ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
జయపురం: జయపురం సమితి బరిణిపుట్ ప్రాంతీ య శివమందిర ప్రాంగణంలో కొరాపుట్ జిల్లా బి– క్లాస్, సి–క్లాస్, డి–క్లాస్ కంట్రాక్టర్స్ సంఘం ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. సంఘ అధ్యక్షుడు పద్మన్ హరిజన్ నేతృత్వంలో చేపట్టి న ఈ కార్మక్రమంలో సంఘ సభ్యులంతా పాల్గొని వివిధ రకాల మొక్కలు నాటారు. జయపురం హ న్నాగుడలో గల లైఫ్ ఫౌండేషన్లో ఉంటున్న విద్యార్థులతో కంట్రాక్టర్లు ఆత్మీయంగా ముచ్చటించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో వారిని మమేకం చేశారు. విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు.


