చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Feb 13 2026 5:25 AM | Updated on Feb 13 2026 5:25 AM

చట్టా

చట్టాలపై అవగాహన అవసరం

ఆ నేత్రాలు సజీవం శ్రీకాకుళం కల్చరల్‌: నగరంలోని తోటపాలెంకు చెందిన కందోటి కృష్ణచైతన్య (40) మరణించడంతో, ఆయన నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తండ్రి కె.వెంకటరమణమూర్తి, తల్లి కె.విజయలు పెద్దపాడు వీఆర్వో డి.సూర్యసీతారాం ద్వారా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావుకు తెలియజేశారు. నేత్ర సేకరణలో భాగంగా మగటపల్లి కల్యాణ్‌ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్‌ పూతి సుజాత, పి.సుమతిలు అతని కార్నియాలు సేకరించారు. వాటిని విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్‌ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321 నంబర్‌ను సంప్రదించాలని రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహన్‌రావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్‌ కోరారు. ఎనిమిది బస్తాల ధాన్యం చోరీ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నిక నేడు ● జిల్లా నుంచి ఇద్దరు నామినేషన్లు శ్రీకాకుళం పాతబస్టాండ్‌: న్యాయవాదుల రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. దీనికి సంబంధించి జిల్లా బార్‌ అసోషియేషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, ఇతర సభ్యులతో కలిసి 25 మంది ఉంటారు. దీంట్లో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులుగా జిల్లా నుంచి ఇద్దరు న్యాయవాదులు నామినేషన్‌ వేశారు. ఇందులో కిల్లి మార్కేండేశ్వరరావు, గేదెల వాసుదేవరావులు ఉన్నారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కి జిల్లా నుంచి ఇద్దరు పోటీలో ఉండడం ఇదే తొలిసారి. నాలుగు సంవత్సరాల కాలానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో జిల్లా కోర్టు కాంప్లెక్సుతో పాటు 13 కోర్టులు ఉన్నాయి. ఈసారి జిల్లా నుంచి మొత్తం 1,316 మంది న్యాయవాదులు ఓటు వేయనున్నారు. హోంగార్డుకు చెక్‌ అందజేత పటాయత్‌ ప్రతాప్‌ కేసరి సింగ్‌ దేవ్‌ కన్నుమూత

పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి గారబంద ఎస్‌.వి.టి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోష్‌ చట్టంపై అవగాహన, బాల్యవివాహాల నివారణ, ఎస్‌.ఓ.పిపై శిబిరాన్ని జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్‌ రౌళో ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ శిబిరంలో జస్టీస్‌ కార్నర్‌ చారిటబుల్‌ ట్రస్టు సభ్యులు భాగ్యలక్ష్మి నాయక్‌, గారబంద సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లోకనాథ బెహరా, గారబంద ఎస్‌.వి.టి ప్రధాన ఉపాధ్యాయులు బి.గంగాధర్‌ పాల్గొన్నారు. విద్యార్థినులకు చట్టాలపై అవగాహన అవసరమన్నారు. ఈ శిబిరంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

హిరమండలం: ఎల్‌.ఎన్‌.పేట మండల కేంద్రం సమీపంలో ఉన్న తాయిబాంబాపురం నిర్వాసిత కాలనీకి చెందిన రైతు సురవరపు సింహాచలంకు చెందిన ఎనిమిది బస్తాల ధాన్యం చోరికి గురైనట్లు ఆయన తెలిపారు. కాలనీ సమీపంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ధాన్యాన్ని నిల్వ చేశామని, పాఠశాల ప్రహరీ విరగ్గొట్టి ధాన్యం బస్తాలను అపహరిచినట్లు వాపోయాడు. ధాన్యం విలువ సుమారు రూ.15 వేలు ఉంటుందన్నారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

శ్రీకాకుళం క్రైమ్‌: ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు కె.శంకరరరావుకు తోటి సిబ్బంది స్వచ్ఛందంగా ఒక్కరోజు వేతనం రూ.4.07 లక్షలను అందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఈ చెక్‌ను శంకరరావుకు అందజేశారు.

మందస: మందస రాజవంశీయులు, టెరిటోరియల్‌ ఆర్మీ మాజీ అధికారి పటాయత్‌ ప్రతాప్‌ కేసరి సింగ్‌ దేవ్‌(78) గుండెపోటుతో ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఉన్న ఖార్వేలనగర్‌లో మరణించారు. ఆయన మరణంతో మందస, ఒడిశాలో విషాదచాయలు అలముకున్నాయి. దివంగత రాజ జగన్నాథ రాజమణి రాజ్‌ దేవ్‌ ద్వితీయ కుమారుడైన ప్రతాప్‌ కేసరి సింగ్‌ దేవ్‌ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి.

చెక్కు అందజేస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

చట్టాలపై అవగాహన అవసరం 1
1/3

చట్టాలపై అవగాహన అవసరం

చట్టాలపై అవగాహన అవసరం 2
2/3

చట్టాలపై అవగాహన అవసరం

చట్టాలపై అవగాహన అవసరం 3
3/3

చట్టాలపై అవగాహన అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement