోమవారం రాత్రి జరిగిన కొట్లాటకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.వెంకటేష్ మంగళవారం తెలిపారు. వండంకి మంజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై, సొంట్యాన నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. బైక్ ఢీకొని ఒడిశా యువకుడు మృతి నరసన్నపేట: ఉర్లాం సమీపంలో ఆర్అండ్బీ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన 19 ఏళ్ల యువకుడు మృత్యువాత పడ్డాడు. మృతుడు ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా మునిగూడకు చెందిన పప్పు దండసేన(19)గా పోలీసులు గుర్తించారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఉర్లాం వద్ద కొంతకాలంగా పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనులు చేసేందుకు వచ్చిన దండసేన నిత్యావసర సరుకుల కోసం తన స్నేహితుడితో కలిసి ఉర్లాం వచ్చాడు. తిరిగి తమ నివాసానికి వెళ్తుండగా గొనబుపేటకు చెందిన కుంచి రాంప్రసాద్ బైక్పై అతి వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన దండ సేనను నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సిబ్బంది చికిత్స ప్రారంభించగా అప్పటికే మృతి చెందాడు. నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వాహనం పడుపుతున్న రాంప్రసాద్కు కూడా గాయాలయ్యాయి. వాహనం నడుపుతుండగా కంట్లో పురుగు పడటంతో బండి అదుపు తప్పిందని రాంప్రసాద్ తెలిపారు. ఆవులను తప్పించబోయి.. – బైక్ బోల్తాపడి మహిళ మృతి బూర్జ: వైకుంఠపురం పంచాయతీ అల్లెపల్లిగూడ గిరిజన గ్రామానికి చెందిన మండంగి సుజన(55) శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజన తన అకౌంట్లో ఉపాధి హామీ, హౌసింగ్ డబ్బులు చెక్ చేసేందుకు సోమవారం సాయంత్రం చిన్న కుమారుడు మండంగి సామ్యూల్తో కలిసి బైక్పై ఉప్పినివలస బయలుదేరింది. మార్గమధ్యలో శ్మశాన వాటిక వద్ద ఆవులను తప్పించబోయి బైక్ అదుపు తప్పింది. వెనుక కూర్చున్న సుజన రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే ఆటోలో రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పెద్ద కుమారుడు డానియల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్ఛాపురం: వన్యప్రాణుల పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు అన్నారు. మున్సిపాలిటీ పరిధి రత్తకన్న గ్రామంలోని ఓ ఇంటికి సమీపంలో గల కంచెలో మంగళవారం రక్తపింజరి పాము చిక్కుకుంది. దీన్ని గుర్తించిన స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ అధికారి అమ్మన్నాయుడు ఆదేశాల మేరకు సోంపేటకు చెందిన స్నేక్క్యాచర్ బాలరాజు సహకారంతో పాముని పట్టుకొని జలంత్రకోట సమీపంలో రక్షిత అటవీశాఖ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ సందర్బంగా ఫారెస్ట్ సిబ్బంది మాట్లాడుతూ.. వర్షాకాలం కావడంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చేటప్పుడు, తోటలు, పంటపొలాలకు వెళ్లేటప్పుడు చెప్పులు లేదా బూట్లను ధరించి టార్చ్లైట్ని వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు. -
శివ.. శివా
● ముఖలింగం అష్ట దిక్పాలకుల గర్భగుడిలో శునకాల విహారం ● పట్టించుకోని దేవదాయ, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు జలుమూరు: మహాదేవునికి అపచారం జరిగింది. శ్రీముఖలింగంలోని ఒక శివలింగం పానపట్టంపై శునకం నిద్రించింది. ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీముఖలింగానికి దక్షిణ కాశీగా పేరుంది. కాశీకి తుల్యమైనదిగా భావించి ఇక్కడకు దేశవిదేశాలతోపాటు ప్రపంచం నలుమూలలు నుంచి భక్తులు వస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత గల దేవాలయాన్ని అటు దేవదాయ శాఖతోపాటు కేంద్ర పురావస్తు శాఖ నుంచి సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంది. కానీ అష్ట దిక్పాలకులు ప్రతిష్టించిన శివలింగాలను కనీసం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మంగళవారం ప్రధాన దేవాలయంలో ఉన్న అష్ట శివలింగాల్లో ఒకటైన దేవేంద్రుడి ప్రతిష్టితమైన ఇంద్ర లింగం గర్భగుడిలో పానపట్టంపై శునకాలు పడుకుని కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆలయ నిర్వహణపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయంలోని గర్భగుడిలో శునకాలు ప్రవేశించడం దేవదాయ శాఖ నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనమని అంటున్నారు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ నిర్వహణపై లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎంతో విశిష్టత గల ఈ దేవాలయం నిర్వహణ ఇలా గాలికి వది లేయడం మంచి పద్ధతి కాదు. ఎంతో విశ్వాసంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ చూస్తే ఇలా ఉంది. దేవదాయ శాఖ ఏం చేస్తున్నట్టు? ఇది భక్తులు మనో భావాలను దెబ్బతీయడమే. – బి.ఆనంద్, భక్తుడు, విజయనగరం కేవలం ఇక్కడ అధికారులు ఆలయానికి వచ్చిన భక్తులు నుంచి ఎంత ఆదాయం వస్తుందో అని చూడడం తప్ప ఆలయంపై కనీస నిర్వహణ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలి. – కె.సతీష్, భక్తుడు, పాలకొండ -
830 గ్రామాల్లో .. పోలీసుల మెగా పల్లె నిద్ర
శ్రీకాకుశం క్రైమ్ : జిల్లాలో మెగా పల్లెనిద్రలో భాగంగా 830 గ్రామాల్లో పోలీసులు సోమవారం రాత్రంతా బస చేశారు. ప్రజల్లో భద్రతా భరోసాను పెంపొందించడమేకాక రానున్న ఎన్నికల నాటికి సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడమే పల్లె నిద్ర ముఖ్య ఉద్దేశమని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. హెడ్ కానిస్టేబుల్ నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి పోలీసూ గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నామన్నారు. ఈ క్రమంలో ఎస్పీ స్వయంగా గార మండలం కళింగపట్నంం గ్రామంలో పల్లె నిద్ర చేశారు. ఆయనతో పాటు రూరల్ సీఐ పైడపునాయుడు, స్పెషల్ బ్రాంచి సీఐ ఇమ్మాన్యుయల్ రాజు, గార ఎస్ఐ గంగరాజు పాల్గొన్నారు. శ్రీకాకుళం రెండో పట్టణ పరిధి పుణ్యపువీధి 12వ వార్డులో సీఐ పి.ఈశ్వరరావు, ఒకటో పట్టణ పరిధి కంపోస్టు కాలనీలో ఎస్ఐ ఎం.హరికృష్ణలు తమ సిబ్బందితో పాటు పల్లె నిద్ర చేశారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో.. కళింగపట్నం గ్రామాన్ని సందర్శించిన ఎస్పీకి అక్కడి స్థానికులు సీసీ కెమెరాలు ఏర్పాటు, ట్రాఫిక్ సమస్యలు, పబ్లిక్ న్యూసెన్సు, మాదక ద్రవ్యాల ప్రభావం, రోడ్డు ప్రమాద నివారణ వంటి అంశాలు దృష్టికి తెచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేర ఛేదనలో కీలకపాత్ర పోషిస్తాయని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామాల్లోని ముఖ్యప్రాంతాలతో పాటు వీలైనంతవరకు ప్రతీ ఇంటి వద్ద సీసీ కెమెరాలు పెట్టుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం యువతను తీవ్రంగా ప్రభావం చేస్తున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సమాచారం సామాజిక స్పృహతో ప్రజలు పోలీసులకు తెలియపర్చితే నియంత్రణకు సహకరించినట్లువుతుందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం.. ప్రతి గ్రామానికి దత్తత కానిస్టేబుల్ను నియమించి 15 రోజులకోసారి గ్రామాన్ని సందర్శించేలా చేసి గ్రామస్తులతో నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేవిధంగా కృషిచేస్తామని ఎస్పీ అన్నారు. పోలీసుల వైపు నుంచి నిర్లక్ష్యం, అలసత్వం కనిపిస్తే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. -
లోక్ భవన్కు ఐజీబీసీ సర్టిఫికెట్
● సర్టిఫికెట్ అందుకున్న గవర్నర్ కంభంపాటి హరిబాబు భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి సమయస్ఫూర్తి, సృజనాత్మకత రాష్ట్రానికి కొత్త వన్నె దిద్దుతోంది. ఆయన ఆధ్వర్యంలో ఒడిశా లోక్ భవన్ సరికొత్త మైలురాయిని ఆవిష్కరించింది. పర్యావరణహిత కార్యకలాపాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. పర్యావరణహిత మౌలిక వసతుల దిశగా చేసిన కృషికి ఫలితంగా ఒడిశా లోక్ భవన్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్లాటినం సర్టిఫికేషన్ పొందింది. జాతీయ స్థాయిలో ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించిన తొలి లోక్ భవన్ ఇదే కావడం విశేషం. లోక్ భవన్ నూతన అభిషేక్ హాల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఐజీబీసీ జాతీయ చైర్మన్ సి.శేఖర్ రెడ్డి నుంచి గవర్నర్ హరిబాబు సర్టిఫికెట్ను స్వీకరించారు. ఐజీబీసీ రేటింగ్లో మొత్తం 100 పాయింట్లకు గాను స్థానిక లోక్ భవన్ 88 పాయింట్లు సాధించి అత్యున్నత కేటగిరీలో నిలిచిందని ప్రకటించారు. సమష్టి కృషితోనే గుర్తింపు ఈ సందర్భంగా గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ.. పర్యావరణహిత చర్యల్లో సమష్టి కృషితోనే జాతీయ స్థాయిలో గుర్తింపు సాధ్యమైందన్నారు. ఐజీబీసీ సూచనల మేరకు పచ్చదనం సంరక్షణ, స్వచ్ఛ ఇంధన ఉత్పాదన, విద్యుత్ వాహనాల వినియోగం వంటి చర్యలతో అత్యున్నత రేటింగ్ సాధించగలిగామని వివరించారు. ఈ సర్టిఫికెట్ను తన తదుపరి ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చూపిస్తానని తెలిపారు. ఈ ప్రేరణతో మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పర్యావరణహిత విధానాలను అవలంభించి గ్రీన్ సర్టిఫికేషన్ పొందేందుకు కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలు పర్యావరణహిత కార్యాచరణతో ముందడుగు వేయడంలో వీసీలు కీలక పాత్రధారులు కావాలని పిలుపునిచ్చారు. 635 కిలో వాట్ – పీక్ (కేడబ్ల్యూపీ) సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ వ్యవస్థతో పునరుత్పాదక విద్యుత్ వినియోగంలో లోక్ భవన్ ముందంజలో ఉందని తెలిపారు. భువనేశ్వర్ లోక్ భవన్ తరహాలోనే పూరీలోని లోక్ భవన్ను కూడా గ్రీన్ క్యాంపస్గా మార్చేందుకు చురుకుగా సన్నాహాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, విద్యుత్ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి విశాల్ కుమార్ దేవ్, అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భాస్కర్ జ్యోతి శర్మ, గవర్నర్ కమిషనర్ కమ్ కార్యదర్శి డాక్టర్ రూపా రోషన్ సాహూ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా రెడ్క్రాస్కు ‘గవర్నర్ గోల్డ్మెడల్’
శ్రీకాకుళం కల్చరల్ : ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన మానవతా సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి అవార్డును కై వసం చేసుకుంది. 2024–25 సంవత్సరానికి గానూ సేవల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. విజయవాడలో నిర్వహించిన రెడ్క్రాస్ రాష్ట్ర శాఖ వార్షిక సాధారణ సమావేశంలో రాష్ట్ర గవర్నర్, ఐఆర్సీఎస్ ప్రెసిడెంట్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్, రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షుడు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ‘గవర్నర్ గోల్డ్మెడల్’ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రక్తదాన శిబిరాలు, తలసేమియా బాధిత చిన్నారులకు ఉచితంగా రక్తాన్ని అందించడం, విపత్తు నిర్వహణ శిక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మారుమూల గ్రామాలకు కూడా రెడ్క్రాస్ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ పర్యవేక్షణలో యూత్ రెడ్క్రాస్, పర్యావరణ పరిరక్షణ, మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. రెడ్క్రాస్ ప్రతినిధులు, వలంటీర్లు, రక్తదాతల సమష్టి కృషితోనే ఈ పురస్కారం లభించిందన్నారు. జాయింట్ కలెక్టర్ తరఫున రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు అవార్డును స్వీకరించగా ఐఆర్సీఎస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు కనుగుల దుర్గ శ్రీనివాస్, నిక్కు అప్పన్న, బి.చిన్మయిరావు, పి.వైకుంఠరావు, నూక సన్యాసిరావు, ప్రతినిధులు కె.సత్యనారాయణ, జి.రమణ, పి.చైతన్యకుమార్, పి.రాజేష్, ఉమా, మాధవకుమార్, సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. -
పింఛన్లు ఇచ్చేందుకు వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు గాయాలు హిరమండలం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు తీవ్ర గాయాలపాలయ్యారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు మంగళవారం ఉదయం వెళుతుండగా హిరమండల మండలంలోని ధనుపురం మలుపు దాబా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం బూరగాం, రొంపివలస పంచాయతీ కార్యదర్శులు వాడన ఉదయశ్రీ, గేదెల ప్రసన్నలు మంగళవారం ఉదయం స్కూటీపై వెళుతున్నారు. సరిగ్గా ధనుపురం శివార్లలో ఉన్న దాబా వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై తుల్లిపడటంతో కార్యదర్శులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాతపట్నం సామాజిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. హిరమండలం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.గాయపడిన బూరగాం కార్యదర్శి ఉదయశ్రీ గాయాల పాలైన రొంపివలస కార్యదర్శి ప్రసన్న -
మానవత్వం చాటుకున్న శ్యాంప్రసాద్రెడ్డి
కంచిలి: ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్రెడ్డి మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఉదయం ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా పలాస మండల శాసనం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడివున్న వ్యక్తిని గమనించారు. హైవే మార్గంలో హైవే సేఫ్టీ సిగ్నల్ వాహనాన్ని ద్విచక్ర వాహనంతో ఢీకొని ప్రమాదానికి గురైన వ్యక్తిగా గుర్తించారు. అక్కడ ఆగి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి గురించి అంబులెన్స్కు సమాచారం ఇచ్చి పలాస ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదానికి గురైన వ్యక్తికి చేయి విరగడంతోపాటు శరీరంపై గాయాలయ్యాయి. హెల్మెట్ ధరించడం వలన తలకు ఎటువంటి గాయాలు కాలేదు. శ్యాం ప్రసాద్రెడ్డి ప్రమాదానికి గురైన వ్యక్తికి అందించిన సహాయానికి పలువురు అభినందించారు. విద్యుత్ శాఖ ఉద్యోగి ఆత్మహత్య కాశీబుగ్గ: పలాస విద్యుత్ డివిజన్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఒక ఉద్యోగి అదే కార్యాలయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, విద్యుత్ సిబ్బంది సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న కంచి సంతోష్కుమార్ (31) సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చాడు. తన బ్యాగును బయటే ఉంచి నేరుగా డాబాపైకి వెళ్లి, అదే కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న ఉద్యోగినికి ఫోన్ చేశాడు. అనంతరం డాబాపై ఉన్న సోలార్ ప్యానల్ బోర్డులకు వేలాడుతున్న వైర్లతో ఉరేసుకున్నాడు. విషయాన్ని తెలుసుకున్న అటెండర్ వెంటనే వచ్చి డాబాపైకి వెళ్లి చూసి కేకలు వేసింది. స్పందించిన కార్యాలయ సిబ్బంది సంతోష్కుమార్ను పలాస ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సారా ప్యాకెట్లతో వ్యక్తి అరెస్టు కంచిలి: మండలంలోని తలతంపర పంచాయతీ పరిధి కాకర్లపుట్టుగ గ్రామంలో సోంపేట ఎకై ్సజ్ శాఖ సిబ్బంది సోమవారం దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా ఆ గ్రామానికి చెందిన కాకర్ల దాలయ్య అనే పాత ముద్దాయి నుంచి 100 నాటుసారా ప్యాకెట్లు(సుమారు 10 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, సోంపేట కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. విచారణలో భాగంగా సదరు వ్యక్తికి నాటుసారా సరఫరా చేసిన శ్రీరాంపురం గ్రామానికి చెందిన లండ నవీన్ మీద కూడా కేసు నమోదు చేశారు. ఒడిశా నుంచి నాటుసారా రవాణా అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు సీఐ జి.వి.రమణ తెలిపారు. గతంలో నాటుసారా కేసులు కలిగి ఉన్న అందరి మీద ప్రత్యేక నిఘా ఉందన్నారు. దాడుల్లో ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది కృష్ణమూర్తి, ఉమాపతి, మార్కారావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులు ● టీచర్పై పోక్సో కేసు నమోదు ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం మండల పరిధిలోని ఓ మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గడిచిన ఐదేళ్లుగా ఒకే పాఠశాలలో ఈ టీచర్ పనిచేస్తున్నారు. ఆగస్టు 29న శనివారం వాష్రూంకు వెళ్లిన బాలికలపై లైంగిక దాడికి పాల్పడడంతో ఇద్దరు బాలికలు తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేశారు. మరుసటి రోజు ఆదివారం కావడంతో మిన్నకుండిపోయారు. సోమవారం ఉదయం స్కూల్కు రాగానే గ్రామస్తులందరూ వెళ్లి ఆ ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఇదే విషయంపై రూరల్ పోలీసులకు బాలిక తల్లిదండ్రులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారులు, రూరల్ పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారణ చేశారు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
రాష్ట్రపతి భవన్లో రక్షా బంధన్ వేడుకల్లో రాష్ట్ర బాలలు
భువనేశ్వర్: న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ప్రత్యేక రక్షా బంధన్ కార్యక్రమంలో ఒడిశాకు చెందిన నలుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ 6 ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సంతోషి మండల్, 7వ తరగతి విద్యార్థిని శుభ సాయి రంజిత పట్నాయక్, ఐఆర్సీ విలేజ్ పీఎమ్ శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి బిభు ప్రసాద్ సాహు, లోక్ భవన్ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి రోనక్ త్రిపాఠి ఒడిశా ప్రతినిధులుగా పాల్గొన్నారు. స్థానిక యూనిట్ 6 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రిన్సిపాల్ రూపాలి సేనాపతి, ఐఆర్సీ విలేజ్ పీఎమ్ శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సహాయ ఉపాధ్యాయుడు తూఫాన్ కుమార్ రౌత్రాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఝార్సుగుడలో 61.280 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వలపై ఉక్కుపాదం మోపుతున్న ఝార్సుగుడ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన తనిఖీల్లో సుజుకి ఎర్టిగా కారులో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 61.280 కిలోల గంజాయిని పొలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర తెలియజేసిన వివరాల ప్రకరం ఆదివారం నాడు ఉదయం ఝార్సుగుడ పోలీస్ స్టేషన్కు అందిన విశ్వసనీయ సమాచారంతో చితువాపడ కూడలి సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన కారును గుర్తించారు. దీంతో వాహనంలో తనిఖీలు చేపట్టగా అందులో గంజాయి పట్టుబడింది. ఈ మేరకు కుందన్ సాహు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. -
అనాథ బాలలకు అండగా..
పర్లాకిమిడి: జిల్లా శిశు సురక్షా సమితి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో అనాథ బాలలు, శిశు సంక్షేమం కోసం జిల్లా అధికారులు వారితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు అధ్యక్షత వహించారు. ఏడీఎం మునీంద్ర హానగ, సమగ్ర గిరిజనాభివృద్ధి, జిల్లా ప్రాజెక్టు అధికారి అంశుమాన్ మహాపాత్రో, బాలల అక్రమరవాణా నిరోధక అధికారి కమలా చౌదరి, తదితరులు హాజరయ్యారు. తొలుత జిల్లా శుశు సురక్షా సమితి అధికారి అరుణ్ కుమార త్రిపాఠి మాట్లాడారు. గజపతి జిల్లాలో పలు బాలల సంరక్షణ కేంద్రాల్లో నివసిస్తున్న వారికి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం తల్లులను పోగొట్టుకున్న పిల్లలు, చైల్డ్లైన్ కార్యక్రమాలు సమీక్షించారు. జిల్లా కార్మిక శాఖ తరఫున అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రజుక్త శోబోరో గత ఆరు నెలలుగా అనాథ బాల లను సంరక్షించిన జాబితాను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఇప్పటివరకు గజపతి జిల్లా నుంచి వివిధ రాష్ట్రాలు దంపతులకు దత్తత నిమిత్తం అందజేసిన బాలలతో దృశ్యశ్రవణం ద్వారా వారితో అధికారులు మాట్లాడారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని అంగన్వాడీ కార్యకర్తలకు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఎన్జీఓలు, ఇతర శిశు సంరక్షణ కేంద్రాల కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం
జయపురం: జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని ముగ్గురు యువకుల నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి మోసగించిన సంఘటన వెలుగు చూచింది. లక్ష్మీకాంత హల్బా అనే వ్యక్తి యువకులకు నకిలీ నియుక్తి పత్రాలు అందజేసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. మోసానికి గురైన యువకులు జయపురం సదర్ పోలీసు స్టేషన్లో లక్ష్మీకాంత హల్వాపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. లక్ష్మీకాంత హల్వ జయపురం జిల్లా కేంద్రాస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నానని తెలిపి మొదట వారికి చెప్పి వారిలో తనపై విశ్వాసం కలిగించాడు. కెఆర్పీసీ ఔట్సోర్సింగ్ పేరుగల ఒక ఏజెన్సీ ద్వారా హాస్పిటల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మొదట ఇన్స్యూరెన్స్, ఆధార్ కార్డుల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5000 చొప్పున వసూలు చేశాడు. అదేవిధంగా వారి స్నేహితుల నుంచి కూడా ఉద్యాగాలు ఇప్పిస్తానని మొత్తం రూ.2 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. డబ్బులు తీసుకువెళ్లి నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు కల్పించకపోవటంతో తమ డబ్బులు వాపస్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అతడు డబ్బులు తిరిగి ఇవ్వనందుకు లాయర్ను కలిసి ఫిర్యాదు చేశారు గణనాథుని పూజలకు ముహూర్తపు రాట రాయగడ: స్థానిక రైతుల కాలనీలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మహిళలు నడుం బిగించారు. మహిళా స్వాభిమాన్ మంచ్ మహాగణపతి పూజా కమిటీ పేరిట ఈ ఏడాది వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉత్సవ వేదిక ప్రాంగణంలో మహిళలంతా మూహూర్తపు రాట వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భక్తి శ్రద్ధలతో మూహూర్తపు రాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాలను తొమ్మిది రోజులు నిర్వహిస్తామని కమిటీకి చెందిన మహిళలు తెలిపారు. ఏటా తమ కాలనీలో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఈసారి తమ ప్రాంత మహిళలంతా సమైఖ్యతగా ఉత్సవాలను నిర్వహించేందుకు నడుం బిగించాన్నారు. విదేశీ మద్యం బాటిళ్ల స్వాధీనం రాయగడ: విదేశీ మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లాలోని బిసంకటక్ పోలీసులు శనివారం రాత్రి బిసంకటక్ బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 10 పెట్టెల్లో ఉన్న 190 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. పోలీసుల రాకను గమనించిన అక్రమ రవాణాదారులు మద్యం బాటిళ్ల పెట్టెలను విడిచి అక్కడ నుంచి పరారయ్యారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పది అడుగుల మొసలి ప్రత్యక్షం జయపురం: జయపురం సమితి జయంతిగిరి గ్రామ పంచాయతీ మలదా మీదుగా ప్రవహించే బొడొపొడ నదిలో పది అడుగుల మొసలి స్థానికులకు సోమవారం కనిపించింది. మలదా గ్రామ ప్రజల కొంత మంది నదిలో వెళ్లున్న మొసలిని చూసి వెంటనే గ్రామస్తులకు తెలియజేశారు. నదిలో మొసలి కనిపించటంతో తరచూ నది దాటి వెళ్లే మలదా, బొడొపొడ, తదితర గ్రామాల ప్రజలు భయం వ్యక్తం చేస్తున్నారు. -
సబర గిరిజనుల శ్రమదానం
రాయగడ: తమ భాష, లిపి, సంస్కృతి పరిరక్షణతో పాటు ఆశ్రమంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల పోషణకు సబర గిరిజనులు చేస్తున్న సామూహిక కృషి ఆదర్శంగా నిలుస్తోంది. జిల్లాలోని గుణుపూర్ సమితి పరిధిలో ఉన్న టిటిమిరి పంచాయతీ ఎంగెర్భ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎస్పీ మంగాయి ఆశ్రమం నిర్వహణ ఖర్చుల కోసం పరిసర ప్రాంతాల్లోని 14 గ్రామాల సబర గిరిజనులు క్రమం తప్పకుండా శ్రమదానం చేస్తూ తమవంతు సహకారం అందిస్తున్నారు. ఆశ్రమ నిర్వహణ కోసం సంఘం ప్రత్యేకంగా ఉపనియమాలను రూపొందించింది. ఆ నిబంధనల ప్రకారం ప్రతీ గురువారం అక్షర బ్రహ్మ మత్తారావనం పూజ సందర్భంగా 14 గ్రామాలకు చెందిన ప్రజలు ఆశ్రమ ప్రాంగణంలో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో నెలకొన్న సమస్యలు, అవసరాలపై చర్చించి వాటి పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా సమస్య పరిష్కారానికి ఆర్థిక అవసరం ఏర్పడితే మరుసటి రోజున గ్రామస్తులు సమూహంగా శ్రమదానం చేసేందుకు బయలు దేరుతారు. ప్రస్తుతం వరి నాట్లు వేసే సీజన్ కావడంతో 14 గ్రామాలకు చెందిన సబర గిరిజనులు సుదూరంలోని మారిగుడ గ్రామానికి వెళ్లి వరి నాట్లు వేస్తున్నారు. వరి నాట్ల ద్వారా వారు పొందే కూలి మోత్తాన్ని ఆశ్రమ నిర్వహణ కోసం సంఘం అధ్యక్షుడికి అందజేయనున్నారు. ఇలా తమ శ్రమతో సంపాదించిన మొత్తాన్ని ఆశ్రమ నిర్వహణకు కేటాయిస్తు విద్యార్థుల చదువు, వసతి, భోజనం తదితర అవసరాలకు అండగా నిలుస్తున్నారు. తమసొంత భాష, లిపి, సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు ఆశ్రమం, హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్కు భరోసా కల్పించేందుకు పేద సబర గిరిజన సమాజం చేస్తున్న ఈ సామూహిక శ్రమదానం, సేవాభావం నిజంగా ప్రశంసనీయంగా పలువురు అభినందిస్తున్నారు. -
రిటైనింగ్ వాల్ నిర్మించాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గుమ్మా బ్లాక్ అజయగడ–నమ్మనగుడ రహదారిలో కొండ చరియలు, మట్టి రోడ్డుకు అడ్డంగా పడుతున్నాయి. వాహనదారులు, బాటసారులు ఇబ్బంది పడుతున్నారు. గుమ్మఘాటిలో కొండచరియలు విరిగిపడుతున్నందున కొన్నిసార్లు రాకపోకలు బంద్ అవుతున్నాయి. పీడబ్ల్యూడీ, రోడ్లు–భవనాల శాఖ ఇంజినీర్లు స్పందించి అజయగడ, నమ్మనగుడ రోడ్డులో రిటైనింగ్ వాల్, డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర డిజాస్టర్ సర్వే ప్రకారం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి గజపతి జిల్లాలో కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించారు. వాటిలో గుమ్మ ప్రాంతంలో అతి ఎక్కువగా 59 గిరిజిన గ్రామాలు, 49 కిలో మీటర్లు రోడ్డు అతి ప్రమాదకరమైన కొండచరియలు విరిగిపడే జోన్గా గుర్తించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని గుమ్మ ప్రజలు కోరుతున్నారు. -
రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా
నందిగాం: టెక్కలి నియోజకవర్గంలో నిత్యం గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. తాజాగా నందిగాం మండలం ఆనందపురం పంచాయతీ మాదిగాపురం కొండపై అక్రమ తవ్వకాలు, తరలింపు చేపడుతుండగా.. అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై తిరగబడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాదిగాపురం పరిధి సర్వే నంబర్ 253లో ఉన్న కొండపై అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నట్లు సమాచారం అందుకున్న నందిగాం డిప్యూటీ తహసీల్దార్ రామారావు, స్థానిక వీఆర్వో మధు అక్కడికి చేరుకున్నారు. అక్కడ యంత్రాలతో తవ్వుతున్నవారిని అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వడం, తరలించడం నేరమని, తక్షణం పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. అయితే వారు పట్టించుకోకపోవడంతో యంత్రాల తాళాలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగి తిరగబడ్డారు. ఈ క్రమంలో డీటీ రామారావు చేతికి గాయమైంది. దీంతో డీటీ నందిగాం పోలీసులకు విషయం తెలియజేయడంతో కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. దీంతో తవ్వకందారులు తాళాలు అప్పగించారు. డీటీ వాటిని పోలీసులకు అప్పగించారు. రెవెన్యూ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. ఈ కొండపై 1980 దశకంలో హరిదాసుపురానికి చెందిన 21 మంది దళితులకు 8 ఎకరాల పట్టాలు అందజేసి ఉన్నారు. ఆ పట్టాలకు 1–బీ, అడంగల్ వంటివి రావడం లేదు. కానీ ఆ 8 ఎకరాలు ఆ దళిత కుటుంబాల ఆధీనంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టడంతో అడ్డుకున్నామన్నారు. కాగా అక్రమంగా కొండను తవ్వేసి, గ్రావెల్ తరలిస్తూ కూడా.. అధికారులపై తిరగబడ్డారంటే వారి వెనుక అధికార పార్టీ నాయకులు ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
మజ్జిగౌరీ అమ్మవారి హుండీ ఆదాయం రూ. 54.15 లక్షలు
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం.. మజ్జిగౌరీ అమ్మవారికి భక్తులు వేసే కానుకల రూపంలో వచ్చిన హండీ ఆదాయాన్ని అధికారులు సోమవారం లెక్కించారు. ఎండోమెంట్ కమిషన్ ఇన్స్పెక్టర్ పుష్పిత బెహర, మందిరం నిర్వహక కమిటీ సభ్యులు రాధాకృష్ణ దలాయి, పెద్దిన వాసు, దేవేంద్ర బెహర, మంగరాజ్, మందిరం సూపరింటెండెండ్ జానకీ వల్లభ మహాంతి, జేయీ వెంకట్, అకౌంటెంట్ వెంకటరావు తదితరుల సమక్షంలో మందిరం ప్రాంగణంలోని తొమ్మిది హుండీలను ఉదయం పది గంటలకు తెరిచారు. అనంతరం ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం అయిదున్నర గంటల వరకు సాగింది. స్థానికంగా గల సేవా సంస్థలకు చెందిన 80 మంది మహిళలు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. నగదు రూపంలొ అమ్మవారికి 54,15,902 రూపాయలు లభించగా, 64 గ్రాముల బంగారం, 1.764 కిలోల వెండి లభించింది. లెక్కింపులో భాగంగా విదేశీ నాణాలు, విదేశీ కరెన్సీనోట్లు కూడా హుండీలొ లభించాయి. ఈ సందర్భంగా మందిరం నిర్వాహక కమిటీ సభ్యులు రాధాక్రిష్ణ దొలాయి విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్ నెల 29వ తేదీన హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టగా అప్పట్లో ఒకకోటీ 22 లక్షల 29 వేల 623 రూపాయల నగదుతోపాటు 32 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి ఆభరణాలు, తొమ్మిది విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని వివరించారు. ఇకపై రెండు నెలలకోసారి లెక్కింపు అమ్మవారి హుండీ ఆదాయం ఇదివరకు ప్రతీ మూడు, నాలుగు నెలలకొసారి తెరిచి లెక్కింపు చేపట్టేవాళ్లమని అన్నారు. అయితే లెక్కింపు నిర్వహణ ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇకపై ప్రతీ రెండు నెలలకొసారి హుండీ ఆదాయాన్ని లెక్కించాలని నిర్ణయించామన్నారు. ఈసారి చేపట్టిన హుండీ లెక్కింపులో అమ్మవారికి లభించిన నగదును స్థానిక యూనియన్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి హుండీలో భక్తుడి ఆవేదన లేఖ మజ్జిగౌరమ్మ హుండీ లెక్కింపు సందర్భంగా ఓ భక్తుడి ఆవేదనతో కూడిన ఆరు పేజీల లేఖ బయటపడింది. అప్పుల భారంతో సతమతమవుతున్న ఓ భక్తుడు తన కష్టాలను అమ్మవారికి మొరపెట్టుకుంటూ రాసిన లేఖను చదివిన ఆలయ సిబ్బంది, అక్కడున్న పలువురు భక్తులు భావోద్వేగాలకు గురయ్యారు. కొరాపుట్ జిల్లాకు చెందిన భక్తులు సునీల్ ఖొర ఈ లేఖను అమ్మవారికి సమర్పించినట్లు తెలుస్తోంది. సుమారు 23 మంది వ్యక్తుల వద్ద అప్పులు తీసుకున్నానని, ఇప్పటివరకు వాటిని పూర్తిగా చెల్లించలేకపొయానని ఆయన తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అప్పుల కారణంగా తాను, తన కుటుంబం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని, ఈ కష్టాల నుంచి తనను గట్టెక్కించి రుణ విముక్తుడిని చేయాలని మజ్జిగౌరి అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారిపై అంచంచల విశ్వాసం మనిషి అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు భావించినప్పుడు తన బాధను దేవుడి పాదాల వద్ద చెప్పుకుంటాడనే భావనకు ఈ లేఖ అద్దం పడుతోంది. తన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులను వివరిస్తు భక్తుడు అమ్మవారిపై ఉన్న అచంచల విశ్వాసంతో తన మనసులోని మాటలను లేఖ రూపంలో చెప్పుకున్నాడు. హుండీ నుంచి బయట పడిన ఈ ఆరు పేజీల లేఖ కేవలం ఓ భక్తుడి మొక్కుబడి మాత్రమే కాకుండా.. అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తి ఆవేదన, కుటుంబంపై ఉన్న ఆందోళన , కుటుంబంపై ఉన్న అపరామైన నమ్మానికి ప్రతిబింబంగా నిలిచింది అనడంలో అతిఽశయోక్తి కాదు. -
కళ్యాణసింగుపూర్లో 63 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి కార్యాలయం సమావేశం హాల్లో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం నిర్వహించింది. కలెక్టర్ అశుతోస్ కులకర్ణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమితిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 63 వినతులు వచ్చాయి. వీటిలో 49 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించిన అధికారులు మిగత 14 సామూహిక గ్రామ సమస్యలుగా పరిగణలోకి తీసుకున్నారు. స్వీకరించిన వినతుల్లో గ్రామ సమస్యలను పరిశీలించి సంబంఽధిత శాఖ అధికారులు త్వరితగతిన వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజ్ప్రసాద్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, సబ్కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి పాల్గొన్నారు. కాశీనగర్లో 18 వినతులు.. పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ పంచాయతీ కార్యాలయంలో సోమవారం జిల్లా యంత్రాంగం నిర్వహించిన జాయింట్ గ్రీవెన్సు సెల్కు అతితక్కువ స్పందన లభించింది. గ్రీవెన్సుకు ఏడీఎం మునీంద్ర హానగ అధ్యక్షత వహించగా అదనపు ఎస్పీ బిరంచీ బేగ్, జిల్లా పరిషత్ ఆదనపు సీడీవో ఫృథ్వీరాజ్ మండళ్, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ పాల్గొన్నారు. కేవలం 18 వినతులు మాత్రమదే అందగా వాటిలో 13 వ్యక్తిగతం, ఐదు గ్రామసమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. సామిజిక పింఛన్లు, ఇళ్ల పథకం, రేషన్ కార్డులకు సంబంధించి పలు వినతులు అధికారులకు అందాయి. వాటిని సకాలంలో పరిష్కరించాల్సిందిగా ఏడీఎం మునీంద్ర హానగ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాశీనగర్ బీడీవో డుంబురుధర మల్లిక్, తహాసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. -
స్వపరిపాలన దినోత్సవం
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఘనంగా.. పర్లాకిమిడి: స్థానిక సంస్థల స్వపరిపాలన దినోత్సవాన్ని పర్లాకిమిడి పురపాలక సంఘం ఆవరణలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, ఈఓ లక్ష్మణ ముర్ము, వైస్ చైర్మన్ లెంకమధు, 15 వార్డుల కౌన్సిలర్లు బబునా బెహరా, అమ్ములమ్మ, నారాయణరావు బెహారా, బాలకృష్ణ పాత్రో తదితరులు పాల్గొన్నారు. తొలుత పర్లాకిమిడి పలు కూడళ్లలో మహారాజా కృష్ణచంద్ర గజపతి విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం జాతీయ జెండాను చైర్మన్ నిర్మలా శెఠి ఎగురవేసి మాట్లాడారు. పర్లాకిమిడి పురపాలక సంఘంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కట్టుబడి ఉన్నామని, నగరం అందంగా తీర్చిదిద్దటానికి శాయశక్తులా కృషిచేస్తానని అన్నారు. అనంతరం పారిశుద్ధ్య సిబ్బందికి చైర్మన్ చేతులమీదుగా ఉత్తమ అవార్డులను అందజేశారు. కాశీనగర్ నగరపాలక సంస్థ (ఎన్.ఏ.సి.) స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా త్రివర్ణపతాకాన్ని చైర్మన్ యం.సుధారాణి ఎగురవేసి పలువురికి మిఠాయిలు అందజేశారు. జయపురం: లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ దినోత్సవాల సందర్భంగా జయపురం మున్సిపాలిటీ అధికారులు పలు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి జాతీయ పతాకాన్ని ఎగురవేసి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేశారు. ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు. మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బి.సునీత, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం జయపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి పాల్గొన్నారు. బొరిగుమ్మకు ఎన్ఏసీ హోదా ఎట్టకేలకు జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మకు నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్(ఎన్ఏసీ) గా గుర్తింపు లభించింది. స్వయం పాలక దినోత్సవం సందర్భంగా బొరిగుమ్మను నోటిపైడ్ ఏరియాగా ప్రకటించారు. ఈ సందర్భంగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి జాతీయ పతాకాన్ని ఎగుర వేసి బొరిగుమ్మ నేటి నుంచి నోటిఫైడ్ ఏరియా అయ్యిందని వెల్లడించారు. బొరిగుమ్మ ప్రజలు నిరాహార దీక్షలు, రాస్తారోకోలు మొదలగు ఆందోళనలు జరిపిన కారణంగా నేడు ఈ విజయం దక్కిందన్నారు. తాను శాశనసభలో అనేక సార్లు ధృడంగా డిమాండ్ చేశానని, అందరి పోరాట ఫలితమే గొప్ప విజయం సాధించామన్నారు. రాష్ట్రంలో ఉత్తమ పురపాలక పరిషత్ గా నిలబెట్టేందుకు కృషి చేద్దామని ఆయన బొరిగుమ్మ ప్రజలకు పిలుపు నిచ్చారు. బొరిగుమ్మ ఉన్నతికి రాజకీయాలకు అతీతంగా సమైక్యంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. గుడారి ఎన్ఏసీకి రాష్ట్ర స్థాయి పురస్కారం రాయగడ: సొంత ఆదాయ వనరుల సమీకరణలో గణనీయమైన పురోగతి సాధించిన గుడారి ఎన్ఏసీ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. కేవలం ఏడాది వ్యవధిలో సొంద ఆదాయ వసూళ్లను దాదాపు 91 శాతం పెంచినందుకు రాష్ట్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వపరిపాలన దినోత్సవంలో గుడారి ఎన్ఏసీకి ప్రశంసనీయ పనితీరు పురస్కారం లభించింది. దీంతో రెండు కోట్ల ప్రోత్సాహక బహుమతి నిధిని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి చేతుల మీదుగా అందజేశారు. ఈ నిధులను పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, పౌరసేవలను మరింత బలోపేతం చేసేందుకు వినియోగించనున్నారు. 92 శాతం పెరిగిన సొంత ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో గుడారి ఎన్ఏసి 36.45 లక్షల సొంత ఆదాయాన్ని సమీకరించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ వసూళ్లు గణనీయంగా పెరిగి రూ.70.20 లక్షలకు చేరుకుంది. ఈ అభివృద్ధిని గుర్తించిన పట్టణాభివృద్ధి శాఖ కమండేబుల్ లోకల్ బాడీ పెర్ఫార్మెన్స్ ఇన్ గ్రొత్ ఆఫ్ ఔస్ఆర్ కలెక్షన్ విభాగంలో గుడారి ఎన్ఏసీకి పురస్కారం దక్కింది. ఈ విజయానికి కలెక్టర్ అశుతొస్ కులకర్ణి అందించిన సమర్థమైన పరిపాలన మార్గదర్శకత్వం, జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్, అధికారి అక్షయ కుమార్ ఖెముండొ అందించిన ప్రాత్సాహం కీలకంగా నిలిచాయి. -
కొత్త జాతీయ అటవీ కమిటీలకు రూ.560 కోట్లు
భువనేశ్వర్: ఈ ఏడాది స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తగా నగరాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పిలుపునిచ్చారు. యువతకు కొత్త అవకాశాలు, ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామికవేత్తల ఆవిష్కరణ దిశలో నగరాలు విస్తరించాలని ఆకాంక్షించారు. స్థానిక ఓయూఏటీ కృషి శిక్షా సదన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమంలో కొత్తగా ఏర్పడిన 28 జాతీయ అటవీ కమిటీల్లో (ఎన్ఏసీ) వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రూ. 560 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ప్రతి జాతీయ అటవీ కమిటీకి (ఎన్ఏసీ) రూ. 20 కోట్లు కేటాయించనున్నారు. ఈ నిధులతో సంబంధిత ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీలు, మార్కెట్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పట్టణాభివృద్ధి పథకం కింద 62 పట్టణ ప్రాంతాల కోసం రూ. 323 కోట్ల పెట్టుబడితో 593 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటిలో రూ. 102 కోట్ల విలువైన 423 ప్రాజెక్టులను ప్రారంభించగా రూ. 221 కోట్ల విలువైన 170 ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. వివిధ పనుల నిమిత్తం మున్సిపల్ సంస్థలకు వచ్చే పౌరులకు గౌరవప్రదమైన సేవలు అందించాలని మున్సిపల్ పరిపాలన అధికారులు, ఉద్యోగులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృత వినియోగంతో పని విధానాలను సరళీకరించి నిర్ధారిత కాలపరిమితిలో పూర్తి చేసే పని సంస్కృతిని అలవరచుకోవాలని మున్సిపల్ సంస్థలకు ముఖ్యమంత్రి సూచించారు. ఒడిశా ఆర్థికాభివృద్ధికి ప్రతి నగరాన్ని ఒక శక్తివంతమైన చోదక శక్తిగా మార్చాలని కోరారు. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పురపాలక సంస్థల సామర్థ్య పెంపు కోసం ఒడిశా అర్బన్ అకాడమీ, శ్రీ శ్రీ యూనివర్సిటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మరియు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీనితో పాటు సీఆర్యూటీ, శ్రీ శ్రీ యూనివర్సిటీ మధ్య కూడా ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. 115 పురపాలక సంస్థలలో ఓస్వాన్ వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – బంధు, ఒడిశా యాత్రి ఎస్ఓఎస్ యాప్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో ఇటీవల 28 కొత్త నోటిఫైడ్ ఏరియా కౌన్సిళ్లు, 7 కొత్త మున్సిపల్ కౌన్సిళ్లు ఏర్పడ్డాయి. పూరీకి మెట్రోపాలిటన్ కార్పొరేషన్ హోదా కల్పించాలని రాష్ట్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కృష్ణ చంద్ర మహా పాత్రో తెలిపారు. రాష్ట్రంలోని పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న ఎన్ఏసీ, మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో భువనేశ్వర్ ఏకామ్ర నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, భువనేశ్వర్ నగర పాలక సంస్థ బీఎంసీ మేయర్ సులోచన దాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఉషా పాఽఢి, పురపాలక పరిపాలన సంచాలకులు అరిందమ్ డకువా పాల్గొన్నారు. -
వెంటాడిన దురదృష్టం
● మరమ్మతులకు గురైన ట్రాక్టర్ను ఢీకొన్న లారీ ● ట్రాక్టర్ మరమ్మతులు చేస్తున్న డ్రైవర్ మృతి టెక్కలి రూరల్/నరసన్నపేట: తన వాహనం మరమ్మతులకు గురవ్వడంతో రహదారి పక్కన ఆపి వాహనాన్ని మరమ్మతులు చేస్తుండగా.. అనుకోకుండా ఓ కంటైనర్ లారీ ఆ వాహనాన్ని ఢీకొనడంతో చోటుచేసుకున్న ప్రమాదంలో వాహనం మరమ్మతులు చేస్తున్న వ్యక్తి మృతి చెందిన ఘటన కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నరసన్నపేట మండలం బుచ్చిపేట గ్రామానికి చెందిన కొన్న నవీన్(35) అనే వ్యక్తి తన ట్రాక్టర్తో ఇసుక లోడ్కు వెళ్లి మడపం నుంచి టెక్కలి వైపు వస్తున్న సమయంలో కోటబొమ్మాళి మండలం జర్జంగి ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగుతుండగా టైర్ పంక్చర్ అవ్వడంతో రోడ్డు పక్కగా ఆపి మరమ్మతులు చేపట్టాడు. అయితే అదే మార్గంలో వచ్చిన ఒక కంటైనర్ లారీ మరమ్మతులు చేస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. దీంతో ట్రాక్టర్ సమీపంలోని పంట కాలువలో పడిపోగా.. మరమ్మతులు చేస్తున్న డ్రైవర్ ట్రాక్టర్ కిందనే ఉండిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు హుటాహుటిన కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నాడు. అనంతరం హైవే సిబ్బంది భారీక్రేన్ల సాయంతో ట్రాక్టర్ని బయటకు తీయడంతో నవీన్ మృతదేహం బయటపడింది. కాగా ఈ ఘటనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్ సరిచేసి మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు పొలం పనులు చేసుకుంటూ ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య అశ్విని, మూడేళ్ల కుమారుడు ధీరజ్కుమార్లు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటబొమ్మాళి రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
2,3 తేదీల్లో బాలల హక్కుల కమిషన్ పర్యటన
రాయగడ: జిల్లాలో విద్యార్థుల భద్రత, బాలల హక్కుల పరరిక్షణ అంశాలపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. కమిషన్ చైర్ పర్సన్ బబితా పాత్రోతో పాటు సభ్యురాలు సుజాత నాయక్ సెప్టెంబరు 2,3 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల రివల్కోన ఉన్నత పాఠశాల వసతి గృహంలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడిన నేపథ్యంలో కమిషన్ ప్రతినిధుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటలో భాగంగా కొలనార సమితి పరిధిలోని రివల్కొన లో ఉన్న ఎస్సి, ఎస్టీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత పాఠశాలను కమిషన్ చైర్ పర్శన్, సభ్యురాలు సందర్శించనున్నారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, భద్రత పరిస్ధితులను తెలుసుకోవడంతో పాటు ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించే అవకాశం ఉంది. విద్యార్థులపై దాడి వీడియో వైరల్ ఈ నెల మొదటి వారంలో రివల్కోన ఉన్నత పాఠశాలలోని ఓ సీనియర్ విద్యార్థి మరి కొందరి సహచరులతో కలిసి జూనియర్ విద్యార్థులను తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై చందిలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. అనంతరం ఏడుగురు విద్యార్థులకు టీసీలు ఇచ్చి పాఠశాల నుంచి బహిష్కరించారు. క్రికెట్ ఆటకు సంబంధించి విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం ఈ ఘటనకు కారణమైందని అప్పట్లో అధికారులు వెల్లడించారు. కొంతమంది జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులపై ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన సీనియర్లు 20 మందికి పైగా వసతి గృహ విద్యార్థులపై దాడికి పాల్పడినట్లు వైరల్ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. గతంలోనూ సీనియర్ విద్యార్థులు జూనియర్లను వేధిస్తున్నారనే ఆరోపణలు రావడం గమనార్హం. పలు బాలల సంక్షేమ సంస్థల్లో తనిఖీలు రివల్కోన పాఠశాల సందర్శనతో పాటు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, శిశు సంరక్షణ సంస్థలు, ఇతర బాలల సంక్షేమ సంస్థలను కమిషన్ ప్రతినిధులు సందర్శించనున్నారు. ఆస్పత్రులు, పాఠశాలలు, టీహెచ్ఆర్ యూనిట్లను కూడా ఆకస్మిక తనిఖీ చేయనున్నట్లు సమాచారం. వరుస ఘటనల నేఽపథ్యంలో ప్రాధాన్యత గత కొంత కాలంగా జిల్లాలోని పలు వసతి పాఠశాలలు, విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో కమిషన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలోని అంబొదల ఉన్నత పాఠశాల ఘటన, ముకుందపూర్ ఉన్నత పాఠశాలలో పరీక్షల్లో కాపీలు అందించిన ఘటన, డంగసొరొడ విద్యార్థి అదృశ్యం, మలేరియాతో విద్యార్థుల మృతి, బుడాగుడ ఉన్నత పాఠశాల విద్యార్థి నీటిలో మునిగి మృతి వంటి ఘటనలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు, ముఖ్యంగా వసతి పాఠశాలల్లో విద్యార్థుల భద్రత ప్రమాణాలు, అధికారుల పర్యవేక్షణ వసతి గృహాల నిర్వహణ తదితర అంశాలపై కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు చట్టపరంగా ఉన్న అధికారాల నేపథ్యంలో ఈ పర్యటనను అధికారులు కూడా కీలకంగా భావిస్తున్నారు. కమిషన్ చైర్పర్శన్ పర్యటనకు సంబంధించి రాయగడ కలెక్టర్, ఎస్పీతో పాటు ఇతర జిల్లాస్థాయి అధికారులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలిసింది. -
ఫోర్జరీ పత్రాలతో భూ ఆక్రమణ
శ్రీకాకుళం క్రైమ్: తాతల వారసత్వంగా వచ్చిన తమ ఇనాం భూమిలోని కొంత స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో రావాడ అరుణకుమారి ఆక్రమణ చేస్తున్నారని, అడ్డుకుంటే దాడులకు ఎగబడుతున్నారని కొత్తూరు మండలం కలిగాంకు చెందిన అలికాన శ్రీనివాసరావు ఎస్పీ గ్రీవెన్సులో సోమవారం ఫిర్యాదు చేశారు. కలిగాం బౌండరీలో దాదాపు 70 సెంట్ల స్థలాన్ని ఎం.రాజారావు, అలికాన తులసీదాసుల సహకారంతో అరుణకుమారి ఆక్రమించారని, ఇదే విషయాన్ని సీఎం గ్రీవెన్సులో గత నెల 30న ఫిర్యాదు చేశామని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్సులో బాధితుల నుంచి 63 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల వద్ద నుంచి వినతులు స్వీకరించి సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. -
స్క్రబ్ టైఫస్ వ్యాప్తి ప్రాంతంపై ప్రత్యేక నిఘా
భువనేశ్వర్: స్క్రబ్ టైఫస్ ప్రభావిత ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవల రాష్ట్రంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందినట్లు ఖరారు కావడంతో స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన నమూనా పరీక్షల్లో నెగెటివ్ ఖరారు కావడంతో ఆందోళన చెందాల్సిన పరిస్థితులు లేనట్లు ఆరోగ్య శాఖ భరోసా ఇచ్చింది. స్క్రబ్ టైఫస్ నిర్ధారణకు ఆరోగ్య శాఖ ఎపిడెమియోలాజికల్ పరీక్షలను ముమ్మరం చేసింది. ఇంతకు ముందు పరీక్షించిన 9 నమూనాల పరీక్షల్లో సోమవారం ఐజీఎం ఎలీసా ఫలితాలు నెగటివ్గా తేలినట్లు పేర్కొన్నారు. మరో వైపు ప్రభావిత ప్రాంతంలో సామూహిక స్క్రీనింగ్ నిర్వహించి నమూనాలను సేకరించారు. ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. సందిగ్ధ పీడితులు సకాలంలో పరీక్షలు చేయించుకోవడంపై నిరంతర నిఘా వేసింది. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితిని ఆరోగ్య శాఖ స్క్రబ్ టైఫస్ అనుమానిత క్లస్టర్గా పరిగణిస్తుంది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పర్యావరణం, దట్టమైన వృక్షసంపద, గుబురు పొదలు, గడ్డి ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బయటకు వెళ్లేటప్పుడు చెప్పులు తొడుగుకుని, శరీరం పూర్తిగా కప్పి ఉంచే రీతిలో దుస్తులు ధరించి చర్మం బహిర్గతం కాకుండా జాగ్రత్త వహించాలని కోరారు. బస్సు నుంచి జారిపడి కండక్టర్ మృతి భువనేశ్వర్: భద్రక్ జిల్లా బేటలిగాంవ్ మార్కెట్ సమీపంలో కదులుతున్న బస్సు నుంచి జారిపడి కండక్టర్ మృతి చెందారు. మృతుడిని ప్రభాత్ మల్లిక్గా గుర్తించారు. అతను అరడీ అఖండలమణి నుంచి భద్రక్ వైపు ప్రయాణిస్తున్న అమానత్ బస్సుకు కండక్టర్గా పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై జారిపడి అక్కడికక్కడే మృతి చెందారు. గంజాయితో ఇద్దరు అరెస్టు ఆమదాలవలస: స్థానిక పోలీసుస్టేషన్ పరిధి కొత్తరోడ్డు సమీపంలోని నాగావళి నది పరివాహక ప్రాంతంలో 2.5 కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ ఎం.సన్యాసినాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. నాగావళి నది బ్రిడ్జి కింద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ సనపల బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం వారిని తనిఖీ చేయగా అలికాన నవీన్ కుమార్, చింతాడ దిలీప్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. మండల డిప్యూటీ తహసీల్దార్, వీఆర్వోల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా నవీన్ కుమార్ వద్ద 1.5 కిలోలు, దిలీప్ వద్ద కిలో గంజాయి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచామన్నారు. నిందితులిద్దరికీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో వారిని అంపోలు జిల్లా జైలుకు తరలించినట్లు వెల్లడించారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి మందస: మండలంలోని కొత్తపల్లి జాతీయ రహదారి బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన కొత్తపల్లి కాంతారావు(43) కంచిలి నుంచి పలాసకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు తీవ్రగాయాలతో ఉన్న కాంతారావును హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన అనంతరం 108 వాహనంలో టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే మార్గమధ్యలో అతను మృతి చెందారు. కాంతారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కంచిలి మండలంలో ఉన్న ఫాస్ట్ఫుడ్ సెంటర్లో మాస్టర్గా పనిచేస్తున్నారు. మందస పోలీసులు కేసు నమోదు చేశారు. -
పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులపాటు ఉత్తర, కోస్తా ఒడిశా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్డీ) సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐఎమ్డీ తెలిపింది. ఆదివారం సూర్యోదయం నుంచి రాష్ట్ర రాజధానిలో వర్షం కురుస్తూనే ఉంది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో అసాధారణమైన చీకటి అలుముకుంది. ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్ఆర్సీ) రాబోయే 4 రోజుల కోసం వివిధ జిల్లాలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ వ్యవధిలో బాలేశ్వర్, భద్రక్, కేంద్రాపడా, మయూర్భంజ్ జిల్లాలకు ఐఎమ్డీ రెడ్ వార్నింగ్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా జగత్సింగ్పూర్, జాజ్పూర్, అనుగోల, కెందుఝర్, కటక్ మరియు ఢెంనాల్ ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. నేటి వాతావరణ సూచన సోమవారం బరగఢ్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ వా ర్నింగు జారీ చేశారు. ఆరెంజ్ హెచ్చరిక సుందర్గఢ్, ఝార్సుగుడ, సంబల్పూర్, దేవ్గడ్, అంగోలా, కెందుఝర్, సుబర్ణపూర్, నువాపడా, బొలంగీర్ మరియు కలహండి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. పసుపు హెచ్చరిక బాలేశ్వర్, భద్రక్, జాజ్పూర్, ఢెంకనాల్, మయూర్భంజ్, బౌధ్, కంధమల్, నబరంగ్పూర్, రాయగడ మీదుగా ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాలేశ్వర్, భద్రక్, జాజ్పూర్, కేంద్రాపడా, జగత్సింగ్పూర్, కటక్, ఢెంకనాల్, మయూర్భంజ్, బౌధ్, కంధమల్, నవరంగ్పూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్గిరి, గజపతి, పూరీ, ఖుర్దా, నయాగడ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. -
పూరీ ఆలయంలో ఎలుకలు, బొద్దింకల బెడద
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయ గర్భగుడిలో తలెత్తిన ఎలుకలు, బొద్దింకలు బెడద సేవాయత్లలో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ బెడదను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆలయ యంత్రాంగం చర్చిస్తోంది. శ్రీ జగన్నా థ ఆలయ పరిపాలన (ఎస్ జేటీఏ) కార్యాలయంలో సీనియర్ సేవాయత్లు, ఛొత్తీసా నియోగ నాయక జనార్దన్ పట్టజోషి మహా పాత్రో, దైతపతి నియోగ కార్యదర్శితో పూరీ జిల్లా కలెక్టర్ దిబ్యజ్యోతి పరిడా సవివరంగా చర్చించారు. రాత్రి పూట దేవతా మూర్తులు విశ్రాంతి తీసుకునే సమయంలో ఆలయం లోపల ఉండే చీకటిని ఎలుకలు, బొద్దింకలు అవకాశంగా తీసుకుని ఇబ్బంది కలిగిస్తున్నాయని పట్టజోషి మహా పాత్రో తెలిపారు. దేవతామూర్తుల పవిత్ర దేహానికి ఎలాంటి హాని జరగకుండా నివారించడంపై సేవాయత్లు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని వివరించారు. రాత్రి పూట దేవతా మూర్తులు విశ్రాంతి తీసుకునే సమయంలో జయ, విజయ ద్వారం నుంచి గర్భగుడి వరకు ఉన్న ప్రాంతం చీకటిగా ఉంటుంది. ఇది కీటకాలు తిరగడానికి అవకాశం కల్పిస్తుందని పట్టజోషి మహా పాత్రో అన్నారు. పలు సందర్భాల్లో ఎలుకలు, బొద్దింకలు కనక ముండి చందువాలోకి (దేవతామూర్తుల తలపైన ఉండే పందిరి) కూడా ప్రవేశించినట్లు సమాచారం. ఆలయ సంప్రదాయాలు, శాస్త్రాల ప్రకారం ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఎలుకల కోసం బోనులు పెట్టడం, బొద్దింకలను ఆకర్షించడానికి బెల్లం ఉన్న కుండలను ఉంచడం వంటి నిర్దిష్ట చర్యలు సేవాయత్ వర్గం సూచించింది. ఆలయంలోని స్థిరపడిన సంప్రదాయాలను పాటిస్తూనే ఈ సమస్యను పరిష్కరించే చర్యలపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఎస్జేటీఏ ప్రధాన నిర్వాహకుడి (సీఏఓ) అధ్యక్షతన త్వరలో మరో సమావేశం జరుగుతుందని ఆయన అన్నారు. పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం రాయగడ: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన కల్యాణసింగుపూర్ సమితి పునాఖండి పంచాయతీలోని సనోఘటి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల మధ్య విసిగెత్తిన గ్రామానికి చెందిన విష్ణు కులసి శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చిని కుటుంబీకులు ఆపస్మారక స్థితిలో ఉన్న విష్ణు కులసిని చూసి వెంటనే కళ్యాణసింగుపూర్ పీహెచ్సీకి చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతున్న యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ జయపురం: జయపురం సబ్ డివిజన్ కొట్పాడ్ సమితిలోని వరద ప్రాంతాలను కొరాపుట్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సస్మితా మెలక ఆదివారం పర్యటించారు. ఇంద్రావతి నది ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలు పడటం వలన కొట్పాడ్ సమితిలోని 6 గ్రామ పంచాయతీల్లో అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. సస్మిత మెలక తన బృందంతో ముంపు ప్రభావిత గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలిసి వారికి ప్రభుత్వ అధికారులు అందించే సహాయంపై అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు, వృద్ధులకు దుప్పట్లు, బియ్యం, అటుకులు, బెల్లం, దుస్తులు పంపిణీ చేశారు. చైర్పర్సన్ మాట్లాడుతూ.. ఇల్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇల్లు నిర్మించటం జరుగుతుందన్నారు. బాధితులందరికి తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమెతో పాటు బొరిగుమ్మ సమితి 1వ జోన్ పరిషత్ సభ్యులు ప్రసాద్ బిడిక, మంత్రి ప్రతినిధి నరేంద్ర బిశాయి, కొట్పాడ్ సమితి చైర్మన్ తపన కుమార్ పాణిగ్రహి, జిల్లా పరిషత్ కొట్పాడ్ జోన్–2 సభ్యురాలు గీతాంజలి మఝి, మనోజ్ పండా, కొట్పాడ్ సమితిలోని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
వంశధారలో కాలువలో పడి యువకుడు మృతి
హిరమండలం: కుమారుడికి వివాహం జరిపించాలని ఆ తల్లిదండ్రులు భావించారు. ఇంతలోనే కాలువ రూపంలో మృత్యువు కబళించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హిరమండలంలోని చిన్నకోరాడ వీధికి చెందిన కొంకి గోవింద (37) ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి స్నానం కోసం చిన్నకోరాడ సమీపంలోని వంశధార కుడి కాలువలో దిగాడు. కొద్దిసేపటికే గల్లంతయ్యాడు. అక్కడే స్నానం చేస్తున్న స్థానికులు గమనించి గ్రామంలోకి వెళ్లి సమాచారం అందించారు. వారంతా వచ్చి కాలువలో గాలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొత్తూరు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. సాయంత్రానికి మృతదేహాన్ని బయటకు తీశారు. కుమారుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు అప్పలనరసమ్మ, దుర్గా రావు గుండెలవిసేలా రోదించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మధుసూదనరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. -
జేకేపూర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉద్రిక్తత
రాయగడ: జేకేపూర్ ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) హాస్పిటల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 13 ఏళ్ల బాలికకు ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో, రక్త నమూనా సేకరణలో సరైన విధానాలు పాటింలేదని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో హాస్పిటల్లో కొంత సమయం ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై విధుల్లో ఉన్న వైద్యుడు, నర్సు నుంచి వివరణ కోరనున్నట్లు ఈఎస్ఐ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జేకేపూర్ ఉద్యోగుల సంఘం కోశాధికారి హేమంత్ కుమార్ జెన్నా కుమార్తె విజయలక్ష్మి అనారొగ్యంతో భువనేశ్వర్ నుంచి చికిత్స అనంతరం తిరిగి వచ్చింది. వైద్యుల సూచన మేరకు ప్రతీ 21 రోజులకు ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటికే రెండు ఇంజక్షన్లు ఇచ్చారు. మూడో ఇంజక్షన్ కోసం శుక్రవారం ఆమెను జేకేపూర్ ఈఎస్ఐ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఇంజక్షన్ ఇవ్వడానికి ముందు అవసరమైన పరీక్షల కోసం రక్త నమూనా సేకరిస్తుండగా విధుల్లో ఉన్న నర్సు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ సక్రమంగా రక్త నమూనా తీసుకోలేకపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక తీవ్ర ఇబ్బందికి గురైందన్నారు. అనంతరం ఇంజక్షన్ ఇచ్చే సమయంలో కూడా సరైన విధానం పాటించలేదని, ఇంజక్షన్ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని వైద్యుడి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో సీడీయూ జిల్లా అధ్యక్షురాలు, జేకే పేపర్ మిల్లు, ఇంఫా ఉద్యోగల సంఘం సలహాదరుడు చందనా హరిచందన్.. విధుల్లో ఉన్న వైద్యుడు, నర్సుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఆరోపణలు గతంలోనూ వచ్చాయని, గతంలో ఓ ఉద్యొగికి బ్రెయిన్ హ్యామరేజ్ జరిగిన ఘటన కూడా ఉందన హరిచందన్ పేర్కొన్నారు. హాస్పిటల్పై తరచూ ఫిర్యాదులు వస్తున్నప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. హాస్పిటల్లో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు సొంత ఖర్చులతో ఆంబులెన్స్ ఏర్పాటు చేసకోవాల్సి వస్తోందన్నారు. మరోవైపు ఈఎస్ఐ అధికారులు స్పందిస్తూ.. విజయలక్ష్మికి అవసరమైన పరీక్షలు నిర్వహించామని, ఈ క్రమంలో ఇబ్బంది కలిగిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఘటనపై విధుల్లో ఉన్న వైద్యుడు, నర్సు నుంచి వివరణ కోరనున్నట్లు అధికారులు తెలిపారు. -
రైలు నుంచి జారిపడి మహిళకు గాయాలు
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస రైల్వే స్టేషన్లో ఆదివారం రైలు నుంచి జారిపడి మహిళకు గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. కోల్కతా నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్ రైలు పలాస రైల్వే స్టేషన్కు చేరుకున్న సమయంలో అసోంకు చెందిన మహిళా ప్రయాణికురాలు అజ్మినా ఖాన్ జారిపడటంతో గాయాల పాలైంది. స్థానికులు స్పందించి 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సత్యం, వెంకటరావు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్తకు తలకొరివి పెట్టిన భార్య సంతబొమ్మాళి: భర్తను కోల్పోయిన వేళ కుమారుడు విదేశాల్లో ఉండటంతో భార్యే తలకొరివి పెట్టిన ఘటన సంతబొమ్మాళి మండలం సూరాడవానిపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సూరాడ మోహనరావు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన కుమారుడు విదేశాల్లో ఉండటంతో స్వగ్రామానికి చేరుకోలేకపోయారు. దీంతో మోహనరావు భార్యే భర్త అంత్యక్రియలను నిర్వహిస్తూ తలకొరివి పెట్టారు. మోహనరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం పరిధిలోని కొత్తరోడ్ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు...స్థానిక హడ్కో కాలనీకు చెందిన చుక్క సంతోష్ దొర (36) జూనియర్ లైన్మేన్గా విధులు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత పనిమీద కొత్త రోడ్ జంక్షన్ వచ్చి రోడ్డు క్రాస్ చేస్తుండగా పాలకొండ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ హయర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో సంతోష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంతోష్కు భార్య కళ్యాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● ఘనంగా స్పోర్ట్ డే
రాయగడ: క్రీడలతో ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో జిల్లాలో మూడు రోజుల పాటుగా జాతీయ క్రీడా దినోత్సవం–2026 ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ రవీవద్ర కుమార్ కుహరో పర్యవేక్షణలో మూడు రోజులుగా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. ఈ ఏడాది భేలేగా భారత్..జీతేగా భారత్ అనే ప్రధాన సందేశంతో చిన్నారులు, యువతను క్రీడల వైపు ఆకర్షించడం, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, క్రీడలను నిత్యజీవితంతో భాగంగా చేసుకోవడంపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ క్రమంలో ట్రిబ్యూట్ థీమ్తో దేశంలోని ప్రముఖ క్రీడాకారులు, క్రీడా రంగ ప్రముఖులకు డిజిటల్, సామాజిక కార్యక్రమాల ద్వార ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా ప్లే థీమ్ కార్యక్రమంలో భాగంగా ప్లేగ్రౌండ్లో ఒక గంట ఆట అనే సందేశంతో జిల్లాతోని వివిధ పాఠశాలల్లో, విద్యాసంస్థల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, పరుగు, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజ్ప్రసాద్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీని కూడా నిర్వహించారు. థీమ్ మూడులో భాగంగా స్పెషల్ సండేస్ సైకిల్ ఎడిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సైకిల్ తొక్కడం, ఇతర శారీరక వ్యాయామాల్లో ప్రజలు, యువత చురుగ్గా పాల్గొనేలా అవగాహన కల్పించారు. ఈ సైకిల్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రవీంద్ర కుమార్ కుహరో, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న తదితరులు ప్రారంభించారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారి భద్రత, అవసరమైన నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు సంబంధించిన ఏర్పాట్లు ముందుగానే చేపట్టారు. జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్ ఆలీనూర్ పర్యవేక్షించారు. -
ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
పర్లాకిమిడి: వ్యవహారిక భాష కోసం పోరాడిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్థానిక సింహాద్రి అప్పన్న కల్యాణ మండపంలో చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చా గోష్టి, తెలుగు భాషపై ఉపోధ్ఘాతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి అధ్యక్షుడు కోండా రామారావు, కార్యదర్శి బి.జనార్దరావు ఆధ్వర్యంలో గణేష నామ స్తుతిలో మొదలుపెట్టారు. గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. గిడుగు తెలుగునాట పుట్టి పర్లాకిమిడి రాజావారి సంస్థానంలో ఉన్న కృష్ణచంద్ర గజపతి కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. ఆయన సవరభాష లిపిని కనుగోని ఇంగ్లిష్లో బాషలోకి తర్జుమా చేశేవారని వి.వి.రమణమూర్తి పంతులు అన్నారు. అందుకు గుర్తింపుగా మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం గిడుగు కృషికి మెచ్చి 1913లో రావుబహదూర్ అని బిరుదును అందజేశారన్నారు. ఈ సందర్భంగా గిడుగు జీవనవిధానం, చరిత్రపై పలువురు మాట్లాడారు. మాతృ భాష దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు చెట్టి వేంకటేశ్వర్లు, శాసనం ధనుంజయ, వి.వి.రమణమూర్తి పంతులును ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన సభలో పాతపట్నంకు చెందిన పారిశెల్లి రామరాజు, జామి పోలిశెట్టి, కోట్ని శోభారాణి, కల్యాణ వినయకుమార్, కోశాధికారి గణేష్ పట్నాయక్, జవ్వాది సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంటరీ సంయుక్త కమిటీ భువనేశ్వర్ పర్యటన
● ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల జీతాలు, భత్యాలపై చర్చలుభువనేశ్వర్: జీతాలు, భత్యాల పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఆదివారం భువనేశ్వర్లో పర్యటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర శాసన సభ సభ్యుల జీతాలు, ఇతర భత్యాలు, అలాగే మాజీ ఎమ్మెల్యేల ఫించను, భత్యాలపై స్పీకర్ సురమా పాఢి శాసన సభ వ్యవహారాల మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, శాసన సభ కార్యదర్శి సత్యబ్రత్ రౌత్, ఇతర అధికారులతో విడివిడిగా కూలంకషంగా ఈ కమిటీ చర్చలు జరిపింది. రాష్ట్ర ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాలు, భత్యాలు, అనుబంధ ప్రయోజనాలపై సంయుక్త కమిటీ తులనాత్మక నివేదికను పార్లమెంటులో సమర్పిస్తుంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న జీతాలు, భత్యాలను మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ చైర్మన్ ఎంపీ బీరేంద్ర ప్రసాద్ వైశ్యతో పాటు ఎంపీలు విజయ్ కుమార్ దుబే, వీణా దేవి, కె.గోపీనాథ్, బాబు సింగ్ కుష్వాహా, రిచర్డ్ భమిలహమ్నాంగియా, పార్లమెంట్ డైరెక్టర్ భత్శాల జోషి భువనేశ్వర్కు విచ్చేసిన బృందంలో ఉన్నారు. -
సకల కళల సమాహారం..హరికథ
● సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించడంలో తోడ్పాటు ● అంతరించిపోతున్న కళను ఆదరిస్తున్న సంస్థలు ● నేడు హరికథా పితామహుడు ‘నారాయణదాసు’ జయంతి శ్రీకాకుళం కల్చరల్ : సకల కళల సమాహారంగా నిలిచే హరికథకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఒకే వ్యక్తితో సందర్భానుసారంగా హావ, భావ, రాగ, తాళ, నాట్య విన్యాసం ఆవిష్కరించడం ఈ కళ గొప్పతనం. ప్రాచీన జానపద కళారూపమైన హరికథను సంస్కరించి సామాన్యుని మనోజన హృదయ రంజకంగా తీర్చిదిద్దిన ఘనత హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసుకే దక్కుతుంది. అందుకే ఆయన హరికథా పితామహుడయ్యారు. కొన్ని గంటల సమయంలో పురాణ కథ, కీర్తనలు, పద్యం, మంజరి, తోహరా, వచనాలతో రసవత్తరమైన గాన, తాళ, భావయుక్త, పరిపూర్ణమైన మహోన్నత కథా కధనం తయారుచేసి నవరస భరితంగా ప్రదర్శించగల గంధర్వుడు ఆదిభట్ల. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టుల ద్వారా హరికథలను ఆదిరించి జీవింపచేస్తున్నారు. ఆవిధంగా హరికథ ఇప్పటికీ జనాదరణలోనే ఉంటోంది. రేడియోలలో ఇప్పటికీ హరికథకులకు ఆదరణ లభిస్తోందనే చెప్పాలి. ఈ కళకు గుర్తుగా జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో ప్రముఖ కళాభిమాని డాక్టర్ నిక్కు అప్పన్న.. నారాయణదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో హరికథకులు.. శ్రీకాకుళం జిల్లా హరికథ చరిత్రలో ఈశ్వర సత్యనారాయణ శర్మ ప్రథములు. ఈయన శర్మద రామాయణం, భక్తనందనార్, సతీసులోచన, వామన చరిత్ర, లక్ష్మీవిజయం, త్యాగరాజ, శ్రీనివాస కల్యాణం, సతీ పరిణయం రచించారు. డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు హరికథలపై పరిశోధన గ్రంథాన్ని రచించి బర్హెంపూర్ యూనివర్సిటీకీ సమర్పించి డాక్టరేట్ పొందారు. జిల్లాలో సీనియర్ భాగవతారులైన దివంగత దూసి బెనర్జీ ఇంగ్లీషులో కూడా హరికథ చెప్పగల దిట్టగా పేరుగాంచారు. బుసకల రంగారావు, యెన్ని రామం, ముగితి వెంకటనారాయణ, బొంతలకోటి యతిరాజులు, వడగ సుబ్రహ్మణ్యం, జయంతి సావిత్రి, రోణంకి మీనాక్షి, సిద్దేశుల శారదాంబ, సరోజిని, పి.వి.సత్యనారాయణ, ఎం.శివదండాసి వంటి ఎందరో భాగవతారులు కళను తమ ప్రదర్శనలతో బతికిస్తున్నారు. ఇంకా ఎందరో హరికథా గానం చేస్తూ జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. సుమిత్రా కళా సమితి ప్రోత్సాహం.. జిల్లాలో సుమిత్రా కళా సమితి నిర్వాహకులు హరికథ కళను ఆదరిస్తున్నారు. ప్రతి ఏడాది హరికథా సప్తాహం నిర్వహిస్తూ కళ కోసం కృషి చేస్తున్నారు. జిల్లా కళాకారులనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా యువ కళాకారులను తీసుకువచ్చి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 6న బాపుజీ కళామందిర్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు.రంగస్థ కళాకారులు కూడా హరికథ ప్రదర్శనలను ఏర్పాటు చేస్తు కళను ఆదరిస్తున్నారు. -
ఆదిత్యాలయానికి పోటెత్తిన భక్తజనం
అరసవల్లి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. శ్రావణ మాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాదాలు, మంచినీటి సౌకర్యాలను కల్పించారు. రూ.300 చెల్లించిన భక్తులకు అంతరాలయంలో గోత్రనామాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో భక్తులకు ఆదివారం ఉదయం 5.30 గంటల నుంచి సర్వదర్శనాలను కల్పించారు. ఆరోగ్యం కోసం రూ.300 చెల్లించి సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. ఈఓకు ఫిర్యాదులు.. ప్రసాదాల పంపిణీ వద్ద ఆన్లైన్ సమస్య తలెత్తడంతో కొందరికి విక్రయాలు సాధ్యం కాలేదు. కేశఖండన శాలలో ఎప్పట్లాగే అక్రమ వసూళ్లు వ్యవహారం తలెత్తింది. టికెట్ల సొమ్ము కంటే అదనంగా డబ్బులు అడుగుతున్నారంటూ కొందరు భక్తులు ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల పట్ల గౌరవంగా ప్రవర్తించకుండా రెగ్యులర్ ఉద్యోగులు సైతం నోరుపారేసుకుంటూ అవమాన పరుస్తున్నారంటూ ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఈవోకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ అవస్థలు..! దేవదాయశాఖ ఆన్లైన్ విధానంలో ఇటీవల మార్పులు చేపడుతున్న క్రమంలో అరసవల్లి ఆలయంలో ఆన్లైన్ విధానంలో సమస్యలు తలెత్తాయి. వివిధ దర్శనాల టికెట్లతో పాటు ఇతరత్రా సౌకర్యాల కల్పనకు ఆలయ ఆన్లైన్ వ్యవస్థ ద్వారానే భభక్తులకు సేవలందిస్తున్నారు. అయితే టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (టీఎంఎస్) ఆన్లైన్ పోర్టల్లో మార్పులు కారణంగా స్థానికంగా ఆలయంలో ఆన్లైన్ పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో విరాళాల రశీదులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్ టిక్కెట్లు ఆగిపోవడంతో మాన్యువల్గా ఇచ్చిన టికెట్లు, టైం స్లాట్ ఆలస్యమైన టికెట్లతో దర్శనాలకు వెళ్లిన వారు కూడా సిబ్బంది చేష్టలతో ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఈఓ స్పందిస్తూ సాంకేతిక లోపంతో ఆలస్యమయ్యాయని, నకిలీ టికెట్లు కావంటూ ధ్రువీరించారు. ఆన్లైన్ సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఢిల్లీకి తరలిన కమ్యూనిస్టు నేతలు
జయపురం: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ ఒకటో తేదీన నిర్వహిస్తున్న ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీపీఐ నాయకులు శనివారం రాత్రి తరలివెళ్లారు. కమ్యూనిస్టు పార్టీ జిల్లా నేత ఉత్తమ మల్లాక్ నేతృత్వంలో జయపురం నుంచి హీరాకుద్ ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరారు. వారు భువనేశ్వర్ వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లారని రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రమోద్ కుమార్ మహంతి తెలిపారు. దేశంలో ధరలు నియంత్రించటంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగ సమస్య పరిష్కరించటంలో, విద్య, వైద్య రంగాల వైఫల్యాలు పూర్తిగా విఫలమైన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు, అంబానీ, ఆదానీ మొదలగు పెట్టుబడుదారులకు దేశ సంపదను చౌకగా అప్పగించటానికి నిరసనగా ఢిల్లీలోని రామలీలా మైదానంలో జాతీయ కమ్యూనిస్టు పార్టీ పరివర్తన మహాసభ నిర్వహిస్తుందని నాయకులు చెప్పారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
శ్రీకాకుళం రూరల్: రాగోలు పంచాయతీ రాయిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు పొలాల్లోకి దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. నేరుగా పొలాల్లోకి దూసుకుపోయినప్పటికీ ఎవరికీ ఎటువంటి నష్టం కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కారును ఢీకొట్టిన లారీ రణస్థలం: శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆదివారం సాయంత్రం రణస్థలం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ కూడలి వద్ద జరిగిన ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న ముగ్గురూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జె.ఆర్.పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు పెట్టి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. నేత్రదానంపై అవగాహన ర్యాలీ శ్రీకాకుళం అర్బన్/శ్రీకాకుళం కల్చరల్: జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహిస్తున్న ‘41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు‘ సందర్భంగా 80 ఫీట్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నేత్రదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆప్తాలమిక్ అధికారి ఎంఆర్కే దాస్ వాకర్లకు నేత్రదానం – కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వైశ్యరాజు తిరుమలరాజు, పొట్నూరు మాధవరావుల పిలుపుమేరకు 30 మంది వాకర్ల కుటుంబ సభ్యులకు దాస్ అవగాహన కల్పించారు. మరణానంతరం నేత్రదానం చేస్తామని ప్రతిజ్ఞ పత్రాలు అందజేశారు. రణస్థలం: బంటుపల్లి పంచాయతీ పరిధిలో ఓ పరిశ్రమ నుంచి వెలువడుతున్న ధూళి, బూడిదతో ఇబ్బందులు పడుతున్నామని పరిసర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లటి బూడిద ఇళ్లపైన, నీళ్లలోనూ, తినే ఆహా రంలో పడుతోందని, సమీప వాణిజ్య పంటలకు సైతం నష్టం వాటిల్లుతోందని వాపోయా రు. వాహనచోదకుల కళ్లలో పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ విఫయమై కాలుష్య నియంత్రణ అధికారి కుసుమశ్రీ వద్ద ప్రస్తావించగా, గతంలో పరిశ్రమకు షోకాజ్ నోటీస్ జారీ చేశామని, మరల పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
చట్టాలపై అవగాహన
పర్లాకిమిడి: స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా న్యాయసేవా ప్రాధికరణ గజపతి జిల్లా జడ్జి, డి.ఎల్.ఎస్.ఎ అధ్యక్షుడు జగదీష్ ప్రసాద్ మహంతి ఆదేశాల మేరకు న్యాయ సచేతన కార్యక్రమన్ని కార్యదర్శి బిమల్ రౌళో ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ న్యాయ అవగాహన సదస్సులో సీనియర్ న్యాయవాది ఆర్.బాబూరావు, సఖీ వన్ స్టాఫ్ సెంటర్ అడ్మిన్స్ట్రేటర్ సునీతా రోథో, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. సుప్రీం కోర్టు ఇటీవల ఇంగ్లిషులో విడుదల చేసిన వివిధ తీర్పులను (ఏఐ) ఆధారంగా ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి ‘విధిక్’ అనువాద సాఫ్ట్వేర్ (సువాస్)ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. దీంతో పాటు ఒడిశా హైకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ కోర్టు రూల్స్ 2020కి సులభతరమైన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, సివిల్ ప్రోసీజ్యూర్స్ ఏ.డి.ఆర్. చట్టాలు 2007పై ఈ సదస్సులో డి.ఎల్.ఎస్.ఎ కార్యదర్శి బిమల్ రౌళో అవగాహన కల్పించారు. -
జీఐఈటీ వర్సిటీకి జాతీయస్థాయి గుర్తింపు
రాయగడ: విద్యార్థులకు మెరుగైన కేరీర్ అవకాశాలు కల్పించడం, ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో బలమైన సంబంధాలు కొనసాగించడం, క్యాంపస్ ప్లేస్మెంట్లలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నందుకు జిల్లాలోని గుణుపూర్లో ఉన్న గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మమైన గౌరవం దక్కింది. తూర్పు భారతదేశంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్, కార్పొరేట్ రిలేషన్స్ విభాగాల్లో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఇండియా బ్రాండ్ ఐకాన్ అవార్డు–2026ను వర్సిటీ అందుకుంది. ముంబైలో టైమ్ సూఐబర్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవార్డు ప్రదానోత్సవంలో విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డాక్టర్ చంద్రధ్వజ పండ ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. వి ద్యార్థుల భవిష్యత్ కేరీర్ను తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి, పరిశ్రమలతో ఏర్పరుచుకున్న బలమైన అనుబంధాలు, నాణ్యమైన క్యాంపస్ ప్లేస్మెంట్స్కు గుర్తింపుగా అవార్డు లభించింది. విద్యా, ఉపాధి అవకాశాలు, కార్పొ రేట్ అనుసంధానం వంటి రంగాల్లో జీఐఈటీ యూనివర్సిటీ సాధిస్తున్న ప్రగతికి ఈ అవార్డు మరో ముఖ్యమైన మైలు రాయిగా నిలిచింది. -
మళ్లీ ఉప్పొంగుతున్న సువర్ణ రేఖ నది
● బాలాసోర్లో వరద ముప్పుభువనేశ్వర్: బాలాసోర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సువర్ణ రేఖ నది నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. మరో వరద ముప్పు పొంచి ఉంది. రెండో వరద తగ్గిన 14 రోజుల లోపే మూడో వరద వచ్చే అవకాశం ఉండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. జార్ఖండ్లోని గలుడిహ్ బ్యారేజీ 6 గేట్లను తెరవడంతో దిగువన ప్రవహిస్తున్న సువర్ణ రేఖ నది నీటి మట్టం అనుక్షణం పెరుగుతుంది. పరిస్థితి మరింత తీవ్రమైతే జలేశ్వర్, భొగరాయ్, బలియాపాల్ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు మళ్లీ ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. తాజా వరద ముప్పు సువర్ణ రేఖ నది ప్రమాద స్థాయి 10.36 మీటర్లు కాగా ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి దాని నీటి మట్టం 8.84 మీటర్లుగా నమోదైంది. గత వరద సమయంలో అనేక గ్రామాలు, రోడ్లు, పంట పొలాలు నీట మునిగిపోయాయి. పలు చోట్ల రవాణాకు కూడా అంతరాయం ఏర్పడింది. గత వరదల వల్ల కలిగిన నష్టాల నుంచి కోలుకోవడానికి రైతులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి వరదలు వస్తే తమ కష్టాలు మరింత తీవ్రం అవుతాయని ఆందోళన చెందుతున్నారు. నది నీటి మట్టం మరింత పెరిగితే, బలహీన ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు, వ్యవసాయ భూములపై కూడా ప్రభావం పడవచ్చు. మూడో వరద సంభవిస్తే అంతా నాశనమవుతుందని, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోవచ్చని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. -
విచారణకు తమ్మినేని కుటుంబం
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం రూరల్ పోలీస్స్టేషన్లో విచారణకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిలు శనివారం హాజరయ్యారు. ఒక ల్యాండ్ కేసు విషయమై ఇద్దరూ హాజరైనట్లు రూరల్ ఎస్ఐ సురేష్ తెలిపారు. ఇచ్ఛాపురం రూరల్: ఆంధ్ర విశ్వకళా పరిషత్ తెలుగు శాఖ విద్యార్థిని, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామమైన జయంతిపురానికి చెందిన గిరిజన యువతి కిల్లో సరోజిని యూజీసీ–నెట్ జూన్–2026 ఫలితాల్లో సత్తా చాటారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతతో పాటు ప్రతిష్టాత్మక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) సాధించి జాతీయ స్థాయిలో ఘనత సాధించినట్లు ఆమె సోదరుడు, శాసనాం ఉన్న త పాఠశాల స్కూల్ అసిస్టెంట్ బొమ్మిడి ఢిల్లేష్ శనివారం తెలిపారు. తన విజయానికి తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, ఆచా ర్యులు వెలమల సిమ్మన్న, పరిశోధకుడు, సోదరుడు బొబ్మిడి ఢిల్లేష్ అందించిన మార్గదర్వకత్వం, ప్రోత్సాహమే కారణమని సరోజిని తెలిపారు. కవిటి: మండల పరిధిలోని జాడుపుడి ఆర్ఎస్, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు శనివారం గుర్తించారు. మృతుడు ఎరుపు రంగు టీషర్ట్, నీలంరంగు నైట్ప్యాంట్ ధరించి ఉన్నట్లు వెల్లడించారు. అతని చేతిపై ఇంగ్లిష్లో జయదేబ్ అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని గుర్తించినవారు పలాస రైల్వే పోలీ సు ఎస్ఐ డి.శ్రీనివాసరావు(92475 85743) ను సంప్రదించాలని కోరారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: పెండింగ్లో ఉన్న నోటీసులను సత్వరమే పూర్తి చేయాలని అదనపు ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి శేనాపతి ఢిల్లీరావు తెలిపారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లతో కలసి ఆయన ప్రత్యేక జాబితా సవరణపై సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక జాబితా సవరణపై కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గల ఎనిమిది నియోజకవర్గాల్లో నోటీసుల పంపిణీ పూర్తయ్యిందా లేదా అని ప్రశ్నించగా పంపిణీ పూర్తయ్యిందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో మ్యాపింగ్ కాని వివరాలను, ఫార్మ్ 6, 7, 8ల గూర్చి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 93,457 విచారణ జరిగాయని, 7184 పెండింగ్లో ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. బందరువానిపేట బీఎల్ఓ రమేష్ మాట్లాడుతూ 150 మంది మత్స్యకార ఓటర్లు జాబితాలో నమోదు కాలేదని, మత్స్యకారులు సముద్రంలో వేటనిమిత్తం వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు చెప్పగా మత్స్యకారులు సముద్రంలో ఉన్నప్పుడు వర్చ్వుల్గా నమోదు చేయవచ్చని అదనపు సీఈఓ చెప్పారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: గిరిజనుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం కలెక్టరేట్లో చెంచు తెగకు సంబంధించిన జిల్లా సంఘం ఉన్నతి సభ్యులకు సున్నా వడ్డీతో బ్యాంక్ లింకేజ్ రుణం రూ.8 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శిక్షణ కలెక్టర్ హరి ఓం పాండ్య తదితరులు పాల్గొన్నారు. -
సీఎం మార్గదర్శకాలు
ఒడిశా పోలీసులకు..భువనేశ్వర్: రాష్ట్రంలో సాంకేతికత ఆధారిత, పౌర కేంద్రీకృత పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి నేర నియంత్రణ, సైబర్ భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, తీరప్రాంత భద్రత, శిక్ష విధింపు రేటును మెరుగుపరచడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. స్థానిక రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో శని వారం జరిగిన రాష్ట్ర స్థాయి డీజీపీ, ఐజీపీల సమావేశంలో ప్రసంగిస్తూ సమర్థమైన నేర నియంత్రణ, సైబర్ భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, తీరప్రాంత భద్రత, శిక్ష విధింపు రేటును మెరుగుపరచడంపై పోలీసు బలగాలు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. పోలీసు సంస్కరణల అమలు, రాష్ట్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేజేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని వనరులు, నిధులు, పరిపాలనాపరమైన మద్దతును అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒడిశా పోలీసులకు ఆయన 10 సూత్రాల ఆదేశాన్ని జారీ చేశారు. సున్నితత్వం ప్రధానం సాధారణ పౌరులపై పోలీసు సిబ్బంది సున్నితంగా వ్యవహరించాలి, పోలీస్ ఠాణాకు వచ్చే ప్రతి వ్యక్తిని బాధితుడిగా పరిగణించి వారితో సానుభూతితో వ్యవహరించాలని ఆయన అన్నారు. ‘పోలీసులను చూసి నేరస్థులే వణికిపోతారు కానీ, అమాయక పౌరులు కాదు‘ అనే సూత్రాన్ని పోలీసులు పాటించాలని ఉద్ఘాటించారు. మాదకద్రవ్య రహితం 2029 నాటికి రాష్ట్రం మాదకద్రవ్య రహితం కావాలి. నేరస్తుల పట్ల శిక్ష విధింపు రేటు పెంచడం అనివార్యం. ఎన్సిఆర్బి సమాచారం ప్రకారం రాష్ట్రంలో శిక్ష విధింపు రేటు 40 శాతం కొనసాగుతుంది. దాన్ని కనీసం 75 శాతానికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కోరారు. ఒడిశా 575 కిలో మీటర్ల సుదీర్ఘ తీరప్రాంతాన్ని సురక్షితం చేయడానికి సముద్ర మార్గాల ద్వారా చొరబాట్లను నివారణ కోసం ప్రత్యేక పోలీసు అధికారులు, మాజీ రక్షణ సిబ్బందిని నియమించినట్లు ఆయన తెలిపారు. గత రెండేళ్లలో పోలీస్ శాఖలో 17,794 కొత్త పోస్టులను సృష్టించి 5,817 పోస్టులను భర్తీ చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణ కోసం, అవసరమైన పరికరాలతో పాటు రూ. 50 కోట్ల ప్రత్యేక దర్యాప్తు నిధిని కేటాయించారు. పోలీస్ స్టేషన్ల ఆధునీకరణతో సైబర్ నేరాలు, డార్క్ వెబ్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనేందుకు ఎన్ఏటీగ్రిడ్, సీసీటీఎన్ఎస్ వంటి వ్యవస్థల ద్వారా నిఘా సామర్థ్యాలను బలోపేతం చేయాలని పోలీసులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసు బలగాలు పూర్తి అంకితభావంతో పని చేస్తాయని పోలీస్ డైరెక్టర్ జనరల్ వినయ్తోష్ మిశ్రా హామీ ఇచ్చారు. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, ఇంటెలిజెన్స్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్. పి. కోచె, డీజీపీ (నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు) సంజీబ్ పండా, రాష్ట్రానికి చెందిన ఇతర డీజీపీలు, ఐజీపీలు హాజరయ్యారు. -
ఒడిశాలో స్క్రబ్ టైఫస్ వ్యాప్తి
● అనుగోల జిల్లాలో ఒకరు మృతిభువనేశ్వర్: అనుగోల జిల్లాలోని పల్లొలొహడా మండలం పవిత్రాపూర్ పంచాయతీ సనబగడరి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధితో ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం. మరో 10 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడటంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. మృతుడిని సుమంత్ సెఠిగా గుర్తించారు. అతడు జ్వరం, తల నొప్పి, ఒళ్లు నొప్పులతో అస్వస్థతకు గురయ్యాడు. తదుపరి దశలో చిగ్గర్ పురుగుల కాటు వల్ల కలిగే స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్గా నిర్ధారణ అయింది. 10 మందికి పైగా వ్యాధిగ్రస్తులను చికిత్స కోసం ఖమర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ), ఇతర ఆరోగ్య కేంద్రాలలో చేర్పించారు. ఈ పరిస్థితి గురించి ఖమర్ సీహెచ్సీ వైద్య అధికారితో సంప్రదించినట్లు పల్లొలొహడా సబ్ కలెక్టర్ రవీంద్ర కుమార్ పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా స్క్రబ్ టైఫస్ సోకిన ఒక రోగి మరణించగా 4 నుంచి 5 మంది రోగులు చికిత్స పొందుతున్నారని వైద్య అధికారి తెలిపారు. పరిస్థితి అదుపులో ఉంది. చికిత్స పకడ్బందీగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. వ్యాధి సోకిన వారిని ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుందన్నారు. ఆరోగ్య శాఖ నిఘా ఆరోగ్య శాఖ అనుగోల జిల్లాలో నిఘాను ముమ్మరం చేసింది. సందిగ్ధ రోగుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభావిత గ్రామంలో చికిత్స, అవగాహన కార్యక్రమాల కోసం ప్రత్యేక ఆరోగ్య బృందం 15 రోజుల పాటు క్రమం తప్పకుండా సందర్శిస్తుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ నిఘాను ముమ్మరం చేసింది గడ్డి, పొదలు, ఆకులు, తదితర వృక్షసంపద ఉన్న ప్రాంతాల్లో కనిపించే చిన్న పేను లాంటి కీటకాల కాటు వల్ల స్క్రబ్ టైఫస్ వస్తుంది. ఇది జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులను కలిగిస్తుంది. అనుగోల ముఖ్య జిల్లా వైద్య అధికారి డాక్టర్ మదన్ మోహన్ ప్రధాన్ మాట్లాడుతూ సనబగడరిలో ఇప్పటి వరకు 4 కేసులు నిర్ధారణ అయ్యాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం అని తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది. వ్యాధి సోకిన వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు. పాజిటివ్గా తేలిన వారికి తక్షణమే చికిత్స అందించేందుకు సమగ్ర సరంజామా అందుబాటులో ఉందని అభయం ఇచ్చారు. ఈ వ్యాధి కొత్తది కాదు. చాలా కాలంగా ఉంది. డయాగ్నస్టిక్ కిట్ల ద్వారా దీనిని గుర్తించవచ్చన్నారు. వర్షా కాలంలో చెప్పులు లేకుండా నడిచే వారిని టిక్ లాంటి కీటకాలు కుట్టడం వల్ల ఇది వస్తుందని ఆయన అన్నారు. -
కొండబాబు అకాల మరణం తీవ్రంగా కలిచివేసింది
రాయగడ: బీజేపీ నాయకుడు, లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు యాళ్ల వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని రాజ్యసభ మాజీ సభ్యుడు , బిజు స్వాభిమాన్ మంచ్ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరరావు అన్నారు. నాలుగు దశాబ్దాలుగా తనతో ఎంతో సన్నిహిత అనుబంధం కలిగిన కొండబాబు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపొతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. శనివారం నెక్కంటి, అతని అనుచరులు, మద్దతుదారులతో స్థానిక రాణిగుడఫారంలోని కొండబాబు స్వగృహానికి చేరుకున్నారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. అనంతరం తన స్వగృహంలో విలేకర్లతో నెక్కంటి మాట్లాడుతూ.. కొండబాబుతో తనకు నాలుగు దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆప్తుడిగా, ఆత్మీయుడిగా తనతో కొనసాగిన ఆయన ఆకస్మికంగా మృతి చెందడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. ఇటీవల బీజేపీలో చేరారని.. అయితే ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని తాను ఎప్పుడూ కొరుకునే వాడినని నెక్కంటి చెప్పారు. అయితే ఇలా అర్ధాంతరంగా అందరినీ విడిచి వెళ్లిపోవడం అత్యంత బాధాకరమన్నారు. కొండబాబు కుటుంబం ఈ కష్టకాలంలో ఒంటరిగా భావించాల్సిన అవసరం లేదని, కుటుంబానికి ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరమైనా తాను ముందుండి అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను పరామార్శించిన వారిలో నెక్కంటి తనయుడు క్రిష్ణ చైతన్య, పి.వి.పి.రాము, దూడల శ్రీనివాస్, తిరుపతి , ఇప్పిలి సన్యాసిరాజు, సానా జగదీష్, రాయగడ సమితి ఉపాధ్యాక్షులు హరప్రసాద్ హెప్రుక, కౌన్సిలర్ సర్మిష్టపాడి, సంతోష్ దలాయి, గోపి గౌడో ఉన్నారు. -
జయపురంలో బయో సీఎన్జీ ప్లాంట్
జయపురం: జయపురంలో త్వరలో రూ.70 కోట్ల అంచనాతో బయో సీఎన్జీ ప్లాంట్ ఏర్పాటు జరగనుంది. జయపురం సమితి బలియ గ్రామ పంచాయతీ పలకాపుట్ గ్రామ ప్రాంతంలో చేపట్టనున్నట్లు జయపురం మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్ వెల్లడించాయి. ఆ ప్లాంట్ లో గోబర్(పేడ)ఇతర వ్యర్థ పదార్థాలు వినియోగించి గ్యాస్ ఉత్పత్తి చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. పలకాపుట్, నువాపుట్ గ్రామాల మధ్య కుంతర్కాల్ మౌజ లో రెవెన్యూ విభాగానికి చెందిన 16.770 ఎకరాల భూమిని బయో సీఎన్జీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పూజా రౌత్, మునిసిపాలిటీ అమీన్ శుభశ్మిత జెన, భారత పెట్రోలియం కార్పొరేషన్కి చెందిన నలుగురు అధికారుల బృందం పలకాపుట్– నువాపుట్ గ్రామాల మధ్య గల కుంతరకాల్ మౌజలో ప్లాంట్కు గుర్తించిన భూమిని సందర్శించి ప్లాంట్కు ఉపయోగ పడుతుందా లేదా అని సమీక్షించారు. మరోసారి భూమిని సర్వే జరిపిన తరువాత తర్వాత చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. -
ఉపసంహరించాలి
ఎంఎండీఆర్ సవరణ బిల్లు● కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక డిమాండ్ రాయగడ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన గనులు, ఖనిజాల అభివృద్ధి –నియంత్రణ (ఎంఎండీఆర్) సవరణ బిల్లును జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు ఒడిశా రాష్ట్ర హక్కులు, ఆదివాసీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని కొరాపుట్ పార్లమెంటు సభ్యుడు సప్తగిరి శంకర్ ఉలక, రాయగడ ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రకలు అన్నారు. బిల్లును ఉపసంహరించుకోకపొతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. స్థానిక సర్క్యూట్ హౌస్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ సప్తగిరి ఉలక మాట్లాడుతూ.. ఎలాంటి సమగ్ర చర్చ లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఎంఎండీఆర్ సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసిందని ఆరోపించారు. 2024లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఖనిజాలపై పన్నులు, సెస్ విధించే హక్కు రాష్ట్రాలకు ఉన్నప్పటికీ.. తాజాగా సవరణ బిల్లు ద్వారా కేంద్రం ఆ హక్కులను పరిమితం చేసిందని ఆరోపించారు. సవరణ బిల్లు వల్ల ఒడిశా రాష్ట్రానికి రావాల్సిన సుమారు లక్ష కోట్ల రూపాయల బకాయి రాయల్టీపై ప్రభావం పడటంతో పాటు ఏటా రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 22 వేల కోట్ల వరకు రాష్ట్రానికి ఆదాయం నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఉలక పేర్కొన్నారు. దీని ప్రభావం జిల్లా ఖనిజ ప్రతిష్టానాల నిధులపైనా పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఆదాయ మిగులు రాష్ట్రంగా ఉన్న ఒడిశా భవిష్యత్లో ఆదాయలోటు రాష్ట్రంగా మారే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇసుక రీచ్, రాయి క్వారీలు, ఖనిజ భూములు వంటి రాష్ట్ర పరిధిలోని అంశాలపై కేంద్రం పెత్తనం చేయడానికి ఈ సవరణ మార్గం సుగమం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఆదివాసీ ముఖ్యమంత్రిగా ఉన్న మోహన్ చరణ్ మాఝి ఈ బిల్లుకు ఎలా మద్దతు ఇస్తున్నార ని ఎంపీ ఉలక ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు వెంటనే ఒడిశా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంఎండీఆర్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ఈ బి ల్లును కేంద్రం ఉపసంహరింకోకతోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీ సాధారణ కార్యదర్శి సంకర్షణ మంగరాజ్, డీసీసీ మహిళా అధ్యక్షురాలు నంది గౌరీ ఉన్నారు. -
భూ కుంభకోణం కేసులో మాజీ మంత్రి కుమారుడు అరెస్టు
భువనేశ్వర్: భూ కుంభకోణం కేసులో మాజీ మంత్రి కుమారుడు అజిత్ సాహును స్థానిక నయాపల్లి ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. రాజ్య సభ సభ్యుడు సుజీత్ కుమార్కు భూమి ఇప్పిస్తానని వాగ్దానం చేసి మోసం చేశాడనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో అజిత్పై ఒక ఫిర్యాదు నమోదైంది. ఆ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి ఆరోపిత మోసంపై దర్యాప్తు ప్రారంభించారు. సమన్లు జారీ చేసినప్పటికీ అజిత్ పదేపదే కోర్టుకు గైర్హాజరు కావడంతో ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు అతడిని పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది. తదనంతరం అతనిపై వారెంట్ జారీ చేసింది. వారెంట్ ఆధారంగా నయపల్లి ఠాణా పోలీసులు అతడిని భువనేశ్వర్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. బైకు చోరీ కేసులో నిందితుడి అరెస్టు రాయగడ: సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన బైకును పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరెస్టయిన వ్యక్తి కాసీపూర్ పరిధిలోని రౌత్ఘాటి గ్రామానికి చెందిన హేమంత్ గౌడోగా గుర్తించారు. నిందితుడి నుంచి టివిఎస్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో ఆర్.ఉదయగిరి వాసి మృతి పర్లాకిమిడి: తెలంగాణలో హైదరాబాద్కు పొట్టచేతపట్టుకుని వలస వెళ్లిన కార్మికుడు ఒక రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్టు ఆర్.ఉదయగిరి పోలీసు అధికారులు తెలియజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ అనుగురు పంచాయతీ తిలికోరో గ్రామానికి చెందిన బయాన్ రయితో (52) హైదరాబాద్లో రోడ్డుపై నడుచుకుని వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. అనంతరం అక్కడి స్థానికులు మెడికల్కు తరలించగా ఆయన మృతిచెందినట్టు పోలీసు అధికారులు తెలిపారు. బయాన్ రయితో మృత్యువార్త విని స్వగ్రామం తిలికోరో గ్రామంలో విషాధచాయలు నెలకొన్నాయి. ఆయన మృతదేహాన్ని ఎలాగైనా ఒడిషా తీసుకురావడానికి గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు. రూ. 1.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెల్టాయి కూడలి నుంచి బోడపోదర్ పంచాయతీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆటో అనుమానాస్పదంగా ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. దీంతో అనుమానంతో ఆపి పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్టు గమనించారు. 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహరంగ మార్కెట్లో లక్షన్నర రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ నగేష్ హంతాళ్పై కేసు నమోదు చేసి అరేస్టు చేశారు. పట్టుబడ్డ గంజాయిని చిత్రకొండ తహసీల్దార్ ప్రశాంత్ కుమార్ భత్ర సమీక్షంలో తూకం వేశారు. -
రెచ్చిపోయిన దొంగలు
సోంపేట: మండలంలో పలాసపురం గ్రామంలోని బెందాళం రాజశేఖర్ ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే అదే గ్రామంలో నౌపడ నారాయణకు చెందిన సెలూన్ షాప్ వద్ద ఉంచిన టీవీఎస్ ఎక్స్ఎల్ ద్విచక్ర వాహనం సైతం చోరీకి గురైంది. సోంపేట సీఐ బి.మంగరాజు, ఎస్ఐ బి.మోహిని, క్లూస్ టీం సంఘటన స్థలాలను శనివారం పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సోంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. పూండిలో 3 తులాలు వజ్రపుకొత్తూరు రూరల్: పలాస నియోజకవర్గంలో వాణిజ్య, వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న వజ్రపుకొత్తూరు మండలం పరిధి పూండిలో శుక్రవారం దొంగతనం ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూండి సాగర్కాలనీలో భద్రాచలం రామకృష్ణ, మురళి అనే సోదరులు ఒకే ఇంట్లో పైన, కింద గదుల్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు అన్నదమ్ములు ఉపాధి కోసం దుబాయిలో ఉన్నారు. అయితే రాఖీ పండగ రోజున వారి భార్యలైన స్వాతి, బిందులు కలిసి స్కూటీపై చినబడాంలో ఉన్న సోదరులకు రాఖీ కట్టేందుకు ఉదయం 9.30 గంటలకి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి పైన ఇంటి తాళాలు తీసి ఉండడంతో అందోళన చెందారు. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బెడ్రూంలో బీరువ పక్కన షూట్కేసులో ఉన్న 3 తులాల బంగారు అభరణాలు, రూ.15 వేల నగదు అపహరణకు గురయ్యిందని గుర్తించారు. వెంటనే స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అలాగే బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా పూండిలో గత కొంతకాలంగా కేవలం మహిళలు ఉండే ఇళ్లలోనే దొంగతనాలు జరుగుతుండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కింద ఇంట్లో దొంగతనం జరగకుండా పైఇంట్లో దొంగతనం జరగడం, అది కుడా కేవలం షూట్ కేసులో ఉన్న ఈ బంగారు అభరణాలు, నగదు చోరీ జరగడంతో తరుచూ ఇంటికి వచ్చి వెళ్లేవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. -
ఆర్టీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
పర్లాకిమిడి: స్థానిక ఆర్కే పాడి మార్గం రోడ్డులో ఉన్న రోడ్డు రవాణా కార్యాలయంలో శనివారం ఉదయం పదిగంటల సమయంలో మంటలు చెలరేగటంతో సిబ్బంది అగ్నిమాపక దళానికి ఫోన్ చేశారు. ఆర్టీఓ కార్యాలయంలో మంటలు వ్యాపించడంతో సంఘటన జరిగిన కొద్ది సమయంలోనే అగ్నిమాపక దళం సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది మొదటి అంతస్తు భవనంలో మంటలు ఆర్పడానికి ఎంత ప్రయత్నించినా లక్షలాది రూపాయల విలువైన కంప్యూటర్స్, ఫర్నీచర్, ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. ఈ సందర్భంగా ఎంవీఐ విలేకరులతో మాట్లాడుతూ, తొలుత బయోమెట్రిక్ గదిలో మంటలు ఏర్పడి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయని, విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్లే ఆర్టీఓ కార్యాలయంలో మంటలు ఏర్పడినట్టు ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారు. ఫైర్ సేఫ్టీ లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. -
ఉత్సాహంగా జాతీయ క్రీడా దినోత్సవం
పర్లాకిమిడి: అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతి సంధర్భంగా శనివారం జిల్లా స్థాయి క్రీడా ఉత్సవాలు పర్లాకిమిడి గజపతి స్టేడియంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా సబ్ కలెక్టర్ అనుప్ పండా, అతిథిగా పురపాలక సంఘచైర్మన్ నిర్మలా శెఠి, సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనామంగరాజ్, విశ్రాంత క్రీడాధికారి త్రినాథసాహు అంతర్జాతీయ ఆటగాడు కిశోర్ చంద్ర రథ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా విచ్చేసిన క్రీడాకారులకు అనేక పోటీలు నిర్వహించారు. బ్యాడ్మింటన్, కబడ్డీ, బాలికలకు మ్యూజికల్ చైర్, హాకీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. విజేతలకు సబ్కలెక్టర్ అనుప్ పండా ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. రెండు రోజులుగా ఈ క్రీడోత్సవాలు జరిగాయి. -
పారాదీప్ మత్స్య రేవులో భారీ అగ్నిప్రమాదం
● మంటల్లో ట్రాలర్ దగ్ధంభువనేశ్వర్: పారాదీప్ చేపల రేవులో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక చేపల పడవ పూర్తిగా దగ్ధమైంది. సమీపంలో ఉన్న జాలర్లు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దేబీ లక్ష్మి అనే పేరు గల చేపల వేట పడవలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్వల్ప వ్యవధిలోనే మంటలు చెలరేగి దట్టమైన పొగ మేఘాలు నింగికి ఎగసిపడి ఆందోళన కలిగించాయి. మంటలు తీవ్రమవుతుండటంతో, సమీపంలో ఉన్న జాలర్లు మండుతున్న ట్రాలర్పై నీళ్లు చల్లుతూ మంటలను అదుపు చేసేందుకు విఫల యత్నం చేశారు. తక్షణమే అగ్ని మాపక సిబ్బందిని అప్రమత్తం చేయడంతో కుజంగ్ నుంచి ఒక యూనిట్ అగ్నిమాపక బృందం ఘటనా స్థలానికి చేరింది. సమీపంలో లంగరు వేసి ఉన్న ఇతర నౌకలకు మంటలు వ్యాపించకుండా నివారించేందుకు అగ్నిమాపక సిబ్బంది సత్వర చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో గాయాలు లేదా ప్రాణ నష్టం వంటి అవాంఛనీయ సంఘటనలు జరగనట్లు సమాచారం. -
ఖరగ్పూర్–అమరావతి హైస్పీడ్ కారిడార్కు కేంద్రం ఆమోదం
రాయగడ: తూర్పు భారత దేశాన్ని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతితో అనుసంధానించే ప్రతిష్టాత్మక ఖరగ్పూర్–అమరావతి హై స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టుపై ఆశలు చిగురించాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 1,107 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ కారిడార్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 457 కిలొమీటర్ల అలైన్మెంటుకు కేంద్రం ఆమోదం లభించినట్లు సమాచారం. దీంతో ప్రాజెక్టు పనుల పురొగతిపై చర్చ ఊపందుకుంది. ఒడిశా పరిధిలో సుమారు 522 కిలోమీటర్ల రహదారి నిర్మించనున్నారు. ఇది రాష్ట్రంలొని మయూర్భంజ్ (86 కిమీ) , కేంఝర్ (86), ఢెంకానాల్ (88), గంజాం (97), కటక్ (21), నయాఘడ్ (53), కొరాపుట్ (17)జిల్లాల మీదుగా వెళ్లేలా ప్రతిపాదించారు. గుణుపూర్–రామనగుడకు ప్రత్యేక ప్రాధాన్యం ఈ హైస్పీడ్ కారిడార్ రాయగడ జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకోనుంది. ప్రతిపాదిత మార్గం గుణుపూర్, రామనగుడ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కురుపాం ప్రాంతంతో అనుసంధానం కానున్నట్లు సమాచారం. దీంతో రాయగడ జిల్లాలోని సరిహద్దు, గిరిజన ప్రాంతాల్లో రహదారి కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. కారిడార్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్తో రాయగడ జిల్లాకు రాకపోకలు, వాణిజ్య సంబంధాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గుణుపూర్, రామనగుడ వంటి గిరిజన ప్రాంతాల్లొ వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ కనెక్టివిటీ సులభతరం కావడంతో పాటు రవాణా సమయం ఖర్చు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. రూ.75,629 కోట్ల అంచనా వ్యయం నాలుగు లేన్లుగా నిర్మించనున్న ఈ హైస్పీడ్ కారిడార్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా డిజైన్ చేయనున్నారు. నాలుగు రాష్ట్రాల్లోని మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.75,629 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. కారిడార్ పూర్తయితే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణికులు, సరకు రవాణా మరింత వేగవంతం కానుంది. -
ఆపత్కాలంలో ఆపన్న హస్తం
● రెండేళ్లుగా గదికే పరిమితమైన మహిళకు కొత్త జీవితంరాయగడ: భర్త మృతి చెందిన అనంతరం మానసిక ఆరోగ్య సమస్యలతో రెండేళ్లుగా గదికే పరిమితమైన మహిళకు ఎట్టకేలకు కొత్త జీవితం దక్కింది. జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బంది సమన్వయంతో ఆమెకు అవసరమైన మానసిక చికిత్స అందించి, తదుపరి సంరక్షణ, పునరావాసం కోసం మల్కన్గిరిలోని పునరావాస కేంద్రానికి తరలించారు. జిల్లాలోని బిసంకటక్ సమితి పరిధి జుగాపదర్ గ్రామానికి చెందిన ఈ మహిళ మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా చాలాకాలంగా కుటుంబ సభ్యుల నుండి, సమాజం నుండి దూరంగా జీవిస్తున్నట్లు అధికారులకు సమా చారం అందింది. కలెక్టర్ అశుతొష్ కులకర్ణి ఆదేశాల మేరకు వైద్య బృందం గ్రామానికి వెళ్లి ఆమె పరిస్థితిని పరిశీలించింది. ఈ బృందంలో జిల్లా కేంద్రాస్పత్రి మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ రాకకేష్ రంజన్ పాఢి, బిసంకటక్ సీహెచ్సీ ఇన్చార్జి అధికారి డాక్టర్ హెచ్ బి టుడు, మానసిక ఆరోగ్య సామాజిక కార్యకర్త పూర్ణ చంద్ర కాదాంబాలు, స్థానిక సర్పంచ్ తదితరులు ఉన్నారు. కుటుంబ సభ్యులకు మానసిక అనారోగ్యం, దాని చికిత్స, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని ఒంటరిగా ఉంచడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై అవగాహన కల్పించారు. అనంతరం మహిళను రాయగడ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. డాక్టర్ రాకేష్ రంజన్ పండ పర్యవేక్షణలో ఐదు రోజుల పాటుగా మానసిక ఆరోగ్య చికిత్స, అవసరమైన సహాయాన్ని అందించారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మార్పు కనిపించడంతో పాటు పరిస్థితి స్థిరపడిందని నిర్ధారించారు. దీంతో ఆమెకు దీర్ఘకాలిక సంరక్షణ, పునరావాసం అవసరమని గుర్తించి తదు పరి ఏర్పాట్లు చేశారు. రాయగడ జిల్లా సామాజిక భద్రత అధికారి ఎలిజబెత్ గొర్డా శ్రీకాంత్ కుమార్ పాణిగ్రహి, సబ్ డివిజనల్ సొషల్ సెక్కూరీటీ ఆఫీసర్ జ్ఞానవర్ధిని, కొలనార సమితి మరి కొంతమంది సహకరించారు. సమన్వయంతో ఆమెను మల్కనగిరి లోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ మానసిక అనారో గ్యం కారణంగా ఎవరినీ బంధించి లేదా సమా జానికి దూరంగా ఉంచకూడదని అన్నారు. సకా లంలో చికిత్స, కుటుంబ సభ్యుల సహకారం, పునరావాసం, సమాజం నుంచి అంగీకారం లభి స్తే మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతు న్న వారు కూడా గౌరవప్రదమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపగలని అభిప్రాయపడ్డారు. -
పన్నీరు, కోవా దుకాణాల్లో తనిఖీలు
జయపురం: మార్కెట్లో విరివిగా అమ్ముడు పోతున్న పన్నీరు, పుట్టగొడుగులు, కోవా టోకు వ్యాపార దుకాణాలపై జిల్లా ఆహార భద్రతా విభాగ అధికారులు, జయపురం మున్సిపాలిటీ అధికారులు తమతమ సిబ్బందితో సంయుక్తంగా దాడులు జరిపారు. నేడు పట్టణంలో 7 పన్నీరు దుకాణాలు ప్రాసెసింగ్ యూనిట్ల పైన మస్రూమ్ దుకాణాలపైన దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో పన్నీరు, కోవా, మష్రూమ్ శాంపిళ్లు సేకరించారు. పాలిథీన్ సంచులు వినియోగం, ట్రేడ్ లైసెన్స్లు లేకుండా వ్యాపారం చేయటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన మూడు దుకాణాల వ్యాపారు లపై రూ.3 వేలు చొప్పున జరీమానాలు వేశా రు. శాంపిల్స్ రిపోర్టులు వచ్చిన తర్వాత ఏమై నా కల్తీలు జరిగినట్టు వెల్లడైతే తగు చర్యలు తీసుకుంటామని జిల్లాఆహార భధ్రతా అధికారి పంకజనీ బెహరా వెల్లడించారు. ఈ దాడుల్లో మునిసిపాలిటీ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్, మునిసిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. -
పీహెచ్డీ విద్యార్థులకు ఓరియంటేషన్
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో కొత్తగా నియమితులైన పీహెచ్డీ విద్యార్థులకు ఓరియెంటేషన్ (ఇంట్రడక్షన్) కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్డీ విద్యార్థులకు విశ్వవిద్యాలయంలో పరిశోధన వ్యవస్థ, నియమ నిబంధనలు, విద్యా వాతావరణం, పరిశోధనలకు సంబంధించిన వివిధ విధానాలను పరిచయం చేయటమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హృషికేష్ శనాపతి వివరించారు. పరిశోధన రంగంలో క్రమశిక్షణ, నిబద్ధత, మైళికత, పరిశోధన నీతి, అకడమిక్ ఇంటిగ్రటీ యొక్క ప్రాముఖ్యతపై వివరించారు. ఉన్నత ప్రమాణాల పరిశోధనల ద్వారా సమాజ ఉన్నతికి, దేశాభివృద్ధికి సహకారం అందించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. రిజిస్ట్రార్ మహేష్ చంద్ర నాయక్ మాట్లాడుతూ.. పరిశోధన పద్ధతలు, సాహిత్య సమీక్ష, పరిశోధన నీతి, డేటా సేకరణ, పరిశోధన వ్యాసం తయారీ, పరిశోధనలో వివిధ దశలను వివరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యువేట్ కౌన్సిల్ (సిపిజిసి)డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో, పరీక్షల నియంత్రణ అధికారి రంజన్ కుమార్ ప్రధాన్, విశ్వవిద్యాలయంలోని రిజిస్టర్డ్ పీహెచ్డీ పరిశోధన గైడ్లు పాల్గొని నూతన పరిశోధన విద్యార్థులకు మార్గదర్శకాలను వివరించారు. డాక్టర్ విజయ కుమార్ శెట్టి ధన్యవాదాలు తెలిపారు. -
సంస్కృతం అన్ని భాషలకు మూలం
జయపురం: సంస్కృతం అన్ని భాషలకు మూలమని, ఆ భాష మహాసముద్రం వంటిదని పలువురు వక్తలు అన్నారు. శనివారం జయపురం పూజ్య పూజ సంసద్ నిర్వహించిన సంస్కృత భాషా దినోత్సవం, స్వభావకవి గంగాధర మెహర్ జయంతి కార్యక్రమానికి పూజ్య పూజ సంసద్ అధ్యక్షుడు ఉదయ శంకర జానీ అధ్యక్షత వహించారు. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు సాహిత్య రుచిని సమాజానికి అందేలా సంస్కృతం చేసిందని అన్నారు. అందుకే భాషా సాహిత్యాలకు జనకుడు సంస్కృతం అని వాఖ్యానించారు. హిందీ భాషను విస్తృత ప్రచారం చేసి భాషా పరిరక్షణకు హిందీ భాషాప్రియులు, అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 19వ శతాబ్దానికి చెందిన ఒడియా కవి గంగాధర మెహరను స్వభావ కవిగా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందారన్నారు. ఆయన సాహిత్య మేధావి, ఆయన రచనలు భాషా ప్రగతికి ఎంతో తోడ్పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో పూజ్య పూజ సంసద్ కార్యదర్శి బైరాగి చరణ సాహు, ఎకంబా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి.నళినీ కుమార్, శోభాగిణి నందా, సంధ్యారాణి సాహు, ప్రీతి కాంచన సాహు, సంఘమిత్రా భుక్త, బిపిన్ కుమార్ మిత్ర, సరస్వతీ సాహు, తపన్ కుమార్ త్రిపాఠీ, సెజల్ కుమార్ సాహు, మహేశ్వర నాయక్, సంజయ కుమార్సాహు, ఆచార్య కౌశిక్, అనీశా కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. సాహితీవేత్తలు, ఇంజినీర్ కేధార్ నాథ్ బెహర, ఇంజినీర్ భాస్కర్ సామంతరాయ్, అనసూయ సామంతరాయ్ ఘనంగా సన్మానించారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రతి పాఠశాలలో నిర్వహిస్తూ విద్యార్థులలో హిందీ భాష పట్ల ఆసక్తిని పెంచాలని సన్మాన గ్రహితులు విజ్ఞప్తి చేశారు. -
11 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
రాయగడ: జిల్లాలోని రామనగుడ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ రవీంద్ర నాఽథ్ కుహరో, వివిధ రెవెన్యూ కేసులు, ఆదాయ వసూళ్లపై అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఉకుంబా గ్రామానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్గా తొలిసారిగా తహసీల్ కార్యాలయానికి వచ్చిన కుహరోను తహసీల్దార్ ప్రాణ కృష్ణ పాణిగ్రహి, అదనపు తహసీల్దార్ గయా డంబురుధర్ బెహర, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. పట్టాల పంపణీ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు రీనా బౌరి, మదన్ పండ పాల్గొన్నారు. -
న్యాయవాదులకు శిక్షణ
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు ప్యానెల్ న్యాయవాదుల శిక్షణ శిబిరాన్ని శనివారం నిర్వహించారు. స్థానిక జిల్లా జడ్జి కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ వివాద పరిస్కార కేంద్రంలో నిర్వహించిన ప్యానెల్ న్యాయవాదుల శిక్షణ శిబిరాన్ని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ మహంతి ప్రారంభించారు. శిక్షణ శిబిరంలో కొరాపుట్, జయపురం, కొట్పాడ్, బొరిగుమ్మ, లక్ష్మీపూర్, సెమిలిగుడ, దసమంతపూర్ నుంచి వచ్చిన ప్యానెల్ న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి ప్రదీప్ కుమార్ మహంతి.. ప్యానెల్ న్యాయవాదులకు స్వాగతం పలికారు. శిక్షణ శిబిరం లక్ష్యాలను వివరించారు. జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యోమయి సుజాత పాల్గొని ప్యానెల్ న్యాయవాదులకు శిక్షకులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆమె న్యాయ సేవా ప్రదీకరణ సంస్థ నియమావలి, ప్యానెల్ న్యాయవాదుల భూమిక, బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, క్లైంట్తో సంప్రదింపులు, సలహాలు తదితర అంశాలపై ఉద్భోదించారు. జయపురం సివిల్ కోర్టు రిజిస్ట్రార్ మధుశ్మితా సున న్యాయ సేవలో ప్యానెల్ న్యాయవాదుల పాత్రపై ప్రసంగించారు. మరో శిక్షకుడు, జయపురం సెసన్స్ జడ్జి కోర్టు క్యాడర్ పబ్లిక్ ప్యాసిక్యూటర్ మహేంద్ర కుమార్ నాగ్.. క్రిమినల్ కేసులకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానం, అరెస్టు చేసిన వ్యక్తి హక్కులు, బెయిల్,ఽ దరఖాస్తు విచారణ, క్రిమినల్ చట్టం ముసాయిదా, సాక్షుల విచారణ, వాదన, న్యాయ సెక్షన్లను వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం, తాలూకా న్యాయ సేవా కమిటీ కొట్పాడ్, కొరాపుట్, బొరిగుమ్మ, లక్ష్మీపూర్, దసమంతపూర్, సెమిలిగుడలలో ప్యానెల్ న్యాయవాదులు, న్యాయ సలహాదారు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో బలిమెల–చిత్రకొండ ప్రధాన్ ఘాట్ రోడ్డులో నూవగూడ గ్రామం వద్ద శనివారం ఉదయం ట్రక్కు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ట్రక్కు డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి డ్రైవర్ను చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షంచి డ్రైవర్ ఆరోగ్యం విషమించడంతో మల్కన్గిరికి రిఫర్ చేశారు. చిత్రకొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అధిక బరువు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని బావించి కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి డ్రైవర్, యజమానా అని తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వాహనాల తనిఖీ మల్కన్గిరి: మల్కన్గిరి పట్టణంలోని రవాణా కార్యాలయం ఎదుట శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన ఓ కంటైనార్ ట్రక్కును మల్కన్గిరి ఆర్డీ అధికారులు పట్టుకుని మొత్తం రూ.35,000 జరిమానా విధించారు. తనిఖీల్లో ట్రక్కు అధిక బరువుతో ఉన్నందున ఈ జరిమానా వేశారు. ఓవర్ లోడ్తో వాహనాలు నడిపితే జరిమానా తప్పదని హెచ్చరించారు. ట్రక్కును ఢీకొట్టిన కారు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని ఆదర్శ పోలీస్ స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కును కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం జరిగింది. కారులో ఉన్న ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. కారు కలిమెల సమితి కంగురుకొండ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. కారు ముందు భాగం పాడైంది. డ్రైవర్కు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంపై మల్కన్గిరి పోలీసులు కేసు నమోదు చేశారు. శబరపల్లిలో సౌరా భాష పుస్తకావిష్కరణ రాయగడ: ఆదివాసీ సౌరభాష, సాహిత్యం, సంస్కృతిని పరిరక్షించి, భావితరాలకు అందించేందుకు జిల్లాలోని రామనగుడ సమితి పరిధి పరిఖితి పంచాయతీలోని శబరపల్లి గ్రామంలొ సౌరా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సౌరా ఎడ్యుకేషన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు 125 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఒడిశా స్కూ ల్ ఎడ్యుకేషనల్ ప్రొగ్రామ్ అథారిటీ బహుభాషా విద్యా కార్యక్రమం రిసొర్స్ పర్శన్, ప్రముఖ రచయిత ఇనాం గమాంగ్ రచించిన ఈ పుస్తకం సౌర భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు కీలకమైన ప్రయత్నంగా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. ముఖ్యఅతిథిగా శ్యామఘన్ భుయాన్ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. యూత్ అసోసియేషన్కు చెందిన విశ్వనాథ్సబర్, ఉపాధ్యక్షుడు గిరికిమి సబర్, సత్యసావిత్ర సబర్, జగ్గారావు బిడిక పాల్గొన్నారు. జి.సిగడాం(పొందూరు): మండలంలోని మజ్జిలపేట గ్రామానికి చెందిన మొజ్జాడ అసిరినాయుడు, వరలక్ష్మి దంపతుల కుమారులు మొజ్జాడ విష్ణుమూర్తి, రామకృష్ణ ప్రమాదవశాత్తు నేలబావిలో పడి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. వీరిలో విష్ణుమూర్తి అగ్నివీర్లో శిక్షణ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. వీరిని దృష్టిలో ఉంచుకుని జిల్లా మాజీ సైనికుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రూ.82 వేల ఆర్థిక సాయం ఆ కుటుంబానికి శనివారం అందజేసింది. కార్యక్రమంలో చైర్మన్ కల్నల్ ఎం.టి.రాజు, అధ్యక్షుడు సువ్వారి నీలాచలం, జనరల్ సెక్రటరీ అమ్మాజీరావు, కిల్లి వెంకటరమణ, కింతలి రామారావు, అన్నెపు నర్సింహులు, పైడి రంగనాథం, కీర్తి సుశీల, బొడ్డేపల్లి మోహన్, పి.జగన్మోహన్, బి.గోవిందరావు, మల్లేశ్వరరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు
రాయగడ: ప్రయాణికులతోవెళ్తున్న ఓ ఆటో బోల్తా పడి ఐదుగురు గాయపడ్డారు. జిల్లాలోని బిసంకటక్ సమితి నియమగిరి కుర్లీ పంచాయతీలోని తువాగుడ ఘాటీ వద్ద ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు, బీఎస్పీ కార్యకర్తలు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లో బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. హజరిడంగ పంచాయతీలోని అంకుల్పదర్ గ్రామం నుంచి కొంతమంది మహిళలు కుర్లీ గ్రామానికి సమీపంలో గల ఒక పర్యాటక స్థలాన్ని చూసేందుకు వెళ్లి తిరిగి ఆటోలో వస్తున్న సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో మొతం 11 మంది ప్రయాణిస్తుండగా ఇందులో సుకాంతి పడికాక, బబిత పడికాక, నీలావతి కుట్రుక, మహినాబతి టుయిక, రచన కుట్రుకలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మిగత వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. హార్డ్కోర్ నేరస్తుడు హడప శివపై ఎన్ఎస్ఏ ప్రయోగం రాయగడ: హర్డ్కోర్ నేరస్తుడు హడపా శివపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) ప్రయోగించినట్లు ఎస్పీ రాజ్ ప్రసాద్ తెలిపారు. హడపా శివపై రెండు దశాబ్దాలుగా హత్య, దోపిడీ, కిడ్నాప్ వంటి నేరాలకు సంబంధించి సుమారు 64 కేసులు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం హడప శివ సంబల్పూర్ సర్కిల్ జైలులో ఉంచారు. వివిధ నేరాలకు సంబంధించి అతనిపై అనేక కేసులు నమోదై ఉండగా ప్రస్తుతం విచారణ ఖైదీగా జైలులో ఉన్నాడు. రాయగడ జిల్లా సబ్ జైలు, మల్కనగిరి జిల్లా సబ్ జైలులో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందనే అనుమానంతో ప్రభుత్వం అతడిని సంబల్పూర్ జైలుకు తరలించింది. ఇదిలా ఉండగా కొద్ది రొజుల క్రితం అతని కుమారుడు నిఖిల్ హత్యకు గురైన ఘటనతో రాయగడ పట్టణంలొ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హడప శివ పలు నేర కేసులతో సంబంధం కలిగి ఉండటంతో జాతీయ భద్రత చట్టం (ఎన్ఎస్ఏ) పరిధిలోకి తీసుకున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. సెల్ఫీ తీసుకుంటుండగా కాలుజారి.. యువకుడి గల్లంతు రాయగడ: జలపాతం అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన ఓ యువకుడికి సెల్పీ సరదా ప్రాణంపైకి తెచ్చింది. జిల్లాలొని కాసీపూర్ సమితి పరిధిలోని తయాంగీర్ జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా కాలుజారి కిందపడిన యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గల్లంతైన యువకుడు గొడిబాలి పంచాయతీ పరిధిలోని జెరేకా గ్రామానికి చెందిన చెంకా బిసోయి కుమారుడు జొక్ బిసాయి (16)గా గుర్తించారు. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జోక్ తన నలుగురు స్నేహితులతో కలసి తయాంగీర్ జలపాతానికి వెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి పోయినట్లు తోటి స్నేహితులు తెలియజేశారు. వెంటనే వారంతా పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో అక్కడ నుంచి వారంతా కలసి గ్రామంలోని జోక్ కుటుంబీకులకు తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టింది. యాంత్రిక లోపంతో నిలిచిన భారీ వాహనం రాయగడ: జిల్లాలోని బిసంకటక్ నుంచి గుణుపూర్ కు వెళ్లే రహదారి మలుపులో బంకనాల్ వద్ద భారీ వాహనం యాంత్రిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో ఆయా మార్గాల గుండా రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం నాడు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న బిసంకటక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డు మధ్యలో ఉన్న వాహనాన్ని క్రేన్ సహాయంతో పక్కకు నెట్టడంతొ రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.గల్లంతైన జోక్ బిసొయి -
అండగా నిలుద్దాం
భువనేశ్వర్: నేపాల్లో సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలుపుతూ పూరీలో ఉంటున్న అంతర్జాతీయ సైకత కళాకారుడు మానస్ కుమార్ సాహు హృద్యమైన సైకత యానిమేషన్ను రూపొందించారు. కరుణ, ఐక్యత, మానవత్వంతో వరద ప్రభావిత పొరుగు దేశంలో కష్టాలను ఎదుర్కొంటున్న వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అండగా నిలవాలని, కేవలం 15 నిమిషాల్లో రూపు దిద్దుకున్న సృజనాత్మక కళా ప్రదర్శనతో కళాత్మకంగా పిలుపునిచ్చారు. మానవత్వంతో మనమందరం కలిసి చేయూతగా నిలబడి నేపాల్ బాధితుల కోసం ప్రార్థిద్దామని కళాకృతితో కోరారు. వరదల వల్ల ప్రభావితమైన ప్రజలకు ప్రార్థనలు, మానవతా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్కు నవోదయ విద్యార్థి
సరుబుజ్జిలి: అహ్మదాబాద్లో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరగనున్న జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్కు 10 వతరగతి విద్యార్థి విద్యాశ్రీమహంతి ఎంపికై నట్లు వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపాల్ బేతనసామి శుక్రవారం తెలిపారు. మహంతి ఎగ్జిబిషన్ పోటీల్లో చక్కగా రాణించి అత్యుత్తమ ప్రతిభ చూపాలని కోరారు. ఆదిత్యుడిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి శ్రీకాకుళం కల్చరల్: ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామిని శుక్రవారం ఉదయం హైకోర్టు జడ్జి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. శ్రీకూర్మంలోనూ స్వామిని దర్శించుకున్నారు. ‘పీ–4లో లక్ష మందిని చేర్చాం’ శ్రీకాకుళం పాతబస్టాండ్: అట్టడుగు వర్గాల సంక్షేమానికి ఉద్దేశించిన ‘పీ–4’ కార్యక్రమం మంచిదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షకు శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇతర అధికారులతో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా లో లక్ష మందికి పైగా లబ్ధిదారులను గుర్తించగా, ఇప్పటికే 51 వేల మందిని మార్గదర్శకులకు అనుసంధానం చేసి వారి ఉపాధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ క్రమంగా పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, నేపాల్ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. రెండో రోజూ విధుల బహిష్కరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక ‘న్యాయవాద రక్షణ చట్టం’ తీసుకురావాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన విధుల బహిష్కరణ రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగింది. శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూన రాజారావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. న్యాయవాదుల రక్షణకు చట్టబద్ధమైన భద్రత కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరినా ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. చట్టాల అమలు కోసం వాదించి, కృషి చేసే న్యాయవాదులకే తగిన రక్షణ లేకపోవడం విచారకరమన్నారు. రోడ్డు ప్రమాదంలో కూరగాయల వ్యాపారి మృతి వజ్రపుకొత్తూరు రూరల్: రాఖీ పండగ రోజున ఇంటి పెద్దదిక్కు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పలాస మండలం చినమామిడి మెట్ట గ్రా మానికి చెందిన కూరగాయల చిరు వ్యాపారి చెల్లూరి బైరాగి(75) శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బైరాగి ప్రతి రోజు తన ద్విచక్రవాహనంపై గ్రామాల్లో తిరుగుతూ కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగానే ఆయన శుక్రవారం తన కూరగాయల బండితో ఇంటి నుంచి బయల్దేరారు. తన భార్య దమయంతితో కలిసి గ్రామం నుంచి పలాస వస్తుండగా ఎన్హెచ్–16 జాతీయ రహదారిపై మాకన్నపల్లి వద్ద లారీ ఢీ కొట్టడంతో బైరాగి అక్కడికక్కడే మృతి చెందగా భార్య దమయంతి తీవ్ర గాయాలకు గురైంది. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆమెను పలాస ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరు కొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
రాయగడ: విద్యార్థుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన హాస్టళ్లలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని బుడాగుడ ఎస్ఎస్డి విద్యార్థుల హాస్టల్లో బయటకు వేలాడుతున్న విద్యుత్ తీగలు, మూతలు లేని జాయింట్ బాక్సులు, రైలింగ్ లేని మెట్లు, శిథిలమైన మెట్లతో పాటు వర్షం పడితే పైకప్పు నుంచి నీరు కారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా విద్యార్థుల వసతి గృహాల్లో విద్యుత్ పరికరాలు, స్విచ్ బోర్డులు పిల్లలకు అందకుండా సురక్షిత ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. అయితే బుడాగుడ హాస్టల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. స్విచ్ బోర్డులు, జాయింట్ బాక్సులు సరైన రీతిలో అమర్చకపోవడంతో వాటికి సంబంధించిన విద్యుత్ తీగలు బహిరంగంగా వేలాడుతున్నాయి. పలు జాయింట్ బాక్సులకు మూతలు కూడా లేకపొవడంతో ప్రమాదం పొంచి ఉంది. నాగావళి హాస్టల్లో ప్రవేశ ద్వారం వద్ద కూడా ఎంసీబీ స్విచ్ బాక్స్ మూత లేకుండా కనిపిస్తుంది. కొంత దూరంలో ఉన్న విద్యుత్ బోర్డు నుంచి స్విచ్లు బయటకు వచ్చి తీగలు వేలాడుతున్నాయి. మరోవైపు నల్లా బావి వద్ద ఏర్పాటు చేసిన మోటార్ పంప్కు సంబంధించిన విద్యుత్ తీగలు నేలపై పడి ఉన్నాయి. వాటికి పలు చోట్ల జాయింట్లు ఉండటంతో వర్షాకాలంలో నీటితో సంబంధం ఏర్పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. హాస్టల్లోని పై అంతస్తుకు వెళ్లే మెట్లకు రెయిలింగ్ లేకపోవడం, మెట్లు కూడా శిథిలావస్థకు చేరుకోవడం మరో సమస్యగా మారింది. వర్షం పడినప్పుడు పై కప్పు నుంచి నీరు కారడంతో భవనం భయపెడుతోంది. ఇటీవల జిల్లాలోని కళ్యాణసింగుపూర్ హాస్టల్ నుంచి ఓ విద్యార్థి అదృశ్యమైన అనంతరం అతడి మృతదేహాం లభ్యమైన ఘటన నేపథ్యంలో జిల్లాలోని హాస్టళ్లలో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హాస్టళ్లలో మౌలిక వసతులు, ముఖ్యంగా విద్యుత్ భద్రతపై సమగ్ర తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలికల హాస్టల్లోకి ప్రవేశానికి అనుమతి లేకపోవడంతో అక్కడ పరిస్థితులు పూర్తిగా వెలుగులోకి రాలేదు. విద్యార్థుల భద్రత, మౌలిక వసతుల సమస్యలపై ఐటీడీఏ, జిల్లా కలెక్టర్తో చర్చించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తానని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ను సంప్రదించినప్పటికీ ఆయన నుంచి ఎలాటటి స్పందన లభించలేదు. -
రక్తదాతల కోసం వెబ్సైట్
రాయగడ: అత్యవసర సమయాల్లో రక్తం కోసం ఎదురుచూస్తున్న రోగులకు సకాలంలో రక్తాన్ని అందించేందుకు తాసుబెల్లి ఫౌండేషన్ మరో కీలక ముందడుగు వేసింది. స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడంతో పాటు.. అవసరమైన రోగులను రక్తదాతలతో అనుసంధానం చేసేందుకు అధికారిక www. thasubellifoundation.com వెబ్సైట్ను ప్రారంభించారు. తలసేమియా బాధపడుతున్న చిన్నారులు, క్రమం తప్పకుండా రక్త మార్పిడి అవసరమయ్యే రోగులకు సకాలంలో రక్తం అందించడం ఎంతో అవసరమని భావిస్తూ అందరి సహకారంతో వెబ్సైట్ ప్రారంభిస్తున్నట్లు జేకేపూర్లోని తాసుబెల్లి ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమయ్యే వారికి సకాలంలో రక్తం అందించడమే ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేకే పేపర్ మిల్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో పనిచేస్తున్న సిద్దా క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఫౌండేషన్ వెబ్సైట్ను సందర్శించి రక్తదాతగా నమోదు చేసుకోవాలని కోరారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో జయపురం క్రీడా అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం 2026 సందర్భంగా ‘ఖేలేగా భారత్ – జీతేగా భారత్’ థీమ్తో మూడు రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభించారు. వర్సిటీ క్రీడా మైదానంలో వీసీ ప్రొఫెసర్ హృషికేష్ శనాపతి క్రీడా శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ మహేష్ చంద్ర నాయిక్, సీపీజీసీ డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రణస్థలం: లావేరు మండలంలోని బెజ్జిపురం జంక్షన్ ఎన్హెచ్–16పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఐసర్ వ్యాన్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. లావేరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో రణస్థలం నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న ఐసర్ వ్యాన్ రోడ్డు దాటుతున్న గొర్లె తేజేశ్వరరావు (55) అనే వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునిది సంతకవిటి మండలంలోని సిరిపురం గ్రామం. మృతుడి భార్య ఇటీవల చనిపోవడంతో లావేరు మండలంలోని బుడతవలస గ్రామంలో ఉన్న తన కుమార్తె దగ్గర గత కొన్ని నెలలుగా ఉంటున్నారు. శుక్రవారం ఉదయం కుమార్తె ఇంటి దగ్గర బయల్దేరి సిరిపురం వెళ్తూ బెజ్జిపురం కూడలికి వచ్చారు. రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లావేరు పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుని వివరాలు సేకరించారు. ఎస్ఐ వి.సందీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సమరశీల పోరాటాలే విద్యుత్ అమరులకు నివాళి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేయడమే విద్యుత్ అమరవీరులకు ఘనమైన నివాళి అర్పించడమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. సీపీఎం కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని, విద్యుత్తు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో టీడీపీ ప్రభుత్వం బషీరాబాగ్ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అసువులు బాసారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు విద్యుత్ విషయంలో మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టండి అని పిలుపునిచ్చి, అదానీ స్మార్ట్ మీటర్లు పెట్టడం మోసం కాదా అని ప్రశ్నించారు. జీడి గిట్టుబాటు ధర, జీడి బోర్డు, రిమ్స్ను సూపర్ స్పెషాలిటీగా తీర్చిదిద్దడం, కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణం, జిల్లాకు ఐటీడీఏ వంటి హామీలేవీ నెరవేరలేదని గుర్తు చేశారు. -
నడిమివలస కొండ జోలికి రావద్దు
● మళ్లీ రోడ్డెక్కిన నడిమివలస వాసులు జి.సిగడాం: ‘మా అందరికీ ఈ కొండే ఆధారం. మాకు భూములు లేవు, కొండమీది చెట్లు, చిన్న చిన్న వ్యవసాయ సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. కొంతమంది ఆవులు, మేకలు, గొర్రెలు ఇక్కడే మేపుతారు. మాకు కూడా ఈ కొండే జీవనాధారం. ఈ కొండ జోలికి రావద్దు’ అంటూ నడిమివలస వాసు లు మళ్లీ రోడ్డెక్కారు. నడిమివలస–గదబపాలెం గ్రామ సమీపంలో ఉన్న కొండలో సుమారుగా 202 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఈ కొండలో ఏపీఐఐసి పరిశ్రమ వాడగా ఏర్పాటు చేయడానికి అధికార యంత్రాంగం ముందడుగు వేసింది. సర్వే నంబర్ 36.38 లో 202 ఎకరాలపై ఉన్న రైతులు శుక్రవారం నిరసనకు దిగారు. గ్రామం సచివాలయంలో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందించారు. ఈ కొండను ఎన్ఈఆర్ సివికాన్ కంపెనీకి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. తోటపల్లి, నారాయణపురం, మడ్డువలస నీరు తీసుకురావాలి గానీ ఇలా పచ్చని భూములను విధ్వంసం చేయరాదని కోరారు. ప్రాణాలకు తెగించి కాపాడుకుంటాం మా గ్రామంలో ఉన్న కొండ జోలికి అధికారులు వస్తే ప్రాణాలకు తెగించి మేము కాపాడుకుంటాం. ఎంతవరకై నా పోరాటాలు చేస్తాం. – ఇజ్జిరోతు రమేష్, పోరాట కమిటీ అధ్యక్షుడు, నడిమివలస సెంటు భూమి కూడా వదలం మాకు గత ప్రభుత్వం హయాంలో కొండపై పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి మేమంతా సాగు చేసుకుని జీవనోపాధి సాగిస్తున్నాం. ఈ భూమి తీసుకుంటే మా ఆధారం పోతుంది. సెంటు భూమి కూడా మేము వదులుకోలేము. – యడ్ల గౌరినాయుడు, గదబపాలెం -
భారీ తనిఖీలు
శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026రాష్ట్రంలో ఆహార భద్రతా శాఖ..భువనేశ్వర్: రాష్ట్రంలో పండగ పబ్బాల సీజను ఆరంభమైంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆహార నాణ్యత, భద్రతను నిర్ధారించేందుకు ఆహార భద్రతా శాఖ నడుం బిగించి ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. రాష్ట్రంలో పలు చోట్ల భారీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఆహార భద్రతా కమిషనర్ డాక్టరు పోమా టుడు పర్యవేక్షణలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఉప జిల్లాలు, పట్టణ ప్రాంతాలు మొదలైన చోట్ల ఆహార వ్యాపార సంస్థలు విక్రయిస్తున్న మిఠాయిలు ఇతరేతర తినుభండారాల నాణ్యతని తనిఖీ చేస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలను ధ్వంసం చేయడంతో పాటు సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు 475 ఆహార నమూనాలను సేకరించి పరీక్షించిన మేరకు మొత్తం 3,605 కిలోల కల్తీ ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. దీనితో పాటు సంబంధిత యజమానుల నుంచి రూ. 2,84,500 జరిమానా వసూలు చేశారు. వీటిలో భువనేశ్వర్ నగర పాలక సంస్థ (బీఎంసీ) పరిధిలో ఽ61 నమూనాలను సేకరించి అత్యధికంగా 787 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేసి రూ. 68,500 జరిమానా విధించారు. అదేవిధంగా కల్తీ కారణంగా కటక్ నగర పాలక సంస్థ (సీఎమ్సీ)లో 570 కిలోలు, రూర్కెలా నగర పాలక సంస్థ (ఆర్ఎమ్సీ)లో 123 కిలోల కల్తీ ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. జిల్లా స్థాయిలో కొనసాగుతున్న తనిఖీల్లో పూరీలో 120 కిలోలు, బాలాసోర్లో 98 కిలోలు, ఢెంకనాల్లో 95 కిలోలు, కేంద్రాపడాలో 95 కిలోలు, సుందర్గఢ్లో 70 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. కేంద్రాపడాలో రూ. 44,000, ఽఢెంకనాల్లో రూ.28,000, భద్రక్లో రూ. 31,500 జరిమానా విధించారు. వినియోగదారులకు సురక్షితమైన, పరిశుభ్ర ఆహార సరఫరా హామీ నిర్ధారణ ధ్యేయంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు ఆహార భద్రతా ప్రామాణికలపై ఆహార వ్యాపారులలో అవగాహన పెంచడంపై శాఖ దృష్టి సారించింది. ఆహార భద్రతా శాఖ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి తనిఖీలు, పరిశీలన ప్రచారాలను ముమ్మరం చేస్తుందన్నారు. ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు దాని నాణ్యత, పరిశుభ్రత, లేబులింగ్ను తనిఖీ చేయాలని వినియోగదారులను హెచ్చరించారు. -
శ్రీ క్షేత్రంలో బలభద్ర స్వామి జన్మ దినోత్సవం
● శ్రీమందిరంలో ప్రత్యేకమైన ఆచారాలు భువనేశ్వర్: శ్రీమందిరంలో, బలభద్రుని జన్మదినోత్సవాన్ని శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రత్న వేదికపై కొలువై ఉన్న శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనుడు, భూదేవి, శ్రీదేవి అనే ఆరు విగ్రహాలను బంగారు ఆభరణాలతో అలంకరించారు. పూజా పండా, పతి మహా పాత్రో, ముదిరొస్తొ వర్గం సేవాయత్ల సహాయంతో శుద్ధ సువార్ సేవకులు బలభద్రుని జన్మ దిన పూజల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఝులణొ (ఊంజల) ఉత్సవం ఆచారాల కోసం శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు ప్రతినిధులుగా శ్రీదేవి, భూదేవి, మదన్ మోహన్ శ్రీ జగన్నాథుని పవిత్రమైన ఆజా్ాఞ్మల పొందడంతో యాత్రకు వేంచేశారు. అనంతరం బలభద్ర స్వామి జన్మ దినోత్సవ పూజాదుల కోసం హరిడ మాల అని పిలువబడే బంగారు పూలమాల అలంకరణతో సుదర్శనుడు రత్న వేదిక నుండి దిగి వచ్చి పల్లకి అధిరోహించి ఊరేగింపుగా మార్కండేయ పుష్కరిణి తీరానికి చేరాడు. ఈ తీరంలో శుద్ధొ సువార్ సేవకులు తడి (ఒండ్రు) మట్టితో శ్రీ బలభద్రుని విగ్రహాన్ని తయారు చేయడంతో పూజా పండా వర్గీయులు పవిత్ర మంత్ర పఠనంతో ఆ విగ్రహానికి ప్రాణం పోసే ఘట్టం పరిసరాల్ని ఆధ్యాత్మికమయంగా మలిచాయి. ప్రాణం పోసుకున్న బలభద్ర స్వామి మట్టి ప్రతిమకు భోగం సమర్పించడంతో జన్మ దినోత్సవం పూజాదులు ముగిసినట్లు పరిగణించి మట్టి విగ్రహాన్ని కొలనులో నిమజ్జనం చేయడం ఆచారంగా నిర్వహించారు. నిమజ్జనం అనంతరం సుదర్శన స్వామి నాలుగు ఆశ్రమాలను సందర్శించి నగర పరిక్రమగా శ్రీ మందిరానికి చేరడంతో బలభద్ర స్వామి జన్మ దినోత్సవం వేడుకలకు తెర పడింది. రాఖీ వేడుక నిర్వహణకు అవసరమైన రాఖీలను పటొరా బిసోయ్ సేవకులు తయారు చేస్తారు. ఈ సందర్భం కోసం 4 ప్రత్యేకమైన రాఖీలను తయారు చేస్తారు. శ్రీ జగన్నాథుని రాఖీని ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు పట్టు పోగులతో, బలభద్రుని రాఖీని గాఢమైన నీలం మరియు ఊదా రంగులు పట్టు పోగులతో తయారు చేస్తారు. మార్కండేయ పుష్కరిణికి తరలి వెళ్తున్న సుదర్శనుడు మార్కండేయ పుష్కరిణి తీరంలో బలభద్ర స్వామి మట్టి ప్రతిమ శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో పతిత పావనునికి రాఖీ ధారణ -
ఆట్యా–పట్యా జట్ల ఎంపిక రేపు
టెక్కలి రూరల్: శ్రీకాకుళం జిల్లా ఆట్యా–పాట్యా జట్ల ఎంపిక ఈ నెల 30న టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతుందని ఆ క్రీడ కార్యదర్శి కె.చిరంజీవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ జట్లకు జరిగే ఈ ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు తీసుకురావాలని సూచించారు. అలాగే ఈ ఎంపికలు ఉదయం 9 గంటల నుంచి జరుగుతాయని, ఎంపికై న జట్టు వచ్చే నెల 12, 13 తేదీల్లో కర్నూలులో జరిగే 11వ రారష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్ షిప్ 2026లో పాల్గొంటారని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు 9440941974, 8500007272 నంబర్ను సంప్రదించాలని సూచించారు. యువకుడు అదృశ్యం మెళియాపుట్టి: మండలంలోని మర్రిపాడు ‘సి’ గ్రామానికి చెందిన బదకల హరి (17) గురు వారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫోన్ రీచార్జ్ చేస్తానని తన తల్లి బదకల ఆదిలక్ష్మిని డబ్బులు అడిగి ఇంటి నుంచి వెళ్లాడు. శుక్రవారం ఉదయానికి కూడా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందజేశా రు. వారి బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. యువకుడు మెళియాపుట్టి జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం మధ్య లోనే నిలిపి వేసి, మేకలు కాపలా కాసుకుంటున్నాడు. ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదనీ, మొబైల్ రీచార్జ్ అని డబ్బులు తీసుకుని వెళ్లాడనీ, మొబైల్కు ఫోన్ చేసినా అవ్వడం లేదని తల్లి దండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పీఎఫ్ ఫైనల్ క్లెయిమ్స్ పరిష్కరించాలి’ శ్రీకాకుళం: రిటైర్డ్ ఉపాధ్యాయులు, రెగ్యులర్ ఉద్యోగుల జిల్లా పరిషత్ పీఎఫ్ ఫైనల్ క్లెయిమ్స్ను త్వరితగతిన పరిష్కరించడంలో జిల్లా ప్రజా పరిషత్, స్టేట్ ఆడిట్ కార్యాలయాల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటరామన్, జిల్లా ఆడిట్ అధికారి కె.అంబేడ్కర్ను కలిసి సమస్యలపై చర్చించి మెమొరాండం సమర్పించారు. క్లెయిమ్లు నెలల తరబడి పెండింగ్లో ఉంచడం సబబు కాదన్నారు. -
మైనర్పై అత్యాచారం కేసులో.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
రాయగడ: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో రాయగడ జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు చిత్రసేన్ పాలకను దోషిగా నిర్ధారిస్తు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమాన విధించింది. జరిమాన చెల్లించలేని పక్షంలో అదనంగా మరో నెల రోజులు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. అలాగే బాధితురాలికి ఆరు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ కేసును విచారించిన ఏడీజే కమ్ స్పెషల్ జడ్జి సంజీవ్ కుమార్ బెహర ఈ తీర్పును వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. 2023 ఫిబ్రవరి 23వ తేదీన పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న మైనర్ బాలికపై నిందితుడు పాలక అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి చిత్రసేన్ పాలకాను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా మొత్తం 29 మంది సాక్షుల్లో 28 మంది సాక్షుల వాగ్మూలాలను పరిశీలించిన కోర్టు ఈ మేరకు దోషిగా నిర్ధారిస్తు తీర్పును వెల్లడించింది. -
గుండెపోటుతో బీజేపీ నాయకుడు కొండబాబు మృతి
రాయగడ: లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు, ఉత్కళ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు యాళ్ల వేంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణంతో పట్టణంలో విషాదఛాయలు నెలకొన్నాయి. గురువారం అర్థరాత్రి ఎప్పటిలాగే స్తానిక రాణిగుడఫారంలోని ఆయన స్వగృహంలో భోజనం చేసిన అనంతరం ఒక్కసారిగా ఆపస్మారక స్థితిలో పడిపోయారు. వెంటనే కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కొసం తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం స్వగృహంలో ఉంచారు. శుక్రవారం నాడు ఆయన మరణ వార్త దావాణంలా వ్యాపించడంతో అభిమానులు, శ్రేయోభిలాషులు, వివిధ రాజీకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల కోసం.. తెలుగు ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో నాలుగేళ్లుగా ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు కొండబాబు ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. అందరికి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపై స్పందిస్తు తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఆయన బీజేడీలో క్రీయాశీలకంగా పనిచేశారు. రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయన ఆ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ పార్టీ అధిష్టానంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కొండబాబు అకాల మరణానికి రాజకీయ, సామాజిక వర్గాలతో పాటు తెలుగు ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, బీజేపీ నాయకులు కాలీరాం మాఝి, టుటుదాస్, ఎస్డీసీ చైర్మన్ సబర్, వైస్ చైర్మన్ మంజుల మినియాక, బీజేడీ సీనియర్ నాయకుడు సుధీర్ దాస్, పి.గౌరీశంకరరావు తదితర ప్రముఖులు కొండబాబు పార్థవ దేహాన్ని సందదర్శించి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీ నడుమ మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. -
నేపాల్ వరదల్లో మరో ముగ్గురు గల్లంతు
భువనేశ్వర్: నేపాల్లో సంభవించిన వినాశకరమైన వరదల్లో రాష్ట్రానికి చెందిన మరో 3 మంది వ్యక్తులు గల్లంతయ్యారు. బర్గఢ్ జిల్లా జంపాలి గ్రామానికి చెందిన దంపతులు, వారి రెండేళ్ల కుమార్తె ఆచూకీ తెలియడం లేదు. గల్లంతైన దంపతులు గున్నం జయకృష్ణ, గున్నం సాయి విందు కుమారి. వారి రెండేళ్ల కుమార్తె ఉన్నారు. జయకృష్ణ నేపాల్లోని ఒక జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తూ కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. నేపాల్లో సంభవించిన భారీ వరదలు, వర్షాల కారణంగా కుటుంబంతో సంబంధాలు తెగిపోవడంతో బర్గడ్లోని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్త బర్గడ్లో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. అదృశ్యమైన ముగ్గురూ క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. గల్లంతైన కుటుంబం కోసం ఒక సహాయక బృందం గాలిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటన తర్వాత నేపాల్ వరదల్లో గల్లంతైన ఒడియా ప్రజల సంఖ్య 5కి పెరిగింది. -
నాలుగు కేసుల్లో 9 మంది అరెస్టు
జయపురం: జయపురం పట్టణ పోలీసులు నాలుగు కేసుల్లో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8 మోటారు బైక్లు, కత్తి, డబ్బు, బాసుమతి బియ్యం బస్తాలు స్వాధీన పరచుకున్నట్లు పట్టణ పోలీసులు ఉల్లాస చంధ్ర రౌత్ వెల్లడించారు. బైక్ ల దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారు సుండిగుడ గ్రామానికి చెందిన దిలీప్ ఖొర(26), హటపొదర్ గ్రామం రాజు మఝి(23), నువాగుడ గ్రామం జగదీష్ హరిజన్(28). వీరి వద్ద నుంచి 8 బైక్లు సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. కాగా బాసుమతి బియ్యం దొంగతనం కేసులో డెప్పిగుడ వాసి అభి రావు(21), గాంధీ చక్ కెనాల్ రోడ్డు రాజేష్ పాయిక్(25)లను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. వారి వద్ద బాసుమతి బియ్యం ప్యాకెట్లు స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. అలాగే మారణాయుధాలు చూపి ప్రజలను భయబ్రాంతులను చేస్తూ దోచుకునే ఆరోపణలపై నమోదైన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారు హటపొదర్ రాఖేల్ ఖొర(19), డెప్పుగుడ వాసి ఉత్తమ నాగ్ (21), ప్రసాదరావు పేట వాసి రింకు బాగ్(20) అని వెల్లడించారు. వారి నుంచి రూ.500 నగదు, కత్తి స్వాధీన పరచుకున్నుట్లు వెల్లడించారు. అవి కాకుండా పట్టణ పోలీసు స్టేషన్ కేసులో జయపురం పొరజా వీది నివాసి భగవాన్ మాలీ(21) ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరు పరిచినట్లు పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంధ్ర రౌత్ వెల్లడించారు. -
వంశధార భూములు కబ్జా
నరసన్నపేట: స్థానిక వంశధార డివిజన్ పరిధిలోని భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికే కిళ్లాం చానెల్కు ఆనుకొని నరసన్నపేట ఇందిరానగ ర్ ప్రాంతంలో విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. ఎలాంటి అనుమతులు లేకుండా భవనా లు నిర్మించారు. ఇప్పుడు తాజాగా నరసన్నపేట బ్రాంచి కెనాల్కు ఆనుకొని జమ్ము కూడలి వద్ద ఉన్న విలువపైన భూమి కబ్జాకు స్థానికులు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో లక్షలాది రూపాయల విలువ కలిగిన ఈ స్థలం కాజేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. లారీ అసోసియేషన్ పేరున ఈ స్థలం కాజేయడానికి కుట్రలు చేస్తున్నారు. గురువారం ఈ స్థలంలో జేసీబీతో మట్టి నెరిపారు. ఇలా వదిలేస్తే ఈ స్థలం ఆక్రమణ అవుతుందని స్థానికులు అంటున్నారు. వంశధార అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విలువైన ఈ స్థలం ఆక్రమణలు కాకుండా చూడాలన్నారు. దీనిపై వంశధార ఈఈ మురళీ మోహనరావు దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్కు లెటర్ రాస్తామని తెలిపారు. -
చోరీ సొత్తు స్వాధీనం
రాయగడ: బలంగీర్ జిల్లాలో జరిగిన భారీ చోరీ కేసు దర్యాప్తు రాయగడ జిల్లాకు చేరింది. కేసులొ కీలక ఆధారాల మేరకు బలంగీర్ పోలీసులు రాయగడ జిల్లాలోని కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగారి పంచాయతీ ఖరయోడా గ్రామంలో బలంగీర్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఇటీవల నమోదైన ఓ భారీ చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సరైన ఆధారాలతో ఖరాయోడా గ్రామానికి చేరుకుని ఇద్దరి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు పోలీసులకు లభించినట్లు సమాచారం. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని తమ వెంట బలంగీర్ జిల్లాకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే ఈ దాడి జరిగిన విషయం వాస్తవమని రాయగడ ఎస్డీపీఓ గౌర హరి సాహు ధృవీకరించారు. ఇదిలాఉండగా రాయగడ జిల్లా పోలీసులు ఇటీవల రెండేళ్ల కాలంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీ కేసులను ప్రత్యేకంగా దర్యాప్తు చేసి సుమారు 240 గ్రాముల బంగారం, 581 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 12 మందిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. -
మావోయిస్టుల డంప్ స్వాధీనం
మల్కన్గిరి: మత్తిలి సమితి పరిధిలోని కిర్మిట్ల సమీప అడవిలో డీవీఫ్ జవాన్లు బుధవారం కూంబింగ్ నిర్వహించారు. గురువారం ఉదయం తిరిగి వస్తున్న సమయంలో మావోయిస్టుల డంప్ను స్వాధీనం చేసుకున్నారు. 3 తుపాకీలు, 6 ఐఈడీలు, క్లెమెరో మైన్లు, కరెంటు వైర్లు ఉన్నాయి. ఇందులో వీటిని ఎస్పీ వినోద్ పటేల్ ఎదుట ప్రదర్శించారు. నిపుణులైన డాక్టర్లను నియమించాలి జయపురం: స్థానిక పూల్బెడ గ్రామ ప్రాంతంలోని జిల్లాకేంద్ర ఆస్పత్రిలో నిపుణులైన డాక్టర్లను నియమించాలని జయపురం సచేతన నాగరిక కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం సచేతన నాగరిక కమిటీ సభ్యులు అభిమన్య భొటమిశ్ర, తుషార్ మిశ్ర, సనాతన పురోహిత్, సంజీవ కుమార్ సాహు, సుధామ్ మహరాణ తదితరులు జిల్లా ప్రధాన వైద్యాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆస్పత్రిలోని ముఖ్యమైన వ్యాధుల విభాగాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉందన్నారు. -
ఘనంగా రక్షా బంధన్
జయపురం: జయపురం సూర్యమహల్ ప్రాంగణంలో కేశవ ప్రభాత్ శాఖ జయపురం శాఖ గురువారం పవిత్ర రక్షా బంధన వేడుకలు ఘనంగా జరిపింది. ముందుగా పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హేమంత భాయ్ పాల్గొని రక్షాబంధన్ పై ప్రసంగించారు. అందరూ ఒకరికొకరు రాఖీలు కట్టుకుని సోదర భావం, ప్రేమ, ఐక్యత సామాజక సద్భావన సందేశాలను అందించారు. ఐదుగురు మైనర్లకు విముక్తి పర్లాకిమిడి: గజపతి జిల్లా నుంచి ఐదుగురు బాలికలను తరలించిన నిందితుడిని ఆర్.ఉదయగిరి, అడవ పోలీసు స్టేషన్ అధికారులు అరెస్టు చేసి బాలికలకు విముక్తి కల్పించారు. బాలికలను తిరిగి అడవ పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. మోహనా బ్లాక్ అడవ పోలీసు స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు, ఇన్స్పెక్టర్ సంతోష్ బిశోయి తదితరులు పాల్గొన్నారు. మైనర్ బాలికలను ఉద్యోగం ఇప్పిస్తామని ప్రలోభ పెట్టి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు తీసుకెళ్లడంతో గరడమా సర్పంచు ఈనెల 17 అడవపోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి హైదరాబాద్ వెళ్లి బాలికలను మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేసినట్టు విలేకరుల సమావేశంలో ఎస్డీపీఓ రాకేష్ సాహు తెలిపారు. రూ.10 కోట్ల విలువైన గంజాయి పట్టివేత మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి కంగురుకొండ పంచాయతీ సమీప అడవిలో బుధవారం రాత్రి కలిమెల పోలీసులు 1025 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిపై పోలీసులకు సమాచారం అందడంతో.. కలిమెల ఐఐసీ ప్రభుదత్తు తన సిబ్బందితో అడవిపై దాడి చేయగా పోలీసుల రాకను గమనించిన మాఫియా గంజాయి బస్తాలు వదిలి పరారైంది. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని కలిమెల స్టేషన్కు తరలించారు. తహసీల్దార్ సమక్షంలో తూకం వేయగా 1025 కిలోలు ఉంది. దీని విలువ రూ.10కోట్లు వరుకు ఉంటుంది. సబ్సిడీ ఎరువుల కోసం ఇబ్బందులు పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ ఎన్ఏసీ(నగరపాలక సంస్థ)లో ప్రాథమిక వ్యవసాయ కో–ఆపరేటివ్ సొసైటీలో ఎరువుల బస్తాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ల గడువు చివరి తేదీ ఆగస్టు 31వ తేదీ కాగా.. ఇప్పటివరకు 474 మంది మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసుకోగలిగారు. సొసైటీలో ఇంటర్నెట్ సేవలు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక మంది రైతులు డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకోలేకపోతున్నారు. దీంతో బీజేపీ కృషక్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ పాలో డీఆర్సీఎస్ హరిహర శెఠికి ఫోన్చేసి రైతుల సమస్యలను తెలియజేశారు. గడువులోగా రైతుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని కోరారు. -
‘కాన రాని దూరంలో’ పాట విడుదల
శ్రీకాకుళం అర్బన్: ‘కొన్ని పేజీల జ్ఞాపకాలు’ పేరు తో నిర్మించిన సిక్కోలు చిత్రాన్ని ఆదరించాలని ఆ చిత్ర యూనిట్ బృందం కోరింది. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్క్ వద్ద ‘కొన్ని పేజీల జ్ఞాపకాలు‘ చిత్ర బృందం వారి మొదట పాటను లిరికల్ రూపంలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బృందం మాట్లాడుతూ కొన్ని పేజీ ల జ్ఞాపకాలు చిత్రాన్ని, పెద్ద సినిమాలకు దీటుగా నిర్మించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రేమ్ సుప్రీం యూట్యూబ్ చానెల్లో పూర్తి పాటను అందించామన్నారు. ‘కాన రాని దూరంలో’ అనే ఈ పాటలో సాహిత్యం, సంగీతం శ్రోతల్ని అలరిస్తోంద ని తెలిపారు. చిరంజీవి మజ్జి రాసిన పాటను ప్రము ఖ సంగీత గురువు వరద దుర్గరాజు మాస్టారు, హీరో మిధున్, తల్లిదండ్రులు సంయుక్తంగా లాంచ్ చేశారు. పూర్తిగా గ్రామీణ వాతావరణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గొప్ప విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ పాటకు రచన చిరంజీవి మజ్జి, సంగీతం నిజానీ అంజన్, వయోలి న్ హేమంత్ కశ్యప్, గానం హితేష్ సాయి, దర్శకు లు ప్రేమ్ సుప్రీం అని తెలిపారు. అనంతరం నటు లు బాబూరావు, రమేశ్ నారాయణ్, సాయి సుధాక ర్, తదితరులు చిత్ర విశేషాలను, కాన రాని దూరంలో పాట ప్రాముఖ్యతను ప్రేక్షకులకు తెలియజేసారు. -
పాముకాటుతో యువకుడు మృతి
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి బోడిగేట పంచాయతీ టెక్గూడ గ్రామానికి చెందిన కృష్ణ ఖతేరి(20) అనే యువకుడు పాముకాటుకు గురై మృతిచెందాడు. బుధవారం తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి వరి నాట్లు వేసి తిరిగి ఇంటికి వచ్చి భోజనాలు చేసి నిద్రపోయారు. కొంత సమయం తర్వాత విషసర్పం కృష్ణను కాటు వేసింది. నొప్పి రావడంతో మెలకువ వచ్చి చూడగా పాము కాటు వేసి రంధ్రంలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి కృష్ణను కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ గురువారం వేకువజామున మృతిచెందాడు. భువనేశ్వర్ డీసీపీ జగ్మోహన్ మీనా రాజీనామా ఆమోదం భువనేశ్వర్: 2013 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, భువనేశ్వర్ డీసీపీ జగ్మోహన్ మీనా రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు నిరభ్యంతర పత్రాన్ని పంపింది. వ్యక్తిగత కారణాలు చూపుతూ ఆయన అఖిల భారత సర్వీసులకు రాజీనామా సమర్పించారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సుమారు 3 నెలల క్రితమే తన రాజీనామా సమర్పించినట్లు సమాచారం. ఈ విషయం జూలై నెలలో వెలుగులోకి వచ్చింది. భువనేశ్వర్ డీసీపీగా నియమితులు కాకముందు జగ్మోహన్ మీనా మల్కన్గిరి, అంగుల్, గంజాం జిల్లాలకు ఎస్పీగా, కటక్ నగర డీసీపీగా పని చేశారు. ఐపీఎస్లో చేరడానికి ముందు ఆయన ఐఐటీ కాన్పూర్ నుండి ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో ఎం.టెక్ పూర్తి చేశారు. ఘనంగా రాధాగోపాలుని ఊయల యాత్ర పర్లాకిమిడి: స్థానిక జగన్నాథమందిరం వద్ద రామస్వామి మందిరంలో రాధాగోపాలునికి ఝులానా యాత్ర ఉత్సవం గురువారం నిర్వహించారు. రాధాగోపాలునికి సువాసన వెదజల్లే పుష్పాలతో అలంకరించి ఊయల సేవ చేపట్టారు. అధిక సంఖ్యలు భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నేరడి ప్రాజెక్టుతో కాశీనగర్ గ్రామాలకు ముప్పు పర్లాకిమిడి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తూరు మండలం నేరడి వద్ద వంశధార నదిపై రిజర్వాయరు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో కాశీనగర్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్లో బూదర, వన్న, గౌరి, కాశీనగర్ ప్రాంతంలో 106 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమవ్వడంతో కాశీనగర్ రైతులు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహితో గురువారం సమావేశమయ్యారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, గజపతి జిల్లా బీజేడీ అధ్యక్షుడు ప్రదీప్ నాయక్ తదితరులు హాజరయ్యారు. నేరడి ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే 15 గ్రామాల ప్రజలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి భరోసా ఇచ్చారు. కాశీనగర్ ప్రాంత వాసుల హక్కులు కాపాడటానికి అవసరమైతే అందోళనలు చేపడతామని జెడ్పీ అధ్యక్షుడు గవర తిరుపతిరావు చెప్పారు. శ్రీకాకుళం అర్బన్: బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఉ మెన్స్ కాలేజ్ రోడ్డులో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద సాయంత్రం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు అధికారులు నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసు లు మాట్లాడుతూ సెప్టెంబర్ 11వ తేదీ సమ్మె చేస్తామని, సమస్యలు పరిష్కారం కాకపోతే సె ప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజులు సమ్మె చేస్తామని, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. -
బిసంకటక్లో 230 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. అక్రమంగా పికప్ వ్యాన్లో తరలిస్తున్న 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సమారు రూ.12 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. రాయగడ నుంచి చత్తీస్గఢ్ ప్రాంతానికి జగదల్పూర్ మీదుగా అక్రమంగా గంజాయి రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. బిసంకటక్ సమీపంలో ఒక పికప్ వ్యాన్ వస్తుండటం గమనించి దాన్ని ఆపి తనిఖీ చేసారు. అందులో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్కు చెందిన వీరేంద్ర సింగ్, కొరాపుట్ జిల్లా ఉమ్మర్కోట్ ప్రాంతానికి చెందిన సమీర్ దాస్లను పోలీసులు అరెస్టు చేశారు. -
చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
రాయగడ: జిల్లాలోని సదరు సమితి చందిలి పోలీస్ స్టేషన్ పరిధి పెంట గ్రామ శివాలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆలయం తాళం పగలుగొట్టి శివుడు, పార్వతి లోహ విగ్రహాలతో పాటు పూజా సామగ్రిని అపహరించిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నిందితులను కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి ఆలయం పూజారి సీహెచ్ నాగరాజు పూజలు ముగించి ఆలయానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారం తాళం పగలుగొట్టి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా గర్భగుడిలోని విగ్రహాలు, రెండు గంటలు, రెండు బకెట్లు, రెండు చేతి గంటలు, ఇతర పూజా సామగ్రి కనిపించకపోవడంతో చందిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి సంబంధమున్న నువాపడకు చెందిన మనోజ్ దుర్గ, పవన్ గంత, బీసీ రోడ్డులో నివాసముంటున్న అమలాభట్టకు చెందిన అల్లు హరికృష్ణలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్డీపీఓ గౌరహరి సాహు, చందిలి ఐఐసీ ఉత్తమ్ కుమార్ సాహు తెలిపారు. -
ఈ–ఎస్ఆర్తోనే సరి.. పని ఎలా మరి?
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసుకోవాలని ఆదేశా లు జారీ చేయడం వారికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. రోజుకో కొత్త పని అప్పజెబుతుండ డంతో బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నామని, యాప్లతోనే సమయం సరిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ–ఎస్ఆర్ ప్రక్రియలో తొలుత నిధి లాగిన్లో ఉద్యోగ ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సర్వీసు వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా జీవిత భాగస్వామి వివరాలు నమోదు చేసి ఈ కేవైసీ ద్వారా నిర్ధారించుకుంటేనే మిగిలిన వివరాలు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. డీడీఓకు ఆ వివరాలను ఓటీపీ ద్వారా ధ్రువీక రించాలి. డీడీఓ కన్ఫర్మేషన్ పూర్తి చేస్తేనే కుటుంబ సభ్యుల వివరాలు వ్యక్తిగత సర్వీసు వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని ఉద్యోగు లు అంటున్నారు. ఇది కొంత మంది ఉద్యోగ ఉపా ధ్యాయులకు ఇబ్బంది కలిగించే అంశమని చెబుతు న్నారు. జీవిత భాగస్వామితో విడాకులు తీసుకు న్నా, మరే కారణాలతో అయినా దూరంగా ఉన్నా ఈ వివరాలు నమోదు చేయడం కష్టతరం. అలాగే జీవిత భాగస్వామి మృతి చెందితే కూడా కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఉద్యోగితోపాటు డీడీఓ కూడా పని భారం అనే చెప్పాలి. వివాహ వివరాలు నమోదు చేయడం కష్టమే ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుడు తన వివాహానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది నమోదు చేయడం కష్టం కాకపోయినప్పటికీ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫోటోలు, మరికొన్ని ఆధారాలను పొందుపరచాల ని ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయా వర్గాలు తప్పుపడుతున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల్లో చాలామంది 30, 40 ఏళ్ల కిందటే పెళ్లి చేసుకున్నారు. వారి వివాహ ఆహ్వాన పత్రికలు, పెళ్లి ఫొటోలు ఏ విధంగా తీసుకురాగలుగుతారని ఉద్యోగ ఉపాధ్యాయు లు ప్రశ్నిస్తున్నారు. అలాగే వివాహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా అడుగుతున్నారని కొందరు చెబుతుండగా, గతంలో వివాహ రిజిస్ట్రేషన్ ను ఏ ఒక్కరూ చేయించుకునేవారు కాదు. ఇటీవల కాలంలోనే రిజిస్ట్రేషన్ పై పలువురు శ్రద్ధ చూపిస్తున్నారు. అలాంటిది ఎప్పుడో వివాహమైన వారిని ఇలాంటి ఆధారాలను పొందుపర్చాలని కోరడాన్ని తప్పుపడుతున్నారు. ఇందులో కూడా విడాకులు తీసుకున్న వారు వితంతువులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, దీనిపై ఏం చేయాలో కూడా అర్థం కాక మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఉద్యోగులు అంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఎస్ ఆర్ విధానాన్ని తీసుకువచ్చారని అప్పట్లోనే తామంతా ఈ ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ కొత్త కొత్త నిబంధనలను తెచ్చి దాన్ని అప్డేట్ చేసుకోవాలని చెప్పడం సరైన విధానం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక ‘న్యాయవాద రక్షణ చట్టం’ తీసుకురావాలని శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రాజారా వు డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాకుళం నగరంలో జిల్లా బార్ అసోసియేషన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. రెండు రోజులు విధుల బహిష్కరణలో భాగంగా గురువారం విధు లు బహిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణకు చట్టబద్ధమైన భద్రత కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరినా ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో న్యాయవాదుల రక్షణకు సంబంధించి ప్రత్యేక చట్టాలు అమలులోకి తీసుకువ చ్చారని తెలిపారు. ఇక్కడ కూడా అలాంటి చట్టాన్ని తీసుకురావాలని కోరారు. -
గూడ్స్ రైలులో సరుకుల చోరీకి బ్రేక్
రాయగడ : గూడ్స్ రైళ్ల నుంచి కొంతకాలంగా జరుగుతున్న సరుకుల చోరీకి అంబొదల పోలీసులు బ్రేక్ వేశారు. ఇచ్చాపురం, అంబొదళ ప్రాంతంలో గూడ్స్ రైళ్ల నుంచి బియ్యం బస్తాలను దించుతున్న దుండగులను పోలీసులు గుర్తించి దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు 150 బియ్యం బస్తాలు, 10 సైకిళ్లను విడిచి పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని దుండగులు చాలా కాలంగా గూడ్స్ రైళ్ల బోగీల నుంచి బియ్యం, చక్కెర, గోధుమలు, సిమెంట్, ఎరువులు తదితర వస్తువులను చోరీ చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ మేరకు మంగళవారం రాత్రి అంబొదల పోలీస్ స్టేషన్ ఎస్ఐ అశోక్కుమార్ ప్రధాన్ సిబ్బందితో కలిసి ఇచ్ఛాపురం ప్రాంతంలో పెట్రొలింగ్ నిర్వహించారు. ఇఛ్చాపురం పంచాయతీ గడియాజోల గ్రామ సమీపంలో రైల్వే పట్టాల వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి కొందరు వ్యక్తులు బియ్యం బస్తాలను కిందకు దించుతుండటం గమనించి దాడులు నిర్వహించారు. అనంతరం స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలను టిట్టాఘడ్ రైల్వే పోలీసులకు అప్పగించారు. -
8 మందిపై పిచ్చికుక్క దాడి
రాయగడ: జిల్లాలోని మునిగుడలో వీధికుక్క భీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా రెచ్చిపోయి 8 మందిపై దాడి చేసి గాయపరిచింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రధానంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులపై ఈ కుక్క దాడి చేయడంతో తల్లిదండ్రుల్లో కలకలం రేగింది. మునిగుడ బస్టాండ్ సమీపంలోని త్రికొణియా కూడలి వద్ద శిశు మందిర్కు వెళ్తున్న రెండో తరగతి విద్యార్థి సందీప్ కరకరియా, ఎనిమిదో తరగతి చదువుతున్న సచ్చితానంద బెహరలపై వీధి కుక్క దాడి చేసి కరిచింది. గాయాలకు గురైన వారిని హాస్పిటల్కు తరలించారు. అనంతరం మునిఖొల్కు చెందిన యాకేసిన కాందరి అనే వృద్ధుడితో పాటు రథ్ హియాల్, తదుపరి మరో నలుగురిపై దాడి చేసింది. కుక్కదాడిలో గాయపడిన మొత్తం 8 మందిని మునిగుడ సీహెచ్సీకి చికిత్స కోసం తరలించారు. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుని వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. -
కత్తులతో బెదిరించారు.. 30 పందులను ఎత్తుకెళ్లారు
రాయగడ: పందుల ఫారంలోకి అర్ధరాత్రి చొరబడిన గుర్తు తెలియని దుండగులు కత్తులతో బెదిరించి ఫారం నిర్వాహకుడిపై దాడిచేసి అతడిని కట్టివేసి పందులను పికప్ వ్యాన్ లో ఎత్తుకెళ్లిన ఘటనను జార్సుగుడ జరగగా.. జిల్లా బ్రజరాజ్ నగర్ పోలీసులు కేసును ఛేదించారు. కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 10 పందులు, నేరానికి వినియోగించిన ఆయుధాలు, బాధితుడి మొబైల్ ఫోన్, పికప్ వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఝార్సుగుడ ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర మీడియాకు విడుదల చేసిన వివరాల ప్రకారం పూర్వాపురాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని బరకాండియా ప్రాంతానికి చెందిన ఆయోధ్యా రొహిదాస్ అనే వ్యక్తి గత 5 నెలలుగా పందుల ఫారం నిర్వహిస్తు జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 24,25 తేదీల మధ్య అర్ధరాత్రి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పందుల ఫారంలోకి చొరబడి మరణాయుధాలతో రొహిదాస్ అనే వ్యక్తిని బెదిరించి దాడి చేశారు. అనంతరం అతడు ధరించే దుస్తులను విప్పి అతడిని కట్టివేసి ఫారంలో ఉన్న 30 పందులను బలవంతంగా పికప్ వ్యాన్లో ఎక్కించుకుని పరారయ్యారు. ఈ ఘనలో బాధితుడి బొటల వేనికి గాయమైంది. విషయం ఎవరికై నా చెబితే ప్రాణాలు తీస్తామని దుండగులు బెదించారు. అంతే కాకుండా బాధితుడి మొబైల్ ఫోన్ను లాక్కుని, సిమ్ కార్డును తొలగించి దూరంగా పారవేశారు. ఈ విషయమై బాధితుడు బ్రజరాజ్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ రాఘవేంద్ర ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారు. అనంతరం కేసుకు సంబంధించి సాహిల్ ఓరం, సునీల్ అలియాస్ కాళీ కలేట్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 పందులు, మరణాయుధాలు, పికప్ వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. -
హొటళ్లు, బేకరీలపై దాడులు
జయపురం: జయపురం ఆహార భద్రతా విభాగం, మున్సిపాలిటీ హెల్త్ సిబ్బంది సంయుక్తంగా మిఠాయి దుకాణాలు, హొటళ్లు, బేకరీ దుకాణాలపై గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. పట్టణ ప్రధాన మార్గంలో ఉన్న ఓం ప్రకాశ్ స్వీట్స్ దుకాణం, ఓం ప్రకాస్వీట్స్ తయారు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను తనిఖీ చేసి మిఠాయి తయారుకు వినియోగిస్తున్న సరుకులను పరిశీలించారు. అక్కడ పరిశుభ్రత, మిఠాయిల నాణ్యతలను పరిశీలించారు. అనంతరం వారు పట్టణంలో గల పలు మిఠాయి దుకాణాలను, బేకరీ దుకాణాలను, హొటళ్లను తనిఖీ చేసి ఆహార పదార్థాలు పరిశీలించారు. కొన్ని హొటళ్లలో అపరిశుభ్రత గుర్తించి నోటీసులు జారీ చేశారు. పదార్థాల తయారీకి వినియోగిస్తున్న వస్తువులను పరీక్షలకు పంపించారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని ఆహార సురక్షా అధికారి పంకజనీ బెహరా వెల్లడించారు. రూ.15వేల వరకు జరిమానాలు వసూలు చేశామని తెలిపారు. దాడుల్లో మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారిణి పూజ రౌత్ ఆదేశం మేరకు హెల్త్ సిబ్బంది భవానీ హల్వ, సత్యనారాయణ పాత్రో, జగదీష్ రావు తదితరులు పాల్గొన్నారు. -
‘నీరివ్వండి మహాప్రభో’
నరసన్నపేట: మండలంలోని గోపాలపెంటకు సాగునీరు విడుదల చేయాలని, నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని నీటి సంఘం గోపాలపెంట డైరెక్టర్ తోట భార్గవ్, రైతులు బొబ్బాది ఈశ్వరరావు, గదిలి రమేష్, సనపల రమేష్, మార్పు అమ్మాజీ బుడుమూరు రమణ తదితరులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక వంశధార ఈఈ కార్యాలయ హెచ్డీ నారాయణమూర్తికి విన తి పత్రం అందించారు. ఈ సందర్భంగా బొబ్బాది ఈశ్వరరావు మాట్లాడుతూ కాలువల్లో పూడిక తీయలేదని, చుక్క నీరు రావడం లేదని ఆందోళన చెందారు. ఏటా నష్ట పోతున్నామని, వంశధార అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరారు. -
నోటి ట్యూమర్కు విజయవంతంగా చికిత్స
రాయగడ: నోటి కేన్సర్తో బాధ పడుతున్న ఆదివాసీ యువతికి ఏడేళ్లుగా పెరుగుతూ వచ్చిన ట్యూమర్కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన ఆస్పత్రి దంత, ముఖ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ హీరా చంద్ పట్నాయక్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం కటక్లోని శాంతి మెమోరియల్ క్యాన్సర్ సెంటర్లో ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రస్తుతం యువతి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాయగడ సదరు సమితి హలువా గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి గౌతమీ జకక సుమారు ఏడేళ్లుగా నోటి కేన్సర్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. తొలుత రాయగడ జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్న ఆమె అనంతరం ఇంటికి వెళ్లి సంప్రదాయ వైద్యం తీసుకున్నట్లు సమాచారం. అయితే కాలక్రమేణా నోటిలోని ట్యూమర్ పరిమాణం పెరుగుతూ వచ్చింది. పరిస్ధితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను మళ్లీ రాయగడ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు, బయాప్సి పరీక్షలు నిర్వహించగా నోటి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లా ఆస్పత్రిలో ఈ స్థాయి శస్త్రచికిత్సకు అవసరమైన పూర్తి సదుపాయాలు అందుబాటులో లేకపొవడంతో గౌతమిని కటక్లోని కేన్సర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించే వైద్య బృందంలో రాయగడ జిల్లా ప్రధాన ఆస్పత్రి దంత, ముఖ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ హీరా చంద్ పట్నాయక్ కూడా భాగస్వామిగా ఉన్నారు. గత ఆదివారం వైద్య బృందం గౌతమికి క్లిష్టమైన నోటి క్యాన్సర్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఆపరేషన్ అనంతరం ఆమెను మూడు రోజుల పాటు ఐసీయులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. గౌతమికి సంబంధించిన కేన్సర్ చికిత్స మొత్తాన్ని ఆయుష్మాన్ పథకం కింద నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు స్వయంగా ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సలో పాల్గొనడం, పేద కుటుంబానికి ప్రభుత్వ ఆరోగ్య పథకం ద్వారా చికిత్స అందడం పట్ల రాష్ట్ర ఆరోగ్య శాఖ నుంచి డాక్టర్ హీరా చంద్ పట్నాయక్ కు అభినందించినట్లు సమాచారం. -
సారా విక్రయదారుకు ఏడాది జైలు శిక్ష
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల సూదికొండకు చెందిన ముద్దాయి దూలి రాజేశ్వరికి సారా విక్రయించిన కేసులో ఏడాది కాలం జైలు శిక్షతో పా టు రూ. 2లక్షల జరిమానా విధిస్తూ గురువా రం పలాస జూనియర్ సివిల్ కోర్టు న్యాయ మూర్తి యు.మాధురి తీర్పు వెలువరించారు. పలాస ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కె.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు మేరకు.. పలాస ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 2021 మార్చి 4న ముద్దాయి దూలి రాజేశ్వరి సారా విక్రయి స్తూ పట్టుబడటంతో అప్పట్లో విధుల్లో ఉన్న ఎకై ్సజ్ ఎస్ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసు లో ముద్దాయి రాజేశ్వరిని ఈ ఏడాది మార్చి 23న కోర్టులో హాజరుపర్చాల్చి ఉండగా ముద్దా యి అందుబాటులో లేకపోవడంతో తీర్పు రిజ ర్వ్ చేశారు. అయితే ముద్దాయి రాజేశ్వరిని గురువారం పలాస జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరిచామని అన్నారు. ఈ మేరకు కోర్టు తుది తీర్పు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. రణస్థలం: కోష్ట జాతీయ రహదారిలోని పై వంతెనపై ఈ నెల 22న ముందు వెళ్తున్న లారీని ఢీకొని గాయపడిన డ్రైవర్ పొట్నూరు ఎర్రిబా బు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జేఆర్ పురం ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నం జిల్లాలోని భీమిలి మండలానికి చెందిన ఎర్రిబాబు క్యాబిన్లో ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు. రిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వజ్రపుకొత్తూరు రూరల్: బెండి గేటు సమీపంలోని కాశీబుగ్గ పాత జాతీయ రోడ్డులో గరుడఖండి దగ్గర గురువారం గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అరుదైన నక్క మృతి చెందింది. ప్రధానంగా ఈ నక్కలు కొండ ప్రాంత పరిసర తోటలో సంచరిస్తుంటాయి. రాత్రి సమయంలో ఆహారం కోసం బెండి కొండ నుంచి వస్తూ ప్రమాదానికి గురై ఉండవచ్చని స్థానికులు తెలిపారు. రణస్థలం: లావేరు మండలంలోని లావేటిపా లెం గ్రామానికి చెందిన ఓయిబోయిన గంగు లు, అప్పలసూరిలకు చెందిన సుమారు 20 గొర్రె పిల్లలను కుక్కలు చంపేశాయి. బుధవా రం అర్ధరాత్రి సమయంలో కుక్కలు ఈ దారుణానికి ఒడికట్టాయి. ఇంతలా నష్టం వాటిల్లడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. సుమారు రూ. 2లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవా లని వేడుకుంటున్నారు. లావేరు పశువైద్యులు గాయిత్రిదేవి, వీఆర్ఓలు వేణుగోపాల్ పరిశీలించి శవపంచనామా చేశారు. లావేరు వైఎస్సార్సీపీ గ్రామనాయకులు లంకలపల్లి మహే ష్ సంఘటన స్థలానికి వెళ్లి జరిగిన నష్టాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
పురపాలక జట్టుపై మీడియా గ్రూప్ విజయం
● స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్పర్లాకిమిడి: స్థానిక శ్రీక్రిష్ణ చంద్రగజపతి కళాశాల మైదానంలో ఈనెల 31న స్థానిక సంస్థల స్వపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ బుధవారం ఉత్సాహంగా జరిగింది. మీడియా మిత్రులు, పురపాలక సిబ్బందితో తలపడ్డారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా, పురపాలక సంఘం చైర్పర్సన్ నిర్మలా శెఠి విచ్చేసి మ్యాచ్ను ప్రారంభించారు. తొలుత టాస్ గెలిచిన పురపాలక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పురపాలక జట్టులో జిల్లా ఎస్పీ ప్రహ్లద్ సహాయ్ మీనా, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ట్రయల్ ఆడారు. ఆనంతరం పురపాలక జట్టు తరఫున తొలి బ్యాట్స్మెన్స్గా మైదానంలోకి ఉత్సాహంగా అడుగుపెట్టి 14 పరుగులు తీసి క్యాచ్ అవుట్ అయ్యారు. మొత్తం తొమ్మిది ఓవర్లలో 10 వికెట్లు పోగొట్టుకుని 88 పరుగులు తీశారు. మున్సిపల్ జట్టుకు దీటుగా మీడియా జట్టు తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 89 పరుగులు తీసి విజయం సాధించారు. మీడియా జట్టులో జ్ఞాన్రంజన్ షడంగి 50 పరుగులు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. పురపాలక జట్టు వచ్చే ఏడాది ఇంకొంచెం మెరుగైన ఆటను ప్రదర్శించాలని జిల్లా ఎస్పీ మీనా ఈ సందద్భంగా అన్నారు. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్కు మీడియా జట్టు కెప్టెన్గా జితేంద్ర పట్నాయిక్, వైస్ కెప్టెన్గా జ్ఞాన్ రంజన్ షడంగి, పురపాలక జట్టుకు కెప్టెన్గా లెంకమధు, బాలక్రిష్ణ పాత్రో, అంపైర్లుగా రాజీవ్ పాఢి, శుభం రౌత్లు వ్యవహారించారు. విజేతలకు ఈ నెల 31వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో జరగనున్న స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా బహుమతులను ప్రదానం చేయనున్నారు. -
60 అడుగుల సంకట మోచన గణపతి
కొరాపుట్: ప్రపంచ ప్రఖ్యాత హైదరాబాద్ గణేష్ ఉత్సవాలలో ఈ ఏడాది 60 అడుగుల సంకట మోచన గణపతి విగ్రహం రూపుదిద్దుకుంటోంది. కొరాపుట్ జిల్లా కేంద్రానికి చెందిన సీహెచ్ జోగారావు ఈ విగ్రహానికి ప్రధాన శిల్ప కళాకారుడిగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది కూడా జోగారావు చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఖైరతాబాద్ విగ్రహం ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది. ఏటా ఆంధ్రా–తెలంగాణాలలో వినాయక చవితి నాడు జోగారావు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న విగ్రహాలు పూజలందుకోవడంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఖైరతాబాద్కు సమాంతరంగా విజయవాడలోని సితార సెంటర్లోనూ 76 అడుగుల వరసిద్ధి వినాయక విగ్రహం కూడా నిర్మిస్తున్నట్లు జోగారావు ‘సాక్షి’కి తెలిపారు. ఈ రెండు విగ్రహాలనూ కేవలం మట్టితోనే నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణేష్ నిర్మాణంలో కొరాపుట్ వాసి జోగారావు విజయవాడలో 76 అడుగుల వరసిద్ధి వినాయకుడు -
యానిమేషన్ సినిమా వివాదాస్పదం
భువనేశ్వర్: పూరీ జగన్నాథునిపై రూపొందుతున్న యానిమేషన్ చిత్రంపై పెద్ద వివాదం చెలరేగింది. ఈ చిత్రం విడుదలను పూర్తిగా నిషేధించాలని పూరీలోని గోవర్ధన పీఠాధిపతి శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి కోరారు. శ్రీ మందిరం ముక్తి మండపం పండిత సభ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పూరీ గజపతి మహారాజుకు లేఖ ద్వారా తమ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేసింది. యానిమేషన్ చిత్రం జగన్నాథుని సంప్రదాయం, సంస్కృతి, తత్వాన్ని (తత్వాన్ని) నాశనం చేస్తోందని స్వామి నిశ్చలానంద సరస్వతి పేర్కొన్నారు. సినిమాలో జగన్నాథుడిని వక్రీకరించి అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించారని,. ఇది చట్టబద్ధంగా అనుమతించకూడని క్షమించరాని నేరమని తీవ్రంగా ఆరోపించారు. సినిమా విడుదల, అన్ని మీడియా మాధ్యమాల్లో దాని ప్రసారాన్ని తక్షణమే నిషేధించాలని శంకరాచార్య డిమాండ్ చేశారు. దైవం సంప్రదాయ, శాసీ్త్రయ స్వరూపాన్ని వక్రీకరించే ఏ చిత్రీకరణను అంగీకరించలేమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను నిలిపివేయడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు గత తీర్పును సమీక్షించాలని పూరీలోని గోవర్ధన పీఠాధిపతి శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి అభ్యర్థించారు. ఈ పరిణామం ఒడిశాలోని మత, సాంస్కృతిక వర్గాలలో విస్తృత చర్చకు దారి తీసింది. సాంప్రదాయ సంస్థలు సినిమాలోని అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సమాచార శాఖ డైరెక్టర్గా సంజయ్కుమార్ బిస్వాల్భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ బిస్వాల్ను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల (ఐ అండ్ పీఆర్) విభాగం డైరెక్టర్గా నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2015 నాన్–స్టేట్ సివిల్ సర్వీస్ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ ప్రస్తుతం వాణిజ్య, రవాణా శాఖలో ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదే విధంగా, ప్రస్తుతం మాధ్యమిక విద్యా శాఖ డైరెక్టర్గా ఉన్న బీరేంద్ర కోర్కోరా (ఎస్సీఎస్–2014) హోం శాఖలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. ఓబీసీ డైరెక్టర్గా ఉన్న జుగలేశ్వరి దాస్ (ఎస్సీఎస్–2015) మాధ్యమిక విద్యా శాఖ డైరెక్టర్గా నియమితులయ్యారు. అబ్కారీ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న అర్చనదాస్ పట్నాయక్ (ఎస్సీఎస్–2015) ఆయుష్ డైరెక్టర్గా, ప్రస్తుతం ఆయుష్ డైరెక్టర్గా ఉన్న అంజనా పండా (ఎస్సీఎస్–2015) అబ్కారీ శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. నిర్మాణాల శాఖలో డిప్యూటీ కార్యదర్శిగా ఉన్న సుందర మాధవ పాఢి (ఎన్ఎస్సీఎస్–2020)ని ఒడిశా మారిటైమ్ బోర్డు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా బదిలీ చేశారు. ఆయన ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓఎస్ఆర్టీసీ) జనరల్ మేనేజర్గా అదనపు బాధ్యతలతో కొనసాగుతారు. అజయగడలో వారపు సంత భవనం ప్రారంభం పర్లాకిమిడి: గుమ్మాబ్లాక్ అజయగడ గ్రామంలో వారపు సంత భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా అజయగడ ప్రజలు నిరీక్షిస్తునకు ఎట్టకేలకు ముగింపు పలికామన్నారు. భవన నిర్మాణంతో వారపు సంతకు ప్రతి బుధవారం చుట్టుపక్కల గిరిజనులు తమ ఉత్పత్తులు అమ్ము కోవడానికి, ఆర్థిక వెసులుబాటుకు, వారికి ఆర్ధికాభివృద్ధి ఉపయోగపడుతోందని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఈ సందర్భంగా అన్నారు. అనంతరం అజయగడ సర్పంచు సులేమీ శోబోరో నేతృత్వంలో వారపు సంత అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాజారావు బోడోనాయక్, కార్యదర్శులుగా సురేష్ నాగా, మాల్యబంత బోడోదోళాయి, కోశాధికారిగా సుభాస్ మచ్ఛో కలిసి ఈ ప్రాంతంలో ప్రచారం చేపట్టారు. ఈ వారపు సంత వల్ల ఈ ప్రాంతపు వ్యవసాయదారులు, గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వారపు సంత ప్రారంభోత్సవంలో గుమ్మా సమితి అధ్యక్షులు సునేమీ మండళ్, గుమ్మ బీడీవో దులారాం మరాండి, తహసీల్దార్ శరత్ శోబోరో, ఎల్.ఎస్.డి.ముఖ్యులు ఆకాష్ దిగాల్ పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ
జయపురం: జయపురం ముస్లిమ్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మిలాద్–ఉన్–నబీని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా జయపురం ముస్లిమ్ అంజుమాన్ కమిటీ, జయపురం ముస్లిమ్ కమిటీలు సంయుక్తంగా పట్టణ ప్రధాన మార్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జమా మసీదు నుంచి వందలాది మంది ముస్లింలు పతాకాలు చేత పట్టి సంప్రదాయ దుస్తులతో శోభాయాత్ర చేపట్టారు. ఒకరికొరు ముబారక్ చెప్పుకున్నారు. మాజీ మంత్రి, బీజేడీ నేత రబినారాయణ నందో, జిల్లా బీజేడీ కార్యనిర్వాహక అధ్యక్షుడు దుర్గా మిశ్రా తదితర నేతలు హాజరై ముస్లిమ్ సోదరులకు అభినందనలు తెలిపారు. తరణి జంక్షన్లో షాదీఖానా వద్ద మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. -
103 కిలోల గంజాయి స్వాధీనం
● నలుగురు అరెస్టుకొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో పోలీసులు 103 కేజీల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కేంద్ర పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసు అధికారులు వెల్లడించారు. జయపూర్ నుంచి నబరంగ్పూర్ మీదుగా ఆటోలో గంజాయిని కొంతమంది తరలిస్తున్నట్టు తమకు సమాచారం వచ్చినటుట పోలీసులు చెప్పారు. దీంతో అనుమానిత ఆటోని వెంబడించి పట్టుకొని పరిశీలించగా గంజాయి మూటలు ఉన్నట్టు గుర్తించారు. గంజాయిని కలహండి జిల్లా మీదుగా తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ ఘటనో జిల్లా కేంద్రంలోని మేదరి వీధికి చెందిన నిలాంబర్ హరిజన్, దండాసి వీధికి చెందిన బబులా హరిజన్, పర్మేష్ హరిజన్, దిలిప్ హరిజన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి రవాణాలో ఇతరుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని ఎస్ఐ సంబిత్ సాహు స్వాధీనం చేసుకోగా మరో ఎస్ఐ సీమా లక్రా దర్యాప్తు చేస్తున్నారు. -
నూతన మైనింగ్ చట్టాన్ని రద్దు చేయాలి
● సీపీఐ నాయకుల ఆందోళనజయపురం: నూతన మైనింగ్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మైనింగ్ చట్టం–1957ను పూర్తిగా మార్పు చేసి ఎం.ఎం.డి.ఆర్.చట్టం 2026ను కేంద్రంలోని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వ ఆమోదించిందని.. ఆ చట్టాన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అది ఒడిశా గనుల తవ్వకాలకు వ్యతిరేకమని.. కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎంఎండీఆర్–2026 మైనింగ్ చట్టానికి వ్యతిరేకంగా బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం వెనుక కుట్ర ఉందన్నారు. ముఖ్యంగా టాటా కంపెనీకి ఒక లక్షా పది వేల కోట్ల రూపాయల బకాయిని చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చిందన్నారు. ఈ చట్టం వలన ఆ డబ్బు ఇక ముందు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించనక్కర లేదన్నారు. అంతే కాకుండా ప్రతి ఏడాది ఒడిశా నుంచి కేంద్ర ప్రభుత్వం రూ. 12 వేల కోట్ల విలువైన ఖనిజ సంపదను వెలికి తీసే హక్కును పొందటమే కాకుండా వాటిని నియంత్రించే హక్కను ఈ నియంత్ర చట్టం ద్వారా పొందుతుందన్నారు. అందువలన ఒడిశా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడుతుందని కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చే ఎం.ఎం.డి.ఆర్– 2026 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఒడిశా ప్రభుత్వం శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన నూతన మైనింగ్ చట్టంపై చర్చించి నూతన చట్టాన్ని రద్దు చేసేలా తీర్మానం చేయాలని కోరారు. ఒడిశా ప్రభుత్వం ప్రతిపక్షాల డిమాండ్ను అంగీకరించక పోతే సెప్టెంబర్ తొమ్మిదో తేదీన భువనేశ్వర్లో ప్రజా సదస్సు నిర్వహిస్తామని కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమోద్ కుమార్ మహంతి వెల్లడించారు. అవసరమైతే ఒడిశా బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై కఠిన చర్యలు చేపడుతూ, పంచదార, బియ్యం మొదలగు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెంచిందన్నారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా విద్యావ్యవస్థను నాశనం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా సుమారు లక్షకు పైగా పాఠశాలలను దేశ వ్యాప్తంగా మూసివేసిందని ధ్వజమెత్తారు. కేంద్రం వ్యవహిరిస్తున్న ప్రజావ్యతిరేక కుయుక్తులను సహించబోమని ఏఐటీయుసీ కొరాపుట్ జిల్లా అద్యక్షులు జుధిష్టర్ రౌళో హెచ్చరించారు. సెప్టెంబర్ ఒకటో తేదీ చేపట్టనున్న చలో ఢిల్లీ ఉద్యమాన్ని విజయవంతం చేయటానికి, ఖనిజ సంపదకు నిలయమైన కొరాపుట్ జిల్లాలో ఎం.ఎం.డి.ఆర్. 2026 చట్టంపై ప్రజలకు వివరించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. ఆందోళనలో కమ్యూనిస్టు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బుద్రా బొడొనాయిక్, సుదర్శణ బిశాయి, వసంత బెహర, రతన్ నాయి క్, భీష్మ నాయిక్, బాదల్ పొరజ, వికాశ పొరజ, అధికసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
జయపురం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎం.ఎం.డి.ఆర్–2026 బిల్లుపై కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ఈ బిల్లు పూర్తిగా ఒడిశా రాష్ట్ర వ్యతిరేక బిల్లు అని ఆరోపించింది. బుధవారం స్థానిక బాబా సాహెబ్ కల్యాణ మండపంలో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి మాట్లాడుతూ.. ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం.. ఒడిశా రాష్ట్ర ఖనిజ సంపదను దోచుకోవటానికి యత్నం చేస్తుంన్నారు. ఈ బిల్లు వలన రాష్ట్రానికి ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు నష్టం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశాలో అపారంగా ఉన్న ఖనిజ సంపదను తీసుకువెళ్లి ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు బీజేపి ప్రభుత్వం ఎత్తుగడ అని ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తోందని ఎమ్మెల్యే హెచ్చరించారు. కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రూపక్ తురుక్ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యవర్గ సభ్యులను సంభోదిస్తూ కేంద్ర ప్రభుత్వం.. మైనింగ్ బిల్లు వలన ఒడిశా రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఆ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం.. మన రాష్ట్ర హక్కులను హరిస్తుందని, అందువల్ల బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది రాష్ట్ర రూ.20 వేల కోట్ల రెవెన్యూ కోల్పోతుందని వెల్లడించారు. నేటివరకు ఒక లక్షా 20 వేల కోట్లు కోల్పోయిందని వెల్లడించారు. ఒడిశాలో ఎక్కడ ఖనిజ సంపద, అడవులు, భూములు ఉన్నాయో అక్కడ నిరుపేద ఆదివాసీలు నివసిస్తున్నారని, వారి జీవితాలను బలి చేసేందుకు ఈ బిల్లు తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరాపుట్ జిల్లాతోపాటు మొత్తం రాష్ట్రంలో ఖనిజ సంపదను తరలించటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ సమావేశంలో శాసన సభ కాంగ్రెస్ పక్షనేత, పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర కడమ్, పార్టీ కార్యవర్గ సభ్యులు దేవేంద్ర బాహిణీపతి, కృష్ణ కులదీప్, నిహార బిశాయి, జగదీష్ కోశ్ల, మనోజ్ హియాల్, బసంత నాయక్, మనోజ్ ఆచార్యతోపాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు జిల్లాలో సమితుల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, విద్యార్థి, యువ, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యం
జయపురం : జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి గ్రీవెన్స్సెల్కు విశేష స్పందన లభించింది. 47 ఫిర్యాదులు రాగా అందులో 20 కమ్యూనిటీ, 27 వ్యక్తిగత ఫిర్యాదులు. కొరాపుట్ జిల్లా కలక్టర్ మనో జ్ సత్యవాన్ మహాజన్ హాజరై వినతులను పరిశీలించారు. అనంతరం మిషన్ శక్తి యోజనలో భా గంగా మహిళా స్వయం సహాయక గ్రూపునకు రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. దివ్యా ంగులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ, జయపురం సబ్ కలెక్టర్ జాదుమణి నాయిక్, జిల్లా అటవీ విభాగ అధికారి ప్రశాంత పటేల్, జిల్లా అభివృద్ధి విభాగ ప్రధాన అధికారి, జిల్లా పరిషత్ కార్యనిర్వాహక అధికారి బేణుదర శబర, బొరిగుమ్మ సమితి బీడీఓ సుకాంత పట్నాయిక్ పాల్గొన్నారు. -
వెలుగు పంచుదాం..!
కనులు మూసినా..● నేత్రదానంతో మరొకరి జీవితంలో వెలుగు ● సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు ● విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న అధికారులు అవగాహన తప్పనిసరి ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, ఎప్పటికప్పుడు నేత్ర వైద్య నిపుణులతో కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా చూపును సంరక్షించుకోవచ్చు. ప్రస్తుతం చిన్నారులు గంటల తరబడి మొబైల్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను ఉపయోగించడం వల్ల చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి. – ఎంఆర్కే దాస్, ఆప్తాల్మిక్ అధికారి, నేత్రదాన మోటివేటర్ ప్రోత్సహించాలి జిల్లావ్యాప్తంగా నేత్రదాన ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. నేత్రదానం మరింత విస్తృతంగా జరగాలంటే కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు సమీపంలోని నేత్రనిధి కేంద్రాన్ని సంప్రదించి, నేత్రదానానికి అనుమతి ఇచ్చి ఇతరులను కూడా ప్రోత్సహించాలి. – డా.ఎస్.పుష్పలత, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాకుళం అర్బన్: సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషి శరీరంలో అన్ని అవయవాలు కంటే కంటికి ఉన్న ప్రత్యేకత వేరు. ప్రపంచాన్ని చూడాలంటే కళ్లతోనే సాధ్యమవుతుంది. కంటిచూపు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. అందువలన కంటి చూపు కోల్పోయిన వారికి వెలుగును ప్రసాదించేందుకు నేత్రదానం ఎంతో కీలకమని జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రజల్లో నేత్రదానంపై అవగాహన పెంపొందించేందుకు 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. కార్నియా అంధత్వం కార్నియా సంబంధిత అంధత్వం కారణంగా ఎంతోమంది దృష్టిని కోల్పోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. కార్నియా అంధత్వాన్ని నివారించడంలో నేత్రదానం ద్వారా సేకరించే ఆరోగ్యకరమైన కార్నియాలు ఎంతో ఉపయోగపడతాయి. అందువల్ల మరణానంతరం నేత్రదానం చేయడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని అధికారులు సూచిస్తున్నారు. కార్నియా అంధత్వానికి కారణాలు కంటికి గాయాలు కావడం, రసాయనాలు లేదా దుమ్ము, ధూళి పడడం, వరి రేకు, చెరుకు రేకు వంటివి కంటికి తగిలినప్పుడు సకాలంలో సరైన వైద్యం అందకపోవడం వంటి కారణాలతో కార్నియా దెబ్బతిని శాశ్వత అంధత్వం ఏర్పడే అవకాశం ఉంది. కంటికి ఏదైనా గాయం అయినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. ఎవరు నేత్రదానం చేయవచ్చు నేత్రదానానికి వయసు, కులం, మతం, లింగం వంటి భేదాలు లేవు. సాధారణంగా చాలా మంది వ్యక్తులు నేత్రదానం చేయవచ్చు. రక్తపోటు, మధుమేహం, ఆస్తమా ఉన్నవారు, గతంలో కంటి శస్త్రచికిత్స చేయించుకున్నవారు, కళ్లద్దాలు ఉపయోగించే వారు కూడా నేత్రదానం చేయడానికి అర్హులై ఉండవచ్చు. తుది నిర్ణయం నేత్రబ్యాంకు వైద్య నిపుణులదే. అయితే కొన్ని తీవ్రమైన అంటువ్యాధులు, రక్త సంబంధిత వ్యాధులు, ఇతర నిర్దిష్ట పరిస్థితుల్లో మరణించిన వారి నుంచి నేత్రాలను సేకరించడం సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మరణం సంభవించిన వెంటనే సంబంధిత నేత్ర బ్యాంకు లేదా వైద్య సిబ్బందిని సంప్రదించి వారి సూచనలు పాటించాలి. నేత్రదానం ఎప్పుడు చేయాలి ఒక వ్యక్తి మరణించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా.. సాధారణంగా 6 నుంచి 8 గంటల్లోపు నేత్రదాన ప్రక్రియను పూర్తి చేయాలి. ముందుగా నేత్రదాన ప్రతిజ్ఞ చేయవచ్చు. ప్రతిజ్ఞ చేయకపోయినా మరణానంతరం కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించవచ్చు. మరణం సంభవించిన వెంటనే దాత తలను కొద్దిగా ఎత్తి ఉంచాలి. రెండు కళ్లను మూసి, శుభ్రమైన చల్లటి తడి వస్త్రం లేదా తడి దూదిని కళ్లపై ఉంచాలి. వీలైనంత త్వరగా సమీపంలోని నేత్రబ్యాంకు, కంటి ఆస్పత్రి, రెడ్క్రాస్ నేత్రనిధి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా జిల్లా ఆస్పత్రిని సంప్రదించాలి. నేత్రదానం ఎందుకు అవసరం దేశంలో ప్రతీ సంవత్సరం అనేక మంది వివిధ కారణాలతో మరణిస్తున్నప్పటికీ, మరణానంతరం నేత్రదానం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరోవైపు ప్రతి సంవత్సరం కొత్తగా కార్నియా అంధత్వ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రజల్లో నేత్రదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు మరణానంతరం తమ కళ్లను బూడిదపాలు కాకుండా, మట్టిపాలు కాకుండా, మరో వ్యక్తి జీవితంలో వెలుగులు నింపేలా నేత్రదానం చేయాలని అధికారులు పిలుపునిస్తున్నారు. నేత్రదానాన్ని ప్రతి కుటుంబం ఒక సామాజిక బాధ్యతగా, కుటుంబ సంప్రదాయంగా స్వీకరించాలని కోరుతున్నారు. అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేత్రదాన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్ర చికిత్స తర్వాత నల్లగుడ్డు అంధత్వం శస్త్ర చికిత్సకు ముందు అపోహలు తొలగించాలి నేత్రదానంపై ప్రజల్లో ఇంకా అపోహలు ఉన్నాయి. నేత్రదానంపై మరింతగా అవగాహన కల్పించి వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. దేశంలో కార్నియా సమస్య వలన చూపు కోల్పోయినవారు 12 లక్షల మంది ఉన్నట్లు సర్వే చెబుతోంది. నేత్రదానం ద్వారా ఇటువంటి వారికి చూపు తిరిగి పొందే అవకాశం ఉంది. ఏడాదికి సుమారు 1.5 లక్షలు నుంచి 2 లక్షల కార్నియాలు అవసరం కాగా.. కేవలం 30 వేల కార్నియాలు మాత్రమే సేకరించడం అవుతోంది. – డా.పి.శ్రీకాంతి, కార్నియా ప్రత్యేక నేత్ర వైద్య నిపుణురాలు -
గజపతి డీఈవో మయాధర్ సాహుకు ‘నైపా’ ఆవార్డు
పర్లాకిమిడి: గజపతి జిల్లా ముఖ్యవిద్యాధికారి డాక్టర్ మయాధర్ సాహుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక జాతీయస్థాయి పురస్కారాన్ని సెప్టెంబర్ 2, 3 తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో నైపా అవార్డును అందుకోనున్నారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడమే కాకుండా 2024–25, 25–26 విద్యా సంవంత్సరంలో రెండు దఫాలు 99 శాతం పైగా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఘనత గజపతి డీఈవో మయాధర్ సాహుకు తక్కింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్, అడ్మిన్ష్ట్రేషన్ (నైపా) ఒడిశా రాష్ట్రంలో పాఠశాల విద్యకు వినూత్న విధానాలు, సూపర్ 30, ‘ప్రయాస్’వంటి కార్యక్రమాలు ప్రతి ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం స్ఫూర్తిని పెంపొందించిన ఫలితంగా 90 శాతం పైగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థాయికి తెచ్చి గజపతి జిల్లాకు పేరు తెచ్చారు. -
బేస్బాల్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతాం
● బేస్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత ● జిల్లా బేస్బాల్ జట్ల ఎంపికలకు పోటెత్తిన క్రీడాకారులు శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లాలో సంఘ ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో బేస్బాల్ క్రీడను మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్తామని జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు తమ్మినేని సుజాత పేర్కొన్నారు. జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల బేస్బాల్ జట్ల ఎంపిక పోటీలు బుధవారం శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరిగాయి. ఈ సెలక్షన్ ట్రయల్స్కు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పోటెత్తారు. సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా బేస్బాల్ ప్రాబబుల్స్ జట్లకు ఎంపిక చేసినట్టు జిల్లా బేస్బాల్ సంఘ ప్రతినిధులు వెల్లడించారు. జిల్లా ప్రాబబుల్స్ జట్లకు సెప్టెంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు గ్రామంలో నిర్వహించనున్న శిక్షణా శిబిరాల అనంతరం, జిల్లా తుది జట్లను ప్రకటిస్తామని కార్యనిర్వహణ కార్యదర్శి కొండపల్లి రవికుమార్ చెప్పారు. – పుట్టపర్తిలో రాష్ట్రస్థాయి పోటీలు జిల్లా జట్లను శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనున్న 8వ ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్(మెన్, ఉమెన్) బేస్బాల్ ఛాంపియన్ షిప్–2026 పోటీలకు పంపించనున్నట్లు జిల్లా బేస్బాల్ సంఘ ప్రధాన కార్యదర్శి గుంటముక్కల వీరభద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సమష్టిగా రాణించి పతకం సాధించడమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, కొండపల్లి కిరణ్కుమార్, హెచ్ఎం యాళ్ల పోలినాయుడు, సీనియర్ పీడీలు చల్లా జగదీశ్, సాధు శ్రీనివాసరావు, లకిలీ రాంబాబు, సింహాద్రినాయుడు, రామాంజనేయులు, రవిబాబు, సంఘ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఖుర్దా డివిజన్లో పలు రైళ్ల రద్దు
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ మండలం పరిధిలోని కెందువాపడ, భద్రక్, కటక్ మార్గంలో మూడో లైన్ పనులకు సంబంధించి కెందువాపడ స్టేషన్లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. దీనిలో భాగంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా నియంత్రించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 29, 30 తేదీల్లో 68438 కటక్ – భద్రక్ మెమూ రైలు, 68437 భద్రక్ – కటక్ మెమూ రైలు సేవలు రద్దు చేయనున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో 68424 కటక్ – భద్రక్ మెమూ రైలు సేవలు జాజ్పూర్ కెందుఝొర్ రోడ్ వరకు పరిమితం చేస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో 68423 భద్రక్ నుంచి బయల్దేరాల్సిన కటక్ మెమూ రైలు జాజ్పూర్ కెందుఝొర్ రోడ్ నుంచి బయల్దేరుతుంది. ఈ నెల 27 నుంచి 29 వరకు కెందుఝొర్ రోడ్ వరకు వెళ్లాల్సిన 18037 ఖరగ్పూర్ – జాజ్పూర్ కెందుఝొర్ రోడ్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు భద్రక్ వరకు పరిమితం చేస్తారు. ఈ నెల 28 నుంచి 30 వరకు జాజ్పూర్ కెందుఝొర్ రోడ్ నుంచి ఖరగ్పూర్ వెళ్లాల్సిన 18038 ఎక్స్ప్రెస్ రైలు భద్రక్ నుంచి బయల్దేరుతుంది. ఈ నెల 27 నుంచి 30 వరకు 18021 ఖరగ్పూర్ – ఖుర్దా రోడ్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు భద్రక్ వరకు పరిమితం చేస్తారు. 18022 ఖుర్దా రోడ్ – ఖరగ్పూర్ ఎక్స్ప్రెస్ ఈ నెల 27 నుంచి 30 వరకు భద్రక్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. రైళ్ల రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారం నేషనల్ ట్రైన్ ఎంకై ్వరీ సిస్టమ్ (ఎన్టీఈఎస్)లో అందుబాటు లో ఉంటుందని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. భువనేశ్వర్: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పదంపూర్ మాజీ ఎమ్మెల్యే సత్య భూష ణ్ సాహు (73) కన్ను మూశారు. భువనేశ్వర్ లోని ఒక ప్రైవేట్ ఆస్ప త్రిలో చికిత్స పొందు తూ బుధవారం తుదిశ్వాస విడిచారు. సత్యభూషణ్ సాహు 1980, 1985, 2004లో పదంపూర్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్పై ఒడిశా శాసన సభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. ప్రభుత్వ చీఫ్ విప్గా కీలక బాధ్యల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆయన అకాల మర ణం పదంపూర్ ప్రాంతంతో పాటు ఒడిశా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదఛాయలను నింపింది. స్థానికులు, వివిధ వర్గాల నాయకులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. భువనేశ్వర్: రక్షాబంధన్ పండగ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు. ఈ నెల 27వ తేదీన గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని అన్ని అమొ బస్సుల్లో మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించవచ్చని, సమగ్ర ప్రాంత పట్టణ రవాణా (సీఆర్యూటీ) తెలిపింది. ఈ ఏర్పాటు ప్రకారం భువనేశ్వర్, కటక్, పూరీ, రూర్కెలా, సంబల్పూర్, బరంపురం, కెందుఝర్లలో అమొ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులు ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లే దు. ఈ కార్యక్రమం వల్ల సుమారు లక్ష మంది మహిళా ప్రయాణికులు ప్రయోజనం పొందు తారని సీఆర్యూటీ అంచనా వేస్తోంది. 7 నగరాల్లో పనిచేస్తున్న అమొ బస్ నెట్వర్క్ అంతటా ఈ నెల 27వ తేదీ రోజంతా ఈ మహిళల కు ఉచిత ప్రయాణ పథకం వర్తిస్తుంది. వ్యక్తి ఆత్మహత్య శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని గోనెలవారి వీధిలో నివసిస్తున్న తోలేటి మహేష్ (50) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ బుధవారం వెల్లడించారు. మహేష్ కార్పెంటర్గా పనిచేస్తూ భార్య రాజేశ్వరితో కలిసి గోనెలవారి వీధిలో నివసిస్తున్నాడు. భార్య రాజేశ్వరి రైతుబజారు సమీపంలోని ఒక టైలర్ షాపులో పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలుండగా.. ఒకరికి వివాహమై తన భర్తతో కలసి హరిపురంలో నివసిస్తోంది. రెండో కుమార్తె సౌమ్య రిమ్స్ కళాశాలలో నర్సింగ్ చదువుతోంది. రెండు సంవత్సరాలుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న మహేష్, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మంగళవారం రాత్రి ఉరివేసుకున్నాడు. ఎదురింటివారు వచ్చి చనిపోయాడని నిర్ధారించారని, ఈ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని భార్య రాజేశ్వరి తెలపడంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు. గల్లంతైన రైతు ఆచూకీ లభ్యం ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని సైదాలపుట్టుగ గ్రామానికి చెందిన రైతు నారద గంగయ్య పొలం పనుల్లో భాగంగా మంగళవారం బాహుదానది దాటుతూ నది ఉద్ధృతకు గల్లంతైన విషయం తెలిసిందే. రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. అయితే బుధవారం ఉదయం బాహుదా నది ఒడ్డుకు మృతదేహం కొట్టుకొచ్చినట్లు స్థానికులు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రూరల్ ఎస్ఐ ఆర్.జనార్థనరావు మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించి, శవ పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
ఉపాధి కోసం వెళ్తూ.. మృత్యు ఒడిలోకి...
కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్లో విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతుండగా జారిపడి వ్యక్తి దుర్మరణం చెందాడు. కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామానికి చెందిన తోట వెంకటరావు(47) అనే వ్యక్తి విశాఖ ఎక్స్ప్రెస్లో భీమవరం వెళ్లేందుకు బుధవారం బయల్దేరాడు. టికెట్ తీసి ఒకటో నంబర్ ప్లాట్ ఫాం మీద ఆగిన రైలును ఎక్కి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రైన్ నుంచి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో ఇతని కాలి మీద నుంచి ట్రైన్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తోట వెంకటరావు భీమవరంలోని ఒక హోటల్లో వంట మనిషిగా 26 ఏళ్లు నుంచి పని చేస్తున్నాడు. మధ్యలో కొన్నాళ్లు స్వగ్రామంలో చిన్న జనరల్ స్టోర్ కూడా నడిపాడు. వ్యాపారం లేకపోవడంతో మళ్లీ వంట పనిచేయడానికి భీమవరం వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇతనికి భార్య సుజాత, కుమారుడు మణికంఠ, కుమార్తె మనీష ఉన్నారు. కుమారుడు మణికంఠ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ కాఫీ హౌస్లో పనిచేస్తుండగా, కుమార్తె మనీష సోంపేటలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటి యజమాని అకస్మాత్తుగా ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మృతుని స్వగ్రామం బల్లిపుట్టుగలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై పలాస జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. 40 నిమిషాలు నిలిచిపోయిన ట్రైన్ విశాఖ ఎక్స్ప్రెస్ నుంచి ప్రయాణికుడు జారిపడి మృతి చెందడంతో ట్రైన్ను సోంపేట స్టేషన్లో 40 నిమిషాలు పాటు నిలిపివేశారు. ప్రమాదం జరిగిందని తెలిసి ప్రయాణికులంతా అవాక్కయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత రైల్వే అధికారులకు స్థానిక స్టేషన్ మేనేజ్మెంట్ సమాచారం ఇవ్వడం, అక్కడి నుంచి మళ్లీ ఆదేశాలు అందిన తర్వాత ట్రైన్ను పంపేందుకు సిగ్నల్ ఇచ్చారు. -
‘లంకాఘడ్’కు ప్రశంసలు
జయపురం: అతడు ఓ ఉపాధ్యాయుడు. కొరాపుట్ జిల్లా మారుమూల ప్రాంతాల్లో పని చేస్తూ.. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న నిరక్షరాస్యతను అర్థం చేసుకున్నాడు. అమాయకత్వం, నిజాయితీ వలన వారు దోపిడీకి గురవుతున్నారు. వారి పరిస్థితికి ప్రధాన కారణం నిరక్ష్యరాస్యత అని గ్రహించిన ఆ ఉపాద్యా యుడిని, విద్యా ఉన్నతికి అంకితమైన అతడి జీవితాన్ని సమాజానికి పరిచయం చేసేందుకు ఒక దర్శకుడు సినీమా తీశాడు. మారుమూల ఆదివాసీ గ్రా మాల్లో ఆ ఉపాధ్యాయుడు చేపట్టిన విద్యా వ్యాప్తి ఉద్యమంలో అనేక ప్రతికూల వాతావరణంలోనూ ఆదివాసీ పిల్లలకు వారి మాతృ భాషలో విద్యా బోధన చేస్తు వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంచి, పరివర్తన తీసుకువస్తున్నారు. కొరాపుట్ జిల్లా ప్రకృతి, గ్రామీణ జీవనం, ఆ ప్రాంత సామాజిక పరిస్థితులు కథగా మలచి ఆదివాసీ పిల్లలకు విద్యను అందిస్తున్న ఆ ఉపాధ్యాయుడి జీవితాన్ని కథలో ప్రధానంగా ప్రస్థావిస్తూ ‘లంకాఘడ్’ సినీమా తీశారు. ఈ నెల 12వ తేదీన విడుదల చేసిన ఈ సినీమా ప్రిమియర్ షో బుధవారం జయపురంలో ప్రదర్శించారు. సినీ దర్శకుడు, కళాకారులు, నిర్మా త, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రము ఖ కళాకారులు పాల్గొన్నారు. లంకాఘడ్ టైటిల్తో తీసిన ఈ సినీమాను అందరూ ప్రశంసించారు. ఇది కేవలం సినీమా మాత్రమే కాదని, మారుమూల ఆదివాసీ ప్రాంతంలో విద్యా వెలుగులు నింపుతున్న ఒక ఉపాధ్యాయుని స్ఫూర్తిదాయక కథ అని కొనియాడారు. ఈ చిత్రానికి దర్శకుడు ఆనంద కుమార్ ఒక ప్రొఫెసర్ అయినా చిత్రంలో హీరోగా నటించి జీవం పోశారు. సుదేష్ణ పాత్రలో హీరోయిన్ జెన్హ ఒక వితంతు తల్లిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో జయకార్, భూమా టన్టన్, సోపాన్ సామంతరాయ్, తరణి, శుభం, నరేష్, తరుణ్, బాల నటి పద్మ, తదితరులు తమ త్రలకు జీవం పోసి ప్రేక్షకుల మన్నలను పొందారు. -
పాత్రికేయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
జయపురం: పాత్రికేయుల న్యాయమైన డిమాండ్ల సాధనకు సామూహిక పోరాటం అవసమని జయపురం ఎం. ఎల్.ఎ తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. స్థానిక అప్సర కాన్ఫరెన్స్ హాల్లో ఉత్కళ సంబాదిక సంఘ కొరాపుట్ జిల్లా వార్శిక సాధారణ పరిషత్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్కళ సంబాదిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బిభూతి భూషణ కర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. బాహిణీపతి ప్రసంగిస్తూ.. సమాజానికి ఎనలేని సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు రక్షణ కరువైందన్నారు. పెన్షన్ సౌకర్యం కల్పించటం ఎంతో అవసరమన్నారు.హెల్త్ బీమా కేవలం రూ.5 లక్షలకు మాత్రం చేస్తున్నారని దీనిని రూ.15 లక్షలు చేయాలన్నారు. హెల్త్ బీమా పరిధిలోనికి జర్నలిస్టుల తల్లితండ్రులతోపాటు కుటుంబ సభ్యులందరినీ చేర్చాలన్నారు. రాష్ట్రంలో ఉన్న జరనలిస్టులందరూ రాష్ట్ర రాజధానిలో సామూహిక ఆందోళన జరపాలని అందుకు తాను పూర్తి మద్దతు ఇస్తానన్నారు. జర్నలిస్టులు నిజాతీగా, నిర్భయంగా పనిచేయాలన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలిపి ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిలా పనిచేసి సమాజ ఉన్నతికి, కొరాపుట్ జిల్లా అభివృద్ధిలో మమేకం కావాలన్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధిలు నిజాయితీగా ప్రజా సేవకు కట్టుబడి పనిచేస్తే ప్రగతి అసాధ్యం అవుతుందన్నారు. గౌరవ అతిథులు భారతీయ వర్కింగ్ జర్నలిస్టు మహాసంఘ అధ్యక్షులు హేమంత తివారీ, సాధారణ కార్యదర్శి సిద్ధార్థ కలహంస మాట్లాడుతూ.. దేశంలో జర్నలిస్టుల సమస్యలపై జాతీయ మహాసంఘ్ జరుపుతున్న పోరాటాలు, పత్రికా రంగంలో ఎఐ ప్రభావంపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఉత్కళ సంబాద సంఘ్ కొరాపుట్ జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సమావేశంలో ఉత్కళ సంబాదిక సంఘ్ సలహాదారులు దండకారణ్య పత్రిక సంపాదకులు బినోద్ మహాపాత్రో, అశిభక్త కొరాపుట్లో సీనియర్ పాత్రికేయులు సంఘ్ సలహాదారు వి.భాస్కరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నందపూర్ సమితిలో వేలాది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకునిగా పేరు గాంచిన జి.సత్యనారాయణకు ‘వృక్ష బంధు’ బిరుదుతో సన్మానించారు. పత్రికా రంగానికి ప్రశంసనీయ సేవలు అందిస్తున్న చిన్న పత్రికల జాతీయ సంఘ ఉపాధ్యక్షుడు బినోద్ మహాపాత్రోను సత్కరించారు. ఈ వార్శిక సభలో కొరాపుట్ జిల్లా నుంచే కాకుండా నవరంగపూర్, మల్కనగిరి జిల్లాల నుంచి అనేక మంది పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
బెట్టింగ్ ఆట..చోరీల బాట
● దొంగతనాలకు పాల్పడిన డిగ్రీ విద్యార్థి అరెస్టు ● 6.25 తులాల బంగారం, రూ.39 వేలు నగదు స్వాధీనం ఇచ్ఛాపురం రూరల్: బెట్టింగులకు బానిసైన ఓ డిగ్రీ విద్యార్థి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతూ చివరకు పోలీసులకు చిక్కాడు. ఇప్పటికే బారువ పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిపై ఏడు కేసులు నమోదయ్యాయి. ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామంలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ కేసు వివరాలను కాశీబుగ్గ డీఎస్పీ టీ.భవానీ మంగళవారం సీఐ ఎం.చిన్నంనాయుడు, రూరల్ ఎస్సై ఆర్.జనార్దనరావుతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. చోరీ సొమ్ము అమ్మేందుకు సిద్ధమై.. డొంకూరు గ్రామంలో ఇటీవల రూ.24 వేల నగదు, బంగారు కాసు చోరీకి గురైనట్లు బాధితులు ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమేరాల ఫుటేజీలను పరిశీలించగా సోంపేట మండలం ఇసుకలపాలెం గ్రామానికి చెందిన వాసుపల్లి తాతారావు అనే డిగ్రీ విద్యార్థి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. తదుపరి దర్యాప్తులో అతనిపై గతంలోనే ఇచ్ఛాపురం రూరల్, కవిటి, బారువ పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. దొంగతనం ద్వారా సంపాదించిన సొత్తును ఒడిశాలోని బరంపురంలో విక్రయించేందుకు విద్యార్థి సిద్ధమయ్యాడు. మంగళవారం ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి జంక్షన్ వద్ద బస్సు కోసం వేచి ఊండగా, రూరల్ ఎస్ఐ ఆర్.జనార్థనరావు తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 16 తులాల పావు బంగారం, రూ.39 వేలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగులే కారణం.. బారువలో డిగ్రీ చదువుతున్న తాతారావు బెట్టింగులకు బానిసై డబ్బులు అవసరం కావడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. యువత ఆన్లైన్ బెట్టింగులు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ తెలిపారు. -
వలసలు అరికట్టాలని వినతి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో వీబీజీ రామ్జీ (ఉపాధి) చట్టాన్ని అమలు చేసి వేతనదారుల వలసలు అరికట్టాలని, ఉద్యానవనాలు, వ్యవసాయ శాఖ అధికారుల నియామకం చేపట్టాలని, పర్లాకిమిడిలో కోల్డ్ స్టోరేజీని మరమ్మతులు చేయాలని కోరుతూ డిప్యూటీ డైరక్టర్ (ఉద్యానవనాలు) బోరెక్ ఉల్లాంగ్ అమ్మన్కు బీజేపీ కృషక్ మోర్చా అధ్యక్షుడు ప్రశాంత్కుమార్ పాలో వినతిని అందజేశారు. గజపతి జిల్లాలో వ్యవసాయ శాఖ, ఉద్యానవనాల శాఖల్లో బ్లాక్ స్థా యి అధికారులు కొరత చూపించి కేంద్ర ఉపా ధి పథకం అమలు కావడం లేదని ప్రశాంత్కుమార్ పాలో అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ డైరెక్టర్ బోరెక్ ఉల్లాంగ్ అమ్మన్ను కలిసిన వారిలో బీజేపీ యువజన మోర్చా నాయకులు కోట్ల యువరాజ్, శాసనం లింగరా జు తదితరులు ఉన్నారు. విద్యుత్ షాక్తో వెల్డర్ మృతి నరసన్నపేట: మడపాం టోల్గేట్ వద్ద ఓ పరిశ్రమలో వెల్డింగ్ పనులు చేస్తున్న చేనులవలసకు చెందిన సరిపల్లి రామచంద్రరావు (35) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. గతంలో వంశధార పేపరు మిల్లులో పనిచేసిన రామచంద్రరావు ప్రైవేటుగా వెల్డింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ దశలో మంగళవారం పరిశ్రమలో వెల్డింగ్ పనులు చేస్తుండగా షాక్కు గురయ్యాడు. స్థానికులు స్పందించి నరసన్నపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు రామచంద్రరావు తల్లి మరణించగా తండ్రి అప్పన్న వృద్ధాప్యంలో ఉన్నారు. భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామచంద్రరావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం ఆమదాలవలస/బూర్జ: శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు ఢీకొని తులగాపు శ్రీనివాస రావు(43) మృతి చెందినట్లు జి.ఆర్.పి. పోలీసులు తెలిపారు. బూర్జ మండలం లచ్చయ్యపే ట కాలనీకి చెందిన శ్రీనివాసరావు భార్య ర మ్య, ఇద్దరు పిల్లలు పూజిత, తరుణ్ ఉన్నారు. మద్యానికి బానిసై రెండురోజుక్రితం ఇంటి నుంచి వచ్చేశాడు. ఏం జరిగిందో గానీ రైలు కింద పడి మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. మనస్తాపంతో యువతి ఆత్మహత్య సంతబొమ్మాళి: గోవిందపురం గ్రామానికి చెందిన నీలాపు రమ్య(21) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ చదువుకున్న రమ్య పలుమార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమైంది. తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో దిగులు చెందుతూ గడ్డిమందు తాగడంతో రాగోలు జెమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. రమ్య తల్లి మహాలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సంతబొమ్మాళి ఎస్సై వై.సింహాచలం మంగళవారం తెలిపారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 30న జరగనున్న నీట్ పీజీ–2026 పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఎచ్చెర్ల మండలంలోని శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ చిలకపాలెం జంక్షన్లో 270, శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 100, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీస్లో 312 కలిపి మొత్తం 682 సీటింగ్ సామర్థ్యంతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎస్పీ పర్యవేక్షణలో గట్టి భద్రతతో పాటు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. సమావేశంలో డీఆర్ ఓ విశ్వేశ్వరరావు, ఆర్డీవో సాయి ప్రత్యూష, వైద్య ఆరోగ్య, ఆర్టీసీ, పోలీసు శాఖల అధికారులు హాజరయ్యారు. -
మురుగునీటితో ఇబ్బంది
పర్లాకిమిడి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పర్లాకిమిడి శివార్లలో ఉన్న మొక్కతోటమ్మ గుడి కాలనీ వద్ద ఎంఐ నాలా మురికినీరు కాలనీలోకి చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, పురపాలక సంఘం ఇంజినీర్లు, చైర్మన్ నిర్మలా శెఠి తదిత రులు మంగళవారం విచ్చేసి ప్రజలతో మాట్లాడా రు. కొత్తగా ఏర్పడిన కాలనీ పురపాలక సంఘం కింద రావడం లేదు. గుసాని సమితి కెరండీ పంచాయ తీ పరిధిలోకి వస్తుంది. అందువల్ల ఈ కాలనీకి వరదనీరు రాకుండా ఉండేందుకు ఆంధ్రాలోని పాతపట్నం మండలం పాసి గోపాలపురం నాలాకు కనెక్టు చేయాలని ఇంజినీర్లు సలహా ఇచ్చారు. ఎగువ నుంచి వరదనీరు కట్టడికి గార్డు వాల్ నిర్మించాల్సి ఉంటుందని కౌన్సిల్ ఇంజినీర్లు తెలియజేశారు. దీనిపై డీపీఆర్లు తయారుచేసి అర్బన్ డెవలప్మెంట్ నిధులు మంజూరు చేస్తే పనులు చేపడతామని ఇంజినీర్లు చెబుతున్నారు. -
వివాహిత ఆత్మహత్య
మందస : కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై సువర్ణాపురం పంచాయతీ నాతుపురం బొడ్డులూరుకు చెందిన పుచ్చ మీనాక్షీ(40) అనే వివాహిత మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. మీనాక్షి, భాస్కరరావులు దంపతులు. ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం మీనాక్షీ భర్తతో మరోసారి గొడవపడింది. దీంతో భాస్కరరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. మనస్థాపానికి గురైన మీనాక్షి ఇంట్లో తలుపులు వేసి ఊరి వేసుకుంది. ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ కేసు దర్యాప్తు చేపడుతున్నారు. -
సేవా దళాలకు సన్మానం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడలో మంగళవారం రథ యాత్రపై క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్పై మంగళవారం సమావేశం నిర్వహించా రు. రథయాత్ర నిర్వహణలో ఎటువంటి ఫిర్యాదు లు, అభ్యంతరాలు ఉన్నా చెప్పాలని తహసీల్దార్ కోరారు. సభికులు రథయాత్ర ఘనంగా జరిగిందని ముక్త కంఠంతో వెల్లడించటంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం సమీక్ష సమావేశం రథ యాత్ర కమిటీ నిర్వహించింది. బొయిపరిగుడ సమితి సభాగృహంలో బొయిపరిగుడ తహసీల్దార్ స్నిగ్ద చౌదరి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో బొయిపరిగుడ సమితి బిడిఓ సుభ్రత సాహు, పోలీసు అధికారి లక్ష్మీనారాయణ ముదులి, రథ యాత్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రథయాత్ర ప్రశాంతంగా, అంగరంగ వైభవంగా జరిగిందని అందుకు స్థానిక సహిద్ లక్ష్మణ నాయక్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, డ్రైవర్ మహా సంఘం, బొడయి సేవా సంఘ కార్యకర్తలు స్వచ్ఛందంగా అందించిన సేవలను కమిటీ కొనియాడింది. వారంతా ప్రశంసనీయమైన సేవలు అందించారని అధికారులు అభినందించా రు. రథయాత్రలో స్వచ్ఛందంగా సేవలు అందించి న వారిని అధికారులు ప్రశంసాపత్రాలు, మెమోంటోలు అందజేసి సన్మానించారు. ఈ సమావేశంలో రథయాత్ర సమయంలో చేపట్టిన ఏర్పాట్లు, భక్తుల కు సమకూర్చిన సౌకర్యాలు, సేవా కార్యక్రమాలపై సమీక్షించారు. భవిష్యత్లో రథయాత్ర వేడుకలను మరింత ఉత్సాహంగా, భక్తులకు ఏర్పాట్లను బలోపేతం చేయాలని కమిటీ నిర్ణయించింది. రథయా త్ర ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు, యువతకు పలు సంస్థల కార్యకర్తలకు కమిటీ ధన్యవాదాలు తెలిపింది. -
లారీని ఢీకొట్టిన ఆటో
నరసన్నపేట: జమ్ము కూడలి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆగి ఉన్న లారీని విజయనగరం జిల్లా జామి నుంచి పలాస వైపు వెళ్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న శ్రావణ్కుమార్, వెంకటరమణలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జు కావడంతో డ్రైవర్తో పాటు పక్కనే కూర్చున్న వెంకటరమణ ఇరుక్కున్నారు. వారిని బయటకు తీయడానికి స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ అతి వేగంగా వాహనం నడుపుతుండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను కాపాడిన స్థానికులు, ఎస్సై -
బంధువుల వివాహానికి వచ్చి విగతజీవిగా..
● జమ్ము కాలువలో విశాల్ మృతదేహం లభ్యం నరసన్నపేట : ఖరగ్పూర్లో సాఫ్ట్పేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న మెండ విశాల్కుమార్ (30) సారవకోట మండలం కేలవలస కల్యాణ మండపంలో జరిగిన వివాహనికి వచ్చి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. సోమవారం విశాల్కుమార్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి సారవకోట మండలం కిన్నెరవాడ సమీపంలోని వంశధార కాలువలోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉదయం నరసన్నపేట మండలం జమ్ము వద్ద వంశధార బ్రాంచి కెనాల్లో విశాల్ మృతదేహం కొట్టుకురావడంతో స్థానికులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, విశాల్కుమార్ ఖరగ్పూర్ నాలుగేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తూ బంధువుల అమ్మాయి వివాహానికి వచ్చి ఇలా విగత జీవిగా మారాడు. కుమారుడు అకస్మాత్తుగా మర ణించడంతో తల్లిదండ్రులు ప్రభాకర్, భాగ్యలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సారవకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
దివ్యాంగ బాలల హక్కులను రక్షించాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో దివ్యాంగ బాలల హక్కులు కాపాడటానికి వివిధ ఎన్జీఓలు, మెడికల్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, చైల్డ్లైన్, శిశు సంక్షేమ శాఖ అధికారులకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్ర మం కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం జిల్లా శిశు సురక్షా శాఖ, అరుణ ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా సామాజిక సురక్షా అధికారి ఉత్సర్ గీతా బో డోరయితో అధ్యక్షత వహించారు. దివ్యాంగ స్వశక్తీకరణ ఉపఖండ అధికారి లక్కోజు సంతోష్ కుమా ర్, బిభూతీభూషణ్ నందో, డి.సి.పి.ఒ అరుణ్కు మార్ త్రిపాఠి, సంతోష్ బెహరా తదితరులు హాజరయ్యారు. దివ్యాంగ బాలలతో వెట్టిచాకిరీ చేయిస్తు న్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఓపెన్ లెర్నింగ్ పద్ధతి అధ్యక్షుడు సంతోష్ బెహరా అన్నారు. దివ్యాంగ బాలలకు పునరావాసం, బ్రెయిలీ విద్య కల్పించాలని అరుణ్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ సాయి ప్రసాద్ సామల్ అన్నారు. ఈ శిక్షణ శిబిరంలో జిల్లా శిశు సంక్షేమ అధికారి అమియా త్రిపాఠి, సెంటర్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యదర్శి ఎ.జగన్నాథరాజు, వన్ స్టాప్ సెంటర్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
కఠినంగా శిక్షిస్తాం..
పర్లాకిమిడి: కాశీనగర్ సమితి కిడిగాం గ్రామంలో గృహిణి హడపా కుమారి (35) ఇంట్లోకి ప్రవేశించి, ఆమె చేతిని బలంగా లాగి, అత్యాచారానికి పాల్పడమే కాకుండా అడ్డువచ్చిన ఆమె అత్తను కూడా దుర్భాషలాడి, చంపుతానని పనస ధర్మారావు బెదిరించాడు. ఈ కేసులో గజపతి జిల్లా న్యాయస్థానం జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహంతి కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్లో ఆమెకు ఇష్టంలేకుండా, ఇలాంటి దారుణాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆగస్టు 5వ తేదీ సాయంత్రం కిడిగాం గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళ హడపా కుమారిపై అత్యాచారం, దౌర్జన్యం చేసిన ఘటనలో నిందితుడు పనస ధార్మరావుపై కాశీనగర్ ఏఎస్ఐ మనోజ్కుమార్ పాడి కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ మనోజ్ కుమార్ పాడీ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ కేసులో 8 మంది సాక్షులు, ఆరు ధ్రువీకరణ పత్రాలను న్యాయస్థానం ముందు పిటిషనర్ హడపా కుమారి ఉంచారు. రాయగడ: జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతమైన చంద్రపూర్ సమితి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అఽశుతోష్ కులకర్ణి అధ్యక్షతన సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలను అధికారులకు వినిపించారు. మొత్తం 37 వినతులను స్వీకరించిన అధికారులు వాటిలో 22 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించారు. మరో 15 సామూహిక గ్రామ సమస్యలుగా పరిగణలోకి తీసుకున్నారు. స్వీకరించిన గ్రామ సమస్యలను సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కులకర్ణి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ రాజ్ప్రసాద్, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ బిశ్వంబర్ బెహర, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అజయ్ కుమార్ ప్రధాన్ పాల్గొన్నారు. పర్లాకిమిడి: మోహనా నియోజకవర్గం అడవ పోలీసు స్టేషన్ పరిధిలోని సర్పంచ్లు, వార్డు సభ్యులు, కమ్యూనిటీ లీడర్స్, ఆదివాసీలతో సోమవారం జిల్లా ఎస్పీ ప్రహ్లద్ సహాయ్ మీ నా అడవ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గంజాయిని పండి స్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నిషాముక్త అభియాన్లో పాలుపంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ సంతోష్కుమార్ బిశోయి, ఆర్.ఉదయగిరి సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాజేష్ కుమార్ సాహు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పాము వజ్రపుకొత్తూరు రూరల్: పలాస తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సుమారు 7 అడుగుల తాచుపాము కలకలం రేపింది. ఉదయం దాదాపుగా 11 గంటల సమయంలో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్న గదిలో ఒక్కసారికి ప్రత్యక్షం కావడంతో ఉద్యోగులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. సిబ్బంది చాకచాక్యంగా పామును బయటకు పంపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కార్యాలయం చుట్టూ పిచ్చి మొక్కలు అల్లుకుపోవడంతో విష కీటకాల భయం తప్పడం లేదు. -
ఒడిశాలోకి ఏనుగుల ప్రవేశం
● ఆంధ్రా నుంచి చొరబడిన ఏనుగుల గుంపు ● ఆందోళనలో రైతులు రాయగడ: పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆహారం కోసం ఎనిమిది ఏనుగుల గుంపు ఒడిశాలోకి ప్రవేశించాయి. ఇవి రాయగడ జిల్లా సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా రాయగడ సమితిలోని ఎంపలవలస, కెరడ, ఒనిజా, పుడేసు, బైరాగి హలువ గ్రామాల సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు సోమవారం ఉదయం కెరడ సమీపంలోని ఓ ఫామాయిల్ తోటలోకి చొరబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని వీరఘట్టం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఆహారం కోసం ఏనుగుల గుంపు ఇటువైపు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. నాగావళి నదీ పరివాహక ప్రాంతంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య ఏనుగులు సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పంటపొలాల్లో ఏనుగులు చొరబడి పంటలకు తీవ్రనష్టం కలిగించినట్లు స్థానికులు తెలిపారు. ఏనుగుల సంచారంతో సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని సరిహద్దు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రాయగడ అటవీ రేంజర్ అనిల్ కుమార్ పాణిగ్రహి తెలిపిన వివరాల ప్రకారం.. గుంపులో ఆరు ఆడ, రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. రాయగడ అటవీ శాఖ ప్రత్యేక బృందం నిరంతరం వీటి కదలికలను పర్యవేక్షిస్తుంది. ఏనుగులతో పాటు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాణిగ్రహి తెలియజేశారు. ఇదిలాఉండగా ఏనుగులను దగ్గరగా చూసేందుకు కొందరు యువకులు ఫామాయిల్ తోటల్లోకి ప్రవేశించి సెల్ఫోన్లతో వీడియోలు చిత్రీకరించి వాటిని సామాజిక మాధ్యమాలో వైరల్ చేస్తున్నారు. ఏనుగుల సమీపానికి వెళ్లడం ప్రమాదకరమని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి అటవీ శాఖ సూచనలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కూడా రాయగడ జిల్లాలోకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏనుగుల గుంపులు చొరబడ్డాయి. -
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
రాయగడ : జిల్లాలోని గుణుపూర్లో గల గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జిఐఇటి) విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న కౌషిక్ పాత్రో (20) ఆత్మహత్య చేసుకున్నాడు. గుణుపూర్లో గల వరుణ్ నగర్లో ఒక అద్దె ఇంటిలో ఉంటున్న ఆ విద్యార్థి సోమవారం నాడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పొస్టుమార్టంకు తరలించారు. మృతుడు బాలేశ్వర్ జిల్లా సొరొ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు ఈ మేరకు అతని కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉందని పోలీసులు తెలియజేశారు. నీట మునిగి మహిళా రైతు మృతి మల్కన్గిరి: నీట మునిగి మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి యం.వి.79 పోలీసుస్టేషన్ పరిధిలోని భపాన్పల్లి పంచాయతీ లో సోమవారం చోటుచేసుకోగా ఎర్ర కుంజా (51) చనిపోయింది. ఈమె భర్తతో పొలం పని చేసి తిరిగి వస్తూ.. మార్గమధ్యలో ఉన్న చెరువులో స్నానం కోసం వెళ్లారు. అయితే చెరువులోకి వెళ్లిన ఆమె ఎప్పటికీ రాకపోవడంతో భర్త దుల మాడ్కమి అనుమానంతో చెరువు వద్దకు వెళ్లి చూడగా ఆమె బట్టలు అక్కడే ఉన్నాయి. దీంతో దానితో చెరువులోకి దిగి గాలించగా ఎర్ర కుంజా శవమై తేలింది. సమాచారం తెలుసుకున్న యం.వి.79 పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమేల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. బలభద్రునికి సోదరి సుభద్ర రాఖీ భువనేశ్వర్: శ్రీ క్షేత్రం (పూరీ) నుంచి తులసి క్షేత్రంలో కొలువై ఉన్న అన్న బలభద్ర స్వామికి సోదరి దేవీ సుభద్ర రాఖీ తరలింపు కార్యక్రమం సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హై టెక్ గ్రూప్ ట్రస్టీ విశ్వరాజ్ పాణిగ్రాహి, పట్టొ రాఖీ సేవా పరిషత్ అధ్యక్షుడు హిమాన్షు శేఖర్ సాహు, సౌభాగ్య మంజరి సాహు, సుభ్రాంశు సాహు, భువనానంద దాస్ పూరీ గోవర్ధన పీఠం శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి నుంచి పట్టు రాఖీ అందుకున్న హై టెక్ మెడికల్ సముదాయంలో గణేష్ ఆలయంలో భద్రపరిచారు. ఆ రాఖీతో కేంద్రాపడాలో తులసీ క్షేత్రలో బలభద్ర స్వామి సన్నిధికి హై టెక్ సంస్థ ప్రాంగణం నుంచి శ్రీ మందిరం సీనియర్ సేవాయత్, సుభద్ర దేవీ బాడొగ్రాహి రామచంద్ర దాస్ మహా పాత్రో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం యాత్రగా బయలేరింది. ఈ సందర్భంగా గణపతి ఆలయ ప్రాంగణంలో హై టెక్ గ్రూప్ ట్రస్టీ డాక్టర్ రాకేష్ పాణిగ్రాహి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజాదులు నిర్వహించారు. హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి, మేనేజింగ్ ట్రస్టీ సురేష్ పాణిగ్రాహి, ట్రస్టీ డాక్టర్ రాకేష్ పాణిగ్రాహి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. గోడ కూలి మహిళలకు గాయాలు రాయగడ: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రామనగుడ సమితి పరిధిలోని కండాజామ్ గ్రామంలో ఇంటి గోడ కూలి ఓ మహిళ గాయపడిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఆమెకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. గ్రామానికి చెందిన ద్రౌపది మండంగి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలొ ఒక్కసారిగా గోడ కూలి ఆమైపె పడింది. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను శిథిలాల నుంచి బయటకు తీశారు. అనంతరం అధికారులు ప్రాధమిక చికిత్స అందించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
చిత్రకొండ సమితిలో గ్రీవెన్స్సెల్
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి టోనాల్ క్యాంప్ పంచాయతీలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా 62 వినతులను అధికారులు స్వీకరించారు. వీటిలో కొన్నింటిని పరిశీలించి అక్కడిక్కక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ అప్పగించి క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాబు, జిల్లా సబ్కలెక్టర్ దూరోధ్యన్ బోయి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
రాయగడ: మారుమూల ప్రాంతాలకు చెందిన యువకుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారికి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో అవకాశాలు క ల్పించేందుకు వీలుగా ట్యాలెంట్ హంట్ కప్ బ్యా డ్మింటన్ ఎంపిక పరీక్షలను అసోసియేషన్ ప్రతినిధులు నిర్వహించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసొసియేషన్, ఒడిశా ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఎంపిక పోటీలు జరిగాయి. జిల్లాస్థాయి చాంపియన్షిప్కు క్రీడాకారులను ఎంపిక చేయడంతోపాటు జిల్లా నుంచి రాష్ట్రస్థాయి చాంపియన్షిప్కు ప్రతిభావంతులైనన క్రీడాకారులను గుర్తించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలియజేశారు. స్థానిక అంబగుడలోని బిజుపట్నాయక్ ఇండొర్ స్టేడియం, రాయగడ సద్భావన ఇండొర్ స్టేడియం, గుడారి ఎంపీఐఎస్, గుణుపూర్ ఎంపీఐఎప్, జేకే క్లబ్, టికిరి దొరగుడ ఇండోర్ స్టేడియంలో ఎంపిక పరీక్షలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ బ్యాడ్మింటన్ ప్రతిభను ప్రదర్శించారు. ఈ ఎంపిక పరీక్షల్లో 200 మందికి పైగా బాలురు, 30 మందికి పైగా బాలికలు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులకు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లొ పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి రాయగడ అంబగుడలోని బిజుపట్నాయక్ ఇండొర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి చాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో రాయగడ జిల్లా బ్యాడ్మింటన్ అసొసియేషన్ అధ్యక్షుడు హిమాంశు శేఖర్ పాండియా, కార్యదర్శి సురేష్ చంద్ర పండ, మునా జైన్, జయరాం వర్మ, డి.మణికాంత్, సహదేవ్ బామణా, పంచానన్ సతపతి పాల్గొన్నారు. -
వాన.. వాగు.. అవస్థ
రాయగడ: వర్షాకాలం వచ్చిందంటే చాలు పంచుపాండవ గ్రామస్తులకు వాగు దాటడం ప్రాణాలతో చెలగాటంగా మారుతోంది. గ్రామానికి సమీపంలోని వాగుపై వంతెన లేకపోవడంతో భారీ వర్షాలకు నీటి ప్రవాహం ఉధృతంగా మారిన ప్రతి సారి గ్రామస్తులు ప్రాణాలను ఫణంగా పెట్టి వాగును దాటాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలోని గుడారి సమితిలో అల్పపీడనం ప్రభావంతో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెండిలి పంచాయతీ పరిధిలోని పంచుపాండవ గ్రామ సమీపంలోని వాగులో నీటి ప్రవాహం పెరిగింది. పొలాల్లో వ్యవసాయ పనులు, కొండ ప్రాంతాల్లోని తోటల పనులు ముగించుకుని ఇళ్లకు తిరిగి వస్తున్న గ్రామస్తులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటక తప్పని పరిస్థితి ఏర్పడింది. మహిళలు, చిన్నారులు, యువకులు, వృద్ధులు సైతం ప్రమాదకర పరిస్థితుల్లో వాగును దాటుతున్నారు. రోగులు, వృద్ధులు, గర్భిణులు వెళ్లాలంటే చిక్కులు తప్పడం లేదు. ఏళ్లుగా ఇదే సమస్య వర్షాకాలంలో ఉద్ధృతంగా ప్రవహించే వాగును దాటడం తమకు నిత్యకృత్యంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ప్రవాహం పెరిగినప్పుడు ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. పంచుపాండవ గ్రామం మారుమూల ప్రాంతంలో ఉండడంతో అక్కడి ప్రజలకు శాశ్వత రవాణా సౌకర్యం అత్యవసరమని గ్రామస్తులు తెలిపారు. -
ఫిర్యాదుల పరిష్కారం
మంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 202695 శాతం.. భువనేశ్వర్: ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా ప్రతిస్పదించి సత్వర పరిష్కారం ప్రదానం చేసే దిశలో ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ విభాగం చురుగ్గా పని చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. సోమవారం జరిగిన 20వ రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ కార్యక్రమం పురస్కరించుకుని ఆయన మీడియాతో స్పందించారు. సోమవారం ముఖ్యమంత్రి స్థానిక యూనిట్ 2లో ఉన్న ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ శిబిరానికి చేరుకుని ప్రజల సమస్యల పట్ల ప్రత్యక్షంగా స్పందించారు. ముఖ్యమంత్రితో పాటు 10 మంది కేబినెట్ మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శి స్థాయి అధికారులు కూడా హాజరై ప్రజల సమస్యలను విన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ప్రజల సమస్యలను సంఘీభావంతో విని వాటిని పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా ప్రభుత్వం తప్పకుండా అక్కడికి చేరుకుంటుంది. వరదలు, తుఫాన్లు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలిచి సహాయం అందిస్తుంది. 2024లో కురిసిన అకాల వర్షాలను ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించి సముచిత సహాయం అందజేసి సకాలంలో స్పందించిందన్నారు. ప్రస్తుతం తాండవిస్తున్న వరద పరిస్థితుల పట్ల అదే రీతిలో ప్రభుత్వ యంత్రాంగం రాత్రింబవళ్లు అప్రమత్తంగా వ్యవహరిస్తు అనుక్షణం సముచిత ప్రతిస్పందనకు అనుకూలంగా చేయూతనందిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంతకు ముందు నిర్వహించిన 19 సమావేశాలలో గ్రీవెన్స్ సెల్కు అందిన 15,327 ఫిర్యాదులలో 14,519 అంటే 95 శాతం ఫిర్యాదులు విజయవంతంగా పరిష్కరించినట్లు ప్రకటించారు. దీంతో పాటు జిల్లా స్థాయిలో కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్లు ప్రజల సమస్యలను క్రమం తప్పకుండా వింటున్నారు. అదే సమయంలో తహసీల్, మండల స్థాయిలో సమస్యల విచారణ క్రమం తప్పకుండా జరుగుతోంది. ఈ ఏడాది జూలై నెలాఖరు నాటికి జిల్లా స్థాయిలో 2,69,394 ఫిర్యాదులను విచారించగా వాటిలో 87 శాతం పరిష్కరించారు. జిల్లా స్థాయిలో అనేక సమస్యలు పరిష్కారమవుతున్నందున ప్రజలకు ఊరట కలిగిస్తుంది. పరిపాలనా వ్యవస్థలో వచ్చిన ఈ మార్పు ప్రభుత్వంపై సామాన్య ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని బలపరుస్తుందన్నారు. ఎప్పటిలాగే, ముఖ్యమంత్రి సోమవారం ఉదయం అందరికంటే ముందుగా వచ్చి, బయట వేచి ఉన్న దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులను కలిసి వారి సమస్యలను విన్నారు. ఆయన వారి ఫిర్యాదు పత్రాలను స్వీకరించి, అక్కడున్న అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం, గది లోపల తమ వివరాలను నమోదు చేసుకున్న ఫిర్యాదుదారుల ఫిర్యాదులను ఆయన విన్నారు. ఈ రోజు, ముఖ్యమంత్రి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 16 మందికి రూ. 14.50 లక్షల వైద్య సహాయాన్ని మంజూరు చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా 600కు పైగా ఫిర్యాదు పత్రాలు అందాయి. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి శ్రీ కనక్ బర్ధన్ సింగ్ డియో, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి శ్రీ సురేష్ పూజారి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, వాణిజ్య, రవాణా శాఖ మంత్రి శ్రీ బిభూతి భూషణ్ జెనా, గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కృష్ణ చంద్ర మహాపాత్ర, ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కృష్ణ చంద్ర పాత్ర, సహకార శాఖ మంత్రి శ్రీ ప్రదీప్ బాల సమంత, మత్స్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గోకులనంద్ మల్లిక్, ఉన్నత విద్యా శాఖ మంత్రి శ్రీ సూర్యవంశీ సూరజ్, అటవీ, పర్యావరణ, కార్మిక, ఉద్యోగుల రాష్ట్ర బీమా శాఖ మంత్రి శ్రీ గణేష్రామ్ సింగ్ ఖుంటియా హాజరై ప్రజల సమస్యలను విన్నారు. ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ శాశ్వత్ మిశ్రా, రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద్ పాధి, ప్రజా ఫిర్యాదులు, ప్రజా పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సురేష్ కుమార్ వశిష్ట, ఇతర శాఖలకు చెందిన కార్యదర్శి స్థాయి సీనియర్ అధికారులు హాజరై ఫిర్యాదుల విచారణ ప్రక్రియలో సహకరించారు. -
గవర్నర్ను కలిసిన మహిళా పర్వతారోహణ బృందం
భువనేశ్వర్: హిమాచల్ ప్రదేశ్లోని 6,111 మీటర్ల ఎత్తైన యునామ్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన 11 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర మహిళా పర్వతారోహణ బృందం సోమ వారం గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటిని లోక్ భవన్లో కలిసింది. ఈ బృందం సాధించిన విజయానికి గవర్నర్ అభినందించారు. పర్వతారోహకులతో వారి యాత్ర, వారు ఎదుర్కొన్న సవాళ్లు మరియు అధిరోహణ సమయంలో వారి అనుభవాల గురించి సంభాషించారు. 11 మంది సభ్యులలో 5 మంది విజయవంతంగా గరిష్ట స్థాయికి చేరుకున్నారు. 6 మంది ఆరోగ్య సమస్యల కారణంగా మధ్యలో తిరిగి రావాల్సి వచ్చింది. కంభంపాటి మాట్లాడుతూ ఈ ఘనత ఒడిశాకు గర్వకారణమని కొనియాడారు. పర్వతారోహణ, ఇతర సాహస క్రీడల్లో పాల్గొనేందుకు మరింత మంది మహిళలు స్ఫూర్తినిస్తారని అభినందించారు. జట్టు సభ్యుల సంకల్పం, ధైర్యం, స్ఫూర్తిని ప్రేరేపిస్తుందన్నారు. అసోసియేషన్ ఫర్ అడ్వెంచర్ అండ్ సోషల్ యాక్టివిటీస్ (ఏఏఎస్ఏ) ఉపాధ్యక్షుడు హరేష్ కుమార్ మిశ్రా మరియు అసోసియేషన్ కార్యదర్శి మరియు పర్వతారోహకుడు గణేష్ చంద్ర జెనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మిఠాయిలు ఇక ‘ప్రియమే’..?
భువనేశ్వర్: రాష్ట్రంలో మిఠాయిల ధర గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. జున్ను, చక్కెర ధరలు పెరుగుదల ప్రభావంతో మిఠాయిల తయారీ వ్యయం భారం అవుతుందని ఉత్పాదక, వర్తకుల వర్గం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరో వైపు కల్తీ జున్ను కార్యకలాపాలపై నిఘా కట్టుదిట్టం చేయడంతో మిఠాయిల తయారీలో ప్రధాన ముడి సరుకు నాణ్యమైన జున్ను కొరత తాండవిస్తోంది. చక్కెర, వంట చెరకు, ఇతర నిత్యావసర ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా మిఠాయిల తయారీ తలకు మించిన భారంగా పరిణమిస్తుందని మిఠాయిల తయారీదారులు, విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ జున్ను, పనీర్పై కొనసాగుతున్న ఉక్కుపాదం చర్యల నేపథ్యంలో పరిస్థితి మరింత సవాలుగా మారింది. మిఠాయి వ్యాపారుల కథనం ప్రకారం ఈ కఠిన చర్యల వల్ల మార్కెట్లో జున్ను సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో వ్యాపారాలకు అవసరమైన నాణ్యమైన ముడి సరుకును సేకరించడం కష్టంగా మారింది. ఈ కొరత మిఠాయి ఉత్పత్తిని నేరుగా ప్రభావితం చేయడంతో పాటు నిర్వహణ ఖర్చులను కూడా పెంచింది. ఈ వ్యాపారంలో ఉపయోగించే దాదాపు అన్ని ముడి పదార్థాల ధరలు పెరిగాయని మిఠాయి వ్యాపారులు చెబుతున్నారు. మిఠాయిల తయారీలో ఉపయోగించే యాలకులు, కట్టెల ధరలు ఇటీవల సుమారు 40 శాతం పెరిగాయని సమాచారం. ముడిసరుకుల ఖర్చులు నిరంతరం పెరుగుతుండటంతో, ప్రస్తుతం మిఠాయి వ్యాపారం గణనీయమైన నష్టాలతో నడుస్తోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. కటక్లోని సాలేపూర్ ప్రాంతం, భువనేశ్వర్లోని పొహలాతో సహా ప్రధాన స్వీట్ల తయారీ కేంద్రాలన్నింటిలో దీని ప్రభావం కనిపిస్తోంది. ముడి పదార్థాల ధరలు తగ్గకపోయినా లేదా సరఫరా పరిస్థితి మెరుగుపడకున్నా మిఠాయిల ధరల పెరుగుదల దాదాపు అనివార్యంగా కనిపిస్తోందని వ్యాపారులు అంటున్నారు. మిఠాయిల ధరలు పెరిగే పరిస్థితులు వినియోగదారులను, మిఠాయి ప్రియులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణ ప్రజానీకం ఇప్పటికే కూరగాయలు, పప్పులు, వంట నూనె, చక్కెర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న తరుణంలో మిఠాయిల ధరలు పెరిగే పరిస్థితులతో దైనందిన ఖర్చుల భారం మరింత అధికం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. రక్షా బంధన్ పండుగ సమీపిస్తుండటంతో మిఠాయిలకు డిమాండ్ అధికంగా ఉంటుందని అంచనా. పండుగ సమయంలో ధరలు పెరిగితే ఖర్చులను మరింత ప్రభావితం చేస్తుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మిఠాయిల ధరలు పెరిగే పరిస్థితులు పొంచి ఉన్నాయి. ఈ పరిస్థితుల నివారణ పట్ల అనుబంధ ప్రభుత్వ వర్గాలు సమయోచితంగా స్పందించి ధరల పెరుగుదలని కట్టడి చేయాలని వినియోగదారులతో మిఠాయిల తయారీ, పంపిణీ, వ్యాపార వర్గాలు కోరుతున్నాయి. -
గుడ్లు సరఫరాలో నిర్లక్ష్యం
● పాఠశాలల్లో నిండుకున్న గుడ్లు ● విద్యార్థులకు వేరేకూర వండిపెట్టిన వైనంనరసన్నపేట: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్లు సరఫరాలో జాప్యం జరుగుతోంది. సకాలంలో గుడ్లు స్కూల్స్కు చేరవేయడంలో గుత్తేదారు నిర్లక్ష్యం వహిస్తున్నాడు. దీంతో మండలంలో ఎప్పటికప్పుడు స్కూల్స్లో గుడ్లు నిండుకుంటున్నాయి. ఫలితంగా హెచ్ఎంలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పక్క స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాల నుంచి అప్పుగా తీసుకొని విద్యార్థులకు ఇస్తున్నారు. అప్పుగా తీసుకురావడానికి వీలులేని చోట్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. సోమవారం నాటికి సత్యవరం, మడపాం పంచాయతీ కొత్తపేట, నరసన్నపేట పంచాయతీలోని వీడీ కాలనీ, గోపాలపెంట స్కూల్స్లోతో పాటు పలు స్కూల్స్లో గుడ్లు నిండుకున్నాయి. శనివారం నుంచీ ఈ పరిస్థితి ఉండగా ఉపాధ్యాయులు గుత్తేదారు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. సోమవారం నాటికీ గుడ్లు సరఫరా మెరుగుపడలేదు. దీంతో సత్యవరం స్కూల్ హెచ్ఎం అప్పలనాయుడు పొరుగున ఉన్న అంగన్వాడీ కేంద్రం నుంచి అప్పుగా తీసుకురాగా, మిగిలిన చోట్ల ఆ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులకు గుడ్లు లేకుండానే ఆహారం వడ్డించారు. వీడీ కాలనీలో గుడ్డు బదులు మరో కూరను వడ్డించారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సమతుల పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్య బలహీనతలు మెరుగుపరిచేందుకు వారానికి ఐదు రోజులు గుడ్డు ఇస్తున్నారు. దీంట్లో మూడు రోజులు ఉడికించిన గుడ్డు, మరో రెండు రోజులు గుడ్డు కూరను ఇస్తున్నారు. అయితే గుత్తేదారు నిర్లక్ష్యంతో విద్యార్థులకు గుడ్డు సక్రమంగా అందడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎంఈవో యు.శాంతారావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
గ్రీవెన్స్ సెల్కు వినతుల వెల్లువ
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా బ్లాక్ కేంద్ర కా ర్యాలయంలో సోమవారం నిర్వహించిన జాయింట్ గ్రీవెన్స్ సెల్కు ఏడీఎం మునీంద్ర హనగ హాజర య్యారు. మోహనా బ్లాక్లో మలాస్పదర్, చంద్రగిరి, మోహనా, అడవ గ్రామ పంచాయతీల నుంచి 90 వినతులు అధికారులు అందాయి. వీటిలో 24 వినతులు వ్యక్తిగతం, 66 వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించినవి ఉన్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధి కోం ఒక దరఖాస్తు అందింది. నిస్సహాయురాలికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఏడీఎం(రెవెన్యూ) మునీంద్ర హనగ అందజేశారు. అందిన వినతులు సకాలంలో పరిష్కారం చూపాలని ఏడీఎం మోహనా అదనపు బీడీఓకు ఆదేశించారు. మ లాస్ పదార్ పంచాయతీలో ఉన్న దెడేంగ్ జలపా తాలు, చుట్టు పక్కల ఉన్న పెకిలిగుడ, దెబ్బగుడ, కెహెలిగుడ, బంజమా గ్రామాలు అభివృద్ధి చేయాలని, వందేమాతరం జాతీయ దినోత్సవ వేడుకలు మోహనాలో జరపాలని, మోహనాలో కొందరు వినతిని అందజేశారు. ఈ గ్రీవెన్స్ సెల్కు సబ్ కలెక్టర్ అనూప్ పండా, సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఆర్.ఉదయగిరి) రాకేష్ కుమార్ సాహు, ఇతర ప్రభుత్వ ఉన్నతాఽధికారులు విచ్చేశారు.


