శివ నగరి
మహేంద్ర గిరి..
మహేంద్రగిరి కొండమీద ఆహ్లాద వాతావరణం
భీమమందిరం వద్ద కిక్కిరిసిన జనాలు (ఫైల్)
పర్లాకిమిడి: శివరాత్రి పర్వదినం సందర్భంగా గజపతి జిల్లా రాయగడ బ్లాక్లో ఉన్న మహేంద్రగిరి పర్వతంపై శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు శివరాత్రి జరగనుంది. ఈ యాత్రకు విచ్చేసే యాత్రికులకు, భక్తులకు అన్ని విధాల సౌకర్యాలను జిల్లా యంత్రాంగం సమకూర్చుతుంది. ఆంఽధ్రప్రదేశ్ మందస మండలం సాబకోట, కించిలింగి మీదుగా మహేంద్రగిరి పర్వతాలు చేరుకోవచ్చు. లేదా పర్లాకిమిడి నుంచి రాయగడ మీదుగా మీదుగా కోయిపూర్ మీదుగా రోడ్డు సౌకర్యం ఉంది. భారతదేశంలో ఏడు కుల పర్వాతాల్లో మహేంద్రగిరి పర్వతం ఒకటి. తూర్పు కనుమల్లో 1501 మీటర్లు (4,925 అడుగుల) ఎత్తులో ఉన్న మహేంద్రగిరి పర్వతం కొరాపుట్లో దేవమాళి పర్వతం తర్వాత అత్యంత ఎత్తైన పర్వతంగా ఉంది. ఈ పర్వతాలు జీవనవైవిధ్యం మూలంగా కేంద్రప్రభుత్వ పురావస్తు శాఖ గుర్తించింది. మూడు కాలాలు ఒకసారి మనం ఆ పర్వతాలలో పొందే అనుభూతి కలుగుతుంది. మహేంద్రగిరి పర్వతం దిగువున గోకర్ణేశ్వర మందిరం, పరశురాం మందిరం, కుంతీ, యుధిష్టర, భీమ మందిరాలు ఉన్నాయి. పాండవులు
మహేంద్రంలో కుంతీ మందిరంలో శివలింగం
శివ నగరి
శివ నగరి
శివ నగరి


