కల్యాణం.. కమనీయం
వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన మహిళలు
పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని వీరబ్రహ్మేంద్రస్వామి మందిరంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని రాత్రి 7 గంటల సమయంలో వీరబ్రహ్మం, గోవిందమాంబల కల్యాణ మహోత్సవం గజపతి జిల్లా స్వర్ణకారుల సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహంచారు. అంతకు ముందు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబలను తిరువీధి నిర్వహించారు. వేద పండితుడు వనమాలి మణిశర్మ ఆధ్వర్యంలో ఈ వివాహా మహోత్సవాన్ని చేపట్టారు. వరుడు తరఫున దేవు నాగేశ్వర్ రావు ఆచారి దంపతులు, వధువు తరఫున బాణాల భవానీశంకర్ ఆచారి దంపతులు ఘనంగా జరిపించారు. కల్యాణ మహోత్సవం అనంతరం తలంబ్రాలను వధూవరులకు వారి బంధువుల తరఫువారు వేసి ఘనంగా ఆశీర్వాదాలు పొందారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
కల్యాణం.. కమనీయం
కల్యాణం.. కమనీయం
కల్యాణం.. కమనీయం


