● టైలర్ల దినోత్సవం
పర్లాకిమిడి: ప్రపంచ దర్జీల దినోత్సవం (టైలర్స్ డే) సందర్భంగా గజపతి జిల్లా టైలర్ల సంఘం సభ్యులు శనివారం ఉదయం స్థానిక పాతమార్కెట్ వద్ద పర్లాకిమిడి మహరాజా కృష్ణచంద్ర గజపతి విగ్రహానికి పూలమాలలు వేశారు. కుట్టు మిషన్ను కనిపెట్టిన విలియం ఎలియాస్ హోవే చిత్రపటానికి అంజలి ఘటించారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన టైలర్ మార్కెండయ చిత్రపటానికి దర్జీలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ సంఘం అధ్యక్షుడు కోవిల్కోండ వరదరాజులు, కార్యదర్శి ఎం.రవిరాజ్. ఉపాధ్యక్షుడు మల్లా ధర్మారావు, కోశాధికారి పి.దిలీప్, తదితరులు పాల్గొన్నారు.


