గంభీరావుపేట యువతి ప్రేమ వ్యవహారం
ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): తల్లి బంగారాన్ని అమ్మి ప్రియుడికి బహుమతిగా బైక్ను కొనిచ్చింది ఓ యువతి. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి.
గంభీరావుపేట మండలానికి చెందిన ఓ యువతితో ఎల్లారెడ్డిపేటకు చెందిన యువకుడికి ఇన్స్ట్రాగామ్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆ యువకుడు తనకు బైకు కొనివ్వాలని ప్రియురాలిని కోరాడు. ప్రియుడి కోరిక తీర్చేందుకు సదరు యువతి తల్లి బంగారాన్ని అమ్మేసి బైకు కొనిచ్చింది. తన బంగారం కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.


