గ్రీన్‌ ఎకానమీ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ ఎకానమీ సాధనకు కృషి

Feb 13 2026 5:25 AM | Updated on Feb 13 2026 5:25 AM

గ్రీన

గ్రీన్‌ ఎకానమీ సాధనకు కృషి

భువనేశ్వర్‌: భారత్‌లో జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) సహకారంతో రాష్ట్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు విభాగం ఆధ్వర్యంలో 2వ విడత ఒడిశా ఫారెస్ట్రీ సెక్టార్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ 14వ జాతీయ వర్క్‌షాప్‌ గురువారం కూడా కొనసాగింది. రెండో రోజు స్థితిస్థాపక, హరిత అటవీ ఆర్థిక వ్యవస్థపై కీలకమైన చర్చలు జరిపారు. దేశీయ, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా అటవీ వ్యవసాయ శాస్త్రం విస్తరణపై ప్రధానంగా చర్చించారు.

ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు విభాగం ప్రిన్సిపల్‌ సెక్రటరీ భాస్కర్‌ జ్యోతి శర్మ మాట్లాడుతూ సమన్వయ ప్రయత్నాల ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రాలు, జైకా వంటి అంతర్జాతీయ భాగస్వాముల మధ్య సహకారం వాతావరణ స్థితిస్థాపక అటవీ రంగం వైపు భారత దేశం ప్రయాణాన్ని ఎలా వేగవంతం చేస్తుందో వర్క్‌షాప్‌ ప్రదర్శించిందన్నారు. వన సురక్ష సమితి, స్వయం సహాయక బృందాల సామాజిక సభ్యులతో భాస్కర్‌ జ్యోతి శర్మ సంభాషించారు. జీవనోపాధి మద్దతు చొరవలు, పర్యావరణ పునరుద్ధరణకు ఒడిశా నిబద్ధతను పునరుద్ఘాటించారు. జైకా ఇండియా సీనియర్‌ ప్రతినిధి వాకమట్సు ఈజీ సమక్షంలో వర్క్‌షాప్‌ ఫలితాలను అభివృద్ధి నిపుణుడు సిద్ధార్థ్‌ పరమేశ్వరన్‌ ప్రదర్శించారు. వాతావరణ అనుకూలత, అటవీ పరివర్తన , డిజిటల్‌ పరివర్తన భవిష్యత్‌ సహకారానికి మూలస్తంభాలుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో కూడిన బహుళ భాగస్వామ్య సహకారం ప్రాముఖ్యత ఈ కార్యకలాపాల ప్రధాన ఇతివృత్తమని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌, ఫారెస్ట్‌ ఫోర్స్‌ హెడ్‌ డాక్టర్‌ కె.మురుగేశన్‌, ఓఎఫ్‌ఎస్‌డీపీ అదనపు పీసీసీఎఫ్‌ (ప్రాజెక్ట్సు) డైరెక్టర్‌ జి.రాజేష్‌, సంయుక్త ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ స్వయం మల్లిక్‌ ప్రసంగించారు.

గ్రీన్‌ ఎకానమీ సాధనకు కృషి 1
1/1

గ్రీన్‌ ఎకానమీ సాధనకు కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement