శిష్టకరణ సంఘం ఆత్మీయ కార్యక్రమం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా శిష్ట కరణ సంఘం ఆత్మీయ కార్యక్రమం జరిగింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని నీలంబర్ గ్యాస్ కల్యాణ మండపంలో 30 ఏళ్ల అనంతరం తెలుగు కరణాలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా 10 మంది సీనియర్ సభ్యులను సత్కరించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. బాలలు, మహిళలకు పలు పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాలలో సంఘం అధ్యక్షుడు సతీష్ పట్నాయిక్, ఉపాధ్యక్షుడు కిషోర్ పట్నాయిక్, కార్యదర్శి మహేశ్వర్ పట్నాయిక్, సంయుక్త కార్యదర్శి అవనీ ప్రసాద్ పట్నయక్, కోశాధికారి చంద్ర శేఖర్ పట్నాయిక్, న్యాయ సలహాదారు అరవింద పట్నాయక్ పాల్గొన్నారు.
శిష్టకరణ సంఘం ఆత్మీయ కార్యక్రమం


