ప్రేమ–హత్య–ప్రమాదం కేసులో మలుపు | - | Sakshi
Sakshi News home page

ప్రేమ–హత్య–ప్రమాదం కేసులో మలుపు

Feb 11 2026 7:18 AM | Updated on Feb 11 2026 7:18 AM

ప్రేమ

ప్రేమ–హత్య–ప్రమాదం కేసులో మలుపు

ప్రేమ–హత్య–ప్రమాదం కేసులో మలుపు

నిజాన్ని అంగీకరించిన ప్రియురాలు

సీసీ టీవీ ఫుటేజ్‌ బహిర్గతం

భువనేశ్వర్‌: స్థానిక నీలాద్రి విహార్‌లో సోమవారం జరిగిన ప్రేమ–హత్య–ప్రమాదం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం స్నేహితురాలు నిజం అంగీకరించింది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ బహిర్గతమైంది. తన మాజీ ప్రియుడు దినేష్‌ కండి సత్యబ్రత ప్రధాన్‌ను పొడిచి చంపాడని స్నేహితురాలు అంగీకరించింది. హత్య నిందితుడు దినేష్‌ను పట్టుకోవడానికి పోలీసులు పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు.

సీసీ టీవీలో నిజం బట్టబయలు

సత్యబ్రత హత్య కేసులో సీసీటీవీలో నిజం బయటపడింది. గొంతు కోతకు గురైన తర్వాత పారిపోతున్న సత్యబ్రత సీసీ టీవీలో కనిపిస్తున్నాడు. సత్యబ్రతను అతని ప్రేయసి, దినేష్‌ కండి వెంబడిస్తున్నారు. మరోవైపు, చంద్రశేఖర్‌పూర్‌ ఠాణాలో శిశు భవన్‌ ఓవర్‌ బ్రిడ్జిపై నుంచి బీదల వాడ ఇళ్లపై పడి బీభత్సం సృష్టించిన కారు యజమానిని పోలీసులు విచారిస్తున్నారు. హత్య కుట్ర నుంచి కారుతో తప్పించుకోవడానికి ఎవరు ప్రయత్నించారో తెలుసుకోవడానికి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కారు యజమానికి హత్యతో సంబంధం కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రేమికుల వారంలోని చాక్లెట్‌ దినోత్సవం సందర్భంగా తన స్నేహితురాలికి చాక్లెట్లు బహుమతిగా ఇవ్వడానికి ప్రియుడు సత్యబ్రత ప్రధాన్‌ నీలాద్రి విహార్‌లో నివసించే ప్రేయసి దగ్గరకు వచ్చాడు. అతను బ్రహ్మగిరి ప్రాంతంలోని హసిన్‌పూర్‌కు చెందినవాడు. అతను తన స్నేహితురాలితో కొంత సమయం గడిపాడు. ఇంతలో ఆ అమ్మాయి మరో ప్రియుడు దినేష్‌ కండి లోపలికి వచ్చాడు. సత్యబ్రతను తన ప్రియురాలితో చూసిన తర్వాత అతను మితిమీరిన ఉక్రోషంతో అందుబాటులో ఉన్న కూరగాయలు కోసే కత్తిని తీసి సత్యబ్రతపై దాడి చేశాడని ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన సత్యబ్రత తీవ్ర రక్తస్రావంతో తప్పించుకునే ప్రయత్నంలో నీలాద్రి విహార్‌ కూడలి వద్ద మరణించాడు.

ప్రేమ–హత్య–ప్రమాదం కేసులో మలుపు1
1/2

ప్రేమ–హత్య–ప్రమాదం కేసులో మలుపు

ప్రేమ–హత్య–ప్రమాదం కేసులో మలుపు2
2/2

ప్రేమ–హత్య–ప్రమాదం కేసులో మలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement