న్యూస్రీల్
మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026
పట్టణంలో డోలాట్యాంకు వద్ద డోలా యాత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం శ్రీజగన్నాథ మందిరం వద్ద ఉన్న రాధాగోవిందమందిరం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ప్రభలతో డోలాయాత్ర జరుగుతున్న ప్రాంతానికి తీసుకువెళ్లడంతో భక్తులు రాధాగోవింద స్వాములను చూసి పోగో (రంగులు)జల్లుకుని హోలీ జరుపుకున్నారు. ఈ సందర్భంగా డోలా యాత్ర వద్ద అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకున్నారు. మంగళవారం చంద్రగ్రహణం వల్ల రాధాగోవింద స్వామి మందిరం మూసి వేస్తారు. పర్లాకిమిడి హోలీ పండుగ బుధవారం జరుపుకుంటామని అర్చకులు తెలియజేశారు. –పర్లాకిమిడి


