తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
పర్లాకిమిడి: గత కొద్దిరోజులుగా గజపతి జిల్లాలో పర్లాకిమిడి, కాశీనగర్, రాయఘడ బ్లాక్లలో ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతున్నాయి. దీంతో మహేంద్రతనయ నదిలో నీరు అడుగంటింది. పర్లాకిమిడి – పాతపట్నం సరిహద్దులో మహేంద్రతనయ నది వద్ద ప్రజా ఆరోగ్య శాఖ నీటిని ఇసుక మూటలతో అడుకట్ట కట్టి పట్టణంలో తాగునీటికి ఆటంకం లేకుండా నీటి సరఫరా చేస్తున్నారు. వచ్చే నెలలో ఎండలు అధికంగా మండితే మహేంద్రతనయ నదిలో నీరు అడుగంటే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా పీహెచ్ఈడీ ఇంజినీర్లు ఇప్పటి నుండే తాగునీటిని బీఎన్ ప్యాలస్ వద్ద రిజర్వ్ చేస్తున్నారు.


