సరోజినీనాయుడు సేవలు చిరస్మరణీయం
గార : మహిళలకు స్వేచ్ఛ లేని రోజుల్లో విద్యావేత్తగా, గాన కోకిలగా పేరుగాంచిన సరోజినీనాయుడు చిరస్మరణీయరాలని కె.మత్స్యలేశం సర్పంచ్ బి.లలిత అన్నారు. శుక్రవారం సరోజినినాయుడు జయంతి సందర్భంగా స్థానిక బుద్ధా పాఠశాలలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత విద్యావేత్తగా, రచయిత్రిగా, మహిళా స్వేచ్ఛ కోసం మహిళా విద్య కోసం నిరంతరం శ్రమించిన మహిళా పక్షపాతి సరోజినీనాయుడు అని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బి.ఎర్రన్న, ప్రిన్సిపాల్ నంద్యాల శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.


