● పుస్తకాల ఆవిష్కరణ
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ రచించిన ‘యే మట్టి కొథా కొహే’, ‘బక్సీ జగబంధు: ది గ్రేట్ కమాండర్‘ అనే 2 పుస్తకాలను రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి ఆవిష్కరించారు. వేడుకగా జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కంభంపాటి మాట్లాడుతూ ఈ పుస్తకాలు బిశ్వ భూషణ్ హరిచందన్ జీవితకాలపు రాజ్యాంగ విలువలు, ప్రజా సేవ, ఒడిశా స్ఫూర్తి పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. యువ తరాలలో విలువ ఆధారిత నాయకత్వం, దేశ భక్తిని ప్రేరేపిస్తాయని గవర్నరు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి, సౌమ్య రంజన్ పట్నాయక్, ఇతరులు హాజరయ్యారు.
● పుస్తకాల ఆవిష్కరణ
● పుస్తకాల ఆవిష్కరణ


