● ఘనంగ కలశ యాత్ర
జయపురం: జయపురం సమితి ఉమ్మరి గ్రామ పంచాయతీ గగణాపూర్లో దాదాపు 400 ఏళ్లకు పైగా చరిత్ర గల బాలుంకేశ్వర్ మహాదేవ్ ఆలయంలో యజ్ఞమండప ప్రతిష్ట, మహాశిరాత్రి సందర్భంగా శనివారం మహా కలశ శోభా యాత్ర నిర్వహించారు. జయపురం లోకనాథ్ దేవాలయ ప్రాంగణంలో గల ఖజురి బంద(ఖజురి చెరువు)లో పవిత్ర జలాన్ని కలశాల్లో నింపుకుని వేద మంత్రోచ్ఛరణలు మధ్య లోక్నాథ్ ఆలయ కూడలి నుంచి శోభాయాత్ర బయల్దేరింది. వందలాది మంది మహిళలు పవిత్ర కలశాలతో శోభాయాత్రలో పాల్గొన్నారు. కలశ శోభాజాత్ర రఘునాత్ మందిరం, సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గం గుండా గగణాపూర్ కు బయల్దేరింది. గగణాపూర్ బాలుంకేశ్వర్ మహదేవ్ మందిరంలో యజ్ఞప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు, మహాశివరాత్రి వేడుకలు మూడు దినాలు జరుగుతాయని పూజారులు వెల్లడించారు.
● ఘనంగ కలశ యాత్ర
● ఘనంగ కలశ యాత్ర


